breaking news
Krishna District Latest News
-
మహత్తర ఆభరణమై..
బృహత్తర సంకల్పమే.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన లడ్డూ తయారీ భవనంసాక్షి ప్రతినిధి, విజయవాడ: కనకదుర్గమ్మ గుడి అభివృద్ధికి వైఎస్సార్ సీపీ హయాంలోనే బీజం పడింది. ఇంద్రకీలాద్రిపై ఈ పనుల కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం రూ. 72కోట్లు కేటాయించింది. ఆ తర్వాత దాతల సహకారంతో ఐదు కోట్ల రూపాయలతో నూతన యాగశాల నిర్మాణం జరిగింది. 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కూల్చివేసిన లడ్డూ ప్రసాదాల పోటు స్థానంలో ఐదు కోట్లతో నూతన పూజా మండపాల నిర్మాణం సైతం చేపట్టింది. నూతన పూజా మండపం కొన్ని నెలల కిందట అందుబాటులోకి రాగా, 2023లో సీఎంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన నూతన అన్నదాన భవనం, లడ్డూ పోటులు ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. రూ. 53కోట్లతో అన్నదాన భవనం, లడ్డూ ప్రసాదం పోటు దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు 2023 డిసెంబర్ ఏడో తేదీన అప్పటి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టిన పనులలో కొన్ని ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చి భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది అన్నదాన భవనం రూ. 26కోట్లతో నిర్మించారు. గ్రౌండ్, మొదటి అంతస్తులుగా నిర్మించిన ఈ భారీ భవనంలో ఒకేసారి 800 మంది కూర్చుని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించే వీలు కలుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో అన్న ప్రసాద తయారీ, మెయిన్ ప్రోవిజన్ స్టోర్స్, అన్నదానం స్టోర్స్తో పాటు సరుకులు పాడైపోకుండా ఉండేలా కోల్డ్ స్టోరేజీలను నిర్మించారు. ప్రస్తుతం దేవస్థానంలోని మహామండపం రెండు, మూడు అంతస్తులను అన్నదానం నిమిత్తం వినియోగిస్తున్నారు. ఒకే దఫా 250మంది మాత్రమే అన్న ప్రసాదం స్వీకరించే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాలలో ఎనిమిది వేల మందికి అన్న ప్రసాదం అందుతోంది. నూతన అన్నదాన భవనం ప్రారంభోత్సవం అయిన తర్వాత రోజుకు పదివేల మందికి అన్న ప్రసాదం అందించే వీలు కలుగుతుంది. ఇకపై మల్లేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని బయటకు వెళ్లే వారికి సైతం అన్న ప్రసాదం అందుతుంది. రూ.26.50కోట్లతో లడ్డూ తయారీ కేంద్రం గోశాల, మహా మండపం మధ్యన ఉన్న స్థలంలో జీ+3 భవనంలో లడ్డూపోటును ఏర్పాటు చేస్తున్నారు. సెల్లార్, పై అంతస్తులో లడ్డూ తయారీ, మొదటి అంతస్తులో లడ్డూ విక్రయ కౌంటర్లు, రెండో అంతస్తులో చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూ ప్యాకింగ్లు జరుగుతాయి. అయితే లడ్డూ తయారీ కేంద్రంలోని మొదటి అంతస్తులో ప్రసాదాల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దేవస్థానం ఆవరణలో ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేస్తే భక్తులకు అందుబాటులో ఉంటుందన్న అభిప్రాయాన్ని దేవస్థాన సిబ్బంది సైతం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గగుడి, కృష్ణానది పరిసరాల్లో బొడ్డుబొమ్మ, సీతమ్మ వారి పాదాలు, శనైశ్వర స్వామి వారి ఆలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయం, వినాయకుడి ఆలయాలను నిర్మించింది. ఆ తర్వాత దాతల సహకారంతో నూతన యాగశాల, మల్లేశ్వర స్వామి వారి ఆలయం పున నిర్మాణం, ఘాట్రోడ్డులో కొండరాళ్లు విరిగి పడకుండా పనులు చేపట్టింది. 2016 అంటే భక్తులకు గుర్తుకు వచ్చేది కృష్ణానది పుష్కరాలు. అయితే కృష్ణా పుష్కరాల పేరిట దుర్గ గుడితో పాటు కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో అప్పటి తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాలు చేసిన ఆలయాల విధ్వంసాన్ని నగర ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతా ల్లో పలు ఆలయాలను ధ్వంసం చేయగా, దుర్గ గుడిలో కీలక కట్టడాలను సైతం కూల్చివేసింది. వాటిలో ప్రధానమైనవి ఘాట్రోడ్డు మార్గంలోని షాపింగ్ కాంప్లెక్స్, భవానీ దీక్షా మండపం, దేవస్థాన పరిపాలనా భవనాలు, ఆలయం వెలుపల ఉండే లడ్డూ ప్రసాద తయారీ కేంద్రం, అన్న ప్రసాద వితరణ కేంద్రంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం నుంచి బయటకు వచ్చే మార్గంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయం, గోశాలలోని పురాతనమైన కృష్ణుడి మందిరాలను కూల్చివేసింది. -
పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరగాలి
జగ్గయ్యపేట అర్బన్: తరగతులకు గైర్హాజరవుతున్న విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని వారు పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ ఆదేశించారు. పట్ట ణంలోని జీవీజే జెడ్పీ బాలుర హైస్కూల్ను డీఈఓ చంద్రకళ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాల స్టార్ రేటింగ్ గురించి అడిగి, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, సంగ్రహణాత్మక మూల్యాంకనం, పదో తరగతి ఫలితాలపై చర్చించారు. వీటి ప్రకారమే పాఠశాలకు స్టార్ రేటింగ్ వస్తుందని తెలిపారు. విద్యార్థుల హాజరు శాతం పెరగాలని స్పష్టంచేశారు. పాఠశాలకు గైరుహాజరవుతున్న విద్యార్థులను ఒక్కొక్క ఉపాధ్యాయుడు నలుగురు చొప్పున దత్తత తీసుకుని వారు విధిగా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెరగాలని సూచించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నందిగామ డీవైఈఓ జి.గురునాథం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.వి.నాగేశ్వరరావు, పలువురు ఉపాధ్యా యులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో పలువురికి పదవులు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలను జిల్లా స్థాయి పదవుల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలంపూరు విజయను పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, గంజి రమేష్కుమార్రెడ్డి పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా, పులప కృష్ణ జిల్లా కార్యదర్శి (యాక్టివిటి)గా నియమించారు. అదేవిధంగా యు. కృష్ణవంశీరెడ్డిని ఆర్టీఐ విభాగ జిల్లా ఉపాధ్యక్షుడిగా, బత్తుల రాజేష్, పులగాని లక్ష్మణ్లను పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా, వేముల వెంకటేశ్వరరావును బీసీ సెల్ కార్యదర్శిగా, షేక్ బాషాను మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఉప్పులూరు మహేష్ను ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా, మురకొండ సాంబశివరావును సోషల్ మీడియా జిల్లా కార్యదర్శిగా, చెరుకుమల్లి హనుమంతరావును రైతు విభాగ జిల్లా కార్యదర్శిగా, శీమల నారాయణరావును వైఎస్సార్టీయూసీ జిల్లా కార్యదర్శిగా, చిన్నాల శ్రీనుబాబును యువజన విభాగం జిల్లా కార్య దర్శిగా పార్టీ నియమించింది. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మొగిలి ప్రభుకుమార్ ఈ ఏడాది ఏప్రిల్ 26న రోడ్డు ప్రమాదంలో మృతి చెందా డు. దీంతో ఆయనకు యూనియన్ బ్యాంక్ బీమా రూ.1.20కోట్లు మొత్తాన్ని గురువారం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. యూనియన్ బ్యాంకులో ఖాతా ఉన్న పోలీసు సిబ్బంది ప్రమాదవశాత్తూ మృతి చెందితే, ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా యూనియన్ బ్యాంకులో ఖాతా ఉన్న మొగిలి ప్రభుకుమార్కు బీమా మొత్తాన్ని అందజేశారు. యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ కె. శ్రీధర్బాబు, డెప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీ తిలక్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కె. శ్రీనాథ్రెడ్డి, చీఫ్ మేనేజర్ ఉదయ్కిషన్ పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మాతా శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ. శ్రావణ్బాబు అన్నారు. ఆయన గురువారం పాత ఆస్పత్రి ప్రాంగణంలోని సమావేశ హాలులో ఆశా నోడల్ అధికారులు, మహిళా ఆరోగ్య సూపర్వైజర్లకు మాతా శిశు సేవలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్బాబు మాట్లాడుతూ ఎంసీపీ కార్డు ప్రాధాన్యం, సకాలంలో నమోదు, గర్భిణులు, శిశువులకు అందుతున్న ఆరోగ్య సేవల నిరంతర పర్యవేక్షణ వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎంసీపీ కార్డు కేవలం రికార్డు కోసం ఉపయోగించే పత్రం కాదని, గర్భిణికి అందుతున్న ఏఎన్సీ సేవలు, హైరిస్క్ పరిస్థితుల గుర్తింపు, ప్రసవ వివరాలు, ప్రసవానంతర సంరక్షణ, శిశు ఆరోగ్య వివరాలను నిరంతరం పర్యవేక్షించడానికి ఉపయోగపడే ముఖ్యమైన ఆరోగ్య పత్రం అని వివరించారు. డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతీదేవి, సీహెచ్ఓ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు రూ.21లక్షలతో రూపొందించిన రాధాకృష్ణుల బంగారు హారాన్ని గురువారం సమర్పించారు. విజయవాడ సీతారాంపురానికి చెందిన తవ్వా పుల్లమ్మ కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. సుమారు 141 గ్రాముల బంగారంతో తయారు చేయించిన బంగారు హారాన్ని ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేసింది. రానున్న దసరా ఉత్సవాలలో ఈ హారాన్ని అమ్మవారికి అలంకరించాల్సిందిగా దాతలు ఆలయ అధికారులను కోరారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పోలీసులు చెక్ పెట్టారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగను గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద, అతను ఇచ్చిన సమాచారంతో రూ.10 లక్షల విలువైన 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నందిగామ ఏసీపీ శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ద్విచక్రవాహనాల చోరీలను అరికట్టేందుకు జగ్గయ్యపేట పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారని తెలిపారు. పట్టణంలో ఏర్పాటుచేసిన 443 సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి కదలికలను సీసీ కెమెరా పుటేజీ ద్వారా గుర్తించి, పక్కా సమాచారంతో బీ–కన్వెన్షన్ సమీపంలో నిందితు డిని అదుపులోకి తీసుకొని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. నిందితుడిని పెనుగంచిప్రోలో మండలం ముళ్లపాడు గ్రామానికి చెందిన సంగా రాము గుర్తించామన్నారు. జగ్గయ్యపేట, మైలవరం, తెలంగాణ రాష్ట్రం మధిర పోలీస్స్టేషన్లలో రాముపై కేసులు ఉన్నాయని తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. నిందితుడి వద్ద, అతను ఇచ్చిన సమాచా రంతో రూ.10 లక్షల విలువైన 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ పి.వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్ఐ జి.రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
పునరుత్పాదక ఇంధన వినియోగంలో ముందడుగు
ౖరెల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పునరుత్పాదక ఇంధన దినోత్సవం సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే హరిత పురోగతి దిశగా పరుగులుతీస్తోందని విజయ వాడ డీఆర్ఎం మోహిత్ సొనాకియా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. భారతీయ రైల్వే 2030 నాటికి సున్నా కార్బాన్ ఉద్గారిణిగా మార్చాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా విజయవాడ రైల్వే డివిజన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల్లోనే 19.9 లక్షల స్వచ్ఛ ఇంధన యూనిట్లను ఉత్పిత్తి చేయడం ద్వారా రూ.185.54 లక్షలను ఆదా చేసిందని పేర్కొన్నారు. డివిజన్లో 265 రూఫ్టాప్, స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ల ద్వారా ఉపయోగిస్తున్న సౌర విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 4.864 కిలోవాట్లకు చేరిందని పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డివిజన్లో 44,06,903 యూనిట్ల సౌర విద్యుత్ శక్తికి ఉత్పత్తి ద్వారా రూ.461.40 లక్షలు ఆదా చేయడంతో పాటుగా 3,525.52 టన్నుల కార్బన్ ఉద్గారాలను నివారించామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై మధ్య 19,90,741 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా రూ.185.54 లక్షలు ఆదా చేయడంతో పాటుగా 1,592.59 టన్నుల కార్బన్ ఉద్గారాలను నివారించా మని తెలిపారు. డివిజన్లో సౌర విద్యుత్ ఉత్పత్తితో పాటుగా ఇంధన ఆదా దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా డివిజన్లో పూర్తిగా ఎల్ఈడీ లైటింగ్ ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. రన్నింగ్ రూమ్లు, విశ్రాంతి గృహాలు, ఆస్పత్రుల్లో రోజులకు 56,700 లీటర్ల సామర్థంతో సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేశామన్నారు. -
అజిత్సింగ్నగర్లో రెచ్చిపోయిన దొంగలు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా రెండు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఆ షాపుల్లోని నగదుతో పాటు సీసీ కెమెరాలు, డీవీఆర్లను సైతం ఎత్తుకెళ్లిపోయారు. పోలీసుల కథనం మేరకు.. నున్న గౌడు బజార్లో నివాసం ఉంటున్న బాలగోపాల మణికంఠ కుమార్ ఆంధ్రపత్రిక కాలనీ సెకండ్ లైన్లో పదేళ్ల నుంచి లక్ష్మీదుర్గ ఎంటర్ప్రైజెస్ పేరుతో టైల్స్ వ్యాపారం చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన మణి కంఠ కుమారులు రూ.2.80 లక్షలను షాపు కౌంటర్లో బ్యాగులో ఉంచి బయటికి వెళ్లారు. షాపులో పనిచేస్తున్న దుర్గ అనే మహిళ సాయంత్రం 6.30 గంటల సమయంలో షాపు కట్టేసి ఇంటికి వెళ్లిపోగా రాత్రి తొమ్మిది గంటలకు మణికంఠ కుమార్ షాపు దగ్గరికి వెళ్లి షాపు తెరిచి చూడగా బ్యాగ్ కనిపించలేదు. సితార కేఫ్ హోటల్లో చోరీ ఆంధ్రప్రభ కాలనీ సెకండ్ లైన్లో నివసిస్తున్న పొన్నాడ బద్రీనాథ్ నందమూరి నగర్ సెంటర్లో సితార కేఫ్ హోటల్ నడుపుతున్నారు. ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఆ హోటల్లో గుర్తు తెలి యని వ్యక్తులు గోడ దూకి సీసీ కెమెరాలు, డీవీఆర్లతో పాటు క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.50 వేలను దొంగిలించారు. ఈ రెండు ఘటనలపై అజిత్సింగ్నగర్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతమ్మ ప్రచార రథం.. షెడ్డుకే పరిమితం
రెండేళ్ల క్రితం శ్రావణమాసంలో గ్రామాల్లో పర్యటించిన ప్రచార రథం పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మ అమ్మ వారి ఆలయ ప్రచార రథం ఆలయ సత్రాల్లోని షెడ్డుకు పరిమితమైంది. భక్తుల విరాళాలతో ప్రచార రథాన్ని సమకూర్చారు. మొదట్లో గ్రామాల్లో అమ్మవారి శాంతి కల్యాణాలు నిర్వహించేటప్పుడు, పలు ఉత్సవాల సమయంలో అధికారులు అమ్మవారి ప్రచార రథాన్ని వినియోగించేవారు. ఇటీవల శాంతి కల్యాణాలు తగ్గాయి. దీంతో భక్తులు రూ.లక్షలు వెచ్చించి ఇచ్చిన ప్రచార రథం షెడ్డుకు పరిమతమైంది. రెండేళ్ల క్రితం శ్రావణ మాసం సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో కొలువై ఉన్న గ్రామ దేవతలకు ఆలయం తరఫున శ్రావణపట్టీ సమర్పించేందుకు ప్రచార రథంలో మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్ల టంతో ఎంతో ప్రచారంతో పాటు ఆధ్మాత్మిక భావం వెల్లువిరిసింది. అమ్మవార్లకు చీర, రవిక, పూలు, పసుసు, కుంకుమతో పాటు పండ్లు అందజేశారు. అయితే ఇదే సమయంలో అక్కడక్కడ కొంత ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపి వేశారు. కార్యక్రమం నిలిపి వేయటంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా.. అమ్మవారి శాంతి కల్యాణం కావా లని భక్తులు అడిగితే ఆ గ్రామాలకు ప్రచార రథాన్ని పంపిస్తామన్నారు. గతంలో శ్రావణ పట్టీ కార్యక్ర మంలో భాగంగా కొన్ని ఇబ్బందులు వల్ల ప్రజార రథాన్ని వాడటంలేదన్నారు. ఈ ఏడాది నాలుగో శ్రావణ శుక్రవారం ఆలయంలో సామూహిక వరలక్ష్మీవ్రతం జరుగుతుందని తెలిపారు. -
మధ్యాహ్న కార్మికులకు స్మార్ట్ పోటు!
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో వంట చేసి, వేడివేడిగా భోజనం వడ్డిస్తూ విద్యార్థుల ఆకలి తీరుస్తున్న కార్మికులపై చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్ పోటు వేసేందుకు సిద్ధమైంది. జిల్లాలోని 1,324 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు చేసింది. తద్వారా కార్మికుల ఉపాధికి గండి కొట్టే చర్యలు చేపడుతోంది. జిల్లాలోని మధ్యా హ్న భోజన పథకంలో సుమారు 2,214 మంది వంట కార్మికులు, సహాయకులు పని చేస్తున్నారు. సుమారుగా 21 ఏళ్లుగా అమలవుతున్న ఈ పథకంలో అప్పటి నుంచీ వంట ఏజెన్సీల పేరుతో వంట కార్మికులు, సహాయకులు సేవలు అందిస్తున్నారు. స్మార్ట్ కిచెన్లపై అనుమానాలు.. జిల్లాలో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం తాజాగా ప్రతిపాదిస్తున్న స్మార్ట్ కిచెన్స్ నిర్ణయం అనేక అనుమానాలకు తావిస్తోంది. 26 మండలాల్లో 32 స్మార్ట్ కిచెన్లు (పాయింట్లు), 64 రూట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి పంపించడమే దీనికి నిదర్శనం. ఈ నిర్ణయంతో 2,214మంది కుక్ కమ్ హెల్పర్ల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉండగా, సుమారు 67,201 మంది విద్యార్థులు వేడి వేడి భోజనానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడనుంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా.. గతంలో కుక్లు కేవలం వెయ్యి రూపాయల గౌరవ వేతనం అందేది. ఆ తర్వాత దానిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు వేల రూపాయలకు పెంచారు. జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత బలోపేతం చేశారు. పాఠశాలల్లోనే వంటచేసి విద్యార్థులకు వేడి వేడి, పౌష్టికాహారం అందించేలా చిక్కీ, గుడ్డు వంటి పదార్థాలతో మెనూను రూపొందించారు. దీంతో విద్యార్థుల హాజరు పెరగడమే కాకుండా, స్థానికంగా పనిచేస్తున్న కుక్ కమ్ హెల్పర్లకు ఉపాధి భద్రత కూడా లభించింది. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంగా మార్చి, అదే విధానంలో పాఠశాలల్లో వండిపెట్టే విధానాన్ని కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా స్మార్ట్ కిచెన్స్ పేరుతో కేంద్రీకృత వంటలపై దృష్టి పెట్టింది. దీంతో పాఠశాలల్లో పనిచేస్తున్న కుక్ కమ్ హెల్పర్లను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బకాయిలతో ఎండీఎం కార్మికుల అవస్థలు.. మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికుల విషయంలో వారిని తొలగించాలనే ఉద్దేశంతోనే వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలు పేరుకు పోతున్నాయి. ఎండీఎం కుకింగ్ చార్జీలు జూన్, జూలై నెలలకు పెండింగ్లో ఉండగా, ఆయాలకు చెల్లించాల్సిన వేతనాలు మే, జూన్, జూలై నెలలకు బకాయిగా ఉన్నాయి. మరోవైపు పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న నైట్ వాచ్మెన్లకు సైతం ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుపై విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో స్మార్ట్ కిచెన్లు ఎన్ని అవసరమో గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అయితే స్మార్ట్ కిచెన్లు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎండీఎం కుకింగ్ చార్జీలు, ఆయాలు, వాచ్ మెన్ జీతాల బిల్లులు ట్రెజరీకి అటు నుంచి సీఎఫ్ఎంఎస్ పంపించాం. త్వరలో జీతాలు అకౌంట్లో పడతాయి. – యూవీ సుబ్బారావు, డీఈఓ, కృష్ణా జిల్లా -
బుడమేరు అభివృద్ధి పనులు తక్షణమే చేపట్టాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): బుడమేరు అభి వృద్ధి పనుల కోసం రు.5248.28 కోట్ల అంచనా లతో రాష్ట్ర జలవనరుల శాఖ తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తక్షణమే ఆమోదించి వర్క్ ఆర్డర్ ఇవ్వాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి యు.వి.ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర జనవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, జనవలరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి స్పీడ్ పోస్ట్ ద్వారా మెమొరాండాలు పంపినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీకి బుడమేరుకు వరద వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ నగర ప్రజల్లో ఆ భయం ఇంకా పోలేదన్నారు. గట్టిగా వర్షం పడితే మరల వరద వస్తుందేమోనని నేటికీ భయపడుతున్నారని పేర్కొన్నారు. రెండేళ్లలో బుడ మేరు డైవర్షన్ చానల్ గండ్లు పూడ్చటం మినహా విజయవాడకు ఎగువ భాగాన తీసుకున్న చర్యలేమీ లేవన్నారు. 2024లో దాదాపు 40 వేల క్యుసెక్కులకు పైగా వరదనీరు వచ్చిందని, బుడమేరు డైవర్షన్ చానల్ క్యారీయింగ్ కెపాసిటీ 15 వేల క్యుసెక్కులు మాత్రమేనని వివరించారు. మళ్లీ అలాంటి వరద వస్తే బుడమేరు డైవర్షన్ చానల్ సామర్థ్యం చాలదన్నారు. డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని, అది ఆమోదం పొంది పనులు జరిగితే మొత్తం బుడమేరు వ్యవస్థను పైనుంచి కింది వరకు అభివృద్ధి చేయటంతో పాటు, కొత్త వరద కాలువ నిర్మాణం జరుగుతుందని వివరించారు. ఈ పనులు పూర్తయితే విజయవాడకు వరద ముప్పు శాశ్వతంగా తప్పుతుందన్నారు. టాక్స్పేయర్స్ అసోసి యేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.సాంబిరెడ్డి, కోశాధికారి వి.ఎస్.రామరాజు, పౌర సంక్షేమ సంఘం కార్య దర్శి ఎ.పున్నారావు, బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
కూటమి నేతల చిల్లర రాజకీయాలు సిగ్గుచేటు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గుణదల(విజయవాడ తూర్పు): ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడటం సిగ్గు చేటని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. నగరంలోని ఎల్ఐసీ కాలనీ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ జెండా దిమ్మను కూటమి నేతలు గురువారం ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న దేవినేని అవినాష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతు న్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ పైపులైను మరమ్మతులలో భాగంగా జెండా దిమ్మెను తొలగించినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి నేతలు ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడ కుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవుపలికారు. జెండా దిమ్మెను కూల్చి వేసిన నిందితులను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు తుళ్లూరి ఉదయ్, చిత్రం లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
విమానాశ్రయం(గన్నవరం): రాష్ట్ర పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన విజయవాడ అంతర్జాతీయ విమానా శ్రయం(గన్నవరం)నకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం.నవీన్, ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు గురువారం ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం టెర్మి నల్ భవనంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై దిశనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. ఏలూరు జిల్లాలో జరిగే కార్యక్రమం నిమిత్తం విచ్చేస్తున్న ఉప రాష్ట్రపతికి విమానాశ్రయంలో స్వాగతం, తిరుగు ప్రయాణ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లకు గుడివాడ ఆర్డీఓ ఓవరాల్ ఇన్చార్జిగా నియమించామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఆర్డీఓతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎయిర్పోర్ట్లో వీఐపీ రిసెప్షన్, గ్రీన్ రూములు, పార్కింగ్, అల్పాహారం, వైద్య సదుపాయలు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్య పరంగా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, జీజీహెచ్, ఏపీవీవీఏ అధికారులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచా లని ఆదేశించారు. ఎస్సీ విద్యాసాగర్నాయుడు మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన సందర్భంగా విమానాశ్రయం నుంచి ముసునూరు వరకు పటిష్టవంతమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్తో పాటు అన్ని కీలక ప్రాంతాలను భద్రత పరిధిలోకి తీసుకోవాలని సూచించారు. ప్రయాణ మార్గంలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, వీడియో బృందాలను అవసరమైన చోట్ల ఏర్పాటు చేయాలని తెలిపారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఎయిర్పోర్టులోకి అనుమతించాలని స్పష్టంచేశారు. కాన్వాయ్ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్చార్జ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎ.కె.జైశ్వాల్, ముఖ్య భద్రతాధికారి కె.ధర్మేంద్ర, డెప్యూటీ కలెక్టర్ ఎస్.పోతురాజు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దారు కె.వి. శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
హామీ ఇచ్చే వరకూ తగ్గేదేలే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వం తమ స్టైపెండ్ పెంచకుండా ఎంత బెదిరింపు ధోరణితో వ్యవహరించినా జూడాలు తగ్గేదేలే అంటున్నారు. తాము చూపిస్తున్న సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన రాతపూర్వక హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని జూడాలు అంటున్నారు. దీంతో జీజీహెచ్లో వైద్యం చేసే వాళ్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ స్టైపెండ్ పెంచాలని, బోధనావైద్యుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచవద్దని, నాన్మెడికల్ వాళ్లను అసిస్టెంట్ టీచర్లుగా నియామకాలు చేపట్టవద్దంటూ జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె 11వ రోజు కొనసాగింది. కాగా గురువారం ఉదయం వర్షం రావడంతో జూడాలు సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోని బుద్ధుని విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జూడాలు తమ నోటిపై వేలుతో మౌన దీక్ష చేపట్టారు. 350 మందికిపైగా విధులు బహిష్కరణ.. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన సీనియర్ రెసిడెంట్స్, పోసు్ట్రగాడ్యుయేషన్ విద్యార్థులు, హౌస్సర్జన్స్ దాదాపు 350 మంది వరకూ విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో జీజీహెచ్లో వైద్య సేవలు స్తంభించాయి. మరోవైపు క్యాజువాలిటీ, ఆపరేషన్ థియేటర్స్, లేబర్ వార్డు వంటి వాటిలో వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ, వాస్తవంగా అలాంటి చర్యలు ఏమీ లేక పోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. స్పష్టమైన హామీ ఇవ్వండి.. ప్రభుత్వం తమ స్టైపెండ్ పెంచే విషయంలో అసత్య ప్రచారం చేస్తూ, బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోందని జూడాలు అంటున్నారు. తమకు 20 శాతం మేర స్టైపెండ్ పెంచేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలంటున్నారు. అంతేకాని తమను సంప్రదించకుండా ప్రభుత్వం 5శాతం ఇస్తాం.. 3శాతం ఇస్తాం అంటూ ప్రకటనలు చేయడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం తప్పుదారి పట్టించే యత్నాలు చేస్తోందని, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఆందోళన చేస్తామంటున్నారు. -
సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని తొమ్మిది మండలాల్లో వలస వెళ్లిన తల్లిదండ్రుల పిల్లల కోసం సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు అనుమతులు మంజూరైనట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్.కుముదిని సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటి నిర్వహణకు అనుబంధ శాఖలైన గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖలతోపాటు స్వయం సహాయక సంఘాలు, రిజిస్టర్ కాబడిన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలు తమ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనుమతితో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుబంధ శాఖల వారు రాతపూర్వక దరఖాస్తును rrakrirhna@yahoo.co.in మెయిల్ లేదా లేఖ రూపంలో సమర్పించవచ్చని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయి, కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఆయా సంస్థలు గత మూడేళ్ల ఆడిట్ కాపీలు, సంస్థ బైలాస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, దర్పణ్ ఐడీ తదితర పత్రాలను ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోగా సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ 8106653305ను సంప్రదించాలని కుముదినిసింగ్ తెలిపారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో మునిగి గుర్తు తెలియని బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. దుర్గాఘాట్ వద్ద బాలుడి మృతదేహం ఉన్నట్లు బుధవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. సుమారు ఎనిమిదేళ్ల వయసు ఉండే బాలుడు, టీ షర్ట్, చెప్పులు ఒడ్డున కనిపించాయి. స్థానికులు ఇద్దరు పిల్లలు వచ్చి స్నానానికి దిగారని చెబుతున్నారు. బాలుడు మృతి చెందటం చూసి, అతడితో వచ్చిన మరో బాలుడు అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మాస్టర్ ప్లాన్లో భాగంగా దుర్గగుడిలో నూతనంగా నిర్మించిన అన్న ప్రసాద సదనం, మహా ప్రసాద భవనాల ప్రారంభోత్సవం ఈనెల 21న ఉదయం 11.32 గంటలకు జరుగుతుందని ఆలయ ఈవో శీనానాయక్, ఛైర్మన్ రాధాకృష్ణలు పేర్కొన్నారు. రూ. 52.50 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ రెండు భవనాలతో భక్తులకు మరింత మెరుగైన భోజన వసతి, ప్రసాదాలను పొందే అవకాశం ఉందన్నారు. అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాద భవనాల ప్రారంభోత్సవానికి రావల్సిందిగా మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, లోకేష్లతో పాటు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ను ఈవో, ఛైర్మన్లు బుధవారం కలిసి ఆహ్వాన పత్రికలను అందచేశారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన దశరథి సుబ్బలక్ష్మి పేరిట కుటుంబ సభ్యులు ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. గోసంరక్షణకు .. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన గోసంరక్షణ పథకానికి ఖమ్మంకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఖమ్మంకు చెందిన గుంటుపల్లి విశ్వేశ్వరరావు, ఊర్మిళ ఇతర కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి గోసంరక్షణకు రూ.1,01,116 విరాళాన్ని అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండి తుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకుడు నాగేశ్వరరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చదలవాడ యామిని బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జి.గోపీ హైకోర్టు రిజిస్ట్రార్గా ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న సీహెచ్ యామినిని కృష్ణాజిల్లా జడ్జిగా నియమించారు. మొదటి అదనపు జిల్లా జడ్జిగా శ్రీనివాసశర్మ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా వీఎస్ఎస్ శ్రీనివాసశర్మ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ స్థానంలో పనిచేసిన జి.సునీత శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మిన్)గా పనిచేస్తున్న శ్రీనివాసశర్మను మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా నియమించారు. జీడీఏ ఏపీ డిమాండ్ లబ్బీపేట(విజయవాడతూర్పు):బోధనా వైద్యులకు సంబంధించి యూజీసీ పీఆర్సీ 2016 బకాయిలను సత్వరమే విడుదల చేయాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాబ్జి శ్యామ్కుమార్ కోరారు. ఈ మేరకు సంఘ ప్రతినిధులతో కలిసి సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండల రావును కలిసి వినతిపత్రం అందచేశారు. బోధనా వైద్యులకు చట్టబద్ధమైన సేవ, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకుని, వైద్యులకు అనుకూలమైన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మా సమస్యను పట్టించుకోని పక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన, ధర్నా, సమ్మెకు వెళ్లడం వంటివి చేపట్టాల్సి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ను కలిసిన వారిలో జీడీఏ ఏపీ ప్రతినిధులు డాక్టర్ మహేష్, డాక్టర్ సరళ, డాక్టర్ ఉండవల్లి వంశీకృష్ణ, డాక్టర్ స్వర్ణ గిరీష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
మధుర క్షణాల శాశ్వత జ్ఞాపకం ఫొటో
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఒక ఛాయాచిత్రం.. వెయ్యి పదాలకు సమానమని, ఒక క్షణాన్ని బంధించి శాశ్వత జ్ఞాపకంగా నిలిపే కళ ఫోటోగ్రఫీ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తొలుత కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, సమాచార, పౌర సంబంధాల శాఖ జోన్– 2 ఆర్జేడీ పి.తిమ్మప్ప, జిల్లాస్థాయి ఫొటోగ్రఫీ పోటీల జ్యూరీ సభ్యులు టీఎస్ రెడ్డి (ఎఫ్ఆర్పీఎస్), సీహెచ్ విజయభాస్కరరావు (ఏఆర్పీఎస్), కె.రవికుమార్ తదితరులతో కలిసి ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫొటో జర్నలిస్టుల్లోని ప్రతిభను ప్రోత్సహించి, గుర్తించి, సత్కరించేందుకు ఏటా జిల్లా స్థాయిలో ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో వీడియో జర్నలిస్టులు, అమెచ్యూర్ ఫొటోగ్రాఫర్లను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తామన్నారు. ఐ అండ్ పీఆర్ ఆర్జేడీ పి.తిమ్మప్ప మాట్లాడుతూ జర్నలిస్టులు అక్షర సైనికులు అయితే ఫొటోగ్రాఫర్లు దృశ్య సైనికులు అన్నారు. విజేతలకు నగదు బహుమతులు వివిధ విభాగాలలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో మొత్తం 27 మంది విజేతలుగా నిలిచారు. సాక్షి ఫొటో జర్నలిస్టులు ఎన్.కిశోర్, ఎస్.పవన్, కె.చక్రపాణితో పాటు మరో 24 మంది విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా జ్ఞాపికలు, నగదు బహుమతులు అందజేశారు. అనంతరం ఫొటోగ్రఫీ పోటీల విజేతలను సత్కరించారు. ఫొటోగ్రఫీ పోటీల్లో బహుమతులు పొందిన ఛాయాచిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనతో పాటు, సీనియర్ ఫొటోగ్రాఫర్ పొట్లూరి ప్రసాద్ సేకరించిన అరుదైన, వివిధ రకాల కెమెరాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్య క్రమంలో ప్రముఖ ఫొటోగ్రాఫర్లు టీఎస్ రెడ్డి, విజయభాస్కర్, కె.రవికుమార్, డీఐపీఆర్వో కేవీ రమణరావు, డీపీఆర్వో ఎన్.నాగేశ్వరరావు, డివిజనల్ పీఆర్వో కె. రవి, ఫొటోగ్రఫీ పోటీల సమన్వయకర్త వీవీ ప్రసాద్, వీఎంసీ పీఆర్వో డాక్టర్ రజియా షబీనా, సహాయ సమాచార ఇంజినీర్ కె.ధనుంజయరాజు, ఏవీఎస్ బి.బాలాజీ పాల్గొన్నారు. ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఉద్యాన శాఖ, ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ‘‘ఉద్యాన పంటల్లో అంతర పంటగా పూల తోటల పెంపకం, జీవ వైవిధ్యం, ఉత్పాదకత పెంపు’’పై రెండు రోజులుగా జరుగుతున్న శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. తొలిరోజు ఉద్యాన శాఖ, రైతు సేవా కేంద్రం సిబ్బందికి సాంకేతిక శిక్షణ ఇవ్వగా, రెండవ రోజు పెనమలూరు, ఉంగుటూరు మండలాల్లో క్షేత్రస్థాయిలో తోటల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన కీటక శాస్త్రవేత్త డాక్టర్ ధ్యానేశ్వర్ మధుకర్ ఫిరాకే, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి అధ్యక్షతన వేమగిరి పూలతోటల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ నుంచి అవార్డులు అందుకుంటున్న సాక్షి ఫొటోగ్రాఫర్లు కిశోర్, చక్రపాణి, పవన్ -
విద్యార్థులను అణచివేసే చర్యలు మానుకోవాలి
బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశంలో విద్యావ్యవస్థ ప్రక్షాళనకు పోరాడుతున్న విద్యార్థులను అణచివేసే చర్యలు మానుకోవాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఎన్ఈపీ–2020, నీట్, ఎన్టీఏలను రద్దు చేయాలని, విద్యార్థి ఉద్యమాలపై వేధింపులు ఆపాలని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్లో నిరసన దీక్ష జరిగింది. జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన నిరసన దీక్షకు రాజేంద్ర ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు నెలలుగా విద్యార్థులు దేశ భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నారని, విద్యార్థుల పక్షాన నిలబడి వారి డిమాండ్లు వినాల్సిన పాలకులు వారిని దేశ ద్రోహులనడం తగదన్నారు. విద్యార్థుల ఉద్యమానికి న్యాయవాదులుగా తాము సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ ఫ్లాప్ అయ్యిందన్నారు. ఎన్టీఏ అసమర్ధత వల్ల ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారని, తక్షణమే ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం వల్ల ఇప్పటికే 90 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయని, లక్షలాది మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివ, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి షష్ఠి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగత్ రవి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ్, ఉపాధ్యక్షురాలు ప్రణీత పాల్గొన్నారు. -
రోగులకు నాణ్యమైన సేవలు అందించండి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో 2026–27 విద్యాసంవత్సం డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయిందని అధ్యయన కేంద్రం డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.అజంతకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, బీఎల్ఐఎస్సీ కోర్సులలో ప్రవేశాలకు యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లమో కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. అడ్మిషన్ కోసం విద్యార్థులు ఏబీసీడీ ఐడీ, డీఇబీ ఐడీను క్రియేట్ చేసుకుని అడ్మిషన్ పోర్టల్కి లాగిన్ కావాలని సూచించారు. ఆసక్తి అర్హత కలిగిన వారు వచ్చేనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం విజయవాడ మాచవరం ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రాంతీయ కార్యాలయంలో స్వయంగా కానీ, 0866–2434868, 7382929642 నంబర్లలో కానీ సంప్రదించాల్సిందిగా కోరారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యా పురస్కారానికి ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 26వ తేదీ వరకూ గడువును పొడిగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో సెప్టెంబర్ ఐదో తేదీన సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. దానికి గాను జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న అన్ని ప్రభుత్వ యజమాన్య పరిధిలోని అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా పదేళ్ల బోధన అనుభవం కలిగి ఉండి, విద్యాశాఖ నిర్ణయించిన అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మండల విద్యాశాఖ అధికారులకు తమ దరఖాస్తులను గడువులోపు సమర్పించాలని వివరించారు. చిలకలపూడి(మచిలీపట్నం): ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి ఇంటర్మిడియట్ చదివిన ఎస్సీ నిరుద్యోగ యువకులు కిసాన్ డ్రోన్ ఆపరేటర్ (10వ తరగతి పాస్), డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్ (8వ తరగతి పాస్), అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ (10వ తరగతి పాస్), సోలార్ పీవీ ఇన్స్టాలర్ (సూర్యమిత్ర) (ఇంటర్మీడియట్ పాస్), ఎలక్ట్రికల్ వెహికల్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (8వ తరగతి పాస్), బ్యూటీ థెరపిస్ట్ (10వ తరగతి పాస్), ప్లంబర్ – జనరల్ కోర్సులు (10వ తరగతి పాస్)లలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు 21 నుంచి 45 సంవత్సరాల్లోపు వయసు ఉండాలన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్హత పత్రాలు, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డు నకళ్లతో ఐదురోజుల్లోగా ఎస్సీ కార్పొరేషన్ మచిలీపట్నం కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 9848214161, 9652057244 నంబర్లను సంప్రదించాలన్నారు. -
ఆగని ఆందోళన...
తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆఖరి అస్త్రంగా జూడాలు సమ్మెకు దిగారు. తత్ఫలితంగా గత పది రోజులుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందక రోగులు సతమతమవుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా కానరావడం లేదు. జూడాలు, ప్రభుత్వం పంతాల మధ్య రోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. క్యాజువాలిటీలో వైద్యం అందక రోగులు విలవిల లబ్బీపేట(విజయవాడ): జూడాల సమ్మె ప్రభావం రోగులపై తీవ్రంగా పడుతోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయాలతో, తీవ్రమైన అస్వస్థతతో వచ్చిన వారికి క్యాజువాలిటీలో వైద్యం చేయడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. క్యాజువాలిటీలో ఒకరిద్దరు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండటం, రోగులు ఎక్కువగా రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. జూడాలు చేసే పనులను నర్సింగ్ విద్యార్థులు, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు చేయాల్సి వస్తోంది. దీంతో వారు క్యాన్లా పెట్టేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇటువంటి దయనీయ పరిస్థితులు బుధవారం క్యాజువాలిటీలో కనిపించాయి. ఇవే నిదర్శనం పదో రోజు కొనసాగిన జూడాల సమ్మె జూనియర్ వైద్యులు పదోరోజు తమ సమ్మెను కొనసాగించారు. మూడు రోజులుగా అత్యవసర సేవలను సైతం బహిష్కరించిన జూడాలు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోగులు పడుతున్న బాధలు చూడలేకున్నామంటూ కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ స్టైపెండ్ పెంచాలని, టీచింగ్ వైద్యుల వయస్సు 65 ఏళ్లకు పెంచవద్దని, నాన్ మెడికల్ వారిని నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించవద్దని తదితర డిమాండ్లతో పది రోజులుగా జూడాలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం లేదు. దీంతో పేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. 350 మంది విధులు బహిష్కరణ ప్రత్యామ్నాయంగా 21 మందే... తమ సమస్యల పరిష్కారం కోరుతూ జూనియర్ వైద్యులు(హౌస్సర్జన్స్, పీజీలు) 350 మంది వరకూ విధులు బహిష్కరించి సమ్మె చేస్తుండగా, ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా బుధవారం సాయంత్రం వరకూ కేవలం 21 మందిని మాత్రమే ఏర్పాటు చేసింది. వారిలో వైద్య కళాశాల నుంచి 10 మంది, సెకండరీ హెల్త్ నుంచి ముగ్గురు, డీహెచ్ నుంచి 8 మంది ఇక్కడ విధుల్లో చేరారు. జూడాలు లేక పోవడంతో ఆరోగ్యం కాస్త కుదుట పడిన రోగులను డిశ్చార్జి చేసేస్తున్నారు. అత్యవసర వైద్యం అవసరమైన వారిని మాత్రమే అడ్మిట్ చేసుకుంటున్నారు. దీంతో రోగులు లేక వార్డులు వెలవెలబోతున్నాయి. వార్డుల్లో బెడ్లు చాలని పరిస్థితి నుంచి నేడు సగం బెడ్లపై కూడా రోగులు ఉండని పరిస్థితి నెలకొంది. బుధవారం మధ్యాహ్నం బి బ్లాక్లోని పాత న్యూరాలజీ వార్డులో ఒక్క రోగి కూడా లేని పరిస్థితి ఉంది. అంతేకాదు అదే బ్లాక్ లోని ఏఎంసీలో పది పడకలకు ఇద్దరే రోగులు ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తే జూడాల ప్రభావం ఎంతగా ఉందో అర్ధం అవుతుంది. -
కొండెక్కిన పూల ధరలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని నగరంలో హోల్సేల్ పూల మార్కెట్ బుధవారం వినియోగదారులతో పోటెత్తింది. సాధారణంగా ఒకరోజు ముందుగా సందడి ఉండే మార్కెట్లో ఈ ఏడాది మాత్రం రెండు రోజుల ముందుగానే హడావుడి ప్రారంభమైంది. మార్కెట్లో కొన్ని పూల ధరలు అందుబాటులో ఉన్నా మరికొన్ని ధరలు అమాంతం పెరిగిపోవడంతో నగరవాసులు బెంబేలెత్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకోవటం ఆనవాయితీ. అయితే ఈ సారి పౌర్ణమి రోజే శ్రావణ శుక్రవారం రావటంతో రెండు రోజులూ వ్రతాలను చేసుకోవటానికి మహిళలు సమయుత్తమవుతున్నారు. ఆ క్రమంలో బుధవారం మార్కెట్కు నగర వాసులు బారులు తీరారు. ముఖ్యంగా నగరంలోని రాజీవ్గాంధీ హోల్సేల్ పూల మార్కెట్లో కిలో కనకాంబరాలు రూ.1500 పలకగా రెండు రోజుల క్రితం అవే పూలు రూ.400 మాత్రమే పలికాయి. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని కనకాంబరాలు ధర మూడింతలై కూర్చుంది. అదే క్రమంలో మల్లెపూలు మంగళవారం రూ.200 నుంచి రూ.300 పలకగా బుధవారం వెయ్యి నుంచి రూ.1200కు పెరిగింది. అదేవిధంగా సన్నజాజులు కూడా రూ.400 నుంచి రూ.1200 పెరిగాయి. అలాగే చామంతి, గులాబీ 400 నుంచి రూ.600కు విక్రయించారు. బంతిపూలు రూ.400, హైబ్రీడ్ గులాబీ వంద రెండొందల చొప్పున విక్రయించారు. వాటితో పాటుగా బెంగుళూరు నుంచి వచ్చే గులాబీ 20 పూల కట్ట రూ.200కు విక్రయించారు. అదేవిధంగా దండల ధరలు సైతం అమాంతం పైకెక్కి కూర్చున్నాయి. -
ప్రారంభ శూరత్వమే..!
పెడన: మండల పరిధిలోని బల్లిపర్రు గ్రామస్తుల తాగునీటి సమస్య తీరుస్తామంటూ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్లు మైక్రోఫిల్టర్ ద్వారా తాగునీరు అందించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా సీఎస్ఆర్ పవర్ గ్రిడ్ నిధులు రూ.15 లక్షలో ఎంతో ఆర్భాటంగా మైక్రోఫిల్టర్ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మే 24న ఘనంగా ప్రారంభించారు. ప్రారంభం రోజు ఎంతో హంగామీ చేసి తాగునీరు ఇప్పించేస్తున్నామని గ్రామస్థుల్ని బలంగా నమ్మించారు. కానీ, ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ మైక్రోఫిల్టర్ షెడ్డుకు తాళం వేసే ఉంచుతున్నారు. దీని ద్వారా తమకు తాగునీరు ఎప్పుడు ఇస్తారా అంటూ గ్రామస్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రొయ్యల చెరువులకు జలకళ.. గ్రామంలో సుమారు 600కు పైగా కుటుంబాలున్నాయి. పాతబల్లిపర్రు, బల్లిపర్రు గ్రామాలకు గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పీడబ్ల్యూటీ స్కీం ద్వారా నీరందిస్తున్నారు. ఈ స్కీంకు సంబంధించిన ఫిల్టర్బెడ్లు మూతపడటంతో చెరువులోని నీరు నేరుగా ట్యాంకుకు వెళ్లి, తిరిగి అదేనీరు పబ్లిక్ కొళాయిలు ద్వారా, సొంత పైపుల ద్వారా ఇళ్లకు చేరుతున్నాయి. దీంతో ఆ నీటిని వాడకానికి తప్ప తాగేందుకు, వంటలకు వినియోగించడం లేదు. తప్పని సరి పరిస్థితుల్లో తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ, ఎమ్మెల్యే మైక్రోఫిల్టర్ ఏర్పాటు చేశారు. రెండు నెలలు గడిచినా తాగునీరు అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క చేపలు, రొయ్యల చెరువులు నీటితో కళకళలాడుతుంటే పంచాయతీ చెరువులు నీరు లేక ఎండిపోతున్నాయనడం విడ్డూరంగా ఉంటుందని గ్రామస్థులు మండిపడుతున్నారు. మైక్రోఫిల్టర్కు నీరందించడానికి చెరువు నుంచే నీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ చెరువులో నీరు పూర్తిస్థాయిలో లేదు. అడుగుకు చేరడం వల్ల ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ నీరు ఫిల్టర్లలోకి వెళ్తే ఫిల్టర్ పాడైపోయే ప్రమాదం ఉంది. అందువల్ల చెరువులోకి పూర్తిస్థాయిలో నీరు రాగానే మైక్రోఫిల్టర్ ద్వారా తాగునీరందించడానికి చర్యలు తీసుకుంటాం. ఆర్.హేమప్రకాష్, ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఎంపీడీవో,బల్లిపర్రు పంచాయతీ -
రిజిస్ట్రేషన్లు లేని ఆస్పత్రి, క్లినిక్లపై చర్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి జిల్లాలోని ఆస్పత్రులు, క్లినిక్స్, లేబొరేటరీ, దంత వైద్య క్లినిక్స్, స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు అన్నారు. ఆయన బుధవారం నగరంలోని పలు స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికీ అనుమతులు పొందకుండా ఉన్న ఆస్పత్రులు, క్లినిక్స్ వెంటనే పర్మిషన్, రెన్యువల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసి, జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి అనుమతి పొందాలన్నారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్ ధరఖాస్తుతో పాటు, ఆ భవన డాక్యుమెంట్, అద్దె అయితే రెంటల్ అగ్రిమెంట్, ఫైర్ ఎన్ఓసీ, సేఫ్ ఎన్విరాన్ ఎంఓయూ, పొల్యూషన్ ఎన్ఓసీలతో దరఖాస్తు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేని వాటిని గుర్తిస్తే కలెక్టర్ అనుమతితో సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
లెప్టోస్పిరోసిస్పై అప్రమత్తత అవసరం
డీఎంహెచ్ఓ డాక్టర్ దయాకర్ మచిలీపట్నంఅర్బన్: లెప్టోస్పిరోసిస్ వ్యాధిపై ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పి.ఎల్. దయాకర్ సూచించారు. ముఖ్యంగా భారీ వర్షాలు, వరదల సమయంలో వ్యాధి వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స, సమర్థవంతమైన నిఘాతో వ్యాధిని నియంత్రించవచ్చని తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి (అవుట్ బ్రేక్) దర్యాప్తు, నియంత్రణ, ప్రతిస్పందనపై పట్టణంలో నిర్వహించిన రెండు రోజుల సిమ్యులేషన్ ఆధారిత శిక్షణా వర్క్షాప్ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ దయాకర్ మాట్లాడుతూ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, నిఘా, ప్రయోగశాల నిర్ధరణ, వ్యాధి వ్యాప్తి దర్యాప్తు, కేసుల నిర్వహణ, పర్యావరణ పరిస్థితుల అంచనా, ప్రమాద సమాచార ప్రసారం, వివిధ శాఖల మధ్య సమన్వయంతో కూడిన ప్రతిస్పందన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వ్యాధి నియంత్రణలో వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, జిల్లా స్థాయిలో సన్నద్ధతను పెంపొందించడం, వ్యాధి వ్యాప్తి సమయంలో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని మెరుగుపరచడం శిక్షణా కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ శిక్షణలో డీఏహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసరావు, డీఎస్ఓ డాక్టర్ సాయికిరణ్, వైద్య ఆరోగ్యశాఖ, పశుసంవర్ధకశాఖ, పాఠశాల ఆరోగ్య విభాగం, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ, ఆహార భద్రత, వైద్య విద్య తదితర శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ వినియోగదారులు తెలియజేసిన ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు. విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ జిల్లా విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్క సిబ్బంది పని చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రీబ్యూషన్ ట్రాన్స్పార్మర్ల పనితీరును నిరంతరాయం పర్యవేక్షిస్తూ సరఫరాలో నాణ్యతను మెరుగుపరచడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పీక్ అవర్స్లో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. అధిక లోడ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట లోడ్ బ్యాలెన్సింగ్, అదనపు సామర్థ్యాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రధాన మంత్రి సూర్యఘర్ – ముప్త్ బిజ్లీ యోజన, నూతన విద్యుత్సబ్స్టేషన్ల నిర్మాణం, ఫీడర్ల బలోపేతానికి తీసుకుంటున్న చర్యల గురించి ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సులభంగా నూతన విద్యుత్ కనెక్షన్... నూతన విద్యుత్ కనెక్షన్ కోసం వినియోగదారులు ఈ–సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీసీపీడీసీఎల్.ఇన్ వెబ్సైట్ లేదా ఏపీసీపీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా దరఖాస్తు చేసుకునే సౌకర్యం గురించి విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని రకాల భద్రతా చర్యలను సిబ్బంది కచ్చితంగా తీసుకోవాలని పుల్లారెడ్డి ఆదేశించారు. సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్ఎన్.మూర్తి, ఎన్టీఆర్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరు యు.హనుమయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కొండలరావు, రవిచంద్ర, హరిబాబు, సత్యనారాయణతో పాటుగా అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
పనితీరు మారకపోతే చర్యలు తప్పవు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రాజగోపురం ఎదుట కళావేదికపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు కల్యాణం జరిపించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారి కల్యాణం జరిగింది. అనంతరం కల్యాణ తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు. కల్యాణోత్సవంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం కల్యాణ వేదిక నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా స్వామివారి ఆలయానికి తీసుకెళ్లారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి కృష్ణా జిల్లా టూరిజం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (అదనపు బాధ్యతలు)గా డాక్టర్ కొల్లేటి రమేష్ని నియమిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు, జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ కొల్లేటి రమేష్కు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీషర్గా అదనపు బాధ్యతలు కేటాయించారు. -
నిత్యావసరాలు సజావుగా అందించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను సజావుగా ఎటువంటి అంతరాయం లేకుండా పంపిణీ చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి టి. శివరామప్రసాద్ అన్నారు. పౌరసరఫరాల డెప్యూటీ తహసీల్దార్లు, డీలర్ల అసోసియేషన్ సంఘ నాయకులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ సరుకులను నిర్ణీత సమయంలో పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రేషన్డీలర్లకు సూచించారు. సరుకుల కేటాయింపులో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో డీడీలు చెల్లించి దిగుమతి చేసుకోవాలన్నారు. ఆంధ్ర మినీ మార్టు కార్యక్రమం ప్రాముఖ్యతను ఆయన రేషన్ డీలర్లకు వివరించారు. జిల్లాలోని 1059 రేషన్షాపుల్లో 275 రేషన్షాపులను మినీ మార్టులుగా ఏర్పాటు చేసేందుకు గుర్తించామన్నారు. మొదటి దశలో 68 రేషన్ డీలర్లను ఎంపిక చేశామన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కిలో నాణ్యమైన బియ్యాన్ని రూ. 52 చొప్పున అమ్మకాలు జరుపుతున్నామన్నారు. -
బుసకనూ బొక్కేస్తున్నారు!
పెడనలో బరి తెగిస్తున్న అధికార పార్టీ నాయకులు● ఎమ్మెల్యే కాగిత, బూరగడ్డ వర్గీయుల మధ్య పోటాపోటీ ● వారు రెండు ట్రాక్టర్లు తొలుతే.. మేం మూడు తొలుతాం అంటూ గుట్టలను కరిగిస్తున్న వైనం ● అధికారులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారంటూ ఆగ్రహావేశాలు ● పేరుకే తనిఖీలు చేపడుతున్న అధికారులు – షేక్ వజీదా రహమాన్, తహసీల్దార్, పెడన -
చిత్రప్రయాణం
కెమెరామేన్ ప్రసాద్తోక్లిక్ ఇవ్వని కిక్.. పాత కెమెరా ఇస్తోంది!ఆయన ఇల్లు ఓ కెమెరా మ్యూజియం! 1970 నాటి కెమెరా నుంచి నేటి అత్యాధునిక కెమెరాల వరకూ విభిన్న మోడల్స్ ఆయన వద్ద కనిపిస్తాయి. ఆయన వృత్తి ఫొటోగ్రఫీ అయినా.. కెమెరాల సేకరణను ఒక హాబీగా మార్చుకొని దాదాపు 170 పాతతరం కెమెరాలను తన ఇంట్లోని ఓ గదిలో భద్రపరిచాడు. దేశ విదేశాలకు చెందిన అతి పురాతనమైన కెమెరాలు సైతం తన కలెక్షన్లో ఉన్నాయి. ఆయనే విజయవాడకు చెందిన పొట్లూరి ప్రసాద్. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆ ‘మ్యూజియాన్ని’ కెమెరామేన్ ప్రసాద్తో కలిసి సై‘లెన్స్’తో చూసొద్దాం రండి. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కంటితో సైతం చూడలేని చిత్రాలను కెమెరా ‘క్లిక్’లో చూపించడం ఫొటోగ్రాఫర్ల ప్రత్యేకత.. కానీ విజయవాడకు చెందిన పొట్లూరి ప్రసాద్ అక్కడితే ఆగిపోలేదు. కేవలం ఫొటోలు తీయడమే కాదు దేశవిదేశాలకు చెందిన అతి పురాతనమైన కెమెరాలను సేకరించడం అలవాటుగా చేసుకొని ముందుకు సాగుతున్నాడు. 1984లో కెమెరాను కొనాలనే ఆశతో మొదలైన అతని హాబీ ఫొటో కెమెరాల సేకరణ వైపు మళ్లింది. సేకరించిన కెమెరాలకు ఒక గది.. కేవలం కెమెరాలను సేకరించడమే ఒక పని అయితే వాటిని భద్రపరచడం మరో పెద్ద టాస్క్.. కెమెరాలను భద్రపరిచేందుకు తన ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడం, ఆ గదిలో అలమరాలు ఏర్పాటు చేసి వాటి మధ్య కూర్చొని తానే సేకరించిన కెమెరాలను గర్వంగా చూసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తోందంటున్నాడు. కెమెరాల కోసం పలు రాష్ట్రాలకు.. ప్రసాద్ కెమెరాలను సేకరించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాడు. దేశంలో కెమెరాల సేకరించే వారందరితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పాతతరం కెమెరాలను సేకరిస్తుంటాడు. హైదరాబాద్, గుజరాత్, ఆగ్రా, చైన్నె, ముంబైలోని పలువురు ఇదే హాబీతో ఉన్న వారితో పరిచయాలు ఉన్నాయి. తన బాటలోనే పెద్ద కుమారుడు.. ప్రసాద్ తను నడిచిన మార్గంలోనే పెద్ద కుమారుడు మధు నడుస్తున్నాడు. ప్రస్తుతానికి ఫొటోగ్రఫీ రంగంలోనే ఉన్నా తండ్రికి సాయంగా ఉంటున్నాడు. ఒక్క ఫొటో కోసం.. తన చిన్నతనంలో రీల్తో ఫొటో తీసిన తర్వాత ఆ ఫొటో డెవలప్మెంట్ చేసి, ప్రింట్ వేసేందుకు ఒక రోజు మొత్తం ఎదురు చూసేవాళ్లమని ప్రసాద్ తన అనుభవాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు కెమెరాల నుంచి సెల్ఫోన్, డ్రోన్, 360 డిగ్రీ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన పాతతరం కెమెరాల నాణ్యత, టెక్నాలజీ ఇప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతున్నాయంటున్నారు. పాతతరం కెమెరాలను భవిష్యత్తు తరాలకు చూపించడమే తన అభిమతమని ప్రసాద్ పేర్కొంటున్నారు. -
స్వామివారి సన్నిధిలో పలువురు శాసనసభ్యులు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని పలువురు శాసనసభ్యులు దర్శించుకున్నారు. సాయంత్రం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వారు నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివార్లకు అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. -
‘పీఎం రాహత్’పై అవగాహన అవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ.ఎం. రాహత్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద ప్రమాద బాధితుడికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తారన్నారు. అత్యవసర సమయంలో డబ్బు కోసం వేచి ఉండకుండా బాధితుడికి తక్షణ వైద్యం అందేలా ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం జిల్లాస్థాయి రహదారుల భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం అందించి, ప్రమాదం జరిగిన ఒక గంటలోపు ఆసుపత్రికి చేర్చే వ్యక్తిని ‘గుడ్ సమరిటన్’గా గుర్తించి, ప్రోత్సహకంగా రూ. 25వేలు అందజేస్తారన్నారు. గుడ్ సమరిటన్లకు న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై చివరి నాటికి జిల్లాలో 583 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. ఆ ప్రాంతంపై ఫోకస్.. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి. రాజశేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచర్ల ప్రాంతాల్లో ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోనే 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. పురేంద్ర, ఎన్హెచ్ఏఐ విజయవాడ పీడీ ఎం.విద్యాసాగర్, రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, కమిషనర్ రాజశేఖరబాబు -
టిడ్కోకాలనీ వాసుల కష్టాలు తీరేనా?
సాక్షి టాస్క్ఫోర్స్: ‘ఎమ్మెల్యేగా గెలిస్తే గుడివాడ టిడ్కో కాలనీ ప్లాట్ల రుణాలను మాఫీ చేస్తా. ఇందుకు నా సొంత నిధులు చెల్లిస్తా’ ఇదీ ఎన్నికల సమయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన హామీ. ‘రుణాలను చెల్లించడానికి నేనేమైనా టాటానా? బిర్లానా? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తే రుణమాఫీ చేయిస్తా’ ఇవీ గెలిచిన తర్వాత చెబుతున్న మాటలు. టిడ్కో ఇళ్ల రుణాలపై ఎమ్మెల్యే తీరు ప్రస్తుతం గుడివాడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కోకు మోక్షం 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చొరవతో టిడ్కో కాలనీ స్వరూపం పూర్తిగా మారిపోయింది. తన పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిడ్కో కాలనీ వాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిధులు మంజూరు చేశారు. ప్లాట్లను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేశారు. మిగతా వసతుల కల్పనకు సైతం కోట్లాది రూపాయలు కేటాయించారు. కూటమి అధికారంలోకి రావడంతో మిగిలిన సమస్యల పరిష్కారం అటకెక్కింది. నట్టేటముంచిన ఎమ్మెల్యే హామీ ఎన్నికల్లో గుడివాడ సీటును ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముకు తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అక్కడి నుంచి రాము ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పారు. అమలకు సాధ్యకానీ హామీలను గుప్పించారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో టిడ్కో కాలనీకి వచ్చిన రాము తాను ఎమ్మెల్యేగా గెలిస్తే టిడ్కో కాలనీ వాసుల ఇళ్ల రుణాలను తన సొంత నిధులతో చెల్లించి మాఫీ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని నిజంగానే నెరవేరుస్తారని నమ్మిన నిరుపేద టిడ్కో కాలనీవాసులు ఎన్నికల్లో రాముకు ఓట్లు వేశారు. గెలిచి రెండేళ్లు దాటినా ఇంత వరకు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిటబెట్టుకున్న పాపానపోలేదు. ఎమ్మెల్యే హామీ నెరవేర్చాలంటూ టిడ్కో కాలనీ వాసులు రెండేళ్లుగా ఆందోళనలు, నిరసనలు, ఏకంగా నిరాహార దీక్షలు సైతం చేపట్టారు. అయినా ఎమ్మెల్యే నుంచి ఉలుకు, పలుకు లేదు. ఎమ్మెల్యే రుణాలు చెల్లిస్తాడని నమ్మిన నిరుపేదలు బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా ఉండటంతో రుణాలకు వడ్డీలు అంతకంతకు పెరిగి తడిసి మోపెడ య్యాయి. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల అధికారులు ఇళ్ల వద్దకు వచ్చి ప్రతిరోజు నానా యాగీ చేయడం, బోర్డులు పెట్టడంతో నిరుపేద టిడ్కో కాలనీ వాసులు మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికై నా మాట నిలబెట్టుకుంటారా, చరిత్రలో నిరుపేదలకు ముంచిన ఎమ్మెల్యేగా నిలిచిపోతారో ఎమ్మెల్యే తేల్చుకోవాలంటూ టిడ్కో కాలనీ వాసులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి నెరవేర్చే రాజకీయ నాయకులను చూశాం. ఇంత దారుణంగా హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసే ప్రజాప్రతినిధిని గుడివాడలోనే చూస్తున్నాం. ఈ ప్రజాప్రతినిధి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. – సునీత, టిడ్కో కాలనీ లబ్ధిదారు -
సర్వేను అడ్డుకున్న అంబేడ్కర్ కాలనీవాసులు
గన్నవరం: మండలంలోని కేసరపల్లిలో ఆర్ఎస్ నంబరు 283/1లో మంగళవారం రెవెన్యూ, విమానాశ్రయ అధికారులు సంయుక్తంగా చేపట్టిన సర్వేను అంబేడ్కర్ కాలనీవాసులు అడ్డుకున్నారు. మీర్జాపురం జమీందారు నుంచి చట్ట పరంగా తమకు సంక్రమించిన భూములను లాక్కునే ప్రయత్నాలను విమానాశ్రయ అధికారులు విరమించుకోవాలని ఆందోళనకు దిగారు. విమానాశ్రయ, రెవెన్యూ అధికారులు, కాలనీవాసుల మధ్య కొద్ది సేపు వాదో పవాదాలు జరిగాయి. కాలనీవాసులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా న్యూకాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు మోట్రు ఆంథోని మాట్లాడుతూ.. 1964లో మీర్జాపురం జమీందారులు కోర్టు దావా రాజీ షరతుల మేరకు సర్వే నంబరు 283/1లోని 4.80 ఎకరాల భూమి తమకు సంక్రమించిందన్నారు. అప్పటి నుంచి ఆ భూమి తమ ఆధీనంలోనే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు కూడా ధ్రువీకరించారని పేర్కొన్నారు. 2015–17 మధ్య మూడు కుటుంబాలు తప్పుడు పత్రాలు సృష్టించి కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని తెలిపారు. ఈ విషయమై జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో తీర్పు తమకు అనుకూలంగా రాగ, సదరు ఆక్రమణదారులు సీనియర్ సివిల్ కోర్టులో అప్పిల్కు వెళ్లారని వివరించారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే విమానాశ్రయ భూములు తమ సర్వే నంబర్లో ఉన్నట్లుగా అధికారులు సర్వే నిర్వహించారని తెలిపారు. ఈ విషయమై గుడివాడ ఆర్డీఓను ఆశ్రయించగా ఎయిర్పోర్ట్, రెవెన్యూ, కాలనీవాసులకు నోటీసులు జారీచేసి న్యాయవాది సమక్షంలో డాక్యుమెంట్లను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. ఈ నెల 18న కాలనీవాసులు హాజరుకావాలని తహసీల్దారు ఉత్తర్వులు ఇవ్వగా 15 రోజులు గడువు కోరినట్లు పేర్కొన్నారు. అందుకు విరుద్దంగా విమానాశ్రయ, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఈ నెల 29, 30 తేదీల్లో సర్వే నిర్వహించేందుకు వస్తే తగిన ఆధారాలను సమర్పిస్తామని అధికారులకు స్పష్టం చేసినట్లు వివరించారు. కాలనీ పెద్దలు సాతులూరి రవిప్రకాష్, పొంగులేటి సుధాకర్, దాసరి యేసుపాదం, నీలం మహోదయ ఆంథోని తదితరులు పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మైలవరం: రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మొర్సుమల్లి గ్రామంలో మంగళవారం జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల కారణంగా పంటలకు నష్టం కలిగినప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా ఎంతో కీలక మన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలకు ప్రాధాన్యమిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకోవా లని సూచించారు. ప్రకృతి వ్యసాయంపై రైతులకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సీహెచ్ తిరుమల దేవి, వ్యవసాయ శాఖ ఏడీ ఎం.శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి కె.సంధ్యారాణి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
పిల్లల ఆధార్ అప్డేట్ తప్పనిసరి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పిల్లల ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయించా లని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. నిర్దేశిత వయస్సులో వివరాలను అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో ఆధార్ ఆధారిత సేవలు పొందే సమయంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల వయస్సు పెరుగుతున్న కొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలను ఆధార్లో అప్డేట్ చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. 5–7 సంవత్సరాలు, 15–17 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 5–7 సంవత్సరాల వయసు పిల్లల్లో 31,184 మంది, 15–17 సంవత్సరాల వయస్సు పిల్లల్లో 37,470 మంది బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్లో ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 206 ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్తో పాటు ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో పర్మనెంట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పాఠ శాల, ఇంటర్మీడియెట్ విద్యా శాఖలతోపాటు ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి – జిల్లా ఆధార్ నోడల్ అధికారి కె.వై. ఎస్.ఆర్.రవికుమార్, హైదరాబాద్ యూఐడీఏఐ రీజనల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ ఎ.సత్యకళ, వీఎంసీ డెప్యూటీ కమిషనర్ శకుంతల, డీఎస్పీ సత్యనారాయణ, డీఈఓ సత్యకళ, డీఐఓ ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ నాంచారారావు, డీఎం హెచ్ఓ, డ్వామా, పోస్టల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పూర్తిగా భ్రష్ఠుపట్టిందని మాజీ పోలీసు అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు విమర్శించారు. సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, నల్లమోతు చక్రవర్తితో కలిసి మంగళవారం విజయవాడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఏపీపీఎస్సీ చైర్మన్ను నియమించలేదన్నారు. దీనిని బట్టే ఏపీపీఎస్పీపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోందన్నారు. గ్రూప్ వన్ వంటి పెద్ద పరీక్షలు నిర్వహించే కెపాసిటీని ఏపీపీఎస్సీ కోల్పోయిందన్నారు. ఏపీపీఎస్సీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు, దాని ద్వారా నియామకాలు ఆశించే యువత, చదువుకున్న పిల్లలకు మేలు జరగదన్నారు. కంచికచర్ల: ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మోగులూరులో సోమవారం జరిగింది. ఎస్ఐ పి.విశ్వనాథ్ ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ కథనం మేరకు.. కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన షేక్ షకీలా(35)కు అదే గ్రామానికి చెందిన షేక్ జాన్బాబుతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జాన్బాబు మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవలు పడేవాడు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ నెల 16వ తేదీ రాత్రి సమయంలో జాన్బాబు మద్యం తాగి ఇంటికి వచ్చి షకీలాతో గొడవకు దిగాడు. దీంతో మనస్తాపం చెందిన షకీలా నెల 17వ తేదీ రాత్రి సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను 108 అంబులెన్స్లో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కంచికచర్ల: గుర్తు తెలియని మహిళ మృతదేహం మునేరులో లభ్యమైందని ఎస్ఐ పి.విశ్వనాథ్ మంగళవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. కంచికచర్ల మండలం కీసర వద్ద మునేరుపై నిర్మించిన పాత బ్రిడ్జి కింద నీటిలో సుమారు 30 నుంచి 40 ఏళ్ల వయసు మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని బయటకు తీయించారు. మహిళ ఒంటిపై ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గళ్ల డిజైన్ కలిగిన పంజాబీ టాప్, ఎరుపు రంగు లెగ్గిన్ ఉన్నాయి. కుడిచేతిపై కేఎం అక్షరాల పచ్చబొట్టు, మెడలో తాయత్తు ఉన్నాయి. ఆమె మూడు రోజుల క్రితం మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఇతరులు ఎవరైనా తీసుకొచ్చి హత్యచేసి మునేరులో పడేశారా లేక బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కీసర వీఆర్వో ఎస్.సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 94407 96460, 08678 – 274333 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
దుర్గమ్మ సేవలో సీనియర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సీనియర్ ఐఏఎస్ అధికారి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ఎ.వి.రాజమౌళి కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. అమ్మ దర్శనానికి విచ్చేసిన రాజమౌళికి ఆలయ ఈఓ శీనానాయక్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఈఓ శీనానాయక్, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. విజయవాడలీగల్: మార్కాపురం జిల్లా గిద్ద లూరు పోలీసుస్టేషన్లోని పోలీసు జీపును తగలబెట్టిన కేసులో ఇద్దరు నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి ఎ.అనిత మంగళవారం తీర్పు చెప్పారు. రెండు సెక్షన్ల కింద ఒక్కొక్క సెక్షన్ ప్రకారం సంవత్సరం జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధించారు. 2014 జూలై ఒకటో తేదీన ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి, అతని సోదరుడు కృష్ణకిషోర్రెడ్డి సహా 21 మంది అనుచరులు పోలీసుస్టేషన్పై దాడి చేశారు. అక్కడున్న పోలీసు జీపును తగులబెట్టారు. గిద్దలూరు పోలీసులు ఐపీసీ 435 రెడ్విత్ 149, సెక్షన్ 4 ఆఫ్ పీడీపీపీ యాక్టు కింద 21 మందిపై కేసు నమోదుచేశారు. అనంతరం విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే న్యాయస్థానంలో నిందితులను హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ తల్లాప్రగడ సుబ్బారావు, డిఫెన్స్ తరఫున సీనియర్ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణలో ఉండగా ముగ్గురు నింది తులు మరణించగా, మిగిలిన 18 మందిలో 16 మందిని నిర్దోషులుగా న్యాయస్థానం పేర్కొంది. మిగిలిన ఏ–12 సయ్యద్ షానిషా వలి, ఏ–13 పాలగుళ్ల చినశ్రీనివాసరెడ్డిపై నేరం రుజువుకావడంతో పైవిధంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరుగుతున్న 52వ జూనియర్ జాతీయ అక్వాటిక్ చాంపియన్షిప్ పోటీల్లో విజయవాడ నగరానికి చెందిన స్విమ్మర్ ఎం.యజ్ఞ సాయి–200 మీటర్ల ఫ్రీస్టైల్ బాలుర (గ్రూప్–1బీ) విభాగంలో 1:56.63 సెకన్ల సమయంలో పూర్తి రజత పతకం సొంతం చేసుకున్నాడు. పతకం సాధించిన ఎం.యజ్ఞ సాయికి అమెచ్యూర్ అక్వాటిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎ.మోహన్ వెంకట్రామ్, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంగర రవికాంత్, కార్యదర్శి ఐ.రమేష్, విజయవాడ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్ ఇన్చార్జ్ అనిల్, కోచ్లు మాల్యాద్రి, లక్ష్మణ్, అసోసి యేషన్ సభ్యులు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించబోమని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) ఆరోపించింది. మంగళవారం యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు నిరసన కార్యక్రమం జరిగింది. యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కుమార్, కార్యదర్శి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ముందు విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లు రూ.7 వేల కోట్లకు పైగా బకాయి పెట్టిందన్నారు. ఫలితంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పేదల ఉన్నత విద్యకు ఆటంకంగా ఉన్న జీఓ 77ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. కాలేజీలు, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయులు వెళ్లకుండా ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలను తెలుసుకునే హక్కును ఎవరూ హరించలేరని, ఈ నిషేధాన్ని ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. డీమ్డ్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు భీమేష్, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, కమలాకర్, ఆఫ్రిద్, గణేశ్ వివిధ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రైతు సేవా కేంద్రంతో కౌలు రైతులకు కష్టాలు
మచిలీపట్నం అర్బన్: రైతులకు అండగా నిలవాల్సిన రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే)లోనే కౌలు రైతులకు న్యాయం కరువైందని కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పంచకర్ల రంగారావు విమర్శించారు. మంగళవారం గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన బాధిత కౌలు రైతులు కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ ఎం.నవీన్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ.. సూరంపల్లి గ్రామంలోని ఆర్ఎస్కేలో ధాన్యం విక్రయించి ఏడాది దాటినా కౌలు రైతుల ఖాతాల్లో నేటికీ సొమ్ము జమ కాలేదని తెలిపారు. ఒక్కోసారి ఒక్కో విధంగా మాటలు చెప్పి రైతులను నమ్మించి చివరకు మోసం చేశారని ఆరోపించారు. పలువురు బాధిత కౌలు రైతులు మాట్లాడుతూ.. ఆర్ఎస్కేలో పని చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు మధు, దిలీప్ ధాన్యం కొనుగోలు వ్యవహారంలో తమను నమ్మించారని తెలిపారు. తమ నుంచి సరైన ఆధారాలు లేకుండానే ధాన్యం తీసుకుని, ఇతరుల పేర్లతో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచా యితీ నిర్వహిస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు తమకు సొమ్ము అందలేదని వాపోయారు. మరోవైపు తమ నుంచి కౌలు రైతులు ధాన్యం విక్రయించిన విషయం వాస్తవమేనని తహసీల్దార్ సైతం నివేదిక ఇచ్చినట్లు రైతులు తెలిపారు. అయినప్పటికీ తమకు న్యాయం జరగకపోవడంతో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ను కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే తాము ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం ఇచ్చామని జాయింట్ కలెక్టర్ సమాధానం ఇచ్చారని రైతులు వాపోయారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్ఎస్కేలో ధాన్యం కొనుగోలు జరి గితే.. అక్కడ ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తమకు జరిగిన మోసంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి, తమకు నగదు ఇప్పించాలని కౌలు రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కౌలు రైతులు వి.వెంకట నాగు, స్వామిశెట్టి కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, నున్న శంకర్, పామర్తి వెంకటేశ్వరావు, బెజవాడ తాతబ్బాయి, కై లే ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఘర్షణలో తీవ్రంగా గాయపడి వ్యక్తి మృతి
వించిపేట(విజయవాడపశ్చిమ): స్థానిక 50వ డివిజన్, గొల్లపాలెంగట్టు రోడ్డులో సోమవారం రాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఘటనపై కేసు కాకుండా వామపక్ష మాజీ కార్పొరేటర్ ఒకరు పంచాయితీ చేశారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వర్గపురికి తీసుకెళ్లగా, వంటిపై గాయాలను చూసి అక్కడి సిబ్బంది అడ్డుకోవ డంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. మరగడ వెంకటరెడ్డి (55) వంట మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలసి గొల్లపాలెంగట్టు కొండ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో గొల్లపాలెంగట్టు రోడ్డులో మద్యం మత్తులో ఉన్న వెంకట రెడ్డి, అదే ప్రాంతానికి చెందిన కొప్పుల శేఖర్ మధ్య ఏదో విషయంపై ఘర్షణ తలెత్తింది. వెంకటరెడ్డిని శేఖర్ తీవ్రంగా కొట్టి కిందపడిన అతడిని పైకి లేపి బలంగా వెనక్కు విసిరేయడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం మృత దేహాన్ని పక్కనే అరుగుమీద పడుకోపెట్టి శేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తెల్లవారిన తరువాత వెంకటరెడ్డి మృతి వెలుగుచూసింది. మాజీ కార్పొరేటర్ పంచాయితీ కుటుంబ సభ్యులు కేసు పెట్టకుండా ఉండేందుకు వామపక్ష మాజీ కార్పొరేటర్ ఒకరు కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపంలోని తన పార్టీ కార్యాలయంలోనే వెంకటరెడ్డి, శేఖర్ కుటుంబాల సభ్యుల మధ్య పంచాయితీ చేశారు. కేసు పెట్టకుండా ఉంటే రూ.30 వేలు ఇప్పిస్తానంటూ రాజీ చేశారని సమాచారం. అనంతరం వెంకటరెడ్డి మృతదేహాన్ని దహనం చేసేందుకు మంగళవారం హడావుడిగా స్వర్గపురికి తీసుకెళ్లగా మృతుడి వంటిపై గాయాలు ఉండటంతో పోలీసుల రిపోర్టు ఉంటేనే అంత్యక్రియలు చేస్తామని అక్కడి సిబ్బంది స్పష్టంచేశారు. అక్కడి నుంచి వాంబే కాలనీ, కండ్రికలోని శ్మాసనవాటికలకు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో వెంకటరెడ్డి కుమారుడు అప్పలరెడ్డి తన తండ్రి మృతదేహంతో పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
జూడాల ఉద్యమం ఉధృతం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జూనియర్ డాక్టర్లు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వారం రోజులుగా సాధారణ సేవలు జూనియర్ వైద్యులు బహిష్కరించారు. సోమవారం నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. దాదాపు 350 మంది విధులను బహిష్కరించడంలో అన్ని విభాగాల్లో సేవలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో జీజీహెచ్లో వైద్య సేవలు స్తంభించాయి. వార్డుల్లో ఉన్న రోగులకు ఇంజక్షన్ చేసే వారే కరువయ్యారు. స్టైపెండ్ పెంచాలని, టీచింగ్ వైద్యుల ఉద్యోగ విరమణ వయసు పెంచొద్దని, నాన్ మెడికల్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా భర్తీ చేయొద్దని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. జూడాల సేవలే కీలకం బోధనాస్పత్రుల్లో రోగులకు సకాలంలో వైద్యం అందడంలో జూనియర్ డాక్టర్ల సేవలు అత్యంత కీలకం. క్యాజువాలిటీ, లేబర్ వార్డుల్లో విధులు నిర్వహించే హౌస్సర్జన్, పీజీలకు మంచినీళ్లు తాగేందుకు కూడా సమయం ఉండదు. జూడాలు అత్యవసర సేవలు బహిష్కరించిన తొలిరోజే రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓపీల్లోని వైద్య సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఎక్కడ చూసినా రోగులు బారులుతీరి కనిపించారు. ఆస్పత్రి ఓపీ బ్లాక్ బయట బారులు తీరి ఉండటం కనిపించింది. క్యాజువాలిటీలో బెడ్లు రోగులతో నిండిపోయినా వారికి వైద్య సేవలు అందించే వారు కనిపించడం లేదు. నిరంతరం మానిటరింగ్ జూడాల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడకుండా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. ఇద్దరు డీసీఎస్ ఆర్ఎంఓలు ఓపీలు, వార్డులను సందర్శిస్తూ, వైద్య సేవల్లో ఇబ్బందులు తెలుసుకుంటున్నారని, ఇప్పటి వరకూ వైద్య కళాశాల నుంచి నాన్ క్లినికల్ వైద్యులు పది మంది, డీసీహెచ్ఎస్ నుంచి ముగ్గురు వైద్యులు విధులు నిర్వహిస్తున్నా రని వివరించారు. టీచింగ్ వైద్యులు ఆదివారం కూడా సెలవు లేకుండా ఏడు రోజలు పనిచేయాలని నిర్ణయించారని, ప్రతి విభాగానికి నోడల్ అధికారు లను నియమించి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. -
సెప్టెంబర్ 27న శతాధిక వృద్ధుల సన్మానోత్సవం
శోక తప్త హృదయాలతో తండ్రికి అంత్యక్రియలు పామర్రు: తమ తండ్రి అంత్యక్రియలు తామే జరుపుకుంటామని ముందుకొచ్చిన కుమార్తెలు సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పామర్రు గ్రామంలోని అరండాల్ పేటకు చెందిన పలగాని వెంకట నారాయణ(65) గుండె పోటుతో సోమవారం మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి అంత్యక్రియలు జరిపేందుకు కుమారుడు లేకపోవడంతో బంధు మిత్రులు ఆందోళన చెందుతుండగా , ఈ విషయాన్ని గ్రహించిన మృతుడి కుమార్తెలు ముందుకొచ్చి తమ తండ్రి అంత్యక్రియలు తామే నిర్వహించి తమ తండ్రి రుణం తీర్చుకుంటామని ముందుకు రావడం పలువురిని ఆశ్చర్యపర్చింది. మృతుడి ఇద్దరు కుమార్తైలెన లత, ప్రసన్న తండ్రి పాడెను మోశారు. పెద్ద కుమార్తె జ్యోతి దహన సంస్కారాలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించింది. తండ్రి పాడెను పట్టే సందర్భంలో తమ తండ్రిని ఇక చూడలేమని తలచి బాధా తప్త హృదయాలలో నడుస్తూ శ్మశాన వాటికకు వెళ్లడంతో పలువురి కళ్లు చెమ్మగిల్లాయి. స్థానిక హిందూ శ్మశాన వాటిలో అంత్య క్రియలను పూర్తిచేశారు. అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అప్పుల బాధను తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్నగర్ ఎక్సెల్ప్లాంట్ సమీపంలోని అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న చెట్ల పిచ్చేశ్వరరావు(45) అలియాస్ పిచ్చయ్య సత్యనారాయణపురం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎదుట సోడాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి భార్య సత్యవతి, 19 ఏళ్ల కుమార్తె ఉన్నారు. పిచ్చయ్య తనకు బాగా అప్పులు ఉన్నాయని, నేను చనిపోతానని తరచూ ఇంటిలో వారిని బెదిరిస్తూ ఉండేవాడు. అప్పులు ఎక్కువైపోవడంతో గత ఆరు నెలల నుంచి సోడాల షాపు కూడా తీయకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం ఉదయం 6 గంటలకు తనకు చాతిలో గ్యాస్ నొప్పి వచ్చిందని భార్యతో చెప్పి టాబ్లెట్ వేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఇంటి బయట వరండాలో కూర్చొని ఉండగా పిచ్చయ్య ఇంటి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఇంట్లో పని చేసుకుందామని సుమారు ఉదయం 9.00 గంటల సమయంలో సత్యవతి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంటిలో ఫ్యాన్ హుక్కుకు చీరతో ఉరివేసుకొని వేలాడుతూ పిచ్చయ్య కనిపించాడు. దీంతో చుట్టుపక్కల వారి సహాయంతో అతన్ని కిందకు దించి 108 అంబులెన్స్ని పిలవగా వారు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బక్కచిక్కిన పౌష్టికాహారం
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, పంపిణీ చేస్తున్న చిక్కీల పరిస్థితి విరుద్ధంగా ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లెట్స్ చిక్కీల పేరుతో హాస్టల్ విద్యా ర్థులకు ‘న్యూ గుడ్ థింగ్స్ మల్టీ మిల్లెట్ పీనట్ బార్’, పాఠశాలల విద్యార్థులకు ‘ట్రూ గుడ్ పీనట్ మిల్లెట్ చిక్కీ’ అంటూ ప్యాకింగ్ మార్చి పంపిణీ చేస్తున్నారు. గతంతో పోలిస్తే చిక్కీల బరువు, వాటిలో ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు తగ్గిపో యాయి. పాఠశాలలు, హాస్టళ్లలో అందించే పౌష్టికాహారం బక్కచిక్కిపోగా, జూనియర్ కళాశాలల విద్యార్థులకు అసలు చిక్కీలు పంపిణీచేయకపోడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బరువు తగ్గి, పోషకాలు తగ్గి.. గత ప్రభుత్వంలో పాఠశాలలు, క్రీడా శిక్షణ కేంద్రాల్లో 25 గ్రాముల పీనట్ జాగరీ చిక్కీలను పిల్లలకు పంపిణీచేసేవారు. ఆ 25 గ్రాముల చిక్కీలో 4.25 గ్రాముల ప్రోటీన్, 1.54 గ్రాముల ఫైబర్ ఉండేవి. ప్రస్తుతం హాస్టళ్లలో పంపిణీ చేస్తున్న 20 గ్రాముల మిల్లెట్ పీనట్ బార్లో మూడు గ్రాముల ప్రోటీన్, 1.2 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉన్నాయి. గతంలో పంపిణీ చేసిన చిక్కీలతో పోలిస్తే ప్రస్తుత హాస్టల్ విద్యార్థులకు ‘న్యూ గుడ్ థింగ్స్ మల్టీ మిల్లెట్ పీనట్ బార్లో ప్రోటీన్ సుమారు 1.25 గ్రాములు , ఫైబర్ 0.34 గ్రాములు తగ్గింది. అంతేకాకుండా చిక్కి బరువు కూడా 25 గ్రాముల నుంచి 20 గ్రాములకు తగ్గించారు. ప్రస్తుతం పాఠశాలల్లో పంపిణీ చేస్తున్న 25 గ్రాముల ట్రూ గుడ్ పీనట్ మిల్లెట్ చిక్కీలోనూ ప్రోటీన్ పరిమాణం తగ్గింది. గతంలో పంపిణీ చేసిన పీనట్ జాగరీ చిక్కీలో 100 గ్రాములకు 17 గ్రాముల ప్రోటీన్, 6.15 గ్రాముల ఫైబర్ ఉండగా, ప్రస్తుత ట్రూగుడ్ చిక్కీలో 15 గ్రాముల ప్రోటీన్, 6.10 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉన్నాయి. ఒక్కో చిక్కీలో ప్రోటీన్ 4.25 గ్రాముల నుంచి 3.75 గ్రాములకు, ఫైబర్ 1.54 గ్రాముల తగ్గినట్లు ప్యాకెట్లపై ముద్రించిన పోషక విలువలు స్పష్టం చేస్తున్నాయి. పిల్లల ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్ పరిమాణాన్ని పెంచాల్సిన సమయంలో తగ్గించడం ఆందోళన కలిగించే అంశమని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. పోషకాలు కీలకం పిల్లల ఎదుగుదలలో ప్రోటీన్ అత్యంత కీలకమైన పోషక పదార్థం. ఇది కండరాల అభివృద్ధి, ఎముకల పెరుగుదల, రోగని రోధక శక్తి పెంపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. చిక్కీల్లో ప్రోటీన్, ఫైబర్ తగ్గితే దీర్ఘకాలంలో పిల్లలకు అందే మొత్తం పోషక విలువ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పాఠశాలల్లో అందించే ఆహారం పిల్లల రోజువారీ పోషక అవసరాలను తీర్చేలా ఉండాలి. తరుచూ ఆహా రంలో నాణ్యత, పోషక విలువలను ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైతే ప్రోటీన్, ఫైబర్ పరిమాణాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని పౌష్టికాహారం నిపుణులు సూచిస్తున్నారు. hÌêÏÌZÏ C …-r-È-ÃyìlÄñæ$-sŒææ ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ yöM>P ïÜ-™èlÐ]l$à Ð]l$«§éÅçßæ² ¿Z-f¯]l ç³£ýlMýS…ÌZ ¿êVýS-…V> Æøþ _MîSP A…¨-…^éÍÞ E…¨. AƇ$$™ól MýSâê-Ô>-ÌSË$ {´ëÆý‡…--¿ýæOÐðl$ Ð]lÊyýl$ ¯ðlÌSË$ VýSyìl-_¯é _MîSPË$ ç³…-í³×îæ ^ólíܯ]l §éQ-ÌêË$ ÌôæÐ]l#. Csîæ-Ð]lÌS °Æý‡Ó-íßæ…-_¯]l õ³Æð‡…sŒæÞ & sîæ^èlÆŠ‡Þ çÜÐ]l*-ÐólÔèæ… Æøk Ð]l*{™èl… A«¨M>-Æý‡$Ë$ çßæyéÐ]l#-yìlV> JMýS ÆøkMýS$ çÜÇ-ç³yé _MîSP-ÌS¯]l$ ç³…-í³×îæ ^ólíÜ-¯]lr$Ï Ñ§éÅ-Æý‡$¦Ë$ ^ðlº$™èl$-¯é²Æý‡$. hÌêÏÌZ G°Ñ$¨ {糿¶æ$™èlÓ þ°-Ķæ$-ÆŠ‡ MýSâê-Ô>-ÌSÌZÏ 2,369 Ð]l$…-¨, Ð]l$Æø Ð]lÊyýl$ GƇ$$-yðlyŠæ MýSâê-Ô>-ÌSÌZÏ 219 Ð]l$…¨ ѧéÅ-Æý‡$¦Ë$ ^èl§ýl$Ð]l#-™èl$-¯é²Æý‡$. D M>Ìôæ-iÌZÏ _MîSPË$ ç³…í³×îæ ^ólĶæ$yýl…Ìôæ§ýl$. AƇ¬™ól ç³…í³×îæ ^ólíÜ-¯]lr$Ï ¯]lÐðl*§ýl$ ^ólĶæ*ÌS¯]l² Ð]l†¢â¶æ$Ï E¯é²Ä¶æ$¯]l² BÆøç³-׿Ë$ ѯ]l-í³-çÜ$¢-¯é²Æ‡$$. -
పురపోరుకు సన్నద్ధం
సాక్షి, విజయవాడ: పురపోరుకు సన్నద్ధాలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలో ఉండగానే కార్పొరేషన్లతో పాటు మునిసిపాలిటీల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతో పాటు తొమ్మిది మునిసిపాలిటీలు ఉన్నాయి. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో డివిజన్లు, వార్డులు పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతోపాటు జగ్గయ్యపేట, పెడన మునిసిపాలిటీలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్లో ఉండటంతో డివిజన్లు, వార్డుల పెంపు వాయిదా పడింది. గుడివాడ మునిసిపాలిటీలో ఐదు గ్రామాలను విలీనం చేసి, వార్డులను 36 నుంచి 41 లేదా 42 వార్డులుగా చేయాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన చేయగా అప్పడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించడంతో గతంలోనే మునిసిపల్ ఎన్నికలు జరగలేదు. పలు గ్రామాలను విలీనం చేసి 38 వార్డులతో తాడిగడపను మునిసిపాలిటీగా ఏర్పాటు చేయగా, దానిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు జరగలేదు. ఆ కోర్టు కేసు తేలేవరకు ఎన్నికలు జరిగే అవకాశం లేదని సమాచారం. కోర్టు కేసులు పరిష్కారమైతే విజయవాడలో డివిజన్ల సంఖ్య 64 నుంచి 86కు, మచిలీపట్నంలో 50 నుంచి 60కి చేరుతుంది. విజయవాడలో డివిజన్ల పెంపుపై అభ్యంతరాలు తెలుపుతూ మాజీ కార్పొరేటర్ కోర్టులో కేసు వేశారు. మచిలీపట్నంలో డివిజన్లను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీఓలో సరిహద్దులు కూడా సూచించింది. అయితే మునిసిపల్ అధికారులు రాజకీయ ప్రోద్బలంతో అధికార పార్టీకి అనుకూలంగా సరిహద్దులు నిర్ణయించారు. దీనిపై మాజీ కార్పొరేటర్లు కొందరు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి పెండింగ్లో ఉన్న ఈ కేసు మంగళవారం విచారణకు రానుంది. కేసు పరిష్కారమయితే డివిజన్లు పెరుగుతాయి. మరోవైపు వార్డుల పెంపుతో మునిసిపాలిటీల్లో ఆశావహులు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే నెల మూడో తేదీలోగా ముసాయిదా తుది జాబితా ప్రకటించనున్నారు. అంటే 16 రోజులు మాత్రమే గడువు ఉంది. ఎన్నికల కమిషన్ నుంచి కూడా స్థానిక, కార్పొరేషన్, మునిసిపల్ అధికారులకు ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ఉత్తర్వులు అందాయి. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది. మేయర్, చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునే యోచన కార్పొరేషన్లతో పాటు మునిసిపాలిటీల్లో ఇంత వరకు కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లు కలిసి మేయర్ లేదా మునిసిపల్ చైర్మన్లను ఎన్నుకునేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి మేయర్, చైర్మన్ను ఓటర్ల ద్వారానే ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశ పెట్టాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మునిసిపల్ చట్ట సవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టారు. 2005 ముందు వరకు ఈ ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి ఉంది. 2005లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మేయర్/మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకునే పద్ధతి అమల్లోకి వచ్చింది. మరోవైపు 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఇప్పుడు జాబితా రూపొందనుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు లేనట్టే ! గత ఎన్నికల సమయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు రెండేళ్లు దాని గురించి పట్టించుకోలేదు. బీసీల నుంచి పదే పదే 34 శాతం డిమాండ్ రావ డంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఆ కమిటీ కూడా రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలనే సుప్రీంకోర్టు నిబంధనను ఉటంకిస్తూ 34 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని చెప్పకనే చెప్పింది. ఒక వేళ 34 శాతం రిజర్వేషన్ చేస్తే 55 శాతం అవుతుంది. అప్పుడు ప్రత్యేకంగా చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు పెచడం ఇష్టం లేకనే డెడికేటెడ్ కమిషన్తో 34 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని చంద్రబాబు చెప్పించారనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు ఎప్పటిలాగే బీసీలను వాడుకుని వదిలేస్తారనే నిజం మరోసారి సుస్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
విజయవాడను గ్రేటర్ నగరంగా ప్రకటించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడను తక్షణమే గ్రేటర్ నగరంగా ప్రకటించాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్కు పీజీఆర్ఎస్లో సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గ్రేటర్పై స్పష్టత ఇవ్వా లని కోరారు. మునిసిపల్ శాఖ మంత్రి ప్రక టన చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడను గ్రేటర్గా ప్రకటించకపోతే తీరని నష్టం జరుగుతుందన్నారు. అన్ని రంగాల్లో ప్రాము ఖ్యత కలిగిన ఈ నగర పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్లో విజయవాడ కీలకంగా ఉందన్నారు. మంత్రి నారాయణ, ఎంపీ కేశి నేని చిన్ని స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలు, మాజీ కార్పొరేటర్లతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ కార్పొరేటర్లు ఆవాల మారుతి, సైకం సాయిబాబా, వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షుడు వడ్లని శ్యామ్, పైడిపాటి రమేష్, అడ్డూరి తమ్మారావు, షేక్ షాహీనా ఉన్నారు. 134 మంది సర్టిఫికెట్ల పరిశీలన మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఏపీఈఏపీసెట్ (బైపీసీ స్ట్రీమ్) స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం ప్రారంభమైంది. ఎన్సీసీ–60, సీఏపీ–50, దివ్యాంగులు–9, స్కౌట్స్ అండ్ గైడ్స్–3 స్పోర్ట్స్ అండ్ గేమ్స్–12 మంది మొత్తం 134 మంది సర్టిపికెట్లను పరిశీలించామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. మంగళవారం ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ–35001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఆంగ్లో ఇండియన్స్–1 నుంచి చివర ర్యాంకు వరకు, స్కౌట్ అండ్ గైడ్స్ 30001 నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రజలు సైబర్ నేరాలపై అప్రత్తంగా ఉండాలని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేటర్ ఆధ్వర్యంలో టాస్క్ ఆధారిత సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిల్లో మొదటి ప్రత్యేక కార్యక్రాలు నిర్వహించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. జి.కొండూరు మండలం గంగినేని గ్రామంలో పల్లె నిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రామ చంద్రరావు మాట్లాడుతూ.. పోలీస్ కమిషనరేట్లో సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా చేసుకుని వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డిజిటల్ యుగంలో సులభంగా డబ్బు సంపాదించొచ్చంటూ సైబర్ నేరస్తులు ప్రజలకు ఆశ చూపి మోసగిస్తారని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగర పాలక సంస్థలో పలు అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు గత వారం రోజులుగా చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. తమకు రావాల్సిన రూ.400 కోట్ల విలువైన బిల్లులు వెంటనే చెల్లించాలని వారు ఆందోళన చేస్తు న్నారు. అందులో భాగంగా సోమవారం ముఖానికి మాస్కులు ధరించి మౌనంగా అధికారులను, సిబ్బందిని కలిసి ప్లకార్డుల ద్వారా తమ గోడును వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాయన ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ సర్టిఫికెట్లతో పోస్టులకు దరఖాస్తులు
మచిలీపట్నంఅర్బన్: వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో కొందరు నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విజువల్లీ చాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె. ఫణికుమార్రెడ్డి ఆరోపించారు. సోమవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో వికలాంగులు వచ్చి ఇన్చార్జి కలెక్టర్ ఎం.నవీన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఫణికుమార్రెడ్డి మాట్లాడుతూ.. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి మార్చిలో నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. ఇటీవల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసి, 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను వికలాంగత్వ ధ్రువీకరణ కోసం మెడికల్ బోర్డుకు పంపించారని చెప్పారు. చాలామంది అభ్యర్థుల వికలాంగత్వాన్ని మెడికల్ బోర్డు ధ్రువీకరించి నివేదికలు అందజేసిందన్నారు. అయితే క్లాప్–4 ఉద్యోగాల భర్తీలో కొందరు నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఉదాహరణగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ అంధ అభ్యర్థి విజయవాడలోని కొన్ని పాఠశాలల పేరుతో నకిలీ విద్యార్హత ధ్రువ పత్రాలు పొందినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. విద్యార్హతలను పూర్తిగా ధ్రువీకరించాలి.. అభ్యర్థుల విద్యార్హత ధ్రువపత్రాలను డీఈఓ ఆధ్వర్యంలో 1:3 నిష్పత్తిలో సంబంధిత ఎంఈఓల ద్వారా ఆయా పాఠశాలలకు పంపించి, సర్టిఫికెట్లు నిజమైనవేనని నిర్ధారించిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. విజువల్లీ చాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఫణికుమార్రెడ్డి ఆరోపణ -
రిక్షా కార్మికుడి అనుమానాస్పద మృతి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రిక్షా కార్మికుడు కెనాల్రోడ్డులో మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వన్టౌన్ ప్రాంతంలో రిక్షా తొక్కుతూ జీవించే వ్యక్తి కెనాల్రోడ్డులో అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారమందించారు. దానిపై పోలీసులు అక్కడకు చేరుకొని ఆ వ్యక్తిని పరిశీలించగా మృతి చెందినట్లుగా గుర్తించారు. స్థానికులు అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పేర్కొన్నారు. అతని వయస్సు సుమారుగా 60ఏళ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. సిమెంట్ కలర్ ప్యాంట్, తెలుపు రంగు టీ షర్టు వేసి వేసుకొని ఉన్నట్లుగా గుర్తించారు. ఇతర గుర్తింపు ఏమీ లేకపోవటంతో గుర్తుతెలియని మృతదేహంగా, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయాల్లో ఆభరణాలే టార్గెట్
● వరుస చోరీలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ గూడూరు: మండలం మల్లవోలు శివారు కుమ్మరిపాలెంలోని భక్తాంజనేయ ఆలయంలో స్వామి వారి వెండి ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జూలై 28న రాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడిన దొంగలు గర్భగుడి తాళాలు పగలగొట్టి స్వామి వారికి చెందిన దాదాపు 3.5కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకుని పోయారు. చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పట్టుకున్న పోలీసులు సోమవారం గూడూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. డీఎస్పీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలికి వెదురుపర్తి దుర్గేష్, దుడ్డు జోష్ బాబు గుడిలో చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. వీరి నుంచి దొంగలించిన సొత్తుతో పాటుగా ద్విచక్రవాహనం, 2సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గతంలో గుంటూరు జిల్లా పరిధిలోని ఆలయాలలో వీరు పలు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. కారంచేడు, అమృతలూరు, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో వీరి పాత్ర ఉన్నట్లు నిర్ధారించినట్లు డీఎస్పీ తెలిపారు. ఆయా స్టేషన్ హౌస్ అధికారులకు వీరు పట్టుబడిన సమాచారం ఇచ్చామని ఆయన చెప్పారు. ముద్దాయిలను మచిలీపట్నం స్పెషల్ మొబైల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్, గూడూరు ఎస్ఐ చల్లపల్లి దివ్య ప్రకాష్, పోలీస్ బృందాన్ని ఆయన అభినందించారు. ధ్వజ స్తంభానికి తొడుగు వేయడానికి వచ్చి.. మల్లవోలులోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ఽఏర్పాటు చేసిన ధ్వజ స్తంబానికి ఇత్తడి తొడుగు వేయడానికి తెనాలి నుంచి కొంతమంది వచ్చారు. వీరిలో వెదురుపర్తి దుర్గేష్ (30) అనే వ్యక్తి కూడా ఉన్నాడు. పని జరుగుతుండగా ఆలయంలో స్వామి వారికి ఉన్న వెండి ఆభరణాలపై అతని కన్ను పడింది. దీంతో తన ప్రాంతానికి చెందిన దుడ్డు జోష్బాబుతో కలసి పథకం రచించాడు. 28వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ గుడిలోకి ప్రవేశించి స్వామి వారికి అలంకరించిన వెండి మకరతోరణం, వెండి కిరీటం, వెండి వక్షస్థలం, వెండి శఠగోపం, వెండి ప్లేట్తో పాటుగా ఆంజనేయస్వామి ఉత్సవ వెండి విగ్రహాలను తీసుకుని పరారయ్యారు. ప్రత్యేక బృందాలతో.. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు కేసు దర్యాప్తుకు పెడన సీఐ కె.నాగేంద్ర ప్రసాద్, గూడూరు ఎస్ఐ చల్లపల్లి దివ్యప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలానికి పోలీసు జాగిలాలు, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలాలు గుడి నుంచి ఎండకుదురు రోడ్డు వైపునకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో ఆ కోణంలో ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించిన గూడూరు ఎస్ఐ చల్లపల్లి దివ్యప్రకాష్ సీసీ కెమెరాల ఫుటేజీతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు. -
తీరం తరుక్కుపోతోంది!
హంసలదీవి సాగరతీరంలో ప్రమాద ఘంటికలు ● అలల ధాటికి 15 అడుగుల మేర కొట్టుకుపోయిన రహదారి ● మూడు కిలోమీటర్ల మేర భారీగా కోతకు గురైన ఇసుక తిన్నెలు ● కృష్ణమ్మ, నవగ్ర హ విగ్రహాల చుట్టూ తొలగిపోతున్న ఇసుక ముందుకొస్తున్న సముద్రం.. కూలిన పందిళ్లు.. ప్రమాదంలో విగ్రహాలు.. -
ఈత పోటీల్లో పేట స్విమ్మర్లకు పతకాల పంట
జగ్గయ్యపేటఅర్బన్: విజయవాడలోని ప్లోటర్స్ స్పోర్ట్స్ క్లబ్ స్విమ్మింగ్ ఫూల్లో ఈ నెల 16వ తేదీన బెజవాడ స్పోర్ట్స్ క్లబ్ ఆయా విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో జగ్గయ్యపేటకు చెందిన డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ నుంచి మొత్తం 21 మంది స్విమ్మర్లు 27 పతకాలు సాధించారు. డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ నుంచి కోచ్ పొట్టాబత్తిన సందీప్ ఆధ్వర్యంలో సిమ్మర్లు నాన్ మెడలిస్ట్ ఆరేళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయస్సుల వారీగా ప్రీస్టయిల్ 25, 50మీటర్లు, బ్యాక్స్టోన్ 25 మీటర్ల ఈత పోటీల్లో సిమ్మర్లు పాల్గొని విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో సిమ్మర్లు మొత్తం ఏడు బంగారు, ఆరు రజతం, 14 కాంస్య పతకాలు సాధించినట్లు టీం మేనేజర్ అన్నంనీడి కల్యాణ్ సోమవారం తెలిపారు. డాక్టర్ సామి నేని దీపక్, డాక్టర్ ఆళ్ల హరీష్(రెండు పతకాలు), సామినేని కీర్తిక, వేపన్జేరి ప్రణీత, గంజినబోయిన అభిమన్యు, కాసరెల్లి అశ్విన్ బంగారు పతకాలు సాధించగా, గజేంద్రన్ సంజనాదేవిశ్రీ, వర్తినేని చేతన్ శ్రీసాయి, మేక పూజన్సాయి, పోతురాజు జీవన్సాయి, జుత్తు మహిధర్, ఉపొత్తుల కార్తీక్ రజత పతకాలు సాధించారు. డాక్టర్ సామినేని దీపక్, సామి నేని కీర్తిక, అక్కిమళ్ల యశ్విక ఆనంది, వేపన్జేరి ప్రణీత, వేపన్జేరి హేమాన్షి అడ్డగొట్టం అర్షి, ఆళ్ల దన్వి, గంజినబోయిన అభిమన్యు, కాసరెల్లి అశ్విన్, సోమి శెట్టి మోక్ష నివాస్, ఈడ నిఖిల్ త్రిలోక్రాజ్, గజేంద్రన్ జైకార్తీక్, దార్ల శ్యామ్ విహాన్, అక్కిమళ్లతన్వీష్ క్యాంస పతకాలు సాధించారు. విజేతలకు స్విమ్మింగ్ అసోసియేషన్ ఫౌండర్, కోచ్ దంపతులు పొట్టాబత్తిన పాండురంగారావు, లక్ష్మి, అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావు, డాక్టర్ దీపక్కుమార్, కార్యదర్శి కలాలి నరేష్ అభినందనలు తెలిపారు. -
త్వరితగతిన సమస్య పరిష్కరించేందుకు కృషి
కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో అందిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం)లో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. ఫిర్యాదుదారులతో సావదానంగా మాట్లాడి వారి సమస్యలను ఆలకించారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన.. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 55 అర్జీలు అందినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● గుడివాడ నుంచి జ్యోతి అనే వివాహిత వచ్చి తనకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగినట్లు చెప్పింది. అప్పటి నుంచి తన భర్త అదనపు కట్నం కోసం తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడంటూ వాపోయారు. తనకు న్యాయం చేయాలని అర్జీ ఇచ్చారు. ● తోట్లవల్లూరుకు చెందిన ప్రసన్న అనే బాఽధితురాలు ఎస్పీని కలిసి తన భర్త అనారోగ్యంతో మరణించినట్లు తెలిపారు. భర్త చనిపోయిన నాటి నుంచి అత్తింటివారు, ఆడపడుచు ఇంటి నుంచి బలవంతంగా బయటికి పంపించాలని చూస్తున్నారని, న్యాయం చేయమని అర్జీలో పేర్కొన్నారు. ● చల్లపల్లి నుంచి రాములు అనే వృద్ధుడు.. తనకు 82 సంవత్సరాలని తన ఇద్దరు కుమారులు తనని చూడకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యాయం చేయాలని అర్జీ ఇచ్చారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
సంతృప్తికర పరిష్కారం చూపండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో స్వీకరిస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి ప్రజలకు సంతృప్తినివ్వాలని కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. డీఆర్వో శ్రీధర్రెడ్డి, కేఆర్ఆర్సీ ఎస్డీసీ నీలకంఠేశ్వరరెడ్డి, దిశ స్టేషన్ సీఐ వెంకటేశ్వరరావుతో కలిసి ఇన్చార్జి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతోందన్నారు. అయితే వివిధ శాఖల పరిధిలో ఇంకా పెండింగ్ అర్జీలు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులో కలెక్టర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలో పెండింగ్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. గడువు దాటిన అర్జీలపై రోజూ ఉదయం సమీక్ష నిర్వహించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం సాధ్యం కాకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు స్పష్టంగా వివరించి, వారి అభిప్రాయాన్ని నమోదు చేసిన అనంతరం నిబంధనల ప్రకారం అర్జీని మూసివేయాలని సూచించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో ఎంకై ్వరీ రిపోర్టులు, యాక్షన్ టేకెన్ రిపోర్టులు తదితర ఆధారాలను అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 129 అర్జీలను స్వీకరించారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. -
అదుపు తప్పి.. కారు బీభత్సం
పటమట(విజయవాడతూర్పు): పటమటలో అదుపుతప్పిన ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. ఆదివారం అత్యంత రద్దీగా ఉండే రైతుబజారువద్ద తెలంగాణ రిజి స్ట్రేషన్ కలిగిన టీఎస్ 07ఎఫ్కే 6469 కారు పటమట పంటకాల్వ రోడ్డు నుంచి హైస్కూల్ రోడ్డు మీదుగా బందరురోడ్డు వైపు వెళ్తోంది. ఆ సమయంలో అదుపుతప్పి వరుసగా మూడు బైక్లు, ఒక గుడ్ల వ్యాన్ను ఢీకొట్టింది. అనంతరం డివైడర్పైకి దూసుకెళ్లి అక్కడే ఆగి పోయింది. ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బ్రేక్ వేయాల్సిన సమయంలో పొరపాటున యాక్సిలేటర్ తొక్కడంతో కారు అదుపుతప్పినట్లు స్థానికులు తెలిపారు. ఆ ప్రాంతవాసుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పటమట పోలీసులు కారు నడిపిన డ్రైవర్ గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి కేసరి విజయ్ (50)గా గుర్తించారు. బాధితులు పెదపులిపాక శ్రీనగర్కాలనీకి చెందిన మరీదు రామకృష్ణ, యనమలకుదురుకు చెందిన పంచకర్ల నాగబాబు ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. దుర్గాఘాట్లో గుర్తుతెలియని మృతదేహం వన్టౌన్(విజయవాడపశ్చిమ): దుర్గాఘాట్ వద్ద కృష్ణానదిలో మృతదేహం కొట్టుకువచ్చిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దుర్గాఘాట్లోని నీటిలో ఒక వ్యక్తి మృతదేహాన్ని అక్కడ పని చేసే సిబ్బంది గుర్తించారు. దానిపై వన్టౌన్ పోలీసులకు సమాచారమందించారు. వారు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, అతని చేతిపై శ్రీరామ్ అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద ఎటువంటి గుర్తింపు లభించలేదు. మృతుడు నదిలో మునిగి మరణించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీనిపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిపై కేసు గన్నవరం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటనపై గన్నవరం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చిన్ననందిగామకు చెందిన ఇ.కృష్ణ(25) రెండు రోజుల క్రితం దావాజీగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వారి దగ్గర అతను డబ్బులు తీసుకుని స్వగ్రామానికి వెళ్తున్నట్లుగా చెప్పాడు. తీరా ఆ డబ్బుతో మద్యం సేవించిన కృష్ణ గ్రామ శివారులోని బూతుమిల్లిపాడు వెళ్లే రోడ్డు మలుపులో తుమ్మ చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ శ్రీధర్ నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. -
గంజాయి మత్తులో టీడీపీ చోటా నేత హల్చల్
సాక్షి టాస్క్ఫోర్స్: స్వాతంత్య్రం దినోత్సవం రోజున ఓ ప్రభుత్వ శాఖ కార్యాలయ ఆవరణలో కూర్చున్న వారిపై తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. గంజాయి మత్తులో టీడీపీ చోటా నేత దుర్భాషలాడుతూ సాక్షాత్తు విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో నిలిపిన ద్విచక్రవాహనాన్ని తగులబెట్టాడు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన ఎన్.పూర్ణచంద్రరావు వైఎస్సార్ సీపీ కార్యకర్త. ఆయనతోపాటు మరో వ్యక్తి కలిసి ఇంటిపక్కనే ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద శనివారం కూర్చున్నారు. గ్రామంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో క్లర్క్గా పనిచేస్తున్న టీడీపీ చోటా నేత గుత్తా శరత్చంద్ర అదే సమయంలో సబ్స్టేషన్కు వెళ్లాడు. గంజాయి, మద్యం మత్తులో ఉన్న అతడు ‘నా కొ..ల్లారా.. కరెంట్ ఆఫీస్కు ఎందుకు వచ్చారురా.. నీ అ.. ఇది మా అడ్డా...’ అంటూ తిట్ల పురాణానికి తెగబడి అక్కడే ఉన్న పూర్ణచంద్రరావు ద్విచక్ర వాహనంపై పెట్రోలు పోసి తగలబెట్టాడు. ఘటనపై పూర్ణచంద్రరావు కంచికచర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పి.విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీచ్లో గల్లంతైన మత్స్యకారుడు మృతి
కోనేరుసెంటర్: మంగినపూడి బీచ్లో శనివారం గల్లంతైన మత్స్యకారుడు పల్లేటి రాజు (25) మరణించాడు. అతని మృతదేహాన్ని అదే ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఆదివారం ఉదయం సముద్రంలో గుర్తించారు. శనివారం తెల్లవారుజామున చేపలవేటకు వెళ్లిన రాజు అలల ఉధృతికి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిన విషయం విదితమే. శనివారం నుంచి బందరు రూరల్, మైరెన్, కోస్టుగార్డు సిబ్బంది రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన తోటి మత్స్యకారులు, బంధువుల బోట్లలో సముద్రంలో వెతుకుతుండగా ఐదు నాటికన్ మైళ్ల దూరంలో రాజు మృతదేహాన్ని గుర్తించారు. సముద్రంలో తేలి కనబడుతున్న రాజు మృతదేహాన్ని బోటులో ఒడ్డుకు చేర్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన బందరు రూరల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఇది తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి పోస్టుమార్టంకు అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేయించేలా చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించి పార్టీ అండగా ఉంటుందనిఽ ధైర్యం చెప్పారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు రూరల్ ఎస్సై రమేష్ తెలిపారు. ఘటనతో హెచ్ సత్తెనపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పేర్ని కిట్టు -
రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు స్వాహా!
గంపలగూడెం: గంపలగూడెం మండలం తోటమూలలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నేతలు స్వాహా చేశారని వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆరోపించారు. ఈ భూములను ఆదివారం స్వామిదాసు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దీర్ఘకాలంగా పేదలు వినియోగిస్తున్న ప్రభుత్వ భూములను జీవో నంబర్ 30 కింద రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా, దీన్ని అడ్డు పెట్టుకుని రెవిన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్వామిదాసు పేర్కొన్నారు. ఈ విధానాన్ని తప్పుదారి పట్టించిన అధికార పార్టీ నేతలతో పాటు కలెక్టర్, తిరువూరు రెవిన్యూ డివిజనల్ అధికారి, గంపలగూడెం తహసీల్దార్లపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని స్వామిదాసు డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్లో గజం రూ.5,800 విలువైన భూమిని రూ.1600కే రిజిస్ట్రేషన్ చేయడం, అధికార పార్టీ భూదందాపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు సిద్ధమని స్వామిదాసు హెచ్చరించారు. ఉన్నతాధికారులు స్పందించాలిసెంటు భూమి విలువ రూ.50 లక్షలకు పైగా ఉన్న తోటమూలలోని 62–1, 62–3, 62–4 సర్వే నంబర్లలో 23 సెంట్లకు జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బూరుగు అంజలి 193.6 గజాలు, బోడపాటి బుజ్జి 242, వలపనబోయిన సీతామహాలక్ష్మి 242, బోడపాటి భద్రాచలం 242, షేక్ మస్తాన్వలి 193 గజాల చొప్పున మొత్తం సుమారు 23 సెంట్లు భూమి రిజిస్ట్రేషన్ అయిందని తెలిపారు. ఈ ఏడాది జూన్ 9న తిరువూరు సబ్రిజిస్ట్రారు కార్యాలయంలో 5 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, జీవో లోని క్లాజ్ 4/8లో విలువైన భూమిని క్రమబద్ధీకరించవద్దని పేర్కొన్నా అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలని స్వామిదాసు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గంపలగూడెం మండల అధ్యక్షుడు కావూరి వినయ్ కుమార్, రాష్ట్ర పార్టీ నేత మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, పెదకొమెర గ్రామ పార్టీ అధ్యక్షుడు కోట లక్ష్మీనారాయణ, జిల్లా నేతలు మందపాటి ఉమామహేశ్వరరెడ్డి, మండల వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆలపాటి ఉమామహేశ్వరరావు, నేతలు నల్లగట్ల సుధారాణి, కొత్తగుండ్ల నరసింహారావు, అనుమోలు కృష్ణారావు, యరమల రామిరెడ్డి, వంగల వైకుంఠం, కోటదాసు, యరమల రామచంద్రారెడ్డి, అత్తునూరు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ తిరువూరు ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆరోపణ -
అన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దుర్గమ్మ నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు సమర్పించారు. విజయవాడ కృష్ణలంక మెట్ల బజార్కు చెందిన పి. రామయ్య, లావణ్య కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన డీవీఎస్ సాయిరాం కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అప్పన్న అన్నప్రసాదానికి.. సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి పామర్రుకు చెందిన యడ్ల మహేష్కుమార్ రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. చెక్కును దేవస్థానం ఈవో వెంకటరావుకు అందించారు. తిరుపతమ్మ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారంపెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ ఆలయ కమిటీ నూతన చైర్మన్గా చుంచు రమేష్బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ మండపంలో ఆదివారం ఆలయ ఈఓ జీవీడీఎన్ లీలాకుమార్ ఆధ్వర్యాన చైర్మన్తో పాటు సభ్యులుగా కల్లూరి శ్రీవాణి, పాకాలపాటి అనసూయ, పోలుపొంగు జ్యోత్స్న ప్రియాంక, గుగులోతు రమేష్, ఓర్సు సూరమ్మ, కర్నాటి కవిత, తన్నీరు గోపీనాథ్, సూరపనేని అప్పారావు, కాకులపాటి విజయలక్ష్మి, శనగవరపు వెంకటేశ్వరరావు(శాస్త్రి), కొలిపాక హైమావతి, మర్రెబోయిన తిరుపతిరావు(ఆలయ అర్చకుడు, ఎక్స్ అఫీషియో సభ్యుడు)తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అధికారులతో పాటు పలువురు నూతన పాలకవర్గానికి శాలువాలు కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, ప్రధానార్చకుడు మర్రెబోయిన గోపిబాబు, మాజీ చైర్మన్లు వాసిరెడ్డి బెనర్జి, కర్ల వెంకటనారాయణ, అత్తలూరి అచ్యుతరావు, లగడపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహిళ బలవన్మరణం బంటుమిల్లి: మండలంలోని మల్లేశ్వరం గ్రామానికి చెందిన శొంఠి నాగమణి (24) ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కిందకు దించగా అప్పటికే మృతి చెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం గ్రామం నుంచి నాగమణి తల్లిదండ్రులు కోసం ఎదురుచూస్తున్నారు. ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
విజన్కు సిబ్బంది కరువు!
పెడన: నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజన్–2048 కార్యాలయం సిబ్బంది కొరతతో కునారిల్లుతోంది. పెడన నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఆఫీసులో ఆరుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సిబ్బందిని భర్తీ చేయడంలో ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగురితో ప్రారంభం.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2025 జూలైలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విజన్–2048 కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పెడన ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆరుగురు సిబ్బందిని నియమించారు. యంగ్ ప్రొఫిషనల్ను నేరుగా ఎంపిక చేయగా.. మిగిలిన ఐదు పోస్టులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఆసక్తిగల సిబ్బంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హత, నైపుణ్యం ఆధారంగా ముగ్గురిని సర్వే శాఖ నుంచి, ఒకరిని మహిళా పోలీస్ విభాగం నుంచి, మరొకరిని పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఎంపిక చేశారు. మూడు నెలలుగా ఖాళీలు ప్రారంభంలో యంగ్ ప్రొఫిషనల్తో పాటు నలుగురు విజన్ సిబ్బంది విధులు నిర్వహించారు. సర్వే శాఖకు చెందిన ముగ్గురిని రీసర్వే పనుల కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో తిరిగి వారి మాతృశాఖకు పంపించారు. మహిళా పోలీసు విభాగానికి చెందిన సిబ్బంది ఏఎస్వో పోస్టుకు ఎంపిక కావడంతో ఆమె కూడా విధుల నుంచి తప్పుకున్నారు. అయితే ఆమె అప్పటికే ప్రసూతి సెలవులో ఉన్నట్లు సమాచారం. మరో పోస్టుకు ఎంపికైన సిబ్బంది అసలు విధుల్లో చేరకపోవడంతో కార్యాలయం సిబ్బంది కొరతలో చిక్కుకుంది. అమలు అంతంతే! నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న ఆదాయ వనరులను గుర్తించడం, వాటి ద్వారా అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించడం, దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పీ4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడటం వంటి అంశాలపై విజన్–2048 కార్యాలయం పనిచేయాల్సి ఉంది. అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదికలు అందించాల్సి ఉంటుంది. అయితే అవసరమైన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఈ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెడన నియోజకవర్గానికి విజన్–2048 ప్రత్యేక అధికారిగా జడ్పీ సీఈవోను నియమించినప్పటికీ.. కార్యాలయంలో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే సిబ్బందిని కేటాయిస్తామని వారు తెలిపారు. ప్రస్తుతం ఒక్కడినే విధులు నిర్వహిస్తూ.. అడిగిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తున్నాను. పెడన నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేయడమే విజన్–2048 కార్యాలయం ప్రధాన ఉద్దేశం. –ఎస్.హరినాథ్బాబు, యంగ్ ప్రొఫిషనల్, విజన్ -
అత్యవసర సేవలూ బహిష్కరిస్తాం : జూడాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జూనియర్ వైద్యులు శనివారం తమ నిరసనను శాంతియుతంగా నిర్వహించారు. తొలుత జీజీహెచ్, వైద్య కళాశాలల్లో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో జూడాలు పాల్గొన్నారు. అనంతరం రిలే దీక్షా శిబిరానికి చేరుకుని శాంతియుతంగా దీక్షలు చేపట్టారు. తమ స్టైపెండ్ పెంచడంతో పాటు, మరిన్ని సమస్యల పరిష్కారం కోరుతూ ఆరు రోజులుగా జూడాలు సాధారణ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జూడాలు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజు కూడా కొనసాగాయి. ప్రభుత్వం శనివారం సాయంత్రం 5 గంటల లోపు తమ సమస్యలు పరిష్కరించాలని జూడాలు అల్టిమేటం జారీ చేశారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్చలకు పిలవలేదు. దీంతో జూడాలు సోమవారం నుంచి అత్యవసర సేవలు సైతం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే జీజీహెచ్ సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్స్కు నోటీసులు అందజేశారు. -
ఈ కలప మాకొద్దు..!
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): పర్యావరణ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అటవీశాఖ అఽధికారులు కొండపల్లి బొమ్మల కాలనీలో ఉడ్బ్యాంక్ను శనివారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా బొమ్మల తయారీ కళాకారులకు ఉడ్ బ్యాంకుల ఏర్పాటులో భాగంగా కొండపల్లిలో సైతం ఉడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ ఉడ్ బ్యాంక్ ద్వారా బొమ్మల తయారీలో ఉపయోగించే తెల్లపొనికి కలప పంపిణీ చేయాల్సి ఉంది. ప్రారంభోత్సవం అనంతరం ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ఉడ్ బ్యాంక్లో తెల్లపొనికి కలపకు బదులు బూరుగు, పనస, నల్లమద్ది కలప నిల్వ ఉండటంతో బొమ్మల తయారీ కళాకారులు తెల్లముఖం వేయాల్సి వచ్చింది. దీంతో అటవీ శాఖ అఽధికారులతో కళాకారులు మాటల యుద్ధానికి దిగారు. ఈ కలప బొమ్మల తయారీకి పనికి రావని తేల్చి చెప్పారు. ఎందుకూ పనికి రాని కలప తీసుకుని మేము ఏం చేసుకోవాలని నిలదీశారు. బొమ్మల తయారీకి తేలికపాటిగా ఉండే తెల్లపొనికి కలప కావాలని పట్టుబట్టారు. వివిధ జాతులకు చెందిన ఈ కలప తీసుకుని తాము ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. కళాకారులు ఎదురు తిరగడంతో ఫారెస్ట్ రేంజ్ అఽధికారి శ్రీనివాసరెడ్డి బొమ్మల తయారీ కళాకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. శాంతించిన కళాకారులు బూరుగ, పనస, నల్లమద్ది కలప మాకు వద్దని, తెల్లపొనికి చెక్క అందిస్తే చాలని బొమ్మల తయారీ దారుల నుంచి రాతపూర్వకంగా రాయించు కున్నారు. ప్రస్తుతం ఉన్న కలపను ఉడ్ బ్యాంక్లోనే భద్రపర్చారు. తెల్లపొనికి కలప పంపిణీకి త్వరలో ఏర్పాట్లు చేస్తామని ఎఫ్ఆర్వో శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డెప్యూటీ రేంజర్ అఽఽధికారి రామిరెడ్డి, ఫారెస్ట్ బీట్ అఽధికారులు దుర్గారావు, సుధాకర్, ఆర్ట్స్, క్రాఫ్ట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ శాఖలో ఏడుగురికి ప్రశంసాపత్రాలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిలా ్లపోలీసు పరేడ్గ్రౌండ్లో శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో మచిలీపట్నం ఎకై ్సజ్శాఖ తరఫున ఏడుగురు మంత్రి కొల్లు రవీంద్ర, జేసీ నవీన్, ఎస్పీ విద్యా సాగర్నాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ప్రశంసాపత్రాలు అందు కున్న వారిలో అవనిగడ్డ సీఐ గిరిజ సత్యకుమారి, మచిలీపట్నం స్టేషన్ నుంచి హెడ్కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ అనిల్, వాకాలరావు, ఇతర సిబ్బంది ఉన్నారు. ప్రశంసాపత్రాలు అందుకున్న సిబ్బందిని అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ భార్గవ్ ప్రత్యేకంగా అభినందించారు. విధులను సమర్థంగా నిర్వర్తించే సిబ్బందికి ప్రభుత్వం తరపున తప్పక గుర్తింపు వస్తుందన్నారు. -
సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్ వద్ద జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఆయన జాతీయజెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎస్.వరలక్ష్మి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో... పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కలెక్టరేట్లో ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ జాతీయజెండాను ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లోని తెలుగుతల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నమ్రతా అగర్వాల్, డీఆర్వో శ్రీధర్రెడ్డి, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డి, ఐఅండ్పీఆర్ డీడీ జయరావు, కలెక్టరేట్ ఏవో ఏఎస్ఎన్ రాధిక, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలోని 2026–2027 విద్యా సంవత్సరంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. స్కూల్ అసి స్టెంట్లకు రూ.12,500, సెకండరీ గ్రేడ్ టీచర్లకు రూ.10,000 గౌరవ వేతనంతో ఈ పోస్టులు భర్తీ చేస్తారన్నారు. జిల్లాలోని వివిధ మండ లాల్లో స్కూల్ అసిస్టెంట్లకు సబ్జెక్ట్ల వారీగా 81, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు రెండు ఖాళీలు ఉన్నాయని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో ఈ నెల 21 లోపు దర ఖాస్తులు అందజేయాలని కోరారు. -
మహనీయుల పోరాటం స్ఫూర్తిదాయకం
జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. అనంతరం మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి సర్టిఫికెట్లను అందజేశారు. డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీ నటి శ్రీలీల, బాల నటుడు బుల్లిరాజు(రేవంత్)శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన వారిరువురికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. కానూరుకు చెందిన బి.శిల్పి, బి.సనీల కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా వారు ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116ల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. -
ఈ ప్రశ్నలకు బదులేది..?
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యమై వందరోజులు దాటింది. నా కొడుకు మృతదేహాన్ని ఏం చేశారు... కనీసం ఆ బూడిదైనా ఇవ్వండంటూ సాయికృష్ణ తల్లి నెత్తీ...నోరూ మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఏదో కన్నీళ్లు తుడవటానికంటూ సిట్ వేసి చేతులు దులుపుకొంది. సిట్ వేసి రెండు నెలలు గడిచినా విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేవలం సీఐ నాగరాజు, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అరెస్టు చేయడం వరకే పరిమితం అయింది తప్ప కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. సాయికృష్ణ అదృశ్యమై వంద రోజులు దాటింది సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం కలిగించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యమై వంద రోజులైంది. ఇప్పటికీ సాయికృష్ణ మృతదేహం ఏమైందో, ఎక్కడ దహనం చేశారో, బూడిద కూడా ఏం చేశారో పరమ రహస్యంగానే ఉంది. రిమాండ్లో ఉన్న సీఐ నాగరాజుని, నలుగురు కానిస్టేబుళ్లను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని వేర్వేరుగా ప్రశ్నించినా ఇప్పటివరకూ ఏం తేల్చలేకపోయారు. అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏ కేసులో తీసుకు వచ్చారు. వారెంట్ పెండింగ్ ఉంటే కోర్టులో హాజరుపర్చకుండా, కృష్ణలంక పోలీస్స్టేషన్లో ఎందుకు అప్పగించారు. అక్కడే ఉంచి విచారించారా.. లేక మరేదైనా పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారా.. సాయికృష్ణ ఎప్పుడు(లాకప్డెత్) మరణించాడు. ఆ తర్వాత డెడ్బాడీని ఏం చేశారో ఇప్పటికీ తేల్చలేదు. బైక్పై డెడ్బాడీని తీసుకెళ్లి స్వర్గపురిలో దహనం చేసినట్లు వస్తున్న వార్తలు నిజమేనా.. స్వర్గపురిలో ఏమి ఆధారాలు సేకరించారన్న సమాచారంపై స్పష్టత రాలేదు. సాయికృష్ణ కాలిగోళ్లు పీకడం కోసం ఉపయోగించిన ఆర్ఎంపీ ఇప్పటివరకూ ఎంతమందికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు. అసలు పోలీసు స్టేషన్లో ఆర్ఎంపీకి ఏం పని అనే విషయంపై కూడా సిట్ దృష్టి పెట్టలేదు. సాయికృష్ణ కేసులో కమిషనరేట్లోని మరో సీఐ సహకరించారన్న వార్తలపై... ఆ సీఐ ఎవరు అన్నది గుర్తించారా? గుర్తిస్తే ఇప్పటి వరకూ ఆ సీఐని ఎందుకు ప్రశ్నించలేదు అన్నది చర్చనీయాంశంగా మారింది. -
సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): సముద్రంలో పడి ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బందరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. మచిలీపట్నం మండలం తాళ్లపాలెం పంచా యతీ శివారు హెచ్.సత్తెనపాలెంనకు చెందిన పల్లేటి రాజు (25) మరో ముగ్గురు మత్స్యకారులతో కలిసి శనివారం తెల్లవారుజాము 3.30 గంటల సమయంలో సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. బోటు ఐదు నాటికల్ మైళ్ల దూరం వెళ్లేసరికి సముద్రంలో ఒక్కసారిగా అలల ఉధృతి పెరి గింది. వర్షంతో పాటు అలలు ఎగిసి పడుతుండటంతో మిగిలిన మత్స్యకారులు తమ బోట్లకు లంగర్లు వేసి నిలిపేశారు. రాజు ఉన్న బోటుకు లంగర్ వేసే సమయంలో ప్రమాదవశాత్తు అతను సముద్రంలో పడిపోయాడు. బోటుకు రెండో వైపు ఉన్న మిగిలిన మత్స్యకారులు పది నిమిషాల తరువాత రాజు కోసం చూడగా కనిపించలేదు. అమానంతో బోటు మొత్తం వెతికినా ప్రయోజనం లేకపోయింది. అలల ఉధృతికి సముద్రంలో పడిపోయినట్లు గ్రహించిన తోటి మత్స్యకారులు ఒడ్డుకు చేరుకుని రాజు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మైరెన్, కోస్టుగార్డు పోలీసుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టామని రూరల్ ఎస్ఐ రమేష్ తెలిపారు. రాజుకు భార్య, ఐదేళ్ళ కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
క్రీడలతో క్రమ శిక్షణ అలవడుతుంది
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శరీర ధారుడ్యానికే కాకుండా క్రమ శిక్షణను అలవర్చుకోవడానికి క్రీడలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లే శ్రీనుబాబు చెప్పారు. స్థానిక పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్లో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్ టెన్నిస్ మహిళల సిటీ లీగ్ ఆదివారం జరిగింది. శ్రీనుబాబు హాజరై లీగ్ను ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే క్రీడలో ఎదుగుదలకు ఆస్కారం ఉంటుందని, సాఫ్ట్ టెన్నిస్కు రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ పి.మురళి, ఎన్టీఆర్ జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి కె.దిలీప్ ప్రసన్న బాబు ప్రసంగించారు. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) స్పోర్ట్స్ ఆఫీసర్ (ఖేలో ఇండియా స్కీమ్స్) పి. సురేంద్ర బాబు, ఆంధ్రప్రదేశ్ నెట్ బాల్ అసోసియేషన్ కోశాధికారి ఎం.వీరాంజనేయులు హాజరై విజేతలకు పతకాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ డి.నవీన్, ఎన్టీఆర్ జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ కోశాధికారి ఎన్.నాగబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అధ్యక్షుడు వల్లే శ్రీనుబాబు -
దుర్గమ్మ సేవలో డీజీపీ హరీష్ కుమార్ దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన డీజీపీకి ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, హరీష్కుమార్గుప్తా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈఓ, చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. నేడు, రేపు సర్టిఫికెట్ల పరిశీలన మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీఈఏపీ సెట్–2026 బైపీసీ స్ట్రీమ్లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నగరంలోని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్ సోమ, మంగళవారాల్లో జరగనుంది. సాధారణ కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఆన్లైన్లోనే జరుగుతుందని, స్పెషల్ కేటగిరీ అభ్యర్థులైన ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ, స్కౌట్స్ అండ్ గౌడ్స్, దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్స్ కేటగిరికి చెందిన విద్యార్థులు ఈ హెల్ప్లైన్ సెంటర్కు స్వయంగా వచ్చి సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. సర్టిఫికెట్ల పరీశీలన పూర్తి అయిన విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోగా ఆన్లైన్లో వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న వెబ్ఆప్షన్లకు ఈ నెల 24వ తేదీన మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఆన్లైన్లో సీట్ ఎలాట్మెంట్ను ప్రకటిస్తారన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక చిలకలపూడి(మచిలీపట్నం): ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ కృష్ణాజిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఈ ఎన్నికలను ఏపీ జేఏసీ అమరావతి కృష్ణాజిల్లా అధ్యక్షుడు ఎంవీ శ్యామ్నాథ్ పర్యవేక్షణలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా జి. గోపీచంద్, ప్రధాన కార్యదర్శిగా పి. జితేంద్ర, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం. కల్పనమయూరి, ఉపాధ్యక్షుడిగా కె. సాయిబాబు, వర్కింగ్ ప్రెసిండెంట్గా పి. శ్రావణ్కుమార్, ట్రెజరర్గా బి. దిలీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె. కిరణ్, జాయింట్ సెక్రటరీలుగా ఎ. రమ్య, కె. పూర్ణచంద్రరావు, కార్యవర్గ సభ్యులుగా సురేఖ, సీహెచ్ స్వామి, ఎన్. సాయితేజ ఎన్నికయ్యారు. నేటి నుంచి అత్యవసర సేవలు బంద్ జూడాల ఉద్యమం ఉద్ధృతం పటమట(విజయవాడతూర్పు): జూనియర్ వైద్యుల ఉద్యమం సోమవారం నుంచి తీవ్ర రూపం దాల్చనుంది. అందులో భాగంగా అత్యవసర సేవలను సైతం బహిష్కరించి నిరసన తెలియజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ వైద్యుల సంఘం పిలుపు మేరకు వారం రోజులుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. సాధారణ సేవలను మాత్రమే బహిష్కరించి, అత్యవసర సేవలైన క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ వార్డ్, ఆపరేషన్ థియేటర్లకు హాజరవుతూ వచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సోమవారం నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరించనున్నారు. స్టైపండ్ పెంచాల్సిందే.. తమ డిమాండ్లలో ముఖ్యమైన అంశం స్టైపండ్ పెంచాల్సిందేనని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లకోసారి 15శాతం పెంచాల్సి ఉండగా, 8 నెలలుగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని జూడాలు చెబుతున్నారు. తమిళనాడు తరహాలో ఏడాదికి మూడు శాతం పెంపును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని వాళ్లు తేల్చి చెబుతున్నారు. రోగులను ఇబ్బంది పెట్టాలనీది తమ ఉద్దేశం కాదని, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం కారణంగానే అత్యవసర సేవలను బహిష్కరించాల్సి వచ్చిందని జూడాలు పేర్కొంటున్నారు. -
సోమవారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2026
చల్లపల్లిలోని పొలంలో నారుమడిని మేస్తున్న పశువులు పశువులను మేపుతున్నారు!భూగర్భ జలం అందటంలేదు. చిన్నపాటి దార వస్తోంది. ఎంతలా అంటే మూడు ఎకరాల భూమిని తడపటానికి నెల రోజులు పట్టింది. సాగు చేయడం కష్టంగా మారింది. పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి. – కొక్కిలిగడ్డ రవి, కౌలురైతు, వక్కలగడ్డ చల్లపల్లి: ఏరువాక పేరుతో హడావుడి చేశారు.. సాగునీరు విడుదల అంటూ ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు.. ఇక సాగునీటికి ఢోకాలేదని భ్రమపడిన రైతులు చివరికి కన్నీరే మిగిలింది. ఆంధ్రా అన్నపూర్ణగా పేరొందిన కృష్ణాజిల్లాలోనే సాగునీటి కోసం రైతులు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఎంతో ఆశతో వేసిన నారుమళ్లు ఇప్పుడు రైతుల కళ్లముందే ఎండిపోతున్నాయి. నాట్లు వేద్దామంటే కనీసం పొలంలోని మట్టి కూడా తడవని పరిస్థితి. ఆదుకోవాల్సిన కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నెలల తరబడి సాగునీటి కోసం ఎదురుచూసిన రైతులు సమయం మించిపోవటంతో చేసేది లేక నాట్లు వేసే మార్గం కనిపించక నారుమళ్లను పశువులకు మేతగా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదీ పరిస్థితి.. చల్లపల్లి మండల పరిధిలోని 5వ నంబర్ కాలువ కింద పరిధిలో సుమారు మూడు వేల ఎకరాల సాగుభూమి ఉంది. కేఈబీ కెనాల్ నుంచి చల్లపల్లి మండలం వెలివోలు దగ్గర ప్రారంభమైన ఈ కాలువ వక్కలగడ్డ మీదుగా రామానగరం వరకూ వస్తుంది. ఇప్పటి వరకూ ఈ కాలువలో పూర్తిస్థాయిలో సాగునీరు ప్రవహించిన దాఖలాలు లేవు. సాగు నీరు విడుదల చేసినప్పటి నుంచి అరకొర నీరే. దీంతో ఎగువన ఉన్న రైతులు వచ్చే కొద్దిపాటి నీటికి అడ్డుకట్టలు వేసి వారి వారి పొలాల్లోకి మళ్లించుకుంటున్నారు. పైన నాట్లు పూర్తయితేగానీ దిగువకు నీరు చేరని పరిస్థితి నెలకొంది. చల్లపల్లి–పామర్రు ప్రధాన రహదారికి ఎడమవైపు ఎగువన అక్కడక్కడా నాట్లు పడినప్పటికీ రోడ్డు ఎడమపక్కన దిగువన ఇంకా నాట్లు పడలేదు. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల విద్యుత్ మోటార్లు ఉన్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటడంతో భూమిలో నుంచి నీరు బయటకు రావటంలేదు. ఫలితంగా విద్యుత్ మోటార్లు నిరుపయోగంగా మారుతున్నాయి. నీరు లేక వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. ఇప్పటికై నా మేల్కొంటారా? ఇదే ఐదో నంబర్ కాలువ దిగువన రామానగరం వద్ద నారుమళ్లు వేసి 60 రోజులు దాటుతున్నా.. భూమి తడవక నాట్లు వేయలేదు. సాధారణంగా 25 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో నాట్లు వేసుకుంటే దిగుబడులు బాగుంటాయి. అయితే నారు వయస్సు 60 రోజులు దాటడంతో అది నాట్లు వేసేందుకు పనికిరాకపోవటంతో రైతులు నారుమడిలో పశువులను దింపి వాటికి మేపుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తక్షణమే ప్రధాన కాలువలకు సాగునీటిని విడుదల చేసి దిగువ ప్రాంత రైతులకు కూడా సమానంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, ఎండిపోతున్న నారుమళ్లను, నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. చల్లపల్లి పద్మావతి ఆస్పత్రి రోడ్డులో నీరులేక ఎండిపోయిన నారుమడి5వ నంబర్ కాలువలో కానరాని సాగునీరు, కాలువకు ఇరువైపులా బీడుగా ఉన్న పొలాలు కాలువల్లో నీరులేదు, మోటార్లు రావటంలేదు. నారు ఎండిపోతోంది. పొలం తడిపే పరిస్థితి లేదు. నాట్లు వేసే పరిస్థితి లేదు. ఏమి చేయాలో అర్థం కావటంలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – లంక బాలవర్థి, కౌలురైతు, వక్కలగడ్డ ఐదో నంబర్ కాలువలో వస్తున్న కొద్దిపాటి నీటిని ఎగువ రైతులు అడ్డుకట్ట వేసి తోడేస్తున్నారు. దిగువన ఉన్న మాకు నీరు రావటం లేదు. మాకు ఎప్పుడు నీళ్లు వస్తాయో అర్థం కావడం లేదు. ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. – కొల్లూరు నాగేశ్వరరావు, కౌలురైతు, వక్కలగడ్డ -
పూర్ణాహుతితో ముగిసిన వరుణ యాగాలు
మల్లేశ్వర స్వామికి ఘటాభిషేకం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో నెలకొని ఉన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని, లోక కల్యాణార్థం ఇంద్రకీలాద్రిపై గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వరుణ జపాలు, వరుణ యాగాలు ఆదివారంతో పరిపూర్ణమయ్యాయి. ఆదివారం మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో జపాలు, స్వామి వారికి ఘటాభిషేకాలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతితో వరుణ యాగాలు పరిసమాప్తమయ్యాయి. తొలుత ఉదయం దుర్గాఘాట్ వద్ద ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పవిత్ర కృష్ణాజలాలను ఘటాలతో తీసుకుని మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఘటాభిషేకం ఇలా.. కృష్ణానది నుంచి ఘటాలతో పవిత్ర కృష్ణాజలాలను మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్న అనంతరం శాంతి కల్యాణ వేదిక వద్ద ఆలయ వైదిక కమిటీ, వేద పండితులు, ఆలయ అర్చకులు, వేద విద్యార్థులు వేద పారాయణ చేశారు. మల్లేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయంలో స్వామి వారికి పవిత్ర కృష్ణాజలాలతో అభిషేకాలను నిర్వహించారు. స్వామి వారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. యాగశాలలో శత అనువాహక, కారక పారాయణలు, మండప దేవతా హోమాలను నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
సీపీఎస్ అంతం మన పంతం
యూటీఎఫ్ పోరాట వీరుల విజయోత్సవ సభలో వక్తలు కృష్ణలంక (విజయవాడతూర్పు): దశాబ్దాలుగా విరామం ఎరుగని పోరాటాల వల్లే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ సాధన సాధ్యమైందని, అదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ పాత పెన్షన్ సాధనకు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల రక్షణకు ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం ఓపీఎస్ పోరాట వీరుల విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, పీడీఎఫ్ మాజీ ఫ్లోర్లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్, పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు కె.జోజయ్య మాట్లాడుతూ.. ‘ఈ విజయంతో పొంగిపోకుండా సీపీఎస్ అంతం మన పంతం అనే నినాదంతో ఉద్యమం కొనసాగించాలి. పెన్షన్ భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు. సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పులను అమలు చేయాలి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలు, నిరాహారదీక్షలు చేపట్టి కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలను కండువా, బంగారు, వెండి, కాంస్య పతకాలతో పాటు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఉద్యమ ఘట్టాలు అనే పుస్తకాన్ని బహూకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కొమ్మోలజు, శ్రీనివాసరావు, ఎ.ఎన్ కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు పక్క పొదల్లో శిశువు
సత్యనారాయణపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు, రైల్వేకాలనీ రోడ్డు పక్కన శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో పొదల్లో ఆడ శిశువును గుర్తించిన స్థానికుడు ఆస్పత్రిలో చేర్చాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఎన్పురం పోలీసులు కేసు నమోదు చేసి శిశువును వదిలి వెళ్లిన వారి కోసం గాలింపు చేపట్టారు. విజయవాడ సూర్యారావుపేటకు చెందిన కటికల విజయ్ శనివారం రాత్రి 10.30గంటల సమయంలో బీఆర్టీఎస్ రోడ్డులో ఫుడ్ కోర్టుకు వెళ్లి భోజనం చేశాడు. అనంతరం టాయిలెట్కు వెళ్లేందుకు రైల్వే క్వార్టర్స్ సిమెంట్ రోడ్డు వద్దకు వెళ్లగా అక్కడ పొదల్లో నుంచి ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా రెండు, మూడు రోజుల వయస్సు కలిగిన ఆడ శిశువు ఏడుస్తూ కనిపించింది. వెంటనే శిశువును తీసుకుని బ్లాసమ్స్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో చేర్పించారు. శిశువుకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. విజయ్ ఫిర్యా దు మేరకు ఎస్ఎన్పురం పోలీసులు కేసు నమోదు చేసి శిశువును వదిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఏపీజీఈఏ ఆవిర్భావ వేడుకలు పటమట (విజయవాడ తూర్పు): ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) 16వ ఆవిర్భావ వేడుకలు విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర, జిల్లా, నగర శాఖల ప్రతినిధులు, మహిళా విభాగం నేతలు, ఉద్యోగులు, సభ్యుల సమక్షంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం ఏపీజీఈఏ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఏపీజీఈఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగసాయి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ పి.లీలావతి, అసోసియేషన్ కార్యదర్శి కూనపురెడ్డి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో పురుషులు, మహిళల చాంపియన్షిప్ పోటీలు, జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు హాజరయ్యారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు వెలగపూడి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు. పురుషులు, మహిళల విభాగాల్లో విజయవాడ జట్లు విజేతగా, మచిలీపట్నం జట్లు రన్నర్స్గా నిలిచాయి. ఈ పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచిన పురుషులు, మహిళలను ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతా ల్లో ప్రతిభవంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలను నిర్వహించినట్లు చెప్పారు. విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ టీఎస్ఆర్కే ప్రసాద్, సంఘం జిల్లా కార్యదర్శి ఎం. శివశంకర్, కార్యనిర్వాహక కార్యదర్శి మురళీ, ఉపాధ్యక్షులు బీవీ. నరసయ్య, డి. శర్వాణి, సహాయ కార్యదర్శులు పి. శ్రీనివాసరావు, జి. సుబ్బారావు, రిఫరీ ఎస్. మోహన్రావు పాల్గొన్నారు. -
పరిహారం ఇవ్వకపోతే ప్రాణత్యాగమే...
ఈ ఫొటోలోని వృద్ధ దంపతుల పేర్లు చనుమోలు సత్యనారాయణ, సామ్రాజ్యం. వీరికి వెల్వడం గ్రామంలో సర్వే నంబరు 498/1లో ఇల్లు ఉండేది. 2016లో మైలవరం–నూజీవీడు ఆర్అండ్బీ రహదారి విస్తరణలో భాగంగా వీరి ఇంటిని అధికారులు కూల్చారు. అప్పటి నుంచి వీరికి ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వలేదు. పరిహారం ఇస్తారా... లేదా.. ఆత్మహత్య చేసుకుంటాం అంటున్న ఈ దంపతుల హృదయ వేదన పాలకుల చెవికి ఎక్కటం లేదు. –చనుమోలు సత్యనారాయణ, సామ్రాజ్యం (బాధితులు, వెల్వడం) -
వరములిచ్చే చల్లని తల్లీ... దుర్గమ్మా..!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఆరు గంటల నుంచే అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరగడంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి బంగారు వాకిలి ద్వారా దర్శనం కల్పించారు. రెండు గంటలకు సుప్రభాతం శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారికి నిర్వహించే ఖడ్గమాలార్చనలో ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో సాధారణంగా రెండు షిఫ్టులలో జరిగే ఖడ్గమాలార్చన మూడు షిఫ్టులలో 50 మందికి పైగా ఉభయదాతలు పాల్గొన్నారు. శుక్రవారం రెండు గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ నిర్వహించారు. మరో వైపున ఆలయ ప్రాంగణంలోని నూతన పూజా మండపంలో లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చనతో పాటు శ్రావణ మాసం ప్రత్యేక కుంకు మార్చనకు భక్తుల నుంచి డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆలయంలో ఆర్జిత సేవలను నిర్వహిస్తుండటంతో సర్వ దర్శనం క్యూలైన్లో మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దీంతో తెల్లవారుజామున నాలుగు గంటలకు క్యూలైన్లోకి చేరుకున్న భక్తులకు ఉదయం 7 గంటల తర్వాతే దర్శనం కలిగింది. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు మహామండపం రెండు, మొదటి అంతస్తులలో అన్నప్రసాదాన్ని అందజేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో, చైర్మన్లు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఆకట్టుకున్న పూల అలంకరణ అమ్మవారి ప్రధాన ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. చామంతి, గులాబీలతో తీర్చిదిద్దిన ఓంకారం భక్తులకు విశేషంగా అకట్టుకుంది. మరో వైపున ఆలయ ప్రాంగణాన్ని బంతిపూలు, అరటి చెట్టు, మామిడాకులతో అలంకరించారు. అమ్మవారిఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు, కనకదుర్గనగర్లో బలిపీఠం అమ్మవారికి విశేషంగా అలంకరించారు. -
మా సమస్యలు పరిష్కరించండి
రవాణాశాఖ కార్యదర్శికి లారీ యజమానుల సంఘం వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్– తెలంగాణల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపాలని ఏపీ లారీ యజమానుల సంఘం నేతలు శుక్రవారం రవాణాశాఖ కార్యదర్శి కోన శశిథర్ను కలిసి విన్నవించారు. రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కోన శశిథర్ను లారీయజమానుల సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని కోరారు. కాగా రవాణా శాఖ కార్యదర్శిని కలిసిన వారిలో ఆ సంఽఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు నాగమోతు రాజా తదితరులు ఉన్నారు. -
మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
గుడివాడరూరల్: రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ అన్నారు. గుడివాడ పట్టణంలో నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈగల్ టీం, పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో... నో డ్రగ్స్ నినాదంతో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఐజీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఈగల్ టీం, పోలీసులు పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ డ్రగ్స్ వద్దు బ్రో.. నో డ్రగ్స్ అంటూ ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ప్రజలకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఏజీకే స్కూల్, ఏలూరురోడ్డు, నెహ్రూచౌక్ సెంటర్, మార్కెట్ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి తిరిగి స్టేడియాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఐజీ మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ భూతాన్ని సమూలంగా నాశనం చేసేందుకు ఈగల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీం ద్వారా డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా, వినియోగిస్తున్నట్లు, సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఈగల్ టోల్ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని ఐజీ కోరారు. ఉద్యోగులు, విద్యార్థులే బాధితులు.. ఈగల్ ఎస్పీ జి.స్వరూపరాణి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు విక్రయించినా, రవాణా చేసిన వారిపై కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయన్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద తీవ్రమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా డ్రగ్స్ భారిన ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా పడుతున్నారన్నారు. ఉద్యోగాల కోసం మెట్రో నగరాలకు వెళ్లి సింథటిక్ డ్రగ్స్కు బానిసలవుతున్నారన్నారు. మారక ద్రవ్యాల దాడుల్లో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులే జైలుకెళ్లిన సందర్భాలున్నాయన్నారు. విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే వారు డ్రగ్స్కు దూరంగా ఉండటమే కాకుండా డ్రగ్స్ బారిన ఇతరులు పడకుండా చూడాలని కోరారు. అనంతరం బ్రహ్మకుమారి సంస్థ సభ్యురాలు శైలజ మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, డీఎస్పీ పాలా శ్రీనివాస్, స్టేడియం వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కూటమి నాయకులు బూరగడ్డ శ్రీకాంత్, దావులూరి సురేంద్రబాబు, గోకరపు సునీల్, నిమ్మగడ్డ సత్యసాయి, కిలారపు రంగ ప్రసాద్, సీఐలు కొండపల్లి శ్రీనివాస్, కె.హనీష్, ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు, ఈగల్ టీం సీఐ రవీంద్ర, వివిధ కళాశాలల విద్యార్థులు, స్వచ్చంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. -
ఏపీఎన్జీవో, ఎన్జీవో సంఘ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
గుడివాడరూరల్: ఏపీఎన్జీవో, ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. కృష్ణాజిల్లా గుడివాడలోని ఎన్జీవో హోమ్లో గుడివాడ సర్కిల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షులుగా వట్టిపల్లి రామస్వామి, జనరల్ సెక్రటరీగా కెఎవిఎల్ఎన్వి ప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్గా వి.అజయ్కుమార్, వైస్ ప్రెసిడెంట్–1గా జి.ధనంజయ్, వైస్ ప్రెసిడెంట్–2గా కె.గోపాలరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి.వెంకటేష్, స్టేట్–1, 2 సెక్రటరీలుగా డి.కార్తీకప్రసాద్, పి.పూర్ణచంద్రరావు, స్టేట్ ట్రెజరర్గా టి.సాయి కిరణ్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నూతన కమిటీ సభ్యులను అసోసియేషన్ సభ్యులు సన్మానించి సత్కరించారు. -
వరుణుడి కరుణ కోసం జపాలు, యాగాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, వర్షాలు సమృద్ధిగా కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో దుర్గగుడి దేవస్థాన ఆధ్వర్యంలో వరుణ జపాలు, యాగాలను నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు విజయవాడ దుర్గాఘాట్లో కృష్ణానది జలాలలో వరుణ అనువాక సహిత కారక పారాయణలు నిర్వహించారు. తొలుత దుర్గగుడి ఈవో శీనానాయక్, ఛైర్మన్ రాధాకృష్ణలు గణపతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయఅర్చకులు, వేద పాఠశాల విద్యార్థులు నదీ జలాలలో పారాయణలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, ప్రధాన దేవతలకు, వరుణ దేవుడికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం దేవతా మూర్లుకు పూజలు, మండప దేవతా ఆవాహనలు, మండప పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. -
లోకేష్.. మా మొర ఆలకించవా!
జి.కొండూరు: ‘‘నారా లోకేష్ సారూ... మమ్మల్ని కరుణించండి.. ఒక్కసారి మా ఊరికి రండి.. మాకు పరిహారం ఇచ్చి ఆదుకోండి.. పదేళ్లు గడిచింది.. ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలి’’ అంటూ మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన బాధితులు శుక్రవారం రోడ్డెక్కారు. నష్ట పరిహారం ఇస్తామంటూ గతేడాది జూలైలో ప్రకటించిన నారా లోకేష్, నేటికీ ఆ పరిహారం అందించకపోవడంతో లోకేష్ బ్యానర్తో బాధితులు నిరసన తెలిపారు. మొత్తం 134 మంది బాధితుల్లో ఈ పదేళ్లలో 16 మంది చనిపోయారు. మృతుల ఫొటోలతో కూడిన బ్యానర్ను పట్టుకుని వారి వారసులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దశాబ్దం గడిచినా... మైలవరం–నూజివీడు అర్అండ్బీ రోడ్డు విస్తరణలో భాగంగా 2016లో మైలవరం మండలం వెల్వడం గ్రామంలో 60 మంది, చంద్రాల గ్రామంలో 74మంది ఇళ్లు కోల్పోయారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం లో పరిహారం కోసం బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం శూన్యం. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సాంకేతిక సమస్య లేకుండా అన్ని ధ్రువపత్రాలను సమర్పించిన వెల్వడం గ్రామానికి చెందిన 50మంది బాధితులకు 2023 డిసెంబరు 15న రూ.1.75 కోట్ల నష్ట పరిహారాన్ని అందించారు. ఇంకా వెల్వడం గ్రామానికి చెందిన 10మందికి సుమారుగా రూ.95 లక్షలతో పాటు చంద్రాల గ్రామానికి చెందిన 74 మందికి సుమారుగా 3.46 కోట్ల వరకు నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంది. లోకేష్ మాటిచ్చి ఏడాది గడిచినా... పదేళ్లు గడిచినా ఇళ్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం అందకపోవడంతో గత ఏడాది జూలై 1వ తేదీన వెల్వడం గ్రామంలో నారా లోకేష్ ఫొటోతో బాధితులు నిరసన తెలిపారు. దీనిపై జూలై 2వ తేదీన ‘గూడూ పోయే...దారీ కరువాయె’ శీర్షికతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటనపై స్పందించిన నారా లోకేష్ బాధితులకు నెల రోజుల్లోగా నష్ట పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఆ మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఏడాది గడిచినా ఒక్క బాధితుడికి కూడా నష్ట పరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో బాధితులు శుక్రవారం మరోసారి రోడ్డెక్కి నిరసన తెలిపాల్సి వచ్చింది. ఇప్పటికై నా మాకు పరిహారం ఇస్తారా... లేదా ప్రాణం తీసుకోమంటారా అంటూ బాధితుల్లో ఓ వృద్ధ జంట ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు వెడల్పు చేయాలని నా ఇల్లు కూల్చి వేసి 155 గజాల స్థలాన్ని తీసుకున్నారు. నేను అప్పు చేసి మళ్లీ ఇల్లు కట్టుకున్నాను. పదేళ్లు గడిచినా ఒక్కరూపాయి పరిహారం ఇవ్వలేదు. నాకు భర్త లేడు. అప్పులు ఎలా తీర్చుకోవాలి. –బొడ్డు లక్ష్మి, చంద్రాల రోడ్డు విస్తరణలో నా రెండు డాబాలు సగం వరకు పోయాయి. అప్పు చేసి ఇళ్లు బాగు చేసుకున్నాం. నష్ట పరిహారం కోసం నేను తిరగని చోటు లేదు. ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలి. –పెండెం లక్ష్మీ మాణిక్యం, చంద్రాలరోడ్డు వెడల్పు చేయాలని పదేళ్ల కింద నా డాబాని సగం కూల్చారు. ఇల్లు బాగు చేసుకోవడానికి అప్పులు చేశాను. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇళ్లు కోల్పోయిన వాళ్లు ఒక్కొక్కరిగా చనిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. –బింగి గోపాలరావు, చంద్రాల -
కృష్ణా జిల్లాలో పలువురికి సేవా పతకాలు
కోనేరుసెంటర్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది కృష్ణా జిల్లా పోలీసుశాఖ తరపున పలువురు ప్రభుత్వం నుంచి పలు సేవా పతకాలు అందుకోనున్నారు. పతకాలకు ఎంపికై న సిబ్బందికి జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు శుక్రవారం అభినందనలు తెలియజేశారు. ఈ రమణమ్మ (ఉమెన్ సీఐ) సీసీఎస్ గుడివాడ, వీజే రామమూర్తి, (ఏఎస్సై) ఒర్లగొంది తిప్ప ఉత్తమ సేవా పతకాలకు ఎంపికయ్యారు. అలాగే అలీబేగ్ (ఎస్సై), జె.శ్రీనివాస (ఏఎస్సై), ఎం.దక్షిణమూర్తి (హెచ్సీ), బి.భద్రు (ఏఆర్ఎస్సై), బి.ఆది (పీసీ), పి.ప్రసాద్ (హెచ్సీ), కె.చంద్రబాబు (హెచ్సీ), వి.విజయ్ (పీసీ)లు సేవా పతకాలను అందుకోనున్నారు. జి.నాగమల్లేశ్వరరావు (హెచ్సీ), బి.నాగశ్రీనివాసప్రసాద్ (ఏఆర్హెచ్సీ), ఎన్.పిచ్చేశ్వరరావు (ఏఆర్హెచ్సీ), బి.వెంకటసుబ్రహ్మణ్యం (హెచ్సీ), పి.రమేష్బాబు (హెచ్సీ), టి.ఏడుకొండలు (హెచ్సీ), ఎస్.కృష్ణమూర్తి (హెచ్సీ), జి.తిరుమలమహేశ్వరరావు (హెచ్సీ), ఎల్.ప్రసాద్ (హెచ్సీ)లు అతి ఉత్కృష్ట సేవా పతకాలు అందుకోనున్నారు. వీరితో పాటు వై.రవికిరణ్ (ఆర్ఐ), కె.రామకృష్ణ (హెచ్సీ), జె.లక్ష్మణరావు (ఏఆర్పీసీ), వై.వెంకటనారాయణ (ఏఆర్పీసీ), ఎం.గంటాదుర్గారావు(పీసీ), టి.సుదీర్ (ఏఆర్హెచ్సీ), కె.సుధీర్ (ఏఆర్హెచ్సీ), కె.రామకృష్ణ (పీసీ), కె.గోవింద (పీసీ), జి.జగ్గయ్య (పీసీ), పి.శివశంకర్ (పీసీ), ఎస్.రాజ (పీసీ), కె.ఏడుకొండలరావు (పీసీ)లు ఉత్కృష్ట సేవా పతకాలను అందుకోనున్నట్లు శుక్రవారం ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. వీరంతా శనివారం జిల్లా పోలీసు పరేడ్గ్రౌండ్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎస్పీ చేతుల మీదుగా పతకాలు అందుకోనున్నారు. మైలవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ (2026– 2027 సీజన్ సబ్ జూనియర్ బాయ్స్) టోర్నమెంట్లో అనంతపురం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించే ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాధిక చారిటబుల్ ట్రస్టు సహకారంతో నిర్వహించే ఈ పోటీల్లో చివరి రోజు శుక్రవారం సెమీఫైనల్స్లో ఏఎస్ఆర్ జిల్లా జట్టు సత్యసాయి జిల్లా జట్టుపై 1– 0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. మరో సెమీ ఫైనల్లో కృష్ణా జట్టుపై అనంతపురం జట్టు పెనాల్టీలలో 5– 3 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఫైనల్స్లో అనంతపురం జట్టు అల్లూరి సీతారామరాజు జిల్లాపై పెనాల్టీలతో 5– 4 విజయం సాధించి టోర్నమెంట్ విజేతగా నిలిచింది. తృతీయ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో సత్యసాయి జిల్లా కృష్టా జిల్లాపై 1–0గోల్స్ తేడాతో విజయం సాధించింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రసిడెంట్ వై.శేషగిరిరావు, ట్రెజరర్ చక్రవర్తి, కోనసీమ జిల్లా కార్యదర్శి నీలాద్రి, కృష్ణాజిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రసిడెంట్ జి. అనిల్, ఏలూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి జి. పవర్కుమార్, ఇతర జిల్లాల ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ ఆర్చరీ పోటీల్లో యుక్తశ్రీ ప్రతిభ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దక్షిణ కొరియాలోని ఇన్చియాన్లో ఈ నెల 10 నంచి 14వ తేదీ వరకు జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ ఇన్విటేషనల్–2026 పోటీల్లో కొండపావులూరి యుక్తశ్రీ, కృషి కుమావత్, ప్రాజల్ తోలియా జట్టు బంగారు పతకాన్ని పొందింది. ఈ జట్టు మన దేశం తరపున బాలికల రికర్వ్ విభాగంలో ప్రతిభభ చూపి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ బంగారు పతకం సాధించడంలో విజయవాడ నగరానికి చెందిన యుక్తశ్రీ కీలక పాత్ర వహించింది. ఫైనల్లో సౌత్ కొరియాపై 3–5 తేడాతో ఈ జట్టు గెలుపొందింది. బంగారు పతకాన్ని పొందిన జట్టులోని సభ్యులను ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షురాలు నందమూరి తేజస్విని, ఛైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బి.వి.రమణ అభినందించారు. -
ఆలోచనలు రేకెత్తించిన ఛాయాచిత్రాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ఛాయాచిత్రాలు ప్రతి ఒక్కరిలో ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ప్రతి ఛాయాచిత్రం కళాత్మక సందేశాన్ని అందించిందన్నారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి హాలులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతల వివరాలను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్లలో నైపుణ్యాన్ని పెంచడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు ఏటా ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, యువత, పీ4, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, ఉత్తమ వార్తా చిత్రాలు విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో మొత్తం 221 ఎంట్రీలు రాగా 27 ఛాయాచిత్రాలను జ్యూరీ సభ్యులు ఉత్తమమైనవిగా ఎంపిక చేశారన్నారు. పోటీలలో వైవీవీ సత్యనారాయణ ప్రథమ బహుమతి, ఎన్.కిషోర్ ద్వితీయ బహుమతి, ఎం.ప్రశాంత్ తృతీయ బహుమతి సాధించారన్నారు. యు.దుర్గా రావు, పి.ప్రసాద్, వైవీ ఆనంద్, ఆర్వీ అప్పారావు, కె.తిరుపతయ్య, కేబీ నవీన్ ప్రోత్సాహక బహుమతులు సాధించారని తెలిపారు. కేటగిరీ 2లో జీఎన్ రావు(ప్రథమ), సీహెచ్ నారాయణరావు(ద్వితీయ),ఎస్ఎస్ విజయ బాబు(తృతీయ) బహుమతులు, సీహెచ్ మస్తాన్, మణికంఠ, సీహెచ్ నారాయణ రావు, బి.సతీష్ కుమార్, రాజేష్, బి.మరి డయ్య ప్రోత్సాహక బహుమతులు సాధించారన్నారు. కేటగిరీ 3లో కేవీఎస్ గిరి(ప్రథమ), ఎ.రాజేంద్రప్రసాద్(ద్వితీయ),దుర్గా ప్రసాద్( తృతీయ) బహుమతులు పొందా రని, ఎ.రామచంద్రరావు, కె.చక్రపాణి, జి.మహేష్, బి.మరిడయ్య, ఎం.సంపత్ కుమార్, ఎస్.లక్ష్మీపవన్ ప్రోత్సాహక బహుమతులకు ఎంపికై నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈనెల 19న బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్య క్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, జ్యూరీ సభ్యులు సీహెచ్ విజయభాస్కర్, టీఎస్రెడ్డి, కె.రవికుమార్, టి.నాగేశ్వరరావు, డాక్టర్ రజియా షబీనాలతో పాటు డివిజనల్ పీఆర్వో కె.రవి, రిటైర్డ్ ఏవీఎస్ వీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
తెల్లదొరలపై తిరువూరు సమరభేరి
తిరువూరు తాలూకా కార్యాలయం ఎదుట నాటి ప్రముఖ న్యాయవాది పీసపాటి లక్ష్మీకాంతం, కోటమర్తి సీతారామయ్య ఖద్దరు దుస్తులు ధరించినందుకు బ్రిటీష్ పోలీసులు ఇరువురినీ దుస్తులు ఊడదీసి నడిరోడ్డుమీద అవమానించారు. ఈ విషయాన్ని లండన్ హౌస్ ఆఫ్ కామర్స్ సభలో భారత సభ్యులు ప్రశ్నించారు. ఆ విధంగా తిరువూరు పేరు నాడు అంతర్జాతీయంగా మార్మోగింది. మహాత్మాగాంధీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో తిరువూరు వాసులు చురుకై న పాత్ర వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా నాటి ఉద్యమంలో తిరువూరు పాత్రపై ప్రత్యేక కథనం... తిరువూరు: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తిరువూరు తాలూకాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరువూరులో బ్రిటీష్ పాలనను వ్యతిరేకిస్తూ సమరయోధులు చేసిన పోరాటానికి గుర్తుగా స్మారక స్థూపం నేటికీ సాక్షీభూతంగా నిలిచి ఉంది. ఉప్పు సత్యా గ్రహం, హోమ్రూల్ ఆందోళనల్లో తిరువూరు వాసులు చురుకుగా పాల్గొన్నారు. 1920లో గంపలగూడెంలో కోటగిరి వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రజలు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1930లో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా సభలు నిర్వహించినందుకు గంపలగూడెంకు చెందిన పేట బాపయ్య, ఆర్లపాడుకు చెందిన ఊటుకూరు సత్యనారాయణరావు, మామునూరు నాగభూషణరావులను, కాంగ్రెస్ కార్యకర్తలకు భోజనం పెట్టినందుకు గోసవీడుకు చెందిన నేరెళ్ళ రోశయ్యను, రోలుపడికి చెందిన జక్కేపల్లి నరసింహంను బ్రిటీష్ పోలీసులు అరెస్టుచేసి చిత్రహింసలు పెట్టారు. తాతకుంట్ల శివారు గౌరంపాలెంకు చెందిన ఐదుగురు ముస్లిం యువకులను ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుకు పంపారు. 1942లో గంపలగూడెంలో పేట బాపయ్య, మురుకుంట్ల వెంకటప్పయ్య జమీందారీ విధానానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు జైలుశిక్ష అనుభవించారు. బ్రిటీష్ పాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు 1931లో కల్లు దుకాణాల వేలం పాటలను వ్యతిరేకిస్తూ స్వాతంత్య్ర సమరయోధులు కోటగిరి వెంకట కృష్ణారావు, పేట బాపయ్య సారథ్యంలో బ్రిటీష్ పాలకులపై సహాయ నిరాకరణ ఉద్యమం ప్రకటించారు. గ్రామాల్లో కల్లు దుకాణాలకు ప్రభుత్వం నిర్వహించిన పాటలను సామూహికంగా బహిష్కరించడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పాట పాడిన వారిని తరిమికొట్టారు. పోలీసు వాహనాలకు ఇంధనం పోయకుండా అన్ని గ్రామాల్లో కట్టడి చేశారు. తిరువూరు తాలూకా కార్యాలయం ఎదుట ప్రముఖ న్యాయవాది పీసపాటి లక్ష్మీకాంతం, కోటమర్తి సీతారామయ్య ఖద్దరు దుస్తులు ధరించినందుకు పోలీసులు ఇరువురినీ దుస్తులు ఊడదీసి నడిరోడ్డుమీద అవమానించారు. ఈ విషయాన్ని లండన్ హౌస్ ఆఫ్ కామర్స్ సభలో భారత సభ్యులు ప్రశ్నించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మురుకుంట్ల వెంకటప్పయ్య, మారేపల్లి సుబ్బారావు, కటారు వెంకయ్య బ్రిటీష్ సమాచార వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి తిరువూరు–నూజివీడు మార్గంలో టెలిఫోన్ తీగెలు తెంచేశారు. తిరువూరు తాలూకాలోని గంపలగూడెంకు చెందిన ఊటుకూరి రామకృష్ణారావు, ఊటుకూరు లక్ష్మీ నరసింహారావు, వెంకటప్పయ్య, కఠారు రంగనాయకులు, కఠారు గోవిందరావు, కఠారు వీరాస్వామి, కాసులనాటి వెంకటేశ్వర్లు, కోటగిరి పార్థసారధి, కోటగిరి సూర్యప్రకాశరావు, కోటగిరి మంగతాయారమ్మ, చలంశెట్టి సుబ్బయ్య, చారుగుండ్ల సీతారామయ్య, రాఘవరపు వెంకయ్య, సువారపు వెంకయ్య, సంతపురి నారాయణరావు, కోడూరుకు చెందిన అనుమర్లపూడి వెంకట సీతారామారావు, ముష్టికుంట్లకు చెందిన కొండపర్తి కోదండరామయ్య, గద్దె రంగయ్యనాయుడు, తిరువూరుకు చెందిన గంగు సత్యం, వీవీకే సుబ్రహ్మణ్యం, పొట్లూరి రామస్వామి, వేదాంతం శంభుశాస్త్రి, వేదాంతం వెంకట సుబ్రహ్మణ్య శర్మ, సయ్యద్ సాలార్, సుబ్బయ్య నాయుడు తదితరులు ప్రాణాలకు తెగించి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. నాటి సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం నేటి తరం కనీస కర్తవ్యం. -
ఆ మూడు శాతం మాకొద్దు..!
లబ్బీపేట(విజయవాడతూర్పు): తెల్లకోటు ధరించి రోగులకు వైద్యం చేయాల్సిన జూనియర్ వైద్యులు నల్ల చొక్కాలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తానని చెప్పే మూడు శాతం ఎందుకు అంటూ నల్లచొక్కాలతో మానవహారంగా ఏర్పడి వినూత్న నిరసన తెలిపారు. తమ స్టైఫండ్ పెంచాలని, బోధనా వైద్యుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు చేయవద్దని, నిబంధనలకు విరుద్ధంగా నాన్ మెడికల్ వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాలు చేయవద్దంటూ వారు ఐదు రోజులుగా నిరసన, రిలేదీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నల్ల చొక్కాలతో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. స్టయిపెండ్ అడిగితే బెదిరింపులా? ప్రభుత్వం తమిళనాడు తరహాలో ఏటా 3 శాతం స్టైఫండ్ పెంచుతామని చెపుతోందని, ఆ విధానాన్ని తాను అంగీకరించబోమని లేదని జూడాలు తేల్చిచె పుతున్నారు. రెండేళ్లకోసారి 15 శాతం స్టైఫండ్ పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తమకు స్టైఫండ్ పెంచమని అడిగితే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ నిరసన విరమించేది లేదని తేల్చి చెపుతున్నారు. సూపరింటెండెంట్కు నోటీసు.. తమ సమస్యల పట్ల ప్రభుత్వం ఇదే ధోరణిలో వ్యవహరిస్తే సోమవారం నుంచి అత్యవసర సేవలూ బహిష్కరిస్తామంటూ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావులకు శుక్రవారం నోటీసులు అందచేశారు. ఇప్పటి వరకూ సాధారణ సేవలను మాత్రమే జూడాలు బహిష్కరించి, అత్యవసర సేవలైన క్యాజువాలిటీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, పీఐసీయూ, లేబర్ రూమ్లలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం నుంచి అత్యవసర సేవలూ బహిష్కరిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జూడా పిలుపునిచ్చింది. -
కృష్ణా యూనివర్సిటీలో మొక్కలు నాటిన వీసీ
కోనేరుసెంటర్: ఆగస్టు 15వ తేదీ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వర్సిటీ పరిసరాలలో ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనం పెంపొందించే సదుద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపకులపతి కె.రాంజీ మాట్లాడుతూ మన పరిసరాలు పచ్చదనంతో నిండి ఉన్నప్పుడే స్వచ్ఛమైన ప్రాణవాయువు అందుబాటులో ఉంటుందన్నారు. మొక్కల్ని నాటడమే కాకుండా అవి పెరిగి పెద్దయ్యే వరకు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎన్.ఉష, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వైకే సుందరకృష్ణ, బయోటెక్నాలజీ ప్రొఫెసర్ మారుతి, ఎన్ ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎం.శ్రావణి, వివిధ కళాశాలల ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. హెచ్ఎంలకు ఎంఈఓల ఆదేశం మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల అధికారిక సర్దుబాటు ప్రక్రియ ప్రారంభానికి ముందే కొందరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారంటూ శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి సదరు మండల విద్యాశాఖాధికారులను (ఎంఈఓ) వివరాలు కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఉపాధ్యాయులే పరస్పరం సర్దుబాటు చేసుకున్నారని తాళ్లపాలెం పాఠశాల హెచ్ఎం తెలిపినట్లు సమాచారం. దీంతో సంబంధిత పాఠశాలల హెచ్ఎంల నుంచి పూర్తి వివరాలను ఎంఈఓలు కోరినట్లు తెలుస్తోంది. హెచ్ఎంల నుంచి వివరాలు అందిన అనంతరం వాటిని పరిశీలించి నివేదిక రూపొందించి జిల్లా విద్యాశాఖాధికారికి (డీఈఓ) సమర్పించనున్నారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని గురుకుల సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఇరువురు అధ్యాపకులను కళాశాల విద్య కమిషనర్ సస్పెండ్ చేశారు. ఇటీవల బదిలీలలో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అధ్యాపకులు గురుకుల కళాశాలకు వచ్చారు. అయితే ఇక్కడ వర్క్లోడ్ తక్కువగా ఉండటంతో సదరు ఇద్దరినీ వార్డెన్, డెప్యూటీ వార్డెన్గా వినియోగిస్తున్నారు. ఇటీవల కళాశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆ విద్యార్థినులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు వార్డెన్, డెప్యూటీ వార్డెన్ నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న కళాశాల విద్య కమిషనర్ ఆ ఇరువురు అధ్యాపకులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): విద్యార్థులు పరిశోధన స్టార్టప్ల దిశగా ముందుకు సాగాలని ఎన్టీఆర్ జిల్లా ఆర్డీఓ వెన్నెల శ్రీనివాస్ సూచించారు. స్థానిక ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎక్సెల్ఆర్ సహకారంతో సస్టైనబుల్ బయో ఇన్నోవేషన్ ఐడియాస్ అక్రాస్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ అనే అంశంపై హ్యాక్థాన్ జరిగింది. కృష్ణా వర్సిటీ రెక్టార్ ఎం.బసవేశ్వరరావు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. -
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు
సంస్థ సీజీఎం శేషాచలం మధురానగర్(విజయవాడసెంట్రల్): బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల అవసరాలు, ఆకాంక్షల మేరకు మరింత నాణ్యమైన సేవలు అందించటంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ఆ సంస్థ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం తెలిపారు. విజయవాడ చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ భవన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రీడమ్ 2.0 మొబైల్ ఆఫర్లో భాగంగా కేవలం రూ.1కే సిమ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ప్లాన్లో రోజుకు ఒక జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత కాల్స్ 24 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయన్నారు. అలాగే రూ.2399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లో 365 రోజులకు అదనంగా మరో 47 రోజుల వ్యాలిడిటీ ఇస్తున్నామని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ ప్రీడమ్ ఫ్లాన్ రూ. 1111 ద్వారా 200 ఎంబీపీఎస్ వేగంతో నెలకు 5000జీబీ డేటాతో పాటు 25కు పైగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయని వివరించారు. ఫైబర్ బేసిక్ ప్లాన్లో నెలకు రూ. 499 అద్దెతో కొత్తగా తీసుకునే వినియోగదారులకు మొదటి నెల సేవలను ఉచితంగా అందించటంతో పాటు నెలకు రూ. 100 చొప్పున మూడు నెలల పాటు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ.. ఏపీ సర్కిల్లో 6850 టవర్లు, 15 వేల బీటీఎస్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం సేవలు అందిస్తున్నామన్నారు. అన్కవర్డ్ గ్రామాలకు 4జీ మొబైల్ సేవలను అందించేందుకు మరో 814కొత్త 4జీ ఆమోదం లభించిందన్నారు. ఇప్పటికే 367 సైట్లలో పనులు ప్రారంభమయ్యాయని.. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని తెలిపారు. సమావేశంలో బీఎస్ఎన్ఎల్ పీజీఎం వై.రవీంధ్రనాధ్, ఎల్.శ్రీను, జీఎం కె.మురళీకృష్ణ, కె.వెంకట ప్రసాద్, కె.సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
చిలకలపూడి(మచిలీపట్నం): యువత దేశానికి అమూల్యమైన ఆస్తి అని, యువతలో చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వారిని దుర్వసనాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ భవన్లో న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశాల్లో మనదేశం ముందంజలో ఉందన్నారు. యువత తమ శక్తి, ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించాలన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. పదో అదనపు జిల్లా న్యాయమూర్తి సీహెచ్ దుర్గాపూర్ణిమ, జిల్లా పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఓవీ నాగేశ్వరరావు, పోక్సో కోర్టు న్యాయమూర్తి జి. వెంకటేశ్వర్లు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్. వరలక్ష్మి, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తుంగల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నేడు వారణాసి సర్వీస్ ప్రారంభం గన్నవరం: స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం 5.30 గంట లకు కోల్కతా–వారణాసి–విజయవాడ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంతరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీస్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు, స్థానిక ఎమ్మెల్యే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. నేరాల నియంత్రణకు కఠిన చర్యలు పెనమలూరు: జిల్లాలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. కానూరు అన్నే కల్యాణ మండపంలో బుధవారం జిల్లా అర్ధ సంవత్సరం క్రైమ్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్నాయుడు మాట్లాడుతూ రాత్రి సమయాల్లో గస్తీ, బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసులు త్వరతగతిన విచారణ పూర్తిచేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని స్పష్టం చేశారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన పెంచాలని, పాతనేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉండాలని తెలిపారు. గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. హెచ్ఐవీ రహిత రాష్ట్రమే లక్ష్యం భవానీపురం(విజయవాడపశ్చిమ): హెచ్ఐవీ, ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నాటికి నిర్దేశిత 95–95–99 లక్ష్యాలను వంద శాతం సాధించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ సాధనలో యువతతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీ శాక్స్) ఆధ్వర్యాన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన 60రోజుల ప్రత్యేక ప్రచార, విద్య ప్రచారం పేరుతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ‘సురక్ష డ్యాష్ బోర్డ్’ను ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ మాట్లాడుతూ రానున్న 60 రోజులపాటు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు, ఏపీ శాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్ రాజ్ మాట్లాడారు. ఏపీ శాక్స్ ఇన్చార్జ్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మి, జేడీఐఈసీ డాక్టర్ మంజుల, జేడీ టీఐ సుకుమార్, జేడీ బీఎస్డీసీఎస్టీ డాక్టర్ శ్రీనివాస వర్మ, జేడీ బీటీఎస్ డాక్టర్ చక్రవర్తి పాల్గొన్నారు. -
సమర్థంగా గంజాయి నియంత్రణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దడంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నిరంతరాయంగా కృషి చేసి గణనీయమైన ఫలితాలను సాధించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్కార్డ్, నషా ముక్త్ భారత్ కార్యక్రమాలపై సమావేశం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విజయవాడకు సంబంధించి ‘గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్’ అనే నానుడి ఇకపై వినిపించకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 100శాతం నియంత్రణ.. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి నియంత్రణకు సంబంధించి 100 శాతం లక్ష్యాన్ని సాధించామని పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. గత రెండు విడతల్లో నిర్వహించిన గంజాయి నిరోధక కార్యక్రమాల్లో భాగంగా 1,287 మందిని పాజిటివ్ కేసులుగా గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ‘ఈగల్ 1972’ కార్యక్రమానికి సంబంధించిన ప్రదర్శనతో పాటు, ‘సే నో టు డ్రగ్స్’ వాల్ పోస్టర్ను కలెక్టర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రతిజ్ఞ చేయించారు. డీసీపీ అడ్మిన్ కె.జి.వి.సరిత, ఎన్టీఆర్ జిల్లా ఈగల్ అధికారి రవీంద్ర, జిల్లా వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వి.కామరాజు, హెల్త్ కేర్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ అనిల్ కుమార్, ఆకాష్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు -
వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్
మచిలీపట్నంఅర్బన్: వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు నామినీలుగా పనిచేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు అనేకసార్లు వీఆర్ఏల సమస్యలను విన్నవించినా పరిష్కారం కాలేదన్నారు. ప్రస్తుతం వీఆర్ఏలకు కేవలం రూ.10,500 మాత్రమే వేతనం అందుతోందని, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ మొత్తంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో మంగళగిరిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వెంకటరత్నం తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చాట్ల రమేష్ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటెండర్, నైట్ వాచ్మెన్, చైన్మెన్ పోస్టులను వీఆర్ఎలతోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సంఘం ప్రతినిధులు, సభ్యులు, పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు. -
పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులకు పురిటి నొప్పులు
నాలుగు జిల్లాల నుంచి.. పీహెచ్సీల్లో దిగజారిన సేవలు.. గత ప్రభుత్వంలో నాడు–నేడు పథకం ద్వారా పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీలను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. అంతేకాక లేబర్ రూమ్స్ ఏర్పాటు చేసి, అత్యాధునిక డెలివరీ టేబుల్స్ను ఏర్పాటు చేశారు. ప్రసవాలు చేసేందుకు అనువైన పరిస్థితిని కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం వైద్య రంగం పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా అవన్నీ మూలన పడ్డాయి. అధిక శాతం పీహెచ్సీల్లో ప్రసవాలు జరగని పరిస్థితి నెలకొంది. ప్రైవేటుకు వెళ్లలేక.. గర్భిణులు, బాలింతలపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను పట్టించుకోని వైనం అక్కడ వైద్యం అందక విజయవాడ జీజీహెచ్కు రాక నాలుగు జిల్లాల నుంచి వస్తుండటంతో ఆస్పత్రిపై విపరీతమైన భారం పడకలు చాలక ఒక్కో బెడ్పై ఇద్దరేసి చొప్పున ఉంచాల్సిన దుస్థితి -
ఏ బిడ్డా.. ఇది మా అడ్డా!
సాక్షి, విజయవాడ: దేశంలోనే అతిపెద్ద బస్టాండ్ అయిన విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్రయాణికులు భారీగా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే తగినన్ని ఆర్టీసీ బస్సులు లేకపోవడం.. ఉన్నా నిర్ణీత వేళకు రాకపోవడం.. సీ్త్రశక్తి బస్సుల్లో కిక్కిరిసి ఎక్కుతుండటంతో.. ఇదే అదునుగా కొందరు ప్రైవేటు వాహనదారులు ఆర్టీసీకి గండి కొడుతున్నారు. బస్టాండ్ బయటే వాహనాలను పెట్టుకుని.. వారి మనుషులను ప్లాట్ఫాంల వద్దకు పంపి.. అక్కడ బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులతో మాట కలిపి తమ వాహనాల్లో ఎక్కేలా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఆలస్యంగా వెళ్తుందని, కారు, వ్యాన్లలో అయితే కావాల్సిన చోటు ఆపుతారని.. త్వరగా గమ్యస్థానం చేరుకోవచ్చని ప్రయాణికులను ఒప్పిస్తున్నారు. అందుకుగానూ సదరు వ్యక్తులకు కొంత కమీషన్ కూడా వాహనదారుల నుంచి అందుతోంది. ఇదీ పరిస్థితి.. విజయవాడ బస్టాండ్ నుంచి రోజూ 2లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. మొత్తం 2,700 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తాయి. బస్టాండ్లో మొత్తం 62 ప్లాట్ ఫాంలు ఉండగా.. డిపార్చర్ బ్లాక్లో 46, అరైవల్ బ్లాక్లో 16 ప్లాట్ఫాంలు, వాటిల్లో రెండు కార్గో సర్వీసులకు కేటాయించారు. అలాగే గవర్నర్ పేట 1, 2 డిపోలు, ఆటోనగర్, ఇబ్రహీంపట్నం డిపోలు ఉన్నాయి. ఈ డిపోల నుంచి సిటీ సర్వీసులు తిరుగుతాయి. అయితే విజయవాడ నుంచి తెలంగాణ, చైన్నె, కర్ణాటక, బెంగళూరు, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు సర్వీసులు నడుస్తున్నాయి. వీకెండ్లో మరింత డిమాండ్.. వారాంతపు సెలవు దినాలు, పండుగల సమయాల్లో, కళాశాలలకు సెలవు దినాల్లో ప్రైవేటు వాహనదారులు టార్గెట్గా పెట్టుకుని ప్రయాణికులను తరలిస్తున్నారు. ఆయా దినాల్లో ఆర్టీసీ సర్వీసులు సైతం తక్కువగా ఉంటుండటంతో ప్రైవేటు వ్యక్తులు ఇదే అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు సొంత లేదా ఆఫీసు పనుల నిమిత్తం విజయవాడ వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు యాప్లను ఓపెన్ చేసుకుని ప్రయాణికులను తరలిస్తున్నారు. ప్రయాణం పదిలమేనా? ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు అంత క్షేమకరం కాకపోయినా.. ప్రయాణికులు కార్లలో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. వేగంగా వెళ్లేటప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగితే కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ఆర్టీసీలో అయితే ఏదైనా ప్రమాదం బారిన పడితే వారికి బీమా రక్షణ ఉంటుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు వివరించాలి. వ్యక్తిగత కార్లలో కూడా.. విజయవాడకు వ్యక్తిగత పనుల మీద వచ్చే కొంద రు బడాబాబులు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ విజయవాడకు వచ్చే కొందరు సాఫ్ట్వేర్, పేరున్న కంపెనీల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసే కొందరు.. ఖాళీగా వెళ్లడం ఎందుకు.. నలుగురు ఎక్కినా డీజిల్కు, చేతిఖర్చులకు వస్తాయన్న ఉద్దేశంతో ప్రయాణికులను పలు యాప్ల ద్వారా ఎక్కించుకుంటున్నారు. మరి కొందరేమో వ్యక్తిగత పనుల మీద విజయవాడకు వచ్చేటప్పుడు.. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రైవేటు యాప్ల ద్వారా ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం బస్టాండ్కు 10 కిలోమీటర్ల వరకు ప్రైవేటు వాహనాలను నిలపకూడదనే నిబంధనను ప్రైవేటు వాహనదారులు ఖాతరు చేయడం లేదు. దీనికితోడు ఆర్టీసీలోని ఉన్నతాధికారులు సైతం కొందరు ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేసుకుని ప్రయాణికులను తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తుండటం వారికి కలిసి వస్తోంది. ప్రైవేటు వాహనాలను బస్టాండ్ సమీపంలోని కంట్రోల్ రూం దగ్గర, బస్టాండ్కు ఎదురుగా ఉన్న కృష్ణలంక రోడ్డులో నిలుపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి పోటీ పడుతుంటారు. -
ముగిసిన సారె సంబరాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు ఆలయ సిబ్బంది అమ్మవారికి సారెను సమర్పించారు. గత నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా నాలుగు రాష్ట్రాల నుంచి సుమారు ఆరు లక్షల మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. దేవస్థానం తొలిసారిగా సారె సమర్పించిన భక్తుల వివరాలతో రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఆషాఢ మాసంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు. శుక్రవారం, వీకెండ్లలో సుమారు 70వేల నుంచి 80వేల మందికి పైగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించగా, సాధారణ రోజులలో సగటున 15వేల మందికి పైగా భక్తులు సారె సమర్పించారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఏపీ, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు విచ్చేశారని వివరించారు. అంగరంగ వైభవంగా.. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మేళతాళాలతో ఊరేగింపు కనకదుర్గనగర్కు చేరుకుంది. కనకదుర్గనగర్లో బలిపీఠం అమ్మవారికి పసుపు, కుంకుమ, పూజా సామగ్రిని సమర్పించిన అనంతరం మహామండపం మీదగా ఆలయానికి చేరుకున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను అందజేశారు. చివరి రోజు కావడంతో పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కోట ప్రసాద్, ఏసీ రంగారావు, ఈఈ ఎల్.రమాదేవి, ఏఈవోలు ఎన్. రమేష్బాబు, తిరుమలేశ్వరరావు, గంగాధర్, డీఈఈ అశోక్కుమార్, రవీంద్రనాథ్, సూపరింటెండెంట్లు, ఆలయ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సంబరంలో పాల్గొన్నారు. ఆషాఢ మాసం చివరి రోజున దుర్గమ్మకు సారె సమర్పించిన ఆలయ సిబ్బంది -
దూసుకొచ్చిన ఆక్సిజన్ సిలిండర్లు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఆక్సిజన్ సిలిండర్ల లీకేజీ ఘటన మచిలీపట్నంలో కలకలం రేపింది. దుకాణంలో లీకై న సిలిండర్లు గోడలను బద్దలు చేసుకుంటూ రోడ్డుపైకి దూసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్రవాహనాలు, ఓ కారు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒకరు గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీస్, ఫైర్ అఽధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసుల కథనం మేరకు.. ఈడేపల్లి బెల్ కంపెనీ వెనుక రోడ్డులో ఉన్న అశ్విని ఎంటర్ప్రైజెస్లో బుధవారం ఉదయం తొలుత ఒక ఆక్సిజన్ సిలిండర్ లీకై ంది. దానితో పాటు మరో మూడు సిలిండర్లు ఒకదాని తరువాత ఒకటి లీకవటంతో షాపులో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. కంగారుపడిన స్థానికులు షాపు వద్దకు వెళ్లి చూస్తుండగా లీకై న సిలిండర్లు పేలి ఒక్కసారిగా గోడను బద్దలుకొట్టుకుని రోడ్డుపైకి దూసుకువచ్చాయి. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహ నాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయి. ఒక కారు ధ్వంసమైంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న సమ్మెట వెంకట కృష్ణమాచారి గాయపడ్డాడు. అతడిని స్థానికులు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణా జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి ఏసురత్నం, చిలకలపూడి ఎస్ఐ పద్మ, ఇతర సిబ్బంది పరిస్థితులను పరిశీలించారు. షాపు యజమాని అద్దంకి వెంకయ్యనాయుడుపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇళ్ల మధ్య ప్రమాదకరంగా ఉన్న దుకాణాన్ని తక్షణమే ఖాళీ చేయించాలంటూ ఆ ప్రాంత వాసులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ షాపులోని సామగ్రిని ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టినట్లు ఫైర్ అధికారి ఏసురత్నం తెలిపారు. -
జూనియర్ డాక్టర్ల శాంతియుత నిరసన
మచిలీపట్నంఅర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా జూని యర్ డాక్టర్లు చేపట్టిన నిరసనలో భాగంగా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఎస్పీవీ జీఎంసీ జూనియర్ డాక్టర్లు శాంతియుతంగా నిరసన తెలిపారు. జూని యర్ డాక్టర్లకు ప్రస్తుతం అందుతున్న స్టైపెండ్ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, కర్ణాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో స్టైపెండ్ తక్కువగా ఉందని, ఆయా రాష్ట్రాల స్థాయిలో ఏపీలోనూ పెంచాలని కోరారు. నిరసన కారణంగా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలతో పాటు అన్ని వైద్య సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి స్టైపెండ్ పెంపుపై తక్షణ నిర్ణయం తీసుకోవా లని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల మచిలీపట్నం అధ్యక్షుడు డాక్టర్ కె.శివబ్రహ్మం, ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్. అనిల్కుమార్, డాక్టర్ ఎం.కోమల్ ఫణిర్మయి, కార్యదర్శి డాక్టర్ దివాకర్రెడ్డి, ఎ. సంతోషిని, ఎస్ఆర్ అండ్ పీజీ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, సాంకేతిక ఆధారిత పరిపాలన ద్వారా చేపడుతున్న వినూత్న కార్య క్రమాలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతినిధి బృందం నుంచి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందించడంతో ది కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భవనారి వెంకటేష్బాబు, కొప్పోలు సుధాకరరావు బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ప్రతినిధి బృందం ఏపీ ముఖ్యమంత్రితో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ పియూష్ కుమార్, చీఫ్ కమిషనర్ అహ్మద్బాబు సమక్షంలో నిర్వ హించిన సమావేశంలో రాష్ట్ర ఏపీ పరిపాలనలో అమలు చేస్తున్న వినూత్న సాంకేతిక కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించడం రాష్ట్రానికి, వాణిజ్య పన్నుల శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాలను ఇతర రాష్ట్రాల్లో అనుసరించదగిన ఉత్తమ పద్ధతులుగా జీఎస్టీ కౌన్సిల్ ప్రతినిధి బృందం గుర్తించడం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు లభించిన విశిష్ట గౌరవమని వివరించారు. మచిలీపట్నం అర్బన్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటంతోపాటు సరైన అవగాహన కలిగి ఉండాలని కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎల్.దయాకర్ సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి సూచ నల మేరకు ‘సుఖవ్యాధులు, హెచ్ఐవీ, ఎయిడ్స్పై విస్తృత ప్రచార కార్యక్రమం’ను బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రారంభించారు. అక్టోబర్ 12వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ దయాకర్ జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు, జిల్లా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ పి.కిరణ్, జిల్లా న్యూక్లియర్ మెడికల్ అధికారి డాక్టర్ వేణుగోపాల్, గైడ్ ప్రోగ్రాం మేనేజర్ శశికళ, యోజన సంక్షేమ సంఘం ప్రోగ్రాం మేనేజర్ ప్రశాంతి, అంకిత సంస్థ ప్రోగ్రాం మేనేజర్ అరుణ్, వాసవి మహిళా మండలి ప్రోగ్రాం మేనేజర్ రాజమోహన్ పాల్గొన్నారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): బాలికపై బాలుడు లైంగికదాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. కంకిపాడుకు చెందిన బాలిక పదో తరగతి వరకు చదువు కుని ఇంటి వద్దే ఉంటోంది. మచిలీపట్నం టెంపుల్కాలనీకి చెందిన పదో తరగతి విద్యార్థికి కంకిపాడులో బంధువులు ఉండటంతో తల్లిదండ్రులతో అక్కడికి వెళ్లొస్తుండేవాడు. ఈ నేపథ్యంలో బాలిక, బాలుడి మధ్య స్నేహం ఏర్పడింది. రెండు నెలల క్రితం బాలిక మంగినపూడి బీచ్కు వెళ్లొస్తానని తల్లిదండ్రులకు చెప్పి మచిలీపట్నం వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్లకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను బాలుడి ఇంటి వద్ద ఉన్నానని చెప్పి, అతని తల్లిదండ్రులతో మాట్లాడించింది. వారం రోజులు మచిలీపట్నంలోనే ఉండి కంకిపాడు వెళ్లింది. మంగళవారం బాలిక అస్వస్థతకు గురి కావటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకె ళ్లారు. పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది బాలిక రెండు నెలల గర్భవతని చెప్పారు. బాలిక తల్లిదండ్రులు కంకిపాడులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంకిపాడు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును చిలకలపూడి పోలీసులకు బదిలీచేశారు. చిలకలపూడి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షల అనంతరం తదుపరి దర్యాప్తు చేపడ్తామని సీఐ నబీ తెలిపారు. -
చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా వేధింపులు
గిరిజన కాంట్రాక్టర్ రాజు నాయక్ ఆవేదన లబ్బీపేట(విజయవాడతూర్పు): తాను చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరుడు, కాంట్రాక్టర్ పామర్తి రాజా తనను కులం పేరుతో దూషిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని కాంట్రాక్టర్ రాజు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను కాంట్రాక్టర్ పామర్తి రాజా వద్ద కొన్నేళ్లుగా పెట్రోల్ బంక్ల నిర్మాణ పనులు చేస్తున్నానని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో పెట్రోల్ బంక్ నిర్మాణ పనులు చేపట్టి 40 శాతం పూర్తి చేసిన తర్వాత ఎన్వోసీ ఇచ్చేందుకు కలెక్టర్ నిరాకరించారన్నారు. దీంతో హై కోర్టు, కర్నూలు కలెక్టరాఫీస్, ఆదోని కార్యాలయాల చుట్టూ తిరిగి స్వయంగా ఎన్వోసీ తెచ్చినట్లు పేర్కొన్నారు. అయితే తనను పక్కన పెట్టి, వేరే వారితో పనులు చేయించుకున్నారని, రూ.88 లక్షల బిల్లులు పెట్టి, అందులో తనకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ గురించి అడిగేందుకు ఫోన్ చేస్తే బెదిరింపులకు దిగారని, తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తాను ఒక గిరిజనుడిననే నెపంతో పామర్తి రాజా ఇబ్బంది పెడుతున్నాడని, తన కులాన్ని, తల్లిని, జాతిని, పుట్టుకను కించపరి చారని వాపోయారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు రూ.1.30 కోట్లకు పైగా బకాయిలు రావాలని, ఇల్లు, బంగారం కుదువబెట్టి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మంత్రి కొల్లు రవీంద్రకు చెప్పానని, త్వరలో గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణిని కలుస్తానని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. గిరిజన కుల పెద్ద నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు. సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): అనుమానాస్పదంగా యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఎస్ఎన్పురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కట్టా దినేష్ మణికంఠ (29) నగరపాలక సంస్థలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలసి ఖుద్దుస్నగర్, స్టార్ బిల్డింగ్ రోడ్డులో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి తండ్రి తిమోతి రాజుతో కలసి బెంజిసర్కిల్ వద్ద ట్రెండ్సెట్లో సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వచ్చారు. అనంతరం ఎవరి గదులకు వారు వెళ్లి నిద్రించారు. బుధవారం ఉదయం డ్యూటీ టైమ్ అవుతున్నా మణిఖంఠ నిద్రలేవక పోవడంతో తిమోతిరాజు అతని గదికి వెళ్లాడు. మణి కంఠ ఫ్యాన్కు దుప్పటితో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే మణికంఠను కిందకి దింపి 108కి ఫోన్ చేయగా వారు వచ్చి చూసి మృతి చెందాడని నిర్ధారించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నేడు ఐలా ఎన్నికలు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అనుమానాస్పదంగా ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సింగ్నగర్ లూనాసెంటర్ ప్రాంతానికి చెందిన అరటికాయల త్యాగరాజు(70) కుటుంబ సభ్యులు మొత్తం తీర్థయాత్రలకు తమిళనాడు వెళ్లారు. త్యాగరాజు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. ఈ నెల ఐదో తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన గాయాలతో తిరిగి వచ్చాడు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే ఓ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. -
ఇన్సర్వీస్ టీచర్లకు టెట్లో మినహాయింపు ఇవ్వాలి
మచిలీపట్నంఅర్బన్: టెట్లో ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపులు కల్పించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు కోరారు. ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్న ఉపాధ్యా యులు టెట్ పరీక్ష తప్పనిసరి చేయడంతో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) కృష్ణా జిల్లా శాఖ నాయకులు బుధవారం డీఈఓ యు.వి. సుబ్బారావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నియామకాలకు టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరి చేస్తూ 2010లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. 2015లో విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(1)కు చేసిన సవరణల నేపథ్యంలో సర్వీసులో కొనసాగేందుకు, ప్రమోషన్ పొందేందుకు కూడా టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు. 2010వ సంవత్సరానికి ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు సైతం టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇన్సర్వీస్ టీచర్లలో చాలామంది దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వారేనని, వారిలో పలువురు ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్నారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణకు ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న వారికి మినహాయింపు ఉన్నప్పటికీ, ప్రమోషన్ పొందాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అంగీకరించిన నేపథ్యంలో తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నా రని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.డి.షౌకత్ హుస్సేన్, బి.కనకారావు, జిల్లా గౌరవాధ్యక్షుడ జె.లెనిన్ బాబు, జిల్లా కార్యదర్శి రంగనాథ్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు జె.ప్రసాద రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు అబ్దుల్ వహీద్, పి.పాపయ్య, కె. అర్జున్, ఫణి కిరణ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా డీఎస్ఏలో అవినీతి క్రీనీడలు
చిలకలపూడి(మచిలీపట్నం): విద్యతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికలపై చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం క్రీడా రంగానికి కేటాయిస్తున్న పరిమిత నిధులు సైతం పూర్తిస్థాయిలో సద్వినియోగం కావడం లేదు. విద్యార్థులకు క్రీడల కోసం ప్రభుత్వం అందిస్తున్న క్రీడా సామగ్రిని ప్రైవేటు మార్కెట్కు తరలిస్తున్నారనే ఆరోపణలతో పాటు, క్రీడా సదుపాయాలను వినియోగించుకునేందుకు అద్దెల పేరుతో వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాల్సిన కృష్ణా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) పనితీరుపై క్రీడా వర్గాల్లో అసం తృప్తి వ్యక్తమవుతోంది. డీఎస్ఏలో జిల్లా అధికారి వ్యవహారశైలిపై పలు ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అధికారికంగా సమగ్ర విచారణ జరగకపోవడంతో వాస్తవాలపై స్పష్టత కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతా తానై.. ఆ అధికారి భర్త కంప్యూటర్ ఆపరేటర్గా, కుమార్తె ఒకసారి కోచ్గా, మరో సారి డీటీపీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన పలువురు సంస్థలో విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వారి నియామకాలు ఏ ప్రాతిపదికన జరిగాయి? విధుల కేటాయింపులకు ఎవరి అనుమతులు ఉన్నాయి? నిబంధనలు ఏమి చెబుతున్నాయి? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తూ జిల్లా స్థాయి అధికారి హోదాలో విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు నియామక ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనలను వెల్లడించాలని క్రీడా వర్గాలు కోరుతున్నాయి. ఎంపిక పోటీల నిధులపైనా ఆరోపణలు అమరావతి చాంపియన్షిప్ కోసం ప్రస్తుతం నియోజకవర్గ, జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. రిజిస్టర్ చేసుకున్న క్రీడాకారులకు రోజుకు రూ.140 చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు సమాచారం. అయితే ఎంపిక పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కొందరు కోచ్లు సొంత నిధులతో చేసుకుని, క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఒకటి, రెండు ఎంపిక కేంద్రాల్లో మాత్రమే కొంత మొత్తాన్ని ఖర్చు చేసి, మిగిలిన నిధుల వినియోగంపై స్పష్టత లేనందున పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగమవుతున్నా యనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిధుల వినియోగంపై సంబంధిత అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాలని క్రీడా వర్గాలు కోరుతున్నాయి. పిల్లల కడుపుకొట్టి ‘పోషకాహార’ నిధులు స్వాహా శిబిరాల నిర్వహణ కోసం ప్రభుత్వం మొత్తం రూ.5,78,860 విడుదల చేసింది. ఇందులో శిక్షణకు వచ్చే ప్రతి విద్యార్థికి రోజుకు రూ.10 చొప్పున (రూ.4 చిక్కీ, రూ.6 ఇతర పౌష్టికాహారం) అందించాలని నిబంధన ఉంది. అయితే ఏ ఒక్క శిబిరంలోనూ పిల్లలకు చిక్కీలు గానీ, పౌష్టికాహారం పంపిణీ చేసిన దాఖలాలు లేవని క్రీడాకారుల తల్లిదండ్రులు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. సమ్మర్ క్యాంపుల పేరుతో శిక్షణను మమ అనిపించి ఆ నిధులు సైతం ఆ అధికారి నొక్కేశారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. నిర్వహణ నిధులపై ఆరోపణలు క్రీడా మైదానాలు, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియంలలో సదుపాయాల నిర్వహణ పేరుతో పెద్ద మొత్తంలో నిధులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్వహణ పేరుతో వసూలు చేసిన నగదును ఎక్కడ జమ చేస్తున్నారు? ఏయే పనులకు ఎంత ఖర్చు చేస్తున్నారు? వాస్త వంగా ఆ పనులు జరిగాయా? అనే అంశాలపై పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని పలువురు కోరుతున్నారు. సమ్మర్ క్యాంపుల నిధులపైనా.. ఏటా వేసవిలో విద్యార్థుల కోసం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ వేసవిలో జిల్లాలో 52 ఉచిత వేసవి శిక్షణ శిబిరాలకు అనుమతులు లభించగా 42 శిబిరాలను నిర్వహించినట్లు డీఎస్డీఓ తెలిపారు. అయితే 16 కేంద్రాల్లో 18 రకాల క్రీడలకు మాత్రమే శిక్షణ జరిగింది. నిధులు కేటాయింపు మాత్రం 42 శిబిరాలకు చూపించి క్యాంపులు పూర్తయిన సుమారు రెండు నెలల తర్వాత కొంత మంది కోచ్లకు మాత్రమే నిధులు అందించారనే విమర్శలు ఉన్నాయి. కోచ్లు, పీఈటీలు, పీడీలతో సమన్వయం కరువు జిల్లాలోని కోచ్లు, పీఈటీలు, పీడీలతో ఆ అధికా రికి సఖ్యత లేదనే విమర్శలు ఉన్నాయి. అవినీతి, నిధుల వినియోగం, విధుల కేటాయింపు, కుటుంబ సభ్యుల పాత్ర తదితర అంశాలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. క్రీడా నిధుల వినియోగానికి సంబంధించిన బిల్లులు, ఓచర్లు, బ్యాంకు లావాదేవీలు, సమ్మర్ క్యాంపుల ఖర్చులు, సిబ్బంది నియామకాలు, విధుల కేటాయింపులను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. క్రీడాకారుల అభివృద్ధి కోసం కేటాయించిన ప్రజాధనం పారదర్శకంగా వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. స్వతంత్ర, సమగ్ర విచారణ జరిపి నివేదికను బహిర్గతం చేయాలని క్రీడా వర్గాలు కోరుతున్నాయి. -
వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఎమ్మెల్యే చెప్పు చేతల్లో ఖాకీలు నడుస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ మరో ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న పార్టీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజతో పాటు 12 మందిపై కేసులు నమోదు.డీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్యలు కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అజిత్ సింగ్నగర్ ఆంధ్రప్రభకాలనీలో మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నిబంధలను అతిక్రమించి రోడ్లపైకి వచ్చి దగా డీఎస్సీ, మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆరోపిస్తూ అజిత్సింగ్నగర్ ప్రాంతానికి చెందిన వృద్ధుడు షేక్ కబీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లాది విష్ణు, అవుతు శ్రీశైలజ, మాజీ కార్పొరేటర్లు బీహెచ్ఎస్వీ జానారెడ్డి, నందెపు జగదీష్, పార్టీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, శ్రీరాములు, గుండె సుందర్పాల్, అలంపూరు విజయ్, మాతా మహేష్, మేడా రమేష్, త్రివేణిరెడ్డి, వరలక్ష్మిపై 126(2), 223, రెడ్విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్–2 ప్రకారం కేసులు నమోదు చేశారు. కార్యక్రమానికి హాజరుకాని వారిపైనా కేసులు అజిత్సింగ్నగర్, నున్న, సత్యనారాయణపురంస్టేషన్ల పోలీసు అధికారులు, సిబ్బంది వచ్చి వైఎస్సార్ సీపీ నాయకుల ర్యాలీని అడ్డుకున్నారు. ఆ సమయంలో తమ ఫోన్లతో పాటు డ్రోన్లతో ర్యాలీని వీడియో తీశారు. అయినా కార్యక్రమానికి హాజరుకాని వారిపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది మారింది. కక్షపూరితంగా ఎమ్మెల్యే చెప్పిన వారిపై పోలీసులు గుడ్డిగా కేసులు నమోదు చేశారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ర్యాలీ నిర్వహణపై కేసులు నమోదు జి.కొండూరు: రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్సార్ సీపీ శ్రేణులపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు జి.కొండూరులో సోమవారం నిర్వహించిన ర్యాలీకి అనుమతులు లేవంటూ ముందుగా ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీ నిర్వహణ అనంతరం మైలవరం నియోజకవర్గానికి చెందిన 35 మంది పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలపై మంగళవారం రాత్రి జి.కొండూరు పోలీసుస్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై వైఎస్సార్ సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే కేసులు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడుతున్నాయి. -
వైఎస్సార్ సీపీలో చేరికలు
జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు అమరబోయిన రవి, దుండగుల సత్యనారాయణ తదితరులు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈమేరకు సోమవారం పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు సమక్షంలో వారు పార్టీలోకి చేరారు. వారికి వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి పార్టీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు కనపర్తి నరసింహారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి మట్టా ప్రతాపరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై ఉన్న నమ్మకంతో పార్టీ విధానాలకు ఆకర్షితులై పలువురు ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నామని తెలిపారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్ సీపీకి క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో గండ్రాయి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమష్టిగా కృషిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గండ్రాయి గ్రామ పార్టీ అధ్యక్షుడు దమ్మాలపాటి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట్ల వెంకటరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేందుకు పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే నేను కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలన్నారు. ‘అనే నేను’ కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో తాను చేయగలిగే ఒక మంచి పనిని లేదా కృషిని సంకల్పంగా స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు, అధికారులు, యువత, విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు, ప్రముఖులు తదితరులు తమ దేశభక్తి, దేశ నిర్మాణంపై తమ ఆలోచనలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రతిబింబించేలా 30 సెకన్ల ‘‘అనే నేను’’ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని తెలిపారు. ‘‘అనే నేను’’ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసే సమయంలో హ్యాష్ట్యాగ్లను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని పాఠశాలల్లో ‘‘అనే నేను’’ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను చురుకుగా భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటన విడుదల చేశారు. -
చంద్రబాబు ప్రభుత్వం
నీరు ఉండి సాగుకు ఇవ్వని పెడన: కాలువల్లో సరిపడా నీరున్నా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సాగునీరివ్వడం లేదని వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రమేష్(రాము) చెప్పారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఒక్కొక్క రోజు చొప్పున నాలుగు రోజులు రిలేదీక్షలు చేపట్టారు. ఐదో రోజైన సోమవారం పెడనలో నియోజకవర్గ స్థాయి నిరసన ప్రదర్శన(ర్యాలీ) నిర్వహించారు. పెడనలోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు చేరుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోగా, సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ కొనసాగించారు. పెడనలోని బంటుమిల్లి రోడ్డు సెంటర్ వరకు అక్కడ నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా తిరిగి పార్టీ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది. ఎమ్మెల్యే ఇంటికే పరిమితమయ్యారు.. బంటుమిల్లి రోడ్డు సెంటర్లో రాము మాట్లాడుతూ.. కృష్ణా డెల్టాలో చాలా మంది రైతులు సాగునీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెడన నియోజకవర్గంలో సుమారు 80 వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా వీటిల్లో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో వరి సాగు వేశారని, మరో 30 వేల ఎకరాల్లో వరి సాగు వేయాల్సి ఉందని చెప్పారు. వీరంతా నీటి కోసం ఎదురు చూస్తున్నారని, వీరే కాదని కృష్ణాడెల్టా అంతా సాగునీటి విడుదల ఎప్పుడా అంటూ చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఇంటికే పరిమితం కారాదని, నియోజకవర్గంలోని వారందరికీ జవాబుదారీగా ఉండాలని ధ్వజమెత్తారు. మొద్దు నిద్ర విడిచి పెట్టి రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాగునీరు విడుదల చేయలేని వారు పచ్చిరొట్ట విత్తనాలను, వరి విత్తనాలను ఎందుకు సబ్సిడీపై అందజేశారని నిలదీశారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువులు ఎందుకు ఇస్తున్నారంటూ పేర్కొన్నారు. ఒక పక్క నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని పేర్కొంటూనే, మరో పక్క ఎల్నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయని, నీరు అందదని, పంటలు వేయొద్దని చెబుతన్నారని మండిపడ్డారు. నీరు ఇవ్వని పక్షంలో దశల వారీగా రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యచరణ వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణం సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ నాయకులు గరికపాటి రామానాయుడు, కొండవీటి నాగబాబు, తిరుమాని శ్రీనివాసరావు, మైలా రత్నకుమారి, మండల కన్వీనర్లు ముత్యాల నాగేశ్వరరావు, జల్లా భూపతిరావు, పిచ్చిక సతీష్, దావు బైరవలింగం, కటకం ప్రసాద్, ఎండీ ఖాజా, వన్నం శ్రీలత, జన్యావుల ఝాన్సీ, కొల్లాటి గంగాధరరావు, ఎంపీపీ రాజులపాటి వాణి, సంగా మధుసూదనరావు, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. -
అఫీఫాకు మైనారిటీ మంత్రి, డీజీపీ నివాళులు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): డీసీపీ షిరీన్బేగం కుమార్తె ఎండీ అఫీఫా మృతదేహం వద్ద మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూఖ్, రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా సోమవారం నివాళులర్పించారు. చీరాల బీచ్కు స్నేహితులతో కారులో వెళ్తుండగా గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద లారీ, కారు ఢీకొన్న ఘటనలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్బేగం కుమార్తె మహ్మద్ అఫీఫా(24) ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. షిరీన్బేగం, మస్తాన్ దంపతులకు కుమారుడు రెహాన్, కుమార్తె అఫీఫా సంతానం. అఫీఫా ఆచార్య నాగార్జున యూనివర్సీటీలో ఎంఏ సైకాలజీ చేస్తూ సివిల్స్కు ప్రిపేర్ అవుతుంది. అఫీఫా మరణవార్తను జీర్ణించుకోలేక డీసీపీ షీరీన్బేగం గుండెలవిసేలా రోదిస్తున్నారు. కుమార్తె జ్ఞాపకాలను తలుచుకుంటూ.. ఆమె భౌతికకాయాన్ని చూస్తూ పలుమార్లు కుప్పకూలి పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అఫీఫా భౌతికకాయాన్ని విజయవాడ న్యూఆర్ఆర్పేటలోని స్వగృహానికి ఆదివారం రాత్రి తీసుకువచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూఖ్, రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ మహేష్ చంద్ర లడ్డా, కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, డీసీపీలు సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్, డెప్యూటీ మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, అవుతు శ్రీశైలజతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, పలు పార్టీల నాయకులు, ప్రముఖులు అఫీఫా మృతదేహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. డీసీపీ షీరీన్బేగం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయ టాకీస్ వద్ద ఉన్న కబర్స్తాన్లో ముస్లిం సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. పామర్రు: మండల పరిధిలోని కాలువలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పామర్రు ఎస్ఐ కూచిపూడి శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక పసుమర్రు గ్రామంలోని రవులదొడ్డి కాలువలో గుర్తు తెలియని పురుషుని మృతదేహం తేలుతూ ఉన్నట్లు సమాచారం అందటంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. సుమారు 30–40 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా గుర్తించామన్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని, ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతుడు బిస్కెట్ రంగు టీ షర్టు, నీలం రంగు షాట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వివరాల కోసం 94407 96431, 83329 83799 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పెడన: మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కమలాపురానికి చెందిన తడిశెట్టి తేజశ్రీ(22) ఆదివారం నుంచి కనిపించకపోవడంతో ఆమె తండ్రి సూరయ్య సోమవారం ఉదయం పెడన పోలీసులను ఆశ్రయించారు. సోమవారం మధ్యాహ్నం సూరయ్య ఇంటి సమీపంలోని పాడుబడిన బావిలో తేజశ్రీ మృతదేహం తేలింది. పశువుల మేపుకోవడానికి వచ్చిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.నాగేంద్రప్రసాద్ పరిశీలించారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఆమె మానసికంగా ఇబ్బందులు పడుతుందని, ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): రైళ్లలో తిరుగుతూ ప్రయాణికుల దగ్గర సెల్ఫోన్లు చోరీ చేసే దొంగను రైల్వే పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే జీఆర్పీ సీఐ రమణ ఆధ్వర్యంలో సాధారణ తనిఖీల్లో భాగంగా సిబ్బంది ఆదివారం రైల్వేస్టేషన్ను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్లాట్ ఫాం నంబర్ 10, ఉత్తర దిక్కు వైపున ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి 45 ఏళ్ల షేక్ గౌసే అనే వ్యక్తి తారసపడ్డాడు. అతని నడవడికి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అతని వద్ద ఉన్న బ్యాగ్ను పరిశీలించగా అందులో 13 సెల్ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు షేక్ గౌసే విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లోని మసీదురోడ్డులో నివాసిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ సుమారుగా రెండు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
గన్నవరం: గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ విక్రయిస్తున్న ఏడుగురు యువకుల ముఠా సోమవారం ఉంగుటూరు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు సోమవారం ఉంగుటూరు పోలీస్స్టేషన్లో నిందితులను అరెస్ట్ చూపించారు. ఈ సందర్భంగా ఎస్ఐ యూ గోవిందు మాట్లాడుతూ.. నూజివీడుకు చెందిన షేక్ సిద్ధిక్ హుస్సేన్బాషా, కస్తూరి హర్షవర్ధన్ అరకు ఏజెన్సీ ఏరియాలో గంజాయి కొనుగోలు చేసి మండల పరిధిలో విక్రయాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని గారపాడు వద్ద గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. బాషా, హర్షవర్ధన్తో పాటు మానికొండకు చెందిన కస్తూరి కార్తీక్, గోగు సంతోష్, ఆరేపల్లి సురేష్, చిట్టిపోతుల ప్రభు, చాట్ల చైతన్యను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు కేజీల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు గంజాయికి అలవాటు పడడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. కేసులో ఏ–1 నిందితుడైన హుస్సేన్బాషాపై మాచవరం, విజయవాడ టూ టౌన్, వీరవల్లి, ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. అనంతరం నిందితులను గన్నవరం కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
లైంగిక దాడి చేసిన ఆటోడ్రైవర్ల అరెస్ట్
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను మచిలీపట్నం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం బందరు మండలం శారదానగర్కు చెందిన మద్దాల శ్యామ్కిరణ్, కొక్కిలిగడ్డ సిద్ధులు స్నేహితులు, ఈ నెల 6న పెడన మండలం బల్లిపర్రు గురుకులం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలు హాస్టల్ నుంచి బయటికి వచ్చి మచిలీపట్నంలోని కోనేరుసెంటర్కు చేరుకున్నారు. అనంతరం వారిలో ఓ బాలిక ఆటోడ్రైవర్ శ్యామ్కిరణ్కు ఫోన్ చేసి తాము కోనేరుసెంటర్ ఉన్నట్లు చెప్పింది. శ్యామ్కిరణ్ తన స్నేహితుడు సిద్ధును ఆటోలో ఎక్కించుకుని కోనేరుసెంటర్కు వెళ్లాడు. అక్కడ ఉన్న బాలికలను ఆటోలో ఎక్కించుకుని బందరు మండలం రుద్రవరంలోని టిడ్కో గృహాల వద్దకు తీసుకువెళ్లి మాయమాటలు చెప్పారు. ఇద్దరినీ ఖాళీగా ఉన్న ప్లాట్లోకి తీసుకువెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం శారదానగర్లో వాళ్ల ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఇద్దరిలో ఓ బాలిక అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు బాలికపై అనుమానంతో ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆటో డ్రైవర్లపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఆర్పేట పోలీసులు దర్యాప్తులో భాగంగా సోమవారం శ్యామ్కిరణ్, సిద్ధులను టిడ్కో గృహాల వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. బాలికలను తరలించిన ఆటోను సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను సోమవారం కోర్టుకు హాజరుపరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. సమావేశంలో బందరు ఇన్చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్పేట సీఐ కె.ఏసుబాబు, పెడన సీఐ కె.నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పాలవ్యాన్ ఢీకొని సైకిలిస్ట్ దుర్మరణం
చల్లపల్లి: సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తిని పాలవ్యాన్ ఢీకొనటంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన 216 జాతీయ రహదారిపై చల్లపల్లి మండల పరిధిలోని నూకలవారిపాలెం అడ్డరోడ్డు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నూకలవారిపాలెం గ్రామానికి చెందిన మాగంటి వెంకటరమణారావు(56)కు కుమారుడు, కుమార్తె ఇద్దరు సంతానం. కుమార్తె మచిలీపట్నంలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కుమారుడు పల్నాడు జిల్లా, సత్తెనపల్లిలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. తన కుమారుడి వద్దకు వెళ్లేందుకు వెంకటరమణారావు ఆదివారం ఉదయం నూకలవారిపాలెం నుంచి తను సైకిల్పై బయలుదేరి చల్లపల్లి వచ్చాడు. అక్కడ బస్టాండులో సైకిల్ పెట్టి రేపల్లె మీదుగా సత్తెనపల్లిలోని తన కొడుకు వద్దకు వెళ్లాడు. సాయంత్రం అలాగే తిరిగి వచ్చాడు. చల్లపల్లి బస్టాండులో సైకిల్ తీసుకుని వస్తూ పద్మావతి ఆస్పత్రి రోడ్డులో నుంచి 216 జాతీయ రహదారి ఎక్కి ఇంటికి బయలుదేరాడు. మరికొద్ది దూరంలో నూకలవారిపాలెం రోడ్డు వస్తుందనగా ఆదివారం రాత్రి 10.30 సమయంలో బాపట్ల జిల్లా, కావూరికి చెందిన పాలవ్యాను మచిలీపట్నం వైపునకు వెళ్తూ వేగంగా వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో వెంకటరమణారావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ కె.ఈశ్వరరావు, ఎస్ఐ డి.దుర్గాంజనేయులు ఘటనా స్థలాని కి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మోపిదేవి టోల్గేట్ వద్ద ఉన్న కెమెరాల్లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఢీకొన్న వాహనం బాపట్ల జిల్లా, కావూరికి చెందిన పాలవ్యానుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
దుర్గగుడిపై శ్రావణ సన్నాహాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో శ్రావణ మాసం ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో శీనానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం మహామండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్లో ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కుంకుమార్చనకు డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, భక్తులకు లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన టికెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. 12న దుర్గగుడి సిబ్బంది సారె ఈ నెల 12వ తేదీ దుర్గగుడి సిబ్బంది, అధికారులు అమ్మవారికి సారెను సమర్పించనున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రాజగోపురం ఎదుట జెండా వందనం ‘స్వాతంత్య్ర’ వేడుకలను ఈ ఏడాది రాజగోపురం ఎదుట నిర్వహించాలని ఈవో ఆలయ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో కిషోర్కుమార్, ఎసీ రంగారావు, ఎఈవోలు ఎన్. రమేష్బాబు, గంగాధర్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఈఈ ఎల్.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
నల్లబ్యాడ్జీలు ధరించి జూడాల నిరసన
లబ్బీపేట(విజయవాడతూర్పు): సిద్ధార్థ వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రుల్లో సోమవారం జూనియర్ వైద్యులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. తమకు స్టైపెండ్ పెంచే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలిపారు. రెండేళ్లకు ఒకసారి జూడాలకు స్టైపెండ్ పెంచాల్సి ఉంది. అందులో భాగంగా గతేడాది డిసెంబరులో పెంచాల్సి ఉండగా, ప్రభుత్వం స్పందించలేదు. దీంతో వైద్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. సమ్మెకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తమ స్టైపెండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఉంటే అన్నిప్రభుత్వ వైద్య కళాశాలలు, భోదనాస్పత్రిల్లో సమ్మెకు దిగనున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజలకు ఆధార్ సేవలను వేగంగా అందించడానికి ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డు కార్యాలయాలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహించనున్నట్లు వివరించారు. శిబిరాలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు, ఆ తర్వాత 17 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయన్నారు. వీటిలో కొత్త ఆధార్ నమోదు, పేరును సరిచేయడం, నవీకరణ, చిరునామా మార్పు, జనన తేదీ, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ వివరాల అప్డేషన్ చేస్తారని తెలిపారు. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నారు. ఆధార్ వివరాలను సక్రమంగా, తాజా సమాచారంతో ఉండటం ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, ఇతర సేవలను పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పామర్రు: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి నిర్వహణ బాధ్యతలను తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. నిమ్మకూరు పరిధిలోని బెల్ కంపెనీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన ‘ఏక్ పెడ్ మా కే నామ్’ ఒక చెట్టు నాటండి, మెరుగైన రేపటిని పెంపొందించండి అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు ఉన్న ప్రదేశం ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందన్నారు. గాలిలో కార్బన్ డయాక్సెడ్ను మొక్కలు స్వీకరించి మానవులకు కావాల్సిన ప్రాణ వాయువు ఆక్సిజన్ను గాలిలోకి వదిలి పెడతాయన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ఆకర్షణీయమైన శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని, శకటాలకు సంబంధించిన డిజిటల్ నోట్స్ను సీపీఓకు వెంటనే పంపాలని సూచించారు. ఆగస్టు 14, 15 తేదీల్లో అన్ని ప్రభుత్వ భవనాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో త్రివర్ణ దీపాలంకరణ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎస్.ఇలక్కియ, డీఆర్వో లక్ష్మీనరసింహం వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
27 ఉత్తమ ఛాయా చిత్రాలు
మూడు విభాగాల్లో ఎంపిక చేసిన జ్యూరీ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా యంత్రాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు విశేష స్పందన లభించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మొత్తం 221 ఛాయాచిత్రాలకు ఎంట్రీలు పంపగా, వాటిలో మూడు కేటగిరీలకు సంబంధించిన 27 ఉత్తమ ఛాయాచిత్రాలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. సోమవారం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ కాంపౌండ్లోని జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో ప్రదర్శించిన ఛాయాచిత్రాలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్ టి.శ్రీనివాస రెడ్డి, ఎఫ్ఆర్పీఎస్ ది హిందూ రిటైర్డ్ ఫొటో జర్నలిస్ట్ సి.హెచ్.వి.ఎస్. విజయభాస్కరరావు, విజయవాడ స్టూడియో ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.రవికుమార్, సీనియర్ ఫొటోగ్రాఫర్ ఎస్.రామారావు (ఫ్లాష్ రామారావు), డీపీఆర్వో టి.నాగేశ్వరరావు, వీఎంసీ పీఆర్వో డాక్టర్ రజియా షబీనాలు జ్యూరీగా వ్యవహరించారన్నారు. ఎంపికై న ఉత్తమ ఛాయాచిత్రాలకు సంబంధించిన నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందజేయనున్నట్లు తెలిపారు. -
లోకేష్ రాజీనామా కోసం పట్టు
డీఎస్సీ అక్రమాలపై యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. న్యాయం కోసం సోమవారం రోడ్డెక్కిన డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్ సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకునే యత్నం చేసినా నిరసనల హోరు తగ్గలేదు. ముందస్తు నోటీసులు, ర్యాలీలకు అనుమతి లేదంటూ ఆంక్షలు, మైకులు లాక్కోవడం .. ఇలా ఎక్కడికక్కడ పోలీసుల నిర్బంధాల మధ్యే జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయలని డిమాండ్ చేస్తూ యువత, వైఎస్సార్ సీపీ నేతలు ర్యాలీలతో ప్రభుత్వంపై నిరసన గళం వినిపించారు. యువతలో గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభం కాగా కొద్దిసేపటికి భారీ ఎత్తున తరలివచ్చిన పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ కొనసాగించేందుకు అనుమతి కోరినా పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వ తీరుకు నిరసనగా యువత కదం తొక్కారు. డీఎస్సీ అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ప్రతి నియోజకవర్గంలోనూ భారీగా ర్యాలీలు జరిగాయి. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినా యువత, వైఎస్సార్ సీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. మచిలీపట్నం నియోజకవర్గంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని, రైతులకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి కోటవారితుళ్లసెంటర్, కోనేరుసెంటర్, ప్రధాన రహదారి మీదుగా లక్ష్మీటాకీసు సెంటరు, పరాసుపేట సెంటర్ మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. గుడివాడ రాజేంద్రనగర్ లోని మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) స్వగృహానికి పోలీసులు చేరుకొని ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని ముందస్తుగా నోటీసు అందజేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా కొడాలి నాని స్వగృహానికి తరలి రావడంతో ర్యాలీని ప్రారంభించి రాజేంద్రనగర్ మీదుగా ఏలూరు రోడ్ వరకు సాగింది.పెనమలూరు నియోజకవర్గంలో సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో కంకిపాడు సెంటర్లో డీఎస్సీ అక్రమాలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. కానూరు గ్రామం నుంచి మోటార్ బైక్లతో ర్యాలీగా కంకిపాడు ప్రభుత్వాస్పత్రి సెంటరు వరకు చేరుకున్నారు. అనంతరం కంకిపాడు సీఐ రవికుమార్ ఇతర సిబ్బంది ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నారు. రోప్ల సహాయంతో నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. బందరు రోడ్డుపై ఆందోళన చేశారు. -
టెట్కు 86.67 శాతం హాజరు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో సోమవారం నిర్వహించిన ఏపీ టెట్–2026 పరీక్షకు 86.67 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. నందమూరులోని శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో మధ్యాహ్నం సెషన్–2 పరీక్ష జరిగిందన్నారు. మొత్తం 90 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 78 మంది హాజరయ్యారని, 12 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. భవానీపురం (విజయవాడ పశ్చిమ): గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, నృత్యరీతులను పరిరక్షించడంతోపాటు గిరిజన విద్యార్థుల విద్య, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సమప్రాధాన్యమిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జుననాయక్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ ఆధ్వర్యాన సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్, ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇందులో గిరిజన కళాకారులు సంప్రదాయ నృత్యాలు, కళారూపాలు ప్రదర్శించారు. అనంతరం మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామని, అవసరమైనవి అందజేస్తున్నామన్నారు. -
పెదపట్నంలో భూ బకాసురులు!
ఊరిలో మట్టి దందా యథేచ్ఛగా జరుగుతోంది. పగలూ రాత్రీ తేడా లేకుండా మట్టి ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. అక్రమ మట్టి తోలకాల్లో కూటమి నేతలు చక్రం తిప్పుతున్నారు. ఆఖరికి సముద్రపు అంచును కూడా వదలటం లేదు. వీళ్ల అవినీతిని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో పెదపట్నం గ్రామాన్ని సముద్రం ముంచేసే ప్రమాదం ఉంది. – గడిదేశి రాజు, వైఎస్సార్ సీపీ గ్రామ ఇన్చార్జ్ కోనేరుసెంటర్: బందరు మండలం పెదపట్నం గ్రామంలో తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమ అవినీతి, అక్రమాలకు ఊరిని, ఊరి జనాన్ని ముంచేందుకు సిద్ధపడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని గ్రామంలో జరుగుతున్న వీరి దందాను అడ్డుకునే నాథుడు లేకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విషయం ఏమిటంటే.. బందరు మండలం పెదపట్నం గ్రామంలో కొంత మంది తెలుగుతమ్ముళ్లు అసైన్డ్ భూములను ఆక్రమించేందుకు మట్టిమాఫియా అవతారమెత్తారు. కూటమి అధికారంలోకి రావటంతో సముద్రపు అంచున ఉన్న మట్టి దిబ్బలను మింగి సొమ్ము చేసుకోవటంతో పాటు ఆ భూములను అన్యాక్రాంతం చేసి చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేందుకు పన్నాగం పన్నుతున్నారు. అందుకోసం గడిచిన ఇరవై రోజులుగా పెదపట్నం పంచాయతీ గొల్లపాలెం గ్రామ శివారు ప్రాంతంలోని సముద్రపు అంచున ఉన్న మట్టిని మిషన్లతో తోడించి పగలూ, రాత్రి తేడా లేకుండా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అలా ఇప్పటి వరకు దాదాపు ఐదు ఎకరాల్లో సుమారు 1000 ట్రక్కులకు తక్కువ కాకుండా మట్టిని మింగేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఊరి అభివృద్ధి పేరుతో.. మట్టి దందాతో పాటు భూ ఆక్రమణ వైపు అధికారులు కన్నెత్తి చూడకుండా గ్రామానికి చెందిన ఓ తెలుగుతమ్ముడు అడ్డుకుంటున్నట్లు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. అందుకే అధికారులు ‘మీనా(ల) ‘మే(వే)షాలు’ వేస్తున్నట్లు సమాచారం. ఊరిలో మట్టిరోడ్లను మెరక చేసే పని పేరుతో సదరు తెలుగుతమ్ముడు అవినీతికి పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. సముద్రపు అంచున ఉన్న మట్టి దిబ్బలను మిషన్లతో తోడించి పేరుకు ఒక ట్రాక్టర్ మట్టిని ఊరి సందుల్లో పోయించి మిగిలిన ట్రాక్టర్లను ట్రిప్పుకు రూ.1200 చొప్పున వసూలు చేస్తూ ఉన్న ఊరితో పాటు పక్క ఊళ్లకు మట్టిని అక్రమంగా తరలించేస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. అందుకోసం మంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తిని గట్టిగా ఉపయోగించి అతనికి ముడుపులు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే తెలుగుతమ్ముడు కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అతని సామాజికవర్గానికి చెందిన ఓ వృద్ధ నాయకుడి సహకారంతో సముద్రపు అంచున సుమారు 25 ఎకరాల అసైన్డ్ భూములను ఇదే తరహాలో స్వాహా చేసినట్లు సమాచారం. తిలా పాపం తలా పిడికెడు.. ఇదిలా ఉండగా మట్టి దోపిడీ ద్వారా రూ.లక్షలకు లక్షలు కూడబెట్టిన సదరు తెలుగుతమ్ముడిని చూసి అదే గ్రామానికి చెందిన మరో తెలుగుతమ్ముడు అవినీతి, అక్రమాల్లో తాను తగ్గేది లేదంటూ మట్టి దోపిడీకి నడుం బిగించాడు. అందుకోసం అతను మట్టి మాఫియా అవతారమెత్తాడు. పార్టీ కోసం అతనే కాదు నేను కష్టపడి పనిచేశానంటూ రెవెన్యూ సిబ్బందిని బెదరేసి మట్టి అక్రమ రవాణాకు లోపాయికారికంగా అనుమతులు తెచ్చుకున్నట్లు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. అందుకు గ్రామంలోని ఓ కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగిని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారులకు పూర్తి సమాచారం ఉన్నా ఆ చిరు ఉద్యోగిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవటం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి తోలకాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే ఊరిలోకి వెళ్లాం. మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు, పొక్లయినర్ను పట్టుకుని జరిమానాలు కట్టించాం. మరలా ఇలాంటివి జరిగితే క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనకాడం. – చోడవరపు చంద్రశేఖర్, నార్త్ మండలం, ఆర్ఐ -
అన్నప్రాశనకు వెళ్లి అనంతలోకాలకు..
గండేపల్లి: కుటుంబ సభ్యులు, బంధువుల ఆనందోత్సాహాలు కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. అంత వరకు సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణం చేస్తున్న వారికి దుఃఖమే మిగిలింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం, అంజనాపురానికి చెందిన అల్లాడి గోపాలకృష్ణ, రాజేశ్వరి దంపతుల ఆరు నెలల చిన్నారి అరణ్య అన్నప్రాశనం నిమిత్తం కమ్మంపాడు, విజయవాడ, సత్తెన్నగూడెం తదితర గ్రామాలకు చెందిన బంధువులు శనివారం వ్యాన్లో కాకినాడ జిల్లా అన్నవరానికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బసచేసి ఆదివారం ఉదయం అన్నప్రాశన అనంతరం వారు తలుపులమ్మ తల్లిని దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా వారి వాహనం మండలంలోని బొర్రంపాలెం శివారు భారత్ పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి వ్యాన్ వెనుకభాగం ఎడమ వైపు టైర్ పంచరై అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాదస్థలం దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో చిన్నారికి వరసకు తాత అయ్యే సత్తెన్నగూడెంకు చెందిన అల్లాడి చిన్నారావు (46) అక్కడిక్కడే మృతి చెందగా మేడిపల్లి నాగేంద్రమ్మ, అట్లూరి స్నేహ, అన్నాబత్తుల సామ్రాజ్యంకు తీవ్రగాయాలు అయ్యాయి. మృతుని భార్య అల్లాడి సరోజిని, బోగి అశోక్కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108, హైవే అంబులెన్స్లో జెడ్ రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యాధికారి నీలిమ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్కు రిఫర్ చేశారు. చిన్నారావుకు కుమార్తె శిరీష, కుమారుడు సుధీర్ ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జగ్గంపేట సీఐ బి.తిరుపతి, గండేపల్లి ఎస్ఐ యూవీ శివనాగబాబు ప్రమాదం వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జెడ్ రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి సారించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అసోసియేషన్ అధ్యక్షుడు పిళ్లా ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఎన్జీవో హోంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమపై ఆధారపడి అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారని, వారి జీవనోపాధికి బాటలు వేయాలన్నారు. ఉపాధ్యక్షుడు జంధ్యాల గోపాలకృష్ణ మాట్లా డుతూ.. సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణను కలసి త్వరాలో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు తోరం రాజా మాట్లాడుతూ.. సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. స్టూడియోలు, రికార్డింగ్,రీ రికార్డింగ్ థియేటర్స్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు కె.అప్పారావు, ఎస్.హరనాథ్, మల్లికార్జున చౌదరి, జె.సరోజిని, ముళ్లపూడి రాధ, షహనాజ్, పిల్లి అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (ఎంఏఏ) అధ్యక్షుడు పిళ్లా ప్రసాద్ -
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలకు రక్షణ చట్టం చేసి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీనగర్లోని ఆలపాటి ఫంక్షన్ హాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ సమాజంలో బీసీలపై వివక్ష, దాడులు జరుగుతున్నాయన్నారు. వీటన్నిటికీ పరిష్కారం బీసీల రక్షణ చట్టం ఒక్కటేనన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టం వజ్రాయుధం లాంటిది అన్నారు. భట్రాజు సంఘం అధ్యక్షుడు కోటంరాజు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బడిగించల చంద్రమౌళి, డాక్టర్ అలా వేంకటేశ్వరావు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు చెల్లా అనుదీప్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమందరావు, విశాఖ జిల్లా అధ్యక్షుడు నమ్మి అప్పలరాజు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రామారావు, రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు నక్క శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ -
దుర్గమ్మ చెంత భక్తజన జాతర
● అంతరాలయ దర్శనం రద్దు.. ● టికెట్ల విక్రయాలు నిలిపివేత ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏకాదశి, వరస సెలువులు, ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ చెంత భక్తజన జాతర కనిపించింది. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. రద్దీ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే కొండపైకి కేవలం దేవస్థాన బస్సులు, ద్విచక్ర వాహనాలను మినహా ఇతర వాహనాలను అనుమతించలేదు ఉదయం 10 గంటల తర్వాత రద్దీ మరింత అధికం కావడంతో అంతరాలయ దర్శనాలను నిలిపివేసి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను రద్దు చేశారు. బంగారు వాకిలి, రూ. 300, రూ. 100 టికెటు క్యూలైన్లతో పాటు సర్వ దర్శనం రెండు క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. రద్దీ తాకిడితో వీఐపీ క్యూలైన్తో పాటు సీఎం గేట్ను సైతం తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు. కనకదుర్గానగర్లో పండుగ వాతావరణం సారెతో ఆలయానికి బయలుదేరిన భక్తులు తొలుత కనకదుర్గానగర్లో బలిపీఠం అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమను సమర్పించారు. ఇతర జిల్లాల నుంచి ప్రత్యేకంగా ట్రాక్టర్లు, ఆటోలపై అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తరలిరావడం కనిపించింది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులతో , భక్తుల పూనకాలతో సారె సంబరం అంబరాన్ని తాకింది. సారె సమర్పించిన వందకు పైగా బృందాలు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆదివారం ఒక్క రోజే సుమారు వందకు పైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 30 వేల మందికి పైగా సారె సమర్పించారని పేర్కొంటున్నారు. ఆషాఢ మాసంలో ఈ ఆదివారం అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం, సారె సమర్పించడం సరికొత్త రికార్డు అని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఈవో, చైర్మన్లతో పాటు డీఈవో కిషోర్కుమార్, ఏసీ రంగారావు, ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్బాబు ఇతర అధికారులు క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. -
లారీ ఢీకొని ఇంటర్ విద్యార్థి దుర్మరణం
ఇబ్రహీంపట్నం: ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని భావించిన తల్లిదండ్రులకు రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతిచెందడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ మీడియెట్ విద్యార్థి వారణాసి భరధ్వాజ్(16) దుర్మరణం చెందడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో నింపింది. విద్యార్థి దుర్మరణంపై పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. స్థానిక ఐశ్వర్య గ్రాండ్స్లో నివాసం ఉంటున్న వారణాసి శ్రీనివాస కుమారస్వామి, సంధ్యారాణి దంపతులకు ఇద్దరు కుమారులు. అర్చకత్వం చేసుకుంటూ కుమారులను చదివించుకుంటున్నారు. చిన్నకుమారుడు వారణాసి భరధ్వాజ్ భవానీపురంలోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం ఇబ్రహీంపట్నంకు స్కూటీపై వచ్చిన విద్యార్థి తిరుగు ప్రయాణంలో ఫెర్రీ నుంచి వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ రింగ్ సెంటర్లో ఢీకొట్టింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తీవ్రగాయాలతో ఉన్న యువకుడిని 108 సిబ్బంది హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి నేత్రదానం.. కన్నకుమారుడిని కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. యువకుడి కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నేత్రాలు సేకరించారు. తమ విషాదాన్ని మరొకరి జీవితాల్లో వెలుగులు నింపేలా మార్చేందుకు కుటుంబం తీసుకున్న నిర్ణయం పలువురి హృదయాలను కదిలించింది. పోలీసులు యువకుడి పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. పోలీసులు ప్రమాదానికి గురైన లారీని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్. రవివర్మ తెలిపారు. కంచికచర్ల: క్వారీలోని పొక్లయినర్కు డీజిల్ తీసుకువెళ్తున్న క్రాంప్ వాహనం ప్రమాదానికి గురవటంతో క్రాంప్ డ్రైవర్ మృతిచెందిన సంఘటన మండలంలో శనివారం రాత్రి సమయంలో జరిగింది. ఎస్ఐ పి. విశ్వనాథ్ కథనం మేరకు.. కంచికచర్ల మండలం దొనబండ రాతి క్వారీలో ఉన్న వర్చ్యూ క్వారీ, అండ్ క్రషర్లో ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అబ్బూరి రాంబాబు(31) సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ప్రాంతంలో క్వారీ కొండపై బండరాళ్లను తొలగిస్తున్న పొక్లయినర్కు డీజిల్ అయిపోతే ఆ డీజిల్ను క్రాంప్ వాహనం ద్వారా తీసుకెళ్తున్నాడు. రాంబాబు క్రాంప్ వాహనాన్ని నడుపుకుంటూ వాహనం కొండపైకి ఎక్కే సమయంలో క్రాంప్ వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టి క్వారీ బండను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాంబాబు తలకు పెద్ద రాయి తగలటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. క్వారీ రోడ్డులో మృతుని బంధువుల ఆందోళన.. క్వారీ ప్రమాదంలో మృతిచెందిన రాంబాబు కుటుంబం గురించి పట్టించుకోకపోవటంతో క్వారీ యాజమాన్యం సకాలంలో స్పందించకపోవటంతో బంధువులు క్వారీలో ఆందోళన చేపట్టారు. రాంబాబు కుటుంబానికి క్వారీ యాజమాన్యం న్యాయం చేయాలని, తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేయాలి. దీంతో క్వారీ, క్రషర్లలో నుంచి వచ్చే వాహనాలు రెండు గంటల పాటు రోడ్డుపై నిలిచిపోయాయి. పోలీసులు సర్దిచెప్పటంతో ఆందోళన విరమించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ క్రషర్ వద్ద మృతుని బంధువుల ఆందోళన -
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా విద్యార్థులు
గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో సైతం ప్రతిభావంతులుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు వై. మదన్మోహన్రావు అన్నారు. ఆంధ్రలయోల కళాశాలలో తైక్వాండో పోటీలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో సైతం నైపుణ్యాలను పెంచుకోవాలని కాంక్షించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని పలు విద్యా సంస్థల నుంచీ 500మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలలో గోల్డ్మెడల్ సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 21, 22, 23 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారని వివరించారు. అసోసియేషన్ కార్యదర్శి ఎం. అంకమరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి బి. కాశీనాథ్ రెడ్డి, ఇంటర్నేషనల్ యోగా మెడలిస్ట్ బి. శిరీష తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీల అభివృద్ధికి కృషి
చిలకలపూడి(మచిలీపట్నం): ఆదివాసీల అభి వృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సంత్ సేవాలాల్ మహారాజ్, ఏకలవ్యుడు, చెంచులక్ష్మి, వెన్నెలకంటి రాఘవయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు ప్రభుత్వ పథకాలను పొందేందుకు ఆధార్ కార్డు సహా అవసరమైన పత్రాలను భద్రంగా ఉంచుకోవడంతో పాటు పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పటికీ, వీలైనంతవరకు ఒక గ్రామం లేదా ఒక ప్రాంతాన్ని స్థిర నివాసంగా చేసుకోవాలన్నారు. గిరిజనుల అభివృద్ధిలో విద్య అత్యంత కీలకమని పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం కుసుమహర యువ సేవా సంఘం సౌజన్యంతో కలెక్టర్ గిరిజన విద్యార్థులకు దుప్పట్లు, కండువాలు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తదితర కిట్లను అందించారు. కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె. సత్యవతి, పర్యాటకశాఖ అధికారి జి.రామలక్ష్మణరావు, గిరిజన సంఘ నాయకులు బారోతు జ్యోతిలాల్ నాయక్, కుంభ రవి కిరణ్, కుంభ అయ్యప్ప, కందుల పవన్, మద్దెల పాండురంగారావు, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది పీ శివకుమార్, ఇ.సుబ్రహ్మణ్యం, విద్యార్థులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
కాలువలపై రియల్టర్ల కన్ను!
● పంట కాలువను పూడ్చి రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు ● నీరు వెళ్లే మార్గం లేక 100 ఎకరాల వరి మాగాణికి ముంపు ● పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా పరిష్కారం శూన్యం ● బాడవ డొంక రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం జి.కొండూరు: జిల్లాలో పలుచోట్ల కాలువలపై రియల్టర్ల కన్ను పడింది. దీనికి నిదర్శనం వెలగలేరు పంట కాలువలు. ఇక్కడ కాలువలు లేకుండా చేసి వెంచర్లు వేయడంతో 100 ఎకరాలకు పైగా వరి మాగాణి ముంపునకు గురై రైతులు లబోదిబో అంటున్నారు. ఆక్రమణ ఇలా.. వెలగలేరు గ్రామ రెవెన్యూ పరిధిలోని కవులూరు రోడ్డుకు ఆనుకొని సర్వే నంబర్లు 264, 265లో గ్రామానికి చెందిన ఓ భూస్వామికి 24ఎకరాల వరకు భూమి ఉంది. దీనికి ఎగువన ఉన్న మాగాణి భూముల్లో అదనపు నీరు పోయేందుకు పూర్వం భూస్వామికి చెందిన భూమిలో నుంచి కాలువ ఉండేది. వెలగలేరు నుంచి కవులూరు రోడ్డు వరకు 2.5కిలోమీటర్లు మేర 45అడుగుల వెడల్పుతో బాడవ డొంక (పుంత) రోడ్డు ఉంది. ఇది కూడా సైతం సదరు భూస్వామి భూమి మధ్యలో నుంచి ఉంది. సదరు భూస్వామి ఈ భూమిలో కొంత మేర ఇటీవల రియల్టర్లకు విక్రయించారు. భూమి విక్రయించిన నేపథ్యంలో అదనపు నీరు పోయేందుకు కాలువ కింద వదిలిన భూమి కూడా రైతులకు లేదని, అది తన సొంత భూమి కనుక కాలువపై హక్కు లేదని చెప్పడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్వం నుంచి ఉన్న కాలువను పూడ్చి ప్రహరీ నిర్మించాడు. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వెంచర్లో ఉన్న బాడవ డొంక రోడ్డుకు రెండు వైపులా ఉన్న పంట కాలువలను సైతం పూడ్చి రోడ్డును మెరక చేసి తారురోడ్డుగా మార్చడంతో సమస్య ఉత్పన్నమైంది. అంతటితో ఆగకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వెంచర్కు ముందు భాగాన అంటే వెలగలేరు, కవులూరు ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న పెద్ద కాలువను సైతం పూడ్చి చిన్న పైపు వేసి వదిలేయడం విస్మయానికి గురి చేసింది. రియల్టర్కు కొంత భూమిని విక్రయించిన సదరు భూస్వామి తన ఆధీనంలో దిగువన ఉన్న భూమిలో బాడవ డొంక రోడ్డుకు అడ్డంగా గోడను నిర్మించడంతో రైతులు వెళ్లలేని పరిస్థితి. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు ఈ సమస్యపై వెలగలేరు గ్రామానికి చెందిన రైతు సుఖవాసి గోపాలరావుతో పాటు 40మంది రైతులు సంతకాలు చేసి విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జూన్ 22వ తేదీన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన జి.కొండూరు తహసీల్దార్ జులై 9వ తేదీ సిబ్బందితో కలిసి సమస్య ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం పొలాల్లో నీరు పోవడానికి కాలువ ఏర్పాటు చేసుకోవాలని రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చెప్పినట్లు, వారు సైతం అందుకు ఒప్పుకున్నట్లు, సమస్య పరిష్కారమైనట్లు ఎండార్స్మెంట్ పంపారు. అక్కడ సమస్య అలానే ఉండటంతో మళ్లీ బాధిత రైతులు గత నెల 27న పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అధికారుల వైపు నుంచి స్పందన లేక వరి పొలాలు ముంపునకు గురై పైరు కుళ్లిపోతున్న నేపథ్యంలో రైతులు లబోదిబోమంటున్నారు. బాడవ డొంక రోడ్డుకు అడ్డంగా భూస్వామి నిర్మించిన గోడను సైతం పూర్తిగా తొలగించి రైతుల రాకపోకలు సాగేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. -
కాన్పులకు సర్కారీ దవాఖానో
ప్రభుత్వ ప్రసూతి సేవలకు తగ్గుతున్న ఆదరణ? ● రెండేళ్లలో 3,006 ప్రసవాలు తగ్గుదల.. ● పని చేయని చంద్రబాబు ప్రోత్సాహకాలు ● ప్రైవేటు ఆస్పత్రుల వైపు పెరుగుతున్న మొగ్గు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగానికిపైగా తగ్గుదల నగదు ప్రోత్సాహకాలతో పెరగని జననాలు కుటుంబ నియంత్రణపై ప్రచారానికి తెర? – డాక్టర్ పి.ఎల్. దయాకర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి -
దళిత యువతికి న్యాయం చేయకపోతే ఉద్యమమే
మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్ అవనిగడ్డ: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి దళిత యువతిపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక సీబీఎం బోర్డింగ్ స్కూల్ ప్రాంగణంలో దళిత నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ కొత్తపేటకు చెందిన ఎస్సీ యువతికి మోపిదేవికి చెందిన బీసీ యువకుడు కె. సందీప్ మాయ మాటలు చెప్పి మోపిదేవి మండల పరిధిలోని నాగాయతిప్ప రోడ్డులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అమానుషంగా దాడి చేసిన విషయంలో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు. దాడికి గురైన బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు తారుమారు చేసి కేసు నీరుగర్చారని దీనిపై పోలీసులు సరిగ్గా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేయకపోతే ఆందోళన చేస్తామని గోవర్ధన్ హెచ్చరించారు. దళిత నేతలు బట్టు జైపాల్, బత్తుల బిక్షం, జి. నాగశ్రీను, సీహెచ్ శ్యామ్, మద్దాల ధర్మారావు, సీహెచ్ రాకేష్, బొంతు ప్రకాష్, మేరుగు రణధీర్, గుంటూరు బాబూరావు, బెజవాడ రవి, గుంటూరు కుటుంబ రావు, లింగం అనీల్, మద్దాల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ జరి గింది. లోక కళ్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రతి ఆదివారం అమ్మవారి సన్నిధిలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్యోపాసన సేవ జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి అర్చకులు పూజలు చేశారు. అనంతరం అరుణ పారాయణం, మహా సౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళిని పఠించారు. సూర్య భగవానుడిని ఆరాధించడంతో సంపూర్ణ ఆరోగ్యం.. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అనంతరం సూర్యోపాసన సేవ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. పెనమలూరు: పోరంకిలో ఈ నెల 12వ తేదీ జాబ్మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.సురేష్కుమార్ తెలిపారు. ఆయన ఆదివారం వివరాలు తెలుపుతూ 12వ తేదీ ఉదయం 9.30 గంటలకు పోరంకి బందరు రోడ్డులోని వరుణ్మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెక్సా షోరూమ్లో వివిధ విభాగాల్లో మొత్తం 129 పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి, ఏదైన డిగ్రీ, ఇంజినీరింగ్ మెకానికల్ చదివిన వారు హాజరుకావచ్చని వివరించారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నారు. ఆధార్ లింకు ఉన్న ఫోన్, పాన్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో రావాలన్నారు. ఎంపికైన వారికి కేటగిరీ ప్రకారం నెలకు జీతం రూ.12 వేల నుంచి రూ.28 వేల వరకు ఇస్తారన్నారు. మరిన్ని వివరాలకు 79813 68429, 96767 08041, 99854 44333, 99892 31431 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో ఆదివారం ఏపీస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఏపీఎస్పీఎఫ్) ఆధ్వర్యాన ఇంటర్జోన్ వాలీబాల్ పోటీలు జరిగాయి. తొలుత పోటీలను ఏపీఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులు నిర్వహించడం అంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, సమయపాలన అవసరమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా కాకుండా క్రమశిక్షణతో ఆడటం, ప్రత్యర్థిని గౌరవించడం నిజమైన క్రీడా స్ఫూర్తికి నిదర్శనమన్నారు. విధుల్లో నిరంతరం బిజీగా ఉండే పోలీస్ అధికారులు, సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. అనంతరం ఇంటర్ జోన్లో భాగంగా ఏపీ సెక్రటేరియట్, ఏపీ హైకోర్టు, ఎన్టీటీపీఎస్, ఎయిర్పోర్ట్ యూనిట్, విజయవాడ గార్డ్స్, హెడ్ క్వార్టర్ యూనిట్ల మధ్య పోటీలు నిర్వహించారు. టోర్న మెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అసిస్టెంట్ కమాండెంట్ కె.రమేష్ తెలిపారు. విజయవాడ జోన్ కమాండెంట్ ఎం.శంకరరావు, ఎయిర్పోర్ట్ సీఎస్ఓ కె.ధర్మేంద్ర, పలువురు విమానాశ్రయ, ఎస్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణపై ‘రైల్వే’ సమీక్ష
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే ఐజీ–పీసీపీసీ (ఇన్స్పెక్టర్ జనరల్–ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్) అంజనీ కుమార్ సిన్హా ఆదివారం విజయవాడ డివిజన్లో పర్యటించి ప్రయాణికుల భద్రత, నేరాల నియంత్రణపై ఆర్పీఎఫ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినం దించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ విజయవాడ డివిజన్ సీనియర్ డీఎస్సీ షణ్ముఖ వడివేల్ ప్రస్తుత ఏడాది ఆర్పీఎఫ్ సాధించిన ప్రధాన చర్యలను ఐజీ–పీసీఎస్సీ దృష్టికి వివరించారు. ఉన్నత ప్రమాణాలతో సేవలందించామన్నారు. జన్ విశ్వాస్ చట్టం 2006 కింద వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 2,948 మందిపై కేసులు నమోదు చేసి రూ. 21,84, 700 జరిమానా విధించినట్లు తెలిపారు. ఆపరేషన్ అమానత్ పథకం ద్వారా రూ. 01,45,04, 437 విలువైన 355 లగేజీలను స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అప్పగించామన్నారు. రైల్వే చోరీలపై 70 కేసుల్లో 61 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 61,85,600 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడాన్ని వివరించారు. ఈ సమావేశంలో ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నత ప్రమాణాలతో సేవలు -
వైఎస్సార్ సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు
పటమట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అవతకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్ సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆదివారం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్కు పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ పరిధిలోని మాచవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు నిర్వహించే ర్యాలీకి అనుమతి లేదంటూ నోటీసులు అందించారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, అనుమతి లేకుండా నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మహిళల్లో వ్యాపార నైపుణ్యాలను వెలికి తీయాలి
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): నగరం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలి రెండు విడతల కౌన్సెలింగ్లలో మిగిలిన సీట్లను ఈ స్పాట్ అడ్మిషన్లలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, పాలిసెట్–2026 పరీక్ష రాసిన, రాయని వారు పాల్గొనవచ్చని సూచించారు. అభ్యర్థులు సోమవారం ఉదయం పది గంటలకు తమ విద్యార్హతా ఓరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ పత్రాలతో కళాశాలకు హాజరు కావాలని పేర్కొన్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పదస్థితిలో హోమ్ ట్యూషన్ టీచర్ ఓ లాడ్జిలో మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పెనమలూరు మండలం, తాడిగడపకు చెందిన లక్ష్మీపురపు వెంకటరమణ, కుటుంబరావు (59) భార్యాభర్తలు. వారి కుమార్తెకు వివాహమై సౌత్ఆఫ్రికాలో ఉంటుండగా, కుమారుడు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. భర్యాభర్తలిద్దరూ హోమ్ ట్యూషన్లు చెప్పుకొని జీవిస్తున్నారు. కుటుంబరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల నాలుగున ట్యూషన్ చెప్పడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో కృష్ణలంక ఫీడర్రోడ్డులో బస్టాండ్ ఎదురుగా ఉన్న లాడ్జి సిబ్బంది వెంకటరమణకు ఫోన్చేసి కుటుంబరావు శుక్రవారం ఉదయం తమ వద్ద రూమ్ తీసుకున్నారు, అద్దె చెల్లించాలని చెప్పారు. తన భర్త మూడు రోజులుగా ఇంటికి రాకపోవడంతో అతను కనిపించడంలేదని పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని వెంకటరమణ బదులిచ్చారు. అనంతరం పకీర్గూడెంలో నివసించే కుటుంబరావు సోదరుడు వెంకట సత్యనారాయణకు సమాచారం విచ్చారు. ఆయన లాడ్జి వద్దకు వెళ్లి చూడగా కుటుంబరావు తీసుకున్న రూమ్ తలుపులు వేసి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా కుటుంబరావు విషం తాగి బెడ్పై పడి ఉన్నాడు. అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని అతడిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడి బలవన్మరణం కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇంటిలో ఎవరూ లేని సమయంలో యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. కృష్ణలంక పోలీసుల కథనం మేరకు.. రాణిగారి తోట ముక్కు శ్రీరామిరెడ్డి రోడ్డుకు చెందిన కాయల రాము ఉడ్ పాలిష్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి పెద్ద కుమారుడు సూర్యచంద్ర మొబైల్ రిపేర్ పనిచేస్తుండగా చిన్న కుమారుడు పవన్కుమార్(22) కొద్దిరోజులు వన్టౌన్లోని ఓ షాపులో పనిచేశాడు. ప్రస్తుతం పని మానేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. శనివారం ఉదయం రాము పనికి వెళ్లాడు. ఆ తరువాత రాము పెద్ద కుమారుడు షాపునకు వెళ్లి తిరిగి రెండు గంటల సమయంలో భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో దగ్గరగా ఉన్న ఇంటి తలుపులు తెరిచి లోపలకి వెళ్లి చూడగా పవన్కుమార్ వంటగదిలో స్లాబ్ కొక్కేనికి చీరతో ఉరేసుకొని వేలా డుతూ కనిపించాడు. వెంటనే సూర్య చంద్ర తన బంధువుల సహాయంతో పవన్ను కిందకు దించి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి పవన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక
మచిలీపట్నం అర్బన్: క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్షిప్లో రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు శనివారం మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఝాన్సీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 224 మంది బాలబాలికలు ఉత్సాహంగా ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. అండర్–17, అండర్–23 బాలురు, బాలికల విభాగాల్లో 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, ఐదు కిలోమీటర్ల పరుగు, లాంగ్జంప్, హైజంప్, జావెలిన్త్రో, షాట్పుట్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది క్రీడాకారులను అండర్–17, 12 మంది క్రీడాకారులను అండర్–23 విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఝాన్సీలక్ష్మి తెలిపారు. -
బందరు కాలువలో వృద్ధుడి గల్లంతు
ెపనమలూరు: మండలంలోని గోసాల గ్రామ పరిధిలో బందరు కాలువలో వృద్ధుడు గల్లంతవటంతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. గోసాల వేణుగోపాలస్వామినగర్కు చెందిన కొడాలి సూరి బాబు(60) మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని భార్య పద్మ వేరుపడింది. సూరిబాబు ఆ ప్రాంతంలోనే ఒంటరిగా నివసిస్తున్నాడు. శుక్రవారం సూరిబాబు తన మిత్రుడు శ్రీనుతో కలిసి బందరు కాలువలో స్నానానికి దిగాడు. స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాడు. ఈ సమాచారం సూరిబాబు భార్యకు తెలిసి, తన బంధువులతో బందరు కాలువలో గాలించారు. అయినా సూరిబాబు జాడ తెలియ లేదు. పద్మ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై అవిశ్రాంత పోరాటం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మెగా డీఎస్సీ –2025లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంతవరకు పోరాటం ఆగదని వైఎస్సార్ సీపీ నేతలు స్పష్టం చేశారు. డీఎస్సీ అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో శనివారం మూడో రోజు రిలేనిరాహార దీక్షలు జరిగాయి. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని మూడు నియోజకవర్గాలకు చెందిన యువత, వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీఎస్సీ అక్రమాలపై విలేకరుల సమావేశంలో ఆధారాలతో సహా నిరూపించినా సిగ్గులేని చర్యలు తీసుకోకపోగా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అదే కూటమిలో ఉన్న లోకేష్ మాత్రం మంత్రి పదవిని అంటిపెట్టుకుని వేలాడుతున్నారన్నారు. ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు, యువత ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే పోలీసుల సహకారంతో వచ్చి దాడి చేస్తారా అని నిలదీశారు. ఎమ్మెల్యే బొండాను ఉద్దేశించి టెంట్ పీకి, నాలుగు కుర్చీలు పగుల కొడితే హీరోయిజం అనుకుంటున్నావా? నీ అక్రమాలు బయటపెడితే తల ఎక్కడ పెట్టుకుంటావని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బొండా ఉమాకు తగిన బుద్ది చెబుతామన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీని వాసరావు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే బొండా ఉమా ఒక రౌడీ లాగా తన అనుచరులతో వచ్చి పోలీసులను పక్కకు నెట్టేసి దాడి చేశారన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ, పార్టీ నాయకులు బండి పుణ్యశీల, అడపా శేషు, వంగవీటి నరేంద్ర, షేక్ ఆసిఫ్, షేక్ గౌస్ మొహిద్దీన్, ఆళ్ల చెల్లారావు, ఎ. రవిచంద్ర, సుందర్పాల్, మెహబూబా, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అను బంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉద్యమానికి సమాయత్తం
అవనిగడ్డ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో నైరుతీ రుతుపవనాలు మందగించడంతో పలుచోట్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్కు ఇన్ఫ్లో లేకపోవడంతో నీటి నిల్వలు ప్రమాద స్థాయి కంటే దిగువకు పడిపోయాయి. పైగా అప్పటికింకా పులిచింతల, పట్టిసీమ ప్రాజెక్టులు కూడా లేవు. అయినప్పటికీ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణాడెల్టాకు సాగునీటిని సరఫరా చేసి రైతులను ఆదుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో 2023లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు సైతం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డెల్టా రైతాంగానికి సాగునీరందించి పంటలను కాపాడారు. పులిచింతల నుంచి విడతల వారీగా నీళ్లు వదిలి, పట్టిసీమ నుంచి 3 వేల క్యూసెక్కులను సరఫరా చేసి వంతుల వారీ విధానం ద్వారా సాగునీరందించారు. గణాంకాల వారీగా చూస్తే శ్రీశైలంలో కాని, సాగర్లో కాని, ప్రకాశం బ్యారేజీ వద్ద కానీ 2008, 2023 సంవత్సరాల్లో కన్నా ఇప్పుడు నీటి నిల్వలు మెరుగ్గానే ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఎందుకు సాగునీరివ్వదని డెల్టా రైతులు నిలదీస్తున్నారు. పడిపోయిన సాగు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ 2008లో వైఎస్ రాజ శేఖరరెడ్డి డెల్టా పరిధిలో 13.07 లక్షల ఎకరాల ఆయ కట్టుకు సాగునీరందించగా, 2023లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో 13.08 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకూ 9.68 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరగ్గా వాటికి కూడా సాగునీరందక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతాంగం సాగునీటిని విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో ఇప్పటికే అవనిగడ్డ, పెడన, మచిలీపట్నంలో ఆయా నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు సింహాద్రి రమేష్బాబు, ఉప్పాల రాము, పేర్ని కిట్టు ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈనెల 10న బైక్ ర్యాలీ లు, ప్రదర్శనలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే సింహాద్రి రమేష్బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ మహా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2023 2026 శ్రీశైలం నీటిమట్టం 834 అడుగులు 834 అడుగులు నాగార్జున సాగర్ నీటిమట్టం 505 అడుగులు 509 అడుగులు ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 2.47 టీఎంసీలు 3.04 టీఎంసీలు -
అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కర్ణాటకకు చెందిన భక్తులు రూ.2.50 లక్షలు విరాళంగా అందజేశారు. కర్ణాటక రాయచూర్ ఎస్సార్ నగర్కు చెందిన కె.వెంకటరావు, పార్వతి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.2.50 లక్షలు విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ డీఈవో కిషోర్కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో ఆషాఢ కృత్తిక(ఆడి కృత్తిక) పవిత్రోత్సవాలు శనివారంతో ముగిసినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఈనెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైదిక కార్యక్రమాల ననుసరించి శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు వివరించారు. మాజీ గవర్నర్, రిటైర్డ్ అధికారి కిరణ్బేడీ లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండటం అత్యంత కీలకమని, తద్వారానే మహిళా సాధికారత సాధ్యమని పుదుచ్చేరి మాజీ లెె ఫ్ట్నెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కిరణ్బేడీ అన్నారు. మహాత్మాగాంధీరోడ్డులోని హోటల్ వివంతలో శనివారం ఫిక్కి ఫ్లో ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న కిరణ్బేడీ మాట్లాడుతూ సమాజంలోనూ, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఆర్థిక వ్యవహారాలపై పట్టుండాలని, వ్యాపార, ఆర్థిక నిర్వహణను ఇతరులకు అప్పగించకుండా మహిళలే స్వయంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఫిక్కీఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ సుప్రియ, పలువురు ప్రతినిధులు, మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలలో ఆలయ అధికారులు కొత్త ప్రతిపాదన చేశారు. అమ్మవారి లడ్డూ ప్రసాదాల కోసం కౌంటర్ల వద్ద భక్తులు వేచి ఉండకుండా లడ్డూ ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు గాను వారం రోజుల్లో ఆలయ ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా పరిశీలన చేయాలని భావిస్తున్నారు. ఇటీవల దసరా ఉత్సవాలపై జిల్లా రెవెన్యూ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. భక్తులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ముందుగా ఆన్లైన్లో లడ్డూలను బుక్ చేసుకుంటే వారి ఫోన్కు ఒక ప్రత్యేక కోడ్ వస్తుంది. ఆలయ ప్రాంగణంలో 4 నుంచి 5 లడ్డూ ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేసి వారికి అక్కడే లడ్డూలను ఇవ్వాలని భావిస్తున్నారు. మరో వైపున ఒక లడ్డూ నుంచి ఆరు లడ్డూల బాక్స్ వరకు ఈ ఏటీఎం మిషన్ ద్వారా భక్తులు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నూతన విధానం ద్వారా ప్రసాదాల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గుతుందని టెక్నికల్ టీం చెబుతుండగా, ఇది ఏ స్థాయిలో అమలుకు సాధ్యమనే విషయాన్ని ఆలయ అధికారులు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. -
హుష్.. గప్చుప్
ఉయ్యూరు: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అక్రమాలకు కేరాఫ్గా మారాయి. రైతులకు వెన్నుదన్నుగా నిలిచి సేవలు అందించాల్సిన కొన్ని సొసైటీల్లో సిబ్బంది, చైర్మన్లు కుమ్మకై ్క అన్నదాత వెన్నువిరుస్తున్నారు. రైతులు దాచుకున్న సొమ్మును అడ్డదారుల్లో కొల్లగొడుతున్నా అధికారుల చర్యలు మాత్రం శూన్యంగా మారాయి. కో ఆపరేటివ్ సొసైటీ ఉన్నతాధికారుల నిర్లిప్తతతో సొసైటీ అక్రమాలపై చీకటి పడగలు కమ్ముకున్నాయి. ఫలితంగా సహకార సంఘాల భద్రత పెనుసవాల్గా మారింది. నత్తనడకన విచారణ ఉయ్యూరు మండలంలోని కడవకొల్లు శివారు వీరవల్లి మొఖాసా సొసైటీలో నిధుల గోల్మాల్పై విచారణ కొనసాగుతూ ఉంది. రూ 62.38 లక్షలు అక్రమాలు బయటపడ్డా చర్యలు లేవు. సొసైటీ సీఈఓ హేమ సొమ్ము తిరిగి చెల్లిస్తానని లేఖ ఇవ్వటం, ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం జరిగి రోజులు గడుస్తున్నా రైతులు, డిపాజిట్దారుల సొమ్ముపై అధికారులు ఇంత వరకూ లెక్కలు తేల్చలేదు. నిత్యం రైతులు సొసైటీకి వచ్చి తమ డబ్బులు సంగతి తేల్చాలని అడుగుతున్నా దాట వేత ధోరణితో కప్పిపుచ్చుతున్నారు. అక్రమాల బాగోతం చిట్టా పెరుగుతుండటంతో అధికారుల్లో కలవరం నెలకొంది. సొసైటీ విషయంలో అక్రమాలు తేల్చాలని, తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని ప్రస్తుత సొసైటీ చైర్మన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కలవపాములలో చర్యలు శూన్యం కలవపాముల సొసైటీలో దాదాపు కోటి రూపాయల వరకూ అక్రమాలు జరిగినట్లు సమాచారం. మూడునెలల క్రితం సొసైటీ సీఈఓ రోజారమణి అక్రమాలకు పాల్పడ్డారని, పాలకవర్గం ఫిర్యాదుచేయటంతో అధికారులు విచారణ జరిపారు. రూ.85.92 లక్షలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. సీఈఓ రోజారమణిపై సస్పెండ్ వేటు వేశారు. అయితే నెలలు గడుస్తున్నా సొమ్ము రికవరీ జాడ లేదు. అక్కడి రైతులు, డిపాజిట్దారులు తమ సొమ్ములు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నా దాటవేతధోరణి కనిపిస్తోంది. ఉన్నతాధికారులు మహాజన సమావేశం నిర్వహించి తీర్మానం చేసి పంపాలని చెప్పటంతోనే సరిపుచ్చారు. మండలంలోని కాటూరు కేడీసీసీ బ్రాంచి పరిధిలోని రెండు సొసైటీల్లో అక్రమాల భాగోతం చోటుచేసుకోవటం గమనార్హం. -
కొమరగిరి దూరదృష్టి, నిబద్ధతే ‘శ్రీవాణి’ విజయానికి నాంది
భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘శ్రీవాణి’ సాంస్కృతిక మాసపత్రిక నాలుగు దశాబ్దాలకు పైగా నిరంతర సేవలు అందిస్తుందంటే దాని వ్యవస్థాపకుడు కొమరగిరి కృష్ణమోహన్రావు దూరదృష్టి, నిబద్ధతే కారణమని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు కొనియాడారు. మచిలీపట్నం కేంద్రంగా వెలువడుతున్న ‘శ్రీవాణి’ మాసపత్రిక తన 500వ సంచికతో పాటు ‘మేరునగరి హిమగిరి కొమరగిరి’ పుస్తక ఆవిష్కరణ వేడుకలు శనివారం విజయ వాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగాయి. సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను రక్షిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక స్పృహను పెంపొందిస్తున్న ‘శ్రీవాణి’ యాజమాన్యం, సంపాదకవర్గం, రచయితలు అభినందనీయలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ కొమరగిరి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాఽథ్(చిన్ని), ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, సీనియర్ పాత్రికేయుడు మాశర్మ, ఆధ్యాత్మికవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడారు. ఆవిష్కరణ వేడుకలను ‘శ్రీవాణి’ సంపాదకుడు కొమరగిరి శ్యామ్ ప్రసాద్, మేనేజర్ కొమరగిరి చంద్రశేఖర్, గౌరవ సలహాదారు కొమరగిరి ఉదయ్ కుమార్ నిర్వహించారు. కంభంపాటి హరిబాబు -
శత వసంతాల సంగీత యాత్ర
శిశుర్వేత్తి.. పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణి అన్నారు. ఈ చరాచర సృష్టిలో సంగీతానికి సకల ప్రాణులు స్పందిస్తాయి. సంగీతానికి భాష, కులం, మతంతో నిమిత్తం లేదు. అది అనుభూతి పూర్వక మంత్రం. వీనుల విందు చేయడమే కాక మనసుకు ఆహ్లాదాన్నిచ్చేది సంగీతం. వాయులీనమే జీవన నాదంగా సంగీత ప్రపంచాన్ని శాసిస్తున్న నిత్య కృషీవలుడు అన్నవరపు రామస్వామి. గత 85 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో ఆయన సంగీత యాత్ర నిరాటంకంగా సాగుతోంది. నూరేళ్ల వయసులోనూ నిత్యనూతనంగా సంగీత సరస్వతికి పట్టాభిషేకం చేస్తున్న అన్నవరపు రామస్వామిపై ప్రత్యేక వ్యాసం. విజయవాడ కల్చరల్: సంగీతమే శ్వాసగా జీవిస్తున్న అన్నవరపు రామస్వామి 1926వ సంవత్సరం మార్చి 23 వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా సోమవరంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, నాదస్వర విద్వాంసుడు పెద్దయ్య. అన్న గోపాలం వద్ద వయోలిన్లో సంగీత శిక్షణ ప్రారంభించి 11 సంవత్సరాల వయసులో బెజవాడలో వయోలిన్లో శిక్షణ తీసుకోవడానికి గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణ య్య పంతులు వద్ద చేరారు. ఆయన శిష్యరికంలో వయోలిన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణతో అప్పట్లో ప్రారంభమైన స్నేహం కడ వరకు సాగింది. ఇద్దరి సంగీత ప్రయాణంలో వేలాది కార్యక్రమాలను నిర్వహించారు. మంగళంపల్లి గాత్రానికి అన్నవరపు వయోలిన్ సహకారం పూవుకు తావి అబ్బినట్టు ఉండేది. సంగీత దిగ్గజాలకు వాద్య సహకారం వయోలిన్ ఒక వాద్యమేకాదు అన్నవరపు చేతిలో నాద బ్రహ్మగా మారింది. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు( విద్యాభిక్షపెట్టిన గురువు), అరయ్యకుడి రామానుజ అయ్యంగార్, భీమ్సేన్ జోషి, టీఆర్ మహాలింగం, బాలమురళీ కృష్ణ లాంటి విద్వాంసులెందరికో వాద్యసహకారం అందించారు. గురు సంప్రదాయాన్ని పాటిస్తూ నగరంలో 75 సంవత్సరాలుగా సంగీత సద్గురువులు త్యాగరాజ స్వామి, సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు పేరిట సంగీత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వంద సంవత్సరాల వయస్సులోనూ ఆయన ఇప్పటికీ కచేరీలు నిర్వహిస్తున్నారు. ఆయన కీర్తికిరీటంలో కలికితురాయిలు అన్నవరపు రామస్వామికి వందకుపైగా పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (1983), సంగీత నాటక అకాడమీ పుర స్కారం(1996), భారత ప్రభుత్వం పద్మశ్రీ (2021), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పురస్కారం, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ పురస్కారంతోపాటు అనేక పురస్కారాలు లభించాయి. ఆయన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో 3 వేలకు పైగా కచేరీలు నిర్వహించారు. ఆకాశవాణిలో స్టాఫ్ ఆర్టిస్ట్గా... విజయవాడ ఆకాశవాణిలో స్టాఫ్ ఆర్టిస్ట్గా దశాబ్దాల పాటు సేవలను అందించారు. రేడియో ద్వారా శాసీ్త్రయ సంగీతాన్ని వేలాదిమందికి చేరువ చేశారు. వందన, శ్రీదుర్గ వంటి రాగాలకు రూపకల్పన చేశారు. అన్నవరపు శిష్య పరంపర నేడు ప్రముఖ సంగీత విద్వాంసులుగా పేరొందిన మోదుమూడి సుధాకర్, అంజనా సుధాకర్, బీవీ దుర్గాభవాని, అన్నవరపు రాఘవేంద్ర, డి.శ్రీనివాస్, కొమాండూరి వెంకట కృష్ణ, ఎం.సత్యనారాయణ, డాక్టర్ ప్రపంచం సీతారాంతో పాటు అనేక వందలమందికి విద్యాదానం చేశారు. సంగీతంతో పాటు సంస్కారం ముఖ్యం నేటి తరం యువ సంగీత కళాకారులు సంగీతంతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలని తమ గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు చెప్పేవారని అన్నవరపు రామస్వామి అన్నారు. సంగీతం భగవదత్తమైన వరమని, వేదంలా అధ్యయనం చేయాలని, చిత్త శుద్ధి, ఏకాగ్రత అవసరమన్నారు. సంగీతాన్ని భగవత్ సేవలా భావించాలన్నారు. విజయవాడలో తాను వారాలు చేసుకుని చదువుకున్నానని, గురువులు కుల మతాలకు అతీతంగా చూసుకునేవారన్నారు. -
ప్రతిష్టాత్మకంగా స్వాతంత్య్ర వేడుకలు
కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక పోలీస్పరేడ్ గ్రౌండ్లో ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శుక్రవారం సాయంత్రం స్వాతంత్య్ర వేడుకలపై జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రతా అగర్వాల్తో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేడుకల ఏర్పాటుకు రెవెన్యూ, మునిసిపల్, పోలీస్శాఖల సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమానికి ఆర్డీవో కె. సాంబశివరావు ఇన్చార్జ్గా వ్యవహరిస్తారని, పరేడ్ గ్రౌండ్ను వెంటనే సిద్ధం చేయటంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలీస్శాఖ పరేడ్, మార్చ్ఫాస్ట్, గార్డ్ ఆఫ్ హానర్ వేడుకల రిహార్సల్స్ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ముఖ్య వేదికపై మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారి మాత్రమే కూర్చునేలా ఏర్పాటు చేయాలని, ప్రజాప్రతినిధులు, వీఐపీలు, అధికారులు, ఆహ్వానితులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసి ముందుగానే సమాచారం అందించాలన్నారు. విశిష్ట సేవకులను గుర్తించండి.. జిల్లాలో విశిష్టంగా రాణిస్తున్న సుమారు 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి వారికి జ్ఞాపికలు అందించే అంశాలను పరిశీలించాలని, ఉత్తమ రైతులను కూడా గుర్తించి తగిన గుర్తింపు ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గత ఏడాదిలో సైన్యం, నేవీ, ఎయిర్ఫోర్స్లకు జిల్లా నుంచి ఎంపికై న యువత కుటుంబాలను గుర్తించి ఈ వేడుకలకు ఆహ్వానించి సత్కరించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు సమయపాలనతో నిర్వహించాలన్నారు. 30 నిమిషాలకు పరిమితం చేస్తూ ఉత్తమ ప్రదర్శనలు మాత్రమే ఎంపిక చేయాలన్నారు. అలాగే వివిధ శాఖల శకటాలు, ప్రదర్శన స్టాల్స్, ఒకే అంశం పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. వేడుకల్లో పర్యావరణ హితంగా అన్ని పాటించాలన్నారు. కార్యక్రమ నిర్వహణలో ప్రతిశాఖకు అప్పగించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేయాలన్నారు. డీఆర్వో కె. శ్రీధర్రెడ్డి, ఏఎస్పీ వీవీ నాయుడు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ ఎస్. పోతురాజు, మెప్మా, డ్వామా, డీఆర్డీఏ పీడీలు సాయిబాబు, ఎన్. శివప్రసాద్, హరిహరనాథ్, డీఈవో యూవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ సమగ్రంగా లేదు
చిలకలపూడి(మచిలీపట్నం): సర్ ప్రక్రియలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితా సమగ్రంగా లేదని తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. కలెక్టరేట్లోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆర్డీవో కె.సాంబశివరావుకు ముసాయిదా జాబితాలో ఉన్న వివరాలను ఆయనకు తెలిపారు. పేర్ని నాని మాట్లాడుతూ సర్ ప్రక్రియ నిర్వహించిన తర్వాత ముసాయిదా జాబితా ఓటర్ల లిస్ట్ పాత ఫొటోలు, పేర్లు మార్పులు జరగకుండానే విడుదల చేశారని.. ఒక ఓటరుకు రెండు చోట్ల ఎపిక్ నంబర్లు ఉన్నట్లు తాము గుర్తించామని తెలిపారు. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో 19 పోలింగ్ బూత్లు పెంచారని, ఈ పోలింగ్ బూత్లలో ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కొంత మంది ఓటర్లకు ఏ పోలింగ్ బూత్లో తాము ఉన్నామో అర్థంకాక ఆందోళన చెందుతున్నారన్నారు. తమ అభ్యంతరాలు, క్లయిమ్లను పరిశీలించి సమగ్రంగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేయాలని పేర్ని నాని ఆర్డీవోను కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పల్లి శేఖర్, తిరుమలశెట్టి ప్రసాద్, కాగిత జవహర్లాల్ (బున్ని), వైఎస్సార్ సీపీ నాయకులు మొహమ్మద్ రఫీ పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మను శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆషాఢ మాసం సారె సంబరాల నేపథ్యంలో సారె సమర్పించిన భక్తుల సంఖ్య మాత్రం సాధారణంగానే కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన సమయానికి ఆలయ ప్రాంగణంలోని క్యూలు భక్తులతో కిటకిటలాడాయి. మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత అధికం కావడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏసీ రంగారావు గాలిగోపురం పాయింట్ వద్ద రద్దీని పర్యవేక్షించారు. శుక్రవారం కావడంతో ఉదయం నుంచి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవ, దర్బారు సేవల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. దుర్గమ్మ సన్నిధిలో దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయాల అభివృద్ధికి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ శీనానాయక్, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. పండితుల వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం దుర్గగుడిలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. 21వ తేదీ నూతన అన్నదాన భవనం, ప్రసాదాల పోటు భవనాల ప్రారంభోత్సవం నేపఽథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లు, టెండర్ల ప్రక్రియపై సమీక్ష చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నవోదయ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు పెంపు హనుమాన్జంక్షన్రూరల్: బాపులపాడు మండలం వేలేరులోని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే జేఎన్వీఎస్ టెస్ట్–2027కు దరఖాస్తు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లుగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ సి.రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. నవోదయ విద్యాలయ అధికారిక వెబ్సైట్లో అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని రాజశేఖర్ పేర్కొన్నారు. పుట్టిన ఊరిని మరవకూడదు వీరులపాడు: జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పుట్టిన గ్రామాన్ని మరవకూడదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు. జమ్మవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో తల్లిదండ్రులు గణపతిరావు, సరోజినీదేవి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వాటర్ప్లాంట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు వినియోగించుకుని శ్రద్ధగా చదువుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, ఎంఈవో పాల్ కెనడి, ఎస్ఎంసీ చైర్మన్ రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
దాడి రాజకీయం!
టీడీపీలో అధిష్టానం మెప్పు కోసం జరుగుతున్న పోటీ ఇప్పుడు బహిరంగ దూకుడుకు దారి తీస్తోందా..? అనే ప్రశ్న విజయవాడ రాజకీయాల్లో తెరపైకి వస్తోంది. ఇటీవల ముద్రగడ సంతాప సభలో చేసిన వ్యాఖ్యల తర్వాత పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే యత్నాల్లో ఎమ్మెల్యే బొండా ఉమా వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడికి దిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బొండా చర్యకు మరుసటి రోజే పశ్చిమ ఇన్చార్జ్ బుద్దా వెంకన్న అదే తరహాలో వ్యవహరించడం చర్చనీయాంశమైంది.మెప్పు కోసం సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధిష్టానం మెప్పు పొందేందుకు విజయవాడ నగరంలోని టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. తొలిరోజు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడి చేస్తే దాన్ని చూసి రెండోరోజు నగరంలోని టీడీపీ ‘పశ్చిమ’ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా అదే బాట పట్టారు. టీడీపీ నేతలు చేస్తున్న ఈ రచ్చను నగర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. తర్వాత ప్లేటు మార్చి.. తాను టీడీపీకి కట్టుబడి ఉన్నానని అధిష్టానం మెప్పు పొందేందుకే ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడికి దిగారు. ఇటీవల వరకూ అసంతృప్తితో ఉండటం, అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉమా ఒక్కసారిగా ప్లేటు మార్చారు. గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాపసభలో పాల్గొన్న బొండా ఉమా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ముద్రగడ చేసిన ఉద్యమాలే కారణమంటూ వ్యాఖ్యానించడం, వైఎస్సార్ సీపీతోపాటు అన్ని పార్టీల్లోని కాపు నేతలతో మాట్లాడటం అధిష్టానానికి కోపం తెప్పించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడితో కమిటీ వేయడం, అ కమిటీ ముందు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నివేదిక ఇచ్చిన తర్వాత బుధవారం సంజాయిషీ ఇచ్చుకుని వచ్చారు. లోకేష్ దృష్టిలో పడటానికే హడావుడి ఈ నేపథ్యంలోనే తాను కూడా లోకేష్ దృష్టిలో పడేందుకు ఈ హడావుడి చేసినట్లు తెలుస్తోంది. రాజధాని రైతులను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్సార్ సీపీ కమిటీ సభ్యులపై మహిళలతో కోడిగుడ్లతో దాడి చేసిన సంఘటన స్ఫూర్తితోనే మహిళలకు కోడిగుడ్లు ఇచ్చి వారిని గొడవకు తీసుకువచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. విజయవాడ నడిబొడ్డున రెండుగంటలపాటు టీడీపీ నేతలు హడావుడి చేసినా పోలీసులు చోద్యం చూడటం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. దాడికి వ్యూహరచన తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అబద్ధం అని చెప్పేందుకే వైఎస్సార్ సీపీపై దాడికి వ్యూహరచన చేశారు. గురువారం ఉదయం సింగ్నగర్కు చేరుకుని అక్కడ జన సమీకరణ చేసుకున్న తర్వాత నేరుగా ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయం వద్ద డీఎస్సీలో అక్రమాలపై జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకుని దాడికి తెగబడ్డారు. షామియానాను తొలగించడంతో పాటు వైఎస్సార్ సీపీ నేతలపై తన అనుచరులను దాడులకు పురికొల్పారు. వెంకన్న దాడికి యత్నం రెండోరోజు శుక్రవారం పశ్చిమలోని కేదారేశ్వరపేటలోని బాప్టిస్ట్పాలెంలో జరుగుతున్న దీక్షా శిబిరంపై దాడికి వెంకన్న ప్రయత్నించారు. ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేయగా, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకుని దాడికి తెగబడ్డారు. గురువారం ఘటనతో పరువు పోగొట్టుకున్న పోలీసులు అప్రమత్తమై వారిని అక్కడి నుంచి పంపించివేశారు. అధిష్టానం మెప్పుకు ఒకరిని చూసి మరొకరు వాతలు పెట్టుకుంటుండటంతో ఈ ట్రెండ్ ఎక్కడికి పోతోందనన్న భయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెంది రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో బొండా వర్గం దాడి చేయడాన్ని ఆ సామాజికవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ నుంచి మార్కులు కొట్టేయడం కోసమే ఈ దాడులకు దిగినట్లు సమాచారం. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడులకు దిగిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి పొలిట్బ్యూరోలో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. -
తనువు చాలించాడు
చదవలేక.. తండ్రికి చెప్పలేక మధురానగర్(విజయవాడసెంట్రల్): చదువు ఒంటబట్టక.. ఈ విషయం తండ్రికి చెప్పలేక అర్ధంతరంగా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువుచాలించాడు. విషాద ఘటన శుక్రవారం విజయవాడ మధురానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన సమ్మెట దుర్గాప్రసాద్ ఎలక్ట్రీషియన్. ఆయన భార్య ఎనిమిది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించింది. కుమారుడు సమ్మెట తరుణ్ రాజ్ (13) సత్యనారాయణపురం ఏకేటీపీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజూలాగే శుక్రవారం ఉదయం 9.15కి స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి సైకిల్ మీద వెళ్లాడు. తర్వాత సుమారు 10 గంటల ప్రాంతంలో బయట నంబర్ నుంచి తండ్రికి ఫోన్ చేసి స్కూల్కు వెళ్లే సరికి గేటు వేసి ఉందని.. తాను ఇంటికి వచ్చేస్తున్నానని చెపాడు. దీంతో తండ్రి సరే వచ్చేసేయ్ అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. పని ముగించుకుని దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు లోపల వేసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా తరుణ్రాజ్ చున్నీతో ఫ్యాన్కి ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో దుర్గాప్రసాద్ చుట్టుపక్కల బంధువులను పిలిచి గుణదల పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెడ్రూంలోని ఒక పుస్తకంలో ‘నాన్నా నువ్వు చదువు .. చదువు అని ఎప్పుడూ అంటూ ఉంటావు. నాకు చదవడం అంతగా రావడం లేదు అందుకే చనిపోతున్నాను’ అని రాసి ఉంది. ఇప్పటికే భార్యను కోల్పోయిన దుర్గాప్రసాద్ ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు తనువు చాలించటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. -
సీబీఐ ఎంకై ్వరీ వేయాలి
పామర్రు: డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం వెంటనే సీబీఐ ఎంకై ్వరీ వేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) డిమాండ్ చేశారు. పామర్రులో ఏపీ జెన్ జెడ్ వార్లో భాగంగా డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ రెండో రోజు నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్తో కలిసి మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ డీఎస్సీ బాధితులు ఎందుకు దీక్షల్లో పాల్గొనడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడి రావడం లేదని తెలిపారు. మేడి పండులా ప్రభుత్వ తీరు ఉందని, పైకి బాగా కనపడుతోందని, లోలోపల కుళ్లి పోయిందని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో నిజాయతీగా 2.40లక్షల ఉద్యోగాలు గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏకంగా 2.40లక్షల ఉద్యోగాలు నిజాయతీగా నిబద్ధతతో ఇచ్చామని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రతిభగల అభ్యర్థులను మోసం చేసిందన్నారు. మరిన్ని ఉద్యోగాలకు మంగళం పాడతారు జీతభత్యాల విషయంలో ఖర్చు తగ్గించామని చెబుతుతున్న చంద్రబాబు భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకు మంగళం పాడతారని అర్థమవుతోందన్నారు. జగన్ ప్రభుత్వంలో రూ.25లక్షల విలువైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ కి మంగళం పాడి సీఎంఆర్ఎఫ్లు అంటూ కాలం వెళ్ల దీస్తున్నారని మండిపడ్డారు. అమరావతితో ప్రజలను మోసం అమరావతిలో రైతులను అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వంలో ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం ఏం చేస్తోందని విమర్శించారు. అక్కడి రైతులకు ఎంతసేపు కాగితాలపైనే తప్ప గ్రామాల్లో ఎక్కడా భూములు చూపించే పరిస్థితే లేదన్నారు. అమరావతిలో ఉన్న 26 గ్రామాల్లో మట్టిని లారీలతో ఇతర ప్రాంతాలకు తోలి కోట్లకు కోట్లను అక్రమార్జన చేసి కూటమినేతలు కుబేరులు అవుతున్నారని వివరించారు. జగన్ సూచించిన మావిగన్పై శ్రద్ధ లేకుండా చంద్రబాబు సీఆర్డీఏలో అమరావతితో పాటు విజయవాడ, గుంటూరును రాజధానిలో కలుపుతున్నామని సిగ్గు లేకుండా తీర్మానించారన్నారు. రాజదాని నడిబొడ్డులో ఎమ్మెల్యే బరితెగింపు రాజధాని నడిబొడ్డులో ఉన్న విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తే ఎమ్మెల్యే బొండా ఉమా పైశాచికంగా ప్రవర్తిస్తూ శిబిరాలను కూల్చడం, నాయకులపై తెగ బడటం , మహిళలపై కూడా అసభ్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు. మంత్రి నారా లోకేష్ నాయుడు వెంటనే మంత్రి పదవి రాజీనామా చేయాలని, కేబినెట్లో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని తీర్మానించాలని కోరారు. కార్యక్రమంలో పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ , పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
సాగునీటి కోసం సమరశంఖం
పెడన: కృష్ణా డెల్టాలో రైతులకు సాగునీరు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వైఎస్సార్ సీపీ పెడన ఇన్చార్జ్ ఉప్పాల రాము చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ‘పెడన’లో చేపట్టిన రిలేదీక్షలు రెండో రోజు బస్టాండు ఎదురుగా ఆంజనేయస్వామి ఆలయం పక్కన చేశారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి దీక్షా శిబిరం వద్దకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా చేరుకున్నారు. దీక్షా శిబిరం వద్ద వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాము మాట్లాడుతూ ‘పెడన’లోని గూడూరులో 21వేల ఎకరాల్లో వరిసాగు అవుతుంటే ఇప్పటికే వెద పద్ధతిలో 14వేల ఎకరాలు వరకు సాగుచేస్తున్నారని, మరో 1500 ఎకరాలు నారుమళ్లు వేసి నాట్లు వేస్తున్నారని తెలిపారు. మరో ఆరువేల ఎకరాల వరకు సాగు మొదలు పెట్టలేదని గుర్తు చేశారు. పెడన మండలంలో 8వేల హెక్టార్లలో వరి సాగుఅవుతండగా 12వేల ఎకరాల్లో వెదసాగు చేస్తున్నారని, ఆరువేల వరకు నాట్లు వేయాల్సి ఉందని, 1500 ఎకరాలు వరకు నారు ఊడ్చారన్నారు. బంటుమిల్లి మండలంలో 15వేల ఎకరాలలో సాగు జరుగుతుండగా 10వేల ఎకరాలు వరకు వెద జల్లారని, ఐదు వేల ఎకరాలు నాట్లు వేయాల్సి ఉందన్నారు. కృత్తివెన్ను మండలంలో ఏడువేల ఎకరాల సాగుభూమి ఉందని, ఇందులో రెండు వేల ఎకరాల వరకు సాగు చేశారని, మరో ఐదువేల ఎకరాలు వరకు నాట్లు వేయాల్సి ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వెదజల్లిన పంటలకు, శివారు భూములకు నీరందని దుస్థితి నెలకొందన్నారు. మే నుంచి కూడా రైతులకు సబ్సిడీవిత్తనాలు అందజేస్తూ, ఏరువాక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు సాగునీరు ఇవ్వలేమని చెప్పడం చాలా దారుణమన్నారు. చరిత్రహీనుడిగా స్థానిక ఎమ్మెల్యే నిలిచిపోతారు 2024లో తాను ఇన్చార్జిగా ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేసి సాగునీటిని రెండు, మూడు దఫాలుగా విడుదల చేయించామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే.. సీఎం చంద్రబాబును బతిమాలి, ప్రాధేయపడి, బ్లాక్మెయిల్ అయినా చేసి సాగునీరు అందించేలా చూడాలని డిమాండ్ చేశారు. నీరు ఇవ్వకపోతే మాత్రం రైతుల గుండెల్ల చరిత్రహీనుడిగా నిలిచిపోతారన్నారు. అవసరమైతే పాదయాత్రఅవసరమైతే కృత్తివెన్ను మండలం పల్లెపాలెం నుంచి పామర్రు వరకు కూడా పాదయాత్ర చేస్తామని, ఇంకా ఇవ్వకపోతే ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా పాదయాత్ర చేసి రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. అప్పటికి కూడా నీరు ఇవ్వకపోతే మాత్రం రైతుల పక్షాన ఆమరణ నిరహార దీక్షకు కూడా వెనుకాడేది లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, పార్టీ రాష్ట్ర, జిల్లా, పెడన నియోజకవర్గ వివిధ అనుబంధ విభాగాల నాయకులు తిరుమాని శ్రీనివాసరావు, గరికపాటి వెంకటరామానాయుడు, కొండవీటి నాగబాబు, ఎంపీపీ రాజులపాటి వాణి, మార్కెట్ యార్డు మాజీ చైర్పర్సన్ గరికపాటి చారుమతి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బైలపాటి జ్యోతి, వన్నం శ్రీలత, రహెతున్నీసా, మైలారత్నకుమారి, కటకం ప్రసాద్, గరికిముక్కు చంద్రబాబు, జన్ను నాగమల్లేశ్వరరావు, సమ్మెట జయవర్ధన్, దావు బైరవలింగం, రాజులపాటి అచ్యుతరావు, గొరిపర్తి రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడనరూరల్, టౌన్లకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు పలువురు సంగా మధుసూధనరావు, ఎండీ ఖాజా, వేముల సురేష్రంగబాబు, రైతులు సంఘీభావం తెలిపారు. సాయంత్రం రైతులు నిమ్మరసం ఇవ్వడంతో రాము, హారిక, వైఎస్సార్ సీపీ కుటుంబశ్రేణులు దీక్షను విరమింపజేశారు. సాగునీరు వస్తుందనే ఆశతో ఒకసారి వేసిన వెదసాగులో విత్తనాలు మొలకలు వచ్చి నీరందక చనిపోయాయి. మళ్లీ నీరువస్తుందని తెలిసి రెండో సారి విత్తనాలు వేశాం. నా ఒక్కడి పరిస్థితి కాదు. చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. ఇప్పుడు కూడా నీరందకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. – లోయ అంజి, కొంగంచర్ల, పెడన మండలం రైతు తన పంట చేతికి వచ్చేదాక కూడా ఎంతో కొంత అప్పుచేసి అయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడే పరిస్థితి ఉండదు. అధికారులు ఖర్చు ఎక్కువగా పెట్టవద్దని పేర్కొనడం రైతులకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే ఇంజిన్లు ద్వారా నీటిని తోడి రైతు ఆర్థికంగా చితికిపోయాడు. ఇప్పుడు నీరివ్వలేమని చెప్పడం సరికాదు. –యాదంరెడ్డి వరప్రసాద్, ఉప్పలకలువగుంట, పెడన మండలం -
కృష్ణాజిల్లా అండర్–17 హాకీ జట్ల ఎంపిక
గూడూరు: అమరావతి చాంపియన్ షిప్–2026లో భాగంగా అండర్–17 బాలుర, బాలికల హాకీ జట్ల ఎంపిక శుక్రవారం గూడూరులో నిర్వహించారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో నిర్వహించిన సెలక్షన్స్కు ఇటీవల నియోజకవర్గ స్థాయిలో సత్తాచాటిన క్రీడాకారులు 90మంది హాజరయ్యారు. వీరి నుంచి అండర్–17లో 16 మంది చొప్పున బాలుర, బాలికల జట్లకు ఎంపిక చేశారు. మరో ముగ్గురు క్రీడాకారులను స్టాండ్బైగా ఎంపిక చేశారు. వీరంతా రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు హాజరవుతారని డీఎస్డీఓ ఝాన్సీలక్ష్మి తెలిపారు. అంతకుముందు గూడూరు తహసీల్దార్ డి.రాజ్యలక్ష్మి హాకీ జట్ల సెలక్షన్స్ను ప్రారంభించగా, జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులను గూడూరు ఎంపీపీ సంగా మధుసూదనరావు, జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి శ్రవణం హరికృష్ణ, కోశాధికారి విఠల్, గూడూరు హాకీ క్లబ్ కార్యదర్శి పెనుగొండ శ్రీనివాసరావు, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి మత్తి అరుణ అభినందించారు. -
భార్యను చంపిన భర్తకు జీవితఖైదు
చిలకలపూడి(మచిలీపట్నం): భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి టి. రాజావెంకటాద్రి శుక్రవారం తీర్పు చెప్పారు. కృష్ణాజిల్లా కలిదిండి మండలం కట్టావానిపాలెం గ్రామానికి చెందిన కట్టా పెద్దిరాజు భార్య జయలక్ష్మిని వ్యసనాలకు లోనై తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె కూలీకి వెళ్లి వచ్చిన డబ్బులు కూడా లాక్కొని తాగుడుకు బానిసయ్యాడు. అయితే జయలక్ష్మి పేరుపై ఉన్న రొయ్యల చెరువును అమ్మి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అయినప్పటికీ ఆమె చెరువు అమ్మకపోవటంతో 2025 జూలై 10వ తేదీన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటనపై కుమారుడు కట్టా రాము కలిదిండి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఏపీపీ నిరంజన్ 20 మంది సాక్షులను ప్రవేశపెట్టగా పెద్దిరాజుపై నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు జూపూడి(ఇబ్రహీంపట్నం): స్వామినారాయణ గురుకుల పాఠశాల బస్సు ప్రమాదవశాత్తూ మండలంలోని జూపూడి గ్రామం వద్ద బోల్తాపడింది. 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేతనకొండలోని గురుకుల పాఠశాల విడిచిపెట్టిన అనంతరం విద్యార్థులతో విజయవాడ వైపు వెళ్తున్న బస్సు మార్గ మధ్యలో అదుపు తప్పి రోడ్డు మధ్యలో డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏడుపులతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భీతిల్లింది. నివాసాల సమీపంలో ప్రమాదం జరగడంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలతో బస్సులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. ఆందోళనతో భీతిల్లిన వారిని సమీప నిమ్రా వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరు విద్యార్థులకు స్వల్పగాయాలు అయినట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. మిగిలిన విద్యార్థులను క్షేమంగా వారి ఇళ్లకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘మా శైలు మృతికి కారణం అతడే!’
మచిలీపట్నంఅర్బన్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్న అనంతరం పెళ్లికి నిరాకరించడంతో తన సోదరి శైలుకుమారి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరుడు పేరం నాగశంకర్ ఆరోపించారు. శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీకి ఫిర్యాదు చేసేందుకు మొవ్వ మండలం పెడసనగంటిపాలెం గ్రామం నుంచి మృతురాలు శైలుకుమారి కుటుంబ సభ్యులు కలెక్టరేట్కు వచ్చారు. అయితే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా నాగశంకర్ మాట్లాడుతూ.. తన సోదరి శైలుకుమారి ఆత్మహత్యకు పమిడిముక్కల మండలం కూడేరు శివారు నమితలగుంటకు చెందిన గంజాల చరణ్గోపి (చింటూ) కారణమని ఆరోపించారు. చరణ్గోపి రెండేళ్లుగా తన సోదరిని వెంటపడుతూ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని నాగశంకర్ తెలిపారు. ఆమెకు ఇష్టం లేకపోయినా వెంటపడుతూ, పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుని ఆమె పేరును పెడతానని బెదిరించి లొంగదీసుకున్నాడని ఆరోపించారు. తనను పెళ్లి చేసుకోవాలని శైలుకుమారి కోరిన సమయంలో చరణ్గోపి నిరాకరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై.. జూలై 31న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. పంచనామాపై కుటుంబ సభ్యుల అభ్యంతరం.. ఆగస్టు ఒకటిన నిర్వహించిన పంచనామాలో తమ సోదరి మృతికి చరణ్గోపితో ఉన్న వ్యవహారమే కారణమని స్పష్టంగా చెప్పినా, పోలీసులు ఆ విషయాలను నమోదు చేయకుండా రక్తహీనత కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు రాయాలని ఒత్తిడి తెచ్చారని నాగశంకర్ ఆరోపించారు. పంచనామాకు ముందు ఖాళీ పత్రాలపై తమ సంతకాలు తీసుకున్నారని తెలిపారు. జప్తు చేసిన సెల్ ఫోన్లలోని కాల్ వివరాలు, సంభాషణలను పరిశీలిస్తే చరణ్గోపి, శైలుకుమారి మధ్య జరిగిన వ్యవహారానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. చరణ్గోపిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. -
సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం
పామర్రు: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమం నిర్వహిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం పామర్రు నియోజకవర్గ కేంద్రమైన పామర్రులోని ఎస్కేఆర్ఆర్ జెడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న ఆరేపల్లి కల్యాణమండపంలో ‘మీ కోసం’ను నిర్వహించారు. కలెక్టర్ ప్రజల నుంచి మొత్తం 30 వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖ అధికారులకు పంపించి, నిబంధనల మేరకు త్వరిత గతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, సహాయ కలెక్టర్ సమ్రత అగర్వాల్, డీఎస్సీ పల్లా శ్రీనివాసరావు, పామర్రు తహసీల్దార్ జి. రవికాంత్, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. కలెక్టర్ డీకే బాలాజీ -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ఘంటసాల: వ్యవసాయానికి అనుబంధంగా అధిక ఆదాయాన్నిచ్చే పుట్టగొడుగుల పెంపకం చేపట్టడం ద్వార మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కేవీకేలో మూడు రోజులపాటు నిర్వహించిన పుట్టగొడుగుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో 700కు పైగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను గుర్తించామన్నారు. వారికి మార్కెట్ అవకాశాలు కల్పించి అగ్రి టెక్ ఫార్మా వంటి సంస్థలతో వారిని అనుసంధానం చేశామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బుట్టల ఎగ్జిబిషన్, ఆయుర్వేద ఎగ్జిబిషన్ను కలెక్టర్ పరిశీలించారు. జేసీ నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి. సుధారాణి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి జె. జ్వోతి తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్పై యువతే ఉక్కుపాదం మోపాలి
సివిల్ జడ్జి వరలక్ష్మి కోనేరుసెంటర్: సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టటంలో యువత మరింత ముందుండాలని సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మి పిలుపునిచ్చారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ‘మాదకద్రవ్యాల వినియోగం, వాటి పర్యావసానాలు’ అనే అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల ముఖ్యంగా యువత చెడునడతకు అలవడుతుందన్నారు. తద్వారా అనేక అనర్థాలు చూడాల్సి వస్తోందన్నారు. డ్రగ్స్ మహమ్మారిపై యువత ఉక్కుపాదం మోపాలన్నారు. బందరు ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాలను నియంత్రణకు పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. వ్యసనాల జోలికి పోవద్దు.. వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో యువత ఎటువంటి వ్యసనాల జోలికి పోకుండా భవిష్యత్తు మీద దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మై భారత్ ఎన్టీఆర్ జిల్లా యువజన అధికారి బి. ప్రదీప్ కుమార్, ఆర్పేట సీఐ ఏసుబాబు, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి, న్యాయవాది సీహెచ్ ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం అర్బన్: జిల్లాలో ఏపీ టెట్–2026కు శుక్రవారం రెండు సెషన్లలో కలిపి 94.98శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. నందమూరులోని శ్రీ వాసవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, పెనమలూరు మండలం కానూరు గ్రామంలోని ఐఓఎన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్ పరీక్ష కేంద్రాల్లో మొదటి సెషన్లో మొత్తం 1,640 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించారు. వీరిలో 1,499మంది హాజరుకాగా, 141మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 94.41గా నమోదైనట్లు తెలిపారు. రెండో సెషన్లో శ్రీ వాసవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్ష కేంద్రంలో 90మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా, 86మంది హాజరయ్యారు. నలుగురు గైర్హాజరయ్యారు. హాజరు శాతం 95.56గా నమోదైంది. రెండు సెషన్ల సగటు హాజరు శాతం 94.98గా ఉందని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు.. ఏపీ టెట్ సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మచిలీపట్నం డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బీఎస్సీ శేఖర్ సింగ్ శ్రీ వాసవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్ష కేంద్రాన్ని, గుడివాడ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కె. రవికుమార్ ఐఓఎన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. తనిఖీల్లో ఎలాంటి ప్రతికూల అంశాలు గుర్తించలేదని అధికారులు తెలిపారు. -
నూతన అన్నదానం, లడ్డూపోటులు సిద్ధం
● 21న ప్రారంభోత్సవాలు ● అన్ని శాఖల అధికారులతో సమీక్షలో దుర్గగుడి ఈవో శీనానాయక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన అన్నదానం, లడ్డూపోటులను ఈ నెల 21వ తేదీన ప్రారంభోత్సవం జరగనున్నాయి. భవనాల ప్రారంభోత్సవానికి సంబంధించి దేవదాయ శాఖ నుంచి అన్ని అనుమతులు రావడంతో సుముహూర్తాన్ని ఖరారు చేశారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా నిర్మించిన ఈ రెండు భవానాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దల వైపు నుంచి ఆమోదం తెలపాల్సి ఉండగా, అన్నదాన భవనం, లడ్డూపోటు భవనాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆలయ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. లడ్డూపోటు ప్రారంభోత్సవం నాటికి యంత్రాలు, విద్యుదీకరణ, ప్రసాదాల తయారీ ప్రక్రియ ఎక్కడా అంతరాయం కలుగకుండా చూడాలని ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రావణ మాసంలో నూతన భవనాలను ప్రారంభోత్సవం చేయడం వల్ల ఎక్కువ మంది భక్తులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఏసీ రంగారావు, డీఈవో కిషోర్కుమార్, ఏఈవోలు ఎన్. రమేష్బాబు, చంద్రశేఖర్, ఈఈ ఎల్.రమాదేవి, డీఈఈలు, ఏఈఈలతో పాటు ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిరసన స్వరం.. రాజీనామా నినాదం
● డీఎస్సీ అవకతవకలపై మంత్రి లోకేష్ బాధ్యత వహించాల్సిందే ● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ శ్రేణులు గళమెత్తాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే.. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ● తాడిగడప మునిసిపాలిటీ యువజన విభాగం అధ్యక్షుడు మరీదు వినయ్ ఆధ్వర్యంలో యనమలకుదురులో గురువారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ● గన్నవరం మూడు బొమ్మల సెంటర్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనగాని సుందరచైతన్య, పల్లి వీరయ్య నేతృత్వంలో దీక్ష శిబిరాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్రాణి ప్రారంభించారు. ● ఏపీ జెన్–జెడ్ వార్ రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని పామర్రులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కై లే అనిల్కుమార్ గురువారం ప్రారంభించారు. తొలుత కై లే అనిల్కుమార్ నివాస గృహం వద్ద నుంచి ర్యాలీగా పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేసుకుంటూ దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఈ శిబిరంలో దీక్షలో పాల్గొన్న వారికి పూల దండలు వేసి దీక్షను ప్రారంభించారు. నియోజకవర్గ పరిశీలకులు వేముల కొండ తిరుపతిరావు, జెడ్పీటీసీ సభ్యులు జొన్నల రామ్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
వెట్టిచాకిరీ చేయలేదని సస్పెండ్ చేశారు
పెనమలూరు/కోనేరుసెంటర్ : పోలీస్ శాఖలో వెట్టిచాకిరీ వ్యవహారంపై తీవ్ర చర్చకు దారితీసిన అంశమిది. పెనమలూరు పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేసిన రూపకళ గురువారం యనమలకుదురులో మీడియాతో మాట్లాడుతూ వెట్టిచాకిరీ చేయడానికి నిరాకరించానని తనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ‘భర్త మృతి చెందడంతో నాకు హోంగార్డు పోస్టు ఇచ్చారు. గన్నవరం డివిజన్ పెనమలూరు పీఎస్లో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత నెల 14వ తేదీన హోంగార్డు కార్యాలయం నుంచి సాల్మన్ అనే కానిస్టేబుల్ ఫోన్ చేసి ట్రైనింగ్ ఉందని రమ్మని చెప్పడంతో 15వ తేదీన వెళ్లి కలిశాను. మాచవరంలో ఐజీ ఉంటారని అక్కడ పని చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. మచిలీపట్నం తిప్పారుఅనారోగ్యంతో ఉన్నానని వెళ్లలేనని చెప్పాను. దీనిని మనసులో పెట్టుకుని అప్పటి నుంచి నిన్నటి వరకూ ప్రతిరోజూ మచిలీపట్నం తిప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడ గడ్డి పీకించారు. ఆర్ఐని కలిసి నాకు ఆరోగ్యం బాగాలేదని మెడికల్ డాక్యుమెంట్లు చూపాను. ఆర్ఐ న్యాయం చేయక పోవటంతో గన్నవరం సర్కిల్లో హోంగార్డు విధులు పర్యవేక్షించే గుప్తాను కలిశాను. సొమ్ము ఇస్తే పనులు అవుతాయని గుప్తా చెప్పారు. నా నెల జీతం రూ.20 వేలేనని, సొమ్ము ఇవ్వలేనని చెప్పాను. దీంతో అక్కడి నుంచి నన్ను పంపించేశారు. ఉద్యోగం పీకేస్తానని ఎస్పీ బెదిరించారు న్యాయం కోసం ఎస్పీని కలిసాను. ఆయన కూడా సీ క్యాటగిరీలో ఉన్న వారు ఇళ్లల్లోనే పని చేయాలని చెప్పారు. తన అర్హతను చూసి పోలీస్స్టేషన్కు కేటాయించారని, తన పరిస్థితి అర్థం చేసుకొని న్యాయం చేయాలని కోరితే ఉద్యోగం పీకేస్తానని బెదిరించారు. ఈ క్రమంలో బుధవారం హోంగార్డ్ ఆఫీసులో నాకు ఒక పేపర్ ఇచ్చి, అందులో ఏముందో కూడా చదువుకునే అవకాశం లేకుండా సంతకం చేయించుకున్నారు. తర్వాత సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. ఆదేశించిన మేరకు ట్రైనింగ్కు హాజరు కాలేదని ఆరోపించారు’ అని కన్నీంటి పర్యంతమయ్యారు. అధికారుల ఇళ్లల్లో పని చేయాలంటే వ్యక్తిగత పనులు, వెట్టి చాకిరి చేయాల్సిందేనని రూపకళ ఈ సందర్భంగా వివరించారు. ‘పిల్లలతో కాలకృత్యాలు తీర్పించి వారికి స్నానాలు చేయించాలి. బాత్ రూమ్లు కడగాలి. వృద్ధులు ఉంటే డైపర్లు మార్చాలి. వంట చేయాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మహిళా హోంగార్డు చేసిన ఆరోపణలను కృష్ణా జిల్లా పోలీసు శాఖ ఓ ప్రకటనలో ఖండించింది. సి–కేటగిరికి ఎంపికై న హోంగార్డులు గార్డెనింగ్, టైలరింగ్, శానిటేషన్ తదితర విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని, పోలీస్స్టేషన్లలో మాత్రమే పనిచేస్తానని భీష్మిస్తే కుదరదని పేర్కొంది. -
పాఠశాల భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సత్యనారాయణపురం(విజయవాడపశ్చిమ): పాఠశాల భవనంపై నుంచి దూకి ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటన విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ మధురానగర్లో నివసించే బాలిక (13) సత్యనారాయణపురంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి విద్యార్థి. ఇటీవల చదువులో కొంచెం వెనుకబడిందని, పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయంటూ ఉపాధ్యాయులు బాలికను తరగతి గదిలోని విద్యార్థులు ఎదుటే అవమానకరంగా మాట్లాడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో గురువారం పాఠశాలలో యూనిట్ పరీక్షలు జరుగుతున్నాయి. మళ్లీ అవమానిస్తారనే ఆందోళనతో..ఆ పరీక్ష రాసిన బాలిక తక్కువ మార్కులు వస్తాయని ఆవేదనకు గురైంది. మళ్లీ ఉపాధ్యాయులు అవమానిస్తారని భావించింది. జరుగుతున్న విషయాలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక చావే శరణ్యమని భావించింది. పాఠశాల నాలుగో అంతస్తులోని టాయిలెట్ల వెనుక నుంచి రోడ్డు మీదకు దూకింది. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు, స్కూల్ సిబ్బంది వెంటనే ఆమెను ఆటోలో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ఆమె కాళ్లు, చేతులు విరిగి, తలకు తీవ్ర గాయాలు కావటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ను వివరణ కోరగా ఉపాధ్యాయులు ఎటువంటి వత్తిడి పెట్టలేదని, బాలిక ప్రమాదవశాత్తు పాఠశాల భవనం నుంచి జారిపడిందని దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం. తన కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాఠశాల యజమాన్యమే కారణం అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే తమకు సమాచారం కూడా అందించలేదని ఆస్పత్రిలో చేర్పించిన తర్వాతే తమకు తెలిసిందని వాపోయారు. దీనిపై ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఎన్పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బధిరుల బ్యాడ్మింటన్లో నాగూర్పాషా సత్తా
ఇబ్రహింపట్నం: బధిరుల జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2026 పోటీల్లో కొండపల్లికి చెందిన మహమ్మద్ నాగూర్ పాషా ప్రతిభ చాటి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఇటీవల హైదరాబాద్ మొయినాబాద్లోని జ్వాలా గుట్టా అకాడమీ ఆఫ్ ఎక్స్లెన్స్లో డెఫ్ ఎనేబిల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యాన జరిగిన జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో మహమ్మద్ నాగూర్ పాషా అద్భుత ప్రదర్శనతో రెండు విభాగాల్లో రన్నరప్గా నిలిచారు. పాషా సింగిల్స్ విభాగంలో రన్నరప్, డబుల్స్ విభాగంలోనూ రన్నరప్గా నిలిచి ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు తీసుకొచ్చారు. పలు క్రీడల్లో జాతీయ స్థాయిలో అతను రాణిస్తున్నారు. క్రీడా ప్రముఖులు, సహచరులు అతన్ని అభినందించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి సమీపంలోని కనకదుర్గనగర్లో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని భక్తుడు మృతి చెందాడు. సుమారు 50 నుంచి 60 సంవత్సరాల ఉన్న వ్యక్తి శరీరంపై బనియన్, గ్రీన్ లుంగీ, చేతికి వాచీ ఉన్నాయి. మృతదేహాన్ని చూసిన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అతని వద్ద గుర్తింపు ఆధారాలేమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమ వ్యక్తి కనిపించడం లేదని ఆలయ మైక్ ప్రచార కేంద్రానికి , పోలీస్ అవుట్పోస్టుకు ఎవరూ రాకపోవడంతో ఒంటరిగా గుడికి వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చరీలో భద్రపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అజయ్బాబు విజయం యువతకు స్ఫూర్తిదాయకం
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): కామెన్వెల్త్ గేమ్స్లో రాష్ట్రానికి చెందిన వల్లూరి అజయ్బాబు వెయిట్లిఫ్టింగ్లో రజత పతకాన్ని సొంతం చేసుకుని యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ(శాప్) చైర్మన్ ఏ. రవినాయుడు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి చెప్పారు. స్థానిక బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలోని శాప్ కార్యాలయంలో అజయ్బాబును గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీల్లోనూ అజయ్బాబు ప్రతిభ చూపి పతకాలు పొందాలని ఆకాంక్షించారు. -
‘విజయ’ ఎన్నికలో నాటకీయ పరిణామాలు!
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య ఏకగ్రీవమయ్యాయి. మూడు డైరెక్టర్ల ఖాళీలకు బుధవారం చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, చలసాని చక్రపాణి, గొంది నరేంద్రబరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. గడువు ముగియడానికి కచ్చితంగా మూడు నిమిషాలు ఉన్న తరుణంలో అనూహ్యంగా చలసాని చక్రపాణి తన నామినేషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల అధికారి గురునాథంకు తెలిపారు. బరిలో ముగ్గురు అభ్యర్థులే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబుకు డిక్లరేషన్ ఫారాలను అందజేశారు. నరేంద్ర ఏకగ్రీవమైనా డిక్లరేషన్ పత్రాన్ని తీసుకునేందుకు అందుబాటులో లేకపోవడంతో అధికార పార్టీ నేతల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలపై ఉత్కంఠ! నామినేషన్ల దాఖలు చేసిన గొంది నరేంద్రతో నామినేషన్ ఉపసంహరించుకునేలా డెయిరీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించినా చివరి నిముషంలో బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం పాలప్రాజెక్టుకు విచ్చేస్తున్న నరేంద్రను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కారులో తరలించినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నరేంద్రతో నామినేషన్ వేయించి అతనికి మద్దతుగా ఉన్న అధికార పార్టీ కృష్ణా జిల్లా ఎమ్మెల్యేకు చెందిన వారే అధికార పార్టీ కార్యాలయానికి ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఎమ్మెల్యే కొంతకాలంగా చైర్మన్ చలసాని ఆంజనేయులపై బహిరంగంగా విమర్శలు చేయడం, ఇప్పుడు ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరో వైపున మూడు పోస్టులకు నాలుగురు నామినేషన్ల ఉండటంతో ఎన్నిక అనివ్యారమయ్యేలా కనిపించింది. చివరి నిమిషంలో చలసాని ఆంజనేయులు, బోర్డు డైరెక్టర్లు, తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత చక్రపాణి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒప్పించారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే వేసిన ఎత్తులు ఫలించలేదు. నామినేషన్ ఉపసంహరణ అనంతరం చక్రపాణి కన్నీటి పర్యంతమయ్యారు. చైర్మన్గా చలసాని ఆంజనేయులు ఏకగ్రీవ ఎన్నిక బోర్డు డైరెక్టర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తైన తర్వాత బోర్డు సమావేశమైంది. సమావేశంలో చైర్మన్గా చలసాని అంజనేయులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ బోర్డు సభ్యులు తీర్మానించారు. -
చైర్మన్ రాజీనామాకు మంత్రుల ఒత్తిడి!
కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) చైర్మన్ చలసాని ఆంజనేయులను రాజీనామా చేయాలని జిల్లా మంత్రులు తీవ్ర ఒత్తిడి చేయడంతో ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. విజయ డెయిరీలో గురువారం 3 డైరెక్టర్ల ఖాళీలకు ఎన్నిక ప్రక్రియ జరిగింది. చలసాని ఆంజనేయులతో పాటు మరో ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికవగా, సాయంత్రం జరిగిన బోర్డు సమావేశంలో చైర్మన్గా చలసానిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన అర్ధగంటలోనే మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్రలు, మరో టీడీపీ నేత విజయ డెయిరీకి చేరుకున్నారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు చాంబర్కు నేరుగా చేరుకున్నమంత్రులు ఆయనను రాజీనామా చేయాలని పట్టుపట్టారు. ఈ దఫా ఎన్నికలలో చలసాని ఆంజనేయులను ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయకుండా చూడాలని జిల్లా టీడీపీ నేతలు తొలి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలించలేదు. విజయ డెయిరీ ఆవరణలోనే నందిగామకు చెందిన బోర్డు డైరెక్టర్.. ఎమ్మెల్యేల మధ్య ఫోన్లో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. రాజీనామా ప్రసక్తే లేదు.. చైర్మన్ చాంబర్లో చలసానితో పాటు మంత్రులు సుదీర్ఘంగా చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఓ దశలో చలసానిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. సుమారు రెండు గంటలు చర్చ జరిగిన తర్వాత రాజీనామా చేసే ప్రసక్తి లేదని చలసాని తేల్చిచెప్పారు. ఇంతలో చలసాని మరోసారి అస్వస్థతకు గురవడంతో కుమార్తెతో ఆయన నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఈ వ్యవహారం ఎటువంటి మలుపు తీసుకుంటుందోనని అటు బోర్డు డైరెక్టర్లతో పాటు కృష్ణా మిల్క్ యూనియన్ అధికారులు, ఉద్యోగులలో చర్చ జరుగుతోది.


