breaking news
Krishna District Latest News
-
విస్సన్నపేటలో కారు బీభత్సం
మద్యం మత్తులో ఉన్న ఇద్దరి అరెస్ట్ విస్సన్నపేట: మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంగా కారు నడుపుతూ.. దారి పక్కన ఉంచిన వాహనాలను ఢీకొంటూ.. ఎదురుగా వస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. అదృష్టవశాత్తూ కారు రోడ్డు పక్కన విద్యుత్ స్తంభానికి ఢీకొని ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి.. విస్సన్నపేట ప్రధాన రహదారిలో శుక్రవారం ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ భయానక వాతావరణం సృష్టించారు. కొందరి వాహనాలను ఢీకొనడంతో అవి దెబ్బతినడంతో పాటు పలువురికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో స్థానికులు కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో నూజివీడు రోడ్డులో వెళ్లిన కారు రహదారి పక్కనే ఉన్న విద్యుతు స్తంభాలకు ఢీకొని ఆగిపోవటంతో స్థానికులు కారులో ఉన్న ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. ఎ. కొండూరు మండలం పాత రేపూడికి చెందిన కొప్పుల గొవర్థన్, కొప్పుల ప్రసాద్లను అదుపులోకి తీసుకున్నామని, కారు నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ అర్జున్రాజు తెలిపారు. -
హృదయ కల్లోలం
ప్రధానంగా.. చిట్టినగర్లోని వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సెక్రటరీ వయస్సు 32. ఇటీవల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో పదిహేను రోజుల క్రితం ఆకస్మికంగా విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ వైద్యుడి వయస్సు 29. వైభవంగా పెళ్లి జరిగిన పదిరోజులకే ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. ఇలా వీరిద్దరే కాదు. ఇటీవల కాలంలో తరగతి గదిలో కుప్పకూలి మరణించిన విద్యార్థిని, బస్సు కోసం వేచి చూస్తూ ఆకస్మికంగా గుండెపోటుతో బస్టాండులోనే మరణించిన ప్రయాణికుడు వంటి ఘటనలు ఇటీవల అనేకం చూస్తున్నాం. -
రోగులకు నాణ్యమైన సేవలు అందాల్సిందే
విజయవాడ కొత్త జీజీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీశ లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాజీ ఉండకూడదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. విజయవాడలోని కొత్త జీజీహెచ్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, శుభ్రత, ఔషధాల లభ్యత, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి.. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోగికి సమయానుకూలంగా నాణ్యమైన చికిత్స అందాలని స్పష్టం చేశారు. ఆస్పత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం (ఓపీ), ఇన్ పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, ఔషధ పంపిణీ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బందికి సేవల మెరుగుదలపై సూచనలు ఇచ్చారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలు 24 గంటల పాటు సమర్థంగా అందేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు కూడా ఉన్నారు. -
గ్రాట్యూటీపై సీలింగ్ రద్దు చేయాలి
మచిలీపట్నంఅర్బన్: వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీపై సీలింగ్ విధించి కేవలం రూ.2లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని, గ్రాట్యూటీ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి చెల్లింపులు జరపాలని రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జన్యావుల రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగం ఫిలిప్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ జీవో సంఖ్య 36ను వెంటనే అమలు చేయాలని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేపట్టాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,400 మంది ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొంటుండగా, ఇప్పటికే 2,026 సహకార సంఘాలు మూత పడ్డాయని తెలిపారు. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు వైవీవీ మోహన్రావు, అడప శ్రీనివాసరావు, వీరవల్లి వెంకటేశ్వరరావు, రాజులపాటి శ్రీనివాసరావు, హనుమకొండ శ్రీనివాసరావు, మెట్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. సహకార ఉద్యోగుల నిరవధిక సమ్మెలో నాయకుల డిమాండ్ -
నిర్మాణంలో గోడ కూలి కార్మికుడు మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఐదో అంతస్తులో నిర్మాణంలో ఉన్న ఒక భవనం గోడ కూలి అక్కడ పనులు చేస్తున్న కార్మికులపై పడటంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయ పడ్డారు. ఈ ఘటన గురువారం సాయంత్రం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామానికి చెందిన జోరిగే సురేంద్ర (36) గురువారం సత్యనారాయణపురం, కొమ్మువారి వీధిలోని నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవన నిర్మాణంలో తాపీ పనులు చేసేందుకు వెళ్లాడు. సాయంత్రం మారుతీనగర్కు చెందిన పల్లా రామారావు, సూరిబాబులతో కలసి సురేంద్ర పరంజాల మీద నిల్చొని ప్లాస్టింగ్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో అంతకు ముందు కట్టిన గోడ కూలి వారి మీద పడటంతో వారు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ సమయంలో రామారావు, సూరిబాబులు వేలాడుతున్న పైపుల మీద పడి అక్కడ నుంచి జారుతూ కిందపడ్డారు. సురేంద్ర మాత్రం ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందపడటంతో తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే తోటి కార్మికులు ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సురేంద్ర అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మరో ఇద్దరు కార్మికులు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై సమాచారం అందటంతో ఎస్ఎన్పురం పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. న్యాయం చేయాలి.. పని ప్రదేశంలో ప్రమాదానికి గురై మృతి చెందిన సురేంద్రకు భార్య మహాలక్ష్మి, పదో తరగతి, ఆరో తరగతి, రెండో తరగతి చదువుతున్న ముగ్గురు ఆడపిల్లల సంతానం ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయిన సురేంద్ర మృతిచెండటంతో ఆడపిల్లలతో కలసి ఎలా జీవించాలని భార్య బోరున విలపిస్తున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఎన్పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రతా ప్రమాణాలు లేకుండానే.. పని ప్రదేశంలో ప్రమాదం జరిగి కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన భవన నిర్మాణ బిల్డర్ తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని కేసును నీరుగార్చే చర్యలు చేపడుతున్నాడని బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకుండా ప్రమాదకరంగా పనులు చేయించిన బిల్డర్పై పోలీసులు కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్టీసీ డిపోల మూసివేత నిర్ణయాన్ని విరమించాలి
ఎంప్లాయీస్ యూనియన్ నాయకులుభవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీ డిపోల మూసివేత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యాధరపురం డిపో వద్ద ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ బస్సు ముద్దు.. ప్రైవేట్ విద్యుత్ బస్సులు వద్దు, ప్రయాణికుల భద్రత – భరోసా ఆర్టీసీతోనే సాధ్యం, పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆసరాగా ఉన్న ఆర్టీసీని కాపాడుకుందాం’ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర డెప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. మొదటి విడతగా 750 విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం 12 డిపోలను మూసివేస్తే రెండో దశలో మరిన్ని బస్సులు వస్తే మిగిలిన డిపోలు, ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 2029 నాటికి విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబర్ 88ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు డీజిల్, సీఎన్జీ బస్సులను నడిపిన తాము విద్యుత్ బస్సులను నడపలేమా అని ప్రశ్నించారు. సీ్త్ర–శక్తి పథకం విజయవంతం కావాలంటే మరో మూడు వేల బస్సులు, పది వేల మంది ఉద్యోగులు కావాలన్నారు. ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా విద్యుత్ బస్సులను నడపాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు. రాష్ట్ర డిపోల మెయింటినెన్స్ కన్వీనర్ ఎన్.హెచ్. చక్రవర్తి మాట్లాడుతూ.. కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించటాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. హైఎండ్ బస్సులను నైపుణ్యంతో సమర్థంగా నడిపిన ఉద్యోగుల స్థానంలో ప్రైవేట్ ఆపరేటర్లను తీసుకురావడం ద్వారా ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టీసీని ప్రైవేట్కు అప్పగిస్తే ఇకపై చరిత్రలోనే సంస్థ ఉంటుందన్నారు. ఈయూ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ జి.ఎం.రావు మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న విద్యాధరపురం డిపోను ఖాళీ చేయించి ప్రైవేట్ విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం అప్పగించటం దారుణమన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన ప్రమాదాలు 0.2 శాతంగా ఉంటే ప్రైవేట్ బస్సుల ద్వారా జరిగినవి ఆరు శాతానికిపైగా ఉన్నాయని వివరించారు. ఈయూ విద్యాధరపురం డిపో సెక్రటరీ, ప్రెసిడెంట్లు ఎల్ఎల్ రాజు, కె.అనిల్ కుమార్ మాట్లాడుతూ 1990లో ఏర్పడిన ఈ డిపో ఉద్యోగులంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటున్నా మని తెలిపారు. ఈ పరిస్థితిలో డిపోను మూసివేసి ఇక్కడి ఉద్యోగులను వేర్వేరు డిపోలకు కేటాయించడం బాధాకరంగా ఉందన్నారు. -
దీవించమ్మా.. దుర్గమ్మ!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆశీస్సుల కోసం విద్యార్థులు శుక్రవారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తులు, యాత్రికులు, నూతన వధూవరులతో అమ్మ వారి ఆలయంలో పండుగ వాతావరణం కనిపించింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. పోటీ పరీక్షలు, వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లతో అమ్మవారిని దర్శించుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యేలా దీవించు తల్లీ అంటూ వేడుకున్నారు. కనక దుర్గమ్మ అమ్మ వారి దర్శనం కోసం తరలివచ్చిన విద్యార్థులు, భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం కల్పించారు. -
వెంటిలేట్ర్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేదల ప్రాణాలకు పెద్దదిక్కుగా నిలవాల్సిన విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో మృత్యుఘోష కొనసాగు తోంది. ఆస్పత్రిలో సేవలు రోజు రోజుకూ దిగజారు తున్నాయి. నిపుణులైన వైద్యులు, సమర్థంగా పనిచేసే అధికారులు ఉన్నా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించక పోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది. అత్యవసర సమయంలో రోగుల ప్రాణాలు నిలిపేందుకు అత్యంత కీలకమైన వెంటిలేటర్లు కావాలని ఆరు నెలల కిందటే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయితే అవి ఇంత వరకూ ఆస్పత్రికి చేరలేదు. ఉన్న వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో వాటిని మూలన పడేశారు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రోగులకు ఊపిరి అందించేందుకు ఉన్న అరకొర యంత్రాలతోనే వైద్యులు కుస్తీ పడుతున్నారు. ఈ తరుణంలో మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వెంటిలేటర్లు కొనుగోలులో జాప్యం ప్రభుత్వాస్పత్రిలో ఉన్న వెంటిలేటర్లు దాదాపు పనిచేయని స్థితికి చేరాయి. కోవిడ్ సమయంలో కొనుగోలు చేసిన వెంటిలేటర్లులో చాలా వాటిని ఇప్పటికే పక్కన పెట్టేశారు. అనంతరం గత ప్రభుత్వంలో వచ్చిన వెంటిలేటర్లు కొన్ని ఉండగా వాటితోనే కుస్తీ పడుతున్నారు. వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు సిద్ధార్థ వైద్య కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2023వ సంవత్సరంలో మంజూరు చేసి, డీఎంఈ వద్ద ఉన్న పీజీ గ్రాంట్స్తో వెంటిలేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆరు నెలల కిందటే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పినా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆస్పత్రిలో ఎవరికై నా వెంటిలేటర్ సపోర్టు అవసరమైతే, అందుబాటులో ఉన్న వాటిపై ఉంచేందుకు వైద్యులు సంకోచించాల్సిన పరిస్థితినెలకొంది. అవి సరిగా పనిచేయక పోతే, రోగికి ప్రాణాపాయం అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తోంది. డీఎంఈలో నిర్లక్ష్యం చేయడంతో రోగులకు శాపంలా మారింది. ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ తర్వాత నిత్యం 12 నుంచి 14 మంది వరకూ మరణించే వారు. వారిలో క్రిటికల్ స్టేజ్లో ఆస్పత్రికి వచ్చిన వారు ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రోజుకు 18 నుంచి 20కి చేరింది. ఒక్కో రోజు 20 మంది కంటే ఎక్కువగానే ప్రాణాలు కోల్పోతున్నారు. జీజీహెచ్లో 2025 జనవరిలో 504 మంది మృత్యువాత పడ్డారు. 2026 జనవరి 523 మంది మృతి చెందారు. ఇలా మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఒక వైపు పాలకులు నాణ్యమైన సౌకర్యాలు అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారే కానీ క్షేత్రస్థాయిలో ఆస్పత్రులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ప్రాణాలు నిలుస్తాయన్న కొండంత ధైర్యంతో ప్రభుత్వాస్పత్రికి వస్తున్న నిరుపేద రోగులు నాణ్యమైన సేవలు అందక విలవిల్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్లు కొనుగోలుకూ గతిలేకుండా పోయింది. గత ప్రభుత్వంలో కోవిడ్ సమయంలో వచ్చిన వాటితోనే వైద్యులు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటిలేటర్ సరిగా పనిచేయక, రోగి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికై నా జాప్యం చేయకుండా వెంటిలేటర్లను కొనుగోలు చేసి, జీజీహెచ్కి అందించాలి. – డాక్టర్ ప్రభుదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
నేడు ఆర్గానిక్ రైతోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో శనివారం ఎన్టీఆర్ జిల్లా సేంద్రియ మేళా – ఆర్గానిక్ రైతోత్సవం జరగనుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. అన్నదాతలు, ప్రకృతి వ్యవసాయ ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్గానిక్ రైతోత్సవం నిర్వహణపై జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి రెవెన్యూ, ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన, పశు సంవర్ధక తదితర సమన్వయ శాఖల అధికారులతో శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు రైతులకు సామర్థ్య అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ మేళాలో సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ స్టాళ్లు కూడా ఉంటాయన్నారు. సేంద్రియ సాగుకు అవసరమైన ఉత్పాదితాల ప్రదర్శన ఉంటుందన్నారు. రైతు–నిపుణుల పరస్పర చర్చా వేదికల ద్వారా సందేహాల నివృత్తితో పాటు మేధోమధనానికి అవకాశం కల్పించినట్లు వివరించారు. ప్రకృతి వ్యవసాయ రైతులు, వినియోగదారులు, సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ నెల 22వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలోనూ ప్రకృతి వ్యవసాయ మేళా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ధర లభించేలా మార్కెటింగ్ లింకేజీ, ఎంఓయూలపై అవగాహనతో పాటు అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, మంచి ఫలితాలు వచ్చేలా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. -
బాబు హయాంలో లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ చేపట్టాలి
చిలకలపూడి(మచిలీపట్నం): 2014 నుంచి 2019 వరకు, 2024 నుంచి ఇప్పటి వరకు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించే ధైర్యం సీఎం చంద్రబాబుకు ఉందా అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశ్నించారు. బందరులోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయిస్తే నిజాలు నిగ్గు తేలతాయన్నారు. చంద్రబాబు, నారా లోకేశ్ ఈ వ్యవహారంలో నిజాయితీపరులైతే శాసనమండలిలో ఎందుకు చర్చ జరపడం లేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పాత్రికేయుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై నారా లోకేశ్ పుష్ప సినిమా డైలాగుల మాదిరి ‘ఫ్లైట్ టిక్కెట్టు నాదే, మ్యాచ్ టిక్కెట్టు నాదే’ అని ట్వీట్ చేయటంపై పేర్ని నాని స్పందిస్తూ పుష్ప సినిమాలో హీరో కూలీ అని, నారా లోకేశ్ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు కూలీ అని ఫ్లైట్ టికెట్టు, మ్యాచ్ టికెట్టు కొన్న వివరాలు, బోర్డింగ్ పాస్ల వివరాలు, దుడ్లు ఏ అకౌంట్ నుంచి చెల్లించారో ఆధారాలు ట్విట్టర్లో పెట్టగలరా? అని నిలదీశారు. రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రి అయిన లోకేశ్ ఇప్పటి వరకు ఎన్ని స్పెషల్ౖ ఫ్లెట్లలో తిరిగారు? ఎంత మొత్తం ఏ అకౌంట్ ద్వారా చెల్లించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాబుపై ఎన్ని కేసులు పెట్టాలో అప్పుల మంత్రి కేశవ్ చెప్పాలి శాసనమండలిలో వైఎస్సార్ సీపీ సభ్యులు చెప్పులు వేసుకుని వేంకటేశ్వరస్వామి చిత్రపటాలతో సభలోకి వచ్చారని, దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ శాసనమండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారని ఓ విలేకరి ప్రశ్నించగా, పేర్ని నాని సమాధానం చెబుతూ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్కు అప్పులు తేవటం కోసం సంతకాలు పెట్టి, పెట్టి మైండ్ బ్లాక్ అయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ‘అప్పుల మంత్రి కేశవ్ గారూ నిత్యం వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని కేసులు నమోదు చేయాలో చెప్పగలరా?’ అని వేంకటేశ్వస్వామి చిత్రపటం పట్టుకుని చంద్రబాబు బూట్లతో వెళ్తున్న ఫొటో చూపించి ప్రశ్నించారు. నెయ్యి రవాణా కంపెనీలతో హెరిటేజ్కు ఎన్నో అక్రమ సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. ప్రసాదం అంశాన్ని బజారుకీడ్చిందెవరో! అసలు భోలేబాబా డెయిరీకి, హెరిటేజ్కు సంబంధం లేదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని, శాసనమండలిలో ప్రైవేటు కంపెనీపై ఎందుకు చర్చ జరపాలని అంటున్న టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ సలహాదారుగా ఉన్న కుటుంబరావు హెరిటేజ్ సంస్థపై ఎందుకు వివరణ ఇచ్చారో చెప్పాలని పేర్నినాని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఎవరినైనా మేనేజ్ చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, అయితే వేంకటేశ్వరస్వామిని మేనేజ్ చేయలేక ఆయన పాపం బద్ధలైందని, ఆ స్వామే కక్ష తీర్చుకున్నారని పేర్కొన్నారు. భోలే బాబా సంస్థతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్న టీడీపీ నాయకులు ఆ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న వైష్ణవి కంపెనీ యాజమాన్యం ద్వారా వెనక్కి పంపిన నాలుగు లారీల నెయ్యిని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎలా అనుమతించారని సూటిగా ప్రశ్నించారు. ఆ నెయ్యితోనే లడ్డూ ప్రసాదాన్ని చేసి భక్తులకు పంచలేదా అని నిలదీశారు. ప్రస్తుతం మార్కెట్లో రూ.650కు నెయ్యి దొరుకుతుంటే, రూ.658కు ఎలా కొనుగోలు చేస్తున్నారో చంద్రబాబు, లోకేశ్, పవన్కల్యాణ్ జవాబివ్వాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు లంకే వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి రూ.2.71 కోట్ల ఆదాయం
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ వ్యాపా రాలు నిర్వహించే హక్కు పొందేందుకు శుక్ర వారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ –ప్రొక్యూర్మెంట్ టెండర్ కం బహిరంగ వేలం ద్వారా రూ.2,71,06,062 ఆదాయం సమకూ రిందని ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. భక్తులు సమర్పించే తల నీలాలు పోగు చేసుకునే హక్కును రూ.2,07,72,729లకు శ్రీనివాస హెయిర్ ఇండస్ట్రీస్ (ఏలూరు), కొబ్బరి చెక్కలు పోగుచేసుకునే హక్కు రూ.52,33,333 లకు రెడ్డి మణికంఠ (తూర్పు గోదావరి జిల్లా), తిరునాళ్లలో జెయింట్ వీల్, కొలంబస్, పాస్ట్ఫుడ్ నిర్వహణకు రూ.11 లక్షలకు ఆర్.ఫణికుమార్ (ఉయ్యూరు) హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్ హక్కులు పొందారని పేర్కొన్నారు. ఈఈ రమ, ఏఈఓ జంగం శ్రీనివాస రావు, చుంచు రమేష్బాబు పాల్గొన్నారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల పోటీలు ఈ నెల 22 నుంచి మార్చి ఎనిమిదో తేదీ వరకు జరుగుతాయని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు. స్థానిక ఎక్స్పీరియన్స్ కేంద్రంలో ఈ పోటీల బ్రోచర్ను జేసీ ఇలక్కియ, కొండపల్లి మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ జి.కృష్ణన్ శుక్రవారం ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. సంప్రదాయ కళను ప్రోత్సహించి, కళాకారుల జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీలకు శుక్రవారం ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు శనివారం రాత్రి పది గంటల వరకు కొనసాగుతాయన్నారు. కళాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తయిన బొమ్మలను మార్చి తొమ్మిదో తేదీన సమర్పించాలని, రూ.లక్ష విలువైన బహుమతులు, సర్టిఫికెట్లు అందజేస్తారని పేర్కొన్నారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): క్వారీ, క్రషర్ లారీలను అరుణనగర్ రోడ్డు మీదుగా నడపొ ద్దని ఆ ప్రాంతం వాసులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఆరో రోజు కొనసాగాయి. లారీ లతో దుమ్ము ధూళితో కాలుష్యం పెరిగిందని శుక్రవారం స్థానికులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు. సీపీఎం పట్టణ కార్యదర్శి ఎం.మహేష్ మాట్లాడుతూ లారీల అతివేగంతో వెదజల్లుతున్న కాలుష్యంతో ఇళ్లల్లో ఉండలేక పోతున్నామన్నారు. గుంతలు పడిన రోడ్డులో లారీల మధ్య బైకులు నడపాలన్నా, కాలినడకతో వెళ్లాలన్నా నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో ఉన్న సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడో ఎన్టీపీసీ ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఫర్ ఉమెన్ ఆర్చరీ టోర్నమెంట్ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్చరీ అసో సియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియే షన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్), డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ సంయుక్తంగా ఈ పోటీ లను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. 22వ తేదీ ఉదయం పది గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, శాప్ వైస్ చైర్మన్ ఎస్.భరణి టోర్నమెంట్ను ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలోని సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో రికర్వ్ అండ్ కాంపౌండ్ అంశాల్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానాల్లో ఉన్న మహిళా ఆర్చర్లు పాల్గొంటారని సత్యనారాయణ వివరించారు. -
ప్రత్యేక ఉప కారాగారం సందర్శన
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ విజిటర్స్ సభ్యులు శుక్రవారం మచిలీపట్నం ప్రత్యేక ఉపకారాగారాన్ని సంద ర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తదితరుల కేసు నేపథ్యంగా దేశవ్యాప్తంగా జైళ్ల స్థితిగతులు, ముద్దాయిలకు అందుతున్న సదుపాయాలు, వసతులు, కుల, మత సంబంధిత వివక్ష అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి, సీనియర్ సివిల్ జడ్జి కె.వి.రామకృష్ణయ్య, బోర్డు సభ్యులైన రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.పోతురాజు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి.యుగంధర్, పంచాయతీరాజ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎ.రమణరావు, డీవైఈఓ బి.ఎస్.సి. శేఖర్ సింగ్, జిల్లా సామాజిక సంక్షేమ అధికారి ఎస్కే షాహిద్ బాబు, జిల్లా ఉపాధి అధికారి బ్రహ్మం, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఖైదీలతో అధికారులు నేరుగా మాట్లాడి జైలులో అందుతున్న వసతులు, ఆహారం, శుభ్రత, వైద్య సేవలు, న్యాయ సహాయం వంటి అంశాలపై ఆరా తీశారు. సబ్ జైలులో ఖైదీలందరూ మంచి పరివర్తనతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ చీలి ముసలయ్య, జైలు సూపరింటెండెంట్ పిల్లా రమేష్, డెప్యూటీ జైలర్ టి.మాలిబాబు, జైలు సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
మచిలీపట్నంఅర్బన్: సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు వైవీవీ మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 28 తేదీ వరకు ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్యావుల రామాంజనేయులు, అడపా శ్రీనివాసరావు, వీర వల్లి వెంకటేశ్వరరావు, రాజులపాటి శ్రీనివాసరావు, అనుమకొండ శ్రీనివాసరావు, మెట్ల శ్రీనివాసరావు, మన్నే శ్రీనివాసరావు, వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. -
చెస్ మహిళా జట్టు ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్(మహిళల) టోర్నమెంట్లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు క్రీడాకారులను ఎంపిక చేశామని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ ఈ.త్రిమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలోని గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ ఆవరణలో జరగనున్న ఈ టోర్నీకి ఎం.సాయిదివ్వ, ఎన్.సాత్విక, బి.నివేదితా బాయ్, ఏ.శ్రీనిధి, ఆర్.దీపిక, డి.అమూల్య ఎంపిక య్యారని తెలిపారు. విశాఖపట్నలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన ఆర్.గున్నాజీని జట్టు మేనేజర్గా, కోచ్గా డాక్టర్ కె.రామకృష్ణారావును ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను వర్సిటీ వైస్ చాన్స్లర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయి సుఽధీర్ అభినందించారు. -
మహిళలకు కారు డ్రైవింగ్లో శిక్షణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. 3వ తేదీ చంద్రగ్రహణం నేపథ్యంలో శాంతి కల్యాణం, చండీహోమం, సాయంత్రం పంచహారతుల సేవ, పల్లకీ సేవలను రద్దు చేశారు. ఇక 4వ తేదీ ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం నేపథ్యంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహహోమం, గణపతి హోమాలను రద్దు చేశారు. ఉదయం 7.30గంటలకు ప్రారంభమయ్యే లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను ఉదయం 8.30 గంటలకు నిర్వహిస్తారు. ఇక 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆలయంలో జరిగే కుంభాభిషేక మహోత్సవం నేపథ్యంలో అన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మచిలీపట్నంటౌన్: రైల్వేలో ఉద్యోగాల పేరుతో బురిడీ కొట్టించారని ఈ నెల 19న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త కు రైల్వే పోలీసులు స్పందించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ (సికింద్రాబాద్) ఆదేశాలతో గురువారం విజయవాడ రైల్వే ఇంటెలిజెన్స్ ఎస్ఐ పోలయ్య తన బృందంతో మచిలీపట్నం విచ్చేశారు. తొలుత రైల్వే క్వార్టర్కు వెళ్లి పరిశీలించగా రైల్వే ఉద్యోగి కిషోర్ కుమార్ క్వార్టర్కు తాళం వేసి ఉండడంతో రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం బాధితుల నుంచి కలిసి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండు గంటల పాటు విచారించారు. వారి వద్ద ఉన్న ఆధారాలను సేకరించి, ఈ వ్యవహారానికి సంబంధించిన కాల్ రికార్డులను విన్నారు. -
జాతీయ సాంఘిక నాటకోత్సవాలు ప్రారంభం
విజయవాడ కల్చరల్: ఏపీ సృజనాత్మక సాంస్కృతిక సమితి సౌజన్యంతో శ్రీ కృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యాన ఈ నెల 19 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే 26వ సాంఘిక నాటకోత్సవాలు గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో గురువారం ప్రారంభమయ్యాయి. సమాజంలో విలువలతో కూడిన రాజకీయాలు నడపాలని, సమాజమే దేవాలయమని పీడిత తాడిత ప్రజలకు మేలు చేస్తే ప్రజల గుండెల్లో నిలచిపోతారనే సందేశంతో హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారి అనగనగా ఓ రాత్రి సాగుతుంది. రచన పీవీ సత్యనారాయణ, దర్శకత్వం మహ్మద్ఖాజావలి, రెండో నాటికగా హైదరాబాద్కు చెందిన స్వర్ణసూర్యా డ్రామాలవర్స్ వారి సీ్త్రమాత్రేనమః మూడో నాటికగా ఉషోదయ, కట్రపాడు వారి మంచి మనసులు నాటకాన్ని ప్రదర్శించారు. నాటక పోటీలను ప్రారంభించిన సమాచార పౌరసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్కుమార్ పోతలు మాట్లాడుతూ తెలుగు నాటకాలకు పూర్వవైభవం తీసుకురావాలన్నారు. శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కేవీ రంగనాథన్, కోశాధికారి చంద్రశేఖర్, శ్రీ కృష్ణ తెలుగు ఽథియేటర్ ఆర్ట్స్ క్రియాశీలక నిర్వాహకులు హరి రవిశంకర్, మక్కపాటి అవంతి, బొర్రా నరేన్, హెచ్వీఆర్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. -
రైతులకు బోనస్ ఇవ్వొద్దనడం సరికాదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతులకు బోనస్ ఇవ్వొద్దంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి, ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులు పండించిన వరి, గోధుమలకు రూ.630 బోనస్ ప్రకటించిందన్నారు. ఈ నిర్ణయాన్ని సమర్థించాల్సిన కేంద్రం అందుకు భిన్నంగా బోనస్ ఇవ్వడానికి వీల్లేదంటూ కేరళ సీఎస్కు లేఖ రాసిందన్నారు. కేంద్రం లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాల్సిన కేంద్రం, కేరళ రాష్ట్రం ఇస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. అమెరికా ఒప్పందంపై సంతకం చేయొద్దు.. రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పాడి, ఫౌల్ట్రీ రంగం, పశుసంవర్థక, మత్స్య శాఖ తదితర రంగాలకు నష్టదాయకమైన భారత, అమెరికా ఉచిత వాణిజ్య ఒప్పందంపై సంతకాన్ని చేయవద్దని కేంద్రాన్ని కోరారు. మన పంటలకు సుంకాలు అమెరికా విధించటం, వారి పంటలేమో ఉచితంగా కొనుగోలు చేయటం ఏ పాటి ఒప్పందమని కేంద్రంపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను కలుస్తాం.. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ మాట్లాడుతూ రైతు సమస్యలపై ఈ నెల 27న సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ను కలుస్తామన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందరావు, ఏఐకేఎఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, నల్లమడ రైతు సంఘం నాయకుడు డాక్టర్ కొల్లా రాజమోహన్, ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి వెంకటరెడ్డి, ఏఐఎస్ కేఎస్ కేంద్ర నాయకుడు జానకీరాములు, కిసాన్ సంఘటన్ రాష్ట్ర నాయకుడు మరీదు ప్రసాద్ బాబు పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోఽభనాద్రీశ్వరరావు -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుడివాడకు చెందిన మసిముక్కు జలచంద్రరావు, మల్లీశ్వరి దంపతులు వారి కుటుంబ సభ్యులైన సత్యనారాయణ, మాధవి, వెంకట నారాయణ, వెంకటరత్నమ్మ పేరిట రూ.2లక్షల విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందజేశారు. జలచంద్రరావు, మల్లేశ్వరి తమ కుమారుడు సత్యనారాయణ, మాధవిల పేరిట రూ.1,55,599 విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందజేశారు. హైదరాబాద్ లింగంపల్లికి చెందిన నారాయణమ్, రాజేష్, నాగలక్ష్మి ఆలయ అధికారులను కలిసి అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను దాతలకు అందజేశారు. -
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలను అందచేశారు. సింగపూర్కు చెందిన విపిన్ కుమార్, ప్రవీణ్కుమారి కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం సమర్పించింది. గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన కొండూరు కృష్ణమూర్తి, ఉమామహేశ్వరి అమ్మవారి నిత్యాన్న దానానికి రూ.1,00,001 విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.రామలింగేశ్వరుడికి రూ.10 లక్షల ఆభరణాలు పెనమలూరు: మండలంలోని యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతి సమేత శ్రీ రామ లింగేశ్వరస్వామికి భక్తులు రూ.10 లక్షలు విలువ చేసే ఆభరణా లను బుధవారం సమర్పించారు. విజయవాడ పటమటకు చెందిన కొడాలి సీతారాంబాబు, ఉషారాణి దంపతులు బంగారపు పూతతో జటాజూటం, నాగాభరణం తయారు చేయించారు. ఆలయ నిర్మాణ దాత సంగా నరసింహా రావు, ఈఓ ఎన్.భవాని పాల్గొన్నారు.సీబీసీ ప్లాంట్ను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశకంచికచర్ల: మండలంలోని పరిటాల శివారు దొనబండ నేషనల్ హైవే పక్కన ఏర్పాటు చేసిన రిలయన్స్ న్యూ ఎనర్జీ కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీసీ) ప్లాంట్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ బుధవారం సందర్శించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్ను త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్లాంట్లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. రోజుకు 22 టన్నుల సీజీసీ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంటును సిద్ధం చేస్తున్నట్లు ప్లాంటు సిబ్బంది తెలిపారు. స్థానిక వ్యవసాయ వ్యర్థాలు, మునిసిపల్ ఘన వ్యర్థాలను ఉపయోగించి పర్యావరణ హిత ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు ఈ ప్లాంటు దోహదం చేస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, ప్లాంట్ డీజీఎం శ్రీకాంత్, ప్లాంట్ మేనేజర్ శ్రీచరణ్, అసిస్టెంట్ మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
డీపీవో అరుణకు ఉద్యోగోన్నతి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పంచా యతీ అధికారి జె. అరుణకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో నంబరు 13ను విడుదల చేశారు. జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉద్యోగోన్నతి కల్పించారు. అయితే ఏ జిల్లాలో విధులు కేటాయించిందీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులతో పాటు డీపీవో కార్యాలయ సిబ్బంది అరుణకు అభినందనలు తెలిపారు. పాఠశాలల్లో డీఈఓ తనిఖీలు రెడ్డిగూడెం: మండలంలోని రంగాపురం కస్తూర్భాగాంధీ, బాలయోగి గురుకుల కళాశాలలను, రెడ్డిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 100రోజుల కార్యక్రమం గురించి అడిగి తెలుసుకుని, 10వ తరగతి విద్యార్థులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎంఈవో రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెబ్ డెవలపర్ కోర్సులో ఉచిత శిక్షణ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నిరుద్యోగ యవతకు వెబ్ డెవలపర్ కోర్సులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారధి ఓ ప్రకటనలో తెలిపారు. తమ కళాశాల ఆవరణలోని స్కిల్ హబ్లో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయని, డిప్లొమా, ఇంటర్మీడియెట్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ శిక్షణ తరగతులకు హాజరు కావడానికి అర్హులని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రధాన మంత్రి కౌశల్ వికాసయోజన స్కీమ్ ద్వారా సర్టిఫికెట్తో పాటుగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 23వ తేదీలోగా విజయవాడ రమేష్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు 99857 59304, 63050 04318లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. -
ముగిసిన నెట్బాల్ టోర్నమెంట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువత విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ(శాప్) చైర్మన్ ఎ.రవి నాయుడు సూచించారు. స్థానిక మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్బాల్ టోర్నమెంట్ బుధవారం సాయంత్రం ముగిసింది. సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం జట్టు మొదటి స్థానంలో నిలిచి ట్రోిఫిని సొంతం చేసుకుంది. కాలికట్ విశ్వవిద్యాలయం ద్వితీయ, కృష్ణా విశ్వవిద్యాలయం తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు. ముగింపు సభకు రవినాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. శాప్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి శాప్ లీగ్స్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభ చూపిన వారికి శాప్ తరఫున శిక్షణ ఇచ్చి, వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామ న్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ కూన రాంజీ మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్లో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 90 టీమ్లు, 200 మంది కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారని తెలిపారు. కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్.ఉష, రెక్టార్ ఎం.వి. బసవేశ్వరరావు, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ జి. ఇన్యాసమ్మ, కాకినాడ జేఎన్టీయూ స్పోర్ట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జి.శ్యామ్కుమార్ పాల్గొన్నారు. -
ఇంటర్మీడియెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సమన్వయ సమావేశంలో డీఐఈఓ సరళ కుమారి మచిలీపట్నం అర్బన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్. సరళ కుమారి ఆదేశించారు. బుధవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా కేంద్రంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ పరీక్షలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రత, ప్రధాన సమాధాన బుక్లెట్ల సరైన వినియోగం, ఓఎంఆర్ షీట్ల నిర్వహణ, హాజరు పట్టికల కచ్చితమైన నమోదు వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా ఉన్నాయో లేదో ముందస్తుగా పరిశీలించాలన్నారు. హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల సమాచారంతో పాటు ఇతర ఎలాంటి సమస్యలు, సందేహాలున్నా కంట్రోల్ రూం(18004251531)ను సంప్రదించొచ్చన్నారు. అనంతరం ఇంటర్మీడియెట్ విద్యా మండలి పరీక్షల నిర్వహణ కార్యదర్శి పి. రంజిత్ బాషా, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పరిశీలన అధికారి సైమన్ విక్టర్ వీడియో కాన్ఫ రెన్స్లో పలు మార్గదర్శకాలు అందించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, పరీక్షల నిర్వహణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అంకెల గారడీతో అన్ని వర్గాలకూ టోపీ
రాష్ట్ర బడ్జెట్పై రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టేలా ఉందని విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. బుధవారం విజయవాడలోని దాసరి భవన్లో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్పై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో పీవీ రమేష్ మాట్లాడుతూ బడ్జెట్లో పేర్కొన్న కేటాయింపులకు వాస్తవిక వ్యయాలకు పొంతన ఉండటం లేదన్నారు. బడ్జెట్ ప్రజల సంక్షేమం, అభివృద్ధిలను పూర్తిగా విస్మరించిందన్నారు. పదేళ్లుగా కేవలం 5 శాతం మాత్రమే రాష్ట్ర ఆదాయం పెరుగుతూ రూ.88వేల కోట్లకు చేరిదని.. నేటి బడ్జెట్లో పేర్కొనట్లు రూ. 1.25వేల కోట్లకు ఎలా చేరుతుందని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందన్నారు. బడ్జెట్లో మరో లక్ష కోట్ల రూపాయల రుణాలను ఈ ఏడాది పొందాలని పేర్కొనడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3శాతానికి మించి అప్పులు చేయరాదని 16వ ఫైనాన్స్ కమిషన్ స్పష్టం చేసిందన్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేయడం లేదన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ప్రజలకు ప్రయోజనం లేదు.. వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కోట్లాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులు చూస్తే అరకొరగా ఉన్నాయన్నారు. సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే విధంగా బడ్జెట్ రూప కల్పన జరగలేదని విమర్శించారు. అంకెల గారడీతో రూపొందించిన బడ్జెట్లో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యం లేదు.. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమ్మిళత వృద్ధికి, అసమానతల తగ్గింపునకు తోడ్పడే విధంగా లేదన్నారు. 60 శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యం దక్కలేదన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. వి. లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవీ ప్రసాద్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. రాంభూపాల్, కాంగ్రెస్ పార్టీ జాతీయ సభ్యుడు నరహరశెట్టి నరసింహారావు, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకుడు వినయ్ కుమార్, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డల నిధి, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వృద్ధాప్య పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చిందని, నేడు బడ్జెట్లో వాటికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఆయా వర్గాలను మోసం చేసిందన్నారు. ఆర్భాటమైన ప్రచారాలతో వివిధ రకాల ఈవెంట్లతో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణానికి రూ. 4వేల కోట్లు కేటాయించలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. -
21న పోరంకిలో జాబ్మేళా
పెనమలూరు: పోరంకిలో ఈ నెల 21వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో వివరాలు తెలుపుతూ పెనమలూరు నియోజకవర్గ పరిధి పోరంకి 100 అడుగుల రోడ్డులో ఉన్న శ్రీ కృష్ణ వేణి డిగ్రీ కాలేజీలో ఉదయం 9గంటలకు మేళా నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో 16 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ, ఇంజినీరింగ్ వరకు చదువుతున్న వారు 18 నుంచి 35 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.సురేష్కుమార్ మాట్లాడుతూ జాబ్మేళాకు వచ్చే వారు ఆధార్ కార్డు, బయోడేటా, పాన్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు తప్పని సరిగా తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు 7981368429, 8885159008, 9676708041లో సంప్రదించాలని ఆయన సూచించారు.నేటి నుంచి సాంఘిక నాటకోత్సవాలువిజయవాడ కల్చరల్: ఏపీ సృజనాత్మక సాంస్కృతిక సమితి, శ్రీ కృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కృష్ణా తెలుగు థియేటర్ ఆర్ట్స్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కేవీకే రంగనాథం తెలిపారు. సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. శ్రీ కృష్ణ ఆర్ట్స్ థియేటర్ 26వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమ ఆహ్వాన పత్రాన్ని సమాచార పౌరసంబంధాల శాఖ డెప్యూటీ డైరెక్టర్ కిరణ్ కుమార్ ఆవిష్కరించారు. సమావేశంలో కోశాధికారి చంద్రశేఖర్, సహకార్యదర్శి శ్రీకృష్ణా ఆర్ట్స్ థియేటర్స్ హరి రవిశంకర్, సహకార్యదర్శి మక్కపాటి అవంతి తదితరులు పాల్గొన్నారు.సుబాబుల్ కర్రలు పడి యువకుడు మృతివత్సవాయి: సుబాబుల్ కర్రల లోడ్తో వస్తున్న ట్రాక్టర్పై నుంచి పడి యువకుడు మరణించిన సంఘటన బుధవారం వత్సవాయి వేమవరం రహదారిలో చోటుచేసుకుంది. వివరాలు.. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామానికి చెందిన కొందరు కూలీలు సుబాబుల్ కొట్టేందుకు వత్సవాయి వచ్చారు. సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో సుబాబుల్ లోడ్తో ఉన్న ట్రాక్టర్పై డ్రైవర్ పక్కన్న ముప్పాళ్ల పండు(18) కూర్చొన్నాడు. ఈ క్రమంలో వేమవరం రహదారిపై ఓ గుంతలో ట్రాక్టర్ దిగడంతో కుదుపు ఏర్పడి డ్రైవర్ పక్కన కూర్చున్న పండు కిందపడిపోయాడు. అదే సమయంలో ట్రాక్టర్ పై లోడ్ చేసి ఉన్న సుబాబుల్ కర్రలు కూడా అతనిపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పదో తరగతి పూర్తి చేసిన పండు కుటుంబ పోషణ నిమిత్తం కూలీ పనులకు వెళ్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి, ఓ సోదరి ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పతికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
డాక్టర్ దీపిక మృతిపై డీఎంఈ ఆరా
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ఎనస్థీషియా పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థిని డాక్టర్ బత్తుల దీపిక అనుమానాస్పద మృతిపై రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రఘునందన్రావు ఆరా తీశారు. ఆయన బుధవారం వైద్య కళాశాలకు వచ్చి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు, ఆమె క్యాన్నులా పెట్టించుకున్న విషయం డీఎంఈకి వివరించారు. ఆమె మృతికి గల కారణాలను సహచర విద్యార్థులు కానీ, స్టాఫ్ కానీ చెప్పలేక పోతున్నట్లు ఆయన డీఎంఈకి తెలియజేశారు. విచారణలో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా ఉన్న అంశాన్ని వివరించారు. అసిస్టెంట్పై ఆరా.. కాగా ఆ రోజు మృతురాలు డాక్టర్ దీపిక అసిస్టెంట్ ప్రొఫెసర్ రూమ్లో క్యాన్నులా పెట్టించుకుని ఇంజెక్షన్ చేయించుకుంది. అసిస్టెంట్ ఆ సమయంలో విధుల్లో లేకుండా ఎక్కడికి వెళ్లిందనే అంశాన్ని కూడా డీఎంఈ లేవనెత్తినట్లు తెలిసింది. ఆమె ఇంటి కెళ్లిపోయినట్లు ఇప్పటికే ‘సాక్షి’లో కథనం రావడంతో ఆ అంశాన్ని కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. డాక్టర్ దీపిక విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మనోధైర్యాన్ని నింపడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ అన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని బుధవారం ఎన్జీవో హోంలో విద్యాసాగర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా ఉద్యోగుల కృషి, నాయకత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ వి.నిర్మలా కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 4, 5, 6 తేదీలలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆయా తేదీలలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలచారి ఇండోర్ స్టేడియం, ఏపీ ఎన్జీవో హోం నందు నిర్వహించే కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ, రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య గుడివాడరూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుడివాడ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలో పెద్ద వీధికి చెందిన పి.మాధురి(30) గత కొంతకాలంగా మునిసిపల్ పార్కు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుండగా భర్త తాపీ పని చేస్తూ ఇద్దరు కుమారులతో కలసి జీవిస్తున్నారు. గత 27వ తేదీన మాధురి ఆస్పత్రిలో ఉద్యోగం మానేసిందని, రెండు రోజుల నుంచి ఇంట్లో ఒక్కతే ఒంటరిగా ఉంటోందని స్థానికులు పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతసేపటికి ఇంటి పక్కన వారు వచ్చి చూడగా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసి వెంటనే పరిసర ప్రాంతాల్లోని వారికి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్, వన్టౌన్–2 ఎస్ఐ కుమార్రాజాలు సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తల్లి గట్టు దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా వన్టౌన్ ఎస్ఐ–2 కుమార్రాజా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే ఉద్యోగాల పేరుతో బురిడీ
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నానికి చెందిన రైల్వే ఉద్యోగి, టీడీపీ చోటా నాయకులు రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు 70 మంది నిరుద్యోగుల నుంచి రూ.2.50 కోట్ల మేర దండుకున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తమ వద్ద నుంచి రూ.లక్షలు వసూలు చేసి మూడేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో తాము మోసపోయా మని బాధితులు వాపోతున్నారు. ఇటీవల మోసగించిన రైల్వే ఉద్యోగి ఇంటికి వచ్చి నిలదీయడంతో బండారం బయటపడింది. బాధితుల కథనం మేరకు.. మచిలీపట్నం రైల్వేస్టేషన్లో వెల్డర్గా పనిచేస్తున్న ఎం.కిషోర్ కుమార్ తాను టికెట్ కలెక్టర్ను అంటూ కొందరు నిరుద్యోగులను పరిచయం చేసుకున్నాడు. మంత్రి కొల్లు రవీంద్రతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే చిన్నం చిన్నా, గిలకలదిండికి చెందిన టీడీపీ చోటా నాయకుడు రమేష్, విజయవాడ రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులు కర్మిల, షఫీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. తమ రాజకీయ పలుకుబడితో దొడ్డిదారిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భరోసా ఇచ్చారు. 70 మంది నుంచి విడతల వారీగా రూ.లక్షలు దండుకున్నారు. చెక్కులు ఇచ్చి దాటవేత బాధితురాలు నాగ పద్మ మీడియాతో మాట్లా డుతూ.. తాను 2021 ఆగస్టు 20న విజయవాడ కనక దుర్గమ్మ గుడికి వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్లో కిషోర్ పరిచయమై ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ బలికాడని తెలిపారు. తనకు, తన కుమారుడికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫోన్పే, బ్యాంక్ అకౌంట్, నగదు రూపంలో కిషోర్ రూ.20 లక్షలు తీసుకున్నాడని వివరించారు. తనకు ఉద్యోగం వచ్చినట్లుగా నకిలీ ధృవపత్రాలు, గుర్తింపు కార్డు సృష్టించాడని, రైల్వే ఉద్యోగుల కోఆపరేటివ్ బ్యాంకులో రుణం కోసం తన పేరుతో దరఖాస్తు చేశానని కిషోర్ తెలిపాడని, ఆ రుణానికి సంబంధించిన మెసేజ్లు కూడా వచ్చా యని వివరించింది. డబ్బులు ఇవ్వాలని తాను ఒత్తిడి చేయగా కిషోర్ 2024 మే 27 తేదీతో వీరంకి హరివాసుదేవరావు పేరుతో ఉన్న చెక్కు తనకు ఇచ్చాడని తెలిపింది. ఆ చెక్కు చెల్లకపోవడంతో మచిలీపట్నంలోని కిషోర్ ఇంటికి వెళ్లి డబ్బులు అడిగానన్నారు. డబ్బులు ఇవ్వకపోగా టీడీపీ నాయకుడు చిన్నం చిన్నా అండదండలతో తాము దాడి చేశామని ఆస్పత్రిలో చేరి తమపై ఎదురు కేసు పెట్టాడని వాపో యింది. చిన్నం చిన్నా కూడా పలుమార్లు ఉద్యోగం వస్తుందని నమ్మబలికాడని పేర్కొన్నారు. చివరకు కూర్చుని మాట్లాడి డబ్బులు ఇప్పిస్తానని చెప్పి, తన డ్రైవర్ను పంపాడని పేర్కొన్నారు. చిలకలపూడికి చెందిన వేగేశ్న గంగాభవాని మాట్లాడుతూ.. తనకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని కిషోర్ రూ.2.50 లక్షలు విడతల వారీగా తీసుకుని మూడేళ్లయిందని తెలిపారు. పోలీసులు తమ ఫిర్యాదు మేరకు కిషోర్ అతనికి సహకరిస్తున్న చిన్నం చిన్నా, రమేష్, కర్మిల, షఫీపై కేసు నమోదు చేయాలని కోరింది. తమతో పాటు కిషోర్ చేతిలో మోసపోయిన నిరుద్యోగులకు డబ్బులు ఇప్పించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆమె డిమాండ్ చేసింది. మూడేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు కాళ్ల మండలం జక్కరం గ్రామానికి చెందిన కునాధరాజు నాగపద్మ, ఆమె తండ్రి కృష్ణంరాజు, మచిలీపట్నం చిలకలపూడికి చెందిన వేగేశ్న గంగాభవాని ఈ నెల మొదటి వారంలో రైల్వే క్వార్టర్స్లో నివసిస్తున్న కిషోర్కుమార్ ఇంటికి వెళ్లి నిలదీశారు. వారిని బెదిరించేలా మాట్లాడిన కిషోర్ ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లి తనపై కునాధరాజు నాగ పద్మ, కృష్ణంరాజు, వేగేశ్న గంగాభవాని దాడి చేశారని జీజీహెచ్లో చేరాడు. అతని ఫిర్యాదు మేరకు ఆస్పత్రిలోని అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలపూడి పోలీసులు ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్కు పిలిచి మాట్లాడారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేలా అందుబాటులో ఉండాలని వారిని ఆదేశించారు. తాము ముందుగానే కిషోర్ కుమార్పై ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని బాధితులు అడిగితే ముందు దాడి కేసు తేలితే ఆ తర్వాత మీ కేసు చూద్దామని బదిలిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. -
పంచాయతీ నిధులు.. ఫలహారం!
ఎంచక్కా పంచేసుకున్న అధికారులుముక్త్యాల(జగ్గయ్యపేట): పంచాయతీకి పన్నులు, కేంద్ర రాష్ట్ర నిధులు వస్తున్నప్పటికీ గ్రామాభివృద్ధిని పక్కనబెట్టి నిధులను పక్కదారి పట్టించారు. ప్రజా ప్రతినిధితో కలిసి అధికారులు జేబులు నింపుకున్నారు. వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. 2021–2025 జూలై వరకు జగ్గయ్యపేట మండలం, ముక్యాల గ్రామ పంచాయతీ నిధులు రూ. 2.90 కోట్ల మేర దుర్వినియోగమైనట్లు జిల్లా అధికారులు గుర్తించి, ప్రస్తుత గ్రామ సర్పంచ్, అప్పటి పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు అందించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసలేం జరిగిందంటే.. గతేడాది ఏప్రిల్లో జెండా చెట్టు దగ్గర సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు గ్రామ సర్పంచ్, కార్యదర్శులకు మొరపెట్టుకున్నారు. దీంతో వారు పంచాయతీలో నిధులు లేవని చెప్పటంతో గ్రామానికి చెందిన 10 మంది యువకులు కలిసి 2025 జూలైలో జిల్లా కలెక్టర్కు పంచాయతీ నుంచి ఆదాయం ఉన్నా.. గ్రామాభి వృద్ధి లేదని, నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఎనిమిది నెలల పాటు జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి ఆధ్వర్యంలో విచారణ జరిపిన అధికారులు నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. విచారణ సమయంలో అధికారులను కూటమి నాయకుల ఒత్తిళ్లకు గురిచేయటంతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వారిపైనా బెదిరింపులకు దిగటం గమనార్హం. రూ. 2.90 కోట్లు దుర్వినియోగం.. పంచాయతీలో 2021 నుంచి 2025 వరకు ప్రస్తుత సర్పంచ్తో పాటు అప్పటి కార్యదర్శులు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. 2021 నుంచి 2025 సాధారణ నిధులు రూ. 2,83,96,797, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 6,49,930, మొత్తం రూ. 2,90,46,727 దుర్వినియోగమైనట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ పనుల కింద పంచా యతీ నిధులను పలు గ్రామాలకు కేటాయించినట్లు అధికారులు గుర్తించారు. నిధుల దుర్వినియోగంలో సర్పంచ్ షేక్ అస్మతున్ వాటా కింద రూ. 1,45,23,000, అప్పటి కార్యదర్శులు ఎన్వీ నరసింహారావు రూ. 1,23,24,000, జి. శ్రీనివాస రెడ్డి రూ. 20 లక్షలు, కె. సిద్ధారెడ్డి రూ. 1.93లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు. కాగా ఈవోఆర్డీ పద్మావతికి జాయింట్ చెక్పవర్ ఇస్తూ డీపీవో ఆదేశాలు ఇచ్చారు. -
భూముల రీసర్వేను త్వరగా పూర్తి చేయాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పామర్రు(పమిడిముక్కల): కృష్ణాజిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భూముల రీసర్వేను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. రీ సర్వేకు ముందు రైతులకు నోటీసులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో రీ సర్వే పూర్తి చేస్తున్నామని వివరించారు. భూమి వివరాల నమోదును తప్పుగా సైట్లో చూపిస్తే దానిని సరి చేసుకునేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అనే విషయాలను వివరించారు. రైతులు తమ పాస్ బుక్లో ఉన్న తప్పులను సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. భవిష్యత్లో రాబోయే పట్టాదారు పాసు పుస్తకంలో ఏవిధమైన తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయాల సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు. -
గలీజు దందా
గుడివాడరూరల్: టీడీపీ నాయకుడు ఒకరు బరితెగించారు. నిరుపేదల భూముల్లో వారితో లీజు అగ్రి మెంట్ చేయించుకోకుండా ఎమ్మెల్యే తన వెనక ఉన్నారంటూ అడ్డగోలుగా చెరువులో పూడికతీసి గట్లను పటిష్టం చేస్తున్నారు. ఇదేమి అన్యాయమంటూ అడిగిన పేదలను దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారు. తమ భూములను నెల రోజులుగా దౌర్జన్యంగా తవ్వేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం గుడివాడ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.ముగిసిన లీజునందివాడ మండలంలోని పోలుకొండ గ్రామ శివారు నాగభూషణపురం గ్రామంలో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని రెండు దశాబ్దాల క్రితం విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చేపల చెరువుగా మార్చారు. ఈ భూముల్లో అత్యధికం గ్రామంలోని నిరుపేద ఎస్సీలకు చెందినవే. ఆ పారిశ్రామికవేత్త భూముల యజమానుల నుంచి లీజుకు తీసుకున్నారు. చెరువు తవ్వినప్పటి నుంచి క్రమం తప్పక లీజు సొమ్ము చెల్లించారు. ఆయన తీసుకున్న లీజు గడువు ముగిసిన తర్వాత గుడివాడకు చెందిన టీడీపీ నాయకుడికి సదరు రైతులు నిబంధనల ప్రకారం లీజుకు ఇచ్చారు. ఈ లీజు ప్రక్రియ ప్రస్తుతం ముగి సింది. లీజు నిబంధనల ప్రకారం సదరు నేత రైతుల అంగీకారంతో మరో సారి లీజు తీసుకోవాలి.బెదిరింపుల పర్వంఎస్సీల భూములకు సంబంధించి గుడివాడకు చెందిన టీడీపీ నేత కుదుర్చుకున్న లీజు గడువు ముగిసింది. గడువు ముగిసినందున ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికే రైతులు చెరువును లీజుకు ఇచ్చుకోవచ్చు. గుడివాడకు చెందిన ఓ వ్యక్తి ఎకరాకు రూ.లక్ష చెల్లించేందుకు ముందుకొచ్చారు. కొంత మంది రైతులకు ఇప్పటికే రూ.లక్ష చొప్పున చెల్లించారు. లీజు గడువు ముగిసిన టీడీపీ నాయకుడు మళ్లీ రంగంలోకి వచ్చాడు. తనకే ఆ భూములను లీజుకు ఇవ్వాలని, ఎకరాకు రూ.80 వేలు మాత్రమే చెల్లిస్తానని, తనను కాదని ఎవరికై నా ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాడు. తనకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని, తాను ఎంత చెబితే అంతే లీజుకు ఇవ్వాలని, లేనిపక్షంలో చెరువును సాగు చేసుకోనివ్వనని భీష్మించాడు. అంతేకాదు రైతులను బెదిరించి వారితో లీజు కుదుర్చుకోకుండా నెలరోజుల నుంచి చెరువును యథేచ్ఛగా తవ్వేస్తూ మరమ్మతులు చేపట్టాడు. తాము లీజుకు ఇవ్వకపోయినా తమ భూముల్లో చెరువు మరమ్మతులు ఎలా చేపడత్తారని ప్రశ్నించడానికి వెళ్లిన అమాయక ఎస్సీ వర్గానికి చెందిన రైతులపై దౌర్జన్యానికి దిగాడు. కొందరు రౌడీమూకలను వారిపై ఉసిగొలిపి దాడు లకు పాల్పడుతున్నాడు. దశాబ్దాల కాలంగా తమ వంశీకుల నుంచి తాము సాగు చేస్తున్న భూములను దౌర్జన్యంగా తవ్వేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత ఎస్సీ వర్గాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పత్తాలేని అధికారులు చంద్రబాబు ప్రభుత్వం చేపల చెరువులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రవేశపెట్టింది. ప్రతి ఎకరాకు కనీస రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చెరువుల మర మ్మతులు చేయాలంటే దాని కింద భూములు ఉన్న రైతులు అందరూ అంగీకారం తెలపాలి. 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు సంబంధించి 42 ఎకరాల రైతులు లీజుకు ఇవ్వలేదు. అయినా టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే పేరుతో బెదిరిస్తున్నాడు. ఇప్పటికే బాధిత రైతులు కొందరు రెవెన్యూ, మత్య్సశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారీ స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.మేము పోలుకొండ గ్రామానికి చెందిన నిరు పేద ఎస్సీలం. తాతల కాలం నుంచి బండిరేవులో 44 సెంట్ల భూమి ఉంది. మా భూమిని గుడి వాడకు చెందిన టీడీపీ నేతకు లీజుకు ఇచ్చాం. లీజు కాలం ముగిసింది. మరొకరికి ఎకరాకు రూ.లక్ష చొప్పున లీజుకు ఇచ్చాం. లీజు ముగిసిన టీడీపీ నేత మా అనుమతి లేకుండా చెరువు తవ్వేస్తున్నాడు. ఒప్పుకొంటే ఎకరాకు రూ.80 వేలు ఇస్తామని, లేకపోతే ఒక్కరూపాయి కూడా ఇచ్చేది లేదని బెదిరిస్తున్నాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి.– పి.ప్రసన్న, రైతు పోలుకొండ -
ప్రజలకు బాబు వెన్నుపోటు..
గత సార్వత్రిక ఎన్నికలలో ప్రజల ఓట్లు రాబట్టడానికి కూటమి నాయకులు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు చిత్తశుద్ధితో అమలు చేసిన దాఖలాలు లేవు. వరుసగా రెండో ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయినా నిధుల కేటాయింపు ఉంటుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. తీరా బడ్జెట్ చూశాక ప్రజలకు మరోసారి నిరాశ తప్పలేదు. గత ప్రభుత్వంలో ప్రతి హామీని వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే నిధులు కేటాయిస్తూ పకడ్బందీగా అమలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వ పరిపాలనలో హామీలను పూర్తిగా విస్మరించడం బాధాకరం. ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజలకు మరోసారి బాబు వెన్నుపోటు పొడిచారు. – సంగా మధుసూదనరావు, ఎంపీపీ, గూడూరు -
పరిశ్రమల స్థాపనపై యువత దృష్టి పెట్టాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వృత్తి విద్యా కోర్సులను నేర్చుకున్న యువతీ యువకులు ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని పరిశ్రమలు స్థాపనపై దృష్టి పెట్టాలని జిల్లా పరిశ్రమల శాఖ ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ ఆఫీసర్ పి.మనీషా చెప్పారు. స్థానిక రావిచెట్టు సెంటర్లోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయం ఆవరణలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్స్పై అవగాహన సదస్సు బుధవారం జరిగింది. ఈ సందర్బంగా మనీషా మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సులను నేర్చుకున్న వారు పరిశ్రమలను స్థాపించడం ద్వారా మరికొంత మందికి ఉపాధికి కల్పించవచ్చని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన పూర్తి సమాచారాన్ని తాము అందజేస్తామని, పరిశ్రమల స్థాపనకు ముఖ్యమైన పెట్టుబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా సబ్సిడీలతో కూడిన రుణాలను అందిస్తున్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన ద్వారా సులభంగా బ్యాంకుల నుంచి రుణాలను పొందవచ్చని చెప్పారు. ఆ రుణాలను పొందడానికి ఉద్యమ్ కార్డు తప్పనిసరి అని చెప్పారు. వృత్తి విద్యా కోర్సులను నేర్చుకున్న చాలా మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ ఆఫీసర్ ఆర్.రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని యువత అభివృద్ధి చెందడంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావచ్చునని అన్నారు. జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ, శిక్షణ పొందుతున్న మహిళలు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త పెన్షన్ల ఊసే లేదు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన చంద్రబాబు సర్కారుకు ఏ కోశానా కనిపించడం లేదు. అందుకు ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రత్యక్ష ఉదాహరణ. కేవలం అమరావతి జపం చేస్తూ చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతూ పరిపాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కొత్తగా ఒక్క పెన్షన్ గానీ, రేషన్ కార్డు కానీ, ఇంటి స్థలం కానీ మంజూరు చేయలేదు. ఇంతకంటే చెత్త పరిపాలన రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూడలేదు. ప్రజలకు మేలు చేయకుండా సాగిస్తున్న పరిపాలనను ప్రశ్నించిన నేతలపై కేసులు పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు. – కారుమంచి కామేశ్వరరావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ -
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్కు పితృ వియోగం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాంకు పితృవియోగం కలిగింది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నివసిస్తున్న రఘురాం తండ్రి తలశిల చంద్రశేఖరరావు (88) బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన మంగళవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం వేకువజామున తుది శ్వాస విడిచారు. చంద్రశేఖరరావు భౌతికకాయాన్ని గొల్లపూడి లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి చంద్రశేఖరరావు భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. రఘురాంను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రద్ధాంజలి ఘటించిన వారిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్యాదవ్, టి.జె.భరత్, చంద్రశేఖర్, ఇజ్రాయిల్, అరుణకుమార్, కవురు శ్రీను, వరుదు కల్యాణి, కల్పలత, మంగమ్మ, రామసుబ్బారెడ్డి, తూమాటి మాధవరావు, రుహుల్లా, ఇషాక్బాషా, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రులు జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, విడదల రజిని, ఆదిమూలపు సురేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి సాంబశివారెడ్డి, ఏసురత్నం, రామచంద్రారెడ్డి, ఎమ్మె ల్యేలు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మల్లాది విష్ణు, గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సుధాకర్బాబు, అన్నాబత్తుని శివ కుమార్, నల్లగట్ల స్వామిదాసు, రాపాక వరప్రసాద్, దూలం నాగేశ్వరరావు, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, వరికూటి అశోక్బాబు, బలసాని కిరణ్, ఉప్పాల రాము, వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు గౌతంరెడ్డి, పోతిన మహేష్, పొన్నవోలు సుధాకర్రెడ్డి, మనోహరరెడ్డి, సురద్శన్రెడ్డి, నాయకులు షేక్ ఆసిఫ్, కాకుమాను రాజశేఖర్, బందెల కిరణ్రాజ్, దొడ్డ అంజిరెడ్డి, కర్నాటి రాంబాబు, నగరపాలక సంస్థ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, ఎన్నారై కోమటి జయరాం తదితరులు చంద్రశేఖరరావు భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్య, వైద్య, ఏపీఎస్ ఆర్టీసీ, పోలీసు, పోస్టల్, మునిసిపల్, విద్యుత్, రెవెన్యూ, రవాణా శాఖల అధికారులతో 10వ తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్మీడియెట్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. 148 కేంద్రాలు.. పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 148 కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, అందులో 11,941 మంది బాలురు, 10,291 మంది బాలికలు ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఓపెన్ ఇంటర్మీడియెట్ పరీక్షలకు 2,235 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. పది పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, రూట్ అధికారులు, కస్టోడియన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి 144వ సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంత రాయం లేకుండా సరఫరా చేయాలని, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీఆర్ఓ కె. చంద్రశేఖరరావు, ఏఎస్పీ వీవీ నాయుడు, డీఈఓ యూవీ సుబ్బారావు పాల్గొన్నారు. -
లక్ష్యాలను పూర్తి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యం మేరకు వేగంగా పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రూ.108.44కోట్ల ఉపాధి హామీ పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.47కోట్ల మేరకు చేశారన్నారు. ఇందులో 43శాతం మేరకు బిల్లులను చెల్లింపు కోసం అప్లోడ్ చేశారన్నారు. మిగిలిన రూ. 61కోట్ల పనులను ఎట్టి పరిస్థితుల్లోనైనా మార్చి 15వ తేదీ లోగా పూర్తి చేసి, అందుకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు మురిగిపోకుండా సకాలంలో సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డ్వామా పీడీ కె. శివప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు తదితరులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు: విద్యార్థి దశ నుంచే ఆరోగ్య సూత్రాలు పాటించటం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యపడుతుందని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆమె స్థానిక కేవీఆర్ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి 1నుంచి 19ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు అందించాలన్నారు. చిన్నారుల్లో రక్తహీనత, పోషకాల లోపాలకు కారణమైన నులిపురుగులను నివారించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఈమాత్రలు ఉపయోగపడతాయన్నారు. భోజనానికి ముందు, తరువాత, ఆడుకున్న తరువాత చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఆర్డీఓ కె. బాలకృష్ణ, తహసీల్దార్ ఎ శాంతిలక్ష్మి, వైద్యాధికారి నాగరాణి, హెచ్ఎం కె. జలజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: క్రీడలు జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని, అవి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి కె. ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ఎంపికలో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 155మంది యువత పాల్గొన్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి పోటీలలో 16 మంది విజేతలు రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 21, 22 తేదీలలో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్, చెస్ ఆర్గనైజేషన్ ఆర్బిట్రేటర్లు తదితరులు పాల్గొన్నారు. సీబీఎస్ఈ ‘పది’ పరీక్షలు ప్రారంభం వన్టౌన్(విజయవాడపశ్చిమ): సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. నగరంలోని వీపీ సిదార్థ విద్యాసంస్థ, పాతబస్తీలోని అట్కిన్సన్ హైస్కూల్ తదితర విద్యాసంస్థల్లో తొలి రోజు గణితం పరీక్షకు వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ పరీక్ష కొనసాగింది. మంగళవారం ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి ఏడో తేదీ వరకూ కొనసాగనున్నాయి. కాగా గణిత ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ఇంటర్మీడియెట్ స్థాయిలో ప్రశ్నలు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
క్లోజ్ చేస్తున్నాం..
ఉపాధి హామీ కొత్త చట్టం నిబంధనల ప్రకారం జిల్లాలో ఉన్న పెండింగ్ పనులను క్లోజ్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. క్లోజింగ్ ప్రక్రియలో రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. సీసీ రోడ్ల పెండింగ్ పనులను క్లోజ్ చేయడంలో పంచాయతీరాజ్ శాఖ కూడా వేగం పెంచితే సమస్య పరిష్కారమవుతుంది. మార్చి 31వ తేదీ కల్లా ఈ ఏడాది టార్గెట్ పనిదినాలు, అభివృద్ధి పనులను పూర్తి చేసేలా పనిచేస్తున్నాం. – అరవపల్లి రాము, డ్వామా పీడీ, ఎన్టీఆర్ జిల్లా -
శుభాల వసంతం.. రంజాన్కు సంసిద్ధం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సర్వశుభాలను అందించే రంజాన్ మాస ప్రార్థనలకు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మసీదు ప్రాంగణాలు సిద్ధమవుతున్నాయి. ఇది ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎన్నోరెట్ల ఫలితాలను అందిస్తుందని వారి విశ్వాసం. భగవత్ ఆశీస్సులు అందించే రంజాన్ కోసం ముస్లింలు సంవత్సరమంతా ఎదురుచూస్తుంటారు. పవిత్ర రంజాన్ మాసం మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలపొడుపు కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ముస్లిం మత పెద్దలు తెలిపారు. గురువారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే అవకాశముందని వారు వివరించారు. ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు.. రోజా (ఉపవాస దీక్ష) పాటించే ముస్లింలు నమాజ్కు మొదటి ప్రాధాన్యమిస్తారు. నమాజ్ కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యోదయానికి ముందు (సహర్) నుంచి సూర్యాస్తమయం (ఇఫ్తార్) వరకూ ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఉపవాస దీక్షలో రోజుకు ఐదుపూటలా నమాజు చేస్తారు. దీనికి అదనంగా ‘తరావిహ్’ నమాజ్ను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. రాత్రి ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకూ సాగే తరావీహ్ నమాజులో ఖురాన్ పఠనం చేస్తారు. ఖురాన్ అవతరించిన మాసం.. రంజాన్ మాసాన్ని దివ్య ఖురాన్ భూమిపై అవతరించిన మాసంగా భావిస్తారు. ఈ నెల మొత్తం ముస్లింలు భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. ఈ నెలలో ’సఫిల్’ చదివితే ’ఫరజ్’ చదివినంతగా.. అంటే 70 సార్లు నమాజ్ చేసిన పుణ్యం వస్తుందని ఇస్లాం గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. దానధర్మాలకు ప్రాధాన్యం.. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలు దానధర్మాలకు (జకాత్, ఫిత్రాకు) ప్రాధాన్యమిస్తారు. ఈ నెల రోజుల్లో చేసిన దానాలు 70 రెట్లు అధిక ఫలితాన్ని అందిస్తాయని వారి నమ్మకం. ఈ మాసంలోని తాక్రాత్ రోజులకు ప్రత్యేకత ఉంది. ఈ నెల రోజులు ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టి అభాగ్యులకు దానాలు చేస్తూ ఇతోధిక సాయాన్ని అందిస్తారు. ప్రతి ముస్లిం ఫిత్రా (నిర్ణీత దానం) తప్పనిసరిగా చేయాలి. మొదలైన సందడి.. విజయవాడలో వంద సంవత్సరాలకు పూర్వమే మసీదులను ఏర్పాటు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. నగరంలోని సరాయి మసీదు, జుమ్మా మసీదుకు రంజాన్ మాసంలో రోజూ వందల సంఖ్యలో ముస్లింలు హాజరై సామూహిక నమాజ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారాల్లో అయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. రంజాన్ మాసం సందర్భంగా మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంజాన్ మాసం నెల రోజులూ లభించే ఒక ప్రత్యేక వంటకం హలీమ్. కొన్నేళ్ల క్రితం వరకూ హైదరాబాద్ వరకే పరిమితమైన హలీమ్.. దశాబ్ద కాలంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని పట్టణాలకు విస్తరించింది. విజయవాడలోని వించిపేట, ఇస్లాంపేట, భవానీపురం, అరండల్పేట తదితర ప్రాంతా ల్లో హలీమ్ దుకాణాలు ఏర్పాటయ్యాయి. వించిపేటలోని పలు హలీమ్ సెంటర్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు మంగళవారం ప్రారంభించారు. నెల పొడుపు చూసిన మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. బుధవారం సాయంత్రం నెలపొడుపు కనిపించే అవకాశముంది. గురువారం నుంచి ఉపవాసాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాం. రంజాన్ మాసం చాలా పవిత్రమైన నెల. ఈ నెల రోజులు మానవ జీవనాన్ని ఎంతగానే ప్రభావితం చేసే అనేక విషయాలను ఖురాన్ వివరించింది. వాటిని ఆచరించటం ద్వారా మానవ జీవన విధానం సన్మార్గంలో పయనిస్తుంది. భగవంతుని కృప లభిస్తుంది. – నయీమ్ ఖదీర్, ఇమామ్, షాహీమసీద్, విజయవాడ -
రోబోలతో కలసి పనిచేయడానికి సిద్ధమవ్వండి
గుంటూరు మెడికల్: రానున్న కాలమంతా రోబోటిక్, ఏఐ టెక్నాలజీదేనని వాటితో కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి తెలిపారు. స్థానిక గుంటూరు మెడికల్ కళాశాల మెడ్ ఫ్యూజన్లో ఏర్పాటుచేసిన సాయి భాస్కర్ హాస్పిటల్స్ స్టాల్ ను మంగళవారం విద్యార్థులు సందర్శించారు. స్టాల్లో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్ మీద మాకో స్మార్ట్ రోబోటిక్ ద్వారా జరుగుతున్న మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డాక్టర్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యరంగంలో రోబోటిక్, ఏఐ టెక్నాలజీ తమ ప్రాముఖ్యతను పెంచుకుంటూ వస్తున్నాయన్నారు. ఫ్యూచర్లో మన జీవితంలో భాగమవుతాయని వాటి నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు. రోబోటిక్ ద్వారా జరిగే ఆపరేషన్లు కచ్చితత్వంతో కూడుకొని మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. అంతకుముందు రోబో, ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ప్రశ్నావళిని విద్యార్థులతో పూర్తి చేయించి వారికి కలిగిన సందేహాలను నివృత్తి చేశారు. -
దాములూరు సంగమేశ్వరుడికి రూ. 12.09 లక్షల ఆదాయం
నందిగామ రూరల్: దాములూరు కూడలిలోని సంగమేశ్వరస్వామికి హుండీ కానుకల ద్వారా రూ. 12.09 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో నరసింహమూర్తి పేర్కొన్నారు. గ్రామంలోని ఆలయ ఆవరణలో మంగళవారం హుండీ కానుకలు లెక్కించారు. ఈ సందర్భంగా కానుకల ద్వారా రూ. 4.58 లక్షలు, పూజ టికెట్ల ద్వారా రూ. 5.77 లక్షలు, కల్యాణం కానుకల చదివింపుల ద్వారా రూ.12,143, లడ్డూ ప్రసాదాలు అమ్ముకునే హక్కు వేలం పాట ద్వారా రూ.లక్ష, కొబ్బరిచిప్పలు పోగు చేసుకునే హక్కు ద్వారా రూ. 60,500 ఆదాయం వచ్చింది. కార్యక్రమంలో ఆలయాల ఇన్స్పెక్టర్ పవన్ కల్యాణ్, దుర్గా శివ సాయి సేవా సమితి సభ్యులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. ముక్త్యాల(జగ్గయ్యపేట): కోటిలింగాల అమృతలింగేశ్వరస్వామికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హుండీ ద్వారా రూ. 5.92 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో హరిదుర్గా నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. అభిషేకాలు, దర్శనాలు, శివలింగ ప్రతిష్ట, విరాళాలు, అన్నదానం, లడ్డూ ప్రసాదాల ద్వారా ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. లెక్కింపులో నందిగామ దేవాలయ ఇన్స్పెక్టర్ పవన్కల్యాణ్, ఉత్సవాల అధికారి జయప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. నిధులు దుర్వినియోగమే కారణం! ముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామ పంచాయతీలో అవకతవకలపై గతేడాది జూలైలో గ్రామ యువకులు జిల్లా అధికారులకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. 2021–25 కాలంలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దాదాపు రూ.2.9 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు తేలడంతో సోమవారం రాత్రి జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ప్రస్తుత సర్పంచ్ షేక్ అస్మతున్, గత కార్యదర్శులు ఎన్వీ నరసింహారావు, శ్రీనివాసరెడ్డి, సిద్ధారెడ్డిలకు షోకాజ్ నోటీసులను ఈవోపీఆర్డీ పద్మావతి జారీ చేశారు. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిధులు దుర్వినియోగమైనా జిల్లా, మండల అధికారులు సైతం సమాచారం అందించేందుకు కూడా దాటవేత ధోరణి అవలంబించడం గమనార్హం. విజయవాడలీగల్: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ పోక్సో కోర్ట్ న్యాయమూర్తి వేల్పుల భవాని తీర్పునిచ్చారు. నున్న పీఎస్ పరిధిలోని ఓ బాలిక (17) కళాశాల నుంచివచ్చి ఇంటికి వెళ్లే క్రమంలో పలుమార్లు ప్రేమిస్తున్నానని అదే ఏరియాకు చెందిన గోగులమూడి అశోక్ చక్రవర్తి అలియాస్ అశోక్ (23) వెంటపడుతున్నాడు. పెద్దలు మందలించినా మారకపోవడంతో నున్న పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. 2014 నవంబరు 7న అశోక్ చక్రవర్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడ్డం రాజేశ్వరరావు, సీఎంఎస్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు, నున్న ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో ఐదుగురు సాక్షులను విచారణ చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో మంగళవారం న్యాయమూర్తి పైవిధంగా తీర్పు ఇచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కృపానందం గన్నవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో గ్రంథాలయాలకు సరిపడా నిధులు కేటాయించకపోవడం అన్యాయమని గ్రంథాలయ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు కె.కృపానందం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేర్కొన్నారు. ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేవలం 36.34కోట్లు కేటాయించటం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. రెండేళ్లుగా రిటైరైన ఉద్యోగులకు రూ.20కోట్లు బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు సుమారు పది కోట్లు అవసరం కాగా, సంవత్సరానికి రూ.120 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. జూలైలో 25 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తున్నారని, వారికి మరో రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు అవసరం కాగా కేవలం రూ.36.30 కోట్లు ప్రతిపాదించడం తీవ్ర అన్యాయమని, ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్తామని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో గతేడాది డిసెంబర్ నుంచి జీతాలు, పెన్షన్లు చెల్లించలేదని, ఫిబ్రవరి నుంచి పది ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగులకు, పెన్షన్ దారులకు చెల్లించేందుకు తగిన నిధులు జిల్లా గ్రంథాలయ సంస్థల్లో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు 010 పద్దు నుండి చెల్లించాలని, పూర్తిగా గ్రాంటు విడుదల చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.చినరాజు కూడా డిమాండ్ చేశారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలో జరుగుతున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్బాల్(మహిళల)టోర్నమెంట్ ఉత్కంఠగా జరుగుతోంది. బుధవారం ఫైనల్ లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. వీటితో టోర్నమెంట్ ముగుస్తుంది. హోరాహోరీగా నందిగామ రూరల్: దాములూరు సంగమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పూటీ లాగుడు పోటీలను సర్పంచ్ గాదెల వెంకట రామారావు, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా కల్యాణ ఉత్సవాల ముగింపు తర్వాత ఎడ్ల పూటీ లాగుడు పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యూ జూనియర్ విభాగం పోటీల్లో తొమ్మిది జతల ఎడ్లు పాల్గొని ఆరుగురు వ్యక్తుల సాయంతో 1.5 క్వింటాళ్ల బరువును 10 నిముషాల వ్యవధిలో లాగాయని చెప్పారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
స్పటికేశ్వరుడిగా సంగమేశ్వరుడు
సంగమేశ్వరం(నాగాయలంక): సంగమేశ్వరంలోని శ్రీగంగాపార్వతీ సమేత సంగమేశ్వరస్వామి వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ముగిశాయి. దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యాన నాలుగు రోజులుగా కొనసాగిన ఉత్సవాల్లో 1008 స్పటిక మాలలతో చేసిన విశేష అభిషేకం ఆధ్యాత్మిక సౌరభంగా నిలిచింది. ఉత్సవాల్లో సోమవారం అర్ధరాత్రి స్వామివారికి స్పటిక మాలలతో అభిషేకం చేశారు. అనంతరం సంగమేశ్వరం వీధుల్లో స్వామివారి రథోత్సవం రాత్రంతా శోభాయమానంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముగింపు పురస్కరించుకుని మంగళవారం గ్రామస్తులు, భక్తులు ఆధ్వర్యంలో పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారి సముద్ర విహార ఊరేగింపు, అనంతరం గ్రామంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, ధ్వజావరోహణ, పవళింపు సేవలతో బ్రహ్మోత్సవాలకు స్వస్తి పలికారు. -
వర్సిటీ సమగ్రాభివృద్ధిలో విశేష పురోగతి
కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ రాంజీ మచిలీపట్నంఅర్బన్: కృష్ణా విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్ధిలో విశేష పురోగతి సాధించిందని వర్సిటీ ఉప కులపతి కె. రాంజీ తెలిపారు. మంగళవారం కృష్ణా యూనివర్సిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ–జాతీయ సహకారం, క్రీడలు, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు. దేశీయంగా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ బోర్డులు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. అభివృద్ధికి నిధులు.. కేంద్ర ప్రభుత్వ పీఎం ఉష పథకం కింద రూ. 20 కోట్ల గ్రాంట్ మంజూరై యూనివర్సిటీ మౌలిక వసతుల అభివృద్ధికి బలమైన మద్దతు లభించిందని వీసీ తెలిపారు. రూ.2.5కోట్లు రావలసిన యూజీసీ క్యాచ్–అప్ గ్రాంట్, రూ. 39కోట్లు ఖేలో ఇండియా నిధుల విడుదలకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల సత్తా.. ఇటీవల 7వ, 8వ స్నాతకోత్సవాలు ఘనంగా నిర్వహించామని, అచీవర్స్ డే, యువ సాంస్కృతిక క్రీడా ఉత్సవాలు, ఇంటర్ కాలేజియేట్ క్రీడా పోటీలు విజయవంతంగా పూర్తయ్యాయని వీసీ చెప్పారు. పలు యూనివర్సిటీల్లో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో తమ విద్యార్థులు సత్తా చాటారన్నారు. విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ పీజీ సెంటర్ స్థాపనకు భవనం కేటాయించామని చెప్పారు. ఉపాధి కోసం జాబ్ మేళాలు నిర్వహించి 100 శాతం ప్లేస్మెంట్లతో అచీవర్స్ డే కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వానికి వినతులు.. ఐడీపీ సమావేశంలో ఆక్వాకల్చర్, సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్, టెస్టింగ్ ఫెసిలిటీస్ కోసం రోడ్ మ్యాప్ సమర్పించామని వీసీ చెప్పారు. రుద్రవరం ప్రాంతంలో 102 ఎకరాలు, గూడూరు ప్రాంతంలో 44.92 ఎకరాల భూముల కేటాయింపుతో పాటు, మచిలీపట్నం పట్టణ పరిధిలో వర్సిటీకి అదనంగా 100 ఎకరాల భూమి సేకరణకు సంబంధించి ప్రజాప్రతినిధులను కోరినట్లు వెల్లడించారు. రెక్టర్ ఎం.వి. బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఎన్. ఉష తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేసే బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేది తప్ప ప్రజలకు మేలు చేసేది కాదు. బడ్జెట్ పేరుతో అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. బడ్జెట్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా సాగింది. చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్ పేర్లను ప్రస్తావించడం తప్ప పస లేదు. గతేడాది బడ్జెట్కు ప్రస్తుతం ఇచ్చిన దానికి ఎలాంటి తేడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, విద్యా రంగాలను పూర్తిగా విస్మరించింది. ముఖ్యంగా విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. గత బకాయిల గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారడీని తలపించింది. -
ఇబ్బంది లేకుండా రీసర్వే
కోడూరు: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రీసర్వే కార్యక్రమం సజావుగా సాగుతోందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ దివిసీమలో చల్లపల్లి, మోపిదేవి, కోడూరు మండలాల్లో పర్యటించి, రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా ఇబ్బంది పడుతున్నట్లు సాలెంపాలెం రైతులు కలెక్టర్కు విన్నవించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే ఉంటుందని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. భూ రికార్డుల ఏడీ లక్ష్మణ్, తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మౌని అమావాస్యను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారి ఖడ్గమాలార్చన మొదలు రాత్రి పల్లకీ సేవ వరకు అన్ని సేవల టికెట్లకు డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన అమ్మవారి సుప్రభాత సేవలో 8మంది, అనంతరం ఖడ్గమాలార్చన 26మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఇక నూతన యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో ప్రత్యేక్షంగానూ, పరోక్షంగానూ 330 టికెట్లు విక్రయించగా, సుమారు 5వందలకు పైబడి భక్తులు పాల్గొన్నారు. 21న కానుకల లెక్కింపు.. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులు, ముడుపులను 21వ తేదీ శనివారం లెక్కించనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మహామండపం ఆరో అంతస్తులో కానుకల లెక్కింపు ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. -
1972 నంబరుపై విస్తృత అవగాహన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే 1972 నంబరుకు ఫోన్ చేసి సమాచారమివ్వాలని కోరారు. ఈ నంబరుపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమావేశం జరిగింది. సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, డీఎల్ఎస్ఏ సెక్రటరీ కె.రామకృష్ణయ్య తదితరులు హాజరైన ఈ సమావేశంలో జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డీ అడి క్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్ స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై చర్చించారు. విజయవంతంగా డ్రగ్స్పై దండయాత్ర.. జిల్లాలో డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, 34డే యాంటీ డ్రగ్స్ సైకిల్ ర్యాలీలు కూడా జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. అనంతరం సేనో టు డ్రగ్స్, డ్రగ్స్ వద్దు.. స్కిల్స్ ముద్దు, ఈగల్ టోల్ఫ్రీ నంబరు 1972, ఈగల్ క్లబ్స్ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, బి.లక్ష్మీనారాయణ, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, టీజీ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి వాడ్రేవు కామ రాజు, ఈగల్ అధికారులు, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, నవజీవన్ బాల్ భవన్, ఆకర్ష ఫౌండేషన్, హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల చికిత్స పొందుతూ ఇద్దరి మృతి
జి.కొండూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీటెక్ విద్యార్థి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల పరిధి మునగపాడుకు చెందిన బత్తుల గిరీష్ (20) మైలవరంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి. ఈ నెల 12వ తేదీన కళాశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో తన గ్రామానికి చెందిన గంజి స్వామి బైకుపై లిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాడు. జి.కొండూరు శివారులోని మలుపు వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్న ప్రయివేటు పాఠశాల బస్సు బైకును ఢీకొట్టింది. ఘటనలో బైక్ నడుపుతున్న స్వామికి స్వల్ప గాయాలవ్వగా గిరీష్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక అతను సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మరణించాడు. మృతుడి తండ్రి బాలస్వామి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ పేర్కొన్నారు. మరో ఘటనలో.. చల్లపల్లి: తాపీ పనిచేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. చల్లపల్లి నారాయణరావునగర్కు చెందిన అవనిగడ్డ వెంకట శేషగిరిరావు(59) ఈ నెల 13న పనికివెళ్లి స్లాబుకు ప్లాస్టింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని చల్లపల్లిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 16 తేదీన మృతి చెందాడు. మంగళవారం ఉదయం విజయవాడ నుంచి వచ్చిన సమాచారం మేరకు హెడ్కానిస్టేబుల్ ఎ.పాండురంగారావు శవపంచనామా చేసి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శేషగిరిరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. -
దుర్గగుడిలో ‘ఆన్లైన్’కు బ్రేక్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖ ప్రవేశపెట్టిన ఆన్లైన్ సేవలకు దుర్గగుడిలో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో కూటమి ప్రభుత్వం ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. దుర్గగుడిలో సైతం దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయం, ఆర్జిత సేవలను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దీనికి ఘాట్రోడ్డు, కనకదుర్గనగర్, మహామండపాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. భవానీ దీక్షల విరమణ తర్వాత నుంచి కౌంటర్లలో మార్పులు చేశారు. కనకదుర్గనగర్లోని ప్రసాదాల విక్రయ కేంద్రంలో 5 కౌంటర్లలోని నాలుగు ఆన్లైన్ కౌంటర్లు, ఒకటి నగదుతో ప్రసాదాల కొనుగోలుకు అవకాశం కల్పిస్తూ ఏర్పాట్లు చేసింది. పూర్తిగా ఆన్లైన్ చేయడంతో భక్తులతో పాటు కౌంటర్లలో ఉన్న దేవస్థాన సిబ్బందికి ఇబ్బందులు తప్పలేదు. భారీ వ్యత్యాసం గుర్తించి రద్దు కౌంటర్లకు ఇచ్చే లడ్డూలకు, స్టాక్ బుక్ ఎంట్రీకి, విక్రయాల మధ్య భారీ వ్యత్యాసం వస్తున్నట్లు ఆలయ అధికారులు గుర్తించి, ఆన్లైన్ విక్రయాలను రద్దు చేశారు. రెండు నెలల కాలంలో సుమారు 50 వేల పైగా లడ్డూల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నాలుగు రోజులుగా కనకదుర్గ నగర్లోని ప్రసాద విక్రయ కేంద్రంలోని 5 కౌంటర్లలో నాలుగింటిలో నగదుతోనే ప్రసాదాలను కొనుగోలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తూ, అదనపు సిబ్బందిని నియమించారు. మరో కౌంటర్లో కియోస్క్ మిషన్ ఏర్పాటు చేసి అమ్మవారి రూ. 100, రూ. 300 దర్శన టికెట్లు విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. కియోస్క్ మిషన్ల ద్వారా దర్శన టికెట్లు దుర్గగుడిలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంపై తొలి నుంచి భక్తులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల క్రితం దుర్గమ్మ దర్శనం కోసం ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్లను జిరాక్స్లు తీసి తిరిగి విక్రయించిన ఘటన వెలుగు చూసింది. దీంతో ఆన్లైన్ టికెట్ల విక్రయాలను రద్దు చేసి ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేసి దర్శన టికెట్లను విక్రయిస్తోంది. ఈ మిషన్ల ద్వారా కొనుగోలు చేసిన టికెట్లు సొమ్ము నేరుగా దేవస్థాన ఖాతాలో జమ కావడం మరో విశేషం. తాజాగా ప్రసాదం టికెట్ల విక్రయాల్లో లోపాలు గుర్తించిన దేవస్థాన అధికారులు ప్రసాదాలను ఆన్లైన్లో కాకుండా నేరుగా కౌంటర్లలో నగదుతో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రసాదాలు కొనుగోలు చేసే వారిలో ఎక్కువ మంది నగదు చెల్లిస్తామంటున్నారు. కౌంటర్లలో రద్దీ నేపథ్యంలో ఆన్లైన్కు, నగదుకు వేర్వేరు కౌంటర్లు ఉన్నాయి. ఆన్లైన్ విధానం పూర్తిగా అమలు చేసే క్రమంలో పరిశీలన, మార్పులు జరుగుతూ ఉంటాయి. సేవలను పూర్తిగా ఆన్లైన్లో పొందేలా చూస్తున్నాం. –శీనానాయక్, ఈవో, దుర్గగుడి -
పెండింగ్ ని‘బంధనాలు’!
‘ఉపాధి హామీ’కి అడ్డంకిగా పాత పనులు జి.కొండూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రక్షాళన చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టంతో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమవుతోంది. దశాబ్ద కాలానికి పైబడి ఉపాధి హామీ పథకంలో వివిధ కారణాలను చూపుతూ పాత పనులను క్లోజ్ చేయకుండా వదిలేయడంతో అవన్నీ ఇప్పుడు కొత్త పనుల ప్రారంభానికి అడ్డొస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో నేడు ఉపాధి హామీ పథకంలో కూలీలు తమ పని దినాలను కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో బిల్లులు పెండింగ్లో ఉంచడంతో ఉపాధి హామీ పథకంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన సీసీ రోడ్లు, భవన నిర్మాణ పనులు క్లోజ్ కాక నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణానికి బ్రేక్ పడుతోంది. పేరుకుపోయిన పాత పనులు.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నూతన చట్టం ప్రకారం ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 20 పనులు మాత్రమే జరుగుతూ ఉండాలి. ఇలా జరుగుతున్న పనులలో పూర్తయిన వాటిని క్లోజ్ చేసిన వెంటనే కొత్త పనులను యాడ్ చేసుకునేలా నిబంధన విధించారు. అయితే దశాబ్ద కాలానికి పైబడి పాత పనులు వేల సంఖ్యలో పెండింగ్లో ఉండడం వల్ల ఒక్కొక్క గ్రామ పంచాయతీలో వందకి పైబడి పాత పనులే పెండింగ్ చూపిస్తుండడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. పాత పనులను క్లోజ్ చేస్తేనే కొత్త పనుల ప్రారంభానికి వీలు కలిగేలా ఆన్లైన్ వ్యవస్థను రూపొందించడంతో ఇప్పుడు పలు చోట్ల పనులు ప్రారంభానికి సమస్య తలెత్తుతోంది. ఈ విధంగా ఎన్టీఆర్ జిల్లాలో 32వేల పనులు పెండింగ్లో ఉండటంతో వీటిని క్లోజ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 20వేల పనులను క్లోజ్ చేయడంతో పాటు జిల్లాలో ఉన్న 288 గ్రామ పంచాయతీలకు గానూ 170 గ్రామ పంచాయతీల్లో పెండింగ్ పనులను క్లోజ్ చేసి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఇరవైలోపు పాత పనులు ఉండేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం కొన్నిపెండింగ్ పనులకు మినహాయింపు ఇవ్వడంతో 5,500వరకు పాత పనులు క్లోజ్ చేసే వీలు కలిగింది. కొత్త పనుల ప్రారంభానికి తలనొప్పి.. నూతన చట్టం అమలుతో యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులను క్లోజ్ చేసే ప్రక్రియ మొదలు పెట్టిన అధికారులు అన్ని గ్రామ పంచాయతీలలో 20లోపు పాత పనులు ఉండేలా చేస్తున్నారు. కానీ 20లోపు పెండింగ్ పనులలో పంచాయతీరాజ్ పనులే ఉండడంతో ప్రభుత్వం ఎప్పుడు బిల్లులు ఇస్తుందో, ఆ పెండింగ్ పనుల ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియక నూతన పనులు ప్రారంభానికి అవకాశం లేక క్షేత్రస్థాయిలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2025, మార్చి 31వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు మెటీరియల్కు 192 పనులకు గానూ రూ.32కోట్లు కేటాయించారు. ఈ పనులలలో పలు చోట్ల సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, బీటీ రోడ్లు వంటివి ఇంకా నిర్మించాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా క్యాటిల్ షెడ్లు వెయ్యికి 850 గ్రౌండ్ కాగా 500షెడ్లు మాత్రమే పూర్తయ్యాయి. పని దినాల లక్ష్యం పూర్తవుతుందా ఎన్టీఆర్ జిల్లాలో జాబ్కార్డులు 2లక్షల8వేలు ఉండగా, కూలీలు 2,95,234 మంది ఉన్నారు. వీరికి 41లక్షల పనిదినాలు ఈ ఏడాది కల్పించాల్సి ఉండగా 38లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. మిగిలిన అభివృద్ధి పనులు, పనిదినాలు మార్చి 31వ తేదీ లోపు పూర్తవ్వాలంటే పాత పెండింగ్ పనులు అడ్డు పడుతున్నాయి. అంతే కాకుండా మార్చి తర్వాత చేపట్టబోయే నూతన పనులకు సైతం పెండింగ్ పనుల తలనొప్పి తప్పేలా లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ కింద చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమై, ఎన్నికల ముందు పూర్తయిన నిర్మాణాలు, నిర్మాణ దశలో ఆగిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు పెండింగ్లో ఉంచడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తి 200కి పైగా పనులు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నిర్మించిన సీసీ రోడ్లు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించిన సీసీ రోడ్లకు సైతం రూ. 20కోట్ల వరకు బిల్లులు పెండింగ్ పెట్టడంతో పనులు క్లోజ్ కాక సమస్య తలెత్తుతోంది. -
హోరాహోరీగా నెట్బాల్ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్బాల్ (మహిళలు) టోర్నమెంట్లో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి లీగ్ పోటీలు మరింత ఉత్కంఠగా సాగనున్నాయి. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లు టోర్నమెంట్ ప్రారంభమైన మూడో రోజైన సోమవారం జరిగిన నాకౌట్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ, పూణే– స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ హరియాణాపై 49–32 స్కోరుతో విజయం సాధించింది. హేమచంద్ యాదవ విశ్వవిద్యాలయం, దుర్గ్–అటల్ బిహారీ వాజ్పేయి విశ్వవిద్యాలయంపై 58–48 స్కోర్తో, కాలికట్ యూనివర్సిటీ–మంగళూరు యూనివర్సిటీపై 58–51 స్కోర్తో విజయం సాధించాయి. -
క్రీడా ప్రతిభను వెలికితీయడమే శాప్ లీగ్ లక్ష్యం
ఏపీ క్రీడాప్రాథికార సంస్థ వీసీ/ఎండీ భరణిభవానీపురం(విజయవాడపశ్చిమ): పాఠశాల విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్ది వారిని జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలపడమే శాప్ లీగ్ లక్ష్యమని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వీసీ/ఎండీ బి.భరణి అన్నారు. శాప్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల స్థాయిలో నిర్వహించే శాప్ లీగ్ ట్రోఫీ, మస్కట్లను ఆమె చెస్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు కోనేరు హంపి, పీవీ సింధులతో కలిసి సోమవారం విజయవాడ భవానీపురంలోని బెరంపార్క్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే శాప్ లీగ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ఇందులో పాల్గొంటారని అన్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కలిసి పని చేస్తాయన్నారు. జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహిస్తామని, ఎంపికై నవారు నేరుగా రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని అన్నారు. ఈ నెల 21న తిరుపతిలో రాష్ట్ర స్థాయి చెస్ లీగ్ ప్రారంభం కానుందని తెలిపారు. దీని కోసం ఇప్పటికే సుమారు 20 వేల మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. కేవలం ప్రతిభను గుర్తించడమే కాకుండా ఎంపికై న క్రీడాకారులకు భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేలా ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వం కల్పిస్తామని వివరించారు. శాప్ నిర్ణయంతో అంతర్జాతీయ విజేతలవుతారు... బ్యాడ్మింటన్, చెస్ క్రీడాకారిణులు పీవీ సింధూ, కోనేరు హంపి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ క్రీడల్లో నైపుణ్యం కలిగిన ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని, వారిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించేందుకు శాప్ నిర్వహిస్తున్న లీగ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఈ లీగ్ ద్వారా గుర్తించబడిన క్రీడాకారులకు భవిష్యత్లో అవసరమైన, మెరుగైన శిక్షణ, ఆర్థిక సహాయం అందించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే శాప్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. శాప్ తీసుకున్న ఈ నిర్ణయం వలన రాష్ట్రం నుంచి ఎంతో మంది అంతర్జాతీయ క్రీడల్లో విజేతలుగా తయారవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ఎల్హెచ్బీ కోచ్లతో హుబ్లీ–విజయవాడ ఎక్స్ప్రెస్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల భద్రత, సౌలభ్యం కోసం భారతీయ రైల్వే ఐసీఎఫ్ కోచ్ల స్థానంలో ఎల్హెచ్బీ కోచ్లను ఆధునీకరిస్తోంది. అందులో భాగంగా ఇప్పటివరకు ఐసీఎఫ్ కోచ్లతో నడుస్తున్న హుబ్లీ–విజయవాడ (17330/17329) ఎక్స్ప్రెస్ రైళ్లను మంగళవారం నుంచి రైల్వేశాఖ కొత్త ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్) కోచ్లతో ఆధునీకరించారు. ఈ కోచ్ల ప్రవేశంతో విజయవాడ–హుబ్లి ఎక్స్ప్రెస్ రైళ్ల సామర్ధ్యం గణనీయంగా పెరిగింది. ఇప్పటికే ఉన్న ఐసీఎఫ్ కోచ్లు ఏసీ 2 టైర్లో 46 బెర్త్లు, ఏసీ 3 టైర్లో 64 బెర్త్లు, స్లీపర్ క్లాస్లో ఒక్కో కోచ్లో 72 బెర్త్లతో నడిచేది. కొత్త ఎల్హెచ్బీ కోచ్ల రాకతో ఏసీ 2 టైర్లో 52 బెర్త్లు, ఏసీ 3 టైర్లో 72 బెర్త్లు, ఒక్కో స్లీపర్ క్లాస్లో 78 బెర్త్ల సామర్ధ్యంతో నడుస్తుంది. ఈ పెరుగుదలతో ఐసీఎఫ్ కోచ్ రేక్లో మొత్తం 742 బెర్త్ల నుంచి 814 ఎల్బీహెచ్ కోచ్లకు పెరిగింది. దీని ఫలితంగా అదనంగా 72 బెర్త్లు పెరిగాయి. ముక్త్యాల(జగ్గయ్యపేట): మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి గ్రామంలోని భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. కనులపండువగా నిర్వహించిన కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వంశపారంపర్య ధర్మకర్త తరఫున కేసీపీ ప్రతినిధి రాంప్రసాద్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి పూజలు చేశారు. విజయవాడ కల్చరల్: శ్రీకృష్ణ తెలుగు ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో సంస్థ 26వ వార్షికోత్సవం సందర్భంగా గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఈనెల 19 నుంచి మూడు రోజు ల పాటు జాతీయ సాంఘిక నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ సహాయ కార్యదర్శి మొక్కపాటి అవంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19న హేలాపురి అసోసియేషన్ వారి అనగనగా ఓ రాత్రి, స్వర్ణసూర్య డ్రామా లవర్స్ వారి సీ్త్రమాత్రేనమః, ఉషోదయ కళానికేతన్ వారి మంచి మనసులు, 20న చైతన్య కళాస్రవంతి వారి అగ్నిసాక్షి, విజయవాడ సాంస్కృతిక సంస్థ వారి మమ్మల్ని బ్రతకనివ్వండి, హర్ష క్రియేషన్స్ వారి చెరిగిపోని చిరునామా, 21న తెలుగు కళాసమితి వారి చిటికిన వేలు, కాలహారతి కళాతిరుమాలి వారి ప్రియమైన శత్రువులు నాటికలు ప్రదర్శిస్తారని వివరించారు. చివరి రోజు విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందన్నారు. గంపలగూడెం: కిడ్నీ వ్యాధితో వృద్ధుడు మృతి చెందిన ఘటన సోమవారం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో జరిగింది. సేకరించిన వివరాల మేరకు.. మండలంలోని వినగడప తండాకు చెందిన లాకవత్తు బాలాజీ(65) పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడు. కూలి పనులు చేసుకుని భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకునే బాలాజీ మంచానికే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత మరింత పెరిగి సోమవారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మండలంలోని అనుముల్లంక, కనుమూరు, గోసవీడు శివారు రామకృష్ణాపురం గ్రామాల్లోనూ ఫ్లోరైడ్ నీటి కారణంగా కిడ్నీ మరణాలు సంభవిస్తున్నాయి. కృష్ణా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): నిత్యం అప్రమత్తంగా ఉంటూ రహదారి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం సాయంత్రం రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్క అధికారి బాధ్యత అని, అందుకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ పరిష్కారం చేపట్టడం ద్వారా ప్రమాదాలకు అవకాశం లేకుండా ఉంటుందన్నారు. జాతీయ రహదారులకు చేరుకునే 28 ప్రాంతాల్లోని అప్రోచ్ రహదారులకు అత్యవసరంగా స్పీడ్బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల వేగ నియంత్రణ కోసం జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన డ్రమ్ములు రాత్రి సమయాల్లో వాహనచోదకులకు కనిపించకపోవటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా డ్రమ్ములకు పూర్తి స్థాయిలో రేడియం స్టిక్కర్లు వేయాలని సూచించారు. జాతీయ రహదారులపై ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు జీపీఎస్ పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వీవీ నాయుడు, జిల్లా రవాణాధికారి ఎన్యూఎన్ఎస్ శ్రీనివాస్, జాతీయ రహదారుల అధికార సంస్థ పీడీ విద్యాసాగర్, జిల్లా ప్రజారవాణాధికారి వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రామవరప్పాడులో దొంగల బీభత్సం
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో సోమవారం మిట్ట మధ్యాహ్నం రెండు గృహల్లో జరిగిన వరుస దొంగతనాలు కలకలం సృష్టించాయి. ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులు అపహరించారు. ఓ ఇంట్లో దుండగుడు దొంగతనానికి పాల్పడుతుండగా స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామంలోని రామాలయం వీధిలో, పిన్నమనేని అపార్టుమెంట్ సమీపంలో వేర్వేరు సమయాల్లో దొంగలు హల్చల్ చేశారు. రామాలయం వీధిలో బెజవాడ రఘుకు చెందిన నివాసంలో, పిన్నమనేని హైట్స్ అపార్టుమెంట్ సమీపంలో బాదర్ల బాబి నివాసంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. బాదర్ల బాబి నివాసంలో ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో ఇంట్లోని వారు పని మీద బయటకు వెళ్లారు. తిరిగి ఒంటిగంటకు ఇంటికి చేరుకున్న వీరు ఇంటి తలుపులు తీసి ఉండటం, బీరువాలోని సామాన్లు చిందరవందరగా పడేసి ఉండటాన్ని గుర్తించారు. అనుమానంతో పరిశీలించగా రెండు బంగారు చైన్లు, కొంత నగదు, విలువైన వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. రామాలయం వీధిలో బెజవాడ రఘు మధ్యాహ్నం సమయంలో తన తల్లితో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి వీరు వచ్చేసరికి ఆగంతకుడు ఇంట్లో ఉండటాన్ని గమనించి భయంతో కేకలు వేశారు. వీరిని గమనించిన దుండగుడు బయటకు పరుగులు తీశాడు. బాధితులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంబడించి కాపుల బజారులో పట్టుకున్నారు. అతని వద్ద పరిశీలించగా తాళాలు, బీరువాలు పగులగొట్టడానికి వినియోగించే వస్తువులతో పాటు పదునైన ఆయుధాలు ఉండడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోని వీధుల్లో సంచరించే సీసీ ఫుటేజీలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. పోలీసుల విచారణలో దొంగతనానికి గ్రూపుగా వచ్చినట్లు తెలిసింది. స్థానికులకు పట్టుబడిన వ్యక్తి ఢిల్లీకి చెందినవాడిగా గుర్తించారు. ఇతని ద్వారా మిగిలిన దొంగల వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. -
బిల్గేట్స్కు స్వాగతం
కోనేరుసెంటర్: ఆర్టీజీఎస్ టెక్నాలజీ, వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతిక అంశాలపై చర్చించడానికి ఏపీ పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్గేట్స్ను కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్నాయుడు సోమవారం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బిల్గేట్స్కు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. పవర్ లిఫ్టింగ్లో ‘పేట’ ప్రతిభజగ్గయ్యపేటఅర్బన్: రాజమండ్రిలో ఈ నెల 14,15 తేదీల్లో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన 13వ రాష్ట్ర స్థాయి సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలో జగ్గయ్యపేటకు చెందిన క్రీడాకారుడు షేక్ అబ్దుల్ వహాబ్ ప్రతిభ కనబరిచాడు. 120 కేజీల పవర్ లిఫ్టింగ్ కేటగిరిలో స్క్వాట్–210 కేజీలు, బెంచి ప్రెస్–130 కేజీలు, డెడ్ లిఫ్ట్–200 కేజీలు మొత్తం 540 కేజీలు బరువు ఎత్తి తృతీయ బహుమతిని సాధించినట్లు ఆయన తెలిపారు. పేట సచివాలయ టౌన్ప్లానింగ్ విభాగంలో పని చేసే అబ్దుల్ వహాబ్ సోమవారం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కమిషనర్ డీటీవీ కృష్ణారావులు అభినందించారు. -
ప్రజా సమస్యల పరిష్కార వేదికే ‘మీకోసం’
జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడుకోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కార వేదికే మీకోసం కార్యక్రమమని జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని, బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పోలీసు సేవలు ఉండాలన్నదే పోలీసుశాఖ నిర్ణయమని, ఆ మేరకు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో మీకోసంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామన్నారు. మీకోసంలో 28 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రధానమైన అర్జీలు ● వడ్లమన్నాడుకు చెందిన కవిత తన వివాహ సమయంలో కట్నంగా ఇచ్చిన వ్యవసాయ భూమిని తన బావ, అత్తమామలు ఆక్రమించుకుని తన భర్తను, తనను ఇంటి నుంచి గెంటివేసినట్లు తెలిపింది. తమకు జరిగిన అన్యాయం గురించి పెద్దలలో పెట్టినా న్యాయం చేయకపోగా తనను, తన భర్తను బెదిరిస్తున్నారంటూ వాపోయింది. వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరింది. ● మచిలీపట్నంకు చెందిన కమల అనే వివాహిత తనకు వివాహం జరిగి ఏడు నెలలు అవుతుందని, అడిగినంత కట్న కానుకలు ఇచ్చినా అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటివారు తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయమని ప్రాధేయపడింది. ● తాడిగడపకు చెందిన వినోద్ తనకు వివాహం జరిగి రెండేళ్లు అవుతుందని, వివాహ జీవితంలో ఒక ఆడబిడ్డ కలగగా తన భార్య ఆమె తల్లిదండ్రుల మాటలు విని గొడవలకు దిగుతూ తనపై తప్పుడు కేసులు పెడుతోందని, తనకు న్యాయం చేయమని కోరాడు. ● కోడూరు నుంచి వచ్చిన నరసయ్య అనే వృద్ధుడు తనకున్న వ్యవసాయ భూమిని తన దగ్గర బంధువులకు కౌలుకు ఇచ్చానని, గడిచిన రెండేళ్లుగా కౌలు సొమ్ము ఇవ్వకపోగా అడుగుతుంటే భౌతికదాడికి పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయమని కోరాడు. -
ఇంధన పొదుపుపై అవగాహన అవసరం
అవగాహన ప్రచారం (సక్షమ్ 2025–26) ముగింపు కార్యక్రమంలో భాస్కరరెడ్డి లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంధన వనరుల వినియోగం, పొదుపుపై ప్రజల్లో అవగాహన అవసరమని రాష్ట్ర చమురు పరిశ్రమల రాష్ట్ర సమన్వయకర్త ఎన్.భాస్కరరెడ్డి అన్నారు. ఈ నెల 2 నుంచి 16 వరకూ పక్షం రోజుల పాటు నిర్వహించిన ఇంధన వనరుల అవగాహన ప్రచార కార్యక్రమం ముగింపు సమావేశం సోమవారం ఎంజీరోడ్డులోని ఓ హోటల్లో జరిగింది. ఈ సమావేశంలో భాస్కరరెడ్డి మాట్లాడుతూ వివిధ రకాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రజా కేంద్రీకృత కార్యకలాపాల ద్వారా ఇంధన పొదుపుపై అవగాహన కలిగించినట్లు తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల పరిరక్షణ, సమర్థమైన వినియోగం కోసం ఇంధన పొదుపు, అవసరాలు, సమస్యలు, పరిష్కారాలపై పౌరులలో అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో భాగంగా సైక్లోథాన్, వాక్థాన్, సీఎన్జీ ఆటో, కార్ ర్యాలీ, ఎల్పీజీ డెలివరీ బాలురకు శిక్షణ కార్యక్రమం, గృహిణులు, పాఠశాల కళాశాల విద్యార్థులకు ఇంధన పొదుపు చిట్కాలపై గ్రూప్ టాక్ వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఓసీ ఎల్పీజీ డివిజన్స్ హెడ్ టి.భాస్కరరావు, విజయవాడ గెయిల్ డీజీఎం కేఎస్ తివారీ, విజయవాడ ఎల్పీజీ టెరిటరీ మేనేజర్ సీటీ వేణుగోపాల్, హెచ్పీ సీఎల్ విజయవాడ రిటైల్ హెడ్ అభిషేక్ ప్రతాప్ సింగ్, పంకజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. -
క్రమబద్దకీకరణ
పటమట(విజయవాడతూర్పు): నగరపాలక సంస్థలో క్రమబద్ధీకరణ ప్రక్రియ జాప్యమవుతోంది. అనుమతులు లేకుండా.. ప్లాన్లు మంజూరు కాకుండా .. అదనపు అంతస్తులు వేసిన భవనాల క్రమబద్ధీకరణకు ఏపీ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) 2025 విడుదల చేసింది. ఇది ఆగస్టు 31 2025 వరకు నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించేందుకు వర్తిస్తుంది. నగరపాలక సంస్థ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 2,157 భవనాలు అనధికారికంగా నిర్మించినట్లు అధికారులు సర్వే చేశారు. వీటి క్రమబద్ధీకరణకు వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అంతగా ఆసక్తి చూపడంలేదని, క్షేత్రస్థాయి సిబ్బంది కూడా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మందకొడిగా బీపీఎస్, ఎల్ఆర్ఎస్ నగరపాలక సంస్థ పరిధిలో మూడు సర్కిళ్లవారీగా ఇప్పటి వరకు 2157 అనధికారిక భవనాలను గుర్తించారు. వీటితో ఈ ఆర్థిక సంవత్సరానికి వీఎంసీకి రూ. 60 కోట్లు ఆదాయం సమకూరుతుందని అధికారులు వార్షిక బడ్జెట్లో కూడా పొందుపరచారు. వచ్చిన దరఖాస్తుల్లో కేవలం 270 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారు. వీటిద్వారా రూ.5.84 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. ఇంకా 1,887 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. ఒకవైపు దీనిపై విస్తృత ప్రచారం కూడా జరగలేదు. మరోవైపు క్షేత్రస్థాయి అధికారులు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించకుండా వారిలాగిన్లోనే పెండింగ్లో పెట్టి భవన యజమానులతో బేరసారాలు చేసుకుంటున్నారని, అందుకే నత్తనడకన సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఒక్కో భవనానికి స్థలం, భవనం కొలతల మేరకు, అక్కడ ఉన్న స్థల ధరలను రూ.లక్ష నుంచి 3లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఎల్ఆర్ఎస్ పరిస్థితి కూడా ఇలాగే సాగుతోంది. నగరంలో ఇప్పటి వరకు 1,881 దరఖాస్తులు ఎల్ఆర్ఎస్కు రాగా కేవలం 172 మాత్రమే పరిష్కరించారు. వీటితో రూ.17.69 కోట్లు వచ్చాయి. ఇంకా 1709 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని రెగ్యులరైజ్ చేస్తే కార్పొరేషన్కు రూ. 90 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఎల్ఆర్ఎస్ నవంబర్లో, బీపీఎస్ ప్రక్రియ డిసెంబర్లో మొదలయ్యాయి. ఎల్ఆర్ఎస్కు విజయవాడలోని లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) 2020 జూన్ 30, 2020 కి ముందు రిజిస్టర్ చేయబడిన అనధికార ప్లాట్లు/లేఅవుట్లను క్రమబద్ధీకరించడానికి ఈ పథకం వర్తిస్తుంది. ఏప్రిల్ 23 లోపు దరఖాస్తు చేయాలి. మున్సిపల్, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లలోని ప్లాట్లకు ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తు దారులు యాజమాన్య ధ్రువీకరణ కోసం సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, లే అవుట్ ప్లాన్, యు సైట్ ఫొటోలనుఆన్లైన్లో సమర్పిం చాలి. చార్జీలు, జరిమానాలు ప్లాట్ మార్కెట్ విలువ, పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. హెచ్టీటీపీ://డీటీసీపీడాట్ఏపీడాట్జీవోవీడాట్ఇన్/ఎల్ఆర్ఎస్లో దరఖాస్తు చేయాలి విజయవాడలో బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం), ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) అమలు నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు పది శాతం మాత్రమే క్రమబద్ధీకరణ జరిగింది. అధికారుల్లో వేగం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫ్లైళ్లు క్లియరెన్స్ కాకపోవడం.. నగరపాలక సంస్థ ఆదాయంపై ప్రభావం చూపేలా ఉంది. బీపీఎస్కు మార్చి11వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. 1985 జనవరి 1వతేదీ నుంచి 2025 ఆగస్టు 31వ తేదీలోపు నిర్మించిన భవనాలకు హెచ్టీటీపీ://బీపీఎస్డాట్ఏపీడాట్జీవోవీడాట్ఇన్/బీపీఎస్/లాగిన్డాట్లో దరఖాస్తు చేయాలి ఆమోదించిన ప్లాన్, యాజ్ ఆన్ గ్రౌండ్ ప్లాన్, ఎలివేషన్, సెక్షన్, సైట్ ప్లాన్ ఉండాలి. గడువు దాటినా దరఖాస్తు చేసుకోనివారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. బీపీఎస్కు, ఎల్ఆర్ఎస్కు నగరంలో వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం క్షేత్రస్థాయిలో గుర్తించింది. వాటిని క్రమబద్ధీకరించడానికి ఆయా స్థల, భవన యజమానులకు సరైన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. చాలామంది దరఖాస్తు చేయకపోవటానికి కూడా కారణం అదే అవుతుంది. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాం. నగరంలో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు కూడా ప్రణాళికలు రూపొందించాం. –సంజయ్ రత్నకుమార్, వీఎంసీ చీఫ్ సిటీప్లానర్ -
యనమలకుదురులో కుప్పకూలిన ప్రభ
పెనమలూరు: కృష్ణా జిల్లా యనమలకుదురులో ఆదివారం జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓ ప్రభ అదుపుతప్పి భక్తులపై పడిపోయింది. ఈ ఘటనలో భక్తురాలికి గాయాలయ్యాయి. యనమలకుదురు అంబేడ్కర్నగర్కు చెందిన నంబర్–29 ప్రభ ప్రదర్శనలో ఉండగా దానికి ఏర్పాటు చేసిన రథం చక్రాలు విరిగి పోయాయి. దీంతో ఒక్కసారిగా ప్రభ పక్కకు ఒరిగి కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో బాపులపాడుకు చెందిన రేవతి తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆమెను పోరంకిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
లింగోద్భవ వేళ శివయ్యకు అభిషేకాల హరివిల్లు
శ్రీరామపాదక్షేత్రం, సంగమేశ్వరంలో వైభవంగా శివకల్యాణం నాగాయలంక: మహాశివరాత్రి అత్యంత ప్రాశస్త్యమైన లింగోద్భవ కాలం అభిషేకాలను మండలంలోని నాగాయలంక, సంగమేశ్వరం శివాలయాల్లో ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. స్థానిక శ్రీకన్యకాపరమేశ్వరీ సమన్విత పార్వతీ సమేత నగరేశ్వరస్వామి ఆలయంలో నగరేశ్వరునికి గంధం, అన్నం, పలురకాల పండ్లు, విభూది, చక్కెర, పంచామృతం తదితర 11 రకాలతో అత్యంత వైభవంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలను కమిటీ చైర్మన్ చిట్టా సాంబశివరావు పర్యవేక్షణలో అలయ ప్రధానార్చకుడు కొల్లిపర సుబ్బారావు బృందం నిర్వహించారు. కృష్ణానది ఒడ్డున శ్రీరామ పాదక్షేత్రం పుష్కర ఘాట్లోని శ్రీరామలింగేశ్వరస్వామి మండపం వద్ద తెల్లవారు జామున 2గంటల వరకు సాగిన శివపార్వతుల కల్యాణం కనులపండువగా సాగింది. వేద పండితుల నేతృత్వంలో కల్యాణం కనులపండువగా జరిపారు. తొలుత శ్రీరామలింగేశ్వర శివలింగానికి, నందీశ్వరునికి భక్తులు స్వీయ అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పుష్కర ఘాట్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో అర్థరాత్రి రంగుల హరివిల్లుగా మారి కృష్ణానది, శ్రీరామపాద క్షేత్రం దేదీప్యమానంగా మెరిసిపోయింది. క్షేత్రం చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, ఉప్పల బుజ్జి, తలశిల రఘుశేఖర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మండలంలోని సంగమేశ్వరంలోని చారిత్రక ప్రసిద్ధి కలిగిన శ్రీగంగా పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. నాగాయలంక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి లింగోద్భవ కాల అభిషేకాలలో అన్నంతో అభిషేకించారు. -
ఎంఎంసీకి పన్ను పోటు!
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో వివిధ రకాల పన్నుల వసూళ్లు మందకొడిగా జరుగుతోంది. ఎంఎంసీ సిబ్బందికి తోడు నగరంలోని 50 డివిజన్లలో సచివాలయ ఉద్యోగులు ఉన్నా పన్నుల వసూళ్లు జోరు అందుకోలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడుతున్నా వసూళ్లు కేవలం 29 శాతం మాత్రమే ఉండడం ఆందోళనకరంగా ఉంది. నగర ప్రజలకు మౌలిక వసతులు, అత్యవసర సేవలు అందించేందుకు వసూలైన పన్ను నిధులనే వినియోగిస్తుంటారు. నగర వాసులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్నులు చెల్లింపులో తీవ్ర అలసత్వం కనిపిస్తోంది. దీంతో ఎంఎంసీ పన్నుల వసూళ్లు, సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఎంఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, ఆస్తి పన్నులతో పాటు తాగునీటి, ఖాళీ స్థలాల పన్నులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. మార్చి నెలాఖరు లోపు ఈ పన్నులు నూరు శాతం వసూలు కావాల్సింది. ఆ దిశగా ఎంఎంసీ అధికారులు అడుగులు వేయటంలేదనే విమర్శలు వినవస్తున్నాయి. వసూళ్లకు సంబంధించి బాకీదారులకు రెడ్ నోటీసుల జారీ, మైక్ ప్రచారం, మొండి బకాయిదారుల పేర్లతో ప్రధాన కూడళ్లలో బోర్డుల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాల్సిఉండగా అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారంటున్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఖాళీ స్థలాలు వంటి ఆస్తి పన్నుకు సంబంధించి మొత్తం 53,856 అసెస్మెంట్లు ఉండగా వీటి నుంచి పాత పన్ను బకాయి రూ.21.07 కోట్లు, ప్రస్తుత బకాయి రూ.19.09 కోట్లు మొత్తం కలిపి రూ.40.16 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వీటిలో పాత బకాయిలకు సంబంధించి రూ.2.14 కోట్లు, ప్రస్తుత బకాయికి సంబంధించి రూ.9.60 కోట్లు మొత్తం రూ.11.73 కోట్ల మేర మాత్రమే వసూలయ్యాయి. ఇంకా ఎంఎంసీకి రూ.28.42 కోట్ల మేర పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాగునీటి పన్నులకు సంబంధించి నగరంలో 447 మీటర్ తాగునీటి కనెక్షన్లు ఉండగా వీటి నుంచి రూ.2.60 కోట్ల బకాయి వసూలు కావాల్సి ఉంది. 33,257 గృహ తాగునీటి కొళాయిలు ఉండగా వీటి నుంచి రూ.8.04 కోట్ల మేర బకాయి వసూలు కావాల్సి ఉంది. రెండూ కలిపి తాగునీటి పన్ను రూ.10.64 కోట్ల మేర ఎంఎంసీకి వసూలు కావాల్సి ఉంది. ఈ బకాయిలు రానున్న 45 రోజుల్లో వసూలు కావలసి ఉంది. అయితే ప్రతి ఏడాదిలానే రాష్ట్ర ప్రభుత్వం పన్నులపై ఉన్న వడ్డీ రాయితీ ఇస్తుందని, అప్పుడు పన్నులు చెల్లించవచ్చునని కొంతమంది పన్నుదారులు ఎదురుచూస్తున్నారు. -
అన్ని వర్గాలకూ వంచన
బడ్జెట్ 2026–27రాష్ట్ర బడ్జెట్లో ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు ప్రభుత్వం మొండి చేయి చూపింది. డాక్టర్ వైఎస్సార్ ముస్లిం మైనార్టీలకు నాడు బడ్జెట్లో పెద్దపీట వేసి సంక్షేమ సారథిగా మారారు. ఆయనకు మించిన విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ముస్లిం మైనార్టీలకు బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసి అన్ని విధాలా ఆదుకుంటామని హామీలు ఇచ్చారు.ఇప్పుడు పట్టించుకోవడం లేదు. –షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్లో అన్ని వర్గాలనూ వంచనకు గురి చేసింది. ఎన్నికల ముందు సూపర్సిక్స్ హామీలంటూ ఊదరగొట్టి ఇప్పడు వాటికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. 18 నుంచి 59 ఏళ్ల వయసు లోపు మహిళలకు ఆడ్డబిడ్డ నిధి కింద రూ.1500 అంటూ ఊరావాడా ప్రచారం చేసి.. మూడో బడ్జెట్లో కూడా దాని ఊసే లేదు. నాడు ఎడాపెడా హామీలు ఇచ్చి.. బడ్జెట్లో అంకెల గారడీ తప్ప ఏమీ లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు –సాక్షి నెట్వర్క్ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాలపై బడ్జెట్లో ప్రస్తావనే లేదు. చంద్రబాబు, పవన్కల్యాణ్ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే నిరుద్యోగులు నమ్మి ఓట్లేశారు. నిరుద్యోగులతో పాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఈ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. అన్ని వర్గాలకు బడ్జెట్లో మాత్రం నామమాత్రంగా నిధులు కేటాయించడం చూస్తే రాష్ట్ర ప్రజలపై కూటమి పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోంది. –సింహాద్రి రమేష్బాబు, మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ సూపర్సిక్స్లో నాలుగు హామీలకు చంద్రబాబు సర్కార్ పంగనామాలు పెట్టింది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు 50ఏళ్లకే పింఛన్లు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాలకు గత రెండు బడ్జెట్లతో పాటు ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదు. అంకెల గారడీ తప్ప అమలులో సాధ్యమయ్యేలా లేదు. ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు ప్రభుత్వానికి తగిన బుద్ధిచెబుతారు. –వేములకొండ తిరుపతిరావు(వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) -
మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్యకు కడపటి వీడ్కోలు
పలువురు ప్రముఖుల నివాళి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీసీ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య అంత్యక్రియలు సోమవారం ఘనంగా ముగిశాయి. విజయవాడ దుర్గా అగ్రహారంలోని ఆయన నివాసం నుంచి సాంబమూర్తి రోడ్డు మీదుగా ఐలాపురం హోటల్, ఏలూరు రోడ్డు, స్వర్ణ కాంప్లెక్స్ మీదుగా స్వర్గపురి వరకు అంతిమ యాత్ర సాగింది. అంతిమ యాత్రలో భాగంగా ఆయన భౌతిక కాయాన్ని ఐలాపురం హోటల్లో కొద్దిసేపు ఉంచారు. ఐలాపురం వెంకయ్య మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇంటి వద్ద ఐలాపురం వెంకయ్య భౌతికకాయాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ సీపీ నాయకుడు పోతిన వెంకట మహేష్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి ఫోన్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. పామర్రు: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని గుడివాడ డీఎస్సీ ధీరజ్ వినీల్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నిందితుడిని సోమవారం విలేకరుల ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పెదపారుపూడి మండలానికి చెందిన నాలుగేళ్ల బాలికపై ఈనెల 7వ తేదీన లైంగిక దాడి జరిగిందని చెప్పారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 5వ తేదీన బాలిక తల్లి పుట్టింటికి వెళ్లిందని, ఇంట్లో ఉన్న సమీప బంధువు బాలికకు స్నానం చేయించిన తర్వాత ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఈ విషయమై బాలిక తల్లి ఈనెల 14వ తేదీన పెదపారుపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి పోక్సో యాక్టు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో పామర్రు సీఐ వి.సుభాకర్, ఎస్ఐ–2 కె.విజయ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దర్ని కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్ పథకంతో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ఆయన కోవిడ్లో తల్లిదండ్రులు ఇద్దర్ని కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్ సహాయాన్ని అందించారు. అనంతరం వారితో ముఖాముఖి మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు. వారిలో 18 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు కోస్టల్ బ్యాంక్ పాస్ పుస్తకాలను అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సమగ్ర సంరక్షణ, రక్షణను అందించటం, ఆరోగ్య బీమా ద్వారా వారి శ్రేయస్సును నిర్ధారించటం, విద్య ద్వారా వారిని శక్తిమంతం చేయటం తదితర అంశాలను ఈ పీఎం కేర్ పథకం ద్వారా నిర్వహిస్తామన్నారు. వారు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధనకు శ్రమించాలని ఉద్భోదించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వారి బయోడేటాను పంపాలని, వారికి విద్య అవకాశాల కల్పనకు కృషి చేయాలని నైపుణ్యాభివృద్ధి అధికారికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ సువార్త, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి తదితర అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ విద్యార్థుల సత్తా
గుడ్లవల్లేరు: రాష్ట్ర స్థాయి క్రీడల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని ఏఏఎన్ఎం అండ్ వీవీఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ శేషాద్రీరావు నాలెడ్జ్ విలేజ్ గుడ్లవల్లేరు కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ ఆదివారం విలేకరులకు తెలిపారు. తెనాలిలో ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ కళాశాలల మధ్య క్రీడా పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో తమ కాలేజీ విద్యార్థులు పాల్గొన్న రెండు విభాగాలు బాలికల వాలీబాల్, ఖోఖోలలో విజేతలుగా నిలవడమే కాకుండా అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలు పొందారన్నారు. విజేతలుగా నిలిచిన బాలికల జట్లకు నిర్వాహకులు వాలీబాల్ విజేతలకు రూ.10 వేలు, ఖోఖో విజేతలకు రూ.10 వేల నగదుతో పాటు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారని చెప్పారు. బహుమతులు సాధించిన విజేతలకు శిక్షణ అందించిన ఫిజికల్ డైరెక్టర్ వి.శ్రీనివాసరావు, సహాయ ఫిజికల్ డైరెక్టర్ ఎం.భవదీప్ను పాలిటెక్నిక్ యాజమాన్య కమిటీ చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వల్లూరుపల్లి సత్యనారాయణరావు(బాబ్జి), ప్రిన్సిపాల్ రాజశేఖర్, వివిధ విభాగాల శాఖాధిపతులు అభినందించారు. ఆటోనగర్(విజయవాడతూర్పు): మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్గేట్స్ సోమవారం విజయవాడకు రానున్న నేపథ్యంలో నగరపాలకసంస్థ అధికారులు ఆదివారం పారిశుద్ధ్య పనులను చేపట్టారు. బందరు రోడ్డుతో పాటు పటమట రైతుబజారు పరిసరాల్లోని డివైడర్లను శుభ్రం చేశారు. ప్రధాన రహదారుల్లోని మట్టి దిబ్బలు, చెత్తా చెదరాలను తరలించారు. పటమట రైతుబజారులోని క్రీడా ప్రాంగణాన్ని బిల్గేట్స్ సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయం దక్షిణం వైపు గత రెండేళ్లుగా మట్టి కుప్పలు, వ్యర్థాలను డంపింగ్ చేశారు. అంతే కాకుండా పాత వాహనాలను ఏళ్ల తరబడి ఉంచారు. వీటన్నింటిని తొలగించడంతో ఈ ప్రాంతం అంతా పరిశుభ్రంగా మారింది. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): పేపర్ లోడుతో వస్తున్న కంటైనర్ లారీ కొండపల్లి ఎర్రకట్ట బ్రిడ్జి వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సేకరించిన వివరాల మేరకు భద్రాచలం పేపర్ కంపెనీ నుంచి పేపర్ బండిళ్లు లోడ్తో వస్తున్న లారీ విజయవాడ వైపు వెళ్తోంది. ఈక్రమంలో కొండపల్లిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల వద్ద గతంలో ఉన్న గ్రిల్స్ తొలగించడంతో నూతనగా నిర్మాణం జరుగుతున్న రోడ్డులోకి లారీ దూసుకుపోయింది. తిరిగి ఎత్తులో ఉన్న పాత రోడ్డులోకి వచ్చేందుకు డ్రైవర్ ప్రయత్నం చేయగా అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రం కూచిపూడిలో ఆదివారం కళాకారులు నిర్వహించిన నృత్యాభిషేకం ఆశీనులను ఆకట్టుకున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా హరిహర ఫైన్ ఆర్ట్స్(హైదరాబాద్) ఆధ్వర్యంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ కళారత్న పసుమర్తి రామలింగ శాస్త్రి పర్యవేక్షణలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం సహకారంతో నిర్వహించిన నాట్య ప్రదర్శనలలో పాల్గొన్న కళాకారులు శివయ్యకు నాట్య నీరాజనాలను అర్పించారు. నాట్యాచార్యుల ఇలవేల్పు శ్రీగంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద శ్రీ సిద్ధేంద్రయోగి కళా వేదికపై ప్రదర్శన ఇచ్చారు. నాట్య ప్రదర్శనలను గ్రామ సర్పంచ్ కొండవీటి వెంకట రమణ విజయలక్ష్మి పలువురు నాట్యాచార్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. పసుమర్తి రామలింగ శాస్త్రి నిర్వహణలో వెంపటి సత్యప్రసాద్ సహకారంతో కళాకారులను, నిర్వాహకులను దేవాలయ పాలకమండలి సభ్యులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలతో అభినందించారు. -
రైతులకు ఒరిగింది శూన్యం
కంకిపాడు: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతులకు ఒరిగింది శూన్యం. బడ్జెట్లో కేటాయింపులు అరకొరగానే జరిగాయి. సాగునీటి ప్రాజెక్టులకు, వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం కల్పించలేదు. ఏటా ఇస్తామని హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ సొమ్ములో కోతలు విధించారు. రూ 20 వేలు అందిన రైతులు ఒక్కరూ లేరు. అంకెల గారడీ తప్ప రైతులకు చేసింది ఏమీ లేదు. కౌలురైతులకు అన్నదాత సుఖీభవ అందనే లేదు. – కొండవీటి వెంకట సుబ్బారావు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, మంతెన మధురానగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. ఈ బడ్జెట్ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడే విధంగా లేదు. బడ్జెట్లో సూపర్సిక్స్ పథకాలకు కనీస నిధులు కేటాయించలేదు. ఇది కేవలం ప్రజలను మోసం చేసే బడ్జెట్. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయటంతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేయగా.. చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అటక ఎక్కించారు. – బీహెచ్ఎస్వీ జానారెడ్డి, కార్పొరేటర్ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామంటూ ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇంటింటా తిరిగి సూపర్సిక్స్ బాండ్లు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచింది. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ ఆడబిడ్డ నిధి ఊసే ఎత్తడం లేదు. ఇది మహిళలను మోసం చేయడం కాదా. ఓట్లు కోసం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారు. మహిళలను మోసం చేసిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. – అంబడిపూడి నిర్మలకుమారి, కార్పొరేటర్ అవనిగడ్డ: గత ఎన్నికల్లో విస్త్రత ప్రచారం చేసి నిరుద్యోగులకు ఆశలు కల్పించిన నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు. దీనివల్ల ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు అడియాసలే ఎదురయ్యాయి. ఆడబిడ్డ నిధికి రూ.32,400 కోట్లు అవసరం కాగా ఒక్క రూపాయి కేటాయించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. – నలుకుర్తి రమేష్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ పోటీలు
గన్నవరం: స్థానిక జెడ్పీ బాలురోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి అండర్–12 బాలబాలికల రగ్బీ పోటీలు, జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. తొలుత ఈ పోటీలను రగ్బీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ మడుపల్లి బాలకృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు బొప్పన హరికృష్ణ ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 300 మంది బాలబాలికలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో పెద్దఆవుటపల్లి జట్టు విజేతగా నిలవగా, నున్న జెడ్పీ హైస్కూల్ జట్టు ద్వితీయ స్థానం, విజయవాడ ఎంఎస్ఆర్ పాఠశాల జట్టు, వీరపనేనిగూడెం జెడ్పీ హైస్కూల్ జట్టు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో విజయవాడ ఎంఎస్ఆర్ పాఠశాల జట్టు ప్రథమ స్థానం సాధించగా, నున్న జెడ్పీ హైస్కూల్ జట్టు ద్వితీయ స్థానం, ఉంగుటూరు జెడ్పీ హైస్కూల్ జట్టు, ప్రసాదంపాడులోని వివేకానంద స్కూల్ జట్టు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. జిల్లా జట్లకు ఎంపిక.. అనంతరం వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచిన బాలబాలికల జట్లకు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో అత్యుత్తమ క్రీడా ప్రదర్శన కనబరిచిన బాలబాలికలను ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జి.రాంబాబు తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీఆర్ కిషోర్, ఎన్టీఆర్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి శ్రీలత, రగ్బీ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శులు నరసింహ, సీహెచ్ బాలకృష్ణ, నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త ధనియాల నాగరాజు, పలువురు వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్బాల్ (ఉమెన్) టోర్నమెంట్–2025–26 పోటీలు స్థానిక మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలో ఆదివారం హోరాహోరీగా జరిగాయి. కృష్ణాజిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కూన రాంజీ, యూనివర్సిటీ రెక్టార్ ఎం.బసవేశ్వరరావు, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ ఇన్యాసమ్మతో పాటుగా యూనివర్సిటీ క్రీడావిభాగం అధికారులు ఆదివారం జరిగిన మ్యాచ్లను పరిశీలించారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లు –టీఎన్పీఈ యూనివర్సిటీ, చైన్నె – రాణి చన్నమ్మ యూనివర్సిటీపై 36–19 విజయం సాధించింది. సావిత్రీబాయి పూలే యూనివర్సిటీ పుణే –ఎంజీయూ కొట్టాయం పై 48–43 విజయం సాధించింది. ఆర్టీఎంఎన్యూ, మహారాష్ట్ర – దేవి అహిల్యా యూనివర్సిటీ, ఇండోర్పై 47–31, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా, సోనిపట్ బెంగళూరు యూనివర్సిటీపై 43–38, హేమచంద్ యాదవ విశ్వవిద్యాలయ, దుర్గ్ (సీజీ)– కెబీసీఎన్ఎంయూ జల్గావ్ (ఎంహెచ్)పై 43–18 విజయం, బెంగళూరు యూనివర్సిటీ– డాక్టర్ రామ్మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీపై 36–05 విజయం సాధించాయి. అటల్ బిహారీ వాజ్పేయి విశ్వవిద్యాలయం, బిలాస్పూర్ – రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం, భోపాల్ యూనివర్సిటీ పై 60–24, కృషా్ణ్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ – జేఎన్టీయూ హైదరాబాద్ పై 42–27, కావికులగురు కాలిదాస సంస్కృత యూనివర్సిటీ, రామ్టెక్–ఉత్కల్ యూనివర్సిటీ, ఒడిశాపై 53–18, కేరళ యూనివర్సిటీ – భారతిదాసన్ యూనివర్సిటీపై 44–24, మంగళూరు యూనివర్సిటీ – గోండ్వానా యూనివర్సిటీపై 34–04, మహర్షి దయానంద యూనివర్సిటీ, రోహ్తక్ (పంజాబ్)– తుమ్కూర్ యూనివర్సిటీ, కర్ణాటకపై 43–11,యూనివర్సిటీ ఆఫ్ కాలికట్–పంజాబ్ యూనివర్సిటీ పాటియాలాపై 56–26 స్కోరుతో విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన క్యాంప్ఫైర్లో విద్యార్థులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలం
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మోపిదేవి: కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్ బాబుతో కలసి ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్సీ కల్యాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరంకుశపాలన సాగుతోందని, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ అంటూ తప్పుడు ప్రచారానికి పూనుకొన్నారని విమర్శించారు. తమ వారికి భూములు కట్టబెడుతున్నారు.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. తిరుపతి లడ్డూ కల్తీ విచారణ కమిటీ ఏర్పాటు చేసింది 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ లడ్డూలో జంతువుల కొవ్వు కలపలేదని చెప్పిందన్నారు. గత ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలన్న అంబటి రాంబాబుపై దాడి చేశారని తెలిపారు. చంద్రబాబు తమ వారికి ప్రభుత్వ భూములను అన్యాయంగా తక్కువ ధరకు కట్టబెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గరికిపాటి వెంకటేశ్వరావు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ నలుకుర్తి రమేష్, మండల బీసీ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరావు, పంచాయతీరాజ్ నియోజకవర్గ అధ్యక్షుడు బండారు సూరిబాబు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
కనులపండువగా కల్యాణోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి ఇంద్రకీలాద్రిపై శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆదిదంపతుల ఉత్సవ మూర్తులకు కల్యాణోత్సవాన్ని జరిపించారు. ఆలయ ప్రాంగణంలో గణపతి పూజను నిర్వహించగా, ఆలయ చైర్మన్, ఈవోలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కల్యాణోత్సవాన్ని ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, వేద పండితులు కల్యాణోత్సవాన్ని జరిపించారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగింది. తొలుత స్వామి వారికి త్రికాల అభిషేకాలు, మహాన్యాసం నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఈ కోటేశ్వరరావు, ఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ దంపతుల ప్రత్యేక పూజలు.. మల్లేశ్వర స్వామి వారికి నిర్వహించిన విశేష అభిషేకాలు, అర్చనలలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దంపతులు పాల్గొన్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న కలెక్టర్ లక్ష్మీశను దేవస్థాన ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయంలో ఏర్పాటు చేసిన శివలింగం, నందీశ్వరుల ప్రతిమల వద్ద కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. ఇంద్రకీలాద్రిపై విశేష పూజలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని ఆది దంపతులైన దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని వివిధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. పూలతో సిద్ధం చేసిన శివలింగం, నంది, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాలింగం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆది దంపతులను దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇంద్రకీలాద్రిపై ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. లోక కళ్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆలయ అర్చకులు సూర్యభగవానుడి విగ్రహానికి విశేష పూజలు చేశారు. రాజగోపురం వద్ద లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్యభగవానుడి విగ్రహానికి పూజా కార్యక్రమాలు, అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించారు. -
శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
రామేశ్వరస్వామికి విశేష పూజలు.. స్వామి సేవలో కై లే.. ముక్త్యాల(జగ్గయ్యపేట): భవానీ ముక్తేశ్వరాలయ ప్రాంగణంలో భక్తజన సందోహం నెలకొంది. తెల్లవారు జాము నుంచే ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ సమీపంలోని కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసి ముక్తేశ్వరునికి అభిషేకాలు, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామస్మరణతో మార్మోగింది. నదిలో పిండ ప్రధానాలతో పాటు వీర్ల కొలుపు, వీరభద్రుడు, ఎల్లమ్మ సామాగ్రి, కృష్ణమ్మ పవిత్ర జలంతో వారి ఆచారం ప్రకారం పూజలు చేశారు. -
సాగు ఎండమావిడి
జి.కొండూరు: ప్రభుత్వ వివక్ష, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల దాడితో ఏటా నష్టాలను చవిచూస్తున్న మామిడి రైతులు తోటల్లోని చెట్లను నరికేస్తున్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు వంటి ప్రకృతి విపత్తులతో మామిడి కాయలు నేలరాలినా ప్రభుత్వం పరిహారం చెల్లించడంలేదు. ప్రీమియం జమ చేసినా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవో సాకులు చూపి బీమా పరిహారం ఇవ్వడంలేదు. సాగు, కోత ఖర్చులు కూడా రాక రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ రెండేళ్లలో 4,580 హెక్టార్లలో మామిడి తోటలను రైతులు తొలగించారు. ప్రభుత్వం చొరవ చూపి రైతులకు భరోసా ఇవ్వకపోతే మామిడి సాగు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. భారీగా నరికివేత ఎన్టీఆర్ జిల్లాలో 22,896 హెక్టార్లలో మామిడి సాగవు తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో తీరు అందుకు భిన్నంగా ఉంది. మామిడి సాగు అధికంగా ఉండే తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో ఏటా పది శాతానికి పైగా తోటలను రైతులు తొలగించి పామాయిల్ సాగు చేపడుతు న్నారు. నీరు అందుబాటులో లేని ప్రదేశాల్లో ఇతర మెట్ట పంటలను సాగు చేస్తున్నారు. గత ఏడాది భారీ వర్షాలతో కాయ నేల రాలడంతో పాటు, ఉన్న కాయలు కూడా మంగు వచ్చి ధర పతనమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ ఏడాది మామిడి తోటల తొలగింపు అధికమైంది. ముదురు తోటలను తొలగిస్తున్న స్థాయిలో కొత్త తోటల సాగు ప్రారంభం కావడంలేదు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 623 క్టార్లలో మాత్రమే లేత తోటల సాగు ఉండడం మామిడి భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. రూ.10.57 కోట్ల పరిహారం ఎక్కడ? ఎన్టీఆర్ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ ఏడు, 13వ తేదీల్లో భారీ వర్షాలు, పెను గాలుల వల్ల మామిడి తోటల్లో కాయలు భారీగా రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో 15,300 హెక్టార్లలో 50 శాతానికిపైగా కాయలు రాలినట్లు ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ పంట నష్ట గణన బృందాలు ఇచ్చిన నివేదిక ప్రకారం 5,418 మంది రైతులకు చెందిన 3,021 హెక్టార్లలో 33 శాతాని కన్నా ఎక్కువగా కాయలు రాలినట్లు తేల్చారు. ఈ నష్టానికి రూ.10,57,37,534 పెట్టుబడి రాయితీ కింద నిధుల విడుదల కోసం ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నిధులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇన్సూరెన్స్ కంపెనీ మొండిచేయి 2024–25 సంవత్సరానికి మామిడి తోటల బీమా పథకం కింద అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎన్టీఆర్ జిల్లాలో 290 మంది రైతులు మామిడి బీమా ప్రీమియంగా రూ.13,26,328 చెల్లించారు. 2024 డిసెంబరు 15 నుంచి 2025, మే 31వ తేదీ మధ్య కాలంలో అధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం, అధిక గాలి వేగం వంటి పరిమాణాల ఆధారంగా బీమా చెల్లించేందుకు నిబంధనలు విధించారు. దీనిని మండల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నష్ట అంచనాలను లెక్కించి మీమా నిబంధనలకు సరిపోలిన ప్పుడు మాత్రమే బీమా పరిహారాన్ని రైతుకు అందించాల్సి ఉంది. అయితే గత ఏడాది ఏప్రిల్లో భారీ వర్షాలు, పెనుగాలులకు జరిగిన నష్టానికి రైతుల నుంచి ప్రీమియం తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ రైతులకు పరిహారం చెల్లించేందుకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
నిరాశపరిచిన బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విద్యా రంగాన్ని పూర్తిగా నిరాశపరి చింది. బడ్జెట్ కేటాయింపుల్లో కేవలం 10.5 శాతమే విద్యారంగానికి ఇవ్వడం విచారకరం. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 30 శాతం విద్యారంగానికి కేటాయించాలని కొఠారి కమిషన్ సిఫారసు చేసింది. దానిని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. గత ఏడాది బడ్జెట్తో పోల్చినా ఈ కేటాయింపులు చాలా తక్కువ. ఈ నిధులు విద్యారంగ సమగ్ర అభివృద్ధికి ఏ విధంగానూ ఉపయోగపడవు. – ఎస్.సమరం, ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కార్యదర్శి -
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సర్పించారు. విజయవాడకు చెందిన డాక్టర్ వి.విజయ్కుమార్, బి.శాంతికిరణ్ బొర్రా సుబ్బారావు, సువర్చలా దేవి పేరిట రూ.1.15 లక్షల విరాళాన్ని ఆలయ ఈఓ శీనానాయక్కు అందజేశారు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన పి.కామేశ్వరరావు కుటుంబం ఈఓ శీనానాయక్ను కలిసి రూ.1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. మల్లేశ్వర స్వామికి చేనేత పట్టు వస్త్రాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన గంగ, పార్వతి (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామికి మంగళగిరికి చెందిన బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు శని వారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏటా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. పట్టు వస్త్రాలను సమర్పించేందుకు విచ్చేసిన సేవా సంఘం సభ్యులకు ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. సేవా సంఘం సభ్యులు తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం స్వామికి పట్టువస్త్రాలు, పూజా సామగ్రి సమ ర్పించారు. చిల్లపల్లి మోహన్రావు, అందే నాగవరప్రసాద్, చిల్లపల్లి శ్రీనివాస్, తమ్మిశెట్టి జానకీదేవి, గంజి చిరంజీవి, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల నాగమణి, రామనాథం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. బందోబస్తును పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీపీపెనమలూరు: మండలంలోని యనమలకుదురులో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీపీ జి.వి.జి.అశోక్కుమార్ శనివారం పరిశీలించారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి కొండపైన ఆలయ ప్రాంగణ, కొండ దిగువు ప్రాంతాలను పరిశీలించారు. అశోక్కుమార్ మాట్లాడుతూ.. మహాశివరాత్రికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. క్యూలైన్లలో భక్తుల తోపులాట జరగకుండా సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోనిటరింగ్ రూమ్లో నిరంతర పరిశీలన చేస్తామన్నారు. స్వామిని ఐజీపీ అశోక్కుమార్, ఎస్పీ విద్యాసాగర్నాయుడు దర్శించుకుని పూజలు చేశారు. దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లా సాంఘిక సంక్షే మశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ, డీఆర్వో ఎం.లక్ష్మీనర సింహం, ఇతర అధికారులతో కలిసి సంజీ వయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దామోదరం సంజీవయ్య నిరాడంబరత, నిజాయితీ, కార్యదక్షత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రమాదేవి, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, వసతి గహ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీని ప్రక్షాళన చేస్తాం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశఎ.కొండూరు: స్థానిక కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని ప్రక్షాళన చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శనివారం ఆ పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకున్నారు. హాస్టల్లో నిద్రించే బాలికలను ఎలుకలు కొరకడం బాధాకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై చర్యలకు ఉపక్రమించామని, గత జనవరి 31వరకు ఇక్కడ పనిచేసిన వసతిగృహ ప్రత్యేకాధికారి శ్యామల అలసత్వధోరణి కారణంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు గుర్తించామన్నారు. ఆమెను విధుల నుంచి తప్పించి ప్రభుత్వానికి సరెండర్ చేశామని కలెక్టర్ వెల్లడించారు. పూర్తి విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామని తెలిపారు. పాఠశాల డార్మెటరీ వెనుక ఉన్న బావి ఎలుకలకు ఆవాసంగా మారిందని, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుపరుస్తామన్నారు. ఎంపీడీవోకు పర్యవేక్షణ బాధ్యతలు కస్తూరిబా గాంధీ విద్యాలయ పర్యవేక్షణ బాధ్యతలను ఎ.కొండూరు ఎంపీడీవోకు అప్పగిస్తూ కలెక్టరు ఆదేశాలిచ్చారు. ప్రస్తుత కేజీబీవీ ప్రిన్సిపాల్ విజయ సుందరి పాఠశాల నిర్వహణలో పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎ.కొండూరు తహసీల్దారు అరవింద్, ఎంఈవో కేశవరావు అదికారులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరంలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. శనివారం లీగ్ పోటీలలో ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖ వీడియం చైన్నె పీజీ పీసీ తిరువాత్తూరు చైన్నె, వెస్ట్రన్ ముంబై, ఐపీఎఫ్ చైన్నె, తమిళనాడు పోస్టల్ స్పోర్ట్స్ బోర్డు చైన్నె, ఎస్ఆర్ఎం ఐఎస్టీ వెందలూరు, శ్రీరామా బాల్ బ్యామిటన్ క్లబ్ నునపర్తి జట్టులు క్వార్టర్ ఫైనల్స్కి వచ్చాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ మత్తి శివశంకర్ తెలిపారు. ఈ క్వార్టర్ ఫైనల్లో గెలుపొందిన జట్లు సూపర్లీగ్కు అర్హత సాధిస్తాయన్నారు. ప్రతిభ చూపిన వారిని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ సహ కార్యదర్శి వల్లూరుపల్లి రామకృష్ణ అభినందించారు. -
‘ప్రైవేట్’లో రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో పెట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సోషలిస్టు కూటమి రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్క్లబ్లో శనివారం సోషలిస్టు కూటమి ఆధ్వర్యాన రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. తొలుత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. టీయూఎస్సీ జాతీయ కార్యదర్శి ఎల్.జైబాబు మాట్లాడుతూ రిజర్వేషన్లు ఎత్తివేయాలనే వాదం ముందుకు వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలు ప్రైవేటులో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే రిజర్వేషన్లు తప్పనిసరి చేయాలన్నారు. సమావేశంలో గిద్దా శ్రీనివాస్, వేల్పూరి శ్రీనివాస్, దేవసేన, శీలం వెంకటేశ్వర్లు, బూరుగా రత్నం, గణేష్, దేవి, పిట్టా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు -
బందరు కాలువలో మృతదేహం లభ్యం
పెనమలూరు: రెండు రోజుల క్రితం పెనమలూరు వంతెన పైనుంచి బందరు కాలువలో దూకి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తల గొడవలు కారణంగా భర్త షేక్ నాగుల్మీరా(36) పై భార్య అనూష పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు. ఆ భయంతో భర్త గురువారం బందరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాలువలో గల్లంతైన నాగుల్మీరా కోసం రెండు రోజులుగా గాలిస్తున్నారు. శనివారం గంగూరు డీమార్ట్ వెనుక ఉన్న బందరు కాలువ గుర్రపుడెక్కలో మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుణదల(విజయవాడ తూర్పు): పట్టపగలు ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు అక్కడున్న బాలుడు గొంతుపై కత్తి పెట్టి బెదిరించి చోరీకి విఫలయత్నం చేసిన ఘటన మాచవరం పీఎస్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. జనసంచార ప్రాంతంలో ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంమాచవరం యారం వారి వీధికి చెందిన బత్తుల రాజేష్ ప్రైవేటు ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఉదయం అతను పనికి వెళ్లారు. భార్య సౌజన్య పెద్ద కుమారుడితో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఇంట్లో చిన్న కుమారుడు బత్తుల హర్ష ఒక్కడే ఉన్నాడు. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు ఆ ఇంట్లో చొరబడ్డారు. హర్ష గొంతుపై కత్తి పెట్టి బెదిరించి చోరీకి యత్నించారు. ఇంతలో హర్ష కేకలు వేయడంతో వారు పరారయ్యారు. ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బుగానీ చోరీ కాలేదు. ఈ విషయం గురించి హర్ష తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలంలో సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా ఆరుగురు మాస్కులు ధరించి చోరీకి యత్నించినట్లు గుర్తించారు. హర్ష గొంతుపై కత్తి పెట్టిన వ్యక్తికి చేతిపై టాటూలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు భద్రత కల్పించాల్సిందిగా బాధితులు పోలీసులకు విన్నవించారు. ఏడుగురికి తీవ్ర గాయాలు కృత్తివెన్ను: మాట్లం తూము సమీపంలో 126 జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం వ్యాన్ ఢీకొనడంతో మహిళ మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు తెలిపిన వివరాల ప్రకారం చినగొల్లపాలెం నుంచి కత్తివెన్నుకు మోటార్ సైకిల్పై వస్తున్న వారిని.. చేపల వేటకోసం పోడు గ్రామం వెళుతున్న వ్యాన్ ఎదురుగా ఢీకొట్టింది. ఘటనలో మోటార్ సైకిల్ మీద ఉన్న జ్యోతి (40)ఘటనా స్థలంలోనే మరణించగా మంగమ్మ, ఏసురాజులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వ్యాన్లో 13 మంది ఉండగా వారిలో ఏడుగురికి తీవ్రంగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలైనట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈసారీ అరకొరే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో శనివారం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మైట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు, బుడమేరు ఆధునికీకరణ వంటి వాటికి నామ మాత్రంగానూ నిధులు కేటాయించలేదన్న భావన వ్యక్తం అవుతోంది. విజయవాడ కార్పొరేషన్కు ఒక్క రూపాయీ ఇవ్వలేదు. నీటి పారుదల రంగానికి గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులే అరకొర, వాటిలోనూ అంతంత మాత్రంగానే ఖర్చు చేశారు. గత ఏడాదికన్నా ఈ ఏడాది తక్కువ నిధులు కేటాయించడం గమనార్హం. చింతలపూడి ప్రాజెక్టు పూర్తయ్యేనా..? 2026 జూన్ నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని పాలకులు గొప్పలు చెప్పారు. మైలవరం, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆ ప్రాంతాల ప్రజలకు తాగు నీరు అందించే అతి ముఖ్యమైన ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావ లంటే రూ.4 వేల కోట్లకు పైగా అవసరం. గత ఏడాది రూ.30 కోట్లు కేటాయించినా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది రూ.430 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేశారు. కృష్ణా డెల్టాకు గత ఏడాది కేవలం రూ.400 కోట్లు కేటాయించినా అరకొరగానే ఖర్చు చేశారు. ఈ ఏడాది రూ.300 కోట్లు మాత్రమే కేటా యించారు. పులిచింతల ప్రాజెక్టుకు గత ఏడాది రూ.16.37 కోట్లు కేటాయించి కొంత మేర నిధులు ఖర్చు చేశారు. ఈ ఏడాదీ బడ్జెట్లో అన్నే నిధులు కేటాయించారు. మచిలీపట్నం పోర్టుకు రూ.150 కోట్లతో సరిపెట్టారు. మచిలీపట్నం ిఫిషింగ్ హార్బర్కు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గన్నవరం ఎయిర్పోర్టుకు మాత్రం రూ.30 కోట్లు కేటాయించారు. హామీల అమలుకు ఏదీ పూచీ? సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీల అమలు బడ్జెట్లో చేసిన కేటాయింపులతో ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బడ్జెట్లో నిధుల కేటాయింపుపై రైతులు పెదవి విరుస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 1,41,726 మంది, కృష్ణా జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఉచిత పంటల బీమా వంటి పథకాలకు మంగళం పాడారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 6,09,032 కుటుంబాలు, కృష్ణా జిల్లాలో ఎనిమిది లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం మాట అటుంచి బడ్జెట్లో నిధులు లేకపోతే భృతి ఎలా అమలవుతుందని ఈ కుటుంబా ల్లోని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని ఊదర గొట్టారు. బడ్జెట్లో ఈ పథకం ఊసే లేదు. ఎన్టీఆర్ జిల్లాలో 8,30,958 మంది, కృష్ణా జిల్లాలో 7,39,202 మంది అర్హులైన మహిళలు ఉన్నారు. వీరంతా బాబు మాటను నమ్మి నిండా ముని గా మని వాపోతున్నారు. డ్వాక్రా మహిళలకు బడ్జె ట్లో మొండి చెయ్యి చూపారు. కృష్ణా జిల్లాలో 28,878 డ్వాక్రా సంఘాల్లో 2,88,633 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 24,783 సంఘాల్లో 2,45,401 మంది సభ్యులు ఉన్నారు. సున్నా వడ్డీ వంటి పథకాలకు ప్రత్యేకంగా నిధుల కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. బడ్జెట్ అంకెల గారడీపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 2024 సెప్టెంబర్లో వచ్చిన బుడమేరు వరదలకు బెజవాడ నగరంలో సగం భాగం నీట మునిగింది. పది రోజులకు పైగా వరదలో చిక్కుకొని ప్రజలు అల్లాడారు. ఇకపై నగరం బుడమేరు వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని అప్పట్లో ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుడమేరును ఆధునికీకరిస్తామని, అక్రమణలను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయితే బడ్జెట్లో బుడమేరు ఆధునికీకరణకు ఒక్క పైసా కేటాయించలేదు. దీంతో బుడమేరు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పరామర్శకు వెళ్తూ అనంతలోకాలకు...
కంకిపాడు: తెలిసిన వారు చనిపోతే పరామర్శించేందుకు వెళ్తున్న ఓ మహిళ అనంతలోకాలకు వెళ్లిపోయిన విషాద ఘటన కంకిపాడు బైపాస్లో శనివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెంకు చెందిన ఆచంట శైలజ (50), కె.శ్రీనివాసరావు భార్యాభర్తలు. కంకిపాడు బస్టాండు సెంటరులో మెడికల్ దుకాణం నిర్వహిస్తుంటారు. పెనమలూరు మండలం తాడిగడపలో ఓ మహిళ మరణించడంతో మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆచంట శైలజ తన ద్విచక్ర వాహనంపై పూలదండలతో బయలుదేరింది. ఆమె కంకిపాడు బైపాస్మార్గానికి చేరుకునే క్రమంలో రోడ్డు మార్జిన్లో ఉన్న ఇసుకలోకి ఆమె వాహనం వెళ్లటంతో జారి ప్రమాదవశాత్తూ కిందపడ్డారు. వెనుకగా కుందేరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆమె మీదుగా దూసుకెళ్లటంతో శైలజ తల నుజ్జు అయ్యి ఘటనాస్థలిలోనే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. అదనపు ఎస్ఐ దాసు పర్యవేక్షణలో పోలీసులు మృతదేహాన్ని అంబులెన్సులో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంకిపాడులో విషాదం రోడ్డు ప్రమాద ఘటన కంకిపాడులో విషాదం నింపింది. అందరితో కలివిడిగా మసులుతూ, పూజాది కార్యక్రమాలు, అన్నదానాల్లో తన వంతు పాత్ర పోషిస్తూ ఉండే శైలజ హఠాన్మరణం పట్టణ వాసులను కలవరపరిచింది. మృతదేహాన్ని వీక్షించిన స్థానికులు అయ్యోపాపం అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
మహిళల నెట్బాల్ టోర్నీ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడల్లో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ముందుకు సాగాలని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్ బాల్ (మహిళల) టోర్నీ శనివారం ప్రారంభమైంది. మంత్రి రాంప్రసాద్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నీని ప్రారంభించి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీలకు విజయవాడ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కూన రాంజీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉన్న 88 యూనివర్సిటీల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు, 200 మంది కోచ్లు, అధికారులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు టోర్నీ జరుతుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ ఇన్యాసమ్మ, యూనివర్సిటీ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మొదటి మూడు రోజులు నాకౌట్ విధానంలో పోటీలు జరుగుతాయి. మైదానంలో ఏర్పాటు చేసిన నాలుగు కోర్టుల్లో వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చి క్రీడాకారులు పోటీ పడ్డారు. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కేజీబీవీని ప్రక్షాళన చేస్తాం ఎ.కొండూరులోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శనివారం సందర్శించారు. విద్యార్థుల ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు. మోపిదేవి: మహాశివరాత్రిని పురస్కరించుకొని శనివారం సాయంత్రం జరిగిన గ్రామోత్సవంలో శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆకాంక్షించారు. పారిశ్రామిక రంగాల అభి వృద్ధి లక్ష్యంతో విజయవాడ కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నిర్వహించిన నైపుణ్య వర్క్షాప్ను గుంటుపల్లి రైజ్ సెంటర్లో శనివారం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల వ్యాపారం లాభదాయకమన్నారు. ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త కలను సాకారం చేయడానికి ప్రతివారం రైజ్ కేంద్రంలో ప్రత్యేక వర్క్షాపులు నిర్వహిస్తున్నామని, మహిళలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, ఆర్డీఓ కావూరి చైతన్య, కూలెక్స్ ఇండస్ట్రీస్ యజమానులు పాలకుర్తి రాధాకృష్ణ, భ్రమరాంబ, సందేశ్, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు తదితరులు పాల్గొన్నారు. శివోహం మహాశివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఆలయ ప్రాంగణాల్లో ప్రభబండ్లు కొలువుదీరాయి. ఓం నమఃశివాయ అన్న మహాదేవుని నామ స్మరణతో ఆలయాల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతులీనుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ Iఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 4900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 35.8640 టీఎంసీలు. -
ఇంటింటా మార్మోగుతున్న శివనామస్మరణ
పెనమలూరు: చరిత్ర ప్రసిద్ధిగాంచిన యనమలకుదురు శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. గ్రామంలో ఇప్పటికే పండుగ సందడి చోటు చేసుకుంది. ప్రతి ఇంటా శివనామస్మరణమే వినబడుతుంది. ఆలయంలో గడచిన కొద్ది సంవత్సరాలలో చాలా అభివృద్ధి జరిగింది. దాత సంగా నరసింహారావు శివాలయం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు పెండ్లి కుమారుడిగాస్వామివారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఉత్సవాలు జరుపుతారు. 14వ తేదీ ఉదయం 8 గంటలకు స్వామివారు, అమ్మవారిని పెడ్లి కుమారుడిగా, పెండ్లి కుమార్తెగా అలంకరిస్తారు. నూతన పట్టు వస్త్రాలతో స్వామివార్లను అలంకరించి ప్రదర్శిస్తారు. రాత్రి 9 గంటలకు విఘ్నేశ్వరపూజ, దీక్షాధారణ. అఖండస్థాపన, అంకురార్పణ, మండపారాధన, అగ్నిప్రతిష్ట పలు పూజా కార్యక్రమాలు చేస్తారు. ఆదివారం వేకువజామునుంచే స్వామివారి దర్శనం ఉంటుంది. అర్ధరాత్రి స్వామివారి కల్యాణం చేస్తారు. ప్రభల హడావుడిలో భక్తులు మహాశివరాత్రికి అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రభల ప్రదర్శన. కొండ చుట్టూ ప్రభలు తిప్పటానికి అధికారులు 40 ప్రభలకు అధికారికంగా అనుమతులు ఇచ్చారు. ఇవే కాకుండా చిన్న ప్రభలు కూడా ఉదయం నుంచే కొండ చుట్టూ తిప్పుతారు. దేవుడి ప్రభ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవగానే సీరియల్ ప్రకారం మిగతా ప్రభలు ప్రదక్షిణకు బయలుదేరుతాయి. సోమవారం ఉదయం వరకు ప్రభలు తిరుగుతాయి. ప్రభలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. గ్రామంలో ప్రభలు పోటీపోటీగా భక్తులు సిద్ధం చేస్తున్నారు. గ్రామ వీధుల్లో ఎక్కడ చూసినా ప్రభలే కనబడుతున్నాయి. పోలీసుల ఆంక్షలు ప్రభల ప్రదర్శనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రభల ఎత్తు 60 అడుగులు మాత్రమే ఉండాలని, డీజేలు పెట్టరాదని, సినీగీతాలు పెట్టి డ్యాన్స్లు వేయరాదని నిబంధన పెట్టారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెట్టరాదని తెలిపారు. మహాశివరాత్రికి భారీ పోలీసుల బందోబస్తు పెట్టారు. పోలీసు అవుట్ పోస్టు కూడా ఏర్పాటు చేశారు. -
డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): డ్రగ్స్ రహిత ఏపీగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సుజనా ఫౌండేషన్, ఎన్టీఆర్ జిల్లా పోలీసు సంయుక్త ఆధ్వర్యంలో వన్టౌన్ గాంధీజీ హైస్కూల్ ప్రాంగణంలో డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ యువత సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను పెంచుతారని, వారిని ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగంతో యువత పెడదోవ పడుతోందన్నారు. ఏపీలో డ్రగ్స్ నిర్మూలించడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్పై దండయాత్ర పేరుతో 18 రోజులుగా సైకిళ్లపై గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్న ఐదుగురు మహిళా పోలీసులను సత్కరించారు. డ్రగ్స్పై దండయాత్ర ఏవీని లాంచ్ చేశారు. డ్రగ్స్ గుర్తించడంలో పోలీస్ డాగ్స్ పనితీరును చూపించిన విధానం ఆకట్టుకుంది. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఏపీ దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మీరా, ఈగల్ ఐజీ రవికృష్ణ, సీపీ రాజశేఖర్బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కేజీబీవీ విద్యార్థినులకు పరామర్శ
ఎ.కొండూరు: ఎలుకలు కొరికి గాయాలపాలైన ఎ.కొండూరు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థినులను వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ శుక్రవారం పరామర్శించారు. వసతి గృహంలో టీడీపీ నాయకులు ఉండటంతో పోలీసులు అవినాష్ను గేటు వద్దే అడ్డుకున్నారు. అనంతరం స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి ఆయన పాఠశాలలోని విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల డార్మెటరీలో నిద్రిస్తుండగా ఎలుకలు కరిచాయని విద్యార్థినులు అవినాష్కు తెలియజేశారు. మెనూ ప్రకారం భోజనం లేదని, ఆదివారం చికెన్ ఇవ్వట్లేదని కూడా తెలిపారు. దోమలు, ఎలుకల బాధతో అల్లాడుతున్నామని, కిటికీలకు మెష్లు కూడా లేవని తెలియజేశారు. విద్యాశాఖాధికారులు పాఠశాలలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో ఉదాసీన వైఖరి అవలంబించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని అవినాష్ వారికి హామీ ఇచ్చారు. పేద విద్యార్థినులకు రక్షణ కల్పించలేకపోవడం తగదని హితవు పలికారు. పాఠశాలలో సమస్యలు తెలుసుకున్న దేవినేని అవినాష్ -
పదిలం.. ప్రేమ జ్ఞాపకం
● బందరు తాజ్మహల్ ● అరబెల్లా ప్రేమ సమాధి ఉన్న సెయింట్ మేరీస్ చర్చి ● నేడు ప్రేమికుల దినోత్సవం మచిలీపట్నం టౌన్: ప్రేమకు చిహ్నం తాజ్మహల్. దీన్ని షాజహాన్ చక్రవర్తి తన ప్రియురాలు ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మిస్తే.. 1815లో బందరు పట్టణంలో బ్రిటీష్ మేజర్ జనరల్ పీటర్ తన ప్రియురాలు అరబెల్లా రాబిన్సన్ కోసం ఓ సుందర భవనానికి రూపు నిచ్చారు. అదే సెయింట్మేరీస్ చర్చి. దానిలో అరబెల్లా సమాధి ఉంది. తాజ్ మహల్లోలేని ఓ విశేషాన్ని ఈ అరబెల్లా మందిరంలో పొందుపరిచాడు. ప్రియురాలు అరబెల్లా మృతదేహం దెబ్బతినకుండా పీటర్ ఈజిప్ట్ తదితర దేశాల నుంచి సుగంధ ద్రవ్యాలు, రసాయనాలను తెప్పించి పూయించారు. ఓ అందమైన గాజు పెట్టెలో ఆమె మృతదేహాన్ని భద్రపరిచి భూమిలో ఓ అరను ఏర్పాటు చేసి దానిలో ఉంచారు. ప్రియురాలి మృతదేహాన్ని చూడాలనుకున్నప్పుడు గోడకు ఉన్న ఒక కొయ్య చిలుకను తిప్పితే లోపల ఉన్న పెట్టి పైకి వచ్చేటట్లు అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లోనే పెద్దలను ఎదిరించి.. మేజర్ జనరల్ పీటర్ ఆనాటి ఆంగ్లేయ సైన్యాధికారిగా మచిలీపట్నంలో పని చేశారు. అక్కడ కెప్టెన్గా పని చేస్తున్న రాబిన్సన్ కుమార్తె అరబెల్లా సౌందర్యానికి ముగ్ధుడైన మేజర్ పీటర్ ఆమెను ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. దీనికి ఆమె తండ్రి రాబిన్సన్, మతాధికారులు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ప్రేమైక సహజీవనాన్ని కొనసాగించారు. వారిద్దరి చర్యను ఎవరూ హర్షించ లేదు. ఆ సమయంలో పీటర్, రాబిన్సన్ల మధ్య కలతలు వచ్చాయి. అరబెల్లా ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయింది. మానసిక ఒత్తిడి పెరిగి ఆరోగ్యం దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో 1809 నవంబర్ 6వ తేదీన పీటర్ ఒడిలోనే ఆమె కన్నుమూసింది. పీటర్ అరబెల్లా మృతదేహాన్ని పెళ్లి గౌను, ఉంగరాలతో అలంకరించి అంతిమ వీడ్కోలు ఇచ్చారు. ప్రియురాలి సమాధే దేవాలయం.. అరబెల్లా మృతదేహాన్ని పరిశుద్ధ యోహాను అవరణలోనూ, బందరుకోటలోని ఆంగ్లేయుల శ్మశాన వాటికలో సమాధి చేసేందుకు నాడు పెద్దలు అంగీకరించలేదు. దీంతో పట్టణంలోని బైపాస్రోడ్ ఆనందపేట ఎదురుగా ఉన్న స్థలంలో అరబెల్లా మృతదేహాన్ని భద్రపరిచారు. ప్రతి రోజూ ఆమెను చూసుకుని కుమిలిపోయేవారు. అరబెల్లా మృతదేహాన్ని చర్చిలోకి అనుమతించకపోయినా ఆమె భౌతికదేహం ఉంచిన చోటే దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. అరబెల్లా తన ప్రియమైన స్నేహితురాలిగా వర్ణిస్తూ షీటర్ ఓ శిలాఫలకాన్ని సమాధి గోడపై అమర్చారు. ఆయన మద్రాసు బదిలీపై వెళుతూ ఈ పరిశుద్ధ సెయింట్ మేరీస్ చర్చిని (సమాధుల చర్చి) ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించారు. 1819 నుంచి మధ్య చర్చిలో ప్రార్థనలకు అనుమతిచ్చారు. అదే ఏడాదే పీటర్ మద్రాస్లో మృతి చెందారు. ఆయన పేరుతో మద్రాసులో ఓ ఉద్యానవనం, ఒక రోడ్డు ఏర్పాటు చేశారు. మేరీస్ చర్చిలో పని మనిషి అనుకోకుండా గోడకు అమర్చిన కొయ్య చిలకను తిప్పింది. దీంతో సమాధిపై రాయి తొలిగి అరబెల్లా మృతదేహం పైకి రావటంతో అది చూసిన ఆమె మరణించింది. ఈ విషయం తెలిసిన అప్పటి కలెక్టర్ ఈ అమరికను శాశ్వతంగా మూయించారు. ప్రస్తుతం ఈ చర్చి ఆవరణలో క్రైస్తవ మతస్తుల మృతదేహాలను సమాధి చేస్తున్నారు. ఆ ఆవరణలో మృతదేహాన్ని ఖననం చేసేందుకు చర్చి నియమాల ప్రకారం కొంత మొత్తాన్ని ఫీజుగా వసూలు చేస్తున్నారు. మచిలీపట్నంలో శతాబ్దాల నాటి అరబెల్లా, జాన్ పీటర్ల అమర ప్రేమగాథకు చిహ్నమే ఆ సమాధి. ఇది ఉన్నచోటే సుందరమైన సెయింట్మేరీస్ చర్చి నిర్మించారు. దీన్ని ‘బందరు తాజ్మహల్’గా పిలుస్తారు. ఇది నాటి ప్రేమగాథను నేటి తరానికి తెలియజేస్తోంది. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వీరి ‘ప్రేమ జ్ఞాపకం’పై ప్రత్యేక కథనం. -
మహా శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత
విజేతలుగా మచిలీపట్నం వైద్య కళాశాల విద్యార్థులు మచిలీపట్నంఅర్బన్: పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాలలోని కమ్యూనిటీ వైద్య విభాగం ఆధ్వర్యాన ఎపిక్ క్విజ్–2026 పేరుతో అంతర వైద్య కళాశాలల (మూడవ సంవత్సరం) విద్యార్థులకు శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.టి.కె.రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి శాసీ్త్రయ పోటీలు విద్యార్థుల్లో వైద్య విజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. పోటీల్లో మొత్తం ఎనిమిది వైద్య కళాశాలలు పాల్గొన్నాయి. వాటిలో గుంటూరు మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, పీఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (గన్నవరం), ఎయిమ్స్ మంగళగిరి, ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు తదితర కళాశాలలు ఉన్నాయి. పోటీల్లో మచిలీపట్నం వైద్య కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. గన్నవరం పీఈఎస్ వైద్య విజ్ఞాన సంస్థ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ వైద్య విభాగాధిపతి డాక్టర్ టి.శివయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆశాలత, డాక్టర్ రత్నమంజుల, డాక్టర్ దుర్గారాణి, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరంలో జాతీయ స్థాయి ఆహ్వాన బాల్ బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పోటీల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 17 జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. అతిథులుగా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి.సత్యనారాయణ, చైన్నె ఐఐటీ విశ్రాంత ప్రొఫెసర్ వెంకట చలపతి, కృష్ణా జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెలగపూడి వెంకటేశ్వరరావు విచ్చేశారు. ముఖ్య అతిథి అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుట్టి పెరిగిన పల్లెటూరు కారణంగా చిన్ననాటి నుంచి క్రీడలపై మక్కువతో ఆటల్లో పాల్గొంటూ జాతీయ స్థాయిలో అనేక బహుమతులు సాధించానన్నారు. లీగ్ కమ్ సూపర్ లీగ్ పద్ధతిలో నిర్వహించే పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ మత్తి శివ శంకర్ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ అడ్వైజర్ వి.దేశపతి, చీఫ్ రిఫరీ సింగరాజు మురళి, సాగునీటి డీసీ చైర్మన్ మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, సమ్మెట నాగేశ్వరరావు, మత్తి మణికుమార్, తూము కృష్ణ ప్రసాద్, పింగళి వెంకట సుబ్బారావు, పింగళి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారునికి నూతన వాహనాన్ని ఇవ్వాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కాసా మోటార్స్ సంస్థ నూతన వాహనాన్ని, వాహనం ఖరీదు వడ్డీతో సహా చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు చింతలపూడి కిషోర్కుమార్, సభ్యురాలు శ్రీ లక్ష్మీరాయల శుక్రవారం తీర్పు చెప్పారు. మచిలీపట్నంకు చెందిన బత్తుల హరినాథ్ కాసా మోటార్స్ మచిలీపట్నం బ్రాంచ్లో 2024 జూలై 3వ తేదీన రూ.1,63,000 చెల్లించి ఎలక్ట్రిక్ బైక్ను కొనుగోలు చేశారు. ఇంటికి వచ్చిన తరువాత బండికి చార్జింగ్ పెట్టగా అది చార్జ్ కావటం లేదు. దీంతో హరినాథ్ షోరూమ్లో వాహనాన్ని అప్పగించారు. షోరూమ్లో మూడు రోజుల పాటు బండి ఉంచుకుని చెక్ చేసి తిరిగి ఇచ్చారు. మళ్లీ బండికి అదే సమస్య పునరావృతం కావటంతో తిరిగి ఆయన షోరూమ్కు అప్పగించారు. ఎన్ని రోజులైనా సమస్య తీరకపోవటంతో ఆయన వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం సభ్యులు కొత్త వాహనం ఇవ్వాలని, లేదా వాహనం రూ.1.63 లక్షలు కొనుగోలు తేదీ నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని తీర్పు చెప్పారు. దీంతో పాటు మానసిక వేదనకు రూ.25 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు షోరూమ్ ప్రతినిధులు ఫిర్యాదుదారునికి 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): హోలీ పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి–షాలీమార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–షాలీమార్ (07512) ప్రత్యేక రైలు ఈ నెల 26, మార్చి 1, 5 తేదీలలో ఉదయం 5.40 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11.20 గంటలకు షాలీమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07513) ఈ నెల 27, మార్చి 2, 6 తేదీలలో మధ్యాహ్నం 12.45 గంటలకు షాలీమార్లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస తదితర స్టేషన్లలో ఆగుతుంది. పామర్రు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన పామర్రులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నంకు చెందిన అబ్దుల్ అల్లా బక్షు(35) విజయవాడలోని ఓ వేడుక నిమిత్తం బైక్పై జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్నాడు. మార్గ మధ్యంలో స్థానిక 14వ మైలు రాయి వద్దకు చేరుకుంటుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన జేసీబీ బైక్పై వస్తున్న అల్లాబక్షుని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు తగిలిన అల్లాబక్షు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలం చేరుకున్న పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ వివరాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యతో వివాదం నేపథ్యంలో... పెనమలూరు: భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడటంతో భయంతో భర్త బందరు కాలువలో దూకి గల్లంతైన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. పెనమలూరు పల్లిపేటకు చెందిన షేక్ అనూష 12 ఏళ్ల క్రితం గుంటూరుకు చెందిన తాపీ పనులు చేసే షేక్ నాగుల్మీరా(36)ను వివాహం చేసుకుంది. అనూష పటమటలో ఏసీ కంపెనీలో పని చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే భర్త మద్యానికి బానిసగా మారడంతో భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య అనూష 10 నెలల క్రితం ఇద్దరు పిల్లలతో సహా పెనమలూరులోని పుట్టింటికి వచ్చి ఉంటోంది. భర్త నాగుల్మీరా అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళుతుంటాడు. ఆ విధంగానే రెండు రోజుల క్రితం పెనమలూరులోని భార్య వద్దకు వచ్చాడు. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడటంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరింది. పోలీసుల వద్దకు వెళుతుందనే భయంతో భర్త పెనమలూరు వంతెన వద్ద బందరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. స్థానికులు కాపాడే యత్నం చేసినా అతనిని ఆపలేకపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బందరు కాలువలో గల్లంతైన నాగుల్మీరా కోసం గాలిస్తున్నారు. -
ఆధునిక ఆవిష్కరణలతో మెరుగైన వైద్య సేవలు
పటమట(విజయవాడతూర్పు): వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఆవిష్కరణలను వైద్యులు అందిపుచ్చుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డి తెలిపారు. విజయవాడ గట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏపీ చాప్టర్) 8వ వార్షిక సదస్సు ఏపీ ఈఎస్జీకాన్ 2026 శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఘనంగా ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జీర్ణాశయ సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు ప్రస్తుతం వేగంగా పెరుగుతున్నాయన్నారు. వాటి నిర్ధారణ, చికిత్సల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. కొత్త పద్ధతులు, అత్యాధునిక ఎండోస్కోపీ సాంకేతికతలు, మినిమల్ ఇన్వేసివ్ చికిత్సా విధానాలు రోగులకు తక్కువ నొప్పితో, త్వరితగతిన కోలుకునే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు. వైద్యులు నిరంతరం శిక్షణ తీసుకుంటూ, తాజా పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. సదస్సులో గ్యాస్ట్రో ఎంట్రాలజీ, హెపటాలజీ, జీఐ ఎండోస్కోపీ తదితర ముఖ్య అంశాలపై దేశంలోని పలువురు వైద్య నిపుణులు ప్రసంగించారు. జీర్ణాశయ వ్యాధుల నిర్ధారణలో నూతన పద్ధతులు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలో వచ్చిన అభివృద్ధి, క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తింపు, అడ్వాన్స్్డ్ ఎండోస్కోపిక్ టెక్నిక్స్ వంటి విషయాలపై చర్చలు జరిగాయి. సదస్సులో ఏపీ ఈఎస్జీకాన్ 2026 నిర్వాహక కమిటీ ప్రతినిధులు డాక్టర్ జవ్వాజి సతీష్, డాక్టర్ గోపీకృష్ణ జాలాది, రాజేష్ బత్తిని, రవిశంకర్ తాతా, డాక్టర్ ప్రమోద్ గార్గ్, డాక్టర్ డి.పెదవీర్ రాజు, డాక్టర్ కె.జగన్మోహన్ రావు, డాక్టర్ ఎం.జగన్మోహన్ రావు, డాక్టర్ ఎన్. తిరుమలరావు, డాక్టర్ పి.హరికృష్ణ, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఐ. నళినీ ప్రసాద్, డాక్టర్ ఐ.ఆర్.ఎస్. గిరినాథ్ ఐఎస్జీ ఏపీ ఆఫీస్ బేరర్లు డాక్టర్ ఎం.కవిత, డాక్టర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు అంటేనే కార్పొరేట్ పాలన
మచిలీపట్నంఅర్బన్: చంద్రబాబు అంటేనే కార్పొరేట్ పాలనని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. బందరులో శుక్రవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఆరు ప్రధాన హామీల్లో ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా నమ్మగలరని ప్రశ్నించారు. భత్యాలు, బకాయిల చెల్లింపుల్లో స్పష్టమైన నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాట్యూటీ చెల్లింపులపై స్పష్టత లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని తెలిపారు. 25న చలో విజయవాడ మూడు దశల్లో పోరాట కార్యక్రమాల్లో భాగంగా రెండో దశగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశామన్నారు. మూడో దశగా ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వెంటనే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను పే స్లిప్పుల్లో చూపించి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర శాఖల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మెమో నంబర్ 57 ప్రకారం ఓపీఎస్ తక్షణమే అమలు చేయాలని కోరారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మరుసటి రోజునే పెన్షన్ సౌకర్యాలు అందించాలని, బకాయి ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీకి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.విజయసాగర్, అదనపు కార్యదర్శి డి.చంద్రశేఖర్, రాష్ట్ర కౌన్సిలర్ల కొమ్ము ప్రసాద్, ఎంఈఎస్ఎన్ ప్రసాద్, కె.సతీష్బాబు, జిల్లా అధ్యక్షులు పి. ఇమాన్యూల్, కార్యదర్శి యూవీ కృష్ణమూర్తి, ఆర్థిక కార్యదర్శి మాధవరావు, రాష్ట్ర కార్యదర్శి డి.విద్యాసాగర్, అర్బన్ అధ్యక్షులు ఎస్.కిరణ్ బాబు, కార్యదర్శి ఎం.వీరబాబు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
వాగ్గేయకార సాహిత్యం సదా స్మరణీయం
విజయవాడ కల్చరల్: వాగ్గేయకార సాహిత్యం సదా స్మరణీయమని విశ్రాంత అదనపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవీ ప్రసాదరావు అన్నారు. స్వరఝరి సంగీత సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే తెలుగు భాషా సంగీత మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. వయొలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి సభకు అధ్యక్షత వహించారు. అదనపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎంఎస్ఎం రమాశ్రీ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్లో స్వరఝరి సహకారంతో 16 ఏళ్ల లోపు యువ కళాకారులు లక్ష మందితో ప్రపంచ బాల మహోత్సవం నిర్వహిస్తామన్నారు. సభలో విద్యావేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ తదితరులు మాట్లాడారు. స్వరఝరి కార్యదర్శి మోదుమూడి సుధాకర్ సభను నిర్వహించారు. సంగీత సాహిత్యాలకు వేదిక తొలి రోజు కార్యక్రమంలో వయోలిన్ విద్వాంసుడు గండూరి శ్రీనివాసమూర్తి బృందం కీర్తనలను ఆలపించారు. రాకమర్ల వెంకటదాసు కీర్తనల వైశిష్టి అంశంగా డాక్టర్ శేషులతా విశ్వనాథ్ ప్రసంగించారు. అన్నమయ్య తెలుగుభాషా సౌందర్యం అంశంగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ టేకుమళ్ళ వెంకటయ్య మాట్లాడారు. సినీ సంగీతంలో తెలుగుభాష అంశంగా కె.శాంతిశ్రీ ప్రసంగించారు. పి.సదాశివశాస్త్రి అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. ఆంధ్రేతర వాగ్గేయకార రచనల వివరాలను ఆకొండి శ్రీనివాసరావు, లలిత సంగీత శిఖరాలు రజనీకాంతరావు, మల్లిక్ సాహిత్య విశేషాలను వివరించారు. భద్రాచల రామదాసు కీర్తనలను తుషార పూర్ణవిల్లి వివరించారు. ప్రారంభమైన తెలుగుభాషా సంగీత మహాసభలు -
భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య
పెనమలూరు: భార్యను వద్దన్నా పుట్టింటికి వెళ్లిందని భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుక్ను ఘటన కానూరులో జరిగింది. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నంకు చెందిన బండి ఉదయకుమారి, నాగమల్లేశ్వరరావుకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు బండి క్రాంతికుమార్(30)కు ఏడు నెలల క్రితం పెదముత్తేవి గ్రామానికి చెందిన అమలరాణితో వివాహమైంది. క్రాంతికుమార్ ఎనికేపాడులో ఒక కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. దంపతులిద్దరూ 20 రోజుల క్రితం కానూరు కమ్మర్ల బజార్లో కాపురం పెట్టారు. భార్య నెల తప్పటంతో ఈ నెల 11వ తేదీన ఆమె తన పుట్టింటికి వెళ్తానని భర్తకు తెలిపింది. దీనికి భర్త వద్దన్నాడు. అయితే భర్త లేని సమయంలో భార్య అమలరాణి పుట్టింటికి వెళ్లింది. రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన భర్త క్రాంతికుమార్ భార్య ఇంట్లో లేకపోవటంతో వీడియో కాల్ చేసి తనకు చెప్పకుండా ఎందుకు వెళ్లావని భార్యతో గొడవపడ్డాడు. నేను చనిపోతానని భార్యను బెదిరించాడు. ఈ విషయం అమలరాణి అత్త ఉదయకుమారికి చెప్పింది. ఉదయకుమారి ఫోన్చేయగా క్రాంతికుమార్ ఫోన్ తీయలేదు. దీంతో ఉదయకుమారి గురువారం ఉదయం క్రాంతికుమార్ ఉంటున్న ఇంటికి వచ్చి చూడగా అప్పటికే క్రాంతికుమార్ బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు లుంగీతో ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పెనమలూరు: పెనమలూరు పోలీసులకు తలనొప్పిగా మారిన రౌడీషీటర్ కొండూరు మణికంఠ(కేటీఎం పండు)పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతనిని జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్కు పంపారు. పెనమలూరు సీఐ వెంకటరమణ గురువారం వివరాలు తెలుపుతూ పెనమలూరు పోలీస్స్టేషన్లో రౌడీషీటర్గా ఉన్న కేటీఎం పండు గతంలో అనేక నేరాలకు పాల్పడ్డారన్నారు. అతను హింసాత్మక నేరాలతో పాటు, గంజాయి రవాణా, హత్య, హత్యాయత్నం కేసుల్లో ఉన్నాడని తెలిపారు. అతనిని జైలుకు పంపిన తరువాత బెయిల్పై వచ్చి మరల నేరాలకు పాల్పడుతున్నాడని, అతని ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దీంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఎస్పీకి నివేదిక అందచేశారు. దీంతో మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేటీఎం పండును అదుపులోకి తీసుకోని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపామని సీఐ వెంకటరమణ తెలిపారు. -
ప్రభల పండుగకు ఘనంగా ఏర్పాట్లు
●యనమలకుదురు కొండపై రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ●15వ తేదీ రాత్రి శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం పెనమలూరు: యనమలకుదురులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గ్రామంలో మహాశివరాత్రి ప్రభోత్సవం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నిర్వహిస్తారు. ఒకే సారి దాదాపు 60 ప్రభలతో కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. లక్షల్లో భక్తులు శ్రీరామలింగేశ్వరస్వామి దర్శనానికి వస్తారు. నందీముద్దలు–గండదీపం భక్తులు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకుంటారు. శ్రీరామలింగేశ్వరుడు మహాశక్తివంతుడని భక్తులకు ప్రగాఢ నమ్మకం. పిల్లలు పుట్టని వారు సంతానం కోసం భక్తులు ధ్వజస్తంభానికి వస్త్రాలు కప్పి నందీముద్దలు (పులగం)పైకి విసురుతారు. అవి చీరకొంగులో పడితే వారికి పిల్లలు పుడతారని నమ్మకం. అలాగే కొండ పైకి ఉన్న మెట్లను కడిగి పసుపు కుంకుమ రాసి మొక్కులు తీర్చుకుంటారు. గండదీపం తలపై పెట్టి నేలపై చీరలు పరిచి ఆ చీరల పై నడుచుకుంటూ కొండ పైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయంలో హనుమంతుడు, నాగేంద్రస్వామి, వీరభద్రుడు, దక్షిణ మూర్తి, చండీశ్వరుడు, నందీశ్వరుడు, నవగ్రహాలు, సప్తమాత్రికులు, సుబ్రహ్మణ్యస్వామి ఇలా అనేక మంది దేవతామూర్తులు కొలువై ఉన్నారు. భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేయటానికి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా ప్రభల ప్రదర్శన మహాశివరాత్రి ఉత్సవాల్లో ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దేవుడి ప్రభతో పాటు కొండ చుట్టూ దాదాపు 60 ప్రభలు రంగురంగుల దీపాలతో అలంకరించి రాతి చక్రాల రథంపై ఉంచి తిప్పుతారు. ప్రభలు 70 అడుగుల ఎత్తులో ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున ప్రభలు ఒకేసారి గిరి ప్రదక్షిణ చేయటం ఇక్కడే జరుగుతుంది. రాధాకృష్ణ కోలాటం, కోయ, హరిణి నృత్యాలు, భేతాళ వేషాలు, ఇలా అనేక కార్యక్రమాలు ప్రభోత్సవంలో నిర్వహిస్తారు. మహాశివరాత్రి కార్యక్రమం వివరాలు... ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు ఈ నెల 14వ తేదీన ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటలకు స్వామివార్లను పెళ్లి కుమారుడు, పెళ్లికుమార్తెను చేస్తారు. 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి విశేష అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ, దర్శనం, 11 గంటలకు దేవుడి ప్రభ ఊరేగింపు, మండపం వద్ద బహిరంగ వేలం పాట ఉంటుంది. మధ్యాహ్నం నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభల ఊరేగింపు చేస్తారు. అర్థరాత్రి 2.16 గంటలకు స్వామివారికి కల్యాణం నేరెళ్ల సత్య వెంకట నారాయణ దంపతులు చేస్తారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఉదయం గ్రామోత్సవం, 17వ తేదీ ఉదయం వసంతోత్సవం, త్రిశూలస్నానం, నందీముద్దలు, రాత్రి స్వామివారి పవళింపుసేవ జరుపుతారు. -
ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం
అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మాక్సిల్లో ఫేషియల్సర్జన్స్ ఇండియా ఏర్పాటై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది తాము చేసే శస్త్రచికిత్సలపై విస్తృతంగా అవగాహన కలిగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో ముఖ గాయాలు, ఓరల్ క్యాన్సర్, ముఖ దవడ కణితులకు శస్త్ర చికిత్సలు , వాటి నివారణ మార్గాలపై విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల డెంటల్ వింగ్స్, దంత వైద్య కళాశాలల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనేది ఈ ఏడాది నినాదంగా తెలిపారు. – నాదెళ్ల కోటేశ్వరరావు, పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు, ఏఓఎంఎస్ఐ -
రీ సర్వే పనులు సమయానికి పూర్తి చేయాలి
రామవరప్పాడు: గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే ప్రాజెక్టు పనులను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని సర్వే, సెటిల్మెంట్ అండ్ భూరికార్డుల డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు సచివాలయంలో గురువారం రీ సర్వేకు సంబంధించిన పనులు, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూర్మనాథ్ ఎల్పీఎం వెక్టరైజేషన్, లాగిన్ డేటా పనులను పరిశీలించారు. జీటీ అయిన వెంటనే సమాంతరంగా వెక్టరైజేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. జీటీ సమయంలో ప్రతి రైతుకు ముందుగానే తెలియపరిచి ఈకేవైసీ యాప్ ద్వారా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్వీఎస్ఎన్ కుమార్, సర్వే ఏడీ మోహనరావు, విజయవాడ తహసీల్దార్ సుగుణ, డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సుబ్బారావు, హుమయూన్ బేగ్, సర్వేయర్లు, వీఆర్ వోలు పాల్గొన్నారు. చల్లపల్లి: ఏపీ పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంఘం, రాష్ట్రీయ గోయల్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో మండల పరిధిలోని లక్ష్మీపురం పశువైద్యశాల వద్ద గురువారం పెయ్యి లేగదూడల అందాల ప్రదర్శన పోటీలు ఏర్పాటుచేశారు. 40 లేగదూడలు పోటీల్లో పాల్గొన్నాయి. పోటీల్లో చిగురుపల్లి పాపారావు, యడ్లపాటి ముక్తేశ్వరరావు, దోనేపూడి నరసింహారావులకు చెందిన లేగదూడలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించాయి. పశుసంవర్థక శాఖ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.నాగభూషణం, చల్లపల్లి ఏడీ డాక్టర్ కేసీవీ రెడ్డి, మండల పశువైద్యాధికారి ఎం.నందకిషోర్, గన్నవరం డీఎల్డీఏ డాక్టర్ పి.రాధిక న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. చిన జీయర్ స్వామి హనుమాన్జంక్షన్ రూరల్: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గానూ ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను విజయ డెయిరీ పార్లర్ ద్వారా విక్రయించేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ ముందుకు రావటం అభినందనీయమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి అన్నారు. బాపులపాడు మండలం వీరవల్లిలోని కృష్ణా మిల్క్ యూనియన్ కామథేను పాల ఫ్యాక్టరీని గురువారం ఆయన సందర్శించారు. చిన జీయర్ స్వామి చేపట్టిన ‘సుఫల రైతు యాత్ర’లో భాగంగా ఇక్కడకు విచ్చేసిన ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. కృత్రిమ ఎరువుల వినియోగంతో నేల, ఆహారం, వాతావరణం పూర్తిగా కలుషితమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తామని రైతులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ మార్గదర్శకాల మేరకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభించే రైతులకు బాసటగా నిలుస్తామని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ అధికారి మహేష్, కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం చిన జీయర్ స్వామి హనుమాన్జంక్షన్లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాలను దర్శించారు. మంగళగిరి టౌన్ : భారతీయ చారిత్రక వారసత్వాన్ని భద్రపరిచే దిశగా భారత్శ్రీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చైన్నె పురావస్తు, పురాతత్వ శాఖ శాసన విభాగ బృందం శిలాశాసనాల డిజిటలైజేషన్ కార్యక్రమానికి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గురువారం శ్రీకారం చుట్టారు. ఈ దేవస్థానంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చైన్నె, ఎపిగ్రాఫీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. ఏసుబాబు బృందం శ్రీకృష్ణదేవరాయల హయాం నుంచి 18వ శతాబ్దం వరకు శిలాశాసనాలను అధ్యయనం చేశారు. ● ఏసుబాబు మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద అక్కన్న, మాదన్న గుహల శిలాశాసనాలు, పాత శివాలయం వద్ద శాసనాలను అధ్యయనం చేశామని పేర్కొన్నారు. ● పురాతన దేవాలయాలు, శిలా నిర్మాణాలు, కోటలు, ఇతర చారిత్రక కట్టడాలపై శాసనాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ రూపంలో భద్రపర్చడం కార్యక్రమ ఉద్దేశమన్నారు. ● శిలాశాసనాల లిపి ఆధారంగా స్థానిక భాషల్లో అనువదింపజేస్తామన్నారు. చెదిరిపోతున్న అక్షరాలను స్పష్టంగా గుర్తించి డేటాబేస్ లో నమోదు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఈ శాసనాలు అందుబాటులో ఉంటాయన్నారు. ● మంగళగిరి పరిధిలోని చారిత్రక ఆధారాలు, శిలాశాసనాలను అధ్యయనం చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అధికారులకు నివేదిక అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. -
ముఖ ఎముకల ఫ్యాక్చర్లు పెరిగాయి
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ముఖ ఎముకలు విరుగుతున్న వారు పెరుగుతున్నారు. దిచక్రవాహనదారులు హెల్మెట్ వినియోగం ద్వారా ముఖ ఎముకలు గాయాలు అవకుండా కాపాడుకోవచ్చు. నోటి క్యాన్సర్, ముఖ దవడ కణితులతో భాదపడుతున్న వారు మా వద్దకు వస్తున్నారు. వారికి విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. హెడ్ అండ్ నెక్ సర్జరీలు, కాస్మోటిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వాటిని ఫేషియల్ సర్జన్స్ సమర్దవంతంగా నిర్వహిస్తున్నారు. సామాన్యులకు సైతం శస్త్ర చికిత్సలు అందుబాటులోకి తేవడం జరిగింది. – డాక్టర్ మెహబూబ్ షేక్, మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఏఓఎంఎస్ఐ -
అధికారుల అలసత్వం...సమస్యలు యథాతథం
●దక్షిణకాశీలో నత్తనడకన శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు ●లక్షలాదిగా వచ్చే భక్తులకు సౌకర్యాలు శూన్యం పెదకళ్లేపల్లి(మోపిదేవి): దక్షిణకాశీగా పేరొందిన పెదకళ్లేపల్లిలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో పుణ్యస్నానాలు సక్రమంగా సాగేనా అనే అనుమానం భక్తులకు కలుగుతోంది. ఉత్తరవాహినిలో పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండప్రదానాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తోందని భక్తుల అచంచల విశ్వాసం. అందువల్ల ఈనెల 15వ తేదీ మహాశివరాత్రి, 16వ తేదీ రథోత్సవానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ దుర్గానాగేశ్వరస్వామివార్లను దర్శించుకుంటారు. ఈ ఏడాది అధికారుల అలసత్వంతో ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. పెదకళ్లేపల్లిలో ప్రధానంగా రెండు స్నానఘాట్లు ఉండగా, జ్యోతిర్లింగ ధ్యాన క్షేత్రం ఘాట్ వద్ద నదీ ప్రహహానికి కోతకు గురై మెట్లు కొట్టుకుపోయాయి. దీంతో భక్తులు నదిలోనికి దిగటానికి చాలా ఇబ్బందికరంగా మారింది. మెట్ల వెంట మందుబాబులు వదిలేసిన సీసాలు పగిలిపోయి పడి ఉన్నాయి. మహిళలు స్నానాలు అనంతరం దుస్తులు మార్చుకునే రూములకు కనీసం డోర్లు లేవు. పితృదేవతలకు పిండప్రదానం చేసేందుకు గతంలో వేసిన షెడ్డులో కూర్చునే బల్లలు పూర్తిగా పగిలిపోయాయి. అక్కడ పిండ ప్రదానం చేయడం ప్రశ్నార్థకంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు సరైన రహదారి సౌకర్యం లేక నరకం చూస్తున్నారు. ప్రస్తుతం వెంకటాపురం గ్రామం నుంచి పెదకళ్లేపల్లి వరకు ప్రధాన రహదారిపై రోడ్డు వేయడానికి ఉన్న రోడ్డును తవ్వించారు. పక్క డ్రైనేజీలో మట్టితీసి రోడ్డు పక్కన పోయడంతో వాహనదారులకు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో జరగనున్న మహాశివరాత్రి మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఎస్టీలపై వేధింపులు :అధికారుల విచారణ
నాగాయలంక: మండలంలోని ఈలచెట్లదిబ్బలో ఎస్టీలపై వేధింపుల విషయంలో గురువారం అధికారులు ఆ గ్రామంలో పర్యటించి విచారణ నిర్వహించారు. గ్రామ కమిటీ, అదే గ్రామానికి చెందిన పీతల వ్యాపారస్తుల నడుమ వివాదం ఆ ప్రాంతం మడ అడవుల్లో పీతల వేట సాగించే యానాదుల(ఎస్టీ) కుటుంబాలకు ప్రాణసంకటంగా మారిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారుల కమిటీ గ్రామంలో పర్యటించినట్లు తహసీల్దార్ సి.హెచ్.వి.ఆంజనేయప్రసాద్ తెలిపారు. అధికారుల బృందంలో బందరు ఆర్డీఓ ఎస్.పోతురాజు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పి.విష్ణు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఎం.ఫణిధూర్జటి, డీఎస్పీ టి.విద్యాశ్రీ , ఫిషరీస్ జేడీ అయ్య నాగరాజు, మార్కెటింగ్ ఏడీ ఎల్.నిత్యానందం, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.మణి, జిల్లా ఎస్టీ వెల్ఫేర్ అధికారి షేక్ సయ్యద్బాబు గురువారం గ్రామంలో పర్యటించి విచారణ జరిపినట్లు తెలిపారు. యానాదులు, గ్రామస్తులు, పీతల వ్యాపారులను విచారించిన అధికారుల బృందం సంబంధిత నివేదికను కలెక్టర్కు సమర్పిస్తారని తెలిపారు. -
వదనం... వికసిత కమలం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిని చూస్తుంటాం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్ ఉంటే పర్వాలేదు. లేకుంటే ముఖ ఎముకలు గాయాలవుతున్న వారు ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంటున్నారు. అలాంటి వారికి విరిగిన ఎముకలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకు రావడంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ కీలకంగా మారారు. అంతేకాదు గ్రహణం మొర్రితో పుట్టిన చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేసి, వారి ముఖాల్లో చిరునవ్వులు చిందేలా చేస్తున్నారు. అంద విహీనంగా ఉన్న ముఖాన్ని కాస్మోటిక్ సర్జరీలు చేసి, అందంగా ఉండేలా చేస్తున్నారు. ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, నోటి క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ సర్జరీలు ఇప్పుడు మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ అలవోకగా చేసేస్తున్నారు. ఇలా వైద్య రంగంలో కీలకంగా మారారు. ఆయా శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 13 అంతర్జాతీయ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం... ఏటా 500కు పైగా శస్త్ర చికిత్సలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రతి ఏటా 500 మందికి పైగా వ్యక్తులకు రోడ్డు ప్రమాదాల్లో ముఖ ఎముకలు ఫ్యాక్చర్స్ అవుతున్నాయి. వారికి మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ శస్త్ర చికిత్సలు చేసి వాటిని సరి చేస్తున్నారు. ముఖంలోని ఏ ప్రాంతంలో ఎముక విరిగినా అత్యంత చాకచక్యంగా సర్జరీలు చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో హెడ్ అండ్ నెక్ సర్జరీలు సైతం ఎక్కువమందికి అవసరం అవుతున్నాయి. ముఖ దవడ మీద కణితులు రావడం, గొంతులో కణితులు వంటి వాటికి కూడా విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న నోటి క్యాన్సర్ ఉమ్మడి కృష్ణాలో రోజురోజుకు నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. టుబాకో, పచ్చి వక్క లు, సున్నం వేసిన తమలపాకులు, పాన్పరాగ్, గుట్కా, జర్దా కిళ్లీలు, హుక్కా, అడ్డ పొగ సేవనం, బీడీలు, చుట్ట, సిగరెట్, హుక్కాలు తాగే వారికి ఎక్కువగా నోటి క్యాన్సర్ సోకుతుంది. కొందరు పాన్పరాగ్, గుట్కా నమిలిన తర్వాత రాత్రి వేళల్లో అలాగే నిద్రిస్తారు. అలాంటివారు త్వరగా నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. జిల్లాలో నమోదవుతున్న ఓరల్ క్యాన్సర్లలో నాలుక, పెదవి, అంగడి, బుగ్గ క్యాన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఏటా 700 వరకూ నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, వారికి మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ విజయవంతంగా శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నారు. రూపు రేఖలు మార్చేస్తారు ప్రస్తుతం మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ కాస్మోటిక్ సర్జరీలు చేసేందుకు డీసీఐ అనుమతిచ్చింది. దీంతో ఫేషియల్ కాస్మోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ముక్కు వంకరగా ఉన్నా, నుదిరు సరిగా లేకున్నా, దవడ రూపం బాగా లేకున్నా వాటి రూపురేఖలు మార్చేసి అందంగా ఉండేలా చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఫేషియల్ సర్జన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేందుకు సైతం డీసీఐ అనుమతి ఇచ్చింది. ఇలా కాస్మోటిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి శస్త్ర చికత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. విరిగిన ముఖ ఎముకలు.. సరిచేసేస్తారు! ఏటా రోడ్డు ప్రమాదాల్లో 500కు పైగా ముఖ ఎముకల ఫ్యాక్చర్స్ నోటి క్యాన్సర్కు అధునాతన శస్త్ర చికిత్సలు గ్రహణం మొర్రి చిన్నారుల్లో సైతం చిరునవ్వులు పూయిస్తారు ముఖాన్ని అందంగా మార్చేందుకు కాస్మోటిక్స్ సర్జరీలు వైద్య రంగంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ కీలకంగా మారిన వైనం నేడు అంతర్జాతీయ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ డే -
ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు..
ఉపాధ్యాయుల జీతాల సమస్యపై పలుమార్లు జిల్లా విద్యాశాఖాధికారులకు వినతిపత్రాలను అందించాం. పలు రూపాల్లో ఉన్నతాధికారుల వద్ద ఉపాధ్యాయులకు నిలిచిన జీతాల సమస్యపై చర్చించాం. అయినా వారు సరైన రీతిలో స్పందించకపోవటంతో రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదు. సమస్య ఏదైనా త్వరతగతిన పరిష్కరించాల్సిన అధికారులు స్పందించకపోవటంతో ఏడు మాసాలుగా పలువురు జీతాలు పొందటం లేదు. ఇప్పటికై నా స్పందించాలి. – ఏ సుందరయ్య, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, ఎన్టీఆర్ జిల్లా -
మెట్టినింట ప్రవేశించిన వీరమ్మతల్లి
ఉయ్యూరు: వీరమ్మతల్లి శ్రీ కనక చింతయ్య సమేతంగా మెట్టినింటిలోకి ప్రవేశించారు. 15 రోజులు పాటు వైభవంగా జరిగిన తిరునాళ్ల ముగియటంతో గురువారం ఉదయం ఆలయం నుంచి అమ్మవారు పల్లకీలో ఊరేగింపుగా తరలివెళ్లి మెట్టినింటిలో కొలువుదీరారు. తిరుగు ప్రయాణంలోనూ అమ్మవారు ఊయల స్తంభాల వద్ద ఊయల ఊగి.. ప్రధాన సెంటరు, రావిచెట్టు సెంటరు, కాలేజ్ రోడ్డు, కాపుల రామాలయం సెంటరు, మెట్టినింటి పరిసరాల్లో గ్రామోత్సవం జరుపు కొన్నారు. అమ్మవారి పల్లకీకి భక్తులు పసుపునీరు ఓరబోస్తూ హారతులు పట్టి స్వాగతం పలికారు. మెట్టినింటి వద్ద అమ్మవారి వంశస్తులు, భక్తులు వసంతోత్సవం జరుపుకొని అమ్మవారి పల్లకీపై పూల వర్షం కురిపిస్తూ విగ్రహాలను మెట్టినింటిలో కొలువుదీర్చి పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన అమ్మవారు ఐలూరు వద్ద కృష్ణానది పాయలో పవిత్రస్నానం ఆచరించి మరలా మెట్టినింటిలో ప్రవేశిస్తారు. -
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ అమీన్పూర్కు చెందిన వి.సుబ్బలక్ష్మి కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. వి. గున్నేశ్వరరావు పేరిట రూ. లక్ష, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎం.ప్రసన్నదేవి కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఈ నెల 17వ తేదీన జిల్లా స్థాయి చెస్ పోటీలను, 22వ తేదీన నున్న జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో సైక్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–13, 15, 17, 19 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 16వ తేదీలోగా స్పోర్ట్స్. ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో ఆధార్ నంబరుతో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. జిల్లా స్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ చూపిన వారు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన వారు ఈ నెల 28వ తేదీ, మార్చి 1 తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఇతర వివరాలకు 98661 34016లో సంప్రదించాల్సిందిగా కోటేశ్వరరావు కోరారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాణాంతక వ్యాధులైన లుకేమియా, తలసీమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి తీవ్రమైన రక్తసంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి పునర్జన్మను ప్రసాదించే స్టెమ్సెల్ దాతల నమోదు కార్యక్రమం గురువారం ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్ఎంసీ)లో నిర్వహించారు. ధాత్రి బ్లడ్ స్టెమ్సెల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 300 మంది వైద్య విద్యార్థులు స్టెమ్సెల్ డొనేషన్కు ముందుకు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ధాత్రి ప్రతినిధి చావా రవీంద్రనాథ్ మాట్లాడుతూ 2009లో తమ సంస్థను స్థాపించినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 6 లక్షల మంది వరకూ స్వచ్ఛంద దాతలు నమోదు అయ్యారన్నారు. అంతేకాకుండా ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న 1700 మందికి విజయవంతంగా స్టెమ్సెల్ మార్పిడి(ట్రాన్స్ప్లాంట్) సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ బెల్లం శివప్రసాద్తో పాటు ధాత్రి వలంటీర్ గోకుల్ కృష్ణ పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణ యాలు తీసుకుందని ఎన్టీఆర్ జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు పేర్కొన్నారు. ఎంఎస్ ఎంఈ సేవారంగ సంస్థలకు భవన నిర్మాణ ప్రణాళికల అనుమతుల దరఖాస్తులను పారిశ్రామిక సంస్థలతో సమానంగా పరిష్కరించడంతో పాటు మినహాయింపులు కూడా అదే విధంగా ఉంటాయని ఆయన తెలిపారు. పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థలు (యూడీఏ), పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని సేవారంగ ఎంఎస్ఎంఈలు ఉద్యమ్ పోర్టల్లో నమోదై ఉన్నట్లయితే ఈ వెసులుబాటు ఉంటుందని వివరించారు. ఆటోమొబైల్ సర్వీసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్య సేవలు, లాజిస్టిక్స్, హోటళ్లు (20 గదుల వరకు), ఫంక్షన్ హాళ్లు, లాండ్రీ–డ్రై క్లీనింగ్ సేవలు, గోదాము సేవలు, పర్యాటక సేవలు వంటి సేవల కార్యకలాపాలకు సంబంధించిన ఎంఎస్ఎంఈలకు తాజా నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. -
బాబోయ్ బస్సు ప్రయాణం!
కంచికచర్ల: వరుస రోడ్డు ప్రమాదాలతో బస్సుల్లో ప్రయాణమంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఒకటి మరువక ముందే మరొకటి సంభవిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. గత అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు మండ లం చినటేకూరు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20మంది మృత్యువాత పడిన ఘటన మరువక ముందే అదే తరహాలో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో చోటుచేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ చూసి ఉండకపోతే.. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్ సిటీ వరుణ్ ట్రావెల్స్ బస్సులో 39మంది ప్రయాణికులు ఉన్నారు. వారితో పాటు డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నారు. కీసర టోల్గేట్ను శనివారం తెల్లవారుజామున 5.26గంటలకు దాటిన బస్సు 65వ నంబర్ జాతీయ రహదారిపై ఎన్ఎస్పీ కెనాల్ సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ నుంచి పొగలు రావటం బస్సు డ్రైవర్ చంద్రమౌళి గుర్తించాడు. బస్సును ఆపి కిందకి దిగి వెనుక ఇంజిన్ వద్దకు వెళ్లి చూడగా పెద్దపెద్ద పొగలు వస్తున్నాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయా ణికులను కేకలు వేస్తూ లేపి కిందకు దించాడు. వారి సామగ్రిని కూడా క్లీనర్ సాయంతో కిందకు దించారు. ఆ కొద్దినిముషాలకే బస్సుకు మంట లు వ్యాపించాయి. డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలియజేశారు. వారు రెండు ఫైర్ ఇంజిన్లను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే బస్సు వెనుకభాగం పూర్తిగా కాలిపోయింది. 39 మంది ప్రయాణికులు బస్సు తగులబడుతుంటే నిశ్చేష్టులయి చూస్తుండిపోయారు. బస్సుల్లో సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవటం వల్ల బస్సుల్లో మంటలు వ్యాపిస్తాయి. ఒక్కోసారి బస్సు ఇంజిన్ వేడెక్కటం వల్ల కూడా మంటలు వస్తాయి. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవటం, మితిమీరిన వేగంతో బస్సులు నడపటం వల్ల ఇంజిన్ వేడెక్కుతుంది. కొన్ని గంటలు ఏకధాటిగా బస్సును నడిపిన తర్వాత ఒక గంట పాటు రోడ్డు పక్కన బస్సును ఆపాల్సి ఉంటుంది. – ఎ. శివారెడ్డి, ఫైర్ అధికారి, కంచికచర్ల -
ఉపాధ్యాయుల వేతన వ్యథలు!
ఏడు మాసాలుగా పలువురు టీచర్లకు జీతాల్లేక ఇబ్బందులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యాశాఖలో చోటు చేసుకున్న నిర్లక్ష్యం ఉపాధ్యాయుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. అధికారుల అలసత్వంతో పలువురు ఉపాధ్యాయులకు ఏడు మాసాల నుంచి జీతాలు అందటం లేదు. ఒకవైపు పని భారం ఎక్కువై పలువురు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ రోగాల బారిన పడుతుంటే.. మరోవైపు మానవ తప్పిదాలతో గందరగోళం చేసి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పదే పదే తప్పులు చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో అవి తరచుగా కొనసాగుతున్నాయి. అసలేం జరిగిందంటే.. జూన్ మాసంలో బదిలీల సందర్భంగా జరిగిన హేతుబద్ధీకరణలో భాగంగా పలువురు ఉపాధ్యాయులను విద్యాశాఖ వివిధ ప్రాంతాలకు బదిలీ చేసింది. అదేవిధంగా బదిలీల ప్రక్రియ అనంతరం ఉన్న సిబ్బంది, ఖాళీలను గమనించి పలువురిని మళ్లీ బదిలీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ క్రమంలో జి. కొండూరు మండలం నుంచి టి. లావణ్య (ఎస్జీటీ)ను విజయవాడ రూరల్ మండలం పీఎస్ఆర్ కాలనీ రామవరప్పాడుకు బదిలీ చేశారు. అలాగే అదే మండలం కవులూరు ప్రాథమిక పాఠశాల నుంచి టి. పూర్ణచంద్రరావు (ఎస్జీటీ)ను ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి జెడ్పీ హైస్కూల్కు ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా సీహెచ్ రాజేశ్వరి (స్కూల్ అసిస్టెంట్)ను మల్కాపురం జెడ్పీ హైస్కూల్ నుంచి పెనుగంచిప్రొలు మండలం కొణకంచికి బదిలీ చేశారు. వీరితో పాటు ఈ విధంగా బదిలీ అయినటువంటి పలువురికి జీతాలను విద్యాశాఖ ఏడు మాసాల నుంచి నిలిపివేసింది. నాలుగు మాసాల క్రితం ఇదే పరిస్థితి నాలుగు మాసాల క్రితం ఇదే విధమైన పరిస్థితుల కారణంగా కొన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు నెలల తరబడి జీతాలు నిలిచిపోయాయి. పదవీ విరమణ, ఉద్యోగోన్నతుల వల్ల ఆయా ఖాళీల్లో అర్హత ఉన్న వారికి పోస్టింగ్ ఇచ్చారు. విద్యాశాఖ ఆ తదుపరి చర్యలు తీసుకోవటంలో, ఉత్తర్వులు జారీ చేయటంలో గందరగోళం చేస్తోందని పలువురు నాయకులు మండిపడుతున్నారు. ఆ క్రమంలోనే ఐదారు మాసాల పాటు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జీతాలు నిలిచిపోవటంతో వారంతా నాయకుల ద్వారా ఉన్నతాధికారులను, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు తిరిగి మామూళ్లను సమర్పించుకొని తిరిగి జీతాలు పొందినట్లు నాయకులు ఒకరిద్దరు వ్యాఖ్యానిస్తున్నారు. దిద్దుబాటు చర్యలేవి? ఇంత పెద్ద ఎత్తున గందరగోళం జరిగినా అధికారులు సరి చేయటంలో అలసత్వం వహిస్తున్నారని యూటీఎఫ్ నాయకులు విమర్శిస్తున్నారు. తప్పు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా సరిదిద్దటానికి ఏడు మాసాలు దాటినా పని జరగలేదంటూ వారు మండి పడుతున్నారు. జిల్లా, మండల విద్యాశాఖాధికారులు చేసిన పొరపాట్ల వల్ల బదిలీల ప్రక్రియ అయిన తరువాత మళ్లీ ఉపాధ్యాయులను బదిలీ చేశారు. అయితే వారికి సంబంధించిన జీతాలు చెల్లించడంలో తగు ఉత్తర్వులు లేకపోవటం వల్ల ఏడు మాసాలుగా జీతాలు లేక ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీనిపై ఎంతమంది అధికారులను కలిసినా స్పందించేవారు కరువయ్యారంటూ ఉపాధ్యాయ సంఘ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మామిడి తోటల పరిశీలన
రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండలంలోని రెడ్డికుంట గ్రామంలో చేబ్రోలు శ్రీనివాసరావు మామిడి తోటలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. రైతులందరూ తప్పని సరిగా ఫ్రూట్ కవర్స్ వాడాలని, వాటిని ఉద్యాన శాఖ రాయితీ ద్వారా ఇస్తున్నారని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే తామరపురుగు నివారణకు రైతులందరూ తప్పని సరిగా నీలి, పసుపు రంగు జిగురు అట్టలు 40–50 చొప్పున ఎకరానికి ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొంత మంది రైతులకు రోటోవేటర్ను కలెక్టర్ చేతుల మీదుగా రాయితీపై అందించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి పి. బాలాజీ కుమార్, ఆర్డీఓ మాధవి, తహసీల్దార్ జె. సుశీలాదేవి, ఎంపీడీఓ రమణ, ఉద్యాన అధికారి, వ్యవసాయ అధికారి, ఎఫ్పీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాటం
దేశవ్యాప్త సమ్మెలో కార్మిక, రైతు సంఘాల నాయకులుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని వామపక్ష పార్టీలు, కార్మిక, రైతు సంఘాలు మండిపడ్డాయి. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్పొరేట్ల మేలు కోసమే తప్ప, కార్మికులకు ఏ మాత్రం ప్రయోజనం లేదని, వాటిని రద్దు చేసేంత వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశాయి. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో విజయవాడలో భారీ కార్మిక ప్రదర్శన జరిగింది. విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు కార్మికులు, రైతులు ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలు, కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు సమ్మెలో పాల్గొన్నాయి. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే.. అనంతరం లెనిన్ సెంటర్లో జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 12ఏళ్లలో దేశంలో సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారన్నారు. కార్మికులు, సంఘాలు పెట్టుకోవడానికి, సమ్మె చేయడానికి, హక్కులకు భంగం కలిగితే అడిగేందుకు వీలు లేకుండా దుర్మార్గంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందన్నారు. గతంలో పార్లమెంట్ చేసిన 29కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. రైతులకు గిట్టుబాటు కల్పిస్తామని చెప్పారని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో 750మంది రైతులు చనిపోయారని, ఆ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. 35కోట్ల మంది కార్మికులు.. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీని వాసరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెలో 35కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. మోదీ కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకురావడమే ఆలస్యం.. రాష్ట్రంలో ప్రభుత్వం వాటిని అమలు చేయాలని తహతహలాడుతోందన్నారు. ఏఐటీయూ సీ నగర కార్యదర్శి ఎం.సాంబశివరావు, సెంట్రల్ సిటీ సీఐటీయూ నగర ప్రధాన కె.దుర్గారావు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుడు పి.ప్రసాద్, లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాథ్, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, మరీదు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ ముఠా అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం, కృష్ణలంక ప్రాంత వాసులకు డబ్బు ఎరగా చూపి వారితో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించే సైబర్ ముఠాను కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం సైబర్ పోలీస్స్టేషన్లో సౌత్ ఏసీపీ డి. పవన్కుమార్, సైబర్ ఏసీపీ బి. రాజశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తమకు వచ్చిన సమాచారం మేరకు యనమలకుదురు తాడిగడప డొంకరోడ్డుకు చెందిన రాయపాటి రవికుమార్, రాయపాటి స్టీఫెన్, యరగుంట్ల బాజీలు స్థానికులను ప్రలోభాలకు గురిచేసి వారితో బ్యాంక్ ఖాతాలను తెరిపిస్తున్నట్లు గుర్తించామన్నారు. వీరంతా ఈ బ్యాంక్ ఖాతాలను కేరళ, మహారాష్ట్ర గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ఛత్తీస్ఘడ్ ప్రాంతాల్లో డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్, ఫిషింగ్, విషింగ్, ఓటీపీ తదితర సైబర్ నేరాలకు వినియోగిస్తున్నారని చెప్పారు. రిమాండ్కు నిందితులు.. యనమలకుదురు వద్ద తాము మెరుపుదాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల వద్ద రూ.3.40లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 21 సెల్ఫొన్లు, 46 ఏటీఎం కార్డులు, 21 చెక్బుక్లు, 16 పాస్బుక్కులు ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను 3వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయన వారికి రిమాండ్ విధించారని వివరించారు. పెనమలూరు: విధుల నుంచి ఇంటికి వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. పోరంకి గ్రామానికి చెందిన భుక్యా బాలు(53) ఆర్టీసీలో గవర్నర్పేట డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతను మంగళవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి బైక్పై బయలుదేరి కామయ్యతోపు పెట్రోల్బంక్ వద్దకు రాగా.. అనారోగ్యానికి గురై బైక్పై నుంచి పడిపోయాడు. స్థానికులు ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలుపగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యానికై చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై భార్య పార్వతీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెనమలూరు: కానూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరుకు చెందిన ఎం.వెంకటేశ్వరరావు కుమారుడు ఎం.శ్రీహర్షవర్థన్(15) కానూరు కెనడీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 9వ తేదీన ఉదయం శ్రీహర్షవర్థన్ నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాడు. రాత్రి 7 గంటలకు మరలా నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తుండగా రాజాచికెన్ సెంటర్ వద్ద ముగ్గురు వ్యక్తులు బైక్పై అతివేగంగా వచ్చి శ్రీహర్షవర్థన్ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో తలకు బలమైన గాయమయింది. అతనిని ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని 19 ఏళ్లలోపు ఉన్న ప్రతి బాలబాలికకు ఆల్బెండజోల్ మాత్ర లు అందేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం వివిధ శాఖల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సంబంధిత శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. 17న పంపిణీ.. డీఎంహెచ్ఓ డాక్టర్ పి. యుగంధర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు, అన్ని యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, నర్సింగ్, సాంకేతిక కళాశాలల్లో ఈ నెల 17న ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆ రోజున మాత్రలు తీసుకోలేని వారికి 24న ‘మాప్–అప్ డే’ నిర్వహించి అందజేస్తామని వెల్లడించారు. జేసీ నవీన్, ఆర్బీఎస్కే కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ హిమబిందు పాల్గొన్నారు. గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ హుండీల్లోని కానుకలను బుధవారం లెక్కించినట్లు సహయ కమిషనర్ ఎన్. సంధ్య తెలిపారు. ఆరు హుండీలలో రూ. 17,38,791 రాగా, అన్నదానం హుండీలలో రూ. 13,488 వచ్చినట్లు చెప్పారు. బంగారం 5.8గ్రాములు, వెండి 92.400గ్రాములు, యూఎస్ఏ డాలర్లు 175, సింగపూర్ డాలర్లు 10 ఉన్నట్లు తెలిపారు. లెక్కింపులో ఆలయ చైర్మన్ కావూరి శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట: పట్టణంలో తాచు పాము హాల్చల్ చేసింది. శాంతి నగర్కు చెందిన కిషోర్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఓ చెట్టు పొదలో బుసలు కొడుతూ ఉన్న పామును చూశారు. దీంతో స్నేక్ క్యాచర్ సుధాకర్కు సమాచారం ఇవ్వగా వెంటనే ఆయన పామును చాకచక్యంగా పట్టుకున్నారు. తాను ఎప్పుడూ ఇలాంటి తాచును చూడలేదని ఐదు అడుగుల పొడవు గల తెల్లటి ఈ పాము చంద్రనాగు జాతికి చెందినదిగా సుధాకర్ తెలిపారు. అనంతరం పామును సమీపంలోని బుదవాడ అటవి ప్రాంతంలో వదిలి వేశారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) నిర్వహించే బీఎడ్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల జనవరి–2026 సెషన్కు, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ (పీజీడీఆర్సీ) కోర్సు జూలై–2026 సెషన్కు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో మాత్రమే ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి బీఎడ్, ప్రవేశ పరీక్షకు ఫిబ్రవరి 27, అలాగే బీఎస్సీ నర్సింగ్, పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ కోర్సుల ప్రవేశ పరీక్షకు మార్చి 5 ఆఖరు తేదీగా యూనివర్సిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు. అర్హతగల అభ్యర్థులు ఇగ్నో వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు విజయవాడ కొత్తపేట హిందూ హైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని గాని లేదా దగ్గరలోని ఇగ్నో అధ్యయన కేంద్రాన్ని లేదా 0866–2565253లో సంప్రదించాలని కోరారు. వెంగనాయకునిపాలెం(పెనుగంచిప్రోలు): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వెంగనాయకునిపాలెంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముళ్లగిరి సురేష్(38) అనే వ్యవసాయ కూలీ అప్పుల బాధతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తొలుత నందిగామ, ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుధవారం మృతదేహానికి పోస్టుమార్టమ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ అర్జున్ తెలిపారు. -
భక్తి నీరాజనం
కృష్ణాజిల్లాగురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026విశ్వమాతకువిజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 537.60 అడుగులకు చేరింది. ఇది 183.3636 టీఎంసీలకు సమానం. మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని చిన జీయర్ స్వామి బుధవారం దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు.సమర్థంగా విధులు నిర్వర్తించండి చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రెవెన్యూ అంశాలు, రెవెన్యూ రికార్డులను పటిష్టపరిచి సమర్థంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్తో కలిసి రెవెన్యూ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. రెవెన్యూ క్లినిక్, 22ఏ కేసుల పరిష్కారం, రీ సర్వే, జాయింట్ ఎల్పీఎం, మీ – కోసం, ఈకేవైసీ, కోర్టు కేసులు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. తప్పులు జరగకుండా రీ సర్వే చేపట్టాలన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు మండలాల్లో సర్వే సిబ్బంది, వీఆర్వోలతో సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించాలన్నారు. రీ సర్వేలో విస్తీర్ణంలో ఐదు శాతానికి మించి తేడా వస్తేనే భూహక్కుదారులతో జాగ్రత్తగా మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించే అంశానికి వచ్చే అర్జీలను సేవల పోర్టల్లో పెట్టాలన్నారు. గ్రామకంఠం, ప్రభుత్వ భూమిని సబ్డివిజన్ చేయలేమని, అయితే భూపరిపాలన ముఖ్య కమిషనర్ కార్యాలయానికి ఈ–ఆఫీస్ ద్వారా ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జేసీ నవీన్ మాట్లాడుతూ.. నాలుగో విడత రీ సర్వే నివేదికలు ప్రతిరోజూ ఆర్డీఓలు తప్పనిసరిగా పంపాలన్నారు. ప్రభుత్వభూమి, ప్రైవేటు భూమి కలిసి ఉంటే దానిని విభజించేందుకు అవకాశం త్వరలో రానుందన్నారు. ఇందు కోసం పాత సర్వే నంబరు తదితర వివరాలు ఈ–ఆఫీస్ ద్వారా పంపాలన్నారు. మీ–కోసం అర్జీల్లో మూడు శాతం గడువు దాటి పరిష్కరిస్తున్నారని, పది శాతం అర్జీలు రీ–ఓపెన్ అవుతున్నాయని వివరించారు. అర్జీల పరిష్కా రంలో నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించాలన్నారు. కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీఓలు బాలసుబ్రహ్మణ్యం, హేలా షారోన్, సర్వే ఏడీ లక్ష్మణ్ పాల్గొన్నారు.భక్తులతో పోటెత్తిన గుణదల పుణ్యక్షేత్రంగుణదల(విజయవాడ తూర్పు): ప్రఖ్యాత క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రమైన గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో మూడు రోజులు ఘనంగా జరిగిన ఉత్సవాలు బుధవారం ముగిశాయి. లోక మాతను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చారు. పుణ్యక్షేత్ర ప్రాంగణాలు, కొండదారులన్నీ యాత్రికులతో నిండిపోయాయి. భక్తులు మరియమాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆఖరి రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలి వచ్చి ఉత్సవాల్లో పాల్గొని తరించారు. లక్షలాదిగా భక్తుల రాక గుణదల ఉత్సవాలకు మూడు రోజుల్లో సుమారు 15 లక్షల మంది యాత్రికులు వచ్చారని ఆలయ నిర్వాహకులు అంచనా వేశారు. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో పాటు నగర వాసులు సైతం కుల మతాలకు అతీతంగా తిరునాళ్లలో పాల్గొనటం ప్రాధాన్యత సంతరించుకుంది. భక్తుల రాకతో పుణ్యక్షేత్ర ప్రాంగణాలన్నీ కిక్కిరిసి కనిపించాయి. ఉత్స వాల ముగింపు ప్రార్థనలకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ను ఉత్సవ నిర్వాహకులు వేదిక పైకి ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. మరియమాత దయతో నగరంతో పాటు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరైన భక్తులందరికీ ఆ తల్లి దీవెనలు ఉండాలని కాంక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తదితరులు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వమానవులు శాంతి, సమాధానాలతో జీవించాలంటే క్రీస్తు మార్గమే శరణ్యమని విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరిగిన ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. సమాజంలో అసమానతలు తొలగిన నాడు దేశం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. సర్వ మానవాళి కోసం తన ప్రాణాలను అర్పించిన క్రీస్తు చూపిన శాంతి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరిగిన మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశా యని ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు అందరిపై మరియతల్లి దీవెనలు ఉండాలని కాంక్షించారు. అనంతరం అమెరికాకు చెందిన బిషప్ షమీంద్ర జయవర్ధన, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం.గాబ్రియేలు తదితర గురువులు సమష్టి దివ్యబలి పూజ సమర్పించి, భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. 7 -
భూమాతను కాపాడుకోవాలి
అయోధ్య(మోపిదేవి): మానవ, జంతు, పక్షుల వంటి సకల జీవరాశులకు మాతృమూర్తి భూ మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. మోపిదేవి జెడ్పీ పాఠశాల ఆవరణ నుంచి అయోధ్య గ్రామం వరకు సుఫల రైతు పాదయాత్ర బుధవారం చేపట్టారు. అందులో భాగంగా ఉదయం ఆయన సందేశమిస్తూ అన్ని రకాల సుఖాలు అందిస్తున్న భూమాతను ఆనందింపజేయాల్సి ఉందన్నారు. దీనికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి సన్నిధి నుంచి మోపిదేవిలంక, నడిమిలంక, కోసూరువారిపాలెం, మేళ్లమర్తిలంక, ఉత్తరచిరువోలులంక గ్రామాల మీదగా సుమారు 8 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి అయోధ్య చేరుకున్నట్లు తెలిపారు. మచిలీపట్నం సమీపంలోని తరకటూరులో పూర్తి ఆర్గానిక్స్ సాగుతో అత్యధిక ఆదాయం పొందుతున్న విజయారావ్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, అధికారులు, రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి -
రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలి
ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కావాలనే అక్రమ కేసులు, దాడులతో రాక్షస పాలన సాగిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్యం మంట కలుపుతున్న వేళ గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో బుధవారం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీమంత్రి ఉషశ్రీ చరణ్ విడివిడిగా జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకుని అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పరిశీలించారు. అనంతరం అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడిచేయడం ఉగ్రవాదుల చర్య అని అన్నారు. దాడి జరిగిన వీడియోలు చూస్తే పక్కా ప్రణాళికతో దాడి జరిగినట్లు తెలుస్తోందన్నారు. అంబటి రాంబాబు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా -
శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి ఈఓ శీనానాయక్ తెలిపారు. తన చాంబర్లో ఆలయ ఇంజినీరింగ్ అధికారులు, ఏఈఓలు, సూపరిండెంటెంట్, ఇతర ముఖ్య అధికారులతో శివరాత్రి ఏర్పాట్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వ హించారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామిని దర్శించుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మల్లేశ్వర ఆలయ ప్రాంగణంలో అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దుర్గాఘాట్, వీఐపీ స్నానఘాట్లలో ఏర్పాట్లపై చర్చించారు. ఏసీ రంగారావు, ఈఈ కోటేశ్వరరావు, ఏఈఓలు సుధారాణి, చంద్రశేఖర్, గంగాధర్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు. పెనమలూరు: మండలంలోని యనమలకుదురు కొండపై వేంచేసిన శ్రీపార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని రాజమండ్రి దేవదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ త్రినాథరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన ఆలయానికి వచ్చి ఏర్పా ట్లను పరిశీలించారు. భక్తులకు సకల వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ ఎన్వి.సాంబశివరావు, ఆలయ ఈఓ ఎన్.భవాని పాల్గొన్నారు. శివ రాత్రి పండుగ రోజు వీఐపీ దర్శనాలకు ప్రత్యేక సమయాలు కేటాయించా మని ఈఓ భవాని తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు వీఐపీలు స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆలయానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి చెందిన ఎం.వెంకటేశ్వర్లు, లక్ష్మీరాజ్యం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. తమ కుటుంబ సభ్యులు కె. దీిప్తి, రాజేష్, జి.విద్య, సతీష్ సూర్యనారాయణ పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన మెట్టపల్లి రామదేవి అన్నదానానికి రూ.1,01,116 విరాళం సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితుడు రామబ్రహ్మం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.78.12 లక్షలను కానుకలు, మొక్కుబడిగా సమర్పించారు. హుండీ కానుకలను బుధవారం అమ్మవారి మండపంలో లెక్కించారు. 71 రోజులకు రూ.78,12,667 నగదు, 50 గ్రాముల బంగారం, 220 గ్రాముల వెండి సమకూరాయని ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. 12 యూఎస్ఏ డాలర్లు, పది సౌదీ రియాల్స్, ఒక మలేషియా రింగిట్, 20 ఆస్ట్రేలియా డాలర్లు కూడా వచ్చాయన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. ఆలయ ఈఓ, గ్రూపు ఆలయాల ఈఓ సురేష్, ఈఈ ఎల్.రమాదేవి, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. -
న్యాయం కోసం రోడ్డెక్కిన రైతులు
కంచికచర్లలో ధర్నాకంచికచర్ల: అమరావతి ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వ్యవసాయ కార్మిక రంగ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కల్యాణ్తో పాటు పలువురు రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ ఓఆర్ఆర్కు భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నాలుగు రెట్లు న్యాయ సమ్మతమైన పరిహారం అందజేయాలని, ఓఆర్ఆర్ వెడల్పు 70 మీటర్లకు కుందించాలని డిమాండ్ చేశారు. సారవంతమైన విలువైన భూము లు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. అమరావతిలో ప్లాట్లు ఇవ్వాలి.. ఓఆర్ఆర్లో కోల్పోతున్న భూములు సీఆర్డీఏ అమరావతి జోన్ పరిధిలో ఉన్నాయని ఈ ప్రాంతా న్ని ప్రొటెన్షియల్ ఏరియాగా గుర్తించాలన్నారు. అలైన్మెంట్ వెడల్పు 140 మీటర్ల నుంచి 70 మీటర్లకు కుదించాలని సమీప డోర్ నంబర్లలో నమోదైన విలువల ఆధారంగా భూముల ధరలు నిర్ణయించాలని బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నష్ట పరిహారంతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులకు ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఓఆర్ఆర్ కోసం భూములను కోల్పోతున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని తెలిపారు. ఈ మేరకు కంచికచర్ల తహసీల్దార్ కార్యలయంలో డీటీ మానసకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు గంగిరెడ్డి రంగారావు, నన్నపనేని వీఎల్ నరసింహారావు, అల్లాడి కోటేశ్వరరావు, నన్నపనేని భాస్కరరావు, బుడ్డి సూర్యప్రకాష్, కపలవాయి సుబ్బారావు, సూర్యదేవర రమ తేళ్ల శ్రీనివాసరావు, చెన్నుపాటి కృష్ణ, చంద్రం, జొన్నలగడ్డ వీరబాబు, సాయిరాం, కాపా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే లక్ష్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గదర్శకం, శిక్షణ, వనరులు అందించి ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ (శాప్) చైర్మన్ ఏ.రవినాయుడు, ఎండీ భరణి చెప్పారు. విజయవాడ బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలోని శాప్ ప్రధాన కార్యాలయంలో శాప్ లీగ్స్ అమలు విధానంపై వీడియో కాన్ఫరెన్స్ బుధవారం జరిగింది. రవి నాయుడు మాట్లాడుతూ శాప్ లీగ్స్ కేవలం క్రీడా పోటీలు నిర్వహించే కార్యక్రమంగా మాత్రమే కాకుండా గ్రామ స్థాయి నుంచి క్రీడా సంస్కృతిని బలోపేతం చేసేలా నిర్వహిస్తున్నామన్నారు. ఫిట్నెస్, పోషకాహారం, శారీరక సామర్థ్యాల ఆధారంగా క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి క్రీడా కిట్లు, అవసరమైన పరికరాలు, ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా వారిని క్రీడా అకాడమీలతో అనుసంధానం చేసి నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. 32 విభాగాల్లో.. శాప్ ఎండీ ఎస్. భరణీ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో మొత్తం 32 క్రీడా విభాగాల్లో శాప్ లీగ్స్ నిర్వహిస్తున్నామని, ఈ లీగ్స్ ద్వారా రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి రావడం ఖాయమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. శాప్ ఏవో ఆర్.వెంకట రమణ నాయక్, క్రీడా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాప్ చైర్మన్ రవి నాయుడు, ఎండీ భరణి -
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడం మానుకోండి
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు అవనిగడ్డ: కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని, వివాదాలు తలెత్తి నియోజకవర్గంలో ఏదైనా జరిగితే ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్దే బాధ్యతని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు హెచ్చరించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చినా, మేధావులు వారిస్తున్నా పట్టించుకోకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా స్థానిక కూటమి నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు. టీడీపీ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు ఇటీవల మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, బాత్రూంలో వాడే కెమికల్స్ కలిపారని చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు మెప్పుకోసం కారుకూతలు కూస్తున్న వ్యక్తులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇది గుంటూరు కాదు.. దివిసీమ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు. రూ.108కోట్లు మంజూరు చేయించినా.. ఎదురుమొండి వారధిని ఎందుకు గాలికి వదిలేశారో చెప్పాలన్నారు. అవనిగడ్డ డంపింగ్ యార్డు మార్చలేక పోయారని, ఎడ్లంక వారధి ఊసేలేదని, బండికోళ్లంక వద్ద కృష్ణానదిపై వారధి నిర్మాణం కోసం తాను కృషి చేస్తే ఆ విషయం పట్టించుకునే తీరిక ఎమ్మెల్యేకి లేకపోవడం దారుణమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, వైఎస్సార్ సీపీ పంచాయితీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు రేపల్లె శ్రీనివాసరావు, మహిళా విభాగం నాయకురాలు మానేపల్లి అరుణ, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్నజీర్బాషా, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి గాజుల జయగోపాల్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు చింతలపూడి బాలు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు
శ్రీకాకుళం(ఘంటసాల): తెలుగు బాష ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేసేలా శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు ఉన్నాయని ఎస్పీ పి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు ఆలయ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ దేవదాయ శాఖ సహకా రంతో దివి ఐతిహాసిక మండలి ఆధ్వర్యంలో ఆంధ్ర భోజ శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు రెండో రోజు బుధవారం వైభవంగా జరిగాయి. ఈ సంద ర్భంగా ఎస్పీ విద్యాసాగర్నాయుడు మాట్లాడుతూ.. తమిళుల మాదిరిగా మనం కూడా తెలుగు బాషను గౌరవిస్తూ ప్రేమించాలన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కమిషన్ చైర్మన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ.. తెలుగును రాజభాషగా చేసిన యోధుడు శ్రీకృష్ణ దేవరాయులన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు బాషకు పూర్వపు ఔన్నత్యం, పునరుద్ధరణే ఈ ఉత్సవాల ద్యేయమన్నారు. ముందుగా శ్రీకృష్ణ దేవరాయుల విగ్రహం వద్ద ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్తో కలసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ విద్యా సాగర్నాయుడు, తేజస్వి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్గుమ్మడి గోపాలకృష్ణ, సాహితీవేత్త అద్దంకి శ్రీనివాసరావు, నాట్యాచార్య కె.వి.సత్యనారాయణను ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి.సాయిబాబు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవాల్లో పిల్లలకు చైల్డ్ ట్రాకింగ్ ట్యాగ్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మేరీమాత ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పిల్లలు తప్పిపోకుండా వారి చేతికి చైల్డ్ ట్రాకింగ్ ట్యాగ్లు వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ నేతృతంలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సీ్త్ర శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ, ఫోరమ్ ఫర్ చైల్డ్ వారు బృందాలుగా ఏర్పడి చిన్న పిల్లలకు ట్రాకింగ్ ట్యాగ్లు వేస్తున్నారు. కార్యక్రమంలో మాచవరం సీఐ డీవీ రమణ, ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అరవ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కోడూరుపాడు కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత
●వరుస మరణాలతో గ్రామస్తుల ఆగ్రహం ●కార్మికుడి మృతదేహంతో ఆందోళన హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కోడూరుపాడులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద కార్మికుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త తత ఏర్పడింది. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికుల వరుస మరణాలు మిస్టరీగా మారాయి. ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న కెమికల్ వల్ల కార్మికులకు ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, ఇప్పటికే ఏడుగురు మృత్యువాత పడ్డారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఎ.సీతారామపురం గ్రామానికి చెందిన తాళ్లపూడి కాన్కుమార్ (30) మృతి చెందాడు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మి కుడిగా పని చేస్తున్న కాన్కుమార్కు ఏడాదిన్నర క్రితం అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రంగా ఉండ టంతో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందినా ఫలితం లేకుండాపో యింది. విజయవాడ ప్రభుత్వా స్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కెమికల్ ఫ్యాక్టరీ ఎదుట కాన్కుమార్ మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యాజ మాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషపూరిత రసాయనాలు తయారు చేస్తూ, అమాయక యువత ప్రాణాలు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ.సీతారామపురం గ్రామానికి చెందిన తొమ్మిది మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పని చేయగా, ఇప్పటికే ఏడుగురు మృత్యువాత పడ్డా రని, మిగిలిన వారు అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారని వివరించారు. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ బాధితుల పక్షాన ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తక్షణం వచ్చి, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో తయారవుతున్న కెమికల్స్పై సమగ్ర విచారణ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న వీరవల్లి ఎస్ఐ సురేష్ ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత నష్టపరిహారం చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వటంతో బాధితులు ఆందోళన విరమించారు. -
భర్త ఆచూకీ కోసం పోలీస్స్టేషన్ ఎదుట గర్భిణి ఆందోళన
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): తన భర్తను అతని అన్న, తల్లి ఎక్కడో నిర్బంధించారని, ఆయన ఆచూకీ తెలపమంటే పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ నిండు గర్భిణి తన బంధువులతో కలిసి సింగ్నగర్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన ఘటన మంగళవారం జరిగింది. బాధితు రాలి కథనం మేరకు.. సింగ్నగర్ పైపులరోడ్డు సమీపంలో నివసిస్తున్న పినపాల లిఖితకు జ్ఞానపవన్ కుమార్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. పెళ్లయిన కొంతకాలం వరకూ తన భర్త, అత్త పుణ్యలక్ష్మీదుర్గ తనను బాగానే చూసున్నారని, ఆ తరువాత వారిద్దరితో పాటు తన బావ ఉదయ్కిరణ్ తనను వేధింపులకు గురిచేస్తున్నారని లిఖిత ఆరోపించింది. గతేడాది టూ టౌన్ పోలీస్స్టేషన్లో 498ఏ కింద కేసు పెట్టగా ఆ తరువాత తాను, తన భర్త పటమటలో వేరు కాపురం పెట్టుకుని నివసిస్తుండగా, అత్త, బావ అక్కడకు కూడా వచ్చి తనను వేధింపులకు గురిచేశారని, దీనిపై పటమట పోలీస్స్టేషన్లో కేసు పెట్టినట్లు తెలిపింది. ఆ తరువాత నుంచి తన భర్త జ్ఞానపవన్కుమార్ ఆచూకీ తెలియడం లేదని, తన అత్త, బావలే ఎక్కడో నిర్బంధించి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తూ సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నెల రోజుల నుంచి పట్టించుకోవడం లేదని, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించింది. లిఖిత నోటీసులు తీసుకోవడం లేదు తన భర్త ఆచూకీ తెలపాలంటూ లిఖిత నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని సింగ్నగర్ సీఐ బి.హెచ్.వెంకటేశ్వర్లు తెలిపారు. గత డిసెంబర్ 25వ తేదీన లిఖితే తనపై దాడి చేసి గాయపర్చిందని ఆమె అత్త పుణ్యలక్ష్మీదుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. ఆ కేసుకు సంబంధించి 41ఏ నోటీసులు తీసుకోవడానికి రావాలని లిఖితను ఎన్నిసార్లు పిలిచినా స్టేషన్కు రావడం లేదన్నారు. పటమటలో లిఖిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు సింగ్నగర్ పోలీస్స్టేషన్కు బదిలీ కావడంతో గత నెల 19వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కేసు విచారణకు ఆమె సహరించకపోగా ఇలా పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపడతామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తెలకు గాయాలు
పెనుగంచిప్రోలు: రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని కొణకంచి క్రాస్రోడ్స్ వద్ద మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తెలంగాణకు చెందిన వరికుప్పల వెంకటేష్ బైక్పై భార్య రజిత, కుమార్తె అమృత వర్షిణితో కలిసి అమరావతి నుంచి సూర్యాపేట బయలుదేరాడు. ఎదురుగా వెళ్తున్న మరో బైక్ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయారు. వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ రజిత కుడి చేయిపై వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. ఆమె కుమార్తె అమృత వర్షిణి ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగిన సమయంలో స్థానిక పోలీసులు అక్కడే ఉండ టంతో వెంటనే అంబులెన్స్లో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆప్కాస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఉద్యోగులను మళ్లీ ఏజెన్సీలనే అగాథంలోకి నెట్టొద్దని గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాణ్యం వేణు, అల్లం సురేష్బాబు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రైవేటు ఏజెన్సీల చేతిలో మోసపోయి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అధ్వాన స్థితిలోకి వెళ్లిన దశలో వారి సంక్షేమం ఆప్కాస్ ఏర్పాటైందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఆప్కాస్ను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందని విమర్శించారు. నూతన ఉద్యోగాలన్నీ మళ్లీ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెబితే చిరుద్యోగులకు మళ్లీ ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తంచేశారు. ఆప్కాస్ను బలోపేతం చేయాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు అన్నీ ఆప్కాస్ ద్వారానే చేపట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో చాలీచాలని జీతా లతో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, సంక్షేమం తదితరాలపై అసెంబ్లీలో చర్చించాలని కోరారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు అసోసియేషన్ తరపున లేఖలు రాశా మని వేణు, సురేష్ బాబు తెలిపారు. ట్రావెల్స్ బస్సు ఢీ.. వృద్ధుడి మృతి కంకిపాడు: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ప్రొద్దుటూరు అడ్డరోడ్డు వద్ద బందరు రోడ్డుపై ఉయ్యూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్రావెల్ బస్సు రోడ్డుపై నడుస్తున్న కడవకొల్లు గ్రామానికి చెందిన వీరుల రంగారావు (70)ను ఢీకొంది. తీవ్రంగా గాయపడి అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అతను మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
శైవ క్షేత్రాలకు శివరాత్రి శోభ
● మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు ●తిరునాళ్ల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు● ఈ నెల 14 నుంచి కల్యాణ మహోత్సవాలు ముక్త్యాల సమీపంలోని కోటిలింగాల ఆలయం ముస్తాబవుతున్న దాములూరు కూడలి సంగమేశ్వర స్వామి ఆలయంముక్త్యాల వద్ద ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానది నందిగామ రూరల్/జగ్గయ్యపేట: మహా శివరాత్రికి శైవక్షేత్రాలు ముస్తాబువుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఉత్తరవాహినిగా పేరొందిన జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీభవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం, నందిగామ మండలం దాములూరు కూడలి గ్రామంలో వేంచేసియున్న పర్వతవర్ధిని సంగమేశ్వర స్వామి ఆలయాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు ఆలయాలకు శివరాత్రి ఉత్సవాల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిస్తారు. సంగమేశ్వ ఆలయం నాలుగు రోజుల పాటు జరగనున్న కల్యాణ మహోత్సవాలకు సిద్ధమైంది. ఈ ఆలయ సమీపంలోని వైరా కట్టలేరులో పితృదేవతలకు పిండ ప్రదానాలు, తదితర కార్యక్రమాలను నిర్వహించటం ఆనవాయితీ. సంగమేశ్వర ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న కాఫీ, టీ, భోజనం, చిన్న పిల్లల బొమ్మలు, చిత్ర పటాలు, మిఠాయిలు, తదితరాలు విక్రయించే స్టాళ్ల ఏర్పాటు, భక్తుల వాహనాల పార్కింగ్కు పంచాయతీ సిబ్బంది ఆలయం వెలుపల ఉన్న ఖాళీ స్థలాన్ని యంత్రాలతో చదును చేస్తున్నారు. ఆలయ ఆవరణలో షామియానాలు, క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈఓ నరసింహ మూర్తి, ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, జల్లు, తొట్టె స్నానాలు, తదితర అన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సంగమేశ్వరాలయంలో ఈ నెల 14 నుంచి 17 వరకు స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయని ఈఓ తెలిపారు.15వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా రుద్రహోమం, ఎదురుకోలోత్సవం, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామి వారి దివ్య కల్యాణం జరుగుతాయని వివరించారు. ఉత్తరవాహిని.. ముక్త్యాల జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భవాని ముక్తేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరవాహినిగా కృష్ణా నది ప్రవహిస్తోంది. శివరాత్రి ఉత్సవాల సమయంలో పుణ్య కృష్ణానదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఎంతో పవిత్రమైన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ నెల 15న శివరాత్రికి ఒక్కరోజే లక్షల సంఖ్య లో భక్తులు హాజరై స్వామివారిని కల్యాణాన్ని తిలకిస్తారు. శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు పనుల్లో నిమగ్నమయ్యారు. నదీ ఒడ్డున పవిత్ర స్నానాలు ఆచరించేందుకు స్నానఘాట్లను ప్రత్యేక సిబ్బందితో శుభ్రం చేయించారు. కోటిలింగాలు ముస్తాబు ముక్త్యాల సమీపంలోని పంచముఖ అమృత లింగేశ్వరస్వామి (కోటిలింగాలు) ఆలయం మహాశివరాత్రికి ముస్తాబైంది. కోటిలింగాలను ఇక్కడ ప్రతిష్టించేందుకు 108 ఉప ఆలయాలు ఏర్పాటు చేశారు. ఏటా మహాశివరాత్రి, కార్తిక మాసాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శివలింగాలు ప్రతిష్టిస్తుంటారు. ఆలయం ముందు భాగంలో ఽ19 అడుగుల ద్యాన శివుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయటం విశేషం. ఇక్కడ 19 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. -
సకల కళా వల్లభుని స్మరణకే మహోత్సవాలు
శ్రీకాకుళం(ఘంటసాల): శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుజాతికి చేసిన మహోపకారాన్ని స్మరించుకోవడానికే ఈ మహోత్సవాలని రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి, రాష్ట్ర ప్రభుత్వ హైపవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ యూవీ దుర్గా ప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువు దేవాలయ ప్రాంగణంలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ సహకారంతో దివి ఐతిహాసిక మండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జస్టిస్ యూవీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ బహు భాషా కోవిదుడైన శ్రీకృష్ణ దేవరాయలకు ఆంధ్ర మహావిష్ణువు స్వప్నంలో ఇచ్చిన ఆదేశాలతో తెలుగు బాషలో ఆముక్త మాల్యద కావ్యాన్ని శ్రీకాకుళం దేవస్థానంలో గావించడం, అది పంచ మహాకావ్యాల్లో ఒకటిగా ఖ్యాతి గడించడం శ్రీకాకుళం గ్రామ ప్రజలకు గర్వకారణమన్నారు. శ్రీకాకుళం నుంచే ప్రారంభం.. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుజాతి చరిత్ర శ్రీకాకుళం నుంచే ప్రారంభమైందన్నారు. ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం నుంచే ఆంధ్ర రాజుల పాలన ప్రారంభించారన్నారు. అనంతరం ఆముక్త మాల్యద మండపంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి, పక్కనే ఉన్న కాసుల పురుషోత్తమ కవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా శ్రీకాకుళేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
బజారులో దళారీ భోజ్యం!
పచ్చనేతల కబంధ హస్తాల్లో రైతు బజార్లు సాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతు బజార్లపై ‘పచ్చ’ గద్దలు వాలిపోయాయి. మార్కెట్ సిబ్బందితో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నాయి. బజార్లలో షాపుల కేటాయింపు మొదలు, కూరగాయల సరఫరా వరకు అన్నీ తామై వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నాయి. కనీసం రైతులు తాము పండించిన కూరగాయలను సైతం అమ్ముకోనివ్వకుండా, తాము చెప్పిన వారి వద్దే కూరగాయలు తీసుకోవాలని దుకాణాల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ దందాలో విజయవాడకు చెందిన ఓ వ్యాపారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రైతు బజార్లలోనూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నీ రైతు బజార్లలో ఈ దందా కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు కూరగాయలపై కేజీకి రూ.4 చొప్పున నెలకు రూ. 25లక్షల నుంచి రూ. 35 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంటున్నారు. షాపుల కేటాయింపునకు దుకాణదారుల నుంచి రూ.4లక్షలు, స్థానికంగా రైతు బజార్ల పరిధిలో ఉండే పచ్చ నేతలకు నెలకు రూ.7లక్షల మామూళ్లు ముట్టజెబుతున్నట్లు సమాచారం. రోజువారీ మార్కెట్ ధరలు కూడా వారే నిర్ణయిస్తూ, మార్కెట్పై పెత్తనం సాగిస్తూ, రోజుకు లక్షల రూపాయలు దండుకొంటున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. మేం చెప్పిన వారి వద్దే కొనాలి.. ప్రధానంగా ఇంగ్లిష్ కూరగాయలుగా పేర్కొనే క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, బీన్స్, కీరతో పాటు పచ్చి మిర్చి, టమాట, అల్లం వంటి వాటిని రైతు బజార్లలో కొంత మంది వ్యాపారులు విజయవాడ, గుంటూరు, హనుమాన్జంక్షన్ తదితర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చి, రైతు బజార్లలో దుకాణదారులకు హోల్సేల్గా విక్రయిస్తారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా పచ్చనేతలు, మార్కెటింగ్ సిబ్బంది కుమ్మకై తాము చెప్పిన వారి వద్ద నుంచే కొనాలంటూ హెచ్చరిస్తున్నారు. గతంలో కూరగాయలు సరఫరా చేస్తున్న వ్యాపారులకు, ప్రస్తుతం మార్కెటింగ్ సిబ్బంది సూచిస్తున్న విజయవాడ వ్యాపారికి మధ్య గొడవలు తలెత్తడంతో విషయాలు బహిర్గతం అయ్యాయి. అనధికారిక షాపులు.. విజయవాడ పటమట రైతు బజారులో అధికారికంగా 110 షాపులుండగా, అనధికారికంగా ప్రస్తుతం 200కు పైగా షాపులున్నాయి. ఇందులో ఫుట్పాత్లకు అటు, ఇటు కూడా షాపులున్నాయి. ఇక్కడ ఆ కూరగాయలు సరఫరా చేసే వ్యాపారి ఆధీనంలో ఏకంగా 24 షాపులు ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఒక్కో షాపునకు రూ.4లక్షలు దుకాణదారుల నుంచి వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పెనమలూరు, ఉయ్యూరు రైతు బజార్లు సైతం ఈ విజయవాడ వ్యాపారి ఆధీనంలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడలో రైతు బజార్లను పర్యవేక్షించే వారితోపాటు, అతను ఉన్నతాధికారులను సైతం బుట్టలో వేసుకొని ఆడింటి ఆట, పాడింది పాటగా దోపిడీ సాగిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు విజయవాడ సెంట్రల్ నందిగామ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి, టాస్క్ఫోర్స్: గన్నవరం రైతుబజార్ కేంద్రంగా టీడీపీ నేత సాగిస్తున్న దోపిడీ బహిర్గతమైంది. ఆ నేతకు విక్రయదారులు అడ్డం తిరగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నేతకు కూరగాయల సరఫరా అనుమతుల కోసం సాక్షాత్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిఫార్సు చేయడం గమనార్హం. వివరాలు ఇవి.. రైతుబజార్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప సరఫరా కాంట్రాక్ట్ను ఇటీవల ఎమ్మెల్యే సిఫార్సు మేరకు గన్నవరానికి చెందిన టీడీపీ నేత మోర్ల నాగబాబు నిర్వహిస్తున్నారు. రైతుబజార్ ఎస్టేట్ అధికారితో కుమ్మకై ్క ఆ నేత స్టాల్స్ నిర్వాహకులు తాను సరఫరా చేసే కూరగాయలనే విక్రయించాలని నిబంధన పెట్టారు. దీనికితోడు రైతుల వద్ద కొనుగోలు చేసే ధర కంటే అదనంగా వసూలు చేస్తున్నాడు. దీనివల్ల విక్రయదారులు ఆర్థికంగా నష్టపోతుండటంతో ఆ నేత వద్ద కూరగాయలు కొనుగోలు చేయమని తేల్చిచెప్పడంతో వివాదం మొదలైంది. అయినప్పటికీ నాగబాబు తన మనుషులతో విక్రయదారులను బెదిరింపులకు పాల్పడుతున్న ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే రైతుబజార్ నిబంధనలకు వ్యతిరేకంగా నాగబాబుకు కాంట్రాక్ట్ను అప్పగించాలని ఎమ్మెల్యే సిఫార్సు లేఖను మార్కెంటింగ్ శాఖకు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇది చిలికి చిలికి గాలివానలా మారడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించి, ఆ కాంట్రాక్ట్ నుంచి నాగబాబును తాత్కాలికంగా తప్పించారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026మైలవరం: డ్రగ్స్పై దండయాత్ర సైకిల్ ర్యాలీ ఇప్పటి వరకు 201 కి.మీ. పూర్తయినట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం 15వ రోజు జి.కొండూరు పరిధిలో కొనసాగిందన్నారు. అక్రమ మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ గన్నవరం మండలం సావరగూడెం గ్రామస్తులు మంగళవారం ఆందోళన బాట పట్టారు. 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.0923 టీఎంసీలు. -
మైనింగ్ నిలిపివేయాలని ఆందోళన
గన్నవరం రూరల్: మండలంలోని సావరగూడెం గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. మన ఊరు–మన భవిష్యత్ అని పేర్కొంటూ ‘బాంబు పేలుళ్లు వద్దు.. అక్రమ మైనింగ్ వద్దు అని నిదిస్తూ మంగళవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి మైనింగ్ జరుగుతున్న క్వారీ వద్దకు చేరుకుని నిరసన దీక్ష చేపట్టారు. సావరగూడెం గ్రామాన్ని ఆనుకుని ఉన్న వెదురుపావులూరులో సర్వే నంబరు 717–2లో కొండపోరంబోకు ఉంది. దీనిలో ఏపీఎస్పీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, శిక్షణ కేంద్రానికి ప్రభుత్వం భూమి కేటాయించింది. నిర్మాణాలు చేసేందుకు ఆ ప్రాంతాన్ని చదును చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏడాదిగా ఇక్కడి నుంచి మట్టిని తరలిస్తున్నారని, అక్రమ మైనింగ్ చేస్తున్నారని, రాత్రి వేళల్లో బాంబ్ బ్లాస్టింగులు చేస్తున్నారని సావరగూడెం గ్రామస్తులు ఆరోపించారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తరువాత జరుగుతున్న బ్లాస్టింగ్ ధాటికి తమ ఇళ్లు కదిలిపోతున్నాయని, ఇంట్లో సామగ్రి దెబ్బతింటోందని, తాగునీరు, సాగునీటి బోర్లు పూడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ జరుగుతున్న పరిసరాల్లో పెట్రోల్ బంక్, గ్యాస్ గోడౌన్ ఉన్నాయని వివరించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై గన్నవరం తహసీల్దారు కె.వి.శివయ్యను వివరణ కోరగా.. గ్రామస్తుల ఆందో ళన విషయం తన దృష్టికి రాలేదన్నారు. మైనింగ్ శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. వీఆర్వో శేఖర్ ఆందోళనకారుల అభ్యంతరాలను నమోదు చేసుకున్నారు. ముస్తాబాద సీపీఎం నాయకులు కై లే ఏసుదాసు, ఆంతోని, బాలశౌరి, ఏడుకొండలు తదితరులు నిరసన శిబిరం సందర్శించి గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు. -
‘రైజ్’తో మహిళల ఆర్థిక సాధికారత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ (రైజ్) కేంద్రం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పాటు లభిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలంలోని గుంటుపల్లిలో రైజ్ కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలు ఆయన పరిశీలించారు. మహిళలకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు, మార్కెటింగ్ సహకారం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. మహిళలు రైజ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ సదుపాయాలను పూర్తిగా వినియోగించుకుని స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, మహిళలు పాల్గొన్నారు. పని ఒత్తిడితోనే డిజిటల్ అసిస్టెంట్ మృతి వత్సవాయి: జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న గువ్వల అశోక్ పని ఒత్తిడి కారణంగానే మృతి చెందినట్లు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ల సంఘ నాయకుడు వామన్నాయక్ పేర్కొన్నారు. అశోక్ మృతదేహానికి ఉద్యోగులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం టార్గెట్లు విధించడంతో పని భారంతో ఉద్యోగులు మానసిక సంఘర్షణకు గురై మరణిస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500మంది ఉద్యోగులు బలైనట్లు చెప్పారు. చిరుద్యోగులమైన తమపై ఇంత పని ఒత్తిడి పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని, గతంలో ఇంత పని ఒత్తిడి టార్గెట్లు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లుతెరిచి ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లోనే జీతాలు పెంచాలి గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే అంగన్వాడీలకు జీతాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏపీ ప్రగతి శీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఇఫ్టూ) డిమాండ్ చేశాయి. మంగళవారం విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. అంగన్వాడీలు నిర్వహించిన 42 రోజుల చారిత్రక సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు తక్షణమే సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. వేతనాలు రూ. 26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అనేకమార్లు సీఎం, మంత్రులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నవించినా నేటి వరకు వేతనాలు పెంచలేదన్నారు. మహాశివరాత్రికి భారీ బందోబస్తు కోనేరుసెంటర్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల వద్ద భారీ బందోస్తును ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా ఏడు శైవ క్షేత్రాలు ఉన్నాయని, అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు పెద్ద సంఖ్య భక్తులు హాజరు అయ్యేందుకు అవకాశం ఉండటంతో ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్టు చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాశివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు సహకరించాలని కోరారు. -
సద్గుణరాశి.. సదా సన్నుతి
దయాప్రాప్తురాలి చెంత.. భక్తజన కెరటం విశ్వాస శిఖరం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. వేలాదిగా తరలివస్తున్న భక్తజనం మదిమదిలో సద్గుణరాశి మరియమాతను నింపుకొని మనసారా ప్రణమిల్లుతోంది. మొక్కుబడులు చెల్లిస్తూ.. ప్రార్థనల్లో పాల్గొంటూ.. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ దీవెనలు పొందుకుంటోంది. మేరీమాత తిరునాళ్ల రెండో రోజు మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో గుణదల పుణ్య క్షేత్రం కిక్కిరిసింది. ఉత్సాహపరిచే పాటలు.. మనోనేత్రాన్ని వెలిగించే ప్రసంగాలు.. గురువుల సమష్టి దివ్యపూజాబలి, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి. గుణదల(విజయవాడ తూర్పు): విశ్వ జననిగా కీర్తినొందిన మరియతల్లిని గౌరవిస్తూ.. ఆమె కుమారుడైన ఏసుక్రీస్తు మార్గాన్ని మనమంతా అనుసరించాలని నెల్లూరు కథోలిక పీఠాధిపతి పిల్లి ఆంథోని దాస్ అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో రెండో రోజు మంగళవారం ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఆంథోని దాస్ భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. మానవాళికి మరియమాత ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేవాది దేవునికి సంపూర్ణమైన శిష్యురాలిగా ఆమె జీవించిందన్నారు. లోక రక్షకుడైన క్రీస్తును, ఆయన కట్టడలను అనుసరిస్తూ మానవులంతా పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించాలని కోరారు. తన ప్రియ కుమారుడు శిలువ మరణం పొందుతున్నా ఆమె ఎంతగానో సహించి.. తన జీవితాన్ని దేవునికి అప్పగించిందని వివరించారు. మరియతల్లిని ఆదర్శంగా తీసుకుంటూ దేవుడిపై విశ్వాసముంచుతూ మానవులంతా భక్తిమార్గంలో నడుచుకోవాలన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి రాజారావు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలయం జయరాజు, తదితర గురువులతో కలసి సమష్టి దివ్య బలి పూజ సమర్పించా రు. భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కిటకిటలాడిన పుణ్యక్షేత్రం.. మేరీమాత తిరునాళ్లకు రాష్ట్ర నలుమూలల నుంచి యాత్రికులు లక్షలాదిగా పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో గుణదల కొండపై భక్తులు కిటకిటలాడారు. కొండపై కాలిబాటలు, మెట్ల మార్గాలు యాత్రికులతో నిండిపోయాయి. మరియమాతను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మా వందనం.. మరియతల్లీ వందనం అంటూ శరణు వేడారు. కొబ్బరి కాయలు కొడుతూ, తలనీలాలు సమర్పిస్తూ తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. అటుపై కొండ శిఖరాగ్రం వరకు వెళ్లి భక్తులు క్రీస్తు శిలువ వద్దకు చేరుకుని ప్రార్థించారు. దేదీప్యంగా గుణదల కొండ.. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీప కాంతులతో గుణదల కొండంతా కాంతులీనుతోంది. పుణ్యక్షేత్ర ప్రధానాలయం దగ్గర నుంచి మెట్ల మార్గాలు, మేరీమాత స్వరూపం అటుపై కొండ శిఖరాగ్ర వరకు ధగధగ మెరుస్తోంది. పగటి వెలుగును ప్రతిబింబిస్తూ పుణ్యక్షేత్రం అలరారుతోంది. సాయంత్రం సమయంలో జరిగిన సమష్టి దివ్యబలి పూజ కార్యక్రమానికి విశాఖపట్నం అగ్రపీఠాధిపతి ఉడుముల బాల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ మరియమాత పరమ పునీతురాలిగా కీర్తినొందుతోందన్నారు. లోక రక్షకుడైన క్రీస్తును విశ్వసించి ఆయనను అనుసరించిన భక్తులకు రక్షణ మార్గం చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని, దైవ చింతన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. -
అవాస్తవాలతో డైవర్షన్ పాలిటిక్స్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని నిందలు మోపారని.. ఇప్పుడు వాస్తవాలు బయటకు తెలుస్తుండటంతో డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అవినాష్ మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమంపై శ్రద్ధ లేదన్నారు. పవన్కల్యాణ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటానికి దుర్గగుడి మెట్లు కడిగిన పవన్ కల్యాణ్ నటించారన్నారు. ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చిన నేపథ్యంలో పవన్కల్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అవినాష్ డిమాండ్ చేశారు. కల్తీ జరిగిందని చెప్పిన ట్యాంకర్లు అన్నీ తనిఖీ చేసి, పంపించింది కూటమి ప్రభుత్వమేనన్నారు. ఈ విషయం లో వైఎస్సార్ సీపీకి సంబంధం ఏమి ఉందో చెప్పాలన్నారు. సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టినా... తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందనే విషయంలో సుప్రీం కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని అవినాష్ చెప్పారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని, హిందువులకు అండగా ఉండేది వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై అపనమ్మకం తీసుకొచ్చింది చంద్రబాబేనని, 2014–19 మధ్య వందలాది హిందూ గుడులు కూల్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు చిందులు వేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేసే విష సంస్కృతి ప్రారంభించింది చంద్రబాబేనన్నారు. -
ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు ఉండాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే శైలజానాఽథ్ ఇబ్రహీంపట్నం: రాజకీయాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలేకానీ అరాచకాలు, దాడులను ప్రోత్సహించకూదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను మంగళ వారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. బయటి ప్రాంతాల నుంచి వచ్చి జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం యాసిడ్, పెట్రోల్ బాంబులతో దాడులను కక్ష పూరితంగా ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. జోగి రమేష్ కుటుంబం వైఎస్సార్ సీపీకి సేవలు అందించిందని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూర్తిస్థాయిలో అండగా నిలిచిందని పేర్కొన్నారు. రాజకీయాల్లో దాడులను ప్రోత్సహించకపోవడం కూటమి ప్రభుత్వానికే మంచి దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి మిక్కిలి శరభయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నల్లమోతు ప్రకాశ్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గోగులమూడి రాణి, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు కోలకాని శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లపై అవగాహన పెంపొందించుకోవా లని సూచించారు. కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులతో కలిసి ఆర్బీఐ – ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల (ఫిబ్రవరి 9 నుండి 13 వరకు) పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందేందుకు కూడా అవగాహన అవసరమన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తన, బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం కె.ప్రియాంక, జీఎం డీఐసీ మధు, ఎస్బీఐ కోఆర్డినేటర్ జగదీష్, కెనరా బ్యాంక్ కోఆర్డినేటర్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
11 నెలల్లో నిందితుడికి జైలు శిక్ష
●కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు ఎస్పీ అభినందనలు ●సిబ్బందికి రివార్డులు అందజేత కోనేరుసెంటర్(మచిలీపట్నం): నేరం జరిగిన 11 నెలల్లోనే నిందితుడికి కోర్టు జీవితకాలపు శిక్ష విధించేలా దర్యాప్తు చేసిన పోలీసులను కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు అభినందించారు. తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. పమిడిముక్కల మండలం మంటాడ గ్రామానికి చెందిన భార్యాభర్తలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. వేర్వేరుగా జీవిస్తున్నారు. భార్య తన ఇద్దరు కుమార్తెలతో మంటాడలో, భర్త తన కుమారుడు కొమ్ము సౌల్తో కలిసి ప్రకాశం జిల్లా కొండెంపి మండలం పెట్లూరు గ్రామంలో నివసిస్తున్నారు. 2023లో కొమ్ము సౌల్ మంటాడలోని తల్లి వద్దకు వచ్చాడు. సౌల్ తన మైనర్ చెల్లెలికి మాయమాటలు చెప్పి 2024 డిసెంబర్ 19వ తేదీన గుణదల తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆమైపె తరచూ లైంగికదాడి చేశాడు. కొంత కాలానికి బాలిక గర్భం ధరించడంతో విషయం బయటికి పొక్కింది. తల్లి నిలదీయగా అన్న సౌల్ విషయం చెప్పింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పమిడిముక్కల పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్వినీల్ కేసు దర్యాప్తు చేపట్టి సౌల్ను అరెస్టు చేసి, పూర్తి ఆధారాలతో విజయవాడ పోక్సో కోర్టులో హాజరుపరిచారు. నింది తుడిపై నేరం నిరూపణ కావడంతో సౌల్కు జీవితకాలపు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కోర్టు ఈ నెల తొమ్మిదో తేదీన తీర్పు చెప్పింది. బాలికకు రూ.30 వేలతో పాటు రూ.5 లక్షలను పరిహారంగా ఇవ్వాలని జిల్లా లీగల్సెల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించిందని ఎస్పీ తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా కేసు దర్యాప్తు చేసిన డీఎస్పీ ధీరజ్వినీల్తో పాటు పమిడిముక్కల పోలీస్స్టేషన్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, బందరు డీఎస్పీ సీహెచ్.రాజ పాల్గొన్నారు. -
బాల్యాన్ని నులిమేస్తుంది.. జాగ్రత్త!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఆరోగ్యమే తొలిమెట్టు. పిల్లల ఎదుగుదల కేవలం ఆహారం మీద మాత్రమే కాదు, వారి కడుపు ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నులి పురుగులు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వారి ఎదుగుదల క్షీణించి, రక్తహీనతకు దారి తీస్తాయి. పిల్లల్లో నులిపురుగుల సమస్య, వాటి ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే ఏటా ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నులి పురుగులు అంటే.. నులిపురుగులు పిల్లల పేగుల్లో పెరిగే పరాన్న జీవులు. ఇవి అపరిశుభ్రమైన చేతులు, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. మట్టిలో చెప్పులు లేకుండా ఆడటం వల్ల చర్మం ద్వారా కూడా లోపలికి వెళ్లే అవకాశం ఉంది. చాలా నష్టదాయకం.. ● చాలామంది తల్లిదండ్రులు దీనిని చిన్న సమస్యగా భావిస్తారు. కానీ ఇది తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని వైద్యులు చెబుతారు. రక్తహీనతకు దారి తీయొచ్చు. నులి పురుగులు రక్తంలోని పోషకాలను పీల్చుకోవడం వల్ల పిల్లలు పాలిపోయి కనిపిస్తారు. ● మనం ఇచ్చే బలమైన ఆహారాన్ని పిల్లల శరీరం గ్రహించకుండా ఈ పురుగులు అడ్డుకుంటాయి. ● శారీరక, మానసిక ఎదుగుదల తగ్గుతుంది. ● ఏకాగ్రత లోపించి చదువులో వెనుకబడతారు. ● త్వరగా అలసిపోతారు. ఇలా గుర్తించాలి.. కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం. బరువు తగ్గడం, ఎదుగుదల లేకపోవడం, మలద్వారం వద్ద దురద (ముఖ్యంగా రాత్రి వేళల్లో), తరచూ వాంతులు, విరేచనాలు అవ్వడం జరుగుతుంది. కలుషిత ఆహారం, తాగునీటి ద్వారా శరీరంలోకి.. తద్వారా చిన్నారుల్లో రక్తహీనత ఎదుగుదల లోపించి ఇబ్బందులు జాగ్రత్త వహించాలంటున్న వైద్యులు వైద్యులు సూచించిన విధంగా పిల్లలకు నులి పురుగుల మాత్రలను తప్పనిసరిగా వేయించాలి. ఇది సురక్షితమైనది. భోజనానికి ముందు, మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. పిల్లల గోర్లు పెరగకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే గోర్ల కింద మురికిలో పురుగుల గుడ్లు ఉంటాయి. తాగునీరు శుభ్రంగా ఉండాలి. పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే వాడాలి. నులి పురుగులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తరచూ కడుపునొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో వైద్యుడితో పరీక్షలు చేయించి నులి నివారణ మాత్రలు వేయాలి. అంతేకాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేస్తే మంచిది. – డాక్టర్ వైభవ్ వెంకటేష్, పిడియాట్రిక్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
సింగన్నగుంట చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
గన్నవరం: చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక ఎస్సీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బొజ్జ వెంకటేశ్వరరావు(45) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ వివాదాల కారణంగా అతని భార్య, పిల్లలకు దూరంగా ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గుణదలలో మేరీమాత ఉత్సవాల్లో ఖర్జూరం, జీడీలు విక్రయించేందుకుగాను భీమవరానికి చెందిన వ్యాపారులు అతనిని తీసుకువచ్చారు. అయితే గుణదల నుంచి గన్నవరం వచ్చిన వెంకటేశ్వరరావు సోమవారం ఉదయం స్థానిక ఎస్సీ కాలనీలోని సింగన్నగుంట చెరువులో దూకాడు. నీట మునుగుతున్న అతనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
క్వారీల దుమ్ము.. సాగు ఆశలు వమ్ము
జి.కొండూరు: క్వారీలు, క్రషర్ల నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. నత్తనడకన రహదారులు విస్తరణ పనులు, అడుగడుగునా భారీ గోతులతో నిండిన రోడ్లపై అధిక లోడింగ్తో అతివేగంగా దూసుకెళ్తున్న టిప్పర్ల రాకపోకలతో రైతులు నష్టపోతున్నారు. రోడ్లను ఆనుకుని ఉన్న పొలా ల్లోని పైర్లు టిప్పర్ల కారణంగా రేగుతున్న దుమ్ముతో నిండిపోతున్నాయి. పంట వేయకుండా ఉండలేక, వేసినా దుమ్ము కారణంగా పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేక రైతులు తల్లడిల్లుతున్నారు. జి.కొండూరు మండలంలోని లోయ గ్రామాల రైతులు దుమ్ము సమస్యతో సతమతమవుతున్నారు. వందల టిప్పర్ల రాకపోకలు ఎన్టీఆర్ జిల్లాలో క్వారీలు, క్రషర్లు అంటే గుర్తొచ్చేది నందిగామ నియోజకవర్గంతో పాటు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాలు. ఇబ్రహీంపట్నం, కంచికచర్లలో కలిపి 39 క్వారీలు ఉన్నాయి. జి.కొండూరు మండలంలోని లోయ ప్రాంతంలో తొమ్మిది, కొండపల్లి పరిధిలో మరో ఆరు క్వారీలు నడుస్తున్నాయి. కొండ పల్లి, లోయలో ప్రాంతాల్లోని 15 క్వారీలు, క్రషర్ల నుంచి రోజూ వందల టిప్పర్లు మెటల్, డస్టును రవాణా చేస్తూ ఉంటాయి. జి.కొండూరు నుంచి గంగినేని వరకు రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. జి.కొండూరు నుంచి గడ్డమణుగు ఎస్సీ కాలనీ మీదుగా మరో రహదారి సైతం మరమ్మతులకు నోచుకోక భారీ గోతులతో నిండిపో యింది. ఈ నేపథ్యంలో భారీ లోడులతో టిప్పర్లు మితి మీరిన వేగంతో రాకపోకలు సాగించడం వల్లన రహదారులను ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో సాగువుతున్న పంటలపై దుమ్ము పేరుకుపోతోంది. దుమ్ము కారణంగా పంట దిగుబడులు పడిపోతున్నాయి. ఏడు గ్రామాల్లో సమస్య తీవ్రం క్వారీల నుంచి టిప్పర్ల రాకపోకల వల్ల జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు, పినపాక, కడింపోతవరం, చెర్వుమాధవరం, మునగపాడు, జి.కొండూరు, లోయ గ్రామాల్లో రహదారుల పక్కన రబీలో సాగువుతున్న 5,487.07 ఎకరాలలో మొక్కజొన్న, వరి, ఉద్యాన పంటలైన మిరప, అరటి, పామాయిల్, కూరగాయ పంటలపై దుమ్ము చేరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దుమ్ము లేవకుండా ఉండేలా నిత్యం రహదారులపై నీరు చల్లాల్సి ఉంది. అయితే క్వారీల నిర్వాహకులు నామమాత్రంగా నీళ్లు చల్లి వదిలేస్తున్నారు. దుమ్ము ప్రభావంతో అవసరాలకు భూములు అమ్ముకోవాలన్నా కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదని రైతులు వాపోతున్నారు. -
‘పెడల్ ఫర్ ఫ్రీడమ్’ సైకిల్ ర్యాలీ ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజల్లో పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘పెడల్ ఫర్ ఫ్రీడమ్’ ని చేపట్టినట్లు కళాశాల విద్య కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యాన 11 మంది విద్యార్థులు ఆరు రోజుల పాటు ఐదు జిల్లాల మీదుగా 600 కి.మీ ర్యాలీ చేయనున్నట్లు వివరించారు. స్థానిక మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్, ఈగల్ ఏపీ, రెడ్ రోప్ మూవ్మెంట్ ఆధ్వర్యాన పెడల్ ఫర్ ఫ్రీడమ్ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఈగల్ ఏపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్ రవికృష్ణ, ఈగల్ ఏపీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.నగేష్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లూరు నీరజ హాజరయ్యారు. విజయవాడ టు విశాఖ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు రోజుల పాటు జరిగే పెడల్ ఫర్ ఫ్రీడమ్ సైకిల్ ర్యాలీ ద్వారా మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు, మానవ అక్రమ రవాణా, సురక్షిత వలసలపై అవగాహన, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, న్యాయ ప్రాప్తి, లైంగిక విద్య, ఎయిడ్స్పై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు సైకిల్ యాత్ర సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల విద్య అకడమిక్ ఆఫీసర్ డాక్టర్ తులసి మస్తానమ్మ, రెడ్ రోప్ కోఆర్డినేటర్ క్రిస్టోలెట్, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్, ఐక్య కోఆర్డినేటర్ డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి నృత్య పోటీల్లో విజేతలు వీరే..
విజయవాడ కల్చరల్: సంస్కార భారతి మహానగర్, సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో భరతముని జయంతి సందర్భంగా నగరంలో రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి నృత్యపోటీ విజేతల వివరాలను రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ, నగర అధ్యక్షుడు పసుమర్తి భాస్కరశర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మంది పోటీల్లో పాల్గొన్నారన్నారు. నాట్యాచార్యులు హేమంత్కుమార్, సుధీర్రావ్, సంతోష్, పద్మశ్రీ హేమంత్, యల్లా జోస్యుల అనూరాధ, తులసీ కృష్ణ, మంజూష, స్రవంతి, కల్పన నృత్యపోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని చెప్పారు. విజేతల వివరాలు.. ● కూచిపూడి నృత్యం సీనియర్స్ విభాగంలో సాయి వర్షిత వర్మ, భావన, నిఖిల లక్ష్మి, జూనియర్స్లో జాస్విత, యశ్వర్థిక్, నిశ్వన, సబ్ జూనియర్స్లో లోచన శ్రీ వర్షిత, దేవాన్విషి, ప్రీతి మహల్లిక ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. ● భరతనాట్యం సీనియర్స్లో మధురిమ, సన్వితశ్రీ, నమోనిక, జూనియర్స్ విభాగంలో మిధున, మనస్వి ఫణి, సాయి లక్ష్మి, సబ్ జూనియర్స్లో నాగవర్నిక, ఆరాధ్యశ్రీ, దివ్యాన్ శ్రీసార విజేతలుగా నిలిచారు. ● ఆంధ్రనాట్యం సీనియర్స్లో షేక్ షర్మిళ, దేవార్షిణి, హరిణి, జూనియర్స్లో నాగత తన్విశ్రీ, లాస్య ప్రియ, తేజస్విని, సబ్ జూనియర్స్లో అక్షరదేశ్ పాండే, మేఘన, సహస్రలు వరుసగా ప్రథమ ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. ● జానపద బృంద నృత్యంలో మధురిమ గ్రూప్, శ్రీ ఉమామహ్వేర గ్రూప్, తులసీ లహిత గ్రూప్, శాసీ్త్రయ బృంద నృత్యంలో శ్రీ కనకదుర్గా నాట్యమందిర్, అమృత గ్రూప్, సన్విశ్రీ గ్రూప్లు ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులను గెలుచుకున్నారు -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఉపాధ్యాయుడి ఎంపిక
నందివాడ: పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు వెన్ననపూడి వ్యాయా మ ఉపాధ్యాయుడు పరిశే ఏసురత్నం ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్వై మాధవ్కుమార్ తెలిపారు. ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా ఆయన వ్యవహరించననున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏసురత్నంను ఉపాధ్యాయులు, రాజకీయ ప్రముఖులు అభినందించారు. విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో రిమాండ్లో ఉన్న ఏ21 సుదర్శన్ తరఫు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్పై ఎకై ్సజ్ న్యాయస్థానంలో సోమవారం వాదనలు జరిగాయి. న్యాయమూర్తి లెనిన్బాబు తీర్పును ఈనెల 17వ తేదీకి వాయిదా వేశారు. ఇదే కేసులో మదనపల్లి జైలులో రిమాండ్లో ఉన్న ఏ22 సీపీ సెంథిల్ పీటీ వారెంట్ కోరుతూ విజయవాడ ఎకై ్సజ్ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ను అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సెంథిల్ను విజయవాడ ఎకై ్సజ్ న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈనెల 19వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు సెంథిల్ను తరలించారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం భారతీయ రిజర్వు బ్యాంకు ఆధ్వర్యాన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ముద్రించిన వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. జేసీ నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. మంగళగిరి టౌన్ : మంగళగిరిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మూడోరోజు స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు దాతలు ఆలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన కీర్తిశేషులు గోలి సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారులు గోలి చిన్నారావు, గోలి నాగేశ్వరరావు, గోలి సాంబశివరావు, గోలి శ్రీనివాసరావు వ్యవహరించారు. దేవస్థాన ఈ.ఓ. గోపి ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. -
నిరుపేదలకు ఇళ్లపట్టాలు అందించండి
చిలకలపూడి(మచిలీపట్నం): గన్నవరం నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు ఇళ్లపట్టాలు అందించాలని గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్కు వినతిపత్రం సమర్పించి, పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మల్లవల్లి గ్రామంలో ఆర్ఎస్ నంబర్–11 ఉన్న అటవీభూముల్లో పశువుల మేత కోసం వినియోగించుకుని జీవనం సాగించేవారన్నారు. అయితే ఈ భూములను ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కోసం ఈ భూమిని ఏపీఐఐసీకి అప్పగించారన్నారు. దీని కారణంగా జీవనభృతి దెబ్బతిన్న ఆ ప్రాంత ప్రజలకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి, కొంతమందికి మాత్రమే చెల్లించారని.. మిగిలిన వారికి వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీఐఐసీకి 1,460 ఎకరాలు బదిలీ చేసిన నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులు 2,400 మంది ఉన్నారని వీరికి సర్వే నంబరు 11లో ఉన్న 100 ఎకరాలను ఇళ్లపట్టాలు అందించాలని ఆయన జేసీకి వివరించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా రైతుల నుంచి తీసుకున్న భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. గతంలో ఈ భూమికి సంబంధించిన అన్ని అంశాలను జేసీకి ఆయన వివరించారు. ‘మీ కోసం’లో జేసీకి విన్నవించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ -
జోగి రమేష్ ఇంటిపై దాడి అమానుష చర్య
మాజీ హోం మంత్రి తానేటి వనిత ఇబ్రహీంపట్నం: జోగి రమేష్ ఇంటిపై దాడి అమానుష చర్య అని మాజీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, దాడులు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులను తానేటి వనిత సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక వారి ఇళ్ల పైన పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడులు చేయించడం ఆటవిక చర్య అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఇళ్లు, కుటుంబ సభ్యులపై దాడి చేయడం, ఆస్తులు ధ్వంసం చేసే సంస్కృతి ఇప్పటి వరకు లేదన్నారు. దాడులు చేసే వారిని ఆపకుండా పోలీసులు వారికి సహకరించడం ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడమే అన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ లేదని రిపోర్టు వచ్చినా దానికి సమాధానం చెప్పలేని చంద్రబాబు ప్రభుత్వ నాయకులు నిస్సిగ్గుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె వెంట గోపాలపురం జెడ్పీటీసీ కాకులపాటి శ్రీను, నల్లజర్ల, ద్వారకాతిరుమల ఎంపీపీలు బంకా అప్పారు, బొండాడ వెంకన్నబాబు, వివిధ మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు. అలాగే అమలాపురం ఎస్ఈసీ సభ్యుడు కూడిపూడి భరత్భూషణ్, సీనియర్ నాయకుడు కంచె రమణారావు, రాష్ట్ర దృశ్యకళల మాజీ చైర్మన్ కూడిపూడి శాంతి, తదితరులు జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
దుర్గమ్మ భక్తులకు త్వరలో జలప్రసాదం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శనానికి విచ్చేసే భక్తులకు ఇకపై దేవస్థానమే ఉచితంగా మినరల్ వాటర్ బాటిళ్లను జల ప్రసాదంగా పంపిణీ చేయనుంది. ఇందు కోసం మినరల్ వాటర్ను బాటిళ్లలో ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన ప్లాంట్ను దేవస్థానం ఏర్పాటు చేయనుంది. సీవీ రెడ్డి చారిటీస్ స్థలంలో రూ.1.10 కోట్లతో ప్లాంట్ను ఏర్పాటు చేయాలని దుర్గగుడి ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం సోమవారం బ్రాహ్మణ వీధిలో ఉన్న జమ్మిదొడ్డి ఆవరణలోని బోర్డు సమావేశ మందిరంలో నిర్వహించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈఓ శీనానాయక్, ఏసీ రంగారావు, ఈఈ కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఏఈఓలు హాజరయ్యారు. బోర్డు సమావేశంలో మొత్తం 15 అంశాలు చర్చకు రాగా పది అంశాలను ఆమోదించారు. కొన్నింటిని వాయిదా వేశారు. మరి కొన్నింటిని తిరస్కరించారు. ఆమోదం తెలిపిన అంశాలివే... ప్రసాదాల ప్యాకింగ్కు అవసరమైన క్యారీ బ్యాగులను 12 నెలలకు సరఫరా చేసే టెండర్ను ఆమోదించారు. దుర్గగుడి దత్తత దేవస్థానం కొమర వోలులోని అమరలింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి వారి ఆలయానికి మరమ్మతులు, పెయింటింగ్, నిర్వహణ పనులకు ఆమోదం తెలిపారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని రాయబార మండపం ఉత్తరభాగంలో మెట్లు అభివృద్ధికి రూ.8.25 లక్షల అంచనాలకు, వేసవి నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటుకు రూ.14.50 లక్షల అంచనాలకు, మార్చిలో జరిగే కుంభాభిషేకానికి అవసరమైన స్కాఫోల్డింగ్ పనులకు రూ.6.50 లక్షల అంచనాలకు, భవానీ దీక్ష విరమణ సమయంలో లడ్డూ తయారీ నిమిత్తం కాంట్రాక్టర్కు రూ.19.85 లక్షలు చెల్లించేందుకు, ప్రసాదాల పోటులో నాలుగు లిఫ్ట్ల ఏర్పాటుకు రూ.1.70 కోట్ల అంచనాలకు, అన్నదాన భవనంలో రూ.70 లక్షల అంచనాలతో లిఫ్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. సీవీ రెడ్డి చారిటీస్ స్థలంలో 150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు జిల్లా కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ చేసిన తీర్మానాన్ని ట్రస్ట్ బోర్డు తిరస్కరించారు. దేవస్థానానికి చెందిన భూములు, పొలం లీజులు, కౌలు వంటి అంశాలపైనా చర్చ జరిగింది. -
అర్జీల పరిష్కారంపై శ్రద్ధ చూపండి
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ చూపాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్తో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ నవీన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీల్లో పెండింగ్ ఉండకూడదని, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అర్జీదారుల సమస్యను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అధికారులు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 152 అర్జీలను స్వీకరించారు. పెడన మండలం ముచ్చర్ల గ్రామంలో సుమారు 40 ఎకరాల రొయ్యల చెరువు వల్ల 300 ఎకరాల వరిపంట నాశనమవుతోందని గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. రొయ్యల చెరువుల వల్ల కొన్ని రోజులకు భూమి చౌడు బారి పంటలు పండవని, భూమి మీద ఆధారపడి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని, భూములను పరిశీలించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. -
సమస్యలకు సత్వర పరిష్కారం
‘మీ కోసం’లో అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో అందిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో సిబ్బంది చొరవ చూపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘మీ కోసం’లో మొత్తం 40 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● కూచిపూడి నుంచి విశ్వేశ్వరరావు అనే వ్యక్తి వచ్చి తన వ్యవసాయ భూమిని సరిహద్దుదారుడు ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని, అదేమని అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు దిగుతున్నాడంటూ వాపోయారు. అతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని అర్జీ సమర్పించారు. ● కంకిపాడు నుంచి కవిత అనే వివాహిత.. తనకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతోందని, అదనపు కట్నం కోసం తన భర్త, అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని వినతి పత్రం సమర్పించారు. ● ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన స్నేహితుడు మోసం చేశాడని, ఉద్యోగం నిమిత్తం ఇచ్చిన డబ్బు ఇవ్వకపోగా బెదిరిస్తున్నాడని న్యాయం చేయమని గుడివాడకు చెందిన నాని అనే యువకుడు ఫిర్యాదు చేశారు. -
సాఫ్ట్ టెన్నిస్లో ఏపీ క్రీడాకారుల సత్తా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పంజాబ్ రాష్ట్రం లూథియనాలో ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు జరిగిన 2వ ఏషియన్ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్షిప్–2026లో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ చూపి పతకాలు సాధించడం గర్వకారణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఏ.రవినాయుడు అన్నారు. పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలోని శాప్ కార్యాలయంలో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఏఎస్ వైశాలి అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం, పీవీ చిన్హాస్ అండర్–15 బాలుర డబుల్స్ విభాగంలో కాంస్య పతకం, అండర్–18 బాలుర డబుల్స్ విభాగంలో ఎం.రేవంత్ కాంస్య పతకం సాధించారని వివరించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
దుర్గగుడికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయానికి సోమ వారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ గొల్లపూడికి చెందిన వెనిగళ్ల కృష్ణకుమారి కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ.5,00,116 విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజే సింది. ఆలయ అభివృద్ధి పనులకు సంతరావూరు గ్రామానికి చెందిన కొప్పుల రవికిరణ్ కుటుంబం రూ.1,01,116 విరాళాన్ని ఆలయ చైర్మన్కు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రా లను అందజేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య, ఆరోగ్య శాఖలో డెమో విభాగం సేవలు అత్యంత కీలక మని ఎన్టీఆర్ డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా అధికారులు(డెమోల) సంఘం – అమరావతి 2026 క్యాలెండర్, డైరీని సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో డెమోలు కీలక పాత్ర వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ నవీన్, డాక్టర్ బాలాజీ, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సాగర్, గణాంక అధికారి లక్ష్మోజి, రాజశేఖర్, బాషా ఏపీ ఎంఓహెచ్ఈ అసోసి యేషన్ అధ్యక్షుడు చదలవాడ నాగేశ్వరరావు, కొవ్వూరి ప్రభాకరరెడ్డి, ఎంఎంవై శ్రీనివాస్, మహ్మద్ యూసుఫ్, పుష్పరాణి తదితరులు పాల్గొన్నారు. జి.కొండూరు: డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా పోలీసు శాఖ చేపట్టిన డ్రగ్స్పై దండయాత్ర ర్యాలీ సోమవారం జి.కొండూరులో కొనసా గింది. అడ్మిన్ డీసీపీ సరిత, రూరల్ డీసీపీ లక్ష్మీ నారాయణ నేతృత్వంలో మండలంలోని కట్టుబడిపాలెం గ్రామం వద్ద మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన సైకిల్ ర్యాలీ పినపాక, విద్యానగరం, జి.కొండూరు వై జంక్షన్ మీదుగా మధ్యాహ్నం మూడు గంటలకు జి.కొండూరు చేరింది. ఈ ర్యాలీకి మైలవరం ఏసీపీ ప్రసాదరావు, సీఐ దాడి చంద్రశేఖర్, ఎస్ఐలు సతీష్కుమార్, గిరిజామణి, స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జి.కొండూరులో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీసీపీలు సరిత, లక్ష్మీనారాయణ, ఏసీపీ ప్రసాదరావు మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో 510 కిలోమీటర్లు మేర సైకిల్ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, పోలీసు సిబ్బంది, వివిధ పాఠ శాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
మరియమ్మ పండుగ.. దీవెనలు మెండుగ
వైభవంగా గుణదల తిరునాళ్ల ప్రారంభం అమ్మా దర్శనం.. మరియ తల్లీ దర్శనమన్న భక్తుల శరుణుఘోషతో గుణదల కొండ మారుమోగింది. మరియమాతను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా యాత్రికులు తరలివస్తున్నారు. మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయం దిగువన ఉన్న బిషప్ గ్రాసి స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు తిలకిస్తూ యాత్రికులు ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. గుణదల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. గుణదల(విజయవాడ తూర్పు): మేరీమాత కొలువైన గుణదల కొండ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మ దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దక్షిణ భారత దేశంలో ప్రముఖ క్రైస్తవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు బిషప్ గ్రాసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, సిల్వర్ జుబిలేరియన్ గురువులు నేలటూరి ఫ్రాన్సిస్, మద్దాల జోసఫ్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తదితర గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛన ప్రాయంగా ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకులుగా విచ్చేసిన నేలటూరి ఫ్రాన్సిస్ భక్తులకు దైవ సందేశం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. శ్రీసభలో మరియ తల్లి సమైక్య మాతగా గుర్తింపు పొందింద న్నారు. మరియమాత సంపూర్ణ దైవత్వానికి కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. నేటి ప్రపంచంలో అనేక దేశాలు విభజన దిశగా అడుగులు వేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు మానవీయత సన్నగిల్లుతోందని అభిప్రాయపడ్డారు. సమస్త జనులను ఐక్య పరిచే శక్తి సృష్టికర్త అయిన దేవునికే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. తమ జీవితాలను, కుటుంబాలను కట్టుకోవా లని వివరించారు. అనంతరం విజయవాడ బిషప్ తెలగతోటి రాజారావు మాట్లాడుతూ.. గుణదలలో జరుగుతున్న 102వ మహోత్సవాలు దీవెనకరంగా జరగాలని కోరారు. పుణ్యక్షేత్రానికి చేరుకునే యాత్రికులకు మరియ తల్లి దీవెను మెండుగా లభిస్తాయని వివరించారు. అనంతరం పుణ్యక్షేత్ర గురువులతో కలసి సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. భక్తులకు సత్ప్రసాదాన్ని అందించి యాత్రికుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సజావుగా ఉత్సవాలు పుణ్యక్షేత్ర గురువులు, పోలీసులు, నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో గుణదల ఉత్సవాలు సజావుగా సాగుతున్నాయి. ఎక్కడా భక్తుల తొక్కిసలాటలు జరుగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. యాత్రికుల సౌకర్యార్థం విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది తాగునీరు, మరుగుదొడ్లు, ప్రాథమిక వైద్య శిబిరాలు వంటి వసతులు కల్పించారు. ఎప్పటికప్పుడు పుణ్యక్షేత్ర ప్రాంగణాలన్నింటినీ శుభ్రం చేస్తున్నారు. సమష్టి దివ్యబలి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడప బిషప్ సగినాల పాల్ ప్రకాష్ మాట్లాడుతూ.. మరియమాత పవిత్రతను బట్టి దేవాది దేవుడే ఆమెను లోకమాతగా ఎంపిక చేశాడని చెప్పారు. అనంతరం పుణ్యక్షేత్ర గురువులు వరుస క్రమంలో దేవుని గీతాలను ఆలపిస్తూ జపమాల ధ్యానంతో వేదిక పైకి చేరుకున్నారు. మహోత్సవాలలో భాగంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
చికిత్స పొందుతూ ఏఎన్ఎం మృతి
చల్లపల్లి: ఆత్మహత్యాయత్నం చేసుకొని, చికిత్స పొందుతున్న ఏఎన్ఎం పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన దాసి సబిత(44) ఈనెల 7వ తేదీన ఇంట్లో ఉరి బిగించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. లోపలికి వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు వేలాడుతున్న సబితను చూసి వెంటనే కిందికి దించారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను వెంటనే మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సబిత ఆదివారం రాత్రి మృతి చెందింది. ప్రస్తుతం సబిత మోపిదేవిలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త స్టాలిన్బాబు 20ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. పెద్దకుమారుడు ప్రమోద్ కుమార్ డిగ్రి పూర్తిచేశాడు. చిన్నకుమారుడు సోహిత్కృష్ణ ఇంటర్ చదువుతున్నాడు. సబిత తల్లిదండ్రులు, అత్తమామలు కూడా గతంలోనే చనిపోయారు. దీంతో పిల్లలు ఒంటరులయ్యారు. చల్లపల్లి ఎస్ఐ దంపనపూడి దుర్గాంజనేయులు విజయవాడ వెళ్లి సబిత భౌతికకాయం వద్ద వివరాలు సేకరించి పంచనామా నిర్వహించారు. అయితే సబిత ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు. కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజీవ్గాంధీ పార్కు ఎదురుగా రైల్వేట్రాక్ సమీపంలో కృష్ణానదిలో నీటిలో ఒక మహిళ మృతదేహం తేలుతున్నట్లు సోమవారం సాయంత్రం 5.30గంటలకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద ఊరు, పేరుకు సంబంధించిన ఎటువంటి వివరాలు లభించలేదు. మృతురాలు వయస్సు సుమారు 50ఏళ్లు ఉండవచ్చని, ఎరుగు రంగులో ఉండి పచ్చని జాకెట్, పింక్ చీర ధరించి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. పమిడిముక్కల: విజయవాడ–మచిలీపట్నం హైవేపై మంటాడ బైపాస్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మచిలీపట్నంకు చెందిన అల్లా జగన్మోహనరావు(40) బైక్పై ఉయ్యూరు బయలుదేరారు. మార్గమధ్యలో మంటాడ బైపాస్లో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జగన్మోహనరావు ఉయ్యూరు కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026వర్గాలుగా చీలిన విజయవాడ సెంట్రల్ టీడీపీ7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 36.1837 టీఎంసీలుగా ఉంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దందాలతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. చివరకు ఫుట్పాత్లు, టిఫిన్ బండిని కూడా వదలకుండా భారీ రేట్లు పెట్టి వసూళ్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడ అదనపు అంతస్తులు, అక్రమ కట్టడాలు కడుతున్నా స్థానిక టీడీపీ నేతలు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరుడు వాలిపోతున్నారు. దీంతో స్థానిక టీడీపీ నేతలకు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నియమించిన ఏజెంటుకు మధ్య విభేదాలు పొడ చూపుతున్నాయి. కొన్ని చోట్ల బహిరంగంగానే తన్నుకోవడంతో రచ్చ, రచ్చ అవుతోంది. ఈ విషయం నియోజకవర్గ ప్రజాప్రతినిధి దృష్టికి వెళ్లినా, తన ‘ఏజెంట్’ వైపే మొగ్గు చూపుతుండటంతో ఆయనపై క్యాడర్ సైతం కారాలు, మిరియాలు నూరుతోంది. ఎవ్వరు ఏమనుకుంటే, నాకేంటి.. అన్న రీతిలో ఆ ఏజెంట్ వసూళ్ల పర్వం కొనసాగిస్తూనే ఉండటం ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ‘తమ్ముళ్ల’ మధ్య జరుగుతున్న గొడవల వెనుక అసలు రహస్యం ఈ దందాల వసూళ్లలో వచ్చిన తేడాలే అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఇంతకు మునుపు బీసెంట్ రోడ్డులో స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో దందా జరిగేది. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఇద్దరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని స్వయంగా దందాలు చేస్తూ వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. ఇందులో ఒకరేమో పలు కేసుల్లో నిందితుడు, మరొకరు ఇటుకల వ్యాపారి కావడం విశేషం. ప్రధానంగా బీసెంట్ రోడ్డులో కొత్తగా 16 బండ్లు ఏర్పాటు చేసి, బండికి రూ. 4లక్షల చొప్పున వసూలు చేశారు. దీంతో పాటు రెండో సెక్టార్లో ఒక్కో పాత బండి నుంచి రూ.3లక్షల చొప్పున రూ.35 లక్షలు వసూలు చేశారు. మొత్తం మీద బీసెంట్ రోడ్డులో హాకర్ల నుంచి రూ. కోటికి పైగా వసూళ్లు రాబట్టారు. అ‘ధన’పు వసూళ్లు..దీంతో పాటు అక్కడ నాలుగు భవనాలకు సంబంధించి అదనపు అంతస్తుల నిర్మించారు. వీరు అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధిని కలుసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే నిర్మాణం చేసుకున్నారు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా బిల్డింగ్ వ్యవహారం చూస్తున్న ప్రజాప్రతినిధి ఏజెంట్ అయిన ఇటుక వ్యాపారి అక్కడ వాలిపోయారు. అదనపు అంత స్తులు నిర్మించిన భవన నిర్మాణ యజమానులను, నియోజకవర్గ ప్రజా ప్రతినిధిని కలవాలని హుకుం జారీ చేశారు. వారు వెంటనే నియోజకవర్గ ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లి, స్థానిక ప్రజా ప్రతినిధికి చెప్పి నిర్మాణం చేసుకున్నామని చెప్పారు. ఆగ్రహంతో రగిలి పోయిన నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధి మధ్యాహ్నం 12 గంటలలోపు అదనపు అంతస్తుకు రూ.25 లక్షల చొప్పున, మధ్యాహ్నం 12 గంటల లోపు తెచ్చి ఇవ్వాలని ఆదేశించారు. వారు డబ్బు సమీకరించుకొని తీసుకురావడం కొంత ఆలస్యం కావడంతో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఏజెంటు, టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు ట్రాక్టర్లు, బుల్డోజర్లు తీసుకొని కూల్చేందుకు సిద్ధం చేసినట్లు చర్చ సాగుతోంది. డబ్బులు తీసుకు వస్తున్నామని, ఫోన్ చేసి చెప్పి, వెంటనే ముట్టజెప్పడంతో శాంతించినట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధికి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి మధ్య వసూళ్లలో కోల్డ్ వార్ నడిచి.. చివరకు బహిరంగ తన్నులాటకు దారి తీసినట్లు సమాచారం. ప్రధానంగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఏజెంట్లు టీడీపీకి అనుకూలంగా ఉన్న సామాజిక వర్గం వారు కావడం, స్థానిక నియోజకవర్గ ప్రజా ప్రతినిధి స్థానికంగా బలమైన సామాజిక వర్గం వారు కావడంతో అక్కడ వర్గ పోరు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. వసూళ్లలో విభేదాలతో ఇటీవల బాహాబాహీ కార్పొరేటర్ వర్సెస్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు ఎక్కడ అదనపు అంతస్తు వేసినా వాలిపోతున్న ‘ఏజెంట్’ రగిలిపోతున్న స్థానిక టీడీపీ నేతలు బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారులనూ వదలని వైనం చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్(1100)కు కాల్ చేసి కూడా అర్జీ నమోదు, దాని స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. అజిత్ సింగ్నగర్లో ఓ బ్రాందీ షాపు మార్పు విషయంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఏజెంటు తలదూర్చడంతో పాయకాపురానికి చెందిన నేతలు ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజా ప్రతినిధి దృష్టికి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఆయన వారి మాట వినకపోవడంతో చివరకు బార్లకు సంబంధించి ఓ వ్యక్తి ద్వారా మధ్య వర్తిత్వం చేయించి రూ.4లక్షలు చెల్లించినట్లు అక్కడ చర్చ సాగుతోంది. నాలుగు స్తంభాల సెంటర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులకు 200 గజాల స్థలం ఉంది. దాని పక్కనే ప్రభుత్వానికి చెందిన 100 గజాల స్థలం ఉంది. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, దానిని కలుపుకోవటంతో అక్కడ రచ్చ జరుగుతోంది. 64వ డివిజన్లో ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేత బ్యానర్లను చించి వేయటంతో అక్కడ గందరగోళం నెలకొంది. మధురానగర్లో ఓ టీడీపీ స్థానిక ప్రజా ప్రతినిధి, ఇటుక వ్యాపారి పెత్తనాన్ని జీర్ణించుకోలేక రగిలిపోతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికితోడు రేషన్ బియ్యం, మట్టి దందా జోరుగా సాగుతోంది. బీసెంట్ రోడ్డులోనూ దందా ఇతనే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడ భవన నిర్మాణం, అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్న నియోజక వర్గ ప్రజా ప్రతినిధి ఏజెంటు (ఇటుకల వ్యాపారి) వాలిపోతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్ర తానే పోషిస్తూ, బిల్డింగ్ను బట్టి పెనాల్టీ వసూలు చేస్తున్నారు. ఈ దందాతో భవనాలు నిర్మించే యజమానులు హడలిపోతున్నారు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితం అవుతున్నారు. -
నదీమ తల్లికి కవితా హారతులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణానదిపై జలవిహారం చేస్తూ ప్రకృతి అందాలను తిలకించిన కవులు, కవయిత్రుల్లో భావావేశాలు ఉప్పొంగాయి. కృష్ణా తరంగాలపై ఓలలాడుతూ ఆనందోత్సాహాల నడుమ తమ కవితలతో కృష్ణమ్మకు హారతులిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, ఏపీ పర్యాటక శాఖ సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆదివారం విజయవాడ భవానీపురంలోని బెరంపార్క్ వద్ద ‘కృష్ణా తీరం.. కవితా హారం’ పేరుతో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. నదిలో ప్రయాణిస్తున్న బోటులో కవి సమ్మేళనం నిర్వహించడం ఒక కొత్త ఒరవడికి నాంది అని, ఇదే తరహాలో పెన్నా, గోదావరి నదీ తీరాలలో సాహిత్య కార్యక్రమాలు చేపడతామన్నారు. దేవీపట్నం నుంచి పాపికొండలు వెళ్లే లాంచిలో త్వరలోనే కవి సమ్మేళనం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. కవులు, రచయితలు లేని సమాజాన్ని ఊహించుకోలేమన్నారు. కళలు, సాహిత్యం మన సంస్కృతికి చెట్ల వేర్లు వంటివని, అవి ఎంత బలంగా ఉంటే మన సమాజం అంత బలంగా ఉంటుందని చెప్పారు. జాతి బతకాలంటే భాష బతకాలి ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజశ్వి మాట్లాడుతూ జాతి బతకాలంటే భాష బతకాలన్నారు. చరిత్ర అనేది రాజుల శాసనాల నుంచి మాత్రమే కాదని, కవుల పద్యాల నుంచి కూడా తెలుసుకున్న చరిత్ర మనదని పేర్కొన్నారు. భాష, సాహిత్యాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ప్రతినిధులు, సాహిత్యాభిలాషులు పాల్గొన్నారు. -
మూణ్ణాళ్ల ముచ్చటే !
పెడన: రహదారులు గుంతలు మయంగా మారాయని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు ఇప్పుడు వేసిన రోడ్లు నిర్మాణాలు చేపట్టి రోజులు గడవక ముందే దెబ్బతినడంపై ఏ సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని కొంగంచర్ల గ్రామానికి, అలాగే గురువిందగుంట, కవిపురం గ్రామాలకు వేసిన బీటీ రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆయా రోడ్లకు రూ.81 లక్షలు మంజూరయ్యాయి. రహదారుల పనులు ప్రారంభించిన పిమ్మట ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేపు మండల పరిషత్ సమావేశం.. అధికారం చేపట్టిన ఏడాదిన్నర తరువాత ఆయా రోడ్లకు మోక్షం లభించడంతో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడి వరకు పరిస్థితి బాగానే ఉంది. రోడ్డు నిర్మించిన కొన్ని రోజులకు ఆయా రోడ్లు బీటలు వారడంపై ఆయా గ్రామాలకు చెందిన గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు. నాణ్యతాప్రమాణాలు పాటించారా లేక చేతులు దులుపుకోవడానికే రోడ్లు వేశారా అనే సందేహాలను వెలిబుచ్చుతున్నారు. ఈ నెల 10వ తేదీన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో రోడ్డు నాణ్యతా ప్రమాణాలపై సభ్యులు ప్రశ్నిస్తారా లేదా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
జల్లు స్నానాలకు ఇక చెల్లు
విజయవాడ దుర్గాఘాట్లో నేటి నుంచి నదీ స్నానం ప్రారంభం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులు, యాత్రికులు ఇకపై దుర్గాఘాట్లో నదిలోకి దిగి స్నానాలు చేసేందుకు వీలు కల్పిస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి భక్తులు నదిలోకి దిగి పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత నాలుగు రోజులుగా స్నానఘాట్ లో పేరుకుపోయిన మట్టి, వ్యర్థాలు, బురదను పొక్లయిన్తో తొలగించే పనులు చురుగా సాగాయి. స్నానాలు చేసే వారు నది గర్భంలోకి వెళ్లకుండా ఉండేందుకు పది అడుగుల ఎత్తులో స్టీల్ బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా అనంతరం నదిలోకి పుణ్యస్నానాలు ఆచరించకుండా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కరోనా అనంతరం నదిలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో మరికొంత కాలం నదిలోకి దిగి పుణ్యస్నానాలు ఆచరించడం సాధ్యం కాలేదు. ప్రత్యామ్నాయంగా జల్లు స్నానాలకు అవకాశం కల్పించారు. అయితే ఈ ఏడాది మహా శివరాత్రికి దుర్గాఘాట్లోని నదిలోకి దిగి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకుంటున్నారు. క్లోక్రూమ్లు, చెప్పుల స్టాండ్లు.. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కొండపైకి చేరుకునేందుకు దేవస్థానం బస్సులను ఏర్పాటు చేసింది. నడక దారిలో వెళ్లే వారి కోసం అండర్ పాస్ను నిర్మించింది. నదీ తీరం నుంచి నేరుగా దేవస్థాన కేశఖండనశాల వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఘాట్రోడ్డులో కామథేను అమ్మ వారి ఆలయానికి చేరుకుంటారు. దుర్గాఘాట్లో భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు, లగేజీ భద్రపరుచుకునేందుకు క్లోక్రూమ్లు, చెప్పుల స్టాండ్లను అందుబాటులో ఉంచింది. -
పోయిన బంగారు నగ బాధితురాలికి అప్పగింత
కోనేరుసెంటర్: బందరు బస్టాండ్లో ఓ బాధితురాలు పోగొట్టుకున్న బంగారు ఆభరణాన్ని సేకరించిన పోలీసులు సదరు వస్తువును సంబంధిత మహిళకు అప్పగించిన ఘటన మచిలీపట్నంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నరసాపురానికి చెందిన ఆకుల లిఖిత అనే ఆమె కొంత మంది స్నేహితులతో కలిసి మొక్కుబడి తీర్చుకునేందుకు ఈ నెల 5న విజయవాడ బయలుదేరింది. నరసాపురం బస్సు బందరు బస్టాండ్కు రావటంతో విజయవాడ బస్సు ఎక్కేందుకు అందరూ బస్టాండ్లో దిగారు. ఆ సమయంలో లిఖిత చేతికి ఉన్న బ్రేస్లెట్ కింద పడిపోయింది. విషయాన్ని ఎప్పటికో గ్రహించిన లిఖిత ఆభరణం కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవటంతో అదే రోజు వెంటనే చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న బందరు డీఎస్పీ క్రైం పార్టీ సిబ్బంది బస్టాండ్కు చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఓ వృద్ధుడికి బంగారు వస్తువు కనిపించగా అతను తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. సదరు వృద్ధుడి శారదనగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించి ఆభరణాన్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం చిలకలపూడి సీఐ ఎస్కే నభీ చేతుల మీదుగా బాధితురాలికి ఆభరణాన్ని అప్పగించారు. దీంతో ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. నాగాయలంక: మండలంలోని దీవి గ్రామమైన ఈలచెట్లదిబ్బలో గ్రామ కమిటీ, పీతల వ్యాపారుల మధ్య వివాదం ముదిరింది. దీంతో ఆ ప్రాంత మడ అడవుల్లో పీతల వేట సాగించే యానాదుల కుటుంబాలకు ప్రాణసంకటంగా మారింది. ఆ గ్రామానికి చెందిన యానాదులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 30 కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తుంటారు. మడ అడవులల్లో పీతల వేట సాగించడంలో నిపుణులైన వేటగాళ్లను గ్రామానికి చెందిన ఆరుగురు పీతల వ్యాపారులు తమ గుప్పిట్లో పెట్టుకోవడంతో గ్రామ కమిటీ పెద్దలకు, వారి మధ్య వివాదాలు తలెత్తినట్లు తెలిసింది. పర్యవసానంగా వేటగాళ్లను ఈలచెట్లదిబ్బ ప్రాంతం వదలి పోవాలని హెచ్చరిస్తూ వారికి సహకరించవద్దని గ్రామ కమిటీ గ్రామంలో టామ్ టామ్ వేసి హుకూం జారీ చేసింది. దుమారం లేపిన టామ్ టామ్.. వ్యాపారులేమో వేట చేసి పీతలు తెచ్చి తమకు అమ్మాలని ఒత్తిడి చేసి, వేధింపులకు గురిచేస్తున్నారని వేటగాళ్లు వాపోతున్నారు. వేటలో పీతలు దొరక్కపోయినా తమను వేధిస్తూ హింసిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. తరచూ ఈ సంఘటనలు జరుగుతుంటే వేటగాళ్ల కుటుంబాలు ప్రాణ భయంతో బెంబేలెత్తున్నారు. వేటగాళ్లను తమ గుప్పెట్లో పెట్టుకుని మత్స్య సంపద దోచుకుంటున్నారనే ఉద్దేశంతో వారిని వెళ్లగొట్టాలని గ్రామ కమిటీ తీర్మానించుకుని ఆ మేరకు టామ్ టామ్ వేయించారు. ఈ సంఘటనలపై మండల తహసీల్దార్ సీహెచ్వీ ఆంజనేయప్రసాద్ను వివరణ కోరగా వివాదాలు వాస్తవమేనని, దీనిపై నెల రోజుల క్రితమే తాను ఎస్.ఐ కలిదిండి రాజేష్తో కలిసి వెళ్లి విచారించామన్నారు. వేటగాళ్లను వెళ్లగొట్టే చర్యలు ఎవరూ చేపట్ట వద్దని హెచ్చరించినట్లు చెప్పారు. వేటగాళ్లలో చాలామందికి ఆధార్కార్డులు కూడా లేకపోవడంతో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. వాస్తవానికి వీరిలో చాలామంది పీతల వేటకోసం సీజనల్గా ఈ ప్రాంతానికి వస్తుంటారని, దీనిపై జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని తహసీల్దార్ వివరించారు. ఆటోనగర్(విజయవాడతూర్పు): స్థానిక ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాలులో ఆదివారం నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి బాలబాలికల దివ్య ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీ్స్(యూఎఫ్క్యూఎస్) చైర్మన్ మొహమ్మద్ దావూద్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్లో విస్తరిస్తున్న అశ్లీల కంటెంట్, మొబైల్ గేమ్స్, యూట్యూబ్కు అతుక్కుపోయి చిన్నారులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులను సమాజం పట్ల బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే దైవ గ్రంథాలతో, దివ్య ఖురాన్తో పటిష్ట సంబంధం కల్పించడం అత్యంత అవసరమన్నారు. ఆ దిశగా గత 11 ఏళ్లుగా దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహిస్తూ, తల్లిదండ్రుల్లోనూ చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటి వరకు లక్ష మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించిన సెమీ ఫైనల్స్ ద్వారా మొత్తం 40 మంది బాల బాలికలు క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించారన్నారు. క్వార్టర్ ఫైనల్స్కు ఎంపికై న వారికి మెడల్తో పాటు సర్టిఫికెట్, నగదు బహుమతులను అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో జమాత్–ఎ–ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు హాఫిజ్ షౌకట్ ఫహీమ్, ఏటీఏ అధ్యక్షుడు రాజనాల వెంకటరమణారావు(బాబ్జీ), చిన్నారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బాలుడి మృతిపై ఆర్డీఓ విచారణ
మచిలీపట్నంఅర్బన్: గురుకుల పాఠశాల విద్యార్థి మృతి ఘటనపై బందరు ఇన్చార్జి ఆర్డీఓ పోతురాజు ఆదివారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల ఆర్థిక సహాయం, రెండు సెంట్ల స్థలం, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గురుకులం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందినట్లు విమర్శలున్నాయి. చెరువులో నుంచి బాలుడిని బయటకు తీసే సమయంలో ప్రాణం ఉన్నట్టు తెలిసినా, లైఫ్ సపోర్ట్ సదుపాయాలతో ఉన్న అంబులెన్స్ను ఏర్పాటు చేయలేదు. అత్యవసర పరిస్థితిలో బాలుడిని ఐదు కిలోమీటర్ల దూరం నలుగురు ఒకే బైక్పై తరలించడంపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. విచారణ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్ బాబా, జేడీ ఐ. శ్రీదేవి, కృష్ణా–ఎన్టీఆర్ జిల్లాల గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ ఎ. మురళీకృష్ణ, తహసీల్దార్ మధుసూదనరావు, ఎంఈ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు నాగరాజు, సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు బూర పూజిత, ఎస్.సమరం, విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల్లో ఆందోళన.. ఆదివారం గురుకులంలో పేరెంట్స్ మీట్ ఉండడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో గురుకులానికి వచ్చారు. సంఘటనా తెలుసుకున్న వారు విద్యార్థుల భద్రతపై ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీసుల రంగ ప్రవేశంతో ఆందోళన సద్దుమనిగింది. -
ఐక్యత చాటిన సత్యసాయి రన్ రైడ్ 5కే ర్యాలీ
మధురానగర్(విజయవాడసెంట్రల్): సేవా భావం, క్రమశిక్షణ శ్రీ సత్యసాయి భక్తుల ప్రత్యేకత అని.. యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ట్రాఫిక్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్కే షిరీన్ బేగం అన్నారు. స్థానిక సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో శ్రీసత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యాన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి రన్.. రైడ్.. 2026 5కే ర్యాలీ ఆదివారం జరిగింది. ర్యాలీలో డీసీపీ ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావుతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. రన్ రైడ్కు విశేష స్పందన ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం నగరంలో ఐక్యతా సందేశాన్ని చాటుతోందన్నారు. బాబా అందించిన ప్రేమ, కరుణ, సేవా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఐక్యతా భావం వ్యాప్తి, ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతు లక్ష్యంగా శ్రీ సత్యసాయి రన్ – రైడ్ – 2026 5కే రన్ నిర్వహించామన్నారు. కార్పొరేటర్ శర్వాణీ మూర్తి మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. 9 వేల మందికి పైగా 5కే రన్ రైడ్లో ఉత్సాహంగా పాల్గొని ఐక్యత, సమరసతకు ప్రతీకగా నిలిచారు. శ్రీ సత్యసాయి యూనివర్సల్ టార్చ్ ఆఫ్ పీస్ను బీఆర్టీఎస్ రోడ్డులో షిరీన్ బేగం, లక్ష్మణరావు మోశారు. ప్రపంచ వ్యాప్త్తంగా ఐక్యత, పవిత్రత, దైవత్వం సందేశాన్ని చాటేందుకు రూపొందించిన ఈ టార్చ్ను గతేడాది నవంబర్ 22న పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. తొలుత సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు, జాతీయ యువ సమన్వయకర్త లక్ష్మీకాంత్శర్మ, జిల్లా అధ్యక్షుడు జి.విశ్వనాథం, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ సురేంద్ర, సేవా సమన్వయకర్త కె.శ్యామ్ప్రసాద్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. సర్వమత ప్రార్థనలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన గాయకులు సర్వమత ప్రార్థనలు ఆలపించి, విశ్వ శాంతి కోసం ప్రార్థించారు. ప్రముఖ ఫిట్నెస్ కోచ్, జుంబా ఇన్స్ట్రక్టర్ బోదేష్ కుమార్ ఉత్సాహభరిత వార్మప్ సెషన్ నిర్వహించారు. బాలవికాస్ విద్యార్థుల సంగీత బృందం ఆకట్టుకునే ప్రదర్శనతో అందరిని మంత్రముగ్ధులను చేసింది. రన్లో పాల్గొన్న వారికి ప్రత్యేక టీ షర్టులు, ఫినిషర్ మెడల్స్ అందజేశారు. -
జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం
రోడ్లు వేసిన కొన్ని రోజులకే దెబ్బతిన్నాయి. భారీ వాహనాలు రాకపోకలు ఏమీ లేవు. కేవలం ద్విచక్ర వాహానాలు అంచుల పక్కకు వెళ్తేనే రోడ్లు బీటలు వారడంతో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వస్తున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నామమాత్రంగా పరిశీలించారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం. – తిక్కిశెట్టి వెంకటసీతారామప్రసాద్బాబు, మాజీ సర్పంచ్, గురువిందగుంట ఆ రోడ్డు వెంబడి లారీలు లోడుతో వెళ్లడం వల్ల కొత్తగా వేసిన రోడ్లు అంచులు దెబ్బతిని ఉండవచ్చు. ఈ విషయం నా దృష్టికి రాగానే ఆరా తీశాను. సచివాలయ సిబ్బంది నుంచి సమాచారం తీసుకున్నా. ధాన్యం లోడు లారీలు తిరిగినట్లు సమాచారం వచ్చింది. అయితే కొత్తగా వేసిన రోడ్లు కావడంతో తక్షణం సంబంధిత కాంట్రాక్టరుకు కూడా సమాచారం తెలియజేశా. సరిచేయాలని చెప్పాను. ఒకటి రెండు రోజుల్లో వాటిని సరి చేస్తామన్నారు. – ధర్మయ్య, ఏఈ, పంచాయతీ రాజ్, పెడన● -
నేత్రపర్వం.. ఆంధ్ర నాట్య వైభవం
విజయవాడ కల్చరల్: స్వరనర్తన సంగీత నృత్య శిక్షణా సంస్థ, బందరురోడ్డులోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆంధ్రనాట్య పోటీ విజేతలకు బహు మతి ప్రదానం, నాట్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధప్రసాద్ హాజరవగా.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, ఏపీ సృజనాత్మక సమితి చైర్ పర్సన్ పొగడపాటి తేజస్వి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునిరత్నం నాయుడు, విశ్రాంత హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి, నాట్యాచార్యుడు కళాకృష్ణ ఆంధ్రనాట్య వైభవం గురించి ప్రసంగించారు. నాట్యాచార్యుల బృంద సభ్యులు ప్రదర్శించిన నృత్యాలు నేత్ర పర్వంగా సాగాయి. బహుమతి ప్రదానం.. ● జూనియర్ విభాగంలో శారదా రామకృష్ణ బృందానికి ప్రథమ స్థానం, తమ్మిన జ్యోత్స్న బృందం, పెడమల్లు క్షీరసాగరానికి ద్వితీయం, కె. సాహితీ లక్ష్మి, ఉమామహేశ్వర పాత్రుడికి తృతీయ స్థానం లభించింది. ● సీనియర్స్ విభాగంలో శారదా రామకృష్ణకు ప్రథమం, సాయిమాధవికి ద్వితీయం, ఉమామహ్వేర పాత్రుడుకి తృతీయ బహుమతి లభించింది. ఆయా బృందాలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు.


