breaking news
Krishna District Latest News
-
ఏఐఎస్జీఈఎఫ్ ఉపాధ్యక్షుడు విద్యాసాగర్కు స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం):అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, జాతీయ కార్యవర్గ సభ్యుడైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణకు ఆ సంఘ నేతలు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. జాతీయ సమావేశానికి హాజరైన ఈ ఇరువురు న్యూఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి మంగళవారం రాత్రి చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి ఎన్టీఆర్ జిల్లా సంఘ అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి పి.రమేష్, కోశాధికారి సతీష్, కార్యనిర్వాహక కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షులు రామకృష్ణ, రాజబాబు, విజయవాడ నగర అధ్యక్షుడు సీవీఆర్ ప్రసాద్, గన్నవరం తాలుకా యూనిట్ అధ్యక్షుడు సాంబశివరావు తదితరులు స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా బుధవారం గూడూరు–విజయవాడ సెక్షన్లో విస్తతంగా తనిఖీలు చేపట్టారు. నెల్లూరు స్టేషన్లో అమృత్ భారత్ పథకంలో జరుగుతున్న స్టేషన్ పునరాభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ముందుగా అధికారులతో కలసి డీఆర్ఎం గూడూరు స్టేషన్లోని ప్లాట్ఫాంలు, స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ సకాలంలో పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. అక్కడ నుంచి నెల్లూరు స్టేషన్కు చేరుకుని స్టేషన్ ఆధునికీకరణ పనులను పర్యవేక్షించారు. నూతన భవన నిర్మాణాలు, ప్లాట్ఫాం పనులను పర్యవేక్షించి సకాలంలో పూర్తిచేయాలన్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక ప్రవేశ ద్వారాలు నెల్లూరు స్టేషన్కు ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. అనంతరం బిట్రగుంట, సింగరాయకొండ, ఒంగోలు స్టేషన్లను సందర్శించి సిబ్బందికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో గూడూరు–విజయవాడ సెక్షన్ అత్యంత కీలకమైనదన్నారు. ఈ సెక్షన్లో ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాల దిశగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో పనులు వేగంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. -
నేరస్తుల కదలికలపై నిఘా పెట్టండి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆర్.గంగాధర రావు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశపు హాలులో జిల్లాలోని పోలీసు అధికారులతో బుధవారం నేరసమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. జిల్లావ్యాప్తంగా డ్రోన్ కెమెరాల వినియోగం మరింత పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, చోరీలు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరి శీలించాలన్నారు. రాత్రి గస్తీ నిర్వహించే సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విషయంలో పోలీసులు వెంటనే స్పందించి కేసులు నమోదుచేయాలని స్పష్టంచేశారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి టీం బృందాలు మరింత చురుగ్గా పని చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరి మొబైల్లో శక్తి యాప్ ఉండేలా చూడాలన్నారు. యాప్ ద్వారా ఫిర్యాదు అందితే తక్షణమే స్పందించాలన్నారు. వాహనాల తనిఖీలు నిరంతరం నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి అధికారి తమ గ్రామాల్లో పల్లెనిద్రలు చేస్తూ అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు సిబ్బందికి రివార్డులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నేరసమీక్ష సమావేశంలో కృష్ణా జిల్లా ఎస్పీ -
మార్గదర్శులు స్వచ్ఛందంగా వచ్చేలా చర్యలు చేపట్టండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఉన్నత వర్గాల వారిని చైతన్యపరిచి పీ–4 కార్యక్రమంలో మార్గదర్శకులుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జేసీ గీతాంజలిశర్మతో కలిసి పీ–4 కార్యక్రమం పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 53,759 మంది పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామన్నారు. వీరిలో 48,375 బంగారు కుటుంబాలను 4,272 మార్గదర్శిలకు అనుసంధానం చేశామన్నారు. ఉన్నత వర్గాల వారు, ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో నివసిస్తున్న వారిని గుర్తించి సంప్రదించి వారికి పీ4 కార్యక్రమంపై సంపూర్ణ అవగాహన కలిగించాలన్నారు. పేద కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురావటమే ప్రధాన లక్ష్యమని, ఆర్థికంగా వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చటంలో సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించాలని మార్గదర్శిలకు సూచించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ మురళీకిషోర్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహిద్బాబు, సీపీవో భీమరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
వేర్వేరు కేసుల్లో బంగారం దొంగలు అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): అత్యాశకు పోయి యజమాని ఇంటిలో బంగారు దొంగిలించిన వేర్వేరు కేసుల్లో నిందితులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై విజయవాడ కమిషనరేట్ సెంట్రల్ డివిజన్ ఏసీపీ దామోదర్, సీఐ పవన్ కిషోర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. గురునానక్నగర్లోని కనకదుర్గ గెజిటేట్ ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉండే దేవరకొండ తేజశ్రీ(24) శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలోని 5వ క్రాస్రోడ్డులో ఉండే అసుసుమిల్లి శివలీల ఇంటిలో పనిమనిషిగా చేరింది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న రూ.13లక్షల విలువ చేసే 40 గ్రాముల డైమండ్ గాజులు, 114 ఆభరణాలను దొంగింలించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితురాలిపై పటమట పోలీసులు నిఘా పెట్టగా ఆమె వద్ద ఉన్న నగలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ● అశోక్ నగర్, వెంకటప్పయ్య వీధిలో నివాసం ఉండే బైసాని జనార్ధన్ కుటుంబసభ్యులు కుమారుడి వివాహం అనంతరం జూలై 31వ తేదీన శ్రీశైలం వెళ్లగా, ఆగస్టు 1వ తేదీన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉన్నాయని పనిమనిషి సమాచారంతో పటమట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయగా బెంజ్ సర్కిల్, నర్మదా లాడ్జ్ దగ్గరలో, ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్:3, ఎన్హెచ్ –16 సర్వీస్ రోడ్డు మార్జిన్ లో నిందితుడిని అదుపులో తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గుంటూరు అడవి తక్కెళ్లపాడుకు చెందిన ఉప్పల సురేష్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న 30 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.5 కేజీల వెండి వస్తువులు చోరీ చేయగా అతని వద్ద గుంటూరు జిల్లా పట్టాభిపురంలో దొంగతనం చేసిన 60 గ్రాముల బంగారు ఆభరణాలు, పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన 300 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు పాత నేరస్తుడని, అతనిపై ఉమ్మడి కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాలో పలు కేసులు ఉన్నాయని, నిందితుడు జల్సాలకు అలవాటు పడి సుమారు 20 నేరాలకు పాల్పడ్డాడని చెప్పారు. సమావేశంలో మహిళా ఎస్ఐలు దుర్గా దేవి, రేవతి, ఏఎస్ఐ వి.గోపి, హెచ్.సి అబ్దుల్ రషీద్ కానిస్టేబుల్ నరేశ్, మహిళా కానిస్టేబుల్ సునీత పాల్గొన్నారు. -
జెడ్పీ ఉద్యోగులకు ప్రమోషన్లు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): గణపతి నవరాత్రుల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు స్పష్టంచేశారు. తన కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. పందిళ్లు ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలు పోలీసు, విద్యుత్, మునిసిపాలిటీతో పాటు గ్రామాల్లో పంచాయతీల నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. పందిళ్ల వద్ద సీసీ కెమెరాలతో పాటు అగ్ని ప్రమాద నివారణ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లను ఉంచాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణమే పోలీసులతో పాటు అగ్నిమాపకశాఖకు సమాచారం అందించాలని సూచించారు. ఐదు నుంచి పది మంది వలంటీర్లు విధులు నిర్వర్తించేలా చూడాలని, కమిటీ నిర్వాహకులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. నిమజ్జనంఊరేగింపుల రూట్ మ్యాప్లను పోలీసులకు కచ్చితంగా తెలియజేయాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగేలా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానం పథకం అమలులో జరుగుతున్న అవకతవకలపై ఆలయ ఈఓ శీనానాయక్ దృష్టి సారించారు. ఈ నెల 11న ‘అమ్మ సన్నిధిలో లెక్కల్లోనే భోజనం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఈఓ స్పందించారు. అన్నదానం సంబంధించిన ప్రదేశాలను స్వయంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ పథకంపై ఈఓ దృష్టి సారించడంతో రికార్డుల్లో భక్తుల సంఖ్య నమోదు గణనీయంగా తగ్గింది. ఈ తేడాను గమనించిన ఈఓ బాధ్యులైన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదానాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఇందులో కీలక పాత్రధారిగా వ్యవహరిస్తున్న జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ స్వామిని డోనర్ సెక్షన్కు బదిలీ చేశారు. ఈఓ తీసుకొంటున్న చర్యపై భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అన్నదానంలో జరి గిన అవకతవకల్లో మరో ఉద్యోగి పాత్ర ఉందని, అతడిని కూడా అక్కడి నుంచి తప్పిస్తే పూర్తిస్థాయి ప్రక్షాళన జరుగుతుందన్న భావన సిబ్బందిలో వ్యక్తమవుతోంది. లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగంలో పీహెచ్డీ స్కాలర్స్ చేసే పరిశోధనా అంశాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచించారు. ఉపయోగకరమైన పరిశోధనలు, ప్రచురణల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే అంశంపై బుధవారం హెల్త్ యూనివర్సిటీలో ఆన్లైన్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల నుంచి టీచింగ్ వైద్యులు, పోస్టు గ్రాడ్యుయేట్లు, సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లు 637 మంది పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గురుగావ్ నుంచి వచ్చిన నటాష గులాటీ మాట్లాడుతూ.. పీహెచ్డీలు చేసే వారు ఏదో డిగ్రీ కోసం కాకుండా, నూతన వైద్య విధానాలు, పద్ధ తులు, వైద్యం పరంగా ప్రజలకు ఉపయోకరమైన అంశాలను ఎన్నుకోవాలన్నారు. పీహెచ్డీ స్కాలర్స్ సమర్పించిన పత్రాలను ప్రచురణల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే వాటికి సార్థ్ధకత లభిస్తుందన్నారు. ఈ సదస్సులో రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో చేరేందుకు మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటుగా 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐలో చేరవచ్చునని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 26వ తేదీలోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ లోగాని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు స్వయంగా వచ్చి గాని దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 27వ తేదీన దరఖాస్తు చేసుకున్న కళాశాలకు స్వయంగా వెళ్లి సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలని తెలియజేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి అయిన వారు మాత్రమే కౌన్సెలింగ్లో హాజరు అవడానికి అర్హులని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చేరే విద్యార్థులకు ఈ నెల 29వ తేదీన, ప్రవేటు ఐటీఐ కళాశాలలో చేరే విద్యార్థులకు ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కనకరావు వివరించారు. ఇతర వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. నందిగామ టౌన్: ఇంటిలోని ఫ్యాన్కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన కాసర్ల లక్ష్మయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు మనోజ్ (24) జేసీబీ ఆపరేటర్గా పని చేస్తూ మద్యానికి బానిసై నిత్యం మద్యం తాగుతుండటంతో పలుమార్లు తండ్రి మందలించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి తండ్రితో వాగ్వాదానికి దిగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన మనోజ్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి మనోజ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వైవీఎల్ నాయుడు తెలిపారు. మృతుని తండ్రి లక్ష్మయ్య కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంజిసర్కిల్ సమీపంలోని ఐరా హోటల్ ముందు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఒక వ్యక్తి మద్యం తాగి తూలుతూ నడుస్తూ రోడ్డు పక్కన పడిపోయాడు. కాళ్లు, చేతులు కొట్టుకుంటుండగా చుట్టుపక్కల వారు అతనిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుని వద్ద ఊరు, పేరుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని, వయస్సు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తెలిపారు. హోటల్ వాచ్మన్ నర సింహారావు బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
ఉండవల్లిలో నవ వధువు ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లికి చెందిన రంగనాయకమ్మ (24)కు ఈ నెల 17వ తేదీన ఉండవల్లి సెంటర్లో నివాసం ఉంటున్న జితేంద్రతో వివాహం చేశారు. బుధవారం జితేంద్ర తన భార్య ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చాడు. పది నిమిషాల అనంతరం తిరిగి లోనికి వెళ్లేందుకు రాగా గదికి గడియ పెట్టి ఉంది. జితేంద్ర తలుపులు పగలగొట్టగా.. రేకుల గదిలోని ఇనుప రాడ్కు చున్నీతో రంగనాయకమ్మ ఉరి వేసుకుని కనిపించింది. ఏడాదిగా కడుపునొప్పితో బాధ పడుతోందని, దానివల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అక్రమాలకు అడ్డాగా ఎన్టీఆర్ వైద్య సేవలు
●చిన్న వ్యాధులు తీవ్రమైనవిగా చూపి తప్పుడు బిల్లులు ●కూటమి పాలనలో పక్కదారి పడుతున్న పథకం ●కేవలం 14 నెలల్లోనే జిల్లాలో 9,120 థెరపీలపై 18.07 కోట్ల వ్యయం ●నాడు పేదలకు అండగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ●నేడు అవినీతికి ఆలవాలంగా ఎన్టీఆర్ వైద్య సేవ మచిలీపట్నంఅర్బన్: కృష్ణాజిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పుడు అక్రమాలకు వేదికగా మారింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి సంబంధించి 31 విభాగాలలో 3,257 జాబితాబద్ధమైన థెరపీ చికిత్సలు ఉన్నాయి. చిన్న చిన్న జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు తీవ్రమైన వ్యాధులున్నట్టు జాబితాబద్ధమైన థెరపీలు చూపిస్తూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో నమోదు చేస్తున్నారు. తప్పుడు రిపోర్టులు సృష్టించి, వైద్యానికి అయిన వ్యయం ప్రభుత్వానికి పంపించి నిధులను గుంజుతున్నారు. గతంలో పేదలకు అండగా ఉన్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, నేడు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో అవినీతి పథకంగా దిగజారిపోయింది. కూటమి పాలనలో పక్కదారి పడుతున్న పథకం కూటమి ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేయకుండా ఎన్టీఆర్ వైద్య సేవల నుంచి వచ్చే నిధులతోనే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, అభివృద్ధి జరపాలని ఆదేశాలు ఇచ్చింది. సంపాదించిన ఆదాయంలో 20 శాతం రివాల్వింగ్ ఫండ్ గా నిల్వ ఉంచి పునరావృత సహాయం అందేలా సూచించింది. దీంతో కొన్ని ఆసుపత్రులలో వైద్య సిబ్బంది రోగుల అసలు పరిస్థితి పక్కన పెట్టి, ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో డబ్బులు వచ్చే అవకాశాలున్న జబ్బులు చూపి బిల్లులు గుంజుతున్నారు. థెరపీల వ్యయం ఆందోళన కలిగించే స్థాయికి: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ వ్యయం ఆందోళన కలిగించే స్థాయికి చేరింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కృష్ణాజిల్లాలో మొత్తం 1,381 థెరపీలకు రూ 2.87 కోట్లు వ్యయం కాగా 2023–24 లో 4,484 థెరపీలకు రూ 8.50 కోట్లు, 2024–25లో 7,078 థెరపీలకు రూ 14 కోట్లు వ్యయం అయింది. 2025 ఏప్రిల్ నుంచి జూలై వరకు కేవలం నాలుగు నెలల కాలంలోనే 2,032 థెరపీలకు రూ.4.07 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి వ్యయం చూపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలోనే జిల్లాలో 9,120 థెరపీలపై 18.07 కోట్ల భారీ వ్యయం కావటం పథకం పూర్తిగా పక్కదారి పట్టిందనడానికి నిదర్శనం. జాబితాబద్ధ థెరపీల పేరిట అక్రమాలు ఎన్టీఆర్ వైద్య సేవలలో జాబితాబద్ధమైన థెరపీల పేరుతో కూడా విచిత్రమైన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. ఏ థెరపీకి సంబంధం లేకపోయినా, కేవలం ఉచిత ఓపీ ఇవాల్యుయేషన్ పేరుతో రోగులను నమోదు చేసి బిల్లులు సృష్టించడం సాధారణంగా మారింది. జాబితాబద్ధమైన థెరపీలకు చెందిన ప్రీ–ఎగ్జిస్టింగ్ కేసులు కూడా కవరేజ్లో చేర్చుతున్నట్లు చూపించి, ఇప్పటికే చికిత్స పొందిన రోగులపై కొత్తగా ఖర్చులు చూపిస్తున్నారు. ఈ విధంగా తప్పుడు బిల్లుల సృష్టి ద్వారా నిధులు గుంజుతున్న ఘటనలు ప్రభుత్వ ఆసుపత్రులపై తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బిల్లుల దోపిడీపై ప్రజల ఆందోళన ప్రభుత్వ బడ్జెట్ మంజూరుపై ఆధారపడకుండా, కేవలం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నుంచి వచ్చిన డబ్బులపై ఆసుపత్రులు నడుస్తున్నాయన్న వాస్తవం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని, తప్పుడు రిపోర్టులతో బిల్లులు సృష్టించి డబ్బులు గుంజుతున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. నాడు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేదల పాలిట వరం. నేడు ఎన్టీఆర్ వైద్య సేవ అక్రమాలకు అడ్డా. గతంలో చికిత్స పొందిన రోగులకు కొత్తగా ఖర్చులు చూపిస్తూ, తప్పుడు బిల్లులు సృష్టించి నిధులు గుంజుతున్నారు. కూటమి పాలనలో ఎన్టీఆర్ వైద్యసేవ అవినీతిమయం అయిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
సువర్ణ శోభితం... కృష్ణవేణి సోయగం
ఇదేదో ప్రఖ్యాత చిత్రకారుడు గీసిన అద్భుత చిత్రంలా ఉంది కదూ...ఆకాశం కాన్వాస్పై ప్రకృతి గీసిన చిత్రం ఇది. నాగాయలంక శ్రీరామపాదక్షేత్రంలో బుధవారం సాయం సంధ్య వేళ కనువిందు చేసిన దృశ్యకావ్యం. ఓ వైపు కృష్ణానదికి తూర్పువైపు మండపాన కొలువైన శ్రీరామలింగేశ్వర స్వామికి సూర్య కిరణాలతో వింజామర వీచినట్లు అస్తమించిన సూర్యుని కిరణాలు ఉవ్వెత్తున పైకిలేచి శివయ్యకు రంగు రంగుల వింజామరను పరచినట్లు ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమైంది. మరోవైపు కృష్ణవేణి మాత విగ్రహం సువర్ణ నదీ జలాల్లో విహరిస్తున్నట్టు శోభాయమానంగా మెరిసింది. ఈ అందమైన దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. –నాగాయలంక -
మా పొట్ట కొట్టొద్దు సారూ..!
పెడన: ఎన్డీయే కూటమి ప్రభుత్వం కుడి చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి... కుర్ర చేత్తో లాగేసుకుంటోందని దివ్యాంగులు వాపోతున్నారు. పింఛన్లు నిలుపుదల చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న దివ్యాంగులు బుధవారం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పొట్టలు కొట్టవద్దంటూ అధికారులను ప్రాథేయపడుతున్నారు. పెడన పట్టణంలో మంచానికే పరిమితమై బెడ్రిడింగ్ ఉన్న వారు 24 మంది ఉంటే వీరిలో 21 మంది ఫేక్ అని, మరో ముగ్గురు మాత్రమే రూ.15వేలు పింఛనుకు అర్హులని పేర్కొంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం గమనార్హం. సదరం సర్టిఫికెట్ ద్వారా 90 శాతం నుంచి 80 శాతానికి వికలాంగత్వాన్ని తగ్గించి రూ.15వేలు పింఛను కాస్తా రూ.6 వేలుకు మార్పు చేసింది. దీంతో వారంతా బుధవారం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు మొరపెట్టుకుని అప్పీల్ చేసుకున్నారు. పట్టణంలోని 9వ వార్డుకు చెందిన పోలిశెట్టి తిరుమలరావు చేనేత కార్మికుడు. రూ.6 వేలు కూడా రద్దు చేశారు... కుడి కన్ను పోయింది. ఎడమ కన్నుతో కూడా చూపు అంతంత మాత్రమే. రూ.6వేలు పింఛను పొందుతున్న ఇతనికి సదరం సర్టిఫికెట్లో వికలాంగశాతం 40 కంటే తక్కువ ఉందని చూపించి ఏకంగా పింఛను రద్దు చేసేశారు. మున్సిపాలిటీ పరిధిలో 548 వికలాంగుల పింఛన్లు ఉండగా వీటిల్లో పది మందిపై అనుమానంతో రిజెక్ట్ చేశారు. వీరిలో ఐదుగురికి వికలాంగుల పింఛను నుంచి వృద్ధాప్య పింఛనుగా మార్పు చేశారు. మరో ఐదు పింఛన్లు రద్దు చేశారు. పింఛను మార్పు, రద్దు చేసిన వారికి అనుమానాలుంటే నోటీసులు అందిన 30 రోజుల్లోగా తిరిగి అప్పీల్ చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.చంద్రశేఖరరెడ్డి చెప్పారు. – మండలంలో వికలాంగుల పింఛన్లు రూ.6వేలుకు సంబంధించిన వారు 854 మంది ఉండగా వీరిలో 45 మందికి వికలాంగత్వ శాతం తక్కువగా ఉందని పేర్కొంటూ నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు 21 మందికి నోటీసులు జారీ అవగా, మరో 24 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. రూ.15వేలు పింఛను పొందుతున్న వారు 17 మంది ఉండగా వీరిలో ముగ్గురి పింఛన్లు రద్దు చేశారు. వీరికి నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న వారు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని ఇన్చార్జి ఎంపీడీవో కేవీఎస్వీ శివప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్న దివ్యాంగులు పెడన పట్టణంలో రూ.15 వేలు పింఛను పొందేవారు 24 మంది వారిలో 21 మంది ఫేక్ అంటూ నోటీసులిస్తున్న అధికారులు అప్పీల్ చేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన బాధితులు -
బాస్కెట్ బాల్ విజేత హిందుస్థాన్ జట్టు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్విటేషనల్ పురుషుల బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఫైనల్స్ బుధవారం రాత్రి సిద్ధార్థ కళాశాల మైదానంలో జరిగాయి. లయోలా కళాశాల(చైన్నె), హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(చైన్నె) జట్ల మధ్య ఫైనల్స్ పోటీ రసవత్తరంగా సాగింది. లయోలా జట్టుపై హిందుస్థాన్ జట్టు విజయం సాధించింది. హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ జట్టు 81 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 46 పాయింట్లతో లయోలా కళాశాల రన్నరప్గా నిలిచింది. విజేత జట్టుకు రూ.75 వేల నగదు, రన్నరప్ జట్టుకు రూ.50 వేల నగదును సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, అకాడమీ సభ్యులు కలిసి అందజేశారు. ఏపీ సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, అకాడమీ అడ్వయిజర్ ప్రొఫెసర్ ఎల్కే మోహనరావు, శాప్ మాజీ చైర్మన్ అంకమ్మ చౌదరి, సిద్ధార్థ కళాశాల క్రీడా విభాగాధిపతి డాక్టర్ బాలకృష్ణారెడ్డి క్రీడాకారులను అభినందించారు. -
ఎలీసా టెస్ట్తో నిర్ధారణ
స్క్రబ్ టైఫస్ వ్యాధికి గురైన వారిని తరచూ చూస్తుంటాం. వ్యాధిని నిర్ధారించేందుకు ఎలీసా పరీక్ష అందు బాటులో ఉంది. స్క్రబ్ టైఫస్ వచ్చిన వారికి కచ్చితమైన యాంటిబయోటిక్ ఇవ్వడం ద్వారా నివారించవచ్చు. వ్యాధిని అశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై ప్రభావం చూపి, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంపై నల్లటి మచ్చలు ఉండటాన్ని గుర్తించవచ్చు. – డాక్టర్ టి.వి.మురళీకృష్ణ, జనరల్ మెడిసిన్ నిపుణుడు -
ఉత్సాహంగా 5కే మారథాన్ రెడ్ రన్
మధురానగర్(విజయవాడసెంట్రల్): యువతలో హెచ్ఐవీ/ఎయిడ్స్పై అవగాహన పెంపొందించేందుకు మారథాన్ రెడ్ రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ – టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ బి.భానూనాయక్ తెలిపారు. స్థానిక సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో మంగళవారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ విభాగం, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల మారథాన్ పోటీలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ భానూనాయక్ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ శ్యాంసన్తో కలిసి మారథాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెచ్ఐవీ/ఎయిడ్స్పై అవగాహన పెంచుకోవాలన్నారు. హెచ్ఐవీ బాధితులను ఆదరించాలని సూచించారు. పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్ విభాగాల వారీగా పోటీలు నిర్వహించారు. 5కే మారథాన్ పోటీల్లో జిల్లాలోని పలు కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలు వీరే... ఈ పోటీలలో పి.వినయ్ (పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ – సైన్సు కళాశాల) ప్రథమ, వై.లక్ష్మీతిరుమలరావు (ఆంధ్ర లయోల కళాశాల) ద్వితీయ స్థానాల్లో నిలిచారు. మహిళా విభాగంలో ఎస్.నిషా(ఎస్డీఎం. సిద్ధార్థ మహిళా కళాశాల), వి.హన్నా (ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల) వరుసగా తొలి రెండు స్థానాలు సాధించారు. ట్రాన్స్జెండర్ విభాగంలో ఎం.రాజి ప్రథమ, బి.మాయ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ పోటీలను ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వ్యాయామ విద్య విభాగాధిపతి యుగంధర్ సమన్వయం చేశారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7వేలను త్వరంలో కలెక్టర్ చేతుల మీదుగా అందజేస్తామని డాక్టర్ భానూ నాయక్ తెలిపారు. -
కూటమి నిరంకుశానికి లక్ష్మి మృతి నిదర్శనం
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్ పెదపూడి(మొవ్వ): కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు మేడం లక్ష్మి మృతి నిదర్శనమని, ఆమె మరణానికి సర్కారే కారణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే ౖకైలే అనిల్కుమార్ పేర్కొ న్నారు. పెన్షన్ తొలిగించారనే మనోవ్యథతో పెద పూడి గ్రామంలో దివ్యాంగురాలు మేడం లక్ష్మి మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి కైలే అనిల్కుమార్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయంగా తన పెన్షన్ తొలగించారన్న మనోవ్యథతో లక్ష్మి మరణించటం బాధాకరమన్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నది పరీవాహక ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలి పటమట(విజయవాడతూర్పు): నగరంలో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం డ్యామ్ నుంచి మంగళవారం ఉదయం 5.5 లక్షల క్యూసెక్కుల వరద విడుదలవుతోందని, దీంతో హెచ్చరిక జారీ చేశారని తెలిపారు. పులిచింతల డ్యామ్ నుంచి కూడా వరద ప్రవాహం పెరుగుతోందని జలవనరుల శాఖ అధికారులు ప్రమాదక హెచ్చరికలు జారీ చేశారని వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని వివరించారు. బ్యారేజీ వద్ద వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరికకంటే ఎక్కువగా ఐదు లక్షల క్యూసెక్కులకు చేరుకుందని పేర్కొన్నారు. వరద ఆరు లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లోకి తరలి రావాలని కమిషనర్ సూచించారు. ఆయా ప్రాంతాల ప్రజలు వీఎంసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. విద్యుదాఘాతంతో బాలుడి మృతి పమిడిముక్కల: విద్యుదాఘాతంతో బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని గురజాడ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీకి చెందిన కాండ్రు అబుషలేం కుమారుడు హర్షవర్ధన్ (13) తాడంకి హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి తమ కాలనీలో జరిగే వివాహ వేడుకకు వెళ్లాడు. విద్యుత్ పోల్ నుంచి పెళ్లి పంది రికి లైటింగ్ లాగారు. వర్షం పడుతుండటంతో పెళ్లిపందిరి వద్ద ఉన్న ఐరన్ రాడ్కు విద్యుత్ సరఫరా జరిగింది. ఈ విషయం తెలియని హర్షవర్ధన్ ఆ రాడ్ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. బైక్ దొంగలకు జైలు శిక్ష మైలవరం: బైక్ చోరీ కేసులో ఇద్దరు దొంగలపై నేరం రుజువు కావడంతో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఎస్ఐ సుధాకర్ కథనం మేరకు.. మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలు జరిగాయి. ఈ చోరీలపై కేసులు నమోదయ్యాయి. జి.కొండూరు మండలం గంగినేని గ్రామానికి చెందిన ఎం.నాగ తిరుపతిరావు, పల్లెపు మారేశ్వరరావును పోలీసులు నిందితులుగా గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేసి 2024 సెప్టెంబర్ 12వ తేదీన అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సకాలంలో విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో మైలవరం జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఎం.శైలజ మంగళవారం మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.కృష్ణకిశోర్ వాదనలు వినిపించారు. నిందితులను నూజివీడు సబ్ జైలుకు పంపించినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఐదు ఇసుక టిప్పర్ల పట్టివేత ఆటోనగర్(విజయవాడతూర్పు): ఇసుక తరలిస్తున్న ఐదు టిప్పర్ లారీలను విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. కృష్ణానదికి వరద వచ్చినప్పటికి పాత వీబీఎం డిగ్రీ కాలేజీ సమీపంలోని జంక్షన్ వద్ద ఇసుక తరలిస్తున్న లారీలను గుర్తించారు. లారీ డ్రైవర్లకు ట్రాఫిక్ ఎస్ఐ పి.రాజేంద్రబాబు కౌన్సెలింగ్ ఇచ్చారు. కృష్ణానదికి వరద వచ్చినా లారీల్లో ఇసుక ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు? అనుమతులు చూపాలంటూ ఎస్ఐ డ్రైవర్లను ప్రశ్నించారు. డ్రైవర్ల నుంచి సమాధానం రాకపోవడంతో ఒక్కో లారీకి రూ.2,035 జరిమానా విధించారు. వరద తగ్గేంత వరకు ఇసుక లారీలు, ట్రాక్టర్లు గాని రావడానికి వీలులేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. -
ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి ఫొటో జర్నలిస్టులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, వాటిలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దడంలోనూ ఫొటో జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. వివిధ మోడళ్ల కెమెరాలను కలెక్టర్ క్లిక్ మనింపించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు తొమ్మిది రాష్ట్రాల నుంచి స్పాట్ న్యూస్, జనరల్ కేటగిరీలో 552 ఫొటోలు రాగా 50 ఫొటోలకు బహుమతులు లభించాయి. విజేతలకు సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్, కలెక్టర్ లక్ష్మీశ జర్నలిస్టు, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ల ప్రతినిధులతో కలిసి అవార్డులు ప్రదానం చేశారు. ఏపీ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ మాట్లాడుతూ.. ఒక ఛాయాచిత్రం వేయి భావాల నేత్రమని, వేల కథనాలకు సరిసాటి అని పేర్కొ న్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టు పి.వి.కృష్ణారావు, సీనియర్ ఫొటో జర్నలిస్టులు సీహెచ్.వి.మస్తాన్, సీహెచ్.నారాయణరావు, ఐ అండ్ పీఆర్ శాఖలో సీనియర్ ఫొటోగ్రాఫర్గా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న వి.వి. ప్రసాద్ను సత్కరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
26న ఆశ వర్కర్స్ యూనియన్ మహాసభ
మధురానగర్(విజయవాడసెంట్రల్): మైలవరంలో ఈ నెల 26వ తేదీన ఎన్టీఆర్ జిల్లా ఆశ వర్కర్స్ యూనియన్ ఆరో మహాసభ జరుగుతుందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి తెలిపారు. ఆశ వర్కర్ల యూనియన్ ఎన్టీఆర్ జిల్లా సమావేశం పి.జ్యోతి అధ్యక్షతన సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 ఏళ్లుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆరోగ్యపరమైన సేవలు అందించ డంలో ఆశ వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. షుగర్, బీసీ, లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ వంటి అనేక రకాల వ్యాధిగ్రస్తులకు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, పనిచేయని ఫోన్లు, సిమ్లు వంటి సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వకంగా జీఓలు ఇవ్వాలని, మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఆశ వర్కర్లకు వేతనాలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల, జిల్లా నాయకులు కె.బేబీరాణి, జి.దయామణి, పి.శ్రావణి, ఎస్.జోత్స్న, టి.రాజామణి కె.సైదమ్మ, వై.నాగలక్ష్మి ఎస్.హేమకుమారి, చిలకమ్మ పాల్గొన్నారు -
ఫుడ్సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు
మధురానగర్(విజయవాడసెంట్రల్): కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్, లీగల్ మెట్రా లజీ ఆదేశాల మేరకు మంగళవారం నగరంలో పలు హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలపై జాయింట్ ఫుడ్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ డెప్యూటీ కంట్రోలర్ ఆధ్వర్యాన విస్తృతంగా తనిఖీలు జరిగాయి. సత్యనారాయణపురం భగత్సింగ్రోడ్డులోని యూఎస్ బేక్ హౌస్లో ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. బేక్ హౌస్లో కాలంచెల్లిన ఆహార పదార్థాలను, ఫ్రిజ్లో నాన్వెజ్ తోపాటు పాడైన బేకరీ పదార్థాలను నిల్వచేయడాన్ని, ఆహార పదార్థాల్లో రంగులను కలుపడాన్ని గుర్తించారు. కనీస పరిశుభ్రత లేకపోవటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బేకరీకి లైసెన్సు కూడా లేదని అధికారులు పేర్కొన్నారు. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. నగరంలో 20 బృందాలుగా ఏర్పడిన అధికారులు 39 హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలను తనిఖీ చేశామన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలను ఉల్లంఘించిన, పరిశుభ్రత పాటించని 13 వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసి, నోటీసులు ఇచ్చారు. సుమారు 100 కిలోల నిల్వ ఉంచిన, పాడైన చికెన్ను పడేశారు. ల్యాబుల నుంచి ఫలితాలు వచ్చిన తదుపరి బాధ్యులపై ఫుడ్ సేఫ్టీ – స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం చర్యలు తీసుకుంటామని పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. ఈ తనిఖీలలో వివిధ జిల్లాలకు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, సహాయ ఆహార నియంత్రణాధికారులు, లీగల్ మెట్రోలాజీ అధికారులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు మంగళవారం విరాళాలను సమర్పించారు. పెనమలూరు మండలం కానూరు చనుమోలురావు నగర్కు చెందిన కొల్లి మోహనకృష్ణారెడ్డి, కొల్లి వీరవెంకటశివ ప్రసాద్రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి శర్వరెడ్డి పేరిట రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. రామవరప్పాడుకు చెందిన కడియాల శాంతి సుభాష్ పేరిట నిత్యాన్నదానానికి రూ.1,00,008ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
మంగళగిరిలో ఇన్నోవేషన్ హబ్
నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి మంగళగిరి టౌన్: యువతలోని వినూత్న ఆలోచనలను మెరుగుపట్టి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ను మంగళగిరిలో ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగర పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న మయూరి టెక్ పార్క్లో ఈ హబ్ ఏర్పాటైంది. దీనిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. యువతకు ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ సూర్యతేజ తెలిపారు. -
స్క్రబ్ టైఫస్.. అరుదైన జ్వరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాధారణంగా వర్షాకాలంలో దోమ కాటు కార ణంగా మలేరియా, డెంగీ వంటి జ్వరాలు ప్రబలుతాయి. గడ్డి, పిచ్చి చెట్లలో పెరిగే సుట్సుగా ముషి కీటకం కుట్టిన వారికి స్క్రబ్ టైఫస్ జ్వరం సోకుతుంది. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురు ఈ జ్వరాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. స్క్రబ్ టైఫస్ సోకిన వారు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది నవంబర్లో పదేళ్ల బాలుడు తీవ్రమైన జ్వరంతో విజయవాడలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో చేరాడు. రెండు రోజులైనా జ్వరం తీవ్రత తగ్గలేదు. డాక్టర్కు అనుమానం వచ్చి బాలుడి శరీరాన్ని నిశితంగా పరిశీలించగా ఓ మచ్చ కనిపించింది. వెంటనే పరీక్షలు చేయించగా బాలుడికి సోకింది స్క్రబ్ టైఫస్ జ్వరంగా తేలింది. గుంటూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి గత ఏడాది విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేరగా, వైద్య పరీక్షల్లో అతనికి సోకింది స్క్రబ్ టైఫస్గా తేలింది. అతనికి సకాలంలో వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పింది. స్క్రబ్ టైఫస్ కొన్నేళ్లుగా తరచుగా వింటున్న అరుదైన జ్వరం. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రితో పాటు, పలు కార్పొరేట్ ఆస్పత్రులకు ఉమ్మడి జిల్లాతో పాటు, పొరుగు జిల్లాల నుంచి బాధితులు వస్తున్నారు. సాధారణ జ్వరంలా కనిపించే స్క్రబ్ టైఫస్ను సకాలంలో గుర్తించకుంటే ప్రాణాంతకమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తొలుత ఆకస్మిక జ్వరంతో ప్రారంభమై క్రమేణా లివర్, కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుందని, రక్తనాళాలు దెబ్బతినడం, తెల్ల రక్తకణాలపై ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు. వ్యాధి ఎలా వ్యాపిస్తుందంటే దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివశించే వారికి ఎక్కు వగా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకు తుంది. గడ్డి, చెట్లు, పొలాల్లో ఉంటే సుట్సుగాముషి అనే కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ కీటకాల్లో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కొందరికి కీటకం కుట్టిన వారం రోజుల వ్యవధిలో వ్యాధి సోకుతుంది. మరి కొందరిలో కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు ఇలా... సుట్సుగాముషి కీటకం కుట్టిన వారిలో జ్వరం అకస్మాత్తుగా వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, చలి, కండరాల నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. కళ్లు తిరగడం, మగత, వాంతులు కూడా అవుతుంటాయి. ఇలాంటి వారి శరీరంపై పరిశీలిస్తే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. ఈ వ్యాధిని నిర్ధారించేందుకు ఏలీసా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రభావం ఇలా.. స్క్రబ్ టైఫస్ సోకిన వారిలో అధిక జ్వరంతో పాటు, న్యూమోనైటీస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యుట్రెస్పిరేటరీ డిస్ట్సెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతుంటారు. కిడ్నీలు పనిచేయకపోవడం, హృదయ కండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం, తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాలేయం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరకోవచ్చు. వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యం పొందడం ద్వారా ఎలాంటి ప్రభావం చూపకుండా బయటపడొచ్చు. కీటకం కుడితే శరీరంపై ఏర్పడే మచ్చ వ్యాధి కారక సుట్సుగాముషి కీటకం స్క్రబ్ టైఫస్ వ్యాధి మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారికి సోకితే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. హెచ్ఐవీ రోగులకు సోకినా ప్రాణాంతకమే. చిన్నపిల్లలు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాధి సోకితే ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి వారు తగిన సమయంలో చికిత్స పొందాల్సిన అవసరం ఉంది. -
మహిళా సాధికారతే లక్ష్యం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, సాధికారతే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. నగరంలోని కేబీఎన్ కళాశాలలో ‘మహిళల సంక్షేమం, భద్రత, రక్షణ, సాధికారతపై జిల్లా స్థాయి అవగాహన సమావేశం’ మంగళవారం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సాధికారత సంస్థ, కేబీఎన్ కళాశాల ఉమెన్స్ స్టడీ సెంటర్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాయపాటి శైలజ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు సైబర్ నేరాల ముప్పు పొంచి ఉందన్నారు. మహిళలు డిజిటల్ భద్రతపై చైతన్యం పెంచుకోవాలని, అవసరమైన సమయంలో ప్రభుత్వ హెల్ప్లైన్స్, చట్టపరమైన రక్షణను ఉపయోగించుకోవాలని సూచించారు. బాలికలు, మహిళలపై అన్యాయాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యురాలు రాధాకుమారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి షెక్ రుఖ్సానా సుల్తాన్ బేగం, మహిళా కమిషన్ కార్యదర్శి అనురాధ, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి, కార్యదర్శి టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ దూకుడు
సాక్షి, ప్రతినిధి, విజయవాడ: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. మంగళవారం ఉదయం 6గంటలకు 3.22 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద నీరు సాయంత్రానికి 4.66లక్షలు, రాత్రికి 4.87లక్షలకు చేరింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద క్రమేపీ పెరగటంతో ఆ నీరు బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద 5 లక్షల నుంచి 6 లక్షలకు చేరుతుందన్న అంచనాతో కృష్ణా దిగువ ప్రాంతంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అధికారులకు సెలవులు రద్దు.. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వరద ప్రవాహం పెరగటంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను అప్రమత్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన క్షేత్ర స్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాలైన తోట్లవల్లూరు, పెనమలూరు, కోడూరు, నాగాయలంక తదితర మండలాలు.. బుడమేరు పరీవాహక ప్రాంతంలోని మండలాల అధికారులు, సిబ్బంది పనిచేసే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల నియంత్రణకు వచ్చేంతవరకు ఎవరికీ ఎటువంటి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. వరద నీరు 6 లక్షల క్యూసెక్కులకు దాటితే లంక గ్రామాల్లోని ప్రజలను తప్పనిసరిగా సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన పడవలను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ● ఎస్పీ గంగాధర్ రావు మాట్లాడుతూ రాత్రి సమయంలో వరద నీటి పరిస్థితి ఎలా ఉందో తెలియక కాజ్వేలు దాటేందుకు కొందరు ప్రజలు ప్రయత్నిస్తుంటారని అక్కడ తప్పనిసరిగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ● జల వనరుల శాఖ ఎస్ఈ మోహన్రావు మాట్లాడుతూ వరద ప్రవాహం 5.66 లక్షల క్యూసెక్కులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామన్నారు. సమావేశంలో జేసీ గీతాంజలి శర్మ, డీఆర్ఓ కె. చంద్రశేఖరరావు, జిల్లా అధికారులు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద బ్యారేజీ నుంచి 4.87లక్షలు క్యూసెక్కులు దిగువకు విడుదల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు స్థానికంగా వర్షం తగ్గుముఖం పట్టడంతో కొంత ఉపశమనం ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మునేరు ఉద్ధృతి తగ్గింది. మునేరుతో పాటు, స్థానిక వాగుల నుంచి 25వేల క్యూసెక్కుల నీరు మాత్రమే కృష్ణా నదికి వచ్చి చేరుతోంది. చిరు జల్లులు మాత్రమే కురవడంతో విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బుడమేరు వరద నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పడవలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వస్తున్న వరదకు చెవిటికల్లు వద్ద ఉన్న గనిఅతుకులంక చుట్టూ నీరు చేరడంతో అక్కడి వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని చిన్నలంక, జూపూడి లంక, మూలపాడు, త్రిలోచనపురం లంకల్లోకి వరద నీరు చేరింది. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపైన ప్రయాణాలు చేస్తున్నారు. -
క్షమాపణ చెప్పే వరకు ఆందోళన ఆగదు
మచిలీపట్నంటౌన్: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరించారు. నగరంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం వద్ద జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి గుమ్మడికాయతో దిష్టి తీసి టెంకాయలు కొట్టారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ చిత్రపటాన్ని చెప్పుతో కొడుతున్న జూ.ఎన్టీఆర్ అభిమానులు -
అనుక్షణం అప్రమత్తంగా ఉండండి
అధికారులకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం ఎదురుమొండి(నాగాయలంక): వరద పరిస్థితులను పరిశీలించేందుకు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం సాయంత్రం నాగాయలంక మండలంలో పర్యటించారు. ఆయన తొలుత స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ వద్ద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ ఆంజనేయప్రసాద్, జలవనరుల శాఖ ఇంజినీర్లు, మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తదుపరి మండలంలోని ఎదురుమొండి దీవికి వెళ్లి గొల్లమంద మార్గంలో నది కోతకు గురైన 700మీటర్ల రహదారిని పరిశీలించి, తాత్కాలిక మరమ్మతులపై పంచా యతీరాజ్ అధికారులకు సూచనలు చేశారు. సంసిద్ధంగా ఉన్నాం.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 4.3లక్షల క్యూసెక్కుల వరద నీటిని నదికి వదిలారని, కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో వరద పరిస్థితి గమనించడానికి, అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ శాఖలతో సమన్వయ సమావేశాలు జరిపి వరద ప్రవాహం పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఆదేశించామన్నారు. కలెక్టర్ పర్యటనలో తహసీల్దార్ సీహెచ్వీ ఆంజనేయప్రసాద్, ఎంఈపడీవో పి.సుధాప్రవీణ్, ఇరిగేషన్ డీఈఈ గణపతి, ఏఈఈ పి.రవితేజ, పీఆర్ ఏఈఈ సురేష్బాబు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. -
వికలాంగ పింఛన్దారులకు ‘పర్సంటేజీ’ల షాక్!
● పింఛన్లు ఎత్తివేసేందుకు కొత్త డ్రామాలు ● మరోసారి సదరం సర్టిఫికెట్ తెచ్చుకోవాలని మెలిక ● వికలాంగత్వం తక్కువగా ఉందని చూపిస్తూ రద్దు చేస్తున్న వైనం ● తెరపైకి నూతన నిబంధనలు ● గగ్గోలు పెడుతున్న లబ్ధిదారులు మంచానికే పరిమితమైన వారు, కండరాల క్షీణత, రెండు కాళ్లు ఏనుగు కాళ్లలా ఉండటం, పక్షవాతం వచ్చిన వారికి వికలాంగ పింఛన్ అందజేస్తున్నారు. కనీసం 40శాతం, ఆపైబడి వికలాంగత్వం ఉన్నవారికి రూ. 6వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ. 15వేలు ఇస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అర్హులకు కూడా సర్వేలు నిర్వహించి ఏదో ఒక సాకుతో రద్దు చేసే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా లబ్ధిదారులు నోటీసులు జారీ చేస్తూ.. రూ.15వేల పింఛన్ను రూ. 6వేలకు మార్పు చేయటం చేస్తోంది. చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వం వికలాంగ పింఛన్దారులకు కుచ్చుటోపీ పెట్టింది. పింఛన్ నగదు పెంచినట్లే పెంచి.. ఇప్పుడు పర్సంటేజీల షాక్ ఇస్తోంది. కొత్త పంథాలో ముందుకు వెళ్తూ.. మొత్తానికి పింఛన్నే రద్దు చేస్తోంది. కొత్తగా సదరం పరీక్షలు చేయించుకోవాలని చెప్పి, ఆ పరీక్షల్లో వికలాంగత్వం తక్కువగా ఉందని సాకులు చూపుతూ వారి పింఛన్లు ఎగ్గొట్టేస్తోంది. ఏళ్లుగా పింఛను పొందుతున్న వారికి కొత్త నిబంధనల పేరుతో అర్ధాంతరంగా మొండిచేయి చూపి.. వారిని నడిరోడ్డుపై నిలబెడుతోంది. రద్దయినట్లు నోటీసులు.. కృష్ణా జిల్లాలో ఆగస్టు 1వ తేదీన రూ.15వేలు పింఛన్ పొందుతున్న వారు 1,280 మంది ఉన్నారు. వీరిలో 482 మందికి మీ పింఛన్ను రూ. 6 వేలుగా మార్పు చేస్తున్నట్లు నోటీసులు అందజేశారు. మరికొంత మందికి మీ వికలాంగత్వం తాత్కాలికమైందని పింఛన్ రద్దు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. ఎటువంటి పనిచేయలేని తాము పింఛన్ సొమ్ము రాకుంటే ఎలా జీవించాలని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. కోతల పింఛన్.. ఎన్నికల సమయంలో బాహాటంగా హామీలిచ్చి, నేడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల్లో కోత విధించేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. దీనిలో భాగంగా నెలకు రూ. 15 వేలు పింఛన్ ఇచ్చే లబ్ధిదారులపై వేటు వేసేందుకు నిర్ణయించింది. జిల్లాలో 1280 మంది లబ్ధిదారులు రూ.15వేలు పింఛన్ తీసుకుంటున్నారు. వీరిలో ప్రస్తుతం సర్వే నెపంతో 482 మందిని రూ.15వేలు పింఛన్కు బదులుగా రూ.6వేలకు మార్పు చేశారు. మరికొంత మంది లబ్ధిదారులకు పక్షవాతం, ప్రమాదంలో పూర్తిగా వైకల్యం ఉండి మంచానికి పరిమితమైన వారికి మాత్రమే ఇస్తామని చెప్పి వారిని తొలగించింది. అన్ని అర్హతలు ఉన్న తమకు ఏళ్లుగా పింఛన్ ఇస్తూ.. అర్ధాంతరంగా తొలగించటం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. రూ.6వేలు తీసుకునే వారికి కూడా.. మరో పక్క రూ. 6 వేలు పింఛన్ తీసుకుంటున్న వారిపై కూడా కోత విధిస్తోంది. 40 శాతం కంటే వికలాంగత్వం ఎక్కువ ఉంటేనే రూ. 6 వేలు వస్తుందని, మరలా సదరం సర్టిఫికెట్ సమర్పిస్తేనే పింఛన్ను కొనసాగిస్తామని లేకుంటే పింఛన్ను రద్దు చేస్తామంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. రీ–వెరిఫికేషన్ పేరుతో అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు తొలగిస్తున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అర్హత ఉండి పింఛన్ తొలగిస్తున్నారని దివ్యాంగుల్లో ఆందోళన మొదలైంది. జిల్లా వ్యాప్తంగా తొలగించిన పింఛన్ల వివరాలను సేకరిస్తున్నామని ఆ జాబితాను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం. అప్పటికీ స్పందించకుంటే వికలాంగుల పింఛన్ల పునరుద్ధరణకు ఉద్యమిస్తాం. – ఎన్ఎస్ నారాయణ, జిల్లా కార్యదర్శి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
కంచికచర్ల: ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడు హత్య చేశాడా లేక ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందా అని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామానికి చెందిన కంభం భవానీ(28) అలియాస్ రజినీకి వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తితో 12ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు మగ సంతానం ఉన్నారు. రాజశేఖర్ పేరకలపాడులో ఉంటూ కంచికచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే భవానీ కంచికచర్లలోని సంజీవయ్ నగర్లో నివాసముంటున్న జంగా ప్రకాశరరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త రాజశేఖర్ నెల రోజుల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని అల్లూరులో విడిగా ఉంటున్నాడు. భవానీ మాత్రం చిన్న కుమారుడితో పేరకలపాడులోని తల్లి వద్ద ఉంటోంది. 16న ప్రియుడితో గొడవ.. పది రోజుల క్రితం భవానీ తల్లి వేరే గ్రామంలో ఉంటున్న తన పెద్ద కుమార్తె వద్దకు వెళ్లింది. ఈనెల 16న పేరకలపాడులో అర్ధరాత్రి సమయంలో ప్రకాశరావుకు భవానీ మధ్య గొడవ జరిగింది. కానీ భవానీ ఈనెల 17వ తేదీ సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. భవానీ మేన అత్త అయిన బురదగుంట దుర్గా భవానీ ఇంట్లోకి వెళ్లి చూసి, ఆమెను స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతిచెందింది. అయితే ప్రకాశరావు 17వ తేదీ అర్ధరాత్రి భవానీ ఇంటికి వచ్చాడని దుర్గా పోలీసులకు తెలియజేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి ప్రియుడు ప్రకాశరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం భవానీ మృతదేహానికి పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేన అత్త దుర్గా ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. విశ్వనాథం తెలిపారు. ప్రియుడు ప్రకాశరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు -
నేడు, రేపు మంగళగిరిలో సీఎం పర్యటన
మంగళగిరి టౌన్: మంగళగిరిలో మంగళవారం, బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం అధికారులతో కలసి పరిశీలించారు. నగర పరిధిలోని సీకే కన్వెన్షన్లో జీరో ప్రావర్టీ పి–4 కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. సీటింగ్, సభాస్థలి, వీడియో గ్యాలరీ, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నగర పరిధిలోని ఎన్ఆర్ఐ ఫ్లైఓవర్ వద్ద ఉన్న మయూరి టెక్ పార్క్లో బుధవారం జరగనున్న రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొననున్న దృష్ట్యా, అక్కడి ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమన్వయంతో విధులు నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్, శాసనమండలి సభ్యులు పెందుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, ప్లానింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ శంకరరావు, సంయుక్త కలెక్టర్ భార్గవ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, సీఎంఓ కార్యాలయ అధికారి ఇక్బాల్ సాహెబ్, ఎంటీఎంసీ కమిషనర్ అలీమ్ బాషా పాల్గొన్నారు. -
సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం
ఎస్పీ గంగాధరరావు చిలకలపూడి(మచిలీపట్నం): మీ కోసంలో వచ్చిన సమస్యలు ఏమైనా చట్టపరిధిలో పరిష్కరించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం ద్వారా అర్జీలను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ మీకోసంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. ● అవనిగడ్డకు చెందిన సత్యనారాయణ తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని తన సోదరులు అక్రమంగా అనుభవిస్తున్నారని ఆరోపించారు. వారిని ప్రశ్నిస్తే చంపాలని చూస్తున్నారని, దొంగ దస్తావేజులు సృష్టించి ఆస్తి కాజేయాలని చూడటమే కాకుండా ఇంటికి కూడా రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఎస్పీకి అర్జీనిచ్చారు. ● గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడుకు చెందిన పద్మావతి తనకు వివాహం జరిగి 11 ఏళ్లు అయ్యిందని.. ఇద్దరు మగ సంతానం కూడా ఉన్నారన్నారు. తన భర్త రెండేళ్లుగా వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని వాపోయారు. పెద్దల్లో పెట్టినప్పటికీ ప్రయోజనం లేదని న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ● గన్నవరానికి చెందిన ఓ వివాహిత తనకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతోందని అత్తమామలు మొదట్లో భాగానే ఉన్నా, తరువాత అకారణంగా ఆస్తి కోసం తన భర్తను, తనను ఇబ్బందులు పెడుతున్నారని వివరించారు. తమ ప్రమేయం లేకుండా ఆస్తులను అమ్మకాలకు పెడుతూ, ప్రశ్నిస్తే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని న్యాయం చేయాలని అర్జీనిచ్చారు. -
వైఫల్యాలు బహిర్గతం అవుతాయనే భయం
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశంపై కూటమి ప్రభుత్వం జారీ చేసిన నిషేధపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల అంబేడ్కర్ విగ్రహం ముందు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు. విద్యార్థి నేతలు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లోనే విద్యారంగాన్ని నీరుగార్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే విద్యార్థి సంఘాలను ప్రభుత్వ విద్యాసంస్థ ల్లోకి రాకుండా చీకటి ఉత్తర్వులు ఇచ్చిందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహించిన లోకేష్ నేడు ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలే.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలేనని రవిచంద్ర తెలిపారు. మెగా పేరెంట్, టీచర్ మీటింగ్లను రాజకీయ ఈవెంట్లుగా మార్చిన ఘనత చంద్రబాబు, లోకేష్లదేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలల్లో కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నా లోకేష్ స్పందించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, సహాయ కార్యదర్శి బి. కొండలరావు, జిల్లా అధ్యక్షుడు జె. కోమల్ సాయి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణలు చెప్పాలి
మచిలీపట్నంటౌన్: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మచిలీపట్నంలో ఎన్టీఆర్ అభిమానులు సోమవారం మండిపడ్డారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆయన క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న అభిమానులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తా మని పలువురు అభిమానులు హెచ్చరించారు. -
ఆక్వా ల్యాబ్ సేవలు అభినందనీయం
కృష్ణా జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు నాగరాజా గుడివాడరూరల్: గుడివాడ మార్కెట్ యార్డ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కృష్ణా జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఎ.నాగరాజా పేర్కొన్నారు. స్థానిక మార్కెట్యార్డ్లో ఉన్న మత్స్యశాఖ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బృందంతో సభ్యులతో కలసి సోమవారం ఆయన పరిశీలించారు. తొలుత ఆక్వా ల్యాబ్లో ఏ రకమైన పరీక్షలు ఎలా నిర్వహిస్తారు, తదితర విషయాలను బృందం సభ్యులకు మత్స్యశాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా నాగరాజా మాట్లాడుతూ గుడివాడ డివిజన్ పరిధిలో 42వేల ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతుందని, ఈ ల్యాబ్ను ఆయా ప్రాంతాల్లోని ఆక్వా రైతులు వినియోగించుకుంటున్నారన్నారు. అదేవిధంగా ఈ ల్యాబ్లో నీరు, మట్టి నాణ్యత పరీక్షలు, మేత నాణ్యత పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో గుడివాడ మత్స్యశాఖ సహాయ సంచాలకులు సీహెచ్ ప్రసాద్, గుడివాడ, నందివాడ మత్స్యశాఖ అధికారులు మంజూష, రవికుమార్, వీఎఫ్ఏలు, ఎంపీఈడీఏలు, సిబ్బంది పాల్గొన్నారు. -
పొంచి ఉన్న వాయు‘గండం’!
అవనిగడ్డ: ఒకవైపు వర్షాలు, మరోవైపు వరదతో నదీ తీర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు మంగళవారం అల్పపీడనం వాయుగుండంగా మారనుందనే వార్తలు మరింత కలవర పాటుకు గురిచేస్తున్నాయి. వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షం ముంపు నుంచి ఇంకా పంటలు తేరుకోలేక పోవడమే అందుకు కారణం. మరోసారి వరద పెరగనుందనే హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తీవ్రవర్షాల వల్ల పంటలు మునగడంతో ఆందోళన చెందుతున్న రైతులను వాయుగండం మరింత కలవర పెడుతోంది. 16,977 ఎకరాల్లో పంట నీటి మునక.. కృష్ణాజిల్లాలో ఈ ఖరీఫ్లో 2.62లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. గత మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం పడటంతో వరిపొలాలు నీటమునిగాయి. జిల్లా వ్యాప్తంగా 16,977 ఎకరాల్లో వరిపొలాలు నీటమునిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అత్యధికంగా 11,075 ఎకరాల్లో పంట నీటమునిగినట్టు చెప్పారు. ఆరు రోజులుగా వరిపొలాలు, నారుమళ్లు నీటమునిగి ఉండటంతో చనిపోతున్నాయని రైతులు చెప్పారు. పెరగనున్న వరద తీవ్రత.. అల్పపీడనం వల్ల ఆదివారం రాత్రి నుంచి పలుచోట్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి. మంగళవారం అల్పపీడనం వాయుగుండంగా మారనుందనే వార్తలు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు రెండు రోజుల క్రితం తగ్గిన వరద మళ్లీ పెరిగింది. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 2.84లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదలగా, మంగళవారం 3.97లక్షలు, బుధవారానికికు ఏడు లక్షలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకేసారి వానలు, వరద రావడంతో మురుగునీరు సముద్రంలోకి లాగడం లేదని రైతులు తెలిపారు. ఈ కారణంగానే ఆరు రోజులవుతున్నా ఇంకా చాలాచోట్ల పంటపొలాలు ముంపులోనే ఉన్నట్టు బాధిత రైతులు చెప్పారు. కొనసాగుతున్న వానలు.. సోమవారం జిల్లాలో కోడూరులో అత్యధికంగా 20 మి.మీ వర్షపాతం నమోదైంది. నాగాయలంకలో 16.8, చల్లపల్లి, మోపిదేవిలో 9.2, ఘంటసాలలో 7.2, కృత్తివెన్నులో 5.4, మచిలీపట్నంలో 4.8, అవనిగడ్డలో 4.2, బంటుమిల్లిలో 3.6,పెడనలో అత్యల్పంగా 1.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు వానలు కొనసాగవచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మళ్లీ పెరుగుతున్న వరద ఇంకా ముంపులోనే పంట పొలాలు వరద ఎఫెక్ట్తో ఎగదట్టిన సముద్రం తీర ప్రాంతాల్లో ఏకమైన డ్రెయిన్లు, పొలాలు జిల్లాలో 16,977 ఎకరాల్లో నీట మునిగిన వరి -
అక్రమ బిల్లుల నైవైద్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): బెజవాడలో మెడికల్ మాఫియా దందా సాగిస్తోంది. జబ్బు చేస్తే వైద్యానికి డబ్బులు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే సాయాన్ని సొమ్ము చేసుకుంటోంది. సచివాలయంలోని ముఖ్య మంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు వ్యక్తులు లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్ఓసీ)ల దందా సాగిస్తున్నారు. వైద్యం పొందకుండానే ఆస్పత్రుల నుంచి బిల్లులు తెచ్చుకుంటే రీయింబర్స్ మెంట్ (సీఎంఆర్ఎఫ్) ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. కమీషన్ కొట్టు.. ఎల్ఓసీ పట్టు వైద్యానికి అయ్యే ఖర్చులకు ప్రభుత్వం నుంచి ఎల్ఓసీ తీసుకొచ్చేందుకు కొందరు వ్యక్తులు 20 నుంచి 30 శాతం వరకూ కమీషన్ దండుకుంటున్నారు. విజయవాడలోని రెండు మూడు ఆస్పత్రుల కేంద్రంగా ఈ దందా సాగిస్తున్నారని, రోజుకు నాలుగైదు ఎల్ఓసీలు వాటికే ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని ఎల్ఓసీలు ఎమ్మెల్యేల లేఖలు లేకుండానే తీసుకొస్తున్నట్లు తెలిసింది. కొందరైతే ఎమ్మెల్యే లేఖలు కూడా తామే తెస్తామని బేరం కుదుర్చుకుంటున్నారు. రోగి స్వచ్ఛందంగా వెళ్తే, ఆస్పత్రి నిర్వాహకులు ఇచ్చిన అంచనా వ్యయంలో 40 శాతానికే ఎల్ఓసీ ఇస్తున్నారని, ఈ ముఠా సభ్యులు 60 శాతం వరకూ తీసుకొస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. చికిత్స అనంతరం వీళ్లు తీసుకొచ్చిన ఎల్ఓసీలకు సంబంధించిన బిల్లులు సైతం వెంటనే ఇప్పించేందుకు ఆస్పత్రుల నుంచి సైతం కమీషన్లు తీసుకుంటున్నారు. నిజాయ తీగా వైద్యం చేసిన ఆస్పత్రులకు నాలుగు, ఐదు నెలలకు కూడా బిల్లులు రావడం లేదని, కానీ కమీషన్ ఇచ్చిన వారికి నెలా రెండు నెలల్లోనే వచ్చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశీలన ఏదీ..? ఆరోగ్య శ్రీలో చికిత్స అందించాలంటే నిపుణుల కమిటీ పరిశీలన తప్పని సరి. ఎల్ఓసీల జారీలో నిపుణుల పరిశీలన లేకుండానే ఆస్పత్రులు ఇచ్చే అంచనా వ్యయాన్ని ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక రోగికి ఎల్ఓసీ ఇస్తే చికిత్స అనంతరం ఆస్పత్రులు పెట్టే బిల్లులను కూడా సరిగ్గా పరిశీలించకుండానే మంజూరు చేయడంతో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని సీనియర్ వైద్యులు పేర్కొంటున్నారు. సరైన పరిశీలన లేకపోవడంతో ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే సాయంలో సగం దళారుల జేబుల్లోకి వెళ్తోందని వివరిస్తున్నారు. ప్రభుత్వానిదే బాధ్యత పేద రోగుల వైద్యం కోసం ఇచ్చే ఎల్ఓసీలకు కమీషన్లు దండుకునే ముఠా సభ్యులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు సూచించారు. ఒకే ఆస్పత్రి నుంచి ఎక్కువగా ఎల్ఓసీలు ఇస్తున్నప్పుడు కనీసం స్పెషాలిటీ, సూపర్స్ఫెషాలిటీ నిపుణులతో వాటిని పరిశీలించాలని, వైద్యం కోసం ఉదారంగా ఇచ్చే సాయం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు. వైద్యం చేయకుండానే బిల్లులు కొన్ని ఆస్పత్రులు అక్రమ సంపాదనే లక్ష్యంగా వైద్యం చేయకుండానే చేసినట్లు అడిగినంత మొత్తానికి బిల్లులు ఇచ్చేస్తున్నాయని, అందులో 30 నుంచి 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ బిల్లులను సీఎంఆర్ఎఫ్, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రీయింబర్స్మెంట్కు వాడుతున్నట్లు తెలిసింది. ఇన్సూరెన్స్ ఉన్న వారు ఆస్పత్రిలో చేరకుండానే చేరినట్లు చూపించి వైద్యానికి అనుమతి తీసుకుంటున్నారని, అలా రూపొందించిన దొంగ బిల్లులతో ఆ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి వచ్చిన మొత్తంలో రోగి, ఆస్పత్రి నిర్వాహకులు పంచు కుంటున్నారని, ఈ తరహా దందాలు విజయవాడ సీతారామపురం సమీపంలోని ఓ ఆస్పత్రిలో ఎక్కువగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిన్ని ఆస్పత్రులు ఇదే మార్గంలో ఉన్నట్లు సమాచారం. -
అట్రాసిటీ కేసుల్లో సత్వర చర్యలు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఎస్పీ ఆర్.గంగాధరరావుతో కలిసి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల వివరాలు, బాధితులకు తక్షణం పరిహారం అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని చార్జ్షీట్లు దాఖలయ్యాయి, కేసులు ఫైల్ చేయడంలో జాప్యానికి గల కారణాలు, ఇప్పటి వరకు బాధితులకు నష్టపరిహారం ఎంత చెల్లించారు అన్న వివరాలను డివిజన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. అణగారిన వర్గాలపై ముఖ్యంగా షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలపై వివక్ష, దౌర్జన్యాలను తొలగించడమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు తక్షణం న్యాయం చేసేలా పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. క్లిష్టమైన కేసులను తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీఓలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం, హేలా షారోన్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహిద్బాబు, గిరిజన సంక్షేమశాఖాధికారి ఎం.ఫణిదూర్జటి తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ జీజీహెచ్లో అరుదైన ఈఎన్టీ సర్జరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ జీజీహెచ్ ఈఎన్టీ విభాగంలో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తిరువూరు మండలం వావిలాల గ్రామానికి చెందిన 48 ఏళ్ల చిన్న కృష్ణయ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. వైద్యులు అత డిని పరీక్షలు నిర్వహించి, ముక్కు శ్వాసనాళంలో కణితి ఉందని, సర్జరీ చేసి తొలగించాలని నిర్ధారించారు. దీంతో ఈ నెల ఆరో తేదీన రోగికి ఫేషియల్ రీజియన్ను ఓపెన్ చేసి ముక్కునాళంలో ఉన్న ఐదు సెంటీమీటర్ల కణితిని తొలగించారు. ఇది చాలా అరుదైనదిగా వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స నిర్వహించిన ఈఎన్టీ వైద్యులు రవి, డాక్టర్ లీలాప్రసాద్ తదితరులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు అభినందించారు. -
ఉద్యోగ భద్రతపై భయాందోళన
ఏపీటీడీసీ యూనిట్లను ప్రైవేటీకరణ చేస్తే వచ్చే సంస్థలు కొన్ని దశాబ్దాలుగా పని చేస్తున్న తమను విధుల్లో కొనసాగనిస్తాయా అని కాంటాక్ట్/మ్యాన్పవర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు ఇటీవల విజయవాడలోని ఏపీటీడీసీ ప్రధాన కార్యాలయంలో ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. పర్యాటక శాఖకు లీజుల పేరుతో ఇప్పటికే బకాయిలు ఉన్న సుమారు రూ.63 కోట్లను వసూలు చేయలేని ప్రభుత్వం కొత్తగా ఇచ్చే లీజు సొమ్మును క్రమం తప్పకుండా వసూలు చేయగలదా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించటం గమనార్హం. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సీఎం చంద్ర బాబు ఇచ్చిన హామీ మేరు బీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు డిమాండ్ చేశారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై హామీని అమలు చేయా లని కోరుతూ బీఎస్పీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బచ్చలకూర పుష్పరాజు మాట్లాడుతూ.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సారీ చంద్రబాబు వాగ్దానాలతో బీసీలను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు. బీసీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎరగొర్ల ఉదయ్కిరణ్ యాదవ్, దొండపాటి శామ్యూల్ కుమార్, కె.వి. కోటేశ్వరరావు, దాసరి కృష్ణ, మల్లాది అశోక్, కె.వి.రత్నం, గాలంకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సామూహిక వరలక్ష్మి వ్రతాలకు దరఖాస్తుల స్వీకరణఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 22వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరించనున్నారు. అమ్మ వారి సన్నిధిలో జరిగే ఈ వ్రతాల్లో పాల్గొనే మహిళలకు దేవస్థానం ఉచితంగా దరఖాస్తులను పంపిణీ చేస్తోంది. మంగళవారం వరకు భక్తులకు దరఖాస్తులు అందజేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను 20వ తేదీ సాయంత్రానికి దేవస్థానం టోల్ఫ్రీ కౌంటర్లో అందజేయాలని సూచించారు. తెల్లరేషన్ కార్డు కలిగిన భక్తులు తమ రేషన్ కార్డు జిరాక్స్ కాపీని కౌంటర్లో చూపించి దరఖాస్తును పొందాలని పేర్కొన్నారు. 22వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక వరలక్ష్మీవ్రతం ప్రారంభమవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. వ్రతం అనంతరం భక్తులకు దేవస్థానం ప్రసాదం కిట్లను అందజేస్తుంది. వ్రతంలో పాల్గొన్న మహిళలకు రూ.100 క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.మనిషి ఉన్నతికి మూలం విద్యమైలవరం: మనిషి ఉన్నతికి మూలం విద్య అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ సంయుక్త సంచాలకుడు, గిరిజన శాఖ ట్రైకార్ మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎ.మణికుమార్ పేర్కొన్నారు. వార్షిక తనికీల్లో భాగంగా సోమవారం మైలవరంలోని శ్రీలీలావతి గిరిజన పాఠశాలను ఆయన సోమ వారం సందర్శించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. చదువులో రాణించడానికి భాషాభేదాలు, వర్గవైషమ్యాలు అడ్డురావన్నారు. అట్టడుగు వారు కూడా చదువు ద్వారా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. ఇంగ్లిష్, లెక్కలు, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉడతా లక్ష్మీనారాయణ, కార్యదర్శి జంజనం రాధాకుమారి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ప్రకాశం బ్యారేజీకి నిలకడగా వరదగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి వరద నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజీకి 2,51,783 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీనిలో 2,48,450 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలివేస్తున్నారు. మరో 3,333 క్యూసెక్కులు కాలువలకు మళ్లిస్తున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో 2,90,122 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో, సాయంత్రానికి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం నిలకడగా సాగుతోంది. సోమవారం ఎన్టీఆర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 3.03 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మంగ ళవారం ఉదయానికి నీటి ప్రవాహం ఐదు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం పీజీఆర్ఎస్ (మీ–కోసం) కార్యక్రమం జరిగింది. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహెద్, బందరు ఆర్డీఓ కె.స్వాతి, డీఎస్పీ చప్పిడి రాజా అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. సాధారణ రైతులకే యూరియా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ యూరియాను కేవలం సాధారణ రైతులకు చేరాలని స్పష్టంచేశారు. ఫౌల్ట్రీ, ఆక్వా పరిశ్రమలు తదితర వ్యవసాయేతర అవసరరాలకు వినియోగించకూడదని హెచ్చరించారు. దీని పర్యవేక్షణ కోసం వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక పరిశ్రమలు తదితర శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా యూరియాను వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల నాలుగు వారాల పాటు శిక్షణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ తన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. శిక్షణలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 75 మంది అధికారులు హాజరయ్యారని, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాంకేతి పరిజ్ఞానాన్ని రోజువారీ వృత్తిలో వినియోగించటం ద్వారా పనిని సులభతరం చేసుకోవచ్చని, ఆ విధంగా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ బాలాజీ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ దశల్లో ఉత్తమ అధికారిగా ఎంపికై నందుకు జిల్లా యంత్రాంగం ఆయనను సత్కరించి అభినందించింది. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు 139 అర్జీలను అందజేశారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. -
నూతన బార్ పాలసీకి గెజిట్ నోటిఫికేషన్
చిలకలపూడి(మచిలీపట్నం): నూతన బార్ పాలసీ (2025–2028) కింద కృష్ణా జిల్లాలో 39 జనరల్ బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.గంగాధరరావు తెలిపారు. ఆయన తన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పది, గుడివాడలో మునిసిపాలిటీలో పది, ఉయ్యూరులో ఒకటి, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో 14, పెడన మునిసిపాలిటీలో ఒకటి, మంగినపూడిలో ఒకటి, అవనిగడ్డలో రెండు చొప్పున బార్లకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. లైసెన్సు ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తూ గీతకులాల వారికి నాలుగు షాపులు కేటాయించామని, వీటికి ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ వస్తామని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గీత కులాల్లో ఉపకులాలైన గౌడ కులానికి తాడిగడప, మచిలీపట్నం కార్పొరేషన్, గుడివాడ మునిసిపాలిటీల్లో ఒక్కొక్క షాపు కేటాయించేందుకు సోమవారం కలెక్టర్ డి.కె.బాలాజీ లాటరీ తీసి ఎంపిక చేశారు. గౌడ్ కులానికి తాడిగడప–1 షాపు లాటరీ పద్ధతిలో కేటాయించారు. ప్రస్తుతం జనరల్ బార్లకు ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా లైసెన్సు ఫీజు 50 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న వాటికి రూ.35 లక్షలు, 50 వేల నుంచి ఐదు లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతానికి రూ.55 లక్షలుగా నిర్ణయించామని వివరించారు. ప్రతి దరఖాస్తుదారుడు అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.5.10 లక్షలు చెల్లించాలని తెలిపారు. జనరల్ బార్లకు ఈ నెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 28వ తేదీన కలెక్టరేట్లోని సమావేశపు హాలులో లాటరీ ద్వారా షాపులు ఏటాయిస్తామని వివరించారు. గీత కులాలకు చెందిన నాలుగు షాపులకు లైసెన్సు ఫీజులో 50 శాతం రాయితీతో ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. వారికి కూడా అప్లికేషన్ ఫీజు రూ.5.10 లక్షలు ప్రతి దరఖాస్తుదారుడు చెల్లించాలని స్పష్టంచేశారు. గీత కులాలకు వారికి ఈ నెల 30వ తేదీన లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తామన్నారు. నూతన బార్లలో ఉదయం పది నుంచి రాత్రి 12 గంటల వరకు విక్రయాలకు అనుమతులు ఇస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 63001 00899, 99636 04239 సెల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సిద్ధార్థ ప్రో వైస్ చాన్సలర్కు ఐఎస్టీఈ అవార్డు
పెనమలూరు: సిద్ధార్థ అకాడమీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్కు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐఎస్టీఈ) అవార్డు వచ్చింది. ఈ నెల 14న మదనపల్లెలో ఐఎస్టీఈ స్టేట్స్టూడెంట్ కన్వెక్షన్ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో ఐఎస్టీఈ ఏపీ స్టేట్ అవార్డు బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా –2024గా డాక్టర్ రత్నప్రసాద్ అవార్డు అందుకున్నారు. డాక్టర్ రత్నప్రసాద్ 2014–2024 కాలంలో వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్కాలేజీ ప్రిన్సిపాల్గా అనేక రంగాల్లో అపూర్వమైన సేవలు అందించి విజయాలు సాఽధించారు. ప్రస్తుతం ప్రో వైస్ చాన్సలర్గా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సిద్ధార్థ’ వైస్ చాన్సలర ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు, యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 69వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రెస్క్లబ్ వద్ద ఆదివారం యూనియన్ నాయకులు ఏపీయూడబ్ల్యూజే పతాకాన్ని ఆవిష్కరించారు. యూనియన్ వ్యవస్థాపకుడు మణికొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే 68 ఏళ్ల ప్రస్థానంలో జర్నలిస్టుల సమస్యలెన్నింటినో పరిష్కరించడంలో కృషి చేసిందన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఏచూరి శివ, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు, విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఏపీఏజేఏ అధ్యక్షుడు విజయభాస్కర్, కౌన్సిల్ సభ్యుడు రఘురాం పాల్గొన్నారు.కారు ఢీ.. వ్యక్తి దుర్మరణం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కారు ఢీ కొట్టడంతో చికెన్ షాపులో పనిచేసే వ్యక్తి మృతి చెందిన ఘటన భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవానీపురం అవుట్ ఏజెన్సీకి చెందిన శంకరరావు(35) స్వాతి సెంటర్లోని న్యూ స్టార్ చికెన్ షాపులో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో షాపు నుంచి ఇంటికి వచ్చి భోజనం చేశాడు. మరుసటి రోజు ఆదివారం కావడంతో 10.30 గంటల సమయంలో షాపులో పని ఉందని ఇంట్లో చెప్పి కాలినడకన వెళ్లాడు. ఆ సమయంలో ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో శంకరరావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యావ్యవస్థలో గందరగోళం!
మచిలీపట్నంఅర్బన్: కూటమి ఏకపక్ష నిర్ణయాలతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. క్లస్టర్, పాఠశాలల విలీనం వివాదం కొనసాగుతుండగానే మూల్యాంకన పుస్తకాల విధానం పాఠశాలల్లో గందరగోళం రేపింది. పూర్వం పేపర్లపై రాసే పరీక్షలు ఇప్పుడు మూల్యాంకన పుస్తకాలపై రాయడంతో ఉపాధ్యాయులపై పని భారం పెరిగింది. కృష్ణా జిల్లాలో 1,317 పాఠశాలల్లో 81,427 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. తాజాగా జిల్లాలో జరిగిన ఎస్ఏ–1 పరీక్షల్లో సిలబస్కు సంబంధం లేని ప్రశ్నలు రావడం, ఒకటో తరగతి హిందీ పేపర్ అసంపూర్తిగా ముద్రించడం, ప్రథమ తరగతి పిల్లలకు ఇంగ్లిష్ పేరాగ్రాఫ్ రాయాలని, మూడో తరగతి వారికి పుస్తక సమీక్ష చేయాలని అడగడం, నాలుగో తరగతి పాఠ్యాంశం నుంచి మూడో తరగతికి ప్రశ్నలు ఇవ్వడం పిల్లలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. విద్యార్థుల స్థాయి, సామర్థ్యాన్ని పట్టించుకోకుండా ప్రశ్నపత్రాలు తయారు చేశారు. బోధన కంటే ప్రధానంగా పేపర్ వర్క్ పాఠశాలల్లో బోధన క్రమంగా పక్కకు వెళ్తోంది. ప్రస్తుతం ఉపాధ్యాయులకు పేపర్వర్క్, ఆన్లైన్ అప్డేట్లు ప్రధానంగా ఉన్నాయి. పుస్తకం కంటే యాప్ స్క్రీన్షాట్లు, విద్యార్థి అభివృద్ధి కన్నా సెల్ఫీ అప్లోడ్లకే ప్రాధాన్యం పెరిగింది. ఆన్లైన్ అటెండెన్స్, టాస్క్ ట్రాకర్, అసెస్మెంట్ రిపోర్టులు, వాట్సాప్ అప్డేట్లతో ఉపాధ్యాయులకు సమయం గడిచిపోతోంది. విద్యార్థి కళ్లలోకి చూసి బోధించే అవకాశాలు తగ్గిపోయాయి. బోధనలో అనుభవం లేని వారు విధానాలను రూపొందిస్తున్నారు. గ్రామీణ పరిస్థితులు, పిల్లల స్థాయి, బోధన భాష వంటి అంశాలను పట్టించుకోకపోవడంతో విద్య నాణ్యత దెబ్బతింటోంది. సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్లో పరీక్షలు విద్యార్థుల అభ్యసన మదింపునకు ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరుగుతున్నాయి. గత ఏడాది నుంచి ఫార్మేటివ్ పరీక్షలను సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4 రూపంలో నిర్వహిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి పరీక్షను ఈనెల 11 న నిర్వహించారు. అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలు జూన్ 12 న ప్రారంభమైనా పరీక్షలు జూన్ 4 నుంచే జరగాల్సి ఉంది. కానీ అసెస్మెంట్ బుక్లెట్లు పాఠశాలలకు ఆలస్యంగా చేరుకోవడంతో షెడ్యూల్ వెనక్కి వెళ్లి సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభమయ్యాయి. పని భారం రెట్టింపు.. నిల్వ సమస్యలు మూల్యాంకన పుస్తకాల్లోనే మార్కులు నమోదు చేసి, వాటి ఓఎమ్మార్ షీట్స్ను విద్యాశాఖ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో స్కూళ్లలోనే ఏడాది పొడవునా భద్రపరచాలి. ఈ పద్ధతిలో ఒక్కో పాఠశాలలో వందల కొద్దీ పుస్తకాలను భద్రపరచాల్సి పరిస్థితి ఏర్పడింది. గతంలో పరీక్ష పేపర్లను ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లి దిద్దేవారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో పుస్తకాలు ఉండటంతో ఇంటికి తీసుకెళ్లి అవకాశం లేక ఇప్పుడు స్కూళ్లలోనే మూల్యాంకనం చేయాల్సి వస్తోంది. నిల్వకు తగిన సదుపాయాలు లేకపోవడంతో వాటి భద్రతపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులపై అదనపు పనిభారం మూల్యాంకన పుస్తకాల విధానంతో ఇబ్బంది పాత పద్ధతినే అనుసరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ పరీక్షలు జూన్, జూలై సిలబస్కు సంబంధించి ప్రశ్నలు రూపొందించారు. పరీక్షలను ప్రత్యేక మూల్యాంకన పుస్తకాలలోనే రాయాలనే నిర్ణయంతో 2వ తరగతికి మూడు, 3 నుంచి 5వ తరగతులకు నాలుగు, 6 నుంచి 7 వ తరగతులకు ఆరు, 8 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు ఏడు పుస్తకాలు చొప్పున అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థలో గందరగోళం నెలకొంది. అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వెంటనే ఆచరిస్తుండటంతో విద్యావిధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే క్రమంలో మూల్యంకన పుస్తకాల విధానం ఉపాధ్యాయులపై భారాన్ని పెంచింది. ‘అసెస్మెంట్’తో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థ పడుతున్నారు. అసెస్మెంట్ పుస్తకాల విషయంలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుంది. ఆరు నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఆరు పుస్తకాలు అందించింది. ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలను వీటిలో రాయాల్సి ఉంటుంది. పరీక్షల అనంతరం ఉపాధ్యాయులు మార్కులు ఓఎమ్మార్ షీట్లో నమోదు చేసి, విద్యాశాఖ యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ విధానం బోధనకంటే పరిపాలనా భారం పెంచుతోంది. ప్రభుత్వం ఈ పరీక్షల విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలోనే నిర్వహించాలి. –అంబటిపూడి సుబ్రహ్మణ్యం, అధ్యక్షుడు, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ఒకే పుస్తకంలో ఏడాది మొత్తం పరీక్షలు, మార్కులు, ఓఎమ్మార్ డేటా భద్రపరచడం సమయ, స్థల పరమైన ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. పాత పద్ధతే మేలు. బోధనేతర పనులతో అలసిపోయిన ఉపాధ్యాయులపై ఈ కొత్త భారాన్ని మోపడం అన్యాయం. ప్రభుత్వం తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలి. –ఎం.వి. మహంకాళరావు, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
అధనపు అంతస్తులు!
యూఎల్సీకి ఇచ్చిన భూములను సైతం.. ఆ వ్యక్తి మధ్యవర్తిగా..! విజయవాడ వన్టౌన్లో అడ్డగోలుగా నిర్మాణం సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ వన్టౌన్ అక్రమ భవన నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగటం లేదు. అనుమతి లేని అదనపు అంతస్తులు పైకి ఎగబాకుతున్నాయి. భవన నిర్మాణాల్లో డీవియేషన్లు అధికంగా ఉన్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖరీదైన ప్రాంతం.. వన్టౌన్ ప్రాంతం ఇరుకుగా ఉండటం, ఎక్కువగా వాణిజ్య సముదాయాలు ఉండటంతో అక్కడ స్థలాల ధర భారీగా ఉంటుంది. బిల్డింగ్ మొత్తం చిన్నదైన రూ.కోట్లల్లో ధర పలుకుతుంది. దీంతో పార్కింగ్ ప్రాంతాన్ని సైతం షాప్స్, గోడౌన్లుగా వాడుతారు. జీప్లస్–2 భవన నిర్మాణానికి అనుమతి తీసుకొని అదనంగా ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. ఇవిగో కొన్ని ఉదాహరణలు.. ఉపేక్షిస్తే కష్టం.. వన్టౌన్ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇలాంటి భవనాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఇలాంటి భవనాలను ఎన్ని ఉన్నా యో సర్వే చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఇలాంటి నిర్మాణాలను ఉపేక్షిస్తే, పార్కింగ్ సమస్యలు తలెత్తడంతోపాటు, రోడ్లపైనే వాహనాలు నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి. వర్షం వస్తే నీరు బయటకు పోయే దారి లేక రోడ్లపైన నిలుస్తుంది. రోడ్ల కింద అర్బన్ ల్యాండ్ సీలింగ్(యూఎల్ సీ) కింద ఇచ్చిన భూములను సైతం తిరిగి తప్పుడు రికార్డులతో కొంత మంది సబ్ రిజిస్ట్రార్ల సహకారంతో రిజిస్ట్రేషన్ చేసి, ప్లాన్లో కలుపుకొని ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. ప్రభుత్వానికి డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తే రూ.14కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకూ ఆదాయం వచ్చే స్థలాలు ఉన్నాయి. అయితే యూల్ఎసీ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా రూ.కోట్ల విలువైన యూల్ఏసీ భూములు భవానీపురం, గొల్లపూడి, పటమట, సింగ్నగర్, నున్న.. చుట్టు పక్కల ఉన్నాయి. వీటిపైన రెవెన్యూ శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వన్ టౌన్ ప్రాంతంలో అడ్డగోలు నిర్మాణాలు చేపడుతున్నా అడ్డుకట్ట వేయటంలో అధికారులు విఫలం అవుతున్నారు. ప్రధానంగా నగర పాలక సంస్థ ముఖ్య అధికారి పర్యవేక్షణ కొరవడటంతోపాటు కొందరు పైస్థాయి అధికారులే క్షేత్ర స్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అదనపు అంతస్తుల నిర్మాణం చేసుకొనేందుకు రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలకు సెట్బ్యాక్, భారీగా డీవియేషన్లు ఉన్నా పట్టించుకోకుండా మమ అనిపిస్తున్నారు. ఇలాంటి కొన్ని వ్యవహారాలను నగరంలో ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేరు చేసే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ చక్కబెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అనధికార కట్టడాలను ప్రారంభంలోనే గుర్తించడంతోపాటు ఆయా నిర్మాణాలు చేపట్టిన వారిపై చార్జిషీట్ వేసేలా చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. భవన అనుమతుల్లో నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న కొంత మంది సిబ్బంది పెడ చెవిన పెడుతున్నారు. గతంలో ఏసీబీ దాడుల్లో వెలుగు చూసిన అవకతవకలను సరిచేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు చేపట్టిన చర్యలు ముందుకు సాగటం లేదు. చీఫ్ సిటీ ప్లానర్ టౌన్ ప్లానింగ్ సిబ్బందికితో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేస్తున్నా, క్షేత్ర స్థాయిలో సిబ్బందిలో మార్పు కనిపించటం లేదు. భవనాల అనుమతుల్లో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతూనే ఉన్నారు. -
ఎరువులు పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఎరువులు పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ లక్ష్మీశ.. వ్యవసాయ, సహకార, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత అనే మాటకు ఆస్కారం లేకుండా సమృద్ధిగా ఉన్నాయన్నారు. పక్కదారి పట్టకుండా, ప్రతి రైతుకూ న్యాయబద్ధంగా ఎరువులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 6,388టన్నుల యూరియాతో పాటు డీఏపీ, ఎంవోపీ, ఎస్ఎస్పీ కాంప్లెక్స్.. ఇలా మొత్తం 23,820 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులను సరైన విధంగా వినియోగించాలని, అవసరానికి మించి తీసుకోకుండా అవగాహన కల్పించాలని సూచించారు. నానో ఎరువుల వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫిర్యాదుల కోసం.. ఎరువుల సరఫరాపై ఫిర్యాదులు లేదా సమాచారం అందించేందుకు కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నంబర్ను ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జేసీ ఎస్. ఇలక్కియ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.మాధురి, కె.బాలకృష్ణ, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
అద్భుతం.. అపూర్వం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏరా ప్రసాద్.. బాగున్నావా?.. ఏంటిరా మహేష్ ఏం చేస్తున్నావు? .. అంటూ 32 ఏళ్ల నాటి జ్ఞాపకాలను వారంత నెమరువేసుకున్నారు. అపూర్వ కలయిక .. అద్భుతం అంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆదివారం భవానీపురం క్రాంబ్వే రోడ్డులోని క్యాస్రోల్ హోటల్లో విద్యాధరపురం దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ 1992–93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగింది. తమకు విద్యా బుద్దులు నేర్పిన గురువులు రామరాజు(సోషల్), వెంకటేశ్వరరావు( పీఈటీ)లను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు శోభనాచలపతిరావు, పెదబాబూరావు మాస్టార్లు జూమ్లో అటెండ్ అయి తమ పూర్వ విద్యార్థులను ఆశీర్వదించారు. రీయూనియన్ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. టీకేఎన్వీ ప్రసాద్, దాది మహేష్, వినోద్పాల్, మున్వర్ బాషా, ముజీబ్పాషా, అన్నవరపు మురళీకృష్ణ తమ బ్యాచ్కు చెందిన వారి నంబర్లు సేకరించి రీయూనియన్ చేశారు. క్లాసులు ఎగ్గొట్టి ఆడుకున్న ఆటలు, అలనాటి అనుభూతులు, ఆప్యాయలతో తెలియని అనుబంధం పెనవేసుకున్న మనం మళ్లీ 32 వసంతాల తర్వాత కలవడం ఓ అద్భుతం’ అని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. పాఠశాల అభివృద్ధికి సహాయం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం -
చిత్రకళతో సృజన పెంపు
కృష్ణలంక(విజయవాడతూర్పు): చిత్రకళతో సృజనాత్మకత పెంపొందుతుందని అమరావతి బుద్ధ విహార్ ప్రధాన కార్యదర్శి శుభకర్ మేడసాని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్, అమరావతి బాలోత్సవం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రంగ్ తరంగ్ చిత్రకళా పోటీలకు విశేష స్పందన లభించింది. పోటీల్లో మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులు జాతీయ చిహ్నాలు, 6,7 తరగతి విద్యార్థులు భారత దేశ స్మారక చిహ్నాలు, 8,9,10 తరగతుల విద్యార్థులు భిన్నత్వంలో ఏకత్వం అనే అంశాలపై చిత్రాలు వేశారు. అనంతరం బహుమతీ ప్రదానోత్సవం జరిగింది. శుభకర్ మాట్లాడుతూ అద్భుతమైన చిత్రాలు వేసిన విద్యార్థులను ప్రశంసించారు. రోటరీ క్లబ్ మిడ్టౌన్ సెక్రటరీ నాగ వసంతకుమార్ మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహిస్తున్న ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్, అమరావతి బాలోత్సవం నిర్వాహకులను కొనియాడారు. కార్యక్రమంలో మోడరన్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కె.వెంకట సునీల్చంద్, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ నాయకులు ఎ.సునీల్కుమార్, అరసవిల్లి గిరిధర్, శ్రావణ్కుమార్, అమరావతి బాలోత్సవం కార్యదర్శి యు.వి.రామరాజు, కవి అనిల్ డ్యానీ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఉరుసు మహోత్సవం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక స్వాతీ సెంటర్లోని బాబాజీ హజరత్ సయ్యద్ అమీనుద్దీన్ చిష్తి ఔలియా దర్గా 41వ ఉరుసు (గంధం) మహోత్సవం ఘనంగా జరిగింది. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సాయంత్రం 6 గంటలకు భవానీపురంలోని బాబా దర్గా నుంచి గంధం తీసుకుని వాహనంలో ఊరేగింపుగా బయలుదేరింది. ప్రకాశం బ్యారేజి, కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా బాబా దేవుని ధ్యానం చేసిన ప్రదేశానికి (రైల్వే స్టేషన్ వెస్ట్ వైపు గల షాజహూర్ ముసాఫిర్ ఖానాలోని షాప్ నంబర్ 9) చేరుకుంది. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి సొరంగం మీదుగా రాత్రి 9 గంటలకు బాబా దర్గాకు చేరుకుంది. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చిన సంధల్(గంధం)ను బాబా దర్బార్పైకి ఎక్కించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయనతోపాటు కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణ, పార్టీ నాయకులు ఎస్కే నజీర్, అబ్దుల్ రెహమాన్, ఎండీ గౌసీ, షేక్ నయీం, ఎస్కే కలీం తదితరులు ఉన్నారు. కాగా దర్గా సజ్జాదె నషీన్, ప్రభుత్వ ఖాజీ సయ్యద్ షా మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ చిష్తి మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం చిరాగ (దీపారాధన), సాయంత్రం ప్రసాదం పంపిణీ జరుగుతుందని తెలిపారు. రాత్రి 9 గంటలకు బాబాను కీర్తిస్తూ భక్తి గీతాలతోకూడిన ఖవ్వాలీ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వరస సెలవుల నేపథ్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం చల్లగా ఉండటం, చిరు జల్లులు కురుస్తుండటంతో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోనే సేద తీరారు. ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, శ్రావణ మాస ప్రత్యేక కుంకుమార్చనతో పాటు చండీహోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ, వీఐపీ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. రూ. 300 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. దుర్గమ్మ దర్శనానంతరం భక్తులు మహా మండపంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం అమ్మవారికి జరిగిన పంచహారతుల సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సూర్యోపాసనసేవ లోక కల్యాణార్థం, సర్వ మానవాళి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇంద్రకీలాద్రిపై దు ర్గమ్మ సన్నిధిలో సూర్యభగవానుడికి ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సూర్యనమస్కారాలు, సూర్యోపాసన సేవలో ఉభయదాతలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఫ్లడ్ రెస్పాన్స్ టీంలు అప్రమత్తంగా ఉండాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో నగరపాలక సంస్థ పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో ఫ్లడ్ రెస్పాన్స్ టీంలు ముందు జాగ్రత్తగా అక్కడ మూడు షిప్ట్లలో అందుబాటులో ఉండాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన రామలింగేశ్వరనగర్లోని సాయిరామ్ కట్ పీసెస్ వీధి చివరన ఉన్న రిటైనింగ్ వాల్ వద్ద ఫ్లడ్ యాక్షన్ ప్లాన్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లో టీంలు అందుబాటులో ఉండటంతోపాటు మిషనరీని కూడా సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీనాథ్రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సామ్రాజ్యం పాల్గొన్నారు. విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ఆంధ్ర, తెలంగాణనుంచి పర్యాటకులు నాగార్జునసాగర్ చేరుకొని స్థానిక లాంచీస్టేషన్ నుంచి నాగార్జునకొండకు నాగసిరి లాంచీ, శాంతిసిరి లాంచీలలో వెళ్లారు. అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. పచ్చని కొండల మధ్య ఉన్న అనుపులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, యాంపీ స్టేడియం, శ్రీ రంగనాథస్వామి దేవాలయాలను సందర్శించారు. ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. -
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన కందుల లక్ష్మణరావు కుటుంబం ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసిన కందుల లక్ష్మణరావు, విజయ వెంకట లక్ష్మి, కుమారుడు, కోడలు రామప్రసాద్, ప్రభాచంద్ర, మనవడు, మనవరాలి పేరిట రూ. 1,00,116 విరాళాన్ని నిత్యాన్నదానానికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.నేటి నుంచి విధుల్లోకికృష్ణా కలెక్టర్చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం నుంచి విధులకు హాజరుకానున్నారు. జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు ముస్సోరీలో శిక్షణ కోసం వెళ్లిన ఆయన ఆదివారం సాయంత్రం మచిలీపట్నంకు చేరుకుంటారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశపు హాలులో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమానికి హాజరవుతారు.అప్రమత్తంగా ఉండండి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశలింగాల(వత్సవాయి): మన జిల్లాలో భారీ వర్షాలతోపాటు మునేటికి ఎగువ ప్రాంతాలైన తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాలలో వర్షాలు పడుతుండడంతో మునేటికి వరదనీరు పోటెత్తుతోందని.. లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఆదివారం లింగా ల కాజ్వే వద్ద మునేటికి వరద ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునేటికి 12 అడుగుల మేర వరద వస్తుండగా 31వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు చెప్పారు. గతేడాది వరదలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు రెండు రోజులు పాటు ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదన్నారు. అదేవిధంగా చేపలవేటకు వెళ్లే వారు, పశువుల కాపరులు నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉండాలన్నారు.పటిష్ట బందోబస్తు..వరద తగ్గే వరకు అధికారులందరూ అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపే లింగాల కాజ్వేకు ఇరువైపులా పోలీస్, రెవెన్యూ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వరద పరిస్థితులపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు నమ్మకుండా సమాచారం కావాలంటే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకోవాలని తెలిపారు. నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో నితిన్, ఇరిగేషన్ అధికారి రామనరసింహరావు తదితరులు పాల్గొన్నారు.మళ్లీ పెరిగిన వరదగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానది పరీవాహక ప్రాంతంతో పాటు ఎగువ ప్రాంతా ల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజ్కు మరోసారి వరద వస్తోంది. సోమవారానికి 3.97లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కు 2,85,392 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ఇందులో 2,82,358 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా తూర్పు కాలువకు 2,518 క్యూసెక్కులు, వెస్ట్ కెనాల్కు 516 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11.3 అడుగులుగా ఉంది. వరద పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా నది కన్జర్వేటర్ హెచ్చరించారు. -
క్యూ లైన్ల కోసం ఆర్చ్ఫ్రేమ్స్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ దృష్టి సారించింది. సింహచలం దేవస్థానంలో స్వామి వారి నిజరూప దర్శనం రోజున గోడ కూలి పలువురు భక్తులు మృతి చెందడం, ఆ తర్వాత సింహచలం గిరిప్రదక్షిణలో భారీ గాలులకు షెడ్డు కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనల నేపథ్యంలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ ఇంజినీరింగ్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై పలు కీలక మార్పులు చేయనున్నారు. గతంలో దసరా ఉత్సవాల సమయంలో ఎదురైన అనుభవాలకు తోడు ఈ రెండు ఘటనల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆర్చ్ఫ్రేమ్స్తో క్యూలైన్లు.. దసరా ఉత్సవాలలో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకునేందుకు క్యూలైన్ల ఏర్పాటు చేస్తుంది. కెనాల్రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి అమ్మవారి ఆలయం వరకు దేవస్థానం ఐదు లైన్లలో క్యూలైన్లు ఏర్పాటు చేయనుంది. భక్తుల రద్దీని తట్టుకునేలా ఈ క్యూలైన్లను తీర్చిదిద్దేలా మార్పులు చేయనున్నారు. గత ఏడాది వరకు ఈ క్యూలైన్లను ఏర్పాటు చేసేందుకు రోడ్డుపై గోతులు తీసి గడ్డర్లు ఏర్పాటు చేసి, ఆ గడ్డర్లకు ఐరన్ మెస్ బిగించేవారు. రద్దీ సమయంలో ఈ మెస్ భక్తుల చేతులకు, కాళ్లకు గీసుకుని గాయాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతే కాకుండా ఈ క్యూలైన్లపై భాగంలో టార్పాలిన్ పట్టాలు, ప్లాస్టిక్ పట్టాలను కప్పి ఉంచేవారు. భారీ వర్షం, భారీ గాలులు వీచినా ఈ కవర్లు చిరిగిపోయి భక్తులు తడిసి ముద్దయ్యేవారు. అయితే ఈ ఏడాది క్యూలైన్లో ప్లాస్టిక్ పట్టాలు కాకుండా ఆర్చ్ ఫ్రేమ్లను ఏర్పాటు చేసి వాటి మధ్య క్యూలైన్లను ఏర్పాటు చేసేలా దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సింహచలం దేవస్థానం నుంచి ఈ ఆర్చ్ఫ్రేమ్లను దుర్గగుడికి తీసుకువస్తున్నారు. ప్రయోగాత్మకంగా.. దేవదాయ శాఖ ఆదేశానుశారం దుర్గగుడి ఇంజినీరింగ్ విభాగం ఆదివారం సీవీ రెడ్డి చారిటీస్ కాటేజీల వద్ద ప్రయోగత్మకంగా ఈ ఫ్రేమ్లతో క్యూలైన్లను ఏర్పాటు చేసింది. వీటిని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ ఈవో పరిశీలించారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దేవదాయ శాఖ కీలక మార్పులు చేసినట్లు ఆలయ ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్చ్ఫ్రేమ్ క్యూలైన్ల వల్ల ఎంతటి భారీ గాలులు వీచినా, ఇబ్బందులు ఉండవని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. -
నదీ తీరం.. అక్రమార్కుల పరం!
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణానదీ తీర ప్రాంతం అక్రమార్కుల పరమవుతోంది. నదీ తీరాన శాశ్వత కట్టడాలు నిర్మించకూడదన్న జలవనరుల శాఖ(ఇరిగేషన్) నిబంధనలు గాలికి వది లేసింది. దర్జాగా ఇరిగేషన్ స్థలాలను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు జరిగినా అటు ఇరిగేషన్, ఇటు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. వరదలు వస్తే నదీ తీర ప్రాంతం కచ్చితంగా మునిగిపోతుందని తెలిసినా అప్పుడు చూసుకుందాంలే అన్నధీమాతో ఉన్నారు. టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు నదీ తీరాన షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చేస్తున్నారు. మరోవైపు ఒక వ్యక్తి గుడి మాటున పక్కా కట్టడాలు నిర్మిస్తున్నాడు. ప్రతిరోజూ ఈ రెండు ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న అధికారులు ఆ నిర్మాణాలను చూసి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణదారుల నుంచి భారీగానే ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడి పేరుతో ఆక్రమణ! విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన భవానీపురం 40వ డివిజన్ పరిధిలోని పున్నమిఘాట్కు ఇవతల కరకట్ట సౌత్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించుకున్నాడు. గుడి పేరుతో అయితే ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశమో లేదా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరన్న భావనతోనో ఏకంగా పెద్ద స్థలాన్నే కబ్జా చేశాడు. ఇతను ఏ సామాన్యుడో కాదు.. ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా వెలగబెట్టిన వ్యక్తి కావడం గమనార్హం. తొలుత షెడ్లు నిర్మించి ఇప్పుడు వాటిని తొలగించి శాశ్వత కట్టడాలు నిర్మించి శ్లాబు కూడా వేశాడు. ఈ అక్రమ నిర్మాణాల వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటాడు. ప్రస్తుత పచ్చ ప్రభుత్వంలో గుడి మొత్తం పసుపు రంగులు వేసేశాడు. రోజూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటు వైపు రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. అయినా పసుపు రంగు వేసి ఉండటంతో అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉంటాడని భావించి మరోవైపు చూస్తూ వెళ్లిపోతారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారుల చర్యలు శూన్యం భవానీపురం పున్నమిహోటల్కు ఆనుకుని విద్యాధరపురం హిందూ శ్మశానవాటికకు దక్షిణం వైపు గత కృష్ణా పుష్కరాల సమయంలో తొలగించిన చిన్న చిన్న గుడిసెల స్థానంలో ఇప్పుడు షెడ్లు దర్శనమిస్తున్నాయి. వాటికి మున్సిపల్ కార్పొరేషన్లో అసెస్మెంట్ నంబర్ గానీ, పన్నులు గానీ, అనధికార నిర్మాణాల్లో వ్యాపారాలు చేస్తున్న వారెవరికీ ట్రేడ్ లైసెన్స్లు గానీ లేవు. అదేమని అడిగితే ఈ స్థలం తమదేనంటూ బుకాయిస్తున్నారు. వాస్తవానికి నదీ తీరాన అక్రమ కట్టడాలపై జలవనరుల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్కు 2023 డిసెంబర్ 27న కలెక్టర్ లేఖ రాశారు. ఫలితం లేకపోవడంతో గత ఏడాది జనవరి 17న ఇరిగేషన్ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ (కృష్ణా మధ్య విభాగం) పీవీఆర్ కృష్ణారావుకు జిల్లా కలెక్టర్ మరో లేఖ రాశారు. అయినా సంబంధిత అధికారులు కబ్జా వ్యవ హారంపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
సాక్షి ఫొటోగ్రాఫర్లకు కన్సొలేషన్ బహుమతులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రదర్శించిన ఛాయా చిత్రాలు ప్రతిఒక్కరిలో ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయని, ప్రతి ఛాయాచిత్రం కళాత్మక సందేశాన్ని అందిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతల వివరాలను శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన విడుదల చేశారు. విజేతలకు ఈ నెల 19న నిర్వహించనున్న అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమంలో నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందజేసి సత్కరించనున్నట్లు తెలిపారు. బెస్ట్ న్యూస్ పిక్చర్ విభాగంలో సాక్షి మీడియా నుంచి ఎన్.కిశోర్, కె.చక్రపాణిలకు ప్రోత్సాహక బహుమతులు లభించాయి. -
వాహనమిత్ర పథకంలో రూ. 25వేలు ఇవ్వాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఉచిత బస్సుతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదు కోవాలని.. వారికి వాహన మిత్ర ద్వారా రూ. 25 వేలు ఇవ్వాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.శివాజీ, ముజఫర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సంఘ నేతలు శనివారం బీఆర్టీఎస్ రోడ్డులోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీ్త్ర శక్తి పథకంతో రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. కరోనా అనంతరం ఆర్థికంగా దెబ్బతిన్న ఆటోడ్రైవర్ కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదన్నారు. ఉపాధి అవకాశాలు లేక ఒకరిపై ఆధారపడకుండా సొంత పెట్టుబడి, ఫైనాన్స్లతో స్వయం ఉపాధిగా ఆటోడ్రైవర్లు జీవనం సాగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 115 పట్టణాల్లో విదేశీ సంస్థలు ర్యాపిడో, ఊబర్, ఓలా కంపెనీలకు అనుమతులు ఇచ్చారన్నారు. దీంతో ఆటోడ్రైవర్లు కిరాయిలు లేక అవస్థ పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అధికారంలోకి రాక ముందు ఆటోడ్రైవర్లను ఆదుకుంటామంటూ అనేక హామీలు ఇచ్చిన కూటమి నేతలు వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం ప్రారంభించడానికి ముందు ఆటోడ్రైవర్ల సంఘాలతో చర్చించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలంటూ ఈనెల 18,19 తేదీల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రం ఇస్తామన్నారు. దీనిపై సీఎం స్పందించకపోతే ఈనెల 24న ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో ఆందోళన కార్యక్రమానికి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
వరద తగ్గు ముఖం
కంకిపాడు: మద్దూరు ఏటిపాయలో వరదనీటి ప్రవాహం తగ్గు ముఖం పట్టింది. ఎగువనుంచి వరదనీటి విడుదల తగ్గింది. ఏటిపాయ క్రమేపీ వెనక్కి వెళ్తోంది. ప్రస్తుతం పాయ అంచులు తాకుతూ నీటి ప్రవాహం ఉంది. అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ కూలీలు, రైతులు పడవల సాయంతో పొలాల్లో పనులకు వెళ్తున్నారు. బందోబస్తు పర్యవేక్షణ అంతా మొక్కుబడిగా సాగుతుందనడానికి ఇదొక ఉదాహరణ. ప్రకాశం బ్యారేజీ నుంచి రెండు రోజుల క్రితం 5.65 లక్షల క్యూసెక్కుల వరదనీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. దీంతో పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండలాల గుండా ఏటిపాయ ఉద్ధృతంగా ప్రవహించింది. ఏటిపాయ అంచుల నుంచి కరకట్ట వైపు చొచ్చుకువచ్చింది. కరకట్టకు దిగువన సాగు చేసిన పొలాలు, ఏటిపాయ మధ్యన ఉన్న లంక భూములో పొలాలు మునిగిపోతాయని రైతులు ఆందోళన చెందారు. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ముంపు భయం వీడింది. నిండుగా నీటిప్రవాహం వరద తగ్గినా నీటి ప్రవాహం మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ప్రస్తుతం పాయ అంచులు తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఏటిపాయ మాత్రం ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటితో ఉరకలు వేస్తోంది. మద్దూరు వద్ద ఏటిపాయ మధ్యన ఉన్న రోడ్డు మార్గం ఇంకా వరదనీటిలో మునిగే ఉంది. కాసరనేనివారిపాలెం వద్ద శివాలయం పరిసరాల్లో వరదనీటి ముంపు నుంచి కోలుకుంటోంది. అధికారుల ఆదేశాలు బేఖాతర్ ఉద్ధృతి సమయంలో అధికారుల ఆదేశాలు బేఖాతరు అవుతున్నాయి. వరదనీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఏటిపాయలోకి ఏ ఒక్కరూ వెళ్లవద్దని హెచ్చరిక చేస్తూ అధికారులు బ్యానర్లు ఏర్పాటుచేశారు. అయితే కొందరు రైతులు, కూలీలు మాత్రం పడవల సాయంతో పాయ మధ్యన ఉన్న లంక భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. -
ఉచిత బస్సుతో ఆటోస్టాండ్లు వెలవెల
చల్లపల్లి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించటంతో దాని ప్రభావం ఆటోలపై పడింది. ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆటోస్టాండు శనివారం వెలవెలబోయింది. ఆటోలన్నీ స్టాండులోనే ఉండిపోయాయి. ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం నుంచి సీ్త్రశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం ఆటో యజమానులు, డ్రైవర్లను ఇరుకున పడేసింది. చల్లపల్లి బస్టాండు వద్ద ఉన్న ఆటో పాయింటులో 30కి పైగా ఉన్నాయి. ఇవి నిత్యం అవనిగడ్డ, రేపల్లె ప్రాంతాలకు నిరంతరం ప్రయాణికులను తీసుకువెళుతుంటాయి. ఒక్కొక్క ఆటో కనీసం మూడు నుంచి నాలుగు ట్రిప్పులు వేసేది. మహిళకు ఉచిత బస్సు కారణంగా శనివారం ఒక్క ట్రిప్పు వేయటానికే గగనమైపోయిందని ఆబోవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు ఆద్దెకు తెచ్చి తిప్పుకునే వారికి కనీసం ఆటో అద్దె చెల్లించటానికి కూడా కిరాయి రాని పరిస్థితి నెలకొందని తమ గోడు విన్నవించుకుంటున్నారు. మండల కేంద్రమైన చల్లపల్లి పెదకళ్ళేపల్లి రోడ్డులో, ప్రధాన సెంటర్ వద్ద బందరు రోడ్డులో, పంచాయతీ ఆఫీసు వెనుక ఉన్న ఆటోస్టాండుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. భవిష్యత్తులో తమ పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించాలని వేడుకొంటున్నారు. తొలిరోజే ఆటో డ్రైవర్లకు ఎఫెక్ట్ -
కొండలమ్మ ఆదాయానికి గండి
గుడ్లవల్లేరు: కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా శ్రీ కొండలమ్మ ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయకపోవటంతో జవాబు దారీతనం లేకుండా పోయింది. జిల్లాలో అత్యధికంగా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే శక్తి ఆలయాల్లో వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానానికి ఎంతో ఖ్యాతి ఉంది. ఆ ఆదాయానికి కొందరు స్వార్థశక్తులు 2008–09వ సంవత్సరం నుంచి గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారికి రావలసిన బకాయిలను వసూలు చేయకుండా ఏళ్ల తరబడి దేవదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు చెల్లించే మొక్కుబడుల్లో భాగంగా కొబ్బరి చిప్పలు, చీరలు, ధాన్యం సేకరణ చేసే హక్కులను పొందేందుకు కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉండే పాటదారులకే కట్టబెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు అమ్మవారి సన్నిధిలో పాటదారులకు ఆడిందే ఆటగా...పాడిందే పాటగా ఉంది. ఏళ్ల తరబడి రూ.40 లక్షల బకాయిలను ఐదారుగురు పాటదారులు చెల్లించవలసి ఉన్నా ఆ విషయం అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కొండలమ్మకు చెల్లించకపోతే ఆస్తుల జప్తే... అమ్మవారికి ఒకవేళ చెల్లించవలసిన సొమ్మును బకాయి పడిన సంబంధిత పాటదారులు చెల్లించకపోతే దేవదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం కోర్టు ద్వారా వచ్చే ఆర్డరుతో పాటదారుల ఆస్తుల్ని కూడా జప్తు చేసే హక్కు అధికారులకు ఉంది. కాని ఆ నిబంధనలను వర్తింపజేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. గతంలో ఒక ఆలయ ఈఓ రూ.40 లక్షల బకాయిల గూర్చి బకాయిదారులపై కోర్టులో కేసు వేశారు. కాని దానిని ముందుకు వెళ్లనివ్వకుండా కొన్ని దుష్ట శక్తులు తొక్కి పెడుతున్నాయి. రూ.40లక్షల బకాయిలు చెల్లించవలసిన ప్రతి ఒక్క బకాయిదారుడు ఆర్థికంగా చెల్లించే శక్తి ఉన్నవారే. కాని ఒకరు బకాయి చెల్లించలేదని మరొకరు తాత్సారం చేస్తూ అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నారు. దేవస్థాన పాలనా వ్యవహారాల్లోకి కుల జాడ్యం అమ్మవారి ఆలయ పాలనా వ్యవహారాలకు కుల జాడ్యం పట్టింది. దాదాపుగా తెలుగు తమ్ముళ్లే ఆలయ పరిపాలనా వ్యవహారాల్లో ఉన్నా కులపరంగా కూడా ఆలయంలో పరిపాలన నడుస్తోందన్న ఆరోపణలు స్థానిక భక్తుల నుంచి వస్తున్నాయి. అధికారులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని టీడీపీలోనే కొందరు తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాయటంతో దేవస్థానం ఆదాయానికి గండి పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. పాటదారులు కొబ్బరి చిప్పలు, చీరలు, ధాన్యం సేకరణ చేసే హక్కులను పొందేందుకు బహిరంగ వేలంలో పాడుకుంటారు. బహిరంగ వేలం పెట్టే తరుణంలో ఎవరైనా పాటదారులు బయట నుంచి వస్తే వారిని తిట్టి, కొట్టి తరిమేయటం వంటి బెదిరింపులు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బయట నుంచి వచ్చిన పాటదారులను పంపించేసినా... వేలం తక్కువ ధరకు రాని పక్షంలో ఆ వేలం ఎన్నిసార్లు పెట్టినా...అన్నిసార్లు వాయిదా వేయిస్తున్నారు. ఒకవేళ పాడుకున్నా...హక్కు పొందే కాల వ్యవధిలో సగం రోజుల పాటే ఆ ఆ సేకరణ బాధ్యతను నిర్వహిస్తున్నారు. తమకు పాడుకున్న పాటలో నష్టం వచ్చిందని సొమ్ము చెల్లించకుండా ఎగవేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ అదే హక్కు కోసం జరిగే వేలంలో తమ బినామీల పేరిట పాత పాటదారులే పాడతారు. ఆ బకాయిదారులే అమ్మవారి సన్నిధిలో సేకరణ చేయటం స్థానిక భక్తులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ ధాన్యం, చీరలు, కొబ్బరి చిప్పల సేకరణ హక్కుల విషయంలోనే గాక అమ్మవారి దుకాణ సముదాయాల విషయంలో కూడా ఇవే పరిస్థితులు తలెత్తటంతో అవి ఏళ్ల తరబడి మూతపడుతూనే ఉన్నాయి. -
నిబద్ధత కలిగిన నాయకుడు గౌతు లచ్చన్న
చిలకలపూడి(మచిలీపట్నం): సర్దార్ గౌతు లచ్చన్న నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గౌతు లచ్చన్న జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని), నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ లచ్చన్న బడుగు, బలహీనవర్గాల వారికి ఎనలేని సేవలు చేశారన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ రెండింటికి ఒకేసారి పోటీ చేసి గెలుపొందిన గొప్ప నాయకుడన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆ దిశగా రిజర్వేషన్ల కోసం పోరాడారన్నారు. ఆయన కృషితోనే నేడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, కార్పొరేటర్ జోగి చిరంజీవి, వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ అచ్చెబా, గాజుల భగవాన్, బడే భాను, మాడపాటి వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైగల శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన ఈ పూజల్లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ దంపతులు పాల్గొన్నారు. తొలుత గోమాతకు ఘనంగా పూజలు చేసిన అనంతరం శ్రీకృష్ణ భగవాన్కు పూజలు నిర్వహించారు. ఈ వేడుకల నిమిత్తం దేవస్థానం స్థానాచార్యులు, వైదిక కమిటీ, అర్చక బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా విశేష సౌకర్యాలు కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి దేవస్థాన పురాణ పండితులు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి ఉపన్యసించారు. అనంతరం మల్లికార్జున మహామండపం 7వ అంతస్తులో రాజగోపురం ముందు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. నెమలిలో కృష్ణాష్టమి వేడుకలు తిరువూరు: గంపలగూడెం మండలం నెమలి శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని నవనీత కృష్ణుడిగా విశేష అలంకరణ చేసి తొమ్మిది రకాల ప్రసాదాలు నివేదించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వేణుగోపాలుడిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సంధ్య పర్యవేక్షణలో అర్చకులు వేడుకలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఆలయంలో ఉట్టికొట్టే మహోత్సవాన్ని నిర్వహించారు. -
మనసంతా మువ్వన్నెలే..
శ్రీకాకుళం(ఘంటసాల): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని ఘంటసాల, కొడాలి గ్రామాల్లోని మద్యం దుకాణాలు మూసివేయగా శ్రీకాకుళంలో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగాయి. షాపు ప్రధాన ద్వారం తాళం వేసి దుకాణ వెనుక భాగంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరపడంతో మందుబాబులు పండుగ చేసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు నిర్భయంగా మందు షాపు నిర్వహిస్తుంటే ఎకై ్సంజ్ అధికారులు ఏమయ్యారంటూ పలువురు వాపోతున్నారు. మద్యం షాపు వెనుకే మందు అమ్మడంతో పాటు అక్కడ వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు అమ్మకాలు జరిగాయి. మద్యం ఎక్కడ లేకపోవడంతో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నిర్వాహకులకు బాగానే గిట్టిందని మందుబాబులు అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చట్ట వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): లోక్ సభలో జాతీయ క్రీడల పాలన బిల్లు –2025 పై ప్రసంగించడం ఎంతో గర్వంగా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అన్నారు. స్థానిక చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా యువ ఆంధ్ర ఛాంపియన్ షిప్–2025 కబడ్డీ లీగ్ పోటీలను ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న తర్వాత శివనాథ్ మాట్లాడుతూ 2030లో ఒలింపిక్స్ నిర్వహణకు నేషనల్ బిడ్ దాఖలు చేస్తామని ఎంపీ అన్నారు. కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.ప్రభావతి, కార్యదర్శి వై.శ్రీకాంత్, సంఘ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఎన్.అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. కోనేరుసెంటర్: ప్రతి భారతీయుడి మదిలో మువ్వన్నెల జెండా రెపరెపలే. వాడవాడలా శుక్రవారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీటిలో భాగంగా కృష్ణా విశ్వవిద్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. ఎందరో మహానుభావుల త్యాగాలతో సాధించిన స్వాతంత్య్రం అనంతరం అనేక అడ్డంకులను అధిగమించి నేడు వికసిత భారతదేశంగా ఆవిష్కృతమవుతోందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ పేర్కొన్నారు. యూనివర్సిటీలో వీసీ జాతీయజెండాను ఆవిష్కరించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ గంగాధరరావు జాతీయజెండాను ఎగురవేశారు. జాతీయపతాకానికి సెల్యూట్ చేసి ప్రసంగించారు. ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలని అప్పుడే సమాజానికి మంచి సేవలను అందించగలుగుతామని చెప్పారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంచారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రాంగణంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ జాతీయజెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, ఆర్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. సీపీ కార్యాలయంలో.. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్య్రమని, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశానికి, ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు , సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డీసీపీలు కేజీవీ సరిత, కె.తిరుమలేశ్వరరెడ్డి, ఏబీటీఎస్ ఉదయరాణి, ఎస్వీడీ ప్రసాద్, ఏడీసీపీలు, ఏసీపీలు, పోలీసు అధికారులు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025పటమటలంక చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో శుక్రవారం యువ ఆంధ్ర చాంపియన్ షిప్ కబడ్డీ లీగ్ పోటీలను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. త్రివర్ణ పతాకం సగర్వంగా నింగికెగసింది. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఎల్లెడలా చాటింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడిన సమరయోధులకు జిల్లా ప్రజలు నిండుమనసుతో నివాళులర్పించారు. భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని ఎనిమిది దశాబ్దాలకు చేరువవుతున్న తరుణంలో ఆ స్ఫూర్తిని భావితరాలకు చాటేందుకు స్వాతంత్య్ర దిన సంబరాలను వేడుకగా జరుపుకొన్నారు. మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకలలో మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులకు,సిబ్బందికి ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ ప్రశంసాపత్రాలు అందజేశారు.చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరిలో మరింత దేశభక్తిని నింపాలని భావిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్.గంగాధరరావుతో కలిసి మంత్రి రవీంద్ర జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కృష్ణాజిల్లాకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ వారికి నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సుపరి పాలన అందిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, నిరుద్యోగ యువతకు డీఎస్సీ నోటిఫికేషన్, దీపం పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, ప్రతి విద్యార్థికి రూ. 15 వేల ఆర్థిక సాయం తదితర పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం ద్వారా కొత్త శకానికి నాంది పలికామన్నారు. మహిళలకు సీ్త్ర శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం శుక్రవారం నుంచి అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 42 జాబ్మేళాలు రూపొందించి 2,204 మంది యువతీ, యువకులకు ఉపాధి కల్పించామన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లాలోని నాగాయలంకలో నిర్వహించిన జలయోగా కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం పొందటం ఆనందంగా ఉందన్నారు. రెవెన్యూ రంగంలో రీ–సర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 502 గ్రామాలకు గానూ 309 గ్రామాల్లో 3.82 లక్షల ఎకరాలు రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. విద్యుత్శాఖ ద్వారా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద జిల్లాలో 2,222 మందికి రూ.75వేల వరకు రాయితీతో సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. బందరు నార్త్ మండల పరిధిలో ఓడరేవు నిర్మాణ పనులు ఇప్పటివరకు 40 శాతం పూర్తయ్యాయన్నారు.మచిలీపట్నం,నిమ్మలూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ యూనిట్లలో తయారైన యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇటీవల పాకిస్థాన్పై జరిగిన ఆపరేషన్ సింధూలో సమర్ధంగా పనిచేసి పాకిస్థాన్ డ్రోన్లను నేలకూల్చటం జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు. 7మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైనుకు సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తయిందని డీపీఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారని చెప్పటానికి తాను గర్విస్తున్నానన్నారు. జిల్లా అభివృద్ధికి సర్వదా కృషి చేస్తూ అమూల్యమైన సలహాలు, సూచనలు అందిస్తూ అభివృద్ధికి పాటుపడుతున్న ప్రజాప్రతినిధులకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం త్రివర్ణ రంగులతో ఉన్న బెలూన్లను, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఆయా శాఖలకు సంబంధించి శాఖాపరంగా చేస్తున్న ప్రగతి, పథకాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్.గంగాధరరావు తదితరులు తిలకించారు. ఈ స్టాల్స్ ప్రదర్శనలో మొదటి స్థానం ఉద్యానశాఖకు రాగా, రెండో స్థానం హ్యాండ్లూమ్స్, మూడో స్థానం వ్యవసాయశాఖకు లభించాయి. -
అన్నదాతకు తప్పని ఎదురుచూపులు
పెడన: అన్నదాతకు ఎదురు చూపులు తప్పడం లేదు. నిన్న..మొన్నటి వరకు వర్షాల కోసం ఎదురుచూసి చూసి విసుగు చెందాడు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుంది వాతావరణ పరిస్థితి. ఖరీఫ్ సాగు ఆలస్యంగా ప్రారంభించారు. వర్షాలు పడి..నీరు అందుతుందనే సమయంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సాగునీరు పుష్కలంగా వస్తున్నాయని వాటి కోసం ఎదురుచూసిన రైతుకు అవి కూడా అరకొరగానే రావడంతో వాటి కోసం ఎదురుచూసి మోటార్లు పెట్టుకుని తోడుకుని కష్టపడాల్సివచ్చింది. పంటను కాపాడుకునేందుకు యూరియా సరైన సమయంలో కొట్టడానికి ఉద్యుక్తులవుతుండగా యూరియా దొరకని పరిస్థితి. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా అందిస్తే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి పేరొస్తుందేమోనని భావించి పీఏసీఎస్ల ద్వారా రైతులకు యూరియా అందిస్తున్నారు. అక్కడ రుణాలు తీసుకున్న వారికే యూరియా కట్టలు అంటూ మెలిక పెడుతున్నారు. పీఏసీఎస్లకు చెందిన పాలకులు, సభ్యులు తమకు అనుకూలమైన వారికి ఇస్తూ మిగిలిన వారికి చుక్కలు చూపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 38,300 మెట్రిక్ టన్నులు అవసరం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు జిల్లా వ్యాప్తంగా 38,300 మెట్రిక్ టన్నులు యూరియా అవసరమని గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఇప్పటివరకు 20,359 మెట్రిక్ టన్నులు విక్రయించగా 2,756 టన్నులు బ్యాలెన్సు ఉంది. ఇంకా 4,065 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉందని అధికారిక గణాంకాలు. వాస్తవంగా జిల్లా వ్యాప్తంగా 2,85,110 ఎకరాల్లో వరి సాగు అవుతోంది. ఈ విస్తీర్ణానికి ఎకరానికి మూడు కట్టలు చొప్పున అంటే 150 కేజీల చొప్పున 42,776 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అధికారులు ఎకరానికి మొదటి డోసు అరకట్ట, రెండో డోసు కట్ట, మూడో డోసు కట్ట చాలని చెబుతున్నారు. రైతులు మాత్రం ఎకరానికి మూడు కట్టలు కావాల్సిందేనంటున్నారు. మార్కెట్లో గుళికలతో లింకు బయట మార్కెట్లో రూ.270 పెట్టి యూరియా కొంటే రూ.600 పెట్టి గుళికలు కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో రైతులు పీఏసీఎస్లను ఆశ్రయిస్తున్నారు. యూరియా కోసం అధిక సంఖ్యలో రైతులు పీఏసీఎస్లకు వస్తుండటంతో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకుంటున్నారు. యూరియా లోడు వస్తే ముందుగా పీఏసీఎస్లలో రుణాలున్న వారికి టోకెన్లు ఇచ్చి పంపిస్తున్నారు. ఆ తరువాత యూరియా ఉంటే మిగిలిన రైతులకు ఇచ్చే పరిస్థితి నెలకొంది. -
మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం
చిలకలపూడి(మచిలీపట్నం): ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా ఆయన జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, దేశంలో విభిన్న వర్గాల ప్రజలు ఉన్నారని అందరూ ఐక మత్యంతో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య , పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో... కలెక్టరేట్లో స్వాతంత్ర దిన వేడుకల సందర్భంగా జాతీయజెండాను ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ ఎగురవేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు. అనంతరం తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. గీతాంజలిశర్మ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారని, వారిని స్మరించుకుంటూ మనందరం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, కలెక్టరేట్ ఏవో రాధిక, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి -
దుర్గమ్మకు కానుకగా బంగారు లక్ష్మీహారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం గుంటూరు జిల్లా వడ్లమూడికి చెందిన భక్తులు 82 గ్రాముల బంగారు లక్ష్మీహారాన్ని కానుకగా సమర్పించారు. వడ్లమూడికి చెందిన వి.శ్రవణ్కుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు రూ.8.50 లక్షల విలువైన 82 గ్రాముల బంగారం, పచ్చలతో తయారు చేయించిన లక్ష్మీహారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈవో ఎన్.రమేష్బాబు, ఇతర అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. ఈ–పంట నమోదు తప్పనిసరి బుద్దవరం(గన్నవరం): మండలంలోని అల్లాపురం, బుద్దవరం గ్రామాల్లో జరుగుతున్న ఈ–పంట నమోదు ప్రక్రియను శుక్రవారం వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం.సునీల్ పరిశీలించారు. ఈ–పంట నమోదుపై గ్రామ వ్యవసాయ సహాయకులకు ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. గ్రామాల్లో రైతులు పండిస్తున్న ప్రతి పొలాన్ని ఈ–పంట నమోదు చేయాలని సూచించారు. రైతులకు సంబంధించిన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ–పంట డేటా ఆధారంగానే తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ–పంట నమోదులో తప్పులు జరగకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. పంట పొలాల్లో గుర్తించిన చీడపీడలకు వివరాలు, ఫోటోలను ఏపీఎయిమ్స్ 2.0 యాప్లో నమోదు చేయాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి కె.శివప్రసాద్, వీఏఏలు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: అధిక వర్షాలు, వరదల ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణం పంటల నష్టాన్ని అంచనావేసి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటుపల్లి, మూలపాడు, త్రిలోచనాపురం గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను శుక్రవారం వారు పరిశీలించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఇందులో సుమారు లక్ష ఎకరాలకు పైగా వరికి నష్టం వాటిల్లిందని తెలిపారు. గుంటూరు జిల్లాలో 72 వేలు, బాపట్లలో 41 వేలు, ఎన్టీఆర్ జిల్లాలో 12 వేలు, కృష్ణాలో 10 వేలు, కాకినాడ జిల్లాలో 20 వేలు, ఉద్యాన పంటలు మరో 20 వేలు, ఇబ్రహీంపట్నంలో 500 ఎకరాల వరకు నష్టం జరిగిందని చెప్పారు. ఇతర జిల్లాల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. నష్టాన్ని అంచనావేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం నాల్గో శుక్రవారం, ఆగస్టు 15వ తేదీ సెలవుదినంతో పాటు, శనివారం శ్రీకృష్ణాష్టమి సెలవు, ఆదివారం ఇలా వరుసగా మూడు రోజుల సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. సెలవులకు తోడు వివాహ సుముహూర్తాలు కూడా ఉండడంతో నూతన వధూవరులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివస్తుండడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కృత్తివెన్ను: రపమాదవశాత్తు బైక్ రోడ్డు మార్జిన్లో పడిపోవడంతో వ్యక్తి మరణించిన సంఘటన మండల పరిధిలోని సంగమూడి సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు తెలిపిన వివరాల ప్రకారం చినగట్టు గ్రామానికి చెందిన మాటూరి బసవేశ్వరరావు (పెదబాబు) బుధవారం రాత్రి కృత్తివెన్ను వెళుతుండగా అతను ప్రయాణిస్తున్న మోటార్బైక్ అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ గమనించలేదు. కొంత సమయం తరువాత వాహనదారుల సమాచారం మేరకు ప్రమాద స్థలాన్ని గుర్తించి చూడగా అప్పటికే పెదబాబు మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గురువారం బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. విజయవాడలీగల్: విజయవాడ కోర్టులో గురువారం తొలి ఈ–సేవ కేంద్రాన్ని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్ ప్రారంభించారు. రెండవ ఈ–సేవ కేంద్రాన్ని 12వ అదనపు జిల్లా జడ్జి ఎస్.సునీల్, మూడవ ఈ–సేవ కేంద్రాన్ని కమర్షియల్ కోర్టు జడ్జి భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఇకనుంచి ఎటువంటి దావాలు కానీ, దావాకి సంబంధించిన దస్తావేజులు కానీ ఫైల్ చేసుకోవటానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. దీని ద్వారా న్యాయవాదులకు కక్షిదారులకు ఖర్చు తక్కువ, పని సులభం అవుతుంది కక్షిదారులకు కావలసిన కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కేంద్రంలో అడిగి తెలుసుకోవచ్చు. కార్యక్రమంలో పోక్సో కోర్టు జడ్జి వేల్పుల భవనమ్మ, ఎంపీ ఎమ్మెల్యే కోర్టు జడ్జి ఎ.అనిత, 13వ అదనపు జిల్లా జడ్జి శేషయ్య, ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి తిరుమల వెంకటేశ్వర్లు, సీనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి, ఏడో అదనపు జిల్లా జడ్జి అబ్రహం, నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి.అంజనీ ఎస్ఎస్ రామ ఆదిత్య రిషిక, మూడవ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పి. తిరుమల రావు, ఇతర జడ్జిలు పాల్గొన్నారు. హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఈదులగూడెం రోడ్డులో ఉన్న మహిషమ్మ తల్లి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామ శివారులో మామిడి తోటల మధ్య నిర్మానుష్య ప్రాంతంలో ఆలయం ఉండటంతో రాత్రివేళ దొంగలు సులువుగా దోపిడీ చేశారు. ఆలయ ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి గర్భగుడిలోకి ప్రవేశించిన దుండగులు హుండీ అపహరించుకుపోయారు. ఆలయ వెనుక ప్రాంగణంలో హుండీని ధ్వంసం చేసి అందులోని నగదు తీసుకుని పరారయ్యారు. ఆలయ గర్భగుడిలో బీరువాలో భద్రపర్చిన అమ్మవారి నూతన వస్త్రాలు, ఇతర ఆభరణాలను కూడా దుండగులు అపహరించారు. ముఖానికి మాస్క్లు ధరించిన ఇద్దరు యువకులు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి హుండీ అపహరించటం, బీరువా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. గురువారం ఉదయం ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వీరవల్లి పోలీసులకు సవ -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు!
●ఒంటిమిట్ట, పులివెందుల ప్రజలను ఓట్లు వేయనివ్వలేదు ●పక్క నియోజకవర్గాల ప్రజలతో దొంగ ఓట్లు వేయించారు ● వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపాటులబ్బీపేట(విజయవాడతూర్పు): పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అక్కడి ప్ర జలను ఓట్లు వేయనీయకుండా, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకు వచ్చి దొంగ ఓట్లు వేయించిన తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. గుణదలలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు ఒంటిమిట్ట, పులివెందుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి, దానిపై పేలాలు ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందంటూ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ వీడియోలో, పోలింగ్ బూత్లో కలెక్టర్ పరిశీలన చేస్తున్నట్లు విడుదల చేసి న వీడియోల్లోనే దొంగ ఓటర్లు ఉన్నారని అన్నారు. అలా దొంగ ఓట్లు వేసిన వారిపై పోలీసులు, ఎన్నిక ల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని అవినాష్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసి, అత్యంత దారుణంగా ఎన్నికలు నిర్వహించారని, ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. టీడీపీ గూండాలు దాడులు చేసి, గాయపడిన వైఎస్సార్సీపీ వారిపైనే ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు. ఓట్లు వేసేందుకు వెళ్లిన వారిని అడ్డుకున్నారని, స్లిప్లు లాక్కుని తామే ఓటేశారని, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారని అవినాష్ మండిపడ్డారు. అధికార పార్టీ ఏ విధంగా గెలిచిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. -
అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ లభ్యం
అవనిగడ్డ: స్కూల్కు వెళుతున్నామని చెప్పి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. విశాఖపట్నం రైల్యే స్టేషన్లో వీరిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సీఐ యువకుమార్ తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడివాకవారిపాలెంకు చెందిన గుడివాక రామకృష్ణ, అవనిగడ్డకు చెందిన విక్కుర్తి కార్తీక్నాఽథ్ స్థానిక శ్రీచైతన్య స్యూల్లో 9వ తరగతి చదువుతున్నారు. వారిద్దరూ బుధవారం స్కూల్కు వెళుతున్నామని చెప్పి వెళ్లారు. స్కూల్ వదిలినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ యువకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నారని తెలుసుకుని అక్కడి రైల్వే పోలీస్ స్టేషన్లో వారిని భద్రంగా ఉంచి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పిల్లల తల్లిదండ్రులు వైజాగ్ వెళ్లి తమ పిల్లలను తీసుకుని వచ్చారు. సరదా కోసమే వీరు అంతదూరం వెళ్లినట్టు పోలీసులు చెప్పారు. కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
100 మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థుల మానవహారం
నాగాయలంక: స్వాతంత్య్ర దిన వేడుకలలో హర్ఘర్ తిరంగా అభియాన్ నేపథ్యంలో నాగాయలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ గ్రౌండ్స్లో గురువారం విద్యార్థులు ఉత్సాహంగా 100 మీటర్ల జాతీయ పతాకంతో భారీ మానహారం నిర్మించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రోద్యమ చరిత్ర, స్వాతంత్య్ర దిన ప్రాముఖ్యతలపై పాఠశాల హెచ్ఎం అలపర్తి సత్యనారాయణ అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): హెచ్ఐవీ బాధితులను ఉద్దేశించి అమానవీయంగా మాట్లాడిన జిల్లా లెప్రసీ, టీబీ అధికారి తీరుపై వైద్యశాఖ కమిషనర్ వీరపాండియన్ సీరియస్ అయినట్లు తెలిసింది. హెచ్ఐవీ బాధితుల సేవల విషయంలో ఓ వైద్యుడితో ఫోన్లో సంభాషించిన విషయమై సాక్షి జిల్లా ఎడిషన్లో ఈ నెల 12న పోతే పొమ్మనండి అంటూ కథనం ప్రచురితమైంది. దీనిపై కమిషనర్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆయన ఫోన్లో మాట్లాడిన వైద్యుడి నుంచి డీఎంహెచ్ఓ వివరణ తీసుకున్నారు. డీఎంఓ, వైద్యశాఖ కార్యాలయంలో వైద్యుల పట్ల ప్రవర్తనా తీరుపై వారి వద్ద నుంచి కూడా వివరణ తీసుకున్నట్లు తెలిసింది. విచారణ నివేదికను డీఎంహెచ్ఓ వైద్యశాఖ కమిషనర్కు పంపించారని సమాచారం. ఈ విషయమై ఏపీ శాక్స్ అధికారులు సైతం సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి అధికారులతో హెచ్ఐవీ బాఽధితుల మనోభావాలు దెబ్బతింటాయని భావిస్తున్నట్లు సమాచారం. టీబీలోనూ అంతే.. నెలన్నర కిందట బాధ్యతలు చేపట్టిన ఆ అధికారి వచ్చిన వెంటనే కొందరు సిబ్బందిని ఇష్టారాజ్యంగా బదిలీలు చేసేసినట్లు తెలిసింది. వాస్తవంగా వారికి పోస్టింగు ఇచ్చిన సమయంలో ఏ సెంటర్లో పనిచేయాలో కూడా పేర్కొంటారు. కానీ దానికి విరుద్ధంగా బదిలీలు చేసినట్లు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురు వారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కంకిపాడుకు చెందిన బి.తుషార పేరిట రాజేష్ దంపతులు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. ఇక అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడ కామకోటినగర్కు చెందిన సీహెచ్ రమేష్కుమార్, మాధురి దంపతులు తమ కుమారులు చుండూరి నాగరామ్, జశ్వంత్ పేరిట రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
డాక్టరమ్మ రారు...రోగులకు సిబ్బందే గతి!
మచిలీపట్నంఅర్బన్: నగర పరిధిలోని చిలకలపూడిలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో విధులు నిర్వర్తించాల్సిన మహిళా వైద్యురాలు తరచుగా విధులకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో పీహెచ్సీలో వైద్యసిబ్బందే డాక్టర్ స్థానంలో చికిత్స అందించే పరిస్థితి ఏర్పడింది. ఈ పీహెచ్సీకి నిత్యం 60 నుంచి 70 వరకు పేషెంట్లు వస్తుంటారు. వీరందరికీ సిబ్బందే దిక్కు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, అత్యవసర వైద్య సహాయం అవసరమయ్యే వారు సరైన పరీక్షలు, చికిత్సలు పొందలేక వైద్య సిబ్బంది ఇచ్చే మందులతోనే సరిపెట్టుకోవాల్సివస్తోంది. డాక్టర్ గైర్హాజరుపై స్థానికులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి పెద్దల అండదండలు వైద్యురాలి గైర్హాజరు వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల అండదండలు, ఆమె కుటుంబ రాజకీయ సంబంధాలే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ తన విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాక, ఆసుపత్రి సిబ్బందిపై దురుసు ప్రవర్తన ప్రదర్శిస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆమె అవమానకర వైఖరి కారణంగా పలువురు సిబ్బంది ఉద్యోగాలు వదిలిపెట్టిన సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూజ్యం ఓపీ సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్నా వైద్యురాలు గైర్హాజరుతో సిబ్బంది, అటెండెంట్లే క్లినిక్ నడపాల్సి వస్తోంది. ఆసుపత్రిపై అధికారుల పర్యవేక్షణ లేక వైద్యురాలు తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారికంగా ఎటువంటి సెలవులు మంజూరు చేయలేదని తెలుస్తోంది. అయితే రాజకీయ అండతో విధులకు గైర్హాజరు అవుతున్న డాక్టర్ ఉన్నతాధికారుల మందలింపుల తరువాత కూడా తమ ధోరణి మార్చుకోలేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. రాజకీయ నాయకుల అండతో ప్రభుత్వ వైద్యురాలి నిర్లక్ష్య వైఖరి ప్రజల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం...ప్రైవేట్ ప్రాక్టీస్ మహిళా వైద్యురాలు అధికారిక విధుల కన్నా స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రికి రావ డంలో నిర్లక్ష్యం చూపుతున్న ఆమె నగరంలోని తన ప్రైవేట్ క్లినిక్కు మాత్రం రోజూ సమయానికి హాజరవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ప్రతి నెలా జీతం అందుకుంటూ, ప్రైవేట్ ప్రాక్టీస్ పైన దృష్టి సారించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వైద్య వృత్తి నైతికతకు విరుద్ధమని వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాసుపత్రులపై పేద ప్రజల్లో ఉన్న నమ్మకం సన్నగిల్లుతోంది. కూటమి ప్రభుత్వ వైఖరి ఇందుకు కొంత కారణంగా కాగా వైద్యుల గైర్హాజరు, పరికరాల కొరత, మౌలిక సదుపాయాల లోపం, మందుల కొరత వంటి సమస్యలు కారణభూతమవుతున్నాయి. మచిలీపట్నం పరిధిలోని చిలకలపూడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితి ఇందుకు ప్రబల నిదర్శనం. -
ఆప్మెల్ సంస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
తెలంగాణ డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ప్రపంచ వ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడిభాగాల తయారీ, పాత విడిభాగాలు మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఏపీహెచ్ఎంఈఎల్ సంస్థ అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర డెప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఎల్(ఆప్మెల్)ను సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. కార్మికులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ ఆప్మెల్ మిషనరీ, మానవ వనరులు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. సంస్థలో పనిచేసే అధికారులు, కార్మికులు నిబద్ధతతో పనిచేసి ప్రపంచంతో పోటీ పడగలం అన్న నమ్మకం కలిగించాలని అన్నారు. సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీని నియమిస్తామన్నారు. స్థానిక పరిస్థితుల అధ్యయనం ద్వారా ఎలా ముందుకు పోవాలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది ఎంత బాగా పనిచేస్తే అంత బాగా లాభాలు సాధిస్తామని, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. మిషనరీని పరిశుభ్రంగా ఉంచి, యంత్రాలకు ఓవరాలింగ్, రంగులు వేయాలని ఆదేశించారు. కార్మికులు భద్రతా ప్రమాణాలు పాటించి పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలో సింగరేణి కాలరీస్ కొత్త యంత్రాల తయారీ, పాత యంత్రాల మరమ్మతు వరకే పరిమితం కాకుండా దేశానికి అవసరమైన ఆర్డర్లు తీసుకొని భెల్ కంపెనీ మాదిరిగా థర్మల్ పవర్ స్టేషన్లకు అవసరమైన యంత్రాల తయారీ, యంత్రాల మరమ్మతు చేయాలన్నారు. -
కక్షిదారుల సౌలభ్యం కోసం ఈ–సేవ కేంద్రాలు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ చిలకలపూడి(మచిలీపట్నం): కక్షిదారులు, న్యాయవాదుల సౌలభ్యం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ–సేవ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ–సేవ కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ.. ఈ కేంద్రాల ద్వారా ఉచితంగా కక్షిదారులకు, న్యాయవాదులకు కేసుల పరిస్థితి, తదుపరి విచారణ తేదీలు వంటి వివరాలను తెలు పుతారని వివరించారు. సెలవులో ఉన్న న్యాయ మూర్తుల వివరాలను కూడా తెలియజేస్తారని తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. న్యాయపరమైన ఆదేశాలు, తీర్పులు, సాఫ్ట్ కాపీలను ఈ–మెయిల్, వాట్సాప్, అందుబాటులో ఉన్న ఇతర యాప్ల ద్వారా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. న్యాయశాఖలో తర్ఫీదు పొందిన సిబ్బంది ఈ–సేవ కేంద్రాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్జి జి.వెంకటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోతురాజు, న్యాయవాదులు ఎల్.బాలాజీ, నగధర్నాథ్, పుప్పాల కామేశ్వరరావు, పామర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధుల ముప్పు.. అప్రమత్తతే మందు
వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కుసిరిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడలోని పలు కాలనీలు నీటమునిగాయి. అన్ని రోడ్లలో మురుగుతో కలిసి వర్షపునీరు తిష్టవేసింది. దీంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరద ప్రాంతాలతో పాటు, అన్ని ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా చూడా లని, తాగునీటిని కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే తాగాలని స్పష్టంచేస్తున్నారు. అంటు వ్యాధుల భయం ● వరదలు వచ్చిన ప్రాంతంలో ఆహారం, నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో వాంతులు, విరేచనాలు, అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ వ్యాధుల లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఏర్పడవచ్చు. ● వరద ప్రాంతాల ప్రజలు కొన్ని రోజుల పాటు చేతి పంపులు, కుళాయిల ద్వారా వచ్చే నీటిని తాగకుండా ఉండటం మంచింది. మంచినీటి పైపులు, డ్రెయిన్లు పక్కపక్కనే ఉంటే, ఆ రెండింటిలో నీరు కలిసే ప్రమాదం ఉంటుంది. ఇలా నీరు కలిసి కలుషితమైతే అనేక రకాల బ్యాక్టీరియాలతో పాటు, ఈ–కోలి వంటివి శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురిచేస్తాయి. ● ఆర్ఓ వాటర్ బాటిళ్లలోని నీరు కూడా సురక్షితమని చెప్పలేం. ఆ నీటిని కూడా 30 నిమిషాల పాటు కాచి చల్లార్చి తాగితే మంచిది. ● వరద ప్రాంతాల్లోని ప్రజలు కొన్ని రోజుల పాటు బయట ఆహారం తినకూడదు. ఇప్పటికే ప్రబలిన జ్వరాలు ఇప్పటికే విజయవాడతో పాటు, ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీజనల్ ఫ్లూ జ్వరాలు ఉన్నాయి. ఇప్పుడు వరద నేపథ్యంలో అవి ఇంకా విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటివి ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ● నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వ్యాప్తి చెందితే మలేరియా, డెంగీ, గున్యా వంటి విషజ్వరాలు సోకుతాయి. ప్రస్తుతం నగరంలో ఈ జ్వరాలు ఉన్నందున, ఈ వరదతో మరింత పెరిగే అవకాశం ఉంది. ● ఈగల ద్వారా కూడా బ్యాక్టీరియా ఆహార పదార్థాలపైకి చేరి వ్యాధులు సోకే అవకాశం ఉంది. ● విజయవాడలో ఇప్పటికే పారిశుద్ధ్య సమస్య ఉన్న నేపథ్యంలో వరదలతో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. వర్షాలతో పలు కాలనీల్లో నీళ్లు రావడంతో ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. అంతేకాకుండా కాలనీల్లోకి నీరు వచ్చిన ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 24 శిబిరాలు ఏర్పాటు చేశాం. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు కూడా వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్జిల్లా -
బస్టాండ్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలకు ఉచిత బస్సు (సీ్త్ర శక్తి) పథకాన్ని ప్రారంభించేందుకు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను గురువారం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పరిశీలించారు. బస్టాండ్తో పాటు, పరిసర ప్రాంతాల్లో భద్రతా పరంగా ఎలాంటి చిన్న లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్నిశాఖల అధికారుల సమ న్వయంతో అప్రమత్తంగా ఉంటూ, బందో బస్తు నిర్వహించాలని సూచించారు. ముఖ్య మంత్రితో పాటు, మంత్రులు, వీవీఐపీలు, ఇతర అధికారులు ప్రయాణించే మార్గాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కె.జి.వి. సరిత, ఎస్.వి.డి.ప్రసాద్, ఏడీసీపీ ఎ.వి.ఎల్. ప్రసన్నకుమార్, సౌత్ ఏసీపీ పావన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు సీ్త్రశక్తి పథకం ప్రారంభం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం సీ్త్ర శక్తి పథకం శుక్రవారం ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. విజయవాడ బస్టాండ్లో ఏర్పాట్లను కలెక్టర్ సమన్వయ శాఖల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఆర్డీఓ కావూరి చైతన్య, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లోని సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. నగరంలోని న్యూరాజరాజేశ్వరిపేట, ఇబ్రహీంపట్నం, చినలంక సడక్రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆమె గురువారం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను పరిశీలించారు. అదే విధంగా సడక్రోడ్డు ప్రాంతంలో వరద తీవ్రతను పరిశీలించి, గర్భిణులు, బాలింతలు ఉంటే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నపాటి అనారోగ్యం కలిగినా వెంటనే ప్రథమ చికిత్స చేయాలనే, అవసరమైతే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. -
స్వాతంత్య్ర వేడుకలకు సర్వంసిద్ధం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): స్వాతంత్య్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను గురువారం పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు దగ్గరుండి చేయించారు. షామియానాలు వేసి నేలను రబ్బీసుతో చదును చేయించారు. టెంట్ల కింద పచ్చటి తివాచీలు పరిచారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లును ఎస్పీ ఆర్. గంగాధర్రావు పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసు సిబ్బంది రిహార్సల్స్ చేయగా, వారి నుంచి ఎస్పీ గౌరవవందనం స్వీకరించారు. పరేడ్ కమాండర్గా బందరు డీఎస్పీ సీహెచ్.రాజా వ్యవహరించారు. -
బుడమేరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
జి.కొండూరు: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుడమేరు వరద ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. జి.కొండూరు మండలంలోని వెలగలేరు వద్ద బుడమేరుపై ఉన్న హెడ్ రెగ్యులేటర్ను ఆయన గురువారం ఉదయం పరిశీలించారు. హెడ్ రెగ్యులేటర్ గేట్ల పనితీరు, వరద ప్రవాహం, డైవర్షన్ కెనాల్ సామర్థ్యం వంటి అంశాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. బుడమేరులో సాధారణ వరద ప్రవాహం కొనసాగుతున్నందున డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్తోందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. బుడమేరుకు వరద ప్రవాహం పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందుగానే సమాచారం అందించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. అనంతరం కొండపల్లి శాంతినగర్ వద్ద ఇటీవల బుడమేరు డైవర్షన్ కెనాల్కు నిర్మించిన రిటైనింగ్వాల్, ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025స్వాతంత్య్ర దినోత్సవ సందడి వాడవాడలా స్వాతంత్య్ర దినోత్సవ సందడి నెలకొంది. విజయవాడ నగరంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకాల విక్రయాలు జోరుగా సాగాయి. దుర్గమ్మకు పలువురి విరాళాలు విజయవాడ దుర్గమ్మకు గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. నిత్యాన్నదానం పథకం కోసం ఈ విరాళాలు ఆలయ అధికారులకు అందజేశారు.కంకిపాడు/అవనిగడ్డ: ఒక వైపు కృష్ణమ్మ, మరో వైపు బుడమేరు ఉగ్రరూపం దాల్చాయి. పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గంట గంటకూ నీటి ప్రవాహ ఉధృతి పెరుగుతుండ టంతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలు స్తంభించే పరిస్థితి నెలకొంది. వరదెత్తిన కృష్ణమ్మ విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నది దిగువకు భారీగా నీటిని వదిలారు. దీంతో వరదనీరు కడలి వైపు పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే 5.52 లక్షలు క్యూసెక్కులను అధికారులు విడుదల చేయడంతో కృష్ణానది ఏటిపాయ వరదతో పోటెత్తింది. గురువారం మధ్యాహ్నానికి ఏటిపాయ అంచుల నుంచి కరకట్టకు వెళ్లే రహదారుల్లోకి, కరకట్టకు దిగువనున్న పంట కాలువల్లోకి వరదనీరు చేరింది. పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండలాలతో పాటుగా పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలంలోని లంక గ్రామాల చుట్టూ వరద నీరు చుట్టేసింది. లంక గ్రామాల ప్రజలు పడవల సాయంతో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నారు. లంక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. లంక భూములను వరద ముంచే ప్రమాదం ఉంది. వరద ప్రవాహం పెరిగితే దివిసీమలోని పలు గ్రామాలు నీటమునిగే ప్రమాదముంది. ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద కృష్ణానదిలో వేసిన రహదారి వరదలకు కొట్టుకు పోవడంతో రాకపోకలు స్తంభించాయి. పంట పొలాలకు ముంపు ముప్పు కృష్ణానది కరకట్ట, బుడమేరు పరిసరాల్లో పంట పొలాలకు ముంపు భయం పొంచి ఉంది. ఇప్పటికే కృష్ణానది, బుడమేరు ఉగ్రంగా ప్రవహిస్తున్నాయి. కరకట్ట దిగువున ఉన్న పంట పొలాల చుట్టూ నీరు చేరింది. ఎగువ నుంచి వరదనీరు ఇంకా విడుదల చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుడమేరు పరిధిలోని కేసరపల్లి, మురుగుకాలువ పరిధిలోని జగన్నాధపురంలో ఇప్పటికే 100 ఎకరాల్లో పొలాలు ముంపునకు గురయ్యాయి. బుడమేరు ఉధృతి పెరిగే పంట పొలాల ముంపు అధికమయ్యే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. అప్రమత్తమైన అధికారులు బుడమేరు, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఉయ్యూరు ఆర్డీఓ హెలా షారోన్ నేతృత్వంలోని అధికారుల బృందం పరిస్థితిని సమీక్షించింది. శాస్వతంగా ఊరొదిలేస్తాం అవనిగడ్డ మండలంలోని ఎడ్లంకను వరద ముంచెత్తింది. ఈ గ్రామానికి వెళ్లే కాజ్వే రోడ్డు కొట్టుకుపోవడంతో గ్రామస్తులు పడవ ప్రయాణం సాగిస్తున్నారు. ఎడ్లంక పల్లెపాలెంలో కృష్ణానది ఒడ్డున నిర్మించిన తిరుపతమ్మ ఆలయం వరదలకు కోతకు గురైంది. వరద పెరిగితే ఈ ఆలయం నీటమునుగుతుంది. తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరావు, సీఐ యువకుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ఎడ్లంక గ్రామంలో గురువారం పర్యటించి, వరద ఉధృతి పెరుగుతున్నందున పునరావాస కేంద్రానికి తరలి రావాలని గ్రామస్తులను కోరారు. దీంతో కొంతమంది మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వరద వచ్చినప్పుడే తమ ఊరు, తాము గుర్తుకొస్తున్నామని, తరువాత ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన ఊసేలేదని, రక్షణ గోడ నిర్మానాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు పడలేమని శాస్వతంగా ఊరు వదిలి వెళ్లిపోతామని చెప్పారు. ఉధృతంగా బుడమేరు బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. గత సెప్టెంబర్లో పంట పొలాలుపై విరుచుకుపడిన బుడమేరు ఈ ఏడాది ఖరీఫ్ తొలి నాళ్ల లోనే ఉధృతంగా ప్రవహిస్తోంది. కంకిపాడు మండలం వేల్పూరు, ఉప్పలూరు, మంతెన, తెన్నేరు మీదుగా బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో వైపు ఏనుగుల కోడు నీటితో నిండుగా ప్రవహిస్తోంది. గొడవర్రు వద్ద కట్ట మీదుగా ఏనుగుల కోడు వెళ్తోంది. సమీపంలోని వరి పొలాలు నీటమునిగాయి. -
దుర్గమ్మ సన్నిధిలో 16న కృష్ణాష్టమి వేడుకలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 16వ తేదీ శనివారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కృష్ణ భగవానుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. లక్ష్మీ గణపతి విగ్రహం ఎదురుగా ఉన్న గోశాల వద్ద గోమాతకు విశేష పూజలు, సాయంత్రం 5 గంటలకు మహా మండపం కళావేదికపై దేవస్థాన పురాణ పండితులచే ఉపన్యాసం ఉంటుందని తెలిపారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం రాజగోపురం ఎదుట ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. 19, 20 తేదీల్లో దరఖాస్తుల పంపిణీ.. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో నిర్వహించే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు 19, 20వ తేదీలలో దరఖాస్తులను అందిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 22వ తేదీ 5వ శుక్రవారం మహా మండపం ఆరో అంతస్తులో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్న సంగతి తెలిసింది. ఈ వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే భక్తులకు మహా మండపం గ్రౌండ్ ప్లోర్లో ఉన్న దేవస్థాన టోల్ ఫ్రీ కార్యాలయంలో ఉదయం నుంచి దరఖాస్తుల పంపిణీ జరుగుతుందన్నారు. దరఖాస్తులను పూర్తి చేసి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని జత చేసి తిరిగి కార్యాలయంలో అందచేయాలని తెలిపారు. -
బందరులో ‘క్విట్ కార్పొరేట్’ నిరసన
మచిలీపట్నంటౌన్: వ్యవసాయ రంగంలో కార్పొరేట్ల ప్రవేశాన్ని అడ్డుకోవాలని సీఐటీయూ, వ్యవసాయ, రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు బుధవారం మచిలీపట్నం కోనేరు సెంటర్లో ధర్నా నిర్వహించారు. వ్యవసారంగంలో ఇప్పటికే చిన్న కమతాల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 20 సెంట్లు భూమి కలిగిన చిన్న రైతులకు అన్నదాత భరోసా పథకం వర్తించడం లేదని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం నారాయణరావు మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి అత్యధికంగా పండే ఆక్వా ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల భారం నుంచి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కాపాడాలన్నారు. ఇతర దేశాలకు సరుకు ఎగుమతుల్లో ప్రోత్సహించి రొయ్యల రైతులకు గిట్టుబాటు ధర అదే విధంగా చూడాలని కోరారు. కృష్ణాజిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కోసూరు శివ నాగేంద్ర మాట్లాడుతూ అధిక వర్షాల బారిన పడి ముంపునకు గురైన వరి రైతులను ఆదుకోవాలన్నారు. వేలాది రూపాయల ఖర్చుపెట్టి వరి నాట్లు పూర్తి చేసిన రైతులకు నీటి ముంపు సమస్య తీరని నష్టం కలిగించిందన్నారు. డ్రెయిన్ల నిర్వహణ వేసవి కాలంలో చేపట్టి పనులు పూర్తి చేసి ఉంటే ముంపు నీరు త్వరగా తరలిపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరావు మాట్లాడుతూ రైతుల పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాల మేరకు ఉంటుందని ఆచరణలో అమలు జరగడం లేదన్నారు. రైతులు తమ పండించిన పంటలు అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఐటీయూ కృష్ణా జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, నగర కన్వీనర్ సీహెచ్ జయరావు, బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడు ఎండీ యూనస్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఇద్దరు బాల నేరస్తులు
గన్నవరం: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు బాల నేరస్తులను గన్నవరం పోలీసులు బుధవారం అదుపులో తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హైదరాబాద్ జువైనల్ హోమ్ నుంచి ఈ ఏడాది జూలై 22న ఐదుగురు బాల నేరస్తులు పారిపోయారు. వీరిలో ఇద్దరు హయత్నగర్, చౌటుప్పల్లో రెండు బైక్లను చోరీ చేసుకుని విజయవాడ వచ్చి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉంటూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక దావాజీగూడెం రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసి ఉన్న రెండ్ బైక్లు ఈ నెల 6వ తేదీ రాత్రి అపహరించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ శ్రీధర్ నేతృత్వంలోని సిబ్బంది సాంకేతిక ఆధారాలు మేరకు స్థానిక కోనాయి చెరువు సమీపంలో బైక్పై వెళ్తున్న ఇరువురు బాల నేరస్తులను అదుపులో తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ. 4.30 లక్షల విలువైన మూడు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల గురించి హైదరాబాద్లోని జువైనెల్ హోమ్కు సమాచారం ఇచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. -
విద్యతోనే జ్ఞాన సముపార్జన
గుడ్లవల్లేరు: ఆకాశమే హద్దుగా విద్యార్థులు జ్ఞాన సముపార్జనకే విద్య అభ్యసించాలని స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ జి.వి.వి.సత్యనారాయణ మూర్తి అన్నారు. వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు 17వ స్మారక అవార్డుల ప్రదానోత్సవం బుధవారం నిర్వహించారు. గుడ్లవల్లేరు ఎ.ఎ.ఎన్.ఎమ్ అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్. పాలిటెక్నిక్ కాలేజీలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ అవార్డులను సాంకేతిక విద్యామండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారన్నారు. విద్యా విధానంలో మార్కులకు ప్రాతిపదికగా కాకుండా నైపుణ్యాలను పెంపొందించే దిశగా పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వారితో ఒప్పందాన్ని కుదుర్చుకొనే దిశగా అడుగులువేస్తున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను అందించటంలో లాభాపేక్ష లేని ఒక విద్యా వ్యవస్థను స్థాపించడంలో దివంగత వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. గుడ్లవల్లేరు ఏఏఎన్ఎమ్ అండ్ వీవీఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆలూరి లలిత కోమలికు రూ.10వేల విలువైన బంగారు పతకాన్ని, రూ.10వేల నగదును, డి.టి.ఇ ధ్రువీకరించిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ద్వితీయ ర్యాంకు సాధించినందుకు గాను శ్రీ వాసవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ – టెక్నాలజీ నందమూరు పాలిటెక్నిక్కు చెందిన విద్యార్థిని అంకెం అఖిలా దేవికి రూ.5ల విలువగల బంగారు పతకాన్ని, రూ.5 వేల నగదును, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కాలేజీ ప్రెసిడెంట్ వల్లభనేని సుబ్బారావు, గారు, కో– కరెస్పాండెంట్ వల్లూరుపల్లి రామకృష్ణ తదితనేఏ పాల్గొన్నారు. స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సత్యనారాయణమూర్తి -
విద్యార్థులూ.. డ్రగ్స్ జోలికెళ్లొద్దు!
●ఉన్నత లక్ష్య సాధన దిశగా అడుగులేయండి ●ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ కృష్ణలంక(విజయవాడతూర్పు): విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా అడుగులేయాలని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో బుధవారం యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల స్వాగత కార్యక్రమాన్ని సంయుక్త పేరుతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజీ విద్యార్థులతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలు వంటి దుర్వసనాల బారినపడితే జీవితం అంధకారంగా మారుతుందని హెచ్చరించారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారికి 20 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ చట్టం కింద విద్యార్థులపై కేసు నమోదైతే జీవితం అంధకారంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల వినియోగానికి, సరఫరాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలి.. విజయవాడ డీసీపీ కె.జి.వి.సరిత మాట్లాడుతూ జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని, దేశ ప్రగతికి కృషి చేయాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యా సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ఈగల్ ఎస్పీ కె.నగేష్బాబు మాట్లాడుతూ ఆతిధ్య రంగంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అపారమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్య సాధనలో విద్యార్థులే కీలకమన్నారు. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని కళా నైపుణ్యాలను వెలికితీసి వారిని బహుముఖ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే సంయుక్త లక్ష్యమన్నారు. అనంతరం ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు అనే బ్యానర్లును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ అబ్దుల్ రెహమాన్, యునైటెడ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కరీమా, ప్రిన్సిపాల్ జగదీష్ జంపన, ఈవెంట్ మేనేజర్ ఉష, ఈగల్ ఇన్స్పెక్టర్ ఎం.రవీంద్ర, ఎస్ఐ ఎం.వీరాంజనేయులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రగతి సూచికలే ‘స్వర్ణాంధ్ర’ పునాదులు
●పీ4 అమలులో జిల్లాను ముందు వరుసలో నిలపాలి ●జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ●విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో డీఆర్సీ సమావేశం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర నిర్మాణానికి కీలక ప్రగతి సూచికలే (కేపీఐ) పునాదులని.. నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఇంచార్జి మంత్రి సత్యకుమార్యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లోనూ వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. బుధవారం విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్లోని రైతు శిక్షణ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా మూడో సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశతో పాటు ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకటరావు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కొలికపూడి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు హాజరయ్యారు. తొలుత కలెక్టర్ లక్ష్మీశ.. సుపరిపాలనలో తొలి అడుగు పనుల్లో ప్రగతిని వివరించారు. మొత్తం రూ. 167.37 కోట్లతో శంకుస్థాపన చేసిన 1,661 పనుల్లో ఇప్పటికే 1,339 పనులు ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించి 18.5 శాతం వార్షిక వృద్ధి లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలను, రంగాల వారీగా జీవీఏ, జీడీడీపీ, తలసరి ఆదాయ లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు సానుకూల దృక్పథంతో పని చేయాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకునేందుకు నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. డీఆర్సీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. 2024–25లో జిల్లా జీడీపీ రూ. 94,561 కోట్లు కాగా దీన్ని 2025–26లో రూ.1,12,057 కోట్లకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. అదేవిధంగా 2024–25లో తలసరి ఆదాయం రూ. 3,53,150 కాగా దీన్ని 2028–29 నాటికి రూ. 6,38,946కు చేర్చాల్సి ఉందన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన పీ4 విధానం అమల్లో జిల్లాను ముందు వరుస లో నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించా రు. విజయవాడ నగర ఘన వారసత్వ సంపద ను భావితరాలకు అందించేందుకే విజయవాడ ఉత్సవ్ను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కీలక అంశాలను ముందుంచిన ఎమ్మెల్యేలు.. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావించారు. పీఎం సూర్యఘర్ పథకం అమలు, గహ నిర్మాణాల వేగవంతానికి రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల ఏర్పాటు, అడ్డంకులు లేని సురక్షిత తాగునీటి పథకాల పటిష్ట అమలు, ఆర్ అండ్ బీ రహదారుల మరమ్మతులు, గన్నవరం–విజయవాడ రహదారి, లింకు రోడ్ల అభివృద్ధి, విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాలకు రెయిలింగ్, ఆటోనగర్ల అభివృద్ధి, సౌకర్యాల కల్పన, వివిధ ప్రాజెక్టుల డీపీఆర్ల రూపకల్పన, వేదాద్రి–కంచల ఎత్తిపోతల పథకాల సమస్యల పరిష్కారం తదితరాలపై చర్చించారు. ఎ.కొండూరుకు కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయినందున, పైపులైన్ల పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎ.కొండూరు డయాలసిస్ కేంద్రంలో వారానికి ఒకసారి కా కుండా రెండు రోజులు నెఫ్రాలజిస్టు సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వీటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో వై.శ్రీలత, ఆర్టీఓలు కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డ్వాక్రా బజార్ల ఏర్పాటు కీలకం : ఎంపీ శివనాథ్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావించారు. విజయవాడ అర్బన్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు డ్వాక్రా బజార్ల ఏర్పాటు, ఎర్రకట్ట పై వంతెన ఆధునికీకరణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ వర్క్ డీపీఆర్, అర్బన్ నియోజకవర్గాల పరిధిలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు, మూడు కాలువల గట్ల సుందరీకరణతో పాటు గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలు, గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. -
గణపతి ఉత్సవాల్లో ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: గణపతి నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు కోరా రు. ఉత్సవ కమిటీలు, యువత పోలీసు శాఖ నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఆయన పందిళ్ల నిర్వాహకులకు పలు సూచనలు చేస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిర్వాహకులు మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. డీజే బాక్సులు, బాణసంచాకు అను మతి లేదన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్లు ఆక్రమించి, ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అర్జీదారులు, ఉత్స వకమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీరువా పగులగొట్టి నగలు చోరీ చిట్టినగర్(విజయవాడపశ్చిమ): బీరువా తాళాలు పగులగొట్టి వెండి, బంగారు నగలను చోరీకి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాపురం పరిధిలోని పైపుల రోడ్డు సమీపంలోని కృష్ణ బాబాయి హోటల్ వద్ద పన్నేరి దుర్గాప్రసాద్ తన భార్య సుమతో కలిసి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. దుర్గాప్రసాద్ ఎసీ టెక్నిషియన్గా పని చేస్తుంటాడు. ఈ నెల 10వ తేదీన దుర్గాప్రసాద్ భార్యకు ఇంట్లో సీమంతం జరిగింది. అదే రోజు సాయంత్రం సుమా పుట్టింటికి వెళ్లింది. 12వ తేదీ మధ్యాహ్నం దుర్గాప్రసాద్ తన ఇంటికి వచ్చి భార్యకు కావాల్సిన కొన్ని బట్టలు తీసుకుని అత్త గారి ఇంటికి వెళ్లాడు. అయితే బట్టలు సరిపోలేదని మరో డ్రెస్ తెచ్చేందుకు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి కనిపించాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువా తాళం పగలగొట్టి అందులో వస్తువులు చిందర వందరగా పడేసి కనిపించాయి. బీరువాలో ఉండాల్సిన నాలుగు గ్రాముల బంగారు నల్లపూసలు, 3 గ్రాముల బంగారపు చెవిదిద్దులు, 300 గ్రాముల వెండి వస్తువులు, కొంత నగదు చోరీకి గురయినట్లు గుర్తించాడు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అమరేశ్వరుని పవిత్రోత్సవాలు ప్రారంభం అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలిరోజు బుధవారం ఉదయం 5గంటల నుంచి ఆలయ ఆవరణను శుద్ధిచేసి భక్తులకు 9 గంటలకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. రెండవరోజు గురువారం పవిత్రో త్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో రేఖ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. -
విద్యుత్ షాక్తో ప్రొక్లెయిన్ డ్రైవర్ మృతి
వీరులపాడు: విద్యుదాఘాతంతో ప్రొక్లెయిన్ డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని జయంతి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు... గ్రామానికి చెందిన వల్లబోయిన గోపి (32) ప్రొక్లెయిన్ డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం గ్రామ శివారులోని వ్యవసాయ పనులు ముగించుకుని ప్రొక్లెయిన్ను లారీపై ఎక్కించి గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఎస్సీ కాలనీ వద్దకు వచ్చే సరికి 11 కెవీ విద్యుత్ తీగలు ప్రొక్లెయిన్కు అడ్డురావటంతో తప్పించబోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అనిల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆటోపై కూలిన తాటి చెట్టు.. డ్రైవర్కు తీవ్ర గాయాలు
నందమూరు(గన్నవరం): రోడ్డుపై వెళ్తున్న ఆటోపై తాటి చెట్టు కూలి డ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన ఉంగుటూరు మండలం నందమూరు వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... ఉంగుటూరు మండలం ముక్కపాడుకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీను తెల్లవారుజామున పెనమలూరులో ఉన్న బందువులను ఎక్కించుకుని వచ్చేందుకు బయలుదేరాడు. నందమూరు వద్దకు రాగనే భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి రోడ్డు పక్కనే ఉన్న తాడిచెట్టు కూలి ఒక్కసారిగా ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో శ్రీనుకు బలమైన గాయాలు కావడంతో ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉంగుటూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. వర్షానికి కూలిన చెట్టును ఢీకొని బైకిస్టు దుర్మరణం గుణదల(విజయవాడ తూర్పు): వర్షానికి రోడ్డుపై కూలిన చెట్టును ఢీకొని మోటారు సైకిల్పై వెళుతున్న వ్యక్తి మృతి చెండాడు. ఈ ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., గుణదల హరిజన వాడకు చెందిన తుళ్లూరి మహేష్ బాబు (37) యనమల కుదురు ప్రాంతంలో ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తుంటాడు. రెండేళ్ల క్రితం స్వాతి అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రోజు ఉదయం షాపు నిర్వహించేందుకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం యనమలకుదురు వెళ్లిన మహేష్బాబు రాత్రి 11.30 గంటలకు గుణదలలోని ఇంటికి ప్రయాణమయ్యాడు. అప్పటికే వర్షానికి లయోల కళాశాల రోడ్డులో ఓ చెట్టు పడిపోయింది. రాత్రి సమయంలో వేగంగా వెళుతున్న మహేష్బాబు రోడ్డు పై పడి ఉన్న చెట్టును ఢీ కొట్టాడు. బలమైన గాయాలు కావడంతో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమిక వైద్యం అందించేందుకు వచ్చిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మహేష్బాబు బైక్ పై వచ్చి చెట్టుకు ఢీ కొట్టిన సీసీ కెమేరా ఫూటేజిలు లభ్యమయ్యాయని మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు. తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు పెనమలూరు: తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకు అరెస్టయ్యాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిగడప శ్రీనివాసానగర్కు చెందిన నన్నం శౌరి(68), నన్నం కేశవరావులు తండ్రీకొడుకులు. ఇద్దరూ పెయింటింగ్ పనులు చేస్తుంటారు. రెండు రోజల కిందట కేశవరావు తనతో పాటు పనికి రావడం లేదనే కోపంతో తండ్రిపై దాడి చేశాడు. గాయపడి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించగా శౌరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈ ఘటనను రోడ్డు ప్రమాదంలో శౌరి గాయపడ్డాడని తప్పుదారి పట్టించటానికి కేశవరావు యత్నించాడు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావటంతో పోలీసులు కేశవరావుపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించింది. -
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వాతంత్య్ర వేడుకల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీ హరీష్కుమార్ గుప్తా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం పోలీస్ పరేడ్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు, వీవీఐపీలు, వీఐపీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీజీపీ మధుసూదనరెడ్డి, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, ఐజీ బి.రాజకుమారి, డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముంచెత్తిన వాన
చిలకలపూడి(మచిలీపట్నం): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయంకావడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పొలాలు నీటమునిగాయి. జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 83.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో పమిడిముక్కల మండలం ఐనంపూడి గ్రామంలో పిడుగుపడి పశువులపాక దగ్ధం కావటంతో రెండు గేదెలు, ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందాయి. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని రత్నకోడు, గుండేరు డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. ఈ ఆయకట్టులోని పొలాలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం వేసిన నాట్లు నీటి ఒరవడికి కొట్టుకుపోయాయి. జిల్లాలోని నియోజకవర్గాల్లో నీట మునిగిన పొలాలు ● మచిలీపట్నం నియోజకవర్గంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చిన్నాపురం, గొల్లపాలెం, సింహాచలం, నెలకుర్రు తదితర గ్రామాల్లోని పంటపొలాలు నీటమునిగాయి. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) నీటమునిగిన పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికై నా రైతు కష్టాలను పరిశీ లించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓవైపు ఎరువుల కొరత, మరోవైపు అధిక వర్షాల కారణంగా పొలాలు దెబ్బతినడంతో రైతులు కుదేలవుతున్నారన్నారు. ● పెడన నియోజకవర్గంలోని పెడన మండలంతో పాటు బంటుమిల్లి, గూడూరు మండలాల్లో అధిక వర్షం నమోదుకాగా కృత్తివెన్ను మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో ఎటువంటి పంటనష్టం జరగలేదు. ● అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ వర్షం కారణంగా చల్లపల్లి మండలం నడకుదురు గ్రామంలో చెట్లు పడిపోవడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. నియోజకవర్గ పరిధిలోని రత్నకోడు, గుండేరు డ్రెయిన్ల పరిధిలో పొలాలు మునిగాయి. కోడూరు, నాగాయలంక, మోపిదేవి, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో నాట్లు వేసిన పొలాలు దెబ్బతిన్నాయి. నియోజకవర్గ పరిధిలో రాత్రి 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థ పడ్డారు. ● పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ, పామర్రు, పెదపారుపూడి, తోట్లవల్లూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట కాలువల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. మొవ్వ మండలంలోని కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. ● గుడివాడ నియోజకవర్గంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి పంట పొలాలు పరిస్థితి బాగానే ఉన్నా రెండు, మూడు రోజులు వర్షం ఇలానే కురిస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుడివాడ పట్టణంలోని బస్టాండ్ తదితర పల్లపు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. బుడమేరుకు పైనుంచి వరద రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ● పెనమలూరు నియోజకవర్గ పరిధిలో కూడా అధిక వర్షపాతం నమోదైంది. గాలి, వాన రావడంతో గంటసేపు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వరి పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ● గన్నవరం నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఐనంపూడిలో పిడుగుపడి పశువుల పాక దగ్ధం, మూడు పశువులు మృతి పొంగిపొర్లుతున్న రత్నకోడు, గుండేరు డ్రెయిన్లు బుడమేరుకు పైనుంచి వరద పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయంకృష్ణాలో లోతట్టు ప్రాంతాలు జలమయంజిల్లాలో 83.4 మిల్లీమీటర్ల వర్షపాతం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 83.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చల్లపల్లి మండలంలో 177.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా బాపులపాడు మండలంలో 0.4 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు పరిశీలిస్తే నాగాయలంక మండలంలో 143.8 మిల్లీమీటర్లు, అవనిగడ్డ 137.2, కోడూరు 126.8, కంకిపాడు 125.4, పామర్రు 120.4, గుడివాడ 114.4, మోపిదేవి 108.2, ఉయ్యూరు 106.2, గుడ్లవల్లేరు 105.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పమిడిముక్కల మండలంలో 102.6 మిల్లీమీటర్లు, నందివాడ 96.4, బంటుమిల్లి 87.2, పెనమలూరు 84.6, ఘంటసాల 83.2, తోట్లవల్లూరు 74.6, ఉంగుటూరు 65.6, పెదపారుపూడి 58.2, మొవ్వ 55.4, గన్నవరం 45.2, పెడన 40.0, మచిలీపట్నం నార్త్, సౌత్ 32.6, గూడూరు 28.8, కృత్తివెన్ను మండలంలో 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ప్రజలపై ‘స్మార్ట్’ భారం!
గుడివాడరూరల్: స్మార్ట్మీటర్ల ఏర్పాటును ప్రజలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా రాష్ట్రంలోని కూటమి సర్కార్ లెక్కచేయడం లేదు. ప్రజలపై భారంపై మోపడానికి అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, వాణిజ్య సముదాయాలకు వీటిని బిగిస్తున్నారు. త్వరలో గృహ సముదాయాలు, వ్యవసాయ కనెక్షన్లకు ఏర్పాటుచేయడానికి రంగం సిద్ధమవుతుంది. ప్రీపెయిడ్ ఆప్షన్తో వీటిని రూపొందించారు. మొబైల్, కేబుల్ టీవీల తరహాలోనే ముందుగానే రీచార్జ్ చేసుకుంటేనే విద్యుత్ సరఫరా ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్గా సరఫరా నిలిచిపోతుంది. మొబైల్ చార్జర్ ఆన్చేసినా విద్యుత్ వాడినట్లు బిల్లు వచ్చేస్తుంది. పేదల కష్టార్జితం ‘స్మార్ట్’ బిల్లులు కట్టడానికే సరిపోయేలా ఉంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 6,65,266 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దీనిలో ప్రభుత్వ సంస్థలవి 11,399 ఉండగా, ప్రైవేట్ కనెక్షన్లు 6,53,867 ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 211.411మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికి ప్రతి నెలా రూ.87.92 కోట్ల బిల్లులు ప్రభుత్వానికి, విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నారు. తొలుత కేవీ, నాన్ అగ్రికల్చర్, ప్రభుత్వ సర్వీసులు, ఇండస్ట్రియల్, కమర్షియల్ కనెక్షన్లకు విద్యుత్శాఖ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. జిల్లాలో ఇప్పటికే 62,197కు పైగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసినట్లు విద్యుత్శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. అనంతరం గృహ సముదాయాలకు ఏర్పాటు చేయడానికి యత్నాలు చేస్తున్నారు. 500 యూనిట్ల పైబడి విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు బిగించడానికి రంగం సిద్ధమవుతోంది. దీన్ని వినియోగదారులు, వామపక్షాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా వీటిని పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు స్మార్ట్ మీటర్ బిగించుకోకపోతే ప్రస్తుతం ఉన్న మీటర్కు కమర్షియల్ బిల్లు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. అనుమతులు లేకుండా వీటిని ఏర్పాటు చేసే అధికారం విద్యుత్శాఖకు లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నా ఆ శాఖ అధికారులు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్న చంద్రబాబు, లోకేష్.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ ప్రస్తుతం వీటిని ప్రోత్సహించడంపై వినియోగదారులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ బోరుబావుల వద్ద స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే వాటిని ధ్వంసం చేయండని రెచ్చగొట్టిన చంద్రబాబు, లోకేష్లు ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేస్తుండటంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు కూటమి దూకుడు జిల్లాలో 62,197కుపైగా విద్యుత్ మీటర్ల ఏర్పాటు మీటర్లు వద్దంటే బెదిరింపులు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాత భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్ ముందే రీచార్జ్ చేసుకోవాలి ప్రస్తుతం నెలంతా విద్యుత్ వినియోగించుకుని బిల్లు వచ్చిన అనంతరం చెల్లిస్తున్నాం. భవిష్యత్తులో అలాంటి ప్రక్రియకు చెక్ పడుతుంది. సెల్ఫోన్, డిష్టీవీ తరహా ముందస్తుగా స్మార్ట్ మీటర్కు రీచార్జ్ చేసుకోవాలి. ఆ అమౌంట్ పూర్తవగానే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. పీక్ సమయం పేరుతో అధిక చార్జీలు వసూలు చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడు తుంది. వేసవిలో అధిక చార్జీలు వసూలు చేసే అవకాశముంది. జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు డివిజన్ కేటగిరి–1 కేటగిరి–2 కేటగిరి–3 కేటగిరి–4 క్యాటగిరి–5 గుడివాడ 2,20,542 24,571 713 5439 19,535 ఉయ్యూరు 1,22,769 12,106 318 3323 18,206 మచిలీపట్నం 1,97,718 21,666 950 5625 11,785 విద్యుత్ రంగాన్ని కేంద్రం కంట్రోల్లోకి తీసుకోవడం సరికాదు విద్యుత్ రంగం ఎప్పటి నుంచో రాష్ట్రాల కంట్రోల్లో ఉండేది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తమ కంట్రోల్లోకి తీసుకోవడం సరికాదు. దీంతో పేద ఎస్సీ వర్గాలు, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేతులో కీలుబొమ్ముగా మారింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేసిన తర్వాత దుకాణాలు, చిన్న చిన్న ఇండస్ట్రియల్ వ్యాపారులకు వస్తున్న బిల్లులు చూసి గుండెలు బాదుకుంటున్నారు. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలి. లేనిపక్షంలో ప్రజలతో కలసి పోరాటాలు ఉధృతం చేస్తాం. –ఆర్సీపీ రెడ్డి, సీపీఎం నేత, గుడివాడ -
నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బెంగుళూరుకు చెందిన భక్తులు బుధవారం రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. బెంగుళూరుకు చెందిన పిళ్లా రవి దంపతులు కుటుంబం సమేతంగా అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ. 2 లక్షల విరాళాన్ని ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఏఈవో ఎన్.రమేష్బాబు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. సాగరంలో ‘అల’జడి కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హంసలదీవి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం ఉదయం నుంచి పాలకాయతిప్ప బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు ముందుకు చొచ్చుకురావడంతో పాటు తీరంలో ఈదురుగాలుల తీవ్రత అధికమైంది. సముద్ర స్థితిగతుల్లో మార్పు కనిపిస్తోందని పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు తెలిపారు. బీచ్ వద్ద నుంచి సాగరసంగమం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు భారీగా కోతకు గురై భయానకంగా మారింది. భారీ వర్షాలు కూడా ఉండటంతో తీరంలో అలజడి నెలకొంది. గ్రంథాలయాలకు కంప్యూటర్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రంథాలయాల ద్వారా పౌరులకు డిజిటల్ సేవలు అందించేందుకు శివశ్రీ చారిటబుల్ ట్రస్ట్, శిక్షణ ఫౌండేషన్, బెంగుళూరు గ్రంథాలయాలకు కంప్యూటర్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు అందజేశారు. కృష్ణా జిల్లాలోని 70 శాఖా గ్రంథాలయాలను ఎంపిక చేశారు. బుధవారం ఎంజీ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్, ప్రాజెక్టు మేనేజర్ వి. స్వాతిదేవ్ ఆయా గ్రంథాలయాలకు అందజేశారు. డైరెక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 70 శాఖా గ్రంథాలయాలను ఎంపిక చేసి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు అందజేశారన్నారు. యువతకు, నిరుద్యోగులు, విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ వ్యవస్థ ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ స్వాతిదేవ్ మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రంథాలయాలకు 2 కంప్యూటర్లు, ఒక స్మార్ట్ టీవీ, ఒక స్మార్ట్ ఫోన్, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఫౌండేషన్ టీం ప్రతినిధులు డి. సత్యనారాయణ, రాజారావు, ఎ.బుచ్చిబాబు, ఎ. కార్తీక్, కార్యదర్శి వి. రవికుమార్ ఠాగూర్ గ్రంథాలయాధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కానూరులో జాతీయ వాలీబాల్ పోటీలు పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సీటీలో ఆలిండియా ఇన్విటేషన్ వాలీబాల్ పోటీల వేదికగా మార్చారు. మూడు రోజులుగా విజయవాడ పీబీ సిద్ధార్థలో జరుగుతున్న పోటీలను వర్షం కారణంగా కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సీటీలో పోటీలను బుధవారం ఉపకులపతి పి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. లీగ్ విభాగంలో మహిళల పోటీలో తమిళనాడు స్పోర్ట్స్ అకాడమీ జట్టు కేరళ అజంష్షన్ కాలేజీపై గెలిచింది.ఏపీ ఎంసీఎఫ్ జట్టు చైన్నె ఎస్ఆర్ఎం యూనివర్సిటీపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో చైన్నె ఎస్ఆర్ఎం జట్టు గుజరాత్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై, తివేండ్రం స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా జట్టు కేరళ హోలీ గ్రేస్ జట్టుపై గెలిచింది. నాకౌట్ పోటీలు పూర్తయ్యాయని, లీగ్ పోటీలతో టోర్నమెంట్ ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. -
మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు
కోనేరుసెంటర్: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులతో పాటు ప్రజలూ పాటుపడాలని ఎస్పీ గంగాధరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని, యువతను మత్తు పదార్థాల జోలికి పోకుండా పాటు పడతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సమూలంగా నాశనం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. యువత జీవితాలను చిత్తు చేస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను నాశనం చేయడానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఎస్పీ గంగాధరరావు -
పాఠశాల విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): పాఠశాల విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో పాఠశాల విద్య, నిర్మాణ అంశాలపై ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడతూ కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ దార్శనికత –2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంగా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్య మెరుగుదలకు విద్యాధికులు కృషి చేయాలన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో పాఠశాల స్థాయిలో వారికి సబ్జెక్టుపై పట్టు సాధించానికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలు అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం చాలా ముఖ్యమని పేర్కొంటూ ఆ దశలో వారికి వేయాల్సిన అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు అందించాలని చెప్పారు. రక్తహీనత నివారణకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని నైతిక విలువలు నేర్పిస్తూ మాదకద్రవ్యాల జోలికి పోకుండా చైతన్యవంతులను చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో పీవీజే రామారావు, సమగ్ర శిక్ష ఏపీసీ కుమిదినీసింగ్, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ శర్మిష్ట, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిదూర్జటి తదితరులు పాల్గొన్నారు. -
ఆటో కార్మికుల ఉపాధికి ముప్పు
మచిలీపట్నంఅర్బన్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడనుందని కృష్ణా జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మర్రాపు పోలినాయుడు తెలిపారు. జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నాచౌక్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. జిల్లాలో ఆటో వృత్తిపై 50వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. మహిళలకు ఉచిత బస్సుతో ఆటోల బాడుగలు తగ్గి, ఆదాయం ఉండదనే ఆందోళనలో ఆటో కార్మికులు ఉన్నారే కానీ, మహిళల ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకం కాదన్నారు. ఇంధనంపై వ్యాట్ తగ్గింపు, జీవో నంబర్ 21 రద్దు, రుణ సబ్సిడీ మంజూరు చేయాలన్నారు. వాహన మిత్ర పథకం కింద డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి రూ.25 వేల సాయం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గింపు, వాహన కొనుగోలుకు రూ.4 లక్షల సబ్సిడీతో వడ్డీ రహి త రుణాలను మంజూరు చేయాలన్నారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మకు వినతిపత్రం సమర్పించారు. యూనియన్ నేతలు కె. దావీదు, ఎ. వెంక టేశ్వరరావు, కె. పోతురాజు, కరీముల్లా పాల్గొన్నారు. -
చోరీకి గురైన 600 సెల్ఫోన్లు రికవరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంతో పాటు, పలు ప్రాంతాల్లో చోరీకి గురైన 600 సెల్ఫోన్లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు రికవరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో మంగళవారం రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు సీపీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ దొంగిలించిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్తో రికవరీ చేసినట్లు తెలిపారు. వేర్వేరు ప్రాంతాలకు చెందినవి.. రికవరీ చేసిన మొబైల్స్లో ఏపీకి చెందిన 504, ఒడిశావి 20్ల, కర్ణాటక 18, మహారాష్ట్రకు చెందిన 16, రాజస్తాన్ 13, ఉత్తరప్రదేశ్కు చెందిన 12 ఫోన్లు, బిహార్ 10, వెస్ట్ బెంగాల్ 7 మొబైల్స్ రికవరీ చేశామని తెలిపారు. అలాగే ‘సురక్ష’ ద్వారా ఆరువేల సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. -
పిల్లల ఆరోగ్య రక్షణలో మరో ముందడుగు
ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ మచిలీపట్నం అర్బన్: పిల్లల ఆరోగ్య రక్షణలో మరో అడుగు ముందుకు వేశామని ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం నివారించటం, పాఠశాల డ్రాప్ అవుట్లను తగ్గించడమే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (ఎన్డీడీ) ప్రధాన లక్ష్యమన్నారు. చిలకలపూడి పాండురంగ మునిసిపల్ హైస్కూల్లో మంగళవారం రెండో రౌండ్ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. స్వయంగా విద్యార్థుల చేత మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 99 శాతం మందుల పంపిణీ చేశామన్నారు. ఆగస్టు 20న మాప్అప్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఏటా మార్చి, ఆగస్టు నెలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోగనిరోధక శక్తి మెరుగు.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శర్మిష్ఠ మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలతో పిన్ వారమ్స్, రౌండ్ వారమ్స్, టేప్ వారమ్స్ వంటి పేగు పరాన్నజీవులను నిర్మూలించవచ్చన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్ మాట్లాడుతూ నులిపురుగుల నిర్మూలనతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పోషకాహార శోషణ మెరుగుపడుతుందన్నారు. ఆల్బెండజోల్ అంగన్వాడీ కేంద్రాలు, అన్ని పాఠశాలలు, జూనియర్, సాంకేతిక కళాశాలల్లో 1–19 ఏళ్ల పిల్లలందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానిటరింగ్ అధికారి డాక్టర్ మాలిని, ఆర్బీఎస్కే పీఓ డాక్టర్ కె. హిమబిందు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మనాన్న
కనకున్నా ‘కారా’ మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఓ మధురానుభూతి. వివాహమైనప్పటి నుంచి ‘అమ్మ’ అనే పిలుపు కోసమే తహతహలాడుతుంటారు. నవమాసాలు మోసి.. బిడ్డను కని.. పొత్తిళ్లలో ఎత్తుకున్న క్షణాన.. ఆ అమ్మ ఆనందం వర్ణనాతీతం. అయితే ఇటీవల కాలంలో మారుతున్న అలవాట్లు, జీవనశైలి, వయసు మీరిన తర్వాత వివాహం వంటి కొన్ని కారణాలతో అమ్మతనం అనేది చాలా మందికి అందని ద్రాక్షగా మారుతోంది. సమస్య భార్యలో ఉన్నా.. భర్తలో ఉన్నా.. నింద మాత్రం మహిళలే మోయాల్సిన పరిస్థితి సమాజంలో కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇది కుటుంబాల్లో చిచ్చురేపు తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది దంపతులు పిల్లల దత్తతపై ఆసక్తి చూపుతున్నారు. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా..’ అని ఓ సినీ కవి రాసిన మాటలను గుర్తుచేసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ముళ్లపొదల్లోని నవజాత శిశువులకు మరో జన్మనిచ్చి మురిసిపోతున్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): పిల్లలు కావాలని ప్రతి ఒక్క పైళ్లెన జంట కోరుకుంటారు. అయితే ఇటీవల కాలంలో అది అందరికీ సాధ్యం కావడం లేదు. కాస్త ఆర్థికంగా స్థితిమంతులు కృత్రిమ గర్భధారణకు వెళ్తున్నారు. అది కూడా కొందరికే ఫలాన్నిస్తోంది. అలాంటి వారికి వరంలా మారింది పిల్లల దత్తత స్వీకరణ. కృష్ణా జిల్లాలో అనాథ పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గత రెండున్నరేళ్ల కాలంలో 115 మందికి పైగా మంది దంపతులు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. దత్తతలో చట్టబద్ధత తప్పనిసరి.. దత్తత కార్యక్రమంలో భాగంగా ఎవరో ఒకర్ని దత్తత తీసుకుని తల్లిదండ్రుల సమ్మతితో తెచ్చుకున్నంత మాత్రాన అది చట్టప్రకారం దత్తత కాదు. దత్తత కావాలనుకునే దంపతులు తప్పనిసరిగా చట్టబద్ధంగా స్వీకరించాల్సి ఉంటుంది. అందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ ఎడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా)ను నిర్వహిస్తున్నాయి. దీనిలో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ‘కారా’లో రిజిస్ట్రేషన్ ఇలా దంపతులు సెంట్రల్ ఎడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) వారి www.cara.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం తల్లిదండ్రుల పాన్కార్డు, ఆధార్కార్డుతో పాటు నివాస, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలు, రూ. 6వేలు డీడీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 48 గంటల్లోగా దంపతుల మొబైల్కు సమాచారం వస్తుంది. అనంతరం సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ నిర్వహణలో ఉండే శిశు గృహానికి వెళ్లి అక్కడున్న పిల్లలను చూసుకొని, రిజర్వు చేసుకునే అవకాశం ఉంది. శిశువు నచ్చిన తరువాత రూ. 40వేలు ఏజెన్సీకి చెల్లిస్తే, అన్ని ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అనంతరం దత్తతకు వచ్చిన డాక్యుమెంట్లు అన్నీ స్థానిక ఫ్యామిలీ కోర్టులో సమర్పించి, దత్తత అధికారిక ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. సీ్త్ర, శిశు సంక్షేమశాఖ శిశుగృహతో పాటు ఇతర చైల్డ్ కేర్ సొసైటీల్లో ఉన్న వారిని దత్తత తీసుకోవచ్చు. 46మంది దత్తత కృష్ణా జిల్లాలో 2022 నుంచి ఇప్పటి వరకూ 115 మంది దంపతులు పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకోగా.. 46మందిని దత్తతు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది చిన్నారులను దత్తత ఇచ్చారు. సీ్త్ర, శిశు సంక్షేమశాఖ నిర్వహణలో మచిలీపట్నం నగరంలో ఉన్న శిశుగృహలో 18 మందికి గానూ 16 మందిని దత్తత తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మగ శిశువులు, 11 మంది ఆడశిశువులు ఉన్నారు. వీరిలో ఒకరు న్యూజిల్యాండ్, ఒకరు అమెరికాకు చెందిన వారు దత్తత తీసుకోగా.. మిగిలిన వారిని కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల వారు వీరిని దత్తత తీసుకున్నారు. గన్నవరం మండలం రుద్రవరం గ్రామంలో కేర్ అండ్ షేర్ బాలల ఆశ్రమంలో ఐదుగురు శిశువులు ఉండగా వీరిలో అన్నా, చెల్లెళ్లు ఇరువురిని ‘కారా’ ద్వారా కెనడాకు చెందిన వారు రిజర్వు చేసుకున్నారు. ప్రస్తుతం బందరులోని శిశుగృహలో ఇద్దరు, కేర్ అండ్ షేర్లో ముగ్గురు శిశువులు ఉన్నారు. ఈ ఏడాది దత్తత ఇవ్వటంలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. దత్తత కోసం ఇంకా 50 దరఖాస్తులు కారా వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేసి ఉండగా.. ఏటా సుమారు 25 మంది పిల్లలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులు తెలిపిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. సమయం ప్రకారం టీకాలు వేయించాలి.. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సమయం ప్రకారం శిశువులకు వేయించాల్సిన టీకాలన్నీ తప్పనిసరిగా వేయించాలి. తరచూ పరీక్షలు నిర్వహించుకుంటే ఎదిగే పిల్లలకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుంది. పిల్లల పట్ల ఔదార్యం ప్రదర్శిస్తే మానసికంగా పిల్లలు ఎదుగుతారు. అలాగే బలానికి సంబంధించిన మందులు వాడుతూ ఉండాలి. సంతానం లేకపోవటం బాధ అనిపించినా.. దత్తత చేసుకోవటం ఓ వరంగా భావించాలి. – ఎం. హారిక, పిల్లల వైద్య నిపుణురాలు, బందరు -
ఉత్సాహంగా తిరంగా ర్యాలీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా విజయవాడ రైల్వే డివిజన్లో తిరంగా బైక్, సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఆర్ఎం మోహిత్ సొనాకియా ర్యాలీని ప్రారంభించారు. ముందుగా దేశ సమగ్రత, అభివృద్ధికి కృషి చేస్తామని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు దేశ ఐక్యత, దేశభక్తి, స్వేచ్ఛ, సమానత్వానికి శక్తివంతమైన స్ఫూర్తినిస్తుందన్నారు. అనంతరం క్లాక్ టవర్ నుంచి త్రివర్ణ పతాకాలతో స్టేషన్ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా సత్యనారాయణపురంలోని ఈటీటీసీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏడీఆర్ఎం కొండా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కృష్ణా యూనివర్సిటీలో.. కోనేరుసెంటర్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం అనే నినాదంతో మంగళవారం కృష్ణా విశ్వవిద్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో 100 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య కె. రాంజీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు వీసీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వర రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, బోధనా సిబ్బంది పాల్గొన్నారు. -
సింగిల్ బ్లండర్!
కంకిపాడు: సింగిల్ నంబర్ లాటరీ మోజులో జీవితాలు చిత్తవుతున్నాయి. అత్యాశతో కుటుంబాలు గుల్లవుతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో సింగిల్ నంబర్ లాటరీ టికెట్ల విక్రయాలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. పచ్చ నేతల అండదండలతో అమ్మకందారులు ప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా సింగిల్ నంబర్ లాటరీకి అడ్డాగా మారినా.. పోలీసు యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోంది. చిన్నా పెద్దా తేడా లేదు.. ఎవరో ఒకరికి చిన్న లాటరీ తగిలిందన్న ప్రచారంతో ఎక్కువ మంది సొమ్ములకు ఆశ పడి సింగిల్ నంబర్ లాటరీ టికెట్లకు బానిసలవుతున్నారు. 15 ఏళ్ల బాలుడి నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ల వరకూ ఈ టికెట్లను కొనుగోలు చేస్తున్న వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇళ్లల్లో ఉన్న సొమ్మును తీసుకొచ్చి లాటరీ టికెట్లను కొనేవాళ్లు కొందరైతే, పగలంతా కష్టం చేసి ఆ కష్టాన్ని మరుసటి రోజు ఉదయాన్నే లాటరీ విక్రేతల వద్దకు వెళ్లి లాటరీ టికెట్లు కొనేవాళ్లు మరికొందరు. ప్రతి ఏరియాలోనూ వందల సంఖ్యలో వీటికి బానిసలయ్యారు. వీరి ఆశను సొమ్ము చేసుకుంటూ లాటరీ విక్రేతలు ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం సాగిస్తున్నారు. అంతా బాహాటంగానే.. లాటరీ విక్రయాలు అంతా బాహాటంగానే సాగుతున్నాయి. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండు ప్రాంగణాలే వీరికి సింగిల్ నంబర్ విక్రయ కేంద్రాలుగా మారాయి. చైన్నె, విజయవాడ కేంద్రాల నుంచి వ్యాపారులు ఇక్కడి విక్రేతలకు లాటరీ టికెట్ల వివరాలను చెబుతారు. ఇందులో నల్లనేరం రూ. 150, స్వర్ణలక్ష్మి రూ. 800, విష్ణు రూ. 400, కుమరన్ రూ. 300, తంగం రూ. 80, సిక్కిం సూపర్ రూ. 80, లయన్ రూ. 1200 ఇలా అనేక రకాల కంపెనీలకు చెందిన లాటరీ టికెట్లు అమ్ముడవుతున్నాయి. వాటికి సంబంధించిన టికెట్లకు బదులుగా ఐదంకెల టికెట్ నంబరును పేపరుపైన, లేదా సిగిరెట్ డొక్కులపైనా రాసి కొనుగోలుదారులకు అప్పగిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఓ వెబ్సైట్ ద్వారా లాటరీ ఫలితాలు చూసుకోవాలని సూచిస్తారు. లాటరీ వచ్చేది అరుదు. అయినా ఆశతో ప్రతి రోజూ లాటరీ టికెట్ల కొనుగోళ్లు మాత్రం చేస్తున్నారు. విక్రేతలకు భారీగా కమీషన్లు.. టికెట్ల విక్రయాల్లోనూ విక్రేతలకు భారీ మొత్తంలో కమీషన్లు అందుతాయని సమాచారం. ప్రధాన కేంద్రాల నుంచి లాటరీ టికెట్ల నంబర్లను స్థానిక విక్రేతలకు పంపుతారు. ఆ మొత్తాన్ని విక్రేతల ద్వారా అదే రోజు ఆన్లైన్లో పంపకాలు జరుగుతాయి. సుమారు 40 శాతం మార్జిన్ ఉంటుంది. అంతేకాకుండా లాటరీ తగిలితే కమీషన్ పేరుతో ప్రధాన విక్రేతలకు, స్థానిక విక్రేతలకు 60–65 శాతం పోనూ 35–40 శాతం మాత్రమే కొనుగోలుదారుడికి చేతికొస్తుంది. ఫేక్ టికెట్లతో కాసుల పంట.. చోద్యం చూస్తున్న పోలీసులు.. సుమారు 15 ఏళ్ల క్రితం జిల్లాను ఈ సింగిల్ నంబర్ లాటరీ టికెట్ల విక్రయాలు కుదిపేశాయి. అప్పట్లో పలువురు దీనికి బానిసలై అప్పులు చేయటంతో వాటిని తీర్చే పరిస్థితి లేక ఇళ్లు, స్థలాలు తాకట్టు పెట్టడం, ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డ ఘటనలు జరిగాయి. ప్రస్తుతం మరోమారు ఈ వ్యాపారం జోరందుకుంది. అడ్డూ అదుపు లేకుండా వ్యాపారం సాగిపోతోంది. బహిరంగంగా టికెట్ల నంబర్లు చేతులు మారుతున్నా పోలీసులు మాత్రం కిమ్మనటం లేదు. వ్యాపారులను నియంత్రించే చర్యలు తీసుకోవటం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యాపారుల నుంచి పోలీసు శాఖకు భారీ మొత్తం నెలవారీ మామూళ్లు ముడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అందువల్లే ఆ వ్యాపారం జోలికి వెళ్లటం లేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అత్యాశతో చిత్తవుతున్న జీవితాలు జిల్లాలో జోరుగా సాగుతున్న సింగిల్ నంబర్ లాటరీ విక్రయాలు ఆశల వలలో చిక్కుకుని బానిసవుతున్న వైనం లూఠీ అవుతున్న పేదల కష్టార్జితం చోద్యం చూస్తున్న పోలీసు యంత్రాంగం మత్తు పదార్థాలకు బానిసలైనట్లు లాటరీ టికెట్లకు సైతం ఎంతో మంది బానిసలు అవుతున్నారు. ఇంట్లో బంగారం, డబ్బులు సైతం తెచ్చి టికెట్లను కొనుగోలు చేస్తున్నారంటే ఎంతగా ఈ వ్యాపారం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందో అర్థమవుతోంది. ప్రజల ఆశను వ్యాపారులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధాన కేంద్రాల నుంచి ఒక్కో వ్యాపారి రోజుకు రూ.లక్ష విలువైన టికెట్లను కొనుగోలు చేస్తే అమ్మకం మాత్రం రూ. 2 లక్షలకు పైగా అమ్ముతున్నారని వినికిడి. తద్వారా ఫేక్ నంబర్లను కాగితాలపై వేసి ఆ టికెట్ల విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును తమ జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
గిరిజనుల ఆలోచన విధానం మారాలి
నాగాయలంక: ఆదివాసీల అభ్యున్నతికి దేశవ్యాప్తంగా నాబార్డు అందిస్తున్న భూమి ఆధారిత ఉపాధి అవకాశాల కంటే భిన్నంగా నాగాయలంక ‘యానాది గిరిజన సంఘం జీవావరణ వ్యవస్థ ఆధారిత జీవనోపాధి మెరుగుదల’ ప్రాజెక్ట్ చేపట్టడం ఆనందదాయకంగా ఉందని నాబార్డు డీఎండీ అజయ్కుమార్ సూద్ పేర్కొన్నారు. శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్లోని ఫుడ్కోర్టు భవనంలో మంగళవారం సంఘం అధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. చేపలు పట్టడం, కేజ్ కల్చర్ లాంటి సముద్రం, నదీ జలాల ఆధారిత కార్యక్రమంగా ఈ ప్రాజెక్టు మొదటిదని ఆయన పేర్కొంటూ మారుతున్న సామాజిక పరిణామాలకు దీటుగా ఆదివాసీ యానాదులు ఆలోచనా విధానాలను మార్చుకొని జీవన ప్రమాణాల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. 25మందికి రూ. 12.75లక్షల విలువైన.. ఈ సందర్భంగా లబ్ధిదారులైన పలువురు గిరిజనులు తమ అనుభవాలను డీఎండీతో పంచుకున్నారు. తదుపరి ఎన్జీఓ ఆధ్వర్యంలో నాబార్డు–ట్రైబల్ డెవలెప్మెంట్ ఫండ్ ఆర్థిక సహకారంతో నాగాయలంక మండలంలోని మర్రిపాలెం, కమ్మనమోలు, సంగమేశ్వరం గ్రామాలకు చెందిన 25 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.12.75లక్షల విలువైన అయిదు బోట్లు, ఐస్ బాక్స్లను డీఎండీ అందజేశారు. కార్యక్రమంలో నాబార్డు ఏపీఆర్ఓ సీజీఎం ఎం.రామ్గోపాల్, జీఎంలు కేవీఎస్ ప్రసాద్, ఎంపీ పహడ్సింగ్, కేడీసీసీబీ సీఈఓ ఎ.శ్యామ్ మనోహర్, పీపీఎస్ఎస్ కోఆర్డినేటర్ నక్కా విజయబాబు తదితరులు పాల్గొన్నారు. నాబార్డు డీఎండీ అజయ్కుమార్ సూద్ -
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు, ఇతర మంత్రులు, వీవీఐపీలు పాల్గొననున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు. బందోబస్తు పకడ్బందీగా ఉండాలన్నారు. కంటిజెన్సీ బృందాల కవాతు, ట్రాఫిక్ వంటి అంశాలపై చర్చించారు. అంతేకాకుండా స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపుతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఇతర మార్గాలను నిర్ధేశించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డీఐజీ ఐఎస్డబ్ల్యూ కె. ఆరిఫ్ హఫీజ్, డీసీపీ కేజీవీ సరిత, ఎస్వీడీ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 17న బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక మచిలీపట్నంటౌన్/గన్నవరం: ఉమ్మడి కృష్ణాజిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక ఈనెల 17వ తేదీ విజయవాడ మధురానగర్లోని కేంద్రియ విద్యాలయం–1 గ్రౌండ్లో జరుగుతుందని ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బాల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ జట్ల సెలక్షన్లు అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సెలక్షన్లకు వచ్చే సబ్ జూనియర్ క్రీడాకారులు 2010 జనవరి 2, జూనియర్ క్రీడాకారులు 2006 జనవరి 2 తర్వాత జన్మించిన వారు ఉండాలని వివరించారు. సెలక్షన్స్కు వచ్చే క్రీడాకారులు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బ్లడ్ గ్రూపు తప్పనిసరిగా తీసుకురావాలని, డ్రెస్ కోడ్ పాటించాలని ఆయన సూచించారు. జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలిమధురానగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలని.. కచ్చితంగా సమయ వేళలు పాటించేలా చూడాలని ఆర్జేడీ ఎం.ఆదినారాయణ సూచించారు. మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని ఇంటర్మీడియెట్ విద్యాధికారి కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలో తప్పనిసరిగా ఉండాలన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సైమన్ విక్టర్, డీఐఈఓ ప్రభాకరరావు మాట్లాడుతూ ఇక్కడ తెలుసుకున్న విషయాలను కళాశాలలో తప్పక అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణకాంత్, జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. ● ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న తరగతులను మంగళవారం ఆర్జేడీ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేశారు. -
నరసింహుడికి రూ.36 లక్షల ఆదాయం
జగ్గయ్యపేట: వేదాద్రిలోని యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ. 26.02లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో సురేష్బాబు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. నాలుగు నెలల 15 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. ఆలయ ఇన్స్పెక్టర్ పవన్ కల్యాణ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.వేలంతో రూ. 10.32లక్షల ఆదాయం..ఆలయ ప్రాంగణంలో కొబ్బరిచిప్పలు పోగు చేసుకునేందుకు తులసీ పూలు నిర్వహించుకునేందుకు బహిరంగ వేలం నిర్వహించారు. కొబ్బరిచిప్పలు పోగు చేసుకునేందుకు గ్రామానికి చెందిన పోలోజు గోపి రూ.4లక్షలు, తులసి పూలు అమ్ముకునే హక్కుకు రూ. 6.32 లక్షలకు కై వసం చేసుకున్నారని తెలిపారు. ఏడాది పాటు పాటలు అమలులో ఉంటాయని తెలిపారు.పారదర్శకంగా అమలు చేస్తాంసాక్షి ప్రతినిధి, విజయవాడ: దుర్గగుడిలో ఉచిత భోజన పథకాన్ని పారదర్శకంగా, సమర్థంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆలయ ఈవో వీకే శీనా నాయక్ తెలిపారు. ‘అమ్మ సన్నిధిలో.. లెక్కల్లోనే భో‘జనం’’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలలో ప్రచురితమైన వార్త పై ఆయన స్పందించారు. అన్నదానం సంబంధించిన ప్రదేశాలను సోమవారం తనిఖీ చేశారు. సిబ్బందిని పిలిచి ఆరా తీశారు. దీనిపై లోతుగా అంతర్గత విచారణ చేసి బాధ్యులైన వారిపైన శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నదానం కార్యక్రమం అంతర్గత పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. ఇందులో భక్తుల అభిప్రాయాలు, సూచనలు స్వాగతిస్తున్నామని తెలిపారు.ఈఎస్ఐ ఆస్పత్రికి రెండు అంబులెన్స్లులబ్బీపేట(విజయవాడతూర్పు): తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎస్ఐ ఆస్పత్రిలో రూ.79 లక్షలు విలువ చేసే రెండు అంబులెన్స్లను అందించింది. ఈ సందర్భంగా విజయవాడలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ డెప్యూటీ జనరల్ మేనేజర్ షితాక్షి సింగ్ అంబులెన్స్ల తాళాలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. షితాక్షి సింగ్ మాట్లాడుతూ సేవా రంగంలో ఎస్బీఐ దేశంలోనే ఇతర బ్యాంకులు కన్నా ముందంజలో ఉందన్నారు. ఆ బ్యాంక్ విజయవాడ వెస్ట్ ప్రాంతీయ మేనేజర్ శ్రీనివాసరావు, కార్మికశాఖ జాయింట్ కమిషనర్ రాణి, ఈఎస్ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ వి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.ఆయుష్లో అందుబాటులోకి ‘డాక్బాక్స్’లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐసీయూ రోగులకు మెరుగైన, వేగవంతమైన చికిత్స అందించేందుకు దోహదపడే ‘డాక్బాక్స్’ టెక్నాలజీని విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ వై.రమేష్బాబు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ డాక్బాక్స్ టెక్నాలజీలో ఐసీయూ చికిత్స పొందే రోగి మానిటర్స్, వెంటిలేటర్స్ ఇన్ఫూషన్ పంప్స్, డయాలసిస్ మెషీన్స్ ఎనస్థీషియా మెషీన్స్ వంటి పరికరాల డేటాను ఆటోమేటిక్గా రికార్డు చేస్తుందన్నారు. ఆ డేటా ఎప్పటికీ రోగి ఐడీలో భద్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కేర్ ఫ్లూయెన్స్ ప్రతినిధి విలియమ్స్, ఆయుష్ నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పీఎస్ఎస్ చౌదరి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేడ జయలక్ష్మి, క్రిటికల్ కేర్ నిపుణులు పాల్గొన్నారు. -
నేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లా వ్యాప్తంగా మంగళవారం నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని సోమవారం తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు 5.26 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. నులి పురుగులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. ఏటా ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల్లో నులిపురుగులు నిర్మూలించి రక్తహీనత నివారణ, శారీరక. మానసిక ఎదుగుదలకు పోషకాహారలోం, పిల్లల్లో అలసట, బలహీనత వంటి సమస్యలను నిర్మూలించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా డాక్టర్ సుహాసిని తెలిపారు. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో డీ వార్మింగ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్క చిన్నారికి ఈ మాత్రలు వేయాలని సూచించారు. మాత్రల పంపిణీ ఇలా.. ఎన్టీఆర్ జిల్లాలో 192 కళాశాలలు, 1,446 పాఠశాలలు, 1,475 అంగన్వాడీ కేంద్రాల్లో 19 ఏళ్లలోపు గల 5,26,323 మంది చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించనున్నట్లు తెలిపారు. అందుకోసం 5.64 లక్షల మాత్రలను సిద్ధం చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 5.64 లక్షల మాత్రలు సిద్ధం -
ఏదయా.. యూరియా!
ఎరువుల కోసం బారులు తీరిన రైతన్నలు బుద్దాలపాలెం సొసైటీలో ఎరువుల పంపిణీలో కూడా కూటమి నాయకుల హవా కొనసాగింది. కూటమి నాయకులు చెప్పిన పేర్లకే టోకెన్లు ఇచ్చి ఒక్కొక్కరికీ రెండు కట్టలు చొప్పున ఎరువులు అందజేశారు. అయితే కొంత మంది రైతులకు అందకపోవటంతో సొసైటీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో త్వరలో మరో ఎరువుల లోడ్ వస్తుందని అప్పుడు అందరికీ అందజేస్తామని చెప్పటంతో ఆందోళన విరమించారు. అయితే అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఎరువులు పంపిణీ చేశారని తమ పరిస్థితి ఏమిటని మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): ఎన్నికల సమయంలో రైతుల సంక్షేమానికి తాము పాటుపడతామని రైతులకు ఎటువంటి కష్టం రానివ్వకుండా తాము అధికారంలోకి వస్తే రైతులకు అన్ని అందిస్తామని మాయమాటలు చెప్పి.. నేడు రైతులను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎరువులు సక్రమంగా అందించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్ల వద్ద బారులు తీరి ఎరువుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. బుద్దాలపాలెంలో దిక్కుతోచని స్థితి.. బుద్దాలపాలెం సొసైటీ పరిధిలో ఉన్న బుద్దాలపాలెం, బొర్రపోతుపాలెం, పిల్లవానిగొల్లపాలెంతో పాటు కొంతమేర కొత్తపూడి, కాకర్లమూడి గ్రామాలకు చెందిన భూములకు చెందిన రైతులు పంట రుణాలు తీసుకున్నారు. సుమారు 2 వేల ఎకరాలు ఆయకట్టులో వరిసాగు చేస్తున్నారు. వీరికి ఎకరానికి నాలుగు బస్తాల ఎరువులు కావాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం ఇంత వరకు వారికి ఒక్క బస్తా కూడా ఇవ్వకపోవటంతో పంట ఎదుగుదల లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బుద్దాలపాలెం సొసైటీకి సోమవారం అరకొరగా ఎరువులు రావటంతో రైతులు తమకు అందుతాయో, లేదోనని ఆందోళన చేపట్టారు. వచ్చిన ఎరువులు అందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. దీంతో సొసైటీ ప్రతినిధులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను నిలువరించేప్రయత్నం చేశారు. రైతులు అంతటితో ఆగకుండా ఎరువులు అందరికీ సమానంగా పంచాలని పూర్తిస్థాయి ఎరువులు అందించకపోతే తమ పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సొసైటీ సిబ్బంది, పోలీసుల జోక్యంతో రైతులకు రెండు కట్టలు చొప్పున అందజేస్తామని చెప్పి టోకెన్లు అందజేసి వాటి ఆధారంగా ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పారు. ● గూడూరు మండల పరిధిలోని కంకటావ, ఆకులమన్నాడు గ్రామల్లో అదే పరిస్థితి కనిపించింది. కొందరు బడా రైతులు పలుకుబడి చూపించుకుని యూరియా దక్కించుకుంటుంటే చిన్నకారు రైతుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆయా సంఘాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ● కృత్తివెన్ను పీఏసీఎస్కు 20 టన్నుల యూరియా లోడ్ వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సఖ్యలో సొసైటీ వద్దకు చేరుకున్నారు. ముందు నమోదు చేసుకున్న వారికి ఇవ్వగా.. మిగిలిన వారికి అరకట్ట ఇచ్చి సరిపెట్టారు. ● బంటుమిల్లి పీఏసీఎస్ వద్ద యూరియా అమ్మకాలు మొదలు పెట్టగానే రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వచ్చి రైతులకు సర్దిచెప్పి లైనులో ఉంచి స్లిప్పులు రాయించారు. తర్వాత ఎకరానికి అర కట్ట చొప్పున అత్యధికంగా రెండు కట్టలు పంపిణీ చేశారు. ● మోపిదేవి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)కు సోమవారం యూరియా వచ్చిందని తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. గంటల వ్యవధిలోనే అమ్ముడు పోయాయి. ● ఘంటసాల మండలంలో ఒక్కో రైతుకు ఎకరాకు 25 కేజీలు మించి ఇవ్వరాదని, రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నా ఒక్కో రైతుకు గరిష్టంగా నాలుగు కట్టలు మాత్రమే ఇవ్వాలని అధికారులు నిబంధనలు పెట్టారంటే యూరియా కొరత ఏ విధంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ● గుడ్లవల్లేరు మండలంలోని రైతులకు యూరియా పంపిణీ అరకొరగా జరిగింది. బడా బాబులకు యూరియాను దొడ్డిదారిన కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● ఉంగుటూరు పీఏసీఎస్ వద్ద సోమవారం యూరియా కోసం రైతులు వందల సంఖ్యలో బారులు తీరారు. కూటమి నాయకులు చెప్పిన వారికే.. కూటమి నాయకులు చెప్పిన వారికే టోకెన్ల వారీగా పంపిణీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు జిల్లా వ్యాప్తంగా ఆందోళన బాట నష్టపోతున్నాం.. ఆదుకోవాలని వేడుకోలు రుణం ఉన్న వారికి మాత్రమే.. పెడన: మండలంలోని పలు పీఏసీఎస్లకు యూరియా లోడు రావడంతో సోమవారం వేకువ జాము నుంచే రైతులు ఆయా పీఏసీఎస్లు వద్ద బారులు తీరారు. రైతుల రద్దీని చూసి ఆయా పీఏసీఎస్లు వద్ద ఒక్కో కానిస్టేబుల్ను ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని అనుకున్నారు. పెనుమల్లి పీఏసీఎస్ వద్ద పరిస్థితి అదుపుతప్పడంతో కానిస్టేబుల్ను సైతం తోపులాటలో పక్కకు లాగేశారు. దీంతో అక్కడ ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది క్యూలైన్లో రైతులు నిలబడేలా చర్యలు తీసుకున్నారు. పీఏసీఎస్ సిబ్బంది బ్యాంకులో రుణం ఉన్న వారికి మాత్రమే యూరియా కట్టలు ఇస్తామని పేర్కొనడమే కాకుండా దండాలు పెట్టి మరీ చెబుతుండటంతో మిగిలిన రైతులు తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. దీంతో ముందుగా వారికి ఇచ్చిన తరువాత మిగిలినవి ఇస్తామని చెప్పడంతో చేసేది లేక రైతులు అలాగే క్యూ లైన్లో వేచి తమ వంతు వచ్చేదాక ఉండి తీసుకువెళ్లారు. అరకట్ట చొప్పున మాత్రమే ఇవ్వడంతో ఇద్దరి రైతులకు ఒక కట్ట చొప్పున అందజేశారు. -
అర్జీదారునికి భరోసా ఇవ్వండి
చిలకలపూడి(మచిలీపట్నం): ‘మీ కోసం’లో వచ్చే అర్జీలు పరిష్కరించి అర్జీదారుడికి భరోసా కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జిల్లా విజిలెన్స్ అధికారి పోతురాజు, ఆర్డీవో కె. స్వాతి అర్జీలు స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో జారీ చేసిన సర్క్యులర్లు, నోటిఫికేషన్లు, మెమోలు, ఉత్తర్వులు రియల్ టైమ్ గవర్నెన్స్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 15వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. వేడుకల్లో మంత్రి సందేశం కోసం ఆయా శాఖల ప్రగతి నివేదికలను సంబంధిత అధికారులు సమాచారశాఖకు అందజేయాలన్నారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వశాఖల అధికారులు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు శాఖల వారీగా, క్యాడర్ల వారీగా పోస్టుల వివరాలను తమకు పంపాలన్నారు. తాము నియామకపత్రాలు అందజేసినప్పుడు ఆయా శాఖల అధికారులు వారిని జాయిన్ చేసుకోకుండా జాప్యం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి విషయాల్లో కలెక్టర్ సీరియస్గా ఉన్నారని అలాంటి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. మీకోసంలో అధికారులు 103 అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● తనకు వస్తున్న దివ్యాంగుల పెన్షన్ను గత రెండు నెలలుగా నిలిపివేశారని.. తాను పెన్షన్ ఆధారంగా జీవిస్తున్నానని, అర్ధాంతరంగా నిలిపివేసిన పింఛన్ ను తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన జాగాబత్తుల దాక్షాయణి అర్జీ ఇచ్చారు. ● తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో సర్వే నెంబర్ 163/3, 164/3 తదితర నంబర్లలో సుమారు 7.44 ఎకరాల భూమి ఉండగా.. రీ–సర్వే నిర్వహించినప్పుడు 6.98 ఎకరాలుగానే చూపుతున్నారు. ఈ సర్వేలో దాదాపు 50 సెంట్ల భూమి తేడా వచ్చి ఉన్నందున మరలా సర్వే నిర్వహించి తనకు న్యాయం చేయాలని విజయవాడ రూరల్ మండలానికి చెందిన నార్ల సుగుణ అర్జీ ఇచ్చారు. ● మచిలీపట్నం నగరంలోని పరాసుపేట పుచ్చల్లపల్లి సుందరయ్య రోడ్డు, సెయింట్ ప్రాన్సిస్ పాఠశాల ఎదురు సందులోని ఓ ఇంట్లో సెల్టవర్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారని ఈ టవరు ఏర్పాటు చేస్తే సమీప నివాస గృహాల వారికి పర్యావరణ సమస్యలతో పాటు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని సెల్ టవర్ ఏర్పాటు నిర్ణయాన్ని అనుమతించకుండా తమకు న్యాయం చేయాలని కోరుతూ కేవీ గోపాలరావు తదితరులు అర్జీ ఇచ్చారు. డీఆర్వో చంద్రశేఖరరావు ‘మీ కోసం’లో 103 అర్జీలు స్వీకరణ -
ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, స్వదేశీ ఉత్పత్తుల తయారీతో పాటు కొనుగోళ్లను ప్రోత్సహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ నుంచి ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన డీఆర్వో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అన్ని స్థాయిల్లో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించాయన్నారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు, పార్కులు తదితర సంస్థల వద్ద జాతీయ పతాకాలను ఎగురవేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలన్నారు. అలాగే స్వదేశీ వస్తువుల తయారీ, వాటి అమ్మకాలను ప్రోత్సహించాల్సి ఉందని, స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ అంశంలో ముఖ్యంగా చొరవ చూపాలన్నారు. కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జిల్లా విజిలెన్స్ అధికారి పోతురాజు, జిల్లా పర్యాటక అధికారి రామ్లక్ష్మణరావు, ఆర్డీవో కె. స్వాతి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు హరిహరనాథ్, శివప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం. ఫణిదూర్జటి, డీఐపీఆర్వో వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్వో చంద్రశేఖరరావు -
ఆటోవాలాకు వెన్నుపోటు!
కార్మికుల ఆర్తనాదాలు పట్టని కూటమి సర్కారుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం సీ్త్రశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 15 నుంచే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఆటో డ్రైవర్లలో ఆందో ళన మొదలైంది. సీ్త్ర శక్తి పథకం తమ భుక్తిని లాగేసుకుంటుందని భయపడుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసిన తాము.. రేపటి నుంచి ఉపాధి కోల్పోయి రోడ్డున పడడం ఖాయమని, కుటుంబాలను పోషించుకోవడం ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుంటే ప్రభుత్వం తమతో కనీసం చర్చలు జరపలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఎన్నికల హామీలో ఈ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన నాటి నుంచి ఆందోళన చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటూ వాపోతున్నారు. ఇదీ జిల్లాలో పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లాలో 25వేల ఆటోలు ఉన్నాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాని యువత సైతం ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా స్తోమత లేకపోయినప్పటికీ ఫైనాన్స్లో ఆటో తీసుకొని వచ్చే ఆదాయంతో అప్పులు తీరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంతో కార్మికుల నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తే తమకు కిరాయిలు ఉండవని, ఇప్పటికే ఈ రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఆటో నిర్వహణ పెనుభారం కానుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఆటో కార్మికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. 14 నెలలైనా అమలు కాని హామీ.. తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ. 15వేలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆర్థిక సహాయంతో పాటు సంక్షేమ బోర్డు, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని నమ్మబలికింది. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఇకనైనా అమలు చేస్తామని భరోసాను కల్పించలేదు. సంక్షేమ బోర్డు ఊసేత్తడం లేదు. తక్కువ వడ్డీతో ఆటోలు రుణాలు ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. తీరా సీ్త్ర శక్తి పథకం అమలు చేయబోతుండడంతో ఆటో కార్మికులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఉచిత బస్సు ప్రభావంతో ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేని పరిస్థితి వస్తుందని, ఫైనాన్షియర్లు ఒత్తిడి చేసే ప్రమాదం ఉందని వాపోతున్నారు. హామీలు అమలు చేయాలని పలు రూపాల్లో కార్మికులు ఆందోళన చేసిన ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదు. రూ. 15వేల ఊసెత్తని సర్కారు ఏడాదిగా ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోని వైనం ఏకపక్షంగా ఉచిత బస్సు పథకం ప్రకటనతో ఆగ్రహం దిక్కుతోచని స్థితిలో 23వేల కుటుంబాలు ఫైనాన్స్ బకాయిలు చెల్లించేదెలా అంటూ ఆందోళన గత ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. వారి సంక్షేమానికి వాహన మిత్ర పథకం ప్రవేశపెట్టింది. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికి ఏటా రూ.10వేలు వాహన మిత్ర కింద ఆర్థిక సహాయం చేసింది. కరోనా లాంటి కష్టకాలంలోనూ ఆదుకుంది. వరుసగా క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందించింది. ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. -
వైద్య రంగం ప్రైవేటీకరణపై 24న జాతీయ సదస్సు
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొస్తున్న ఆరోగ్య రంగ సంస్కరణల వలన రాష్ట్ర ఆరోగ్య రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో వైద్యరంగం ప్రైవేటీకరణ–ప్రభావాలు–పరిష్కారాలు అనే అంశంపై జాతీయ స్థాయి ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు సరైన వైద్యం అందక ప్రైవేట్ వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు జరగబోయే వైద్య రంగంలోని మార్పుల వలన పేదల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి రాబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పబ్లిక్–ప్రైవేట్–భాగస్వామ్యం(పీపీపీ) నమూనా కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోందన్నారు. ప్రజారోగ్యం ప్రైవేటీకరణ అంశంపై పలువురు ప్రొఫెసర్లు సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఎస్పీ జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్య ఎలాంటిదైనా చట్ట పరిధిలో విచారణ జరిపించి పరిష్కరిస్తామన్నారు. న్యాయం కోరుతూ వచ్చే బాధితులకు కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం జరిగిన మీ కోసంలో 33 అర్జీలు అందాయని తెలిపారు. మీ కోసంలో అర్జీలు.. ● గుడ్లవల్లేరుకు చెందిన పద్మ అనే బాధితురాలు ఎస్పీని కలిసి 9 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఇరువురు పిల్లలు కలిగిన తర్వాత భర్త మరొక మహిళ వ్యామోహంలో పడి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, తన మాట వినని పక్షంలో తనతో పాటు పిల్లలను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని అతని నుంచి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరింది. ● పెడనకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి తాను చేపల చెరువు సాగు చేసుకుంటున్నట్లు తెలిపాడు. కాకినాడకు చెందిన ఒక వ్యక్తి తన వద్ద చేపలను కొనుక్కొని వెళ్లి నేటి వరకు డబ్బులు చెల్లించకపోగా అడుగుతుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని న్యాయం చేయమని కోరాడు. ● అవనిగడ్డకు చెందిన వనజ అనే బాధితురాలు భర్త తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ వాపోయింది. అత్తమామలు తన భర్తకు మరో వివాహం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. బలవంతంగా విడాకులు ఇవ్వమని వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయమని కోరింది. ● మచిలీపట్నంకు చెందిన కుమార్ అనే వ్యక్తి తన స్నేహితునికి ఐదు లక్షలు చేబదులుగా ఇచ్చినట్లు తెలిపాడు. తీసుకున్న డబ్బు ఇవ్వమని అడుగుతుంటే నాలుగు నెలలుగా తన చుట్టూ తిప్పుకోవడంతో పాటు తనను దుర్భాషలాడుతూ మనుషులను పంపి తనపై దాడి చేయిస్తున్నాడని తెలిపాడు. అతని నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఎస్పీని కోరాడు. మీ కోసంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు -
వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి
ఆత్కూరు(గన్నవరం): కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం జరిగిన ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పెద్దఆవుటపల్లి గ్రామ శివారు లూర్థునగర్కు చెందిన దొప్పల సురేష్(39) రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటిలో సురేష్ ఉరి వేసుకుని ఉండటాన్ని అతని భార్య గమనించింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో అతడిని కిందకు దింపి చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేష్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అతని భార్య అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. గుడివాడలో వ్యక్తి మృతి గుడివాడరూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని నీలామహాల్ రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీలామహాల్రోడ్డులో నివాసముంటున్న పోలుకొండ భద్రయ్య(48) ఆదివారం జరిగిన గంగానమ్మ సంబరంలో పాల్గొని మద్యం సేవించాడన్నారు. రోజు మాదిరిగానే రాత్రి ఇంట్లో పడుకున్న భద్రయ్య తెల్లారి సోమవారం చూసే సరికి చనిపోయి ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. వన్టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్, తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి పిన్ని కుమారుడు వల్లూరు రాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా ఓ స్థలం విషయమై మృతునికి, అతని బంధువులకు గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రెండు సార్లు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మృతుడిది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. తల్లి చెంతకు చేరిన బాలుడు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంటి నుంచి తల్లితో పాటు బయలుదేరి, బస్టాండ్లో తప్పిపోయి తిరుగుతున్న బాలుడిని మహిళా పోలీసులు తిరిగి తల్లి చెంతకు చేర్చారు. ఈ ఘటన సోమవారం విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మహిళా కానిస్టేబుళ్లు ఎస్కేబీబీ శైలజ, అనూష సోమవారం పీఎన్బీఎస్లో శక్తి యాప్పై అవగాహన కలిగించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో బస్టాండ్లో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని వారు గుర్తించి అతని వద్దకు వెళ్లి వివరాలు అడగా, తల్లి పేరు మాత్రమే చెబుతూ, అడ్రస్ చెప్పలేక పోతున్నారు. దీంతో చుట్టుపక్కల విచారించినా ఎవరూ తెలియదని చెప్పడంతో, బాలుడిని మహిళా పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. అక్కడ ఇన్స్పెక్టర్ వాసవి బాలుడిని వివరాలు అడుగుతూ ఎక్కడకి వచ్చారని అడగ్గా హాస్పిటల్కు వచ్చినట్లు తెలపడంతో పాత ప్రభుత్వాస్పత్రికి వెళ్లి విచారించారు. దీంతో అక్కడ తల్లి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాలుడిని క్షేమంగా అప్పగించారు. ఈ సందర్భంగా బాలుడి తల్లి పోలీసులకు వివరాలు చెబుతూ, తనది చిట్టినగర్ అని, భర్త మృతి చెందగా, తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. పిల్లల్లో ఇద్దరికి అనారోగ్యం కారణంగా పాత ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయిస్తున్న క్రమంలో రెండో బాబు కనిపించక పోవడంతో చుట్టుపక్కల విచారించి ఏమి చేయాలో తెలియని సమయంలో మహిళా పోలీసులు, శక్తి బృందం బాలుడిని తీసుకువచ్చి అప్పగించారన్నారు. మహిళా కానిస్టేబుళ్లకు బాలుడి తల్లి అభినందనలు తెలిపింది. -
తండ్రిపై కుమారుడు దాడి
పెనమలూరు: తాడిగడప గ్రామంలో తండ్రిపై కుమారుడు విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేయగా పెనమలూరు పోలీసులు ఘటనపై విచారించి హత్యగా తేల్చి కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం నన్నం శౌరి(68) భార్యతో తాడిగడప శ్రీనివాసానగర్ కాలువ కట్టపై నివశిస్తున్నాడు. శౌరికి ముగ్గురు పిల్లలు. అందరికి వివాహం జరిగింది. శౌరి పెయింటర్గా పని చేస్తుండగా భార్య వంట పని చేస్తోంది. కాగా శౌరి కొడుకు కేశవరావు(30) కూడా పెయింటర్గా పని చేస్తాడు. కేశవరావు మద్యానికి బానిసగా మారటంతో అతని భార్య అతడిని వదిలి గుడివాడలోని పుట్టింటికి వెళ్లి పోయింది. కేశవరావు పెయింటింగ్ పనులు చేసే సమయంలో తండ్రి శౌరిని కూడా తనతో పనికి రావాలని ఒత్తిడి చేయసాగాడు. శౌరికి కూలీ సొమ్ము కేశవరావు ఇవ్వక పోవటంతో శౌరి పనికి రావటానికి నిరాకరించాడు. పోలీసుల విచారణలో బట్టబయలు.. ఈ విషయమై ఆదివారం సాయంత్రం కుమారుడు తండ్రితో గొడవపడ్డాడు. దీంతో తండ్రిపై కుమారుడు విచక్షణా రహితంగా దాడి చేసి ఎదురింటి ఇనుప గేటుకు, రోడ్డుకు శౌరి తలను బలంగా కొట్టాడు. ఈ ఘటనను చూసిన శౌరి ఇంటి పక్కనే ఉంటున్న అతని కుమార్తె శశిరేఖ ఆమె భర్త బాబుతో పాటు స్థానికులు దాడిని నివారించే యత్నం చేశారు. అప్పటికే శౌరిని తీవ్రంగా కొట్టడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో అత్యవసర చికిత్సకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చా రు. చికిత్స పొందుతూ శౌరి సోమవారం ఉదయం మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై పోలీసులను తప్పుదారి పట్టించటానికి కేశవరావు యత్నించాడు. తాను తన తండ్రి శౌరి బైక్పై వస్తుండగా సిద్ధార్థ కాలేజీ వద్ద బందరు రోడ్డుపై ప్రమాదం జరిగిందని బుకాయించాడు. సీసీ ఫుటేజీలో ఎక్కడా రోడ్డు ప్రమాదం జరిగినట్లు కనబడక పోవటంతో పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో కేశవరావును, కుటుంబ సభ్యులను విచారించగా హత్య వ్యవహారం బయటకు వచ్చింది. కేశవరావుపై హత్య కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి రోడ్డు ప్రమాదంగా చిత్రించే యత్నం -
పోతే.. పొమ్మనండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉంటే ఉండమనండీ.. పోతే పోమ్మనండీ ఎవరి కోసం వచ్చారు. ఏఆర్టీలో సిబ్బంది లేకుంటే నేనేమి చేస్తాను. వచ్చే వరకూ ఉండమనండీ అంటూ హెచ్ఐవీ బాధితుల పట్ల డీఎల్ఓ అమానుషంగా మాట్లాడారు. అసలు నీవు నాకెందుకు ఫోన్ చేశావు, నీ కేడర్ ఏమిటీ అంటూ విషయాన్ని ఆయనకు చెప్పేందుకు ఫోన్ చేసిన ప్రభుత్వాస్పత్రి నోడల్ ఆఫీసర్ను నోటికొచ్చినట్లు అనడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఈ విషయం సోమవారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. హెచ్ఐవీ రోగులకు అందించే సేవలను పర్యవేక్షించాల్సిన అధికారే అలా బాధ్యతా రహితంగా వ్యవహరించడం ఏమిటనీ పలువురు అధికారులు అంటున్నారు. ఆయన తీరు నిత్యం వివాదస్పదంగా మారుతోందని వైద్యశాఖలోని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. అసలేమి జరిగిందంటే.. తిరువూరు నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతం నుంచి హెచ్ఐవీ బాధితులు మందుల కోసం కొత్తాస్పత్రిలోని ఏఆర్టీ కేంద్రానికి వచ్చారు. అక్కడ గంట సేపు కూర్చున్నా వారికి కార్డులు ఇచ్చే కో ఆర్డినేటర్ రాలేదు. దీంతో తిరిగి వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని, అక్కడి సిబ్బందిని ఎంత బతిమిలాడినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సూపరింటెండెంట్ చాంబర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న అభయ్ నోడల్ అధికారిని కలిసి వివరించారు. దీంతో ఆయన ఏఆర్టీ కేంద్రాలను పర్యవేక్షించే డీఎల్ఓకు ఫోన్ చేసి విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా అసలు నాకు ఫోన్ చేయడానికి నీవు ఎవరూ, నీ కేడర్ ఏమిటీ, నాకెందుకు ఫోన్ చేశావంటూ చివాట్లు పెట్టారు. అయినా సిబ్బంది లేకపోతే వచ్చేదాకా కూర్చోమనండీ, లేకపోతే పొమ్మనండీ అంటూ అమానుషంగా మాట్లాడారు. దీంతో ఆ నోడల్ అధికారి చిన్నబుచ్చుకోవడమే కాకుండా, రోగి సైతం చేసేది ఏమి లేక, మళ్లీ ఏఆర్టీ దారి పట్టారు. ఓ గంట తర్వాత కానీ సిబ్బంది రాలేదు. గతంలో పనిచేసిన చోట్ల అంతే.. జిల్లాలో పనిచేస్తున్న డీఎల్ఓ గతంలో ఏలూరులో పనిచేస్తున్న సమయంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కోవిడ్లో పనిచేయని వారికి సైతం చేసినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, అనుభవం పత్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా అనంతరం భీమవరంలో పనిచేసిన సమయంలో రెండు నెలలో ఇన్చార్జి డీఎంహెచ్ఓగా చేసి అవినీతికి పాల్పడటంతో, ఆ పోస్టు నుంచి తప్పించినట్లు వైద్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేయడం, ఇతరులపై పెత్తనం చేలాయించాలని చూడటం అతని నైజమని సిబ్బంది వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో జిల్లా వైద్య శాఖ పరువు బజారున పడటం ఖాయమంటున్నారు. మా కోసం వచ్చారా.. ఉండక ఏమి చేస్తారు హెచ్ఐవీ రోగుల పట్ల డీఎల్ఓ అమానుష ప్రవర్తన ప్రభుత్వాస్పత్రి నోడల్ అధికారిపై చిందులు నిత్యం వివాదస్పందంగా మారుతున్న డీఎల్ఓ తీరు గతంలో పనిచేసిన చోట్ల అనేక అవినీతి ఆరోపణలు ఆయన ప్రవర్తన నిత్యం వివాదస్పదమే.. నెలన్నర కిందట జరిగిన బదిలీల్లో జిల్లాకు వచ్చిన డీఎల్ఓ ప్రవర్తన వివాదస్పదంగా మారుతుంది. అంతేకాకుండా, ఆయన విధులు ఆయన చేయకుండా, డీఎంహెచ్ఓ కార్యాలయంలో చేసే ఇతర వైద్యులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడంటూ పలువురు ఆరోపించారు. రెండు రోజుల కిందట సీనియర్ వైద్యుడైన డీఎంఓను కూడా ఇలాగే మాట్లాడారని, డీఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేసే వైద్యుల పట్ల అమానుషంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా పనులు సాగుతున్నాయని, ఇప్పుడు డీఎల్ఓ తీరు నిత్యం వివాదంగా మారుతున్నట్లు వాపోతున్నారు. నా దృష్టికి వచ్చింది.. డీఎల్ఓ చులకనగా మాట్లాడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇంకా డీఎల్ఓ అలాగే ప్రవర్తిస్తే కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తా. ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనపై కూడా వివరాలు తెలుసుకుంటా. – డాక్టర్ ఎం.సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ జిల్లా -
ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ సంఘ కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. సమావేశాలు 9, 10 తేదీల్లో కొండపల్లిలో జరిగాయన్నారు. ఈ ప్లీనరీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలపై తీర్మానాలు చేయడంతో పాటు నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా టి.కుమారస్వామి, సీహెచ్ వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. జిల్లాలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, విద్యార్థులు స్కిల్స్ పెంచడానికి విజయవాడ కేంద్రంగా సైన్స్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్–కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్లో విద్యార్థులను ఐక్యం చేసి పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్లీనరీ అనంతరం నూతన జిల్లా కమిటీని 21 మందితో ఎన్నుకున్నామన్నారు. నూతన కార్యవర్గం.. నూతన కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా టి.కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా ఎస్.ప్రణయ్, టి.కుమార్ నాయక్, టి.ప్రణీత, ఎస్కే ఖాజు, సహాయ కార్యదర్శులుగా బి.మాధవ్, వి.షణ్ముఖ, కె.యశస్వినీ దేవి, పెద్దబాబు, జిల్లా కమిటీ సభ్యులుగా ప్రసాద్, ఒజెస్విన్, జ్వాలిత, మోహన్కృష్ణ, కావ్య, కుషాల్ కుమార్, నరసింహ, సిద్దు, హస్మి, యశ్వంతీ ఉన్నారు. -
భారీ వర్షానికి పొంగిన వాగులు
పెనుగంచిప్రోలు: మండలంతో పాటు ఎగువన ఆదివారం రాత్రి భారీ వర్షం పడటంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం వరకు లింగగూడెం వద్ద గండివాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పక్కన ఉన్న పొలాలు మొత్తం నీట మునిగాయి. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి పొలాలపై వరద ప్రవహించటంతో పాటు పంటలు పూర్తిగా నాశనమవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముండ్లపాడు గ్రామంలోని వాగు చప్టాపై వరద నీరు ప్రవహించటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పెనుగంచిప్రోలు చెరువు నిండి అలుగులు గుండా నీరు ఉధృతంగా ప్రవహించటంతో సమీప వరి పొలాలు నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం -
అభిమాన హీరో బ్యానర్ కట్టేందుకు వచ్చి.. అనంత లోకాలకు
పమిడిముక్కల: అభిమాన హీరో బ్యానర్ కట్టేందుకు వచ్చి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెనుమత్స గ్రామానికి చెందిన జుజ్జువరపు హర్ష(26) విజయవాడ గూడవల్లిలో నివాసం ఉంటూ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన ఓ సినీ హీరో పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రామంలో బ్యానర్ కట్టేందుకు వెళ్లాడు. బ్యానర్ కట్టి బైక్పై తిరిగి విజయవాడ వెళ్తుండగా మార్గమధ్యలో మంటాడ రెడ్డిపాలెం వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొంది. దీంతో హర్ష తలకు తీవ్ర గాయమైంది. రెడ్డిపాలెం వాసులు పోలీసులకు, పెనుమత్స గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతునికి ఏడాది క్రితం వివాహమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. -
కలగా మిగిలిన రైలు మార్గం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, తిరువూరు నియోజకవర్గాలకు రైలు సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదించిన కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం గత 40 సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. అప్పటి ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు విజయవాడ పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న దివంగత చెన్నుపాటి విద్యకు ఈ రైలుమార్గం ప్రాధాన్యతను తెలియజేసి పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదింపజేశారు. వరుసగా నాలుగు బడ్జెట్లలోనూ ఈ రైలుమార్గాన్ని నిర్మించడానికి గల అవకాశాలపై సర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కూడా కేటాయించింది. 2010లో తొలిసారి ఈ రైలుమార్గానికి రూ.10 కోట్లు కేటాయించి సర్వే చేయడానికి రైల్వేశాఖ కార్యాచరణ రూపొందించింది. గత పార్లమెంటు సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ మినహా ఈ రైలుమార్గం గురించి విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇతర పార్లమెంటు సభ్యులెవరూ పార్లమెంటులో ప్రస్తావించలేదు. బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తదుపరి ఈ రైలుమార్గాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించడంతో పాటు కొండపల్లి నుంచి నున్న, వెలగలేరు, వెల్వడం, మైలవరం, తిరువూరు మీదుగా రైలుమార్గం ఏర్పాటుకు సుముఖత చూపినా ఇంత వరకు తదుపరి చర్యలు తీసుకోలేదు. రెండు రాష్ట్రాలకు అనుసంధానం.. కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం నిర్మిస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో ఈ రైలుమార్గాన్ని ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని కిరండల్ వరకు నిర్మించాలనే ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. దీనికి అనుసంధానంగా కొవ్వూరు – భద్రాచలం రైలుమార్గాన్ని గత పదేళ్లలో చేపట్టి పూర్తి చేశారు. ప్రస్తుతం కొండపల్లి నుంచి ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి వరకు రైలుమార్గం నిర్మిస్తే కొత్తగూడెం వరకు రైలు సదుపాయం కల్పించే అవకాశం ఉంటుంది. కొండపల్లి నుంచి పెనుబల్లికి 65 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండటంతో తక్కువ ఖర్చుతో రైలుమార్గం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇటీవల కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీలో కొత్త రైలుమార్గాల జాబితాలో కొండపల్లి – కొత్తగూడెం మార్గం లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కీలకమైన రైలుమార్గం కొత్తగూడెం సింగరేణి బొగ్గు గనులు, భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి పుణ్యక్షేత్రం తదితర ప్రాంతాలను కలిపే ఈ రైలుమార్గం ఆవశ్యకతను ఇకనైనా విజయవాడ పార్లమెంటు సభ్యులు గుర్తించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరితగతిన కార్యరూపం దాల్చే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల అసెంబ్లీలో ఈ రైలుమార్గం నిర్మాణం గురించి ప్రస్తావించినా అధికార పార్టీ స్పందించలేదు. 40 ఏళ్లుగా సర్వేలతో సరి ప్రతి బడ్జెట్లో నామమాత్రంగా నిధుల కేటాయింపు ఆచరణకు నోచుకోని కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గంనాయకులు శ్రద్ధ చూపాలి.. అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ కృష్ణాకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం గురించి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయం. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో కొత్త రైలుమార్గాల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉన్నా తదనుగుణంగా ప్రతిపాదనలను పంపకపోవడం తగదు. ఇకనైనా ఈ రైలుమార్గాన్ని నిర్మించడానికి ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపాలి. – నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ తిరువూరు ఇన్చార్జి రైలు మార్గం కల్పించాలి.. ఎన్టీఆర్ జిల్లాలోనే కాక రాష్ట్రంలో మారుమూల ఉన్న తిరువూరు, మైలవరం నియోజకవర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే రైలుమార్గం ఏర్పాటు ఎంతో అవసరం. ఈ రెండు నియోజక వర్గాల్లో ప్రభుత్వభూములు, అటవీ భూములు వేలాది ఎకరాలున్నందున వీటిని పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కేటాయించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైలుమార్గం నిర్మాణంతో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. – ఐవీకే కిషోర్, స్థానికుడు, తిరువూరు -
అక్షరం ప్రభాకర్ ‘రణం’ ఉత్తమ కవితగా ఎన్నిక
విజయవాడ కల్చరల్: ఎక్స్రే సాహిత్య మాసపత్రిక జాతీయ స్థాయిలో నిర్వహించిన తెలుగు కవితల పోటీ విజేతలను ప్రధాన కార్యదర్శి బోడి ఆంజనేయ రాజు, అధ్యక్షుడు కొల్లూరి ఆదివారం ప్రకటించారు. తెలంగాణ మానుకోటకు చెందిన అక్షరం ప్రభాకర్ రచించిన రణం కవితను ఉత్తమ కవితగా న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారన్నారు. విజేతలకు రూ.10 వేల నగదు బహుమతి ఎక్స్రే అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. కె.మునిసురేష్ పిళ్లే హైదరాబాద్, మామిడిశెట్టి శ్రీనివాస్ దొడిపట్ల, డాక్టర్ రాధాశ్రీ నాగరం, అవ్వారు శ్రీధర్బాబు నెల్లూరు, చిత్రాడ కిషోర్కుమార్ విజయవాడ, జాగారపు శంకరరావు గజపతి నగరం, శ్రీ కంఠస్ఫూర్తి విజయవాడ, దుప్పటి రమేష్బాబు నెల్లూరు, ధవశ్వేరపు రవికుమార్ విశాఖపట్నం, కోరుప్రోలు హరినాథ్ హైదరాబాద్ ఎక్స్రే అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరంలో విజయవాడలో జరిగే సభలో వారికి నగదు బహుమతి, జ్ఞాపికలతో సత్కరిస్తామని పేర్కొన్నారు. -
హామీల అమలు ఎప్పుడో చెప్పాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలు ఏమయ్యాయనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షులు ఎల్.సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు అధ్యక్షతన ఎస్టీయూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే సకాలంలో డీఏలు ఇస్తామని, మెరుగైన వేతన సవరణ చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం హామీల అమలును ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ● సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ బోధనేతర పనులు మితిమీరి, ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, దీని ప్రభావం బోధనపై పడే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే సీపీఎస్ విధానం రద్దు చేయాలని, తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమం తప్పనిసరిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ● ఏఐఎస్టీఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు మాట్లాడుతూ 2003–డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదోతరగతి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్నవారికి ఇంతవరకు పారితోషికం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ● ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఉద్యమాలు చేయాల్సిన అనివార్య పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ● సంఘ జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ రకరకాల యాప్ల పేరుతో టీచర్లు బోధనేతర పనులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ● సంఘ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదరి డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి పొదుపు చేసుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ ఖాతాల నుంచి రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు యస్. రామచంద్రయ్య, షేక్ మహబుబ్ సుభాని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ప్రసాదరావు, పల్నాడు, బాపట్ల జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్వీ రామిరెడ్డి, యు.చంద్రజిత్ యాదవ్, బడుగు శ్రీనివాస్, జి. అమర్నాథ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వి.భిక్షమయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్ -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు
పెడన: మచిలీపట్నం – గుడివాడ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన, పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందిగామ గ్రామానికి చెందిన పోలగాని పెదబోదయ్య(45), పోలగాని సాయి(23)లు గుడివాడ నుంచి పెడన వైపు వస్తున్నారు. వడ్లమన్నాడుకు చెందిన మరో ఇద్దరు గుడివాడ వైపు వెళ్తున్నారు. వీరి వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీ కొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పెడన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆటోలో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బోదయ్య మినహా మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు రిఫర్ చేసినట్లుగా సమాచారం. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): విద్యారంగం, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విమర్శించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు కొండపల్లి క్రాంతి హైస్కూల్లో ఆదివారం జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు కోరుతుంటే, విద్యార్థి సంఘాలను పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అనుమతించవద్దని సర్క్యూలర్ తీసుకురావడం అత్యంత దారుణమన్నారు. సర్క్యూలర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా ఏడాది ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ సంక్షేమ హాస్టళ్లలో, విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు. ఆఫ్లైన్లో డిగ్రీ ప్రవేశాలు జరపాలని, పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చడంలేదని విమర్శించారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నగదు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు గోపి నాయక్, ఉపాధ్యక్షులు కుమారస్వామి, కుమార్ నాయక్, మాధవ్, ప్రణీత, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు -
త్వరలో వేద పాఠశాలలో తరగతులు ప్రారంభం
తాడేపల్లి(ఘంటసాల): శ్రీపరిపూర్ణానందగిరి స్వామి ఆశీస్సులతో తాడేపల్లి ఆశ్రమంలోని బ్రహ్మ విద్యా కేంద్రం ప్రాంగణంలో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారి శృతిభారతి వేద పాఠశాలలో సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభించనున్నట్లు విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య గుళ్లపల్లి శ్రీరామ కృష్ణమూర్తి తెలిపారు. మండలంలోని తాడేపల్లిలో కృష్ణామండలం వ్యాసాశ్రమంలో ఎన్నారై మూల్పూరి వెంకట్రావు, సావిత్రి దంపతుల సౌజన్యంతో వేద పాఠశాల తరగతులు నిర్వహించనున్నారు. బ్రహ్మ విద్యా కేంద్రం ప్రాంగణంలో తిరుపతి రాష్ట్రీయ(జాతీయ) సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా గుర్తించబడిన సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో అర్చకత్వ పౌరోహిత్య(కర్మకాండ) అధ్యయన కేంద్రం, విశ్వవిద్యాలయ ప్రాక్ శాస్త్రి కార్యక్రమాలకు ప్రవేశం కల్పించి తరగతులు నిర్వహిస్తారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో మొదటసారిగా ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాలలో కులరహితంగా ప్రవేశాలు పొంది వేదాలు అభ్యసించాలన్నారు. ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు, డిప్లమో ఒక సంవత్సరం, ప్రాక్ శాస్త్రి కోర్సు రెండేళ్లు ఉంటుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని చెప్పారు. కార్యక్రమంలో ఉపకులపతి సతీమణి రామలక్ష్మి, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం డైరెక్టర్, శృతిభారతి వేదపాఠశాల కోఆర్డినేటర్ డాక్టర్ జ్ఞాన్ రంజన్ పాండా, ఆశ్రమ నిర్వాహకులు కావూరి కోదండరామయ్య, గొర్రెపాటి రామకృష్ణ, మొవ్వ శ్రీరామమూర్తి, గొర్రెపాటి సురేష్, పి.శివకోటేశ్వరరావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శృతిభారతి వేదపాఠశాల విద్యార్థుల వసతి గదుల నిర్మాణానికి ఎన్నారై మూల్పూరి వెంకట్రావు – సావిత్రి దంపతులు శంకుస్థాపన చేశారు. మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నం చేయనున్నట్లు వారు చెప్పారు. -
వైద్య విజ్ఞానంపై విస్తృత ప్రచారం జరగాలి
గన్నవరంరూరల్: వైద్య విజ్ఞానంపై ప్రజల్లో మరింత విస్తృతంగా ప్రచారం జరగాలని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబిషన్లను 3,400 మంది సందర్శించారు. మొత్తం 26 వేల మందికి పైగా ఈ ఎగ్జిబిషన్లను సందర్శించినట్లు చెప్పారు. వైద్యం పట్ల అవగాహన ఎంతో అవసరమన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతున్నా ఆ మేరకు విజ్ఞాన ప్రగతి సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారతదేశం అన్ని రంగాల్లో దూసుకువెళ్తోందని, వైద్య రంగంలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ను సందర్శించిన వారిని అభినందించారు. ప్రతి ఒక్కరూ మానవ శరీర నిర్మాణంలో తమను తాము దర్శించుకున్నారని చెప్పారు. మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబిషన్లలో అన్ని డిపార్టుమెంట్లు, నర్సింగ్ స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులు పాల్గొని సేవలందించారని కొనియాడారు. డైరెక్టర్ సీవీ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్కుమార్, డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.కళ్యాణి, ఏవోలు, డాక్టర్ రాజగోపాల్ పాల్గొన్నారు. డెంటల్ కళాశాలలో.. చిన అవుటపల్లి డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో ఆదివారం 9 విభాగాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను విద్యార్థులు తిలకించారు. గ్రహణం మొర్రి, అంగిలి చీలిక విభాగంలో ఇప్పటి వరకు ఆస్పత్రిలో నిర్వహించిన ఆపరేషన్ల వివరాలను ప్రిన్సిపాల్ విద్యార్థులకు తెలియజేశారు. కమ్యూనిటీ విభాగం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సేవలు ప్రదర్శించారు. హెచ్వోడీలు కాళేశ్వరరావు, అజయ్బెనర్జీ, ఏవో వై.మధుసూదనరావు పాల్గొన్నారు. -
మెడికల్ టెక్నీషియన్ల హక్కుల సాధనకు కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్స్ హక్కుల సాధనకు కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఇన్చార్జి మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్లోని కందుకూరి కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్స్ అసోసియేషన్ 3వ రాష్ట్ర మహాసభ ఆదివారం జరిగింది. సభకు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను మల్లాది విష్ణుకు తెలియజేశారు. బీమా సదుపాయం కూడా లేని పరిస్థితి ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ రోగులకు సేవలు అందించడంలో మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్లదే కీలక పాత్ర అన్నారు. వారి సేవలను ప్రశంసించారు. రేడియాలజీ టెక్నీషియన్స్,ల్యాబ్ అసిస్టెంట్స్ ప్రభుత్వ సహాయ, సహకారాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం బీమా సదుపాయం కూడా లేదన్నారు. తాము అధికారంలో లేకపోయినా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -
రామలింగేశ్వరునికి జాజులతో మహార్చన
నాగాయలంక: స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్లోని శ్రీగంగ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి మండపంలో ఆదివారం రాత్రి స్వామివారి శివలింగానికి 25 కేజీల సన్నజాజి, విరజాజి పువ్వులతో మహార్చన వైభవంగా జరిపారు. బ్రహశ్రీ అంబా సాయికిరణ్ శర్మ నేతృత్వంలో భక్తులు సమర్పించిన జాజులతో వేద పండితులచే అర్చన నిర్వహించారు. తదుపరి భక్తులు బారులుతీరి జాజి పూలతో స్వామిని వారే స్వయంగా అభిషేకించారు. అనంతరం అభిషేక పూజ, అలంకరణను శర్మ శోభాయమానంగా తీర్చిదిద్దారు. క్షేత్రం కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, నిర్వహణకర్త తలశిల రఘుశేఖర్, ఉప్పల లీలాకృష్ణప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకులు వెంకటాపురం(పెనుగంచిప్రోలు): మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కందిమాల సత్యనారాయణ, నల్లబోతుల రామకృష్ణ(బుల్లబ్బాయి) వారి కుటుంబ సభ్యులు శఽనివారం రాత్రి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి, సర్పంచ్ కూచి నర్సయ్య, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లేజర్ ఎన్యుక్లియేషన్, అడ్వాన్స్డ్ ప్రొస్టేట్ సర్జరీలపై శిక్షణ పటమట(విజయవాడతూర్పు): ప్రశాంత్ హాస్పిటల్ 37వ వార్షికోత్సవం సందర్భంగా లేజర్ ఎన్యుక్లియేషన్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొస్టేట్ సర్జరీ ప్రోగ్రామ్(లీప్)ను అత్యాధునిక ప్రొస్టేట్ సర్జరీలు, వైద్య చికిత్సల నిర్వహణపై వైద్యులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. లబ్బీపేటలోని ప్రశాంత్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో అడ్వాన్స్డ్ లేజర్ ఎన్యుక్లియేషన్ ప్రొస్టేట్ చికిత్స గురించి, లైవ్ సర్జరీలు, చికిత్సలో మెలకువలు, యూరాలజిస్టులకు ప్రయోగాత్మక శిక్షణ అందించారు. వాటితో పాటు రెజుమ్ వాటర్ వేపర్ థెరపీ వంటి సూక్ష్మ విధాన శస్త్రచికిత్సలు, యూరోలిఫ్ట్, రోబోటిక్ సింపుల్ ప్రొస్టటెక్టమీ, తదితర చికిత్స విధానాలపై శిక్షణనందించారు. ప్రశాంత్ హాస్పిటల్ ఎండీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ధీరజ్ కాసరనేని, క్లినికల్ డైరెక్టర్ ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐపీఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఐపీఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీఐపీఎంఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్క్లబ్లో ఏపీఐపీఎంఈఏ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డిపార్ట్మెంట్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తమ సంఘం రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉద్యోగుల పదోన్నతులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. డిపార్ట్మెంట్ అధోగతి పాలుకావడానికి ఆయనే కారణమన్నారు. అతడిని తక్షణమే తొలగించి అదేస్థాయి అధికారిని పరిపాలన అధికారిగా నియమించాలని కోరారు. 150 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.. ఐపీఎంకు డైరెక్టర్ను నియమించాలని రాజారావు కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల పదోన్నతులు కల్పించాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన సింగిల్ పోస్టులను వెంటనే మంజూరు చేయాలని, మంత్రి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 150 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 50 శాతం పోస్టులు ల్యాబ్లోనే భర్తీ చేయాలన్నారు. జూనియర్ అనలిస్ట్లకు సర్వీసు రెగ్యులర్ చేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు డిపార్ట్మెంట్లో అవకాశం కల్పించాలని కోరారు. సీఐటీయూ నాయకులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐపీఎం నిర్వీర్యం కావడానికి అధికారులే కారణమన్నారు. ఐపీఎంను నిలబెట్టుకోవాలన్నా, పదోన్నతులు పొందాలన్నా, ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలన్నా పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. సమావేశంలో యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తాళ్లూరి వెంకటేశ్వర్లు, నేషనల్ హెల్త్ మిషన్ జేఏసీ నాయకులు దయామణి, చలం, బి. శ్రీనివాసరావు, సతీష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏపీఐపీఎంఈఏ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన శీల రమ్య కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ. 5,01,116 విరాళాన్ని ఆలయ అధి కారులకు అందజేశారు. గుంటూరు పాత పట్టాభిపురానికి చెందిన విజయ్ శైలేంద్ర అమ్మవారి ఉచిత ప్రసాద పంపిణీకి రూ. 90 వేలు విరాళాన్ని ఇచ్చారు. డోనర్ సెల్కు రూ.10 వేల విలువైన బీరువాను అందించారు. తెలంగాణలో నిజామాబాద్కు చెందిన బాలాప్రగడ ఎన్ఎస్. కామేశ్వరి కుటుంబం దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.1,07,900 విరాళాన్ని అందజేసింది. దాతలకు దుర్గమ్మ దర్శనం కల్పించిన అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు ఇచ్చారు. రాము, హారిక దంపతులకు పరామర్శ పెడన: వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్ల మెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఆదివారం వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము, ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక దంపతులను పరామర్శిం చారు. గత నెల 12న గుడివాడలో హారిక, రాము దంపతులపై దాడి జరిగింది. ఆదివారం పెడన మండలం కూడూరులోని రాము నివాసానికి చేరుకుని రాము దంపతులను పరామర్శించి దాడి ఘటనను అడిగి తెలుసుకున్నారు. దాడులు దారుణమని, ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులున్నారు. నేటి నుంచి ఇన్విటేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): నగరంలో పీబీ సిద్ధార్థ కళాశాల ఆవరణలోని మైదానంలో నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఆలిండియా ఇన్విటేషనల్ వాలీబాల్ (సీ్త్ర, పురుషులు) టోర్నమెంట్ జరగనుంది. దీనిలో కేరళ, మద్రాస్, కోయంబత్తూరు, గుజరాత్, ఆంధ్రపదేశ్ జట్లు తలపడ నున్నాయి. అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. ఇప్పటికే టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు నగరానికి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం టోర్న మెంట్ ప్రారంభ సభ జరుగుతుంది. తమ అకాడమీ స్వర్ణోత్సవం సందర్భంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ చెప్పారు. తక్కెళ్లపాడులో తెలంగాణ ఉన్నతాధికారులు తక్కెళ్లపాడు(జగ్గయ్యపేట): తక్కెళ్లపాడులో తెలంగాణ ఉన్నతాధికారులు ఆదివారం పర్యటించారు. గ్రామానికి చెందిన ప్రస్తుత తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీనివాస్, మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ దారావత్ జానకి పర్యటించారు. ఈ ప్రాంతంలో పుట్టి పురిగి ఇతర ప్రాంతాల్లో ఉన్నత హోదాల్లో ఉన్న వారిని ఆదివారం గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కస్కుర్తి శ్రీనివాసరావు, కోదాడకు చెందిన వ్యాపార వేత్త పెదనాటి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఎస్పీ గెంటేల సత్యనారాయణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
అమ్మ సన్నిధిలో లెక్కల్లోనే భోజనం
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అన్నదానం (అన్నప్రసాదం) అంటే భక్తులకు విశ్వాసం మెండు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తజనం జగజ్జనని దర్శనానంతరం అన్నప్రసాదం తీసుకునే వెనుదిరుగుతారు. అయితే దేవస్థానంలోని కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లు లాలూచీ పడటంతో తిన్నవారికంటే.. లెక్క అధికంగా చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్నదానంలో అంకెల మాయ చేస్తూ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మను భక్తులు మనసారా పూజిస్తారు. అందుకే అమ్మవారిని నియమ నిష్టలతో కొలుస్తారు. అయితే ఆలయంలో సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు మాత్రం ఎలాంటి భీతి లేకుండా అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానంలోనూ వీరు నిత్యం అక్రమాలకు పాల్పడుతున్నారు. అన్నదానంలో తినేవారి కంటే ఎక్కువ సంఖ్య చూపిస్తూ ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..సాధారణ రోజుల్లో..జనం సాధారణంగా ఉండే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకే అన్న ప్రసాదం భక్తులకు ఇస్తారు. అంటే మొత్తం 4.30 గంటల సమయంలో 14 బ్యాచ్లు. బ్యాచ్కు 300 మంది చొప్పున 4,200 మందికి మాత్రమే ఉచిత అన్నప్రసాదం వడ్డిస్తారు. ఆ రోజుల్లో బఫే ఉండదు. అయితే ఈ రోజుల్లో దాదాపు 5000 నుంచి 6000 మంది భక్తులకు భోజనం పెడుతున్నట్లు లెక్క చూపుతున్నారు. సరుకులు దేవస్థానం ఇస్తుండగా, పాలు, కూరగాయలు, గ్యాస్, క్లీన్అండ్ సర్వీసింగ్ను కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. స్వీపింగ్లో 40 మంది సిబ్బంది పనిచేయాల్సిండగా అక్కడ కేవలం 30 మంది మాత్రమే చేస్తున్నారు.అధికంగా..ఈ లెక్కన సాధారణ రోజుల్లో 2 వేల మంది, రద్దీ రోజుల్లో వెయ్యి మందిని ఎక్కువగా చూపి చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో భక్తుడికి అన్న ప్రసాదం పెట్టేందుకు దాదాపు రూ.40 ఖర్చు అవుతుంది. ఈ లెక్కన సరాసరి రోజుకు 1000 నుంచి 1500 మందిని అదనంగా చూపి బిల్లులు పెట్టి దోపిడీ చేస్తున్నారు. రోజుకు రూ.50 వేలకు పైగా దండు కొంటున్నారు. ఇలా నెలకు రూ.15 లక్షల మేర దోపిడీ పర్వం జరుగుతోంది. గత ఏడాది జూన్, జూలై, ఈ ఏడాది జూన్, జూలై నెలలకు సంబంధించిన అన్నదానం లెక్కలు తీస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది.సీసీ పుటేజ్ను పరిశీలిస్తే..ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆలయ కార్య నిర్వహణ అధికారి.. అన్నదానం పెట్టే ప్రాంతంలో జూన్, జూలై నెలల్లో సీసీ పుటేజీని పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ఏ సయమంలో భక్తులకు అన్నదానం ప్రారంభిం చింది, క్లోజ్ అయిన విషయాలు స్పష్టంగా ఉంటాయి. ఒక్క రోజు పరిశీలిస్తే ఎన్ని బ్యాచ్లకు భోజనాలు పెట్టింది తెలుస్తుంది. అక్కడ భోజనాలు చేసే ముందు వేసే వేలి ముద్రల్లో సిబ్బంది మాయ చేస్తున్నారని సమాచారం. సీసీ పుటేజీలు పరిశీలిస్తే అన్నదానంలో జరిగే దందా మొత్తం బయటికి వస్తుంది. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.దోపిడీ చేస్తున్నారిలా...దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉచిత అన్నదాన ప్రసాదాన్ని భక్తులకు పెడతారు. మూడో ఫ్లోర్ నుంచి క్యూలైన్ మొదలవుతుంది. రెండో ఫ్లోర్లో భక్తులకు ఒక హాలులో 180మంది, ఇంకో హాలులో 120 మందికి రెండు హాళ్లల్లో 300 మందికి ఒకేసారి భోజనం పెడతారు. ఒక్కో బ్యాచ్ భోజనం చేసేందుకు 20 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన 6 గంటల సమయంలో 18 బ్యాచ్లు అంటే అత్యధికంగా 5,400 మందికి భోజనం పెట్టే వెసులుబాటు ఉంది. ఈ రోజుల్లో ఫస్ట్ ఫ్లోర్లో దాదాపు 1500 మందికి బఫే పద్ధతిలో పెడతారు. అంటే అత్యఽధికంగా 7000 మందికి భోజనం పెట్టే వీలుంది. బఫే బ్యాచ్ భోజనం 10 నుంచి 13 నిమిషాల్లోనే పూర్తైనట్లు చూపి, రోజుకు 8000 నుంచి 9000 మందికి భోజనం పెడు తున్నట్లు లెక్క చూపుతున్నారని సమాచారం. ఎక్కువగా చూపిన భక్తుల సంఖ్యకు సంబంధించిన లెక్కను ఆలయ అన్నదాన సిబ్బంది, క్లీన్ అండ్ సర్వీంగ్ కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చేతివాటంలో అన్నదానానికి సంబంధించి ఇద్దరు గుమాస్తాలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
పులకించిన భక్తజన మది
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనంతో భక్తజన మది పులకించింది. దుర్గమ్మ దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివాహ సుముహూర్తాలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాల అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఘాట్రోడ్డు, మహా మండపం మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 క్యూలో ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటల వరకు రద్దీ ఓ మోస్తరుగా ఉండగా, తర్వాత అనూహ్యంగా పెరిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభమవగా మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దీ కొనసాగింది. రాత్రి 7 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు ఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు ముగిశాయి. ఆదివారం ఉదయం మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలోని యాగశాలలో అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు పూర్ణాహుతి చేశారు. తొలుత పవిత్రోత్సవాలను పురస్కరించుకుని పలు ప్రత్యేక వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం జరిగిన పూర్ణాహుతిలో ఈవో శీనానాయక్ దంపతులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై రద్దీ కిటకిటలాడిన క్యూలునేటి నుంచి ఆర్జిత సేవలు..పవిత్రోత్సవాలు పూర్తి కావడంతో సోమవారం నుంచి అన్ని ఆర్జిత సేవలు యధావిథిగా ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, నవగ్రహ హోమాలు వంటి ఆర్జిత సేవల టికెట్లు కౌంటర్లలో అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది. విజయవాడ ఎంజీ రోడ్డులోని లెమన్ ట్రీ హోటల్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. సమితికి గౌరవ అధ్యక్షుడిగా గోకరాజు గంగరాజు, అధ్యక్షుడిగా చలసాని ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా త్రినాథ్ను నియమించారు. వీరితో పాటు అన్ని జిల్లాల నుంచి సమితి సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా గౌరవా ధ్యక్షుడు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే గణపతి నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల నుంచి సహకారం అందించాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో మండపాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ.. గణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసుకునేవారికి స్థానిక పరిపాలన వ్యవస్థ పోలీసు, విద్యుత్, వైద్య, ట్రాఫిక్, నీటిపారుదల శాఖ నుంచి సహాయ, సహకారాలు అందించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్ మాట్లాడుతూ.. ‘గణేష్ విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు, అనుమతుల కోసం రకరకాల రుసుముల పేరుతో ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. ఉత్సవ సమితికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. అనంతరం ఉత్సవాల వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. -
సీఎం రాక.. స్తంభించిన ట్రాఫిక్
పెనమలూరు: మండల పరిధిలో ఆదివారం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సీఎం చంద్రబాబునాయుడు పోరంకి రావడం, మండల పరిధిలోని కల్యాణ మండపాల్లో శుభకార్యక్రమాలు జరగడంతో ఒక్కసారిగా వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో బందరురోడ్డుపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సీఎం చంద్రబాబు పోరంకిలో జరిగిన శుభకార్యక్రమానికి రోడ్డు మార్గంలో రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించారు. ముఖ్యంగా చంద్రబాబు వచ్చిన సమయంలో పది నిమిషాల ముందుగానే బందరురోడ్డుపై వాహనాలు నిలిపివేయడంతో వాహనచదోకులు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం తిరిగి వెళ్లిన తర్వాత బందరురోడ్డుపై ట్రాఫిక్ వదలటం, బందోబస్తులో ఉన్న పోలీసులు ట్రాఫిక్ సమస్యలు పట్టించుకోకుండా విధుల నుంచి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనచోదకులు అవస్థ పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణ ఏది..? జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు తరచూ విఫలమవుతున్నారు. ప్రజల కష్టాలను పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో బందరు రోడ్డుపై ట్రాఫిక్ పెరిగినా దాని నియంత్రణపై పోలీసు ఉన్నతాధికారులు శ్రద్ధ చూపడం లేదని వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు మండల పరిధిలో తరచూ తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ముత్యాలమ్మకు కరెన్సీ నోట్ల అలంకరణ
జగ్గయ్యపేట అర్బన్: శ్రావణ మాస ఉత్సవాల్లో పట్టణంలోని శ్రీముత్యాలమ్మ ఆలయంలో మూడో ఆదివారం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. రూ.5 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. కుమ్మరి శాలివాహన వంశస్తులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అప్పన మణికుమార్, కొత్తా రమేష్కుమార్, కార్యవర్గ సభ్యులు నోముల శివకుమార్, కొంకిమళ్ల సురేష్, అప్పన పిచ్చయ్య, సభ్యులు చేడె శ్రీరంగం, నాగప్రసాద్, తునికిపాటి మల్లేశ్వరాచారి, ఆరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు మోపిదేవి: మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో నిండిపోయింది. తెల్లవారుజామునుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. దేవస్థానంలో నిర్వహించే స్వామివారి శాంతి కల్యాణంలో 73 మంది దంపతులు పాల్గొన్నారు. 203 మంది సర్పదోషనివారణ పూజలు చేశారు. సేవా టికెట్ల ద్వారా ఒక్కరోజులో స్వామివారి ఆదాయం రూ. 10,00,605 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అభ్యసన మదింపునకు సెల్ఫ్ అసెస్మెంట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నెల 11 నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025– 26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో తొలి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్–1 (శాంప్) ఈ నెల 11 నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడానికి నిర్వహిస్తున్న పరీక్షలను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ను ప్రవేశపెట్టారు. గతేడాది 1నుంచి 8 తరగతుల వరకూ సీబీఏ అమలు చేయగా, ఈ ఏడాది 9వ తరగతికి కూడా సీబీఏ విధానాన్ని తీసుకొచ్చారు. టెన్త్ విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్–1 జరపనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇలా.. సీబీఏ విధానంలో నిర్వహించే పరీక్షలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఎయిడెడ్, ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో 1నుంచి 5 తరగతుల వరకు 33,983 మంది, 6 నుంచి 10 తరగతుల వరకు 56,094 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో సుమారు 90,077 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలో సుమారుగా 540 విద్యాసంస్థలు ఉన్నా వాటిల్లో కొద్ది విద్యాసంస్థలే అనుసరిస్తున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం... ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు ఈ నెల నాలుగు నుంచి నిర్వహించాల్సి ఉండగా, అసెస్మెంట్ బుక్లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈ నెల 11కు వాయిదా వేశారు. జూన్, జూలై సిలబస్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సిలబస్తో పాటు, ఆరో తరగతికి రెడీనెస్ ప్రోగ్రామ్పై పరీక్ష ఉంటుంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు కొన్ని మార్పులతో పరీక్షలను నిర్వహిస్తున్నారు. 10వ తరగతికి నాలుగు ఎఫ్ఎలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు పాత విధానంలో అమలు చేస్తారు. బైలింగ్విల్ ప్రశ్నపత్రాలు సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం బైలింగ్విల్ విధానంలో ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లిష్ ప్రశ్నపత్రం అర్థం కాకుంటే తెలుగులో చదివి ప్రశ్నను అర్థం చేసుకునేందుకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలను ప్రవేశపెట్టారు. నేటి నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు జిల్లాలో 90 వేల మంది ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు కొండపల్లి జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినులు (ఫైల్) -
పొంగిన వాగులు..
రాకపోకలకు అంతరాయంపెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు మండలంలో గురువారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లింగగూడెం వద్ద గండివాగు పొంగడంతో రాకపోకలు నిలిచి పోయాయి. ముచ్చింతాల–తాళ్లూరు మధ్య, పెనుగంచిప్రోలు–అనిగండ్లపాడు మధ్య కూచివాగు, గుమ్మడిదుర్రు వద్ద వాగు పొంగడంతో చప్టాలపై పెద్ద ఎత్తున నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పక్కన ఉన్న పొలాలు నీట మునిగాయి. పెనుగంచిప్రోలు చెరువు నిండి అలుగుల నుంచి పెద్ద ఎత్తున జలపాతంలా నీరు ప్రవహిస్తూ రోడ్డుపైకి చేరింది. దీంతో పెనుగంచిప్రోలు–సుబ్బాయిగూడెం రోడ్డు వరద నీటికి కొట్టుకు పోయింది. చెరువు అలుగు కాలువ పూడి పోవడంతో నీరు మొత్తం నాట్లు వేసిన పొలాలపై ప్రవహించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు వాగుల వద్ద రాకపోకలు నిలిచి పోయాయి. పత్తి సాగు చేసిన పొలాల్లో వర్షం నీరు చేరి తటాకాలుగా మారాయి. -
పూర్తిగా సేంద్రియ ఎరువులు వాడకం
నాకు వచ్చిన ఆలోచన మేరకు 365 రోజులు ఏదో ఒక పంట ద్వారా ఆదాయం పొందవచ్చని విభిన్న రకాల పండ్ల మొక్కలు నాటాను. ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలోనే మొక్కలు పెంచాను. ఫలసాయం కూడా బాగానే ఉంది. డ్రాగన్, అంజీర పండ్లు సొంతంగా అమ్ముతున్నాం. నిమ్మతో పాటు జామ పిందె దశలో ఉన్నాయి. నిమ్మ కొన్ని మొక్కలు కోతకు కూడా వచ్చాయి. పూర్తిగా డ్రిప్ ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నాం. మొక్కలు పెద్దవి కావడంతో అంతర పంటల సాగు కూడా లాభదాయకంగా ఉంటుంది. రైతులు నూతన సాగు పద్ధతులతో ముందుకు వెళ్లాలి. ముందు మా కుటుంబంలో కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి పండ్లను తినడంతో పాటు విక్రయంతో ఆదాయం పొందవచ్చు. – గింజుపల్లి శ్రీనివాసరావు, రైతు, పెనుగంచిప్రోలు -
కోరిన వరాలిచ్చే వరలక్ష్మిగా..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కోరిన వరములిచ్చే వరలక్ష్మిగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. మరో వైపు పవిత్రోత్సవాల నేపథ్యంలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లతో పాటు ఇతర ఉపాలయాల్లో దేవతా మూర్తులకు పవిత్రాలను అలంకరించారు. ఉదయం 9.20 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభం కాగా భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. ఆన్ లైన్లో రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం అంతరాలయ దర్శనం కల్పించారు. బంగారు వాకిలితో పాటు మొత్తం 5 క్యూలైన్ల ద్వారా భక్తులకు ఉచితంగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ... పవిత్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులతో పాటు పలువురు ఆలయ అధికారులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతాలను పురస్క రించుకుని అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రవేశ మార్గాలలో వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో మామిడి తోరణాలు, అరటి చెట్లతో అలంకరించడంతో పండుగ వాతావరణం కనిపించింది. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం మజ్జిగ పంపిణీ చేసింది. రాత్రి 7 గంటల నుంచి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు... శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పవిత్రోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు పవిత్రాలను సమ ర్పించి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద మంత్రోచ్చారణ మధ్య పవిత్రమాలలను అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి, ఉపాలయాల్లో దేవతా మూర్తులకు ఆలయ అర్చకులు అలంకరించారు. మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలు ఆదివారం ఉదయం పూర్ణాహుతితో ముగుస్తాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తజనం భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి రద్దీ సమయంలో టికెట్ల విక్రయాలు రద్దు అన్ని క్యూలైన్లలోనూ ఉచితమే -
11 నుంచి ఆహ్వాన క్రీడా పోటీలు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవం సంవత్సర సందర్భంగా ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆలిండియా ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ (ఆహ్వాన క్రీడా పోటీలు)ను తమ కళాశాల ఆవరణ మైదానంలో నిర్వహిస్తున్నామని సిద్ధార్థ అకాడమీ అకడమిక్ అడ్వైజర్ ఎల్కే మోహనరావు చెప్పారు. సిద్ధార్థ కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో టోర్నమెంట్స్కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. మోహనరావు మాట్లాడుతూ ఈ నెల 11 నుండి 14 వరకు వాలీబాల్ (సీ్త్ర, పురుష జట్లు) ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ జరుగుతాయని చెప్పారు. ఈ టోర్నమెంట్లో కేరళ, మద్రాస్, కోయంబత్తూరు, గుజరాత్, ఆంధ్రపదేశ్ టీమ్లు తలపడతాయని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు బాస్కెట్బాల్ (పురుషులు) టోర్నమెంట్ ఉంటుందన్నారు. ఈ టోర్నమెంట్లో చైన్నె, బెంగళూరు, కేరళ, తమిళనాడు, ఏపీ టీమ్లు పోటీ పడనున్నాయని వెల్లడించారు. 11వ తేదీ మధ్యాహ్నాం టోర్నమెంట్స్ ప్రారంభ సభ నిర్వహిస్తామన్నారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, కళాశాల ప్రిన్సిపాల్స్ మేకా రమేష్ మాట్లాడుతూ నగరంలోని క్రీడాకారులు, క్రీడాభిమానులతో పాటుగా విద్యార్థులు కూడా ఈ టోర్నమెంట్స్ను వీక్షించవచ్చునన్నారు. సిద్ధార్థ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చుండి వెంకటేశ్వర్లు, శాప్ పూర్వ అధ్యక్షుడు అంకమ్మచౌదరి, సిద్ధార్థ కళాశాల క్రీడా విభాగాధిపతి టీ.బాలకృష్ణారెడ్డి, ఉపాధి కల్పనాధికారి కావూరి శ్రీధర్, వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు. -
కొత్త సాగు.. ఆదాయం తెచ్చింది..
పెనుగంచిప్రోలు: సంప్రదాయ పంటలతో నస్టాల సాగు చేసిన ఓ రైతు పండ్ల మొక్కలతో కొత్త సాగు చేసి విభిన్న పంటలతో ఆదాయాన్ని చూస్తున్నాడు. దాని గురి తెలుసుకోవాలంటే పెనుగంచిప్రోలు వెళదాం. గ్రామానికి చెందిన రైతు గింజుపల్లి శ్రీనివాసరావు. అతను సంప్రదాయ పంటలు పత్తి, మిర్చి ఏళ్లతరబడి సాగు చేసి తెగుళ్లతో, ధరలు లేక విసుగుచెందాడు. సాగులో కొత్తదనం కోసం ప్రయత్నించాడు. 18 నెలల క్రితం కడియం నుంచి పలు రకాల పండ్ల మొక్కలు తెచ్చి తనకున్న 2.44 ఎకరాల్లో నాటాడు. మొక్క కొనుగోలు, నాటడం, వ్యవసాయ ఖర్చులు, డ్రిప్ ఏర్పాటుకు సుమారుగా రూ.20 లక్షలు వెచ్చించాడు. పశువుల ఎరువు, ఇతర సేంద్రియ పద్ధతులతో సాగు చేశాడు కొత్తగా అంజీర సాగు శ్రీనివాసరావు ఈ ప్రాంతంలో ఎవరూ పండించని విధంగా తన పొలంలో అంజీర మొక్కలు నాటి ఫలసాయం కూడా పొందారు. అంజీర సాగు ఈప్రాంతంలో చేపట్టిన మొదటి వ్యక్తి. ఆ పండ్లను డ్రై చేసేందుకు సొంతగా యంత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంజీరతో పాటు డ్రాగన్, నిమ్మ, మామిడి, జామ, సపోట, సీతాఫలం, రామాఫలం, రేగు, ఉసిరి, పనస, తదితర పండ్లతో పాటు పొలం చుట్టూ శ్రీగంధం, మహాగని, కొబ్బరి మొక్కలు కూడా నాటాడు. సొంతగా విక్రయం... ప్రస్తుతం అంజీర, డ్రాగన్ పండ్లను అతనే సొంతంగా విక్రయిస్తున్నాడు. అంజీర కిలో రూ.100, డ్రాగన్ కిలో రూ.100 నుంచి రూ.150 చొప్పున విక్రయిస్తున్నాడు, రేగిపండ్లు కూడా 150 కిలోల వరకు విక్రయించినట్లు రైతు శ్రీనివాసరావు తెలిపారు. నిమ్మ, జామలు కూడా కాపునకు వచ్చాయని ఏదో ఒక పండ్లద్వారా 365 రోజులూ ఆదాయం పొందేలా సాగు చేస్తున్నానని తెలిపారు. పండ్ల మొక్కలు పెద్దవి కావటంతో మధ్యలో పసుపు, బంతి అంతర పంటల సాగు చేపట్టారు. మొత్తంగా పొలం మొత్తం ఏదో ఒక పంటల ద్వారా ఆదాయం పొందేలా రైతు చేస్తున్న సాగును చూసి పలువురు అభినందిస్తున్నారు. 365 రోజులూ ఆదాయం పొందేలా సాగు నష్టాలు రాకుండా విభిన్న పంటలు ఒకే చోట పలు రకాల పండ్లు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పెనుగంచిప్రోలు రైతు శ్రీనివాసరావు సొంతంగా విక్రయిస్తూ ఆదాయార్జన -
ఉన్మాద పాలన
నందిగామటౌన్: రాష్ట్రంలో గత 13 నెలలుగా ఉన్మాద పాలన సాగుతోందని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. ఇందులో భాగంగానే నందిగామలో అధికారులు గురువారం అర్ధరాత్రి అరాచకానికి పాల్పడ్డారన్నారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లం ఘించి గాంధీ సెంటర్లో ఉన్న మహానేత విగ్రహాన్ని క్రేన్లతో తొలగించి తీసుకువెళ్లి మున్సిపల్ కార్యా లయంలో పడేశారన్నారు. మహానేత విగ్రహాన్ని తొలగించటాన్ని నిరసిస్తూ డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు నాయకత్వంలో శుక్రవారం పార్టీ కార్యాలయం నుంచి గాంధీ సెంటరులోని మహానేత విగ్రహం వరకు పాదయాత్రగా వెళ్లి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని కూటమి నేతలు తొలగించి ప్రజల హృదయాలలో ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేశారని అన్నారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు అధికారులు కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని తొలగించారని అన్నారు. అధికార పార్టీ నేతల ధన దాహానికి రాఘవాపురం కొండ విరిగి పడి ఓ వ్యక్తి మృతి చెందితే రెండవ కంటికి తెలియకుండా సెటిల్మెంట్ చేసి బాధిత కుటుంబానికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. వినతిపత్రం అందజేత.. గాంధీ సెంటరులోని రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని తొలగించిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కన్వీనర్ దేవినేని అవినాష్, నాయకులు నల్లగట్ల స్వామిదాసు, పూనూరు గౌతమ్రెడ్డి, ఇంటూరి రాజగోపాల్తో కలిసి సీఐ వైవీఎల్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. విగ్రహాన్ని తొలగిస్తున్న సమయంలో అటుగా వస్తున్న మహిళా సర్పంచ్ను, ఆమె భర్తను సైతం ఇష్టారీతిన అసభ్య పదజాలంతో దూషించి కారు అద్దాలపై గుద్దుతూ భయభ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు లాక్కుని దిక్కున్న చోట చెప్పుకోండంటూ వ్యవహరించిన తీరు అమానవీయమని అన్నారు. ఇప్పటికై నా పోలీసులు స్పందించి విగ్రహాన్ని తొలగించేందుకు సహకరించిన వారితో పాటు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు ముక్కపాటి నరసింహారావు, వేల్పుల ప్రశాంతి, ఎంపీపీలు పెసరమల్లి రమాదేవి, మలక్ బషీర్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు మంగునూరి కొండారెడ్డి, కాలవ వాసుదేవరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, పట్టణ, మండల కన్వీనర్లు మహ్మద్ మస్తాన్, వేమా సురేష్బాబు, మంచాల చంద్రశేఖర్, బండి మల్లికార్జునరావు, ఆవుల రమేష్ బాబు, కందుల నాగేశ్వరరావు, నెలకుదిటి శివనాగేశ్వరరావు, షేక్ షహనాజ్ బేగం, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందిగామలో అర్ధరాత్రి మహానేత విగ్రహం తొలగింపు హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేసిన అధికారులు కూటమి నేతల మెప్పు పొందేందుకే ఈ దుశ్చర్య నిరసనగా పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అవినాష్, పార్టీ నేతలు -
యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆటో బోల్తా
హనుమాన్జంక్షన్ రూరల్: చైన్నె–కోల్కతా జాతీయ రహదారిపై హనుమాన్జంక్షన్ బైపాస్రోడ్డులో యాసిస్ లోడుతో వెళ్తున్న ట్రక్ ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరుకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షు శుక్రవారం యాసిడ్ లోడుతో ఏలూరుకు కిరాయి కోసం బయలుదేరాడు. అతనితో పాటుగా తోడు ఉంటుందని తన భార్య షేక్ షంషాద్ (47)కు కూడా వెంట తీసుకెళ్లాడు. భార్యభర్తలిద్దరూ ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మార్గమధ్యంలో దుర్ఘటన చోటు చేసుకుంది. అదుపుతప్పి బోల్తా హనుమాన్జంక్షన్ బైపాస్రోడ్డు వద్దకు రాగానే ట్రక్కు ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ క్యాబిన్లో ఉన్న భార్య షంషాద్ రోడ్డుపైకి పడిపోయింది. ఆటో బోల్తా కొట్టడంతో ట్రక్కులో ఉన్న యాసిడ్ డ్రమ్ములు కూడా కిందకు ఒరిగిపోయాయి. దీంతో షంషాద్పై అధిక మొత్తంతో యాసిడ్ పడటంతో ఆమె శరీరంగా తీవ్రంగా కాలిపోయి, అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఆటో నడుపుతున్న ఆమె భర్త షేక్ అలాభక్షు కంటిలో యాసిడ్ పడటంతో పాటుగా శరీరంపై పలుచోట్ల గాయాలైయ్యాయి. రహదారిపై యాసిడ్ పడి ప్రమాదకరంగా మారడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న హనుమాన్జంక్షన్ ఫైర్ ఆఫీసర్ వి.అమరేశ్వరరావు సిబ్బందితో రహదారిపై పడిన యాసిడ్ను శుభ్రం చేయించారు. క్రేన్ సాయంతో ట్రక్కు ఆటోను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. ఘటనపై పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలుత ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మృతురాలు షేక్ షంషాద్కు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వాచ్మెన్ అనుమానాస్పద మృతి మధురానగర్(విజయవాడసెంట్రల్): వాచ్మెన్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గుణదల పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుణదల అయ్యప్పనగర్కు చెందిన బద్దూరి ప్రసాద్(45) అపార్ట్మెంట్లో వాచ్మెన్. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం 5 గంటలకు ప్రసాద్ ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఏలూరు రోడ్డులో కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి ప్రసాద్ కుమార్తె నీలవేణికి ఫోన్ చేసి మధురానగర్ శివాలయం రైవస్కాలువ పక్కన మీ నాన్న ఫిట్స్వచ్చి చనిపోయారని తెలిపారు. దీంతో నీలవేణి తల్లి గౌరికి ఫోన్చేసి సమాచారం తెలియజేశారు. సమాచారం అందుకున్న గౌరి ఘటనాస్థలికి చేరుకుని చూడగా అప్పటికే ప్రసాద్ మృతి చెంది ఉన్నారు. దీంతో గౌరి ఫిర్యాదు మేరకు గుణదల పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టమ్కు పంపించారు. ప్రసాద్కు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని వాటితో చనిపోయి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రైవర్ భార్య దుర్మరణం -
సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల అమలుకు నోచుకోలేదని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ అన్నారు. సంక్షేమ బోర్డును అమలు చేయాలని కోరుతూ ఈ నెల 19న మహాధర్నా జరుగుతుందన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, ఇఫ్టూఆధ్వర్యంలో మహాధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అందడానికి చర్యలు తీసుకుంటామని కూటమి ప్రకటించిందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని తెలిపారు. రాష్ట్రంలో 36 లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో ‘నా వంతు కర్తవ్యంగా కోటి రూపాయలు సంక్షేమ బోర్డుకి’ విరాళం ఇస్తున్నానని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విస్మరించడం కార్మికులను మోసం చేయడమేనని మండి పడ్డారు. కార్యక్రమంలో బీసీడబ్ల్యూ రాష్ట్ర నేతలు జి. హరికృష్ణరెడ్డి, షేక్ మీరావలి, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, ఆసియా బేగం, కనకారావు, మధు, కలాం, అల్లూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు 19న విజయవాడలో మహా ధర్నా ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ -
దేవదాయ భూముల పరిరక్షణకు చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం):జిల్లాలో దేవదాయ, ధర్మదాయ శాఖకు సంబంధించిన ఆలయాల భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో గురువారం దేవదాయ, ధర్మదాయశాఖ, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. తొలుత దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.వెంకటసాంబశివరావు మాట్లాడుతూ పలు దేవాలయాలకు చెందిన భూములకు పట్టాదారు పాస్పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేశారని, కొన్ని పాస్పుస్తకాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అలాగే కొన్ని భూములు రెవెన్యూ 1బీ రికార్డులో పేర్లు నమోదు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో పెదకళ్లేపల్లి దేవాలయానికి సంబంధించిన భూములతో పాటు శ్రీకాకుళం, పెనమలూరు మండలంలోని పలు దేవాలయాలకు చెందిన భూములు ఆక్రమణలకు గురయ్యాయని వీటిని తమ స్వాధీనంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాల్సి ఉందని ఆయన గీతాంజలిశర్మకు వివరించారు. వీటిపై ఆమె మాట్లాడుతూ పాస్పుస్తకాలు ఏయే భూములకు సంబంధించి ఏ తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయో తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ తహసీల్దార్తో వెంటనే మాట్లాడి పాస్పుస్తకాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే 1బి అడంగల్లో పేర్లు నమోదు చేసేలా వారికి ఆదేశాలు ఇస్తామని పేర్కొన్నారు. దేవదాయ భూముల్లో ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు సంబంధిత తహసీల్దార్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఆక్రమణలు తొలగించి భూములు స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవోలు కె.స్వాతి, జి. బాలసుబ్రహ్మణ్యం, హేళాషారోన్ తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ -
మునేరు కాజ్వేపై ప్రమాదం
పెనుగంచిప్రోలు: స్థానిక మునేరు కాజ్వేపై ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన గురువారం చోటు చేసుకుంది. మునేరు అవతల పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్ వస్తుండగా, వెనుక అనిగండ్లపాడు వైపు నుంచి వస్తున్న ఆటో ట్రాక్టర్ను క్రాస్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఆ సమయంలో అదుపు తప్పి ట్రాక్టర్ ఆటోను ఢీకొని మునేరులో పడిపోగా ట్రాక్టర్ కింద వత్సవాయి మండలం దేచుపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పెరుమామిళ్లపల్లి రాజు (43) పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న గన్నవరం దగ్గర దావోజిగూడెంకు చెందిన పాలాది వెంకటేశ్వరరావు మునేరులో పడి గాయాలవ్వగా, ఆటోలో ప్రయాణిస్తున్న పెనుగంచిప్రోలుకు చెందిన బిట్ట తులశమ్మకు గాయాలయ్యాయి . వారిని 108 వాహనంలో పెనుగంచిప్రోలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. మృతి చెందిన రాజును పోస్టుమార్టమ్ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాన్తు చేస్తున్నారు. ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి ఇద్దరికి గాయాలు -
హర్ ఘర్ తిరంగ ప్రచార ర్యాలీ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ’ ప్రచార ర్యాలీ గురవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా జాతీయ జెండాను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వే నిర్మాణంలో సిబ్బంది కృషి ఎనలేనిదని ప్రశంసించారు. డివిజన్ పరిధిలోని స్టేషన్లు, కార్యాలయాలు, సూల్స్లో జాతీయ జెండాలను ప్రదర్శించేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రచారంలో భాగంగా కమర్షియల్ విభాగం వారు విజయవాడ రైల్వేస్టేషన్, డీఆర్ఎం కార్యాలయాలలో సెల్ఫీ బూత్లను సృజనాత్మకంగా ఏర్పాటు చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, స్కూల్ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు. అనంతరం డివిజన్ ఆడిటోరియంలో జరిగిన పేట్రియాటిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో 300 మంది జాక్ అండ్ జిల్, కేంద్రీయ విద్యాలయం, ఐకాన్ స్కూల్ విద్యార్థులు పాల్గొని తమ ప్రదర్శనలతో అందరినీ ఉత్తేజపరిచారు. -
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం
తేలప్రోలు(గన్నవరం): ఇంజనీర్లు తమ శ్రమ, పట్టుదల, మేధస్సుతో దేశాభివృద్ధికి దోహదపడే మంచి ఫలితాలు సాధించాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు పరిధిలోని ఉషారామ కళాశాలలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో నేడు భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భారత్లో ఉన్న యువత ప్రపంచంలోని మరే దేశంలోను లేదన్నారు. అటువంటి యువత దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా మేధస్సుతో పనిచేయాలని సూచించారు. అందుబాటులోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పూర్తి అవగాహన పెంచుకోవాలని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతు నష్టపోతున్నారని, ఇంజినీర్లు వ్యవసాయ రంగంపై దృష్టి సారించాలని కోరారు. మన సాంకేతికతను ఉపయోగించి పంటలు బాగా పండేలా చేయాలని తెలిపారు. ఇంజినీర్లు కేవలం ఉద్యోగాన్వేషణలో ఆగిపోకుండా, ఎవరికి వారు సొంతంగా కాళ్లపై నిలబడేలా పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పారు. చదువుతో పాటు డిగ్రీ సంపాదించడమే కాదు, సంస్కారం, విజ్ఞానం సముపార్జించడం ముఖ్యమన్నారు. ఈ దిశగా గత 16 ఏళ్లుగా మంచి విద్యను బోధిస్తున్న ఉషారామ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, కార్యదర్శి, కరస్పాండెంట్ సుంకర అనిల్, ప్రిన్సిపాల్ జీవీకేఎస్వీ. ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లంక అరుణ్, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు -
ఐటీ చెల్లింపుదారుల సేవలు మెరుగుపర్చాలి
ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ అనిల్కుమార్ లబ్బీపేట(విజయవాడతూర్పు):ఆంధ్రప్రదేశ్– తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఆధాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎం. అనిల్కుమార్ గురువారం విజయవాడలో అధికారిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆదాయపు పన్నుశాఖ అధికారులతో చేపట్టిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడం, సమ్మతి విధానాలు బలోపేతం చేయడం, విభాగ పనితీరును క్రమబద్దీకరించడంపై దృష్టి సారించాలని సూచించారు. వివిధ కీలక పనితీరు సూచికలు, ఆదాయ సేకరణ లక్ష్యాలు, పన్ను చెల్లింపుదారులను చేరుకునే ప్రయత్నాలు, విధాన సంస్కరణల అమలు గురించి చర్చించారు. ఈ విభాగం పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం ప్రాముఖ్యతపై సమీక్షించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని, విజయవాడ ప్రధాన కమిషనర్ జయరామ్ రాయ్పుర, ప్రిన్సిపల్ కమిషనర్ సునీతా బిల్లా, వి.జనార్ధనన్లతో పాటు, ట్యాక్స్ బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దీవుల్లో ఎన్డీఆర్ఎఫ్ అవగాహన సదస్సులు ఎదురుమొండి(నాగాయలంక):జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో మండల పరిధిలోని దీవుల్లో ఎదురుమొండి, నాచాగుంట, ఈలచెట్లదిబ్బ గ్రామాల్లో వరదలు, ఇతర ప్రకృతి విపత్తులపై గురువారం అవగాహన సదస్సులు నిర్వహించారు. కొండపావులూరు (గన్నవరం) నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు నేతృత్వంలో ఆయా గ్రామాల్లో విపత్తులు ముందు జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కలిగించారు. చేపలవేట సమయంలో జాలర్లు పడిపోతే తోటి మత్స్యకారులు ఎలా రక్షించాలనేది, అలాగే నదిలో వరదకు బోట్ బోల్తా పడినపుడు, నది మధ్య లంకల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించాల్సిన తీరుపై ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం డెమో ప్రదర్శించింది. ఈ సందర్భంగా 2300 మంది పేదలకు సింథటిక్ స్లీపింగ్ మ్యాట్స్ పంపిణి చేశారు. తహసీల్దార్ ఆంజనేయప్రసాద్, ఎస్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కిరణ్కుమార్, ఇన్స్పెక్టర్ కమలేశ్సింగ్, నాగాయలంక ఎస్ఐ కలిదిండి రాజేష్, ఆయా గ్రామాల సర్పంచ్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ 11 మందిపై కేసు పెనమలూరు:కానూరులో 300 గజాల పూర్వార్జిత ఇంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు కాజేయటానికి ఏకంగా తహసీల్దార్ గోపాలకృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేయటంతో పోలీసులు 11 మందిపై గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం..... కానూరు గ్రామంలో ఆర్ఎస్ నెంబర్లు 249/3,4,5ఎలో 300 చదరపు గజాల ఇంటి స్థలం ఉంది. తహసీల్దార్ గోపాలకృష్ణ ఎండార్స్ చేసినట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని కొందరు వ్యక్తులు సృష్టించారు. దీంతో పోలుకొండ వెంకటాచలం అనే మహిళ తన మనవడు కౌశిక్కు అనుకూలంగా కంకిపాడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గిఫ్టు డీడ్ (16032/2024) ఇచ్చింది. దీనికి పలువురు వ్యక్తలు సహకరించి ఇంటి స్థలాన్ని అమ్మే యత్నం చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావటంతో తహసీల్దార్ గోపాలకృష్ణ తన సంతకం ఫోర్జరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనకు పాల్పడిన కామోదుల సూరిబాబు, (ఎర్రసూరిబాబు), షేక్.వలి, బోరుగడ్డకుమార్, పోలుకొండ వెంకటాచలం, పోలుకొండ కౌశిక్, బి. వెంకటేశ్వరరావు, వి.లక్ష్మణరావు, వేములపల్లి శ్రీనివాసరావు, పోలుకొండ రాఘవమ్మ, అవనిగడ్డ స్వాతీ, సీవీఎన్ఎస్ సూరిబాబులని పోలీసులు విచారణలో నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. బావిలో గుర్తు తెలియని మృతదేహం పెనమలూరు:పెనమలూరు గ్రామంలోని ఓ బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గ్రామస్తులు చూసి గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం... పెనమలూరు వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న 15 అడుగుల బావిలో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. అయితే గ్రామస్తులు మృతదేహాన్ని చేసి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయటానికి పోలీసులు యత్నిస్తున్నారు. బయటకు తీస్తే మృతుడి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. -
అండర్–22 కృష్ణా జిల్లా హాకీ జట్ల ఎంపిక
గూడూరు:అండర్–22 బాలుర, బాలికల విభాగాలలో కృష్ణా జిల్లా హాకీ జట్ల ఎంపిక గురువారం గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. హాకీ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.రామకృష్ణ, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రవణం హరికృష్ణ, సంయుక్త కార్యదర్శి యోగానంద్, ట్రెజరర్ పి.ఎస్.విఠల్, గూడూరు క్లబ్ కార్యదర్శి పెనుగొండ శ్రీనివాసరావులు, పీడీ మత్తి అరున, పీఈటీ చిలుకోటి రాజేష్ల పర్యవేక్షణలో బాలుర, బాలికల జట్ల ఎంపిక నిర్వహించారు. సెలక్షన్స్ ప్రక్రియను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొరిపర్తి విజయ కుమారి ప్రారంభించారు. జిల్లా జట్లు ఇవే.... బాలికల జట్టు: జె.వనజశ్రీ(కెప్టెన్), ఎం.యజ్ఞశ్రీ(గోల్కీపర్), ఎల్.రమాల్య, పి.లిల్లీ గ్రేస్, పి.సాహిత్య, ఆర్.లాలిత్య, కె.ఇంద్రజ, పి.సంజన, కె.చరిష్మ, ఎం.చేతన శ్రీ, వి.రమ్య, సిహెచ్.నాగజ్యోతి, పి.యశ్విత, ఎం.కావ్యశ్రీ, కె.లైలా, ఏ.ఝాన్సీరాణి, సిహెచ్,కీర్తన, ఎ.నాగసంజనలు ఎంపికవ్వగా స్టాండ్ గర్ల్స్గా టి.కావ్య, టి.కుసుమ భవాని, వి.మోహనాంజలిలను ఎంపిక చేశారు. బాలుర జట్టు: ఎం.భాస్కరరావు (కెప్టెన్), వి.పవన్కుమార్ (గోల్కీపర్), ఎస్.కె.ఆర్యన్, వి.మనోజ్, జి.ఎల్.వీరబాబు, టి.తరుణ్ కుమార్, బి.శివసతీష్ బాబు, ఎస్.భరత్కుమార్, ఎస్.చరణ్, సిహెచ్.వెంకట సాయి, ఎష్.జస్వంత్ కుమార్, పవన్కళ్యాణ్, టి.ఇషాక్, వనసాయి, ఎ.రవితేజ, ఎస్కె.బాష, అబ్దుల్ కరీం, శ్రీనివాస్లు జిల్లా జట్టకు ఎంపికయ్యారు. స్టాండ్ బాయ్స్గా ఎం.ఎఫ్.తన్వీర్, కె.పవన్తేజ, జి.మహిధర్లను ఎంపిక చేశారు. -
ఇతర రాష్ట్రాలకు ధీటుగా రాజధాని నిర్మాణం
గుణదల(విజయవాడ తూర్పు): దేశానికి తలమానికంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి నారాయణ అన్నారు. విజయవాడ భారతీనగర్ నోవోటెల్ హోటల్లో గురువారం గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ – 2025 నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఉంటుందని చెప్పారు. విజయవాడ నగర ప్రతిష్టతను ఇనుమడింప చేసే విధంగా పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. అధునాతన నిర్మాణ శైలిని అనుసరిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటక రంగంలో రాజధాని గుర్తింపు సాధిస్తుందని వెల్లడించారు. అనంతరం గ్రీన్ ఆంధ్రప్రదేశ్ బ్రోచర్ను విడుదల చేశారు. -
గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు
నాకు, నా కుటుంబసభ్యులకు కలిపి సుమారు 30 ఎకరాలు వరకు ఉంది. ఇప్పటికే ఒకసారి పంట ఎండి పోయింది. ప్రస్తుతం నీరు వస్తుంది. ఈ సమయంలో యూరియా వేయాలి. కనీసం ఒక్క కట్ట కూడా ఇవ్వలేదు. ఇప్పటికే రెండు దఫాలుగా యూరియా వచ్చిందన్నారు. ముందుగా బుక్ చేసుకున్నా కూడా ఇవ్వని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. అధికారులు స్పందించి యూరియా అందించేలా చూడాలి. -పుట్టి వెంకమ్మ, మాజీ సర్పంచు, రైతు, మర్రిగుంట, చేవేండ్ర పంచాయతీ -
దసరా ఏర్పాట్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కనకదుర్గనగర్, మహా మండపం, దుర్గాఘాట్ పరిసరాల్లో పర్యటించి దసరా ఉత్సవాల పనులపై ఆలయ అధికారులతో మాట్లాడారు. దసరాపై గత నెల తొలి సమీక్ష సమావేశం నిర్వహించగా, అధికారులు పలు సూచనలు చేశారు. దీంతో గురువారం కలెక్టర్ ఆలయానికి విచ్చేసి కనకదుర్గనగర్ నుంచి మహా మండపం వరకు నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులపై అడిగారు. గోశాల వద్ద లడ్డూ పోటు, మహా మండపం వద్ద నిర్మిస్తున్న అన్నదాన భవనం పనులపై ఆరా తీశారు. దసరా నాటికి పనులు ఏ మేరకు జరుగుతాయి, ఉత్సవాల నేపథ్యంలో ఆయా భవనాల వినియోగంపై ఈవో శీనానాయక్, ఈఈ రాంబాబులను అడిగారు. మహా మండపం దిగువన ప్రసాదాల కౌంటర్లను పరిశీలించే క్రమంలో అక్కడ విక్రయిస్తున్న కవర్లను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కనకదుర్గనగర్, చైనావాల్, రథం సెంటర్ల మధ్య ఆక్రమణలు తొలగించిన తర్వాత చేసిన పనులను కలెక్టర్ పరిశీలించారు. సకాలంలో వైదిక క్రతువులు దసరా ఉత్సవాల్లో అమ్మవారికి జరిగే వైదిక క్రతువులు సకాలంలో జరిగేలా చూడాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. దుర్గగుడి మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్లో గురువారం దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రామచంద్రమోహన్, ఫెస్టివల్ ఆఫీసర్ భ్రమరాంబ, దుర్గగుడి ఈవో శీనానాయక్తో పాటు ఇంజినీరింగ్ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్జిత సేవలపై భక్తులలో అనేక గందరగోళాలు ఉన్నాయని, సేవలకు తగిన ప్రణాళిక ఉండాలని సూచించారు. -
దుర్గమ్మకు కానుకగా బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు గురువారం బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తును కానుకగా సమర్పించారు. బెంజ్సర్కిల్లోని ఆచార్యరంగ నగర్కు చెందిన పోసాని బసవయ్య, మనోహరమ్మ దంపతులు, వారి కుమారుడు ప్రసాదరావు సుమారు 24.7 గ్రాముల బంగారం, నవ రత్నాలతో తయారు చేయించిన ముక్కుపుడక, బొట్టు, నత్తును ఆలయ అధికారులకు అందచేశారు. సుమారు రూ. 3.05 లక్షలతో బంగారు ఆభరణాలను తయారు చేయించినట్లు దాతలు పేర్కొన్నారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.నానో ఎరువులతో బహుళ ప్రయోజనాలువిజయవాడ రూరల్: నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న పీఏసీఎస్ను గురువారం ఆయన సందర్శించారు. రైతులకు ఎరువుల సరఫరా స్థితిగతులను పరిశీలించారు. ఈ పోస్ మెషిన్ పనితీరు పరిశీలించి, అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను తెలుసుకున్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణం, గోదాము తనిఖీ చేశారు. ఫిజికల్, ఆన్లైన్ రికార్డులు పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక తదితరులు ఉన్నారు.ముగిసిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలుగన్నవరం: కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో గురువారం కృష్ణాజిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–19 బాల, బాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు జరిగాయి. సెలక్షన్స్కు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాలిబాలికలు హాజరయ్యారు. తొలుత పోటీలను జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ అధికారి కె.ఝాన్సీలక్ష్మి ప్రారంభించారు. అనంతరం బాల, బాలికల విభాగాల్లో వేర్వేరుగా పోటీలు నిర్వహించి క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. వీరు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఝాన్సీలక్ష్మి తెలిపారు. పోటీలను కేవీఆర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కేవీఆర్ కిషోర్ పర్యవేక్షించారు. వ్యాయామ ఉపాధ్యాయులు రామారావు, బాలకృష్ణ, చంద్రశేఖర్, నాగరాజు, శాంతికిరణ్, రాంబాబు ఎంపికలు చేశారు.పేద విద్యార్థుల ఆకలి తీర్చండిరాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్రెడ్డిచిలకలపూడి(మచిలీపట్నం): విద్యార్థులందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయప్రతాప్రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లాలో బుధ, గురువారాల్లో ఆయన వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఆయన మచిలీపట్నంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత ఆహారం ఎలా విద్యార్థులు, పిల్లలకు అందిస్తున్నారో దాన్ని పర్యవేక్షించేందుకే ఆహార కమిషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో అందుతున్న ఆహార పదార్థాలను వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఎలా వినియోగిస్తున్నారో పరిశీలించామని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు అందుతున్నాయో లేదో ఆరా తీశామన్నారు. ప్రస్తుతం వసతి గృహాల్లో సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నారని, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా సన్నబియ్యం అందజేస్తే బాలలకు పౌష్టికాహారం అందించిన వారమవుతామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. విద్యార్థులు, బాలలకు ఎటువంటి ఆహార లోపాలు ఉన్నా ఫుడ్ కమిషన్ నంబర్ 94905 51117కు వాట్సాప్ ద్వారా సమాచారం అందివచ్చని చెప్పారు. సమావేశంలో డీఎస్వో జి.మోహన్బాబు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహెద్బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
యూరియా దొరక్క ఇక్కట్లు!
పెడన: పీఏసీఎస్ల పరిధిలోని కూటమి నాయకులు వచ్చిన యూరియా కట్టలను గద్దల్లా తన్నుకుపోతున్నారు. పీఏసీఎస్ల సిబ్బంది చేసేదేమీ లేక చూస్తూ మిన్నకుండిపోతున్నారు. కనీసం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకురాకపోవడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెడన మండలంలో యూరియా దొరక్క రైతులు రోజు రోజుకు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్లు ద్వారా ఇప్పటికే ముందుగా బుక్ చేసుకున్న వారికి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. చేవేండ్ర పీఏసీస్ పరిధిలో యూరియా కట్టలు రావడతో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడొకరు సుమారు 70 యూరియా కట్టలను ట్రాక్టరులో వేసుకుపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇది గ్రామంలో తీవ్రస్థాయిలో చర్చనీయాంశ మైంది. ఇలా చేయడం చాలా దారుణమని వాపోతున్నారు. అధికారులు సైతం చూిసీచూడనట్లుగా వ్యవహరించడం చాలా అన్యాయమని, రైతులందరికి సమన్యాయంగా యూరియా అందించాల్సిన బాధ్యత లేకుండా నడుచుకోవడం పట్ల పరిస్థితి మరింత చేయిదాటే ప్రమాదం ఉందన్నారు. బయట మార్కెట్లో గుళికలతో.... బయట మార్కెట్లో గుళికలు కూడా కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామనే వాదనను ఎరువుల దుకాణాల వారు స్పష్టం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో రూ.200 పెట్టి యూరియా కొంటే రూ.600 పెట్టి గుళికలు కొనుగోలు చేయాల్సి వస్తుందని, ప్రస్తుతం గుళికలతో పని లేదని, అయినా అంటగడుతుండటంతో బయట యూరియా కొనుగోలు చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎరువుల దుకాణంలో ఆ పరిస్థితి ఉంటే పీఏసీఎస్లలో మరింత దారుణంగా ఉందని పేర్కొంటున్నారు. పీఏసీఎస్లలో రుణం తీసుకున్న వారికి మాత్రమే యూరియా ఇస్తామని పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణాలు పొందిన వారికి యూరియా కట్టలు దొరకడం లేదని, రెండు దఫాలుగా చేవేండ్ర పీఏసీఎస్కు 800 కట్టలు వచ్చినా ఇవ్వలేదంటూ పలువురు రైతులు వాపోతున్నారు. గద్దల్లా తన్నుకుపోతున్న టీడీపీ నాయకులు రుణాలు తీసుకున్న వారికే కట్టాలంటూ మెలిక బయట మార్కెట్లో గుళికలతో లింకు నో స్టాక్ అంటున్న ఎరువుల దుకాణాలు పక్కాగా పంపిణీ చేస్తున్నాం చేవేండ్ర పీఏసీఎస్ పరిధిలో 70 కట్టలు ఒకరే తీసుకుపోయారనే విషయం వాస్తవం కాదు. విచారణ చేశాం. చేవేండ్ర పీఏసీఎస్కు యూరియా కట్టలు రావడంతో రైతులు అధిక సంఖ్యలో వచ్చారు. రాత్రి కావడంతో తాళాలు వేసేందుకు సిద్ధం అవ్వగా ఆ వ్యక్తి వచ్చి రైతుల పేర్లు నమోదు చేసుకుని అందజేశారు. దానిని కావాలని కొందరు వక్రీకరించారు. అంతా పక్కాగా పంపిణీ చేస్తున్నారు. అయితే తీసుకువెళ్లిన వారే మళ్లీ మళ్లీ వచ్చి తీసుకుపోతున్నారు. – ఎస్.జెన్నీ, ఏవో, పెడన మండలం -
నేడు వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, వరలక్ష్మీదేవి అలంకారం, విశేష పూజలు, బాలభోగ నివేదన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆది దంపతులతో పాటు ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో దేవతామూర్తులకు పవిత్రాలధారణ జరుగుతుంది. అనంతరం ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని ఏకాంత సేవగా చేస్తారు. నేటి నుంచి పవిత్రోత్సవాలు ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వరలక్ష్మీదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయాన్ని వివిధ పుష్పాలతో అలంకరించనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై మూడు రోజులు పవిత్రోత్సవాలు ఉదయం 9.30 గంటల తర్వాతే అమ్మవారి దర్శనం -
ఒక్క కట్ట కూడా ఇవ్వలేదు
చేవేండ్ర పీఏసీఎస్లో రూ.16 లక్షలు రుణం తీసుకున్నా. రుణం తీసుకున్న వారికే యూరియా కట్టలు ఇస్తామన్నారు. ఉదయమే వచ్చా. అయినా ఒక కట్ట కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా చూడలేదు. నాకు, నా కుటుంబసభ్యులందరికీ కలిపి 15 ఎకరాలున్నాయి. యూరియా కొట్టకపోతే పంటకు బలం రాదు. బయట కొందామంటే గుళికలకు లింకు పెడుతున్నారు. ప్రస్తుతం గుళికలతో పని లేదు. యూరియా మాత్రమే కొట్టాలి కాబట్టి పీఏసీఎస్లో తీసుకువెళ్లడానికి వచ్చా. -గంగుమోలు వెంకటేశ్వరరావు, రైతు, మర్రిగుంట, చేవేండ్ర పంచాయతీ ●