breaking news
Krishna District Latest News
-
ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కమిటీ కార్యవర్గం ఎన్నికై ంది. గాంధీనగర్లో సర్ విజ్జీ మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్ ఆవరణలో ఈ ఎన్నిక ప్రక్రియ ఆదివారం జరిగింది. ఏపీ హైకోర్టు న్యాయవాది కె.స్టాలిన్ రిటర్నింగ్ ఆఫీసర్ వ్యవహరించారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి (డీఎస్డీవో) కె.కోటేశ్వర రావు, ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు మహేష్, ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ అక్వాటిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఐ.మల్లికార్జునరావు పరిశీలకులుగా హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులు వీరే.. అసోసియేషన్ అధ్యక్షుడిగా కొంగర రవికాంత్, ఉపాధ్యక్షులుగా ఎం.ఓబుల్రెడ్డి, ఎల్.మేఘన, లావు సహదేవ్, కార్యదర్శిగా కొడాలి రమేష్, జాయింట్ సెక్రటరీలు ఇల్లిపిల్ల రమేష్, వల్లభనేని రాజేశ్వరి, ఎస్.వీర వెంకటసత్య నారాయణ, కోశాధికారిగా డి.శివ కుమార్, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. అశ్రునయనాలతో అంత్యక్రియలు గూడూరు: మండలంలోని పొట్టేలుగుంటాయి పేటలో శనివారం బలవన్మరణానికి పాల్పడిన ముగ్గురు మహిళలకు ఆదివారం అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అనుమకొండ రజనీకుమారి, అనుమకొండ మధుబాల భౌతిక దేహాలకు పొట్టేలుగుంటాయిపేట లోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. రజనీకుమారి చితికి ఆమె భర్త కృష్ణ, మధుబాల భౌతిక కాయానికి కుమారుడు విఖ్యాంత్ నిప్పంటించారు. తోట గౌరీదేవి భౌతిక కాయాన్ని ఆమె మెట్టినిల్లు అయిన కంకటావ శివారు కత్తులవానిపాలెం శ్మశాన వాటికలో ఆమె భర్త దేవచంద్రరావు దహనసంస్కారాలు నిర్వహించారు. అనుమకొండ మధుబాల తండ్రి బోయిడి నాంచారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం శనివారం బందరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం జరిపించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాంచారయ్య ఫిర్యాదు మేరకు మధుబాల భర్త అనుమకొండ దేవచంద్రరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్, గూడూరు, పెడన ఎస్ఐలు సీహెచ్.దివ్య ప్రకాష్, షేక్ బషీర్ పాల్గొన్నారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఏపీలో వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏపీ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ తారకేష్ మాట్లాడుతూ.. ఏటా 1,500 నుంచి 2,000 మెడికల్ సీట్లు పెంచుకోవచ్చని మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైద్య విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దంటూ వేడుకున్నారు. మెడికల్ సీట్ల సంఖ్యను పెంచి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో తక్కువ మార్కులు వచ్చినా సీట్లు లభిస్తుంటే, ఏపీలో మాత్రం మెరుగైన మార్కులు సాధించినా సీట్లు రాకపోవడం వెనుక ఇక్కడి కాలేజీల సంఖ్య, సీట్ల కొరతే ప్రధాన కారణమని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కె.రంగారావు, ఉపాధ్యక్షుడు పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ అందె గుంటూరు మెడికల్: పద్మశాలి వైద్యుల నూతన కార్యవర్గం ఎన్నిక విజయవాడ లోని పద్మశాలి కళ్యాణమండపం లో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ అందె వెంకటేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన డాక్టర్ సింగరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్ టి.మునిరామ ప్రసాద్, కోశాధికారిగా నగరానికి చెందిన డాక్టర్ కొల్లి జయకిషన్లు ఎన్నికయ్యారు. కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ సమీపంలోని గుంటుపల్లికి చెందిన కంచర్ల బెనర్జీ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,116ల విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేసింది. హైదరాబాద్ సరూర్నగర్కు చెందిన వి.వీరప్రకాష్ కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందించింది. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడకు చెందిన వై.యోహిత్ పేరిట కుటుంబ సభ్యులు అమ్మవారి అన్నదానం నిమిత్తం రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన వి.వి.మనుబ్రహ్మచారి అన్నదానానికి రూ. 1,00,116 విరాళం సమర్పించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ. లక్ష విరాళం చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఇందుకూరి నరేష్కుమార్రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేసవస్త్రాలను అందించారు. -
మద్యం మత్తులో యువకుల వీరంగం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మద్యం మత్తులో రెండు వర్గాల యువకులు వీరంగం సృష్టించారు. వారి మధ్య జరిగి కొట్లాటలో ఒకరు గాయపడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ పరమేశ్వరరావు కథనం మేరకు.. మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన వడ్లమూడి చాణక్య ఆదివారం మరో ఆరుగురు స్నేహితులు కలిసి డాబాపై మందు తాగుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వేముల చందు మధ్యాహ్నం ఇంటికి రాగా ఎదురుగా డాబాపై చాణక్య అతని స్నేహితులు మద్యం మత్తులో చేస్తున్న వీరంగం చూస్తూ ఇంట్లోకి వెళ్లిపోయాడు. దీంతో చాణక్య అతని స్నేహితులు తమ డాబాపైకి కోపంగా చూస్తూ వెళుతున్నావేంట్రా అంటూ చందుతో ఘర్షణకు దిగారు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. చాణక్య అతని స్నేహితులు చందుపై దాడి చేశారు. చందు భార్య జరిగిన విష యాన్ని అతని మేనమామ మణికంఠకు ఫోన్ చేసి చెప్పింది. విషయం తెలుసుకున్న మణికంఠ తని స్నేహితులతో కలిసి బలరామునిపేట చేరుకుని ఎందుకు దాడి చేశారంటూ చాణక్యను నిలదీశాడు. ఈ విషయంలో మణికంఠకు చాణక్య మధ్య ఘర్షణ జరిగింది. చాణక్య, అతని స్నేహితుల దాడిలో మణికంఠ చెవి తెగింది. ఆర్పేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రెండు వర్గాల వారిని స్టేషన్కు తరలిస్తుండగా కోనేరుసెంటర్ సమీపంలో మరలా చాణక్య అతని స్నేహితులు మణికంఠపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని రెండు వర్గాల వారిని స్టేషన్కు తరలించారు. బాధితుడు మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గాయాలపాలైన మణికంఠను చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. గంజాయి మత్తులోనే తమపై దాడి చేశారని బాధితుడు బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఎస్ఈ పోస్టుపై ఈఈ చూపు!
అనేక ఆరోపణలు లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ సర్కిల్ ఆర్అండ్బీ రెగ్యులర్ ఎస్ఈని ఆ పోస్టు నుంచి తప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనకు ఇంకా తొమ్మిది నెలల సర్వీసు ఉన్నా, ఆ స్థానంలో ఇన్చార్జిగా రావడానికి నగర సమీపంలోనే పనిచేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి రాజకీయ నాయకులతో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో వత్తిళ్లు తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శికి అమాత్యుల సిఫార్సు లేఖలు ఇచ్చిన ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇప్పుడు ఏకంగా సకల శాఖల మంత్రి చుట్టూ తిరుగుతూ ఇంజినీర్ ఇన్ చీఫ్కు ఫోన్లు చేయిస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమిలోని ఓ పార్టీకి చెందిన మంత్రి తన క్లాస్మెంట్ అంటూ ప్రచారం చేసుకుంటూ, ఎలాగైనా ఇన్చార్జి సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ) పోస్టు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మనస్తాపం చెందిన ఎస్ఈ! ప్రస్తుతం విజయవాడ సర్కిల్ ఎస్ఈగా పనిచేస్తున్న జి.వి.భాస్కరరావుకు మరో తొమ్మిది నెలల సర్వీసు ఉంది. రెగ్యులర్ ఎస్ఈ ఉద్యోగ విరమణ తర్వాత ఇన్చార్జిగా వచ్చేందుకు కిందిస్థాయి అధికారులు ప్రయత్నించడం సాధారణం. ఇప్పుడు నిజాయతీగా పనిచేసే ఉన్నతాధికారిని తప్పించి, ఆ పోస్టులో కిందస్థాయి ఉద్యోగి ఇన్చార్జిగా రావాలని ప్రయత్నించడం ఇప్పుడే చూస్తున్నా మంటూ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను సైతం ఇబ్బందులు పెట్ట కుండా సక్రమంగా విధులు నిర్వహించేలా ప్రస్తుత ఎస్ఈ వ్యవహరిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అలాంటి తనను తప్పించి కిందిస్థాయిలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇన్చార్జి ఎస్ఈగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియడంతో ప్రస్తుత ఎస్ఈ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మంత్రులతో సిఫార్సులు ప్రస్తుతం నగర సమీపంలోని డివిజన్లో పనిచేస్తున్న సదరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నెల రోజులుగా ఇన్చార్జి ఎస్ఈగా రావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన రాజకీయ పలుకుబడితో పాటు, గతంలో పరిచయాలను వాడుతున్నారు. కూటమి పార్టీలోని ఒక మంత్రి తన క్లాస్మేట్ అని చెప్పుకుంటూ ఉన్నతాధికారులపై వత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ శాఖ కార్యదర్శితో పాటు, ఇంజినీర్ ఇన్ఛీప్కు కూడా ఫోన్లు చేయిస్తున్నట్లు తెలిసింది. తాజాగా అన్ని శాఖలూ చూస్తున్న ఓ మంత్రి వద్దకు వెళ్లి సిఫార్సు చేయించినట్లు తెలిసింది. ఇన్చార్జిగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఆ శాఖలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగుల సర్వీసు మేటర్లో కూడా లంచాలు ఇస్తేనే పనిచేసే నైజం అతనిది అంటున్నారు. అలాంటి వ్యక్తి రాజధాని నగరంలోని సర్కిల్కు ఎస్ఈగా వచ్చే పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు అమాత్యుల పలుకుబడి ఉందని ఉద్యోగులందరిపై తప్పుడు పనులకు వత్తిడి చేస్తే అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. -
కనకదుర్గమ్మకు జేజేలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జై దుర్గ్గ.. జైజై దుర్గా అంటూ కనకదుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి పరిసరాలు పులకించాయి. దుర్గమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివారం తరలివచ్చారు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడం సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు, యాత్రికులతో పాటు వివాహ శుభముహూర్తం వేళ ఒక్కటైన నూతన వధువరులు, కుటుంబ సభ్యుల రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి జరిగే పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు సైతం విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోని అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. రద్దీ అధికం కావడంతో ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనం నిలిపివేశారు. రూ.300 టికెట్లపై వీఐపీలు, సిఫార్సు లేఖలు ఉన్న వారితో పాటు భక్తులందరికీ బంగారు వాకిలి దర్శనం కల్పించారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయంలో క్యూలైన్లను ఏఈవోలు చంద్రశేఖర్, ఎన్.రమేష్బాబు పర్యవేక్షించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొనగా, రాత్రి 9.30 గంటల వరకు భక్తుల తాకిడి కనిపించింది.దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తజనం -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
కంచికచర్ల: సెలవురోజు కావడంతో సెల్ఫోన్ బాగు చేయించుకుందామని స్నేహితుడితో బైక్పై వెళ్లి తిరిగి కళాశాలకు వస్తుండగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన బాలవోలు గణేష్(21), నందిగామకు చెందిన ప్రవీణ్ ఇబ్రహీంపట్నం మండలంలోని వేర్వేరు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ చదువుతున్నారు. వారిద్దరు స్నేహితులు. గణేష్ తన సెల్ఫోన్ బాగు చేయించుకునేందుకు ప్రవీణ్తోకలిసి మరో స్నేహితుడి బైక్పై నందిగామ వచ్చారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం కళాశాలలకు తిరిగి వెళ్తుండగా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడ్ను ఢీకొని రెండు రోడ్ల మధ్యలో ఉన్న సాగర్కెనాల్లో పడిపోయింది. ఆ సమీపంలో పెద్ద బండరాళ్లు ఉండటంతో గణేష్, ప్రవీణ్కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి గణేష్ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గిరిజన సంస్కృతి సంబరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): గిరిజన ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతూ వారి ఆత్మగౌరవాన్ని ఆకాంక్షిస్తూ శంకర్ షాలిని ఫౌండేషన్ సహకారంతో గిరిజన ప్రజా సమాఖ్య(జీపీఎస్), గిరిజన విద్యార్థి సమాఖ్య (జీవీఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం గిరిజన ఆదివాసి సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన నృత్యాలు అబ్బురపరిచాయి. మన్యం జిల్లా పార్వతీపురం సీతంపేట నుంచి వచ్చిన గిరిజనుల సవర నృత్యం, అదిలాబాద్ జిల్లా గిరిజనుల గుస్పాడి నృత్యం, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామం లంబాడీలు నెత్తిమీద బిందెలు పెట్టుకుని చేసిన నృత్యం, అరకు ప్రాంతం నుంచి వచ్చిన గిరిజనుల థింసా నృత్యం, భద్రాచలం చింతూరు గిరిజనులు కొమ్మ కోయ నృత్యం ఆహూతులను కట్టిపడేశాయి. ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ మాట్లాడుతూ గిరిజన ఆదివాసీల హక్కుల పరిరక్షణ, అభ్యున్నతి లక్ష్యంగా జీపీఎస్, జీవీఎస్ పని చేస్తున్నాయన్నారు. ఆధార్, రేషన్ కార్డు లేని కుటుంబాలను ఆదుకోవాలన్నారు. గాయకుడు డాక్టర్ కళాశ్రీ బిక్షు నాయక్, గాయని సుజశ్రీ వ్యాఖ్యాతలుగా వ్యహరించి అందరినీ ఉత్సాహ పరిచారు. సభలో జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, కార్యదర్శి రవి నాయక్, హనుమంతు నాయక్, మల్లు స్వామి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్, కృష్ణాజిల్లా అధ్యక్షుడు సమీర్ నాయక్, జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణు నాయక్, అంజు నాయక్, పేరం సత్యం, ధర్మ కుమార్, దుర్గా నాయక్, పార్వతి బాయ్, లక్ష్మణ నాయక్, కృష్ణా నాయక్, చంద్ర నాయక్, పాండు నాయక్, కాకినాడ మధుకుమార్, వరహాలు తదితరులు పాల్గొన్నారు.సందడిగా గిరిజన ఆదివాసి సమ్మేళనం -
అందని ద్రాక్షలా నగదు రహిత వైద్యం
ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందని ద్రాక్షలా మారిందని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు వాపోయారు. ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన పౌర గ్రంథాలయ ఉద్యోగి కొలకలూరి కృపానందం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతినెలా ఆరోగ్య బీమా ప్రీమియం ప్రభుత్వం మినహాయిస్తోందని, అయినా ఉద్యోగులు అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే హెల్త్ కార్డులు ఉపయోగపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృపానందం ఇద్దరు పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, మెడికల్ రీయింబర్స్మెంట్ ద్వారా ఆస్పత్రి ఖర్చులు చెల్లించాలని కోరారు. వారి కుటుంబానికి అసోసియేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం దగ్ధం
మధురానగర్(విజయవాడసెంట్రల్): దావు బుచ్చయ్యకాలనీలో ఆదివారం ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం దగ్ధమైంది. ఆ వాహనం పక్కనే ఉన్న కారు సైతం పాక్షికంగా దెబ్బతింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం నుంచి మంటలు వస్తుండటంతో ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందారు. స్థానికుల కథనం మేరకు.. ఆదివారం ఉదయం ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనం నుంచి మంటలు ఎగశాయి. చుట్టపక్కల వారు ద్విచక్రవాహనం యజమానికి సమాచారం ఇచ్చారు. ఆయన స్పందించి మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. అప్పటికే ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం దగ్ధమైంది. పక్కనే ఉన్న కారు సైతం పాక్షికంగా దెబ్బతింది. కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం సోమవారం జరుగుతుందని ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యక్రమం జరుగుతుందని వివరించారు. అందిన ప్రతి అర్జీపై చట్టపరిఽధిలో విచారణ జరిపించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. -
సంఘటితత్వంతో సమస్యల పరిష్కారం సాధ్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): సంఘీయులంతా సంఘటితంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమని సీనియర్ రాజకీయ నాయకుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కార్యవర్గ సమావేశం విజయవాడ భవానీపురంలోని కొండవీడు అకాడమీ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు, నాయ కులు రెడ్డి సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యఅతిథి వేమారెడ్డి మాట్లాడుతూ.. ఒక సామాజిక వర్గానికి సంబంధించి జిల్లాకొక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం సరికాదని, రాష్ట్రంలో ఉన్న అందరూ కలిసి ఒక సంఘంగా ఉంటే మంచిదని సూచించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు, హోదాలకు అతీతంగా రెడ్డి సామాజికవర్గ సంక్షేమం కోసం వారి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన సంఘం డిమాండ్లను వివరించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి పాలక మండ లిని నియమించాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో రెడ్డి విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహాల (హాస్టల్స్) ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయించాలని కోరారు. రెడ్డి సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బిక్క నరసింహారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల వెంకట రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం గౌరవ సలహాదారు పులుగు సుశీల రెడ్డి, ఉపాధ్యక్షురాలు త్రివేణిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెం సుబ్బారెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మచ్చ శ్రీనివాస్రెడ్డి, కోస్తాంధ్ర ఇన్చార్జ్ బోనం రామిరెడ్డి, రాష్ట్ర గౌరవ సలహాదారు జెమిలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొంతిరెడ్డి వేమారెడ్డిని సంఘం కార్యవర్గ సభ్యులు సత్కరించారు.ఏపీ రెడ్డి సంఘం సమావేశంలో దొంతిరెడ్డి వేమారెడ్డి -
సోమవారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2026
యూడైస్ గణాంకాలు విద్యార్థుల నమోదుతో వచ్చినవే. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది చేరికలు ఉన్నాయి. చేరికల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని చేరికలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. విద్యార్థుల నమోదుపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. – యూవీ సుబ్బారావు, కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిమచిలీపట్నం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు ఏటా నిర్వహించే ’బడిబాట’ కార్యక్రమం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ప్రచారానికి పెద్దపీట వేస్తూ సర్కారీ బడుల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెబుతున్నా, గణాంకాలు మాత్రం భిన్నమైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. ప్రధానంగా ఒకటో తరగతి ప్రవేశాలు వరుసగా తగ్గుతుండటం ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల విశ్వాసం ఇంకా పూర్తిస్థాయిలో పెరగలేదనే సంకేతాలనుఇస్తోంది. తగ్గుతున్న చేరికలు జిల్లా అధికారిక వివరాల ప్రకారం 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 7,981 మంది విద్యార్థులు ఉండగా, 2025–26లో ఈ సంఖ్య 7,509కు తగ్గింది. ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరంలో జూన్ 30 నాటికి కేవలం 6,802 మంది మాత్రమే చేరారు. మూడేళ్ల వ్యవధిలో 1,179 మంది తగ్గిపోవడంతో దాదాపు 15 శాతం క్షీణత నమోదైంది. ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం, ప్రత్యేక చేరికల డ్రైవ్లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. గణాంకాల్లో సందేహాలు చేరికల గణాంకాల విషయంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు 8,352 మంది లక్ష్యాన్ని నిర్ణయించి జూన్ 30 నాటికి 81.44 శాతం చేరికలు పూర్తయ్యాయని సమగ్ర శిక్ష అధికారులు ప్రకటిస్తున్నారు. గత ఏడాది నమోదైన విద్యార్థుల సంఖ్య, ఈ ఏడాది వెల్లడించిన చేరికల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల గణాంకాల్లోనూ ఇలాంటి తేడాలు ఉండటంతో విద్యా వర్గాలు లెక్కల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. యూడైస్లోనూ యూడైస్ గణాంకాలు కూడా జిల్లాలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. 2024–25లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం 96,042 మంది విద్యార్థులు ఉండగా, 2025–26లో అది 87,989కు పడిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 87,196కు చేరింది. రెండేళ్ల వ్యవధిలో మొత్తం 8,846 మంది విద్యార్థులు తగ్గడం విద్యాశాఖకు హెచ్చరికగా మారింది. విశ్వాసం పెరగాలంటే.. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరగాలంటే ప్రచార కార్యక్రమాలు మాత్రమే కాకుండా, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, బోధన నాణ్యత మెరుగుదల, మౌలిక వసతుల కల్పన, విద్యా ఫలితాలపై ప్రత్యేక దృష్టి అవసరమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు చేరికల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు మాత్రం ప్రభుత్వ విద్యా వ్యవస్థ ముందున్న సవాళ్లను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 20 మండలాల్లో 600 వరకూ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలోని వివిధ స్థాయిల్లో కొనసాగుతున్నాయి. ఆయా పాఠశాల్లోని మొదటి తరగతిలో సుమారు 15 వేల మంది ని చేర్చుకునే దిశగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే జిల్లాలో ఆ లక్ష్యాన్ని చేరుకోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఎనిమిది వేల మార్కును సైతం దాటలేదని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. కేవలం విజయవాడ అర్బన్ పరిధిలో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ అడ్మిషన్ల సంఖ్య దారుణంగా ఉన్నట్లుగా తెలిసింది. దీనిపై విద్యాశాఖ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
సింగ్నగర్లో గ్యాంగ్వార్
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ‘వాడా.. ఆడో పిరికిపంద. వాడ్ని మా అన్నే రెండు మూడుసార్లు కొట్టాడు. వాడికేంట్రా భయపడేది’ అంటూ ఒక వర్గం... ‘ఏంట్రా నా గురించి ఏదో వాగుతున్నావంటా. నీ తాట తీస్తా. దమ్ముంటే రారా చూసుకుందాం’ అంటూ మరో వర్గం మధ్య పది రోజుల నుంచి చెలరేగిన మాటల యుద్ధం కొట్లాటకు దారితీసింది. ఓ యువకుడిపై కత్తితో దాడికి పాల్పడేలా చేసింది. అజిత్సింగ్నగర్లో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది. పాయకాపురం ప్రశాంతినగర్ ప్రాంతానికి చెందిన కొళ్ల సూర్యతేజ(20) ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత నెలలో తన స్కూల్ ఫ్రెండ్స్ను కలిసేందుకు సూర్యతేజ సింగ్నగర్ వెళ్లాడు. సూర్యతేజ వద్ద అతని ఫ్రెండ్స్ శాంతినగర్కు చెందిన పార్థివ్నందన్ అలియాస్ పార్థు ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో సూర్యతేజ ‘ఆడికేంట్రా భయపడేది. వాడ్ని మా అన్న శివ గతంలో రెండుసార్లు కొట్టాడు. ఏం చేస్తాడంటా’ అంటూ చులకనగా మాట్లాడాడు. ఈ విషయం తెలుసుకున్న పార్థు, సూర్యతేజకు ఫోన్ చేసి ప్రశ్నించాడు. దీంతో కొన్ని రోజుల నుంచి వారిద్దరి వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ‘టైం.. ప్లేస్ చెప్పరా వస్తాం’ అని సూర్యతేజ అనడంతో పార్థు తన స్నేహితులైన సన్ని, మనోజ్, రజాక్, ఈశ్వర్ను వెంటబెట్టుకొని శనివారం సాయంత్రం సూర్యతేజ ఇంటికి వెళ్లారు. అతడిని తమ బండిపై ఎక్కించుకొని సింగ్నగర్ ఎక్సెల్ప్లాంట్ వద్ద ఉన్న జీప్లస్జీ అపార్ట్మెంట్ల వెంబడి ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ సూర్యతేజను తిట్టి, కొట్టడంతో పాటుగా పార్థు తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అతని కడుపులో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. సూర్యతేజ పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు స్పందించి అక్క డికి రావడంతో పార్థు అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న సూర్యతేజను స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి అందిన సమాచారం, బాధితుది ఫిర్యాదు మేరకూ పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో పార్థు, ఎండీ రజాక్ను అరెస్ట్చేశారు. మరో ముగ్గురు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సూర్యతేజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. సూర్యతేజ స్నేహితులు పార్థు స్నేహితులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పది రోజులుగా మాటల యుద్ధం ఓ యువకుడిని బైకుపై ఎత్తుకెళ్లి కత్తితో పొడిచిన ఓ గ్యాంగ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థి పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు, మరో ముగ్గురి కోసం గాలింపు -
పీఆర్సీ కమిషన్ తక్షణం వేయాలి
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనార్థం పీఆర్సీ కమిషన్ను తక్షణం నియమించి ఐఆర్ 30 శాతం ప్రకటించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం ఇబ్రహీంపట్నం స్వర్ణ కన్వెన్షన్లో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథి సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్కుమార్ మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ను నియమించని పక్షంలో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి దశల వారీ ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 30 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలంటే ఆందోళన చెందుతున్నారన్నారు. ఉపాధ్యాయుల ఆందోళన దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుందరయ్య. కోశాధికారి కె. గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చెస్ ఆడితే ఏకాగ్రత, క్రమశిక్షణ, సహనం పెరుగుతాయని నెక్ట్స్జెన్ సీబీఎస్ఈ స్కూల్ సీఈవో గౌతమి చెప్పారు. స్థానిక గుణదలలోని నెక్ట్స్జెన్ స్కూల్ ఆవరణలో ఆదివారం ఎన్టీఆర్ జిల్లా రాపిడ్ చెస్ టోర్నమెంట్ జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 82 మంది పాల్గొని ప్రతిభను చూపారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ పాషా, కార్యదర్శి పి.రేణుక, చీఫ్ ఆర్బిరేటర్లు డి.ప్రవీణ్కుమార్, ఎ.మణిరత్నం, నెక్ట్స్జెన్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.సుధా విజేతలను అభినందించారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వివిధ సేవా టికెట్ల ద్వారా ఆదివారం వచ్చిన ఆదాయం రూ. 8,59,037 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ డీసీ మాట్లాడుతూ స్వామివారికి సేవా టిక్కెట్ల ద్వారా రూ. 4,47,364 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,54,355, డొనేషన్ ద్వారా రూ. 1,67,918, స్వామివారి దర్శనానికి రూ. 59,550, కళ్యాణ కట్ట ద్వారా రూ. 25,640 మొత్తం రూ. 8,59,037 ఆదాయం వచ్చినట్లు వివరించారు. గన్నవరం: ప్రశ్నించే గొంతుకలపై డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ అనుసరిస్తున్న అణచివేత ధోరణి సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. గత నెల 28వ తేదీన ఏలూరులో జరిగిన సభలో ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలను తట్టుకోలేక పవన్కళ్యాణ్ అక్రమ అరెస్ట్లకు దిగడం అన్యాయమన్నారు. ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ పొందిన రావణ్ను భయంకరమైన తీవ్రవాదిగా చూపిస్తూ దేశద్రోహం కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నిస్తే ఇలా భయపెడతామనే హెచ్చరికలను ప్రజలకు పంపడమే కూటమి ఉద్దేశమన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అనేక వేదికలపై నుంచి తాట తీస్తాం, తోలు వలుస్తానని రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను వీడాలని ఆయన హితవు పలికారు. సమావేశంలో నేతలు వై. కేశవరావు, మల్లంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఐసీ వాటాల విక్రయం ఉపసంహరించుకోవాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు మచిలీపట్నంటౌన్: జీవిత బీమా సంస్థలో రూ.10 వేల కోట్ల వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడతామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక కోనేరు సెంటర్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎల్ఐసీని కాపాడాలని కోరుతూ ధర్నా చేశారు. నర్సింగరావు మాట్లాడుతూ.. ఔషధ రంగానికి సంబంధించి ఐడీపీఎల్ కంపెనీని కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్ పరం చేయడంతో సామాన్యులకు ఔషధాల ధరలు అందనంత విధంగా పెరిగిపోయా యని ఆందో ళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వంలో మోదీ నిరంకుశ విధానాలకు తోడు రాష్ట్రంలో చంద్రబాబు కూడా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయ డంలో ముందు వరుసలో ఉంటున్నారని దుయ్యబట్టారు. సీఐటీయూ పోరాటం చేయకుంటే 2021లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోయేదని పేర్కొన్నారు. 1956లో రూ.5 కోట్ల మూల నిధితో ప్రారంభమైన ఎల్ఐసీ నేడు లక్షల కోట్ల సొంత ఆస్తులు కలిగే పరిస్థితికి ఎదిగిన కామధేనువు లాంటి సంస్థను వాటాల విక్రయం పేరుతో ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను పోరాటాల ద్వారా తిప్పికొట్టాలన్నారు. ఐసీయూ మచిలీపట్నం డివిజన్ అధ్యక్షుడు దేవనబోయిన వాసు, ఎల్ఐసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బి.హెచ్.వి.ఎల్.రాధాకృష్ణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎం.పోలినాయుడు, కె.వి. గోపాల్రావు, ఆర్.సి.పి రెడ్డి, జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి. ధనశ్రీ, ఎల్ఐసీ విశ్రాంత ఉద్యోగులు పి.నాగయ్య, సీహెచ్.రాజేష్, ఎస్. ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల హౌసింగ్ నిర్మాణం చేపట్టాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): అమరావతి రాజధానిలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడి యాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు కోరారు. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వ ర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న పలువురు జర్నలిస్టులు ఈ మేరకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 2019లో జర్నలిస్టుల హౌసింగ్ నిర్మాణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 67 ద్వారా 30 ఎకరాల భూమిని అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయించిందని, ఆ భూమిలో సీఆర్డీఏ ఆధ్వర్యంలో బహూళ అంతస్తుల గృహ సముదాయాలను నిర్మించేలా సొసైటీ అధికారికంగా ఒప్పందం చేసుకుని తిరిగి ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చిందని గుర్తుచేశారు. నాలుగు కేటగిరీల్లో జర్నలిస్టులకు అపార్ట్మెంట్లు నిర్మించేలా ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 107ను విడుదల చేసిందన్నారు. హ్యాపీనెస్ట్ తరహాలో జర్నలిస్టుల కోసం ఆ పార్ట్మెంట్లు నిర్మిస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొందని గుర్తుచేశారు. ఇప్పుడు అమరావతిలో హ్యాపీనెస్ట్తో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరుతున్నందున వెంటనే ప్రభుత్వం జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించాలని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టులు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మొత్తం 11 తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు, డైరెక్టర్లు చావా రవి, ఈశ్వర్, నరసింహారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి సీనియర్ జర్నలిస్టుల విజ్ఞప్తి -
ఉద్యోగ భద్రత కల్పించండి
మధురానగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్త దశలవారీ ఆందోళన పోరాటంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందరినీ సంస్థలో విలీనం చేసి పర్మినెంట్ చేయాలని, పీస్ రేట్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు వెంటనే మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని, డీఏలు వెంటనే విడుదల చేయాలన్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని.. జేఎల్ఎం కన్వర్షన్స్ అయిన కార్మికులందరికీ ఏఎల్ఎం ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. 2008 ముందు జాయిన్ ఉద్యోగులందరికీ ఈపీఎప్ హయ్యర్ పెన్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని, సంస్థలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్య నిర్వాహక అధ్యక్షులు ఎల్.రాజు, జి.కనకలింగేశ్వరావు, జె.అనిల్కుమార్, ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.మోహనరావు, పలువురు నేతలు పాల్గొన్నారు. -
సమష్టి భాగస్వామ్యంతో సర్
భవానీపురం/పటమట(విజయవాడతూరు): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంలో సమష్టి భాగస్వామ్యం అవసరమని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం సీఈవో వివేక్ యాదవ్ విజయవాడ అర్బన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. చిట్టినగర్, కంసాలి పేట ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ 208, 217 పరిధిలో వీఎంసీ కమిషనర్, డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ ధ్యానచంద్రతో కలిసి క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించారు. నియోజకవర్గం స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను పరిశీలించి.. అక్కడి అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవల్ అధికారులతో మాట్లాడి ప్రక్రియ అమలుపై ఆరా తీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లేందుకు కీలకమైన ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో కీలక భాగస్వాములు కావాలని సీఈవో వివేక్ యాదవ్ కోరారు. ఈ పర్యటనలో విజయవాడ పశ్చిమ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) ఎ.రవీంద్రరావు, సహాయ ఈఆర్వోలు ఎన్. శ్రీనివాసరావు, డి.హరీష్, జి.సృజన, చంద్రబోస్, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు. -
అల్లూరి ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లోని సమావేశం హాలులో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి.. స్వాతంత్య్రోద్యమంలో చూపిన ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతి భారతచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణకు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం దేశ ప్రజలకు చిరస్మరణీయమన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కోసం కృషి చేసే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సైకిల్పై క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్కు వచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఇన్చార్జ్ డీఆర్వో పోతురాజు, గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిదూర్జటి, కలెక్టరేట్ ఏవో ఏఎస్ఎన్ రాధిక, సూపరింటెండెంట్లు నెల్సన్పాల్బాబు, ఎం.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
గడువు గుబులు!
డిజిటలైజేషన్ అయ్యేనా.. సర్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సర్ ప్రక్రియ గడువు ముగింపు సమయం ఇంకా పది రోజులే ఉంది. అయితే డిజిటలైజేషన్ చేయాల్సిన ఫారాలు ఇంకా 10 లక్షలు పైనే ఉండటంతో గడువు గుబులు సిబ్బందిని వెంటాడుతోంది. డిజిటలైజేషన్లో బీఎల్వోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు రాజస్తాన్కు చెందిన ఓ కుటుంబం ముప్పై ఏళ్లుగా విజయవాడలో నివసిస్తోంది. అద్దె ఇంట్లో ఉంటున్న ఈ కుటుంబం గత ఎన్నికల్లో గొల్లపూడిలోని ఓ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్ లో భాగంగా ఆ కుటుంబానికి బీఎల్వో ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. నాలుగైదు రోజుల్లో వచ్చి ఫారాలు వెనక్కు తీసుకుంటాం. ఈలోపు పూర్తి చేయాలని చెప్పారు. ఈ కుటుంబానికి 2002లో రాజస్తాన్లో ఓట్లు ఉన్నాయి. అష్టకష్టాలు పడి అక్కడ తమ బంధువులకు ఫోన్ చేసి ఎట్టకేలకు వివరాలు సేకరించి ఫారాలు నింపి బీఎల్వోకు అందజేశారు. డిజిటలైజేషన్ సమయంలో ఫారంలో పొంది పరిచిన వివరాల ఆధారంగా వేరే వారి పేర్లు వస్తున్నాయి. దీంతో డిజిటల్ చేయ కుండా ఆపివేశారు. బీఎల్వో మళ్లీ ఆ కుటుంబం వద్దకు వచ్చి వివరాలు తెలుసుకోగా అక్కడి ఓటర్ల జాబితాలో పార్ట్ నంబరు తప్పుగా ఫారంలో పొందుపరిచినట్లు గుర్తించి సరిచేశారు. ఈ ఒక్క కుటుంబం ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయడానికి బీఎల్వో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు విజయవాడ నగరంలో రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వేలాది కుటుంబాలు స్థిరపడ్డాయి. ఇక్కడే వారికి ఓటు హక్కు కూడా వచ్చింది. వారందరినీ ఇంచుమించు ఇదే సమస్య వేధిస్తోంది. కొందరైతే ఎక్కడ తప్పులు దొర్లుతాయోనని పది రోజులు గడుస్తున్నా ఫారాలు పూర్తి చేయకుండా వారి వద్దనే ఉంచుకున్న పరిస్థితి. ఇక రాష్ట్రానికే చెందిన మహిళల్లో కొందరి పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. తెలంగాణలో పుట్టి ఇక్కడ వివాహాలు చేసుకున్న వారి వివరాల కోసం 2002 ఓటర్ల జాబితాలోకి వెళుతుంటే అప్పటి నియోజకవర్గం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగమైన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. వివరాల్తో తేడా వస్తే.. సీరియల్ నంబర్, అప్పటి బూత్ నంబర్, పోలింగ్ స్టేషన్ పేరు, తల్లిదండ్రులు పేర్లు ఇలా ఏ ఒక్కటి తేడా వచ్చినా మొత్తం మొదటికి వస్తుందని కొందరు బీఎల్వోలు చెబుతున్నారు. విజయవాడ వన్టౌన్లో రాజస్తాన్, ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. గవర్నర్పేటలోని బంగారం దుకాణాల్లో పనిచేసే పశ్చిమ బెంగాల్కు చెందిన వారి వివరాల సేకరణ జాప్యమవుతోంది. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 2002 జాబితాలో పేర్లకు ఇప్పటి దానిలో పేర్లకు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు చిట్టినగర్కు చెందిన సయ్యద్ ముర్తుజా పేరు 2002లో సయ్యద్ మక్తిజగా నమోదై ఉంది. తండ్రి పేరు కూడా రసూల్కు బదులు సూల్ అని నమోదైంది. ఆ ఓటు అతనిదేనని నిరూపించుకోవాల్సి ఉంది. ఇలా ఫారాలు వెనక్కు తీసుకున్న తర్వాత తప్పులు గమనిస్తే మళ్లీ ప్రత్యేక సమయం కేటాయించాల్సి వస్తోంది. అటు బీఎల్వోలు, ఇటు ఓటర్లు సర్ పేరు చెప్పగానే భయపడిపోతున్నారు. గడువులోగా డిజిటలైజేషన్ కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 17,13,445 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికి 7,30,192 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం ఫారాల్లో 42.62 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. మిగిలిన సుమారు 10 లక్షల ఫారాలను డిజిటల్ చేయాల్సి ఉంది. ఫారాలు నింపే సమయంలో ఓటరు వివరాలు తప్పుగా నింపడం, కొందరు అసంపూర్తిగా ఇవ్వడం, ఇప్పటికీ ఫారాలు పూర్తి చేయకుండానే వారి వద్ద పెట్టుకోవడం వంటి కారణాల దృష్ట్యా డిజిటలైజేషన్ నిర్దిష్ట సమయానికి పూర్తయ్యేనా అన్న సందేహం కలుగుతోంది. అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటే ఒక్కో ఫారం డిజిటల్ చేయడానికి కనీసం 15 నిమిషాలు పడుతోంది. -
పార్టీల సహకారంతో పారదర్శక ఓటర్ల జాబితా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పార్టీల సహకారంతో పారదర్శక ఓటర్ల జాబితా రూపొందిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ శనివారం కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి హాల్లో సమగ్ర సవరణ ప్రక్రియ నేపథ్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సర్ ప్రక్రియ తీరుతెన్నులను కలెక్టర్ వివరించారు. 17,13,445 ఓటర్లకు గాను పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు, వాటి డిజిటైజేషన్ తదితరాలను వివరించారు. 2002 ఎస్ఐఆర్ జాబితా నుంచి ఓటరు సమాచారం పొందే విధానాన్ని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఓటర్లు ఫారాలు నింపడం, సమర్పించడంలో సహకరించేందుకు జిల్లాలోని 1,792 పోలింగ్ స్టేషన్ల పరిధిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామన్నారు. ఓటు భద్రతకే సర్ ప్రక్రియ చేపట్టామని.. అర్హులైన ప్రతిఒక్కరూ జాబితాలో ఉండేలా జాబితా రూపకల్పనలో సహకరించాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. సమావేశంలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేసి.. వారి నుంచి సూచనలు స్వీకరించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు పి.హరికృష్ణ (ఏఏపీ), కాకాని తరుణ్ (బీజేపీ), పి.డేనియల్ (బీఎస్పీ), డీవీ కృష్ణ (సీపీఎం), వై.ఆంజనేయరెడ్డి, జి.సుందర్ పాల్ (వైఎస్సార్ సీపీ) తదితరులు పాల్గొన్నారు. డిజిటలైజేషన్లో కచ్చితత్వానికి పెద్దపీట ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో కచ్చితత్వానికి పెద్ద పీట వేయాలని రోల్ అబ్జర్వర్ ఐఏఎస్ అధికారి ఎం.వి. శేషగిరిబాబు సూచించారు. శనివారం సర్ కార్యక్రమం పరిశీలకులు శేషగిరి బాబు.. కలెక్టర్ లక్ష్మీశతో కలిసి ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని సమీక్షించి.. కార్యక్రమం సజావుగా జరిగేందుకు సూచనలు చేశారు. -
కేయూలో నూతన భవనానికి పింగళి పేరు
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్మిస్తున్న నూతన భవనాల్లో ఒక దానికి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెడతామని ఉపకులపతి ఆచార్య కె.రాంజీ ప్రకటించారు. విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతిలో ఆయన ప్రసంగించారు. ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా. రాంబాబు, పలువురు సహాయ ఆచార్యులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలగిరికి పోటెత్తిన భక్తులు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): గ్రామంలో వేంచేసిన వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల ఉంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండ కింద స్వామి వారికి ప్రత్యేకంగా పాలపొంగళ్లు తయారు చేసి సమర్పించారు. పలువురు భక్తులు అన్నదానానికి విరాళాలు అందించారు. ఆలయ ఈఓ రంగారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ చైర్మన్ వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. గుణదల(విజయవాడ తూర్పు): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మాచవరం ఎలిశెల వారి వీధికి చెందిన ముత్యాల రాజేశ్వరరావు (39) నగర పాలక సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య శ్వేత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వీరిద్దరూ గొడవ పడ్డారు. ఈ గొడవలో భాగంగా శ్వేత కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోయింది. క్షణికావేశానికి గురైన రాజేశ్వరరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన శ్వేతకు తన భర్త ఉరికి వేలా డుతూ కన్పించాడు. దీంతో ఆమె మాచవరం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉంగుటూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం వేంపాడు గ్రామంలో వారం రోజుల క్రితం ఖననం చేసిన బాలిక మృతదేహానికి శనివారం అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామానికి చెందిన 9వ తరగతి సువర్ణ దీప్తి(14) గత నెల 28వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత ఆమె మృతిపై కుటుంబ సభ్యుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. బాలిక తల్లి మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఉంగుటూరు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఖననం చేసిన బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. తహసీల్దారు జాలాది విమలకుమారి, సీఐ బి.వి.శివప్రసాద్, ఎస్ఐ యు.గోవిందు సమక్షంలో వైద్యుల బృందం సువర్ణదీప్తి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు విచారణ చేపట్టానున్నట్లు సీఐ తెలిపారు. చిలకలపూడి(మచిలీపట్నం): ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జె.సత్యవతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈడీగా బీసీ సంక్షేమాధికారి జి.రమేష్ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహించారు. ఆ స్థానంలో కాకినాడ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న సత్యవతిని ఉద్యోగోన్నతిపై ఈడీగా నియమించారు. ఆమె కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. మచిలీపట్నంటౌన్: నగరంలోని డాక్టర్ పట్టాభి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ స్వర్ణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్లో ఆగస్టు 11 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 35 రోజులు పాటు శిక్షణ ఉంటుందన్నారు. యువతీ యువకులకు కార్ డ్రైవింగ్ ఈనెల 10 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు, జ్యూట్ బ్యాగ్స్ తయారీ 14 రోజులు, ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నేర్పిస్తామన్నారు. మహిళలకు ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె వివరించారు. మరిన్ని వివరాలకు 93907 74782 నంబర్ను సంప్రదించాలని ఆమె సూచించారు. -
గురజాడలో రూ.4 కోట్ల మట్టి దోపిడీ
పమిడిముక్కల: ‘గురజాడ వీర్రాజు చెరువులో అధికార పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు రూ.4 కోట్ల మట్టిని దోపిడీ చేశాడు. నిబంధనలకు విరు ద్ధంగా ఎనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువులో తాటిచెట్టంత లోతున తవ్వేశాడు. ఇందులో ఎమ్మెల్యే వాటా ఎంతో బయట పెట్టాలి? ఇంత భారీ మట్టి దోపిడీ జరుగుతుటే పంచాయతీ, మండల, జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలి?’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ప్రశ్నించారు. గురజాడ వీర్రాజు చెరువును పార్టీ నాయకులు, గ్రామస్తులతో కలిసి శనివారం పరిశీలించారు. కట్టలను బలపరచలేదని, తాటిచెట్టంత లోతు తవ్వేశారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. చెరువు వద్ద అనిల్కుమార్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మట్టి దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుడు సురేష్ బినామీ పేరుతో మట్టిని తవ్వి టిప్పర్లతో బయటకి తరలించి సొమ్ము చేసుకున్నా రని విమర్శించారు. మట్టి దోపిడీపై నిర్వాహకులను ప్రశ్నించిన గురజాడ గ్రామస్తులపై ఎస్ఐ, సీఐ బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి దోపిడీ నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి, రొయ్యూరు, లంకపల్లి క్వారీల నుంచి ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోదని కై లే అనిల్కుమార్ విమర్శించారు. ఇసుక, మట్టి బినామీగా ఉండి రూ.కోట్లు బొక్కుతు న్నారని దుయ్యబట్టారు. కొమరవోలులో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన రూ.23 కోట్లను దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఎంత మట్టి, ఎంత ఇసుక దోపిడీ చేస్తారు, అంతులేని దోపిడీని అడ్డుకునే వారు లేరా అని ప్రశ్నించారు. ఇసుక, మట్టి దోపిడీ చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. నియోజకవర్గంలో ప్రతి పనిలో అవి నీతి రాజ్యమేలుతోందని, అవినీతితో తనకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఎమ్మెల్యేకు ఉందా అని నిల దీశారు. అధికారులు విచారణ జరిపి మట్టి దొంగ లకు జరిమానా విధించాలని సోమవారం కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శొంఠి వెంకటేశ్వర రావు, యలమంచిలి గణేష్, కొడమంచిలి మహేష్, గొర్కెపూడి బుజ్జి, చింతలపూడి గవాస్కర్రాజు, తిరుమలశెట్టి బోసుబాబు, ఆరేపల్లి శ్రీనివాసరావు, రాజులపాటి మురళీ, యేనుగ మస్తాన్రావు, బొర్రా చినబాబు, రాజులపాటి గురవయ్య, నాగరాజు, షుకూర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
జిప్సం అక్రమాలపై అధికారుల కొరడా
కోడూరు: మండలంలోని వి.కొత్త పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో జిప్సం నిల్వల వ్యవహారంలో చోటు చేసుకున్న అక్రమాలు చివరికి పాలకవర్గంపై వేటుకు దారితీశాయి. జిప్సం అక్రమాలపై ‘సాక్షి’లో ప్రచురించిన వరుస కథనాల నేపథ్యంలో కేడీసీసీ బ్యాంక్ సెంట్రల్ అధికారులు స్పందించి ప్రత్యేక విచారణ చేపట్టారు. ప్రాథమికంగా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. దీంతో సంఘానికి సంబంధించిన త్రిసభ్య కమిటీని రద్దు చేస్తూ కేడీసీసీబీ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా 300 బస్తాల జిప్సం నిల్వ వి.కొత్తపాలెం పీఏసీఎస్లో సంఘ గోడౌన్లో అధికారిక స్టాక్లో నమోదు కాని 300 బస్తాల జిప్సంను సంఘ చైర్పర్సన్, జనసేన నేత రేపల్లె పిచ్చేశ్వరరావు అక్రమంగా నిల్వ చేసి, బ్లాక్ మార్కెట్ ద్వారా వీటిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేశారు. స్టాక్కు సంబంధించిన ఓఫామ్లు, రవాణా చార్జీల కాగితాలు, ఇతర పత్రాలు లేకపోవడంతో వ్యవసాయ అధికారులు స్టాక్ను పరిశీలించి ‘స్టాప్ సేల్’ ఆదేశాలు జారీ చేశారు. స్టాక్ బయటకు తరలించకుండా గోడౌన్ను సీజ్ చేసి తాళాలు కూడా వేశారు. ఈ వ్యవహారంలో సంఘం సీఈఓ తోట శ్రీకాంత్, చైర్పర్సన్ పిచ్చేశ్వరరావు మధ్య జరిగిన ఫోన్ సంభాషణపైనా కూడా అధికారులు దృష్టి సారించారు. బ్యాంక్ అధికారులను కొడతానంటూ ఫోన్ సంభాషణలో చైర్పర్సన్ హెచ్చరించడం, అక్రమ జిప్సంను నాగాయలంక మండలానికి గుట్టుచప్పుడు కాకుండా పంపేద్దామని మాట్లాడిన విధానాన్ని కూడా విచారణ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. త్రిసభ్య కమిటీ రద్దు విచారణలో వెలుగులోకి వచ్చిన ఆంశాల ఆధారంగా సంఘం నిర్వాహణలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని భావించిన అధికారులు త్రిసభ్య కమిటీపై చర్యలు చేపట్టింది. చైర్పర్సన్ రేపల్లె పిచ్చేశ్వరరావుతో పాటు సభ్యులు రేపల్లె నాగమల్లేశ్వరరావు, బాదర్ల నాగమల్లేశ్వరరావుతో కూడిన త్రిసభ్య కమిటీని రద్దు చేశారు. సంఘ కార్యకలాపాలు నిలిచిపో కుండా ఉండేందుకు అవనిగడ్డ అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎస్డీఎల్సీఓ డి.నాగమల్లేశ్వరరావును పర్సన్ ఇన్ చార్జిగా నియమించారు. -
హామీ గొప్ప.. అమలు లొట్ట
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలవాల్సిన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం జిల్లాలో ఇప్పటికీ అమలు కాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం పథకాన్ని ప్రకటించి, నిధులు మంజూరు చేసినట్లు తెలిపినా క్షేత్రస్థాయిలో మాత్రం కిట్లు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వేలాది మంది బాలింతలు లబ్ధికి దూరమయ్యారు. రెండేళ్లు గడిచినా.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ బేబీ కిట్ పేరుతో అమలైన ఈ పథకం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వం మారిన తర్వాత అదే పథకాన్ని ఎన్టీఆర్ బేబీ కిట్గా కొనసాగిస్తామని ప్రకటించినా, రెండేళ్లు గడిచినా జిల్లాకు ఒక్క కిట్ కూడా అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పేదలపై ఆర్థిక భారం జిల్లా వైద్యశాఖ గణాంకాల ప్రకారం 2024 నుంచి 2026 జూన్ వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 15,143 ప్రసవాలు నమోదయ్యాయి. ఈ బాలింతలందరికీ రూ.1,400 విలువైన బేబీ కిట్ అందాల్సి ఉన్నా, పథకం అమలు కాకపోవడంతో శిశువుకు అవసరమైన దుస్తులు, దోమతెర, న్యాప్కిన్లు, సబ్బులు, ఆయిల్, టవల్స్ వంటి వస్తువులను కుటుంబాలే కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ప్రైవేట్ వైపు మొగ్గు మరోవైపు జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు తగ్గుతుండగా, ప్రైవేట్ ఆస్పత్రుల వైపు గర్భిణుల మొగ్గు చూపుతున. పథకాల అమలులో జాప్యం కూడా ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిట్లు అందిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన ప్రతి బాలింతకు అందజేస్తామని హామీ ఇస్తున్నా, రెండేళ్లుగా ఎదురుచూస్తున్న పేద కుటుంబాలు మాత్రం ‘ప్రకటనలు కాదు... కిట్లు కావాలి’ అని కోరుతున్నాయి. -
‘సర్’తో అర్హులను తొలగించే ప్రమాదం
గన్నవరం: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ ద్వారా అర్హులైన పేద ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించే ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు శనివారం గన్నవరం మండలంలోని దావాజిగూడెంలో పర్యటించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికే ప్రభుత్వం సర్ పేరుతో కుట్రపూరిత ప్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. ఓటర్ల వెరిఫికేషన్కు 2002 సంవత్సరాన్ని కట్ ఆఫ్ ఇయర్గా తీసుకోవడం అత్యంత అహేతుకమన్నారు. ఈ ప్రకియంతో వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు 2002 రికార్డులు చూపలేక ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, నేతలు కళ్లం వెంకటేశ్వరరావు, మల్లంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు -
దుర్గమ్మకు కానుకగా రూ.3.16 లక్షల బంగారు నక్లెస్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తులు శనివారం రూ.3.16 లక్షల విలువైన బంగారు నక్లెస్ను కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన టి.శ్రీధర్ కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చే సింది. రూ.3.16 లక్షలతో 21 గ్రాముల బంగారం, పచ్చరాళ్లు, కెంపులు, ముత్యాలుతో తయారు చేయించిన నక్లెస్ను అమ్మవారికి సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను ఇచ్చారు. ఉద్యోగోన్నతుల నియామక పత్రాలు అందజేత చిలకలపూడి(మచిలీపట్నం): పలువురు జిల్లా పరిషత్ ఉద్యోగులకు ఉద్యోగోన్నతి పత్రాలను జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక శనివారం అందజేశారు. ఆమె కార్యాలయంలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా, 26 మంది ఆఫీస్ సబార్డినేట్లకు రికార్డు, లైబ్రరీ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ జెడ్పీ పరిధిలో వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న వివిధ స్థాయిల్లోని ఉద్యోగులకు పది రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యోగోన్నతులు ఇచ్చారన్నారు. తమ హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామకాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జె.అరుణ, డెప్యూటీ సీఈవో ఆనంద్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. నేడు జూనియర్ బాయ్స్ ఫుట్బాల్ జట్టు ఎంపిక మచిలీపట్నంఅర్బన్: ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాయ్స్ ఫుట్బాల్ జట్టును ఎంపిక చేసేందుకు అధికారిక సెలెక్షన్ ట్రయల్స్ను ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.అనిల్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 గంటలకు పోరంకిలోని నిడమానూరు రోడ్డుపై ఉన్న అస్త్ర మెడికల్ అకాడమీ ప్రాంగణంలోని హంటింగ్ టైగర్స్ గ్రౌండ్లో జరుగుతాయని పేర్కొన్నారు. జనవరి 2011 నుంచి డిసెంబర్ 2012 మధ్య జన్మించిన బాలురు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. హాజరయ్యే క్రీడాకారులు మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఫుట్బాల్ కిట్తో పాటు క్రీడా దుస్తులు తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన సూచించారు. ఆసక్తి, ఎంపికై న క్రీడా కారులు ఈ నెల 11 నుంచి 13 వరకు మదనపల్లిలో జరిగే రాష్ట్ర అంతర్ జిల్లా ఫుట్బాల్ చాంపియన్షిప్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు కోఆర్డినేటర్ కె.మణిబాబును 97032 85954 నంబర్లో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. దాసాంజనేయ దేవాలయానికి రూ. 2.30 లక్షలు విరాళం మధురానగర్(విజయవాడసెంట్రల్): స్వయంభూ మాచవరం శ్రీదాసాంజనేయస్వామి దేవాలయంలో స్వామివారికి శనివారం దాత ఆళ్ళ నాగ శ్రీనివాస్ మాలతి దంపతులు రూ. 2.30 లక్షలు విరాళాన్ని ఆలయ కార్య నిర్వహణాధికారి పాతూరి లోకేశ్వరికి అందజేశారు. దాత ఆళ్ళ నాగశ్రీనివాస్ మాట్లాడుతూ మహిమాన్వితమైన స్వామివారికి తన వంతు బాధ్యతగా తాను విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. మందిరం అభివృద్ధిలో తాను కూడా భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. తొలుత దాత దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి శేషవస్త్రం చిత్రపటంతో దాతలను సత్కరించారు. -
ఆర్టీఏ కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రవాణాశాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారికి హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (జేటీసీ) వడ్డే సుందర్ శనివారం ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగోన్నతి పొందిన కానిస్టేబుళ్లు ఏడుగురు ఎంజీ రోడ్డులోని కార్యాలయంలో ఉత్తర్వులు అందుకున్నారు. మచిలీపట్నానికి చెందిన వి.బాల కోటేశ్వరరావు, విజయవాడకు చెందిన కె.సుబ్బారెడ్డి, ఎన్.వెంకటేశ్వరరావు, ఎస్.సుబ్బారావు రాజమండ్రికి చెందిన ఎ.హనుమంతరావు, కాకినాడకు చెందిన ఎ.ఆర్.వి.సీహెచ్.రాజు, ఏలూరుకు చెందిన బి.నాగేశ్వరరావు ఉద్యోగోన్నతి పొందారు. వారిలో ఈ ఏడాది ఉద్యోగ విరమణ చేసే వారు కూడా ఉన్నారు. వారికి ప్రమోషన్లు కల్పించడం ద్వారా హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగ విరమణ చేసే అవకాశం కల్పించినట్లు జేటీసీ వడ్డే సుందర్ తెలిపారు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న హెడ్ కానిస్టేబుళ్ల ఉద్యోగోన్నతులను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా చేపట్టడం ద్వారా సిబ్బందిలో నూతన ఉత్సాహం నెలకొందని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, రవాణాశాఖ కానిస్టేబుళ్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేటీసీ వడ్డే సుందర్కు అభినందనలు తెలిపారు. ఆర్జేటీసీ కార్యాలయ ఉద్యోగి కె.ఆర్.శ్రీకాంత్, రవాణాశాఖ ఉద్యోగులు, కానిస్టేబుళ్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కారు, ద్విచక్ర వాహనం ఢీ
పెడన: పెడన – గుడివాడ జాతీయ రహదారిపై పల్లోటి స్కూలు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద జరిగిన ఓ కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. శని వారం మధ్యాహ్నం జరి గిన ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. ఓ కారు పెడన నుంచి గుడివాడ వైపు ప్రయాణిస్తూ పెట్రోల్ బంకులోకి వెళ్లే క్రమంలో గుడివాడ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న మండవల్లి ప్రాంతా నికి చెందిన పోగు నవీన్(38) కారును బలంగా ఢీకొట్టాడు. నవీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 సిబ్బంది అతడిని హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికులు పెడన పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
దుర్గగుడి ఆస్తుల రక్షణకు చర్యలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఈఓ శీనానాయక్ పేర్కొన్నారు. దేవస్థానానికి చెందిన కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని పలు భూములను ఈఓ శనివారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత గూడవల్లిలోని జాతీయ రహ దారి సమీపంలోని దేవస్థాన భూములను పరిశీలించారు. స్థలంలో పిచ్చి మొక్కలు, ముళ్ల కంప పెరిగిపోవడంతో వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానం భూములు ఉన్న ప్రతి చోట బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పాతపాడులోని దేవస్థాన పోలంలోని సోలార్ ప్లాంట్ను సందర్శించారు. పాతపాడు సోలార్ ప్లాంట్ ద్వారా నిత్యం ఏ మేరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది, నెలకు ఆలయానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతోందన్న వివరాలను అధికారులను అడిగి ఈఓ తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యుత్ ప్లాంట్ ద్వారా నెలకు 1.20 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దేవస్థానానికి నెలకు లక్ష యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నామని అధికారులు వివరించారు. ప్రతి నెలా 20 వేల యూనిట్ల వరకు విద్యుత్ మిగులుతోందని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని నెట్ మీటరింగ్ పక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఈఓ శీనానాయక్ సూచించారు. దేవస్థాన భూములు, పొలాలు ఆక్రమణలకు గురి కాకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలన్నారు. ల్యాండ్ బ్యాంక్ వివరాలు భక్తులందరికీ తెలిసేలా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఈఓ వెంట ఈఈ ఎల్.రమాదేవి, అసిస్టెంట్ ఇంజి నీర్ మస్తాన్, సునీల్కుమార్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
విజయవంతంగా గోదావరి రైల్వే బ్రిడ్జి పునరుద్ధరణ పనులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న చారిత్రాత్మక ఆర్చ్ బ్రిడ్జి పునరుద్ధరణ పనుల్లో దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ అద్భుత మైలురాయి సాధించింది. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ – విశాఖపట్నం మార్గంలోని గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జి పునరుద్ధరణ ప్రాజెక్ట్లో ప్రయాణికులు, సరుకు రవాణా రైళ్లకు ఎటువంటి అంతరాయం లేకుండా 28 స్పాన్లలో 672 తుప్పుపట్టిన హ్యాంగర్ కేబుళ్ల స్థానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక, తుప్పు నిరోధక 500 కేబుళ్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి భద్రత, నిర్వహణను బలోపెతం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఇన్స్ట్రుమెంటేషన్ నిపుణులతో కలసి వంతెనపై అత్యాధునిక బ్రిడ్జి హెల్త్ మానిటరింగ్ సిస్టం కూడా ఏర్పాటుచేసి ప్రారంభించారు. వంతెన నిర్మాణ తీరును 24 గంటలూ ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు 272లకు పైగా స్మార్ట్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ.. చారి త్రాత్మక గోదావరి ఆర్చ్ బ్రిడ్జిపై రైల్వే కార్యకలాపాలకు అంతరాయం లేకుండా 500 హ్యంగర్ కేబుళ్లను విజయవంతంగా మార్చడం ఇంజినీర్లు, ఫీల్డ్ బృందం అద్భుత ప్రతిభను కొనియాడారు. -
ఈ విధానం సరికాదు
ఎకరానికి ఎంత ఎరువు ఇస్తారో దానిని కార్డుపై రాసి ఇవ్వాలి. ఓటీపీలు చెప్పిన తరువాత దానిని ఆన్లైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓటీపీలు వీఏఏ వద్ద ఒక సారి, సొసైటీలు వద్ద లేదా ఎరువుల దుకాణం వద్ద మరోకసారి చెప్పాల్సి వస్తోంది. సర్వర్ స్లోగా ఉందని ఒకసారి, పనిచేయడం లేదని మరొక సారి చెబుతుండటంతో వారం రజులు నుంచి రైతులు యూరియా కోసం తిరగాల్సిన దుస్థితి ఏర్పడు తోంది. ఈ విధానం కరెక్ట్ కాదు. – వన్నెంరెడ్డి మహాంకాళరావు, రైతు, పెడన -
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును ఉపసంహరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు(ఆర్ఎస్కే) ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి శుక్రవారం గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. దస్తా వేజు లేఖరులు, అసిస్టెంట్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతకాయల నాగ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై, పూణేలో ఆర్ఎస్కే వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా లీజు, తనఖా వంటి రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తోందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని రకాల రిజిస్ట్రేషన్లు చేయడానికి రంగం సిద్ధం చేస్తోందన్నారు. ఆర్ఎస్కేల ఏర్పాటుతో దస్తావేజు లేఖర్ల పొట్ట కొట్టడం భావ్యం కాదన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే భవిష్యత్తులో తాము మరిన్ని నిరసన కార్యక్రమాలను చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి అధ్యక్షుడు పైలా సతీష్ మాట్లాడుతూ.. తాము దశాబ్దాల తరబడి దస్తావేజు లేఖర్లగా సేవలు అందిస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో ఎన్ని కొత్త తరహా విధానాలు తీసుకొచ్చినా వాటన్నింటినీ నేర్చుకొని అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నామని వివరించారు. అయితే ప్రస్తుతం పీపీపీ విధానంలో ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో కొత్తవారికి శిక్షణ ఇచ్చి ఉపయోగించుకోవడం కన్నా, ఎంతో అనుభవం, నైపుణ్యం గల దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు, ఐడెంటిటీ ఇచ్చి తమ జీవన భృతిని కొనసాగించుకునేలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు ఎం.చక్రధర్, ఎ.వరహాలరావు, సాంబశివరావు, వెంకటేశ్వర రావు, నరేంద్ర, కాజా రమేష్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దస్తావేజు లేఖరుల డిమాండ్ -
యాప్ చిక్కులు.. అందని ఎరువులు
● ఎరువులు బుక్ చేసేందుకు పనిచేయని సర్వర్ ● రైతులకు తప్పని రోజుల తరబడి నిరీక్షణ ● 48 గంటలపాటే చెల్లుతున్న క్యూఆర్ కోడ్ ● ఆ లోపు రైతులకు ఎరువులు అందని వైనం పెడన: ‘సర్వర్ పనిచేయడం లేదు. లైన్లో వేచి ఉండండి.., సర్వర్ చాలా స్లోగా ఉంది. ఒకదాని తరువాత ఒకటి చేస్తున్నాం. వేచి ఉండండి..’ ఇవీ ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు వింటున్న మాటలు. ఈ పదాలు వినీవినీ రైతులు విసిగి పోతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కాకినాడ, కృష్ణా జిల్లాలో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా రైతులు యూరియా బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ యాప్కు వినియోగించాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. అయితే చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్ లేదు. దీంతో వీఏఏలు రైతుల వద్ద ఉన్న కీప్యాడ్ ఫోన్లుకు ఓటీపీ చెప్పి, క్యూ ఆర్ కోడ్ జనరేట్ చేసి ఒక కాగితంపై రాసి ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉండి కూడా బుక్ చేసుకోలేని వారి వద్ద వివరాలను నమోదు చేసుకుని క్యూఆర్ కోడ్ ఫొటో తీసి పంపిస్తున్నారు. ఇక్కడి వరకు రైతుకు ఎటువంటి ఇబ్బందీ ఉండటం లేదు. ఒక రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఇచ్చేస్తున్నారు. అసలు కష్టం రైతుకు యూరియా కట్ట తెచ్చుకోవడమే. రైతు సేవా కేంద్రాల నుంచి తెచ్చుకున్న స్లిప్, కార్డులను మన గ్రోమోర్ కంపెనీ వద్దకు లేదా ఎదైనా సొసైటీ వద్దకు రైతులు తీసుకెళ్తే అక్కడే రెండు, మూడు రోజులు సమయం పడుతోంది. 48 గంటలే క్యూఆర్ కోడ్ చెల్లుబాటు రైతు యూరియా కోసం వీఏఏ క్యూఆర్ కోడ్ ఇచ్చిన 48 గంటల్లోపు రైతు యూరియా తీసుకోవాలి. సొసైటీలు వద్దకు, ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లిన రైతులకు క్యూలో ఉండాలని, సర్వర్ స్లోగా ఉందని, సర్వర్ పనిచేయడం లేదని, రేపు రావాలని చెబుతున్నారు. రైతులు మరుసటి రోజు వెళ్తే అదే పరిస్థితి పునరావృతం అవుతోంది. 48 గంటలు దాటితే మళ్లీ క్యూఆర్ కోడ్ కోసం వీఏఏ వద్దకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. -
కృష్ణాజిల్లా వైద్యాధికారి డాక్టర్ యుగంధర్
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ వైద్య సంస్థల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, ఐవీఆర్ఎస్ ద్వారా సానుకూల ప్రజాభిప్రాయం వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పి. యుగంధర్ సూచించారు. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నిరీక్షణ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా పర్యవేక్షకుల నెలవారీ సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ, గర్భిణులకు ముందస్తు ప్రసవ ప్రణాళిక (బర్త్ ప్లానింగ్)ను సమర్థంగా అమలు చేసి, పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటి పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆహారం, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు విస్తతంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని 100శాతం లక్ష్యంతో విజయవంతంగా పూర్తి చేసిన వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని అభినందించారు. -
ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేయడమే లక్ష్యం
మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంటౌన్: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసి వారి సమస్యలను సత్వరం పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 540 అర్జీలు అందగా, వాటిలో 447 అర్జీలను ఇప్పటికే పరిష్కరించామని చెప్పారు. మరో 77 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో 55 అర్జీలు గడువులోనే ఉండగా, గడువు దాటిన 22 అర్జీల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరిస్తామని వెల్లడించారు. మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవ విగ్రహాల్లా బీఎల్ఓలు!
నందిగామ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కోసం ప్రభుత్వం నియమించిన బీఎల్ఓలు ఉత్సవ విగ్రహాలుగా మారారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో బీఎల్ఓలు మొక్కుబడిగా వైఎస్సార్ సీపీ బీఎల్ఏలకు చెప్పి.. టీడీపీ బూత్ లెవెల్ కన్వీనర్లను మాత్రం వెంటబెట్టుకుని ఇంటింటికీ వెళ్తున్నారు. టీడీపీకి చెందిన బీఎల్ఏలే ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తున్నారు. బీఎల్ఓలు చూస్తుండిపోతున్నారు. అలాగే వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేలా టీడీపీ శ్రేణులకు అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్తతో పాటు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు ఇక్కడ ఉన్న ఓటును తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా.. వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు అడ్డుకొని ఆమెకు ఓటు హక్కు ఉండేలా చేశారు. – కంచికచర్ల -
గంపలగూడెం మండలంలో గవర్నర్ పర్యటన
గంపలగూడెం: మండలంలో శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటించారు. ఊటుకూరులోని ఓ కల్యాణ మండపంలో జరిగిన తన కార్యాలయ ఉద్యోగి దుర్గం గోపీ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వ దించి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ నుంచి ఊటుకూరుకు రాత్రి 7.50 గంటలకు చేరుకొని ఎనిమిది గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. వివిధ శాఖల అధికారులు పాల్గొనగా విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారా యణ, మైలవరం ఏసీపీ రామచంద్రరావు, తిరువూరు సీఐ గిరిబాబు, తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం ఎస్ఐలు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి సారిగా రాష్ట్ర గవర్నర్ గంపలగూడెంలో పర్యటించడం గమనార్హం. రైతులకు శాశ్వత సాగు నీటి భద్రత కల్పిస్తాం వేదాద్రి(జగ్గయ్యపేట): రైతులకు శాశ్వత సాగు నీటి భద్రత కల్పిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రూ.15 కోట్ల అంచనాలతో గ్రామంలోని కృష్ణా నది ఒడ్డునున్న వేదాద్రి– కంచల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. ఈ ఎత్తిపోతల పథకం నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని 17,366 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తుందని పేర్కొన్నారు. 2027 ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేసి శాశ్వత సాగు నీటి భద్రత కల్పిస్తామన్నారు. వత్సవాయి మండలం పోలంపల్లి ప్రాజెక్టును కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. అనంతరం రూ.33 లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన పంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, నాయకులు గద్దె అనురాధ, కోట వీరబాబు, రాటకొండ చంద్రశేఖర్ పాల్గొన్నారు. 6న రేబిస్ నిరోధక టీకాల కార్యక్రమం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఆరో తేదీన ఎన్టీఆర్ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పెంపుడు కుక్కల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.‘ఆరోగ్యకరమైన జంతువులు – ఆరోగ్యకరమైన మనుషులు – ఆరోగ్యకరమైన పర్యావరణం’ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి జూనోటిక్ వ్యాధుల నివారణకు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖరరావు, డాక్టర్ సునంద, డాక్టర్ మనోజ్, డాక్టర్ పంకజ్ పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు సమావేశం 7వ తేదీకి వాయిదా ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం వాయిదా పడింది. శనివారం జరగాల్సిన ట్రస్ట్ బోర్డు సమావేశం ఈ నెల ఏడో తేదీకి మారినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తొలుత ట్రస్ట్ బోర్డు సమావేశం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో జరగాల్సి ఉంది. ఈ సమావేశాన్ని ఈ దఫా సీవీ రెడ్డి చారిటీస్ సమావేశ మందిరంలో నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఏడో తేదీన జరిగే ట్రస్ట్ బోర్డు సమావేశంలో దుర్గగుడి ఆలయ అభివృద్ధి పనులతో పాటు ఈ నెలలో జరిగే ఆషాఢ మాసోత్సవాలు, తెలంగాణ బోనాలు, శాకంబరీ ఉత్స వాల నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించే అవకాశం ఉంది. -
నకిలీ నోట్ల తయారీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
అనంతపురంలో అదుపులోకి తీసుకున్నామన్న డీసీపీ రామకృష్ణ ఇబ్రహీంపట్నం: నకిలీ రూ.500 నోట్లు చెలామణి, తయారీ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసులు అనంతపురంలో శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద 100 నకిలీ రూ.500 నోట్లు, దొంగనోట్లు తయారీకి ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీసీపీ గుణ్ణం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు వెల్లడించారు. పరికరాలు స్వాధీనం.. జూన్ 30న దొంగనోట్లు చెలామణి చేస్తున్న గుంజా మంగారావు, వల్లభనేని పవన్కుమార్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. గుంజా మంగారావు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్ఐ ఎస్.శ్రీనివాసరావు అనంతపురం వెళ్లి నకిలీ రూ.500 నోట్లు తయారు చేస్తున్న పుల్లలరేవు రాజా, పొదిలి భాస్కరరావులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులతో పాటు నోట్లు తయారీకి ఉపయోగించిన రెండు కలర్ ప్రింటర్లు, ఒక ల్యాప్ టాప్, ఒక స్కానర్, ల్యామినేటర్ ఒకటి, ఆరు సెల్ఫోన్లు, 500 నోట్లు 100 (రూ.50వేలు) స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. కేసు రిపోర్ట్ అయిన మరుసటి రోజే ప్రధాన నిందితుడు అనంతపురానికి చెందిన పుల్లలరేవు రాజా, హిందూపురానికి చెందిన పొదిలి భాస్కరరావును అరెస్ట్ చేసినందుకు సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్ఐ ఎస్.శ్రీనివాసరావు, సిబ్బందిని అభినందించారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం రెండు ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అయిన పుల్లాలరేవు రాజా, పొదిలి భాస్కరరావుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ రామకృష్ణ వివరించారు. సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్ఐ ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రేపు రోల్బాల్ ఎన్టీఆర్ జిల్లా జట్ల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కంకిపాడులోని క్యాపిటల్ స్పోర్ట్స్ కార్నర్ ఆవరణలో ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 7 నుంచి 12గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా రోల్బాల్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నామని జిల్లా రోల్బాల్ అసోసియేషన్ చైర్మన్ టి.లలిత ప్రియ ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–11, 14, 17 విభాగాల్లో ఈ జట్ల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 9505950425లో సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు. తిరువూరు: మండలంలోని వావిలాలలో పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై గొడ్డలితో దాడిచేసి, హత్య చేయడానికి శుక్రవారం అదే గ్రామానికి చెందిన వ్యక్తి యత్నించిన సంఘటన సంచలనం కలిగించింది. గ్రామానికి చెందిన దుగ్గిరాల నాగరాజుపై అతని సమీప బంధువు దుగ్గిరాల రమేష్ గురువారం అర్ధరాత్రి గొడ్డలితో దాడి చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న నాగరాజుపై హఠాత్తుగా దాడి చేయడంతో మెడపైన, వీపుపైన తీవ్ర గాయాలయ్యాయి. తృటిలో తప్పించుకున్న నాగరాజు గ్రామస్తుల సహాయంతో తిరువూరు ఏరియా ఆస్పత్రిలో చేరాడు. రమేష్ పరారవ్వగా.. పోలీసులు గాలించి శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. గతంలో మద్యం మత్తులో నాగరాజు తనపై దాడిచేయడంతో కక్షసాధింపుగా అతనిపై దాడికి పాల్పడినట్లు రమేష్ చెప్పినట్లు ఎస్ఐ శాతకర్ణి తెలిపారు. మచిలీపట్నంటౌన్: నగరంలోని ఆస్థానాలు, పంజాల మరమ్మతు పనులకు ఎట్టకేలకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం నగదును అందజేశారు. మొహర్రం దుఃఖ దినాల సందర్భంగా ప్రభుత్వం ముందస్తుగానే ఆస్థానాలు, పంజాలకు మరమ్మతులు, రంగులు వేసేందుకు రూ. 5వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుతం దుఃఖ దినాలు ముగిసిన తర్వాత ముస్లింల డిమాండ్ల నడుమ శుక్రవారం నగరంలోని 139 ఆస్థానాలు, పంజాలకు రూ. 7.45లక్షలను మంజూరు చేసింది. ఈ మెత్తాలను నగరంలోని రాజుపేట షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రవీంద్ర వాటిని నిర్వాహకులకు అందజేశారు. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) శుక్రవారం ప్రకటించిన సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు సత్తా చాటినట్లు సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని శ్రీమేధ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నందకిషోర్ మాట్లాడుతూ జి. వంశీప్రియ 400 మార్కులకు 286 మార్కులతో టాపర్గా నిలిచాడని చెప్పారు. సీహెచ్ తన్మయి 283, ఎస్. రేణుక నందిని 272, వై.తన్విశ్రీ 267, షేక్ మొయినుద్దీన్ 258 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇందుకు శ్రీమేధ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సహకారం ఎంతో ఉందని తెలిపారు. సీఏ ఫౌండేషన్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఏ ఇంటర్ తరగతులు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయని వివరించారు. డైరెక్టర్ అన్నా శ్రీలక్ష్మి పాల్గొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు పట్టాలపై ఓ దివ్యాంగుడి మృతదేహం లభ్యమైంది. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం రామవరప్పాడు యార్డ్ వద్ద పట్టాలపై వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ సిబ్బంది వివరాలు సేకరించారు. మృతుడు సుమారు 45ఏళ్ల దివ్యాంగుడని, ఒంటిపై తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. -
యాప్తో చాలా కష్టాలు
పైలెట్ ప్రాజెక్టు అంటున్నారు. బాగానే ఉంది. కానీ రైతులు రోజులు తరబడి రావాలంటే చాలా కష్టం. నాకు 15 ఎకరాల పొలం ఉంది. ఓటీపీలు రెండు సార్లు చెప్పాల్సి వస్తోంది. ఉద్యోగులు విధుల్లో ఉంటారు. వారి పొలం కౌలుకు తీసుకుని చేస్తుంటే వారు ఓటీపీలు చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. అమెరికాలో ఉంటున్న వారిని రాత్రి సమయంలో నిద్రలేపి ఓటీపీలు అడగాల్సి వస్తోంది. యాప్లో ఎరువులు తీసుకోవాలంటే చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. – జోగి కృష్ణబాబు, మడక, పెడన మండలం -
చిన్న క్లూ కూడా దొరక లేదు!
కృత్తివెన్ను: నిండు ప్రాణాలు నీటిపాలు.. చంపేసిన ఆనవాళ్లు ఏటిపాలు అన్నట్లుంది చినగొల్లపాలెం జంటహత్యల మిస్టరీ. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో జంట హత్యలు జరిగి వారం రోజులు కావస్తోంది.. మృతదేహాలు లభ్యమై ఐదు రోజులైంది. కానీ హంతకులకు సంబంధించి చిన్న సమాచారం కూడా పోలీసులకు దొరకలేదు. రెండు జిల్లాలోనూ జల్లెడేసి గాలిస్తున్నా నిందితులు ఆచూకీ కొంచెం కూడా లభించకపోవడం ఈ కేసు పోలీసు యంత్రాంగానికి సవాల్గా మారింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో బందరు డీఎస్పీ నలుగురు సీఐలు, ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నారు. సముద్రంపై అవగాహన ఉన్నవారే? హత్య చేయడం.. మృతదేహాలను వారి బైక్కే కట్టి నీటిలో వేసేయడం చూస్తుంటే ఇది కచ్చితంగా సముద్రంపై అవగాహన ఉన్న వారు మాత్రమే చేయగలరని స్థానికుల అనుమానం. క్షణికావేశంలో హత్య చేసినా ఈ విధంగా ఏటిలో మృతదేహాలను జలసమాధి చేయాలంటే పడవ నడపడం, ఏటిలోతు తదితర అంశాలపై పూర్తిగా తెలిసిన వారే ఇది చేసుండాలని అంటున్నారు. బయట వ్యక్తులు అర్ధరాత్రి ఆ ప్రాంతంలో హత్య చేయడం, శవాన్ని మాయం చేయడం కష్టమైన పనని, ఇది పూర్తిగా ఆ ప్రదేశాలపై అవగాహన ఉన్నవారు మాత్రమే చేసుంటారన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. జల్లెడేసినా జాడలేదు.. నిందితుల కోసం పోలీసులు అణువణువూ వదలకుండా గాలిస్తున్నారు. కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. అనుమానితులను తీసుకొచ్చి విచారణ చేసినా ఫలితం శూన్యం. మృతులు యానాది సామాజిక వర్గానికి చెందిన వారు అదే సామాజిక వర్గంలో ఏమైనా విభేదాలుండి ఇలా జరిగిందా? అన్న కోణంతో పాటు, తమకు చేపల వేటలో భవిష్యత్తులో పోటీ అవుతారన్న అనుమానంతో వేరే సామాజిక వర్గం వారు ఈ దురాగతానికి పాల్పడి ఉంటారా అన్న అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. అయినా ఎక్కడా కొంచెం కూడా క్లూ లభించకపోవడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కేసులో నిందితులను పట్టుకుని కేసుకు త్వరలో ముగింపు పలికి ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు. -
రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రోజు వారీ విధుల్లో హిందీ తప్పనిసరి అని విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా పేర్కొన్నారు. డీఆర్ఎం అధ్యక్షతన అధికార భాష అమలు కమిటీ సమావేశం గురువారం డీఆర్ఎం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మోహిత్ సోనాకియా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాష హిందీని సమర్థవంతంగా అమలు చేయడం ఉద్యోగుల బాధ్యతని అన్నారు. అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ తనిఖీ జరిగే అవకాశం ఉన్నందున దైనందిన కార్యాలయ పనులు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీని వినియోగించాలని స్పష్టంచేశారు. ప్రతి తనిఖీ నివేదికలో కనీసం ఒక అంశాన్ని హిందీలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. డివిజన్లో అధికార భాష అమలులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో రాజభాష విభాగం కృషిని అభినందించారు. ఏడీఆర్ఎం పి.ఇ.ఎడ్విన్ మాట్లాడుతూ.. అధికార భాష అమలుకు నిర్దేశించిన లక్ష్యాలను విజయవాడ డివిజన్ గణనీయంగా అధిగమించిందన్నారు. హిందీలో నోటింగ్ కోసం నిర్దేశించిన 35 శాతం లక్ష్యానికి గాను 87.87 శాతం, హిందీలో వచ్చిన ఉత్తరాలకు అదే భాషలోనే సమాధానం ఇవ్వాలన్న 60 శాతం లక్ష్యానికి గాను 88 శాతం నమోదు చేసుకుందని వివరించారు. అనంతరం సీనియర్ రాజభాష అధికారి హేమంత్ వాడేకర్ త్రెమాసికంలో డివిజన్లో రాజభాష అమలులో భాగంగా ఉద్యోగుల కోసం నిర్వహించిన హిందీ వర్క్షాపులు, సెమినార్లు, టేబుల్ ట్రైనింగ్ కార్యక్రమాలను వివరించారు. దైనందిన అధికారిక పనుల్లో హిందీ వినియోగాన్ని మరింత పెంచాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా డీఆర్ఎం చేతుల మీదుగా అధికార భాష త్రైమాసిక మ్యాగజైన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం కొండా శ్రీనివాసరావు, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వి.ఎస్.కె.ప్రసాద్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డీఆర్ఎం మోహిత్ సోనాకియా -
నదిలో ఇసుక దోపిడీ పట్టదా?
● గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు బేఖాతర్ ● వందలాది టిప్పర్లతో ఇసుక దోపిడీ ● ఇసుక మాఫియాపై న్యాయపోరాటం ● మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ పమిడిముక్కల: ‘పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నామని సీఎం, డెప్యూటీ సీఎం చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మొక్కలు నాటుతున్నారు. అయితే గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ కృష్ణా నదిలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. ఇదేమి పాలన’ అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ప్రశ్నించారు. చోరగుడిలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని లంకపల్లి, రొయ్యూరు క్వారీల్లో అధికార పార్టీ నాయకుల ఇసుక దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు జూన్ రెండు నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు నదిలో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ సమావేశం పెట్టి నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని, అతిక్రమిస్తే కేసులు పెట్టాలని హెచ్చరించారని గుర్తు చేశారు. అయినా నదిలో నిత్యం యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోందని తెలిపారు. ఈ దోపిడీ గురించి తెలిసినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక్క లారీని కూడా ఆపి క్రిమినల్ కేసు నమోదు చేసిన దాఖలాలు లేవన్నారు. కలెక్టర్, ఎస్పీ, తహసీల్దార్ సీఐ, ఎస్ఐకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇసుక దోపిడీని ఆపడం లేదని, దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని పేర్కొన్నారు. పమిడిముక్కల సీఐ తన పరిధిలోని లంకపల్లి, రొయ్యూరు క్వారీల నుంచి వందలాది టిప్పర్లు ఇసుక తరలిపోతుంటే ఎందుకు నిలుపుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఇసుక రీచ్లోకి వెళ్లకుండా గండి కొట్టామని కలెక్టర్, తహసీల్దార్ చెబుతున్నారని, నదిలో పొక్లెయిన్, ఇసుకతో తరలివెళ్తున్న టిప్పర్లు కనబడతున్నాయని, కావాలంటే వారికి ప్రత్యక్షంగా చూపిస్తానని అన్నారు. వర్షం పడితే ఇబ్బంది లేకుండా అనకొండల్లా ఇసుక నిల్వ చేశారని, నదిలో ఇంకెంత దోచుకొంటారని ప్రశ్నించారు. ఇసుక దోపిడీపై తోట్లవల్లూరు, పమిడిముక్కల పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని, పట్టించుకోకపోతే జిల్లా, మండల అధికారులపై ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్, పార్టీ నాయకులు మర్రి బాబూరావు, పాతూరి చంద్రపాల్, గవాస్కర్ రాజు, వైస్ ఎంపీపీ గంజాల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
వీరులపాడు: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదం గురువారం జరిగింది. మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన నిమ్మల అచ్చమ్మ (50) గ్రామ శివారులో రోడ్డు దాటుతుండగా జయంతి నుంచి పెద్దాపురం గ్రామానికి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అభిమన్యు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉపాధి కూలీలకు సంపూర్ణ భరోసా
జి.కొండూరు: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ పథకంతో ఉపాధి హామీ కూలీలకు సరికొత్త భరోసా కలుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జి.కొండూరు మండల పరిధిలోని చెవుటూరు గ్రామంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వీబీ జీరామ్ జీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్తో కలిసి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల వాగు ఫీడర్ చానల్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జి.కొండూరు కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వీబీ జీరామ్ జీ పథకం ద్వారా ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు రోజువారీ వేతనాన్ని రూ.307 నుంచి రూ.312కు పెంచారన్నారు. ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, డ్వామా పీడీ ఎ.రాము, ఏపీడీ (విజయవాడ) శ్రీనివాస్, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య అధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఎంఎల్హెచ్పీలు కోసం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణను డాక్టర్ పోతన శాస్త్రి, డాక్టర్ శ్రీధర్ అందించగా, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ జవాద్ ఖాన్, డీపీఎంఓ డాక్టర్ అరుణ్ పర్యవేక్షించారు. మధుమేహం, అధిక రక్తపోటు, గర్భిణులు, ప్రసవానంతర తల్లులు సహా జీవనశైలి సంబంధిత వ్యాధుల నివారణ, నియంత్రణలో యోగా ప్రాముఖ్యతపై శిక్షణార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని(స్ట్రెస్) సమర్థంగా నిర్వహించడం ప్రతి ఉద్యోగికి అత్యంత అవసరమని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఉద్యోగులు మానసిక సమతుల్యత, సానుకూల దృక్పథం, సమయపాలనతో విధులు నిర్వర్తించినప్పుడే ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించగలరని పేర్కొన్నారు. ప్రత్యేక సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సెషన్లలో భాగంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. సైకాలజిస్టులు తేజావతి, జి.శంకర్ రావు, టీఎస్ రావు, బి.నవితశ్రీ బృందం రోజువారీ విధుల నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో మొత్తం 50 స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు, సమన్వయకర్త జి.జ్యోతి పాల్గొన్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ నేత దేవినేని అవినాష్ ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. అమెరికా వెళ్లేందుకు వీలుగా ఆయన పాస్పోర్ట్ను తిరిగి ఇవ్వాలని కింది కోర్టును ఆదేశించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితునిగా ఉన్న అవినాష్.. కోర్టు ఆదేశాల మేరకు తన పాస్పోర్ట్ను స్వాధీనం చేశారు. అమెరికాలో తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లేందుకు అనుమతినివ్వాలని, పాస్పోర్ట్ వెనక్కి ఇవ్వాలని కోరుతూ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను గత నెల 16న కోర్టు కొట్టేసింది. దీనిపై అవినాష్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ గురువారం తీర్పు వెలువరించారు. అవినాష్ అమెరికా పర్యటనకు అనుమతినిచ్చారు. భారత దేశానికి తిరిగి వచ్చి, ఈ నెల 13న దర్యాప్తు అధికారి లేదా కింది కోర్టు ఎదుట హాజరుకావాలని అవినాష్ను ఆదేశించారు. అమెరికా ప్రయాణ ప్రణాళికను సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కు, కింది కోర్టుకు సమర్పించాలని చెప్పారు. -
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
కృష్ణలంక(విజయవాడతూర్పు): చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.2.28 లక్షల విలువైన 15.2 గ్రాముల బంగారు నానుతాడు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ కార్యలయంలో ఈ కేసు వివరాలను సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. కిషోర్బాబు విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పెనమలూరు మండలం పోరంకికి చెందిన నరందాస్ చిన్మయి సాయిదుర్గారావు గతంలో నమోదైన ఒక కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్న సమయంలో మోదుగు రాజారావుతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన అనంతరం ఇద్దరూ కలిసి చైన్ స్నాచింగ్లు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మోటార్ సైకిల్పై కొత్తగూడెం వైపు వెళ్తూ మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మగళాపురం క్రాస్ రోడ్డు వద్ద బడ్డీ కొట్టులో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో బంగారు నానుతాడును లాక్కుని పారిపోయినారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పది గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్లో పదో ప్లాట్ఫాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నరందాస్ చిన్మయి సాయిదుర్గారావు, మోదుగు రాజారావును సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. 15.2 గ్రాముల బంగారు నానుతాడు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. -
సూర్యం.. సు‘వర్ణం’
సంధ్యా సమయం.. రెప్ప వాల్చనివ్వని మనోహర దృశ్యం.. చల్లని సాయంత్రం.. వర్ణాలమయమైన నింగి సింగారం.. మబ్బుల చాటుకు చేరిన దినకరుడి సహజ తేజం.. రామలింగేశ్వరుడి కొండపై పసిడికాంతుల ప్రవాహం.. కనుదృష్టిని మైమరపించే.. వర్ణనలకు అందని అద్భుతం.. చూసి పులకించని మది ఉంటుందా? కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంపై గురువారం సాయంత్రం సూర్య కిరణాలు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలయ్యా.. మీరు అధికారంలో ఉంటేనే నిరుపేదల బతుకులు బాగుపడతాయి. మళ్లీ మీరు వస్తేనే మాలాంటి వారికి అండ’ అంటూ పెద్ద సంఖ్యలో మహిళలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. ‘అన్నా.. ఒక్క ఫొటో తీసుకుంటా’ అంటూ ఆయనను అనుసరిస్తూ ముందుకు సాగారు. కృష్ణలంక పోలీసుల వేధింపుల కారణంగా మే 21న ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను గురువారం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ రాకతో లబ్బీపేట, గ్రీన్ల్యాండ్స్ ప్రాంతం జనసందోహంగా మారింది. తమ అభిమాన నేతను చూసేందుకు.. గ్రీన్ల్యాండ్స్ ప్రాంతంలో ఎక్కువగా పేదలు నివసిస్తుంటారు. ఆ ప్రాంతంలో నివసించే కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పనులకు వెళ్తుంటారు. కానీ తమ ప్రాంతానికి వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న మహిళలు పనులు మానుకొని ఇళ్ల వద్దే ఉన్నారు. తమ అభిమాన నేత రాక కోసం ఎదురు చూశారు. ఆయన మెయిన్ రోడ్డులో కారు దిగి క్రాంతికుమార్ ఇంటికెళ్లే దారిలో దాదాపు 300 మీటర్ల మేర మహిళలు పెద్ద ఎత్తున ఇరువైపులా నిల్చొని స్వాగతం పలికారు. ‘మీరు చల్లగా ఉండాలయ్యా.. మీరు ఉంటేనే మా లాంటి వాళ్లకు మేలు జరుగుతుంది. మళ్లీ మీరు అధికారంలోకి రావాలయ్యా’ అంటూ వృద్ధ మహిళలు వైఎస్ జగన్కు దీవెనలు అందించారు. అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తూ క్రాంతికుమార్ ఇంటివైపు వైఎస్ జగన్ కదిలి వెళ్లారు. అక్కడ క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేంతగా ఎందుకు వేధింపులు వచ్చాయనే విషయాలను కుటుంబ సభ్యులతో పాటు ఇతర నేతలు వివరించారు. అపార్ట్మెంట్లపై నుంచి.. వైఎస్ జగన్ రాకతో ఆ ప్రాంతంలో అపార్ట్మెంట్లు భవనాలపై జనాలు కిటకిటలాడారు. ఆయన క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తిరిగి వెళ్లే సమయానికి పకీరుగూడెం– లబ్బీపేట రోడ్డు జనసంద్రంగా మారింది. పకీరుగూడెంకి చెందిన మహిళలు తమ అభిమాన నేత ఆ ప్రాంతానికి వచ్చారని తెలుసుకుని తరలివచ్చారు. వైఎస్ జగన్ ఆ ఇంటి ప్రాంతం నుంచి మెయిన్రోడ్డుపై వచ్చే వరకూ వేచి చూశారు. హోరెత్తిన నినాదాలు.. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల కోసం వైఎస్ జగన్ కారు డోర్పై నుంచి నిల్చొని అభివాదం చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు అరాచక పాలన చేస్తున్న కూటమి సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తరలివచ్చిన నేతలు.. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్తో పాటు మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకరబాబు, నల్లగట్ల స్వామిదాసు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు ఎండీ రూహుల్లా, తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, పెనమలూరు పార్టీ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నత్తా యోనారాజు, మాజీ కార్పొరేటర్లు రెహానా నాహీద్, వియ్య పు అమర్నాథ్, పుప్పాల కుమారి, తంగిరాల రామిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అలీం, ఎస్కే సుభానీ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల వేధింపుల కారణంగా మరణించిన క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ రాకతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కృష్ణలంక సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేయగా, సౌత్ ఏసీపీ మానస, ఇంటెలిజెన్స్ ఏసీపీ మహేంద్ర, ట్రాఫిక్ ఏసీపీ పావన్కుమార్ ఆ ప్రాంతానికి వచ్చారు. వారితోపాటు, ఇంటెలిజెన్స్, స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచి సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారు. -
నిరుద్యోగుల్లో నైరాశ్యం!
నియామకాలపై కాలయాపన ఏల? ఆరు నెలలైనా.. మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువతకు వైద్య, ఆరోగ్యశాఖ మరోసారి మొండి చేయి చూపింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని నోటిఫికేషన్లు జారీ చేసి, ఆపై నియామకాలు నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆప్కాస్ ఆమోదం లేదంటూ కుంటి సాకులు చెబుతూ.. నియామక ప్రక్రియను నిలిపివేయడం వెనుక అసలు ఉద్దేశం పోస్టులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడమేనన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2024 డిసెంబర్లో జారీ చేసిన నోటిఫికేషన్ను 2025 డిసెంబర్లో రద్దు చేయడం వల్ల నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ, అనిశ్చితి నెలకొంది. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో మూడు కేటగిరీలకు సంబంధించిన మొత్తం 22 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టులు 4, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు 8, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మన్ పోస్టులు 10 ఉన్నాయి. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి 2024 డిసెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే, 2025 డిసెంబర్లో ఆ నోటిఫికేషన్ను రద్దు చేశారు. అదే నెలలో మొత్తం 60 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇందులో ఒక పోస్టు ఫార్మసిస్ట్ గ్రేడ్–2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టులు 07, నాలుగు డేటా ఎంట్రీ ఆపరేటర్, 10 పోస్టులు లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ కేడర్కు చెందినవి ఉన్నాయి. అలాగే పీహెచ్సీల్లో 12 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టులు, 16 ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు, 10 శానిటరీ అటెండెంట్ కం వాచ్మన్ కేడర్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీని కోసం 2025 డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత దీనిపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇలా తరచూ నోటిఫికేషన్లు రద్దు చేయడం, మార్పులు చేయడం వల్ల నిరుద్యోగుల్లో విశ్వాసం దెబ్బతింటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీహెచ్సీల్లో క్యాడర్ పోస్టుల నియామకాలను ప్రస్తుతం నిలుపుదల చేశాం. మిగతా ఎన్యూహెచ్ఎం పోస్టులకు సంబంధించిన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తాం. పీహెచ్సీల్లోని క్యాడర్ పోస్టులకు ఆప్కాస్ ఆమోదం వచ్చిన వెంటనే అవి కూడా నియామకాలు చేపడతాం. – డాక్టర్ పి. యుగంధర్, కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎన్యూహెచ్ఎంలో 22, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీలు) 38 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, 2025 డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆరు నెలలు గడిచినా నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఈ 60 ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. ఈ పోస్టులకు మొత్తం 2,994 దరఖాస్తులు అందగా, దరఖాస్తు రుసుముల రూపంలో అభ్యర్థులు సుమారు రూ.9 లక్షలు చెల్లించారు. అయినప్పటికీ నియామకాలపై ఎలాంటి పురోగతి లేకపోవడం అభ్యర్థుల్లో తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. -
కారు ఢీకొని ఒకరి మృతి
కంచికచర్ల: ఇంజినీరింగ్ చదివిన యువకుడు వర్క్ఫ్రం హోం ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి ఉద్యోగం ఇస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి టెలిగ్రామ్ నమ్మించి రూ.2 లక్షలు కాజేసిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు.. కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన వెంపరాల త్రిసాయి వర్క్ఫ్రం హోం ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు. ఓ ఆగంతకుడు వాట్సప్, టెలిగ్రామ్ ద్వారా అతనికి పరిచయమై ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.2 లక్షలు ఆన్లైన్ ద్వారా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఫోన్ చేయగా ఫోన్ పనిచేయటం లేదు. మోసపోయానికి గుర్తించిన త్రిసాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఒక్కటే మార్గం
పామర్రు: ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి యోగా మార్గం ఎంతో దోహద పడుతుందని పతంజలి దక్షణ భారతదేశ పతంజలి ఇన్చార్జి రిత్ దేవ్ బాబా అన్నారు. సమగ్ర శిక్ష విద్యాశాఖల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రగతి జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం 200 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు వారం రోజుల యోగా శిక్షణ తరగతులను డీఈవో యువీ సుబ్బారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిత్ దేవ్ బాబా మాట్లాడుతూ.. యోగ సాధనతో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా శక్తి యుక్తులు పొందగలుగుతారన్నారు. హరిద్వార్లో ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. డీఈవో సుబ్బారావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ గల జీవితం పెంపొందించేందుకు యోగా ఎంతో దోహద పడుతుందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం యోగా ప్రధానాచార్యులు డాక్టర్ రాధిక మాట్లాడుతూ.. యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలోనే కాకుండా ఆసియా ఖండ స్థాయిలో విద్యార్థులను పోటీలకు పంపుతున్నామన్నారు. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఇటేవల నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీలకు విశేష స్పందన లభించిందన్నారు. కార్యక్రమంలో ఏఎంవో శ్యామ్, గుడివాడ డీవైఈవో పద్మారాణి, ఎంఈవోలు భాను ప్రసాద్, పద్మవాణి, శ్రీలక్ష్మి, ఏవీ రమణ, ఎస్.శ్రీకాంత్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత స్టేట్ విన్నర్, యోగా గురువులు ముదిగొండ శాస్త్రి, బెనర్జీ లీలావతి మాట్లాడారు. మచిలీపట్నం బాలాజీ విద్యాలయం విద్యార్థి శోభశ్రీ వేసిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
సర్ను వేగవంతం చేయాలి
గూడూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల సంబంధిత అధికారులను ఆదేశించారు. గూడూరులో మంగళవారం పర్యటించిన కలెక్టర్... క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్వోలు), ఎన్నికల విభాగం అధికారులతో కలిసి ఇంటింటి సర్వే తీరును పరిశీలించి, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి సేకరణ, డేటా డిజిటైజేషన్ పురోగతిపై ఆరా తీశారు. ఫారాల పంపిణీపై ఆరా తీశారు. నిర్ణీత గడువు లోపు ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ డీఆర్వో పి.పోతురాజు, గూడూరు తహసీల్దార్ డి.రాజ్యలక్ష్మి, ఎంపీడీవో పి.శైలజ కుమారి, డిప్యూటీ ఎంపీడీవో చండిక ఉమామహేశ్వరరావు, బీఎల్వోలు పాల్గొన్నారు. పామర్రు: కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఒడిశా గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాల్గొని ప్రారంభోత్సవం చేస్తారని స్థానికుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ మంగళవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కనుమూరులో ఆర్టీసీ బస్సు వయా ముళ్లపూడి, అయినంపూడి, కూచిపూడి వరకు వెళ్లే విధంగా బస్ ప్రారంభం ఉంటుందని అన్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. -
మిస్టరీగానే జంట హత్యలు
మృతుడు సుబ్బన్న ఇంటి వద్ద విచారంలో బంధువులు హత్య జరిగిన ప్రాంతంలో పడి ఉన్న చేపలు కృత్తివెన్ను: కక్షలు కార్పణ్యాలకు అతీతంగా ఉండే పచ్చని పల్లెలో జంట హత్యల కలకలం మిస్టరీగా మారింది. అందరి నోటా ఒకటే మాటా మృతులు వివాదరహితులు ఎవరితోనూ విభేదాలు లేవు కానీ చంపేశారు. చంపడమే కాకుండా వారి మృతదేహాలను వారి బండి(బైక్)కే కట్టి నీటిలో జలసమాధి చేయడంతో దీవి వాసులు హడలిపోతున్నారు. ఇంత కర్కశమా.. మండల చరిత్రలో ఇప్పటి వరకు ఈ తరహాలో హత్యలు జరిగింది లేదు. ఏకంగా అల్లుడూ మామను చంపి ఏటిపాయలో వదిలేయడంపై సర్వత్రా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తీరప్రాంతంలో సరికొత్త తరహాలో హత్యలకు పునాది వేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతులు శెట్టి సుబ్బన్నకు ఎవరితోనూ ఎటువంటి వివాదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. యానాది సామాజిక వర్గానికి చెందిన సుబ్బన్నకు రెండు బోటులున్నాయని ఆర్థికంగా ఉన్నతంగానే ఉన్నట్లు తెలుస్తుంది. రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటున్న పశ్చిమగోదావరి జిల్లా రుస్తుంబాదుకు చెందిన సుబ్బన్న అల్లుడు గొలుసు అయ్యప్పకు కూడా ఇక్కడ ఎవరితోనూ విభేదాలు లేవంటున్నారు. పోలీసుల విచారణలో కూడా ఇదే విషయం తేలింది. అయినా ఇటువంటి హత్యకు కారణం ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రెండు జిల్లాల్లో గాలింపు.. ఈ హత్యలో ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది పాత్ర ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. మృతదేహాలు లభించిన కొద్దిదూరంలోనే కొన్ని చేపలు నేలపై పడి ఉన్నాయి. అంటే చేపల వేట పూర్తయిన తరువాతే హత్య జరిగి ఉండవచ్చన్నది స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే మూడు బృందాలు రంగంలో దిగాయి. ఎస్పీ ఐటీ కోర్ టీం సైతం గాలింపులో ఉన్నట్లు తెలిసింది. రెండు జిల్లాలోనూ గాలింపు ముమ్మరం చేసినట్లు బందరు రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. -
అమ్మా.. వీళ్లు మారరా !
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వీఐపీలు, సిఫార్సు లేఖలపై అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులను కట్టడి చేసి ఆలయానికి ఆదాయాన్ని పెంచాలని దుర్గగుడి అధికారులు రోజుకో టెక్నాలజీని తీసుకువస్తుండగా, ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది అమ్మవారి ఆదాయానికే గండికొడుతున్నారు. అధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదు. సోమవారం నుంచి దేవస్థానంలో తిరుమల తిరుపతి తరహాలోనే వీఐపీ, బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు కొత్త విధానాన్ని తెరపైకి తీసుకురాగా, అదే రోజు సాయంత్రం కాంట్రాక్ట్ సిబ్బంది రూ.500 టికెట్లను ఆరింటిని దారి మళ్లిస్తూ పట్టిపడిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం పంచహారతుల అనంతరం చోటు చేసుకోగా, ఈ వ్యవహారాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, సదరు కాంట్రాక్టు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఆరు టికెట్లు పక్కదారి.. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావుకు సంబంధించిన కొంత మంది భక్తులు సోమవారం సాయంత్రం అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. అయితే శ్రీనివాసరావు వారిని ప్రొటోకాల్ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. అదే తరుణంలో దేవస్థానంలో ఓ బ్యాంక్ తరుఫున ఐటీ విభాగంలో ఉద్యోగం చేస్తున్న విక్రాంత్ అనే యువకుడు ప్రొటోకాల్ కార్యాలయం వద్దకు వచ్చి దర్శనం చేయిస్తానని చెప్పాడు. శ్రీనివాసరావు తాలుకా 10 మంది, విక్రాంత్ తనతో పాటు మరో 10 మంది భక్తులు కలిపి మొత్తంగా 18 మందికి రూ.500 టికెట్లను అతను కొనుగోలు చేశాడు. అక్కడ కేవలం 12 టికెట్లను మాత్రమే ఆలయ సిబ్బందికి ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని శ్రీనివాసరావు గమనించారు. విక్రాంత్ మూడు టికెట్లు స్కానింగ్ చేయించకుండా తన వద్ద ఉంచుకున్నాడు. మిగతా మూడు టికెట్లను మహిళా సెక్యూరిటీ గార్డు వద్ద దాచినట్లు ఆలయ అధికారులు విచారణలో గుర్తించారు. సదరు వ్యవహారాన్ని ఆలయ ఈవో శీనానాయక్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది. బుధవారం ఆలయ ఈవో శీనానాయక్ విధులకు హాజరవుతున్న తరుణంలో ఈ వ్యవహారంపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. -
వెస్ట్ బైపాస్లో ఘోర ప్రమాదం..
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని బీబీగూడెం వద్ద విజయవాడ వెస్ట్ బైపాస్పై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు, అతని తల్లి, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. ఏలూరు జిల్లా కై కలూరు మండలం పెంచికలపర్రుకు చెందిన సోదరులు జయమంగళ వెంకట విజయ్కుమార్, వెంకటరాజు పొక్లెయిన్లు నడుపుతుంటారు. వారి తల్లి రమాదేవి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చారు. వెంకటరాజు భార్య, పిల్లలు ఆస్పత్రి వద్ద ఆగిపోగా, మిగిలిన వారు కై కలూరుకు తిరిగి కారులో బయలుదేరారు. పశ్చిమ బైపాస్పై బీబీగూడెం సమీపంలోకి రాగానే, వెనుక నుంచి వేగంగా వస్తున్న కంటైనర్ ముందు టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ట్యాంకర్తోపాటు వీరి కారును ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కంటైనర్, ట్యాంకర్ మధ్య కారు ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారు వెనుక సీటులో కూర్చున్న వెంకట విజయ్కుమార్ భార్య బాల వెంకట నాగదుర్గ (28), కుమారుడు కారుణ్య నాగసాయి(4) అక్కడికక్కడే మృతిచెందారు. కారు నడుపుతున్న వెంకటరాజు, ముందు సీట్లో కూర్చున్న విజయ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో ట్యాంకర్ అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టడంతో దానిపై వెళ్తున్న విజయవాడ సింగ్నగర్కు చెందిన హోటల్ కార్మికుడు దాసరి వెంకటేశ్వరరావు (49) కూడా మృతిచెందాడు. -
దుర్గమ్మ సేవలో ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కుటుంబ సమేతంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన వారిని ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు(బుల్లాబ్బాయ్) అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందించారు. అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి చల్లపల్లి: అనుమానాస్పద స్థితిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రాముడుపాలెం పుష్కర ఘాట్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కొలుసు శివరామకృష్ణ(35) తన భార్యతో సహా తోట్లవల్లూరులోని అత్త(స్వయాన శివరామకృష్ణ అక్క) ఇంటికి వచ్చారు. అయితే మంగళవారం తోట్లవల్లూరు నుంచి కారులో బయలుదేరిన శివరామకృష్ణ సాయంత్రం రాముడుపాలెం పుష్కర ఘాట్ వద్ద నీటిలో పడిపోయి చనిపోయి కనిపించాడు. స్థానికులు సమాచారం ఇవ్వటంతో ఎస్ఐ డి.దుర్గాంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తోట్లవల్లూరు నుంచి ఇక్కడకు ఎందుకు వచ్చాడనేది ప్రశ్నార్థకంగా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 22.71 శాతం ఫారాల డిజిటలైజేషన్ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో సర్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 16,53,294 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని, వాటిలో ఇప్పటికే 3,89,175 (22.71శాతం) ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
యోగా చాంపియన్ ఆనంద్ దేశానికే గర్వకారణం
మచిలీపట్నంటౌన్: అంతర్జాతీయ యోగా చాంపియన్ ఆనంద్ దేశానికే గర్వకారణమని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. మంగళవారం ఇంటర్నేషనల్ యోగా చాంపియన్ ఆనంద్ కలెక్టర్ డీకే బాలాజీ, కలెక్టర్ తండ్రి కృష్ణయ్యశెట్టితో కలిసి ఘనంగా సన్మానించారు. స్థానిక గాంధీనగర్లోని వాకర్స్ అసోసియేషన్ హాల్లో యోగా శిక్షణకు ఆనంద్ ప్రత్యేక అతిథిగా హాజరై, సభ్యులకు అడ్వాన్స్డ్ యోగా శిక్షణ ఇచ్చారు. యోగ సాధనలో సంపూర్ణ ఫలితాల కోసం పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోని వేలాది మంది యోగ సాధకులకు నిత్యం యోగ శిక్షణ ఇస్తూ, వారంతా పోటీల్లో విజేతలుగా నిలిచి, మెడల్స్ సాధించేందుకు విశేషంగా కృషి చేస్తున్న ఆనంద్ దేశానికే గర్వకారణమని అభినందించారు. అనంతరం ఆనంద్, జాతీయ స్థాయి యోగా గోల్డ్ మెడలిస్ట్ బీకే రాముడిని యోగా సభ్యులందరూ సన్మానించారు. శిక్షణా కార్యక్రమంలో జాతీయ యోగా విజేతలు బీకే రాముడు, శీలం రమేష్, వాకర్స్ అసోసియేషన్ ట్రస్టీ యారా జగన్మోహన్రావు, యోగా గురువులు పాల్గొన్నారు. ఉరేసుకుని వివాహిత మృతి వేదాద్రి(జగ్గయ్యపేట): ఉరేసుకుని వివాహిత మృతి చెందిన ఘటన గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన లాహోరి శ్రీకాంత్ గ్రామంలో డీజే ఆపరేటర్గా పని చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తెలంగాణాకు చెందిన అఖిల(25)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో ఇరు వర్గాల పెద్దలు సర్ది చెబుతున్నారు. ఈక్రమంలో సోమవారం రాత్రి దంపతులు ఘర్షణ పడ్డారు. తెల్లవారు జామున అఖిల ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మారుతి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాళం వేసిన ఇళ్లలో భారీ చోరీ 80 కాసుల బంగారం, 44 తులాల వెండి, 9 లక్షల నగదు అపహరణ పాయకాపురం(విజయవాడరూరల్): నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు వెళ్లిన వారి ఇళ్లలో దొంగలు పడి కోటి రూపాయల విలువైన 80 కాసుల బంగారం, 44 తులాల వెండి వస్తువులు, రూ.9 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. విజయవాడలో బైక్ మెకానిక్లుగా పని చేస్తున్న షేక్ చాన్బాషా, షేక్ రెహ్మాన్ అన్నదమ్ములు. వారి ఇద్దరి కుటుంబాలు జూన్ 26న నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగ కోసం ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చిన వారికి తమ ఇళ్ల తాళాలు పగుల గొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇళ్లలోకి వెళ్లి చూడగా బీరువాల తాళాలు ధ్వంసం చేసి అందులో దాచిన 80 కాసుల బంగారు నగలు, 44 తులాల వెండి వస్తువులతో పాటు రూ.9 లక్షల నగదును దొంగలు చోరీచేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై నున్న సీఐ షేక్ అహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబానికి పరామర్శ భారీ చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. పోలీసు కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. క్లూస్ టీమ్ను, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని నున్న సీఐ అహ్మద్ ఆలీని కోరారు. -
ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర
భవానీపురం(విజయవాడపశ్చిమ): దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజానీకానికి సేవలందిస్తున్న ప్రజా రవాణా(ఆర్టీసీ) సంస్థను మరింత బలోపేతం చేయాల్సిందిపోయి ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. దాదాపు రూ.6 వేల కోట్ల విలువైన ఆర్టీసీ భూములను ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు ధారాదత్తం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆర్టీసీ సంస్థకు చెందిన డిపోలను ఒక్కొక్కటిగా ప్రైవేట్కు కట్టబెట్టి నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకునేందుకు ప్రజల పక్షాన ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ విద్యాధరపురంలో నేలమట్టం చేసిన ఆర్టీసీ డిపోను వారు మంగళవారం పరిశీలించారు. డిపోలో ధ్వంసం చేసిన కట్టడాలు, డీజిల్ ఆయిల్, సీఎన్జీ బంకులు, గ్యారేజీ షెడ్ తదితరాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ–బస్ల నిర్వహణ పేరుతో డిపోలను ఖాళీ చేయించి ప్రజల ఆస్తులను ధ్వంసం చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ విధ్వంసకర పాలనకు నిదర్శనం సుమారు 50 వేల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ భవిష్యత్పై వారితో సంప్రదించకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా విద్యాధరపురం డిపో కూల్చివేత కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలనకు నిదర్శనం కాదా అని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో భూములు విలువ పెరగటం, అందునా బైపాస్ రహదారి పక్కనే ఉన్న డిపోను కబ్జా చేసి తమ అనుయాయులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ దుశ్చర్యలకు పాల్పడిందన్నారు. ఎలక్ట్రికల్ బస్ల నిర్వహణ కోసం ఈ ప్రాంతంలో సంస్థకు చెందిన అనేక ఖాళీ స్థలాలు ఉండగా ఉద్యోగులతో సందడి సందడిగా ఉండే ఈ డిపోను ఎంచుకోవడంలో ప్రభుత్వం కుట్ర బహిర్గతమవుతుందన్నారు. ఆర్టీసీ ఆస్తులు, భూములు ఆ సంస్థ ఆధీనంలోనే ఉండాలన్నారు. ఖరీదైన భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఖరీదైన ప్రభుత్వ, ఆర్టీసీ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గతంలో లులు మాల్ కోసం ఏలూరు రోడ్లో ఉన్న ఖరీదైన ఆర్టీసీ భూమిని కేటాయించినప్పుడు వైఎస్సార్ సీపీ పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఇప్పుడు విద్యాధరపురం డిపో స్థలాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతుందన్నారు. ప్రజాభిప్రాయాలను పట్టించుకోకుండా బినామీల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం వెంపర్లాడుతుందన్నారు. ఆర్టీసీ సంస్థ ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యోగులతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందించి పోరాడతామని తెలిపారు. ఇసుక, మట్టి, మైనింగ్ కొండలను స్వాహా చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ భూములపై కన్నేసిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియలో భాగంగానే విద్యాధరపురం డిపోను ఎంచుకున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఆర్టీసీ బలోపేతానికి రూ.5వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రభుత్వ చర్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు, పోర్టులను కూడా ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, పలువురు మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
రోగికి ఆశ.. వైద్యుడే శ్వాస
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి గుమ్మంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ముందుగా కనిపించేది తెల్లకోట్లులో ఉన్న వైద్యుడే. ఆ క్షణంలో ఆయన ప్రాణాలను నిలబెట్టే ఆశాకిరణం. గుండెపోటు నుంచి ప్రమాదాల వరకు, అత్యవసర పరిస్థితుల్లో క్షణాల వ్యవధిలో తీసుకునే నిర్ణయాలతో ఎన్నో జీవితాలను కాపాడుతున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే మానవీయ స్పర్వను కోల్పోకుండా, ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు అందిస్తూ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. బుధవారం జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా సేవే శ్వాసగా భావిస్తూ సమాజ ఆరోగ్యానికి అహర్నిశలు శ్రమిస్తున్న విజయవాడ వైద్యుల సేవలకు సలాం అంటున్నారు. వ్యక్తిగత సమస్యలు అధిగమిస్తూనే.. రోగులకు సేవలు అందించడమే పరమావధిగా భావిస్తూ 24 గంటలూ రోగుల సేవలోనే వైద్యులు మమేకమవుతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయాన్ని కూడా కోల్పోతుంటారు. రోగులకు సేవలు అందించే క్రమంలో వైద్యులు ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. రేడియేషన్ ప్రభావంతో కొందరు కార్డియాలజిస్టులు క్యాన్సర్ బారిన పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వారి వద్దకు వచ్చిన రోగిని చిరునవ్వుతో ఆత్మీయ పలకరింపే సగం టానిక్లా పనిచేస్తుంది. అందుకే వారిని దైవంతో కొలుస్తారు. పర్యావరణాన్ని ప్రేమిస్తే.. అది మనల్ని రక్షిస్తుందనే భావనతో మొక్కలు నాటడాన్ని డాక్టర్ కొండా వేణుగోపాలరెడ్డి(వీజీఆర్) పదేళ్ల క్రితం ప్రారంభించారు. ఏటా వర్షాకాలంలో వేలాది మొక్కలను తమ ఆస్పత్రికి తీసుకు వచ్చి ప్రతిరోజూ వచ్చే రోగులకు ఇవ్వడమే కాకుండా, రెడ్క్రాస్ వంటి సంస్థలకు ఇస్తుంటారు. అలా ఇప్పటి వరకూ 60 వేలకు పైగా మొక్కలను పంపిణీ చేశారు. మధుమేహ వైద్యుడిగా సైతం తనదైన ముద్ర వేశారు. మధుమేహానికి అవగాహనే మందు అని డాక్టర్ వీజీఆర్ అంటున్నారు. కె.వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు -
ఎగుమతి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
రామవరప్పాడు: ఎంఎస్ఎంఈలు ఎగుమతుల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎలీప్ వైస్ ప్రెసిడెంట్ స్వరూపారాణి అన్నారు. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం–2026 సందర్భంగా ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్లో మంగళవారం ఎలీప్, ప్రపంచ బ్యాంకు, ఎపీఎంఎస్ఎంఈడీసీ, ఆర్టీఐహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎగుమతి అవకాశాలపై’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు ఎలీప్ అందిస్తున్న పారిశ్రామిక వాడలు, ఇంక్యుబేషన్ సదుపాయాలు, డబ్ల్యూఈఐటీటీసీ ద్వారా అంతర్జాతీయ ఎగుమతులపై అవగాహన వంటి వాటిపై కూడా తమ సంస్థ సహాయపడుతుందని తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మధు మాట్లాడుతూ.. నాణ్యత, ఆవిష్కరణ, ఎగుమతి ప్రమాణాలను పాటిస్తే చిన్న పరిశ్రమలు ప్రపంచ మార్కెట్లో విజయవంతంగా నిలవగలవని తెలిపారు. ఎఫ్ఐఈవో అసిస్టెంట్ డైరెక్టర్ రఘనాథ్ బాబు ప్రపంచ మార్కెట్ అవకాశాలు, ఎగుమతి సంసిద్ధతపై అవగాహన కల్పించారు. ఎగ్జిమ్ బ్యాంక్ డెప్యూటీ జనరల్ మేనేజర్ పూర్ణిమ ఎగుమతిదారులకు అందుబాటులో ఉన్న ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలను వివరించారు. ఆన్లైన్లో డీజీఎఫ్టీ డెప్యూటీ డైరెక్టర్ ఫణి కిరణ్ ఎగుమతి విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహాలు, డీసీఎఫ్టీ సేవలపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో ఎలీప్ చైర్పర్సన్ కనకదుర్గ, ఎలీప్ రీజనల్ ఆఫీసర్ సునీత, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, మహిళా వ్యాపారవేత్తలు, యువత, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పైప్లైన్ గ్యాస్ కనెక్షన్లను వినియోగించుకోవాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో అందుబాటులో ఉన్న పైప్లైన్ గ్యాస్ కనెక్షన్లను ప్రతి కుటుంబం తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వినియోగదారులు, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల పంపిణీ, ప్రజాపంపిణీ వ్యవస్థ, పైప్లైన్ గ్యాస్ కనెక్షన్లు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పంపిణీ, క్యూఆర్ కోడ్ అధారిత సరఫరా విధానం, అంత్యోదయ పథకం తదితర అంశాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సకా లంలో చేరేలా రవాణా వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి నెలా పంపిణీ సమ యంలో ఎదురయ్యే సమస్యలను మండలాల వారీగా గుర్తించి రూట్ల వారీగా అవసరమైన చోట అదనపు వాహనాలను సమకూర్చాలని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా డోర్ డెలివరీకి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఎస్ఓ మోహన్బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.శివరామప్రసాద్, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, గిరిజన సంక్షేమశాఖాధికారి ఎం.ఫణిదూర్జటి, వెనుకబడిన తరగ తుల శాఖ జిల్లా అధికారి జి.రమేష్, మెగా సంస్థల ప్రతినిధులు ఫణికుమార్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
కూచిపూడి సర్టిఫికెట్, డిప్లొమా థియరీ రాత పరీక్షలు ప్రారంభం
పామర్రు: మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళా పీఠంలో సర్టిఫికెట్, డిప్లొమా థియరీ రాత పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ పరీక్షలు బుధవారం వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా టీచింగ్ అసిస్టెంట్లు పసుమర్తి హరినాథ శాస్త్రి, వేదాంతం వెంకట దుర్గాభవాని, అబ్జర్వర్లుగా ఓఎస్డీ ఆచార్యులు, నిరీక్షణబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తొలిరోజు సర్టిఫికెట్ పరీక్షకు 60 మందికి 56 మంది హాజరయ్యా రని తెలిపారు. మంగళ, బుధవారాల్లో డిప్లమో పేవర్–1, పేపర్–2 రాత పరీక్షలు జరుగుతా యని వివరించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షను రద్దు చేయాలి : ఫ్యాప్టోమచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా ఫ్యాప్టో చైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సభ్య సంఘాల సమావేశం సోమవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఫ్యాప్టో) జిల్లా కార్యా లయంలో జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను వెంటనే రద్దు చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ మేరకు ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని నాయకులు నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు జులై 14న కలెక్టరేట్ ముట్టడిలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి కుంపటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ అర్హత పరీక్షను కొనసాగించడం సమంజసం కాదని, వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ నాయకుడు కష్ణమూర్తి, ఏపీటీఎఫ్ నాయకులు రేణుకరావు, శివరామకష్ణ, బీటీఏ నాయకుడు సూరిబాబు, డీటీఎఫ్ నాయకుడు కొంపటి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందించిన టీడీపీ నేత అవనిగడ్డ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా మండలంలోని దక్షిణ చిరువోలులంకలో టీడీపీ నేత ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. ఏఎంసీ చైర్మన్, టీడీపీ నాయకుడు కొల్లూరి వెంకటేశ్వరరావు ఓటర్ల నమోదు కార్యక్రమం పరిశీలన కోసం సోమవారం దక్షిణ చిరువోలులంక గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా బీఎల్ఓ ఓటర్లకు అందించాల్సిన ఫారాలను కొల్లూరి అందించి ఫొటోలు దిగడం గమనార్హం. ముగిసిన సురభి నాటకోత్సవాలు విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో వినాయక నాట్యమండలి ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలు సోమవారం ముగి శాయి. చివరి రోజు ప్రదర్శించిన భూ కౌలాస్ నాటకం ఆద్యంతం అలరించింది. తల్లి కై కసి కోరిక మేరకు శివుడి ఆత్మలింగం కోసం రావ ణుడు తపస్సు చేయడం, ఆయనలో మాయ ప్రవేశించి మాత పార్వతిని ఇల్లాలిగా కోరుకోవడం, ఆ తరువాత తప్పు తెలుసుకుని శివుడికి శిరస్సు అర్పించడం, భోళా శంకరుడు ఆత్మ లింగం సమర్పించడం, నారదుడి మాయచేత శివలింగం భూమి మీదనే ప్రతిష్ఠం కావడం తదితర అంశాలతో ఈ నాటకం సాగింది. రావణ బ్రహ్మగా దినకర, శివుడిగా శివయ్య, నారదుడిగా పరిమళ, విరూపాక్షుడిగా శుభకర, మండోదరిగా మానస వీణ అద్భుతంగా నటించారు. నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు. మంగళవారం ప్రేక్షకుల కోరిక మేరకు మంగళవారం ప్రత్యేక ప్రదర్శనగా మాజా బజార్ నాటక ప్రదర్శ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
ప్రాధాన్యతాక్రమంలో ఫిర్యాదుల పరిష్కారం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మీ – కోసం కార్యక్ర మంలో అందిన అర్జీలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీ–కోసంలో పాల్గొన్న ఆయన సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల వద్ద అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కొన్ని ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని అర్జీలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఇంకొన్ని అర్జీలను స్టేషన్లకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీ–కోసంలో తమ దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపిన అనంతరం చట్టపరిధిలో పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది తమ తమ స్టేషన్లకు అందిన అర్జీలను కూలంకుషంగా పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని వీలైనంత వరకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సోమవారం జరిగిన మీ–కోసంలో మొత్తం 47 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. ● మూడేళ్ల క్రితం తనకు వివాహమైందని, నాటి నుంచి నేటి వరకు భర్తతో పాటు అత్తింటి వారు అదనపు కట్నం కోసం తనను వేధింపులకు గురి చేస్తున్నారని పెనమలూరుకు చెందిన సీత ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని, పుట్టింటి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకురావాలని వేధిస్తున్నా రని కన్నీరు పెట్టుకుంది. భర్తతో పాటు అత్తింటి వారిపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కోరింది. ● తాను పీజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తుండగా తన స్నేహితుడు రూ.3 లక్షలు చెల్లిస్తే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, డబ్బు తీసుకుని ఏడాదిగా ఉద్యోగం ఇప్పించ కుండా తప్పించుకు తిరుగుతున్నాడని పెడనకు చెందిన సాకేత్ ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు. ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
లైంగిక దాడికి యత్నం కేసులో జైలు, జరిమానా
చిలకలపూడి(మచిలీపట్నం): ఓ వృద్ధ వితంతువుపై లైంగిక దాడికి యత్నించిన యువకుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి.రాజావెంకటాద్రి సోమవారం తీర్పు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని రాఘవపురానికి చెందిన 60 ఏళ్ల వితంతువు 2023 ఏప్రిల్ ఎనిమిదో తేదీన పొలాల్లో గేదెలను మేపుతోంది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని చూసిన అదే గ్రామానికి చెందిన కోట్ర గోపీ లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయటంతో భయపడిన గోపీ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నందిగామ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏపీపీ అద్దెపల్లి నిరంజన్ ఆరుగురు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షులను విచారించిన అనంతరం గోపీపై నేరం నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి పెనమలూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పోరంకి గ్రామానికి చెందిన వరహాలరావు(55) తాపీ కార్మికుడిగా జీవిస్తున్నాడు. ఈ నెల 21వ తేదీన రాత్రి బైక్ పై బందరు రోడ్డుపై వెళ్తుండగా పచ్చళ్ల కంపెనీ వద్ద ప్రమాదవశాత్తు వాహనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన పోరంకిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరహాలరావు పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పి.శాంతకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ రహదారిపై కారు బీభత్సం గుణదల(విజయవాడ తూర్పు): మితిమీరిన వేగంతో అదుపుతప్పిన కారు జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ఈ ఘటన రామవరప్పాడు రింగ్ రోడ్డులో సోమవారం జరిగింది. రామవరప్పాడు ప్రాంతానికి చెందిన అనిల్ తన కారులో వ్యక్తిగత పనుల నిమిత్తం కుమార్తెతో కలిసి బయలుదేరాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఏలూరు రోడ్డులో గుణదల వద్దకు వచ్చే సరికి ఆయన అస్వస్థతకు గురయ్యారు. గుండె నొప్పిగా ఉందని కుమార్తెకు చెప్పాడు. రామవరప్పాడు రింగ్ రోడ్డుకు చేరుకునే సరికి నొప్పి తీవ్రమై కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం ఓ ద్విచక్రవాహనాన్ని సైతం ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ప్రేమ్ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడగా, వాహనం నుజ్జునుజ్జయింది. గుండె నొప్పితో బాధపడుతున్న అనిల్ను ఆయన కుమార్తె స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. నడిరోడ్డు పై కారు, ద్విచక్రవాహన పెద్ద శబ్దంతో ఢీకొనడంతో స్థానికులు భయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా ఆ రోడ్డులో ట్రాఫిక్ జామైంది. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. జేసీబీ సాయంతో కారును పక్కకు తొలగించారు. బాధితుడు ప్రేమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. వైద్య విద్యార్థి జ్ఞాపకార్థం గోల్డ్మెడల్ లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాళహస్తికి చెందిన లిఖిత్ సాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఏటా అనాటమీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థికి లిఖిత్ సాయి జ్ఞాపకార్థం గోల్డ్మెడల్ అందించేందుకు అతని తల్లిదండ్రులు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా లిఖిత్సాయి తల్లిదండ్రులు స్పాన్సర్షిప్ లేఖను ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కుమారు డిని కోల్పోయి తీవ్ర విషాదంలోనూ సమాజానికి ఉపయోగపడేలా గోల్డ్ మెడల్ ప్రదానం చేసేందుకు ముందుకొచ్చిన లిఖిత్ సాయి తల్లిదండ్రుల ఉదాత్త నిర్ణయాన్ని అభినందించారు. వ్యక్తిగత దుఃఖాన్ని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే శాశ్వత వారసత్వంగా మార్చిన ఈ సేవాభావం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, అనాటమీ విభాగాధిపతి డాక్టర్ చిత్ర, బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ శారదాంబ తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యం
● 22ఏ జాబితా అర్జీల పరిష్కారానికి కృషి ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో భూ వివాద రహిత గ్రామాలే జిల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. 22(ఏ) జాబితాకు సంబంధించి వచ్చిన అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 180 అర్జీలను పరిష్కరించామని తెలిపారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి 22–ఏ నిషేధిత భూముల జాబితాలో పొరపాటున నమోదైన కొందరు పట్టాదారులకు సంబంధించిన ప్రైవేటు భూములను ఆ జాబితా నుంచి తొలగింపు ఉత్తర్వులను కలెక్టర్ లక్ష్మీశ సోమ వారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ క్లినిక్లు నిర్వహించినట్లు తెలిపారు. రెవెన్యూ క్లినిక్లో వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సరైన విధివిధానాలు పాటించకుండా 22ఏ జాబితాలో చేర్చిన భూములకు ఆ జాబితా నుంచి ఉపశమనం కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ సమీక్ష నిర్వహిస్తున్నారని, వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించిన దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, అందుకు కారణాలను విశ్లేషిస్తున్నారని వివరించారు. పరిష్కరించి రిజిస్ట్రేషన్కు వీలుకల్పించిన దరఖాస్తుల్లో ఐదు నుంచి 15 ఏళ్లపాటు సైతం అపరిష్కృతంగా ఉన్నవి కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దేవదాయ శాఖకు చెందని భూములు కూడా పొరపాటున 22ఏలో నమోదైనన సందర్భాల్లో దేవదాయ శాఖ కమిషనర్ నివేదికను అనుసరించి 22ఏ జాబితా నుంచి తొలగింపు ప్రక్రియ చేపట్టామన్నారు. ఏపీఐఐసీ భూముల విషయంలో కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ, సంబంధిత పత్రాల ధ్రువీకరణ అనంతరం అర్హమైన కేసులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వేతో పాటు కలెక్టరేట్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ‘సర్’ ప్రక్రియలో క్లయిమ్లు, అభ్యంతరాలతో పాటు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్తో కలిసి ఆర్డీవోలు, ప్లానింగ్ సెక్రటరీలు, ఎన్నికల విభాగం అధికారులతో సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ సులభంగా జరిగే అవకాశం ఉన్నప్పటికీ పట్టణాలు వాటి స్వరూపం కలిగిన ప్రాంతాల్లో కష్టతరంగా ఉంటుందన్నారు. జూలై 14వ తేదీలోపు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి తొలిదశ పనులు పూర్తి చేయాలన్నారు. డిజిటలైజేషన్ వేగవంతం.. సర్ ప్రక్రియలో నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి అధికారులు వేగంగా పనిచేయాలన్నారు. పంపిణీ ప్రక్రియను వెంటనే ముగించి అందుబాటులో లేని వారి ఇళ్లకు వెళ్లి ధ్రువీకరణ చేపట్టాలన్నారు. అందుబాటులోకి రాని దరఖాస్తులను నిబంధనల ప్రకారం అన్ కలెక్టబుల్గా నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ డీఆర్వో పోతురాజు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్డీవోలు కె. సాంబశివరావు, జి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. కరుణకుమారి, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
చోరీ కేసులో నిందితుల అరెస్టు
పెనమలూరు: దొంగతనాలకు ప్పాడుతున్న ఇద్దరు నిందితులను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ ధర్మేంద్ర సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పెనమలూరుకు చెందిన డి.సాయితేజ (బబ్లూ) (26), విజయవాడ చిట్టినగర్కు చెందిన బిరుదుకోట పవన్కుమార్ (20), మరో బాలుడు ముఠాగా ఏర్పడ్డారు. వీరు గతంలో పలు దొంగతనాలు, ఏటీఎంల వద్దకు వచ్చిన వారిని మోసగించడం, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన కానూరులో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. కామయ్యతోపు సెంటర్ వద్ద ఉన్న ఏటీఎం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న బోలెం సుమంత్ను నమ్మించి తమకు ఆన్లైన్లో సొమ్ము బదిలీ చేస్తే చేతికి నగదు ఇస్తామని నమ్మించారు. సుమంత్ ఫోన్పే ద్వారా రూ.8 వేలు వారికి బదిలీ చేశాడు. అనంతరం డబ్బులు ఇస్తామంటూ సుమంత్ను హోటల్ రూమ్కు తీసుకు వెళ్లారు. అక్కడ వారు అతడిని చంపేస్తామంటూ బెదిరించి మరో రూ.14,400 ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. సుమంత్ వద్ద ఉన్న బంగారు గొలుసు, రెండు వెండి ఉంగరాలను దౌర్జన్యంగా లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలిస్తుండగా ఆదివారం సాయంత్రం నిందితులు డి.సాయితేజ, పవన్కుమార్ కానూరు వద్ద పట్టుబడ్డారు. వారి వద్ద 16 గ్రాముల బంగారు గొలుసు, ఎనిమిది గ్రాముల వెండి ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరీని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడైన బాలుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐలు టి.వి.వెంకటేశ్వరరావు, సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించం
కలెక్టర్ డీకే బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు ఇన్చార్జ్ డీఆర్వో పోతురాజు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ శ్రీనివారావు అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అర్జీదారుని సమస్యలను పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. తొలుత గుండెపోటుతో మృతి చెందిన డెప్యూటీ తహసీల్దార్ పామర్తి శ్రీనివాస్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజల నుంచి మొత్తం 142 అర్జీలు స్వీకరించామని కలెక్టర్ చెప్పారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● మచిలీపట్నంలోని చింతగుంటపాలెం ప్రాంతానికి చెందిన చట్టి నరసమ్మ కలెక్టర్కు అర్జీ ఇస్తూ.. తాను అనాథనని, స్థానిక బెరాకా మినిస్ట్రీస్ వసతి గృహంలో ఉంటూ ఎంసెట్ పరీక్షలు రాశానని చెప్పారు. ఇప్పుడు ఉన్నత విద్యలో ప్రవేశానికి ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరమైందని, అలాగే తనకు రేషన్కార్డు కూడా మంజూరు చేయాలని కోరారు. ● ప్రకృతి సమతుల్యాన్ని కాపాడి సునామీ, తుపానుల నుంచి సముద్రతీర ప్రాంతాలకు కవచంలా ఉండే మడ అడవులకు రక్షణ కరువైందని ఆర్టీఐ కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ కలెక్టర్కు వివరించారు. అవనిగడ్డ, మచిలీపట్నం డివిజన్ల పరిధిలోని తీరప్రాంతాల్లో సుమారు 34,006 హెక్టార్లలో మడ అడవులు ఉన్నాయని, వీటిని నరికివేసి ఆక్రమణదారులు రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారని.. నిబంధనల ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ● పెదపారుపూడి మండలం దూళ్లవానిగూడెం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలను ప్రస్తుతం సీఎస్ఐ చర్చి భవనంలో నిర్వహిస్తున్నారని ఆ భవనాన్ని ఖాళీ చేయాలని చర్చి యాజమాన్యం కోరటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ప్రభుత్వభూములు అందుబాటులో ఉన్నందున ఆ ప్రాంతంలో పాఠశాల భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రంలో కోరారు. -
వైఎస్సార్ సీపీలోకి చేరికలు
వేములనర్వ(వత్సవాయి): చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నికల్లో అలివికాని హామీలను ఇచ్చిన కూటమి నాయకులు తీరా అధికారంలోనికి వచ్చిన తరువాత వాటి అమలును పట్టించుకోకుండా సొంత ప్రజయోజనాలను చూసుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. సంక్షేమ పాలన అందించాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సమక్షంలో జనసేన, టీడీపీకి పలువురు రాజీనామా చేసి పార్టీలో చేరారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పొదిలి లక్ష్మీనారాయణతోపాటు, టీడీపీ సీనియర్ నాయకుడు రాచబంటి చంద్రశేఖర్ మరో 12 కుటుంబాల వారు పార్టీలో చేరారు. మర్రి లక్ష్మీనారాయణ, రాచబంటి పుల్లారావు, మల్లాది వెంకటేష్, మాతంగి బాబురావు, మాతంగి దేవమణి, దాది సురేష్, రాచబంటి తిరుపతిరావు, కమతం రాజు, రాచబంటి నానికి అవినాష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
కేసులకు భయపడం.. పోరాటం ఆపం
లబ్బీపేట(విజయవాడతూర్పు): అక్రమ కేసులకు భయపడి అమరావతి రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతమంది పోలీసులను, గూండాలను, మాఫియా ముఠాలను దించి తమపై దాడులకు ఉసిగొల్పినా.. రైతుల కోసం మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటామని చెప్పారు. అమరావతికి భూములివ్వని రైతులను ప్రభుత్వమే వేధిస్తూ బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు నిజం కాబట్టి, అవి బయటి ప్రపంచానికి తెలియకుండా చేయాలన్న కుట్రతోనే రైతు పరిరక్షణ కమిటీగా వెళ్తున్న తమపై టీడీపీ గూండాలు ఉండవల్లిలో దాడులు చేశారని ధ్వజమెత్తారు. పైగా తామే రౌడీలతో దాడులకు వెళ్తున్నట్టు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తాము పిలిస్తేనే వైఎస్సార్ సీపీ నేతలు వచ్చారని పెనుమాక రైతులు ప్రెస్మీట్ పెట్టి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దోపిడీ వెలుగులోకి వస్తుందని భయం.. ఆంధ్రప్రదేశ్లో బిహార్ని మించిన జంగిల్ రాజ్ పాలన సాగుతోందని అవినాష్ విమర్శించారు. ప్రభుత్వ దోపిడీ, అరాచకాలను తట్టుకోలేక రైతులు వైఎస్ జగన్ను కలిస్తే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ రైతు పరిరక్షణ కమిటీ రైతులను కలవడానికి వెళ్తుంటే అడ్డుకోవడమే అప్రజాస్వామికం అయితే, తమ మీదనే దాడులు చేసి.. తిరిగి తమ మీదనే కేసులు పెట్టడం జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనమన్నారు. టీడీపీ గూండాలతోపాటు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ముఠాలతో కూడిన వందల మంది రౌడీలు తమపై దాడికి తెగబడ్డారని వివరించారు. పోలీసులు చట్టాలను ఉల్లంఘించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారని విమర్శించారు. అమరావతికి వ్యతిరేకం కాదు.. వైఎస్సార్ సీపీ అమరావతికి వ్యతిరేకం అని ఎప్పుడూ చెప్పలేదని అవినాష్ స్పష్టం చేశారు. రాజధాని పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. అమరావతికి భూములిచ్చిన ఒక్క రైతుకై నా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చి ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. వారికి మేలు జరిగితే న్యాయం కోసం తమ వద్దకు ఎందుకొస్తారని ప్రశ్నించారు. అటకెక్కిన విజయవాడ అభివృద్ధి.. ఈ కూటమి ప్రభుత్వం విజయవాడను ఎప్పుడో గాలికొదిలేసిందని అవినాష్ విమర్శించారు. అమరావతి కోసం విజయవాడ నగర అభివృద్ధిని గొంతు పిసికి చంపేస్తున్నారన్నారు. అమరావతి బాధిత రైతులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ చెప్పిన మాటను నిలబెట్టుకునే తీరుతామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అమరావతి అవినీతి, దోపిడీని కోర్టుల్లోనే రుజువు చేస్తామని దేవినేని అవినాష్ చెప్పారు. -
పాఠశాల పరిశీలన
పెనుగంచిప్రోలు: ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కేవీఆర్ జెడ్పీ హైస్కూల్ను సమగ్రశిక్ష రాష్ట్ర స్థాయి అధికారులు సందర్శించారు. పీఎంశ్రీ ప్రాజెక్టుకు సంబంధించిన పాఠశాలలో అమలవుతున్న పథకాలను, మనబడి–మన భవిష్యత్తుకు సంబంధించి మంజూరైన అదనపు తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల సిలబస్, పాఠ్య పుస్తకాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర స్థాయి అధికారులు బట్టు సురేష్, అశోక్, ఎంఈఓ డి. రవీంద్ర, హెచ్ఎం కె. జలజ తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం సోమవారం మొదలైంది. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులైన ఎన్సీసీ, క్యాప్ కేటగిరికి చెందిన 1 నుంచి 60వేల ర్యాంకు వరకు, దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్స్ కేటగిరీకి చెందిన వారికి మొదటి నుంచి చివర ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను సోమవారం పరిశీలించారు. సోమవారం మొత్తం 321 మంది సర్టిఫికెట్లను పరిశీలించామని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారథి చెప్పారు. నేటి షెడ్యూల్.. మంగళవారం ఉదయం 9గంటల నుంచి క్యాప్, ఎన్సీసీ అభ్యర్థులకు 60,001 నుంచి చివరి ర్యాంకు వరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గౌడ్స్ అభ్యర్థులకు మొదటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి చెప్పారు. గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గ్రామ పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే గ్రామసభలతో పారదర్శకమైన పాలన ప్రజలకు అందుతోందని పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ మల్లేశ్వరి తెలిపారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో మాల్దీవుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆమె గ్రామ పంచాయతీలు, గ్రామ సభల నిర్వహణ, వాటి ప్రయోజనాలపై వారికి వివరించారు. స్థానిక జెడ్పీ పాఠశాల, గ్రామ పంచా యతీ కార్యాలయాల వద్ద నిర్వహించిన మహిళలు, బాలలు, గ్రామస్తులతో వేర్వేరుగా గ్రామసభలు నిర్వహించారు. గతంలో జరిగిన గ్రామసభలో నిర్ణయించిన పనుల వివరాలు మాల్దీవుల బృందానికి తెలిపారు. వాటిలో ఇప్పటి వరకు ఏ మేరకు పనులు పూర్తి చేశారనే అంశాలను వివరించారు. జిల్లా పంచాయతీ అధికారి సీతామహాలక్ష్మి, ఎన్ఐఆర్డీ సంస్థ ప్రతినిధి శిరీష, డీఎల్పీఓ రాఘవన్, ఎంపీడీఓ డి.శకుంతల తదితరులు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు పటిష్ట భద్రత కల్పించామని, అయిన్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన సోమవారం గొల్లపూడిలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఆవరణలోగల ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పని తీరుతోపాటు అగ్నిమాపక, విద్యుత్ పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, యరడ్ల ఆంజనేయరెడ్డి (వైఎస్సార్ సీపీ), యేదుపాటి రామయ్య (టీడీపీ), మురళీకృష్ణ(ఐఎన్సీ), జె. శ్రీనివాసరావు (జనసేన) తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే లక్ష్యంగా కేడీసీసీబీ సేవలు
చిలకలపూడి(మచిలీపట్నం): రైతు సంక్షేమం, సహకార రంగ అభివృద్ధి, పారదర్శక పాలన, సభ్యులకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలను అందించటం కేడీసీసీ బ్యాంక్ ధ్యేయమని చైర్మన్ నెట్టెం శ్రీరఘురాం అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో 2026–27 వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ 2015కు ముందు రుణాలు పొంది వివిధ కారణాలతో చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వన్టైమ్ సెటిల్మెంట్ అమలు చేస్తున్నామన్నారు. రూ. 3 లక్షల వరకు పంట రుణాలు తీసుకుని మరణించిన అప్పుదారుని కుటుంబాలకు వడ్డీ పూర్తిగా మాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. పీఏసీ ఎస్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల జీతాల చెల్లింపుల కోసం జిల్లా స్థాయి సహకార నిధికి రూ. 4.43కోట్ల మంజూరుకు సర్వసభ్య సమావేశంలో ఆమోదించామన్నారు. కేడీసీసీబీ ప్రొఫెషనల్ డైరెక్టర్ మురళీధర్, ఆప్కాబ్ జనరల్ మేనేజర్లు జమున, చంద్రశేఖరరెడ్డి, కేడీసీసీబీ జనరల్ మేనేజర్ బీఎల్ చంద్రశేఖర్, రంగబాబు, జిల్లా సహకార అధికారి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లోని టెక్నికల్ వింగ్ డీసీపీగా ఏవీఆర్బీపీ ప్రసాద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. సీపీ రాజ శేఖరబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఇంద్రగిరి.. భక్తసిరి
దుర్గమ్మ కొండపై పండుగ వాతావరణంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): నిజ జ్యేష్ట పౌర్ణమి, మూలానక్షత్రం కలిసి రావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ నిర్వహించగా, మూలా నక్షత్రం నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని యాగ శాలలో సరస్వతి హోమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. మరో వైపున ప్రాంగణంలోనే రైతులు ఏరువాక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. వైభవంగా గిరిప్రదక్షిణ.. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ సోమవారం వైభవంగా నిర్వహించారు. ఘాట్రోడ్డు లోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ బొర్రా రాధా కృష్ణ, ఏసీ రంగారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి కొలువై ఉండగా, దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగింది. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్త జనుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపు వైభవంగా సాగింది. ఘాట్రోడ్డు నుంచి కుమ్మరిపాలెం, విద్యాధరపురం, నాలుగు స్తంంభాల సెంటర్, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీ రోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు అమ్మవారికి పూజా సామగ్రిని సమర్పించి పూజలు జరిపించుకున్నారు. ఆలయ డీఈవో కిశోర్కుమార్ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జ్ఞానప్రదాయినీ నమోస్తుతే.. మూలా నక్షత్రం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మ వారి సన్నిధిలో సరస్వతి హోమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పాత యాగశాలలో ఆలయ అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పలువు రు విద్యార్థులు హోమాన్ని దర్శించుకుని తమకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థిచారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ఏరువాక సంబరం.. దేవదాయ శాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి నాడు అనాదిగా భూమాతను, పశువులను, గంగమ్మను పూజించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించామని వారు తెలిపారు. పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను స్వర్ణకవచంతో అలంకరించారు. పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖులు, వీఐపీలు తరలివచ్చారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడితో పాటు పలువురు న్యాయమూర్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ ప్రముఖులు విశేషంగా పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏజెన్సీల మాయాజాలం
బందరులో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు వినియోగదారులకు చేస్తున్న మోసాలపై విచారించి తగు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నేను సెలవులో ఉన్నాను. విధుల్లో చేరాక ఏజెన్సీల నిర్వహణ తీరుపై విచారించి చర్యలు తీసుకుంటాం. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరక్కుండా చూస్తాం. – ఆంజనేయులు, డెప్యూటీ తహసీల్దార్, బందరు మచిలీపట్నంటౌన్: గ్యాస్ ఏజెన్సీల మాయాజాలానికి వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల ఇరాన్ యుద్ధం నెపంతో కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టించి.. ఇబ్బందులకు గురి చేసిన ఏజెన్సీల నిర్వాహకులు.. ఇంకా అదే పంథాని అవలంభిస్తున్నారు. దీంతో నగరం, పట్టణం, పల్లె అనే తేడాలేకుండా అన్ని ప్రాంతాల్లోనూ గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లాలో పలు కంపెనీలకు చెందిన 42 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 3లక్షలకు పైగా డొమెస్టిక్ వినియోగదారులకు సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ‘బ్లాక్’ దందా.. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అర్జెంటుగా కావాలని వచ్చేవారి నుంచి రూ.1600 నుంచి రూ. 1700కు అంటే దాదాపు రూ. 800 అధిక ధరకు విక్రయిస్తున్నారని వివరిస్తున్నారు. ముఖ్యంగా బందరులోని ఓ హెచ్పీ ఏజెన్సీ వద్ద బ్లాక్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పలువురు వినియోగదారుల ఫోన్ నంబర్లను మార్చేసి వారికి ఆన్లైన్లో బుకింగ్ కాకుండా కంప్యూటర్లో మార్పు చేసి, ఏజెన్సీకి చెందని కొందరి నంబర్లను ఆన్లైన్లో జోడించి బుక్ చేసి ఆ గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో విక్రయించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్లో నుంచి గ్యాస్ కోసం ఆన్లైన్లో బుకింగ్ చేద్దామని చూస్తే ఈ నంబర్ సరికాదని చెబుతోందని, తీరా ఏజెన్సీ వద్దకు వచ్చి ఆరాతీస్తే మీరు లింకు చేసిన ఫోన్ నంబర్ తప్పుగా చెప్పి ఉంటారని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిసింది. బందరుకు చెందిన వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసినా రోజుల తరబడి గ్యాస్ సిలిండర్ సరఫరా చేయని పరిస్థితి ఇక్కడ నెలకొంటోందని చెబుతున్నారు. గ్యాస్ బుక్ చేసినా ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్లను సరఫరా చేయకపోవడంతో బుకింగ్ క్లోజ్ అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా రెండు, మూడు సార్లు బుక్ చేసినా గ్యాస్ ఇంటికి అందని పరిస్థితులు నెలకొంటున్నాయని వాపోతున్నారు. గ్యాస్ రాలేదని వినియోగదారులు ఏజెన్సీలకు వెళితే ఇరాన్ యుద్ధం తర్వాత గ్యాస్ బుకింగ్ను త్వరితగతిన రద్దు చేస్తున్నారని, అందువల్లే గ్యాస్ మీకు ఇవ్వలేకపోయామని వంకలు చెబుతున్నారని వివరిస్తున్నారు. ఇంటికి గ్యాస్ను సరఫరా చేసే కార్మికులు సైతం వినియోగదారుల నుంచి రూ. 30 నుంచి రూ. 40 వీలును బట్టి అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అధిక ధరలు.. డెలివరీలు సక్రమంగా కాక వినియోగదారులే గోడౌన్కు వెళ్లి తెచ్చుకుంటున్నా.. అదనపు వసూళ్లు ఆగడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి వినియోగదారుడే వెళ్లున్నాడు కాబట్టి డెలివరీ చార్జీలు తగ్గించాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
చేపల చెరువుల తవ్వకాలకు వ్యతిరేకంగా ధర్నా
● కూటమి నాయకుల అండతో యథేచ్ఛగా తవ్వకాలు ● అడ్డుకున్న పెద్ద లింగాల గ్రామస్తులు నందివాడ: మండలంలోని పెద్ద లింగాల గ్రామంలో చేపల చెరువులను తవ్వొద్దంటూ గ్రామస్తులు ఆదివారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. చెరువుల వల్ల సాగు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని గ్రామస్తులు ఆరోపించారు. చెరువు తవ్వకాల వివాదంపై సోమవారం కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. విచారణ జరగక ముందే భూ యజమానులు, కూటమి నాయకులు అండ దండలతో తమకు హైకోర్టు అనుమతులు ఉన్నాయంటూ పొక్లెయిన్లు తీసుకువచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించి తవ్వకాలు మొదలుపెట్టారు. తవ్వకాలతో ఉపాధి కోల్పోతాం.. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామసభలు నిర్వహించకుండా, గ్రామస్తుల తీర్మానం లేకుండా, సచివాలయంలో సంతకాలు ఫోర్జరీ చేసి తవ్వకాలు చేస్తున్నారన్నారు. 200 మంది పోలీసులతో దౌర్జన్యంగా తమను బెదిరిస్తున్నారని చెప్పారు. మూడు రోజులు సెలవులు కావడంతో ఏ అధికారితో మాట్లాడడానికి వీలు లేకపోవడంతో తవ్వకాలకు దిగారన్నారు. సోమవారం హియరింగ్ ఉందని, ఒక రోజు తవ్వకాలు ఆపాలని వేడుకున్న పోలీసులు వినే పరిస్థితులో లేరని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము పనిచేస్తున్నామని పోలీసులు చెబుతున్నారని గ్రామస్తులు తెలిపారు. గ్రామమంతటా చేపల చెరువులు కావడంతో డ్రెయినేజీలను ఆక్రమించడంతో మురుగునీరు ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో వరదలు సంభవించి గ్రామం నీట మునగడానికి చేపల చెరువులు ప్రధానమని, కొద్దో, గొప్పో ఉన్న పంట పొలాలను కూడా చేపల చెరువులుగా మారిస్తే పూర్తిగా ఉపాధి కోల్పోతామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 20267చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. జిల్లా అధికారులు 10 గంటలకు హాజరుకావాలన్నారు. నందిగామ రూరల్: మాగల్లు వైకుంఠ నారాయణ క్షేత్రానికి జగద్గురు శంకరాచార్య హింపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి ఆదివారం రాత్రి విచ్చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు.మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా సాగిందని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ కె. ప్రేమ్చంద్ తెలిపారు. ఐదేళ్లలోపు 1,45,588 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, 1,49,286 మందికి పోలియో చుక్కలు వేయడంతో 102.54 శాతం లక్ష్యసాధన నమోదైనట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలియో బూత్లు, మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బృందాలతో కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించినట్లు చెప్పారు. బూత్లకు రాని చిన్నారులను గుర్తించి ప్రత్యేక బృందాలతో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయించడంతో జిల్లా లక్ష్యాన్ని అధిగమించగలిగామని తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించిన వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో తప్పనిసరిగా వేస్తామని డాక్టర్ ప్రేమ్ చంద్ పేర్కొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ అధికారుల ప్రకటనలు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితుల మధ్య వ్యత్యాసం ఉందన్న చర్చ జోరందుకుంది. జిల్లా లోని ఏడు నియోజకవర్గాల్లో సర్వేకు సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓటరు జాబితాకు సంబంధించి అధికారులు నియమించిన బీఎల్వోలు పూర్తిస్థాయిలో పనిలో నిమగ్నం కాకపోవటంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొంతన లేని ప్రకటనలు జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసేందుకు 1,792 మంది బీఎల్వోలను ప్రభుత్వం నియమించింది. వీరు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ బూత్ల ప్రకారం ఓటర్ల ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉంది. ఆదివారం ఉదయం వరకూ జిల్లా వ్యాప్తంగా 14,99,852 మందికి ఫారాలను అందించే కార్యక్రమం 87.53 శాతం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో అంతమేర పంపిణీ జరగలేదని రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. ఇంత స్థాయిలో పూర్తి చేసినట్లయితే ఇంకా చాలా ప్రాంతాల్లోని ఓటర్లుకు ఫారాలు అందలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో చాలా ఇళ్లకు చేరని ఫారాలు విజయవాడలో పశ్చిమ, తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి చాలా డివిజన్లు కొండ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రధానంగా పశ్చిమలోని సగం ప్రాంతం కొండ ప్రాంతాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ నివాసితులకు ఇప్పటి వరకూ చాలా మందికి ఫారాలు అందలేదని చెబుతున్నారు. వారిలో చాలా మంది ఉదయం పనులకు వెళ్లి రాత్రికి ఇళ్లకు చేరుకుంటారు. ఈ సర్వే గురించి వారికి అవగాహన లేకపోవటం, బీఎల్వోలు ఆ దిశగా పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మార్గదర్శకాలను పాటించాలంటున్న రాజకీయ పక్షాలు చాలా మంది బీఎల్వోలు ఆయా ప్రాంతాల్లో ఒక చోట కూర్చొని వచ్చిన వారికి తమ వద్ద ఉన్న ఫారాలను అందజేసి తిరుగు పయనమవుతున్నారు. దీంతో బూత్లో ఉన్న ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి తోడు ఒక ఇంటిలో నాలుగైదు ఓట్లు ఉంటే కేవలం రెండు ఫారాలు అందించి మిగిలినవి తర్వాత ఇస్తామని చెబుతున్నా రని, మళ్లీ వాటిని ఇవ్వడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బీఎల్వోలు మార్గదర్శకాలను అనుసరించి సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. అధికారులు ప్రకటిస్తున్నట్లుగా 14,99,852 మందికి (87.53 శాతం) ఫారాలను అందించే కార్యక్రమం పూర్తి చేస్తే కేవలం 1,84,411 ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ అయినట్లుగా అధికారులే చెబుతున్నారు. దీన్ని బట్టి రెండిటి మధ్య పొంతన లేదనే విషయాన్ని వారే స్పష్టంగా చెబుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్నతాధికారులు సర్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నా క్షేత్రస్థాయిలో బీఎల్వోలు చురుకుగా లేరనే విషయాన్ని గమనించటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఓటర్లు తమ ఓట్లను కోల్పోయే ప్రమాదముందని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేకు ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ గడువు ఉంది. నగరంలోని చాలా మంది బీఎల్వోలు గడువులోపు ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేయలేమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో ఉన్న బీఎల్వోలపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు లేఖలు పంపినట్లు తెలిసింది. పశ్చిమలో ఇద్దరు, తూర్పు, సెంట్రల్లో సుమారుగా పది మంది బీఎల్వోలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి వారి నుంచి సంజాయిషీ కోరినట్లుగా తెలిసింది. కొంతమంది బీఎల్వోలు తమ వ్యక్తిగత సమస్యల కారణంగా కొండ ప్రాంతాల్లో తిరగలేమని చెబుతున్నారు. -
అమరావతి రైతులకు అండగా వైఎస్సార్ సీపీ
పెనుగంచిప్రోలు: అమరావతి రైతులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. మండల కేంద్రమైన పెనుగంచిప్రోలులో పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ముందుగా చెరువుకట్ట సెంటర్ నుంచి బైపాస్ రోడ్డు, శ్రీతిరుపతమ్మవారి ఆలయం మీదుగా ప్రధాన రహదారి గుండా పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగనన్న నినాదాలతో హోరెత్తించారు. ఈసందర్భంగా పార్టీ జగ్గయ్యపేట ఇన్చార్జీ తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో రైతుల భూములను లాక్కుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వద్దకు రైతులు వస్తే వారి తరుఫున మద్దతుగా వైఎస్సార్ సీపీ నేతలు వెళ్తుంటే టీడీపీ గూండాలు, రౌడీలు దాడి చేయటం అత్యంత దారుణమన్నారు. అక్కడ రైతులు ఒక్కరూ కూడా లేరన్నారు. మేమంతా జగన్ సైనికులమని, మహానేత వైఎస్సార్ ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి గొయ్యి తీసి పాతరేసే రోజులు వచ్చాయని చెప్పారు. సగం సినిమా అయిందని, రెండేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి హీరో అన్నారు. జగ్గయ్యపేటలో కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. పోలీసులు ఇబ్బందులు పెట్టినా, వర్షం వచ్చినా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం మరువలేనిదన్నారు. కూటమికి భయమెందుకు ? మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ.. అమరావతి రాజధాని టీడీపీ వారిదేనని.. శాసనం చేస్తే ఎవరు రారన్నారు. మేము రాజధానికి వ్యతిరేకం కాదని, తక్కువ ఖర్చుతో నిర్మించాలనేది ధ్యేయమన్నారు. కూటమి నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులను చూసి భయపడటం ఎందుకు అన్నారు. తన్నీరు మాట్లాడుతూ.. కూటమి రెండేళ్ల పాలనంతా రెడ్బుక్ రాజ్యాంగం మీదే ఆధారపడి ఉందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, జెడ్సీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి, ఎస్సీ, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కన్నమాల శామ్యూల్, బత్తుల రామారావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, రాష్ట్ర కార్యదర్శి నంబూరి రవి, మండల, గ్రామ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు, గుడిమెట్ల శంకర్, నాయకులు పసుపులేటి సత్యశ్రీనివాసరావు, నాగబాబు, ఫిరోజ్ఖాన్, కొత్తపల్లి పెంటయ్య, దామాల శిరీస్, దేరంగుల శ్రీనివాసరావు, మెండెం రామారావు, వూట్ల నాగేశ్వరరావు, చేని రాంబాబు, చేని కుమారి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలో పేకాట జోరు
కోనేరుసెంటర్: నగరంలో అతనో సాదాసీదా ఆటో డ్రైవర్.. రోజూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే అతి సాధారణ వ్యక్తి... అయితే ఇదంతా కేవలం పైకి కనిపించే ముసుగు మాత్రమే... ఆ ఆటో డ్రైవర్ దినచర్య లోతుగా వెళ్లి పరిశీలిస్తే అతనో పేకాట కింగ్. అవును.. బందరులో ఇప్పుడు ఓ ఆటో వాలానే లీడర్గా సాగిస్తున్న పేకాట శిబిరం జిల్లాలోని పేకాటరాయుళ్లలో హాట్టాపిక్గా మారింది. చట్టాన్ని తన చుట్టంగా మార్చుకున్నాడో లేదంటే అధికార పార్టీ నేతలను తనకు అండగా పెట్టుకున్నాడో తెలీదు గానీ అతని పేకాట శిబిరం మాత్రం దినదినాభివృద్ధి చెందుతుంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు. రాష్ట్ర మంత్రి ఇలాకాలో ఆటో డ్రైవర్ ఆధ్వర్యంలో పేకాట జోరుగా సాగుతోంది. మూడు పువ్వులు.. ఆరు కాయలు.. ఈ పేకాట శిబిరం ఏదో సాదాసీదాగా సాగుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. హై–ప్రొఫైల్ జూదరులను ఆకర్షించేలా ఈ శిబిరం సాగుతోందనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ ఆటలో అడుగు పెట్టాలంటేనే కళ్లు బైర్లు గమ్మే రూల్స్ ఉన్నాయి. ఆటలో కూర్చోవాలంటే పందెం రాయుళ్ల నుంచి (ఎంట్రీ ఫీజు) రూ.వెయ్యి నిర్వాహకుడు (ఆటో వాలా) ముక్కు పిండీ వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. రోజుకు లక్షలాది రూపాయలు చేతులు మారే ఈ జూద శిబిరానికి బందరుకు చెందిన పేకాటరాయుళ్లే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ రకాల వ్యాపారవేత్తలు, ఇతర సంపన్నులతో పాటు పలువురు ఉద్యోగులు సైతం వస్తుండటం గమనార్హం. దీంతో నిర్వాహకుడి సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఆటగాళ్ల నుంచి ఒక్కో షోకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్న నిర్వాహకుడు అదే స్థాయిలో పందెం కట్టాలంటే రూ.10 వేలకు తగ్గకూడదనే ఆంక్షల మీద పేకాట నిర్వహిస్తున్నాడు. దీంతో ఈ ఆటలో ప్రతి రోజు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. పోలీసులపై ఆరోపణలు.. నగర నడిబొడ్డు అదీ కాకుండా ఓ రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి ఇంటికి సమీపంలో ఇంత పెద్ద ఎత్తున జూదం జరుగుతున్నా సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అలాగే నిఘా వర్గాలకు సమాచారం ఉన్నా పట్టించుకోకపోవడం, పోలీసులు ఈ శిబిరం వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్న అంతర్యమేంటో అర్థం కావటంలేదంటూ నగర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా సంబంధిత పోలీసులకు నిర్వాహకుడి నుంచి రోజువారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. ఆటో వాలా ముసుగులో ఉన్న ఆర్గనైజర్ వెనుక రాజకీయంగా ఏవో పెద్ద తలకాయలే ఉండి పోలీసులను మేనేజ్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికై నా స్పందించి దాడి చేస్తారా లేక ప్రజాభిప్రాయానికి తలొగ్గి తప్పు ఒప్పుకుంటారో వేచిచూడాలి. మంత్రి ఇంటికి సమీపంలోనే శిబిరం.. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే. ఈ పేకాట శిబిరాన్ని ఎక్కడో అడవుల్లోనో... నిర్మానుష్య ప్రాంతాల్లోనో నిర్వహించడం లేదు. ఏకంగా రాష్ట్ర మంత్రి ఇంటికి అతి సమీపంలో పేకాట శిబిరం కొన్ని నెలల నుంచి యథేచ్ఛగా కొనసాగుతుండటం అందరినీ అవాకై ్కయ్యేలా చేస్తుంది. ‘దీపం కిందే చీకటి’ అన్నట్లు రాష్ట్ర మంత్రి ఇల్లు పక్కనే ఉన్నా భయం లేకుండా ఇంత పెద్ద పేకాట శిబిరాన్ని ఓ సామాన్య ఆటోవాలా (హౌస్ గ్యాంబ్లింగ్) నడుపుతుండటం వెనుక ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా కాకుంటే ఓ సామాన్య ఆటోడ్రైవర్ నగర నడిబొడ్డున ఇంతటి సాహసానికి ఒడిగట్టటం జరగదంటూ నగరవాసులు చెప్పుకుంటున్నారు. -
దుర్గమ్మకు రూ.5 లక్షల బంగారు ఆభరణాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. విజయవాడ కానూరుకు చెందిన కొండవీటి ఈశ్వరరావు, మాధవి దంపతులు రూ. 5 లక్షలు వెచ్చించి బంగారు బొట్టు, బులాకి, నత్తులను తయారు చేయించారు. బంగారు ఆభరణాలను ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ (ఎన్సీసీ, క్యాప్, ఆంగ్లో ఇండియన్స్, దివ్యాంగులు) ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో సోమవారం నుంచి మొదలుకానుంది. సోమవారం ఎన్సీసీ, చిల్డ్రన్స్ ఫర్ ఆర్మ్డ్ పర్సన్స్ (క్యాప్) కేటగిరీకి చెందిన వారికి 1 నుంచి 60 వేల ర్యాంకు వరకు, దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్స్ వారికి మొదటినుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. మంగళవారం క్యాప్, ఎన్సీసీ అభ్యర్థులకు 60,001 నుంచి చివర ర్యాంకు వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గౌడ్స్ అభ్యర్థులకు మొదటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ విజయసారథి తెలిపారు. పరిశీలన పూర్తైన జనరల్ కేటగిరి అభ్యర్థులు సోమవారం నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు. గుడివాడటౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో 11వ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఆదివారం జరిగాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్రీడలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 200 మంది పైగా క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ప్రతినెలా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయన్నారు. క్రీడలను ప్రోత్సహించి యువ క్రీడాకారులను తయారుచేసే కార్ఖానాగా స్టేడియం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కె.రంగప్రసాద్, కమిటీ సభ్యులు ప్రవీణ్కుమార్, జైన్, ఎం.లక్ష్మణరావు, పి.వెంకట్రామయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విజేతలకు గుడివాడ డీఎస్పీ శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ సోమవారం జరగనుంది. ఉదయం 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూల వాహనంపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్లు, దేవస్థాన ప్రచార రథంపై కొలువై ఉన్న మూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరిప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో భక్తులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొననున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు రేపల్లె/చల్లపల్లి/కోడూరు: బాపట్ల జిల్లా రేపల్లె–పెనుమూడి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... కృష్ణా జిల్లా కోడూరు మండలం ఇరాలి గ్రామానికి చెందిన గంజాల బాపనయ్య తన భార్య నాంచారమ్మ, కుమారుడు సంతోష్ కుమార్లతో కలిసి తన ద్విచక్ర వాహనంపై రేపల్లె వైపు వస్తున్నాడు. పనులకు వెళ్లి వస్తుండగా.. చల్లపల్లి మండలం, లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీకి చెందిన కాకి రాకేష్(27) ప్రకాష్ల ద్విచక్ర వాహనం రేపల్లె నుంచి కృష్ణా జిల్లా వైపు వస్తున్నారు. పెనుమూడి రోడ్డులోని టపాసులగూడం వద్ద వీరు బాపనయ్య వాహనాన్ని ఢీకొన్నారు. బాపనయ్య, కాకి రాకేష్ (27) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాంచారమ్మ, సంతోష్ కుమార్, ప్రకాష్లకు తీవ్ర గాయాలయ్యాయి. రాకేష్ కాంక్రీటు పనులు చేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఆదివారం రేపల్లె నుంచి పనులు ముగించుకుని వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించినట్లు సమాచారం. వీరి మృతితో లక్ష్మీపురం, ఇరాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బి.అశోక్కుమార్ తెలిపారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు తెనాలి మారీస్పేటకు చెందిన అట్లూరి బాపూజీ కుటుంబం రూ.2,01,116 విరాళాన్ని అందజేసింది. అమ్మవారి అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన రవీంద్రభారతి విద్యా సంస్థల చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ కుటుంబం రూ.1,11,111ల విరాళాన్ని అందజేసింది. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు.కొండపల్లిలో మాల్దీవుల బృందం కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మాల్దీవుల గణతంత్ర దేశానికి చెందిన 33 మంది సభ్యుల బృందం ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో పర్యటించింది. కొండపల్లిలో వారసత్వ సంపద ప్రాంతాలను సందర్శించింది. కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను బృంద సభ్యులు పరిశీలించారు. హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీపీఆర్ సంస్థ ఈ బృందానికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీ విధానం, వికేంద్రీకృత పాలనా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు జూన్ 28 నుంచి 30 వరకు జిల్లాలో క్షేత్రస్థాయిలో ఈ బృందం పర్యటిస్తోంది. సోమవారం గుంటుపల్లిలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల తయారీ, బాల సభ, మహిళా సభ, పంచాయతీ అధికారులతో సమావేశాలు జరుపుతారు. మంగళవారం జుపూడి గ్రామ పంచాయతీలోని ఎస్డబ్ల్యూ పీసీ షెడ్ సందర్శన అనంతరం అధికారులతో చర్చిస్తారని ఎంపీడీఓ శకుంతల తెలిపారు. బందరు కాలువలో పడి బాలుడు మృతికృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రమాదవశాత్తు బందరు కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లబ్బీపేట, ఫకీర్గూడెంలో బందరు కాలువ సమీపంలో ఎండీ వజీర్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతను కారు డ్రైవర్గా పనిచేస్తుండగా అతని భార్య ఆయేషా ఓ పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది. వీరికి కుమారుడు సబీర్(7), కుమార్తె సోఫియా జైన్(6) ఉన్నారు. సబీర్ రెండో తరగతి చదువుతుండగా సోఫియా ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఆదివారం మధ్యాహ్నం అన్నాచెల్లెలిద్దరు ఆడుకోవడానికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బందరు కాలువ ఒడ్డుకు చేరుకున్నారు. కాలువ మెట్ల మీద ఆడుకుంటుండగా సోఫియా నీటిలోకి జారిపోయింది. పక్కనే ఉన్న సబీర్ తన చెల్లిని గమనించి నీటి నుంచి పైకి తోసి ప్రమాదవశాత్తు అతను నీటిలో మునిగిపోయాడు. ఎంతసేపటికీ కనిపించకపోవడంతో సోఫియా తన ఇంటికి వెళ్లి కాలువలో మునిగి అన్న కనిపించడం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు ఘటనా స్థలానికి వెళ్లి చూసి తన కుమారుడు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు బందరు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మునిగిన ప్రాంతంలోనే సబీర్ను గుర్తించి పైకి తీసుకొచ్చారు. అతనిని పరీక్షించి చూసి మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి గంపలగూడెం: తునికిపాడు గ్రామంలో ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన వేల్పుల బిక్షాలు(55) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 23న పొలం గట్టు విషయంలో బిక్షాలు అతని తమ్ముడు వరసైన వేల్పుల వెంకటేశ్వరరావుల మధ్య ఘర్షణ జరిగింది. దీనిని పురస్కరించుకొని 24న ఉదయం వేల్పుల వెంకటేశ్వరరావు కుమారులు గోపి, ఆజయ్కుమార్లతో పాటు అనిల్, చిన్నికృష్ణ, చిట్టిబాబులు రోకలిబండ, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. క్షతగాత్రుడిని ఖమ్మం ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహానికి ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో హత్యాయత్నం కేసును హత్య కేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గిరిబాబు తెలిపారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులు, యాత్రికులతో ఆదివారం తెల్లవారుజాము నుంచి రద్దీ కనిపించింది. ఉదయం 7 గంటల నుంచి అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మరో వైపున అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం జరిగిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. అంతరాలయ దర్శనం రద్దు చేయడంతో భక్తులు రూ.300 టికెట్లు కొనుగోలు చేసి బంగారు వాకిలి ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ డీఈవో కిశోర్కుమార్ పర్యవేక్షణలో ఏఈవోలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్బాబులు క్యూలైన్లను పర్యవేక్షించారు. మహా నివేదన అనంతరం రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత రూ. 500 టికెట్లను తిరిగి విక్రయించారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయమే ఆలయానికి చేరుకున్న భక్తులు సైతం మధ్యాహ్నం వరకు వేచి ఉండి, అంతరాలయ దర్శనం చేసుకోవడం విశేషం. -
గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఏపీ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గ్రంథాలయాల సందర్శన యాత్ర జరిగింది. తొలుత ఈ బస్సు యాత్రను సివిల్ కోర్టుల సమీపంలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయం వద్ద కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఏపీ రచయితల సంఘం ఇటువంటి యాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు. వీబీఎఫ్ఎస్ కాన్ఫరెన్స్ హాల్లో రచయితల సంఘం ఉపాధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ అమరావతిలో అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ నిర్మాణ పనులకు జూలైలో శంకుస్థాపన చేయబోతున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.వి.పూర్ణ చంద్, సాహితీ వేత్తలు గుమ్మా సాంబశివరావు, వేముల హజరత్తయ్య గుప్తా, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మయ్య తదితరులు ప్రసంగించారు. యాత్ర ఉద్దేశాలను రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ సభకు వివరించారు. ఈ సందర్భంగా చెన్నాప్రగడ శర్మ రచించిన కవిత్వం కురిసింది కవితా సంకలనం, ఎం.ఎన్.వి. ప్రసాద్ రచించిన ఆవకాయ్ శతకం, ఎస్.ఆర్. పృథ్వి రచన ఆరుద్ర సప్తతి ఉత్సవం పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం బస్సుల్లో కవులు, రచయితలు బయలు దేరి నగరంలోని ఠాగూర్ గ్రంథాలయం, రామ్మోహన్ లైబ్రరీ, హనుమంతరాయ గ్రంథాలయం, సర్వోత్తమ గ్రంథాలయాలను సందర్శించి వాటి విశిష్టతలను, అక్కడ పుస్తకాలను పరిశీలించారు. సంఘం తరఫున ప్రభుత్వ ఉగాది పురస్కార విజేత దుర్గాప్రసాద్ను సత్కరించారు. సంఘ ప్రతినిధులు నానా, సోమేపల్లి వశిష్ట, శర్మ సీహెచ్, రాజశేఖర్, పుష్పాదేవి, లక్ష్మీ సుజాత, సుధారాణి తదితరులు పర్యవేక్షించారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ జట్ల ఎంపికలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని గాంధీనగర్లో సర్ విజ్జి మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్లో సబ్ జూనియర్, జూనియర్ విభాగాల జిల్లా స్థాయి పోటీలు ఆదివారం జరిగాయి. జూలై 18, 19 తేదీల్లో విశాఖ పట్నంలో జరగనున్న 11వ సబ్ జూనియర్, జూనియర్ అంతర్ జిల్లా స్విమ్మింగ్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడానికి క్రీడాకారులను ఎంపిక చేశామని ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఐ.రమేష్ చెప్పారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులను అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కొంగర రవికాంత్, స్విమ్మింగ్ పూల్ ఇన్చార్జ్ నవీన్, కోచ్లు ఎం.మాల్యాద్రి, లక్ష్మణ్, ఎస్కే.రఫీ, ఆర్.గౌతమ్ అభినందించారు. ఎంపికై న క్రీడాకారులు వీరే సబ్ జూనియర్స్ గ్రూప్–1 విభాగంలో జి.జితేంద్ర, కె.శక్తిధర్, ఎం.ఎల్.గీతిక, ఎన్.పవన్సరయు, పి.అభిషేక్సాయి, గ్రూప్–2లో పృధ్వీరాజ్, డి.రామస్వామి, కె.ప్రభుసాత్విక్, వడ్లమూడి లిపి, ఎం.యజ్ఞసాయి, మహమ్మద్ ముజ్ఫర్, పి.అభిరామ్, పి.రమ్యశ్రీ, సానా శ్యామ్నాథ్ జూనియర్ గ్రూప్–3లో ఎ.హేమంత్రాజ్, జి.అక్షయ, బి.నాగ లక్ష్మీ కృతిక, జి.అక్షయ, జి.జతిన్, కె.రఘు వెంకట సత్యప్రకాష్, కె.వినయ్, ఎం.చిత్ర, ఎం.జీసశ్రీ, ఎం.సుజీత, ఎన్.పర్ణిక, ఎన్టీ నారీష్, పి.వెంకట అర్జున్, గ్రూప్–4 విభాగంలో డి.మను కార్తీక్, ఈ.గగన్, కె.లోహిత్సాయి, కరణం సుమేధ, ఇ.గగన్ తేజ్, కె.సింధూర, ఎం.చేతన్ సాయిశ్రీ, ఎం.హర్షిత, ఎం.రామ్మణికంఠ, పి.భార్గవ్ సాయి, ఆర్.హర్షిత, రీషాన్ రాజన్, ఎస్టీ.అక్షిత్, ఎస్.యశస్విని దీపిక, సానా అక్షిత్, వి.భావన శివగామి, యానా జైన్ ఎంపికయ్యారని తెలియజేశారు. -
పతాక స్తూప వార్షికోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ
పామర్రు: మొవ్వ మండల పరిధిలో నాట్య క్షేత్రమైన కూచిపూడి గ్రామంలో ఈ ఏడాది డిసెంబర్ 25 నుంచి 27వ తేదీ వరకు జరిగే అంతర్జాతీయ కూచిపూడి నాట్య పతాక స్తూప వార్షిక మహోత్సవాల వాల్పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. గ్రామంలోని శ్రీబాలా త్రిపుర సందరీ సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ వేదాంతం వెంకట నాగ చలపతి మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో గీత పాఠం–నాట్య వేదం, బృంద నాట్యం నిర్వహిస్తామన్నారు. గతేడాది యునెస్కో భగవద్గీత, నాట్య శాస్త్ర గ్రంథాలను, పురాతన గ్రంథాలుగా గుర్తించి వాటి ప్రాముఖ్యతను వెల్లడి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహణ.. డిసెంబర్ 25, 26 తేదీల్లో ప్రదర్శన పూర్వక ప్రసంగాలు ఉంటాయన్నారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలలో ఉన్న 18 శ్లోకాలను నాట్య శాస్త్రంలోకి తీసుకుని గీతాపారాయణం – నాట్య వేదం పేరిట బృంద నాట్యాన్ని డిసెంబర్ 27న నిర్వహిస్తామని తెలిపారు. వేడుకల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కళాకారులు పాల్గొంటారన్నారు. తొలుత నాట్యాచార్యుల ఇలవేల్పు అయిన శ్రీ బాలా త్రిపుర సందరీ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ వేదాంతం కిరణ్, నాట్యాచార్యులు డాక్టర్ యేలేశ్వరపు శ్రీనివాసులు, యేలేశ్వరపు వెంకటేశ్వర్లు, వెంపటి సత్య ప్రసాద్, రమణి, ఇందిరా పరాశరం, గ్రామస్తులు ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు, యేలేశ్వరపు వెంకటేశ్వర ఫణికుమార్, మహంకాళి జ్ఞాన వెంకట సాయి ఫణికుమార్ పాల్గొన్నారు. -
సురభి నాటక వైభవం
విజయవాడ కల్చరల్: ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, ఏపీ సృజనాత్మక సమితి ఆధ్వర్యాన దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో ప్రదర్శిస్తున్న సురభి నాటకోత్సవాలు నయన మనోహరంగా సాగుతున్నాయి. వినాయక నాట్యమండలి (సురభి సంస్థ) వారు ఆదివారం భక్తప్రహ్లాద నాటకాన్ని ప్రదర్శించారు. దర్శకుడు సురభి ఆర్.వేణుగోపాల్. వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి మహారుషులు వస్తారు. వారిని ద్వారంలో ఉన్న జయవిజయులు అడ్డుకుంటారు. రుషులు వారిని రాక్షసులవుతారని శపిస్తారు. హిరణ్యకశిపుడు హరి ద్వేషం, ప్రహ్లాదుని హరి భక్తి అంశాలుగా నాటకం సాగుతుంది. హిరణ్యకశిపుడిగా దినకర్, నారదునిగా పరిమళ, ఇంద్రునిగా శుభకర, ప్రహ్లాదునిగా నైమిక శాయి, లీలావతిగా శాంతిలు నటించారు. నాటకంలో ప్రధాన ఘట్టాలను వైర్ వర్క్తో అద్భుతంగా ప్రదర్శించారు. సంప్రదాయం కాపాడుకోవాలి ముఖ్య అతిథి ఎన్టీఆర్జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ 140 సంవత్సరాల చరిత్రకలిగిన ప్రాచీన సురభి నాటక సంప్రదాయాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సంప్రదాయ కళ ఉందన్నారు. కొండపల్లి బొమ్మలు, కూచిపూడి నాట్యం, సాహిత్యం మన జిల్లా సొత్తు అన్నారు. సురభి కళాకారులను అభినందించారు. పౌరాణిక నాటకాలతో కనువిందు భక్త ప్రహ్లాద నాటకంలో ఓ సన్నివేశంహిరణ్యకశిపుడి సంహార ఘట్టం -
ఆపేవాడెవడు.. రైట్ రైట్!
కంకిపాడు: మమ్మల్ని ఆపేదెవరు అనుకుంటూ అధిక లోడుతో ఇసుక, కంకర లారీలు, ట్రాక్టర్లు రయ్మంటూ దూసుకుపోతున్నాయి. వాహన దారులు నిబంధనలను గాలికొదిలేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ వాహనాలు ప్రధాన రోడ్లపై యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నా అధికారులు ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తున్నారు. ప్రజలు మాత్రం ప్రమాదాల భయంతో ఆందోళన చెందుతున్నారు. రక్షణ చర్యలు సున్నా పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లోని గ్రామాలకు ఇసుక, కంకర లోడు వాహనాలు భారీగా వెళ్తున్నాయి. ప్రధానంగా కరకట్ట వెంట ఉన్న ఇసుక స్టాక్యార్డుల నుంచి నిత్యం వందల సంఖ్యలో హెవీ లోడు లారీలు, ట్రాక్టర్లులో ఇసుక తరలిస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల పరిమితికి మించి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. రవాణా సమయంలో ఇసుక గాల్లో లేచి వాహనచోదకులపై పడి గమ్యస్థానాలకు చేరే సమయంలో చిన్న చిన్న ప్రమాదాల బారిన పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఇసుక జారకుండా, గాలికి ఎగిరి వాహనదారుల కళ్లలో పడకుండా రక్షణ చర్యలు తీసు కోవాలి. కనీసం ఇసుక, కంకర వాహనాలను పూర్తిగా కమ్ముతూ పరదాలు కప్పటం లేదు. దీంతో సమస్య జఠిలమవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని క్వారీల నుంచి కంకర లోళ్లు ఈ ప్రాంతానికి వస్తున్నాయి. ఇవి కూడా పరిమితికి మించి లోడింగ్ చేయించుకుని రోడ్లపై సంచరిస్తున్నాయి. ఆందోళనలో ప్రజలు రోడ్లపై జారిపడుతున్న ఇసుక, కంకర, మట్టితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం ప్రమాదం అంచున జీవనం సాగుతుండటంతో భయంతో వణికిపోతున్నారు. రోడ్డు మార్జిన్లలో పేరుకుపోతున్న ఇసుక, వ్యర్థాలను శుభ్రం చేయడంలో స్థానిక సంస్థలు అలసత్వం ప్రదర్శిస్తుండటంతో ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్న దుస్థితి. స్పందన లేని అధికారులు పరిమితికి మించి రవాణా అవుతున్నా ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదు. గతంలో అడ్డగోలు రవాణాకు తనిఖీలతో బ్రేక్ పడేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. అధిక లోడుతో వెళ్లే వాహనాలను అడ్డుకోవడం, జరిమానాలు విధించడం జరగటం లేదు. ఫలితంగా అధిక లోడుతో వాహనాలను రోడ్లపై దర్జాగా నడిపించేస్తున్నారు. -
కార్తికేయుని ఆదాయం రూ.7.78 లక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.7,78,939 ఆదాయం సమకూరినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. స్వామివారికి సేవా టికెట్ల ద్వారా రూ.3,68,116, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,56,520, డొనేషన్ ద్వారా రూ.1,74,773, స్వామివారి దర్శనం టికెట్ల ద్వారా రూ.54,950 తదితర సేవా టికెట్ల ద్వారా మొత్తం రూ.7,78,939 ఆదాయం వచ్చినట్లు ఆలయ డీసీ వివరించారు. బస్సుల కోసం భక్తుల ఇక్కట్లు.. స్వామివారి దర్శనార్థం ఆదివారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయక స్వామివారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో సరైన ప్రయాణ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులుపడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు కూడా సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో బస్సు డోర్ల వద్ద వేలాడుతూ వృద్ధులు, మహిళలు ప్రమాదకరంగా ప్రయాణం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆది, మంగళవారాల్లో బస్సు సర్వీసులు పెంచాలని భక్తులు కోరుతున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం గన్నవరం: జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని పోరాటాలు సాగిస్తుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు తెలిపారు. స్థానిక రోటరీ ఆడిటోరియంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ వర్కంగ్ జర్నలిస్టు ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టు జర్నలిస్టు అసోసియేషన్(ఏపీబీజేఏ) జిల్లా కమిటీల మహాసభ నిర్వహించారు. వెంకట్రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీబీజేఎ రాష్ట్ర కన్వీనర్ వీసం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జర్నలిస్టులపై దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అమరావతి ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి చిగురుపాటి సతీష్బాబు కోరారు. తొలుత ఫెడరేషన్ జెండాను సీనియర్ పాత్రికేయుడు ఉడతా రామకృష్ణ ఎగురవేశారు. ఎంపీపీ అనగాని రవి, ఫెడరేషన్ నాయకులు వెలమా రామారావు, షేక్ ఖాజావలి, వల్లభనేని సురేష్, ఎంబీ నాథన్, ఎన్.శ్రీనివాసరావు, హలీమ్, ఎం.రామారావు, కళ్లం వెంకటేశ్వరరావు, కాట్రగడ్డ రామచంద్రజోషి పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా దొండపాటి ఉదయ్కుమార్, కార్యదర్శిగా జొన్నా రవిశంకర్, గౌరవ అధ్యక్షుడిగా ఉడతా రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా కె.శ్రీనివాస్, రవీంద్రనాథ్ ఠాగూర్, చిట్టిబాబు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా బి.రమేష్, పి.వేణుగోపాలస్వామి, కోటయ్య, ఇంద్రగంటి గోపికృష్ణ, కోశాధికారి అచ్యుతరావు, మరో ఏడుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నేషనల్ ఐస్ స్కేటింగ్ పోటీల్లో చైత్ర దీపికకు కాంస్యం మొగల్రాజపురం(విజయవాడతూర్పు): డెహ్రాడూన్లో జరుగుతున్న 21వ నేషనల్ ఐస్ స్కేటింగ్ చాంపియ న్షిప్ పోటీల్లో నగరానికి చెందిన క్రీడాకారిణి పెదిరెడ్ల చైత్రదీపిక ప్రతిభ చూపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ చాంపియన్ షిప్లో ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహించిన చైత్రదీపిక ఆదివారం జరిగిన ఐస్ ఫిగర్ స్కేటింగ్ కేటగిరీ–7 విభాగంలో ప్రతిభ చూపి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. జాతీయ స్థాయి ఐస్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు పతకం పొందడం ఇదే మొదటి సారి. ఆర్టిస్టిక్ స్కేటింగ్, ఐస్ స్కేటింగ్ విభాగాల్లో ఏకంగా 62 పతకాలను ఇప్పటి వరకు చైత్రదీపిక సాధించింది. చైత్రదీపికను నగరంలోని క్రీడాకారులు, క్రీడాభిమానులు అభినందించారు. -
వీడని మిస్టరీ!
● మాజీ సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ను విచారణ చేస్తున్న సిట్ బృందం ● క్రాంతికుమార్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్డెత్ కేసులో మిస్టరీ మాత్రం వీడటం లేదు. శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించిన ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు ఆయన అరెస్టు అయిన రోజే పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఏసీపీ మానస, సీఐ మురళీకృష్ణతో పాటు సిట్ పోలీసులు హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఇంటి వెళ్లి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. పరిసరాల్లో సీసీ పుటేజిని పరిశీలించారు. బెంగళూరు, హైదరాబాద్కు ప్రత్యేక బృందాలు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిల కోసం బెంగళూరు, హెదరాబాద్కు ప్రత్యేక బృందాలను పంపి గాలిస్తున్నారు. మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ను, ఓ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అతని నుంచి కీలక సమాచారాన్ని సిట్ పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. సిట్ బృందం సైతం మాజీ సీఐ నాగ రాజుతో పాటు, ఈ ముగ్గురే కేసులో భాగస్వామ్యమయ్యారు అనే రీతిలో ఆధారాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ నలుగురిపైనే కేసు పెట్టి, మిగతా సూత్రధారులను, పాత్రధారులను సురక్షితంగా తప్పించే విధంగా సిట్ దర్యాప్తు సాగుతోంది. సాంకేతిక ఆధారాల సేకరణపై.. శవాన్ని ఎలా మాయం చేశారనే డిక్లరేషన్ను ఈ నెల 29 తేదీ హైకోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోర్టుకు ఏ విధమైన నివేదిక సమర్పించాల్సి, అందుకోసం అవసరమైన సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించే దిశగా సిట్ ప్రయత్నిస్తోంది. మే 6వ తేదీ మార్కాపురం నుంచి విజయవాడకు తెచ్చినట్లు పోలీసులు స్పష్టత ఇచ్చారు. లాకప్లో ఉండగా ఓ ఎస్ఐ చూశారని, బాధితుడి తల్లి విజయలక్ష్మి మా అబ్బాయిని కొడుతుంటే కేకలు వినిపించాయని, రెండు కాళ్లు కట్టి పడేయటం చూశానని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిట్ బృందం సాయికృష్ణ లాకప్డెత్ అయ్యారని స్పష్టత ఇచ్చారు. మిస్టరీ వీడే దిశగా కొనసాగని సిట్ దర్యాప్తు శవాన్ని ఎలా మాయం చేశారు.. సాయికృష్ణను ఎందుకు తెచ్చారనే మిస్టరీ వీడే దిశగా మాత్రం సిట్ దర్యాప్తు సాగడం లేదు. తూతూ మంత్రంగా కంటి తుడుపు దర్యాప్తుతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తోంది. సాయికృష్ణ లాకప్డెత్ కేసులో మాజీ సీఐ సీఐ నాగరాజుతో పాటు, పలువురి ప్రభుత్వ, పోలీసు పెద్దల హస్తం ఉండటంతో, నాగరాజుకే పరిమితం చేసి, వీరిందని పక్కాప్రణాళికతో కరకట్ట ప్యాలెస్ కనుసన్నల్లో తప్పించే కుట్ర సాగుతుందనేది స్పష్టం అవుతోంది. క్రాంతికుమార్ కేసుపై దర్యాప్తు.. మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతికుమార్ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు దర్యాప్తు అధికారిగా ఏసీపీ సత్యానందంను నియమించారు. ఆయన శనివారం సాయంత్రం పేరుపోగు క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి. అతని తండ్రి, భార్య, కుటుంబసభ్యులను విచారణ చేశారు. ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్కు రావాలని క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావును కోరారు. దళిత సంఘాలు, న్యాయవాదుల సలహా తీసుకొని పోలీసు విచారణకు వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. క్రాంతికుమార్తో సన్నిహితంగా మెలిగిన, సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ను కూడా విచారణ చేసినట్లు సమాచారం. కరకట్ట ప్యాలెస్ కనుసన్నల్లో సాగుతున్న దర్యాప్తును, ఏకంగా పోలీసు బాసే పర్యవేక్షిస్తూ, కేసును నీరుగార్చే కుట్రకు తెరలేపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే మాజీ సీఐ నాగరాజుపై కేసు నమోదు అయిన వెంటనే ఆయన పారిపోకుండా సర్వెలెన్స్ పోలీసులను ఏర్పాటు చేశారు. అయితే కీలకంగా నాగరాజుకు సహకరించింది కానిస్టేబుల్స్ ఇద్దరే అని, వీరితో పాటు మరికొంత మంది పాత్ర ఉందని బాధితుడి తల్లి విజయలక్ష్మి, బంధువులు ఫిర్యాదు చేశారు. అయినా వీరిపై మాత్రం పోలీసులు నిఘా పెట్టలేదు. పోలీసుబాస్లే వీరిని బయటికి పంపించారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజాలు వెలుగులోకి రాకుండా వారి ఇద్దరిని పోలీసు పెద్దలే అజ్ఞాతంలోకి పంపి డ్రామా ఆడుతున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే, అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భావనతో, పోలీసు పెద్దలే ఈ డ్రామాకు తెరలేపారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకోవడం పెద్ద కష్టం కాకపోయినా, కేసును సాగదీసి, కాలయాపన చేసే విధంగా దర్యాప్తు సాగుతోంది. పోలీసు పెద్దలను తప్పించి, చిన్న చేపలకు గాలం వేసి పట్టుకొని మమ అని పించే రీతిలో సిట్ దర్యాప్తు చేస్తోందనే భావన పలువురిలో వ్యక్తం అవుతోంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
బంటుమిలి్ల: కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలంలోని అర్తమూరు పంచాయితీ శివారు శాంతినగర్ గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక యువకుడు మరణించాడు. పోలీసుల సమాచారం మేరకు.. పెడన పట్టణానికి చెందిన అబ్దుల్ అఫీజ్ (19) బంటుమిల్లిలో ఉద్యోగ విధులు పూర్తి చేసుకుని పెడన వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంతో గాయపడిన అఫీజును నేషనల్ హైవే అంబులెన్స్లో బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందు తూ అఫీజు మరణించాడు. బందరు నుంచి బంటుమిల్లి వైపు వస్తున్న కారు టైరు బరస్ట్ అయి అదుపు తప్పి ఎదురుగా అఫీజు బైక్ను కారు బలంగా ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అఫీజు చికిత్స పొందుతూ మరణించాడు. ఇదే ఘటనలో బాసినపాడు గ్రామానికి చెందిన మరో ద్విచక్ర వాహనదారుడు కట్టా నాగేశ్వరరావు కూడాఅదుపుతప్పి కింద పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్ఐ గణేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరణంలోనూ తీరని గోడు
ఊరు పొమ్మన్నా.. కాడి రమ్మనలేదు..!! కాటి రేవు నీటిపాలు.. కడసారి వీడ్కోలు పరాయిపాలు కృత్తివెన్ను: మనిషి బతికున్నప్పుడు పడిన కష్టాలు చాలవన్నట్టు, కన్నుమూశాక కూడా ఆత్మశాంతికి నోచుకోని దైన్యం అది. ‘ఊపిరి పోయింది.. ఊరు పొమ్మంది.. కానీ కాటి నేల మాత్రం రమ్మనలేదు.’ ఆధునిక సమాజంలో చంద్రమండలానికి వెళ్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆఖరి మజిలీలో గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు ఆరడుగుల నేల కరువైంది. కృత్తివెన్ను మండలంలోని పీతలావ గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఓ ఘటన చూస్తే ఎవరికై నా కన్నీళ్లు ఆగవు. సముద్రం పోటు.. వర్షం నీరు.. అంతిమయాత్రకు తీరని లోటు! పీతలావ గ్రామంలో దాదాపు 140 ఇళ్లు, సుమారు 500 మంది జనాభా నివసిస్తున్నారు. దశాబ్దాలుగా వీరికి సరైన శ్మశాన వాటిక లేదు. ఊరి చివర ఉన్న పర్రభూమినే వీరు శ్మశానంగా వాడుకుంటున్నారు. అయితే సముద్రపు పోటు వచ్చినప్పుడల్లా, వర్షాలు కురిసినప్పుడల్లా ఆ కాస్తా భూమి జలమయమైపోతుంది. తాజాగా శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతమంతా చెరువును తలపించింది. సరిగ్గా అదే సమయంలో గ్రామంలో ఒకరు మరణించారు. కడసారి చూపు చూసుకుని గుండెలవిసేలా ఏడుస్తున్న బంధువులకు, ఆ మృతదేహాన్ని ఎక్కడ దహనం చేయాలో పాలుపోలేదు. చుట్టూ చూస్తే నీరు.. కళ్లల్లో అంతకంటే ఎక్కువ కన్నీరు. పరాయి ఊరిలో ప్రయాసల మధ్య... ‘మా ఊరి నేల మా వాడిని సాగనంపడానికి చోటివ్వలేదు. బతికుండగా ఎలాగో అష్టకష్టాలు పడ్డాడు, పోయాక కూడా ఈ నరకమా?’ అంటూ మృతుడి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. చేసేదేమీ లేక, పక్కనే ఉన్న కృత్తివెన్ను గ్రామస్తులను వారి కాటి రేవులో దహన సంస్కారాలు చేసుకోవడానికి అనుమతి కోరారు. ఆఖరికి, కన్నవారి చేతుల మీదుగా సాగాల్సిన అంతిమ సంస్కారాలు, పరాయి ఊరి శ్మశానంలో, అపరిచిత నేలపై అశ్రునయనాల మధ్య పూర్తి చేయాల్సి వచ్చింది. మృతదేహాన్ని మోసుకుంటూ వేరే గ్రామానికి తరలిస్తున్న ఆ దృశ్యం స్థానికులను తీవ్రంగా చలింపజేసింది. పాలకులారా.. మా గోడు వినపడదా? ‘ఈ సమస్య ఈ రోజుది కాదు. పాలకులకు, అధికారులకు, స్థానిక శాసనసభ్యులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినే నాథుడే కరువయ్యాడు’ అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు, కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పే అధికారులు.. చనిపోయిన వారికి దక్కాల్సిన కనీస గౌరవాన్ని కూడా కల్పించలేకపోవడం శోచనీయం. ఇప్పటికై నా పాలకులు కళ్లు తెరవాలి. పీతలావ గ్రామస్తుల దశాబ్దాల గోడును ఆలకించి, భవిష్యత్తులో ఇలాంటి కన్నీటి గాథలు పునరావృతం కాకుండా తక్షణమే శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. -
సమగ్ర ఓటరు జాబితాకు సర్ కసరత్తు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా కసరత్తు జరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడ తూర్పు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాల్లో శనివారం కలెక్టర్ లక్ష్మీశ విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల్లో సర్ ఇంటింటి సర్వే పకడ్బందీగా జరుగుతోందన్నారు. జిల్లాలో 14,99,852 (87.53 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని, 1,84,411 ఫారాల డిజిటలైజేషన్ పూర్తైందన్నారు. నియోజకవర్గాల వారీగా ఫారాల పంపిణీ తిరువూరులో 1,96,351 (94.08 శాతం), విజయవాడ పశ్చిమ 2,04,853 (79.72 శాతం), విజయవాడ సెంట్రల్ 2,30,320 (82.9 శాతం), విజయవాడ తూర్పు 2,27,376 (84.3 శాతం), మైలవరం 2,49,135 (87.36 శాతం), నందిగామ 1,94,997 (93.98 శాతం), జగ్గయ్యపేట 1,96,820 (94.83 శాతం) మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వివరించారు. కలెక్టర్ వెంట విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను ఇతర అధికారులు ఉన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నిత్యాన్నదానం నిమిత్తం ఒక రోజు అయ్యే రూ. 6 లక్షల వ్యయం మొత్తాన్ని ఓ భక్తుడు శనివారం అందజేశారు. అమరావతి సాఫ్ట్వేర్ ఇన్పోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ అనిల్కుమార్ చింత కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ ఈవో శీనానాయక్ను కలిసి అన్నదానం నిమిత్తం రూ. 6 లక్షల విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మరో భక్తుడి విరాళం రూ. లక్ష హైదరాబాద్ ప్రగతినగర్కు చెందిన చిన్మయి సాయి కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. -
400 సెల్ఫోన్లు రికవరీ
కోనేరుసెంటర్: గడిచిన మూడు నెలలుగా జిల్లాలో జరిగిన చోరీలతో పాటు వివిధ కారణాలతో పోగొట్టుకున్న దాదాపు 400 సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వాటిని శనివారం బాధితులకు అప్పగించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లాలో బందరు, అవనిగడ్డ, గుడివాడ, పెనమలూరు, గన్నవరం సబ్ డివిజన్ల పరిఽధిలో గడిచిన మూడు నెలలుగా వందలాది సెల్ఫోన్లు అపహరణకు గురి కావటంతో పాటు మరికొందరు వివిధ కారణాలతో పోగొట్టుకోవటం జరిగిందన్నారు. బాఽధితులు ఈ ఘటనలపై జిల్లా వ్యాప్తంగా సంబంధిత పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారన్నారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (ిసీఈఐఆర్) పోర్టల్ ద్వారా వాటిని రికవరీ చేసేందుకు జిల్లాలో సీసీఎస్ సిబ్బందిని ప్రత్యేక టీంగా నియమించినట్లు చెప్పారు. ఆ టీం ద్వారా గడిచిన మూడు నెలలుగా సుమారు 60 లక్షల ఖరీదు చేసే 400 సెల్ఫోన్లను ఐఎంఈఐ వివరాలను విశ్లేషించి ఐటీ కోర్ టీంను సమన్వయం చేసుకోవటం ద్వారా రికవరీ చేసినట్టు చెప్పారు. మచిలీపట్నం సిసిఎస్ సిబ్బంది 100, పెనమలూరు సిబ్బంది 63, గుడివాడ సిబ్బంది 237 సెల్ఫోన్లను రికవరీ చేసి ప్రతిభను కనబరచటం జరిగిందన్నారు. ఈ ఆపరేషన్ను సమర్ధవంతంగా నిర్వర్తించిన సిసిఎస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పలువురికి తన చేతుల మీదుగా మొబైల్స్ను అందజేశారు. ప్రజలు సెల్ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే వెంటనే సమీపంలోని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయటంతో పాటు ిసీఈఐఆర్ పోర్టల్లో కూడా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, బందరు, పెనమలూరు, గుడివాడ సీసీఎస్ సీఐలు కేవీఎస్వీ ప్రసాద్, గోవిందరాజు, రమణమ్మ, ఆయా స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు. -
సబ్జైలును సందర్శించిన జిల్లా జడ్జి
గన్నవరం: స్థానిక సబ్జైలును శనివారం జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.గోపి సందర్శించారు. సబ్జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలను న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.వరలక్ష్మితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి గోపి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సబ్జైలును సందర్శించినట్లు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా సబ్ జైలులో ఖైదీలకు వసతులను కల్పించడంతో పాటు అవసరమైన వైద్య సేవలందించాలని తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.గాయత్రి, జైలు సూపరింటెండెంట్ బి.రాంబాబు, జైలు విజిటింగ్ లాయర్ ఎల్.భగీరథి, పలువురు కోర్టు, జైలు సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్లో ఖాళీగా ఉన్న జేపీఏ (జూనియర్ ప్లాంట్ అటెండెంట్) పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్ 129 రాష్ట్ర అధ్యక్షుడు మోదుగు మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు చీఫ్ ఇంజినీర్ శివరామాంజనేయులను శనివారం యూనియన్ నాయకులతో కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనరేటింగ్ విభాగంలో జేపీఏ ఉద్యోగులు ఎంతో కీలకమన్నారు. కిందిస్థాయి జేపీఏ పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయన్నారు. ప్లాంట్లోని కీలక విభాగాల్లో ఇప్పటికే ఉద్యోగులు కొరత ఉందని, దీంతో ఉన్న ఉద్యోగులపై పని భారం పెరుగుతుందని సీఈకి వివరించారు. ఇతర విభాగాల్లో ఖాళీ ఏర్పడిన నెలలో పోస్టును భర్తీ చేస్తున్నారని, జేపీఏ పోస్టుల భర్తీలో కూడా అలాంటి చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షుడు ఎస్కే సలీం, కోశాధికారి బి.ప్రవీణ్ కుమార్, కాంట్రాక్ట్ కార్మిక యూనియన్ నాయకులు ఎస్కే వలి ఒ.శీను, టి.తంబికుమార్ పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ఆన్లైన్లో కొనసాగుతోంది. ఈ ప్రక్రియను ఏపీ సాంకేతిక విద్యాశాఖ మొదటి సారిగా ఈ ఏడాది నుంచి ఆన్లైన్లో చేపట్టింది. దీని కోసం నగరంలో మూడు హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించిన వెంటనే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైనట్లుగా ఆన్లైన్లోనే సందేశం వస్తోంది. అలా రాని వారు మాత్రమే పాలిసెట్ కౌన్సెలింగ్ హెల్ప్లైన్ సెంటర్కు స్వయంగా వచ్చి వారి సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలి. నగరంలోని రమేష్ ఆస్ప రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాల, గుణదలలోని ఆంధ్రా లయోల కాలేజీ, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ఆవరణలో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇది పూర్తయిన వారికి మాత్రమే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ల ఎంపికకు అర్హత ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన వారు ఈ నెల 29 నుంచి జూలై 3 తేదీ లోపు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారఽథి చెప్పారు. జూలై 4వ తేదీ.. నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లకు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని, 6న సీట్ల కేటాయింపును ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. జూలె 7 నుంచి 10వ తేదీలోగా సీటు కేటాయించిన కళాశాలకు అభ్యర్థులు స్వయంగా వెళ్లి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆయన తెలియజేశారు. -
అదుపుతప్పి మిర్చి లోడు లారీ బోల్తా
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి మిర్చి లోడు లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంతో రోడ్డు దాటుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కొండపల్లి శ్రామికనగర్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం వైపు నుంచి ఇబ్రహీంపట్నం వస్తున్న మిర్చి లోడు లారీ రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయింది. ఈక్రమంలో అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంతో రోడ్డు దాటే వ్యక్తికి కూడా గాయలయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ ఎస్ఐ శివరామకృష్ణ, ఎస్ఐ చక్రధర్ మున్సిపాల్టీ సిబ్బంది సాయంతో మిర్చి బస్తాలను రోడ్డు పక్కకు చేర్పించారు. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు. లారీని క్రేన్ల ద్వారా పక్కకు తొలగించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రుధిర తర్పణం..!
మచిలీపట్నంటౌన్: నగరంలోని చారిత్రక కోనేరుసెంటర్ శుక్రవారం ముస్లింలు భక్తి భావంతో చిందించిన రక్తంతో తడిసి ముద్దయింది. మొహర్రం దుఃఖ దినాల సందర్భంగా కోనేరు సెంటర్లో ముస్లింలు రక్త తర్పణం చేశారు. ప్రవక్త మహమ్మద్ మనవడైన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ఆయన అనుచరులు కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో వారు చేసిన సర్వోన్నత త్యాగాలను స్మరిస్తూ.. మచిలీపట్నంలో ముస్లింలు మొహర్రం దుఃఖ దినాల్లో భాగంగా 11వ రోజును భక్తిశ్రద్ధలతో, శోకతప్త హృదయాలతో రక్త తర్పణ నిర్వహించారు. ఇమామ్ హుస్సేన్ అమరత్వానికి ప్రతీకగా షియా సమాజ ముస్లింలు నల్లటి వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. వారి కుటుంబీకులు ఓ వైపు రుధిర తర్పణ చేస్తుంటే మహిళలు, చిన్నారులు సైతం శోక గీతాలకు అనుగుణంగా మాతం చేస్తూ భక్తిని చాటు కున్నారు. మసీదుల్లో, కోనేరు సెంటర్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలే కాకుండా పలు రాజకీయ పార్టీల నేతలు ఇతర మతాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లింలకు నేతలు, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, నిమ్మరసం, తాగునీరు పంపిణీ చేసి మతసామరస్యాన్ని చాటారు. అలీనఖీపాలెంలో పమడిముక్కల: మొహర్రం సందర్బంగా అలీనఖీపాలెంలోని రెండు మసీదుల్లో వేర్వేరుగా షియా ముస్లింలు చెస్ట్బీటింగ్ చేశారు. రక్తం చిందించి కర్బలా అమర అమరవీరులకు నివాళుల ర్పించారు. తొలుత గ్రామంలో పీర్లను ఊరేగించి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరంకిలాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు.మొహర్రం సందర్భంగా ముస్లింల చెస్ట్ బీటింగ్ -
క్వారీల దుమ్ము.. రైతుకు కన్నీరు!
దొనకొండ క్వారీల సమీపంలో బీడుగా మారుతున్న పొలాలు కంచికచర్ల: క్వారీల నుంచి వచ్చే దుమ్ము, ధూళి రైతుకు కన్నీరు తెప్పిస్తోంది. కంచికచర్ల సమీపంలో జాతీయ రహదారి పక్కన దొనబండ రాతి క్వారీలు, క్రషర్ల నుంచి వెలువడే దుమ్ము ధూళి కారణంగా రెండు పంటలు పండే పంట పొలాలన్నీ బీడు భూములుగా మారుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు సమయంలో సాగర్ కాల్వను పూడ్చటంతో పంటలకు మూలపాడు మేజర్ కెనాల్ ద్వారా సాగునీరు అందక ఎండుతున్నాయి. తమ పొలాలను అమ్ముకుని ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేద్దామనుకుంటే క్రషర్ యజమానులు వాటిని విక్రయించవద్దని బెదిరిస్తున్నారు. తమ కుటుంబాలను ఏ విధంగా సాకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 83 రాతి క్వారీలు.. 22 క్రషర్లు కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ సమీపంలో 801 సర్వే నంబర్లో 83కు పైగా రాతి క్వారీలు, 22 క్రషర్లు ఉన్నాయి. వీటి సమీపంలో సుమారు 450 ఎకరాలు రెండు పంటలు పండే పంట భూములున్నాయి. వీటిలో రైతులు సాగు చేద్దామన్నా భూములు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. నిత్యం వందల సంఖ్యలో లారీలకు భారీగా లోడింగ్ చేసి కంకర, మట్టి, పెద్ద పెద్ద కంకరను తరలిస్తున్నారు. దీంతో పంట పొలాల్లోకి కాలుష్యం నిరంతరం వెదజల్లుతోంది. బ్లాస్టింగ్ ద్వారా పొలాల్లోకి వస్తున్న బండరాళ్లు రాతి క్వారీలో నాణ్యతలేని నాసిరకం పేలుడు పదార్థాలను బ్లాస్టింగ్ సమయంలో వాడటంతో అవి పెద్ద పెద్ద శబ్దంతో పేలుళ్లు వినిపిస్తున్నాయి. అనుభవం లేని కార్మికులతో నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ బండరాళ్లన్నీ పొలాల్లోకి వచ్చి పడుతున్నాయి. అదే సమయంలో వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలకు తీవ్రగాయాలైన సంఘటనలు ఉన్నాయి. నాణ్యత, మన్నిక లేని నాసిరకం పేలుడు పదార్థాలు గాతాల్లో పెట్టి రాళ్లను పేల్చుతున్నారు. వాటి ధాటికి ఇంటి గోడలు పెచ్చులూడి పడుతున్నాయి. -
సరుకు రవాణాలో విజయవాడ డివిజన్ కీలకం
డీఆర్ఎం మోహిత్ సోనాకియారైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సరుకు రవాణా భాగస్వామ్యాలను బలోపేతం చేసే దిశగా సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ శుక్రవారం వ్యాపారవేత్తలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న డీఆర్ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ బలమైన పారిశ్రామిక భాగస్వామ్యాలను పెంపొందించడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, సరుకు రవాణా పరిధిని విస్తరించేందుకు ఈ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సౌత్కోస్ట్ రైల్వే వ్యాప్తంగా సరుకు రవాణాలో విజయవాడ డివిజన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. డివిజన్ వ్యాప్తంగా 24 ప్రైవేటు స్లైడింగ్లు, టెర్మినల్స్, 29 సరుకు రవాణా గూడ్స్ షెడ్ల విసృత నెట్వర్కు ద్వారా బొగ్గు, ఎరువులు, సిమెంట్, ఆహార ధాన్యాలు, ఇనుప ఖనిజం, అల్యూమినియం, పీఎల్ఓ, లాటరైట్ వంటి కీలక వస్తువులను రవాణా చేస్తుందన్నారు. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో డివిజన్ 40.64 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ. 4,136 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించినట్లు తెలిపారు. తద్వారా పారిశ్రామిక ఆర్ధిక వృద్ధికి తోడ్పడటానికి డివిజన్ కీలకంగా మారిందన్నారు. నూతన ఆవిష్కరణలు, బలమైన పభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా మాత్రమే నిరంతర సరుకు రవాణా వృద్ధిని సాధించగలమని తెలిపారు. సరుకు రవాణా మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైల్వేలకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ వినీత్కుమార్, సీసీఎం డి.సత్యనారాయణ, సరుకు రవాణా వినియోగదారులు పాల్గొన్నారు. -
భూములను క్రషర్ల యజమానులకే ఇవ్వాలని బెదిరింపులు.
తమ పంట పొలాలను తక్కువ ధరకు ఇవ్వాలని లేకపోతే ఇతరులకు ఎవ్వరికీ విక్రయించినా ఊరుకునేది లేదని క్వారీల కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని రైతులు అంటున్నారు. పాలకుల అండతో వీరు చెలరేగిపోతున్నారని వాపోతున్నారు. రాజధానికి అతి సమీపంలో ఉన్న తమ పొలాలు బయట మార్కెట్లో ఎకరం భూమి రూ. 2.20 కోట్ల వరకు కొనుగోలు జరుగుతున్నాయని, క్వారీ నిర్వాహకులు కేవలం ఎకరం భూమిని రూ.60 లక్షలకే ఇవ్వాలని బెదిరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ భూముల్లో దుమ్ము ధూళి రాకుండా చర్యలు తీసుకోవాలని పరిటాల, నక్కలంపేట, దొన బండ రైతులు అధికారులను కోరుతున్నారు. -
శృతిభారతి వేద పాఠశాల ప్రారంభం
తాడేపల్లి(ఘంటసాల): ఘంటసాల మండలం తాడేపల్లిలోని శ్రీమలయాళ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన శృతిభారతి వేద పాఠశాలను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఏర్పేడుకు చెందిన శ్రీవ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి, తిరుపతికి చెందిన జాతీయ సంస్కృత విశ్వ విద్యాయలం కులపతి ఆచార్య గుళ్లపల్లి శ్రీరామకృష్ణమూర్తిలతో కలసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ కేరళ నుంచి వచ్చిన మలయాళ స్వామి ఈ ప్రాంతంలో భక్తి, ధ్యానం, సేవే ధ్యేయాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలుగు కవి, సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగశాస్త్రి, ఎన్నారై మూల్పూరి ఫౌండేషన్ అధినేతలు మూల్పూరి వెంకటరావు – సావిత్రి దంపతులు, అధ్యాత్మిక గురువు శ్రీవిజ్ఞాన స్వరూప్, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగు సహస్రావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 5న కృష్ణవేణి కవితోత్సవం మధురానగర్(విజయవాడసెంట్రల్): తెలుగు భాషా సాహిత్యాల ఔన్నత్యాన్ని పెంపొందింపజేయాలనే సంకల్పంతో జూలై 5వ తేదీన సవ్యసాచి గ్రూప్ ఆఫ్ ఇండియా, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త నిర్వహణలో 169వ అఖిల భారత ద్విశతాధిక కవి సమ్మేళనాన్ని ‘కృష్ణవేణి కవితోత్సవం’ పేరుతో నిర్వహించనున్నట్లు శ్రీశ్రీ కళావేదిక ఎన్టీఆర్ జిల్లా గౌరవాధ్యక్షుడు, నిర్వహణ కమిటీ కన్వీనర్ డాక్టర్ కేఆర్జీ శేషుకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రిజిస్టర్ అయిన వారిలో ఎంపిక చేసిన సుమారు 250 మంది తెలుగు కవులు ద్విశతాధిక కవిసమ్మేళనంలో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో తెలుగు భాషా సాహిత్యాలకు సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ప్రముఖులను ‘అక్షర రత్న’ పురస్కారాలతో ఘనంగా సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు. యాప్తో ఎరువుల విక్రయంలో ఇబ్బందులు మచిలీపట్నంటౌన్: రైతులకు యాప్ ద్వారా ఎరువుల విక్రయాలకు వ్యతిరేకంగా రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే), సచివాలయాలు, మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. మచిలీపట్నంలోని జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏపీ రైతు, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.శివనాగేంద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ రైతు సంఘం సీనియర్ నేత వై.కేశవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తీసుకు వచ్చిన యాప్ ద్వారా ఎరువుల కొనుగోలు విధానంతో రైతులు, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ మాట్లాడుతూ యాప్ విధానంతో క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సంఘం ఆధ్వర్యాన ఈనెల 30న విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, జగన్, పి.జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు డాక్టర్ పూర్ణచందుకు నాగ భైరవ సాహిత్య పురస్కారం
విజయవాడ కల్చరల్: శతాధిక గ్రంథకర్త, కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందు 2026 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మకమైన నాగభైరవ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగే సభలో ఆయనకు పురస్కారం ప్రదానం చేయనున్నారు. డాక్టర్ పూర్ణచందు మినీ కవితను ఉద్యమంలో ప్రజలలోకి తీసుకొని వెళ్లారు. ఆయన 120 పైగా వైద్య, సాహిత్య సంబంధించిన గ్రంథాలను రచించి ప్రచురించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం వ్యవస్థ్ధాపకుడిగా ఐదు సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను విజయవంతంగా నిర్వహించారు. తెలుగు భాష కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. సాహిత్య సవ్యసాచి అటు సాహిత్య గ్రంథాలతోపాటు ఆయుర్వేద గ్రంథాలను ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది, కళారత్న పురస్కాలతో సత్కరించింది. జీవీ పూర్ణచందు పురస్కారం అందుకుంటున్న సందర్భాన్ని పురస్కారించుకొని అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధప్రసాద్, సాహితీవేత్తలు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ గుమ్మాసాంబశివరావు, చలపాక ప్రకాష్లు అభినందించారు. -
అక్రమార్జన కోసం దిగజారుడు రాజకీయాలు
పెనమలూరు: స్వార్థ రాజకీయాలు, అక్రమార్జన కోసం ఎమ్మెల్యే బోడెప్రసాద్ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని, వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి విమర్శించారు. దీనికోసం కార్యకర్తలను బలి చేస్తున్నాడని, తాను దీనిని సమర్థవంతంగా అడ్డుకుంటానని చెప్పారు. కానూరులో పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రసాద్ అక్రమార్జన కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే మాయలో పడి కేసులు పెట్టించుకోవద్దని హితవు చెప్పారు. తాము టీడీపీ కార్యకర్తలతో గొడవలు పడటానికి ఇష్టపడనన్నారు. అయితే ఎమ్మెల్యే మాటలు విని ఎవరైన దాడులకు దిగితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. అభివృద్ధి పనుల్లో భారీ అవినీతి.. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను తాను అడ్డుకుంటున్నాననే అక్కసుతో అమాయక కార్యకర్తలతో కలిసి దాడులకు దిగుతున్నాడని చక్రవర్తి విమర్శించారు. అవినీతి, దందాలపై తాము ప్రశ్నిస్తే ఎమ్మెల్యే నుంచి జవాబులేదన్నారు. కానూరులో జరిగిన అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. టెండర్లు, టెక్నికల్ సాంక్షన్, పరిపాలన మంజూరు లేకుండానే అక్రమార్జన కోసం పనులు చేశారన్నారు. ఇలా చట్ట విరుద్ధంగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే తాను అభివృద్ధిని అడ్డుకుంటున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఖండించారు. ఎటువంటి పరిపాలన, సాంకేతిక ఆమోదం లేకుండా అభివృద్ధి పనులు చేయవచ్చని ఇంజినీరింగ్ శాఖ అధికారులతో ప్రకటన చేయిస్తే తాను రాజకీయాలు విరమించుకుంటానని సవాల్ విసిరారు. పాస్పోర్టు ఉంటేనే ప్రయాణం చేయాలా..? తాను విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి పై ప్రయాణం చేయాలంటే పాస్పోర్టుతో ఎమ్మెల్యే ప్రసాద్ అనుమతి తీసుకోవాలా అని చక్రవర్తి ప్రశ్నించారు. పోలీసు వాహనంపై అల్లరి మూకలు దాడులు చేస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కానూరులో టీడీపీ దిమ్మను తాను ధ్వంసం చేయమని చెప్పానని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాడిగడప వద్ద వైఎస్సార్ విగ్రహం ఎలా తొలగించారని ప్రశ్నించారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని సమయం వచ్చినప్పుడు సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నేతలు వేమూరి బాలకృష్ణ, ప్రతివాడ రాఘవరావు, సిద్దిక్, మండూరు కోటేశ్వరరావు, నందిపాటి బిందుమాధవి, కాసాని ఫణి, తోకల ఉమాదేవి పలువురు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు..
స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోల బరువున్న పిల్లవాడు 3 కిలోలకు మించి బరువు మోయడం మంచిది కాదు. రెండు భుజాలపై వేసుకునే బ్యాగ్ మాత్రమే ఉపయోగించాలి. బ్యాగ్ రెండు పట్టీలను సమానంగా బిగించి వీపుకు దగ్గరగా ఉంచాలి. బరువైన పుస్తకాలను బ్యాగ్లో వీపుకు దగ్గరగా అమర్చాలి. అవసరం లేని పుస్తకాలు, వస్తువులు రోజూ బ్యాగ్లో పెట్టకుండా పాఠశాలల్లో లాకర్ లేదా తరగతి గదిలో ఉంచే సదుపాయం ఉంటే ఉపయోగించాలి. పిల్లలు రోజూ కనీసం గంటసేపు ఆరుబయట ఆటలు, శారీరక వ్యాయామం చేయాలి. పిల్లలు తరచుగా వెన్నునొప్పి, మెడనొప్పి లేదా భుజాల నొప్పి గురించి చెబితే త ల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించాలి. -
మేత కరువై.. పాడి బరువై
పచ్చిక మైదానాలు గత జ్ఞాపకాలే రోజురోజుకూ తగ్గుతున్న పశుసంపద పాల ఉత్పత్తిపైనా ప్రభావం –జన్యావుల వెంకన్న, పాడిరైతు, గాంధీనగరంపల్లెటూరి జీవన విధానంలో పంటలతో పాటు పాడిపరిశ్రమ కూడా ఒక భాగం. రైతుకు ఒక కన్ను వ్యవసాయమైతే రెండో కన్ను పాడిపరిశ్రమ. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచే పాడి పరిశ్రమ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోతోంది. పశువులకు కడుపునిండా మేత దొరకని పరిస్థితి ఎదురవుతోంది. వాటిని సాకలేక పోషణ భారమై పాడి రైతులు వారి జీవనాధారమైన మూగజీవాలను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. –పిన్నెంటి పూర్ణచంద్రరావు, పాలసొసైటీ అధ్యక్షులు, గాంధీనగరం -
29న దుర్గమ్మ సన్నిధిలో గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఈ నెల 29వ తేదీన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. ప్రత్యేక పూలవాహనంపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు, దేవస్థాన ప్రచార రథంపై మూర్తులతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఘాట్రోడ్డు వద్ద ఆలయ అర్చకులు, ఈవోలు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపు ప్రారంభిస్తారు. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రహ్మణ వీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణలో భక్తులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొననున్నారు. 4న ట్రస్ట్ బోర్డు సమావేశం... శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం జూలై 4వ తేదీన బ్రహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో ఆషాఢ సారె ఉత్సవాలు, శాకంబరీ ఉత్సవాలు, తెలంగాణ బోనాల నేపధ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. -
కనకదుర్గ వారధిపై ఇంజిన్ ఆయిల్ లీక్
కృష్ణలంక(విజయవాడతూర్పు): కనకదుర్గ వారధిపై శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి విజయవాడ వస్తున్న గుర్తు తెలియని వాహనం నుంచి ఇంజిన్ ఆయిల్ లీకై ప్రమాదకరంగా మారింది. ఆయిల్ మీదుగా ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తుండడంతో టైర్లు స్క్రిడ్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు నెమ్మదిగా వెళ్తుండడంతో వారధిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఐదో ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లీకై న ఆయిల్పై ఇసుక చల్లారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. హోం మంత్రి అనిత భవానీపురం (విజయవాడ పశ్చిమ): దేశాభివృద్ధికి యువశక్తే పెట్టుబడి అని, అటువంటి యువత డ్రగ్స్ బారినపడి నిర్వీర్యమైపోవడం బాధాకరమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నేటి తరం పిల్లలు ఎంతో చురుగ్గా ఉన్నా అవగాహన లోపంతో డ్రగ్స్ బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్ రవాణా చేసినా, దగ్గర ఉంచుకున్నా, వినియోగించినా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి, ఈగల్ వింగ్ ఎస్పీ నగేష్ కుమార్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ సంస్థ రాష్ట్ర సమన్వయ అధికారి ఉమారాణి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ ఎల్ దినకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యతో పాటు సంస్కారం, నైతిక విలువలు అలవర్చుకోవాలి ఆత్కూరు(గన్నవరం): చదువుతో పాటు మంచి సంస్కారం, నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి వంటి లక్షణాలను ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో వృత్తి విద్య కోర్సులో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆయన శుక్రవారం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...విద్య ఉద్యోగానికే కాకుండా సమాజ వికాసానికి దోహదపడేదిగా ఉండాలని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే బాధ్యతను విద్యార్థులు గుర్తుంచుకోవాలని తెలిపారు. వృత్తి విద్య యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేలా ఆత్మవిశ్వాస్వాన్ని పెంపొందిస్తుందన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న వృత్తి విద్య కోర్సులను యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ట్రస్ట్ ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
● పిల్లల బరువులో బ్యాగు బరువు 10 శాతానికి మించరాదంటున్న వైద్య నిపుణులు
● బుడిబుడి అడుగుల వయసులోనే వీపున బండెడు పుస్తకాల భారం మోస్తున్న బుడతలు లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన సిద్దు ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల తరచూ వెన్నునొప్పి అని చెప్పి స్కూల్కు డుమ్మా కొడుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పిల్లవాడు బడి ఎగ్గొట్టి ఇంటి వద్ద ఆడుకోవటానికి వంక చెబుతున్నాడని భావించారు. రోజూ ఇదే సమస్య చెబుతుండటంతో ఇటీవల వైద్యుడ్ని సంప్రదించారు. పరీక్షించిన అనంతరం వెన్నెముకకు ఇబ్బంది ఏర్పడటమే నొప్పికి కారణమని నిర్ధారించారు. స్కూల్లో, ఇంట్లో ఏసీ గదుల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ శరీరానికి ఎండ తగలక విటమిన్ డి లోపం ఏర్పడి ఇలాంటి సమస్యలు వస్తున్నట్టు తేల్చారు. సిద్దులాగే విద్యార్థులు తన శరీర బరువు కంటే అధిక మొత్తంలో బ్యాగ్ బరువు మోస్తూ ఉండటం.. వెన్నెముకపై అధికభారం పడటం వల్ల పిల్లల్లో ఈ సమస్యలు వస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. గదుల్లోనే మగ్గుతున్న బాల్యం.. ఆడుతూ పాడుతూ సరదాగా సాగాల్సిన బాల్యం పోటీ ప్రపంచంలో పుస్తకాల మోత బరువుతో పాఠశాల గదుల్లోనే మగ్గిపోతోంది. పలక బలపం పట్టుకుని బడికెళ్లే బాల్యం నేడు మచ్చుకై నా కనిపించటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కాన్వెంట్ స్కూల్స్పై మోజు పెరిగిపోయి బుడిబుడి అడుగులు వేసే బుడతలకు బండెడు పుస్తకాలు మూటగట్టి వీపున వేస్తున్నారు. నర్సరీ ఎల్కేజీ చదువుతున్న చిన్నారులకే డ్రాయింగ్ బుక్స్, హోంవర్క్ పుస్తకాలు, ఇతర పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు 20 నుంచి 30 వరకు పుస్తకాలు ఇస్తున్నారు. ఫలితంగా చిన్న వయస్సులోనే పిల్లలు వెన్ను సమస్యల బారిన పడుతున్నారు. లేత వెన్నుపై అధిక భారం మోపటం వల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో వచ్చే సమస్యలు ఇవే.. స్కూల్కు వెళ్లే పిల్లలు ఎక్కువ సేపు స్కూల్స్ బ్యాగ్స్ మోయటం, ఎక్కువ సేపు ఒకే భంగిమలో స్కూల్స్లో, ట్యూషన్ సెంటర్స్లో కూర్చోవటం వల్ల నడుము నొప్పి వస్తుంది. కొంత మంది పిల్లల్లో పుట్టుకతోనే ఎముకలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవటం వల్ల స్పయిన్ ఫ్యూజన్ వంటి సమస్యలొస్తాయి. స్కోలియోసిస్ వచ్చిన వారిలో వెన్నుముక సీ లేదా ఎస్ ఆకారంలో ఒకవైపు వంగి ఉంటుంది. ఫలితంగా భుజాలు లేదా నడుం భాగం అసమానంగా ఉంటుంది. కై ఫోసిస్ వల్ల పిల్లలు ముందుకు గుండ్రంగా వంగి కూర్చునట్లు కనిపిస్తారు. వెన్నునొప్పి లక్షణాలు.. నడకలో తేడా కనిపిస్తుంది. నిలబడటంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. త్వరగా పిల్లలు అలసిపోతారు. నడుము లేదా మెడనొప్పి ఉంటుంది. వెన్నెముక భాగం వంకరగా కనిపిస్తుంది. వెనుక భాగంలో అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిపాటి లేదా విపరీతమైన నొప్పి వెన్ను భాగంలో వస్తుంది. రాత్రి వేళల్లో నొప్పి వల్ల పిల్లలు సరిగా నిద్రపోరు. జ్వరంగా ఉంటుంది. ఆటలు ఆడేందుకు సైతం ఇబ్బంది పడతారు. -
ఒకే సమస్యపై ఏడాదిగా 30 అర్జీలు
కోడూరు: దివిసీమలోని తీరప్రాంత రైతులను వేధిస్తున్న ఒకే సమస్యపై ఏడాదిలో 30 అర్జీలు ఇచ్చినా పరిష్కారం కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మండలంలోని ఇరాలి గ్రామ సమీపంలో రత్నకోడు (తాలేరు) మేజరు డ్రెయిన్లో నుంచి న్యూ ఇరాలి డ్రెయిన్లోకి ఆక్వా సాగుదారులు వేసిన అక్రమ తూముల ద్వారా ఉప్పునీరు చేరడంతో ఇరాలి, రామకృష్ణాపురం, కోడూరు గ్రామాల పరిధిలోని సుమారు 1,500 ఎకరాల వ్యవసాయ భూములు ముంపుబారిన పడి పంట రైతుల చేతులకొచ్చే పరిస్థితి లేదు. అక్రమ తూములను తొలగించాలని బాధిత రైతులు ఏడాదిగా జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో 20 అర్జీలు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు ఎనిమిది అర్జీలు, కోడూరు తహసీల్దార్కు రెండు అర్జీలు చొప్పున అందించారు. ఒకే సమస్యపై రైతులు ఇప్పటి వరకు 30 అర్జీలు సమర్పించినప్పటికీ పరిష్కారం మాత్రం లభించలేదు. తాజాగా గురువారం కోడూరులో జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘం నేతలు ఇదే సమస్యపై మరోసారి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కు వినతిపత్రం అందించారు. దీనిపై డ్రెయినేజీ ఏఈ కీరం మాట్లాడుతూ సమస్యపై క్షేత్రస్థాయి పరిశీలనకు కలెక్టర్ ప్రత్యేక కమిటీని నియమించారని, ఈ నెల 29న ఉన్నతాధికారులు పరిశీలనకు వస్తారని చెప్పారు. -
దుఃఖ దినాలు.. భక్తితప్త హృదయాలు
నేడు మొహర్రం సందర్భంగా కోనేరు సెంటర్లో చెస్ట్ బీటింగ్ మచిలీపట్నంటౌన్: ముస్లింలు గత 10 రోజులుగా దుఃఖ దినాలను పాటిస్తున్నారు. సత్యం కోసం ప్రాణాలు అర్పించిన మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ ఆయన అనుచరులు 72 మంది వీరమరణం పొందడాన్ని స్మరించుకుంటూ ముఖ్యంగా షియా ముస్లింలు ఈ దుఃఖ దినాలను పాటిస్తున్నారు. సత్యం, న్యాయం, మానవత్వ పరిరక్షణ కోసం ఇమామ్ హుస్సేన్ ఆధ్వర్యంలో అధర్మ పాలకుడు ఎజిత్తో పవిత్ర యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో వారు వీరమరణం పొందడంతో ముస్లింలు వారిని స్మరించుకుంటూ ఈ దుఃఖ దినాలను పాటిస్తున్నారు. 11వ రోజు అయిన శుక్రవారం మొహర్రం సందర్భంగా నగరంలోని వందలాది మంది ముస్లింలు స్థానిక కోనేరు సెంటర్కు చేరుకుని రుధిర తర్పణం(చెస్ట్ బీటింగ్) చేయనున్నారు. దుఃఖ దినాల్లో ఇలా.. దుఃఖ దినాల్లో భాగంగా 3, 5, 7, 9 రోజుల్లో ముస్లింలు వారి ప్రాంతాల్లోని పంజాల వద్ద నిప్పుల గుండాలను తొక్కారు. మూడో రోజు నుంచి పీర్లను ఊరేగించారు. స్థానిక ఇనుగుదురుపేటలోని వంకాయల పంజాలో తొమ్మిదో రోజు అయిన బుధవారం రాత్రి బీరకాయకు తిరగలిని, సొరకాయకు 10 కిలోల బరువు ఉన్న రాయిని, వంకాయకు నీటితో ఉన్న చెంబును వేలాడదీశారు. దీనిని తిలకించేందుకు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నగరంలోని సెంటర్ డివైడర్ల లోని వీధి దీపాల స్తంభాలకు, కోనేరు సెంటర్ చుట్టూ నల్లజెండాలను అలంకరించారు. పదో రోజైన గురువారం స్థానిక ఇనుకుదురుపేటలోని భారీ ఇమాం పంజా వద్ద పీర్లను బయటకు తీశారు. వైఎస్సార్ సీపీ నియోజవర్గ ఇన్చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ షేక్ అచ్చాబా, మాజీ కార్పొరేటర్ మీరు అస్గర్ అలీ, మాజీ కౌన్సిలర్ శీలం బాబ్జీ, నగర ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ సాహెబ్ హాజరయ్యారు. -
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా వారికి నియామకపత్రాలను గురువారం ఆయన చాంబర్లో అందజేశారు. ఎన్సీసీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా గూడవల్లి గోపీకిరణ్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా సాంఘిక సంక్షేమశాఖలో కత్తుల ఆదర్శ్ను, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో జూనియర్ అసిస్టెంట్గా రేమల్లె రాజశేఖర్ను, రెవెన్యూ విభాగంలో ఆఫీస్ సబార్డినేట్గా తూము ప్రమోద్ను నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కలెక్టరేట్ ఏవో ఏఎస్ఎన్ రాధిక, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు అడ్మిషన్ల కౌన్సెలింగ్లో భాగంగా పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది. పాలిసెట్ రాసిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈ ఏడాది నుంచి ఆన్లైన్లోనే పరిశీలించి ధ్రువీకరిస్తామని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారధి చెప్పారు. ఆన్లైన్లో ఫీజు చెల్లించిన వెంటనే ఆన్లైన్లోనే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయినట్లుగా మెసేజ్ వస్తుందని, ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కాని వారు మాత్రం హెల్ప్లైన్ సెంటర్కు స్వయంగా సర్టిఫికెట్లతో వచ్చి ధ్రువీకరించుకోవాలని చెప్పారు. హెల్ప్లైన్ సెంటర్ వెరిఫికేషన్ ఆఫీసర్ జీవీ ఈశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వ్యవసాయం, దాని అనుబంధ రంగాల రైతులకు సుస్థిర ఆదాయం లభించేలా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉద్యానపంటలు దిశగా వెళ్లడంతో పాటు పంటల మార్పిడిపై మండలాల వారీగా ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, తెలిపారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం–కిసాన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన, దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన తదితర కేంద్ర, రాష్ట్ర అనుసంధాన పథకాల అమలు తీరుపై సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలామృతం ప్లస్ పోస్టర్లను ఆవిష్కరించి.. బాలామృతం కిట్లను అందజేశారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, జెడ్పీ సీఈఓ జె. అరుణ, టాటా ట్రస్టుల జిల్లా ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన అంబటి జయవేంకట చలపతి, వెంకటలక్ష్మి దంపతులు రూ.5 లక్షల విరాళాన్ని గురువారం సమర్పించారు. ఈ మేరకు చెక్కును ఈవో నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల పేరు మీద అన్నదానం చేయాలని ఆమె కోరారు. -
శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026
పెడన: యూరియా కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. గత ఏడాది బారులు తీరి.. వేకువ జాము నుంచే క్యూ లైన్లలో నిలబడి వెళ్తే.. సాయంత్రం లేదా మరుసటి రోజున తెచ్చుకున్న పరిస్థితులను రైతన్నలు మరచిపోలేదు. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఖరీఫ్ సీజన్లో ముందుగానే మేల్కొని యూరియా బస్తాలను తెచ్చుకుని ఇంటి వద్ద పెట్టుకునేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆర్బీకే(రైతు సేవా కేంద్రాలు)ల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. ఒక పక్క అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశామని, ఎకరానికి 45 కిలోల బస్తా ఇచ్చామని చెబుతున్నా.. రైతులు క్యూ కడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉన్న వారికే ఇస్తామన్న వ్యవసాయశాఖ, ఆ తరువాత చాలా మంది వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని గుర్తించి ఓటీపీ చెబితే చాలు గ్రామ వ్యవసాయ సహాయకుల ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ ఇచ్చి రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తామని పేర్కొనడంతో రైతులు క్యూ కడుతున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత.. వ్యవసాయశాఖలో వీఏఏలు తక్కువగా ఉండటంతో వారికి అదనపు డ్యూటీలు పడుతున్నాయి. దీనికి తోడు యూరియా బుకింగ్తో మరింత ఒత్తిడికి గురవుతున్నారు. పెడనకు వీఏఏ లేకపోవడంతో మడక వీఏఏ సుభాష్ను ఇన్చార్జిగా నియమించారు. ఈయన మడక వెళ్లిన సమయంలో పెడనలో యూరియా కోసం ఇబ్బందులు పడకుండా ఉండానికి పెడన వద్ద కొంకేపూడి వీఏఏ నాగేశ్వరరావుకు బాధ్యతలను అప్పగిస్తున్నారు. మడకలో మూడు రోజులు, పెడనలో మూడు రోజులు విధులు నిర్వర్తించేలా సుభాష్కు బాధ్యతలను అప్పగించారు. మూడు రోజులు కొంకేపూడి వీఏఏ పెడనలో ఉండ టంతో కొంకేపూడి రైతులు సైతం యూరియా కోసం బుక్ చేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు పెడనకు వెళ్లిపోతున్నారు. పెడన వారు మడక గ్రామానికి వెళ్లి యూరియా కోసం లైనులో నిలబడితే మడక రైతులు పెడన వారికి ఇక్కడ రాయడానికి వీల్లేదని చెబుతుండటంతో వీఏఏలు రైతులకు సర్దిచెప్పి క్యూ లైన్ కట్టించి రాసి పంపిస్తున్నారు. నడుపూరు వీఏఏ మూడు రోజులు నడుపూరులోను, మరో మూడు రోజులు కూడూరు గ్రామంలో రైతులకు అందుబాటులో ఉంటూ యూరియా బుక్ చేస్తున్నారు. జిల్లాలోని ఇతర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయిదాటిపోకుండా.. పెడన, మడక గ్రామాలకు చెందిన రైతులకు యూరియా బుక్ చేసుకోవడానికి పెడన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోని పశు సంవర్ధకశాఖ, అగ్రి ల్యాబ్లో యూరియా బుకింగ్ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో మడక, పెడన ప్రాంతాలకు చెందిన రైతులు యూరియా కోసం మూకుమ్మడిగా ల్యాబ్కు చేరుకోవడంతో వారందరికీ కుర్చీలు వేసి కూర్చోబెట్టి ఒక్కొక్కరికీ రాసి, కార్డులు అందజేసి క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఆన్లైన్ ద్వారా రోజుకు 40 నుంచి 50 మంది రైతులకు మాత్రమే క్యూఆర్కోడ్ ఇస్తున్నారు. దీంతో మరింత జాప్యం అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం వీఏఏ వద్ద తమ వంతు ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తున్న రైతులుటీడీపీ నేతల వీరంగం నాడుయూరియా అందుబాటులో ఉంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా కార్డు కూడా ఇస్తూ క్యూఆర్ కోడ్ ద్వారా యూరియా అందజేస్తున్నాం. విత్తనాలు వేయకుండానే రైతులు యూరియా కోసం వచ్చేస్తున్నారు. విత్తనాలు వేసి మొలకలు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించాం. మండలంలోని 11 సొసైటీలలోను, మన గ్రోమోర్ ద్వారా 385 టన్నులు యూరియా సిద్ధంగా ఉంది. మరో వంద టన్నుల కోసం ప్రతిపాదనలు పంపించాం. క్యూఆర్ కోడ్ తీసుకున్న చాలా మంది రైతులు తరువాత తీసుకుంటామని వెళ్లిపోతున్నారు. ఈ క్యూ ఆర్ కోడ్ రెండు రోజులకు మించి ఉండదనే విషయాన్ని రైతులు గమనించాలి. – సజ్జా జెన్నీ, ఏవో, పెడన -
టీడీపీ కనుసన్నల్లోనే ‘సర్’
● అధికారపక్షానికి అండగా బీఎల్ఓలు ● ప్రతి సమాచారం టీడీపీకి చేరవేత ● సర్ను హైజాక్ చేస్తున్న టీడీపీ నేతలు కంకిపాడు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమం ప్రహసనంగా సాగుతోంది. కార్యక్రమాన్ని పూర్తిగా టీడీపీ హైజాక్ చేస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లోనే సర్ జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన బీఎల్ఓలు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. టీడీపీ బీఎల్ఏనే కాకుండా ఆ పార్టీ నేతలు అధిక సంఖ్యలో ఓటరు వద్దకు వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తూ అంతా తామే నడిపిస్తున్నట్లు ఓటర్లను ప్రభావితం చేసే యత్నం చేస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమైంది. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గం వ్యాప్తంగా పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో సర్ ప్రక్రియ సాగుతోంది. అధికార పక్షంతో అంటకాగుతూ.. సర్ ప్రక్రియ నిర్వహణలో నియోజకవర్గంలోని అత్యధిక శాతం మంది బీఎల్ఓలు అధికార పక్షంతో అంటకాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేతకు అన్ని రాజకీయ పక్షాలతో బీఎల్ఓలు వెళ్లాల్సి ఉంది. కానీ బీఎల్ఓలు కొందరు మొక్కుబడిగా ఇతర పక్షాలకు సమాచారం అందించి, టీడీపీకి చెందిన బీఎల్ఏలతో మాత్రం నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లిపోయి వారికి ఫారాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల సమాచారాన్ని కూడా టీడీపీ బీఎల్ఏల ద్వారానే సేకరిస్తున్నారు. అవసరమైతే వారి వద్ద ఉన్న ఓటర్ల జాబితాపై ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరించి టీడీపీ బీఎల్ఏలకు అప్పగిస్తూ నియోజకవర్గ ముఖ్యనేత దృష్టిలో పడేందుకు తెగ తాపత్రయ పడుతున్నట్లు సమాచారం. ఉత్సవ విగ్రహాలుగా బీఎల్ఓలు.. సర్ విషయంలో ప్రభుత్వం నియమించిన బీఎల్ఓలు ఉత్సవ విగ్రహాలుగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ పక్షాల బీఎల్ఏలతో కలిసి బీఎల్ఓ అధికారికంగా ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలి. కానీ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ సహా ఇతర పక్షాలకు మొక్కుబడిగా సమాచారం ఇవ్వటంతో అసలు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ ఎక్కడ జరుగుతుందో తెలీక ఆ పార్టీలకు చెందిన బీఎల్ఏలు హాజరు కాలేకపోతున్నారు. టీడీపీ విషయానికొస్తే బీఎల్ఏతో పాటుగా ఆ పార్టీకి చెందిన బూత్, యూనిట్, క్లస్టర్, ఇతర ముఖ్యనేతలు అందరూ హాజరయ్యేలా, ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందేలా చూస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఫారాలు అందజేతలో బీఎల్ఓలు ఓ మూలన నించుకుని ఉండగా, ఫారాలను ఓటర్లకు టీడీపీ నేతలే పంపిణీ చేసేస్తున్నారు. టీడీపీ హయాంలో ఓటర్ల సర్ నిర్వహిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీడీపీ శ్రేణులు యత్నిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. -
వాలీబాల్ పోటీల విజేత విజయవాడ
విజయనగరం: విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో విజయవాడ క్రీడాకారులు సత్తా చాటారు. వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ నేతృత్వంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ పురుషుల వాలీబాల్, అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోటీల్లో వాలీబాల్ పోటీల్లో విజయవాడ జట్టు విజేతగా నిలవగా.. ద్వితీయ, తృతీయ స్థానాలను విశాఖ, ఆతిధ్య విజయనగరం జట్లు చేజిక్కించుకున్నాయి. అథ్లెటిక్స్లో ఓవరాల్ చాంపియన్ షిప్ను విజయవాడ జట్టు దక్కించుకోగా.. రెండు, మూడుస్థానాల్లో తిరుపతి, విజయనగరం జట్లు నిలిచాయి. దాసన్నపేట విద్యుత్ భవనం ప్రాంగణంలో విజేతలకు ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి.సూర్యప్రకాష్, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.హరిబాబు, ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, పార్వతీపురం–మన్యం జిల్లా ఎస్ఈ పెద్దింటి త్రినాథరావులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టి.వి.సూర్యప్రకాష్, ఎస్.హరిబాబు మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడి జీవనం సాగించే విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఉపశమనం కలిగించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్నొన్నారు. కార్యక్రమంలో విజయనగరం డివిజన్ ఈఈ పి.హరి, ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడు వడివేలు, స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఫలితాలపై టీచర్లు శ్రద్ధ పెట్టాలి
● సమాజంలో మార్పు తెచ్చేందుకే విద్యాశాఖను ఎంచుకున్నా! ● విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొక్కిలిగడ్డ(మోపిదేవి): సజాజంలో మార్పు తెచ్చేందుకే తాను విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చి దేశంలోనే ఆదర్శవంతంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకురాలన్నది తన ధ్యేయమన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామంలో దాతల సహకారం రూ. 1.40 కోట్లతో నిర్మించిన పాఠశాల తన భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశామని, ఇక ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ద వహించాలని సూచించారు. ఈ పాఠశాలలో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ తప్ప అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. వెనకబడిన విద్యార్థుల పనితీరుని మెరుగుపర్చేందుకు బ్రిడ్జి కోర్సు మెటీరియల్ అందచేస్తామని, నూరు శాతం ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప నిచేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల చిత్రాలతో పత్రికల్లో యాడ్స్ ఇచ్చామని తెలిపారు. త్వరలో క్లిక్కర్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లీప్ యాప్ను విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని, తమ బిడ్డల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకోవాలని సూచించారు. సర్ ప్రక్రియ కారణంగా ఇంటింటికి ప్రచారం కార్యక్రమం జూలై 10కి వాయిదా వేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. జూలై మూడో వారంలో తల్లికి వందనం రెండో విడత నగదు జమచేయబోతున్నామని తెలిపారు. కృష్ణాజిల్లా ఇన్ఛార్జీ మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, సీఎంఓ కార్యక్రమాల సమన్వయకర్త, జోనల్ ఇన్ఛార్జీ సత్యనారాయణరావు, నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, జడ్పీటీసీ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
27న విజయవాడలో జాబ్ మేళా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు విజయవాడలో ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ‘జాబ్ మేళా’ జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువతీ, యువకులు జాబ్ మేళాకు అర్హులని పేర్కొన్నారు. మేళాలో ఎంపిక అయిన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ. 50వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వివరించారు. మరిన్ని వివరాలకు 9032633548, 9985759304 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ఎనిమిది మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. విజయవాడ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నెల 10 నుంచి 23 వరకూ నిర్వహించిన తనిఖీల్లో 101 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానాల్లో ప్రవేశ పెట్టగా, వారిలో ఒకరి మూడు రోజులు, మరో ఏడుగురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించిన ప్రభుత్వం, మరో 93 మందికి రూ.9.95 లక్షల జరిమానా విధించింది. మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దిగువ సన్నిధిలో వున్న లక్ష్మీ నరసింహస్వామి వారికి పవన్ కల్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్ కల్యాణ్ ఎగువ సన్నిధిలో వున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని, స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలను డెప్యూటీ సీఎంకు అందించారు. 5 కేజీల గంజాయి స్వాధీనం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ బృందం అరెస్ట్ చేసింది. వారి నుంచి 5 కేజీల గంజాయి, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మధ్య నిషేధ, అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ లావణ్య ఆదేశాలు మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం బుధవారం సితార సెంటర్లో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు యమహా ఎంటీ–15 బైక్పై గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారిని తనిఖీ చేయగా మూడు ప్యాకెట్లలో మొత్తం 5 కేజీల గంజాయి పట్టుబడింది. ఆ ఇద్దరు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన కుంచాల సూర్య తేజ, ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన కలపాల తేజలుగా గుర్తించారు. వీరికి ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దుకు చెందిన కార్తీ గంజాయి సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఎన్ఫోర్స్మెంట్ బృందం ఇరువురిని భవానీపురం ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు సరఫరా చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సూర్యతేజ, కలపాల తేజలను అరెస్ట్ చేసి వారి వద్ద 5 కేజీల గంజాయి, బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్ విఽధించినట్లు ఎకై ్సజ్ సీఐ టి.గోపాలకృష్ణ తెలిపారు. దుర్గమ్మకు హైదరాబాద్ వాసి రూ. లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన ఇందుకూరి హేమ శిరీషల పేరిట కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
యనమలకుదురు ఆలయ హుండీ ఆదాయం రూ.14,20,491
పెనమలూరు: యనమలకుదురులోని శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం హుండీ కానుకలను బుధవారం ఆలయ ప్రాంగణంలో అధికారుల సమక్షంలో లెక్కించారు. 125 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలు రూ 14,20,491 ఆదాయం వచ్చింది. బంగారం 6 గ్రాముల 330 మిల్లీ గ్రాములు, వెండి 910 గ్రాములు, యూఎస్ డాలర్లు 30, సౌత్ ఆఫ్రికన్ 100 ర్యాండ్ ఒక నోటు, థాయ్ల్యాండ్ 20 డాట్ రెండు నోట్లు, యూకే 5 పౌండ్ ఒక నోటు హుండీలో భక్తులు వేశారు. జిల్లా దేవాదాయ సహాయ కమిషనర్ లలిత, యనమలకుదురు కనకదుర్గ అమ్మవారి ఆలయ ఈవో యు.వీ.ప్రసాదరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి దాత సంగా నరసింహారావు, ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం, సేవా సభ్యులు, పలువురు పాల్గొన్నారు. -
పీఎండీఎస్తో పశుగ్రాస కొరతను నివారిద్దాం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): పశుగ్రాస కొరతను అధిగమించేందుకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానాన్ని అనుసరించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ బుధవారం పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి పీఎండీఎస్కు సంబంధించి అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎండీఎస్ విధానంలో వర్షాలు రాకముందు పొడి భూమిలో విత్తనాలు వేసి తక్కువ తేమను వినియోగించుకొని మొలకెత్తేలా చేయడమని.. ఈ విధానంలో భూమి ఖాళీగా ఉండదని, పచ్చదనం, జీవంతో నిండిన నేల రైతులకు క్రమంగా ఆదాయం వచ్చేలా చేస్తుందని వివరించారు. ఈ విధానం వల్ల తేమ నిల్వతో పాటు నేలసారం పెరుగుతుందని, రైతుకు అధిక ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. పశుగ్రాసాల సాగు, పాల ఉత్పత్తి పెరుగుదల, స్వల్పకాలిక మిశ్రమ పంటలు వల్ల చీడపీడల ప్రభావం తగ్గుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి.. ఎల్నినో ఇబ్బందులను అధిగమిద్దామని సూచించారు. రైతులు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పంటలపై అవగాహన పెంపొందించుకొని, పీఎండీఎస్ కోసం సరైన పంటలను ఎంపిక చేసుకోవాలని, తద్వారా అధిక ప్రయోజనాలు పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక అధికారి డా. ఎం.హనుమంతరావు, ఏడీ డా. సునంద, పశువైద్యులు డాక్టర్ మనోజ్, డాక్టర్ పంకజ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
ఎరువుల బుకింగ్లో ఇబ్బందులు పడొద్దు
పెడన: రైతులు తమ పంట పొలాలకు కావాల్సిన ఎరువులను స్మార్ట్ ఫోన్లు ద్వారా బుక్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖాధికారిణి జ్యోతిరమణి సూచించారు. స్మార్ట్ ఫోన్లు లేని రైతులు తమ ఇంట్లో ఎవరి ఫోన్ తెచ్చుకున్నా లేదా వీఏఏ ఫోన్ ద్వారా కూడా ఎరువులను బుక్ చేయొచ్చని చెప్పారు. బుధవారం మండల పరిధిలోని నందమూరు గ్రామంలోని రైతుసేవా కేంద్రంలో ఎరువుల బుకింగ్ యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం యాప్కు సంబంధించి కరపత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సందేహాలను వెలుబుచ్చడంతో ఆమె నివృత్తి చేశారు. ప్రస్తుతం మొదటి డోస్గా రైతుకు ఒక యూరియా కట్ట మాత్రమే అందజేస్తున్నామని, ఆ తరువాత మళ్లీ ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో మచిలీపట్నం ఏడీఏ ఎన్ రమాదేవి, పెడన ఏవో సజ్జాజెన్నీ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి జ్యోతిరమణి -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
జగ్గయ్యపేట అర్బన్: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీఐహెచ్), విజయవాడ సీఈవో జి.కృష్ణన్ అన్నారు. అంత ర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల వారోత్సవాలు–2026 లో భాగంగా బుధవారం ఆర్టీఐహెచ్, విజయవాడ, మెప్మా, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో మహిళా పారిశ్రామికవేత్తల సాధికార కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీఐహెచ్ సీఈవో కృష్ణన్ మాట్లాడుతూ ఎంటర్ప్రెన్యూర్ షిప్,ఈ–కామర్స్, జీఎస్టీ, ట్రేడ్మార్క్, బ్రాండింగ్, మార్కెట్ యాక్సెస్, వ్యాపార అభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 30 మందికి పైగా ఉద్యమ్ యాప్లో పేర్లు నమోదు చేసుకున్నారు.ఆర్టీఐహెచ్ సీఈవో జి.కృష్ణన్ -
ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఏపీ ఎన్జీవోతోనే సాధ్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఏపీ ఎన్జీవోతోనే సాధ్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.సత్యనారాయణరెడ్డి, పి.రమేష్ అన్నారు. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకోవడంలో నిరంతరం కృషి చేసిన ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ను జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు బుధవారం ఎన్జీవో హోమ్లో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు మేలు జరిగేలా ఉద్యోగ విరమణ వయసు పెంపు, పాత పెన్షన్ విధానం అమలుపై రాష్ట్ర కేబినెట్ మెమో–57 అమలు ద్వారా సుమారు 11 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు జీవితాంతం భరోసా లభిస్తుందన్నారు. ఈ మెమో రావడం వెనుక విద్యాసాగర్ కృషి ఎంతో ఉందన్నారు. మెమో–57 సమస్య అనేక సంవత్సరాలుగా వేలాది మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశమని, ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లభించడం ఆయన పట్టుదల, దూరదృష్టి, అంకితభావానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వేమూరి ప్రసాద్, బి. సతీష్ కుమార్, బీవీ రమణ, రామకృష్ణ, నగర కార్యవర్గ సభ్యులు బి.రాజశేఖర్, ఎస్కే నజీరుద్దీన్, శివశంకర్, కాశీం సాహెబ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.సత్యనారాయణ రెడ్డి, పి.రమేష్ -
26వారాలకే జన్మించిన కవల శిశువులు
62 రోజుల చికిత్సతో సాధారణ స్థితికి.. లబ్బీపేట(విజయవాడతూర్పు): గర్భం దాల్చిన 26 వారాలకే జన్మించిన కవల శిశువులకు 62 రోజుల చికిత్సతో సాధారణ స్థితికి తీసుకు వచ్చారు అక్కినేని ఆస్పత్రి వైద్యులు. ఈ సందర్భంగా డాక్టర్ బి.సౌమ్య వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన షణ్ముఖ దేవికి 26 వారాల గర్భధారణలోనే ఒక మగ, ఆడ శిశువులు జన్మించారు. పుట్టిన సమయంలో వారి బరువు మగ శిశువు 850 గ్రాములు, ఆడశిశువు 812 గ్రాములు మాత్రమే ఉన్నారు. పిడియాట్రిక్ నిపుణులు డాక్టర్ డి.నరేంద్రబాబు, డాక్టర్ ఎం.పురంజయ్ నియోనాటల్ యూనిట్లో 62 రోజుల పాటు ఆ కవల శిశువులకు చికిత్స అందించారు. దీంతో శిశువులు ఇద్దరు బరువు దాదాపు 2 కేజీలకు పెరగడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
నందివాడ: మండలంలోని రుద్రపాక గ్రామంలో ఉన్న పిన్నమనేని వీరయ్య చౌదరి స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు. గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తమ తండ్రి కొడాలి శ్రీరాములు జ్ఞాపకార్థం ఆయన కుమారులు కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి వీరయ్య, కొడాలి శేషగిరిరావు, కొడాలి వెంకట శ్రీనివాసరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఐదు లక్షలు, జూనియర్ కళాశాలకు ఐదు లక్షలు చొప్పున మొత్తం రూ.10 లక్షలను చెక్కు రూపంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పిన్నమనేని వీరయ్య చౌదరి, పిన్నమనేని పూర్ణ వీరయ్య (బాబ్జి), పాలడుగు నానారావ్, తమ్మారెడ్డి శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ పి. సాల్మన్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ సుబ్బారావు, గ్రామ ప్రముఖులు జాస్తి సాములు, శేషగిరి, నైనవరపు వెంకట కృష్ణ పాల్గొన్నారు. -
విపత్తు సామర్థ్యాల బలోపేతం
● పాలకాయతిప్పలో దక్షిణ ప్రాంత సంయుక్త విపత్తు నిర్వహణ విన్యాసం ● పర్యవేక్షించిన ఏపీఎస్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులు ● పాల్గొన్న ఆరు రాష్ట్రాల అధికారులు భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రాల మధ్య విపత్తు సంసిద్ధత, పరస్పర సమన్వయం, అత్యవసర ప్రతిస్పందన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీఎస్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం కృష్ణాజిల్లా కోడూరు మండలం పాల కాయతిప్ప గ్రామంలో అంతర్ రాష్ట్ర మాక్ ఎక్సర్ సైజ్–2026 జరిగింది. ఇందులో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విద్యుత్, మత్స్య, పశుసంవర్ధక, నీటిపారుదల, పంచా యతీరాజ్ శాఖలు పాల్గొన్నాయి. వరద పరిస్థితుల్లో నిర్వహించాల్సిన శోధన, రక్షణ చర్యలు, ప్రభావిత ప్రాంత ప్రజల తరలింపు, వైద్య సహాయం, సహాయక శిబిరాల నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థల సమన్వయం ఈ విన్యాసాలలో ప్రదర్శించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవిస్తున్న నేపథ్యంలో ఇటువంటి మాక్ ఎక్సర్సైజ్లు విపత్తు సంసిద్ధతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక విలువల వినియోగం, సమర్థమైన సమన్వయ వ్యవస్థలు, ముందస్తు సంసిద్ధత చర్యల ద్వారా ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉందని అధికారులు పున రుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఏపీఎస్పీ బెటాలియన్స్/ఏపీఎస్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. రాజకుమారి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్నకుమార్ సహకారంతో ఏపీఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మార్గదర్శకత్వంలో ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్)ఎన్.మధుసూదనరెడ్డి, డీఐజీపీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, డీఐజీపీ (ఏపీ ఎస్పీ బెటాలియన్స్) డి.ఉదయ్ భాస్కర్, ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రకర్జైన్, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, మచిలీపట్నం ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సమన్వయంతో దక్షిణ ప్రాంత సంయుక్త విపత్తు నిర్వహణ విన్యాసం విజయవంతంగా ముగిసింది. -
అంకితభావంతో విధులు నిర్వర్తించండి
● జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ● జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామకాలు చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను బుధవారం జెడ్పీ కార్యాలయంలో ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ హయాంలో ఎంతోమందికి నిబంధనల ప్రకారం ఉద్యోగోన్నతులు, మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశామన్నారు. నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా, నలుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా, ఒకరికి రికార్డు అసిస్టెంట్ నుంచి టైపిస్ట్గా ఉద్యోగోన్నతి కల్పించామన్నారు. వివిధ హోదాల్లో ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ వారసులను టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ నియామకపత్రాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జె.అరుణ, డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్రాంతి కేసుపై మౌనమేల..?
దళితులంటే చిన్నచూపేలలబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కేసును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారం రోజులుగా వివిధ సంఘాలు, పార్టీలు వారి కుటుంబాన్ని పరామర్శిస్తూ, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. దళితులంటే ప్రభుత్వానికి లెక్కలేనితనంగా ఉందంటూ దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 26న కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. దానిలో కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేకున్నానని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొనడమే కాకుండా, మాదిగగా పుట్టడమే నా తప్పంటూ మాట్లాడిన వైనంపై దళిత సంఘాల నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. క్రాంతికుమార్ స్వయంగా మరణవాంగ్మూలం ఇచ్చినా ప్రభుత్వం స్పందించక పోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎమ్మార్పీఎస్, కేవీపీఎస్తో పాటు, దళిత ఉద్యోగుల సంఘం, వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులు క్రాంతికుమార్ కుటుంబసభ్యులను పరామర్శించి వారికి తమ మద్దతు ప్రకటించారు. క్రాంతికుమార్ మరణంపై చంద్రబాబు స్పందించాలని మృతుని తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావుతో పాటు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి, ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రాంతికుమార్ కుటుంబానికి సాయం అందించాలని, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వమే చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక సీఐ కారణంగా దళితుడు మరణిస్తే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని, హోం మంత్రి దళితురాలై ఉండి కూడా ఇప్పటివరకూ నోరు విప్పకపోవడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. అనేక సామాజిక సమస్యలపై పోరాటం చేసిన నాయకుడికే న్యాయం జరగకుంటే, ఇంకెవరికి చేస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కాపు యువకుడు సాయికృష్ణ లాకప్డెత్ కేసుతో ప్రభుత్వానికి తలబొప్పి కట్టడంతో గత్యంతరం లేని పరిస్థితిలో సీఐ నాగరాజును అరెస్టు చేసి చేతులు దులిపేసుకుంది. అయితే ఇదే సీఐ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతికుమార్ కేసును మాత్రం పట్టించుకోవడం లేదు. దళితులంటే కూటమి ప్రభుత్వానికి మొదటి నుంచీ చిన్నచూపేనని, అందుకే క్రాంతికుమార్ కేసును పట్టించుకోవటం లేదని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్యపై పట్టించుకోని ప్రభుత్వం సీఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో ఆ సెల్ఫీ వీడియోను మరణ వాగ్మూలంగా పరిగణించరా? ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న దళిత సంఘాలు కార్యాచరణ నిమిత్తం ఈ నెల 26 సమావేశం సీబీఐ విచారణతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో కేసు కట్టాలని డిమాండ్ మృతుని కుటుంబానికి పరిహారం, భార్యకు ఉద్యోగం ఇవ్వాలంటున్న దళిత సంఘాలు -
ఎంఎస్ఎంఈల నిర్వహణలో సీఏల పాత్ర కీలకం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిర్వహించడం అంటే కేవలం అమ్మకాలు చేయడం మాత్రమే కాదని లెక్కలు, చట్టాలు ఉంటాయని వాటిని సక్రమంగా సకాలంలో నిర్వ హించే వారే చార్టర్డ్ అకౌంటెంట్స్ అని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయ వాడలోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) విజయవాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎమ్ఎస్ఎంఈ మహోత్సవ్–2026 కార్యక్రమం ఐసీఏఐ భవన్లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర చాలా కీలకమన్నారు. యువతకు ఉపాధి కల్పనలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం పరిశ్రమలు చాలా అవసరమని చెప్పారు. ఎంఎస్ఎంఈల స్థాపనకు సింగిల్ విండో విధానంలో అనుమతులు, సబ్సిడీలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, బ్యాంకుల నుంచి రుణాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ప్రతి యువకుడు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నారు. లోకల్ ఎంఎస్ఎంఈల నుంచి ఉత్పత్తి అయిన వస్తువులను ప్రజలు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. త్వరలో ఎంఎస్ఎంఈ శాఖతో ఒప్పందం ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ చైర్మన్ ఉప్పులూరి జయంత్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు తమ బ్రాంచ్ ఆధ్వర్యంలో యువతకు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. త్వరలో తమ బ్రాంచ్ ఎంఎస్ఎంఈ శాఖతో ఎంవోయూ కుదుర్చుకోనుందని చెప్పారు. ఐసీఏఐ సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ చైర్మన్ ఎం.సుబ్బారావు, ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ కార్యదర్శి వేముల వీరపవన్ కుమార్తో పాటుగా ఐసీఏఐ సభ్యులు, సీఏలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ను ఐసీఏఐ బ్రాంచ్ సభ్యులు సత్కరించారు. ఎంఎస్ఎంఈ మహోత్సవ్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -
అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
గన్నవరం: మండలంలోని దావాజిగూడెం, అల్లాపురం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత దావాజీగూడెం మోడల్ స్కూల్ ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి వసతులను పరిశీలించారు. అంగన్వాడీకి వచ్చే చిన్నారుల సంఖ్యను పెంచాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులు హాజరు, పౌష్టికాహారం పంపిణీ వివరాలను యాప్ ద్వారానే నిర్వహించాలని చెప్పారు. హాజరు పట్టికలు, రికార్డుల్లో రాయడం వంటి పాత పద్ధతులకు స్వస్తి పలకాలని ఆదేశించారు. అనంతరం చిన్నారులు ఎత్తు, బరువులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అల్లాపురం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్ టాయిలెట్స్, టీవీ, తాగునీటి సదుపాయలను పరిశీలించారు. కేంద్రం నిర్వహణపై ఐవీఆర్ఐ కాల్స్లో ప్రజలు ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తపరచడంపై విచారించారు. ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎన్ రాణి, గన్నవరం ప్రాజెక్ట్ సీడీపీఓ జి. మంగమ్మ పాల్గొన్నారు. -
వీధివీధినా ఎం‘చుక్క’.. వ్యాపారం
కోనేరుసెంటర్: కూటమి పాలనలో మద్యం సిండికేట్ రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కేస్తోంది. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటోంది. బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తూ ప్రజా ధనాన్ని దోపిడీ చేసేస్తోంది. నియోజకవర్గంలో ఓటర్లకు చుక్క నీరు దొరకని పరిస్థితి ఉందేమోగానీ.. మందు చుక్క దొరకని సందు లేదు అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ముఖ్యంగా బందరు మండలంలోని కొంత మంది మద్యం వ్యాపారుల అవినీతి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. వైన్ షాపుల్లోని మద్యాన్ని పల్లెలతో పాటు పట్టణంలోనూ ఏరులై పారిస్తున్నారు. వైన్షాపుల్లో నడిచే వ్యాపారం చాలదన్నట్టు పచ్చటి పల్లెల్లో బెల్టుషాపులు పెట్టించి మరీ దొడ్డిదారిన లిక్కర్ బాటిళ్లను సరఫరా చేస్తూ లక్షలకు లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ తతంగమంతా ఎకై ్సజ్శాఖకు తెలిసే నడుస్తున్నా పట్టించుకునే నాథుడు ఉండటంలేదని బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడు.. బందరు మండలంలో మద్యం వ్యాపారులు అంతా కుమ్మక్కయ్యారు. పార్టీలు ఏవైనా ఒకరికొకరు స్నేహంతో మెలుగుతున్నారు. సొమ్ము ఎవడికి చేదు అన్నట్టు బెల్టుషాపులకు మద్యాన్ని తరలించి అక్రమార్జనను తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు పంచుకుంటున్నారు. దీంతో అందరూ అధిక ధరలకు మద్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026ఎవరు పట్టుకున్నా ‘మేమున్నాం మీకేం కాదులే’ అంటూ కూటమి నాయకులు కల్పిస్తున్న ధైర్యంతో బందరు మండలంలో బెల్టుషాపు నిర్వాహకులకు ఎక్కడా లేని తెగింపు వచ్చేసింది. వీరికి తోడు సంబంధిత అధికారులు చూస్తూ చూడనట్లు నటిస్తుండటంతో బందరు నియోజకవర్గంలో బెల్టుషాపులు రోజురోజుకీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. 7ఇంద్రకీలాద్రి: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు మంగళవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి పి. నారాయణ ఆయన వెంట ఉన్నారు.గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రు మహాక్షేత్రం శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ 11వ వార్షికోత్సవాలు మంగళవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ‘అవునండీ అమ్ముకుంటాం.. ఏం అమ్ముకోకూడదా? ఇంకెవరూ అమ్ముకోవటంలేదా? మేమొక్కళ్లమే అమ్ముకుంటున్నామా? పోలీసులు పట్టుకుంటే పట్టుకోనివ్వండి.. నాలుగు రోజులు జైల్లో ఉండి వస్తాం.. మళ్లీ అమ్ముకుని బతుకుతాం’ ఇదీ మచిలీపట్నం కాలేఖాన్పేటకు చెందిన ఓ బెల్టుషాపు నిర్వాహకురాలి ధీమా! ‘లక్షల్లో అమ్ముకునే వాళ్లకు లేని సిగ్గు మాకెందుకండీ.. ఏ వాళ్లే అమ్ముకుని లక్షలకు లక్షలు పోగుజేసుకోవాలా? పోలీసులు వాళ్లను పట్టుకోరా?అమాయకులమైన మమ్మల్ని మాత్రమే పట్టుకుని కేసులు పెడతారా? అసలు వ్యాపారులు అమ్మకుండా మా దగ్గరకి వాళ్ల సరుకు ఎలా వస్తుంది? వాటిని మేమెలా అమ్ముకోగలుగుతామండీ?’ ఇదీ బందరు మండలం మేకవానిపాలెంకు చెందిన మరో బెల్టుషాపు నిర్వాహకుడి మాటలు.. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. ఎగువ నుంచి 400, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. -
15 నుంచి ఆషాఢ మాసోత్సవాలు
దుర్గమ్మకు తొలి సారె సమర్పించనున్న దుర్గగుడి ఈవో ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని మహా మండపం ఆరో అంతస్తులో ప్రతిష్టించనున్నారు. ఆషాఢ మాసంలో తొలి రోజైన 15వ తేదీ బుధవారం ఉదయం 8.30 గంటలకు దేవస్థానం తరఫున ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారికి మొదటి సారెను సమర్పించనున్నారు. నెల రోజుల పాటు సాగే మాసోత్సవాలలో భక్తులు, సేవా బృందాలు, భక్త బృందాలు, ఆలయ ట్రస్టీలు, దేవస్థానాల తరఫున అమ్మవారికి చీరలు, పూజా సామగ్రి, మిఠాయిలు, కాయలు, పండ్లు, పసుపు, కుంకుమను సారెగా సమర్పిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఆషాఢ మాసం చివరి రోజైన ఆగస్టు 12వ తేదీ బుధవారం దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారికి సారెను సమర్పిస్తారు. పక్కా ఏర్పాట్లు.. ఆషాఢ మాసోత్సవాలకు తోడు జూలై 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు, తెలంగాణ బోనాలను పురస్కరించుకొని నెల రోజుల పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఈవో శీనానాయక్ ఆలయానికి చెందిన కీలక విభాగాల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. -
నర్సాపూర్ నుంచి రెండు జతల రెగ్యులర్ సర్వీసులు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్ నుంచి తిరువణ్ణామలై, ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న రెండు జతల వారంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చడానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. నర్సాపూర్ – తిరువణ్ణామలై (17291) వారంతపు ఎక్స్ప్రెస్ జూలై ఒకటి నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సాపూర్లో బయలుదేరి, గురువారం తెల్లవారుజామున 4.55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17292) జూలై రెండు నుంచి ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు తిరువణ్ణామలైలో బయలుదేరి, శుక్రవారం మధ్యరాత్రి రెండు గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు పాలకొల్లు, విరసవరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగుతుంది. నర్సాపూర్ – ఎస్ఎంవీటీ బెంగళూరు (17293) జూలై మూడు నుంచి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్ లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17294) జూలై నాలుగు నుంచి ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు పాలకొల్లు, విరసవరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, బంగారుపేట్, కృష్ణార్జునపురం స్టేషనల్లో ఆగుతుంది. -
‘ఫీజు’ బకాయిలను విడుదల చేయాలని ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రూ. 10వేల కోట్లు పైచిలుకు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూతబడ్డ 4,500 పాఠశాలలను పునఃప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజు, దీపక్, యశ్వంత్, సాయి, దివ్య తదితరులు పాల్గొన్నారు. హనుమాన్జంక్షన్ రూరల్: నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఒకరి మరణానికి కారకుడైన వాహన చోదకుడు అంకం ప్రవీణ్ శ్రీనివాస్కు నూజివీడు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించినట్లు వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ సోమవారం తెలిపారు. వివరాలు ఇవి.. 2023 డిసెంబర్ 22వ తేదీన బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి హైవే మధ్యలో ఉన్న డివైడర్ను సైతం దాటుకుని అవతల వైపు రోడ్డు మీదకు వెళ్లింది. ఆ రోడ్డులో ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొనటంతో ఆ కారులో ప్రయాణిస్తున్న కేరళకు చెందిన లాజర్ పి.థామస్ (60) అనే వ్యక్తి దుర్మరణం చెందటంతో పాటుగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు గ్రామంలోని కాఫీ ఫ్యాక్టరీలో మిషనరీ పరిశీలించేందుకు కేరళ నుంచి వచ్చిన థామస్ తిరిగి వెళ్లేందుకు కారులో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరగా, ఈ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై అప్పటి వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవి కేసు నమోదు చేయటంతో పాటుగా విచారణ పూర్తి చేసి కోర్టుకు చార్జీషీట్ సమర్పించారు. ఈ కేసులో ఏపీపీ వి.ప్రసన్న వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితుడు అంకం ప్రవీణ్ శ్రీనివాస్కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్ నందు మామయ్య మోహనరావు ఇబ్రహీంపట్నం: యూట్యూబర్, సినీ నటి రమానందన (నందు) భర్త తండ్రి జాగర్లమూడి మోహనరావును ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం స్టేషన్లో విచారించారు. ఇప్పటికే నందు కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. తన వ్యక్తిగత లాయర్తో కలిసి మోహనరావు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫొటోలు, వీడియోలు తీయరాదని మీడియా ప్రతినిధులతో అతడి లాయర్ గొడవకు దిగారు. విచారణలో.. నందు దంపతులు ఎక్కడున్నారు? వారు చేసే వ్యాపారంలో మీ పాత్ర ఏమిటి? ఇప్పటి వరకు ఎంత మంది వీసాలు రెన్యూవల్ చేశారు? వీసాల రెన్యూవల్లో మీ కుటుంబంతో పాటు ఇంకా బయట వ్యక్తులు ఎవరెవరు ఉన్నారనే ప్రశ్నలు పోలీసులు వేసినట్లుసమాచారం. అసలేం జరిగిందంటే.. పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన బాధితుడు మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ తన యూకే వీసా రెన్యూవల్ చేయాలని గతంలో డెస్టినీ సంస్థను ఆశ్రయించగా, ఇండియాలో ఉన్న తమ సంస్థకు రూ.15 లక్షలు చెల్లించాలని వారు నమ్మబలికారు. రూ.15 లక్షలు తీసుకున్న తర్వాత ముఖం చాటేయడంతో అతను ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు నిందితులుగా ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన, మధుకర్ తండ్రి మోహనరావుపై కేసు నమోదు చేశారు. నందు దంపతులు అందుబాటులో లేకపోవడంతో మోహనరావును తీసుకువచ్చి విచారించిన అనంతరం పంపించేసినట్లు పోలీసులు తెలిపారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
జి.కొండూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మైలవరంలో సోమవారం రాత్రి పది గంటల సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల గ్రామానికి చెందిన తమండ్రు వేణు(25) తన బైక్పై మైలవరం నుంచి కుంటముక్కల వెళ్తుండగా మైలవరం మార్కెట్ యార్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన వేణు తలకి తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. క్షతగాత్రుడిని స్థానికులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుడు వేణు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
ప్రజలు, ఉద్యోగుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలు, ఉద్యోగుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రత అగర్వాల్, ఇన్చార్జ్ డీఆర్వో పి.పోతురాజు, అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో అమృతకృష్ణ పథకం ద్వారా గాజుల సీసాల మంచినీటి సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, కలెక్టరేట్లోని జిల్లా అధికారులు వారికి కావాల్సిన మంచినీటిని ఆ కేంద్రం నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. పనితీరు సరిగా లేని అధికారులను వచ్చే వారం నుంచి జిల్లా కేంద్రానికి పిలిపిస్తామన్నారు. యువత మత్తు పదార్థాల నుంచి బయటపడేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. జీవితం ఎంతో అమూల్యమైనదని, ఆశయంతో ముందుకు సాగాలని, ఆత్మహత్య పరిష్కారం కాకూడదని తెలియజేస్తూ మహిళా శిశు సంక్షేమశాఖ రూపొందించిన వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సహాయం కోసం 14416 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. మీకోసంలో ఉద్యోగుల నుంచి ఆరు అర్జీలు, ప్రజల నుంచి 147 అర్జీలను అధికారులు స్వీకరించారు. అర్జీల్లో కొన్ని -
గాలి హోరు.. వాన జోరు
కొడాలి ప్రధాన రహదారిపై కూలిన తాటిచెట్టు, విద్యుత్తు స్తంభం కొడాలి – శ్రీకాకుళం ప్రధాన రహదారి పై ఈదురు గాలులకు కూలిన వృక్షం ఘంటసాల: వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో ఘంటసాల మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయం కాగా చెట్లు, విద్యుత్ స్తంభాలు ప్రధాన రహదారులపై కూలిపోయాయి. ● ఘంటసాల ప్రధాన సెంటర్తో పాటు ఘంటసాల – అంబేడ్కర్, మల్లంపల్లి వెళ్లే రోడ్లు పూర్తి జలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● ఘంటసాల మండలం కొడాలి ప్రధాన రహదారిలో తాటిచెట్లు కూలి విద్యుత్ వైర్ల మీద పడటంలో స్తంభం కూడా కూలిపోయింది. ● కొడాలి – శ్రీకాకుళం ప్రధాన రహదారిలో కొడాలి రైస్ మిల్లు సమీపంలో, చినకళ్లేపల్లి వెళ్లే రోడ్డులో, గోగినేనిపాలెం వెళ్లే దారిలో భారీ వృక్షా లు కూలిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ నయీమ్ స్పందించి సిబ్బందితో కలసి చెట్లను తొలగించడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయి. ● ఘంటసాల మండలంలో తాడేపల్లి, కొడాలి, శ్రీకాకుళం శివారు సూరపనేనిపాలెం గ్రామాల్లో నాలుగు విద్యుత్తు స్తంభాలు పడిపోయినట్లు విద్యుత్తు శాఖ ఏఈ రవి కుమార్ వివరించారు. నేలవాలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, పలు రోడ్లు జలమయం -
అభివృద్ధి.. కనపడని చిత్తశుద్ధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గతంలో వరదలు సృష్టించిన బీభత్సం నుంచి విజయవాడ పూర్తిగా తేరుకోలేదు. అప్పుడే వర్షాకాలం వచ్చేసింది. అయితే బుడమేరు ఆధునికీకరణపై ప్రభుత్వంలో చిత్తశుద్ధి కొరవడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండ్లుపడిన చోట గతేడాది చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులే ఇప్పటికీ పూర్తి కాలేదు. వెలగలేరు వద్ద బుడమేరు హెడ్ రెగ్యులేటర్ పనులను మమ అనిపించి వదిలేశారు. అరకొరగా నిధులు బుడమేరు హెడ్రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర బుడమేరు డైవర్షన్ కెనాల్ ఉంది. బుడమేరు ఆధునికీకరణలో భాగంగా దీన్ని పూర్తిగా లైనింగ్ చేయాల్సి ఉంది. వరదలొచ్చిపోయిన 20 నెలల తర్వాత ఇప్పుడు 0 కిలోమీటరు నుంచి 8.3 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులకు ప్రభుత్వం రూ.121కోట్లను మాత్రమే కేటాయించింది. మరో 3.600 కిలోమీటర్ల కెనాల్ పనుల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి. నిధులను ఇటీవల విడుదల చేయడంతో కాంట్రాక్టర్ లైనింగ్ పనులను ఏప్రిల్ 18న మొదలు పెట్టారు. ఈ పనులకు కావాల్సిన వ్యవస్థను తరలించి పూర్తి స్థాయిలో చేపట్టేందుకు మరో నెల అంటే మే నెల సగంలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి. తొలకరి వానలు పడుతుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పునాది దశలోనే బ్యాలన్స్ రిటైనింగ్ వాల్ బుడమేరుకు 2024 ఆగష్టు 31న వచ్చిన వరదలకు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపున మూడు చోట్ల, కుడి వైపున ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపున పడిన గండ్ల వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల కోసం అంటూ 2025, మార్చి 21వ తేదీన రూ.39.77కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. ఇది ఇచ్చిన యాభై రోజుల తర్వాత మే 15న శంకుస్థాపన చేసి రూ.28కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం, రూ.1.80కోట్లతో రెగ్యులేటర్ మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. వీటిలో భాగంగా శాంతినగర్ వద్ద డైవర్షన్ కెనాల్ గండ్లు పడిన ప్రదేశంలో ఎడమవైపు నిర్మించే రిటైనింగ్ వాల్ 8.65 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పు 500 మీటర్ల పొడవునా, కుడి వైపు అంటే శాంతినగర్ వైపున ఇదే కొలతలతో యాభై మీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ను నిర్మించాల్సి ఉంది. పనులు జరుగుతున్న సమయంలో పట్టిసీమ నీటిని విడుదల చేయడంతో ఎడమవైపు 360మీటర్లు పొడవున మాత్రమే రిటైనింగ్ వాల్ని నిర్మించి జూన్ 9న పనులు ఆపేశారు. ఇంకా ఎడమ వైపున బ్యాలన్స్ ఉన్న 140 మీటర్లు పొడవు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రస్తుతం ప్రారంభమై పునాది దశలోనే ఉండగా కుడి వైపున యాభై మీటర్ల పొడవునా నిర్మించాల్సిన రిటైనింగ్ వాల్ పనులు ఇంకా ప్రారంభించలేదు. బుడమేరు డైవర్షన్ కెనాల్ లైనింగ్ పనులు చేయడానికి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద డైవర్షన్ కెనాల్ వైపు వరదనీరు వెళ్లకుండా ఉండేలా భారీ కట్టను నిర్మించారు. డైవర్షన్ కెనాల్లో సైతం అక్కడక్కడా అడ్డుకట్టలను నిర్మించారు. ఇవే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక వైపు పనులు నత్తనడకన సాగుతుండటం.. వర్షాలు కూడా పడుతుండడంతో ఏ క్షణంలోనైనా భారీ వర్షం పడి గతంలో వచ్చినట్లు వరద మళ్లీ వస్తే పెను ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. డైవర్షన్ కెనాల్కు అడ్డకట్టలు వేయడంతో ప్రస్తుతం వచ్చిన వరద హెడ్ రెగ్యులేటర్ గేట్ల నుంచి దిగువకు అంటే విజయవాడ వైపు బుడమేరులో ప్రవహించాల్సి ఉంది. ఈ రెగ్యులేటర్ 11అడుగుల ఎత్తుతో 11 గేట్లు మాత్రమే ఉండి 15వేల క్యూసెక్కుల వరద మాత్రమే అవుట్ ఫ్లో సామర్ధ్యం ఉంది. వరద పోయేందుకు మరో మార్గం కూడా లేకపోవడంతో ఏ క్షణంలో ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జూలై నెలలో పట్టిసీమ నీళ్లను సైతం విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్న క్రమంలో లైనింగ్ పనులు పూర్తిగా ఆగిపోయి మరో ఆరు నెలల పాటు వేచి ఉండక తప్పదు. -
యూరియా సరఫరాకు పటిష్ట కార్యాచరణ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఖరీఫ్ సీజన్లో యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అన్ని రకాల ఎరువుల సరఫరాకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో ఖరీఫ్ యూరియా, ఇతర ఎరువుల సరఫరాపై సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ యూరియా, ఇతర ఎరువుల శాసీ్త్రయ సమతుల్య వినియోగంతో పాటు ఏపీ ఎయిమ్స్ యాప్, పంట వైవిధ్యం, నానో ఎరువులు, డ్రోన్ స్ప్రేయింగ్ తదితరాలపై ఇంటింటి సందర్శనల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పీఏసీఎస్ వద్ద తాగునీరు, టెంట్, కుర్చీలు వంటి వసతులు కల్పించాలని సూచించారు. ఎరువుల సరఫరా, పంపిణీ లేదా ఇతర వ్యవసాయ సంబంధిత సమస్యలు ఎదురైన సందర్భంలో రైతులు కాల్ టు కలెక్టర్ 91549 70454లో సంప్రదించి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. జేసీ ఇలక్కియ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, సహకార అధికారి అజిత కుమారి, మార్క్ఫెడ్ డీఎం కె.నాగమల్లిక, వ్యవసాయ శాఖ ఏడీలు, వర్చువల్గా ఆర్డీవోలు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి పనుల పరిశీలన
ఘంటసాల: ఘంటసాలలో 2025–26లో జరిగిన ఉపాధి హామీ పథకం పనులను ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఆడిట్ బృందం సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా సెంట్రల్ ఆడీట్ సీఓఎం వనీత చౌదరి, పింకు కుమార్ మండల కంప్యూటర్ సెంటర్లో బిల్లులను ఎఫ్టీఓలు ఎలా అప్లోడ్ చేస్తున్నారో గమనించారు. పంచాయతీలో పంచాయతీరాజ్ శాఖలో నిర్మించిన సీసీ రోడ్లు ఫైల్స్ ఎం బుక్, రికార్డులు చూడటంతో పాటు ఆన్లైన్లో కూడా సక్రమంగా ఉన్నాయో లేవో చూశారు. పశువుల షెడ్లు, మేకలు, గొర్రెల షెడ్లు నిర్మాణాలు, వినియోగం, పంట బోదెలు, పంట కాలువల్లో చేసిన ఉపాధి ఫైల్స్, ఏడు రిజిస్టర్ల నమోదును క్షుణ్ణంగా తనఖీ చేశారు. పశువుల షెడ్లను పరిశీలించి యజమానులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు. ఆకస్మికంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావడంతో మండలంలోని ఇతర గ్రామాల్లో పర్యటించకుండానే కేంద్ర బృందం వెనుతిరగడంతో కొన్ని గ్రామాల ఎఫ్ఏలు, అధికారులు ఊపిరిపీల్చుకోవడం కొసమెరుపు. ముందుగా ఘంటసాల మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన కేంద్ర ఆడిట్ బృందం సభ్యులు వనిత చౌదరి, పింకు కుమార్ను ఎంపీడీవో సుబ్బారావు సత్కరించారు. డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్ యాదవ్, మచిలీపట్నం, ఉయ్యూరు ఏపీడీలు రామమోహన్, లక్ష్మీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
ఎస్పీ విద్యాసాగర్నాయుడు కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో తమ దృష్టికి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి చట్టపరిధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ వి. విద్యాసాగర్నాయుడు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ప్రజల నుంచి అర్జీలు అందుకున్నారు. ఫిర్యాదుదారులు చెప్పిన సమస్యలను సావదానంగా ఆలకించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సిబ్బంది ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, అమర్యాదగా మాట్లాడినా, నిర్లక్ష్యంగా వ్యవహించినట్లు తన దృష్టికి వచ్చినా ఉపేక్షించేది ఉండదన్నారు. ప్రజల నుంచి మొత్తం 47 అర్జీలు అందినట్లు ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. పెనమలూరు: యనమలకుదురు కొండ వెనుక గత కొద్ది రోజుల క్రితం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పెనమలూరు పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన యనమలకుదురు కొండ వెనుక నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీ కొట్టడంతో అతను మృతి చెందాడు. అయితే పోలీసులు వివిధ కోణాల్లో విచారించి మృతుడు పశ్చిమబెంగాల్ రాష్ట్రం బిర్బూమ్ జిల్లా బారాలుండా పోస్టు పార్సిములై గ్రామానికి చెందిన లాలుబాస్కీగా గుర్తించారు. అతను పనులు చేయటానికి యనమలకుదురుకు వచ్చి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు బంధువులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. పీఎం అనంతరం మృతదేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు. జి.కొండూరు: చెత్త లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి కాల్వలో బోల్తా పడిన ఘటన హెచ్. ముత్యాలంపాడు వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన డ్రైవర్ బొర్రా వీర నాగ శ్రీనివాసరావు లారీలో చెత్తను నింపుకొని జి.కొండూరు వైపు వస్తున్నాడు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తుండటంతో జి.కొండూరు మండల పరిధి హెచ్. ముత్యాలంపాడు వద్ద బుడమేరు వంతెన దాటగానే లారీ అదుపు తప్పి సైడ్ కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన వీర నాగ శ్రీనివాసరావుని స్థానికులు దగ్గర్లో ఉన్న క్లినిక్కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘంటసాల: పదేళ్ల వయస్సులో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కోలవెన్ను ప్రణతి చేసిన నాట్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు ఘంటసాల గ్రామంలో చేసిన గాన కచేరి 60ఏళ్లయిన సందర్భంగా ఘంటసాల కళాసమితి ఆధ్వర్యంలో శ్రీజలధీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం ఈ నృత్య ప్రదర్శన నిర్వహించారు. నృత్య ప్రదర్శన అనంతరం ఘంటసాల కళాసమితి ఆధ్వర్యంలో సమితి గౌరవాధ్యక్షుడు గొర్రెపాటి రామకృష్ణ చిన్నారి ప్రణతిని ఘనంగా సత్కరించారు. కళా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఘంటసాల కృష్ణ మోహన్, పోతన వెంకటేశ్వరరావు, పామర్రులోని ఘంటసాల కళాపీఠం వ్యవస్థాపకుడు కాటూ రు వెంకట మురళీ కృష్ణ, ప్రణతి తల్లిదండ్రులు విజయ్ కుమార్, బాల భార్గవి తదితరులు పాల్గొన్నారు. -
కౌన్సెలింగ్ బహిష్కరించి ఆందోళన
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంటీఎస్ (మినిమం టైమ్ స్కేల్) ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మరోసారి గందరగోళానికి దారితీసింది. బదిలీలకు సంబంధించిన పూర్తి ఖాళీల వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరచకుండానే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడటంపై ఉపాధ్యా యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పారదర్శకత లేకుండా కౌన్సెలింగ్ నిర్వహించడంతో ఉపాధ్యాయులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ–2008, డీఎస్సీ–1998 బ్యాచ్లకు చెందిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ను సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా డీఎస్సీ–2008, అనంతరం డీఎస్సీ–1998 ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఖాళీల వివరాలు ఏవి? అయితే జిల్లాలో ఉన్న అన్ని ఖాళీల వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీల్లో అనుసరించే ప్రమాణాలు ఎంటీఎస్ ఉపాధ్యాయుల విషయంలో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. పూర్తి ఖాళీల జాబితాను ప్రకటించకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, ఇది ఉపాధ్యాయుల ఎంపిక హక్కును పరిమితం చేసే చర్యగా మారుతుందని విమర్శించారు. దీంతో కౌన్సెలింగ్ను బహిష్కరించిన ఎంటీఎస్ ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మొత్తం ఖాళీలు ప్రకటించాలని, పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చల అనంతరం ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ సోమవారం పొద్దుపోయాక ప్రారంభమైంది. పారదర్శకత లేని బదిలీలపై ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఆగ్రహం -
‘కేజీఎఫ్’ను మించిన రీతిలో అక్రమ క్వారీయింగ్
● అధికారులు తనిఖీ చేసి జరిమానా విధించాలి ● కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి జోగి రమేష్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మైలవరం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, మైనింగ్ దోపిడీకి పాల్పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులను తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నామన్నారు. ఇందులో భాగంగా దాములూరి ఇసుక క్వారీలో అక్రమాలను బహిర్గతం చేశామన్నారు. అలాగే జి. కొండూరు మండలం శేగురెడ్డిపాడు గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు. ఆ గ్రామంలో పర్యావరణ విధ్వంసం కొనసాగుతోందన్నారు. అనుమతులు ఒక చోట తీసుకొని మరో చోట మైనింగ్ సాగిస్తున్నారన్నారు. అక్కడ కేజీఎఫ్ సినిమాను తలపించే రీతిలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశను కలిసి వినతి పత్రం అందజేశారు. మైనింగ్ దోపిడీ ఏ విధంగా జరుగుతుందో వీడియో క్లిప్పింగ్, ఫొటోలతో ఆధారాలన్నీ కలెక్టర్కు అందజేశారు. నియోజక వర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న దోపిడీపై జాయింట్ ఇన్స్పెక్షన్ చేపట్టాలని కలెక్టర్ను కోరారు. అనంతరం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఊసరవెల్లిలా ఎమ్మెల్యే.. ఇసుక, గ్రావెల్, బూడిద, మైనింగ్ దోపిడీ ఏ విధంగా జరుగుతుంది? ఎంత పరిమాణంలో దోచుకున్నారు? జాయింట్ ఇన్స్పెక్షన్లో తేల్చి.. నాలుగైదు రెట్లు జరిమానా విధించాలని కలెక్టర్ను కోరినట్లు జోగి రమేష్ చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇసుక, గ్రావెల్, లిక్కర్, బూడిద ఇలా ప్రతిదాంట్లో పావలా వాటా వెళ్తోందన్నారు. ఆయన ఊసరవెల్లిగా మారారన్నారు. పార్టీలు మారడం, సూట్ కేసులు పంపడం ఆయన ప్రవృత్తిగా మారిందన్నారు. పంపిన సూట్కేసులకు సరిపడా మైనింగ్ ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. నిర్భయంగా, యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారన్నారు. సర్కారుకు దమ్ముందా? గుంటుపల్లి, ఫెర్రీ పవిత్ర సంగమంలో ఫంటు పేరుతో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని జోగి ఆరోపించారు. కొత్తూరు తాడేపల్లి, వెలగలేరులో గ్రావెల్ ద్వారా కోట్లాది రూపాయలు దండుకుంటున్నారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్కు ఇక్కడ ఎమ్మెల్యే చేసే దాన్లో వాటా ఉందా అని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే దమ్మూ ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే అవినీతి నిరూపించి న్యాయ స్థానంలో నిలబెడతామన్నారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణను విరమించుకోవాలి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనలను విరమించుకోవాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పల్లి శేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. పల్లి శేఖర్ మాట్లాడుతూ ఆర్టీసీ చక్రం ప్రగతికి చిహ్నం అనే నానుడి ఉండేదని, ఇప్పుడు అది కనుమరుగయ్యే పరిస్థితులను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుమారు రూ. 700 కోట్లు వెచ్చించి 1459 బస్సులను కొనుగోలు చేశారన్నారు. అయితే ఎన్నికలు రావడంతో ఆ బస్సులు రోడ్డు పైకి తెచ్చే అవకాశం రాలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బస్సులను తమ ఖాతాలో వేసుకుని ఆర్భాటం చేశారన్నారు. రానున్న కాలంలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగులతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పినాకిల్కు అప్పగించిన డిపోలను ఆర్టీసీనే నిర్వహించాలి 12 డిపోలను ప్రభుత్వం పినాకిల్ కంపెనీకి అప్పగించి ప్రైవేటుపరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆర్టీసీ ద్వారానే ఆ డిపోలను నిర్వహించేలా చూడాలన్నారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించటంతో పాటు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. తక్షణమే అవసరమైన 3 వేల డీజిల్ బస్సులను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బస్సు డిపోలను 99 ఏళ్లకు లీజుకు ఇచ్చే ప్రతిపాదన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు తాడిశెట్టి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు ఎగ్గోని గాంధీ, రాంప్రసాద్, మోచర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన, కలెక్టర్కు వినతి -
సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
ఇబ్రహీంపట్నం: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీటీపీఎస్ పాత గేటు వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రీజనల్ అధ్యక్షుడు ఎస్కే సలీం, రీజనల్ కార్యదర్శి ఎం.రవీంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా కార్మికుల వేతనం రూ.43వేలు, పెండింగ్లో ఉన్న కరువు భత్యం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. రమేష్, కోశాధికారి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు టి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
అప్పు తిరిగి చెల్లించమన్నందుకు మహిళపై దాడి
మైలవరం: అప్పుగా ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇవ్వమని మహిళ అడిగితే ఆమైపె దాడి చేసిన సంఘటన మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో సోమవారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి(చల్లా కోటయ్య) ఇటుక బట్టీలు వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో 2020లో అతను వెంకటేశ్వరమ్మ వద్ద నుంచి రూ. 4లక్షలను వ్యాపారం నిమిత్తం తీసుకుని 4, 5 నెలల్లో తిరిగి వడ్డీతో చెల్లిస్తానని చెప్పాడు. వీరి ఒప్పందం ప్రకారం సమయం దాటిపోయిన డబ్బులు చెల్లించకపోవడంతో బాధితురాలు వెంకటేశ్వరమ్మ పదేపదే తన డబ్బులు తనకు ఇవ్వమని అడుగుతోంది. తన పిల్లలు, భర్తతో కలిసి ఆ వ్యక్తిని పలుమార్లు అడిగారు. దానికి బదులుగా ఆ వ్యక్తి నేను ఇవ్వను, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరించాడు. సోమవారం ఉదయం వెంకటేశ్వరమ్మ తనకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి అడగ్గా అసభ్య పదజాలంతో దూషించి ఆ వ్యక్తి ఆమైపె దాడి చేశాడు. ఈ అవమాన భారంతో వెంకటేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇది గమనించిన భర్త, కుటుంబ సభ్యులు వెంకటేశ్వరమ్మను ఆటోలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మైలవరం పోలీసులకు కుటుంబ సభ్యులు వెంకటేశ్వరమ్మ పరిస్థితిని వివరించారు. -
నిత్యాన్నదానానికి రూ,10 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన భక్తులు సోమవారం రూ.10 లక్షల విరాళం సమర్పించారు. మంగళగిరి సమీపంలోని కృష్ణాయపాలేనికి చెందిన వై.జయశంకర కిషోర్బాబు, మహాలక్ష్మి దంపతులు అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధా కృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కల్వకుర్తికి చెందిన భక్తులు తాడూరి సురేష్కుమార్ కుటుంబం ఆలయ అధికారులను కలిసి తాడూరి రాఘవేంద్ర పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–సర్ ప్రక్రియకు సంబంధించి ఇంటింటి సర్వే వేగవంతంగా జరుగుతోందని కలెక్టర్ జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నారని, బీఎల్వోలు ఇప్పటివరకు 7,96,696 మంది (46.87 శాతం) ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించినట్లు పేర్కొన్నారు. 46,871 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తైనట్లు వెల్లడించారు. ఇంటింటి సర్వేలో భాగంగా జులై 14వ తేదీ వరకు బీఎల్వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారని, నింపిన వాటిని తిరిగి సేకరిస్తారని, ఇందుకు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు వెళ్లనున్నారని తెలిపారు. -
బుడమేరు ప్రక్షాళన మరిచారు
బుడమేరు ప్రక్షాళన చేస్తామని, బాధితులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు మాట ఇచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇంత వరకు కనీస చర్యలు చేపట్టలేదు. తూడు తొలగింపు పనులు సక్రమంగా చేపట్టలేదు. బుడమేరులో చెత్త్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ ఉంది. బుడమేరులోకి మురుగు, సెప్టిక్ వ్యర్థాలను సైతం వదలివేస్తున్నారు. బుడమేరులో చెత్త్తాచెదారం సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో దోమలకు ఆవాసకేంద్రంగా మారింది. గత వరదల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. వర్షకాలం వస్తోందంటే భయమేస్తోంది. అధికారులు స్పందించి బుడమేరును ప్రక్షాళన చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. –పూర్ణ, బుడమేరు మధ్య కట్ట -
‘సర్’ను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి
పెనమలూరు: ప్రత్యేక సత్వర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని (సర్) పరిశీలించడానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్యాదవ్ పెనమలూరులో సోమవారం పర్యటించారు. ఆయన 132,134 పోలింగ్ బూత్లకు సంబంధించి సర్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పని చేస్తున్నారా లేదా పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ఇంటింటి సర్వే నిర్వహణ, మరణించిన ఓటర్ల గుర్తింపు, వలస వెళ్లిన ఓటర్ల నమోదు, తాళం వేసి ఉన్న ఇళ్ల విషయంలో అనుసరిస్తున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెనమలూరు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి ఎస్.కరుణకుమారి వివరాలు తెలుపుతూ ఎన్యూమరేషన్ ఫారాలను 71.44 శాతం పంపిణీ చేశామని, ఇంటికి తాళాలు వేసిన కేసుల్లో బీఎల్వోలు మూడుసార్లు గృహాలు సందర్శించారని తెలిపారు. చనిపోయిన ఓటర్ల కేసుల్లో మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పంచనామా చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్యాదవ్ మాట్లాడుతూ సర్ విషయంలో బీఎల్వోలు నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఏఈఆర్వో శివకుమార్రాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్(విజయవాడ పశ్చిమ): ఏపీ పీటీడీ (ఆర్టీసీ) విజిలెన్స్, సెక్యూరిటీ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా బాధ్యతలు తీసుకున్న ఎస్.వినోద్కుమార్ను సోమవారం పీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలిసి అభినందించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి.అంకినీడు ఆధ్వర్యాన విజయవాడ ఆర్టీసీ హౌస్లో జోనల్, రీజనల్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు, అడిషనల్ జనరల్ సెక్రటరీ కొండారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, నాయకులు రవి, అనంతకుమార్, ఆదామ్, జాన్బాబు, గురవయ్య తదితరలు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లో పల్స్ పోలియోపై జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జేసీ నవీన్ పల్స్ పోలియో ప్రచార వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా పకడ్బందీ ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యుగంధర్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసేలా మైక్రో ప్లానింగ్ రూపొందించడం, బూత్ల ఏర్పాటు, వ్యాక్సిన్ సరఫరా, కోల్డ్చైన్ నిర్వహణ, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. అనంతరం మిగిలిపోయిన పిల్లలను గుర్తించి ఇంటింటి సందర్శనలతో పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె.ప్రేమ్చంద్ మాట్లాడుతూ విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, రవాణా శాఖ, సమాచార, ప్రజా సంబంధాల శాఖలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు. -
యోగాతో జీవన శైలి వ్యాధుల నిర్మూలన
మంత్రి సత్యకుమార్ యాదవ్ గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): యోగా సాధనతో జీవన శైలి వ్యాధులు దూరమవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యోగాంధ్ర–2026లో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మూడు రోజులుగా గుంటుపల్లి డాన్బాస్కో పాఠశాలలో జరిగిన యోగా పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో సుమారు 1600 మంది పాల్గొనగా, ప్రతిభకలిగిన 108 మంది విజేతలుగా నిలిచారు. వారికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎస్.చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియాతో కలసి జ్ఞాపికలు, సర్టిఫికెట్లను మంత్రి అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రాచీన వారసత్వ సంపదను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదటి నుంచి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాతో శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ప్రశాంతత, సృజనాత్మకత, ఏకాగ్రత పెరుగుతా యని వివరించారు. ఈ సంవత్సరం ఆరోగ్యకర వృద్ధాప్యానికి యోగా థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతున్నామని పేర్కొన్నారు. నిత్యం 45 నిమిషాలు యోగాకు కేటాయించాలని సూచించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. యోగా సాధన వల్ల ఆరోగ్యం మాత్రమే కాకుండా మనసు, శరీరం మధ్య సమన్వయం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమన్వయ అఽధికారులు సుజాత, కృష్ణవేణి, సుకన్య, జిల్లా ఆయుష్ అధికారి రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
కబ్జాదారులకు జనసేన అండ
కోడూరు: కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని లింగారెడ్డిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) భూముల ఆక్రమణల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారుతోంది. సొసైటీ భూముల కబ్జా వ్యవహారాన్ని ‘కబ్జా కోరల్లో కోట్ల విలువైన భూములు’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ కథనం ద్వారా ఆక్రమణలు వెలుగులోకి రావడంతో పీఏసీఎస్ సభ్యులు, అధికారులు ఉలిక్కిపడ్డారు. కబ్జా వ్యవహారంపై సంఘ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆక్రమణదారులకు కొందరు జనసేన పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారులు జనసేన సానుభూతిపరులే.. సొసైటీ భూములను ఆక్రమించిన వారు జనసేన పార్టీ సానుభూతిపరులేనని గ్రామస్తులు పేర్కొంటున్నారు. లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొందరు జనసేన ముఖ్య నాయకులు ఆక్రమణదారులకు అండగా నిలిచారని రైతులు ఆరోపిస్తున్నారు. సహకార సంఘ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు మౌనం వహించడం, అధికార పార్టీ నాయకులు కబ్జాదారులకు మద్దతు పలకడంపై రైతులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. భూముల ఆక్రమణపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్న సొసైటీ అధికారులను జనసేన నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇప్పించి, వారిని కోర్టుకు పంపి భూములకు బహిరంగ వేలం జరగకుండా ప్రయత్నిస్తున్నారని సమాచారం. కబ్జా చేసిన స్థలంలో మట్టితో మెరక లింగారెడ్డిపాలెంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న 12 సెంట్ల భూమిని కబ్జాదారుడు ఆక్రమించి దర్జాగా మట్టితో మెరక చేశాడు. గ్రామ నడిబొడ్డున ఉన్న 20 సెంట్ల స్థలంలోకి ఆక్రమణదారులు స్తంభాలను తీసుకువచ్చి, నిర్మాణ పనులు చేపట్టేందుకు యత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మందపాకలలోని 20 సెంట్లు, గ్రామంలోని మరో ఆరు సెంట్ల భూమిని కూడా కబ్జా చేసేందుకు జనసేన నాయకులు ప్రణాళిక రూపొందించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ, సహకార సంఘ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మార్పులు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి కథనంతో కదిలిన అధికారులు భూముల ఆక్రమణలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై కృష్ణా కో–ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు స్పందించారు. ఆ భూముల వ్యవహారంపై దృష్టి సారించారు. పీఏసీఎస్ పరిధిలోని భూముల వివరాలపై ఇప్పటికే విచారణ కూడా ప్రారంభించారు. స్థలాలను పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని కోడూరు బ్యాంకు అధికారులను జిల్లా బ్యాంక్ అధికారులు ఆదేశించినట్లు సమాచారం. స్థలాల ఆక్రమణ విషయమై కోడూరు బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు ‘సాక్షి’తో మాట్లాడారు. సొసైటీ ఆధీనంలో ఉన్న భూముల పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. రికార్డులు, యాజమాన్య హక్కులు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి శాఖపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


