breaking news
Krishna District Latest News
-
వేర్వేరు చోట్ల గుర్తు తెలియని రెండు మృతదేహాలు లభ్యం
కృష్ణలంకలో కలకలం కృష్ణలంక(విజయవాడతూర్పు): వేర్వేరు చోట్ల గుర్తు తెలియని రెండు మృతదేహాలు లభ్యమైన ఘటన కృష్ణలంక ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణలంక 22వ డివిజన్లోని సత్యంగారి హోటల్ సెంటర్లో పాత పోస్టాఫీస్ రోడ్డు మొదట్లో నిచ్చెనల తయారీ వెనుక వైపు ఒక పురుష మృతదేహం ఉన్నట్లు శుక్రవారం ఉదయం 10 గంటలకు సమాచారం అందింది. పాత పోస్టాఫీస్ రోడ్డు ఎదురుగా హైవే వెంట కర్మల భవన్ పక్కన ఉన్న బస్టాప్లో మరో మగ మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలను పరిశీలించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. పాత పోస్టాఫీస్ రోడ్డు మొదట్లో ఉన్న మృతదేహం పక్కన ఒక కవర్లో మద్యం క్వార్టర్ బాటిల్, డబ్బులు, సిగరెట్ పెట్టె ఉన్నాయి. గురువారం రాత్రి పక్కనే ఉన్న వైన్ షాపులో మద్యం క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి సేవించడానికి అక్కడ కూర్చొని ఉండవచ్చని, గుండెపోటు రావడంతో మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బస్టాప్ వద్ద మృతదేహం కుళ్లి దుర్వాసన వస్తుండటంతో రెండు రోజుల క్రితం మృతి చెంది ఉండొచ్చని తెలిపారు. స్థానికులను విచారణ చేసి మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు యాచకులుగా పోలీసులు నిర్ధారించారు. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని నగరపాలక సంస్థ సిబ్బందికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తజన కోలాహలం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం, మార్గశిర అమావాస్య నేపథ్యంలో ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, చండీహోమం, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన సేవ జరిగాయి. నూతన యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో 201 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ.300, రూ.500 క్యూలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమావాస్య నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. సాయంత్రం అమ్మవారికి దర్బారు సేవ, పల్లకీ సేవ, పంచహారతుల సేవలను నిర్వహించారు. రేపు హిందూ ఆత్మీయ సమ్మేళనం లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలో ఎన్టీఆర్ కాలనీ 4వ లైన్లోని మలినేని నాగేశ్వరరావు గ్రంథాలయ హాలులో ఈ నెల 21వ తేదీ హిందూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆ కాలనీ బస్తీ ప్రతినిధి తరుణ్ కాకాని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యఅతిథిగా తాడేపల్లిలోని శివకేశవ పీఠం సంస్థాపక అధ్యక్షుడు మాతా శివానంద సరస్వతి, ముఖ్యవక్తగా ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రాంత కార్యకారిణి సదస్యులు పాకాల త్రినాథ్ హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. హిందువులు కుటుంబ సమేతంగా ఉదయం 8.30 గంటలకు జరిగే సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో ప్రయోగాత్మక స్టాపేజ్ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు రైల్వే మంత్రిత్వశాఖ మచిలీపట్నం–విశాఖపట్నం, విశాఖపట్నం– కడప రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్లో ప్రయోగాత్మకంగా స్టాపేజ్ ఇచ్చింది. మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైలు అర్ధరాత్రి 1.13 గంటలకు కొవ్వూరు చేరుకుని 1.15 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైలు మధ్యరాత్రి 1.23 గంటలకు చేరుకుని, 1.25 గంటలకు బయలుదేరుతుంది. విశాఖపట్నం–కడప (18521) సాయంత్రం 5.23 గంటలకు కొవ్వూరు చేరుకుని, 5.25 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో కడప–విశాఖపట్నం (18522) ఉదయం 5.04 గంటలకు కొవ్వూరు చేరుకుని, 5.05 గంటలకు బయలుదేరుతుంది. 22న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మచిలీపట్నంఅర్బన్: జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ – 2025 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా సైన్స్ అధికారి మొహమ్మద్ జాకీర్ అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 25 మండలాల్లో ముందుగా మండల స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలు నిర్వహించామని తెలిపారు. మండల స్థాయిలో నిర్దేశించిన ఏడు థీమ్లలో ప్రథమ స్థానంలో నిలిచిన ఏడుగురు విద్యార్థులు, ఉపాధ్యాయ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఒక ఉపాధ్యాయుడిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రతి మండలం నుంచి ఎనిమిది చొప్పున మొత్తం 200 ప్రదర్శనలు ఉంటాయన్నారు. వాటినుంచి అత్యుత్తమంగా ఎంపికయ్యే 11 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపిక చేస్తామని తెలిపారు. డివైడర్ ఎక్కి బోల్తా కొట్టిన కారు కృష్ణలంక(విజయవాడ తూర్పు): డివైడర్ ఎక్కి కారు బోల్తా కొట్టిన ఘటన కనకదుర్గ వారధి ఫ్లై ఓవర్ వద్ద జరిగింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు జి.కొండూరుకు చెందిన నాగభూషణం కారు డ్రైవర్. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అతను మైలవరంలో సమీప బంధువులైన ఇద్దరు మహిళలను కారులో ఎక్కించుకుని కంకిపాడులో శుభకార్యానికి వెళ్లారు. అతను అక్కడే మద్యం సేవించాడు. తిరిగి సాయంత్రం బంధువులను కారులో ఎక్కించుకుని బెంజిసర్కిల్ నుంచి కృష్ణలంక హైవే మీదుగా మైలవరం బయలుదేరాడు. సుమారు సాయంత్రం 6.30 గంటలకు రాణిగారితోటలోని కోదండ రామాలయం సమీపానికి చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న అతను గుంటూరు వైపునకు వెళ్లే ప్లైఓవర్పైకి వెళ్లి డివైడర్ను ఎక్కించాడు. కారు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు సీట్బెల్టు ధరించడంతో చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును పక్కకు తీసి వివరాలు సేకరించారు. అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
నకిలీ సిగరెట్ల దందా!
● ఉమ్మడి జిల్లాలో జోరుగా అమ్మకాలు ● లక్షలాది రూపాయల పన్నులు ఎగవేత ● తెలిసినా పట్టించుకోని వాణిజ్యపన్నులశాఖ! ● ఇటీవల వివిధ ప్రాంతాల్లోని ట్రాన్స్ పోర్ట్లో దొరికిన సిగరెట్ల లోడ్లు ● కోటిన్నరకు పైగా సరుకును సీజ్ చేసినట్లు ప్రచారం ● నామమాత్ర జరిమానాతో సరి వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా జోరుగా సాగుతోంది. బెజవాడ కేంద్రంగా అక్రమ పద్ధతుల్లో సిగరెట్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారం మేరకు ట్రాన్స్పోర్టుల్లో దాడి చేసి భారీగా సరుకును స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. దాడుల్లో భారీగా దొరికిన సిగరెట్ల లోడు కొందరు అక్రమార్కులు వివిధ పద్ధతుల్లో విదేశీ సిగరెట్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో తయారయ్యే నకిలీ సిగరెట్లను బెజవాడకు తీసుకువస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని విజయవాడ డివిజన్–1, విజయవాడ డివిజన్–2, విజయవాడ డివిజన్–3 పరిఽధిల్లోని వివిధ ట్రాన్స్పోర్టుల్లో ఇటీవల అధికారులు తనిఖీలు చేశారు. విజయవాడ డివిజన్–1 పరిధిలో భవానీపురం, గొల్లపూడి ప్రాంతాల్లోని ట్రాన్స్పోర్టుల్లో, విజయవాడ డివిజన్–2 పరిధిలోని రాజారంగయ్యప్పారావు వీధిలోని మరో ట్రాన్స్పోర్టులో, విజయవాడ డివిజన్–3 పరిధిలోని తోట్లవల్లూరు రోడ్డులో ఉన్న మరో ట్రాన్స్పోర్టులో భారీగా నకిలీ, విదేశీ సిగరెట్లను భారీ లోడులను స్వాధీనం చేసుకున్నారు. విచ్చలవిడిగా.. ఉత్తరాది రాష్ట్రాల నుంచి, నేపాల్ వంటి దేశాల నుంచి నకిలీ కంపెనీల సిగరెట్లను నగరానికి తీసుకొచ్చి ఇక్కడ దుకాణాలకు అక్రమార్కులు విక్రయిస్తున్నారని విజిలెన్స్ విభాగంలో గతంలో పని చేసిన అధికారులు చెబుతున్నారు. సాధారణ కంపెనీల సిగరెట్లతో పాటుగా వీటిని ఆయా కంపెనీల రకాలతో కలిపి విక్రయిస్తుండటంతో చిరువ్యాపారులకు సైతం తెలియకుండా ఇవి వినియోగదారులకు చేరిపోతున్నాయి. దాడుల్లో తప్ప.. మామూలుగా పట్టుకోవడం లేదు ఏడాది క్రితం రామవరప్పాడులోని ఒక గోడౌన్లో ఉంచిన సుమారు రెండు కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను కేంద్ర ప్రభుత్వ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని సెంట్రల్ జీఎస్టీ అధికారులు, కస్టమ్స్ కమిషనరేట్ సిబ్బంది ఆ సరుకును స్వాధీనం చేసుకొని గుంటూరు తరలించారు. తాజాగా వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయా ట్రాన్స్పోర్టులపై దాడులు చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆయా డివిజన్లు, సర్కిల్ పరిధుల్లో ఉన్న అధికారులకు ఎవరు ఎటువంటి వ్యాపారాలను నిర్వహిస్తున్నారన్నది స్పష్టంగా తెలిసినా ఆ వైపుగా దృష్టి పెట్టడం లేదు. వారి నుంచి వచ్చే ముడుపుల కారణంగానే అధికారులు, సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జరిమానాలపై సర్వత్రా అనుమానాలు ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరిగిన తనిఖీల్లో సుమారుగా కోటిన్నరకు పైగా సిగరెట్ల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. సాధారణంగా బయట దేశాల నుంచి వచ్చే సిగరెట్లపై 28 శాతం పన్ను శాతంగా నివేదికలు చెబుతున్నాయి. దాని ప్రకారం దొరికిన సరుకుకు సుమారుగా పన్ను, జరిమానా కలిపి మొత్తం సుమారుగా కోటి వరకూ ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ కేవలం నామమాత్రంగా పన్ను, జరిమానాలను చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ సంబంధిత వ్యక్తికి నోటీస్లు జారీ చేసింది. అయితే దానికి సైతం అతను కట్టనంటూ ఎదురుతిరిగినట్లు సమాచారం. తొలుత భారీగా సరుకు పట్టుకున్నామని ప్రచారం జరగటం, తరువాత నామమాత్రంగా జరిమానా విధించటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అధికారుల కన్నుసన్నల్లోనే ఈ అక్రమ దందాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నాయని ఒకరిద్దరు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. సిగరెట్ల దందాపై దృష్టి పెడుతున్నాం సిగరెట్ల విక్రయాలు చేసే వ్యక్తులపై దృష్టి పెడుతున్నాం. కొంతమంది ఎన్నిసార్లు దొరికినా తిరిగి ఇదే వ్యాపారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై మా అధికారులను అప్రమత్తం చేస్తాం. అడ్డదారుల్లో నగరానికి వచ్చే సిగరెట్లను పట్టుకోవటానికి చర్యలు చేపడుతున్నాం. రానున్న కాలంలో ఈ దాడులను ఉధృతం చేస్తాం. –ప్రశాంత్కుమార్, జాయింట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, విజయవాడ డివిజన్–1 -
డీఆర్ఎం కప్ టోర్నమెంట్ ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో తొమ్మిదవ డీఆర్ఎం కప్ ఇంటర్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ మీట్–2025 విజయవాడ రైల్వే స్టేడియం, రాయనపాడు వ్యాగన్ వర్కుషాపులో ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి డీఆర్ఎం, దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహిత్ సోనాకియా రాయనపాడు చీఫ్ వర్క్షాపు మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఏడీఆర్ఎంలు కొండా శ్రీనివాసరావు, పీఈ ఎడ్విన్, డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్, సీనియర్ డీఓఎం ఎం.దినేష్కుమార్తో కలసి పోటీలను ప్రారంభించారు. పురుషులకు క్రికెట్, వాలీబాల్, మహిళలకు త్రోబాల్, టెన్నికాయిట్, 50 ఏళ్ల లోపు, పైబడిన కేటగిరిలో పురుషులు, మహిళలకు అథ్లెటిక్స్లో 100 మీటరు 200 మీటర్లు లాంగ్ జంప్, షాట్ఫుట్లలో ఉద్యోగులు పోటీపడనున్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 200 మంది మహిళా ఉద్యోగులు మొదటి సారిగా పోటీల్లో పాల్గొనడం లింగ వివక్షలేని సమాజానికి నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు. ఇటువంటి క్రీడలు ఉద్యోగుల్లో ఐక్యత, సమాన అవకాశాలను ప్రోత్సహించడంలో డివిజన్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. గత ఏడాదిలో డివిజన్లోని 15 విభాగాల నుంచి 240 మంది ఉద్యోగులు పాల్గొనగా, ఈ ఏడాది 17 విభాగాల నుంచి 650 మంది ఉద్యోగులు పాల్గొనేందుకు ముందుకు రావడం శుభపరిణామన్నారు. ఈ పెరుగుదల రైల్వే ఉద్యోగుల్లో క్రీడలు, ఫిట్నెస్, జట్టు సమష్టి కృషి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
గాంధీ పేరును తొలగించడం దుర్మార్గం
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహాత్మాగాంధీ పేరుతో ఉన్న వాటిని బీజేపీ కూటమి ప్రభుత్వం తొలగించడం సరికాదని వైఎస్సార్ సీపీ ట్రేడ్యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యనారాయణపురం భగత్సింగ్రోడ్డులోని వైఎస్సార్ సీపీ ట్రేడ్యూనియన్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్(వీబీ–జీ రామ్ జీ )గా మార్చడం దుర్మార్గం అన్నారు. బీజేపీ కూటమి జాతిపిత మహాత్మా గాంధీజీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బీజేపీ, కూటమి నాయకుల్లో గాడ్సే రక్తం ప్రవహిస్తోందన్నారు. కార్మిక చట్టాలను విస్మరిస్తున్నారు కార్మిక వర్గాలపై కూటమి ప్రభుత్వం సిగ్గుమాలిన పనులు చేస్తోందని.. కార్మిక చట్టాల్ని విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంట్లో ఈ విధానం తప్పని తెలిపారని.. టీడీపీ ఎంపీలు నోరు మెదపలేదని దుయ్యబట్టారు. ఉపాధిపై చంద్రబాబు ఎందుకు చర్చించడం లేదు ప్రతివారం జోలె పట్టుకొని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వందల కోట్లు తెచ్చుకుంటున్నారన్నారు. చంద్రబాబు గ్రామీణ ఉపాధి పథకం గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. కార్మిక వర్గాల జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నారని.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. గ్రామీణ ఉపాధి పథకం తీసి వేస్తే వారికి నిరుద్యోగ భృతి ఇస్తారా అని ప్రశ్నించారు. కార్మికుల హక్కులు కాలరాస్తే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగలై 12 గంటల పని విధానం తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికులందరికీ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అండగా ఉంటుందని గౌతంరెడ్డి హామీ ఇచ్చారు. -
ఎస్జీ అండర్–17 క్రికెట్ చాంపియన్ విశాఖపట్నం
విజయవాడరూరల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్న జెడ్పీ హైస్కూల్ ఆధ్వర్యాన మూడు రోజులపాటు గ్రీన్ఫీల్డ్ మైదానంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ అండర్–17 బాలుర క్రికెట్ చాంపియన్షిప్ను విశాఖపట్నం జిల్లా జట్టు కై వసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో విశాఖ జట్టు శ్రీకాకుళంపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు రోజులపాటు 13 జిల్లాల నుంచి జట్లు పాల్గొనగా శుక్రవారం టోర్నమెంట్ ముగిసింది. టైటిల్ పోరులో విశాఖపట్నం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచు కుంది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. కెప్టెన్ అవినాష్ కేవలం 19 బంతుల్లోనే ఆరు ఫోర్లు, భారీ సికర్స్తో 39 పరుగులు చేశాడు. శ్రీకాకుళం బౌలర్ సాహిల్ క్రమశిక్షణతో బౌలింగ్ చేసి పరుగుల ప్రవాహాన్ని నియంత్రించాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జట్టు విశాఖ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆరు వికెట్ల నష్టానికి 71 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ జోగేంద్ర 22 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. విశాఖపట్నం బౌలర్లు శ్రీరామాంజనేయులు, సాకేత్ అద్భుతంగా రాణించి చెరో రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కార్యదర్శి, కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చాంపియన్స్ విశాఖపట్నం, రన్నరప్ శ్రీకాకుళం, మూడవ స్థానంలో నిలిచిన తూర్పు గోదావరి జిల్లాకు ట్రోఫీలను అందజేశారు. ప్రిన్సిపాల్ ఎన్.గోపాలకృష్ణ, టోర్నమెంట్ పరిశీలకుడు వి.భూపాల్రెడ్డి, స్కూల్ గేమ్స్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, కృష్ణా జిల్లా కార్యదర్శి గంపా రాంబాబు, ఎంపిక కమిటీ సభ్యులు వ్యక్తిగత పతకాలు అందజేశారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెరిగే దిశగా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గుణదలలోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఆవరణలో ఏర్పాటైన రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలిపారు. సిద్ధాంత పరమైన సమస్యల పరిష్కారానికి ఆలోచనా సామర్థ్యం పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉండే ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించేందుకు వీలవుతుందన్నారు. ఆధునిక ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అందరూ విజేతలే.. కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. ఈశ్వర్ మాట్లాడుతూ ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వాములైన విద్యార్థులంతా విజేతలేనని తెలిపారు. ఈ ప్రదర్శనలో సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, హరిత ఇంధనం, గణిత వినోదం, జల వనరుల నిర్వహణ, వంటి అంశాలను ప్రదర్శించారన్నారు. డీఈఓ ఎల్. చంద్రకళ, పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ వరప్రసాద్, ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ రాంబాబు, పాఠశాల హెచ్ఎం సిస్టర్ షైనీ థామస్ తదితరులు పాల్గొన్నారు. -
దళారులకే సం‘పత్తి’!
కంచికచర్ల: చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అధికారుల నిర్వాకంతో పత్తి రైతులు దళారీల చేతుల్లో నలిగిపోతున్నారు. సీసీఐ పంట కొనుగోలు చేస్తుందని ఊదరగొట్టినా.. చివరికి దళారీలదే పెత్తనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు సీసీఐ కూడా దళారీలకే మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్భాటంగా ప్రారంభం.. ఎన్టీఆర్ జిల్లాలో రైతులు 87,908 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. అయితే మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కొంత మేర పత్తి పంట దెబ్బతింది. గతంలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే ఈ ఏడాది 5 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చిందని రైతులు అంటున్నారు. పత్తిని కొనుగోలు చేసేందుకు చంద్రబాబు సర్కారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను సంప్రదించింది. ఎన్టీఆర్ జిల్లాలో ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఆర్భాటంగా ప్రారంభించింది. అధికార పార్టీ నాయకులు కూడా దళారుల వద్ద అమ్ముకోవద్దని సీసీఐ ద్వారా పత్తిని విక్రయించాలని రైతులకు చెబుతూ వచ్చారు. కనీస మద్దతు ధరను క్వింటాకు నాణ్యతను బట్టి రూ. 7,710 నుంచి రూ.8,110గా ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ఒక్క దానిలో కూడా పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం లేదు. దళారుల సహకారంతో పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేయించి సీసీఐ అధికారులు లబ్ధి పొందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సీసీఐ, దళారుల మిలాకత్! కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయకపోవటంపై సీసీఐ అధికారులు హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన పత్తిని గుంటూరులోని మిల్లుల వద్దకు రవాణా చేసేందుకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ టెండర్లు పిలిచామని, ఆ టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవటంతో పత్తిని కొనుగోలు చేయలేక పోతున్నామని కుంటి సాకులు చెబుతున్నారు. కాలయాపన చేస్తూ రైతులను అసహానికి గురిచేస్తూ దళారులను రైతులు ఆశ్రయించేలా చేస్తున్నారు. దళారుల నుంచి పత్తి కొనుగోలు చేయటం ద్వారా సీసీఐ అధికారులు మాత్రం ట్రాన్స్పోర్టు కిరాయిని దోచుకుంటున్నారు. ఇప్పటికే రైతుల వద్ద ఉన్న పత్తికి దళారులు క్వింటాకు రూ. 4వేల నుంచి రూ.4,500 లోపు కొంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినా.. తమ పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కంచికచర్లకు చెందిన ప్రజా ప్రతినిధులు, రైతులు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడిని ఇటీవల కలిశారు. కానీ నేటికీ రైతుల నుంచి ప్రభుత్వం కాని, సీసీఐ అధికారులు కాని కొనుగోలు చేయలేదని రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
ఆత్మస్తుతి.. పరనింద!
మొక్కుబడిగా డీఆర్సీ సమావేశం చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా సమీక్ష సమావేశం మొక్కుబడిగా సాగింది. గంటా నలభై నిమిషాలు ఆలస్యంగా వచ్చిన మంత్రులు.. ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహనానికి పరీక్ష పెట్టారు. సమావేశం ప్రారంభమైన తర్వాత కూడా జరగాల్సిన విధంగా జరగలేదు.. తూతూ మంత్రంగానే సాగింది. అంతా ఆత్మస్తుతి, పరనింద అన్న చందంగా సాగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాల కారణంగా తలెత్తుతున్న సమస్యలను సైతం గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ.. తాము చేసేదే గొప్ప అన్నట్లుగా సమావేశం నడిచిందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో శుక్రవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి 2 గంటలకు హాజరు కావాల్సిన మంత్రి వాసంశెట్టి, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి 3.40 గంటలకు వచ్చారు. దీనిపై అవనిగడ్డ ఎమ్మెల్యే(జనసేన) మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహిస్తే పరిపూర్ణంగా నిర్వహించాలని.. లేకుంటే మరో రోజుకు వాయిదా వేయాలని, ఇలా చేస్తే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ నుంచి విజయవాడ కరకట్ట రోడ్డు పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. మిల్లర్ల జోక్యాన్ని నివారించండి.. అనంతరం వ్యవసాయ అనుబంధ శాఖలపై చర్చ ప్రారంభంకావటంతో మంత్రి సుభాష్ మాట్లాడుతూ మోంథా తుపానును సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. రాబోయే వేసవి కాలం నాటికి ఇసుకను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని దీని ద్వారా ఇళ్ల నిర్మాణం, భవన నిర్మాణ కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు రూ. 8కోట్ల నిధులు జిల్లా పరిషత్కు కేటాయించారని జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఆర్డర్లు తమకు వచ్చాయని కృష్ణాజిల్లాకు సంబంధించి ఆర్డర్లు రాలేదని వివరించారు. అయినప్పటికీ కృష్ణాజిల్లాకు సంబంధించిన నిధులను బట్టి కేటాయించిన పనులకు సంబంధించిన ఫైలు తాము తిరస్కరించామని పత్రికల్లో సీఈవో కన్నమనాయుడు తనపై వార్తలు రాయిస్తున్నారని మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా గత సర్వసభ్య సమావేశంలో జరిగిన సంఘటనను బట్టి కలెక్టర్ ఇచ్చిన హామీని కూడా లెక్క చేయకుండా మరలా 205 పనులు రద్దు చేస్తూ తనకు లేఖ రాశారని చెప్పారు. పనులు ప్రారంభమైనవి కూడా ప్రారంభం కాన్నట్లుగా చూపుతున్నారని.. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఆమె కోరారు. -
పరిశ్రమల కల్పనపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఆయన చాంబర్లో జేసీ కలెక్టర్ ఎం. నవీన్తో కలిసి పరిశ్రమల పురోగతిపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీఐఐసీ ద్వారా రెండేళ్లలోపు మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొంది ఇంకా యూనిట్లను ప్రారంభించని దాదాపు 400 మంది పారిశ్రామికవేత్తల జాబితా తయారుచేసి వారి యూనిట్లు వెంటనే నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 30న సమావేశం నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కరించాలన్నారు. ఇంకనూ పరిశ్రమలు నెలకొల్పని వారికి ఎందుకు వాటిని రద్దు పరచకూడదో తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర పథకాల అమలుపై అసంతృప్తి.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ పథకాల అమలులో పురోగతి సరిగా లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద బ్యాంకులలో 39 దరఖాస్తులు ఎటువంటి పురోగతి లేకుండా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని వెంట నే పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖర్, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు స్వాతి, జి. బాలసుబ్రహ్మణ్యం, బీఎస్ హేలా షారోన్, డీఆర్డీఏ పీపీడీ శివప్రసాద్, డ్వామా పీడీ హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
వీఆర్వోల సమస్యల పరిష్కారానికి డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు కోరారు. శుక్రవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న అర్హులైన గ్రేడ్–1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. వన్ టైం సెటిల్మెంట్ కింద రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అర్హులతో భర్తీ చేయాలన్నారు. అర్హులైన గ్రేడ్–2 వీఆర్వోలకు గ్రేడ్ –1, వీఆర్వోలుగా వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్వోలు అందరికీ కామన్ డీడీఓగా తహసీల్దార్లు ఉండేలాగా ఆదేశానివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకే డిపార్ట్మెంట్ కింద.. వీఆర్వోలు అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తారని, ఇతర శాఖల అధికారులు జారీ చేసిన ఆదేశాలు పాటించడం సాధ్యం కాదని రవీంద్రరాజు అన్నారు. బయోమెట్రిక్ విషయంలోనూ జీఎస్డబ్ల్యూ అధికారులు జారీ చేసిన ఆదేశాలు అమలు సాధ్యం కాదన్నారు. వీఆర్వోలు ఈ–ఆఫీసు ద్వారా ఫైల్స్ పంపేందుకు వీలుగా కంప్యూటర్ సౌకర్యం కల్పించాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో వీఆర్వోల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆర్టీజీఎస్ అధికారులు చేస్తున్న చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఏపీ గవర్నమెంట్ రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటు చేసి పనిచేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి మౌళి భాష, గ్రామ సహాయకుల రాష్ట్ర జేఏసీ చైర్మన్ పెద్దన్న, డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర నాయకులు, గ్రేటు–2 వీఆర్వో అసోసియేషన్ నాయకులు శ్యామ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో దేవదాయ శాఖ మంత్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు, చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రా లను బహూకరించారు. అనంతరం ఈవో చాంబర్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో చర్చించారు. భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లు, దేవస్థానంలో ఇటీవల చేపట్టిన మార్పులు, అదనపు కౌంటర్లు, ఆన్లైన్ సేవల గురించి అధికారులు వివరించారు. కార్యక్ర మంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీక్ష విరమణల సమయంలో తయారు చేసిన లడ్డూలను శుక్రవారం కూడా దేవస్థానం ఉచితంగా పంపిణీ చేసింది. గురు, శుక్రవారాలలో మొత్తం 1.30 లక్షల లడ్డూలను ఉచితంగా పంపిణీ చేసినట్లు దేవస్థాన అధికారులు, చైర్మన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవానీ దీక్ష విరమణల నిమిత్తం మొత్తం 28.08 లక్షల లడ్డూలను తయారు చేయగా, 24.49 లక్షల లడ్డూలను విక్రయించినట్లు అధికారులు పేర్కొన్నారు. దేవస్థానం వద్ద 4.61 లక్షల లడ్డూల స్టాక్ ఉండగా, వాటిలో 3.32లక్షల లడ్డూలను విక్రయం నిమిత్తం కౌంటర్లలో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మిగిలిన 1.30లక్షల లడ్డూలను ఉచిత ప్రసాద వితరణ బదులుగా గురు, శుక్రవారాల్లో ఆలయ ప్రాంగణంలోని వేరు వేరు ప్రదేశాల్లో భక్తులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిఽధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విశాఖపట్నం గాజువాకకు చెందిన పీతల సునీల్కుమార్ కుటుంబం రూ. లక్ష, ప్రకాశం జిల్లా పుల్లెల చెరువుకు చెందిన టి. బ్రహ్మానందరెడ్డి కుటుంబం టి. కోటిరెడ్డి పేరిట రూ. 1,01,116, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కొండిశెట్టి వెంకట విఠల్ భాస్కర్ తన కుటుంబ సభ్యులైన కె. సత్యనారాయణమ్మ, అంజయ్య ల పేరిట రూ. 1,00,116 విరాళాన్ని అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పక డ్బందీ ఏర్పాట్లతో విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 966 పోలియో బూత్ల పరిధిలో దాదాపు 2,48,900 మంది సున్నా నుంచి అయిదేళ్లలోపు పిల్లలు లక్ష్యంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, ప్రజా రవాణా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులు కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. 611 గ్రామీణ బూత్లు, 355 అర్బన్ బూత్లు, 71 మొబైల్ బృందాలు, 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా బృందాలు సేవలందిస్తాయన్నారు. 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే.. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని కలెక్టర్ చెప్పారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా అధికారులు చూడాలన్నారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, ఆర్డీవోలు పాల్గొన్నారు. -
నాడు పత్తిని రూ.7వేలకు కొన్నారు..
గ్రామంలో 20 ఎకరాలు పత్తి పంట సాగుచేశా. తుపాను దెబ్బకు ఎకరానికి నాలుగు క్వింటాళ్లు పత్తి మాత్రమే దిగుబడి వచ్చింది. జగన్ ప్రభుత్వంలో క్వింటా పత్తిని రూ.7.500కు కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని కిలో కూడా కొనలేదు. ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవటం లేదు. కనీసం పత్తి పంట దెబ్బతిన్నా ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీరుతాయో అర్థం కావటంలేదు. – షేక్ మొహిద్దీన్ పాషా, రైతు, మోగులూరు, కంచికచర్ల మండలం -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
విస్సన్నపేట: రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న గురుదేవ్ మహాపాత్రో(23)సంఘటన స్థలంలోనే మృతి చెందిన సంఘటన గురువారం విస్సన్నపేట– నూజివీడు రోడ్డులో జరిగింది. మృతుడు విస్సన్నపేటలో ఒక కార్ల షోరూమ్లో స్పేర్పార్ట్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులతో కలసి కొండపర్వలో నివాసం ఉంటున్న గురుదేవ్ మహాపాత్రో ఉదయం విధులకు హాజరయ్యేందుకు స్కూటర్పై ఇంటి నుంచి విస్సన్నపేట వస్తుండగా మలుపు వద్ద లారీ వెనుక భాగం తగిలి తలకు బలమైన గాయం అయి తీవ్ర రక్తస్రావం జరగటంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్కూటీ నడుపుతున్న మృతుడి హెల్మెట్ లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. వెనుకనే వస్తున్న డీసీఎం వ్యాను, దాని వెనుక వస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. స్కూల్ బస్లో ఉన్న విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు. న్యాయం చేయండి.. మృతుడు తల్లి మధుస్మిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. కాగా వీరి స్వగ్రామం ఒడిశా రాష్ట్రం పూరి జిల్లా మల్లూ గ్రామం, అయితే కొండపర్వ గ్రామం వద్ద ఉన్న ఫ్యానుల కంపెనీలో వైడింగ్ పని మేసీ్త్రగా తన భర్త సురేష్ మహాపాత్రో పనిచేస్తుండటంతో కుటుంబం కొండపర్వ గ్రామంలో నివాసం ఉంటున్నామని మృతుడి తల్లి మధుస్మిత పేర్కొన్నారు. డ్యూటీకి వస్తున్న క్రమంలో తన కుమారుడు ఈ విధంగా రోడ్డుప్రమాదంలో మృతి చెందాడని, మృతికి కారణమైనవారిని పట్టుకొని తమకు తగున్యాయం చేయాలన్నారు. చేతికంది వచ్చిన కుమారుడు ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో రక్తపు మడుగులో మృతి చెంది ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకొని విలపించారు. -
మహిళలకు ఇళ్లలోనూ రక్షణ కరువు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. కనీసం ఇళ్లల్లో కూడా మహిళలు స్వేచ్ఛగా ఉండలేని భయానక వాతావరణం నెలకొనడం సిగ్గుచేటని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ్నగర్లోని నార్త్జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో బుధవారం గంజాయి బ్యాచ్ వీరంగంతో గాయపడిన గుమ్మళ్ల కుసుమ కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన గురువారం పరామర్శించారు. గంజాయి బ్యాచ్ సభ్యులు చేసిన ఆగడాల గురించి బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీసిన వీడియోలను చూసి నివ్వెరపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని విమర్శించారు. టీడీపీ నాయకుల వత్తాసు సిగ్గుచేటు.. అమాయక ప్రజల ధన, మాన, ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడని గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు టీడీపీ నాయకులు వత్తాసు పలకడం సిగ్గుచేటని గౌతమ్రెడ్డి విమర్శించారు. ఇళ్లల్లో చొరబడి రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం ప్యాకెట్లతో అలజడి చేసి ఇళ్లను ధ్వంసం చేసి చిన్నపిల్లలను సైతం బూతుపురాణాలతో చంపేస్తామని బెదిరించిన మానవ మృగాలను కాపాడేందుకు టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిళ్లు తీసుకురావడం దారుణమన్నారు. ఇటువంటి విధానాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని.. కూటమి ప్రభుత్వ పాలకులు ఇటువంటి విధానాలను వీడకుండా నేరాలను, నేరస్తులను ప్రోత్సహిస్తే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తోందని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల చేతుల్లో పావులుగా మారకుండా చట్టపరంగా.. న్యాయపరంగా నడుచుకోవాలని కోరారు. వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి సింగ్నగర్లో గంజాయి బ్యాచ్ చేతిలో గాయపడిన మహిళ కుటుంబానికి పరామర్శ -
కేంద్రాలపై ప్రభుత్వం చిన్న చూపు
● పౌషకాహార లోపంతో చిన్నారులు ● అంగన్వాడీల్లో స్పెషల్ డైట్ ఊసే ఎత్తని సర్కారు ● దొడ్డుబియ్యం ఇస్తుండటంతో తినలేకపోతున్న చిన్నారులు ● గత వైభవం కోల్పోయిన అంగన్వాడీలు లబ్బీపేట(విజయవాడతూర్పు): చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. ఫలితంగా ఎదుగుదల లోపిస్తోంది. వయస్సుకు తగిన ఎత్తు, బరువు సక్రమంగా ఉండటం లేదు. ప్రభుత్వం సైతం అలాంటి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతా ల్లోని అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో 20 నుంచి 30 శాతం మంది ఇలాంటి పిల్లలు ఉన్నట్లు సమా చారం. అందుకు ఇటీవల జక్కంపూడి ప్రాంతంలోని ఒక అంగన్వాడీ సెంటర్ను ఓ జిల్లా అధికారి తనిఖీ చేయగా, అక్కడ ఉన్న 20 మందిలో 8 మంది పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించడమే నిదర్శనంగా కనిపిస్తోంది. వారికి ప్రత్యేక డైట్ ఏమైనా ఇస్తున్నారా అంటే అదేమీ లేదని తేలింది. అంతేకాదు పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ఇచ్చే ప్రత్యేక డైట్పై అంగన్వాడీలకు సైతం సరైన అవగాహన లేక పోవడం కొసమెరుపు. లావు బియ్యం, పుచ్చిన కందిపప్పు.. అంగన్వాడీల్లో చిన్నారులకు ప్రతిరోజూ మధ్యాహ్నం పప్పు, ఆకుకూరల భోజనంతో పాటు, ఉడికించిన గుడ్డు, వంద మిల్లీలీటర్ల పాలు ఇవ్వాలని మెనూలో ఉంది. కానీ అక్కడ పెట్టే భోజనం చిన్నారులు తినలేక పోతున్నట్లు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో ఇచ్చే దొడ్డు(లావు) బియ్యమే అంగన్వాడీలకు ఇస్తుండటం, ఒక్కోసారి కందిపప్పు సైతం నాణ్యతాలోపం ఉండటంతో చిన్నారులు తినలేక పోతున్నట్లు చెబుతున్నారు. నూనె, ఇతర సరుకులు కూడా అంత నాణ్యత ఉండటం లేదు. దీంతో అంగన్వాడీల్లోని చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. మరోవైపు పోషకాహారలోపం ఉన్న వారికి అదనంగా డైట్ ఇవ్వాల్సి ఉన్నా, అది సరిగా అమలు కావడం లేదు. దీంతో పోషకాహార లోపం చిన్నారులకు శాపంలా మారుతుంది. గర్భిణులకూ నాసిరకమే.. ఏడాదిగా గర్భిణులకు సరఫరా చేసే రాగి పిండిలో ఇసుక తగులుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం రాగి పిండి సరఫరా చేయడంతో ఇలా జరుగుతోందని వారు అంటున్నారు. అంతేకాకుండా చిక్కీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినది నాణ్యతగా ఉండేదని, కానీ ఇప్పుడు తినలేక పోతున్నామంటున్నారు. మరోవైపు పాలు లీటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారని, అవి ఫ్రిడ్జ్ లేని వాళ్లు ఎలా స్టోరేజ్ చేసుకుని తాగాలని ప్రశ్నిస్తున్నారు. అరలీటరు ప్యాకెట్స్ ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకూ వైఎస్సార్ సీపీ పాలనలో అంగన్వాడీలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే నిత్యావసరాలు నాణ్యతతో ఉండేలా చూశారు. ముఖ్యంగా సన్నబియ్యం సరఫరా చేయడంతో చిన్నారులు ఇష్టంగా తినేవారు. ఎవరైనా పోషకాహార లోపంలో చిన్నారులకు ఉంటే వారికి ప్రత్యేక డైట్ అందించేవాళ్లు. అలా మూడు నెలలు ఇచ్చినా బరువు పెరగకపోతే, వారికి న్యూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్(ఎన్ఆర్సీ)కు రిఫర్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్పెషల్డైట్ సక్రమంగా అందక పోగా, ఎన్ఆర్సీ సెంటర్కు కూడా రిఫర్ చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదు. దీంతో చిన్నారులకు బరువు తక్కువగా ఉంటూ, చలాకీగా ఉండలేక పోతున్నారు. అంగన్వాడీల్లో పిల్లలందరికీ రొటీన్ డైట్ ఇస్తాం. పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఉంటే, వారికి జీర్ణ లోపం ఉందేమో గుర్తించి, వారికి ఆహారం ఎలా పెట్టాలో తల్లికి కౌన్సెలింగ్ ఇస్తాం. స్పెషల్ డైట్ అంటూ ఏమీలేదు. – రుక్సానా, పీడీ, ఐసీడీఎస్, ఎన్టీఆర్ జిల్లా -
కన్నతల్లిని, జన్మభూమిని మరువకూడదు
గుడివాడ టౌన్: వునిషి ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కన్న తల్లినీ, జన్మభూమినీ మరువ కూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నాట్స్ ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాలులో గురువారం నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటించాలన్నారు. యువత ప్రకృతి సమతుల్యతను పాటించేందుకు ప్రయత్నించాలన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలన్నారు. నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ తన జన్మభూమిని గుర్తు ఉంచుకుని గుడివాడలో 30 విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, డాక్టర్ భవాని శంకర్, డాక్టర్ పాలడుగు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు -
భక్తులకు ఉచితంగా లడ్డూల పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీక్ష విరమణలలో తయారు చేసిన లడ్డూలను దేవస్థానం గురువారం ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేసింది. భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని దేవస్థానం భారీగా లడ్డూలను తయారు చేసింది. అయితే చివరి రోజైన సోమవారం భక్తులు, భవానీల రద్దీ అంతంత మాత్రంగానే ఉండటంతో లడ్డూ విక్రయాలు తగ్గాయి. దీంతో దేవస్థానం వద్ద భారీగా లడ్డూ స్టాక్ ఉండటంతో గురువారం ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో భక్తులకు వాటిని ఉచితంగా పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే మార్గంలో రెండు ప్రదేశాల్లో, మహా మండపం లిప్టు ఎదుట, ఘాట్రోడ్డు మార్గంలో డోనర్ సెల్ వద్ద సేవా సిబ్బంది, ఆలయ అర్చకులకే లడ్డూలను పంపిణీ జరిగింది. మరో వైపున భక్తులు ఇదే అవకాశంగా ఒక్కోక్కరు ఒకటికి, రెండు సార్లు క్యూలైన్లో నిల్చోని లడ్డూలను పొందారు. దీంతో ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్, మహా మండపం దిగువన లడ్డూ కౌంటర్లు విక్ర యాలు లేక వెలవెలపోయాయి. దీక్ష విరమణలకు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన తిరుగు ప్రయాణమైన శానిటేషన్, సెక్యూరిటీ, దేవదాయ శాఖ, పోలీసు, ఇతర విభాగాలకు చెందిన వారికి సైతం దేవస్థానం లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేయడం విశేషం. అయితే ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి మాత్రం ఉచిత లడ్డూ ప్రసాదాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
21న పల్స్ పోలియో
మచిలీపట్నంఅర్బన్: చిన్నారుల భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలు తప్పక వేయించాలని కృష్ణా జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ తెలిపారు. పోలియో నిర్మూలన లక్ష్యంగా జిల్లాలో ఈ నెల 21న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని గురువారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు ఒక్క చిన్నారూ మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయించడమే లక్ష్యంగా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తమైందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు మొత్తం 1,39,180 మంది ఉన్నట్లు అంచనా వేశామని వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు 1,94,160 డోసులను సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమం విజయవంతానికి జిల్లాలో మొత్తం 4,898 మంది సిబ్బందిని నియమించామన్నారు. పెనమలూరు: మద్యానికి బానిసగా మారిన వ్యక్తి బందరు కాలువలో దూకి గల్లంతైన ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు ఇందిరానగర్కు చెందిన దేవల దుర్గారావు(33) మట్టి పని చేస్తాడు. అతనికి భార్య మరియ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దుర్గారావు మద్యానికి బానిసగా మారటంతో భార్య, పిల్లలు పుట్టింటికి ఐదు నెలల క్రితం వెళ్లి పోయారు. భార్య, పిల్లలు వెళ్లి పోవటంతో మనస్తాపం చెందిన దుర్గారావు విపరీతంగా మద్యం తాగడం ప్రారంభించాడు. కాగా బుధవారం దుర్గారావు యనమలకుదురు లాకుల వద్ద బందరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. కాలువలో అతని ఆచూకీ తెలియకపోవటంతో ఈ ఘటనపై తల్లి తిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ెపదపారుపూడి: ఎదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొన్న ఘటనలో యవకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన పెదపారుపూడిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ రూరల్ మండలం కాశిపూడి గ్రామానికి చెందిన చప్పిడి అజయ్(24) గ్రామం నుంచి బైక్పై గుడివాడ పట్టణానికి వెళ్తుండగా పెదపారుపూడి గ్రామంలోని రామాలయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు, బైక్ను ఢీకొనటంతో అజయ్ బైక్పై నుంచి కిందకు పడిపోయాడు. చిక్సిత నిమిత్తం గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే సొంత గ్రామానికి వచ్చాడు. మృతుడికి అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఉన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): బీఫార్మసీ రెండు, మూడు సెమిస్టర్ల రెగ్యులర్ ఫలితాలను గురువారం సీఈ ఆలపాటి శివప్రసాద్ విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో 31వ తేదీలోగా సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు ఫీజు రూ.2,070 చెల్లించాలన్నారు. అలానే వ్యక్తిగత పరిశీలనకు రూ.2,190 చెల్లించాలని సూచించారు. -
పొగముంచు.. గమనించు!
నాగాయలంక మండలంలో మంచు కమ్మేసింది. గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచే దట్టంగా కమ్ముకున్న మంచుతో ఉదయాన్నే పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, ట్యూషన్లకు వెళ్లే విద్యార్థులు, స్వచ్ఛత పనులకు కదిలే పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు పడ్డారు. ఉదయం 8గంటల దాటినా మంచు దుప్పటి వీడక పోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరికివారు జాగ్రత్తగా ముందుకు కదిలారు. – నాగాయలంక ఉదయాన్నే మంచు, చలి నుంచి ఊరట పొందేందుకు టీ స్టాల్స్కు క్యూ కట్టిన శ్రామికులు ఉదయం 8.30గంటల వేళ బయటకు వస్తున్న భానుడు వర్షంలా కురుస్తున్న మంచు మధ్యనే.. -
సమస్యలపై చర్చ జరిగేనా?
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) తొమ్మిది నెలల తరువాత శుక్రవారం జరగనుంది. గత డీఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు సమాచారాన్ని సంబంధిత అధికారులు మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాల్సి ఉంది. తొమ్మిది నెలల తరువాత డీఆర్సీ సమావేశం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇది మూడో సమావేశం. గత డీఆర్సీ తూతూమంత్రంగా సాగింది. ఈ సమావేశంలో అయినా ప్రస్తుతం జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలపై చర్చ జరుగుతుందో లేదోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశం అజెండాలో వ్యవసాయ అనుబంధ శాఖలతో పాటు విద్య, వైద్యం, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, గృహనిర్మాణం, పరిశ్రమలు తదితర శాఖలకు సంబంధించి అంశాలను పొందుపరిచారు. రైతుల సమస్యలపై చర్చ సాగేనా..? జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు డీఆర్సీ జరగనుంది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై చర్చ జరిగేనా అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. పంట కోతకొచ్చే సమయంలో మోంథా తుపాను ప్రభావం వల్ల జిల్లాలోని చాలా మండలాల్లో ఈదురుగాలులకు పైరు నేలవాలింది. ధాన్యం రాశులు వర్షానికి తడిచిపోయాయి. దీంతో ధాన్యంలో తేమ శాతం రైతులను వేధించింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని రైతులు పోరాటం చేసినప్పటికీ తేమశాతం తగ్గిస్తేనే కొనంటామని అధికారులు తెగేసి చెప్పారు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తూ మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల జిల్లాలో పర్యటించినప్పుడు ధాన్యం కొనుగోళ్లపై రైతులు నిలదీశారు. ఇప్పటికీ జిల్లాలో సగానికిపైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ధాన్యం సేకరణ, రైతుల ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందో, లేదో వేచి చూడల్సి ఉంది. జిల్లాలోని ప్రతి మిల్లులో తేమశాతం తగ్గించేందుకు డ్రయ్యర్లు ఏర్పాటు చేయాలని గత సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. వలసలపై చర్యలేవి? కృష్ణాజిల్లా నుంచి పేదలు ఎక్కువగా వలస వెళ్తున్నారని, దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారిం చటం లేదని గత సమావేశం దృష్టికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీసుకువచ్చారు. జిల్లాలో అన్యాక్రాంతమైన భూములపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కలెక్టర్ వివరించాల్సిన అవసరం ఉందని యార్లగడ్డ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడలేని మనం ఇలా సమావేశాలు నిర్వహించటం వృథా అని ఆయన తేల్చి చెప్పారు. పశుసంవర్ధకశాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాల్సిన అవసరం ఉంది. అన్నిశాఖల అధికారులందరూ జిల్లా కేంద్రమైన బందరులో కచ్చితంగా ఉండాల్సిందేనని మంత్రి కొల్లు రవీంద్ర గత సమావేశంలో స్పష్టంచేశారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అయినప్పటికీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోతో పాటు కొంతమంది అధికా రులు తప్ప ఎక్కువశాతం అధికారులు ఇప్పటికీ విజయవాడ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మంత్రి సూచనలు, కలెక్టర్ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదు. అధికారులు జిల్లా కేంద్రంలో నివాసం ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే సమస్యల పరిష్కారంలో చొరవ చూపొచ్చని గత సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన నేపథ్యంలో అటువంటివి ఏమీ ప్రస్తుతం జరగటం లేదు. ఈ సమావేశంలో ఈ విషయంపై ఎంత మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారో చూడాల్సి ఉంది. -
కృష్ణా జిల్లా
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం నాగాయలంక: మాస శివరాత్రి సందర్భంగా స్థానిక శ్రీరామ పాద క్షేత్రంలోని పుష్కర ఘాట్ వద్ద ఉన్న గంగ, పార్వతి సమేత రామలింగేశ్వరస్వామికి గురువారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 41.9308 టీఎంసీలు. గుడివాడటౌన్: ఏఎన్నార్ కాలేజీ వజ్రోత్సవాలు గురు వారం ఘనంగా ముగిశాయి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్టౌన్(విజయవాడ పశ్చిమ):వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజయవాడలో గురువారం ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి మద్దతుగా తరలివచ్చిన ప్రజలు జననేతకు సంఘీభావం తెలిపారు. ప్రైవేటీకరణపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని కోటి సంతకాల రూపంలో గవర్నరకు తెలియజేయడానికి అభిమాన నేత నగరానికి చేరుకోవటంతో పార్టీ శ్రేణులతో పాటుగా భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పట్టి సంపూర్ణ మద్దతు తెలిపారు. నేతాజీ వంతెన నుంచి అంబేడ్కర్ స్మృతి వనం వరకు.. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నేతాజీ వంతెన వద్ద వేలాది మంది వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు నీరాజనాలు పలికారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. వందలాది కార్లు, వేలాది ద్విచక్ర వాహనాలతో భారీ సంఖ్యలో ప్రజలు వెంటరాగా పశువుల ఆస్పత్రి సెంటర్ వద్ద బందరు రోడ్డులోకి జననేత కాన్వాయ్ ప్రవేశించింది. అక్కడి నుంచి బందరు రోడ్డు మీదుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్మృతి వనం వద్దకు చేరుకుంది. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్మృతి వనం వద్ద పార్టీ నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ పార్టీ శ్రేణులు నినదించాయి. అక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో చేపట్టిన ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందించేందుకు తరలివెళ్లారు. దారి పొడవునా జై జగన్.. జైజై జగన్ అన్న నినాదాలు మిన్నంటాయి. అడుగడుగనా ఆంక్షలు.. నగరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సంద ర్భంగా అడుగడుగునా ఆంక్షలు విధించారు. బందరురోడ్డు పరిసరాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అంబేడ్కర్ స్మృతి వనం నుంచి గవర్నర్ బంగ్లాకు జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు, పోలీసులు బారికేడ్లు పెట్టి ఇబ్బందులు పెట్టారు. జననేత వెంట జనం ముందుకు సాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, ఆంక్షలు విధిస్తూ ఎటూ వెళ్లడానికి లేకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ సుమారు మూడు గంటల పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వేలాది మంది ప్రజలు అనుసరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణకుమార్, రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెలంపల్లి, మల్లాది విష్ణు, పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. 7ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న చర్యలు దారుణం. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు రానున్న రోజుల్లో వైద్య విద్య అందకుండాపోతుంది. ప్రభుత్వం తక్షణం ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలి. పేద, మధ్య తరగతి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలి. వారికి వైద్య విద్యను చేరువ చేయాలి. – కై లా భరత్ భూషణ్, బీఎస్సీ విద్యార్థి, యనమలకుదురు, పెనమలూరు మండలం -
విద్యాహక్కు చట్టంలో సవరణ తీసుకురావాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసు కురావాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరిచాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో గురువారం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం 2009 క్లాజ్ 23(2) సవరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పని సరిగా టెట్ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఇప్పటికీ నాలుగు నెలలైనా, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రివ్యూ పిటీషన్ వేయకపోవటాన్ని తప్పుపట్టారు. వెంటనే కోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి.మనోహర్ కుమార్, జిల్లా ప్రధాన కార్య దర్శి సుందరయ్య మాట్లాడుతూ.. ఆప్షన్ హాలిడే విని యోగించుకోవడంలో, రెండో శనివారం సెలవులు, ఏకోపాధ్యా యులు ఓహెచ్, ఇతర సెలవులు వినియోగించుకోవడంలో అధికారుల మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విజయవాడ కార్పొరేషన్ పరి ధిలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్షల విరమణ ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.4.49 కోట్ల ఆదాయం సమకూరింది. గురువారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.3,21,22,542 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మహా మండపం ఆరో అంతస్తులో కానుకలు లెక్కించారు. బుధవారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.1,27,90,645 కోట్ల ఆదాయం వచింది. రెండు రోజుల్లో రూ.4,49,13,187 నగదు, 218 గ్రాముల బంగారం, 17.324 కిలోల వెండి సమకూరింది. 190 యూఎస్ఏ డాలర్లు, 25 కెనడా డాలర్లు, 15 యూఏఈ దిర్హమ్స్, 23 మలేరియా రింగట్స్, 101 ఖత్తర్ రియాన్స్, 100.5 ఓమన్ బైంసాలు లభించాయి. కానుకల లెక్కింపును ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించగా, దేవస్థాన సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు. మచిలీపట్నం – ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక రైలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు మచిలీపట్నం – ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక వన్ వే రైలు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రు ప్కర్ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం 4.20 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, 24న తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రయాగ్రాజ్ చేరుతుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్లు, పెద్దపల్లి, మాచర్ల, సిర్పూర్ కాగజ్నగర్, బల్హార్షా, చంద్రాపూర్, నాగ్పూర్, బినా, వీరంగన లక్ష్మీభాయ్ జంక్షన్, ఒరై, గోవింద్పురి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. విజయవాడ–కాచిగూడ ప్రత్యేక రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు. ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్ మీదుగా కాచిగూడ చేరుకుంటుంది. పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈ నెల 21వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిద్దామని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. పల్స్ పోలియోపై యూపీ హెచ్సీ వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ ఎంలు, బూత్ వలంటీర్లకు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురువారం శిక్షణ ఇచ్చారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయాలని స్పష్టంచేశారు. తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మాత్రమే వైద్యుడి సంప్రదించా లని సూచించారు. జిల్లాలో 966 పోలియో బూత్లలో 2,48,900 మంది పిల్లలకు చుక్కల మందు వేయాలన్నది లక్ష్యమని వివరించారు. ఈ సమావేశంలో వీఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ అర్జునరావు, ఏఎంఓహెచ్ డాక్టర్ బాబుశ్రీనివాసరావు, డాక్టర్ గోపాలకృష్ణ, డీఐఓ డాక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన నగరంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల(గుణదల)లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్)ను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులలో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రొత్సహించే లక్ష్యంతో వివిధ స్థాయిల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా పాఠశాల, మండల స్థాయిలో నిర్వహించిన విజేతలతో జిల్లా స్థాయి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన నమూనాలను రాష్ట్ర స్థాయిలో, అక్కడ విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయికి పంపిస్తామని వివరించారు. మండల స్థాయిలో గ్రూప్ ఎగ్జిబిట్స్ ఏడు చొప్పున, విద్యార్థుల వ్యక్తిగత ఎగ్జిబిట్స్ రెండు, ఉపాధ్యాయులు వ్యక్తిగత ఎగ్జిబిట్స్ రెండు చొప్పున ప్రదర్శనలో ఉంటా యని వివరించారు. -
ఐదంచెల సాగు.. లాభాలు బాగు
●ఎకరాకు రూ.3 లక్షల నికర ఆదాయం ●సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ప్రచారకుడు విజయరామ్ గూడూరు: వ్యవసాయంలో మూస పద్ధతికి స్వస్తి పలికి ఐదంచెల సాగు ద్వారా రైతులు లాభాలు గడించొచ్చని నిరూపిస్తున్నారు సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ప్రచారకుడు ఎం.విజయరామ్. గూడూరు మండలం తరకటూరులోని సౌభాగ్య గో సదన్లో చేపట్టిన ఐదంచెల సాగు విధానం ద్వారా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎకరాకు రూ.3 లక్షల నికర ఆదాయం పొందొచ్చని చేసి చూపించారు. ఈ నెల 15వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఐదంచెల సాగు విధానంపై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 60 x 60 నమూనా ఐదంచెల సాగు విధానంలో 60 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో వ్యవసాయ క్షేత్రాన్ని సిద్ధం చేశారు. ఎకరం పొలాన్ని 7 1/2 అడుగుల మడులుగా విభజించారు. ప్రతి మడి తరువాత చిన్నపాటి కలువను తవ్వించారు. కాలువ మధ్యలో ఉన్న దిబ్బలపై పసుపు నాటి, అంతర పంటలుగా 20 అరటి, 36 మునగ, 16 బొప్పాయి, వట్టివేరు తదితర పంటలను సాగు చేస్తున్నారు. సాధారణ సాగు పద్ధతిలో ఉపయోగించే నీటిలో ఐదంచెల సాగు పద్ధతిలో మూడు శాతం నీటిని మాత్రమే అవసరం అవుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పద్ధతిలో పంటల నుంచి లాభాలు గడించొచ్చని విజయరామ్ పేర్కొంటున్నారు. 6 టన్నుల పసుపు దిగుబడి వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన పసుపు పంట ద్వారా దాదాపు ఆరు టన్నుల పసుపు దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు విజయరామ్. దీంతో పాటు సాగు చేస్తున్న మునగ, వట్టివేరుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక మునగ చెట్టుకు సరాసరి రెండు కిలోల మునగాకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కిలో రూ.300 పలుకుతుండగా వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన 36 చెట్ల ద్వారా 72 కిలోల మునగాకు దిగుబడి వస్తుంది. దీనిని డ్రయ్యర్లో పొడి చేయడం ద్వారా ఆకు పాడవకుండా పొడి చేసి ఇతర ప్రాంతాలకు దీనిని ఎగుమతి చేస్తున్నారు. 81 రకాల మొక్కల సాగు ఐదంచెల విధానంలో మొత్తం 81 రకాల పండ్ల, ఆకుకూరలు, కూరగాయలు, తదితర మొక్కలు పెంచేలా విజయరామ్ ఏర్పాట్లు చేశారు. ప్రతి 60 అడుగులకు ఒక మామిడి, నేరేడు, సపోటా, పనస, మధ్యలో జామ, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, అంజీర, ఉసిరి, బిల్వ, మారేడు వంటి చెట్లను పెంచుతున్నారు. వీటి మధ్య ఆవాలు, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి, జీలకర్ర, సోంపుతోపాటు తోటకూర, గోంగూర, బచ్చలి కూర, మొంతి కూర, కొత్తిమీర, ఎర్రతోటకూర, పచ్చతోటకూర, పాలకూర తదితర ఆకుకూరలు, బెండ, టమాట, వంకాయ, చిక్కుడు, సొరకాయ, పొట్లకాయ, బీరకాయ, కాకరకాయ, దోస కాయ, నేతి బీర కాయ వంటి కూరగాయలు, అల్లం, కంద, ముల్లంగి, బీట్రూట్, చామదుంప, వంటి దుంపలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలోనే సాగు విజయరామ్ సాగు చేస్తున్న పంటలకు ఎక్కడా రసాయనాలు వినియోగించడం లేదు. ప్రకృతి వ్యవసాయ విధానంలో వినియోగించే ఆవు పేడ, మూత్రంతో పాటు ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసి వాటి ద్వారానే పంటలను సాగు చేస్తున్నారు. ఫలితంగా పంట దిగుబడులకు మార్కెట్లో మంచి రేటు లభిస్తోంది. ఈ విధా నంలో పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యవంతమైన జీవనం సాగించడానికి అవకాశం లభిస్తుందని, భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం అరికట్టవచ్చని విజయరామ్ పేర్కొంటున్నారు. కార్పొరేట్ కొలువుల వైపు పరిగెత్తుతూ నగరాల్లో కాలుష్య కోరల్లో క్షణం తీరిక లేని జీవనం గడుపుతున్న యువతను వ్యవసాయ రంగంలోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని విజయ రామ్ అంటున్నారు. కూలీలపై ఆధారపడకుండా కష్టపడి పనిచేస్తే ఒక్క ఎకరం పొలంలో ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం సాధించొచ్చని పేర్కొన్నారు. 15 ఏళ్ల పాటు శ్రమించి ఈ ఐదంచెల విధానం రూపొందించడం జరిగిందని ఆయన అన్నారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని తన ద్వారా మరింత మందికి తీసుకువెళ్లాలన్న బృహత్తర లక్ష్యంతో డిసెంబర్ 15 నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని రైతులకు ఐదంచెల విధానంపై క్షేత్ర స్థాయ అవగాహన కార్యక్రమం రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. -
లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా చాప్టర్ ఏర్పాటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికారిక ఎంఎస్ఎంఈ వ్యవస్థ లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా చాప్టర్ ఏర్పాటైంది. మహాత్మాగాంధీ రోడ్డులోని అమరావతి హౌసింగ్స్లో ఏర్పాటు చేసిన ఈ శాఖను జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ మోహన్ సుందరం ఏపీ అధ్యక్షుడు తులసీ యోగీష్ చంద్రతో కలిసి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ సుందరం మాట్లాడుతూ.. లఘు ఉద్యోగ భారతి దేశం వ్యాప్తంగా 68 వేల ఎంఎస్ఎంఈ యూనిట్ల సభ్యత్వం కలిగి ఉందన్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద ఎంఎస్ఎంఈ సంస్థని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా కార్యవర్గం ఇదే.. లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడిగా వెలగపూడి సాంబశివరావు, కార్యదర్శిగా చెరుకూరి చాముండేశ్వరి, జాయింట్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ తరుణ్ కాకాని, ఉపాధ్యక్షులుగా టి.వెంకట నాగేశ్వరరావు, అన్నే శ్రీనివాసరావు, శ్రీరామ్, కార్యదర్శులుగా జె.అభినయ్కృష్ణ, యార్లగడ్డ హరీష్, కార్యనిర్వాహక సభ్యులుగా దొడ్డపనేని కల్యాణ్ కృష్ణ, ప్రణీత్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. -
క్వార్టర్ ఫైనల్స్కు చేరిన క్రికెట్ పోటీలు
విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ బుధవారం ప్రారంభమైంది. ఈ పోటీలను వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ, కరస్పాండెంట్ ఎన్.సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీని నున్నలో రెండు మైదానాలు, సూరంపల్లిలో ఒక మైదానంలో లీగ్–కమ్– నాకౌట్ పద్ధతి నిర్వహిస్తారు. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. ప్రారంభ మ్యాచ్లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా ప్రకాశంపై 102 పరుగుల భారీ తేడాతో, కృష్ణా జిల్లాపై 35 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. విజయనగరంపై విశాఖపట్నం పది వికెట్ల తేడాతో, కర్నూ లుపై గుంటూరు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచాయి. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆతిథ్య కృష్ణా జిల్లా ప్రకాశంపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించింది. కృష్ణా బౌలర్ యశ్వంత్ అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం.అరుణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, టోర్నీ పరిశీలకుడు డి.భూపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ టి.విజయవర్మ పాల్గొన్నారు. -
ఆరుగురు గంజాయి విక్రేతలు అరెస్టు
పెనమలూరు: మండలంలోని పెదపులిపాక గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిపై కేసు నమోదుచేసిన పెనమలూరు పోలీసులు వారిని అరెస్టు చేశారు. సీఐ జె.వెంకటరమణ కథనం మేరకు..పెదపులిపాక గణపతినగర్లోని ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఆరుగురు వ్యక్తులు గంజాయితో ఉన్నారన్న సమాచారం పోలీసులకు అందింది. స్పందించిన పోలీసులు ఆ ప్రాంతంపై దాడిచేసి గంజాయితో ఉన్న కానూరు మురళీనగర్కు చెందిన చెందిన జువ్వనపూడి శశికాంత్, ఉయ్యూరు వెంకటవంశీకృష్ణ, ప్రసాదంపాడుకు చెందిన వి.దుర్గారావు, ఆకుల వెంకటమాధవ్, పెదపులిపాక గణపతినగర్కు చెందిన ఆకులపల్లి మౌనిక, పెనమలూరు పల్లిపేటకు చెందిన గోగం ఫణికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు భద్రాచలం నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న పొట్లాలుగా కట్టి విక్రయిస్తున్నారని విచారణలో తేలింది. నిందితుల వద్ద 2,250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గన్నవరంలో గంజాయి స్మగ్లర్ అరెస్టు కోనేరుసెంటర్(మచిలీపట్నం): గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని గన్నవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పూణేకు చెందిన దీపక్ తుపే ఒడిశాలో రాజ్కుమార్, సురాన్కర్ణ వద్ద 112 కిలోల గంజాయి కొన్నాడు. పూణేలో వైష్ణవిలవన్కు అందిం చేందుకు కారులో ఒడిశా నుంచి బయలుదేరాడు. దీపక్ తుపే గన్నవరం సమీపంలోని బీబీగూడెం అండర్ పాస్ వద్ద చేరుకున్న సమయంలో పోలీ సులు వాహనాలను తనిఖీచేస్తుండటంతో కంగారుపడ్డాడు. అతడిని గమనించిన గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్ కారును తనిఖీ చేయగా రూ.5.60 లక్షల విలువైన 112 కిలోల గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు దీపక్ తుపేపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఒడి శాకు చెందిన రాజ్కుమార్, సురాన్కర్ణ, పూణేకు చెందిన వైష్ణవిలవన్ను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. స్మగ్లర్ను పట్టుకున్న గన్నవరం పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ బి.వి.శివప్రసాద్, ఈగల్ టీం సీఐ ఎం.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లుగా ఎంపికై న అక్కాచెల్లెళ్లకు సత్కారం
ఇబ్రహీంపట్నం: తొలి ప్రయత్నంలో కానిస్టేబుళ్లుగా ఎంపికై న అక్కాచెల్లెళ్లు రత్నశ్రీ, జయశ్రీని పలువురు బుధవారం అభినందించారు. జి.కొండూరు మండలం భీమవరప్పాడు గ్రామానికి చెందిన వంగూరి చిట్టిబాబు పోలీస్ శాఖలో హోం గార్డుగా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు తేజ బసవశ్రీ, రత్నశ్రీ, జయశ్రీ ఉన్నారు. పెద్ద కుమార్తె తేజ బసవశ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిశారు. రెండో కుమార్తె రత్నశ్రీ, మూడో కుమార్తె జయశ్రీ సివిల్ పోలీళ్లుగా ఎంపికయ్యారు. ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యా లయం వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో రత్నశ్రీ, జయశ్రీని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మాకేం సంబంధం లేదు!
● బీఎస్సీ(ఎంఎల్టీ) విద్యార్థుల సమస్యలపై హెల్త్ వర్సిటీ వీసీ చంద్రశేఖర్ ● వర్సిటీ ఎదుట నిరసన తెలిపిన విద్యార్థులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని 2021– 22 సంవత్సర బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాలల నుంచి వచ్చిన బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థులు డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ను బుధవారం కలిశారు. ప్రధానంగా 2021–22 సంవత్సర బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థులకు ఇంటర్న్షిప్ను ఆప్షనల్గా పెట్టాలని లేదా గరిష్టంగా ఆరు నెలలకు పరిమితం చేసి, ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థుల నుంచి ఇంటర్న్షిప్ పేరుతో ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదనీ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్న్షిప్ కారణంగా పొడిగించిన సంవత్సరానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్న్షిప్ సమయంలో కనీసం నెలకు రూ.6,000 స్టైఫండ్తో పాటు వారాంతాల్లో సెలవు ఇవ్వాలని కోరారు. మేం ఏం చేయలేం.. విద్యార్థుల డిమాండ్లపై వీసీ సానుకూలంగా స్పందించకపోవటంతో పాటు తాము ఏం చేయ లేమని స్పష్టం చేసినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజులు వసూలు చేయమని తాము చెప్పలేదని, కనుక తమకు సంబంధం లేదని, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టి స్టైఫండ్ రిలీజ్ చేయడం కుదరదని పేర్కొన్నారని చెప్పారు. దాంతో విద్యార్థులు బయటకు వచ్చి యూనివర్సిటీ ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం లెక్కింపు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణలలో అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. తొలి విడత లెక్కింపులో రూ.1.27కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన కానుకల, ముడుపులు, మొక్కుబడుల లెక్కింపులో మొత్తం రూ. 1,27,90, 645 నగదు, 18 గ్రాముల బంగారం, 2.474 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. గురువారం కూడా కానుకల లెక్కింపు జరుగుతుందని అధికారులు ప్రకటించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఇతర అధికారులు పర్యవేక్షించారు. పైడమ్మతల్లి హుండీ ఆదాయం రూ.5.47లక్షలు పెడన: పట్టణ పరిధిలోని పైడమ్మ తల్లి ఉత్సవాలు ముగియడంతో బుధవారం అధికారుల పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించినట్లు ఈఓ గోవాడ వెంకటకృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల ముగిసిన 70 రోజుల పైడమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి రూ. 5,47,633 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆయన చెప్పారు. అలాగే 700 మిల్లీగ్రాముల బంగారం, 128 గ్రాముల వెండి వస్తువులు వచ్చాయన్నారు. ఉత్సవాలు అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డి. వాయునందన్రావు పాల్గొన్నారు. పీవీన్వీ ప్రసాదరావు పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. -
ఏకపక్షంగా 205 పనులు రద్దు చేసిన సీఈఓ
● కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతర్ ● గత పాలకవర్గ సమావేశంలో నిలదీసినా వెనక్కి తగ్గని వైనం ● అధికారిని వెనకుండి నడిపిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ● సీఈఓ నిర్ణయంపై భగ్గుమంటున్న పాలక వర్గ సభ్యులు సాక్షి ప్రతినిధి, విజయవాడ/మచిలీపట్నం: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన పనులను రద్దు చేస్తూ సీఈవో కన్నమనాయుడు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆయన పాలక వర్గం నిర్ణయాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై పాలక వర్గ సభ్యులు భగ్గుమంటున్నారు. గత పాలక వర్గ సమావేశంలో పనుల రద్దు అంశంపైన సమావేశంలో గందరగోళం నెలకొంది. సీఈవో తీరును నిరసిస్తూ సభ్యులు నిరసన చేపట్టారు. కలెక్టర్ హామీతో సభ్యులు శాంతించారు. అయితే మరలా ఈ నెల 19వ తేదీన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ సీఈవో కె. కన్నమనాయుడు తన మొండి వైఖరి విడనాడకుండా, సమావేశంలో ఆమోదించిన పనులను రద్దు చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతి నిధులకు మంచి పేరు ఎక్కడ వస్తుందోనని ఆందోళన చెందుతున్న అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జిల్లా పరిషత్ సీఈఓను పావుగా వాడుకొంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లా పరిషత్ పాలకవర్గం ఆమోదించిన పనులకు నిధులు లేవంటూ సాకులు చూపుతూ రద్దు చేసి, ‘నేనింతే’ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు సూచించిన పనులకు నిధులు వెచ్చిస్తున్నారు. పాలకవర్గంపై అక్కసుతోనే.. జిల్లా పరిషత్ పాలకవర్గం ఆయా సభ్యులకు కేటాయించిన రూ.12.74కోట్లకు సంబంధించి 205 పనులు నిలిపివేస్తూ జెడ్పీ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి చైర్పర్సన్కు లేఖ పంపినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులకు చెందిన పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ పాలకవర్గం వైఎస్సార్ సీపీది కావటంతో వారిపై అక్కసుతో కావాలనే ఈ రకంగా సీఈవో వ్యవహరిస్తున్నారని సభ్యులు వాపోతున్నారు. గత సర్వసభ్య సమావేశం ముందు రూ. 24.75 కోట్లకు చెందిన 424 పనులను రద్దు చేశారు. దీంతో సభ్యులు సమావేశంలో ఒక్కసారిగా సమావేశాన్ని స్తంభింపజేసి పనులను ఎందు కు నిలిపివేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. రద్దు చేసిన పనులు ఇవి.. నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాలకు ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేశారు. గుడ్లవల్లేరు, బంటుమిల్లి మండలాలకు శ్మశానవాటికలు లేవని, దహన సంస్కారాలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆయా పంచాయతీలోని ప్రజలు విన్నవించగా 25 పంచాయతీలకు టెండర్ ద్వారా పనులను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ఇబ్రహీంపట్నంలోని రూ.90 లక్షల విలువగల పనులకు శంకుస్థాపన సైతం చేసినట్లు గత జెడ్పీ సర్వసభ్య సమావేశం దృష్టికి జెడ్పీ వైస్ చైర్సర్సన్ శ్రీదేవి తెచ్చారు. గత సర్వసభ్య సమావేశంలో పనుల రద్దు విషయంలో సభ్యులు చేసిన పోరాటానికి కలెక్టర్ డీకే బాలాజీ స్పందిస్తూ చైర్పర్సన్, సీఈవో, ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి పనులు ఎంత వరకు వచ్చాయి? ఏ పనులు పూర్తయ్యాయి? అనే విషయాలను చర్చిస్తామని.. అనంతరం నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీని సైతం తుంగలో తొక్కి ఏకపక్షంగా 205 పనులను సీఈఓ రద్దు చేయడంపై సభ్యులు మండిపడుతున్నారు. పనుల రద్దు సమయంలో కలెక్టర్ ఇచ్చిన హామీనీ ఓ అధికారి, సీఈఓ దృష్టికి తీసుకొని వస్తే, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. చైర్మన్, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం పెట్టకుండానే నిర్ణయం తీసుకోవడం ఆయన మొండి వైఖరికి అద్దం పడుతుందనే భావన పలువురిలో వ్యక్తం అవుతోంది. -
ఎలా రద్దు చేస్తారు..
పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేసి పనులు కేటాయింపులు జరిపి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తరువాత ఎలా రద్దు చేస్తారు? నిధుల రాబడి అంచనాలు రూపొందించిన తరువాతే పనుల కేటాయింపు జరిగింది. గత సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ ఇచ్చిన హామీని సీఈవో లెక్క చేయటం లేదు. చైర్పర్సన్, పాలకవర్గ సభ్యులకు సమావేశం నిర్వహించి పనులపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఈవో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు. – వేముల సురేష్బాబు, గూడూరు జెడ్పీటీసీ -
పీపీపీపై జనకోటి కన్నెర్ర
కృష్ణాజిల్లాగురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సంతకాలతో నిరసనాగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రజలు● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ● ఆ ప్రతులను నేడు గవర్నర్కు అందించనున్న వైఎస్ జగన్ ● ఉమ్మడి జిల్లా నుంచి 8.25 లక్షల సంతకాలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): మెడికల్ విద్యను పేదలకు దూరం చేసే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న పీపీపీ విధానంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించి ఆ ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కు నివేదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ క్రమంలో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన సంతకాల పత్రాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాష్ట్ర గవర్నర్ను కలిసి అందించనున్నారు. జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ఉద్యమానికి కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా మిగిలిన రాజకీయపక్షాలు, విద్యార్థి సంఘాలు సైతం స్పందిస్తున్నాయి. దీంతో చంద్రబాబు సర్కార్ బెంబేలెత్తుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి 8.25 లక్షల సంతకాలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి భారీ స్పందన లభించింది. రెండు జిల్లాల్లోని 14 నియోజకవర్గాల నుంచి ప్రజలు తమ సంతకాల ద్వారా చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ (పశ్చిమ), విజయవాడ (తూర్పు), విజయవాడ (సెంట్రల్), నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల నుంచి 4.25 లక్షల సంతకాలు రాగా, కృష్ణాజిల్లా నుంచి మచిలీపట్నం, గుడివాడ, పామర్రు, పెనమలూరు, పెడన, అవనిగడ్డ, గన్నవరం నియోజకవర్గాల నుంచి సుమారుగా నాలుగు లక్షల ప్రజల నుంచి సంతకాలను పార్టీ శ్రేణులు సేకరించాయి. ఆయా సంతకాల పత్రాలను 15వ తేదీన రెండు జిల్లాల నుంచి నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. ఉద్యమిస్తున్న రాజకీయ, విద్యార్థి సంఘాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలకు వైద్య విద్యను చేరువ చేసే లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వాటిల్లో కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కళాశాలలను పూర్తి చేసి తరగతులను సైతం ప్రారంభించారు. మరో రెండు కళాశాలలు అందుబాటులో వచ్చే సమయానికి ఎన్నికలు రావటంతో చంద్రబాబు సర్కార్ గద్దనెక్కింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానం అంటూ తన అనుకూల వర్గీయులకు మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకు కుట్రకు తెరలేపారు. దీనిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రజా ఉద్యమం కొనసాగుతూ ఉండగా అదేబాటలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు రోడ్డుపైకి వస్తున్నాయి. 7గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టారు. అవి పూర్తయితే నాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యలో మంచి అవకాశాలు వచ్చేవి. కాని ప్రభుత్వం మారినంత మాత్రానా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గ చర్యగా భావిస్తున్నా. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ప్రైవేటీకరణను ఆపాలి. – కుక్కమళ్ల బ్యూలా, బీటెక్ విద్యార్థి, కంచికచర్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఫీజులు భారీగా పెరిగి వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుంది. వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు అధికంగా పాల్గొని ప్రభుత్వంపై వ్యతిరేకత చాటారు. గవర్నర్ సైతం ప్రైవేటీకరణపై తుదినిర్ణయం తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలని కోరుతున్నాం. – జి.హేమంత్, బీటెక్ విద్యార్థి, మైలవరంప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్య విద్యను దూరం చేసినట్లే. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. – వెనుగుర్తి హరి, జగ్గయ్యపేటప్రభుత్వ దంత వైద్య కళాశాల 2020 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు బుధవారం వెటర్నరీ కాలనీలోని ఓ ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగాయి. గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.యుగంధర్ బుధవారం గుడ్లవల్లేరు పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేశారు. మందుల పంపిణీ, వార్డులను పరిశీలించారు. గుడివాడటౌన్: గుడివాడలో బుధవారం సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు కుటుంబసభ్యులతో హాజరయ్యారు. సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర అట్టడుగు వర్గాలకు వైద్య విద్యను దూరం చేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యంగా ఉంది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. – సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ ప్రభుత్వమే ప్రజల ప్రాథమిక హక్కులైన విద్యా, వైద్య రంగాలను కళ్ల ముందు కాజేస్తూ, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పీడీఎస్వో ఖండిస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల ిపీపీపీ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. యువగళం పాదయాత్రలో జీవో నంబర్ 107, 108ను రద్దు చేసి 100 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామన్న హామీని ఎందుకు నిలబెట్టుకోరని ప్రశ్నిస్తున్నాం. – ఏ సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్వో -
తక్షణమే విరమించుకోవాలి..
చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కార్పొరేట్లకు కారు చౌకగా అప్పజెప్పే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా ఒక్క పాఠశాల కానీ, కళాశాల కానీ, విశ్వవిద్యాలయం కానీ నిర్మించడం చేతకాలేదు. కానీ గత ప్రభుత్వంలో నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాసులకు కక్కుర్తి పడి కార్పొరేట్లకు లీజుకు ఇవ్వడం సరైన పద్ధతి కాదు. – ఎం. సాయికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ -
ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాలు ప్రారంభం
గుడివాడ టౌన్: స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వజ్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీవీ సత్యనారాయణ, డీన్ డాక్టర్ మణి, కళాశాల కరస్పాండెంట్ కేఎస్ అప్పారావు తదితరులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. 75ఏళ్ల క్రితం కళాశాల ఏర్పాటుకు సహకరించిన వారందరూ రైతులు కావడంతో రైతులను స్మరించుకుంటూ తొలి రోజు రైతు సదస్సు నిర్వహించారు. ఏరువాక సాగారో.. అనే చిన్నారుల నృత్యంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మనదేశంలో 15వేల మిలియన్ ఎకరాలలో పంటను పండిస్తే 145 కోట్ల మందికి భోజనం దొరుకుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల లోటు ఉన్న నేపథ్యంలో యాంత్రీకరణవైపు రైతు దృష్టిపెట్టాలన్నారు. ప్రిన్సిపాల్ పీజేఎస్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ బీఎస్ఎస్ పద్మజ, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కుంగ్ఫూలో తేజ్వీర్కు స్వర్ణపతకం
మచిలీపట్నంఅర్బన్: తండ్రి క్రీడా విజయాల బాటలో కుమారుడు కూడా అగ్ర స్థానానికి చేరుకున్నాడు. మచిలీపట్నానికి చెందిన అంతర్జా తీయ కిక్బాక్సింగ్ విజేత చలాది సతీష్ కుమారుడు చలాది తేజ్వీర్ (09) కుంగ్ఫూలో జాతీయ స్థాయిలో స్వర్ణపతకం సాధించాడు. ఈ నెల 14న చిలకలూరిపేటలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ నేషనల్ లెవల్ కుంగ్ఫూ, కరాటే చాంపియన్షిప్ 2025లో 25 కిలోల లోపు కాటా ఈవెంట్లో తేజ్వీర్ జాతీయ విజేతగా నిలిచి స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు. తేజ్వీర్ తండ్రి సతీష్ గత ఏడాది న్యూఢిల్లీలో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్బాక్సింగ్ ఇండియా (వాకో) ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రెండు రజత పత కాలు సాధించారు. ఇప్పుడు అతని కుమారుడు జాతీయ స్థాయిలో విజయం సాధించడం విశేషం. -
నిలిచిన సహకార సేవలు
పెనుగంచిప్రోలు: సహకార సంఘాల ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, ఆ దిశగా ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని ఆరోపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక(జేఏసీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా ఈనెల 6న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కాగా, 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీ బ్రాంచ్ల ముందు సంఘాలకు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. మంగళవారం మరోసారి అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. అలాగే ఈనెల 22న రాష్ట్రంలోని అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల ముందు ధర్నా, వినతి పత్రం అందించటం, 29న రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా, ఉన్నతాధికారులకు వినతిపత్రం, జనవరి5, 2026నుంచి విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలను జేఏసీ ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో 2,000 మంది ఉద్యోగులు.. ఉమ్మడి జిల్లాలో 425 సహకార సంఘాల్లో రెగ్యులర్, రోజువారీ వేతనంతో పనిచేసే మొత్తం 2000 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ధర్నాలో పాల్గొనటంతో సంఘ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. దీంతో సహకార సంఘాలకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పలేదు. జిల్లాలో సహకార కేంద్రాల ద్వారా రోజు రూ.కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు, ధాన్యం అమ్మినవారు డబ్బులు చెల్లించేందుకు సహకార సంఘాలకు వస్తున్నారు. ఇప్పటికే ఈ నెలలో 8న, 12న రెండు రోజులు తాళాలు వేశారని రైతులు అంటున్నారు. మంగళవారం కూడా సంఘాల్లో ఉద్యోగులు లేక పోవటంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బంగారు రుణాల కోసం పదుల సంఖ్యలో రైతులు బ్యాంకు ల వద్దకు వెచ్చి వెనుదిరగడం కనిపించింది. సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు -
జీవితాలతో బెట్టింగ్ ఆట
జి.కొండూరు: సంక్రాంతి సంబరాలు అంటూ నిర్వహిస్తున్న కోడిపందేల శిబిరాల వద్ద బెట్టింగ్ క్రీడలు జోరుగా సాగుతున్నాయి. శిబిరాల వద్దకు సరదాగా గడిపేందుకు వస్తున్న చిన్నారులు, యువకులను బెట్టింగ్ క్రీడలు ఆకర్షిస్తున్నాయి. పండుగ మూడు రోజుల సెలవుల్లో యువకులు, చిన్నారులు సరదాగా బెట్టింగ్ గేమ్లను ఆడడం పరిపాటిగా మారింది. ఈ సరదా వారిని బెట్టింగ్లకు బానిసగా మారుస్తోంది. చిన్న వయస్సులోనే ఆన్లైన్ గేమ్లు, బెట్టింగ్లకు అటవాటు పడిన యువకులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు, చోరీలకు తెగబడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది జిల్లాలో 70కిపైగా శిబిరాలు ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది సంక్రాంతి సంబరాల పేరుతో అనధికారికంగా 70కిపైగా కోడిపేందేల శిబిరాలు నడిచాయి. ఈ శిబిరాల ఏర్పాటుకు ముడుపులు, అద్దెల కోసం భారీగా ఖర్చు పెడుతున్న నిర్వాహకులు ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు పేకాటతో పాటు బెట్టింగ్ గేమ్లకు విచ్చలవిడిగా అనుమతినిచ్చారు. కోడిపందేలు నేరమని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంప్రదాయం పేరుతో ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో పోలీసులు అటు వైపు వెళ్లే అవకాశం లేకుండా పో యింది. కోడిపందేల శిబిరాల నిర్వాహకులు ఆదాయం కోసం బెట్టింగ్ గేమ్లకు అనుమతి ఇవ్వడంతో మూడు రోజులు పాటు చిన్నారులు, యువకులు పేకాట, కోసు ఆట, లోన – బయట, రాజు – రాణి, నలుపు – తెలుపు, బొమ్మలాట, నంబర్లాట, చిన్న బజారు – పెద్ద బజారు, మూడు ముక్కలాట, బొమ్మాబొరుసు వంటి ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ సరదా సంక్రాంతి సంబరాలు ముగిశాక ఆన్లైన్ గేమ్లు, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడేలా చేస్తోంది. బెట్టింగ్లకు డబ్బుల కోసం లోన్ యాప్ల నుంచి అప్పులు చేయడం, డబ్బు దొరకనప్పుడు చోరీలు, ఇతర నేరాలకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. వెలుగు చూసిన ఘటనల్లో కొన్ని.. -
మ్యాజిక్ బస్తో కేయూ అవగాహనా ఒప్పందం
కోనేరుసెంటర్: కృష్ణా యూనివర్సిటీ పలు సంస్థలతో చేసుకుంటున్న అవగాహన ఒప్పందాల్లో భాగంగా మంగళవారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఐబీఎం సంస్థతో సమన్వయంగా రానున్న 11 నెలల కాలంలో కృష్ణా యూనివర్సిటీలోని కళాశాలలు, దాని అనుబంధ కళాశాలలకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక టూల్స్తో లైఫ్ అండ్ ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ మీద విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించనుంది. అనంతరం ఆ సంస్థ ఆధ్వర్యంలోనే కొన్ని బహుళ జాతి సంస్థలలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. వర్సిటీ వీసీ ఆచార్య కె. రాంజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, వర్సిటీ శిక్షణ, ఉపాధి అవకాశాల డైరెక్టర్ ఆచార్య వైకే సుందరకృష్ణ, మ్యాజిక్ బస్ సంస్థ నుంచి డీజీఎం డి. శేఖర్బాబు, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సీహెచ్ మోహన్ సంస్థ ప్రతినిధులు శౌర్య, రత్న ప్రసాద్, పుష్పలత పాల్గొన్నారు. -
సబ్జైలులో జిల్లా జడ్జి తనిఖీలు
అవనిగడ్డ: జిల్లా న్యాయమూర్తి జి.గోపీ మంగళవారం అవనిగడ్డ సబ్జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమాండ్ ఖైదీలతో మాట్లాడారు. జైలులో అందుతున్న భోజన వసతి గురించి తెలుసుకున్నారు. స్టోర్ రూం, వంట గదిని న్యాయమూర్తి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. జైలు ప్రాంగణం అంతా కలియ తిరిగి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గోపీ మాట్లాడుతూ.. బెయిల్ కోసం న్యాయవాదులను పెట్టుకోలోని రిమాండ్ ఖైదీల కోసం న్యాయవాదులను ఏర్పాటు చేస్తామనానరు. ఖైదీల ప్రవర్తన గురించి జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, అవనిగడ్డ సీనియర్ సివిల్ జడ్జి కె.అరుణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వర్ణలత ఓల్గా, జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సనకా రఘురామప్రసాద్, న్యాయవాది దామెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మా కోసం పోరాడతానన్నారు
మా ఇళ్లు కూల్చివేత తరువాత న్యాయం చేయాలని కోరుతూ కలవని ప్రజాప్రతినిధి లేరు. కనీసం ఘటనా స్థలానికి వచ్చిన వారు లేరు. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు వెళ్లి కలిశాం. మా బాధలను ఆలకించిన ఆయన మా ప్లాట్ల వద్దకు వస్తానని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జగన్మోహన్రెడ్డి వచ్చారు. నలభై రెండు మందికి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. విశ్వసనీయతకు మారు పేరైన ఆయన మాలో నమ్మకం కల్పించారు. మా గుండెల్లో బాధను తగ్గించారు. – గోదావరి గంగ, బాధితురాలు -
నీడ లేకుండా చేశారు
కుటుంబంతో ఒకటో నంబరు ప్లాట్లో నిర్మించిన ఇంటిలో నివసిస్తున్నా. ప్లాటుకొనుగోలు చేసే సమయంలో లీగల్ ఓపీనియన్ తీసుకున్నాం. ఎవ రికై నా అభ్యంతరాలు ఉంటే తెలపాలని పేపరు ప్రకటన కూడా ఇచ్చాం. ఎవరి నుంచీ అభ్యంతరాలు రాలేదు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి రూ.70 లక్షలతో ప్లాటు కొనుగోలు చేశాం. అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే ఇంటి నిర్మాణం చేపట్టాను. ఇప్పుడు కొందరు గద్దల్లా వాలిపోయారు. 42 ప్లాట్లలో ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేసి, మాకు నిలువ నీడ లేకుండా చేశారు. – విద్యాసాగర్, బాధితుడు, జోజినగర్ -
మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ
మచిలీపట్నంటౌన్: స్థానిక బైపాస్రోడ్డు హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ మంగళవారం రాత్రి జరిగింది. మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్తో కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ చేపట్టిన ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన యాత్ర’ బందరుకు చేరిన సందర్భంగా వాజ్పేయి విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహ ఏర్పాటును తొలుత టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పోటీగా ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు యత్నించడంతో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో వాజ్పేయి, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని జనవరి 18న ఆవిష్కరిస్తారని సమాచారం. -
పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి
పిల్లలు సున్నిత మనసుతో ఉంటారు. దేనికైనా వెంటనే ఆకర్షితులవుతారు. తిరునాళ్లు, జాతర్లు, సంక్రాంతి సంబరాల వద్ద నిర్వహించే బెట్టింగ్ గేమ్లను సరదాగా ఆడుతూ వాటికి ఆకర్షితులు అవుతారు. తల్లిదండ్రులు ఆ ఆటల వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. బెట్టింగ్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. నిరంతరం పిల్లలపై పర్య వేక్షణ లేకపోతే వారు బెట్టింగ్లకు బానిసయ్యే ప్రమాదం ఉంది. – డాక్టర్ జి.అజయ్కుమార్, పిల్లల వైద్య నిపుణుడు, మైలవరం -
జియోడెటిక్ అసెట్ మ్యాప్ల ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కచ్చితమైన పటాల(మ్యాపుల) తయారీకి, సర్వేకు జియోడెటిక్ అసెట్ రిజిస్టర్ ఎంతగానో దోహదపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో జియోడెటిక్ అసెట్ రిజిస్టర్, రాష్ట్ర జియోడెటిక్ అసెట్ మ్యాప్లను సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడాతో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జియోడెటిక్ అసెట్ రిజిస్టర్లో గ్రేట్ ట్రిగ్నో మెట్రికల్ సర్వే స్టేషన్స్ (జీటీఎస్), గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ (జీసీపీ), స్టాండర్డ్ బెంచ్ మార్క్స్ (ఎస్బీఎం), గ్రావిటీ రిఫరెన్స్ స్టేషన్స్, మ్యాగ్నెటిక్ రిపీట్ స్టేషన్స్, టైడల్ అబ్జర్వేటరీస్ వంటి ఆరు అసెట్స్ ఉన్నాయని చెప్పారు. వీటి ద్వారా సర్వే, మ్యాపుల రూపకల్పన మెరుగ్గా చేయవచ్చని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడా మాట్లాడుతూ రాష్ట్రంలో స్వామిత్వ, నక్ష, అమృత్, ఏపీ రీ సర్వే వంటి కీలకమైన ప్రాజెక్టులలో సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మొదటిసారిగా తెలుగులో రూపొందించిన రాష్ట్ర పటాన్ని (మ్యాప్ను) కలెక్టర్కు అందజేశారు. -
చెట్టుకింద ఉంటున్నాం
జోజినగర్ 42 ప్లాట్లలో మాది 29వ ప్లాటు. 2001లో కొనుగోలు చేశాం. ఇంటి పన్నులు కూడా చెల్లించాం. మూడేళ్ల క్రితం రూ.30 లక్షల బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. స్టే ఉండగానే నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూల్చి నిలువ నీడ లేకుండా చేశారు. చెట్టుకింద ఉంటున్నాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. మా బాధ చెప్పుకొనేందుకు ఎయిర్ పోర్టు, ఇంటి వద్ద రెండు సార్లు జగనన్నను కలిశాం. పరామర్శకు వస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వచ్చారు. మా తరఫున ప్రభుత్వంపై పోరాడుతానన్నారు. మాకు ధైర్యం ఇచ్చారు. జగనన్నకు రుణపడి ఉంటాం. – యమున, బాధితురాలు -
లంచం తీసుకుంటూ దొరికిన ఉద్యోగికి రిమాండ్
విజయవాడలీగల్: గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలవరం కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్రింటింగ్ టెక్నీషియన్ నగేష్బాబుకు న్యాయమూర్తి ఈ నెల 30 వరకూ రిమాండ్ విధించారు. వివరాలివి.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు సంబంధించి విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జునకు ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు నగేష్బాబు రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో నాగార్జున అవినీతి నిరోధక శాఖ అధికారుల(ఏసీబీ)కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు వలపన్ని నగేష్బాబు తన కార్యాలయంలో లంచం మొత్తం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడిని మంగళవారం అవినీతి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి పి.భాస్కరరావు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఈనెల 30వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయ వాడ జిల్లా జైలుకు తరలించారు. కారుణ్య నియామకంలో ఆపరేటర్గా ఉద్యోగంలో చేరిన నగేష్బాబు 2022 నుంచి అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తిరువూరు: గంపలగూడెం మండలం వినగడప తండాలో మంగళవారం కిడ్నీ రోగి మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన భూక్యా సత్యం(47) పదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఏకొండూరు మండలం కుమ్మరికుంట్లకు చెందిన సత్యం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వివాహమైన తదుపరి వినగడప తండాలో నివసిస్తూ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న నీటి కారణంగా కిడ్నీవ్యాధికి గురైన సత్యం నాలుగేళ్లుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో, తదుపరి తిరువూరులో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. గత శనివారం తిరువూరు ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్ యూనిట్లో డయాలసిస్ చేస్తున్న సమయంలో అతనికి రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడంతో పరిస్థితి విషమించి అపస్మారక స్థితికి చేరాడు. హుటాహుటిన సత్యంను విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అసలే పేదరికం కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సత్యం కుటుంబం అతని చికిత్స నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
బాధితులకు జననేత భరోసా
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ‘నేనున్నా.. మీకు తోడుగా ఉంటా’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా బాధితుల్లో కొండంత ధైర్యం నింపింది. రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి, ప్రభుత్వ ఆదరణకు నోచుకోని బాధితులు జననేత ఆత్మీయ పరామర్శతో సాంత్వన పొందారు. బెజవాడ జోజినగర్లో చంద్ర బాబు ప్రభుత్వం అండతో 42 ప్లాట్లలో ఇటీవల అక్రమంగా కూల్చివేతకు గురైన ఇళ్ల బాధిత కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం జోజినగర్ చేరుకున్న జననేతకు బాధితులు ఒక్కొక్కరుగా తమ ఆవేదన వినిపించారు. రెక్కల కష్టంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుని పాతికేళ్లుగా నివ సిస్తున్నామని వివరించారు. ఇన్నేళ్ల తరువాత ఆ ప్లాట్లు తమవి కావంటూ తమ ఇళ్లను ఒక్కసారిగా బుల్డోజర్లతో కూల్చివేసి రోడ్డుపాలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. గంటకు పైగా బాధిత కుటుంబాలతో మాట్లాడిన జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన జగన్మోహన్రెడ్డి సుమారు గంటకు పైగా ఆయా కుటుంబాలను ఓదార్చారు. ప్రతి ఒక్కరినీ పరామర్శించి, వారి ఆవేదనను తెలుసుకున్నారు. స్థలాలను ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎంతకు కొన్నారు, ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ తీసుకున్న తీరును, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తదితర అంశాలపై బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జోజినగర్ 42 ప్లాట్ల ప్రాంతానికి చేరుకున్న జగన్మోహన్రెడ్డి ఆయా బాధిత కుటుంబాలు ఉన్న టెంట్లోకి వెళ్లి వారితో పాటు కూర్చుని వారి బాధలను ఓపికగా ఆలకించారు. ప్రభుత్వంపై బాధితుల ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి పోలీసు సిబ్బందితో తమను రోడ్డుపాలు చేసిందంటూ బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాము దశా బ్దాల క్రితం కష్టపడి కొనుగోలు చేసిన ఈ ప్లాట్లను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, అన్ని అనుమతులతో నిర్మించుకుని పాతికేళ్లుగా నివసిస్తున్న ఇళ్లను ప్రభుత్వం దగ్గరుండి కూల్చివేసి మోసగాళ్లకు కొమ్ముకాసిందని జగన్ వద్ద వాపోయాయి. తమ స్థలాలకు పన్నులు కట్టించుకుంటూ, ఇంటి నిర్మాణానికి ప్లాన్లతో ఆమోదం తెలిపి, విద్యుత్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ స్థలాలను ఎవరో వస్తే వారికి అండగా నిలిచి దోచి పెట్టిందని బాధితులు విలపించారు. జననేత కోసం తరలివచ్చిన జనసందోహం జోజినగర్కు వచ్చిన తమ అభిమాన నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడటానికి, కలిసి మాట్లాడటానికి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలతో జోజినగర్ పరిసరాలు మారుమోగాయి. భారీ జన సందోహం కారణంగా కారు దిగిన జగన్మోహన్రెడ్డి పక్కనే బాధిత కుటుంబాలు ఉన్న టెంట్ వద్దకు చేరుకోవడానికి 15 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, రుహుల్లా, మేయర్ రాయన భాగ్య లక్ష్మి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, రాష్ట్ర కార్యదర్శి గౌస్ మొహిద్దీన్, జోగి రాజీవ్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, వీఎంసీ ఫ్లోర్లీడర్ అరవ సత్యనారాయణ, కార్పొరేటర్లు ఆంజనేయరెడ్డి, చైతన్యరెడ్డి, ఇర్ఫాన్, కోటిరెడ్డి, షేక్ రెహమతున్నీసా, బండి నాగేంద్ర పుణ్యశీల, గోదావరి గంగ, శిరంశెట్టి పూర్ణ, సహాయ కార్యదర్శి షేక్ హాయత్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు సరగడ శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం
మీకోసంలో జిల్లా ఎస్పీకోనేరుసెంటర్: న్యాయం కోసం మీ కోసంను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఎస్పీ వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీకోసంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. సమస్య తీవ్రను బట్టి విచారణ జరిపించి చట్టపరిధిలో న్యాయం చేస్తామన్నారు. పోరంకి నుంచి వచ్చిన ఓ వివాహిత కొన్ని కారణాల వలన మొదటి భర్తతో విడాకులు తీసుకుని పెనమలూరుకు చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకోవటం జరిగిందని చెప్పింది. అయితే తాను అధిక కట్నం కావాలని మానసికంగా తీవ్ర వేధింపులకు పాల్పడటంతో పాటు శారీరకంగా దాడి చేస్తూ హింసిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరింది. వీటితో పాటు వచ్చిన అర్జీలపై స్పందించిన ఎస్పీ సమగ్ర విచారణ జరిపించి కచ్చితంగా న్యాయం చేస్తామని బాఽధితులకు హామీ ఇచ్చారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ వీవీ నాయుడు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. -
ఏసీబీ వలలో సాగునీటి ప్రాజెక్టు ఉద్యోగి
విజయవాడలీగల్: పోలవరం కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్రింటింగ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న నగేష్బాబు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు సంబంధించి గుత్తేదారుకు ధ్రువీ కరణ పత్రం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జున నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేయడంతో నాగార్జున ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నాగార్జున ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని నగేష్బాబు తన కార్యాలయంలో లంచం మొత్తం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నగేష్బాబు నివాసం, కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కారుణ్య నియామకంలో ఆపరేటర్గా ఉద్యోగంలో చేరిన నగేష్బాబు 2022 నుంచి అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. చిలకలపూడి(మచిలీపట్నం): ఖాతాదారునికి వడ్డీతో ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షుఢు చింతలపూడి కిషోర్కుమార్, సభ్యురాలు శ్రీలక్ష్మీరాయల సోమవారం తీర్పునిచ్చారు. మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన డి.వెంకటనరసింహారావు ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో 2014లో తనకు, తన కుటుంబ సభ్యులకు కలిపి పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 2024లో నరసింహారావు గుండె సమస్యతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యి రూ.1,98,915 ఖర్చు చేశారు. క్లయిమ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించగా మెడికల్ రికార్డులు పరిశీలించి రూ.1,12,026 లు మాత్రమే చెల్లించారు. బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాలని ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీని అడిగినా ప్రయోజనం లేకపోవటంతో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. కమిషన్ సభ్యులు పూర్వాపరాలను విచారించి ఖాతాదారుడు నరసింహారావుకు బ్యాలెన్స్ మొత్తం రూ.76,862 లు ఫిర్యాదు చేసిన రోజు నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని మానసిక వేదనకు రూ.5 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పు చెప్పారు. -
వంశీని పలకరించారని టీడీపీ వారిపైనే దాడి
రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వర్గీయులు గన్నవరం: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ను పలకరించినందుకు టీడీపీ వారిపైనే దాడి చేశారు. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెం గ్రామంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని పరామర్శించేందుకు వల్లభనేని వంశీ ఆదివారం మర్లపాలెం వెళ్లారు. ఆయనను టీడీపీకి చెందిన కంభంపాటి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఇది జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు కంభంపాటి సాయి, శేషు, జాస్తి మురళి ఆదివారం రాత్రి గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న శ్రీధర్పై అకారణంగా దాడి చేశారు. తనపై ఎందుకు దాడి చేశారని అడిగేందుకు బంధువైన కంభంపాటి రామ్మోహన్రావుతో కలిసి శ్రీధర్ గ్రామంలోని సాయి ఇంటికి వెళ్లగా... మరోసారి సాయి, శేషు, జాస్తి మురళీతో పాటు విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హాకీ స్టిక్స్, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో శ్రీధర్ తలకు, రామ్మోహన్రావు చేతికి బలమైన గాయాలయ్యాయి. వారిని బంధువులు వెంటనే చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, తాను 20 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నానని, గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు విజయం కోసం పని చేశానని శ్రీధర్ తెలిపారు. ఎన్నికల అనంతరం యార్లగడ్డ ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ తమను దూరం పెట్టారని చెప్పారు. తమ సమీప బంధువుల ఇంటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీని పలకరించాననే కక్షతో యార్లగడ్డ వర్గీయులు అమానుషంగా దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంభంపాటి శ్రీధర్, రామ్మోహన్రావును సోమవారం వల్లభనేని వంశీ పరామర్శించారు. -
అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అధిక ప్రాధాన్యతతో శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ ఎం. నవీన్, ఇన్చార్జ్ డీఆర్వో శ్రీదేవి, ఏఎస్పీ సత్యనారాయణ, ఆర్డీవో స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మీ కోసంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాకపోతే వెంటనే సంబంధిత అర్జీదారునికి ఏ విధంగా పరిష్కరించాలో వివరించే వివరణతో సమాధానం ఇవ్వాలన్నారు. మీ కోసంలో 151 అర్జీలను అధికారులు స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. -
అమరజీవి త్యాగం అజరామరం
కోనేరుసెంటర్: ఆఽంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరువలేనిదని కృష్ణా జిల్లా ఎస్పీ వీవీఎస్ నాయుడు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర సాధనకు కఠోర నిర్ణయంతో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి పొట్టి శ్రీరాములు అమరుయ్యాడన్నారు. పొట్టి శ్రీరాములు జీవితం మన అందరికీ ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జయహో దుర్గాభవాని
సంబరంగా ముగిసిన దీక్ష విరమణ ఉత్సవాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఐదు రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు సోమవారం మహా పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. మొత్తం 5.27లక్షల మంది భవానీలు దీక్షలను విరమించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రికి నగరానికి చేరుకున్న భవానీలు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గిరిప్రదక్షిణను పూర్తి చేసుకున్నారు. అర్ధరాత్రి క్యూలైన్లోకి చేరుకున్న భవానీలు, భక్తులకు గంటన్నర లోపే అమ్మవారి దర్శనం పూర్తయింది. కొండ దిగువకు చేరుకున్న భవానీలు ఇరుముడులు, హోమగుండానికి నేతి కొబ్బరి కాయలను సమర్పించిన దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి భవానీలకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ మార్గంలో భవానీల తాకిడి కనిపించింది. రద్దీ నేపథ్యంలో గిరిప్రదక్షిణకు నాలుగున్నర నుంచి 5 గంటల సమయం పట్టింది. ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గిరిప్రదక్షిణ మార్గంలో రద్దీ కొనసాగుతూనే ఉంది. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి పరిసరాలు, కెనాల్రోడ్డు, సీతమ్మ వారి పాదాలు, వీఎంసీ కార్యాలయ పరిసరాలు అరుణవర్ణాన్ని సంతరించుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. రేపటి నుంచి ఆర్జిత సేవలు.. మంగళవారం భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతాయని, మంగళవారం కూడా వచ్చే భవానీలకు అన్ని క్యూలైన్లలో ఉచితంగా అనుమతిస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు. దీక్షలు ముగియడంతో బుధవారం నుంచి ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించే అన్ని ఆర్జిత సేవల్లో ఉభయదాతలు పాల్గొనవచ్చని, టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామని ఆలయ అధికారులు ప్రకటించారు. మహా పూర్ణాహుతితో పరిసమాప్తం.. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఆలయ అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్.దుర్గాప్రసాద్, ఇతర వైదిక కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్, భవానీ దీక్ష విరమణల ఫెస్టివల్ ఆఫీసర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారం, సమష్టి కృషితోనే దీక్ష విరమణలను విజయవంతంగా నిర్వహించగలిగామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఆయన మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఈ ఏడాది దీక్ష విరమణలు చేసిన భవానీల సంఖ్య పెరిగిందని, మొత్తంగా 5.27 లక్షల మంది రాగా, 21.25లక్షల లడ్డూలను విక్రయించారన్నారు. అన్న ప్రసాదం, అల్పాహారాన్ని 2.13 లక్షల మందికి అందించామని, సుమారు 60వేల మంది భవానీలు అమ్మవారికి తలనీలాలు సమర్పించారని చెప్పారు.పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు, అధికారులు -
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు
కలెక్టర్ బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణకు అవసరమైన వాహనాలు, గోనె సంచులను సమకూర్చి సహకరించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ రైస్మిల్లర్లకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం రాత్రి జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్తో కలిసి రైస్మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అత్యధికంగా 149 కంబైన్డ్ హార్వెస్టర్లు వరికోతలు కోయటంతో ఎక్కువగా ఒకేసారి ధాన్యాన్ని సేకరించాల్సి వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గోనె సంచులు, వాహనాలను సమకూర్చినప్పటికీ సరిపోవటం లేదని చెప్పారు. మిల్లర్లు వారి వద్ద ఉన్న గోనె సంచులు, వాహనాలను రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమకూర్చాలన్నారు. 75 శాతం కోతలు పూర్తి.. జిల్లాలో ఇప్పటికే 75 శాతం వరికోతలు పూర్తయ్యాయని, ప్రస్తుతం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉందన్నారు. ఆ ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. రోజుకు 20 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే బ్యాంక్ గ్యారెంటీలు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతు కోత కోసిన వెంటనే ధాన్యాన్ని తీసుకువస్తున్నారని దానిని ఆరబెట్టేందుకు వీలుగా మిల్లర్ల వద్ద ఉన్న డ్రయర్లను వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రైతులు 1318 రకం వరిని పండిస్తున్నారని ఆ ధాన్యాన్ని కూడా తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. జిల్లాకు మరో 10 లక్షల గోనె సంచులను త్వరలో తీసుకువస్తున్నామని తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.శివరామప్రసాద్, రైస్మిల్లర్లు పాల్గొన్నారు. -
చల్లపల్లిలో కారు బీభత్సం
చల్లపల్లి: కారు అదుపు తప్పి జనంపైకి దూసుకుపోవటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి పోలీస్టేషన్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సాయంత్రం 5 గంటల సమయంలో సంతబజారు వద్ద చల్లపల్లి–మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్టేషన్ రోడ్డులోకి కారు మలుపు తిరిగింది. ఇంతలోనే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుని అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాయనమ్మ, మనవరాలు కూతాటి నాగమల్లేశ్వరి, కూతాటి జెనీలియాలను ఢీ కొట్టి, అదే వేగంతో వెళ్తూ చల్లపల్లికి చెందిన గెల్లి రాధాకృష్ణను ఢీకొంది. మరికొంత దూరం ముందుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందున్న మండపం వద్ద మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి జెనీలియా, నాగమల్లేశ్వరి, రాధాకృష్ణలను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయాకు, నాగమల్లేశ్వరికి బలమైన గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద మృతి చెందిన వ్యక్తిని నందిగామ కమలాకరరావుగా గుర్తించారు. నాగాయలంకకు చెందిన కమలాకరరావు(60) చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి.. కారు నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్ చేతకాకకపోవటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుగా ఉన్న మండపాన్ని ఢీ కొని కారు ఆగిందని.. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది. -
అక్కినేని వజ్రోత్సవ వైభవం
గుడివాడరూరల్: గుడివాడలో విద్యా రంగానికి పెన్నిధి అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) కళాశాల నిలిచింది. మొదటి 1950లో గుడివాడ కళాశాలగా ప్రారంభమై నేడు అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా రూపాంతరం చెంది 75 ఏళ్లు (వజ్రోత్సవాన్ని) పూర్తి చేసుకోనుంది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కళాశాల వజ్రోత్సవాలు నిర్వహించేందుకు కళాశాల పాలకవర్గం వజ్రోత్సవ కమిటీని ఏర్పాటు చేసి గత నెలరోజులుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకల్లో స్వర్గీయ అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు, కళాశాలలో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు భారీగా హాజరు కానున్నారు. కళాశాల ఏర్పాట్లు బీజం పడింది ఇలా.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కృష్ణా డెల్టాలోని రైతుబిడ్డలు స్థానికంగా ప్రాథమిక విద్యనభ్యసించినా, ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వారికి డిగ్రీ కోర్సులను అందుబాటుకి తీసుకురావాలన్న సంకల్పంతో 1950లో గుడివాడలో కళాశాలకు పునాది పడింది. విశాఖపట్నంలోని యూనివర్సిటీ వారిని అప్పటి ప్రముఖులు కలసి సమస్యను వివరించగా సానుకూలంగా స్పందించారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత గుడివాడ, కై కలూరు, గన్నవరం ప్రాంతాల్లోని ప్రముఖులతో 1950 ఏప్రిల్ 22వ తేదీన శ్రీనివాస సినిమా హాల్లో సమావేశం నిర్వహించారు. పర్వతనేని వెంకటరత్నం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కాజ వెంకట్రామయ్య, సంయుక్త కార్యదర్శిగా వేములపల్లి రామబ్రహ్మం, కోశాధికారిగా ఉప్పలపాటి వీరభద్రరావు, సభ్యులుగా వడ్డే శోభనాద్రి, లింగం వెంకటకృష్ణయ్య, ఉపద్రష్ట పాపన్నశాస్త్రిలతో గుడివాడ కళాశాల ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పాటైంది. 1959లో సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, వారి మిత్రులు రూ.లక్ష కళాశాలకు విరాళంగా ఇవ్వడంతో అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా రూపాంతరం చెందింది. ల్రైబరీతో పాటు మెయిన్ బిల్డింగ్ను ఏర్పాటు చేయించి నిర్వహణ ప్రారంభించారు. 1961లో ముదినేపల్లికి చెందిన యెర్నేని వెంకటేశ్వరరావు రూ.54 వేలు విరాళం ఇవ్వగా ఆయన తండ్రి పేరు యెర్నేని చలమయ్య ఆడిటోరియం నిర్మించారు. కాలానుగుణంగా చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాశాలలో చదివి ఉన్నత స్థానాలకు ఎదిగిన పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి కళాశాలకు కావాల్సిన అన్ని రంగాలు, అభివృద్ధి పనులు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం వల్ల నేడు ఏఎన్నార్ కళాశాల 75సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంది. వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ విద్య.. వచ్చే ఏడాది నుంచి ఏఎన్నార్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెడుతున్నట్లు కళాశాల పాలకవర్గ సభ్యులు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతోనే ఇంజినీరింగ్ విద్యను ప్రవేశ పెడుతున్నామన్నారు. కేవలం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు మాత్రమే చెల్లించి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించవచ్చని పాలకవర్గ సభ్యులు తెలిపారు. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) కళాశాల వజ్రోత్సవాలను మంగళవారం నుంచి 18వ తేదీ వరకు నిర్వహించేందుకు కళాశాల పాలకవర్గం ఏర్పాట్లు పూర్తి చేసింది. మచిలీపట్నంఅర్బన్: ఈ నెల 21న నిర్వహించ నున్న పల్స్ పోలియో కార్యక్రమ పోస్టర్లను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ఆవిష్కరించారు.9కృష్ణాజిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టామని.. అన్ని వర్గాల ప్రజలు తమతో చేయి కలిపారన్నారు. ప్రజామోదంతో కోటి సంతకాలు చేపట్టామని, కోటి సంతకాలను గవర్నర్కు అందిస్తామని చెప్పారు. ప్రజా కలం.. నిరసన గళమై నినదించింది.. సంతకాల రూపంలో తమ అభీష్టాన్ని ప్రస్ఫుటం చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు సహించబోమని చాటి చెప్పింది. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఏకంగా 4లక్షల మంది సంతకాలు చేశారు. ఈ ప్రతులను సోమవారం బందరు నుంచి భారీ ర్యాలీ నడుమ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసమన్నారు. చంద్రబాబే అధికారంలో ఉండాలని కోరుకునే వాళ్లు కూడా ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రి, మాజీ పోలీస్ అధికారి వెంకటేశ్వరరావు ప్రస్తుత పాలనలోని పలు విధానాలను తప్పుపడుతున్నారన్నారని గుర్తు చేశారు. -
ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్ బీ’ సెమీ ఫైనల్
●నాలుగు కేటగిరీల్లో పరీక్షలు నిర్వహణ ●278 మంది విద్యార్థుల హాజరు ●ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి హాజరైన విద్యార్థులు కృష్ణలంక(విజయవాడతూర్పు): విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై నైపుణ్యాలను పెంచేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ సెమీ ఫైనల్ రౌండ్ పరీక్షలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. గతంలో జరిగిన క్యార్టర్ ఫైనల్ రౌండ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సెమీ ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. విజయవాడ, బందరురోడ్డులోని నలంద డిగ్రీ కాలేజీలో జరిగిన పరీక్షలకు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ స్కూల్స్ నుంచి 278 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నాలుగు కేటగిరీలుగా విభజించి పరీక్షలు నిర్వహించారు. కేటగిరి–1లో 39 మంది, కేటగిరీ–2లో 78 మంది, కేటగిరీ–3లో 94 మంది, కేటగిరీ–4లో 67 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పోటీతత్వాన్ని పెంపొందించేలా నిర్వహిస్తున్న పరీక్షలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి కనబరిచి వారే స్వయంగా తమ పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కాలేజీ ఆవరణలో సందడి నెలకొంది. ప్రధాన స్పాన్సర్గా డ్యూక్స్ వాఫీ, అసోసియేట్ స్పాన్సర్గా ట్రిప్స్ ఇంటర్నేషన్ స్కూల్(రాజమండ్రి) వ్యవహరిస్తున్నారు. ఈ పరీక్షలను నలంద డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అనురాధ, ఏఓ కాళీప్రసాద్ పర్యవేక్షించారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు త్వరలో హైదరాబాద్లో జరగనున్న ఫైనల్ రౌండ్ పరీక్షలకు అర్హత సాధిస్తారని ఈవెంట్స్ అసిస్టెంట్ మేనేజర్ ఇ.శ్రీహరి తెలిపారు. -
శాతవాహన కళాశాల పరిరక్షణకు ఐక్య కార్యాచరణ
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): శాతవాహన కళాశాల పరిరక్షణకు విద్యార్థి సంఘాలు అన్ని కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించాలని అప్పుడే కళాశాలకు పూర్వ వైభవం వస్తోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర చెప్పారు. స్థానిక విశాలాంధ్ర రోడ్డులో శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం ఆ కళాశాల ఆవరణలోని మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు, విద్యార్థి సంఘాల కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించి చేసే కార్యక్రమాల్లో తమ సంఘం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. భవనాలను కూల్చడం అనాగరిక చర్య.. శాతవాహన కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సాంబిరెడ్డి మాట్లాడుతూ.. శాతవాహన కళాశాల ఐదు దశాబ్దాల పాటు వేల మందికి విద్యను అందించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దిందన్నారు. కళాశాల స్థలం విలువ కోట్ల రూపాయలకు పెరగడంతో కొంతమంది వ్యక్తులు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. శాతవాహన కళాశాల స్థలాన్ని దురాక్రమణదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవలసిన బాధ్యత శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘంపైనే ఉందన్నారు. ఇందుకోసం కోసం అన్ని విద్యార్థి సంఘాలతో పాటు పూర్వ విద్యార్థులు సంఘం సభ్యులు కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించాలన్నారు. దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధి పి.కృష్ణమోహన్ మాట్లాడుతూ శాతవాహన కళాశాల స్థలాలను పరిరక్షించుకుని కళాశాలను పూర్వస్థితికి తీసుకురావడానికి తమ సొసైటీ అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు నవనీతం సాంబశివరావు, సభ్యులు ఎం.రామకృష్ణ మాట్లాడుతూ కళాశాల భవనాలను కూల్చడం, క్రీడా మైదానాన్ని జేసీబీలతో తవ్వించడం వంటి దుశ్చర్యలు అనాగరికమన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులు రవి, కిరణ్, వెంకన్న, వాలేశ్వరరావు వల్లూరు బాబు, భాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర -
షటిల్ డబుల్స్ టోర్నమెంట్ విజేత విజయవాడ జట్టు
నాదెండ్ల: క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు యువత మధ్య స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయని సీఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చుండి రంగనాయకులు అన్నారు. గణపవరం సీఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయి షటిల్ డబుల్స్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సీఆర్ కళాశాల షటిల్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో నియోజకవర్గ స్థాయిలో 30 జట్లు, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయిలో 40 జట్లు పాల్గొన్నాయి. మూడు జిల్లాల స్థాయి విజేతలు మూడు జిల్లాల స్థాయిలో విజయవాడకు చెందిన ధనుష్, చంద్రగోపీ మొదటి బహుమతి కై వసం చేసుకున్నారు. రెండు, మూడు, నాల్గవ బహుమతులు వరుసగా విజయవాడకు చెందిన విజయ్సాయిరెడ్డి, పోతురాజు, గణపవరం గ్రామానికి చెందిన జాక్సన్, పృథ్వీ, కోండ్రుపాడు, గణపవరానికి చెందిన ఆదినారాయణ, సుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా కొండెపాటి నాగయ్య, రమేష్, నరేంద్ర, గేరా యాకోబు వ్యవహరించారు. కమిటీ సభ్యులు యశ్వంత్చౌదరి, సాయిచౌదరి, పట్నంశెట్టి మణికంఠ, నాని, బాషా, ఆదినారాయణ పర్యవేక్షించారు. -
చిత్రం.. భళారే విచిత్రం
విజయవాడ కల్చరల్: ఏపీ సృజనాత్మక సమితి, తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య ఆధ్వర్యాన పున్నమ్మ తోటలోని దూరదర్శన్, టీటీడీ కల్యాణమండపం రోడ్డులో నిర్వహించిన చిత్ర కళాప్రదర్శన ఆకట్టుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులు వారి చిత్రాలను ప్రదర్శించారు. 200 స్టాల్స్లో ప్రదర్శించిన చిత్రాలు కనువిందు చేశాయి. ఆధునిక చిత్రకళ ఉట్టిపడేలా గ్రామీణ జీవనం, రైతులు, ప్రకృతి సౌందర్యం, పల్లెజీవితం, జాతీయ నాయకులు, దేవతా మూర్తులు తదితర అంశాలతో కూడిన చిత్రాలను ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చిత్ర కళాప్రదర్శన రాత్రి 9 గంటలవరకు సాగింది. ప్రపంచ తెలుగు చిత్రకళా సమాఖ్య అధ్యక్షుడు పీరన్, కార్యదర్శి బాలయోగి, టి.వెంకటర్రావ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడానికే.. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఆశయంతో చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు పీరన్ తెలిపారు. బాల చిత్రకారులకు ఇటువంటి వేదికలు అవసరమన్నారు. అమరావతి కేంద్రంగా కళాకారుల ప్రదర్శనకు ఆడిటోరియం నిర్మించాలని సూచించారు. నిర్వాహకులు శిబిరంలో పాల్గొన్న చిత్రకారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. -
ఏపీఆర్ఎస్ఏ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
చల్లపల్లి: చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన వృత్తిరీత్యా విశాఖపట్నంలో హెడ్కానిస్టేబుల్గా చేస్తున్న మురాల నాగమల్లేశ్వరరావు 7వ ఏపీ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటారు. రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. నాగమల్లేశ్వరరావు 40–45 ఏళ్ల క్రీడాకారుల విభాగంలో మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శనివారం నిర్వహించిన పోటీల్లో విశాఖ జిల్లా తరఫున పాల్గొని గెలుపొందారు. ఐదు కిలోమీటర్లు, 1500 మీటర్లు పరుగు పందేల్లో బంగారు పతకాలు, 110 హర్డిల్స్ పందెంలో వెండి పతకాన్ని కై వసం చేసుకున్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం జనసంద్రంగా మారింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగర్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యాన సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఏపీ టీచర్స్ ఫెడరేషన్ కార్యవర్గం ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నికై ంది. సూర్యారావుపేటలోని ఏపీటీఎఫ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ద్వితీయ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏపీటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా వి.రాధిక, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఖాసీం, ఉపాధ్యక్షులుగా టి.పూర్ణచంద్రరావు, ఎన్.అవని, ఎండీ నయీం అహ్మద్, డి.రాజకుమార్, కార్యదర్శులుగా డి.వసరాం, ఏ సుందరరామారావు, శెట్టిపోగు రాము, షేక్ ఖాజా, షేక్ లాల్మద్, రాష్ట్ర కౌన్సిలర్లుగా పీవీ దుర్గా ప్రసాద్, ఎస్కే నిఖత్ సుల్తానా ఎన్నికయ్యారు. పీఆర్సీ కమిషన్ నియమించాలి.. ఎన్నికల అధికారిగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పువ్వాడ వెంకటేశ్వర్లు, పరిశీలకులుగా మక్కెన శ్రీనివాసరావు వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్, ఉపాధ్యక్షులు అనిత మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పని గంటల పెంపు విధానాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు మండాది వెంకటేశ్వర్లు, శోభనాద్రాచార్యులు, వై.భాస్కరరావు, కె.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
బందరులో పందెంకోళ్ల కూతలు
●రంగు, వాటాన్ని బట్టి పందెంపుంజుల కొనుగోళ్లు ●రూ.10 వేల నుంచి రూ.30 వేల ధర పలుకుతున్న పుంజులు కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లా కేంద్రమైన బందరులో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగకు నెల ముందునుంచే హడావుడి కనిపిస్తోంది. ప్రధానంగా పందెంకోళ్ల కూతలు విన్పిస్తున్నాయి. పందెంరాయుళ్లు పుంజుల కొనుగోలుకు గాలిస్తున్నారు. కిందటేడాది కాకిడేగ మైలాను మట్టి కరిపించిందని ఒకరంటే.. నీ కాకిడేగ మైలానే కొట్టింది నా నెమలి అయితే పర్లాను పరుగులు పెట్టించింది గుర్తుందా.. అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏ రంగుకు ఏ రంగు కోడి కలపాలి, ఏ సమయంలో పందెం వేయాలి, ఎప్పుడు కత్తి కట్టి వదలాలి, ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోతుందనే చర్చలు సాగుతున్నాయి. పందెంకోడి కూత వినబడితే చటుక్కున ఆగి పెంపకందారులతో బేరసారాలు ఆడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి అడ్వాన్స్లు ఇచ్చేస్తున్నారు. పుంజు రంగు, వాటం, కాలు విసిరే విధానం నచ్చితే.. రేటు గురించి కూడా ఆలోచించడంలేదు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, అబ్రాస్, నెమలి, సీతువా, రసంగి, పర్లా, పింగళా, కక్కిరి, మైలా, ఎర్రబొట్ల సీతువా.. ఇలా రంగులను బట్టి పుంజు జాతి గలది అయితే ఒక్కో కోడిని రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ధరకు కొనేస్తున్నారు. పలువురు పందెంకోళ్లను జీడిపప్పు, పిస్తా, కోడిగుడ్లు, కీమా వంటి ఖరీదైన మేతలతో యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. సండే మార్కెట్లో సందడి.. సంక్రాంతి దగ్గర పడుతుండటంతో బందరు సండే మార్కెట్లో పందెంరాయుళ్ల సందడి పెరిగింది. మిగిలిన రోజుల్లో కూర కోళ్లకు మాత్రమే గిరాకీ ఉండగా ప్రస్తుతం పందెంపుంజుల కూతలు విన్పిస్తున్నాయి. దీంతో పందెంరాయుళ్లు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే పుంజుల కోసం సండే మార్కెట్కు చేరుకుంటున్నారు. సండే మార్కెట్లో ఓ మాదిరి పందేలు వేసుకునే వారికి అనుకూలంగా రూ.3 వేల నుంచి రూ.7 వేల వరకు ధర పలికే పుంజులు అమ్మకానికి వస్తున్నాయి. ఈసారి సంక్రాంతికి ఈ ప్రాంతంలో కోడిపందేలు పెద్ద ఎత్తున జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమనలు దిగ్విజయంగా జరుగుతున్నాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. దీక్ష విరమణలపై ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్ వేద పండితులు షణ్ముఖేశ శాస్త్రి, అర్చకులు యూ మురళీధర శాస్త్రిలు మాట్లాడారు. దేవదాయ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ భవానీలకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. 9 మందితో ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు లక్షలాది మంది దీక్షలు స్వీకరించే స్థాయికి చేరిందన్నారు. భవానీలకు వీలైనంత అధిక సమయం దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. దీక్ష విరమణలన్నీ శాసీ్త్రయంగానే సమర్పిస్తున్నామని చెప్పారు. -
అనారోగ్య పరిస్థితులు లేవు
● ఆర్టీసీలో మెకానిక్ రామకృష్ణ ● 59 ఏళ్లలోనూ పాల్గొంటే పతకాలే ● ఇప్పటి వరకు 225 పైగా బహుమతులు కై వసం ● హైస్కూలు స్థాయి నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ వరకు పతకాల పంట ఆటోనగర్(విజయవాడతూర్పు): ఆయన ఆర్టీసీలో మెకానిక్. 59 ఏళ్ల ప్రాయంలోనూ ఆటల పోటీలంటే అత్యంత ఆసక్తి చూపుతున్నారు. ఆటల్లో సత్తా చాటి క్రీడా కోటాలో ఆర్టీసీ ఉద్యోగం సాధించారు బంటుమిల్లి మండలం ఆముదాలపల్లికి చెందిన పి.రామకృష్ణ. ఆయన ఇప్పటి వరకు 225 పైగా బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. మొదటి బహుమతితో క్రీడా కోటాలో.. రామకృష్ణకు రన్నింగ్, సైక్లింగ్, యోగా అంటే మక్కువ. పాఠశాల స్థాయిలోనే ప్రావీణ్యం చూపారు. 1988లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి మారథాన్ 42.195 కిలోమీటర్ల విభాగంలో (రన్నింగ్ 3.28 గంటలు) ప్రథమ స్థానం సాధించారు. ఐటీఐ చదివిన ఆయన ఈ సర్టిఫికెట్తో 1991లో ఆర్టీసీ అవనిగడ్డ డిపోలో మెకానిక్గా ఉద్యోగంలో చేరారు. ఇలా ఇబ్రహీంపట్నం, గవర్నర్పేట, గుడివాడ డిపోల్లో చేసి ప్రస్తుతం ఆటోనగర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతను నెరవేరుస్తూ.. మరోవైపు రన్నింగ్లో పతకాలు సాధించి ఆర్టీసీకి, జిల్లాకు ఖ్యాతి తెస్తున్నారు. నాటి నుంచి ఇప్పటి వరకు.. హైస్కూల్ స్థాయిలోనే కాకుండా ప్రస్తుతం మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరుస్తున్నారు. ఎన్నోపతకాలను సొంతం చేసు కుంటున్నారు. ఆయన పాల్గొంటే కచ్చితంగా పతకం సాధించడమే. యువతకు శిక్షణ ఉద్యోగం చేస్తూనే జిల్లాలో యువకులకు నడక, యోగా, రన్నింగ్లో శిక్షణ ఇస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన వారిలో పలువురికి పోలీసు, ఇతర శాఖల్లో ఉద్యోగాలు వచ్చినట్టు రామకృష్ణ చెబుతున్నారు. 1988, 1993, 98, 2000, 2006, 2009, 2010, 2011 వరకు జరిగిన మారథాన్ రన్నింగ్లో బంగారు పతకాలు సాధించారు. 2025లో ఇటీవల నవంబరులో జరిగిన పరుగు పందాల్లో మూడో స్థానం పొందారు. ఈ నెలలో జరిగిన 44వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అధ్లెటిక్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించారు. అనేక పోటీల్లో వెండి, కాంస్య పతకాలు సాధించారు. నాకు 59 సంవత్సరాలు . ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవు. ఇప్పటి వరకు 50 బంగారు పతకాలు, 100 వెండి, 75 కాంస్య పతకాలు సాధించాను. కొన్నేళ్ల నుంచి కానూరులోని సిద్ధార్థ కాలేజీలో యువకులకు, మధ్య వయసు వారికి నిత్యం రన్నింగ్, యోగా, సైక్లింగ్లో శిక్షణ ఇస్తున్నాను. గతంలో శిక్షణ పొందినవారు పోలీసు, ఇతర శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. –పి.రామకృష్ణ, ఆర్టీసీ మెకానిక్, ఆటోనగర్ డిపో -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై..నియోజకవర్గం సంతకాల సంఖ్య మచిలీపట్నం 65,000 పామర్రు 50,815 గుడివాడ 60,000 అవనిగడ్డ 54,000 పెడన 43,000 గన్నవరం 40,000 పెనమలూరు 50,000 మొత్తం 3,62,815 పతకాల వీరుడు @597చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. డివిజన్, మండలస్థాయిలో కూడా మీ కోసం జరుగుతుందని పేర్కొన్నారు.సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ సెమీ ఫైనల్ రౌండ్ పరీక్షలు ఆదివారం విజయవాడ నలంద డిగ్రీ కాలేజీలో ఉత్సాహంగా జరిగాయి. గుడివాడరూరల్: గుడివాడ మెయిన్రోడ్డు లోని అద్దేపల్లి కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.కోటి ఆస్తి నష్టం సంభవించింది. -
28 బ్రాంచీలు.. రూ.30 కోట్లు వసూలు !
● రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ బాధితులు ●ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారికే బ్రాంచ్ల నిర్వహణ బాధ్యతలు ● గుట్టుగా పెట్టుబడులు తరలించి బోర్డు తిప్పేసిన నిర్వాహకులు తిరువూరు: ౖలెఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అడ్వయిజరీ సర్వీసెస్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా శాఖలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఆకర్షణీయమైన బ్రోచర్లు, అధిక వడ్డీల పేరుతో ప్రజలకు నమ్మకం కలిగించి 2023 నుంచి పెట్టుబడులు స్వీకరించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సంస్థకు చైర్మన్గా ఎన్ఎస్ఎన్ దుర్గాప్రసాద్, సీఈఓగా ఆయన భార్య శివానీ వ్యవహరించారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నమ్మకస్తులైన ఐదుగురిని నియమించుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, వరంగల్ పట్టణాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 28 బ్రాంచ్లు ఏర్పాటుచేసి రూ.30 కోట్లకు పైగా వసూలు చేశారు. తాము 200కు పైగా ప్రాజెక్టుల ద్వారా లాభాలను అందిస్తామని కస్టమర్లను నమ్మించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష మొదలుకుని రూ.10 లక్షల వరకు డిపాజిట్లు స్వీకరించారు. మొక్కలు పెంచే ఆలోచన ఉన్నవారే తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలంటూ బ్రోచర్లలో నిబంధనలు వల్లెవేశారు. పోస్టాఫీసులు, బ్యాంకుల కంటే అధిక మొత్తంలో వడ్డీ వస్తుందనే ఆశతో చిన్న, మధ్య తరహా కుటుంబాలు ఎక్కువగా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో కొంత డబ్బు కస్టమర్లకు చెల్లించినా, నిర్వాహకులు క్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులు దారి మళ్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏజెంట్లపై కస్టమర్ల ఒత్తిడి తాము లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సంస్థలో పెట్టిన పెట్టుబడులు తిరిగి ఇవ్వాలంటూ ఏజెంట్లపై ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. సంస్థ గురించి తమకు తెలియకపోయినా పరిచయస్తులైన ఏజెంట్లకు డబ్బు చెల్లించామని, వారి హామీపైనే పెట్టుబడి పెట్టామని పలువురు చెబుతున్నారు. ఇన్వెస్టర్ల ఒత్తిడి తట్టుకోలేక శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కొత్తగూడెం తదితర పట్టణాల నుంచి ఏజెంట్లు విస్సన్నపేటకు వచ్చి దుర్గాప్రసాద్, శివానీ ఆస్తులపై ఆరా తీశారు. శివానీ అదృశ్యంపై ఫిర్యాదు దుర్గాప్రసాద్, శివానీది ప్రేమ వివాహం. వారిద్దరి కులాలు వేర్వేరు. దుర్గాప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. శివానీ స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం మొద్దులపర్వ. డిపాజిట్దారులు, ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేక దుర్గాప్రసాద్ అక్టోబరు 27న ఆత్మహత్య చేసుకున్నాడు. 10 రోజుల కిందట శివానీ తన ఇద్దరు కుమార్తెలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ, ఏజెంట్లు, కస్టమర్లు ఆందోళన చేస్తుండటంతో అనూహ్యంగా శివానీ కనిపించట్లేదని ఆమె తండ్రి గోవింద్ ఆదివారం రెడ్డిగూడెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కారు, బైక్ ఢీ : ఇద్దరికి గాయాలు
కంచికచర్ల: ముందు వెళ్తున్న బైక్ను వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనగా బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలైన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు గుంటుపల్లికి చెందిన దుర్గా సురేష్కుమార్, రమణ అనే మహిళతో కలిసి విజయవాడ వైపు నుంచి తెలంగాణా రాష్ట్రం కోదాడ బైక్పై బయలుదేరారు. కంచికచర్ల మండలం కీసర బీజేటీ డిగ్రీ కళాశాల వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో రమణకు తీవ్రగాయాలు, సురేష్కుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రమణను వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దుర్గా సురేష్ కుమార్ బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
కార్టూనిస్టుల సేవలు ఎనలేనివి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్టూనిస్టుల సేవలు ఎనలేనివని, ప్రజల హితాన్ని కాంక్షిస్తూ కార్టూనిస్టులు సేవలు అందిస్తున్నారని ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం, అమరావతి’ ఆవిర్భావ సభ సంఘం అధ్యక్షుడు బాచీ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. కార్టూనిస్టుల సంఘానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందేలా చూస్తానన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎ.వి.శేషసాయి మాట్లాడుతూ.. కార్టూన్ అంటే అందరికీ మక్కువేనన్నారు. అందరికీ హాస్యం ఇష్టమని, కార్టూన్కు ఎప్పుడు ఆదరణ ఉంటుందని చెప్పారు. -
గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
●షార్ట్సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు ●రెండు షాపులు పూర్తిగా, ఓ షాపు పాక్షికంగా దగ్ధం ● రూ.కోటి వరకు ఆస్తి నష్టం గుడివాడరూరల్: పట్టణంలోని అద్దేపల్లి కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే పట్టణ నడిబొడ్డులోని నెహ్రూచౌక్ సమీపంలో ఉన్న అద్దేపల్లి కాంప్లెక్స్లో ఉన్న ఓ సెల్ఫోన్ షాప్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. సుమారు గంట తర్వాత సమీప ప్రజలు, ఉదయం వాకింగ్ చేసే వాకర్స్ మంటలు బయటకు కన్పించడంతో 5.15 గంటలకు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక అధికారి జక్కంపూడి ఆంజనేయులు నేతృత్వంలో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. గుడివాడకు ఒక ఫైర్ ఇంజన్ మాత్రమే ఉండటంతో వెంటనే కై కలూరు, ఉయ్యూరు ప్రాంతాల్లోని ఫైర్ ఇంజన్లు రప్పించి 20 మంది ఫైర్ సిబ్బందితో గుడివాడ, కై కలూరు ఫైర్ అధికారులు ఆంజనేయులు, క్రాంతికుమార్ నేతృత్వంలో మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, రెండు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయని, ఒక షాపు పాక్షికంగా దగ్ధమైనట్లు ఫైర్ అధికారులు తెలిపారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు గుర్తించారు. పెరిగిన ప్రమాద తీవ్రత.. గుడివాడలో ఒక్క ఫైర్ ఇంజన్ ఉండడం.. ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చే సరికి ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి డి.ఏసురత్నం, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున నష్టపోయిన బాధితులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదే కాంప్లెక్స్లో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల, ఎస్బీఐ బ్రాంచ్తో పాటు మరికొన్ని షాపులు ఉన్నాయి. ఆదివారం కావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
అధిక మొత్తం ఆశ చూపి కుచ్చుటోపీ!
విస్సన్నపేట: మీ జీవితాల్లో వెలుగులు నింపుతా... మీరు పెట్టే పెట్టుబడికి ఎవ్వరూ ఇవ్వనంత ప్రతిఫలం ఇస్తా... రూ.లక్షకు నెలకు రూ.పదివేలు, రూ.10 లక్షలకు నెలకు రూ.లక్ష లాభం చూపిస్తానంటూ అమాయక ప్రజలకు ఆశ చూపి పెద్దమొత్తంలో కుచ్చుటోపీ పెట్టిన ఒక సంస్థ విస్సన్నపేటలో బోర్డు తిప్పేసింది. విస్సన్నపేట శ్రీనివాస నగర్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ను 2023లో ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా విస్సన్నపేట, పరిసర ప్రాంతాల ప్రజలకు క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని, మీకు అత్యధిక లాభాలు చూపిస్తానని నమ్మబలికి సుమారు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లవరకు ప్రజల నుంచి దండుకున్నారు. సంస్థ డైరెక్టర్ నండూరి శివ నాగదుర్గాప్రసాద్, అతని భార్య శివాని కొద్దినెలల పాటు పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు చూపించారు. గత కొద్దికాలంగా సంస్థ తాళాలు తీయకపోవడం, రెండు నెలల క్రితం భవనం ఖాళీ చేయడంతో ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు లబోదిబోమంటున్నారు. డిపాజిట్దారుల వత్తిడితో డైరెక్టర్ ఆత్మహత్య తాము పెట్టే పెట్టుబడికి అధిక మొత్తం చెల్లిస్తామని నమ్మించిన దుర్గాప్రసాద్ దంపతులు తీరా బోర్డు తిప్పేయడంతో వారిని నమ్మి డబ్బులు డిపాజిట్ చేసిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురై తమ సొమ్ము ఇవ్వవలసిందిగా వత్తిడి చేయడంతో నెల క్రితం ఆ సంస్థ డైరెక్టర్ శివనాగ దుర్గాప్రసాద్ అత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన భార్య శివానీ కూడా కొద్దిరోజులుగా అదృశ్యమవడంతో పెట్టుబడిదారులు కంగుతిన్నారు. పిల్లల పెళ్లిళ్లకు, భవిష్యత్ అవసరాలకు అక్కరకు వస్తాయని ఆశించి దాచుకున్న డబ్బులను ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విస్సన్నపేట పరిసర ప్రాంతాల వారే కాకుండా గన్నవరం, మచిలీపట్నం, ఉయ్యూరు, విజయవాడ తదితర ప్రాంతాలలో కూడా అధికసంఖ్యలో బాధితులున్నారు. శనివారం వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. అయితే విస్సన్నపేట పోలీస్స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
అవనిగడ్డలో బుక్ కీపర్ ఘరానా మోసం
అవనిగడ్డ: అవనిగడ్డ శివారు లంకమ్మ మాన్యంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి పొదుపు, లోన్లకు కట్టాల్సిన రూ.25 లక్షల సొమ్మును బుక్ కీపర్ స్వాహా చేసి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగక పోవడంతో శనివారం బాధిత మహిళలు నిరసన తెలిపారు.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పంచాయతీ పరిధిలోని లంకమ్మ మాన్యంకు చెందిన భాగ్యశ్రీ స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలుగా ఉన్న విశ్వనాథపల్లి నాగమల్లేశ్వరి 23 డ్వాక్రా గ్రూపులకు బుక్ కీపర్గా పనిచేస్తోంది. భాగ్యశ్రీ గ్రూపు సభ్యులు నాలుగేళ్ల క్రితం రూ.20 లక్షలు యూనియన్ బ్యాంకు నుంచి లోను తీసుకున్నారు. వీటికి సంబంధించి ప్రతినెలా పొదుపు, లోను చెల్లిస్తుండగా మరో ఏడు నెలలు చెల్లిస్తే పూర్తిగా చెల్లింపులు జరిగినట్టవుతుంది. ఒక్కో సభ్యురాలు రూ.30వేలు కడితే లోను పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో గత నెల 11వ తేదీ నుంచి నాగమల్లేశ్వరితో పాటు ఆమె భర్త, పిల్లలు కనబడకుండా వెళ్లిపోయారు. దీంతో బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీయగా ఇంకా రూ.8.50 లక్షలు కట్టాలని చెప్పడంతో కంగుతిన్నారు. లంకమ్మ మాన్యంకు చెందిన మరియా ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులు గతంలో రూ.15లక్షలు ఇండియన్ బ్యాంకు నుంచి లోను తీసుకున్నారు. ప్రతినెలా నాగమల్లేశ్వరికే ఈ గ్రూపు సభ్యులు లోను, పొదుపు డబ్బులు ఇచ్చేవారు. ఎనిమిది నెలల క్రితమే ఈ సభ్యులు తీసుకున్న లోను తీర్చేశారు. అప్పటి నుంచి మరో లోను ఇప్పిస్తానని చెప్పి వీరి వద్ద నుంచి మరికొంత సొమ్ము తీసుకుంది. ఈమె కనిపించకుండా పోయిన తరువాత ఈ గ్రూపు సభ్యులు బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీయిస్తే రూ.6.35 లక్షలు కట్టాలని చెప్పడంతో అవాక్కయ్యారు. నాగమల్లేశ్వరి కోడలు సెక్రటరీగా ఉన్న యాసిన్ గ్రూపు సభ్యులు గతంలో ఒక్కొక్కరు రూ.2 లక్షలు లోను తీసుకున్నారు. ఈ గ్రూపునకు సంబంధించి నాలుగు నెలల పొదుపు, లోను డబ్బులు నాగమల్లేశ్వరికి ఇవ్వగా వాటిని బ్యాంకుకు చెల్లించలేదు. ఫోర్జరీ సంతకాలతో శ్రీనిధి లోను భాగ్యశ్రీ గ్రూపు ప్రెసిడెంట్గా ఉన్న విశ్వనాథపల్లి నాగమల్లేశ్వరి సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి రూ.2లక్షలు శ్రీనిధి లోను తీసుకుంది. బ్యాంకుకు వెళ్లినపుడు ఈ విషయం తెలియడంతో బాధిత మహిళలు లబోదిబో మంటున్నారు. అదికాక యాసిన్ గ్రూపు నుంచి సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి మరో రూ.3లక్షలు లోను తీసుకుంది. ఇలా ఇప్పటివరకూ ఈ మూడు గ్రూపుల నుంచి రూ.25 లక్షలకు పైగా సొమ్మును స్వాహా చేసినట్టు లెక్కలు తేలాయి. మూడు గ్రూపుల నుంచే ఇంత సొమ్ము స్వాహా చేస్తే, ఆమె బుక్ కీపర్గా ఉన్న మరో 20 గ్రూపుల పరిస్థితి ఏమిటోనని ఆయా గ్రూపుల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నాగమల్లేశ్వరి మొత్తం 23 గ్రూపులకు బుక్కీపర్గా ఉండగా ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి. కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా... ఈ విషయమై గత నెల 14వ తేదీన అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. 15వ తేదీన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు, 17వ తేదీన కలెక్టర్ డీకే బాలాజీకి కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకూ న్యాయం జరగకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొదుపు, లోను డబ్బులు కట్టక పోవడంతో ఇప్పటికే బ్యాంకులు రూ.2లక్షలు పొదుపు సొమ్ము జమ వేసుకుందని, మరిన్ని డబ్బులు జమ వేసుకోక ముందే కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు కోరుతున్నారు. -
బీటీఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
మచిలీపట్నంటౌన్: బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) –అమరావతి సంఘ కృష్ణా జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక బైపాస్ రోడ్లోని బహుజన టీచర్స్ అసోసియేషన్ –అమరావతి సంఘ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి లంకపల్లి రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చేబ్రోలు శరత్చంద్ర మాట్లడుతూ ఉపాధ్యాయులకు రావలసిన డీఏలు, సంపాదిత సెలవు బకాయిలను తక్షణం విడుదల చేయాలని, పీఆర్సీ కమిషన్ను నియమించి 30 శాతం ఐఆర్ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం నూతనంగా ఎన్నికై న ఆ సంఘ జిల్లా శాఖ కార్యవర్గసభ్యులు జిల్లా విద్యా శాఖాధికారిగా ఇటీవల బాధ్యతలను చేపట్టిన యూవీ సుబ్బారావును మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బీటీఏ జిల్లా నూతన కార్యవర్గం ఇదే: బీటీఏ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడిగా ప్రత్రిపాటి జలంధర్, గౌరవ సలహాదారుగా ఎల్.రామచంద్రరావు, అధ్యక్షుడిగా మన్నెం పవన్ కుమార్ (కేపీటీ పాలెం, బందరు మండలం), ప్రధాన కార్యదర్శిగా తేరా దైవకాంత్ (ఫిషర్మెన్ కాలనీ, బందరు మండలం), అసోసియేట్ అధ్యక్షుడిగా కందిమళ్ల శ్రీనివాసరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా బట్టా రవికుమార్, కోశాధికారిగా ఆబూతురబ్ అలీ, ఉపాధ్యక్షులుగా సైకం వెంకట్రావు, కె.గోపాలం, కార్యదర్శులుగా దోమతోటి ప్రభాకర్, కొనకళ్ల వెంకటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు జిల్లాలో సంఘ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపిచిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వరం కేసులు పరిష్కరించుకోవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్లో శనివారం జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 49 బెంచ్లను ఏర్పాటు చేశామన్నారు. 43,824 కేసులు పరిష్కారం జాతీయ లోక్అదాలత్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆయా కోర్టుల్లో 43,824 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. ఈ లోక్అదాలత్లో 38,525 క్రిమినల్ కేసులు, 331 సివిల్ కేసులు, 1313 చెక్బౌన్స్ కేసులు పరిష్కరించారన్నారు. 142 మోటారు వాహన ప్రమాద క్లయిమ్లకు గానూ రూ.9.85 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయన్నారు. 3,513 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించి అవార్డులు జారీ చేశామన్నారు. మచిలీపట్నంలోని కోర్టుల్లో 7,449 కేసులు, విజయవాడ కోర్టుల్లో 11,964, గుడివాడ 6594, నందిగామ 3334, నూజివీడు 2340, మైలవరం 1892, జగ్గయ్యపేట 927, బంటుమిల్లి 734, కై కలూరు 684, తిరువూరు 3340, గన్నవరం 1668, అవనిగడ్డ 1541, మొవ్వ 673, ఉయ్యూరు కోర్టులో 684 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
‘వేగ’లో పండుగల ఆఫర్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు):రానున్న ధనుర్మాసం, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని వేగ జ్యూయలర్స్లో ప్రత్యేక ఆఫర్లు ప్రవేశ పెట్టారు. ఈ నెల 15 నుంచి అందుబాటు లోకి రానున్న ఈ ఆఫర్ల బ్రోచర్ను శనివారం విజయవాడ బృందావన కాలనీలోని నందమూరి రోడ్డులో ఉన్న వేగ షోరూమ్లో మిరాయ్ సినిమా ఫేమ్ రితిక నాయక్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఆఫర్లలో భాగంగా బంగారు ఆభరణాల తరుగులో 50 శాతం తగ్గింపు, పోల్కి ఆభరణాల తయారీ, తరుగు చార్జీలు ఉండవని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. వజ్రాభరణాల క్యారట్ ధర కేవలం రూ.49,999 ఉంటుందని, అందరూ ఈ అద్భుతమైన ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మైలవరం: ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ను ట్రాక్టర్ ఢీకొని, అదుపు తప్పి పార్కింగ్ ప్రదేశంలో ఉంచిన ద్విచక్ర వాహనాల పైకి దూసుకు వెళ్లడంతో 9 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మండలంలోని పొందుగల గ్రామం నుంచి మైలవరం ఏఎంసీకి ధాన్యం లోడుతో ట్రాక్టర్ వెళుతోంది. ఈ క్రమంలో విజయవాడ వైపు నుంచి మైలవరం వస్తున్న ఆర్టీసీ బస్ను స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్ద ట్రాక్టర్ ఢీకొని అదుపు తప్పి ఎల్బీఆర్సీఈ విద్యార్థులు పార్కింగ్ చేసిన వాహనాల పైకి దూసుకువెళ్లింది. దీంతో పార్కింగ్లోని 9 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆర్టీసీ బస్ పాక్షికంగా దెబ్బతింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్లో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. లకిరెడ్డి బాలిరెడ్డి కళాశాల విద్యార్థి బాణావత్ మోనిక్ నాయక్కి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని మైలవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి కారణం ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమేనని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): రద్దీ ప్రదేశాల్లో ఏమరుపాటుగా ఉన్న ప్రయాణికుల నుంచి సెల్ఫోన్స్ దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన 11 ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్ఐ జె.భానుప్రసాద్ తెలిపారు. విజయవాడ బస్టాండ్లోని పోలీస్ ఔట్పోస్టులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన క్రైమ్ ఎస్ఐ గిరిధర్బాబుతో కలిసి నిందితులను ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గుంటుపల్లి ప్రాంతంలో నివసిస్తున్న షేక్ రియాజ్, చిట్టినగర్ వాగు సెంటర్కు చెందిన ములకా అర్జునసాయి, ఇబ్రహీపట్నంకు చెందిన ఒక బాల నేరస్తుడు స్నేహితులు. వీరు ముగ్గురూ కలిసి సెల్ఫోన్లు దొంగతనం చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ ప్రదేశాల్లో తిరుగుతూ ఆదమరిచి ఉన్న ప్రయాణికుల నుంచి మొబైల్స్ దొంగతనానికి పాల్పడుతున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో సీపీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ సూచనలతో ఏసీపీ పావన్కుమార్ పర్యవేక్షణలో సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్టేషన్ పరిధిలోని బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై పటిష్ట నిఘా పెట్టారు. ఈ క్రమంలో దొంగిలించిన మొబైల్స్ను అమ్ముదామని ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద వెళ్లి అనుమానంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన 11 మొబైల్స్, ఒక మోటార్సైకిల్ను స్వాధీనం చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో కానిస్టేబుళ్లు విజయసారథి నాయక్, రాజేష్, నాగుల్మీరా, సాయి తదితరులు పాల్గొన్నారు. -
బైపాస్రోడ్డులో బైక్ దగ్ధం
కంకిపాడు: కంకిపాడు బైపాస్ రోడ్డు మార్గంలో బైక్ దగ్ధమైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...పటమటకు చెందిన అయ్యప్ప మాలధారి బైక్పై ఉయ్యూరు నుంచి విజయవాడ వైపు వస్తుండగా మార్గ మధ్యంలో కంకిపాడు బైపాస్ మార్గంలో బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన బైక్ యజమాని ఒక్కసారిగా బైక్ స్టాండు వేసి బైక్ దిగటంతో వాహనదారుడికి ఎలాంటి గాయాలు కాలేదు. పెట్రోలు లీక్ అయి బ్యాటరీపై పడటంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సందీప్ తెలిపారు. -
నవ్విపోయిన నాణ్యత!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సర్కార్ పాఠశాలల విద్యార్థులకు అందించిన బ్యాగులు ఇతర సామగ్రి మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. వాటి నాణ్యత దారుణంగా ఉండటంతో విద్యార్థులు నానాతంటాలు పడుతున్నారు. అంత చేస్తాం.. ఇంత ఇస్తామంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ విద్యార్థి సంఘ నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన సామగ్రి మూడునాలుగు మాసాలకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 942 ప్రభుత్వ విద్యాసంస్థలు ఎన్టీఆర్ జిల్లాలోని 20మండలాల్లో సుమారుగా 942 ప్రభుత్వ యాజమాన్య పరిధిల్లో కొనసాగే విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్, మునిసిపల్ తదితర యాజమాన్యాల పేర్లతో అవి కొనసాగుతున్నాయి. ఆయా విద్యా సంస్థల్లో సుమారుగా లక్ష మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారికి 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటుగా బ్యాగ్, షూస్, యూనిఫామ్ తదితర వస్తువులతో కూడిన కిట్లను అందించారు. సాధారణంగా పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన వస్తువులను దాదాపుగా నెల రోజుల తేడాతో వాటిని విద్యార్థులకు అందించారు. ఇచ్చిన నెలకే చిరిగిపోయాయి.. ప్రభుత్వం అందించిన బ్యాగులు, షూస్ విద్యార్థులకు అందిన నెల రోజులకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానంగా నాణ్యత లేని బ్యాగులు అందించటంతో చిరిగిపోయిన వాటిని కొంతమంది వాటిని కుట్టే వారికి అందించి డబ్బులిచ్చి కుట్టించుకున్నామని చెబుతున్నారు. మరికొంతమంది వారే సూదితో కుట్టుకొని అవస్థలు పడుతూ వినియోగిస్తున్నారు. కొంతమంది తమ బ్యాగులు ఎక్కడికక్కడ పీసులుగా ఊడిపోయి కుట్టడానికి సైతం కుదరకపోవటంతో వాటిని బయట పడేసి ఇతర బ్యాగులతో పాఠశాలలకు వస్తున్నారు. షూస్ పరిస్థితి సైతం అదే విధంగా ఉందని విద్యార్థులతో పాటుగా కొంతమంది ఉపాధ్యాయులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. తల్లిదండ్రుల ఆగ్రహం.. చంద్రబాబు ప్రభుత్వం పాలనలో తమ పిల్లలకు బ్యాగులు, షూస్ ఇచ్చామనే పేరే తప్ప వాటిలో నాణ్యత లేదని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అందించే వస్తువులు నాణ్యత లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు అందులోనూ చిన్నపిల్లలు వాడే వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరిగిపోయిన బ్యాగుల్లో పుస్తకాలు తీసుకువెళ్లటానికి చిన్నారులు నానా తంటాలు పడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం చంద్రబాబు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందించిన వస్తువులు చాలా నాసిరకంగా ఉన్నాయి. బ్యాగ్తో పాటు బూట్లు కూడా రెండు నెలలకే చిరిగిపోయాయి. వాటిని పక్కన పెట్టేసి చెప్పులతోనే స్కూల్కి పంపుతున్నాం. పేద పిల్లల కోసం ఇస్తున్న వస్తువుల్లో నాణ్యత ఉండాలే తప్ప, ఇలా మూడునెల్లకే పాడైపోతే ఎలా? మళ్లీ మా ఖర్చులతో కొనక తప్పడం లేదు. ప్రభుత్వం నాణ్యమైన వస్తువులను ఇస్తే పేదలపై భారం తగ్గుతుంది. – పేటేటి లావణ్య, విద్యార్థి తల్లి, మచిలీపట్నం ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కోసం ఇస్తున్నామంటూ ప్రచారం పెద్దగా చేస్తోంది. కానీ ఇచ్చిన బ్యాగులు నాణ్యత చాలా దారుణంగా ఉంది. కొన్ని పుస్తకాలను కూడా వాటిల్లో తీసుకెళ్లలేని పరిస్థితి. పిల్లలు చిరిగిన బ్యాగులను తలపై పెట్టుకుని మోసుకు వెళ్తున్నారు. తెగిపోయిన బూట్లను ఈడ్చుకుంటూ స్కూళ్లకు వెళ్తున్నారు. రెండు నెలలకే ఇలా పాడయితే పేదలు ఎలా కొనగలరు? ప్రభుత్వం పేదల పరిస్థితి తెలిసి కూడా కనీస నాణ్యతతో ఇవ్వాల్సింది పోయి దారుణమైన వస్తువులు విద్యార్థులకు అందించారు. – కోటప్రోలు నాగు, సర్పంచ్, చినగొన్నూరు, గుడ్లవల్లేరు మండలం -
ఓబీసీల సమస్యలపై 15న ఢిల్లీలో ధర్నా
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశ వ్యాప్తంగా ఓబీసీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. అందుకు సంబంధించిన హలో బీసీ.. చలో ఢిల్లీ పోస్టర్ను శుక్రవారం విజయవాడలోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగబద్ధంగా, సామాజిక న్యాయమందించేలా రిజర్వేషన్లు ఇవ్వడానికి, నేటి ఆదిపత్య–పెత్తందారీ రాజకీయ వ్యవస్థకున్న అభ్యంతరాలను స్పష్టం చేయాలని వారు నిలదీశారు. అనేక దశాబ్దాలుగా రాజకీయంగా చట్టసభలు, స్థానిక సంస్థల్లోనూ బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కేటాయించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమ రూపాలలో పోరాడుతూనే ఉన్నామన్నారు. తరాలు మారుతున్నాయే గాని, బీసీల సామాజిక–ఆర్థిక–రాజకీయ అంతరాల నిర్మూలనకు మాత్రం ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. ఓబీసీల సమస్యల పరిష్కారానికి పోరాట మార్గమే శరణ్యమని భావిస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆ సంఘ ఉపాధ్యక్షుడు కనకారావు, ఉద్యోగ సంఘాల కార్యనిర్వాహక అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరవు, బీసీ నాయకులు మేకా వెంకటేశ్వరరావు, వాక వెంకటేశ్వరరావు, రాంప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ సీపీలో తిరుపతిరావుకు అదనపు బాధ్యతలు జి.కొండూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గం జి.కొండూరుకు చెందిన వేములకొండ తిరుపతిరావును పంచాయతీ రాజ్ విభాగం జోన్–3 కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు అదనంగా ఈ బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తిరుపతిరావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. -
భక్తి ప్రకాశం.. అరుణోదయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలా ద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకోగా.. శుక్రవారం సుమారు 80 వేల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 1.15 గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీ దర్శనానికి అనుమతించారు. గురువారం రాత్రి నగరానికి చేరుకున్న భవానీలు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని, క్యూలైన్లోనే వేచి ఉండటం కనిపించింది. వేకువజామునే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భవానీలు, కొండ దిగువకు చేరుకుని ఇరుముడులను సమర్పించారు. అనంతరం ఇరుముడిలోని నేతి కొబ్బరి కాయను హోమగుండానికి అర్పించి దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. దీక్ష విరమించిన భవానీలు లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 11 గంట వరకు భవానీలకు అమ్మవారి దర్శనం కల్పించారు. భవానీలతో పాటు సాధారణ భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. నేడు, రేపు కీలకం.. భవానీ దీక్ష విరమణలలో శనివారం, ఆదివారం అత్యంత కీలకమని ఆలయ అధికారులు భావిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారాల నేపథ్యంలో భవానీలు భారీగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భవానీలు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. కుమ్మరి పాలెం మొదలు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్ వరకు పలు ప్రధాన కూడళ్లు, అపార్టుమెంట్లు, భవన సముదాయాల వద్ద పలు భక్త బృందాలు, సేవా బృందాలు అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు అల్పాహారం, పాలు, పండ్లు, ఫలాలను అందిస్తూ సేవలు చేస్తున్నారు. దుర్గగుడి ఈవో శీనానాయక్ గిరిప్రదక్షిణ మార్గంలో బైక్పై తిరుగుతూ భవానీలతో మాట్లాడారు. ఇబ్బందులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈవో వెంట ఈఈ రాంబాబు పాల్గొన్నారు. -
21న యూటీఎఫ్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశాలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశంలో ఈ నెల 21వ తేదీన తిరువూరులో జరుగుతుందని సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య తెలిపారు. ఈ సమావేశాల కరపత్రాలను యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసరావు, సుందరయ్య మాట్లాడుతూ.. తిరువూరులో జరిగే సమావేశాలకు మాజీ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎనస్.ప్రసాద్ తదితరులు హాజరవుతారని తెలిపారు. సంఘం కార్యకలాపాల నివేదికలను ప్రవేశపెట్టి ఆమోదించి, నూతన కమిటీ ఎన్నిక జరుపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎ.ఎన్.కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్, నాయకులు ఎం.హనుమంతరావు, మచ్చా శ్రీనివాస్, పి.లీల, పి.నాగేశ్వరరావు, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రేషన్ పక్కదారి పడితే కఠిన చర్యలు
ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అమలుకు సంబంధించి విస్తృత తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్ పక్కదారి పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం జేసీ ఇలక్కియ ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వను అరికట్టే విషయాలపై జిల్లా పౌర సరఫరా శాఖ సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమన్వయ శాఖల అధికా రుల బృందాలు బోర్డర్ చెక్ పోస్ట్కు వచ్చే వాహనాలు, కోళ్ల ఫారాలు, చేపల చెరువులను విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. వీటిలో రేషన్ బియ్యాన్ని వినియోగిస్తే 6–ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అందరు ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి గ్యాస్ పంపిణీ తీరుపై సమీక్షించారు. గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన డెలివరీ బాయ్స్ వినియోగదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడటం ముఖ్య మన్నారు. గ్యాస్ ధర కంటే ఎక్కువ మొత్తం వసూలు చేసినట్లు తేలితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తప్పవని జేసీ ఇలక్కియ స్పష్టం చేశారు. 6–ఏ కేసుల్లో పలువురికి జరిమానా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ శుక్రవారం పౌర సరఫరాల శాఖకు సంబంధించిన 6–ఏ కేసుల కోర్టు నిర్వహించారు. ఈ కోర్టులో కేసులు నమోదు అయిన వ్యక్తులను, నమోదు చేసిన అధికారులను విచారించారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరానికి ఉపయోగించిన వారికి రూ.11 వేల జరిమానా విధించారు. 133 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ప్రభుత్వ పరం చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు వినియోగించిన వాహన యజమానికి రూ.5 వేలు, పీడీఎస్ బియ్యంతో అక్రమంగా వ్యాపారం చేసిన వారికి రూ.58 వేల జరిమానా విధించారు. -
నృత్య శిక్షణ తరగతుల ప్రారంభం
కూచిపూడి(మొవ్వ): మూడు రోజుల పాటు నిర్వహించే కూచిపూడి నాట్య శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కూచిపూడి సర్పంచ్ కొండవీటి వెంకటరమణ విజయలక్ష్మి సూచించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్ర సంగీత నాటక అకాడమీ డైరెక్టర్ కళారత్న డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి ఆధ్వర్యంలో కూచిపూడిలోని శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్ నిర్వహించే నృత్య శిక్షణ తరగతులను సర్పంచ్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యాం, ఏఎంసీ చైర్మన్ దోనేపూడి శివరామయ్య, కూచిపూడి రోటరీ క్లబ్ ఉపాధ్యక్షుడు కొండ వీటి అమర బాలేశ్వరరావు, నాట్యాచా ర్యులు పసుమర్తి నారాయణమూర్తి, మువ్వ మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బెల్లంకొండ వెంకటేశ్వరరావు, నాట్యాచార్యులు జగన్నాథరావు, డాక్టర్ వసంత్ కిరణ్ పాల్గొన్నారు. చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల ఎనిమిదో తేదీన కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో గుర్తు తెలియని పురుషుడు అనారోగ్యంతో ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు చేరుకొని అతడిని 108 అంబులెన్స్లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతను చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి గురు వారం రాత్రి ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆస్పత్రి అవుట్పోస్ట్ నుంచి వచ్చిన సమాచారం మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వయసు 49 సంవత్సరాలు ఉంటుం దని, అనారోగ్యంతో బక్కచిక్కి ఉన్నా డని, ఆకుపచ్చ రంగు చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వన్టౌన్ పోలీసుస్టేషన్లో లేదా 94406 27176, 0866 – 2568220 ఫోన్ నంబర్లలో సమాచారం అందించాలని కోరారు. -
జగన్ పాలనలో నాణ్యతతో కూడిన కిట్లు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో ఏటా విద్యార్థులకు పుస్తకాలతో పాటుగా అత్యంత నాణ్యతతో కూడిన బ్యాగులు, షూస్ అందించారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులకు వాటిని అందజేశారు. గత ప్రభుత్వ పాలనలో చక్కగా యూనిఫామ్ ధరించి బ్యాగులు తీసుకొని షూస్ వేసుకొని హుందాగా పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యే వారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు లక్ష మంది విద్యార్థులకు అందించిన బ్యాగులు, షూస్లో సగం వరకూ చిరిగిపోయి ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. -
అధికారిక అడ్డా
పేకాటరాయుళ్లకు సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేకాట శిబిరాలు జోరుగా నడుస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ శిబిరాలు నడుస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మొక్కుబడి దాడులతో సరిపెడుతు న్నారు. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తన వాట్సాప్ స్టేటస్లో పెట్టిన పోస్టు పేకాట జోరుకు నిదర్శనంగా నిలిచింది. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్. పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్’ అంటూ ఆయన వాట్సాప్ స్టేటస్లో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఇది నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్న తీరును, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. విస్సన్నపేట మండలంలోని కొండపర్వ గట్టుపై నిత్యం పేకాట క్లబ్బు నడుపుతున్నారని ఆ మండల ముఖ్య నాయకు డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్లో చేసిన కామెంట్లు టీడీపీ నాయకులు, పోలీసులను ఇరకాటంలో పడేశాయి. ఇక్కడ ప్రజాప్రతినిధుల మధ్య వివాదం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పార్లమెంట్ ప్రజాప్రతినిధి క్యాంపు కార్యాలయాల పేరుతో మండల కేంద్రాల్లో పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేశారు. తిరువూరు, విస్సన్నపేటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాల్లోకి ఎమ్మెల్యేకు, ఆయన అనుచరులకు ప్రవేశం లేకుండా అడ్డుకట్ట వేశారు. గతంలో పలుమార్లు పార్టీ నాయకులపైనే ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే ఈ సారి విస్సన్న పేటలో ఓ నాయకుడిని పరోక్షంగా ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో తిరువూరులో గంజాయి అమ్మకాలపై కూడా పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గీయులను టార్గెట్ చేస్తూ పోలీసుస్టేషనులో ఎమ్మెల్యే హల్చల్ చేశారు. పెనమలూరులో.. పెనమలూరులో పేకాట శిబిరాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రధానంగా పోరంకి–నిడమానురు రోడ్డు, వణుకూరు శివారు ప్రాంతాలు, కానూరు, పోరంకిలోని నివాస సముదాయాలు, ఈడుపుగల్లు, ఉప్పులూరు, యనమలకుదురు లంకలు, కోలవెన్ను, కంకిపాడులోని వాణినగర్, ఉయ్యూరు శివారు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. పోరంకిలో గత ఏడాది నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుచరుడి పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల పోరంకింలో టీడీపీ నాయకురాలి భర్త దొరి కాడు. కానూరులో ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారని తెలిసి పోలీసులు దాడిచేస్తే రూ.2 లక్షలు దొరికాయి. పెనమలూరు పోలీసుస్టేషన్లోని కానిస్టేబుల్ పేకాట శిబిరాల అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కంకి పాడు మండలం కోలవెన్ను గ్రామానికి చెందిన ఓ మంత్రి అనుచరుడు కొలుసు లక్ష్మణ్ ఉప్పులూరులో అద్దెకు తీసుకున్న ఇంట్లో కోతముక్క నిర్వహిస్తుండగా కంకిపాడు పోలీసులు పట్టుకున్నారు. 13 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద రూ.1,72,400, ఒక కారు, పది సెల్ఫోన్న్లను స్వాధీనం చేసుకున్నారు. ● గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు, సూరంపల్లిలో పేకాట శిబిరాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ● గుడివాడలో వన్టౌన్ పరిధిలో హోటళ్లు, లాడ్జిలు, నివాస గృహాలు, నందిగామ మండలంలో గాజులపాడు, పోలుకొండ, ఇలపర్రు, పుట్టుగుంట ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలతోపాటు, జనసేన నాయకులు చేతులు కలిపి పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు. ● పెడన నియోజకవర్గంలో మొబైల్ జూదం నడిపిస్తున్నారు. ● అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతిరోజు పెద్ద ఎత్తున పేకాట జరుగుతోంది. ఘంటసాల మండలం కొడాలి, కోడూరు మండలం మందపాకల శివారు ప్రాంతం, నాగాయలంక బస్టాండు ప్రాంతాల్లో జోరుగా పేకాట సాగుతోంది. ఇక్కడ ముఖ్యంగా ఓ సామాజిక వర్గం చెందిన ముఖ్యనేతలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అవనిగడ్డ మండలంలో జనసేన నేత పలుచోట్ల పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. చల్లపల్లి మండలంలో ప్రాంతాలు మారుస్తూ పేకాట ఆడుతున్నారు. ● మచిలీపట్నం నియోజకవర్గంలో పేకాట యథేచ్ఛగా జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా పేకాట శిబిరాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే శిబిరాల నిర్వహణ తిరువూరు ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్లో సంచలన వ్యాఖ్యలు ఎన్టీఆర్ సొంత గ్రామంలో యథేచ్ఛగా సాగుతున్న జూదం పామర్రులో పేకాట జోరు పామర్రు నియోజకవర్గంలో పేకాట జోరుగా సాగుతోంది. ప్రధానంగా మొవ్వ మండలంలోని క్రోసూరు పేకాట డెన్గా మారింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇక్కడ విచ్చలవిడిగా పేకాడిస్తున్నారు. పామర్రుతోపాటు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఏలూరు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పేకా డుతున్నారు. ఈ డెన్పై పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. ఇటీవల క్రోసూరులో పేకాట శిబిరాలపై దాడికి వెళ్లిన ఓ పోలీసు అధికారిపై జూదరులు దాడికి యత్నించారంటే, ఎంత బరితెగించారో ఇట్టే తెలిసిపోతోంది. దీంతో ఆ పోలీసు అధికారి ఇక్కడ పనిచేయలేక ఇటీవల బదిలీపై వెళ్లినట్లు నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. సాక్షాత్తూ ఎన్టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరులో సైతం పేకాట జోరుగా సాగు తోంది. ఇక్కడ డిమ్ అండ్ డిప్ వంటి వ్యక్తి ఆటను సాగిస్తున్నారు. ఈ తతంగం అంతా పమిడిముక్కల పోలీసు అధికారికి తెలిసే జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పామర్రులోని కొత్త పెద్దమద్దాలి శివారు ప్రాంతంలో యథేచ్ఛగా పేకాట శిబిరం కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా కింది స్థాయిలో కొంత మంది పోలీసు అధికారుల తీరు వల్లే పేకాటకు అద్దూఅదుపూ లేకుండా పోతోంది. పామర్రు ప్రాంతంలో మచిలీపట్నం నగరంలోని బలరామునిపేటకు చెందిన పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. -
విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం
విస్సన్నపేట: విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక వెలుగు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఎంపీపీగా 6వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు గద్దల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కె.మాధురి, అబ్జర్వర్గా జేసీ ఎస్.ఇలక్కియా వ్యవహరించారు. ఏకగ్రీవంగా ఎన్నికై న ఎంపీపీతో ఆర్డీవో ప్రమాణస్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. తహసీల్దార్ కె.లక్ష్మీకళ్యాణి, ఎంపీడీఓ చేకు చిన్నరాట్నాలు, ఎస్ఐ రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యుడు పాల్గొన్నారు. మల్లయ్యకు అభినందనలు గద్దల మల్లయ్యను వైఎస్సార్ సీపీ నాయకులు మండలంలోని పుట్రేల గ్రామంలో పార్టీ రాష్ట్ర నాయకుడు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి నివాసం వద్ద గురువారం అభినందనలు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు, నియోజకవర్గ అబ్జర్వర్ తంగిరాల రామిరెడ్డి,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఓలేటి దుర్గారావు, పట్టణ అధ్యక్షుడు నెక్కళపు కుటుంబరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
తాగునీరు, పారిశుద్ధ్య పనులు చేపట్టండి
కలెక్టర్ డీకే బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో గురువారం తాగునీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ మిషన్ నిధుల ద్వారా గ్రామ పంచాయతీల్లో మంజూరైన 956 మరుగుదొడ్ల పనులను త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సామాజిక పారిశుద్ధ్య సముదాయాల నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 18 అంగన్వాడీ కేంద్రాలు, ఇతర పనులను వెంటనే మొదలుపెట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మంజూరైన 148 మరుగుదొడ్లు, తాగునీటి పనులు 131 పూర్తి చేశారని మిగిలిన పనులు కూడా సత్వరమే చేపట్టాలని కోరారు. గ్రామాల్లోని అన్ని మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని అందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఏలూరు కాలువ పరిధిలో విజయవాడ నుంచి బుడమేరు వరద ముంపు జరగకుండా కాలువల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. గన్నవరం, నందివాడ, బాపులపాడు, ఉంగుటూరు మండలాల పరిధిలో అన్ని చెరువులను నూరుశాతం నింపుకోవాలని తెలిపారు. అవసరమైతే అదనపు బోర్లను కూడా వేయాలన్నారు. మురుగుకాలువల నిర్మాణంలో ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియా తిరువూరు: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగుతోందని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. విస్సన్నపేట, గంపలగూడెం, పెదకొమెర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. తిరువూరు రెవెన్యూ డివిజన్లో 53, నందిగామ డివిజన్లో 46, విజయవాడ డివిజన్లో 37 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 23లక్షల 21వేల 400 గోనెసంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంతవరకు 70,156 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.146 కోట్ల నగదు జమ చేశామన్నారు. రైతులకు ధాన్యం విక్రయంలో ఇబ్బందులను ఇలక్కియా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పరిష్కరించాలని స్థానిక అధికారుల్ని ఆదేశించారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు. తిరువూరు: ఎ.కొండూరు మండలం మత్రియా తండాలో కిడ్నీవ్యాధికి గురై చికిత్స పొందుతున్న బర్మావత్ బాలాజీ (47) గురువారం మృతిచెందాడు. గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధికి చికిత్స నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా పరిస్థితి మెరుగుపడక బాలాజీ మృత్యువాత పడ్డాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలాజీకి ఇద్దరు సంతానం కాగా ఒక కుమారుడు పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. మండలంలో గత రెండు నెలల్లోనే ఆరుగురు కిడ్నీరోగులు మృతిచెందడంతో గిరిజన తండా వాసులు ఆందోళన చెందుతున్నారు. బాలాజీ కుటుంబాన్ని సీపీఎం మండల కార్యదర్శి పి.ఆనందరావు, సీఐటీయూ మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు అమ్మిరెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు కుమార్ నాయక్ పరామర్శించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎల్.చంద్రకళ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసిన ఆమె తాజా బదిలీలలో ఎన్టీఆర్ జిల్లాకు వచ్చారు. గురువారం ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆమెకు సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆమె ఉద్యోగులతో మాట్లాడారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థులకు చేర్చటం, పర్యవేక్షణ బలోపేతం చేస్తానన్నారు. పారదర్శక సేవలను అందిస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రధానోపాధ్యాయులు బోధనా సిబ్బంది సమష్టిగా పనిచేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సహకరించాలని సూచించారు. యూటీఎఫ్ నాయకుల శుభాకాంక్షలు జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రకళకు యూటీఎఫ్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆమెను కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి మనోహర్కుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య నాయకులు పి.లీల, జె.రామకృష్ణ, ఎం.లలిత, ఎ.భరత్, ఎస్పీహెచ్ఆర్ దేవ్ తదితరులు ఉన్నారు. -
నేటి నుంచి కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రమైన కూచిపూడిలోని శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్లో ఈనెల 12 నుంచి 14 వ వరకు మూడు రోజులు పాటు నాట్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠం విశ్రాంత ప్రధాన ఆచార్యులు, కళారత్న డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గురువారం తెలిపారు. నాట్యాచార్యులు చక్రవర్తులు పవన్ కుమార్, నిహారిక చౌదరిల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వాగ్గేయకారులు (కేరళ) సంగీత సామ్రాజ్య సంచారిణి అంశం పై శిక్షణ, కూచిపూడి నాట్య చరిత్ర, పరిక్రమణ సిద్ధాంతం పై అవగాహన తరగతులు ఉంటాయని చెప్పారు. డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానితో సంగీతం, తాళాలుపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 50 మంది పైగా విద్యార్థులు హాజరవుతారన్నారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఏపీ టెట్ 2025 పరీక్షలు రెండు సెషన్లలో గురువారం ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో మొత్తం1,923 మంది అభ్యర్థులు కేటాయించగా, 1,784 మంది హాజరయ్యారన్నారు. 139 మంది గైర్హాజరయ్యారన్నారు. రెండు సెషన్స్లో జరిగిన పరీక్షల సగటు విద్యార్థుల హాజరు 93.48 శాతంగా ఉందని చెప్పారు. ఇబ్రహీంపట్నం: స్థానిక ఫెర్రీ వద్ద కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పోలీసులకు గురువారం లభ్యమైంది. నదిలో కనిపించిన మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి సుమారు 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని భావించారు. మృతదేహం నీటిలో ఉబ్బిపోవడంతో గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. పంచనామా నిర్వహించిన అనంతరం విజయవాడ మార్చురీకి తరలించారు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ సతీష్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ మద్దతు ధరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ టీవీ సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 148 రైతు సేవా కేంద్రాలను ఎంపిక చేశామని, వీటిలో 136 ఆర్ఎస్కేలు పనిచేస్తున్నాయని చెప్పారు. తిరువూరు డివిజన్ 53, నందిగామ డివిజన్ 46, విజయవాడ డివిజన్ 37 రైతు సేవా కేంద్రాలు ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. 18.75 లక్షల గోనె సంచులు అవసరమని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 23,21,400 గోనె సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. తిరువూరు డివిజన్ 12,23,950, విజయవాడ డివిజన్ 5,84,200, నందిగామ డివిజన్ 5,13,250 కేటాయించడం జరిగిందన్నారు. ఈ సీజన్లో 9693 మంది రైతుల నుంచి 70,156 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు రూ.146.10 కోట్ల నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ధాన్యం రవాణాకు 1599 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 20257వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా విజయవాడ నగరానికి చెందిన ఎంఎస్ బేగ్ నియమితులయ్యారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బేగ్కు పార్టీ శ్రేణులు, ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. విస్సన్నపేట ఎంపీపీగా గద్దల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఆర్డీఓ కె.మాధురి, అబ్జర్వర్గా జేసీ ఇలక్కియా వ్యవహరించారు. మచిలీపట్నంఅర్బన్: కృష్ణాజిల్లా నూతన డీఈవో యు.వి.సుబ్బారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
డిజిటల్ పాలనలో కృష్ణాజిల్లా ప్రథమస్థానం
చిలకలపూడి(మచిలీపట్నం): డిజిటల్ పాలనలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొదటిస్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయులయ్యారని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్ల పనితీరుపై ర్యాంకులు ప్రకటించిన నేపథ్యంలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఈ–ఆఫీస్లో మొదటి స్థానంలో నిలిచినందుకు ఆయనను గురువారం కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఘనంగా సత్కరించారు. జేసీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్కు ఈ–ఆఫీస్లో 1482 ఫైల్స్ రాగా అందులో 1469 ఫైల్స్ వేగవంతంగా క్లియర్ చేసినందుకు ఆయనకు మొదటిస్థానం లభించిందన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బాలాజీని శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ–ఆఫీస్లో ఫైళ్లను క్లియర్ చేయటంలో జాయింట్ కలెక్టర్ నవీన్ కూడా మూడో స్థానంలో నిలిచినందుకు ఆయన్ను అభినందించారు. జిల్లా అధికారులు కూడా వారి పరిధిలో ఫైల్స్ పరిష్కారంలో ఏ మేరకు శ్రద్ధ కనపరుస్తారో పరిశీలించి జిల్లాలో కూడా అధికారులకు ర్యాంకులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఇన్చార్జ్ డీఆర్వో శ్రీదేవి పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పీపీపీకి చంద్రబాబు కొత్త భాష్యం
నందిగామ టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తూనే కాదు కాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త భాష్యం చెబుతున్నారని మాజీ శాసనసభ్యుడు, నందిగామ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మండి పడ్డారు. చంద్రబాబుకు ప్రైవేటు పిచ్చి పట్టిందని, పేద ప్రజలకు అన్యాయం చేయటమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లే ప్రత్యేక వాహనాన్ని గురువారం రాత్రి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా పత్రాలను మీడియా ప్రతినిధుల సమక్షంలో బాక్సులలో సర్దించి ఆయనే స్వయంగా వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని మెజార్టీ శాతం కుటుంబాలు తమ ఆదాయంలో అధిక భాగం నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయని, వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు -
15లోగా నివేదికలు అందజేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 15వ తేదీలోగా జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్కు సంబంధించిన నివేదికలు అందజేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురించి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని, ఇందుకు సంబంధించి వివిధ ప్రభుత్వశాఖల నివేదికలు వెంటనే సిద్ధం చేసి అందించాలన్నారు. వివిధ అంశాలపై ఏమైనా మార్పులు ఉంటే జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూప్లో పంపుతామని, అందరూ అప్రమత్తంగా ఉండి గమనించాలన్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో జిల్లాకు సంబంధించిన అంశాలు ఉంటే వాటిని ఈసారి పొందుపరచాలని, గత మూడు నెలలుగా జిల్లాలో ఏమైనా కొత్తగా మొదలుపెట్టిన పనులకు సంబంధించిన వివరాల నోట్ లను కూడా అందజేయాలన్నారు. ఆర్టీజీఎస్ లెన్స్ మాస్టర్ డాష్ బోర్డులో చూపుతున్న వివరాలు సరిగా ఉన్నాయో, లేదో ఒకసారి పరిశీలించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ డీఆర్వో శ్రీదేవి, డ్వామా, డీఆర్డీఏ పీడీలు ఎన్వీ శివప్రసాద్, డి.హరిహరనాఽథ్, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, డీఈవో సుబ్బారావు, డీఎస్వో మోహన్బాబు, డీఎంఅండ్హెచ్వో యుగంధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
మైలవరం: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ, ఏసీపీ వై. ప్రసాదరావు తెలిపారు. మైలవరం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాల్లో ఉన్న ఆలయాలను టార్గెట్ చేసుకుని మైలవరం సర్కిల్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు వారి నుంచి రూ.27,50, 050 విలువ గల వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు నెలల నుంచి మైలవరం సబ్ డివిజన్, సర్కిల్ పరిధిలోని దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతుండటంతో జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఏసీపీ వై. ప్రసాదరావు మైలవరం సర్కిల్ సీఐ దాడి చంద్రశేఖర్ పర్యవేక్షణలో మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మైలవరం ప్రభుత్వాసుపత్రి వద్ద గురువారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఆరుమళ్ళ పురుషోత్తం, (ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల జిల్లా, తెలంగాణరాష్ట్రం)తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో పురుషోత్తంతో పాటు మరో నలుగురు చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరవల్లి మండలం తేలుప్రోలుకు చెందిన పొట్లూరి పద్మతో పురుషోత్తం సహజీవనం చేస్తూ ఏలూరు జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నిర్మానుష్యంగా ఉన్న పరిసర ప్రాంతాల్లో దేవాలయాలను దొంగతనాలకు వీరు ఎన్నుకుంటున్నారు. అందుకోసం వీరితో పాటు మైలవరం మండలం తోలుకోడు, వెల్వడం రోడ్లో ఉంటున్న ఏకుల రవికుమార్, ఏకశిరి అభిలాష్ , ఏకశిరి చిట్టెమ్మ కలిసి ఒక బృందంగా ఏర్పడి ఏడాది నుంచి ఆలయాల్లో దొంగతనాలుకు పాల్పడుతున్నారు. మైలవరం పోలీస్ స్టేషన్లో 3, జి.కొండూరు 2, రెడ్డిగూడెం 1, ఆగిరిపల్లి 1, ద్వారకా తిరుమల 1, తాడేపల్లిగూడెం 1, విజయవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కేసులు నమోదయ్యాయి. దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్న విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దీనితో ఆరుమల్ల పురుషోత్తంలో పాటు అతని టీమ్ను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న సొమ్మును రికవరీ చేశారు. వీరిపై మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. దేవాలయాల్లో చోరీ కేసులు ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన మైలవరం ఎస్ఐ సుధాకర్, రెడ్డిగూడెం ఎస్ఐ, జికొండూరు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్ను పోలీస్ అధికారులు అభినందించారు. -
మసిపూసి మారేడుకాయ చేయటంలో చంద్రబాబు దిట్ట
చిలకలపూడి(మచిలీపట్నం): మసిపూసి మారేడు కాయ చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిట్ట అని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2024 ఎన్నికల సమయంలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, 18 నెలలు వీటిని పూర్తి చేశామని రాష్ట్ర ప్రజలను మోసం చేసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నా రని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఒక్కొక్క ఉద్యోగికి నెలకు రూ.50 వేల జీతమైతే ఏడాదికి రూ.6 లక్షల చొప్పున 20 లక్షల మందికి రూ.12 వేల కోట్ల జీతాలు ఇప్పటికే వచ్చి ఉండాలన్నారు. అలా వచ్చి ఉంటే ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలు ఎంత వ్యాపారం చేసి ఉండాలి, రాష్ట్రానికి ఎంత జీఎస్టీ వచ్చిందో తెలపాలని పేర్ని నాని సవాల్ విసిరారు. అసలు ఉద్యోగాలు ఎంత మందికి ఇచ్చారో ఒక్కరి పేరైనా చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. పవన్ వల్లే అలుసుగా చూస్తున్నారు పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వానికి అంటకాగటం వల్లే చంద్రబాబునాయుడు కాపు సామాజికవర్గాన్ని అలుసులుగా చూస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. అమరావతి సీఆర్డీఏలో ప్లాట్లు ఇచ్చేందుకు యజమానుల నుంచి లంచం అడుగుతున్నారని, అందుకు మంత్రి నారాయణే కారకుడని పచ్చ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన నారాయణను తప్పించి కేంద్ర మంత్రి పెమ్మసానికి పెత్తనం ఇవ్వడానికే ఈ చర్యలని విమర్శించారు. ఇండిగో పాపాల్లో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడును డమ్మీ చేసి రూ.కోట్లు దండుకున్న చంద్రబాబు, లోకేష్ మాట్లాడకపో వటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో రాష్ట్ర మంత్రి సత్యప్రసాద్ తప్పు చేస్తే బీజీపీదే తప్పని చెప్పిన చంద్రబాబు, లోకేష్ ప్రస్తుతం రామ్మోహన్నాయుడు మంత్రిగా ఉన్న శాఖలో తప్పు జరిగితే టీడీపీదే బాధ్యత కాదా అని నిలదీశారు. మంత్రి రామ్మోహన్నాయుడును డమ్మీ చేసి తండ్రీకొడుకులు దోచుకున్న వ్యవహారాన్ని మోదీ బయటపెడతారన్న భయంతో మాట్లాడటం లేదన్నారు. ప్రతి నెలా విమానం ఎగరాలంటే ప్రభుత్వం అను మతి తప్పనిసరిగా ఉండాలని, అప్పుడు ఎందుకు నిబంధనలు కనడపలేదని ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగి వివరాలు చెప్పండి ఇండిగో పాపాలను మోదీపై రుద్దాలని చంద్రబాబు, లోకేష్ యత్నం వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని -
దీక్షల విరమణ బందోబస్తుపై దిశానిర్దేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంద్రకీలాద్రిపై ఐదు రోజుల పాటు జరగనున్న భవానీ దీక్షల విరమణకు బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు దిశా నిర్దేశం చేశారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బందోబస్తు సిబ్బందితో సీపీ బుధవారం సమావేశం నిర్వహించారు. సిబ్బంది రెండు షిఫ్టుల్లో విధులకు హాజరు కావాలని సూచించారు. గిరిప్రదక్షిణ మార్గం, హోల్డింగ్ ఏరియాలు, స్నానఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలను డ్రోన్ కెమెరా వీడియోల రూపంలో చూపించి తగు సూచనలు, సలహాలు అందించారు. భవానీలతో మర్యాదగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని సిబ్బంది సమర్థంగా విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. టాఫిక్ అవాంతరాలు కలుగకుండా చూడాలన్నారు. అంతరాలయం పరిసరాలు, కొండ దిగువన, క్యూలైన్లు, ఇరుముడి విరమణ ప్రదేశాలు, హోమ గుండాలు, ప్రసాదం కౌంటర్లు, కనకదుర్గానగర్, రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వంటి ముఖ్య ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జేబు దొంగతనాలు, గొలుసు చోరీలు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, బి.లక్ష్మీనారాయణ, షిరీన్బేగం, ఎస్.వి.డి.ప్రసాద్, జి.ఆనంద్బాబు, ఏడీసీపీ జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దుర్గగుడి పరిసరాలను సీపీ రాజశేఖరబాబు క్షేత్రస్థాయిలో సందర్శించారు. -
భలే భలే.. బాలోత్సవం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఎనిమిదో అమరావతి బాలోత్సవం బుధవారం చిన్నారుల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగింది. రెండో రోజైన బుధవారం జరిగిన సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిద్ధార్థ ఆడిటోరియంతో పాటుగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు వేదికలపై ఈ పోటీలు జరిగాయి. చిత్రలేఖనం, తెలుగు డిక్టేషన్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, షార్ట్ ఫిల్మ్ విశ్లేషణ, డిబేట్, కోలాటం, దేశభక్తి గీతాలాపన, క్లాసికల్ డాన్స్, జానపద గీతాలాపన, తెలుగు పద్యాలు, ఇంగ్లిష్ రైమ్స్, పద్యం–భావం అంశాల్లో పోటీలు జరిగాయి. విజయవాడ నగరంతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నాం 3.30 గంటలకు బాలోత్సవం ముగింపు సభ, విజేతలకు బహుమతులు ప్రదానం జరుగుతా యని బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు తెలిపారు. -
వీఎంసీ కౌన్సిల్లో ‘మంటలు’!
టీడీపీ తీరుతో రసాభాసగా సమావేశం పటమట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలపై సవతి ప్రేమ చూపుతోందని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వీఎంసీ కౌన్సిల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తట్టుకోలేని టీడీపీ సభ్యులు కౌన్సిల్ సాక్షిగా డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి నుంచి మైకు లాక్కొని, దాడికి పాల్పడ్డారు. సభ ఆద్యంతం టీడీపీ కార్పొరేటర్ల తీరుతో రసాభాసాగా మారింది. విజయవాడ నగర పాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. బాధితులకు న్యాయం చేయాలి.. పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో 42 ఇళ్లను రాష్ట్రప్రభుత్వం తొలగించి ఆ కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. వారికి న్యాయం చేయాలని 179వ అంశంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. టీడీపీ కార్పొరేటర్లు యథాప్రకారం సభ జరగకుండా నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. ఓ క్రమంలో కౌన్సిల్ కంట్రోల్ రూంలో మైక్లను ఆపేయాలని గట్టిగా కేకలు వేస్తూ సిబ్బందిని, సభ సాక్షిగా బెదిరింపులకు గురి చేశారు. అక్కడ ఇళ్లు నిర్మించిన వారందరూ వీఎంసీ నుంచి ఇంటి నిర్మాణ ప్లాన్ను పొందారని, వారికి వీఎంసీ రెవెన్యూ విభాగం నుంచి పన్నులు కూడా వేశారని, తాగునీరు, డ్రెయినేజీ సదుపాయాలు కూడా కల్పించి ఇప్పుడు అర్ధాంతరంగా ఇళ్లను కూల్చివేసి తమకేమీ తెలీదని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ సభ్యులు విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నెల 31వ వరకు గడువు విధించినప్పటికీ అంత తొందరగా ఇళ్లను తొలగించటం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పభుత్వం బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు. కమిషనర్కు నోటీసు.. 27వ డివిజన్లో వీఎంసీ సాధారణ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలుకు స్వాతంత్య్ర సమరయోధురాలు చిట్యాల(చాకలి) ఐలమ్మ పేరు పెడుతూ గతంలో కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే ఆ పేరు తొలగించారు. దీంతో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి మళ్లీ అదే పేరు పెడుతూ బోర్డు పెట్టాలని ప్రతిపాదించగా.. టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీనిపై కమిషనర్ను వివరణ కోరగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఎంసీనే బోర్డు తొలగించిందని అన్నారు. కౌన్సిల్ను, కౌన్సిల్ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవమానిస్తోందని, దీనిపై కమిషనర్కు సభా ఉల్లంఘనల కింద వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు డీసెంట్ నోట్ ఇచ్చారు. ఆ సమయంలో కూడా టీడీపీ కార్పొరేటర్లు లేచి సభలో పెద్దపెద్దగా నినాదాలు చేస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. చంద్రబాబు ప్రభుత్వానికి బీసీలన్నా, పేదలన్నా, మధ్య తరగతన్నా గిట్టదని, ఈ క్రమంలోనే నగరాభివృద్ధిని, వీఎంసీ కౌన్సిల్ మర్యాదను ఖాతరు చేయటంలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. స్పందించిన కమిషనర్ శుక్రవారం ఉదయం నాటికి కమ్యునిటీ హాలుకు చిట్యాల(చాకలి) ఐలమ్మ బోర్డు పెడతామని ప్రకటించారు. -
16 నుంచి ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ ఉర్దూ అకాడమీ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 16 నుంచి వారోత్సవాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ అన్నారు. ఉర్దూ అకాడమీ ఏపీ ఉద్యోగుల సమీక్ష సమావేశం విజయవాడ పాతబస్తీలోని ముసాఫిర్కానా ప్రాంగణంలో బుధవారం సాయంత్రం జరిగింది. ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ శుబ్లీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భాషకు మతంతో సంబంధం లేదన్నారు. ఉర్దూ అకాడమీ ఉద్యోగుల్లో పని చేసిన వారికి గుర్తింపు, చెయ్యని వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. సమీక్ష సమావేశానికి గైర్హాజరైన వారికి తక్షణమే మెమో జారీ చెయ్యాలని చైర్మన్ శుబ్లీ ఆదేశించారు. మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీహెచ్ శ్రీధర్, ఉర్దూ అకాడమీ సెక్రటరీ గౌస్పీర్ పాల్గొన్నారు. ఆర్ఎంపీలకు అవగాహన మచిలీపట్నం అర్బన్: జిల్లాలో ప్రథమ చికిత్స కేంద్రాలను నిబంధనలకు లోబడి నిర్వహించేలా ఆర్ఎంపీలకు అవగాహన కల్పించే సమావేశాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం డీఎంహెచ్ఓ డాక్టర్ పి. యుగంధర్ నిర్వహించారు. ఇటీవల జిల్లాలోని పలు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డాక్టర్ యుగంధర్ పలు సెంటర్లను తక్షణమే మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. తనిఖీల అనంతరం జరిగిన ఈ సమావేశంలో ఆర్ఎంపీలకు ప్రథమ చికిత్స కేంద్రాల్లో అనుమతి పొందన సేవలు, చేయకూడని వైద్య ప్రక్రియలు, అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన ప్రొటోకాల్ వంటి అంశాలపై వివరంగా మాట్లాడారు. ఇటీవల జిల్లాలో వెలుగుచూస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి పై ఆర్ఎంపీలకు అవగాహన కల్పించారు. -
భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్లు కొలువైన ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకు సిద్ధమైంది. మాల విరమణకు తరలివచ్చే భవానీలకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షల విరమణ 15వ తేదీ ఉదయం మహాపూర్ణాహుతితో ముగుస్తుంది. తొలి రోజు తెల్లవారుజామున 6.30 గంటలకు మహా మండపం దిగువన హోమగుండాల్లో అగ్నిప్రతిష్టాపనతో దీక్షల విరమణ ప్రారంభమవుతుంది. ఐదు రోజులు కొనసాగే ఉత్సవాలకు ఆరు లక్షల మంది భవానీలు దీక్షల విరమణ చేస్తారని పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రోజూ 20 గంటల పాటు అమ్మ దర్శనం దీక్షల విరమణలో తొలి రోజు మినహా మిగిలిన నాలుగు రోజుల్లో రోజూ 20 గంటలకు పైగా అమ్మ వారి దర్శనం ఉంటుంది. గురువారం తెల్లవారుజామున ఆరు గంటలకు అమ్మవారికి పూజా కార్యక్రమాల అనంతరం దర్శనం ప్రారంభమవుతుంది. శుక్రవారం నుంచి తెల్లవారుజాము మూడు నుంచి రాత్రి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమయంలో అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేస్తారు. ఇక సాయంత్రం అంతరాలయంలో పంచహారతుల సేవ జరుగుతుండగా, బయట అన్ని క్యూలైన్లు యథావిధిగా నడిచేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో పంచహారతుల సమయంలోనూ అమ్మవారిని భక్తులు దర్శించుకునే వీలు కలుగుతుంది. రద్దీ మరింత అధికమయితే చివరి మూడు, నాలుగు రోజుల్లో దర్శన సమయాన్ని మరింత పెంచే అవకాశాన్ని వైదిక కమిటీ పరిశీలిస్తోందని ఆలయ అధికారులు తెలిపారు. అల్పాహారం పంపిణీకి ఏర్పాట్లు భవానీలు, భక్తులకు దేవస్థానం అన్న ప్రసాదంతో పాటు అల్పాహారం పంపిణీ చేయనుంది. తెల్లవారుజాము ఆరు నుంచి పది గంటల వరకు పులిహోర, దద్యోజనం, కట్టెపొంగలి, ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటలకు వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం అక్కన్న, మాదన్న గుహల ఎదుట వెలివేటెడ్ క్యూలైన్ల కింద ఐదు నుంచి ఏడు గంటల వరకు కదంబం, ఏడు నుంచి 11 గంటల వరకు ఉప్మా పంపిణీచేస్తారు. రోజుకు 32 వేల మందికి అన్న దానం, అల్పాహారం పంపిణీచేసేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. లడ్డూ ప్రసాదాలను కొరినన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు 30 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం సిద్ధం చేస్తోంది. బుధవారం సాయంత్రం నాటికి ఆరు లక్షల లడ్డూలను సిద్ధం చేసింది. ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీ మాలధారులు నేటి ఉదయం 6.30 గంటలకు అగ్ని ప్రతిష్టాపన ఐదు రోజులు కొనసాగనున్న ఉత్సవాలు -
మైనర్ల అక్రమ రవాణాను అడ్డుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): మైనర్ల అక్రమ రవాణాను విజయవాడ డివిజన్ ఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. ఆపరేషన్ యాక్షన్, ఆపరేషన్ యాత్రి సురక్ష, ఆపరేషన్ నాన్హే ఫారిస్టే సేవల్లో భాగంగా ఈ నెల 8, 9 తేదీల్లో పలు కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. ఆపరేషన్ యాక్షన్లో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీన నెల్లూరు, ఒంగోలు ఆర్పీఎఫ్, విజయవాడ సీఐబీ, బచపన్ బచావ్ ఆందోళన్ రాష్ట్ర సమన్వయకర్తలు, ఏపీఓల సంయూక్త బృందాలు ఒంగోలు– నెల్లూరు మధ్య టాటానగర్–యర్నాకులం ఎక్స్ప్రెస్ (18189) రైలులో తనిఖీలు చేపట్టారు. ముగ్గురు బాలురిని గుర్తించి విచారించగా, ఇద్దరు ఏజెంట్టు వారిని పనుల కోసం ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు తేలింది. తదుపరి దర్యాప్తు కోసం ఏజెంట్లను నెల్లూరు జీఆర్పీ పోలీసులకు అప్పగించి, మైనర్లను సీడబ్ల్యూసీ సమక్షంలో పునరావాస కేంద్రానికి తరలించారు. ఆపరేషన్ యాత్రి సురక్షలో భాగంగా గుంటూరు–రాయగడ (17243) ఎక్స్ప్రెస్లో ప్రయాణికుడి బ్యాగులోని నగదు, సెల్ఫోన్ చోరీ కేసుపై ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీ సులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి తుని రైల్వేస్టేషన్లో నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.54 వేల నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఆపరేషన్ నాన్హే ఫారిస్టేలో భాగంగా ఈ నెల తొమ్మిదో తేదీన ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 13 ఏళ్ల బాలుడిని విజయవాడ రైల్వేస్టేషన్లోని ఆరో నంబర్ ప్లాట్ఫాంపై గుర్తించారు. బాలుడిని సంరక్షణ నిమిత్తం చైల్డ్ హెల్ప్ డెస్క్కు అప్పగించారు. అక్కడ బాలుడికి కౌన్సిలింగ్ చేసి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. అపరేషన్ అమానత్లో భాగంగా ఒంగోలు, అనకాపల్లి స్టేషన్లలో ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగులను స్వాధీనం చేసు కుని యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ డీఎస్సీ (డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్) షణుగ్మ వడివేల్ ఆర్పీఎఫ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
‘భోజనం తినలేక పోతున్నాం’
పులిగడ్డ(అవనిగడ్డ): గురుకుల పాఠశాలలో పెడుతున్న భోజనం తినలేక పోతున్నామని, ఏదీ సరిగా వండరని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కె. కృష్ణకిరణ్కు విద్యార్థులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పులిగడ్డ గురుకుల పాఠశాల, అవనిగడ్డలో జెడ్పీ హైస్కూల్, పలు అంగన్వాడీ కేంద్రాలను కృష్ణకిరణ్ బుధవారం తనిఖీ చేశారు. తొలుత పులిగడ్డ గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 90 శాతం మంది విద్యార్థులు సరైన ఆహారం పెట్టడం లేదని లిఖితపూర్వకంగా చెప్పారు. అనంతరం అవనిగడ్డలోని పలు అంగన్వాడీ కేంద్రాలు, జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. ఐసీడీఎస్ సీడీపీవో ప్రసన్న విశ్వనాథ, తూనికలు, కొలతలు అధికారి ఈశ్వరరావు, ఉప విధ్యాధికారి శేఖర్ సింగ్ పాల్గొన్నారు. -
అంగన్వాడీ వర్కర్లకు 5జీ సెల్ ఫోన్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవలు అందించేందుకు అంగన్వాడీ వర్కర్లకు 5జీ మొబైల్ ఫోన్లను అందిస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అంగన్వాడీ వర్కర్లకు సెల్ ఫోన్లు అందించే కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. 58,204 మంది వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్లతో 5జీ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇటీవల వివిధ శాఖల ర్యాంకులు ప్రకటించగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో 98 శాతం సేవలతో ఏ++ కేటగిరీతో నాలుగో స్థానంలో నిలవటం అభినందనీయమన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ సెంటర్లలో పిల్లలను అందంగా అలంకరించటానికి ముస్తాబు కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి మంచి ఫలితాలు సాధించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో కొత్త యూనిఫాం, అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.లక్ష చొప్పున అందిస్తామన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం కార్యదర్శి ఎ.సూర్యకుమారి, సంచాలకుడు ఎం.వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కె.ప్రవీణ, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు. -
అప్పులు ఎలా తీర్చాలి?
పెసర, పత్తి, మొక్క జొన్న, మినుము సాగుచేశా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పంటనూ కొనలేదు. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం పంటలు కొనకపోవటంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించా. ఇతరుల నుంచి అప్పులు తెచ్చి పంటలు సాగుచేశా. ఆ పంటలు చేతికిరాగానే అప్పుల వాళ్లు ఇంటికి వస్తున్నారు. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావటంలేదు. – ఉయ్యూరు మల్లారెడ్డి రైతు, వేములపల్లి, కంచికచర్ల మండలం ● -
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు
కంచికచర్ల: మానవ జీవనానికి ఆధారమైన వ్యవసాయం, రైతులపై చంద్రబాబు ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు విమర్శించారు. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావుకు రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ.. రైతు సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన అధికార పార్టీ నేతలు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా, రైతులను ఆదుకోవాలని కోరేందుకు వస్తున్న తమను పోలీసులతో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థూల ఉత్పత్తి ఎలా పెరుగుతుంది? స్థూల ఉత్పత్తి పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, వ్యవసాయాధారిత రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూలిపోయి, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయకుండా అది ఎలా సాధ్యమని జగన్మోహనరావు ప్రశ్నించారు. కంచికచర్ల మార్కెట్ యార్డుకు ఆగస్టులో తీసుకొచ్చిన అపరాల పంట నేటికీ అలానే దర్శనమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పంటలు సాగు చేసిన రైతులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. వ్యవసాయం చేయాలంటేనే భయపడేలా రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనలేకపోవటం సిగ్గుచేటు అధికార పార్టీ నేతలకు సిగ్గుంటే రైతులు పండించిన ప్రతి ఒక్క పంటను ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయాలని జగన్మోహనరావు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ లేకపోవటం సిగ్గుచేటన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వకపోవటం, 18 నెలల పాలనలో ఈ పంటలు ఇంత కొన్నాం రైతులకు మేలు చేశామని చెప్పలేకపోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బండి మల్లికార్జునరావు, వేమా సురేష్బాబు, ఆవల రమేష్, కాలవ పెదబాబు, నువ్వుల విశ్వనాథం, కాలవ వాసుదేవరావు, దేవరకొండ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. -
● ఉత్సాహంగా.. ఉల్లాసంగా బాలోత్సవం
విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఎనిమిదో అమరావతి బాలోత్సవం మంగళవారం ప్రారంభమైంది. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 60 అంశాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజయవాడ నగరంలోని పాఠశాలలతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బుధ, గురువారాల్లో కూడా పోటీలు కొనసాగుతాయని బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కొండలరావు తెలిపారు. సభ అనంతరం సిద్ధార్థ ఆడిటోరియం, కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు వేదికలపై జరిగిన సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. – మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) -
టెట్ నుంచి మినహాయింపు కోరుతూ టీచర్ల నిరసన
చిలకలపూడి(మచిలీపట్నం): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్షకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కేఏ ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టెట్ పరీక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిటీషన్లు వేయాల్సి ఉందన్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ టెట్ తప్పనిసరిగా పాస్ కావాలని, లేకుంటే వారిని తొలగిస్తామని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీని కారణంగా రాష్ట్రంలో దాదాపు లక్ష మంది ఉపాధ్యాయులు టెట్ పరీక్ష పాస్ కావాల్సి వస్తుందని అంచనాలు ఉన్నాయన్నారు. దీనిపై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. రివ్యూ పిటీషన్ వేయడంలో జాప్యం.. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలని తాము విద్యాశాఖ మంత్రికి చెప్పటంతో ఆయన రివ్యూ పిటీషన్ వేయనున్నట్లు ప్రకటించారని ఉమామహేశ్వరరావు చెప్పారు. కానీ ప్రభుత్వం తరఫున ఈ పిటీషన్ వేయటంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. దీనిని వేగవంతం చేయాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగు న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు జె. లెనిన్బాబు, అధ్యక్షులు ఎండీ షౌకత్ హుస్సేన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో కె. చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందజేశారు. డీఆర్వోకు వినతిపత్రం సమర్పణ -
సేవల్లో గుడివాడ ఆర్ఆర్ఐ ముందంజ
హోమియో సహాయ సంచాలకులు డాక్టర్ కిషన్ బానోత్ గుడివాడరూరల్: రాష్ట్రంలో సీసీఆర్హెచ్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు పరిశోధన, వైద్య సేవలు, ప్రజా అవగాహన కార్యక్రమాల్లో గుడివాడ ఆర్ఆర్ఐ(హెచ్) దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని హోమియో సహాయ సంచాలకులు డాక్టర్ కిషన్ బానోత్ పేర్కొన్నారు. స్థానిక హోమియో వైద్యశాలలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడివాడ హోమియో వైద్యశాలకు సగటును రోజుకు 300మందికి పైగా రోగులకు అవుట్పేషంట్ విభాగం ద్వారా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. 25పడకల ఇన్పేషెంట్ విభాగం(ఐపీడీ) కూడా ఉందని, రోగులకు అవసరమైన సమయంలో అన్ని సేవలు అందించి ప్రత్యేక చికిత్స అందిస్తామన్నారు. సమగ్ర నిర్ధారణ కోసం సక్రమంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాల సదుపాయాలు, లేబొరేటరీ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. గుడివాడ పరిసర ప్రాంతాల వారు హోమియో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఢిల్లీలో ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే 2వ డబ్ల్యూహెచ్వో గ్లోబల్ సంప్రదాయ వైద్య సదస్సు గురించి ఆయన వివరించారు. ఈ సదస్సుకు ఆరోగ్యం, సంతోషం కోసం శాసీ్త్రయ ఆచరణ అనే థీమ్ను నిర్ణయించినట్లు తెలిపారు. 100కు పైగా దేశాల నుంచి మంత్రులు, అధికారులు, ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. -
మహిళకు స్క్రబ్ టైఫస్
లబ్బీపేట(విజయవాడతూర్పు): లారీల ఫిట్నెస్ చార్జీల పెంపును నిరసిస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి చేయ తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు న్యూ ఆంధ్రా మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శేషగిరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం లారీ యజమానులతో చర్చలు జరిగి, పెరిగిన రేట్లు హోల్డ్ చేస్తామని, నాలుగు రోజులు సమయం పడుతుందని కోరిన మీదట సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. నాలుగు రోజుల తర్వాత సమస్యను పరిష్కరించకుంటే మళ్లీ యజమానులందరూ సమావేశమై భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. విజయవాడలీగల్: బాలికపై లైంగికదాడి చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి వేల్పుల భవానీ మంగళవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మాచవరం పోలీసుస్టేషన్ పరిధిలో విజయనగర్ కాలనీలో తల్లి, ఇద్దరు తమ్ముళ్లతో నివసించే ఫిర్యాది(16) కొంతకాలం హాస్టల్లో చదివి, కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటివద్దనే నివసిస్తోంది. ఈ క్రమంలో మారుతీనగర్లో నివసించే మెడేపల్లి సాయి కుమార్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. వారిరువురు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో 2021 జూలై 23వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సాయికుమార్ వచ్చి బయటకు వెళ్దామని చెప్పి గుణదల సమీపంలో హోటల్ నందు రూమ్కి తీసుకెళ్లి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికదాడి చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఇంటికి వచ్చి తల్లికి చెప్పగా, ఇద్దరూ కలిసి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేసిన అనంతరం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 2021 జూలై 26వ తేదీన మెడేపల్లి సాయి కుమార్ను కోర్టులో హాజరుపరిచారు. విచారణలో సాయి కుమార్పై నేరం రుజువైనందున మంగళవారం విజయవాడ పోక్సో న్యాయమూర్తి వేల్పుల భవానీ నిందితుడికి పై విధంగా శిక్ష విధించారు. రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కృష్ణకిరణ్ -
నిరసన ‘సంతకానికి’ విశేష స్పందన
పెడన: నూతన వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు తమ సంతకాల రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులు చెబుతున్న విషయాలను విని, స్వచ్ఛందంగా ప్రజలు సంతకాలు చేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 60వేల సంతకాలు సేకరించాలని వైఎస్సార్ సీపీ నాయకులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆదివారం సాయంత్రానికి జిల్లాలో 3,27,600మంది ప్రజలు సంతకాలు చేశారు. ప్రజల స్పందనను చూస్తుంటే ఈ నెల 13వ తేదీ నాటికి లక్ష్యానికి మించేలా ఉందని ఆయా నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్చార్జులు పేర్కొంటున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులతో పాటు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు సంతకాల సేకరణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా సంతకాల సేకరణను ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్ సీపీ శ్రేణులు.. మంగళవారం పలు నియోజవర్గాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు సంతకాల సేకరణలో నిమగ్నమయ్యారు. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ గ్రామంలో, అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలోని వంతెన సెంటరు, ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ముమ్మరంగా కోటి సంతకాలు సేకరణ చేపట్టారు. అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు సంతకాల సేకరణలో పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా గ్రామాల్లోను, పట్టణాల్లో వైఎస్సార్ సీపీ కుటుంబ శ్రేణులు ముమ్మరంగా సంతకాల సేకరణ చేస్తున్నారున్నారు. నియోజకవర్గా వారీగా పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ పెనమలూరులో 49,500, మచిలీపట్నంలో 65,000, గన్నవరంలో 43,000, పెడనలో 43,000, అవనిగడ్డలో 52,000, గుడివాడలో 32,000 పామర్రు నియోజకవర్గంలో 43,100 సంతకాలు సేకరించారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 3,27,600 సంతకాలు సేకరణ -
చంద్రబాబు పాలనపై వ్యతిరేకతకు నిదర్శనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు పాలనపై వ్యతిరేకతను ప్రజలు తమ సంతకంతో తెలియజేశారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. నూతన వైద్య కళాశాలలు పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడంపై తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడ తూర్పులోని ప్రతి డివిజన్లో సంతకాల సేకరణ చేపట్టామని, చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తమ పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారన్నారు. దీంతో 97వేల మంది ప్రజలు తమ వ్యతిరేకతని తెలియజేస్తూ సంతకాలు చేశారన్నారు. కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలి.. ఇప్పటికై నా కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలని దేవినేని అవినాష్ హితవు పలికారు. ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి 60 వేలకు పైనే సంతకాలు చేశారన్నారు. నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల పేపర్లు జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తాయని, ఈ నెల 15న జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపుతామన్నారు. 17న రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సంతకాలను గవర్నర్కి అందజేస్తామని తెలిపారు. వైద్య కళాశాలలు పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు. డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యం.. గాల్లో దీపం!
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. ఆహార తనిఖీలు చేయాల్సిన ప్రజారోగ్య సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. దీంతో మాంసం దుకాణాల్లో నిల్వ మాంసం విక్రయాలు యథేచ్ఛగా జరుగుతుండగా, నాణ్యాతా ప్రమాణాలు పాటించని ఆర్ఓ ప్లాంట్ల నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. తరచూ ప్రజలు అంటువ్యాధులు బారిన పడుతున్నా అధికారులు కళ్లు తెరవడం లేదు. ప్రజారోగ్యశాఖ అంటే కేవలం నగరంలో శానిటేషన్ పనులకే పరిమితమైనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు అనారోగ్యాలు తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. తనిఖీలు చేయరా.. నగరంలో నిల్వ మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అంతేకాదు మటన్షాపుల్లో మాంసం కల్తీ కూడా జరుగుతున్నట్లు ఆరోపణ లున్నాయి. కానీ మటన్ దుకాణాల్లో తనిఖీలు చేసిన సందర్భాలు చాలా అరుదు. కేవలం కబేళాలో ముద్ర వేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. మాంసం దుకాణాలు తనిఖీ చేసేందుకు నగర పాలక సంస్థలో పశు వైద్యుడితో పాటు ప్రతి డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు నగరంలో ఆర్ఓ ప్లాంట్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. వాటిలో సగానికి పైగా నాణ్యత లేనివే ఉన్నాయి. అందుకు న్యూ రాజరాజేశ్వరీపేటలో నిర్వహించిన తనిఖీల్లో వచ్చిన రిపోర్టులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి నీళ్లు తాగి ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. నగరంలోని ఫుడ్స్టాల్స్లో తనిఖీలు చేసే అధికారం కూడా ప్రజారోగ్య సిబ్బందికి ఉంటుంది. కానీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మామూళ్లే కావాలి.. నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాళ్లు డబ్బులు లేనిదే ఏ పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను పక్కన పెట్టి, షాపులకు ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ వంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. జనన, మరణాల నమోదులో సైతం చేతివాటం చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మాంసం దుకాణాలు, హోటళ్ల నుంచి కూడా మామూళ్లు దండుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇలా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేస్తూ అసలు ప్రజారోగ్యాన్ని పక్కన పెడుతుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. తరచూ సాంక్రమిక వ్యాధులు.. నగర ప్రజలు తరచూ డయేరియా బారిన పడుతున్నారు. ఈ ఏడాది న్యూ రాజరాజేశ్వరీపేటలో దాదాపు 400 మంది డయేరియా బారిన పడ్డారు. ఇటీవల పాత రాజరాజేశ్వరిపేటలో మరో 10 మంది వరకూ డయేరియా బారిన పడిన విషయం తెలిసిందే. కలుషిత ఆహారం, నీరు కారణంగా తరచూ ప్రజలు డయేరియా బారిన పడుతూ ఆస్పత్రుల దారి పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నాణ్యత లేని ఆహారంపై ఫుడ్ కంట్రోలర్తో పాటు, కార్పొరేషన్ ప్రజారోగ్య సిబ్బంది తనిఖీ చేసే అధికారం ఉన్నప్పటికీ, వాళ్లు తనిఖీల జోలికి వెళ్లడం లేదు. దీంతో విచ్చలవిడిగా నాణ్యత లేని ఆహార విక్రయాలు జరగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలోని దుకాణాల్లో నిల్వ మాంసం విక్రయాలపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ఓ ప్లాంట్లను కూడా తనిఖీ చేస్తున్నాం. నాణ్యతను పరిశీలిస్తున్నాం. – డాక్టర్ అర్జునరావు, సీఎంఓహెచ్, వీఎంసీ -
టీడీపీ, బీజేపీ ఢీ అంటే ఢీ
సర్కిల్ వద్ద పోటాపోటీగా నినాదాలు చేస్తున్న టీడీపీ, బీజేపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు మచిలీపట్నంటౌన్: కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీల మధ్య ముసలం వచ్చింది. విగ్రహాల ఏర్పాటు విషయంలో రేగిన వివాదం ఇరు పార్టీల నాయకులు తోపులాటలు, నల్లజెండాలతో నిరసనలు, నినాదాలు, బైఠాయింపుల వరకు వెళ్లింది. ఈ ఘటన సోమవారం నగరంలో నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని బైపాస్ రోడ్లో ఉన్న హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వద్ద మాజీ ప్రధాని అతుల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నాయకులు సోమవారం ఉదయం టెంకాయలు కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. సర్కిల్లో టీడీపీ నాయకులు నిలబడి బీజేపీ నాయకులు శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు సర్కిల్ బయట రోడ్డుపై టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఒకరినొకరు తోసుకుంటూ వాగ్వాదానికి దిగారు. బీజేపీ నాయకులకు పోటీగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించే ప్రయత్నం చేయగా చిలకలపూడి సీఐ నబీ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు నల్లజెండాలను పట్టుకుని జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీ ఆర్... జోహార్ ఎన్టీఆర్... అంటూ నినాదాలు చేయగా, బీజేపీ నాయకులు జోహార్ వాజ్పేయి అంటూ పోటీగా నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి 2014లోనే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశామని, ఈ సర్కిల్కు ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం కూడా చేశామని చెప్పారు. ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేయడంతో సమస్య సద్దుమణిగింది. ఈ వ్యవహారాన్ని బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకుల దృష్టిలో పెట్టినట్లు సమాచారం. ఈ పోటాపోటీ ఆందోళనలో టీడీపీ తరఫున జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణి కుమార్, మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు, అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్, నాయకులు పంతం గజేంద్ర, నాగలింగం అయోధ్య రామచంద్రరావు (రాము) సోడిశెట్టి బాలాజీ, వైవీఆర్ పాండురంగారావు, ఘంటా సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్
నందిగామ టౌన్: చెడు వ్యసనాలకు బానిసై ఖరీదైన మోటారు సైకిళ్లను అపహరించి తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న వ్యక్తులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి చోరీ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరి గ్రామానికి చెందిన ఏపురి శివ, నకిరేకల్ మండలం చీమలగడ్డ గ్రామానికి చెందిన కుర్రి మహేంద్ర, మేడిపల్లి ఉమేష్చంద్ర, నకిరేకల్కు చెందిన కంచుకొమ్మల సంజయ్ కుమార్, నల్గొండ జిల్లా దామచర్ల గ్రామానికి చెందిన ఊదర సంతోష్ గత కొంత కాలంగా ఖరీదైన ద్విచక్ర వాహనాలను అపహరించి వాటిని తాకట్టు పెడుతూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. 20 రోజుల క్రితం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో నందిగామ శివారు వై జంక్షన్ వద్ద ఎస్ఐలు మోహనరావు, సూర్యవంశీ వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వస్తున్న ఐదుగురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా వారిని పట్టుకున్నట్టు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.26 లక్షల విలువ చేసే నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, పిడుగురాళ్ల ఒకటి, నరసరావుపేట ఒకటి, పెనమలూరు ఒకటి, కృష్ణలంక ఒకటి, రెంటచింతల ఒకటితో పాటు ఆయా ప్రాంతాలలో చోరీకి పాల్పడిన మరో ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్ఐలను అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో ఏసీపీ తిలక్, సీఐ వైవీఎల్ నాయుడు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
ప్రాధాన్యతాక్రమంలో ప్రజా సమస్యలు పరిష్కారం
కోనేరుసెంటర్: మీకోసంలో అందిన అర్జీలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బిడ్డల ఆదరణ నోచుకోని అభాగ్యులు ఇలా ఎందరో మీకోసం కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తేగా, చలించిన ఆయన వీలైనంత త్వరగా మీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు ప్రధానమైన అర్జీలు ● పెనమలూరు నుంచి కవిత అనే బాధితురాలు ఎస్పీని కలిసి తన భర్త అదనపు కట్నం కోసం గత రెండేళ్లుగా తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడని, పెద్దలలో పెట్టినా అతని ప్రవర్తనలో మార్పు రావటం లేదని తన సమస్యకు పరిష్కారం చూపి న్యాయం జరిగేలా చూడాలని కోరింది. ● పెడన నుంచి నరసమ్మ అనే వృద్ధురాలు తన కన్నబిడ్డలు కనీసం అన్నం కూడా పెట్టకుండా చిత్రహింసలు పెడుతున్నారని, పైగా ఆస్తి కోసం తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని కన్నీరు పెట్టుకుంది. వారి నుంచి రక్షణ కల్పించి బిడ్డలు తనకు అన్నం పెట్టేలా చూడాలని కోరింది. ● తోట్లవల్లూరుకు చెందిన వీరయ్య తన ఇంటి సరిహద్దుదారులు తమ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు తనతో పాటు తన కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడుతూ బెదిరిస్తున్నారంటూ వాపోయాడు. వారిపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరాడు. ● అవనిగడ్డ నుంచి వనజ అనే వివాహిత తనకు తన భర్తకు మధ్య విభేదాలు తలెత్తటంతో అత్తింటి వారు తన మూడేళ్ల బిడ్డను తనకు చూపించకుండా వారి వద్దే ఉంచుకున్నారని, బిడ్డను తనకు అప్పగించి న్యాయం చేయాలని కోరింది.మీకోసంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
వైద్యశాఖలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించండి
ప్రభుత్వానికి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యశాఖలోని ప్రైమరీ, సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.గిరిబాబు అన్నారు. ఆస్పత్రుల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని జీఓ ఉన్నా, ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పీహెచ్సీలు 24/7 ఆస్పత్రులుగా ఉన్నందున, వాటిలో అదనంగా మరో స్టాఫ్నర్సును నియమించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ముగ్గురు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని, వీక్లీ ఆఫ్, సెలవుల్లో సర్దుబాటు కావడం లేదని తెలిపారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు లాస్ట్ గ్రేడ్ వర్కర్లు ఉండేలా చూడాలని కోరారు. సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియాలజీ సర్వీసు సిబ్బందికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసి, అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టాలని సూచించారు. కాల్ డ్యూటీ పేరుతో ఉన్న వారినే 24 గంటలు డ్యూటీ చేయమనడం సరికాదన్నారు. సెకండరీ హెల్త్ విభాగంలో ఉద్యోగుల సెలవులు మంజూరుకు పెట్టిన ఐదు శాతం నిబంధన తీసివేయాలని డిమాండ్ చేశారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టు పోస్టులు భర్తీ చేయాలని, శాఖాపరమైన సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలన్నారు. పెరిగిన ఆస్పత్రులకు అనుగుణంగా వైద్యులు, పారామెడికల్, నర్సింగ్, క్లాస్ఫోర్ సిబ్బంది నియామకాలు చేపడితేనే పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుతాయని వివరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ ఫైలింగ్లో కాలపరిమితి పెట్టాలని గిరిబాబు డిమాండ్ చేశారు. ప్రాణాలు కాపాడిన పోలీసులు పటమట(విజయవాడతూర్పు): జాతీయ రహదారి 16పై రామవరప్పాడు నుంచి బెంజిసర్కిల్ మీదగా స్క్యూబ్రిడి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వివరాల మేరకు సోమవారం రాత్రి బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ దిగే సమయంలో రామవరప్పాడు వైపు నుంచి స్క్యూబ్రిడ్జికి వెళ్లే మార్గంలో జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు లారీ కింద చిక్కుకున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే 5వ ట్రాఫిక్ సీఐ రవికుమార్కు వైర్లెస్ సెట్లో సమాచారం ఇవ్వగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడు కారు వెనుక లారీకింద చిక్కుకున్నాడు. వెంటనే క్షతగాత్రుడిని బయటకు తీసి సీపీఆర్ చేసి అంబులెన్స్ వచ్చేందుకు ఆలస్యమవుతుందని క్షతగాత్రుడిని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులోనే నవీన్రెడ్డి హత్య
నిందితుడిని విలేకరుల ఎదుట హాజరుపర్చిన డీసీపీ లక్ష్మీనారాయణజగ్గయ్యపేట: మండలంలోని చిల్లకల్లు పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల నాలుగో తేదీన ధర్మవరప్పాడు తండా రామ్కో ఫ్యాక్టరీ సమీపంలో విజయవాడకు చెందిన ఆలవాల నవీన్రెడ్డి హత్య మద్యం మత్తులో జరిగిందని డీసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. నిందితుడు విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అలియాస్ పిల్లా సాయిని పట్టణంలోని సీఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల ఎదుట హాజరుపర్చి కేసు వివరాలను తెలిపారు. మృతుడు నవీన్రెడ్డికి నిందితుడు గాదె సాయికృష్ణ విజయ వాడలో ఓ జైలులో పరిచయం. ఈ క్రమంలో ఈ నెల నాలుగో తేదీన చిల్లకల్లు గ్రామానికి చెందిన ఇనపనూరి అన్వేష్ మద్యం పార్టీ ఇవ్వటంతో ఆ పార్టీకి వీరిద్దరూ హాజరయ్యారు. మద్యం మత్తులో నవీన్రెడ్డి, సాయికృష్ణల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని సాయికృష్ణ బీరు సీసా పగలగొట్టి నవీన్రెడ్డిపై దాడి చేయగా నవీన్రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడున్న అన్వేష్ , మరొకరి సాయంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం 10 బృందాలతో గాలింపు చేపట్టామని, సోమవారం ఉదయం జగ్గయ్యపేటలో అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్లు డీసీపీ తెలిపారు. నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో నందిగామ ఏసీపీ తిలక్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు తోట సూర్య శ్రీనివాస్, సాయి మణికంఠ, శంకర్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడు సాయికృష్ణపై పలు కేసులు సాయికృష్ణపై భవానీపురం, ఇబ్రహీంపట్నం, కృష్ణలంకతో పాటు పలు పోలీస్స్టేషన్లలో గంజాయి, పోక్సో కేసులతో పాటు పదిహేనుకు పైగా కేసులు ఉన్నాయి. నవీన్రెడ్డి, సాయికృష్ణ చిల్లకల్లులో కొంతకాలంగా ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయికృష్ణను సాంకేతిక పరిజ్ఞానంతో చిల్లకల్లు పోలీసులు గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేయగా పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. -
స్క్యూబ్రిడ్జి వద్ద భవానీల ఆందోళన
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ స్క్యూబ్రిడ్జి వద్ద స్వల్ప విషయమై భవానీ మాలధారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో భవానీలు సుమారు గంటపాటు బైఠాయించి ఆందోళన చేశారు. ఏసీపీలు దామోదర్, పావన్కుమార్ అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది వారిని కృష్ణలంక పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. అసలేం జరిగిందంటే... కంకిపాడుకు చెందిన సుమారు 25 మంది భవానీ మాలధారులు రెండు ఆటోల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం మధ్యాహ్నం సద్దికి బయలు దేరారు. ఆటో వెనుక డోర్పై కూడా కూర్చుని ప్రయాణిస్తున్న భవానీ మాలధారులను కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల వద్ద కానిస్టేబుల్ చూసి వారిని ఆపారు. సురక్షితం కాని ఇలాంటి ప్రయాణం చేయవద్దని మందలించారు. దీంతో భవానీ మాలధారులకు, కానిస్టేబుల్కు మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ తరుణంలో ఫొటోలు తీస్తున్న కానిస్టేబుల్ ఫోన్ లాక్కుని భవానీ మాలధారుల్లో ఒకరు పగలకొట్టినట్లు తెలిసింది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. దీంతో ఆ కానిస్టేబుల్ విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెంజిసర్కిల్ వద్ద ఆపిన పోలీసులు ఆటోల్లో వస్తున్న భవానీ మాలధారులను బెంజిసర్కిల్ వద్ద పోలీసులు ఆపారు. ఎందుకు ఆపారని భవానీ మాలధారులు గొడవ పడుతుంటే , ట్రాఫిక్ ప్రాంతం కావడంతో వదిలేశారు. అనంతరం స్క్యూబ్రిడ్జి వద్ద రెండు ఆటోలను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన ట్రాఫిక్ పోలీసులు తమ ఆటోలను ఆపడంతో భవానీ మాలధారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గంటపాటు ఆందోళన సాగడంతో ఏసీపీలు దామోదర్, పావన్కుమార్ అక్కడకు చేరుకుని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా తొలుత వినలేదు. అనంతరం వారందరినీ కృష్ణలంక పోలీస్స్టేషన్కు రమ్మని తీసుకెళ్లారు. అయితే వారు ఫిర్యాదు చేయకుండానే స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. గంటపాటు చేసిన ఆందోళనతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కృష్ణలంక, పటమట, ట్రాఫిక్ సీఐలు నాగరాజు, పవన్కిషోర్, రామారావు, బాలమురళీకృష్ణ చర్యలు తీసుకున్నారు. -
కృష్ణలంక హైవేపై బైక్ దగ్ధం
కృష్ణలంక(విజయవాడతూర్పు): సాంకేతిక లోపాలు తలెత్తి మంటలు చెలరేగడంతో ద్విచక్ర వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యనమలకుదురు, అవనిగడ్డ కరకట్ట రోడ్డులోని హోసన్నా మందిర్ సమీపంలో నివాసం ఉంటున్న పి.కిషోర్ కంచికచర్లలోని మిక్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతను తన యూనికార్న్ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరాడు. కృష్ణలంక, ఫైర్స్టేషన్ సెంటర్లో హైవే మీదకు చేరుకోగానే ద్విచక్ర వాహనం ఇంజిన్లో లోపాలు తలెత్తి మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన కిషోర్ వాహనాన్ని వదిలేసి పరుగులు పెట్టాడు. అప్పటికే యువకుని కాళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. విద్యుదాఘాతానికి గురై ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతి పామర్రు: విద్యుత్ షాక్కు గురై ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన పామర్రులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పామర్రు పంచాయతీ పరిధిలోని చెన్నువానిపురానికి చెందిన చిన్నం విజయ్బాబు(51) ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయం బలిపర్రులో ఓ ఇంటి కరెంట్ వైరింగ్ పనులు చేస్తూ విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కగా, విద్యుత్ వైర్లు తగిలి షాక్కు గురై కిందకు పడిపోయాడు. చెవుల నుంచి రక్తం కారుతుండగా అక్కడే గిలగిలా కొట్టుకుని మృతి చెందాడు. విజయ్ మృతితో చెన్నువానిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం విజయ్బాబు భౌతిక కాయాన్ని గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అంబేడ్కర్ జీవితం ఆదర్శనీయం డీఆర్ఎం మోహిత్ సోనాకియా రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దార్శనికత, జ్ఞానం, విద్య, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా కొనియాడారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం డీఆర్ఎం కార్యాలయ ప్రాంగణంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో రాజ్యాంగ విలువలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, పలు బ్రాంచ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మడకా ప్రసాద్ గుడివాడరూరల్: ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గుడివాడకు చెందిన మడకా ప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన ఏలూరులో జరిగిన రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఎన్నికల్లో తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు. ఈ సందర్భంగా మడకా ప్రసాద్ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ రంగప్రసాద్, గౌతమ్ స్కూల్ డైరెక్టర్ కె.అవినాష్, ఖోఖో సంఘం జిల్లా సెక్రటరీ మద్దినేని సత్యప్రసాద్ అభినందించారు. కొమ్మా కోటేశ్వరరావుకు 15 వరకు రిమాండ్ రామవరప్పాడు(విజయవాడ రూరల్): గన్న వరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ టీడీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో కొమ్మా కోటేశ్వరరావు(కొమ్మా కోట్లు)కు ఈ నెల 15 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు విజయవాడ పటమట పోలీస్స్టేషన్లో ఆయన స్వచ్ఛందంగా లొంగిపోగా పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి పి.భాస్కరరావు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ఈ నెల 15 వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. -
ఆరు గ్రామ పంచాయతీలకు ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాలు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించిన ఆరు గ్రామ పంచాయతీలకు ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కలెక్టరేట్లోని సమావేశం హాలులో పంచాయతీల ఈఓలకు అందజేశారు. ఆత్కూరు గ్రామ పంచాయతీకి సంబంధించి సుపరిపాలన అందించడంలో, కేసరపల్లి గ్రామ కాఫీ షాప్ ద్వారా సొంతంగా రెవెన్యూ సాధించడంలో, బాపులపాడు పంచాయతీ స్వచ్ఛరథం నిర్వహణలో, పునాదిపాడు పంచాయతీ సంపద తయారీలో, చల్లపల్లి స్వచ్ఛ సుందరంగా, నాగాయలంక ప్లాస్టిక్ వ్యర్థాల యాజమాన్య యూనిట్ నిర్వహణలో ఆదర్శంగా నిలిచారన్నారు. ఐఎస్వో ధ్రువీకరణ పత్రాలు పొందడంలో విశేష కృషి చేసిన డీపీవో జె.అరుణ, పంచాయతీ ఈవోలను కలెక్టర్ అభినందించి మరింత సుపరిపాలన అందించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, డీపీవో కార్యాలయ ఏవో సీతారామయ్య, డీఎల్పీవో రజావుల్లా తదితరులు పాల్గొన్నారు. -
కోటి సంతకాలకు విశేష స్పందన
కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 3,24,100 సంతకాల సేకరణపెడన: నూతన వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు తమ సంతకాల రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి పెద్ద విశేష స్పందన లభిస్తోంది. సోమవారం సాయంత్రానికి జిల్లాలో 3,24,100 మంది ప్రజలు సంతకాలు చేశారు. గన్నవరం నియోజకవర్గంలోని ఎనికేపాడు, నందమూరు గ్రామాల్లోను, పామర్రు మండలంలో పామర్రు, పమిడిముక్కల మండలం మామిళ్లపల్లి గ్రామాల్లో, మచిలీపట్నం నగరంలో ముమ్మరంగా కోటి సంతకాలు సేకరణ చేపట్టారు. అలాగే అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలం ఏటిమొగ, అవనిగడ్డలో సంతకాల సేకరణ నిర్వహించారు. అవనిగడ్డలో జరిగిన సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఏడు నియోజకవర్గాల్లో పెనమలూరు 49,500, మచిలీపట్నంలో 65,000, గన్నవరంలో 43,000, పెడనలో 43,000, అవనిగడ్డలో 50,000, గుడివాడలో 30,500, పామర్రులో 43,100 సంతకాలను సేకరించారు. -
కూరగాయల కొరత లేకుండా చూడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో కూరగాయల కొరత లేకుండా చూడాలని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా ధరల నియంత్రణ కమిటీ సభ్యులతో ఇలక్కియ సమావేశం నిర్వహించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను సమీక్షించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. దిగుమతులు ఎక్కువగా ఉండటంతో కూరగాయలకు కొరత ఉండబోదన్నారు. సమావేశంలో డీఎస్ఓ ఎ.పాపారావు, మార్కెటింగ్ ఏడీ, అగ్రికల్చర్ ఏడీ, రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, దాల్స్, ఆయిల్స్ హోల్సేల్, రిటైలర్స్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విశాఖపట్నంలోని గీతమ్స్ డీమ్డ్ టూబీ యూని వర్సిటీలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ (మహిళలు) టోర్నమెంట్లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించే జట్టును ఎంపిక చేశామని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ ఇ.త్రిమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పుత్తూరులోని కేకేసీ హోమియోపతిక్ కళాశాలకు చెందిన ఎం.సుభాషిణి, చిన కాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎన్.యామిని, ఎ.ఖ్యాతి, రాజమండ్రిలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన టి.సాత్విక, విజయనగరంలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ సైన్స్కు చెందిన జి.కల్యాణిని జట్టులో సభ్యులుగా ఎంపిక చేశామని తెలియజేశారు. జట్టుకు ఎంపికై న సభ్యులను యూనివర్శిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ వి.రాధికారెడ్డి అభినందించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నెల 9,10,11 తేదీల్లో 8వ అమరావతి బాలోత్సవం జరగనుంది. విజయ వాడలోని పాఠశాలలతో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పరిధిలోని సుమారు 200 పైగా స్కూళ్ల నుంచి 12 వేల మంది విద్యార్థులు బాలోత్సవంలో పాల్గొననున్నారు. సాంస్కృతిక, అకడమిక్ ఈవెంట్లలో ప్రతిభను ప్రదర్శించనున్నారు. 47 అకడమిక్, 17 కల్చరల్ అంశాల్లో సబ్జూనియర్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. సిద్ధార్థ ఆడిటోరియం, కళాశాల ఆవరణలోని పలు ప్రాంతాల్లో వేదికలను ఏర్పాటు చేసి పోటీలను నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ బాలోత్సవాన్ని ప్రారంభిస్తారని అమరావతి బాలోత్సవ్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు చెప్పారు. మంచి గాలి కోసం.. మంచి జీవితం కోసం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఈ ఏడాది బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలకు సంబంధించి బీ ఫార్మసీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. పరీక్షకు 120 విద్యార్థులు హాజరవ్వగా 83.89 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈనెల 18లోపు ఆన్లైన్లో రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు www.kru.ac.in లో చూసుకోవాలన్నారు. -
దీక్ష విరమణలకు పటిష్ట ఏర్పాట్లు
ఆర్డీవో చైతన్య ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య చెప్పారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. తొలుత కనక దుర్గనగర్లో ఆర్డీవో చైతన్య, ఈవో శీనా నాయక్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. కెనాల్రోడ్డులో క్యూ పనులు, కనకదుర్గనగర్లో లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్లు, స్నానఘాట్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలను పరిశీలించగా, దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులు పనులు జరుగుతున్న విధానాన్ని వివరించారు. మహామండపం వద్ద హోమగుండాలు, అన్నదానం, ఇరుముడులను సమర్పించే కౌంటర్లు, లడ్డూ తయారీ కేంద్రాలను పరిశీలించారు. కార్పొరేషన్, పోలీసు, రెవెన్యూ విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని చైతన్య పేర్కొన్నారు. ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ దుర్గగుడి ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నూతన లడ్డూ పోటులో పూజా కార్యక్రమాలు దీక్ష విరమణలను పురస్కరించుకుని మహా మండపం వద్ద మూడో లడ్డూ పోటుకు ఆలయ అధికారులు సోమవారం పూజలు చేశారు. మహా మండపం, గోశాల మధ్య దేవస్థానం నూతన భవనాన్ని నిర్మించింది. ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటానికి పూజలు చేసి అనంతరం పొయ్యిల వద్ద కొబ్బరికాయ కొట్టి లడ్డూ తయారీని ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీ నాటికి 5 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. -
లోపభూయిష్టంగా ప్రభుత్వ విధానాలు
చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉన్నత విద్యామండలి నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉంటున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియకు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు విధానాలు గందరగోళ పరుస్తున్నాయి. వాటితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. కొంతమంది విద్యాసంవత్సరాలను సైతం కోల్పోతున్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి నిర్ణయాలు ఉండటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. –సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
సకాలంలో స్పందించి పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీలపై అధికారులు సకాలంలో స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్ సమావేశం హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవో స్వాతి, ఏఎస్పీ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 284 అర్జీలను సంబంధిత అధికారులు చూడకపోవడం సరి కాదన్నారు. 128 అర్జీలు గడువుదాటి ఉన్నాయని వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందర్ని ఎస్బీఐలో జీతాల ఖాతాలను తెరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది న్యూఇయర్ వేడుకలకు పుష్పగుచ్చాలు, శాలువాలు తీసుకురాకుండా జిల్లాలోని ప్రభుత్వ బాలికల వసతిగృహాల్లోని వారికి శానిటరీ కిట్లు, చాపలు, టేబుల్స్ వంటివి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ –2025 పోటీల్లో మచిలీపట్నంకు చెందిన బీరం ప్రశాంత్ 65 కిలోల విభాగంలో మొదటి స్థానంలో నిలిచినందుకు కలెక్టర్ సన్మానించారు. మీ కోసంలో 201 అర్జీలను అధికారులు స్వీకరించారు. అర్జీల్లో కొన్ని.. -
ఉన్నత చదువులకు ఆటంకం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు సర్కార్ విద్యావ్యవస్థలో వెనకడుగేస్తోంది. పాలకుల తీరుతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. సాధారణంగా విద్యా సంవత్సరం జూన్లో మొదలై దాదాపుగా ఏప్రిల్ మాసంలో పూర్తవుతుంది. ప్రస్తుత ప్రభుత్వంలో విద్యాశాఖ విధానాలతో వివిధ కోర్సులకు సంబంధించిన విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారిందంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 150 డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సుమారు 40 వేల మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో చేరతారు. ఇంకా పూర్తికాని అడ్మిషన్లు ఎప్పుడూ జూన్లో చేపట్టాల్సిన సాధారణ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఆయా విభాగాలు చాలా ఆలస్యంగా చేపడుతున్నాయి. ప్రధానంగా డిగ్రీ కోర్సులకు అక్టోబర్లో ప్రారంభించి డిసెంబర్ మొదటి వారం వరకూ కొనసాగించారు. దీంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఆయా డిగ్రీ కళాశాలల్లో ఈ నెల మొదటి వారం వరకూ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా కళాశాలలు డిగ్రీలో చేరిన విద్యార్థుల వివరాలను పూర్తిస్థాయిలో తయారు చేసి ఆయా విభాగాలకు పంపుతున్నారు. ప్రస్తుత నిర్ణయాలతో ఈ విద్యాసంవత్సరంలో రెండు సెమిస్టర్లు పూర్తి చేయడానికి ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకూ కొనసాగే అవకాశముంది. ప్రస్తుతం కొనసాగుతున్న పీజీ స్పాట్ అడ్మిషన్లు ప్రస్తుతం పీజీ స్పాట్ అడ్మిషన్ ప్రక్రియకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఐసెట్ ఆధారంగా ఎంబీఏ, ఎంసీఏ వంటి పీజీ కోర్సుల అడ్మిషన్లు పూర్తి చేసినా ఎంఏ, ఎంఎస్సీ వంటి సాధారణ కోర్సుల స్పాట్ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని ఆయా పీజీ కళాశాలలు స్పాట్ అడ్మిషన్లకు సమయత్తమవుతున్నాయి. అవకాశాలు కోల్పోవచ్చు విద్యాసంవత్సరం ముగింపు సకాలంలో జరగకపోతే వివిధ ప్రాంతాల్లో ఉన్నత విద్యకు పలు రకాల ఆటంకాలు ఏర్పడతాయని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా డిగ్రీ కోర్సులు సకాలం పూర్తి కాకపోతే ఇతర రాష్ట్రాలు లేదా వివిధ ప్రాంతాల్లో పీజీ కోర్సుల అడ్మిషన్లను కోల్పోయే ప్రమాదముంది. ప్రధానంగా చాలా రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడంతో పాటు జూన్, జూలై మాసాల్లో అడ్మిషన్లు నిర్వహిస్తాయి. దీంతో ఆలస్యంగా బయటకు వచ్చే డిగ్రీ విద్యార్థులు అక్కడ పీజీ అడ్మిషన్లు కోల్పోతారు. పీజీ విద్యార్థులు సైతం ఇతర కోర్సుల్లో చేరడానికి ఆ విద్యాసంవత్సరంలో అవకాశాలను కోల్పోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఉన్నత విద్యామండలి గందరగోళ నిర్ణయాలు, ఆలస్యంగా నిర్వహించే అడ్మిషన్ల కారణం విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కళాశాలలు ముందుగానే తరగతులు ప్రారంభించడంతో అధికారికంగా అడ్మిషన్లు పూర్తయ్యే సమయంలో చేరే విద్యార్థులకు సరైన తరగతులు, బోధన ఉండవని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉన్నత విద్యామండలిలో అనుభవం కలిగిన విద్యావేత్తలు ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకోవడంతో ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటున్నారని సీనియర్ అధ్యాపకులు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు మేలు జరిగేలా, విద్యారంగానికి ఇబ్బందులు లేని నిర్ణయాలు తీసుకోవాలిగానీ విద్యాసంవత్సరాన్ని అస్తవ్యస్తం చేసే విధానాలు తీసుకోవడం సరికాదంటూ పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. విద్యాసంవత్సరంలో కోర్సులు చక్కగా పూర్తి చేయడానికి ఉన్నత విద్యామండలి ప్రణాళికలను సిద్ధం చేసి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ, పీజీ కోర్సులకు కృష్ణా విశ్వవిద్యాలయం ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ అనధికారికంగా సాంకేతిక విద్యా కోర్సులకు, సాధారణ డిగ్రీ కోర్సులకు ముడిపెట్టి ఒకదాని తర్వాత ఒకటిగా ఉన్నత విద్యామండలి అడ్మిషన్ల నోటిఫికేషన్లు ఇవ్వడం తలనొప్పిగా మారిందని పలువురు విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణంగా మొత్తం విద్యాసంవత్సరం ప్రభావితమవుతుందంటూ పలువుఉ అధ్యాపకులు సైతం విమర్శిస్తున్నారు. -
శుద్ధి చేసిన ధాన్యాన్ని అమ్మండి
చిలకలపూడి(మచిలీపట్నం): వాతావరణం అనుకూలంగా ఉన్నందున రైతులందరూ శుద్ధి చేసిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిచిన మాట వాస్తవమేనని, అయితే వాతావరణం పొడిగా ఉన్నందున రైతులందరూ తేమశాతం తగ్గేంత వరకు ధాన్యాన్ని ఆరబెట్టుకుని శుద్ధి చేసిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రం ద్వారా విక్రయించి కనీస మద్దతు ధర పొందాలన్నారు. మద్దతు ధర పొందేందుకు వ్యర్ధ పదార్ధాలు, మట్టి రాళ్లు, చెత్త, తాలు తొలగించే విధంగా చూడాలన్నారు. చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన పురుగుతిన్న ధాన్యం లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 287 రైతు సేవా కేంద్రాల ద్వారా 2,46,473 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 29,668 మంది రైతుల వద్ద నుంచి సేకరించామన్నారు. ఇప్పటివరకు 72,98,622 గోనె సంచులు ధాన్యం సేకరించేందుకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు 4,199 వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటించి ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే జిల్లా స్థాయిలో కంట్రోల్రూమ్ నంబరు 82476 93551ను ఏర్పాటు చేశామన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ -
ఇవే నిదర్శనం
● గాంధీనగర్కు చెందిన యువతి(19) నగరంలోని ఓ కళాశాలలో బీబీఏ చదువుతోంది. ఎంత చదివినా గుర్తు ఉండటం లేదు. అంతేకాదు తరగతి గదిలో నిద్రపోతోంది. సమస్య ఏదైనా ఉందా అని వైద్యుడిని సంప్రదిస్తే నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ● లబ్బీపేటకు చెందిన వ్యాపారి అర్ధరాత్రి వరకూ బయటే గడుపుతాడు. తర్వాత వెళ్లి రోజుకు మూడు, నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారు. దీంతో ఇటీవల బైక్ నడుపుతుంటే అదుపు తప్పడం, కోపం చిరాకు పెరిగింది. అందుకు నిద్రలేమి కారణం అని వైద్యులు తేల్చారు. -
రేపటి నుంచి సిద్ధార్థలో అమరావతి బాలోత్సవం
200 స్కూల్స్ నుంచి హాజరు కానున్న 12 వేల మంది విద్యార్థులు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో 8వ అమరా వతి బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అమరా వతి బాలోత్సవం అధ్యక్షుడు ఎస్పీ రామరాజు చెప్పారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో బాలోత్సవం పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు మాట్లాడుతూ నగరంలోని పాఠశాలలతో పాటుగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పరిధిలోని సుమారు 200కు పైగా పాఠశాలల నుంచి దాదాపు 12 వేల మంది విద్యార్థులు ఈ బాలోత్సవంలో పాల్గొననున్నారని చెప్పారు. మంచి గాలి కోసం,మంచి జీవితం కోసంపర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఈ ఏడాది బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 47 అకడమిక్, 17 కల్చరల్ అంశాల్లో సబ్జూనియర్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో సిద్ధార్థ ఆడిటోరియంతో పాటుగా సిద్ధార్థ కళాశాల ఆవరణలో 15 వేదికలను ఏర్పాటు చేసి వాటిపై పోటీలను నిర్వహిస్తామని కొండలరావు వివరించారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ బాలోత్సవాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. బాలోత్సవం కమిటీ సభ్యులు మురళీ కృష్ణ, సాంబిరెడ్డి, వై.సుబ్బారావు, నాగళ్ళ విద్యాఖన్నా, రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
వెరీ డేంజర్
మిడ్నైట్ కల్చర్శరీరానికి ఎనర్జీ కోసం ఆహారం ఎంత అవసరమో మెదడుకు నిద్ర కూడా అంతే అవసరం. మెదడు సక్రమంగా పనిచేయాలంటే ప్రతిరోజూ 6 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరి. ప్రస్తుతం చాలామంది నిద్రలేమి కారణంగా అనేక శారీరక, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. స్మార్ట్ఫోన్తో పాటు ఇటీవల నగరంలో పెరిగిన మిడ్నైట్ కల్చర్ ఇందుకు ప్రధాన కారణం. మంచి నిద్రపోవాలంటే... ● మనిషి శరీర తత్వాన్ని బట్టి రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర అవసరం అవుతుంది. ● ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకేసమయానికి నిద్రలేవడం చేయాలి. ● ఒకేసారి ఏకకాలంలో నిద్రపోవాలి. 4 గంటలు ఒకసారి, రెండు గంటలు మరోసారి కాదు. ● మంచి నిద్రకోసం బెడ్రూమ్ను చీకటిగా ఉంచుకోవడంతో పాటు, శబ్దాలు లేకుండా చూసుకోవాలి. ● నిద్రలోనే మెదడులోని వ్యర్ధాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ● విద్యార్థులకు సరిగా నిద్రలేకపోతే, రాత్రి చదివినవి ఉదయానికి గుర్తుండవు. నిద్రలేమి సమస్య గుర్తించిన సమస్యలివే... ● రాత్రివేళల్లో స్మార్ట్ఫోన్లు ఎక్కువ సేపు చూసే వారిలో కంటిలోని మెలకొనిన్ అనే పదార్ధం కరిగిపోతుంది. అలాంటి వారికి నిద్రపట్టదు. క్రమేణా నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. ● నిద్రలేమితో కోపం, చిరాకు పెరిగిపోతుంటాయి. నిస్సత్తువ ఆవహించి, తెల్లారి లేచిన తర్వాత పనిపై దృష్టి పెట్టలేరు. వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతారు. ● పగలు చదివిన అంశాలు బ్రెయిన్లో స్టోర్ అవ్వాలంటే సరైన నిద్ర అవసరం. నిద్రలేమి సమస్య ఉన్న వారిలో చదివిన అంశాలు గుర్తుండని పరిస్థితి నెలకొంటుంది. ● ఒబెసిటీ ఉన్న వారు గురకతో రాత్రి వేళల్లో తరచూ తుళ్లిపడి లేస్తుంటారు. శ్వాసనాళాలు మూసుకుపోవడంతో గురకతో పాటు, ఒక్కోసారి గుండెపోటు, మెదడుపోటుకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి వారి ఆరోగ్య పరిస్థితిని స్లీప్ ల్యాబ్లో అధ్యయనం చేస్తారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలో మిడ్నైట్ కల్చర్ పెరిగింది. అర్ధరాత్రి వరకూ రోడ్లపై గడుపుతున్నారు. రాత్రి 10 గంటల తర్వాత కూడా కుటుంబ సమేతంగా ఫుడ్స్టాల్స్కు వస్తున్నారు. ఇక యువత ఇంట్లో ఉన్నా స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ అర్ధరాత్రుళ్ల వరకు మెలకువగా ఉండడం మామూలైపోయింది. కళాశాలలు కూడా అసైన్మెంట్స్ ఫోన్లోనే ఇస్తుండడంతో ప్రతి విద్యార్థికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయింది. కొద్దిసేపు అసైన్మెంట్స్ చేసిన తర్వాత ఫోన్లలో రీల్స్ చూస్తూ సమయం అంతా వృథా చేస్తున్నారు. దీంతో నిద్రలేమి సమస్య వెంటాడుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. నిద్రలేమికి అనేక కారణాలు నిద్రలేమికి అనేక కారణాలున్నాయి. వాటిలో రోజూ ఒకే సమయానికి పడుకోకపోవడం, సాయంత్రం 6 తర్వాత ఎక్కువగా టీవీలు, స్మార్ట్ఫోన్లు చూడటం, ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో పడుకోవడం, నిద్రలో గురక రావడం, నైట్షిప్ డిజార్డర్, రక్తహీనతలు ఉన్నాయి. నిద్రలేమి ఉన్న వారికి స్లీప్ ల్యాబ్లో స్టడీ చేస్తాం. ఆక్సిజన్ శాచురేషన్, బ్రెయిన్ యాక్టివిటీ, బాడీ యాక్టివిటీ, ఏ సైకిల్లో ఉన్నారో తెలుసుకుంటాం. అలా నిద్రలేమికి అంచనా వేసి అవసరమైన వైద్యం చేయడం, సూచనలు ఇవ్వడమో చేస్తుంటాం. వైద్యుల సూచన లేకుండా నిద్రమాత్రలు వాడటం సరికాదు. – డి.అనిల్కుమార్, న్యూరాలజిస్ట్ ● -
జీవో నంబరు 36ను అమలు చేయాలి
నందివాడ: సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ అమలు చేస్తామంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 36ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు టీపీఎస్ హనుమంతరావు డిమాండ్ చేశారు. నందివాడ మండలం వెన్ననపూడి గ్రామంలోని సహకార సంఘ భవనంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జనవరి 5 వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 8వ తేదీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ బ్రాంచీల ఎదుట సహకార సంఘాల ఉద్యోగులతో ధర్నా నిర్వహించి కంప్యూటర్ పనులు నిలుపుదల చేస్తామన్నారు. ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టి వినతిపత్రాలు అందిస్తామని, 22న డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఈ నెల 29న రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని, అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే జనవరి 5నుంచి నిరవధిక సమ్మె, రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. సహకార సంఘం ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు హనుమంతరావు -
మంచి నడవడికతో మెలగండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): నేర ప్రవృత్తిని వీడి మంచి నడవడికతో మెలగాలని ఎన్టీఆర్ జిల్లాలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్లకు ఆదివారం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు రూరల్ పరిధిలో డీసీపీ బి.లక్ష్మీనారాయణ, సిటీలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ కౌన్సెలింగ్ ఇచ్చారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లు టాస్క్ఫోర్స్ కార్యాలయాల్లో ఆయా పోలీసు అధికారులు సిబ్బందితో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిల్లకల్లు జిల్లా పరిషత్ స్కూల్లో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్లో డీసీపీ లక్ష్మీనారాయణ రౌడీషీటర్ల ప్రవర్తన మార్పుకోవాలని ఆదేశించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్ధాల వినియోగం, అక్రమ రవాణా చేయకుండా మంచి మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలను దూరం చేసుకుని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై పోలీస్ వారి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. -
22 నుంచి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు యోనెక్స్–సన్రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ను నిర్వహిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు తెలిపారు. నగరంలోని హోటల్లో బ్యాడ్మింటన్ పోటీలకు సంబంధించిన లోగో, పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ యువతలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మరింత ఉత్సాహం.. ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ ఇలాంటి చాంపియన్షిప్లు క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ అంటే తెలుగువారే గుర్తుకు వస్తారన్నారు. 2029లో నేషనల్ గేమ్స్ను రాష్ట్రంలో నిర్వహించేలా ప్రయత్నిస్తున్నామని, అందుకు తగినట్లుగా మైదానాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో అన్వర్కు గోల్డ్ మెడల్
భవానీపురం(విజయవాడపశ్చిమ): నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్ – 2025 పోటీల్లో కటా విభాగంలో బ్లూ బెల్ట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయవాది డాక్టర్ షేక్ అన్వర్ బంగారు పతకాన్ని సాధించారు. వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిట్రోరియోకాయ్ ఇంటర్నేషనల్ కరాటే డో అకాడమీ ఇండియా ఆదివారం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో 23వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొన్న షేక్ అన్వర్ కటా విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ సురేష్(బ్లాక్ బెల్ట్ నైన్త్ డాన్ ఇండియా జె.హరినాథ్ (జేకే గోజురియో కరాటే అకాడమీ), జక్కుల దినేష్, మధు, మహేష్ అన్వర్ను సత్కరించి బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. అనంతరం గోల్డ్ మెడల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ షేక్ అన్వర్ మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా కరాటే విద్యలో శిక్షణ తీసుకుంటున్నానని తెలిపారు. కరాటేను సెల్ఫ్ డిఫెన్స్గా మాత్రమే పరిగణించాలని, జీవితంలో ఎదగడానికి, ధృడ నిర్ణయాలు తీసుకోవడానికి కరాటే ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కరాటేను ఒలంపిక్స్లో ప్రవేశపెట్టడం తమలాంటివారికి శుభపరిణామమని పేర్కొన్నారు. -
టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా తనుబుద్ధి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ భవానీపురానికి చెందిన తనుబుద్ధి చంద్రశేఖర్రెడ్డి టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి టీఏసీ సభ్యుడిగా తనుబుద్ధి చంద్రశేఖరరెడ్డిని సిఫార్సు చేశారు. ఆయన సిఫార్సు మేరకు నియామకం జరిగింది. చంద్రశేఖరరెడ్డి గతంలో ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. టీఏసీ సభ్యునిగా తనను సిఫార్సు చేసి ఎంపికకు సహకరించిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి చంద్రశేఖర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీఏసీ సభ్యుడిగా నియమితులైన తనుబుద్ధి చంద్రశేఖర్రెడ్డిని వైఎస్సార్సీపీ నేతలు అభినందించారు. తండ్రికి తలకొరివి పెట్టిన తనయ పెడన: తండ్రికి కుమారులు ఎవరూ లేకపోవడంతో కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన కృష్ణాజిల్లా పెడన మండలంలో ఆదివారం జరిగింది. పెడన మండలం పెనుమల్లి దళితవాడకు చెందిన వల్లభు ఏడుకొండలు(56) అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు కొడుకులు లేరు. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రికి తాను తలకొరివి పెడతానంటూ ఆఖరి కుమార్తె కల్యాణి ముందుకొచ్చింది. పెద్దల సహాయంతో తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో పెడన జెడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకట నగేష్ పాల్గొన్నారు. -
ప్రభుత్వం పట్టించుకోలేదు..
రూపాయి, రూపాయి కూడబెట్టి 2007లో ఇక్కడ స్థలం కొనుగోలు చేశా. నాకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె పెళ్లికి ఈ స్థలం ఉపయోగపడుతుందనే ఆలోచనతో కష్టపడి కొనుక్కున్నాను. కానీ ఇప్పుడెమో ఈ స్థలం మాది కాదంటూ మమ్మల్ని బయటకు తోసేశారు. 20 ఏళ్ల తరువాత ఇప్పుడొచ్చి మా స్థలాలు లాక్కుంటే మా పరిస్థితి ఏమిటి? కూతురు పెళ్లికి ఉపయోగపడుతుందనుకున్న స్థలం పోయింది. నేను ఏమి చేయాలి? మేం అన్యాయంగా ఆక్రమించుకోలేదు. చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. పరిస్థితి ఏమీ అర్థం కావటం లేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం బాధిస్తోంది. – వి. ఆనందరావు, జోజినగర్ బాధితుడు -
నాణ్యతలో రాజీ పడితే చర్యలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణల నిమిత్తం చేపట్టిన పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడితే ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని ఈవో శీనానాయక్ హెచ్చరించారు. దీక్ష విరమణలను పురస్కరించుకుని చేపట్టిన పనులను ఆదివారం ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు పరిశీలించారు. క్యూలైన్లు, స్నానఘాట్లు, ప్రసాదం కౌంటర్లు, లడ్డూ పోటు, హోమగుండాలు, ఇరుముడి సమర్పించే కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావాలన్నారు. ఈవో వెంట ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు(బుల్లబ్బాయ్), రాఘవరాజు, దుర్గగుడి ఈఈ రాంబాబు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని 20 పరీక్ష కేంద్రాల్లో నేషనల్ మీన్స్–కమ్–మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించామని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగిందన్నారు. అసిస్టెంట్ కమిషనర్ మచిలీపట్నంలోని 9 పరీక్ష కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించగా, జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 20 కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో 4,040 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 3,758 మంది (93.02శాతం) హాజరయ్యారని తెలిపారు. -
బాధితులకు న్యాయం చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): జోజినగర్లో నివాసాలు కోల్పోయిన 42 కుటుంబాలను విజయవాడ ఎం సీపీఐ నగర కమిటీ ఆదివారం పరామర్శించింది. కమిటీ కార్యదర్శి కాసాని గణేష్ బాబు మాట్లాడుతూ స్థలం కొనుగోలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అన్నీ పక్కాగానే ఉన్నా నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయడం కిరాతక చర్య అన్నారు. ఇంత అమానుషం జరిగినా.. అధికార పార్టీ నాయకులు బాధి తులకు ధైర్యం చెప్పకపోవడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి ఇళ్లు కోల్పోయిన బాధితులను సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పరామర్శించారు. వారు మాట్లాడుతూ ఇళ్ల కూల్చివేత వెనుక అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. నాయకులు పోలారి, గంగా భవానీ(అడ్వకేట్), కె. నాగమణి, కె. కనకదుర్గ, సీహెచ్ పెద్దిరాజు తదితరులు ఉన్నారు. -
సాయుధ దళాల సేవలు అజరామరం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ రక్షణకు ప్రాణాలను అర్పించిన సైనికుల సేవలు వెలకట్టలేనివని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. సాయుధ దళాల నిధికి తోచిన సహాయం అందించి మాజీ సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకుని ఇన్చార్జ్ కలెక్టర్ ఇలక్కియ పతాక నిధికి విరాళం అందించారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి నుంచి పతాకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సైనికులు, మాజీ సైని కులు, వారి కుటుంబ సబ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణకై పోరాడి, అసువులుబాసిన సైనికులకు నివాళులు అర్పించారు. వీర మరణం పొందిన సైనికుల తల్లిదండ్రులు, భార్యా పిల్లలకు మనకు తోచిన రీతిలో స్పందించి.. జిల్లా ప్రజలు వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు విద్యా సంస్థలు విరివిగా విరాళాలు అందించాలని ఇలక్కియ పిలుపునిచ్చారు. పన్ను రాయితీ.. జిల్లా సైనిక సంక్షేమ అధికారి సర్జస్ లెఫ్టినెంట్ కమాండర్ కె. కల్యాణ వీణ మాట్లాడుతూ పతాక నిధికి అందించే విరాళాలకు ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందన్నారు. స్వచ్ఛందంగా విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చేవారు జిల్లా సైనిక సంక్షేమ అధికారి, ఎన్టీఆర్ జిల్లా పేరున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా 62067742138 నంబర్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0020899 ద్వారా నేరుగా తమ విరాళాలు అందించవచ్చని ఆమె తెలిపారు. విశ్రాంత ప్రిన్సిపాల్ కాళీ ప్రసాద్ పతాక నిధికి రూ. 25వేలు విరాళం ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియ -
వారికి ప్రమోషన్ లేనట్టే!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఉద్యోగోన్నతులకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ఎంతో కాలం నుంచి ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. అయితే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉద్యోగోన్నతులు అనుమానమేనని ఆ శాఖ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఖాళీలు ఇలా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ–1, విజయవాడ–2, విజయవాడ–3 డివిజన్లుగా వాణిజ్య పన్నుల శాఖ పరిధి విస్తరించి ఉంది. ఈ మూడు డివిజన్లలో 17 సర్కిల్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. వీటికి సంబంధించి 20 జీఎస్టీఓ పోస్టులు, ఎనిమిది సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 15 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగోన్నతులు ఇవ్వాల్సి ఉంది. జీఎస్టీఓలకు సంబంధించి 20 పోస్టుల్లో తొమ్మిది రెగ్యులర్ ప్రమోషన్లు, 11 డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకపోవటంతో ఆ ఖాళీలను సైతం తమకు కేటాయించి భర్తీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. శాఖపరమైన ఇబ్బందులు.. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు పలువురు శాఖపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆ శాఖ రాష్ట్రస్థాయి అధికారిని ఆయన కార్యాలయంలో ఘెరావ్ చేయటంతో సుమారు వంద మందికి పైగా మూడు జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులపై ఆ శాఖ విచారణకు ఆదేశించింది. అందులో కొంతమందిని దోషులుగా తేల్చింది. ఆ విచారణ నివేదికపై చర్యలు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉమ్మడి జిల్లాకు చెందిన చాలా మంది ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వారికి నిబంధనల ప్రకారం ఉద్యోగోన్నతి లభించే అవకాశం లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. లాబీయింగ్ షురూ.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 17 సర్కిల్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రమోషన్ల విషయంలో అడ్డంకిగా ఉన్న పలు ఆరోపణలను పూర్తిగా రద్దు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు లాబీయింగ్ మొదలు పెట్టినట్లు తెలిసింది. ఉద్యోగోన్నతులకు ఎటువంటి అవరోధం లేకుండా చూస్తామని, దానికి చాలా నిధులు అవసరమని ఉద్యోగ సంఘాల నేతలు ఒకరిద్దరు ఉద్యోగులకు వివరిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. లాబీయింగ్ ప్రక్రియకు సంబంధించి కొంతమంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించి తమతమ స్థాయిల్లో మామూళ్లు సమర్పించుకుంటున్నారన్న పుకార్లు ఆయా డివిజన్ కార్యాలయాల్లో షికారు చేస్తున్నాయి. త్వరితగతిన పూర్తి.. ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేస్తామని ఉమ్మడి జిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు వాటికి సంబంధించిన విషయాలపై చర్చించి, నివృత్తి చేసేందుకు డ్రైవ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే ఇంత వేగంగా ఆ ప్రక్రియను పూర్తి చేస్తే చాలా మందికి ఉద్యోగోన్నతులు రాకుండా పోతాయని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కిక్కిరిసిన కార్తికేయుని సన్నిధి
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తజనంతో పోటెత్తింది. ఆదివారం ఉదయం తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారికి ఒక రోజు వివిధ సేవా టికెట్లు ద్వారా రూ. 9,97,952 ఆదాయం వచ్చినట్లు ఆలయ డీసీ శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. స్వామివారికి సేవా టికెట్లు ద్వారా రూ. 4,25,194, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 1,89,695, నిత్య అన్నదాన నిమిత్తం రూ. 1,20,085, శ్రీవారి దర్శనం ద్వారా రూ. 74,500, శాశ్వత అన్నదానం కార్యక్రమ నిమిత్తం రూ. 50,256, కళ్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 22,360కలిపి మొత్తం రూ. 9,97,952లు ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు పెడన: పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీపైడమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు ఆదివారం కావడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. స్థానికులు తమ బంధుమిత్రులను, స్నేహితులను, సహచర కుటుంబ సభ్యులను ఆహ్వానించి శిడిబండ్లు సుందరంగా కట్టి.. మేళతాళాలు, డేజేలతో నృత్యం చేసుకుంటూ పసుపు జల్లుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. కొందరు చలువ వస్త్రాలను నేలపై పరిచి, దానిపై నడుస్తూ ఆలయానికి చేరుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. పోలీసులు, దేవదాయశాఖ సిబ్బంది, ఆలయ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్ష విరమణలకు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ త్రినాథరావు నియమితులయ్యారు. దీక్ష విరమణకు విచ్చేసే భవానీలకు మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లను త్రినాథరావు పర్యవేక్షిస్తారు. గతంలో దుర్గగుడి ఇన్చార్జి ఈవోగా 15 నెలల పాటు బాధ్యతలు నిర్వహించిన అనుభవం త్రినాథరావుకు ఉంది. ఆ సమయంలో రెండు భవానీ దీక్ష విరమణలు, ఒక దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. తిరువూరు: భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం తిరువూరులో జరిగింది. 53వ మహాసభల సందర్భంగా జరిగిన కార్యవర్గ ఎన్నికలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా టి. కుమారస్వామి, సీహెచ్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా కుమార్ నాయక్, ప్రణీత, ప్రణయ్, జిల్లా సంయుక్త కార్యదర్శులుగా ఖాజా, మాధవ్, ఉష, యశస్విని, మరో 11 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ తొలి సమావేశంలో తిరువూరు పట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలని, సంక్షేమ వసతిగృహాలకు భవనాలు నిర్మించాలని, పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలి వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాలని తీర్మానించారు. -
ఉదమ్యంలా కోటి సంతకాల సేకరణ
పెడన: నూతన వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి పెద్ద విశేష మద్దతు లభిస్తోంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 60వేల సంతకాలు సేకరించాలని పార్టీ లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఆదివారం సాయంత్రానికి జిల్లాలో మొత్తం 3,06,500 మంది ప్రజలు సంతకాలు చేశారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకూ సేకరించిన సంతకాలు పరిశీలిస్తే.. పెనమలూరులో 49,500, మచిలీపట్నంలో 64,000, గన్నవరంలో 42,000, పెడనలో 43,000, అవనిగడ్డలో 35,000, గుడివాడలో 30,000, పామర్రులో 43,000 సంతకాలు నమోదయ్యాయి. కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకు 3,06,500 సంతకాలు -
ఐఎంఏ అధ్యక్షుడిగా వరప్రసాద్ బాధ్యతల స్వీకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడశాఖ 2025–26 నూతన కార్యవర్గం ఆదివారం బాధ్యతలు స్వీకరించింది. గవర్నర్పేటలోని ఐఎంఏ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ బోడేపూడి హనుమయ్య నుంచి నూతన అధ్యక్షుడిగా డాక్టర్ వీఎన్ వరప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎస్బీఎన్ చౌదరి, డాక్టర్ ఉప్పులేటి తారకప్రసాద్, కార్యదర్శిగా డాక్టర్ అనూప్ తోట, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ ఏ సూర్యనారాయణరావు, డాక్టర్ ఎం. పూజిత, కోశాధికారిగా డాక్టర్ కె. వంశీకృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. మరో 20 మంది కార్యవర్గ సభ్యులుగా నూతన కమిటీలో ఉన్నారు. డాక్టర్ వీఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ ఐఎంఏ విజయవాడ శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయడంతో పాటు, కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. -
వైద్య రంగం ప్రైవేటీకరణతో సమాజానికి చేటు
ప్రజా ఆరోగ్య వేదిక ఆరోగ్య సెమినార్లో వక్తలుకృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేలా వైద్య వ్యవస్థ ఉండాలని, ఐక్యూతో ఎమోషనల్ మేనేజ్మెంట్ కూడా ఉన్నప్పుడే కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయని ప్రజా ఆరోగ్య వేదిక ఆరోగ్య సెమినార్లో పలువురు వక్తలు పేర్కొన్నారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో జన్ స్వాస్థ్య అభియాన్ వ్యవస్థాపకుడు డాక్టర్ అమిత్ సేన్ గుప్తా వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా గౌరవాధ్యక్షుడు, సీనియర్ వైద్యుడు డాక్టర్ సూరపనేని సుధాకర్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్లో ‘వైద్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు–పరిష్కారాలు, పెరుగుతున్న మానసిక సమస్యలు–పరిష్కార మార్గాలు’ అనే అంశాలపై ఆరోగ్య సెమినార్ నిర్వహించారు. ఎమోషనల్ మేనేజ్మెంట్ అవసరం.. ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు మానసిక సమస్యలు పెరుగుతున్నాయని, మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని, ఇది ప్రమాదకరమైన సూచన అన్నారు. ఒకప్పుడు మద్యపానం, ధూమపానం ప్రధాన వ్యసనాలుగా ఉండేవని, ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ కూడా విపరీతంగా పెరిగాయని, వాటి వల్ల యువత పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఎమోషనల్ మేనేజ్మెంట్ ద్వారానే వీటన్నింటినీ అధిగమించడం సాధ్యమన్నారు. -
చలనం లేదు.. చర్యలు లేవు!
రోడ్డున పడిన 42 కుటుంబాలను కన్నెత్తి చూడని టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం పేద కుటుంబాలపై కనికరం చూపకుండా నిర్థాక్షిణ్యంగా వ్యవహరించింది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి బలవంతంగా విజయవాడ భవానీపురం జోజినగర్లోని 42 ఇళ్లను నేల మట్టం చేసింది. పైసా, పైసా కూడబెట్టుకొని స్థలాలు కొనుగోలు చేసి, ఇళ్లు కట్టుకొన్న పేద, మధ్య తరగతి కుటుంబాలను కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి విసిరేసింది. బాధితులను పరామర్శించి, న్యాయం జరిగేంత వరకు అండగా ఉండాల్సిన అధికార టీడీపీ నాయకులు మాత్రం ఇప్పటికీ నోరు మెదప లేదు. ఆ ప్రాంతానికి వెళ్లి నష్టపోయిన ప్రజలను సమీకరించి ధైర్యం చెప్పి, పునర్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయవలసిన గురుతర బాధ్యత వారిపై ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వారి జాడ కనిపించలేదు. దీంతో బాధితులు టీడీపీ నాయకుల తీరుపై మండిపడుతున్నారు. సర్వం కోల్పోయాం.. ఏ చిన్న కార్యక్రమం జరిగినా హడావుడి చేసే ప్రజా ప్రతినిధులు కన్నెత్తి చూడక పోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇంట్లో సామానులు తీసుకోలేదని.. చిన్న పిల్లలకు పాలు ఇస్తున్నామని, కొంత సమయం ఇవ్వండయ్యా అంటూ, కాళ్లా వేళ్లా పడినా కనికరించకుండా, వారి గుండెల్లో గునపం గుచ్చడంతో తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడ తలదాచుకోవాలో దిక్కు తెలియక విలవిల్లాడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి బాధితులతో సమావేశం అయినప్పటికీ ఆయన నుంచి కూడా భరోసా లభించలేదనే భావన వ్యక్తమవుతోంది. అన్ని అనుమతులతో నిర్మించినా.. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు అన్నీ ప్రభుత్వ శాఖల అనుమతులతోనే జరిగాయి. ప్లాట్ రిజిస్ట్రేషన్, ఇంటి నిర్మాణానికి కావలసిన అనుమతులు, ఇంటికి అవసరమైన నీటి కుళాయి, విద్యుత్ కనెక్షన్, నిర్మాణం అనంతరం అంచనా వేసి, ఇంటి పన్ను నిర్ధారించడం ఇవన్నీ ప్రభుత్వ శాఖలు చేసే పనులే. ఇన్ని అనుమతులు తీసుకొని, 20 ఏళ్లకు పైగా అనుభవిస్తున్న ఇంటి యజమానుల ఇళ్లపై దాడిచేసి, ఏకకాలంలో 15 బుల్డోజర్లతో, 200 మందికి పైగా పోలీసులను మోహరించి 42 ఇళ్లను కూల్చివేయటంపై అన్ని వర్గాల ప్రజలు భగ్గుమంటున్నారు. విజయవాడలో వందల సంఖ్యలో అనధికారిక భవనాలు ఉన్నాయి. కోర్టులు సైతం భవనాలను కూల్చివేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని పట్టించుకోని ప్రభుత్వ శాఖలు, ఒక ప్రైవేటు ఆస్తి విషయంలో ఇంత పెద్ద ఎత్తున జోక్యం చేసుకొ కూల్చివేతలకు పాల్పడటంపై సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. నా భర్త కోటేశ్వరరావు ఆర్మీలో పని చేసేవారు. ఆయన రిటైర్డ్ అయిన డబ్బులతో 1996లో స్థలం కొనుకున్నాం. ఎగుడు దిగుడుగా ఉన్న స్థలాన్ని చదును చేసుకొని, రేకుల షేడ్ నిర్మించుకున్నాం. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నాం. మాకు అది తప్ప ఇంకే ఆదరువు లేదు. దేశ రక్షణకోసం కష్టపడిన, మా గూటికే రక్షణ లేకుండా పోయింది. షెడ్డు కూల్చి వేయడంతో రోడ్డున పడ్డాం. కనీసం అధికార పార్టీ నాయకులు వచ్చి పలకరించిన పాపాన పోలేదు. – చానం కనకదుర్గా, జోజినగర్ బాధితురాలు -
ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు..
చంద్రబాబు సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. అందుకు కోటి సంతకాల సేకరణలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనే నిదర్శనం. మా నియోజనకవర్గంలో ఒక్క రోజులో 13వేలు సంతకాలు చేశారు. క్షేత్రస్థాయిలోని పార్టీ సభ్యులు ఉద్యమంలా సంతకాలు సేకరిస్తున్నారు. నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలలో పిల్లలకు వైద్య విద్య అందని పరిస్థితి ఈ ప్రైవేటీకరణ వల్ల ఏర్పడుతుంది. అలాగే వైద్య సేవలు కూడా భారం అవుతాయి. – కై లే అనిల్కుమార్, వైఎస్సార్ సీపీ పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి -
స్ఫూర్తిదాయక గాధలు రూపొందించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారుచేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలు పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలు, వ్యవసాయం, ప్రభుత్వ సేవలు వంటి విజయం సాధించిన గాధలను తయారుచేసి కృష్ణా స్ఫూర్తి పేరుతో ప్రతిరోజు వాడే ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. అవి ఇతరులకు స్ఫూర్తినిస్తాయని, ఆ దిశగా కృషి చేయాలన్నారు. ఆయా రంగాల్లో విజయవంతం అవడానికి సహకరించిన అంశాలను వివరిస్తూ, ఇతరులు కూడా అదే స్ఫూర్తితో ఎదగవచ్చని, అందుకు ప్రభుత్వపరంగా అందించే సహకారాన్ని, వనరులను తెలియపరుస్తూ ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన వివరాలను ఆ కథలో పొందుపరచాలన్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డ్వాక్రా మహిళల వ్యాపారాలు, పాడి పరిశ్రమ, వ్యక్తిగత వ్యాపారాలు తదితర రంగాల్లో విజయగాధలను గుర్తించాలన్నారు. దీనికి గృహనిర్మాణ సంస్థ ఇన్చార్జ్ పీడీ పోతురాజు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానశాఖల అధికారులు చిన్ననరసింహులు, ఎ.నాగరాజు, జె.జ్యోతి, డ్వామా, డీఆర్డీఏ పీడీలు ఎన్వీ శివప్రసాద్యాదవ్, హరిహరనాథ్, ఏపీ ప్రకృతి వ్యవసాయ డీపీఎం పార్థసారధి, ఎల్డీఎం రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
అండర్–14 రగ్బీ రాష్ట్ర జట్ల ఎంపిక
గన్నవరం: జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14 రగ్బీ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర బాల, బాలికల జట్లను ఎస్జీఎఫ్ పరిశీలకుడు కిరణ్ శుక్రవారం ప్రకటించారు. గన్నవరంలో రెండు రోజుల పాటు జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాల, బాలికలను రాష్ట్ర జట్లకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. భువనేశ్వర్లో ఈ నెల రెండవ వారంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని తెలిపారు. బాలుర జట్టు.... ఎ.అరుణ్, టి. నరసింహులు, కె.మధు (కర్నూలు), టి.ప్రభుకిరణ్, బి. అమరకుమార్ (కృష్ణా), షేక్ అబిబుల్ రెహమాన్, యు.విశ్వమిత్ర (కడప), కె.సంతోష్ (నెల్లూరు), వి.హేమంత్(తూర్పు గోదావరి), బి.పవన్ (పశ్చిమ గోదావరి), ఎం.సుబ్రహ్మణ్యం(చిత్తూరు), ఎం.హర్షవర్ధనరాజు (గుంటూరు), మరో ఐదుగురు స్టాండ్బై. బాలికల జట్టు.... పల్లూరి జ్యోతిప్రియ, షేక్ హుస్సేన్బీ, గొల్ల వర్షిత (కర్నూలు), దుక్కా వర్షిణి, భీమశెట్టి పుణ్యవతి (విశాఖపట్నం), రావిపాటి దివ్య (గుంటూరు), కొణతం శ్రీదుర్గా మహాలక్ష్మి (తూర్పు గోదావరి), కెల్లా తనూష, బూసిరాజు భావన(కృష్ణా), వరదరాజు వర్షిత (పశ్చిమ గోదావరి), కోన లోహిత (శ్రీకాకుళం), మరో ఐదుగురు స్టాండ్బై. -
ఉత్సాహంగా యువజనోత్సవం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా విశ్వవిద్యాలయం కృష్ణతరంగ్–2025 పేరుతో నిర్వహిస్తున్న అంతర్ కళాశాలల యువజనత్సోవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గురువారం ప్రారంభమైన యువజనోత్సవాలు రెండో రోజు శుక్రవారం విద్యార్థులు కళాప్రదర్శనలతో సర్వత్రా ఆకట్టుకున్నాయి. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని వివిధ వేదికలపై ఈ పోటీలు కొనసాగాయి. ఈ సందర్భంగా యువజనోత్సవాల పోటీల్లో వివిధ కళాశాలల నుంచి హాజరైన విద్యార్థులు తమ ప్రతిభతో అలరించారు. ఏకాంకికలు, జానపద బృంద నాట్యాలు, క్రియేటివ్ కొరియోగ్రఫీ, లలితసంగీతం, రంగోలి తదితర పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలోచింపజేసిన ప్రదర్శనలు.. వివిధ సామాజికాంశాలతో రూపొందించిన కళారూపాలు అలరించటమే కాకుండా ఆలోచింపజేశాయి. ప్రధానంగా సమాజంలో మనుషులను మనుషులే చంపుతుంటే తోటివారు చోద్యం చూస్తున్నారంటూ విద్యార్థులు మానవ సమాజంలో ఉన్న రుగ్మతలను తమ ప్రదర్శనలతో ఎత్తి చూపారు. అలాగే దేశభక్తి ప్రబోధంగా సాగిన నృత్యాలు, ఇతర ప్రదర్శనలు అలరించాయి. వాటితో పాటుగా తెలుగునాట ఉన్న పలు జానపద కళారూపాలను సైతం విద్యార్థులు అత్యంత రమణీయంగా ప్రదర్శించారు. వాటితో పాటుగా లలిత సంగీతం, రంగోలి తదితర అంశాల్లోనూ విద్యార్థులు తమ అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, విద్యాసంస్థల్లో సెల్ఫోన్ల వినియోగం వంటి అంశాలపై వక్తృత్వం, డిబేట్ పోటీలను నిర్వహించారు.


