breaking news
Krishna District Latest News
-
అమ్మ సన్నిధిలో చండీహోమం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 16 నుంచి ఫైనల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారథి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష రాసి ర్యాంకులు పొందిన వారు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకుని ఫీజు చెల్లించాలన్నారు. ఈ నెల 19 వరకు ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన వారు ఈ నెల 20లోగా వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లకు మార్పులు, చేర్పులకు ఈ నెల 21వ తేదీ అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 24వ తేదిన సీట్ ఎలాట్మెంట్ ప్రకటిస్తామని, 25 నుంచి 29లోగా అభ్యర్థులకు కేటాయించిన కళాశాలకు స్వయంగా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందిగా వివరించారు. విజయవాడలీగల్: డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గన్నవరం పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ప్రశ్న రావణ్కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు, న్యాయవాది ఒగ్గు గవాస్కర్ విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రాసిక్యూషన్కు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి సునీల్కుమార్ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు. విజయవాడ లీగల్: మద్యం రవాణా కేసులో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, కేసిరెడ్డి రాజ్శేఖర్రెడ్డి, కారుమూరి సునీల్ ప్రస్తుతం హైదరాబాద్ చంచల్గూడా జైలులో రిమాండ్లో ఉన్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి కోరుతూ సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో పిటీ వారెంటు దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వారిని ఈనెల 20 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య న్యాయస్థానంలో హాజరుపరచాలని చంచల్గూడా జైలు సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీచేశారు. కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్ఐ కేవై దాసు తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడు పట్టణంలోని విజయలక్ష్మీ థియేటర్ వెనుక రోడ్డులో పిప్పళ్ల దుర్గామాణిక్య వరలక్ష్మీ భవాని (48), శ్రీరామచంద్రమూర్తి కుటుంబం నివాసం ఉంటుంది. ఈనెల 13న రాత్రి దుర్గా మాణిక్య వరలక్ష్మి భవానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. అయితే తన సోదరి మృతికి కారణాలు తెలుసుకోవాలంటూ మృతురాలి సోదరుడు మద్దూరి వీర వెంకట సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మంగళవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్ జగన్ కృషి ఫలితం.. వైద్య విద్యకు వరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగానికి 2019–24 మధ్య ఒక స్వర్ణయుగం అని వైద్యరంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్టం చేసేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా ఉదారంగా నిధులు మంజూరు చేసి, రానున్న రోజుల్లో అదనంగా సీట్లు మంజూరుకు అవసరమైన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో 250 సీట్లకు అనుగుణంగా రూ.90 కోట్లతో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా ఇప్పటికే ఉన్న 175 సీట్లకు అదనంగా మరో 75 సీట్లు ఎన్ఎంసీ(నేషనల్ మెడికల్ కమిషన్) మంజూరు చేసింది. రూ.90 కోట్లతో నిర్మాణాలు.. రాష్ట్రంలోని బోధనాస్పత్రులను నాడు–నేడు పనుల ద్వారా అభివృద్ధికి నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో రూ.170 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టాలని అంచనా వేశారు. అందులో భాగంగా తొలివిడగా రూ.90 కోట్లతో 250 సీట్లకు అనుగుణంగా సిద్ధార్థ వైద్య కళాశాలలో తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రెరీ వంటి సౌకర్యాల కోసం నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో వేగంగా జరిగిన పనులు, ప్రస్తుతం నత్త నడకన సాగుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తికాగా, ఇంకా ఎలక్ట్రికిల్, డ్రెయినేజీ, వాటర్ పైప్లైన్ వంటి పనులు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రిలో సైతం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. సౌకర్యాల కల్పనతోనే సాధ్యం.. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఇప్పటికే 175 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిని అదనంగా మరో 75 సీట్లు మంజూరు చేయాలని ఈ ఏడాది కళాశాల తరఫున నేషనల్ మెడికల్ కమిషన్కు దరఖాస్తు చేశారు. దీంతో ఎన్ఎంసీ బృందం వచ్చి తనిఖీలు చేసింది. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటు, ప్రభుత్వాస్పత్రిలోని సౌకర్యాలను చూసి, సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎంఆర్ఐ, సీటీ స్కాన్లతో పాటు, ఎంబీబీఎస్ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయంటూ మరో 75 సీట్లు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో 2014–19 కాలంలో ఒక్క అదనపు సీటు కూడా మంజూరు కాలేదు. కానీ 2019–24 సమయంలో సౌకర్యాల కల్పనతో పలు విభాగాల్లో దాదాపు 80 పీజీ సీట్లు మంజూరు అయ్యాయి. అంతేకాదు సూపర్ స్పెషాలిటీ విభాగాలైన న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో సైతం ఒక్కో విభాగంలో ఐదు సీట్లు మంజూరు అయ్యాయి. వాటితో పాటు ఈఎన్టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి విభాగాల్లో కూడా సీట్లు మంజూరయ్యాయి. దీంతో ప్రభుత్వాస్పత్రిలో పీజీలు ఏడాదికి వంద మంది చొప్పున పెరగనున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది. వైద్య రంగానికి వైఎస్ జగన్ జీవం పోశారు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు వెంటిలేటర్పై ఉన్నాయి. అలాంటి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా, వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు పెద్ద ఎత్తున చేపట్టారు. 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఉన్న కళాశాలలను అభివృద్ధి చేసి మరిన్ని సీట్లు వచ్చేలా కృషి చేశారు. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ, వైద్య విభాగం -
దుక్కులు దున్ని..
సాక్షి, విజయవాడ : ఉమ్మడి కృష్ణా జిల్లాపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదవుతోంది. కృష్ణా నదికి ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరదలు రాకపోవడంతో డెల్టాకు ఈసారి సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణంలో ఏర్పడిన అసమతుల్యత కారణంగా జూన్లో 108.6 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 142.7 మి.మీ. పడింది. జూలై నెల చివరి నాటికి 234.5 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ నెల 13వ తేదీ నాటికి 87.4 శాతం వర్షం పడాల్సి ఉండగా.. 5.6 మి.మీ మాత్రమే కురిసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నా చంద్రబాబు ప్రభుత్వం సాయం అందించకుండా ఎల్నినోపైనే నింద వేసి తప్పించుకునే యత్నం చేస్తోంది. ముందస్తు నీటి నిల్వలు చేపట్టకపోవడంతో మరింత ఇక్కట్లు తలెత్తుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు.. పంటలపై ఎఫెక్ట్ కృష్ణా జిల్లా పరిధిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా రైతులు నారుమడులు పోసేందుకు మొగ్గు చూపడం లేదు. అయితే పట్టిసీమ నీరు కృష్ణానదికి వస్తుండడంతో ఆ నీరు అందే అవకాశం ఉన్న రైతులు మాత్రం కాసింత ఆశగా ఉన్నారు. పట్టిసీమ నుంచి 7,080 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తుండగా, ఎగువ ప్రాంత రైతుల వినియోగం పోగా మిగిలిన 5,500 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోందని, గుంటూరు కాలువతో పాటు, జిల్లాలోని బందరు, కేఈబీ, రైవస్ తదితర ప్రధాన కాలువలకు ఆ నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కృష్ణా డెల్టాలోని అన్ని ప్రధాన కాలువలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలంటే 18,600 క్యూసెక్కుల నీరు అవసరం కాగా ప్రస్తుతం విడుదల చేస్తున్న 5,500 క్యూసెక్కుల నీరు ఎంతమేర పంటలను కాపాడుతుందనేది వేచి చూడాలి. జూన్ నుంచి జూలై 12వ తేదీ వరకు జిల్లాలో 145.22 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 99.93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగితే పంటల సాగు సమయం మించిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కావాల్సింది ప్రస్తుతం (హెక్టార్లలో) సాగైనది వరి 1,60,655 17,085 మొక్కజొన్న 56 22 కంది 11 00 పెసర 2 00 మినుము 1,412 00 ఉలవ 3 00 వేరుశనగ 661 00 కాటన్ 330 72 చెరుకు 2,641 852 మొత్తం 1,65,771 18,031 పంట సాగు కావాల్సింది ప్రస్తుతం–2026 (హెక్టార్లలో) ఖరీఫ్ నాటికి వరి 48,831 1,127 జొన్న 2 0 మొక్కజొన్న 3,729 1,707 కంది 453 76 పెసర 3,796 2,340 మినుము 2833 1666 శనగ 1 0 వేరుశనగ 39 00 నువ్వులు 26 00 ఆముదం 4 0 కాటన్ 34,057 18,378 చెరుకు 428 43 మొత్తం 94,197 25,336 -
హాస్టళ్లలో అర్ధాకలి!
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న పేద విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న హాస్టళ్లలో మెస్ చార్జీలు మాత్రం యథాతథంగా కొనసాగిస్తోంది. గత రెండేళ్లలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పుధాన్యాలు, వంటనూనె, గ్యాస్ సిలెండర్ ధరలు అమాంతం పెరిగినా, మెస్ చార్జీలను మాత్రం ఇప్పటికీ సవరించలేదు. మరోవైపు వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రచారం చేస్తోంది. ఇదెలా సాధ్యమో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. పౌష్టికాహారం ఎలా సాధ్యం.. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఒక విద్యార్థికి సమతుల్య పౌష్టికాహారం అందించాలంటే రోజుకు కనీసం రూ.100 నుంచి రూ.140 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న మెస్ చార్జీలు ఆ మొత్తానికి సగం కూడా చేరని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యక్ష ప్రభావం పడుతున్నా మెస్ చార్జీల సవరణపై ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. 2023 తర్వాత పెంపు లేదు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో చివరి సారిగా మెస్ చార్జీలను పెంచింది. అప్పట్లో ప్రీ–మెట్రిక్ వసతి గృహాల్లో 3, 4వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,000 నుంచి రూ.1,150కు, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.1,250 నుంచి రూ.1,400కు, పోస్ట్–మెట్రిక్ విద్యార్థులకు రూ.1,450 నుంచి రూ.1,600కు పెంచింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మెస్ చార్జీలను సవరించలేదు. 2023లో రూ.835 ఉన్న వంట గ్యాస్ సిలెండర్ ధర ప్రస్తుతం రూ.970కు చేరగా, కంది పప్పు ధర రూ.110 నుంచి రూ.160కు, వంట నూనె ధర రూ.130 నుంచి రూ.173కు పెరిగింది. కూరగాయలు, మసాలా దినుసులు, ఇతర ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగాయి. మరి ఇంత వ్యత్యాసంతో విద్యార్థులకు పౌష్టికాహారం ఎలా సాధ్యం? రోజువారీ ఖర్చు.. ప్రస్తుతం ప్రభుత్వం 3, 4వ తరగతి విద్యార్థికి నెలకు రూ.1,150 మాత్రమే అందిస్తోంది. అంటే రోజుకు కేవలం రూ.38.33 మాత్రమే ఆహారానికి ఖర్చు చేసే పరిస్థితి ఉంది. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.1,400 చొప్పున, అంటే రోజుకు రూ.46.66 మాత్రమే లభిస్తోంది. పోస్ట్–మెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ.1,600 చొప్పున, అంటే రోజుకు రూ.53.33 మాత్రమే మెస్ ఖర్చు కేటాయిస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరలకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. పెంపు కోసం ఎదురుచూపులు.. వేలాది మంది విద్యార్థుల ఆహార బాధ్యతను నిర్వర్తిస్తున్న వసతి గృహాలకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో పాత మెస్ చార్జీలే కొనసాగడం నిర్వహణపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెస్ చార్జీలతో పాటు కాస్మెటిక్ చార్జీలను కూడా ప్రభుత్వం పునఃసమీక్షించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నా, ప్రభుత్వ వసతి గృహాల మెస్ చార్జీలను రెండేళ్లుగా పెంచకపోవడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న మెస్ చార్జీలు ప్రస్తుత ధరలకు ఏమాత్రం సరిపోవు. ఈ మొత్తంతో విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడం అసాధ్యం. కనీసం అన్ని వసతి గహాల విద్యార్థులకు నెలకు రూ.3,000 మెస్ చార్జీలు మంజూరు చేసి, కాస్మెటిక్ చార్జీలను కూడా పెంచాలి. విద్యార్థుల ఆరోగ్యం, విద్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మెస్ చార్జీల సవరణపై నిర్ణయం తీసుకోవాలి. – ఎస్. సమరం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
కృష్ణా డీఆర్వోగా శ్రీధర్రెడ్డి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారిగా కె. శ్రీధర్రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం డీఆర్వోగా పనిచేస్తున్న కె. చంద్రశేఖరరావు నెలన్నర రోజులుగా సెలవుపై ఉన్నారు. ఈ స్థానంలో ఇన్చార్జ్ డీఆర్వోగా జిల్లా విజిలెన్స్ అధికారి పోతురాజు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన డీఆర్వోగా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్గా పనిచేస్తున్న కె. శ్రీధర్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
సారె సంబరాలకు సర్వం సిద్ధం
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆదిదంపతులు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై బుధవారం నుంచి ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 7గంటలకు ప్రధాన ఆలయంలోని అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తిని ఊరేగింపుగా మహామండపం ఆరో అంతస్తుకు తీసుకువస్తారు. ఆరో అంతస్తులో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఉదయం 7.30 గంటలకు ఆలయ అర్చకులు ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి తొలి సారెను సమర్పిస్తారు. రూట్ ప్లాన్ ఇదే.. సారె సమర్పణలకు వచ్చే భక్తులు ఘాట్రోడ్డు, మహామండపం ద్వారా కొండపైకి చేరుకుంటే తొలుత ప్రధాన ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి ఆరో అంతస్తుకు చేరుకుని ఉత్సవ మూర్తి వద్ద సారెను సమర్పించి పూజలు జరిపించుకునేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అమ్మవారికి సారె సమర్పించిన పిమ్మట భక్తులు తమతో తెచ్చిన పండ్లు, మిఠాయిలు, ఇతర పూజా సామగ్రిని తొటి భక్తులకు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక ఈ కార్యక్రమం అంతా అయిన అనంతరం భక్తులకు మహామండపం రెండు, మొదటి అంతస్తుల్లో జరిగే ఉచిత అన్న ప్రసాద వితరణకు పంపుతారు. అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు నేరుగా కనకదుర్గనగర్కు చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఆరో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు ఇక ఆరో అంతస్తులో భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులందరూ ఒక వరస క్రమంలో కూర్చునేలా రోప్లను ఏర్పాటు చేసింది. అమ్మవారికి సమర్పించే పూజా సామగ్రి కోసం వేదిక ఎదుట ప్రత్యేకంగా బల్లలు ఏర్పాటు చేసింది. సారెలో భాగంగా అమ్మవారికి సమర్పించే ప్రతి చీరకు తప్పని సరిగా రశీదు ఇచ్చేలా దేవస్థానం కౌంటర్ను, సిబ్బందిని నియమించనుంది. మొబైల్ఫోన్లు, కెమెరాలతో నో ఎంట్రీ ఈ దఫా మొబైల్ఫోన్లు, కెమెరాలతో ఆలయంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులను అనుమతించమని దేవస్థాన అధికారులు పేర్కొంటున్నారు. కనకదుర్గనగర్లోనే భక్తుల లగేజీ, చెప్పులు, సెల్ఫోన్లను భద్రపరిచేందుకు వేరు వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. ఆలయ ప్రాంగణం, ఆరో అంతస్తులో సెల్ఫోన్ కలిగిన భక్తుల నుంచి వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తామని ఆలయ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తాపీ మేస్త్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణలంక గౌతమీనగర్ రెండో లైన్లో గొర్రెల బంగార్రాజు (48) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను తాపీ పనికి వెళ్తుండగా భార్య ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమార్తెలిద్దరు చదువుకుంటున్నారు. అతను ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లేవాడు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తరచూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. 11 గంటల వరకు కుటుంబ సభ్యులందరూ సరదాగా మాట్లాడుకుని నిద్రకు ఉపక్రమించారు. అతను మాత్రం ప్రక్క బెడ్రూంలో పడుకుంటానని చెప్పి లోపలకు వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు కుటుంబ సభ్యులు నిద్ర లేచినా అతను మాత్రం లేవలేదు. తలుపు తట్టినా ఉలుకూపలుకూ లేదు. గోడకు ఉన్న రంధ్రంలో గుండా లోపలికి చూడగా ఫ్యాన్ హుక్కు చున్నీతో ఉరేసుకుని వ్రేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహాయంతో లోపలికి వెళ్లి అతనిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 17న వర్చువల్గా స్టేషన్ ప్రారంభోత్సవం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): అమృత్ భారత్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చేసిన రాయపాడు రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ‘సెల్ఫీ విత్ స్టేషన్’ పేరుతో సోషల్ మీడియా ప్రచారాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం పి.ఇ. ఎడ్విన్ మాట్లాడుతూ రాయనపాడు రైల్వేస్టేషన్లో జరిగిన అద్భుతమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మార్పులపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటుగా భారతదేశంలో వేగంగా జరుగుతున్న రైల్వే మౌలిక సదుపాయాలలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సాహించడమే ఈ ప్రచార కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ పోటీలలో పాల్గొని సెల్ఫీ తీసుకుని ఈ నెల 16లోగా విజయవాడ డివిజన్ సోషల్ మీడియాను ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగామ్, ఎక్స్లలో షేర్ చేసుకోవాలి లేదా ఠ్ఛీ జ్చట్ఛ ఛ్డ్చఃజఝ్చజీ .ఛిౌఝ కి మెయిల్ చేసి తమ ఎంట్రీలను పంపిచాలన్నారు. ఈ నెల 17న స్టేషన్ ప్రారంభోత్సవం రోజున విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. -
సమగ్ర సవరణకు సహకరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో రాజకీయ పార్టీలు, బీఎల్ఏలు సహకరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అన్ కలెక్టబుల్, అన్ ట్రేస్డ్, షిఫ్టెడ్గా గుర్తించిన ప్రతి ఓటరును మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. బీఎల్వోలు వ్యక్తిగతంగా సంప్రదించి వివరాలను నిర్ధారించాలన్నారు. బీఎల్వోల సూపర్వైజర్లు కూడా ప్రతి బీఎల్వోతో సమీక్ష నిర్వహించి ఓటర్ల జాబితాలో నమోదైన చిరునామా వాస్తవమైనదో లేదో ధ్రువీకరించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1.39 లక్షల మంది అన్కలెక్టబుల్గా నమోదయ్యారని వీరిలో ఇప్పటికే మరణించిన ఓటర్ల వివరాలు తొలగింపు ప్రక్రియలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వలసలు ఎక్కువగా ఉండటం వల్ల ఓటర్లను గుర్తించటం కష్టమవుతోందని ఈ దశలో రాజకీయ పార్టీల బీఎల్ఏల సహకారం కీలకమన్నారు. పామర్రు భేష్.. కొన్ని నియోజకవర్గాల్లో అధికారులు అద్భుతంగా పనిచేశారని ముఖ్యంగా పామర్రు నియోజకవర్గంలో నో మ్యాపింగ్ కేసులు తగ్గించటం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2002 నాటి పోలింగ్ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంటే అనుసంధానం సులభమవుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ల భౌగోళిక పరిధికి అనుగుణంగా ఓటర్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం బీఎల్ఏ పరిధిలో ఉన్న ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఓటర్ల జాబితాను సిద్ధం చేసి బీఎల్వోలకు అందించాలన్నారు. రానున్న పది రోజులు మిగిలిన ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, బీఎల్ఏలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపగలమన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్దాదా, కొడాలి శర్మ, కొడమంచిలి చంద్రశేఖర్, కూనపరెడ్డి శ్రీనివాసరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించండి.. పెడన: పట్టణంలోని భట్టజ్ఞానకోటయ్య(బీజీకే)జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యాశాఖకు మాత్రమే సమాచారం ఇచ్చి విచ్చేసిన ఆయన తొలుత పాఠశాలలో ఎస్ఎస్ఏ ద్వారా ఏర్పాటు చేస్తున్న ఆటిజం సెంటర్ను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించిందీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. తర్వాత ఉపాధ్యాయులతో సమావేశమైన కలెక్టర్.. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అందరిలో కాకుండా ప్రత్యేకంగా పిలిపించుకుని, సున్నితంగా కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. వారిలో ఉండే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. కలెక్టర్తో పాటు డీవైఈవో శేఖర్సింగ్, ఎంఈవో–1, 2 ఎన్. సలోమి, వైవీ హరనాథ్, పాఠశాల హెచ్ఎం ఎల్. ఇందిరా తదితరులు ఉన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
హిట్లర్లా నియంతృత్వ పోకడలు తగదు
సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి గన్నవరం: రాష్ట్ర ప్రభుత్వ వైఫలాల్యలను ప్రశ్నించిన ప్రశ్న రావణ్పై రాజద్రోహం వంటి కేసులు నమోదు చేయడం దుర్మార్గమని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. గన్నవరం కోర్టులో రావణ్ కస్టడీ పిటీషన్పై వాదనలు వినిపించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రావణ్ను కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ను పోలీసులు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. విచారణ దశలో ఉన్న కస్టడీ పిటీషన్లో బలం లేదని ఉపసంహరించుకోవడం తన న్యాయవాద వృత్తిలో తొలిసారి చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలోని ఓ వ్యక్తిని సంతృప్తి పరిచేందుకు రావణ్పై రాజద్రోహం వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగించడం సరికాదన్నారు. ఇది న్యాయ సమ్మతం కాదనే ఉద్దేశంతో రావణ్కు మద్దతుగా వాదించేందుకు ముందుకువచ్చినట్లు చెప్పారు. నిజంగా దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా రావణ్ వ్యాఖ్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వమే ఎన్ఐఏ వంటి కేసు నమోదు చేయాలని సూచించారు. కానీ రాష్ట్రంలో కూటమి పార్టీల భద్రత కోసమే ఈ అక్రమ కేసులు పెట్టినట్లుగా ఉందన్నారు. హిట్లర్ మాదిరిగానే కూటమి ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందన్నారు. ఇదే పంథా కొనసాగితే రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రక్షణ ఉండదన్నారు. ప్రభుత్వాన్ని గొంతెత్తి ప్రశ్నించిన, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరిన రావణ్కు పట్టిన గతే పడుతుందని కూటమి పాలకులు సాంకేతాలు ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటికై న ప్రజాస్వామ్యవాదులందరూ గొంతెత్తాలని కోరారు. హిడ్మా మృతిపై చేసిన వ్యాఖ్యలకు రావణ్ను ఉరితీసేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులపై పెట్టే ఉపా కేసులను యూట్యూబర్ రావణ్పై నమోదు చేయడమంటే ఇంత కంటే దుర్మార్గం రాష్ట్రంలో మరోకటి ఉండదని మరో సీనియర్ న్యాయవాది సుదర్శన్రెడ్డి తెలిపారు. గతంలో కూడా భావప్రకటన స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టిందన్నారు. న్యాయవాదులు తిరివీధి వెంకయ్య, టి. కట్రావు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు ప్రాధాన్యం
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం సాయంత్రం మండల విద్యాశాఖాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు యూనిఫాంతో పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ముఖ ఆధారిత హాజరును ప్రతి రోజూ క్రమం తప్పకుండా నమోదు చేసి పర్యవేక్షించాలన్నారు. ప్రతి రోజూ కనీసం 20 నిమిషాల పాటు యోగా నిర్వహించటం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరిగి ఫలితాలు మరింత మెరుగుపడతాయన్నారు. మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశాలలో నిరంతరం సందర్శిస్తూ హాజరు, క్రమశిక్షణ విద్యాప్రమాణాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. యోగా ఆడియో, వీడియో ఆవిష్కరణ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం ప్రార్ధనా సమావేశం సందర్భంగా విద్యార్థులతో యోగా సాధన నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. యోగా ఆడియో, వీడియోలను సమావేశంలో ఆయన ఆవిష్కరించారు. -
మచిలీపట్నం చేరుకున్న జయశ్రీ భౌతికకాయం
ముగిసిన అంత్యక్రియలు మచిలీపట్నంటౌన్: ఇటీవల వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన జయశ్రీ (జయలక్ష్మి) (50) మృతదేహం మంగళవారం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని సర్కిల్పేటలో ఉన్న ఆమె స్వగృహానికి చేరింది. ఆమె మృతదేహం సోమవారం రాత్రి ముంబై విమానాశ్రయంలోని ఎయిర్కార్గో విభాగానికి చేరింది. క్లియరెన్స్ ప్రక్రియ పూర్తయిన తరువాత మృతదేహాన్ని ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు మంగళవారం ఉదయం 7.20 గంటలకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆమె భౌతికకాయాన్ని ప్రత్యేక అంబులెన్స్లో మచిలీపట్నం తీసుకువచ్చారు. స్వగృహానికి చేరుకున్న జయశ్రీ మృతదేహాన్ని చూసిన ఆమె కుమారుడు ఆకాష్, కుమార్తె ప్రియాంక, బంధువులు విలపించారు. జయశ్రీ భౌతికకాయానికి మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) తదితరులు నివాళులర్పించారు. జయశ్రీ కుటుంబానికి తాము తోడుగా ఉంటామని పేర్ని కిట్టు పేర్కొన్నారు. వియత్నాంలో చికిత్స పొందుతున్న గెల్లి కిషోర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనంతరం జయశ్రీ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
వెయ్యి రూపాయల వివాదం.. మహిళ ఆత్మహత్య
నందివాడ: జనార్ధనపురం (జొన్నపాడు) గ్రామంలో ఓ మహిళ సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సాగర్ గౌరీపట్నం గ్రామానికి చెందిన నక్క భూలక్ష్మి (30) జనార్ధనపురంలోని ఆర్టీఏ ట్రాక్ సమీపంలో లక్ష్మీ గణపతి బ్రిక్స్ కంపెనీలో పనిచేసేందుకు తన సోదరుడు కన్నయ్య, సోదరితో కలిసి నెల క్రితం వచ్చింది. వారం రోజుల క్రితం కన్నయ్య తన సోదరి భూలక్ష్మి నుంచి వెయ్యి రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. కొన్ని రోజులకు అప్పుగా తీసుకున్న సొమ్మును ఇవ్వాలంటూ భూలక్ష్మి కన్నయ్యను కోరగా ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఆ డబ్బులను తిరిగి ఇచ్చేందుకు కన్నయ్య తన చెల్లితో కలిసి గుడివాడ వచ్చాడు. ఈ విషయమై మనస్థాపానికి గురైన భూలక్ష్మి తను ఉరి వేసుకుని చనిపోతున్నానంటూ తన ఫోన్లో స్టేటస్ పెట్టింది. ఆ స్టేటస్ చూసిన పిన్ని ములికి లక్ష్మి కన్నయ్యకు ఈ సమాచారం అందించింది. అతను గుడివాడ నుంచి వచ్చేసరికి భూలక్ష్మి ఇనుపరాడ్డుకు ఉరివేసుకొని ఉంది. వెంటనే ఆమెను కిందకి దింపి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పారు. కన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దుర్గమ్మకు బంగారు హారం సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తుడు మంగళవారం రూ. 3 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిచంద్రపురానికి చెందిన సీహెచ్ వంశీకృష్ణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరంవేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ అధికారి డీవివి సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. డాక్టర్ జవ్వాజి లోకేష్కు గోల్డ్మెడల్ ప్రదానం లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో జనరల్ సర్జరీ విభాగంలో ఉత్తమ అవుట్గోయింగ్ పోస్టు గాడ్యుయేల్ విద్యార్థిగా ఎంపికై న డాక్టర్ జవ్వాజీ లోకేష్కు సోమవారం డాక్టర్ కనకమేడల శ్రీనివాస్ స్మారక గోల్డ్మెడల్ను అందజేశారు. వైద్య కళాశాల సెమినార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎ విష్ణువర్థన్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ పులాల చంద్రశేఖర్ చేతుల మీదగా ఈ మెడల్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు మాట్లాడుతూ జనరల్ సర్జరీలో ఉత్తమ అవుట్గోయింగ్ విద్యార్థికి డాక్టర్ కనకమేడల శ్రీనివాస్ స్మారకార్థం ఆయన పుట్టిన రోజు అయిన జూలై 14న ఏటా ఈ గోల్డ్మెడల్ అందిస్తున్నట్లు తెలిపారు. జీజీహెడ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, జనరల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ పద్మశ్రీ, కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ప్రతినిధులు, మెడల్ గ్రహీత తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైద్య శాఖలో సమస్యలు పరిష్కరించాలని వినతి మధురానగర్(విజయవాడ సెంట్రల్): రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఏర్పడే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని, నిలిచిన సీహెచ్వో, ఇతర కేడర్ ఉద్యోగోన్నతులు పూర్తిచేయాలని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గొంతి ఆస్కార్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆ శాఖ కార్యదర్శి వీరపాండియన్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అందులో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల ఇబ్బందులు, సమస్యలను వివరించారు. కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సాగర్, నాయకులు సత్యనారాయణ, సత్యనారాయణ బాబు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
ఆషాఢ మాసోత్సవాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
ఆలయ అధికారులు, పోలీసు శాఖతో సమీక్ష ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ మాసోత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత మహామండపం లిఫ్టు నుంచి ప్రారంభమైన అధికారుల పరిశీలన, కనక దుర్గనగర్, చైనా వాల్ పరిసర ప్రాంతాల్లో దేవస్థానం చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆషాఢ మాసం నెల రోజులు కనకదుర్గనగర్లో చెప్పుల స్టాండ్, క్లోక్రూమ్తో పాటు మొబైల్ ఫోన్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. అమ్మవారికి సారె సమర్పించే భక్తులు తొలుత కనకదుర్గనగర్లోని దేవస్థాన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అక్కడి నుంచి మహామండపం ర్యాంప్ మీదగా 7వ అంతస్తుకు, ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి చేరుకోవాలన్నారు. అమ్మవారికి సారె సమర్పించే భక్తులను భవానీ అనుగ్రహ దర్శన్ రూ.100 టికెట్ క్యూలైన్లో అనుమతిస్తారన్నారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ ఉత్సవాలలో భద్రతాచర్యలపై పోలీసు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ట్రాఫిక్ ఏడీసీపీ గుణ్ణం రామ కృష్ణ, ఏసీపీ దుర్గారావు, ట్రాఫిక్ ఏసీపీ రామ చంద్రరావు, వన్టౌన్ సీఐ గుణరామ్, ట్రాఫిక్ సీఐ ఉమామహేశ్వరరావు, దుర్గగుడి ఈఈ ఎల్.రమా దేవి, దేవస్థాన ఏసీ రంగారావు, ఇతర ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇద్దరు బాలికలు అదృశ్యం
రెండు గంటల వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగింత గుణదల(విజయవాడ తూర్పు): ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిఽధిలోని గుణదల ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం, గుణదల గంగిరెద్దుల దిబ్బకు చెందిన ఇద్దరు బాలికలు ఉన్నట్టుండి కన్పించకుండా పోయారు. విషయం తెలిసిన తలిదండ్రులు చుట్టుపక్కల ఇళ్లలో, బంధువుల నివాసాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆందోళనకు గురైన బాలికల తల్లిదండ్రులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసిన మాచవరం సీఐ చంద్రశేఖర్ ఆయా ప్రాంతాల సీసీ కెమెరాలను పరిశీలించారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే బందరు రోడ్డు ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి, ఆ బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. జగ్గయ్యపేట: మండలంలోని వేదాద్రి గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని పంట పొలాల వద్ద మృతదేహం ఉన్నట్లు సోమవారం గ్రామస్తులు సమాచారం అందించటంతో సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తిగా గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
పామర్రు: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే మహిళ దుర్మరణం పాలైన ఘటన పామర్రు మండలం అడ్డాడ గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. పామర్రు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డాడ గ్రామానికి చెందిన బొచిన కుమారి(25) తన కుమార్తె బొచిన వీరమ్మ, బంధువు మాదాసు సుబ్బమ్మతో కలిసి దగ్గరలో ఉన్న పెదమద్దాలి శివారు ప్రాంతమైన కొండాయపాలెం వెళ్లి తమ ప్లాస్టిక్ సామాన్లను అమ్ముకున్నారు. అనంతరం అక్కడి నుంచి పామర్రు–గుడివాడ ఎన్హెచ్ –165లో రోడ్డుకు ఎడమ వైపుగా కాలినడకన ఇంటికి బయలు దేరారు. మార్గమధ్యంలో అడ్డాడ అరవింద స్కూల్ వద్దకు చేరుకోగానే అవనిగడ్డ డిపోకు చెందిన అవనిగడ్డ–గుడివాడ ఆర్టీసీ బస్సు వెనుకగా వచ్చి వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బొచిన కుమారి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమార్తె బొచిన వీరమ్మకు గాయాలయ్యాయి. పామర్రు పోలీసులు వెంటనే ఘటనా స్థలం చేరుకుని వీరమ్మను 108లో గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. బసుఐస డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పామర్రు ఎస్ఐ కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు. -
ఎరువు.. మోయలేని బరువు
కృత్తివెన్ను: నమ్ముకున్న భూమిని వదల్లేక.. అప్పుల పాలవుతున్నా.. పుస్తెలు తెగనమ్మయినా పంట పండించాలన్న రైతులకు భారీగా పెరిగిన ఎరువుల ధరలు మోయలేని భారంగా మారాయి. కాలువల్లో సాగు నీరు ఇంకి పోయింది. వర్షాలు కురవక రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నెర్రెలతో నోళ్లు తెరిచిన పంటపొలాలకు సాగు నీరు అందించేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. మరో వైపు పెరిగిన ఎరువుల ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని రకాల ఎరువుల ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. ఫలితంగా సాగు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో దాదాపు 5,47,525 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఖరీఫ్లో సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుతం పెరిగిన ఎరువుల ధరలు తీవ్ర ఆందోళన కలిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం కాంప్లెక్స్ ఎరువుల రేట్లు అధికంగా పెరిగాయని రైతులు వాపోతున్నారు. యూరియా, డీఏపీ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. పెరిగిన ధరలతో కుదేలు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పెరిగిన ఎరువుల ధరలు రైతుకు ఎకరానికి రూ.8,600 నుంచి రూ.10 వేలు అదనంగా భరించాల్సి వస్తోంది. అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు మూడు నుంచి నాలుగు కట్టలు వేస్తారు. వాటిలో అరకట్ట చొప్పున యూరియా కలుపుతారు. పెరిగిన ధర లతో 20–20 రకం ఎరువుకు ఎకరాకు రూ.3 వేలు, 14–35 రకానికి రూ.2 వేలు, 10–26 రకానికి రూ.2 వేలు, 28–28 రకానికి రూ.1600 చొప్పున అదనంగా రైతులు భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం సాగునీరు లేకపోవడంతో ఆయిల్ ఇంజిన్లతో వరి నారుమడులకు నీటి తడులు అందిస్తున్నారు. ఆయిల్ ఖర్చు, ఇంజిన్ అద్దెకు ఎకరాకు రూ.3 వేల వరకు తమపై అదనపు భారం పడుతోందని రైతులు వాపోతున్నారు.సూపర్ ఫాస్ఫేట్ ఆక్వా రైతులు కూడా ప్రభుత్వానికి భూమి శిస్తులు చెల్లిస్తారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1,44,702 ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. 1,07,970 ఎకరాలు అధికారిక ఆక్వాజోన్ పరిధిలో, 36,732 ఎకరాలు నాన్ ఆక్వాజోన్ పరిధిలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన యాప్ విధానంతో ఆక్వా రైతులకు కావాల్సిన ఎరువులు అందకుండా పోయాయి. ఆక్వా చెరువుల్లో నీరు ప్లాంటేషన్తో మేత విలువలు పెరగడంతో పాటు పోషకాలు వృద్ధి చెందడానికి సూపర్ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులను ఉపయోగిస్తారు. గతేడాది వరకు ఈ ఎరువు లను కోరుకున్న ఆక్వా రైతులకు నేరుగా అందించేవారు. ప్రస్తుతం వచ్చిన యాప్ విధానంతో వ్యవసాయానికి మాత్రమే ఎరువులు అందిస్తు న్నారు. దీంతో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కనీసం ప్రైవేటు ఎరువుల షాపుల్లో సైతం ఎరువుల దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఆక్వా రైతులు ఎరువులు అందక ఆందోళన చెందుతున్నారు. ఆక్వా రంగానికి సైతం కావాల్సిన ఎరువులను యాప్ ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆక్వా రైతులకు ఎరువులు ఇవ్వకపోవడంపై ఫిషరీస్ ఏడీ జల్లా సీతారామరాజును వివరణ కోరగా.. యాప్ సమస్యతో రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, దీనిపై కలెక్టర్కు నివేదించామని తెలిపారు. -
కానూరు ఆటోనగర్లో ఐస్క్రీమ్ ఫ్యాక్టరీ దగ్ధం
పెనమలూరు: కానూరు కొత్త ఆటోనగర్లో శ్రీ విజయదుర్గ ఫుడ్స్(ఐస్క్రీమ్) ఫ్యాక్టరీ ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. రాత్రి సమయంలో ఫ్యాక్టరీలో హఠాత్తుగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించి మిషన్లు, ఫర్నిచర్, సరుకు అగ్నికి కాలి బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటోనగర్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే మొదటి విడత కౌన్సెలింగ్లో దరఖాస్తు చేసుకుని సీటు రాని విద్యార్థులు, మొదటి విడత కౌన్సెలింగ్కు హాజరు కాని వారికి ఈ నెల 15వ తేదీ బుధవారం జనరల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్లో భర్తీ కాగా మిగిలిన సీట్లను ఈ జనరల్ కౌన్సెలింగ్లో భర్తీ చేస్తామని తెలియజేశారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ అన్ని ఒరిజినల్స్తో కౌన్సెలింగ్కు హాజరు కావాలని తెలియజేశారు. వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు. కోనేరుసెంటర్: ద్విచక్ర వాహనం ఢీకొనటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన మద్దూరి సూర్యప్రసాదరావు (53) కూలి పనులు చేస్తుంటాడు. ఆదివారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా చిలకలపూడి రైల్వేస్టేషన్కు సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్ సూర్యప్రసాదరావును ఢీకొంది. ఈ ఘటనలో బాధితుడికి బలమైన గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు రమణసాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. గన్నవరం: యూ ట్యూబర్ ప్రశ్న రావణ్పై గన్నవరం పోలీస్స్టేషన్లో రాజద్రోహం, తదితర సెక్షన్ల కింద నమోదైన కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు ప్రశ్న చానల్ సీఈఓ గమన, ఆ చానల్కు ఫ్లాట్ను అద్దెకు ఇచ్చిన ఇంద్రసేననాయుడుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. స్థానిక సబ్ డివిజన్ కార్యాలయంలో ఈ కేసు విచారణాధికారి డీఎస్పీ కె.ధర్మేంద్ర నేతృత్వంలో వారిద్దరిని ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. మళ్లీ 17న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇటీవల మాదాపూర్లోని స్డూడియోలో స్వాధీనం చేసుకున్న సాంకేతిక పరికరాలను గమన, ఇంద్రసేననాయుడు సమక్షంలోనే సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించినట్లు తెలుస్తోంది. విచారణలో గన్నవరం సీఐ బీవీ శివప్రసాద్ పాల్గొన్నారు. ఉద్యమ కార్యాచరణపై ఉద్యోగ సంఘాలతో సమావేశం మధురానగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అనంతరం ఉద్యమ కార్యాచరణపై తుది నిర్ణయం ప్రకటిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా కమిటీ ప్రకటించింది. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడంపై కమిటీ హర్షం వ్యక్తం చేసింది. సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, చైర్పర్సన్ స్వరాజ్యలక్ష్మి, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ పారె లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి పాల్గొన్నారు. -
రైతుల గోడు పట్టని సర్కారు
బంటుమిల్లి: చంద్రబాబు ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రమేష్(రాము) ఆరోపించారు. బంటుమిల్లి ప్రధాన కాలువకు నీటి విడుదలపై పాలకులు, నీటీపారుదల శాఖ అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఇరిగేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యాలయం వద్ద బంటుమిల్లి ప్రధాన కాలువలో నీటి పారుదల రీడింగ్ పరిశీలించిన అనంతరం రాము విలేకరులతో మాట్లాడుతూ బంటుమిల్లి ప్రధాన కాలువకు దాదాపు 900 క్యుసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉండగా కేవలం 300 క్యుసెక్కుల నీరు ఇచ్చారని.. ఇది ఏ రైతు పంటను కాపాడుతుందని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో సాగు నీరు అందక వెద చల్లిన పొలాలు ఎండిపోతు రైతులు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ నిద్రపోతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ తీర ప్రాంత భూముల్లో వరి తప్ప ఏది పండని చోట రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ఇచ్చి ఆదుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్ రవికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బంటుమిల్లి, కృత్తివెన్ను మండల పార్టీ అధ్యక్షులు ఎం. నాగేశ్వరరావు, జె. భూపతిరాజు, ఎంపీపీలు కె. గరుడప్రసాదు, ఎస్. మధుసూదన్రావు, వైస్ ఎంపీపీ ఓ. చిన్నారిబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ కె. గంగాధర్, జెడ్పీటీసీ ఎం. రత్నకుమారి, ఎంపీటీసీలు పి. వీరబాబు, ఎండి. కమాల్బాషా, ఎండీ. ఆలీం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా స్థానిక లక్ష్మీపురం సెంటర్లో బంటుమిల్లి ప్రధాన కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా, మండల కన్వీనర్లు జి. నాగేశ్వరరావు, ఎల్. అజయ్కుమార్, సీపీఎం మండల పార్టీ కన్వీనరు ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు. సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన -
తిరువూరు టీడీపీలో ప్రొటోకాల్ రగడ
తిరువూరు/గంపలగూడెం: గంపలగూడెం మండలం ఊటుకూరు కృష్ణదేవరాయ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఎమ్మెల్యే పేరు లేదంటూ ఆయన వర్గం సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించడం వివాదానికి దారి తీసింది. సహకార సంఘంలో ఆధునికీకరించిన కల్యాణమంటపం, ఆర్వో ప్లాంటు ప్రారంభోత్సవం, గ్రామ ప్రముఖుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్లను నిర్వాహకులు ఆహ్వానించారు. శిలాఫలకంపై వారి పేర్లు మాత్రమే ముద్రించారు. స్థానిక శాసనసభ్యుడైన కొలికపూడి శ్రీనివాసరావును ఆహ్వానించకపోగా, ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకంపై ఆయన పేరు కూడా ముద్రించకుండా దళిత ఎమ్మెల్యేను అవమానించారంటూ ఆయన వర్గీయులు సోమవారం సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడంతో ఎంపీ కేశినేని చిన్ని, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేదు. ఎమ్మెల్యేపై ధ్వజం ఇదిలావుండగా సహకార సంఘ చైర్మన్ చెరుకూరి రాజేశ్వరరావు కల్యాణ మంటపం ప్రారంభించిన అనంతరం సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొలికపూడి తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. గ్రామ, మండల కమిటీలు నియమించడంలో ఎమ్మెల్యే ప్రమేయం ఏమిటని, సిన్సియర్ కార్యకర్తలను అణగదొక్కి తన అడుగులకు మడుగులొత్తే వారితో కమిటీలు వేయాలని ఎమ్మెల్యే యత్నించడంతో తామంతా వ్యతిరేకించామన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించేటపుడు పార్టీ పదవుల్లో ఉన్న నాయకులకు కనీస మర్యాద ఇవ్వరని, వారికి సమాచారం ఇవ్వకపోవడం గర్హనీయమని అన్నారు. ఎదుటివారిని గౌరవించని ఎమ్మెల్యేని ఎవరూ గౌరవించరని, ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే కనీసం పట్టించుకోలేదని, కార్యకర్తలే నిర్వహించారన్నారు. తమకు పార్టీయే ముఖ్యమని, పార్టీ ఆదేశానుసారం నడచుకుంటామని చెరుకూరి అనడం గమనార్హం. -
పాలు పొంగని ఇళ్లలో పాపాలు!
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పాలు పొంగించి పిల్లా పాపలతో కళకళలాడాల్సిన లోగిళ్లు అవి...అధికారుల అలసత్వమో... పాలకుల వైఫల్యమో కానీ పేదలకు కేటాయింపులు జరగాల్సిన ఫ్లాట్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. నగరంలోని కాల్వ గట్టు, రోడ్డు విస్తరణల సమయంలోనూ, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న పేదల ఇళ్లు తొలగించి వారికి జక్కంపూడి కాలనీలో ఫ్లాట్లు కేటాయింపులు జరిగేవి. అయితే కాలనీలోని వాటర్ ట్యాంక్, ప్రాథమిక పాఠశాల సమీపంలో బ్లాక్ నంబరు 252 నుంచి 263 వరకు ఎటువంటి కేటాయింపులు జరగలేదు. దీంతో సుమారు 350 కుటుంబాలకు దక్కాల్సిన ఫ్లాట్లు నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. చీకటి పడితే చాలు కాలనీలోని యువకులు మద్యం తాగేందుకు పేకాట ఆడేందుకు ఈ ఖాళీ బ్లాకులను ఆవాసాలుగా ఎంచుకుంటున్నారు. చోరీకి గురవుతున్న తలుపులు, కిటికీలు మొత్తం 11 బ్లాకుల్లో సుమారు 350 ఫ్లాట్లను నగర పాలక సంస్థ పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. అయితే 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, ఆ తర్వాత పేదల కష్టాలను ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఫ్లాట్ల కేటాయింపుల ఊసే లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో సిద్ధమైన ఫ్లాట్లలో నేడు ధ్వంసమైన తలుపులు, కిటికీలు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఫ్లాట్లకు ఉండాల్సిన తలుపులు, కిటికీలను దొంగలు ఎత్తుకుపోయారు. ఇక బ్లాక్లో ప్రతి ఇంటికీ వేసిన డ్రైనేజీ పైపులు, ప్లాస్టిక్ పంపులు సైతం మాయం అయ్యాయి. ఆ 11 బ్లాకులు వారికి అడ్డాగా మారాయి రాత్రి వేళ పూర్తి స్థాయిలో మందుబాబులకు తోడు గంజాయి తాగే వారికి ఆ ప్రాంతం అడ్డాగా మారిపోయిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటితో నిర్మానుష్యంగా ఉండే ఖాళీ ఫ్లాట్ల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడపా దడపా కొత్తపేట పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నా.. ముందుగానే సమాచారం రావడంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు అక్కడి నుంచి జారుకుంటున్నారు. 11 బ్లాకులలో ఏ బ్లాక్లో చూసినా మద్యం సీసాలు, పగలగొట్టిన గాజుముక్కలు, పేకాట ముక్కలు, సగం తిని వదిలేసిన బిరియానీ ప్యాకెట్లే దర్శనమిస్తున్నాయి. వెంటనే కేటాయింపులు జరగాలి... కాలనీకి ప్రధాన సమస్యగా ఉన్న ఈ ఫ్లాట్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయింపులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఫ్లాట్లను ఇలాగే వదిలేస్తే మరి కొన్నేళ్ల తర్వాత లబ్ధిదారులకు కేటాయింపులు జరిగినా వారు ఉండేందుకు అనువుగా ఉండవని అంటున్నారు. -
నీట ముంచిన నిర్లక్ష్యం
జి.కొండూరు: బుడమేరు ఉగ్రరూపం దాల్చి డైవర్షన్ కెనాల్కు గండ్లు పడటంతో వరద ముంపు నకు గురై రెండేళ్లు కావస్తున్నా ప్రజల్లో బుడమేరు భయాన్ని తొలగించడంలో ప్రభుత్వం సఫలం కాలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం బుడమేరు డైవర్షన్ కెనాల్ ఆధునికీకరణ పనులకు పెను శాపంగా మారింది. గండ్ల వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులే ఏడాదిగా పూర్తి చేయలేని ప్రభుత్వం లైనింగ్ పనులను హడావిడిగా చేపట్టింది. తొల కరి వానలతో ఈ పనులు సైతం నత్తనడకన సాగుతూ పట్టిసీమ నీటి విడుదలతో పూర్తిగా నిలిచిపోయాయి. లైనింగ్ పనులు చేస్తున్న యంత్రాలు ఒడ్డుకు చేరాయి. నిర్మాణాలు మునిగిపోయాయి. మరో ఆరు నెలలపాటు ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదు. లైనింగ్ పనుల కోసం కెనాల్ గట్లను తవ్వి వదిలేయడంతో పట్టిసీమ నీటి ప్రవాహానికి కోతకు గురవుతు న్నాయి. భారీ వర్షాలు కురిస్తే గండ్లు పడి మరో సారి వరద ముంచెత్తే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హడావుడి పనులకు బ్రేక్ బుడమేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర బుడమేరు డైవర్షన్ కెనాల్ ఉంది. ఈ కాలువ అటు బుడమేరు వరద ప్రవాహంతో పాటు ఇటు పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా వచ్చే పట్టిసీమ నీటిని సైతం కృష్ణానదిలో కలుపుతుంది. 2024 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు డైవర్షన్ కెనాల్కు భారీ గండ్లు పడి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ రోజుల తరబడి నీట మునిగాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ తర్వాత బుడమేరు ఆధునికీకరణ చేస్తామంటూ ముఖ్యమంత్రి నుంచి అధికార పార్టీ నాయకులందరూ ఊదరగొట్టారు. వరదలొచ్చిపోయిన 20 నెలల తర్వాత ఇటీవల బుడమేరు డైవర్షన్ కెనాల్ ప్రారంభం నుంచి 8.3 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులకు ప్రభుత్వం రూ.121 కోట్లు మాత్రమే కేటాయించింది. వర్షాలు పడితే ముందుకు సాగవని తెలిసినా మే నెలలో హడావుడిగా ఆలైనింగ్ పనులు ప్రారంభించింది. జూన్లో తొల కరి జల్లులతో నత్తనడకన సాగిన ఈ పనులు పట్టిసీమ నీటి రాకతో ఈ నెల 11వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ఒకవేళ వర్షాలు కురవకపోతే పట్టిసీమ నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంది. వర్షాలు అధికంగా కురిస్తే ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం డైవర్షన్ కెనాల్ నుంచే కృష్ణానదిలో కలవాల్సి ఉంది. దీనితో మరో ఆరు నెలల పాటు లైనింగ్ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడంలేదు. హడావుడిగా చేపట్టిన లైనింగ్ పనులు, బ్యాలన్స్ రిటైనింగ్ వాల్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాలెన్స్ రిటై నింగ్ వాల్ నిర్మాణం కోసం కట్టను ఎడమ వైపు తవ్వి వదిలేయడంతో పట్టిసీమ నీటి ప్రవాహానికి కోతకు గురవుతోంది. ఒకవేళ భారీ వర్షాలు పడి ఎగువ నుంచి వరద పోటెత్తితే, కోతకు గురైన ప్రదేశంలో గండి పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెను ప్రమాదం సంభవించకముందే అధికారులు అప్రమత్తం కావాలని కోరుతున్నారు. -
మునిగిపోయిన నిర్మాణాలు
పట్టిసీమ నీటి రాకతో గతేడాది నిర్మాణ దశలో ఆగిపోయిన రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, లైనింగ్ పనుల నిర్మాణాలు మునిగిపోయాయి. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్లు పడిన ప్రదేశంలో ఎడమవైపు 8.65 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పు, 500 మీటర్ల పొడవున, కుడి వైపు అంటే శాంతినగర్ వైపు ఇవే కొలతలతో 50 మీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. గతేడాది ఈ పనులు జరుగుతున్న సమయంలో పట్టిసీమ నీరు విడుదల చేయడంతో ఎడమవైపు 360 మీటర్లు పొడవున మాత్రమే రిటైనింగ్ వాల్ నిర్మించి జూన్ 9వ తేదీతో పనులను ఆపేశారు. ఎడమ వైపు 140 మీటర్లు పొడవున, కుడి వైపున యాభై మీటర్ల పొడవున నిర్మించాల్సిన రిటైనింగ్ వాల్ పనులను ఫిబ్రవరిలో ప్రారంభించాల్సి ఉంది. ఈ పనులను మే నెలలో ప్రారంభించడంతో పట్టిసీమ నీటి రాకతోనే మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నిర్మాణాలకు వాడుతున్న ఇనుము సైతం నీటిలో నానుతుండడంతో భవిష్యత్తులో దీని సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. -
పోలీస్ పీజీఆర్ఎస్లో 85 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): G±-tBÆŠ‡ hÌêÏ ´ùÎ‹Ü MýSÑ$-çÙ-¯]lÆó‡sŒæ M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ ÝùÐ]l$ÐéÆý‡… °Æý‡Ó-íßæ…-_¯]l ï³i-B-ÆŠ‡-G‹Ü M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ {ç³fÌS ¯]l$…_ 85 íœÆ>ŧýl$Ë$ A…§éƇ$$. ´ùÎ‹Ü MýSÑ$-çÙ-¯]lÆŠ‡ G‹ÜÒ Æ>f-ÔóæQ-Æý‡-»êº$ B§ól-Ô>ÌS Ðól$Æý‡MýS$ yîlïÜï³ H½-sîæG‹Ü E§ýl-Ķæ$-Æ>×ìæ {ç³fÌS ¯]l$…_ íœÆ>ŧýl$Ë$ ïÜÓMýSÇ…^éÆý‡$. Ððl¬™èl¢… 85 íœÆ>ŧýl$Ë$ Æ>V>, ÐésìæÌZ A™èlÅ-«¨-MýS…V> BíÜ¢ ÌêÐé-§ól-Ò-ÌSMýS$ çÜ…º…«¨…-_-¯]lÐól E…yýl-r… ÑÔóæçÙ…. BíÜ¢ ÑÐé-§éË$, ¯]lVýS§ýl$ ÌêÐé-§ól-ÒÌSOò³ 31,️ ¿êÆ>Å¿ýæÆý‡¢Ë$, MýS$r$…º MýSÌS-à-ÌSOò³ 9, ️ÑÑ«§ýl Ððl*Ýë-ÌSOò³ 15,️ Ð]l$íßæâê çÜ…º…-«¨™èl ¯ólÆ>ÌSMýS$ çÜ…º…«¨…_ 10, ️ MösêÏ-rÌSOò³ 3, ️ §ö…VýS™èl¯é-ÌSMýS$ çÜ…º…-«¨…_ 3, ‡ ÑÑ«§ýl çÜÐ]l$çÜÅ-ÌS™ø 14 íœÆ>ŧýl$Ë$ A…§éƇ$$. -
సమస్యలకు సత్వర పరిష్కారం
జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మీకోసం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. ఇంకొన్ని అర్జీలను సంబంధిత స్టేషన్ అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లలో అధికారులు, సిబ్బంది ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా ఆలకించి పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు మేమున్నాం అనే భరోసాను కల్పించాలన్నారు. అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. మీకోసంలో 50 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. మీకోసంలో వచ్చిన ప్రధానమైన అర్జీలు -
శ్రీనివాసమంగాపురం చిత్ర యూనిట్ సందడి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరంలో ‘శ్రీనివాస మంగాపురం’ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఆదివారం అప్సర థియేటర్లో సూపర్స్టార్ కృష్ణ మనువడు జయకృష్ణ నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ట్రైలర్ విడుదల జరిగింది. కథానాయకుడు జయకృష్ణ, కథానాయిక రషా తడాని, చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాత ఆదిశేషగిరిరావు, చిత్ర నిర్మాత జెమిని కిరణ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో జయకృష్ణ మాట్లాడుతూ తన తాత సూపర్స్టార్ కృష్ణ తనకు దేవుడిలాంటి వారని భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే తన బాబాయ్ మహేష్ బాబు ఈ సినిమా నిర్మాణంలో, షూటింగ్ సమయంలో ఎంతో మద్దతుగా నిలిచారన్నారు. త్వరలోనే ప్రీ–రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ’శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ను విజయవాడ వేదికగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. హీరో, హీరోయిన ఇద్దరూ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారన్నారు. సినిమా అన్ని వర్గాలను అభిమానిస్తుందని తెలిపారు. తొలుత లెనిన్ సెంటర్లో కృష్ణ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీరం బుజ్జి, సుధా స్వామి తదితరులు పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో మృతదేహంగుంటూరు రూరల్: కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో వ్యక్తి మృతదేహం ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... పొత్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం క్వారీ గుంతలో ఛిద్రమైన స్థితిలో ఉందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహంపై వస్త్రాలు లేవని పోలీసులు గుర్తించారు. కాళ్లను తాళ్లతో కట్టారని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రుద్ర ట్రస్ట్ సహకారంతో జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎక్కడైనా చంపి ఇక్కడకు తెచ్చి పడేశారా? ఇక్కడే హత్య చేశారా? అనే కోణాలలో దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో మృతుడు తాడికొండ మండలం ఫణిదరం గ్రామానికి చెందిన మాడుగుల శంకరరావు (52)గా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడని తేలింది. ఈ నెల 7వ తేదీన చిలకలూరిపేటలో పని ఉందని ఇంటి నుంచి బయటకు వచ్చాడని, తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలిసింది. కుటుంబసభ్యులకు నల్లపాడు పోలీసులు సమాచారం అందించారు. వ్యాపార లావాదేవీల వల్ల హత్య చేశారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాలలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థిని అదృశ్యం
నందిగామ రూరల్: ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థిని తెల్లవారుజాము సమయంలో అదృశ్యమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వీరులపాడు మండలం చెన్నారావుపాలెంకు చెందిన నీనావత్ జ్యోతిక పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థిని. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి కూడా తోటి విద్యార్థులతో కలిసి వసతి గృహంలో నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో విద్యార్థిని లేకపోవటాన్ని గుర్తించిన ప్రిన్సిపాల్ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. బాలిక పాఠశాల నుంచి వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలోని స్నేహితురాలి నివాసానికి వెళ్లినట్లు సీఐ పి.శ్రీను పర్యవేక్షణలో గుర్తించారు. అక్కడి నుంచి విద్యార్థినిని పట్టణంలోని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి ప్రిన్సిపాల్, తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థిని 20 రోజుల క్రితమే పాఠశాలలో చేరిందని నాలుగైదు రోజుల నుంచి ఇంటికి వెళ్తానంటే తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవటంతో పంపించలేదని ప్రిన్సిపల్ తెలిపారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఆరు గంటల వ్యవధిలో బాలిక ఆచూకీ కనిపెట్టి అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోహనరావు, పలువురు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
కాలువలు ఎండి.. రైతు కంట తడి!
పెడన: నియోజకవర్గంలో రైతు గోడు వినేవారు కానరావడం లేదు. సాగునీటిపై స్పష్టత కరువవడంతో ఇబ్బంది పడుతున్నారు. నీరు లేక వరినారుమడులు ఎండిపోతున్నాయి. నియోజకవర్గంలోని బంటుమిల్లి కాలువ పూర్తిగా ఎండిపోయింది. వేసవిలో సైతం నీరుండే ఈ కాలువలో నీరు లేకపోవడం, ప్రస్తుతం అరకొరగా నీటిని విడుదల చేయడంపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు తడిసి మోపెడు కాలువలు ద్వారా వస్తున్న అరకొర నీటిని వచ్చింది వచ్చినట్లుగా రైతులు తోడేస్తున్నారు. పూర్తిస్థాయిలో నీరు వస్తే పంటబోదెల ద్వారా పొలాలకు నీరు చేరుతుంది. అంతంత మాత్రంగా వస్తున్న నీటిని తప్పనిసరి స్థితిలో మోటారు ఇంజిన్తో తోడుకోవాల్సి వస్తోంది. లీటరు డీజిల్ రూ.110, ఇంజిన్ అద్దె గంటకు రూ.250. ఇంజిను తీసుకువచ్చినప్పటి నుంచి సమయం లెక్కింపు. నీరందకపోతే ఎంత సమయం పడుతుందోననే రైతులు ఆందోళన పడుతున్నారు. నీరు అంతంత మాత్రమే వస్తుండటంతో ఇంజిన్ తీసుకురావడానికి రైతులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బంటుమిల్లి కాలువకు శనివారం నీరు వచ్చింది. ఆదివారం ఆ నీటి ప్రవాహం కాస్తా మందగించింది. -
స్పష్టత లేదు
రైతులు చాలా మంది వెదపద్ధతిలో నారుమడి వేసుకున్నారు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. అదను దాటిపోయింది. రైతులను మొదటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. విత్తనాలు సబ్సిడీ విషయంలో, అన్నదాత సుఖీభవ పథకంలోను, రైతులకు నష్టపరిహారం విషయంలో ఇలా అనేకమార్లు మోసం చేస్తూ వచ్చింది. ఇప్పుడు పంట ప్రారంభదశలోనే సాగునీటి విషయంలో ప్రభుత్వం దోబుచూలాడుతుంది. – గరికపాటి చారుమతిరామానాయుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్పర్సన్, పెడన సాగు నీరు విషయంలో అధికారులకై నా స్పష్టత ఉండాలి. వారు ఏం చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చేది, విత్తనాలు ఎప్పుడు వేసుకోవాలనే వాటి గురించి రైతులకు ముందుగా తెలియజేయాలి. అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయకపోవడం చాలా బాధకరం. పట్టిసీమ ద్వారా నీరు ఇచ్చేసామని, నీరు వస్తుందని అంటున్నారు. బంటుమిల్లి కాలువకు నీరు పూర్తిగా రావడం లేదు. దీంతో అనుసంధానంగా ఉన్న పంట కాలువలకు నీరు రాని దుస్థితి. – కట్టా శ్రీనివాసరావు, రైతు, లంకలకలువగుంట, పెడన మండలం -
ప్రధాన సమస్యగా నిద్రలేమి
ఇప్పుడు విజయవాడలో సగం మందికిపైగా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో వస్తున్న అనారోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమనే విషయాన్ని గుర్తించలేక పోతున్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. ఇప్పుడు స్లీప్ ఆప్నియా ప్రధాన సమస్యగా మారింది. అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. అలాంటి వారికి స్లీప్ స్టడీ అందుబాటులోకి వచ్చింది.ఈ టెస్ట్ ద్వారా వారి సమస్యను గుర్తించి తగిన చికిత్స పొందవచ్చు. అర్ధరాత్రి దాటే వరకూ నిద్రపోకుండా ఉండటం కూడా మంచిది కాదు. –డాక్టర్ మొవ్వ పద్మ, క్రిటికల్ కేర్ నిపుణులు, విజయవాడ -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
పామర్రు: చిన్నపాటి విభేదాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య యత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఘటన పామర్రు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పామర్రు మండలం నెమ్మలూరు శివారు మలయప్పన్న పేట గ్రామానికి చెందిన కాకి పవన్కుమార్(35) భార్య నాగలక్ష్మితో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. దాంపత్య జీవితంలో కుటుంబ విషయాలకు సంబంధించిన చిన్న చిన్న విభేధాల కారణంగా భార్య తన పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన పవన్కుమార్ ఈనెల 11వ తేదీ ఉదయం పురుగుల మందును తాగాడు. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే మచిలీపట్నంలోని ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. అదృశ్యమైన వ్యక్తి విగతజీవిగా మున్నేటిలో లభ్యం నందిగామ రూరల్: రెండు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి మృతదేహం మునేటిలో లభ్యమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన ఉప్పుటూరి అప్పారావు కొంతకాలంగా నందిగామ పట్టణం, వత్సవాయిలో పురుగుల మందుల దుకాణాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న వత్సవాయిలోని దుకాణం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేదు. దీంతో ఈ నెల 11వ తేదీ అతని భార్య ఉమామహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న మృతుని బావమరిది (భార్య సోదరుడు) రాఘవాపురం సమీపంలోని మున్నేటి వద్ద రోడ్డు పక్కగా అప్పారావు ద్విచక్ర వాహనం నిలిపి ఉండటాన్ని గమనించాడు. బహిర్భూమికి వెళ్లి ఉంటాడని భావించి వేచి ఉన్నా ఎంత సేపటికి రాకపోవడంతో అనుమానం వచ్చి మున్నేటి వద్దకు వెళ్లి చూశాడు. అతని మృతదేహం కనిపించటంతో కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీను తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నిద్రలేమి.. నిశ్శబ్ద మహమ్మారి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు నిద్ర అనేది రోజువారీ జీవితంలో సహజమైన విశ్రాంతి. ఇప్పుడు అదే నిద్ర చాలా మందికి అందని వరంగా మారుతోంది. పని ఒత్తిడి, అర్ధరాత్రి వరకు కొనసాగే నైట్ కల్చర్, స్మార్ట్ఫోన్ల వ్యసనం, మారుతున్న జీవనశైలి.. ఇవన్నీ కలిసి నగరవాసుల నిద్రను దూరం చేస్తున్నాయి. ఫలితంగా నిద్రలేమి నిశ్శబ్దంగా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం నగరంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు సరిపడా నిద్రపోవడం లేదు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావించినా, దీని ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవంపై పడుతోంది. అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలతో పాటు గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహం, డిప్రెషన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతోంది. తీవ్రమైన రుగ్మత స్లీప్ ఆప్నియా నిద్రలో పదే పదే శ్వాస ఆగిపోవడం, మళ్లీ ప్రారంభం కావడం జరిగే ఒక తీవ్రమైన నిద్ర రుగ్మత స్లీప్ ఆప్నియా. ఇది ఉన్న వారికి నిద్రలో శరీరానికి తగినంత గాలి అందదు. గుండెపోటు, మెదడుపోటు వంటి ప్రాణాంతక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. స్లీప్ ఆప్నియాకు ఊబకాయం, పెద్ద టాన్సిల్స్, అడినాయిడ్స్, ధూమపానం, మద్యం వాడకం, కొన్ని రకాల మందులు, నార్కోలెప్సి వంటి నిద్ర రుగ్మతలు ప్రధాన కారణంగా చెపుతున్నారు. ఇలాంటి వారు బిగ్గరగా గురక వేయడం, నిద్రలో గాలికోసం గ్యాస్పింగ్, ఎండిపోయిన నోరుతో నిద్ర మేల్కొనడం, ఉదయం తలనొప్పి, పగలు అధిక నిద్ర, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్లీప్ స్టడీ ఇలాంటి వారి కోసం స్లీప్స్టడీ అందుబాటులోకి వచ్చింది. ఇంటికే వచ్చి స్లీప్ టెస్ట్ నిర్వహిస్తారు. వారు ఏ రకమైన నిద్రలేమితో బాధపడుతున్నారో నిర్ధారిస్తారు. నిద్రలో మెదడుకు ఆక్సిజన్ ఎలా అందుతుంది. హార్ట్ బీట్ ఎలా ఉంది అనే అంశాలను గమనిస్తారు. నైట్కల్చర్తో.. నగరంలో నైట్ కల్చర్ పెరిగిపోయింది. అర్ధరాత్రి వరకూ రోడ్లపై గడిపే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఇళ్లలో ఉన్న వారు కూడా అర్ధరాత్రి దాటే వరకూ స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో అనేక మంది నిద్రలేమి సమస్య వెంటాడుతున్నాయి. తమకు ఆ సమస్యలు నిద్రలేమితో వస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనించలేక పోతున్నారు. దీంతో తీవ్రమైన వత్తిడి కారణంగా మధుమేహం, అదిక రక్తపోటుతో పాటు డిప్రెషన్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. -
భాషాసంస్కృతులను కాపాడుకోవాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవటానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతిని పురస్కరించుకొని కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న మూడో అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు సభలో ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. తెలుగునాట మహిళా రచయిత్రులు అందించిన సాహితీసేవలు అపూర్వమన్నారు. రెండు రోజుల పాటు జరిగిన మహాసభలు ఆద్యంతం తెలుగు సాహితీవైభవానికి అండగా నిలిచాయని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్మన్ బోడుపాటి తేజస్విని మాట్లాడుతూ.. దేశంలో తెలుగు సంస్కృతికి ప్రత్యేకమైన స్థానముందన్నారు. బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.ఆర్.రజని మాట్లాడుతూ.. తెలుగు రచయిత్రుల విశిష్టతను వివరించారు. మహాసభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, కార్యనిర్వాహక గౌరవాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. సమాజానికి మార్గదర్శి మహిళలేనన్నారు. సమాజానికి తమ సాహిత్యం ద్వారా సేవలందించిన ప్రఖ్యాత రచయిత్రుల సేవలను వివరించి వారిని కొనియాడారు. అనుచితంగా మాట్లాడితే.. రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవీ పూర్ణచంద్ ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను ఆమోదింపజేశారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తించటం, మాట్లాడటం చేసిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలని, సోషల్మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించేలా కొత్త చట్టాలు తీసుకురావాలని సూచించారు. సామాజిక చైతన్యానికి పాటుపడాలి.. సామాజిక చైతన్యానికి రచయిత్రుల పాటుపడాలని పలువురు ప్రముఖ రచయిత్రులు పేర్కొన్నారు. తెలుగు పరిశోధనా రంగం, విద్యారంగం, సాంస్కృతికరంగం, తెలుగు భాషోద్యమం, రాష్ట్రేతరుల సమావేశం ఇలా పలు సదస్సులు వేరువేరు వేదికలపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొనసాగాయి. ఆంధ్రా విశ్వవిద్యాలయం తెలుగు విభాగ ఆచార్యురాలు డాక్టర్ దేవులపల్లి పద్మజ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విభాగ ఆచార్యులు ఆచార్య వంగరి త్రివేణి, పలువురు సాహితీ వేత్తలు ప్రసంగించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు (60) గులాబీ, తెలుపు, బ్లూ చారలు కలిగిన ఫుల్ హ్యాండ్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు. ఈ వ్యక్తి గ్రామంలోని సీడబ్ల్యూసీ గోదాము వద్ద నున్న బస్స్టాప్లో గత కొన్ని రోజులుగా ఉంటున్నాడని వివరాలు అడిగితే చెప్పేవాడు కాదని స్థానికులు తెలిపారు. బస్స్టాప్లో కూర్చున్న స్థితిలోనే మృతి చెందడాన్ని ఉదయం స్థానికులు గుర్తించి పటమట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి గురించి ఆచూకీ తెలిసిన వారు పటమట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ 94406 27036కు సమాచారం అందించాలని సూచించారు. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026గందరగోళం లోక్ అదాలత్తో శాశ్వత పరిష్కారం 7వియత్నాం దేశంలోని ఫు క్వాక్ సముద్ర తీరంలో జరిగిన విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. ఘటనలో బందరుకు చెందిన వ్యాపారవేత్త గెల్లి కిషోర్ భార్య మరణించగా ఆయన చికిత్స పొందుతున్నారు.ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ నిత్యాన్నదానానికి గుంటూరు వికాస్నగర్కు చెందిన రాయపాటి కోటి సుధాకర్ (సుబ్బారావు) రూ.1,08,616 విరాళాన్ని శనివారం అందజేశారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథ్యుర్ విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, ఇతర అధికారులతో కలసి శనివారం కొవ్వూరు, గోదావరి స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలపై సమగ్ర తనిఖీ చేశారు. ముందుగా రాజమండ్రి స్టేషన్లో జరుగుతున్న స్టేషన్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపర్చేందుకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోదావరి, కొవ్వూరు స్టేషన్లను తనిఖీ చేసి పుష్కరాలకు తరలివచ్చే భక్తుల రద్దీ నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. రైల్వేస్టేషన్ల నుంచి నదీ తీరానికి మధ్య యాత్రికుల రాకపోకలను అంచనా వేసేందుకు పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, శ్రద్ధానంద్ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్లతో సహా ప్రధాన స్నాన ఘాట్లను తనిఖీ చేశారు. అనంతరం రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది ప్రయాణికుల భద్రత, జన సమూహ నిర్వహణ వ్యూహాలు, అత్యవసర వైద్య ఏర్పాట్లపై సమీక్షించారు. భారీ సంఖ్యలో వచ్చే ప్రయాణికులను సమర్థంగా నిర్వహించేందుకు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తుందని జీఎం తెలిపారు. ఈ సమావేశంలో రాజమండ్రి జిల్లా ఎస్పీ డి.నరసింహా కిషోర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్గుప్తా, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ బీఎస్కే రాజ్కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ సాంబశివరావు, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఏకే సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సుభాష్కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకుడు నాగేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు(బుల్లాబ్బాయ్) అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో మిల్లెట్ ఫుడ్ ప్రొడక్ట్స్ వర్క్షాప్ను కలెక్టర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీచుపదార్థం, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలు ఆరోగ్యకర జీవితానికి పునాదులు వేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలు ఇప్పటికే పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేశారన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. 80 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు 9నట్స్ సీఈవో వి.కీర్తన చిరుధాన్యాలతో తయారయ్యే ఆహార ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నగరంలోని రమేష్ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మొదటి అడ్మిషన్ను మెరిట్ నంబర్ 3 పొందిన ఎం.మణికంఠకు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో డీజిల్ మెకానిక్ విభాగంలో సీటు కేటాయిస్తూ అడ్మిషన్ లెటర్ను కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకారావు అందజేశారు. శనివారం మొత్తం 141 మంది విద్యార్థులకు వివిధ కళాశాలల్లో సీట్లు కేటాయించారు. కౌన్సెలింగ్ ఆది, సోమవారాలు కూడా కొనసాగుతుంది. ఘనంగా ఏపీఎస్ఆర్టీసీ ఈయూ వజ్రోత్సవాలు బస్టాండ్(విజయవాడ పశ్చిమ): ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 75వ ఆవిర్భావ వేడుకలు విజయవాడ జోన్ పరిధిలోని ఆటోనగర్, గవర్నర్పేట 1, 2 డిపోలలో శనివారం ఘనంగా నిర్వహించారు. జోనల్ కార్యదర్శి వైఎస్ రావు మాట్లాడుతూ 1952 నుంచి ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్నామన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ అలవెన్సుల సాధనలో, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంలో తమ యూనియన్ ఘనమైన పాత్ర పోషించిందని చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీని పరిరక్షించేందుకు తమ యూనియన్ కట్టుబడి ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు, డిపోల కార్యదర్శలు, జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఓటు.. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి అత్యంత విలువైన హక్కు. దాన్ని కొనసాగించుకోవాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఓటరూ భాగస్వామి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) అందజేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను నింపి గడువులోగా తిరిగి వారికి అందజేయాల్సి ఉంది. ఇందుకు ఇంకా మూడు రోజులే గడువు ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. ఓటరన్నా మేలుకో.. ఐదేళ్ల భవిష్యత్తును మార్చే ఓటు అనే ఆయుధాన్ని నీ చేతిలో ఉంచుకో.. త్వరపడు. సాక్షి, విజయవాడ/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటు హక్కును కాపాడుకోవడానికి ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. వీటిని పూర్తి చేసి తిరిగి వారికి అందించాలి. దీనికి ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. లేదంటే ఓట్లు గల్లంతయ్యే చాన్స్ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ కార్పొరేషన్తో పాటు పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అందించిన ఫారాలను డిజిటలైజేషన్ చేయడంలో సాంకేతిక సమస్య (సర్వర్ డౌన్) కారణంగా ఆలస్యమవుతోందని సచివాలయ సిబ్బంది నుంచి వినిపిస్తోంది. గడువు సమీపిస్తుండటంతో వీలైనంత ఎక్కువ శాతం డిజిటలైజేషన్ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నా ఆ స్థాయిలో జరగడం లేదు. పట్టణాల్లోనే ఎక్కువ సమస్యలు.. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడ కార్పొరేషన్తో పాటు ఇబ్రహీంపట్నం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట తదితర పట్టణ ప్రాంతాల్లో ఫారాలు సమర్పించని వారే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో బీఎల్వోలకు వారి చిరునామాలు వెదికే పనిలో ఉన్నారు. జిల్లాలో ఇంకా 2.84 లక్షలకు పైగా పెండింగ్ ఎన్టీఆర్ జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 17,09,204 ఫారాలు పంపిణీ చేశారు. శనివారం వరకు 14,24,982 (83.16 శాతం) ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 2,84,222 (16.84శాతం) ఫారాలు పెండింగ్లో ఉన్నాయి. రెండు రోజులు ప్రత్యేక శిబిరాల ఏర్పాటు ‘సర్’ వేగవంతం చేయడానికి 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఏడు నియోజకవర్గాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయించారు. మిగిలిపోయిన వాళ్లంతా వచ్చి ఫారాలను పూర్తి చేసి బీఎల్వోలకు అందిస్తే డిజిటలైజేషన్ పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికీ ఇంకా అసలు ఫారాలే అందనివారు, తిరిగి సమర్పించని వాళ్లను ఈ రెండు రోజుల్లో మరోసారి వారి ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఏదైనా సందేహం వస్తే 1950 టోల్ఫ్రీ నంబర్కు చేసి నివృత్తి చేసుకోవాలని చెబుతున్నారు. గడువును పొడిగించాలని డిమాండ్ ఈ నెల 14వ తేదీ కేంద్రం ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు ముగియనున్న నేపథ్యంలో సర్ ప్రక్రియను పొడిగించాలని పలు ప్రజాసంఘాలు, పలు యూనియన్ల నేతలు డిమాండ్ చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సర్ ప్రక్రియ గడువు పొడిగించే అవకాశాలు లేవని ఉన్నతాధికారుల నుంచి వస్తున్న సమాచారం. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో రెండుచోట్లా ఓటు హక్కు ఉన్నవారు ఒకచోట మాత్రమే ఉంచుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరి కావడంతో రాజకీయ నాయకులు తమ నియోజకవర్గాల్లో ఫైనల్గా ఎన్ని ఓట్లు ఉంటాయనే దాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. టైమ్ లేదు.. ఫారాలు ఇచ్చేస్తేనే ఓటు ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో.. బీఎల్వోలు మరోసారి ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఇంకా ఫారం తీసుకోని వారిని, తీసుకుని ఇవ్వని వారి కోసం వెతుకుతారా ? అంటే ప్రస్తుతం కష్టమే. ఎందుకంటే డిజిటలైజేషన్ ప్రక్రియ చాలా కీలకం. సర్వర్ సమస్యతో రాత్రి వేళ కూడా ఫారాల డిజిటలైజేషన్ చేయాల్సి వస్తోందని పలువురు సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ బి.ఎస్.కోటేశ్వరరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ శ్రీ.బి.ఎస్. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం హనుమాన్పేటలోని తానా భవన్లో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో ‘బాలల హక్కుల సేవలను మరింత బలోపేతం చేసి విస్తరించడానికి భవిష్యత్ కార్యాచరణ‘ అనే అంశంపై చర్చావేదిక జరిగింది. కోటేశ్వరరావు మాట్లాడుతూ బాలల రక్షణ, సంరక్షణ, విద్య, ఆరోగ్యం, బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, బాలల అక్రమ రవాణా నిరోధం వంటి అంశాల్లో ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, పోలీసులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వ్యవస్థాపన సభ్యులు, బాలల సేవలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఫాదర్ థామస్ కోషి మాట్లాడుతూ సమాజ స్థాయిలో బాలల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, గ్రామ, వార్డు స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, బాలల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడాన్ని వివరించారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్ మాట్లాడుతూ బాలల హక్కుల రంగంలో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, ఇతర భాగస్వాములు ముందుకు రావాలని కోరారు. బాలల సంక్షేమం కోసం ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని సమావేశం నిర్ణయించింది. అనంతరం ‘బాలల భద్రత – అందరి బాధ్యత ‘ అనే పోస్టర్ను ఆవిష్కరించారు. చర్చావేదికలో హక్కుల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంతోష్, జె.ఎల్.వి. ప్రసాద్, పి.రత్నం, కాజా చంద్ర, ఫ్రాన్సిస్ తంబి, శారద, అనిల్ కుమార్, జోన్స్ మానికొండ, ఆర్ఎస్ రాజు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవనం గడపాలంటే జాతీయ లోక్అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్లో శనివారం ఆయన జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ మనిషి జీవితంలో ఆనందం ఎంతో ముఖ్యమని అదే ఆయుష్షును పెంచుతుందన్నారు. దీనికోసం వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. కోర్టుల చుట్టూ సంవత్సరాల పాటు తిరుగుతూ సమయం, నగదు వృథా చేసుకునే బదులు పరస్పర రాజీ ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటే ఇరుపక్షాలు సంతృప్తితో ప్రశాంతంగా జీవించగలరన్నారు. జాతీయ లోక్అదాలత్కు వచ్చిన ప్రతి ఒక్కరూ తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.వరలక్ష్మి, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.సునీత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజా వెంకటాద్రి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తుంగల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. 1,15,261 కేసుల పరిష్కారం లోక్అదాలత్లో 1,15,261 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 45 బెంచ్ల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వీటిలో 1,07,628 క్రిమినల్ కేసులు, 439 సివిల్ కేసులు, 692 చెక్బౌన్స్ కేసులు, 6356 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించామన్నారు. 146 మోటారు వాహన ప్రమాద క్లయిమ్లకు రూ. 9.2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించేందుకు అంగీకరించాయన్నారు. మచిలీపట్నం కోర్టులో 9182 కేసులు, విజయవాడలో 33,971, గుడివాడలో 15,237, నందిగామలో 11,430, నూజివీడులో 11,669, మైలవరం 1830, జగ్గయ్యపేట 4735, బంటుమిల్లిలో 2238, కై కలూరులో 1053, తిరువూరులో 5313, గన్నవరం 9821, అవనిగడ్డలో 3160, మొవ్వ 2284, ఉయ్యూరు 3338 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లా తాజా సమాచారం నియోజకవర్గం శాతం డిజిటలైజేషన్ చేసిన దరఖాస్తులు విజయవాడ వెస్ట్ 78.79 2,02,479 విజయవాడ సెంట్రల్ 79.60 2,21,148 విజయవాడ ఈస్ట్ 80.58 2,17,346 మైలవరం 85.05 2,42,539 నందిగామ 85.69 1,77,791 జగ్గయ్య పేట 85.95 1,78,397 తిరువూరు 88.78 1,85,282 కొన్నిచోట్ల డిజిటలైజేషన్ గందరగోళమైంది. కొత్త ఫొటోలు ఇవ్వాలని ఆదేశాలున్నా తుది దశకు వచ్చేసరికి పాతవి అలానే ఉంచేసి డిజిటలైజేషన్ చేసేస్తున్నారు. ఇదేమిటని బీఎల్వోలను అడిగితే పై నుంచి ఆదేశాలు అంటున్నారు. ఇంకొందరు ఫారాలు ఇవ్వకుండానే తమ వద్ద ఉన్న వివరాలతో డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సుమారు 10 డివిజన్లలో ఒక్కో బూత్లో 200 నుంచి 300 మంది అడ్రస్లు దొరకడం లేదు. వీరి ఫారాలు ఇంకా బీఎల్వోల వద్దనే ఉన్నాయి. ఏ ఒక్కరి ఓటు కూడా పోకూడదన్న ఉద్ద్ధేశంతో వారి వివరాలను ముందు ఆన్లైన్ చేసేస్తున్నారు. ఓటర్ల జాబితాలో ప్రతి ఓటును కాపాడుకోవాల్సి ఉంది. -
28న ఢిల్లీలో తెలుగు వెలుగు సంబరాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 28వ తేదీ తెలుగు వెలుగు సంబరాలు పేరిట సాంస్కృతిక పండుగను నిర్వహించనున్నట్లు జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీ రాజు రాంప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన హరియాణ, పంజాబ్లలో నివసిస్తున్న తెలుగువారి కోసం సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో తెలుగు వెలుగు సంబరాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీ రాజు రాంప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషా వికాసానికి, ప్రవాస తెలుగు వారిని ఏకం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ సంస్థ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ సభకు కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అధ్యక్షత వహించనున్నారని తెలిపారు. పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అవార్డ్స్ కమిటీ చైర్మన్ కంతేటి వెంకటరాజు, సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్పీఎన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
లోక్అదాలత్లో 26,805 కేసులు పరిష్కారం
సాక్షి, విజయవాడ : విజయవాడ కోర్టులో మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్, రెండవ అదనపు జిల్లా జడ్జి ఎం.సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్కు కక్షిదారుల నుంచి భారీ స్పందన లభించింది. 15 మంది న్యాయమూర్తుల ఆధ్వర్యంలో 15 బెంచ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 437 సివిల్ కేసులు, 29 ప్రీ లిటిగేషన్ కేసులు, 26,339 క్రిమినల్ కేసులు, మొత్తం 26,805 కేసులను పరిష్కరించినట్లు రెండవ అదనపు జిల్లా జడ్జి సునీల్ నాయక్ తెలిపారు. 11 ఏళ్ల నాటి కేసుకు మోక్షం నందిగామ టౌన్: పదకొండేళ్లుగా పరిష్కారానికి నోచుకోని పార్టీషన్ దావా కేసును జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించినట్లు 16వ అదనపు జిల్లా న్యాయమూర్తి పగడాల శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని కోర్టు సముదాయం ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన గుంజా శ్రీనివాసరావు తన తండ్రి మరణానంతరం 2015లో జిల్లా కోర్టులో పార్టీషన్ దావా దాఖలు చేశారన్నారు. రూ.ఐదు కోట్ల విలువ చేసే ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లుకు సంబంధించిన దావాను నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులతో మాట్లాడి పరిష్కరించినట్లు తెలిపారు. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని విలువైన సమయాన్ని ఆదా చేసుకోవాలని చెప్పారు. కక్షిదారులకు లోక్ అదాలత్పై అవగాహన కలిగించి ఏళ్ల తరబడి సాగుతున్న కేసును లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేలా కృషి చేసిన సీనియర్ న్యాయవాది ఈశ్వరప్రగడ రంగారావును ఆయన అభినందించారు. 431 కేసులు.. రూ. 9.24 కోట్లు.. నందిగామలోని 16వ అదనపు జిల్లా జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుల పరిధిలోని 431 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించి రూ.9,24,55,107ను కక్షిదారులకు అందించినట్లు న్యాయమూర్తి శ్రీనివాసరావు తెలిపారు. వీటితో పాటు జరిమానాలు విధించిన 11 వేల కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు వనపల్లి సత్యలక్ష్మీప్రసన్న, షేక్ రియాజ్, వందన, న్యాయవాదులు మన్నెం నారాయణరావు, మట్టా ప్రసాద్, అద్దంకి మణిబాబు, ఆనందం విజయభాస్కర్, చిరుమామిళ్ల కిరణ్, మంగయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు. -
‘ఎదురుమొండి’పై ఎందుకింత కక్ష
అవనిగడ్డ/నాగాయలంక: ఎదురుమొండి దీవుల ప్రజలపై కూటమి ప్రభుత్వానికి అంత కక్ష ఎందుకో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) డిమాండ్ చేశారు. ఎదురుమొండి వారధి నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు శనివారం అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకూ పది కిలోమీటర్ల మేర నిరసన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నాగాయలంక సెంటర్లో ప్రజలను ఉద్దేశించి పేర్ని మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి ఎదురుమొండి వారధిని మంజూరు చేయించారని చెప్పారు. అంచనాలు పూర్తి చేసి, టెండర్లు పిలిచారని ఎన్నికలు దగ్గర పడటంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదన్నారు. అమరావతిలో అర్హత ఉన్నా లేకపోయినా వందల కోట్లు టెండర్లు అప్పచెబుతున్నారు కదా, బ్రిడ్జిలు కడుతుంటే కూలిపోతున్నా మళ్లీ వాళ్లకే టెండర్లు ఇస్తున్నారు కదా, అలాగే ఎదురుమొండి వారధి కోసం మీ కిష్టమైన కాంట్రాక్టర్లకు ఇచ్చుకుని వారధి నిర్మించేలా చూడాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ ప్రజలకు వంతెన వస్తుందని ఆశ పడ్డారని మీరే వంతెన కట్టి మీకు నచ్చిన వాళ్ల పేర్లు పెట్టుకోండి మాకెలాంటి అభ్యంతరం లేదని పేర్ని అన్నారు. వాళ్ల ఓట్లు కావాలి.. ట్యాక్స్లు కావాలి ఎదురుమొండి దీవుల ప్రజల ఓట్లు కావాలి, ట్యాక్స్లు కావాలి కానీ వారధి కోసం నిధులు మంజూరైనా పనులు ఎందుకు చేయడం లేదని పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పైనా మేమే.. కింద మేమే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారుకదా గత ప్రభుత్వంలో రూ.109 కోట్లు నిధులు మంజూరైనా వంతెన నిర్మాణం చేపట్టడానికి ఎందుకంత జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. టెండర్లు పిలిపించి నిర్మాణ పనులు చేయాలని వైఎస్సార్ సీపీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు ఇక్కడున్న భూములకు చుక్కలు పెట్టి 22ఏ జాబితాలో చేర్చితే జగన్మోహన్రెడ్డి వాటిని విముక్తి చేశారని పేర్ని నాని గుర్తు చేశారు. కూటమి వచ్చాక మళ్లీ చుక్కపెట్టి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని, ఇదేనా మీరు రైతులకు చేసిన మేలు అని పేర్ని నాని ప్రశ్నించారు. కక్ష సాధింపు.. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు మాట్లాడుతూ ఎదురుమొండి వారధి గురించి మాట్లాడుతుంటే ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అక్కడి ప్రజలు ఆయనకు ఓట్లు వేయలేదనే దురుద్దేశంతో వారధి నిర్మించకుండా కక్షసాధింపునకు పాల్పడుతున్నారని చెప్పారు. జిల్లాలో ఎమ్మెల్యేలు అందరికంటే పనితీరులో చివర ఉన్న బుద్ధప్రసాద్ నైరాశ్యంతో ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు భోగాది శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సింహాద్రి వికాస్, అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల జెడ్పీటీసీలు సీహెచ్ లక్ష్మీనారాయణ, ఆర్.కళ్యాణి, కె.మురళి, అవనిగడ్డ ఎంపీపీ టి. సుమతీదేవి, ఎదురుమొండి దీవులకు చెందిన మాజీ సర్పంచ్లు వెంకటేశ్వరరావు, సుబ్బారావు, వసంతరావు, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల సాధికారతతోనే ఆరోగ్యకరమైన సమాజం
మచిలీపట్నంఅర్బన్: మహిళల సాధికారతతోనే ఆరోగ్యవంతమైన కుటుంబాలు సాధ్యమవు తాయని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ (ఇన్చార్జ్) అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమ్చంద్ మాట్లాడుతూ ప్రజలకు కుటుంబ నియంత్రణ, తల్లి–శిశు ఆరోగ్యం, పిల్లల మధ్య ఎడం పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. సాధికారత కలిగిన మహిళలు–ఆరోగ్యవంతమైన కుటుంబాలు–అభివృద్ధి చెందిన దేశం అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, తల్లి–శిశు మరణాలను తగ్గించడం, మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న కుటుంబం–సంతోషకరమైన కుటుంబం, ఆరోగ్యకరమైన తల్లి–ఆరోగ్యవంతమైన శిశువు వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో డాక్టర్ నిరీక్షణ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రోజా రమణి, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రైతులకు అందుబాటులో యూరియా
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో యూరియా కొరతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి రైతుకు, ప్రతి పొలానికి కావాల్సినంత యూరియా అందించే బాధ్యత తీసుకుంటామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో యూరియా లభ్యత, సరఫరాపై శనివారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందవద్దన్నారు. గత ఏడాది జూన్ నెలాఖరు నాటికి జిల్లాలో 4,732 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేశారని, ఈ ఏడాది 10,088 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 54,805 మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారన్నారు. జిల్లాలో తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతుల అవసరాలకు మించి ముందుగానే కొనుగోలు చేయకుండా అందరికీ సమానంగా యూరియా అందేలా తాము చర్యలు చేపట్టామన్నారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఫెర్టిలైజర్ సప్లై యాప్ను అమలు చేస్తున్నామన్నారు. ఈ యాప్ అమలుకు రాష్ట్రంలో కృష్ణా, కాకినాడ జిల్లాలను పైలెట్ జిల్లాలుగా ఏర్పాటు చేశారని, ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా వాటిని ప్రభుత్వంతో మాట్లాడి సత్వరమే పరిష్కరిస్తున్నామన్నారు. ప్రస్తుతం యూరియా సరఫరా ప్రక్రియ సజావుగా సాగుతోందని, అప్పుడప్పుడు స్వల్పంగా సర్వర్ సమస్య మినహా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. స్మార్ట్ ఫోన్ లేని రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రత్యేక సహాయ కేంద్రాలు (హెల్ప్ డెస్క్లు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల తరఫున విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు యాప్లో బుక్ చేసే ఏర్పాట్లు చేశామన్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోవటం లేదా నిరక్షరాస్యత కారణంగా ఏ రైతు అయినా యూరియా అందక ఇబ్బంది పడిన ఘటనలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిరమణి, మార్క్ఫెడ్ డీఎం మురళీకిషోర్, అగ్రికల్చర్ ఆఫీసర్ శాంతి పాల్గొన్నారు. -
బస్ డ్రైవర్పై దాడికి నిరసన
గుడివాడరూరల్: గుడివాడ–విజయవాడ హెయిర్ బస్ డ్రైవర్పై మానికొండ వద్ద దాడి జరగడాన్ని నిరసిస్తూ గుడివాడ ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ఆర్టీసీ హెయిర్ బస్సుల యూనియన్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు శనివారం బంద్కు దిగారు. డిపో పరిధిలోని 43 హెయిర్ బస్సులను డ్రైవర్లు, కండక్టర్లు నిలిపివేయడంతో జిల్లాలో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేపట్టిన కార్మికులతో డిపో మేనేజర్ సునీల్కుమార్ చర్చలు జరిపారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన ఆపేది లేదని కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఆందోళనలకు సీఐటీయూ నాయకుడు ఆర్సీపీ రెడ్డి మద్దతు తెలిపారు. దాడికి గురైన బాధిత డ్రైవర్ దుర్గారావు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం కానూరు వద్ద ఓ యువకుడు బస్సు ఆపమని అడిగాడని, సీట్లు ఖాళీ లేకపోవడంతో కొంత దూరం వెళ్లి బస్సు ఆపానన్నారు. దీంతో ఆ యువకుడు దుర్భాషలాడాడని, దీనికి ప్రతిగా తాను స్పందించానన్నారు. అక్కడ నుంచి బయలుదేరి బస్సు మానికొండ సమీపానికి రాగా ఆ యువకుడు ఇచ్చిన సమాచారంతో అతని కుటుంబ సభ్యులు మానికొండ వద్ద బస్సును చుట్టుముట్టి తనపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సీఐటీయూ నాయకుడు ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ సీ్త్రశక్తి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణాలు పెరిగాయన్నారు. రద్దీ కారణంగా బస్సులు ఆపకపోతే ఈ మధ్య తరచుగా డ్రైవర్లపై దాడులు జరుగుతున్నాయన్నారు. డ్రైవర్లపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ నాయకుడు రేపాని కొండ, యూనియన్ నాయకులు టి.తేజ, జి.మహేష్, ఎం.నాగార్జున, ఎం.పవన్కుమార్, జాజుల మురళి, యోహాను, అప్పలరాజు, అయ్యప్ప, యూసఫ్ పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికత ఉట్టి పడేలా రంగులు
అన్నదానం, లడ్డూపోటులను పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా అన్ని భవనాలకు ఒకే తరహా రంగులు వేయాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులకు సూచించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన భవనం, లడ్డూపోటులను శనివారం పరిశీలించారు. కమిషనర్ వెంట చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, డీఈవో కిషోర్కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు అమ్మవారి సన్నిధికి చేరుకునేసరికి ఎంతో ప్రశాంతతను ఇచ్చేలా రంగులను ఎంపిక చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. లడ్డూ పోటు వెలుపల వేసిన రంగుల శాంపిల్స్ను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. పెయింటింగ్, ఫ్లోరింగ్ పనులను పరిశీలించిన అనంతరం సెల్లార్కు చేరుకున్నారు. సెల్లార్ను పూర్తి స్థాయిలో భక్తుల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మహామండపం 7వ అంతస్తులోని ప్రాకార ప్రాంతాన్ని సందర్శించారు ప్రాకార మండపానికి వేసిన రంగుల తరహాలోనే నూతన భవనాలను పెయింటింగ్ జరగాలన్నారు. కమిషనర్ పర్యటనలో ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి.రాఘవరాజు, ఈఈ ఎల్.రమాదేవి, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.76 లక్షల పరిహారం విజయవాడలీగల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఏడవ అదనపు జిల్లా జడ్జి బి.అబ్రహం విజయవాడ కోర్టులో శనివారం జరిగిన లోక్ అదాలత్ లో రూ.76 లక్షల పరిహారం ప్రకటిస్తూ అవార్డు జారీ చేశారు. ఈ.శ్రీనివాస్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు 2025లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన భార్య లక్ష్మీ ప్రసన్న, కుమార్తె, కుమారుడు బీమా కంపెనీ నుంచి కోటి రూపాయలు పరిహారం కోరుతూ న్యాయవాది ఇసంశెట్టి ఉషాజ్యోతి ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చోళ మండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.76 లక్షలు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. ఇరుపక్షాలు రాజీ మార్గంలో కేసు పరిష్కరించుకోవటానికి అంగీకరించడంతో న్యాయమూర్తి అబ్రహం ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో బాధితులకు అవార్డు కాపీ అందజేశారు. -
పనితీరు ఏమీ బాగోలేదు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘రోగులకు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం పెరిగిపోయింది.. రోగులు, వారి బంధువులు ఏదైనా అడిగితే సిబ్బంది సమాధానం కూడా చెప్పడం లేదు.. మీ తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.. పనితీరు మార్చు కోండి.. పనిచేయడం ఇష్టం లేకుంటే రిజైన్ చేసి వెళ్లిపోండి..’అంటూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా ఆస్పత్రికి వచ్చిన ఆయన అవినీతి ఆరోపణలు వస్తున్న మహాప్రస్థానం వాహనాల వద్దకు వెళ్లి, వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సెమినార్ హాలులో వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్సులతో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా తమకు వచ్చిన ఫిర్యాదులను వారికి వివరించారు. కనీసం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు నర్సింగ్ సిబ్బంది సమాధానం కూడా చెప్పడం లేదని, హెడ్నర్సులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తప్పవు.. వైద్య సిబ్బందిలో మార్పు రాకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రసూతి విభాగంపైనా అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సేవలను నిత్యం పర్యవేక్షించాల్సిన వారు ఏమీ చేస్తున్నారంటూ ఆయన నిలదీశారు. తమకు వచ్చే ప్రతి ఫిర్యాదుపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అప్పారావులతో పాటు పలువురు అధికారులు ఉన్నారు. డీసీఎస్ ఆర్ఎంఓ సరెండర్.. మహాప్రస్థానం వాహనాలను కేటాయించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డెప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సూర్యమంగాదేవిని డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఓ మృతదేహానికి మహాప్రస్థానం కేటాయించక పోవడం వల్ల ప్రైవేటు అంబులెన్స్లో తరలించిన వైనంపై డీఎంఈ డాక్టర్ విష్ణువర్థన్ విచారణ జరిపి, ఇచ్చిన నివేదిక ఆధారంగా డాక్టర్ సూర్యమంగా దేవిని సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. -
‘ఆర్టీఐ’ అమలులో నిర్లక్ష్యాన్ని సహించం
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ శ్రీనివాసరావు భవానీపురం(విజయవాడపశ్చిమ): సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లోని సెక్షన్ 4(1)(బి) నిబంధనలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా అమలు చేయాలని, చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆర్టీఐ చట్టం అమలుపై శుక్రవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ కార్యాలయం, గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, బందరు రోడ్లోని ఏపీపీఎస్సీ కార్యాలయాలను సందర్శించి, ఆర్టీఐ చట్టం అమలు తీరును పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయా కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఆర్టీఐ రిజిస్టర్లు, రికార్డులు, పౌరులకు అందిస్తున్న సమాచార వ్యవస్థను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దేవదాయ శాఖలో ఆర్టీఐ చట్టం అమలు తీరును దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ కమిషనర్కు వివరించారు. సమర్థంగా అమలు.. శ్రీనివాసరావు మాట్లాడుతూ గత కొంత కాలంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదంటూ కమిషన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందున్నాయని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, విధి నిర్వహణలో లోపా లు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ సి.శశిధర్, కార్యదర్శి పి. రవి సుభాష్ పాల్గొన్నారు. -
వైద్య కళాశాలకు విరాళం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంగా ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పనిచేస్తున్న గారపాటి పార్థసారథి గోల్డ్మెడల్ విరాళాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు అందజేశారు. ఏటా జనరల్ సర్జరీలో ప్రతిభ చూపిన విద్యార్థికి తన తల్లిదండ్రులైన గారపాటి దశరథ రామయ్య. పీఆర్వీ పుత్రిక పేరిట స్మారక గోల్డ్మెడల్ను అందిస్తున్నారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ఫార్మకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కె. విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్జిల్లా పోలీస్ కమిషనరేట్లోని సీఎస్డబ్ల్యూ డీసీపీగా బి. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం కల్పించిన ఉద్యోగోన్నతుల్లో నాన్ కేడర్ ఎస్పీ హోదాలో కృష్ణా జిల్లాలో ఏఆర్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణను విజ యవాడ సీఎస్డబ్ల్యూ డీసీపీగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. ఆయన సీపీ ఎస్వీ రాజశేఖర బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా జడ్జి కె. సునీత తెలిపారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవా సదన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఈ ఏడాదిలో రెండో జాతీయ లోక్ అదాలత్ను శనివారం నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 45బెంచ్లలో ఈ లోక్అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ పడ దగ్గ క్రిమినల్, చెక్బౌన్స్ కేసులు, ట్రాఫిక్ చలానా, అన్ని రకాల సివిల్ కేసులు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్ కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చన్నారు. గత మార్చి 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,09,388 కేసులు పరిష్కారమయ్యాయని, ఈసారి అంతకంటే ఎక్కువ కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పునరుద్దరించాలని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలెండర్పై అమలులో ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి దుర్గేష్ను కలిసినవారిలో ఏపీ చాంబర్స్ సలహాదారు లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పి.భాస్కరరావు, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి, ప్రధాన కార్యదర్శి ఎస్. మూర్తి చిట్టూరి ఉన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలోని నూతన పూజా మండపంలో శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, నవగ్రహ హోమం, శాంతి కల్యాణాలలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. మరోవైపున ఉదయం 9 గంటల తర్వాత ఆలయంలోని అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి గంటన్నర సమయం, రూ.100, రూ.300 టికెట్ క్యూలైన్లో గంట సమయం పట్టింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, దర్బారు సేవ, పల్లకీ సేవలలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను పల్లకీపై అమ్మవారి ప్రధాన ఆలయం చుట్టూ మూడు పర్యాయాలు ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి 9.30 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. -
పోరుబాట
ఎదురుచూసి.. అలసిపోయి.. నాగాయలంక: మండలంలోని తీరప్రాంతంలోని ఎదురుమొండి ఈలచెట్లదిబ్బ దీవుల ప్రజల దశాబ్దాల కల సాకారం దిశగా గత ప్రభుత్వంలో పడిన అడుగులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. రాజకీయాలకు అతీతంగా అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకు దీవుల ప్రజలు అందరూ కలసిరావాలనే పిలుపుతో ఆయన శనివారం పాదయాత్ర చేపడుతున్నారు. దీవులపై చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. ఆయా పార్టీల నేతల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ.. ఆశల వారధిని సాధించుకుందామనే నినాదంతో ఆయన ముందుకు సాగనున్నారు. నాడే తొలి అడుగు వేసిన వైఎస్ జగన్.. ఏళ్లుగా కలగానే మిగిలిన ఏటిమొగ–ఎదురుమొండి నడుమ కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి అడుగు వేశారు. మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్బాబు పలుమార్లు సమస్యను మాజీ సీఎంకు వివరించడంతో.. ఆయన దీవుల్లోని ప్రజల కల సాకారం చేసేందుకు కేంద్ర నాబార్డు రుణం మంజూరు చేయించడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. పర్యవసానంగా ఆర్ అండ్బీ(బిల్డింగ్స్) చీఫ్ ఇంజినీర్ పీసీ రమేష్ కుమార్, నాబార్డు మేనేజర్ ఎం.స్మారక్, నాబార్డు కన్సల్టెంట్ అడ్వయిజర్ ప్రభాకరరావులతో కూడిన నాబార్డు అధికారిక బృందం 2022 మార్చి 26న నాగాయలంక మండలం ఎదురుమొండిలో పర్యటించారు. ఇక్కడి భౌతిక, భౌగోళిక పరిస్థితులను అంచనాతో వివిధ వర్గాల ప్రజలతో మమేకమై దీవుల్లో పరిస్థితులను అధ్యయనం చేశారు. గతంలో ఈ ప్రాంతంలో రెండు పర్యాయాలు జరిగిన భారీ పడవ ప్రమాదాల్లో 54మంది మృత్యువాత పడిన దుర్ఘటనలను, గుంటూరు జిల్లా కాలువల నుంచి సాగు, తాగునీటి కోసం నదీ గర్భంలో పైప్లైన్ల ద్వారా ఎదురుమొండిలోని 135ఎకరాల రిజర్వాయర్లోకి ఎత్తిపోతల పథకంతో నీటిని మళ్లించే పరిస్థితులను ఈ బృంద సభ్యులు పరిశీలించారు. ఇక్కడి వారధి అవసరాన్ని గుర్తించి రూ. 110కోట్లు మంజూరు చేశారు. ఈ నాబార్డు నిధులతో కృష్ణానదిపై ఎదురుమొండి–ఏటిమొగ గ్రామాల మధ్య వారధి నిర్మించేందుకు నాటి ప్రభుత్వం 2022ఏప్రిల్ 13న జీవో నంబర్ 101ని సైతం జారీ చేసింది. తదుపరి ఎన్నికలు రావడంతో ఆ పనులకు గత ప్రభుత్వం చేపట్టలేకపోయింది. కూటమి డ్రామాలు.. కూటమి అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ఎదురుమొండి వంతెన నిర్మాణ పనులు చేపడతామని ఎన్నికల్లో వాగ్దానాలు కుమ్మరించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా రాజకీయ డ్రామాలు ఆడుతూ వారధి నిర్మాణాన్ని అటకెక్కించారు. దీవుల ప్రజానీకం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఎదురుచూసి, అలసిపోయిన ప్రజల కోసం మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పోరుబాట పట్టేందుకు సన్నద్ధమయ్యారు. అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకూ దీవుల ప్రజలతో పాటు నియోజకవర్గంలోని ఇతరులకు కూడా వంతెన ప్రాధాన్యం వివరించాలనే సంకల్పంతో ఈ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రాజకీయ ప్రయోజనాలతో దీవుల ప్రజలకు అన్యాయం తలపెట్టొద్దొని ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం నిరాహార దీక్షలకు సైతం వెనుకాడబోమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి సింహాద్రి రమేష్బాబు చెప్పారు. ప్రజా ఉద్యమాలను హైజాక్ చేయడంలో స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఎపుడో డాక్టరేట్ పట్టా పొందారని విమర్శించారు. ప్రయోజనం లేని రాజకీయ బూచితో జనాన్ని మభ్యపెట్టకుండా ఎదురుమొండి వారధి చేపట్టి పూర్తిచేసి ఆ ఘనకీర్తి ఏదో మీరే పొందండి కానీ ప్రజలకు అన్యాయం తలపెట్టడం సహేతుకం కాదన్నారు. -
తాడోపేడో తేల్చుకుంటాం!
అంగన్వాడీల నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్ మచిలీపట్నంఅర్బన్: సమస్యల పరిష్కారానికి ఎందాకై నా అంటూ అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ధర్నా చౌక్ను హోరెత్తించారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో తరలివచ్చిన అంగన్వాడీలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్లో నిరసన తెలిపిన అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడికి దూసుకెళ్లారు. అప్పటికే అప్రమత్తంగానే ఉన్న పోలీసులు కలెక్టరేట్ సమీపంలో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు, పోలీసుల మధ్య కొద్దిసేపు తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తగ్గేదే లేదు.. ‘డిమాండ్లు నెరవేరే వరకు కదిలేది లేదు.. కలెక్టర్తోనే మాట్లాడతాం.. తాడోపేడో తేల్చుకుంటాం‘అంటూ అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించారు. ‘బాబు రాజ్యం... దొంగల రాజ్యం‘ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అక్కడికి చేరుకున్న బందరు డీఎస్పీ శ్రీనివాసరావు శాంతింపజేసేందుకు ప్రయత్నించినా, కలెక్టర్తోనే చర్చలు జరపాలని అంగన్వాడీలు స్పష్టం చేశారు. అనంతరం మరోసారి కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఇన్చార్జి డీఆర్వో కె. సాంబశివరావును అధికారులు అక్కడికి రప్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకులు కనీస వేతనం చెల్లించాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాల అమలు డిమాండ్లతో పాటు రెండు ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంగన్వాడీలపై బీఎల్వో విధులను బలవంతంగా మోపే ప్రయత్నాలను నిలిపివేయాలని, పనిభారాన్ని పెంచుతున్న నవచేతన యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి డీఆర్వో హామీ ఇవ్వడంతో వినతిపత్రం సమర్పించి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో అంగన్వాడీలు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యంతో అర్హులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్తగా అమలు చేస్తున్న ఐదేళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలి. పెండింగ్లో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పనిభారాన్ని పెంచుతున్న నవచేతన యాప్ను వెంటనే రద్దు చేయాలి. – ఎ. రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ -
రత్నాచల్ ఎక్స్ప్రెస్లో గంజాయి రవాణా
31.5 కేజీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఈగల్ టీమ్, ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ)గురువారం రాత్రి సంయుక్త తనిఖీలు నిర్వహించి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న 31.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిలో ఓ మైనర్ ఉన్నాడు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జేవీ రమణ కథనం మేరకు..అనకాపల్లి జిల్లా వి.శరబరం గ్రామానికి చెందిన దోసపత్ని రాజు ఏజెన్సీ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వాటిని బెంగళూరులోని జోకీ అనే వ్యక్తికి అధిక ధరకు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట ఒడిశా రాష్ట్రంలోని జనతాబాయి గ్రామంలో గుర్తుతెలియని గిరిజనుల నుంచి గంజాయి కొనుగోలు చేసి అన్నవరం తీసుకువచ్చి పొదల్లో దాచిపెట్టాడు. ఈ గంజాయిని బెంగళూరు తరలించేందుకు కర్నూలు జిల్లాలోని ఓసూరు గ్రామానికి చెందిన జోకిం బాలసవారి డిసౌజా, తిరుపతికి చెందిన కోటకొండ ధనరాజుతోపాటు ఒక మైనర్ బాలుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దోసపత్ని రాజు సూచన మేరకు వీరు ముగ్గురు ఒక్కొక్కటి 1.5కేజీల బరువుగల 21 ప్యాకెట్ల గంజాయిని నాలుగు బ్యాగుల్లో సర్దుకుని ఈనెల 9వతేదీ మధ్యాహ్నం అన్నవరంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్లో జనరల్ కోచ్లో ఎక్కారు. రైలు రాత్రికి విజయవాడ రైల్వేస్టేషన్లోని ఐదోనంబర్ ప్లాట్ఫాంపై చేరుకోగా ఈగల్ టీం, జీఆర్పీ బృందాలు తనిఖీ చేపట్టి, అనుమానస్పదంగా ఉన్న వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి బ్యాగులు సోదా చేసింది. వారి వద్ద నుంచి రూ. 63వేల విలువగల 31.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులతోపాటు వారి సమాచారం మేరకు గంజాయి రవాణా సూత్రధారి దోసపత్ని రాజును కూడా పోలీసులు అరెస్టు చేశారు. -
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
జి.కొండూరు: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెల్లటూరులో గురువారం రాత్రి జరిగింది. వివరాలలోకి వెళ్తే...ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన నల్లమోతు రమేష్(23) రాడ్బెండింగ్ పనులు చేస్తూ ఉంటాడు. గురువారం రాత్రి 9గంటల సమయంలో పనినుంచి ఇంటికి వచ్చిన రమేష్ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై రమేష్ తనబెడ్రూమ్లోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నాడు. తండ్రి లాజర్ కొద్దిసేపటికి రమేష్ను అన్నం తినమని పిలిచేందుకు గదిలోకి వెళ్లగా అతను ఉరేసుకున్న విషయాన్ని గమనించాడు. దీంతో రమేష్ను చికిత్సనిమిత్తం హుటాహుటిన ఆటోలో మైలవరం ప్రభుత్వాస్పత్రి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడి తండ్రి లాజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గన్నవరం: యూట్యూబర్ రావణ్ను కస్టడీ కోరుతూ గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కోర్టు ఈ ల 14కి వాయిదా వేసింది. నిషేధిత సీపీఐ మావోయిస్టు సంస్థకు మద్దతుగా వీడియో చేశారనే అభియోగంపై రావణ్పై గన్నవరం పోలీసులు దేశద్రోహం వంటి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న రావణ్ను పదిరోజులు కస్టడీ కోరుతూ స్థానిక అదనపు ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై రావణ్ తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి హాజరయ్యారు. అయితే ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు రాకపోవడంతో ఏపీపీ మాధవి విచారణను వాయిదా కోరగా, జడ్జి సమ్మతించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు గాంధీనగర్ (విజయవాడసెంట్రల్):గంజాయితోపాటు వివిధ కేసులలో నిందితుడిగా ఉన్న బత్తుల చిన్నబ్బాయిని పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద భవానీపురం పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జక్కం పూడి వైఎస్సార్ కాలనీకి చెందిన అతనిపై భవానీపురంతోపాటు వివిధ స్టేషన్లలో గంజాయి కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏడాదిపాటు జైలు జీవితం గడుపుతాడని పోలీసులు వివరించారు. పామర్రు: ఇంటర్ చదివే బాలికను ప్రేమించమని వెంటబడి వేధించిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. పోలీసుల కథనం మేరకు..మొవ్వ మండలం పెడసనగ్లు గ్రామానికి చెందిన పేరం గోపిరాజు అనే యువకుడు రెండేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను ప్రేమపేరుతో వేధించడంతో కూచిపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్ఐ సురేష్ విచారణ జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువుకావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి జి.వెంకటేశ్వర్లు, నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష , రూ. వెయ్యి జరిమానా విధించారు. ఏఎస్ఐ జేబీ చలపతిరావు సాక్షులను కోర్టులో హాజరుపర్చగా, ప్రాసిక్యూషన్ తరపున పీపీ మాదివాడు వెంకట నరసింహారావు వాదనలు వినిపించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీకి చెందిన నాయకుడు విజయవాడ వన్టౌన్ పోలీసుస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఉపా చట్టంపై, డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్కల్యాణ్పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యాలు చేశారని, టీడీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) విజయవాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాలను అగౌరవపరిచారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపడతామని వన్టౌన్ స్టేషన్ అధికారులు తెలిపారు. -
గడువులోగా ‘సర్’ పూర్తికి పార్టీలు సహకరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): అర్హత ఉన్న ప్రతివ్యక్తికి ఓటుహక్కు ఉండేలా రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్)పై శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీతోపాటు తిరిగి సేకరించడం కూడా అంతే ముఖ్యమన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, తర్వాత రావాలని కోరడం, అపార్ట్మెంట్లలో ఒకేసారి ఫారాలు ఇవ్వాలని నిర్ణయించడం తదితర కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతుందన్నారు. ఈప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు బీఎల్వోలకు సహకరించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను విభజించి కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదించామన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు నియోజకవర్గాల వారీగా కొత్త పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ను సంబంధిత అధికారులతో పరిశీలించి ఖరారు చేస్తామని వివరించారు. ఆర్డీవోలు కె.సాంబశివరావు, జి బాలసుబ్రమణ్యం, కరుణకుమారి, కెఆర్ఆర్సీ ఎస్డీసీ పి. నీలకంటేశ్వరరెడ్డి, సమగ్రశిక్ష ఏపీసి ఆర్ కుముదినిసింగ్, రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్ డీకే బాలాజీ -
బకాయిలు చెల్లించకుండా బుకాయింపా?
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కృష్ణా మిల్క్ యూనియన్కు చెల్లించాల్సిన రూ. 6.53 కోట్ల బకాయిని చెల్లించకుండా తప్పించుకునేందుకే కొందరు వ్యక్తులు యూనియన్లో అవినీతి, అక్రమాలంటూ ఆరోపణలు చేస్తున్నారని, వారు చేసే ఆరోపణలకు ఆధారాలుంటే నిరూపించాలని విజయ డెయిరీ ఎండీ, డైరెక్టర్లు డిమాండ్ చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్ పరిపాలనా భవనంలోని బోర్డు సమావేశ మందిరంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, బోర్డు డైరెక్టర్లు వేమూరి సాయి, ఆర్జా నాగిరెడ్డి, దాసరి బాలవర్థనరావు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ కొల్లి ఈశ్వరబాబు మాట్లాడుతూ వీరవల్లి ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. యూనియన్ అభివృద్ధి, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ఏటా ఆగస్టులో జరిగే బోర్డు డైరెక్టర్ల ఎన్నికలకు ముందు ఇటువంటి ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వీరవల్లి ప్లాంట్ నిర్మాణం, భూముల కొనుగోలు, వెన్న, పాలపొడి కొనుగోళ్లు, ఇతర ఆర్థ్ధిక లావాదేవీలన్ని సర్వ సభ్య సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం పొందిన తర్వాత చేసినవేనని స్పష్టం చేశారు. వీరవల్లి ప్లాంట్ను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించామని,, దీని ద్వారా లీటర్కు రూ.1.20పై మేర ఖర్చు తగ్గుతుందన్నారు. రూ.185 కోట్ల అంచనాలతో ప్లాంటు పనులను ప్రారంభించి, రూ.183కోట్లతోనే పూర్తిచేశామని వివరించారు. భవిష్యత్తు అవసరాల కోసం నిర్మించిన వీరవల్లి ప్లాంట్ బుడమేరు వరద సమయంలో 42 రోజులపాటు విశేషంగా సేవలు అందించి యూనియన్ను నిలబెట్టిందన్నారు. యూనియన్ టర్నోవర్ గతంలో రూ.700 కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1300 కోట్లకు పెరిగిందని వివరించారు. శివరాం రూ.6.53 కోట్లు బకాయి... యూనియన్ డైరెక్టర్ వేమూరి సాయి మాట్లాడుతూ యూనియన్పై అనేక తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ తోట్లవల్లూరు మండల అధ్యక్షుడు వీరపనేని శివరాం విజయ డెయిరీ సంస్థకు రూ. 6.53 కోట్లు బకాయి ఉన్నారన్నారు. 1.50 లక్షల పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న కృష్ణా మిల్క్ యూనియన్కు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చిందన్నారు. సంస్థకు బకాయి ఉన్న వ్యక్తి బోర్డు డైరెక్టర్ల ఎన్నికలలో పోటీ చేయడానికి ప్రయత్నిస్తే ఎన్నికల అధికారి అతని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని సైతం కోర్టు సమర్థించిందన్నారు. ఎన్నికలు మరో నెల రోజుల్లో ఉండటంతో యూనియన్ను అస్థిరపరచడానికి, బకాయిలను చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నింలో భాగంగానే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. యూనియన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బోర్డు డైరెక్టర్లు, సభ్యులు నిర్ణయించినట్లు వివరించారు. -
సైబర్ స్కామర్లతో జాగ్రత్తగా ఉండాలి
సైబర్ క్రైం డీసీపీ కృష్ణ ప్రసన్న కంచికచర్ల: కంప్యూటర్, ఇంటర్నెట్, ఇతర డిజిటల్ పరికరాలను ఉపయోగించి ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఇతరులను మోసం చేసే నేరాలను సైబర్ క్రైం అంటారని సైబర్ క్రైం డీసీపీ కే కృష్ణ ప్రసన్న పేర్కొన్నారు. కంచికచర్ల మిక్ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో శుక్రవారం సైబర్క్రైంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ కుటుంబసభ్యులు, బంధువులు చిక్కుల్లో పడ్డారని చెప్పగానే భయపడవద్దని తెలిపారు. ఈజీ మనీ పథకాల స్కామ్లను గుర్తిస్తే సైబర్ చోరుల బారిన పడకుండా తప్పించుకోవచ్చని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఏదైనా మెసేజ్ పంపిస్తే స్పందించే ముందు సమాచారాన్ని తెలుసుకోవాలని డీసీపీ అన్నారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని కృష్ణ ప్రసన్న అన్నారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ డీసీపీ బీ లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ సీహెచ్ శ్రీనివాసరావు, రూరల్ సర్కిల్ సీఐ వైవీవీఎల్ నాయుడు, కంచికచర్ల, వీరులపాడు, ఎస్ఐలు పీ విశ్వనాధ్, జీ నాని నరేందర్, బీ అభిమన్యు, పోలీస్సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఐటీఐ అడ్మిషన్ల కౌన్సెలింగ్
పామర్రు: అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం వ్యానును పామర్రు పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్బంగా పామర్రు ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ పామర్రు–గుడివాడ రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న వెయింగ్ బ్రిడ్జి సమీపంలో ఓ వ్యాన్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సంఘటనాస్థలానికి వెళ్లి వాహనాన్ని తనిఖీ చేసి అందులో 30క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ వాహనాన్ని స్వాధీనంచేసుకున్నట్లు వివరించారు. వాహనంలోని పత్రాల ఆధారంగా మంగళగిరి మండలానికి చెందిన కాగితాల శ్రీనివాసరావు, యనమలకుదురుకు చెందిన కొప్పురావూరి శ్రీనివాసరావులను విచారించగా, వారు పామర్రుకు చెందిన బొండా నాగేశ్వరరావు వద్ద నుంచి పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.20 చొప్పున 60 బస్తాలు ఒక్కొక్కటి 50 కిలోలు ఉన్నవాటిని కొనుగోలు చేసినట్లు వారు అంగీకరించారన్నారు. బందరు రోడ్డులోని గంగమ్మ గుడి సమీపంలో ఉన్న అప్పారావు భవనం వద్ద పీడీఎస్ బియ్యాన్ని వాహనంలో లోడ్ చేసి నూజివీడులోని రాము కోళ్ల ఫారానికి తరలిస్తుండగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఇన్చార్జ్ తహసీల్దార్గా శ్రీనివాస్మూర్తి.. -
రైతు కంటతడి
ఎండిన మడి..నీరందక ఎండుతున్న నారుమళ్లు ● బీటలు వారుతున్న వెదజల్లిన పంట పొలాలు ● అన్నదాతలు నీటి కోసం ఎదురుచూపులు సాగు నీరందక నారుమళ్లు ఎండిపోతుండగా.. ఇప్పటికే నాట్లు వేసిన పొలాలు బీటలు వారుతున్నాయి. కాలువల్లో నీటి జాడ లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అప్పులతో సాగు ప్రారంభించిన అన్న దాతలు ఇప్పుడు వరుణుడి కోసం చూస్తున్నారు. సాగునీటిని విడుదల చేయకపోతే వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కూటమి నేతలకు తీరని మట్టి దాహం
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ ● రిమ్మనపూడి చెరువులో నిబంధనలకు విరుద్ధంగా రూ.3 కోట్ల మట్టి స్వాహారిమ్మనపూడి(పామర్రు): కూటమి నేతల మట్టి దాహానికి అంతులేకుండా పోతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ నిప్పులు చెరిగారు. రిమ్మనపూడిలో జువ్వనపూడి రాజేంద్ర ప్రసాద్ కుమారుడు శివ పెళ్లి వేడుకలలో పాల్గొనేందుకు గురువారం గ్రామానికి వెళ్లారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం అక్కడి ప్రజలు అనిల్కు గ్రామంలోని చెరువులో జరిగిన మట్టి మాఫియాపై వివరించగా వెంటనే నాయకులతో కలిసి చెరువును పరిశీలించారు. అనంతరం అనిల్కుమార్ మాట్లాడుతూ పమిడిముక్కల మండలం తాడంకిలో చెరువును అడ్డగోలుగా తవ్విన నేతలు పామర్రు మండలంలోని రిమ్మనపూడి గ్రామంలో అంతకంటే ఎక్కువ స్థాయిలో మట్టి అమ్మకాలు జరిపారని విమర్శించారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ఒక పద్ధతి ప్రకారం తోలకాలు జరిపాలని కలెక్టర్ స్వయంగా తెలిపినా స్థానిక ఎమ్మెల్యే కుమార్ రాజా అనుచరుడు మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువులోని మట్టిని తొలుత చెరువు గట్లను అభివృద్ధి చేసి, తర్వాత గ్రామంలోని ప్రభుత్వ స్థలాలకు తోలకాలు జరపాలన్నారు. మిగిలిన మట్టిని పంచాయతీలో పాట పెట్టి వేలం పాట వేయించి అధిక మొత్తంలో పాడిన వారికి నిబంధనలకు అనుగుణంగా తోలాలి. అయితే ఒకే లేబుల్తో వందలాది ట్రాక్టర్ల్తో మట్టిని ఇతర గ్రామాలకు తరలించిన ఘనత కూటమి నేతలకే దక్కుతుందని ధ్వజమెత్తారు. ఒక్కొక్క ట్రాక్టర్కు రూ.1,700 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోందన్నారు. చెరువు నుంచి సుమారు 17వేలకు పైగా ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా అమ్మి కూటమి నేతలు సుమారు రూ.3 కోట్ల వరకు గుంజుకుని వారి ఖాతాలో వేసుకున్నారని తెలిపారు. మట్టి ట్రాక్టర్లతో గ్రామాలు దుమ్ముమయం వందలాది ట్రాక్టర్లు వెళ్తుండటంతో గ్రామాల్లోని ఇళ్లు వాకిళ్లు మట్టి మయంగా మారాయని వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారని వివరించారు. అక్రమ మట్టి మాఫియాను నిలువరించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వారి ఆగడాలకు అడ్డు కట్ట వేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అశోక్కుమార్, వైస్ ఎంపీపీ ఆరేపల్లి శ్రీనివాసరావు, జిల్లా ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి పెయ్యల రాజు, స్థానికులు నత్తా తోని, శివ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడి వేద పాఠశాలలో ప్రవేశ పరీక్షలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిర్వహిస్తున్న వేద పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. పోరంకిలోని వేద పాఠశాలలో ప్రవేశాలకు దేవస్థానం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వేద పాఠశాలకు విచ్చేశారు. తొలుత విద్యార్థులు సమర్పించిన దరఖాస్తులను పరిశీ లించి ప్రవేశ పరీక్షలకు అనుమతించారు. అనంతరం ఆలయ వేద పండితులు, అర్చకుల సమక్షంలో వారికి ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. వేద పాఠశాలలో ప్రవేశాల కోసం మొత్తం 20 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, గురువారం జరిగిన ప్రవేశ పరీక్షలకు 13 మంది హాజరైనట్లు సూపరింటెండెంట్ చందు శ్రీనివాస్ తెలిపారు. ప్రవేశ పరీక్షలను వేద పాఠశాల ప్రిన్సిపాల్ నూరి రాధాకృష్ణ అవధాని, వేద పాఠశాల పర్యవేక్షకులు రంగావజ్జుల శ్రీని వాసశాస్త్రి, అధ్యాపకులు కూరపాటి ఆంజనేయ శాస్త్రి, చిట్టి చంద్రశేఖరశర్మ తదితరులు నిర్వహించారు. ప్రవేశ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు మరోసారి పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలను ప్రకటిస్తారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఈసెట్–2026లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ గురువారం మొదలైంది. క్యాప్ 1 నుంచి 10 వేల లోపు ర్యాంకు, ఎన్సీసీ 1 నుంచి 15 వేల ర్యాంకు లోపు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 1 నుంచి 15 వేల లోపు ర్యాంకు, ఆంగ్లో ఇండియన్స్ 1 నుంచి చివరి ర్యాంక్ పొందిన వారి సర్టిఫికెట్లను గురువారం పరిశీలించారు. మొత్తం 476 మంది స్పెషల్ కేటగిరి ర్యాంకర్ల సరిఫ్టికెట్లను పరిశీలించామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. ● శుక్రవారం క్యాప్ 20,001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఎన్సీసీ 15,001 నుంచి చివరి ర్యాంకు వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 15,001 నుంచి చివరి ర్యాంకు వరకు, దివ్యాంగులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ –1 నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని తెలిపారు. ప్రకటించిన ఏపీ రాష్ట్రోపాధ్యాయసంఘం వన్టౌన్(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో 2027 ఫిబ్రవరిలోగానీ మార్చిగానీ జరగబోయే కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ ఉద్యమ నేత సీహెచ్ జోసఫ్ సుధీర్బాబును ఎస్టీయూ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నిలుపుతున్నట్లు ఏపీ రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాధరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రకటించారు. ఎస్టీయూ రాష్ట్ర 79వ వార్షిక కౌన్సిల్, కార్యవర్గ సమావేశాల్లో చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మూడు దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానం ఆయనిదన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగుల పెన్షనర్ల వాణిని శాసనమండలిలో బలంగా వినిపించడానికి కలిసి వచ్చే ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించామన్నారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, గురుకుల విభాగ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, మోడల్ స్కూల్ నేత సుబ్రహ్మణ్యం, కేజీబీవీ విభాగం నాయకులు రత్నమాలినీదేవి, శేషాలత, ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులు కేవీ శేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా సంఘాల నిధులు గోల్ మాల్
యలకుర్రు(పామర్రు): ఓ అనధికార బీసీ (బ్యాంక్ కరస్పాండెంట్) బుక్ కీపర్గా విధులు నిర్వహిస్తూ తన చాకచక్యంతో గ్రామానికి చెందిన 31 డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాల జమలను బ్యాంక్కు జమ చేయకుండా తన జేబులో వేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో చోటు చేసుకుంది. డ్వాక్రా సంఘాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యలకుర్రు గ్రామంలో సుమారు 31 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులన్నింటికి ఒకే బుక్ కీపర్ కనకమేడల జ్యోతి ఉంది. ఆమె బీసీగా(బ్యాంక్ కరస్పాండెంట్) కూడా వ్యవహరిస్తోంది. ఈ గ్రూపులన్నింటికి 2020 వ సంవత్సరం నుంచి సుమారు రూ.5 కోట్ల రుణాన్ని నిడుమోలు గ్రామంలోని యూనియన్ బ్యాంక్ ద్వారా మంజూరు చేశారు. ఈ రుణానికి సంబంధించి యూనియన్ బ్యాంక్లో ప్రతి నెలా ప్రతి గ్రూపు జమ చేయవలసి ఉంది. ఎవరైనా రుణాన్ని జమ చేద్దామని బ్యాంక్కి వెళ్తే ..మీరు ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు. మీ ఊరులోనే మా బీసీ ఉంది కదా.. ఆమె వద్ద జమ చేయండని, ఇక్కడకు వచ్చి కట్టనవసరం లేదని అప్పటి యూనియన్ బ్యాంక్ మేనేజర్ హుకుం జారీ చేశారు. దీంతో మేనేజర్ మాటలు నమ్మి గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల సభ్యులు అందరూ తమ రుణ జమలను స్థానికంగా ఉన్న బీసీ వద్దే చెల్లిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఉన్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ గ్రామంలోని అన్ని ఖాతాలకు కలిపి ఇప్పటివరకు రూ.3కోట్లు మాత్రమే రుణం జమ అయిందని, మిగిలిన డబ్బులు జమ పడలేదని పేర్కొంటూ గ్రామంలోని అన్ని డ్వాక్రా సంఘ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా ఈనెల 3వ తేదీన పామర్రులో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తమకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్కు అర్జీ సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను ఎలకుర్రు గ్రామానికి వెళ్లి వివరాలను సేకరించి తనకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఐకేపీ అధికారులు గ్రామానికి చేరుకుని ఒక్కొక్క గ్రూపు సభ్యులనుంచి గత మూడు రోజులుగా వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. సుమారు రూ.70 లక్షల వరకు స్వాహా? గ్రామంలో ఉన్న 31 డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి ఒక్కొక్క సంఘం నుంచి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నగదును బీసీ/బుక్ కీపర్ బ్యాంక్కు జమ చేయలేదని స్థానిక సంఘాల సభ్యులు వాపోతున్నారు. మొత్తం మీద గ్రామ పరిధిలో ఇప్పటి వరకు రూ.70లక్షల వరకు బ్యాంక్ లింకేజ్ రుణాలకు సంబంధించిన సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని, ఇంకా కొన్ని గ్రూపుల వివరాలు తెలియాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామంలోని డ్వాక్రా సంఘాల సభ్యులు కోరుతున్నారు. -
తెలుగు రచయిత్రుల మహాసభల ఆహ్వానపత్రిక ఆవిష్కరణ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): తెలుగు భాష, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు మూడో అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు ఈ నెల 11, 12 తేదీల్లో విజయవాడ కేబీఎన్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే, అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభల గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. కళాశాల ఆవరణలో గురువారం సాయంత్రం మహాసభల ఆహ్వానపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో దేశ విదేశాల నుంచి వెయ్యి మంది ప్రముఖ రచయిత్రులు, కవులు పాల్గొంటారని చెప్పారు. మొత్తం నాలుగు వేదికలపై సుమారు 50 గ్రంథాల ఆవిష్కరణ, 24 సదస్సులు, 15 కళారూపాల ప్రదర్శన, 500 మందికిపైగా తెలుగు సాహితీ మూర్తుల చిత్రాల ప్రదర్శన, ఐదు దశాబ్దాల సాహితీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న 50 మంది ప్రముఖ మహిళా రచయిత్రులకు విదుషీమణి పురస్కారాలతో సత్కారం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. మహిళా రచయిత్రుల పరిశోధనా వ్యాసాలతో ముద్రించిన ‘ప్రమదావనం’ పుస్తకాన్ని మహాసభల్లో ఆవిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవీ పూర్ణచంద్, కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు, హిందూ హైస్కూల్స్ కమిటీ ఏవో డాక్టర్ వి.నారాయణరావు, ప్రముఖ సాహితీవేత్త గుమ్మా సాంబశివరావు, మండలి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగితే క్రీడల్లో రాణించవచ్చునని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. స్థానిక పటమట హైస్కూల్ ఆవరణలో 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ బాస్కెట్బాల్ చాంపియన్ షిప్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ దేశంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో బాస్కెట్బాల్ ఒకటన్నారు. చదువుతో పాటుగా క్రీడలకు యువత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. భవిష్యత్తులో విజయవాడ నగరం మరిన్ని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదిక కావాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బోస్ మాట్లాడతూ రోజుకు 20 మ్యాచ్లు జరుగుతున్నాయని, నాలుగు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయన్నారు. అసోసియేషన్ సభ్యులు రాజ్ కుమార్, చక్రవర్తి, పి.సురేష్ బాబు, పటమట హైస్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ యలమంచిలి రవి పాల్గొన్నారు మైలవరం: మైనర్ బాలిక అదృశ్యం కేసులో ఒకరిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు ఎస్ఐ సుధాకర్ గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మైలవరంలోని బాలికల పాఠశాలలో ఒక బాలిక 9వ తరగతి చదువుతోంది. ఆ బాలిక తల్లి మైలవరం రైతు బజారులో కూరగాయల దుకాణం నిర్వహిస్తుంది. బాలిక తల్లికి సహాయంగా దుకాణంలో ఉండేది. మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన మాగంటి నాగరాజు(24) బైక్ మెకానిక్గా పనిచేస్తుంటాడు. నాగరాజు కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనేందుకు మార్కెట్కు వస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో బాలికతో పరిచయమైంది. గత నెల 30న బాలిక పాఠశాల నుంచి వెళ్లి పోవడంతో బాలిక తండ్రి మైలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాలిక అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికకు మాయ మాటలు చెప్పి పాఠశాల నుంచి నాగరాజు తీసుకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. నాగరాజుపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు అనంతరం మైలవరం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. పెనమలూరు: గంజాయి వినియోగం అరికట్టడానికి బ్లాక్స్పాట్స్ గుర్తించామని సీఐ ఎన్. వెంకటనారాయణ చెప్పారు. వణుకూరు గ్రామంలో గురువారం ఆయన ఈగల్ టీమ్ సీఐ ఎం.రవీంద్రతో శివారు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత గంజాయి తాగటానికి ఎంపిక చేసుకుంటున్న బ్లాక్స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టామన్నారు. పొదల చాటున అసాంఘిక కార్యకలాపాలు చేయకుండా ఉండటానికి శివారు ప్రాంతాల్లో గుబురుగా పెరిగిన చెట్లను జేసీబీతో తొలగించామన్నారు. దట్టమైన గుబురు ప్రదేశాలను గంజాయి వినియోగదారులు ఎంపిక చేసుకుటున్నట్లు తమ దృష్టికి రావటంతో ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆయా గ్రామాల ప్రజలు కూడా పోలీసులకు సమాచారం ఇస్తే అసాంఘిక కార్యకలాపాలు నివారించటానికి చర్యలు తీసుకుంటా మన్నారు. మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సెప్టెంబర్ 5న ప్రదానం చేయనున్న రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని తనిఖీ అధికారులైన ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్లు, ప్రధానోపాధ్యాయులకు అవసరమైన సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను సంబంధిత తనిఖీ అధికారుల సిఫారసులతో జూలై 15లోపు సమర్పించాలని సూచించారు. సిఫారసు చేసిన దరఖాస్తులను జూలై 22 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, మచిలీపట్నంలో రెండు ప్రతుల్లో అందజేయాలన్నారు. తనిఖీ అధికారుల సిఫారసు లేని దరఖాస్తులు, ఈ–మెయిల్ ద్వారా పంపిన దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు దుర్మరణం
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటనపై ఎస్ఎన్పురం పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం యాగంటి వెంకటసాయి (20) కేదారేశ్వరపేటలోని బిగ్బాస్కెట్లో పనిచేస్తూ తల్లిదండ్రులతో కలసి ముత్యాలంపాడు అంబేడ్కర్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ముత్యాలంపాడు కెనరా బ్యాంకు ఏటీఎంకు వెళ్లి నగదు విత్డ్రా చేసుకుని తిరిగి వస్తుండగా భగత్సింగ్ రోడ్డులోని అపోలో ఫార్మసీ వద్ద అదుపుతప్పి పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కాగా స్థానికులు 108 వాహనంలో ఒక ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఎన్పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘ఎదురుమొండి’ నిర్మాణానికి చర్యలు తీసుకోండి
● మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు డిమాండ్ ● రేపు అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకూ పాదయాత్ర అవనిగడ్డ: ఎదురుమొండి వారధి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీ అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకూ పాదయాత్ర నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు వెల్లడించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎదురుమొండి దీవుల ప్రజలు రహదారి సౌకర్యం లేక ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో వారధి నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. 109 కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేయించారని చెప్పారు. గత ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచినా ఎన్నికల ముందు ఎవరూ రాకపోవడంతో ప్రక్రియ కొనసాగలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీనిపై ఈనెల 11వ తేదీ అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకూ పాదయాత్ర చేయనున్నట్టు సింహాద్రి తెలిపారు. పాదయాత్రను పార్టీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు, ఎదురుమొండి దీవుల ప్రజలు విజయవంతం చేయాలని సింహాద్రి కోరారు. హైజాక్ చేయడం బుద్ధప్రసాద్కు వెన్నతో పెట్టిన విద్య హైజాక్ రాజకీయాలు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు వెన్నతో పెట్టిన విద్యని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పేర్కొన్నారు. పులిగడ్డ–పెనుమూడి వారధి కోసం గతంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో దీక్షలు చేస్తే చివరిలో వచ్చిన ఉద్యమాన్ని హైజాక్ చేశారని గుర్తు చేశారు. ఎదురుమొండి వారఽధి నిర్మాణం చేయించి తన తండ్రి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని సింహాద్రి పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, పార్టీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మద్ది చిన్నా, మోపిదేవి మండల కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు, క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు నలుకుర్తి పృధ్వీరాజ్, బీసీసెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చెన్ను రంగారావు, పార్టీ జిల్లా కార్యదర్శి తోట సాయిబాబు, నాగాయలంక మండల యూత్ అధ్యక్షుడు రేమాల నాగరాజు, పంచాయితీరాజ్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బండారు సూరిబాబు పాల్గొన్నారు. -
16 నుంచి అన్నమయ్య సంకీర్తనల ఉచిత శిక్షణ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): నేటి తరానికి అన్నమయ్య సంకీర్తనల సాహిత్య, సంగీత మాధుర్యాన్ని పరిచయం చేయడానికి ఈనెల 16 నుంచి 29వ తేదీ వరకు అన్నమయ్య సంకీర్తనల ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మల్లికార్జునరావు చెప్పారు. నగరంలోని కేబీఎన్ కళాశాలలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాషా సాంస్కృతికశాఖ, కేబీఎన్ కళాశాల, అన్నమాచార్య భావన వాహిని సంయుక్త ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. టీటీడీ ఆస్థాన విద్వాంసురాలు శోభారాజు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. డాక్టర్ శోభారాజు మాట్లాడుతూ తాను స్వయంగా శిక్షణకు సంచాలకత్వం వహిస్తానని, శిబిరం ముగింపు సందర్భంగా ఈనెల 29న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు మాట్లాడుతూ ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, హిందూ హైస్కూల్స్ ఏవో డాక్టర్ వి.నారాయణరావు మాట్లాడుతూ ఆసక్తి గలవారు 90320 44115, 92475 93201 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు -
పేరుకే స్వర్గం...సౌకర్యంలో నరకం
మేడిపండు చూడ మేలిమైయుండు... పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న సామెత గుర్తొస్తుంది అవనిగడ్డ డిపో ఇంద్ర బస్సులను చూస్తే...ఇంద్ర బస్సు అనగానే ఇంద్రలోకాన్ని తలపించేలా ప్రయాణికులకు సౌకర్యాలు ఉంటాయనుకుంటే అది మీ భ్రమే. ఈ మాట నమ్మకపోతే ఒక్కసారి అవనిగడ్డ డిపో నుంచి నడిచే ఇంద్ర బస్సులు ఎక్కి చూడండి.. మీకే తెలుస్తుంది. ఎక్స్ప్రెస్కు ఎక్కువ...లగ్జరీకి తక్కువ అన్నట్టుంటాయి. సీటింగ్–సీలింగ్ అస్తవ్యస్తం టీవీల సౌకర్యం మాయం వర్షాకాలంలో బస్సుల లోపలకి వాన జల్లు వ్యాపారులకే లగేజి బాక్సులు, అదనంగా లాజిస్టిక్స్ సర్వీసు -
విద్యుత్ ప్రగతి నివేదికలో అవాస్తవాలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రెండేళ్ల విద్యుత్ ప్రగతి నివేదిక అబద్ధాలు, అవాస్తవాలు, పాక్షిక సత్యాలతో కూడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, దోనేపూడి కాశీనాథ్ విమర్శించారు. విద్యుత్ చార్జీలు పెంచలేదని, తగ్గించామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ 24 నెలల కాలంలో ప్రతినెలా యూనిట్ విద్యుత్పై అదనంగా సర్దుబాటు చార్జీల భారం మోపారన్నారు. గురువారం విజయవాడలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దోనేపూడి కాశీనాథ్తో కలిసి సీహెచ్బాబూరావు మాట్లాడారు. ఇప్పటికీ రెండు రకాల అదనపు సర్దుబాటు చార్జీల వసూళ్లు కొనసాగుతున్నాయన్నారు. మొత్తం రూ. 21,885 కోట్లు ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు 24 నెలలుగా కూటమి ప్రజల ముక్కుపిండి మరీ వసూలు చేసిందన్నారు. చార్జీలు తగ్గించామని చెప్పుకునే ప్రభుత్వం ఇంకా సర్దుబాటు చార్జీలు ఎందుకు వసూలు చేస్తోందని నిలదీశారు. స్మార్ట్ మీటర్లపై కూటమి ప్రభుత్వం మాట తప్పింది, నమ్మకద్రోహం చేసింది, అదాని సంస్థకు దాసోహం అంటోందని విమర్శించారు. విద్యుత్ సర్దుబాటు చార్జీల భారంపై, స్మార్ట్ మీటర్ల బిగింపుపై.. మంత్రి, కూటమి ప్రభుత్వం బహిరంగ విచారణకు సిద్ధం కాగలరా? అని సవాల్ విసిరారు. విద్యుత్ భారాలను రుజువు చేయడానికి సీపీఎం సిద్ధంగా ఉందన్నారు. చిత్తశుద్ధి ఉంటే సర్దుబాటు చార్జీల విధానాన్ని రద్దు చేయాలని, చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నూతన టెర్మినల్ నిర్మాణాన్ని దసరా నాటికి పూర్తిచేయాలి
గన్నవరం: గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని దసరా నాటికి పూర్తిచేసే లక్ష్యంతో పనులను వేగవంతం చేయాలని ఎయిర్పోర్ట్ ఎడ్వైజరీ కమిటీ చైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి అధికారులకు సూచించారు. స్థానిక విమానాశ్రయంలో గురువారం ఆయన అధ్యక్షతన ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాఽథ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్న ఈ సమావేశంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. విమానాశ్రయంలో ప్రయాణికుల సదుపాయాలు, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీస్ల విస్తరణ, విజయవాడ పశ్చిమ బైపాస్ నుంచి ఎయిర్పోర్ట్కు రహదారి అనుసంధానంపై చర్చించారు. అనంతరం బాలశౌరి మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న షార్జా, సింగపూర్ సర్వీస్లతో పాటు భవిష్యత్లో శ్రీలంకకు నేరుగా సర్వీస్లు నడపాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. దుబాయ్ నుంచి ఇక్కడికి ఎమిరేట్స్ విమాన సర్వీస్లు కూడా ప్రారంభమైతే అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలకు వెళ్లేందుకు సులువైన కనెక్టివిటీ లభిస్తుందన్నారు. దేశీయంగా వారణాసి, ముంబయి, కోల్కత, గోవా, కొచ్చిన్లకు సర్వీస్లను విస్తరించాలని కోరినట్లు తెలిపారు. విమానాశ్రయానికి మెరుగైన రహదారి అనుసంధానం కోసం విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి ఎయిర్పోర్ట్కు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమవుతుందన్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. విమానాశ్రయ విస్తరణ సమస్యల పరిష్కారానికి, భూనిర్వాసితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని యార్లగడ్డ కోరారు. ఎయిర్పోర్ట్ నుంచి రామవరప్పాడు వరకు గ్రీనరీ అభివృద్ధి చేయాలన్నారు. విమానాశ్రయ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రమణ్యం, ఎయిర్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇందిరాగాంధీ స్టేడియం మూసివేత
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునికీరణ పనులకు ఆటంకం కలగకండా ఉండేందుకు బుధవారం నుంచి స్టేడియంలో జరుగుతున్న క్రీడా కార్యక్రమాలను నిలిపివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయం ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐజీఎంసీ స్టేడియంలో చేపట్టిన ఆధునికీకరణ పనులు, వివిధ అభివృద్ధి పనులు చేయడానికి ఏవిధమైన ఆటంకాలు, ఇబ్బంది క్రీడాకారులకు కలుగకుండా ఉండేందుకు, పనులు వేగంగా పూర్తి చేసేందుకు స్టేడియంలో జరుగుతున్న క్రీడా కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని వివరించారు. క్రీడాకారులు, ప్రజలు, వాకర్స్ అందరూ నగరంలోని ఇతర స్టేడియంలను వినియోగించుకోవాల్సిందిగా కోరారు. మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా జూనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 9వ తేదీన జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ కృష్ణ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు ఎస్.ఎన్. సాయి శ్రీనివాస్, ఎస్. హరికృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగబోయే జూనియర్ మెన్ హాకీ చాంపియన్ షిప్–2026 రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా జట్టును ఈ ట్రయల్స్ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. 2007 జనవరి ఒకటో తేదీ, ఆ తర్వాత జన్మించిన క్రీడాకారులు మాత్రమే ఎంపికలకు అర్హులన్నారు. క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్, తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్టు జూలై 11 నుంచి 14వ తేదీ వరకు గుంటూరు వేదికగా జరగబోయే రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ టోర్నమెంట్లో కృష్ణా జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. జగ్గయ్యపేట: జిల్లాలోని అన్ని అంగనవాడీ కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఇండక్షన్ స్టౌవ్లు, వంట పాత్రలు పంపిణీ చేస్తామని జిల్లా శిశు సంక్షేమాధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం పేర్కొన్నారు. మంగళవారం సాక్షి దిన పత్రిక ‘ఇండక్షన్ స్టౌవ్ల పంపిణీలో జాప్యం’ అనే కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ఆమె జిల్లాలోని ఆరు ప్రాజెక్టుల పరిధిలో 1,475 కేంద్రాలున్నాయని, 1068 స్టౌవ్లు పంపిణీ చేయగా 407 కేంద్రాలకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. అదే విధంగా పలు కేంద్రాలలో ఇండక్షన్ స్టౌవ్లపైనే వంట చేస్తున్నారని చిల్లకల్లు, నందిగామ ప్రాజెక్టులకు స్టౌవ్లు, వంట పాత్రలు పంపిణీ చేయాల్సి ఉందని రెండో విడతలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నంలోని భీమరాజుగుట్ట ప్రాంతంలో మంగళవారం జరిగింది. బీమరాజుగుట్ట ప్రాంతానికి చెందిన బి.రమేష్ కుమార్తె మౌనిక (17) తొమ్మిదో తరగతి వరకు చదివింది. ప్రస్తుతం చదువు మానేసి ఇంట్లోనే ఉంటుంది. తల్లిదండ్రులు కుటుంబ అవసరాల నిమిత్తం బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో ఉరికి వేలాడుతూ కుమార్తె కనిపించడంతో కిందకు దించి హుటాహుటిన ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యశాలకు చేరిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విస్సన్నపేట: స్థానిక నూజివీడు రోడ్డులో బైక్ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒక మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. చాట్రాయి మండలం చిత్తపూరుకు చెందిన చల్లపల్లి శృతి(28)తన అత్త జ్యోతితో కలిసి సోదరుడైన చరణ్ బైక్పై విస్సన్నపేట వైపు వస్తుండగా, వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. శృతి తలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, జ్యోతి నూజివీడు ఏరియా హస్పిటల్లో, చరణ్ విస్సన్నపేట సీహెచ్సీలో వైద్యం పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అర్జునరాజు తెలిపారు. -
స్పోర్ట్స్ సొసైటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఈశ్వరరావు
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఏపీ కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా కఠారి ఈశ్వరరావును నియమించామని సొసైటీ వ్యవస్థాపకుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం సొసైటీ చైర్మన్, మాజీ ఎస్పీ సీహెచ్ చక్రపాణి నివాసంలో నిర్వహించారు. చక్రపాణి చేతుల మీదుగా నియమాక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎన్నికై న ఈశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను కర్తవ్యంగా భావిస్తానన్నారు. సొసైటీ, క్రీడాభివృద్ధికి తన వంతు చేయూతనందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి యర్రగోపు నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షురాలు కె.విజయలక్ష్మి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రసాద్, నాగరాజు, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నిబంధనల అమలే అధికారులకు రక్షణ కవచం
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామ పంచాయతీ పరిపాలనలో రికార్డులను పకడ్బందీగా నిర్వహించి, ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే క్రమశిక్షణాపరమైన ఇబ్బందులను నివారించగలమని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గ్రామపంచాయతీ పరిపాలనపై పంచాయతీ ప్రత్యేక అధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. క్రమశిక్షణ చర్యలకు కారణమిదే.. గ్రామపంచాయతీల్లో నమోదవుతున్న అనేక క్రమశిక్షణా చర్యలకు ఉద్దేశపూర్వక తప్పిదాల కంటే అవగాహన లోపం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల అమలులో లోపాలే ప్రధాన కారణామని కలెక్టర్ చెప్పారు. ప్రతి నిర్ణయానికి సంబంధించిన ఆధారాలు, రికార్డులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. టెండర్ ద్వారా చేపట్టాల్సిన పనులను నామినేషన్ పద్ధతిలో అమలు చేసే ప్రయత్నాలు చేయరాదని, ప్రభుత్వం నిర్దేశించిన ఆర్థిక పరిమితులు, టెండర్ విధానాలు, పరిపాలనా, సాంకేతిక అనుమతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పరిపాలనా అనుమతులు లేకుండా పనులు చేపట్టడం, నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేయడం వల్ల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి, డీఎల్పీవోలు రజావుల్లా, రామానందం తదితరులు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
కృష్ణానదిలో 31 వరకు చేపల వేట నిషేధం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పంచా యతీ అభివృద్ధి అధికారుల సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. మంగళవారం జెడ్పీ కన్వెన్షన్ హాలులో కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. సంఘ ప్రధాన అధ్యక్షుడిగా జె.రాధాకృష్ణన్, ప్రధాన కార్యదర్శిగా వి.ప్రకాష్నాథ్, కోశాధికారులుగా సీహెచ్.ఆంజనేయులు, కె.సురేష్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్గా జె.హెచ్.వి.పవన్ కుమార్, సహాధ్యక్షులుగా బి.కోటయ్య, బి.మునిరాజు ఇతర కార్యవర్గ సభ్యులుగా బి.సునీత, పి.దయామణి, పి.శ్రీనివాస్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా డీపీఓ కార్యాలయ ఏఓ పి.శివరామకృష్ణ, గుడివాడ డీపీఓ కార్యాలయ ఏఓ వి.సీతారామయ్య వ్యవహరించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ను స్థాపించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ అసో సియేషన్ కార్యవర్గ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఏడాది స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలపై చర్చించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాల పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కమిషనర్ ఎల్.చంద్రకళ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ డాక్టర్ పి.మురళి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త రికార్డురైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ఒకటి. ఈ నెల ఆరో తేదీన డివిజన్ 192 రైళ్ల నిర్వహణలో 97.35 శాతం సమయపాలన నమోదు చేసుకుని సరికొత్త రికార్డు సాధించింది. గతంలో నమోదైన 97.24 శాతం రికార్డును అధిగమించింది. ఈ విజయం సమర్థవంతమైన రైలు కార్యకలాపాలపై డివిజన్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోందని డీఆర్ఎం మోహిత్ సోనాకియా కొనియాడారు. అన్ని విభాగాల మధ్య సమన్వయం, చురుకై న పర్యవేక్షణ, ఉద్యోగుల అంకితభావంతో కూడిన కృషి ఫలితంగానే ఈ అద్భుతం సాధ్యమైందన్నారు. -
మళ్లీ నాటు సారాజ్యం
● మైలవరం ఎకై ్సజ్ స్టేషన్ సమీపంలో నాటుసారా తయారీ కేంద్రం ● 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన ఎకై ్సజ్ శాఖ అధికారులు ● మైలవరం మండలంలో 2011లో నాటుసారా తాగి 21 మంది మృతి ● మళ్లీ నాటుసారా తయారీ ఆనవాళ్లతో ఉలిక్కిపడిన స్థానిక ప్రజలు దశాబ్ద కాలం తర్వాత... గుప్పు మంటూనే ఉంది... చీప్ లిక్కర్ కాస్ట్లీగా మారడంతో.. -
ఆషాఢానికి దసరా తరహా ఏర్పాట్లు
● ఘాట్ రోడ్డు మీదగానే కొండపైకి అనుమతి ● 26వ తేదీన తెలంగాణ బంగారు బోనం ● 27వ తేదీ నుంచి శాకంబరి ఉత్సవాలు ● వెల్లడించిన ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిపై ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ మాసోత్సవాలకు దసరా తరహా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ తెలిపారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరిగే ఆషాఢ మాసోత్సవాలు, తెలంగాణ బంగారు బోనం, శాకంబరీ ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం సీవీ రెడ్డి చారిటీస్లో జరిగిన మీడియా సమావేశంలో శాకంబరీ ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం చైర్మన్, ఈఓ మాట్లాడుతూ.. ఆషాఢ మాసోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారని తెలిపారు. ఆషాఢం నెల రోజులూ దసరా తరహాలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరినీ ఘాట్ రోడ్డు మీదగానే కొండపైకి అనుమతిస్తామన్నారు. అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత మహా మండపం ఆరో అంత స్తులో ఉత్సవమూర్తిని దర్శించుకుని సారె సమర్పించి, మొదటి, రెండో అంతస్తుల్లో ఉచిత అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత గోశాల, కనకదుర్గనగర్ మీదుగా కొండ కిందకు చేరుకుంటారని వివరించారు. చైనా వాల్, దుర్గాఘాట్ నుంచి వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, దివ్యాంగుల కోసం దేవస్థానం ఉచితంగా బస్సులను నడుపుతుందన్నారు. కనకదుర్గనగర్లో ప్రత్యేకంగా చెప్పులు, క్లోక్రూమ్లు అందుబాటులో ఉంటాయన్నారు. 15వ తేదీ నుంచి ఆలయంలో వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులుగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఆలయ అర్చకులు అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద ఈ ఉత్సవాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు బోనం సమర్పిస్తారని ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ తెలిపారు. సుమారు 500 మంది కళాకారులు, భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ తెలిపారు. ఉత్సవాలలో తొలి రోజున హోల్సేల్ వ్యాపారులందరూ కలిసి అలంకరణకు అవసరమైన అన్ని కూరగాయలను విరాళంగా అందజేసేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. రెండో రోజున ఆకుకూరలు, కూరగాయలతో, మూడో రోజు పండ్లు, ఫలాలు, కాయలు, డ్రైప్రూట్స్తో అమ్మవారిని అలంకరిస్తామని వివరించారు. 14 అంశాలతో ట్రస్ట్ బోర్డు సమావేశం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన మంగళవారం సీవీ రెడ్డి చారిటీస్లో నిర్వహించారు. ఈఓ శీనానాయక్, ట్రస్ట్బోర్డు సభ్యులతో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. మొత్తం 14 అంశాలు చర్చగా రాగా 12 అంశాలను ఆమోదించారు. ఆషాఢ మాసోత్సవాలు, శాకంబరీ, తెలంగాణ బోనం ఏర్పాట్లపై చర్చ సాగింది. ఇటీవల ఆలయంలో జరిగే టికెట్లను అక్రమంగా తరలిస్తూ అవుట్ సోర్స్ సిబ్బంది పట్టుబడిన అంశంపైన సుదీర్ఘంగా చర్చ సాగింది. -
11వ తేదీ నుంచి ఐటీఐ కౌన్సెలింగ్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని మహిళ మృతిచెందిన ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒకటో నంబర్ ప్లాట్ఫాం, ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. దీన్ని గుర్తించిన సిబ్బంది జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించడంతో హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై బ్రౌన్ కలర్ నైటీ, ఎరుపు రంగు లంగా ధరించి, మెడలో పసుపు తాడు, సూత్రం, రోల్డ్ గోల్డ్ చెవి దిద్దులు, మట్టిగాజులు ధరించి ఉందని, కుడి చేతిపై స్వస్తిక్ పచ్చబొట్టు ఉందన్నారు. ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఆచూకి తెలిసిన వారు 0866–2768630, 91103 64646ల ద్వారా జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. కంచికచర్ల: తోటి స్నేహితులతో కలసి మునేరులో ఈతకు వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాళ్ల మధ్యలో చిక్కుకుని ఊపిరాడక మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి. విశ్వనాథ్ తెలిపిన కథనం మేరకు.. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన గొట్టపు రామకృష్ణ(34) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అయితే తన ఇద్దరు స్నేహితులతో కలసి మండలంలోని కీసర మునేటిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. మునేరులో లోతు ఎక్కువగా ఉండటంతో పాటు పెద్ద బండరాళ్లు నీళ్లలో ఉండటంతో ఆ రాళ్లలో చిక్కుకుని పోయాడు. గమనించిన తోటి స్నేహితులు రామకృష్ణను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఊపిరాడక రామకృష్ణ మృతిచెందాడు. మృతునికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐవిశ్వనాథ్ తెలిపారు. -
పవన్కల్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు
గన్నవరం: తన కుమార్తె సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకుని లబ్ధి పొంది, ఆ తర్వాత ఈ కేసులో ఆధారాలు లేవని చెబుతున్న డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కేసు నమోదు చేయాలని కోరుతూ ప్రీతి తల్లి పార్వతీదేవి కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో తన భర్త సుగాలి రాజు నాయక్తో కలిసి పార్వతీదేవి ఎస్ఐ ప్రశాంతికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్వతీదేవి మాట్లాడుతూ.. గతంలో అనేక సభల్లో సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై పవన్ కల్యాణ్ ప్రశ్నించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని, పైగా సుగాలి ప్రీతి కేసులో అసలు ఆధారాలే లేవని ఆయన అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసులో నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చేలా పవన్ మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. యూ ట్యూబర్ ప్రశ్న రావణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కేసు పెట్టారని, తన కుమార్తె కేసుపై తప్పుడు ప్రచారం చేసిన పవన్ కల్యాణ్పై కూడా కేసు నమోదు చేసి, చట్టం ముందు అందరూ సమానులేనని నిరూపించాలని కోరారు. తన ఫిర్యాదును స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్వీకరించారని ఆమె తెలిపారు. పార్వతీదేవికి వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్రాజు సంఘీభావం తెలిపారు. -
రోల్బాల్ స్కేటింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఈ నెల 24, 25, 26 తేదీల్లో గుంటూరులో జరుగనున్న రాష్ట్ర స్థాయి రోల్బాల్ స్కేటింగ్ పోటీలకు తమ క్లబ్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఎంపిక అయ్యారని ఉదయ్ స్కేటింగ్ క్లబ్ కోచ్ కె.ఉదయ్భాస్కర్ చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను అజిత్సింగ్నగర్లోని క్లబ్ ఆవరణలో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కంకిపాడులోని క్యాపిటల్ స్పోర్ట్స్ కార్నర్లో ఆదివారం ఈ ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు. ఈ పోటీల్లో బాలికల అండర్–11 టీమ్ విభాగంలో కె.ప్రద్వీక, జి.షైనీ, సీహెచ్.అనూహ్య, ఎస్.యోచన, ఎం.పర్ణిత, ఎస్.కృతిక, అండర్–14 టీమ్ విభాగంలో కె.ఆద్విక, ఈ.ఏమిమా, సీనియర్స్ విభాగంలో కె.పూజ, కె.సంకల్ప ఎంపికయ్యారని తెలిపారు. అండర్–11 బాలుర విభాగంలో టి.టింకి, హిమంత్, ఎం.జయకర్, అండర్–14 విభాగంలో అబ్దుల్ సలామ్ ఎంపికయ్యారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు అక్కడ కూడా విజయం సాధించాలని ఉదయ్భాస్కర్ ఆకాంక్షించారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవమైంది. ధర్మ ప్రచార సభ రాష్ట్ర కార్యకర్తల సమావేశం దై వార్షిక ఎన్నికలు ఆదివారం విజయవాడలో జరిగాయి. 2026–28 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా కొల్లి సీతారామ గురుస్వామి, కార్యదర్శిగా జి.జయచంద్ర, కోశాధికారిగా సీహెచ్ నాగార్జున రాజు, జోనల్ ఉపాధ్యక్షులుగా గురునాథ్, వీరాస్వామి, జోనల్ కార్యదర్శులుగా రావి రవికుమార్, జె.రామమూర్తి, వలంటీర్ కమాండర్గా ప్రభాకర్, ప్రజా సంబంధ అధికారిగా రవికుమార్లతో పాటు అన్ని జిల్లాల నుండి నూతన రాష్ట్ర కార్య వర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప దాస్, ఎన్నికల అబ్జర్వర్గా జాతీయ కార్యదర్శి బి.హరిప్రసాద్ వ్యవహరించారు. అనంతరం పాత కార్యవర్గం సభ్యులను సత్కరించి నూతన కార్యవర్గం చేత ప్రమాణస్వీకారం చేయించి నియామక పత్రం అందజేశారు. ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు శంకరాచార్యులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిథులుగా అయ్యప్ప స్వామి దేవాలయ నంబూద్రిలు బ్రహ్మశ్రీ హరిహరన్ నంబూద్రి, గొల్లపూడి దేవస్థాన ప్రధాన అర్చకుడు శ్రీకాంత్ నంబూద్రి, మధుసూదనన్ నంబూద్రి, కుమారన్ నంబూద్రి జంధ్యాల రామకృష్ణ అన్నదేవర రామకృష్ణ గురుస్వామి పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి దీక్ష, ఇరుముడి కట్టు, పవన పడునెట్టమబడి ప్రాధాన్యత, గురుస్వామి బాధ్యత, శబరిమల ఆచార వ్యవహరాలు గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రత్యేక పర్యవేక్షకులు ఏబీఏపీ ట్రస్ట్ సభ్యులు లంకబాబు తదితరులు పాల్గొన్నారు. కోనేరుసెంటర్: సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అనేక నేరాలకు పాల్పడుతున్న ఓ రౌడీషీటర్పై జిల్లా పోలీసులు పీడియాక్ట్ అమలు చేశారు. మచిలీపట్నం సుకర్లాబాదుకు చెందిన సాలా సుబ్రహ్మణ్యం అలియాస్ బుడ్డి అనే యువకుడు నగరంలో అనేక నేరాలు చేస్తూ పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. అతనిపై వివిధ పోలీస్స్టేషన్లలో సుమారు 14కుపైగా క్రిమినల్ కేసులో పాటు రౌడీషీట్ ఉంది. అయినప్పటికీ సుబ్రహ్మణ్యంలో ఎటువంటి మార్పు రాకపోగా యథావిధిగా నేరాలకు పాల్పడుతున్నాడు. దీంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసేందుకు అనుమతులు కోరుతూ జిల్లా కలెక్టర్కు సిఫార్సు లేఖ రాశారు. సుబ్రహ్మణ్యం నేరచరిత్ర పూర్తి తెలుసుకున్న కలెక్టర్ అతనిపై పీడీ యాక్ట్ అమలుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సుబ్రహ్మణ్యంను చిలకలపూడి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. జిల్లాలో ఎవరైనా ప్రజల శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తూ ప్రవర్తించినా, అనుచితంగా వ్యవహరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే నేరచరిత్ర కలిగిన వ్యక్తులు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉన్నా తక్షణమే తమకు సమాచారం అందించాలని కోరారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
కంకిపాడు: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, ప్రలోభాలకు గురిచేసి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో నిందితుడిని కంకిపాడు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గన్నవరం ఇన్చార్జి డీఎస్పీ కె.ధర్మేంద్ర స్థానిక పోలీసుస్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నిందితుడి అరెస్టు వివరాలను మీడియా సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ పెనమలూరు మండలం గోసాల ఈదులడొంకకు చెందిన బాలిక (14) కంకిపాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కంకిపాడు భద్రాచలం వీధికి చెందిన ప్రొద్దుటూరి ఆనంద్(25) బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. గత నెల 16న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనను చూసి అనుమానించిన తల్లి నిలదీయటంతో బాలిక జరిగిన విషయాన్ని తల్లితో చెప్పింది. దీంతో ఈనెల 2న బాలిక తల్లి కంకిపాడు పోలీసులను ఆశ్రయించింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్టుల కింద కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచనలతో ఇన్చార్జి డీఎస్పీ ధర్మేంద్ర, ఎస్ఐ కేవై దాసు ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టారు. ప్రొద్దుటూరు గాయత్రీ విహార్లోని విద్యుత్ ఆఫీస్ వద్ద నిందితుడు ఆనంద్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ప్రలోభాలకు లొంగొద్దు.. మాయమాటలకు, ప్రలోభాలకు మైనర్లు, యువత మోసపోవద్దని, లొంగొద్దని ఇన్చార్జి డీఎస్పీ ధర్మేంద్ర సూచించారు. సోషల్ మీడియా, ఫోన్ వినియోగం పెరగటంతో చిన్నారులు, యువత దారి తప్పుతున్నారన్నారు. టెక్నాలజీతో వస్తున్న మార్పులను అందరూ గమనించాలని, ప్రత్యేకించి విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ, సన్మార్గంలో నడిచేలా చూడాలని కోరారు. -
ఎస్పీ కార్యాలయం సమీపంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): పొలం కొనుగోలు విషయంలో పోలీసులు తనకు న్యాయం చేయటంలేదంటూ ఓ వ్యక్తి మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కథనం మేరకు.. నాగాయలంక మండలం పర్రచివర గ్రామానికి చెందిన చిక్కాల సురేష్బాబు కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన రైతు వద్ద ఎకరం పొలం కొనుగోలు నిమిత్తం రూ.15 లక్షలను పొలం యజమానికి అందజేశాడు. అయితే సదరు పొలం యజమాని సురేష్బాబుకు కొనుగోలు విషయంలో తాత్సారం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ విషయంలో పొలం యజమానికి సురేష్బాబుకు మధ్య అనేకమార్లు వివాదం జరిగింది. బాధితుడు సురేష్ ఈ విషయంపై న్యాయం కోరుతూ అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోలేదు. సర్వజన ఆస్పత్రిలో చికిత్స.. ఇటీవల మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న పొలం తాలూకు మధ్యవర్తి అయిన తాడేపల్లి శ్రీనివాసరావును కలిసి తన డబ్బులు తనకు ఇప్పించాలని లేదంటే పొలం అయినా ఇప్పించాలని సురేష్ డిమాండ్ చేయగా ఈ విషయంలో ఇరువురి మద్య ఘర్షణ చోటుచేసుకోగా శ్రీనివాసరావు బాధితుడిపై దాడి చేశాడు. అదే రోజు సురేష్ ఇనగుదురుపేట పోలీసులకు శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశాడు. అయినా న్యాయం జరగకపోవటంతో మనస్తాపం చెందిన సురేష్ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీ పెట్టి న్యాయం కోరేందుకు మచిలీపట్నం వచ్చాడు. ఎస్పీ కార్యాలయానికి సమీపంలో బండి పార్కింగ్ చేశాడు. కార్యాలయం గేటు వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చిన సురేష్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా భార్య సుధారాణి అడ్డుకుంది. అప్పటికే సురేష్బాబు కొంత మేర డబ్బాలో మందు తాగేయటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటినా మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సురేష్బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి భార్య సుధారాణి తమ కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది. -
విద్యార్థులను చితకబాదిన పీఈటీ
పాయకాపురం(విజయవాడరూరల్): నగర శివారు ఎల్బీఎస్ నగర్లోని పుచ్చలపల్లి సుందరయ్య మునిసిపల్ హైస్కూల్లో క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను పీఈటీ ఉపాధ్యాయుడు చితక బాదాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. సుమారు 20 మంది విద్యార్థులను కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పీఈటీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆరో తరగతి చదువుతున్న షేక్ నగీన, యోబుతో పాటు మరికొందరు విద్యార్థులు ఇంటర్వెల్ సమయం మించిపోయినా తరగతులకు వెళ్లకుండా బయట ఉన్నారనే కారణంతో ఆగ్రహంచిన పీఈటీ ఉపాధ్యాయుడు రవీంద్రరెడ్డి బెత్తంతో చితకబాదారు. ఈ విషయాన్ని విద్యార్థులు ఏడుస్తూ తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న డీవైఈఓ సాంబశివరావు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విద్యార్థుల తల్లిదండ్రులకు సర్దిచెప్పారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, మైలవరం నియోజకవర్గ విద్యార్థి విభాగం ప్రెసిడెంటు ఎం.సురేష్ పాఠశాల వద్దకు వచ్చి విద్యార్థులను పరామర్శించారు. పీటీ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు రవీంద్రరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రక్షణ కల్పించాల్సిన వారే ప్రాణాలు తీస్తున్నారు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో శాంతిభద్రతలు కాపాడుతూ, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే వేధించి, వేంటాడి ప్రాణాలు పోయేలా చేయడం దుర్మార్గమని బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ అన్నారు. కృష్ణలంక సీఐగా పనిచేసిన నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన బహుజన చైతన్య వేదిక సభ్యులు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మే 21న, అంతకు ముందు జరిగిన పరిణామాలను తండ్రి వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. డీసీపీకి వినతిపత్రం అందజేత.. అనంతరం శివరామకృష్ణ మాట్లాడుతూ సీఐ నాగరాజు తన స్వప్రయోజనాల కోసం యువకులను పలు విధానాలుగా ఉపయోగించుకుంటూ, మాట వినని వారిపై నేరాలు మోపి రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తుందన్నారు. యువకులపై రౌడీషీట్లు ఓపెన్ చేసి మరో కోణంలో తన దందాలు నడిపారని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం క్రాంతికుమార్ ఘటనలో సీఐ నాగరాజు, ఇతర సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఆ సంఘ ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు, ప్రతినిధులు రామాంజనేయులు, రామాంజినప్ప, కుళ్లాయప్ప, చల్లపల్లి ఈశ్వర్, పరిగి గోవిందప్ప, పరిగి మద్దిలేటి, ఊట్కూర్ మూర్తి తదితరులు ఉన్నారు. అనంతరం ఈస్ట్జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతి అర్హుడికి ఓటు హక్కు ఉండేలా చేసేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఎల్వోల ద్వారా అందజేస్తున్న ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే పూర్తి చేసి తిరిగి అందజేయటం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భంలో చాలా మంది ఓటర్లు ఫారాలు తీసుకున్నప్పటికీ వాటిని తిరిగి ఇవ్వటంలో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. జూలై 14వ తేదీలోపు అన్ని ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉన్నందున ప్రతి ఓటరు వెంటనే వారి వారి ఫారాలను సంబంధిత బీఎల్వోకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఫారాలు అందని వారు సంబంధిత బీఎల్వోను సంప్రదించి సహాయం పొందవచ్చన్నారు. అలాగే voters. eci. gov. in వెబ్ సైట్, ECI NET యాప్లో బుక్ ఎ కాల్ విత్ బీఎల్వో సదుపాయం ద్వారా వారితో నేరుగా సంప్రదించి ఫారం పొందవచ్చన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశామన్నారు. సందేహాలు ఉంటే జిల్లా హెల్ప్డెస్క్ 1950ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అదే విధంగా మండల, మునిసిపాలిటీ కేంద్రాల్లో హెల్త్ డెస్క్లను ఏర్పాటు చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఓటర్లు తమ ఎపిక్ నంబరు ఆధారంగా వెబ్సైట్లో స్వయంగా కూడా ఎన్యుమరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రతా అగర్వాల్ పాల్గొన్నారు. -
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీతో పాటు ఇన్చార్జ్ డీఆర్వో పోతురాజు, మెప్మా పీడీ సాయిబాబు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫోన్లు మాట్లాడితే ఎలా? ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలు తీసుకునే సమయంలో ఆ సమస్యను బట్టి సంబంధిత అధికారిని పిలిచి మాట్లాడుతామని అన్నారు. అటువంటి సమయంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా ఫోన్లు మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మీకోసంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. ప్రతిశాఖ అధికారి వారానికోసారి సమీక్ష నిర్వహించి పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో సంబంధిత అధికారులు పీజీఆర్ఎస్ పోర్టల్లో ఉన్న దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించి వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. పంచాయతీరాజ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, సర్వే శాఖల్లో పెండింగ్ కేసులు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అధికారులు 156 అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. -
విద్యా శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తాం
మచిలీపట్నంఅర్బన్: విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల డిమాండ్ల సాధన కోసం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. ధర్నా అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరగా, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం కొందరు నాయకులు, విద్యార్థులను మాత్రమే కలెక్టరేట్లోకి అనుమతించగా, ఆర్డీఓ పోతురాజుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. హామీలను అమలు చేయకుండా కాలయాపన.. ఈ సందర్భంగా సమరం మాట్లాడుతూ.. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు నెలల తరబడి పెండింగ్లో ఉండటంతో వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో మెస్ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందడం లేదన్నారు. మెస్ చార్జీలను రూ.3 వేల మేర పెంచడంతో పాటు కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిరాకరిస్తున్న జీవో నెం.77ను తక్షణమే రద్దు చేయాలని, డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. విద్యార్థులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే పోలీసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.హారిక, జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్ర, జిల్లా సహాయ కార్యదర్శి ఎండీ అమీర్, నాయకులు విజయ్, సాయినాథ్, ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులు, డిగ్రీ కళాశాల విద్యార్థులు గౌస్ మహమ్మద్, జగదీష్, పి.తారక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
15 నుంచి అమరావతి చాంపియన్షిప్
మచిలీపట్నంఅర్బన్: హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 15 నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు అమరావతి చాంపియన్షిప్–2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనునున్నట్లు తెలిపారు. అండర్–17, అండర్–23 విభాగాలకు చెందిన వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పొతురాజు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయిబాబా, కేఆర్సీసీ డెప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వర రెడ్డి, మచిలీపట్నం డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి కె. ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నలు.. చిక్కుముడులే!
సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కనిపించని పురోగతిసాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో రోజు రోజుకూ కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. శవాన్ని ఎవరు, ఎలా మాయం చేశారనే చిక్కుముడులు మాత్రం వీడటం లేదు. సిట్ బృందం ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చే దిశగా అడుగులు వేయటం లేదు. మాజీ సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్లో కృష్ణలంక పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మరకలు ఉన్నట్లు గుర్తించినట్లు సిట్ పేర్కొంది. స్టేషన్ టెర్రస్పైన ఒక లాఠీ, ఎముకలు, కాలిన బూడిద స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. స్టేషన్లో పాక్షికంగా కాలిపోయిన స్టీల్ చేతి గొలుసు, ఇతర సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. ఇవి సాయికృష్ణవా? లేదా వేరే అనాథ శవానికి సంబంధించినవా అని తేలాలంటే ఫోరెన్సిక్ పరీక్షల ద్వారానే నిర్ధారణ కావాలి. అయితే కేసును తప్పుదోవ పట్టించేందుకు మాజీ సీఐ నాగరాజు గ్యాంగ్, ఎముకలు, బూడిద డ్రామాకు తెరలేపిందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ‘నాకు ప్రాణ హాని ఉంది’ అని మాజీ సీఐ న్యాయమూర్తికి లేఖ రాయడం వెనుక కూడా కుట్ర దాగి ఉందనే భావన వ్యక్తం అవుతోంది. సీసీ ఫుటేజీ రికవరీ ఎప్పుడు? సిట్ బృందం దాదాపు 20 రోజులుగా దర్యాప్తు చేస్తున్నా, కీలక అంశాలను వెలుగులోకి తీసుక రాలేక పోతోంది. ప్రధానంగా కృష్ణలంక పోలీసు స్టేషన్లో మాయం అయిన సీసీ ఫుటేజీని రికవరీ చేస్తేనే కేసులో పురోగతి కనిపిస్తుంది. స్టేషన్లో సాయికృష్ణను ఎలా చిత్ర హింసలకు గురి చేసింది? శవాన్ని ఎలా మాయం చేసింది? తెలిసే అవకాశం ఉన్నా.. సీసీ ఫుటేజీ రికవరీ దిశగా మాత్రం అడుగులు పడటం లేదు. కేసు దర్యాప్తులో జాప్యం జరిగే కొద్దీ కీలక ఆధారాలు మాయం అయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. గోవాకు ఫోన్ ఎందుకో? కేసును తప్పుదోవ పట్టించేందుకు కేసులో నిందితుడిగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, సాయికృష్ణ ఫోన్ను గోవాకు ఏమైనా పంపించారా అనే దిశగా సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అశోక్కు సన్నిహితుడు జిమ్ నిర్వాహకుడైన సుశాంత్ను సిట్ బృందం పిలిపించి విచారించింది. సోమవారం జిమ్ నిర్వాహకుడి తమ్ముడైన ప్రదీప్ను సైతం పిలిచి, అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అశోక్ తనకు ఫోన్ ఇచ్చి పంపింది వాస్తవమేనని అంగీకరించినట్టు సమాచారం. ఫోన్ను గోవాకు పంపడం ద్వారా అక్కడికి సాయికృష్ణ వెళ్లినట్లు సాక్షాధారాలను సృష్టించే యత్నం చేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సురేష్ పాత్ర ఏంటి? మాజీ సీఐకి సన్నిహితుడైన సురేష్ను సిట్ బృందం అదుపులోకి తీసుకున్నట్లు లీకులు మాత్రమే ఇస్తోంది. కాని ఇంకా అతని అరెస్టు మాత్రం చూపలేదు. కేసులో అతని పాత్ర ఏంటనేది, అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెడితేగాని తెలియదు. సురేష్ విషయంలో సిట్ గోప్యత పాటిస్తోంది. శవం మాయం వెనుక, మాజీ సీఐ నాగరాజు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు, సురేష్ ఏవిధమైన పాత్ర పోషించారనే దానిపైన, ఆధారాలు సేకరించడంపై సిట్ దృష్టి సారించింది. అయితే సాయికృష్ణ తల్లి మాత్రం ‘నా కొడుకు బతికుండాగానే పడుకోబెట్టి చేతులపైన మేకులు కొట్టి, లాఠీలతో కొట్టి, అతి దారుణంగా చంపారు. దేనికి చంపారు? ఇంతకు ముందుకు ఇంకెంత మందిని చంపారో? ఆఖరికి మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు’ అని మేజిస్టీరియల్ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘నా కొడుకును చంపిన కేసులో ఉన్న అందరూ బయటికి రావాలి. ఇంత వరకు నలుగురినో, ఐదుగురినో అరెస్టు చేశారు.. మిగతా వారేరి?’ అంటూ ప్రశ్నిస్తున్న సాయికృష్ణ తల్లికి సిట్ సమాధానాలు ఇవ్వలేక పోతోంది. ‘ఆ రోజు నా కొడుకును తీసుకెళ్లడానికి వచ్చినోళ్లు, ప్రతి ఒక్కరూ నాకు తెలుసు.. వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు’ అని నిలదీస్తోంది. ఇలా కేసులో ఉన్న పలు అనుమానాలు నివృత్తి చేసి, చిక్కుమడులు వీడే దిశగా మాత్రం సిట్ బృందం దర్యాప్తు సాగడం లేదనే భావన అందరిలోనూ వ్యక్తం అవుతోంది. రోజుకో మలుపు తిరుగుతూ సాగుతున్న ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీసు, ప్రభుత్వ పెద్దల పాత్రపై సిట్ సరైన పద్ధతిలో దర్యాప్తు చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మొదట్లో కేసును బయటకు రాకుండా చేసిన వైనం.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చి నిలదీసే వరకూ ప్రభుత్వం స్పందించకపోవడం, ఆ తర్వాత సిట్ ఆధ్వర్యంలో సాగుతున్న విచారణ యావత్తూ.. కరకట్ట ప్యాలెస్ డైరెక్షన్లో నడుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సూత్రధారులు, పాత్ర ధారులను రక్షించే విధంగా పక్కా ప్లాన్తో సిట్ వ్యవహారిస్తోందని పోలీసు వర్గాలే పేర్కొంటున్నాయి. మాజీ సీఐ నాగరాజు, కానిస్టేబుళ్ల చుట్టే కేసును తిప్పుతోంది. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని దర్యాప్తును సాగదీస్తూ, కాలయాపన చేస్తోంది. రోజుకో హైడ్రామాతో కేసును రక్తి కట్టిస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే కేసు నీరుగార్చే విధంగానే దర్యాప్తు సాగుతోంది. మొత్తం మీద సాయికృష్ణను ఎందుకు తెచ్చారో ఇంత వరకు సిట్ స్పష్టత ఇవ్వలేదు. బూడిదైనా ఇస్తారా? సాయికృష్ణను కృష్ణలంక పోలీసు స్టేషన్లోనే చిత్ర హింసలు పెట్టి, చంపినట్లు ఆధారాలు లభించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అయితే శవం ఏమైందనేది మాత్రం తేల్చలేక పోతోంది. చివరకు సాయికృష్ణ తల్లి వేడుకుంటున్నట్లు, కనీసం బూడిద ఇచ్చే దిశగా కూడా ప్రయత్నాలు చేయటం లేదనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. -
దుర్గమ్మకు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానం, ఉచిత ప్రసాద వితరణకు హైదరాబాద్కు చెందిన భక్తులు సోమవారం రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ కాప్రాకు చెందిన అదృష్టార్ రత్నాలయం జూయాలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని గుడివాడ రమణలాల్ అన్నదానం నిమిత్తం రూ.1,00,016ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. రుచర్మ పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ.1,00,016 విరాళాన్ని అందించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. నందివాడ: మండలంలోని పోలుకొండ గ్రామంలోని దుర్గా వైన్ షాప్లో పనిచేస్తున్న సిబ్బంది మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సోమవారం వైన్ షాప్కు తాళాలు వేసి నిరసన చేపట్టారు. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తమకు మూడు నెలలుగా ఎటువంటి జీతాలు చెల్లించకుండా, మద్యం సిండికేట్దారులు తమతో పని చేయించుకుంటున్నారన్నారు. జీతాలు అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెబుతూ మాట దాట వేస్తున్నారని. ఒక్కొక్కరికీ రూ.80 వేల వరకు జీతాలు రావాలని మద్యం సిండికేట్ దారులు జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్లో మద్యం సిండికేట్ గడువు ముగిస్తుండడంతో జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని తమకు రావాల్సిన బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. షాప్ యాజమాన్యాన్ని పలుమార్లు అడిగినా స్పందించలేదని వారు ఆరోపించారు. జీతాలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని సిబ్బంది చెప్పారు. కోనేరుసెంటర్: తాళాలు వేసి ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన మచిలీపట్నంలో సోమవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం ముస్తాన్ఖాన్పేటకు చెందిన పుప్పాల వెంకటరామ్ పాత ఇనుము వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల ఒకటో తేదీన తన తల్లికి ఆరోగ్యం క్షీణించటంతో వైద్యం నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేర్పించి కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నారు. కేసు నమోదు.. దర్యాప్తు ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు వేసి ఉన్న తలుపులను బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు నాలుగు లక్షల నగదు, ఆరు కాసుల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండిని అపహరించారు. సోమవారం ఉదయం తలుపులు తీసి ఉండటాన్ని గమనించిన స్థానికులు మంగళగిరిలో ఉన్న వెంకటరామ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. మచిలీపట్నం చేరుకున్న అతను ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని నగదు, వస్తువులు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించి ఇనగుదురుపేట పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఇనగుదురుపేట సీఐ పరమేశ్వరరావు, ఎస్ఐ బేగ్, సీసీఎస్ ఎస్ఐ నాగరాజు తదితరులు హుటాహుటినా సంఘటనా స్థలానికి వచ్చారు. క్లూస్టీం సిబ్బంది నిందితుల వేలిముద్రలు సేకరించి, డాగ్స్క్వాడ్ను రంగంలోకి దింపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరమేశ్వరరావు తెలిపారు. పటమట(విజయవాడతూర్పు): భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం పటమట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటమట గురునానక్రోడ్డు టీచర్స్ కాలనీ రోడ్ నం–1 వద్ద ఉన్న కోనేరు కోటేశ్వరరావు ఐకాన్ వద్ద విజయనగరం జిల్లా తిక్కవరపు కోట మండలం పోతంవేట గ్రామానికి చెందిన గొల్ల సోమేశ్వరరావు సోమవారం ఉదయం భవనంపై నుంచి దూకి చనిపోయాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమేశ్వరరావు మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.39కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు ఆలయంలోని హుండీల ద్వారా మొత్తం రూ.3,39,53,599 నగదు, 568 గ్రాముల బంగారం, 3.330 కిలోల వెండి వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా భారీగానే ఉంది. 576 యూఎస్ఏ డాలర్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు, 22 మలేషియా రింగిట్స్, 295 యూఏఈ దిర్హమ్స్, 1500 నైజిరియా నైరీలు, 800 కంబోడియా రియల్స్, 30 వేల టాంజేనియా షిలాంగ్స్, 850 కోరియన్ వాన్లు, 500 పాకిస్తాన్ రూపీలతో పాటు చైనా, థాయ్లాండ్, హాంగ్కాంగ్కు చెందిన నగదు కానులుగా లభించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న రూ.2 వేల నోట్లు ఐదు, రద్దు చేసిన రూ.1,000 నోట్లు తొమ్మిది, రూ.500 నోట్లు 74 ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. కానుకల లెక్కింపు ఏసీ రంగారావు, ఏఈఓ ఎన్.రమేష్బాబు, సూపరింటెండెంట్లు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల పర్యవేక్షణలో సాగింది. కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు. -
ఇండెక్షన్ స్టవ్ల పంపిణీలో జాప్యం !
జగ్గయ్యపేట: ఎల్పీజీ గ్యాస్ సమస్యలను అధిగమించటానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఇండెక్షన్ స్టవ్లు అంగన్వాడీ కేంద్రాలకు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇంధన సమర్థ సేవల సంస్థ (ఈఈఎస్ఎల్) సంయుక్తంగా ఇండెక్షన్ స్టవ్లు, అందుకు సంబంధించిన వంట పాత్రలను ఇందన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సామగ్రి అందిస్తున్నారు. కానీ జిల్లాలో ఇండెక్షన్ స్టవ్లు, వంట పాత్రలు అందించడంలో జాప్యం జరుగుతుంది. జిల్లాలో 1,475 కేంద్రాలు.. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ రూరల్ పరిధిలో 1,475 అంగనవాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో సుమారు 20 వేల మంది చిన్నారులున్నారు. ఈ కేంద్రాలకు విడతల వారీగా నెల రోజుల క్రితం ఇండెక్షన్ స్టవ్లు వాటికి సంబంధించిన వంట పాత్రల కిట్లను అన్ని కేంద్రాలకు పంపిణీ చేసింది. అయితే కొన్ని ప్రాజెక్టు కార్యాలయాలకు స్టవ్లు పూర్తి స్థాయిలో వస్తే వంట పాత్రలు మాత్రం అరకొరగానే ప్రభుత్వం పంపిణీ చేసింది. జగ్గయ్యపేటలోని చిల్లకల్లు ప్రాజెక్టులో 267 కేంద్రాలకు 37 స్టవ్లు పంపిణీ చేయగా నందిగామలో వంట పాత్రలు రాగా స్టవ్లు మాత్రం రాలేదు. తిరువూరు, మైలవరం, విజయవాడ రూరల్ ప్రాంతాలకు స్టవ్లు, వంట పాత్రలు పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. గ్యాస్కు స్వస్తి.. ఇండెక్షన్ స్టవ్లు రానుండటంతో ఇక అంగన్వాడీ కేంద్రాలలో గ్యాస్ పొయ్యిలకు స్వస్తి పలకనున్నారు. ఇండెక్షన్ స్టవ్ల వల్ల ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్ పొయ్యిలు వాడటం ద్వారా వంట ఖర్చులు తగ్గుతాయి. అంతే కాకుండా సాంప్రదాయ వంట పొయ్యిలతో పోల్చితే ఇండెక్షన్ స్టవ్ల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పొగ, మసి లేకుండా పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేసేందుకు వీలుంటుంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు అరకొరగా పంపిణీజిల్లాలోని అన్ని అంగనవాడీ కేంద్రాలకు ఇండెక్షన్ స్టవ్లు, వంట పాత్రలు వస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టు కార్యాలయాల్లో పంపిణీ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తాం. – షేక్ రుక్సానా సుల్తానా, పీడీ -
పోలీస్ పీజీఆర్ఎస్కు 50 ఫిర్యాదులు
కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో తన దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్నింటిని వెంటనే పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం పోలీస్స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు సిబ్బంది అండగా నిలవాలన్నారు. అర్జీలను నిశితంగా పరిశీలించి చట్టపరిధిలో విచారణ జరిపించి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అమర్యాదగా మాట్లాడితే శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. బాధతో వచ్చిన బాధితులు సంతోషంగా వెళ్లేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పీజీఆర్ఎస్లో 50 ఫిర్యాదులు అందుకున్నట్లు ఎస్పీ తెలిపారు. -
సర్.. వేగవంతం కావాలి
పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సమర్థంగా, సకాలంలో పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఆయన సోమవారం పోరంకిలో 100 పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మునిసిపాలిటీ పరిధిలో ఉన్న బీఎవోలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. తాడిగడప మునిసిపాలిటీలో 125 పోలింగ్ కేంద్రాలలో 1,38,532 ఓట్లు ఉన్నాయన్నారు. అయితే డిజిటలైజేషన్ కేవలం 49 శాతమే అయిందని తెలిపారు. గత నెలలోనే సర్ ప్రారంభమయినా మ్యాపింగ్లో చాలా వెనుకబడి ఉన్నారన్నారు. ప్రతీ బీఎల్వో, అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా, లోపాలు లేకుండా చేయాలని ఆదేశించారు. సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో కరుణకుమారి, తాడిగడప మునిసిపల్ కమిషనర్ షేక్ నజీర్, సిబ్బంది పాల్గొన్నారు. పెడన: మండల పరిధిలోని కొంకేపూడి పంచాయతీ ఈదుమూడి గ్రామంలో సోమవారం రేషన్షాపుపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఏడీ వి. కిరణ్బాబు ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్ను, ఉన్న సరుకు నిల్వలను పరిశీలించారు. ఈ–పోస్ యంత్రంలో పంపిణీ చేసిన బియ్యం 1,312 కిలోలుండగా నిల్వలు 1,550 కిలోలున్నట్లుగా గుర్తించి 238 కేజీలు బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే పంచదార అర కిలో ప్యాకెట్లు ఈ–పోస్ ద్వారా 16 ప్యాకెట్లు పంపిణీ చేసినట్లుగా ఉండగా నిల్వ 15 ప్యాకెట్లు ఉండటాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా డీలర్ పి. రాజేశ్వరమ్మపై 6ఏ కేసు నమోదు చేసి రేషన్షాపును వీఆర్వో మౌలాలికి అప్పగించారు. పామర్రు: మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం శ్రీసిద్ధేంధ్ర యోగి కూచిపూడి కళాపీఠంలో సర్టిఫికెట్ కోర్సు ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ ప్రాయోగిక పరీక్షలను సోమవారం ప్రారంభించారు. ఈ సర్టిఫికెట్ పరీక్షలు ఐదు రోజుల పాటు జరుగుతాయని.. వీటికి అబ్జర్వర్గా డాక్టరు ఉషా మాధవి, చీఫ్ సూపరింటెండెంట్గా డాక్టర్ చింతా రవి బాలకృష్ణ వ్యవహరించారని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ తెలిపారు. మృదంగ సహకారం పసుమర్తి హరినాథ్ శాస్త్రి అందిచారన్నారు. సర్టిఫికెట్ ప్రాయోగిక పరీక్షల అనంతరం ఆరో రోజు డిప్లొమా ప్రాయోగిక పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యలో జనరల్ మెడిసిన్ సబ్జెక్ట్లో ప్రతిభ చూపిన వారికి గోల్డ్మెడల్ అందించేందుకు ఫార్మకాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ విజయకుమారి విరాళం అందజేశారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని సోమవారం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు అందజేశారు. ఈ విరాళం ద్వారా ఏటా జనరల్ మెడిసిన్లో ప్రత్యేక పరీక్ష నిర్వహించి, అందులో ప్రతిభ చూపిన వారికి గోల్డ్మెడల్ అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ విద్యార్థులను చదువులో ప్రోత్సహించేలా గోల్డ్మెడల్ విరాళం ఇచ్చిన డాక్టర్ విజయకుమారిని అభినందించారు. ఈ మెడల్ వందలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కమిటీ కార్యవర్గం ఎన్నికై ంది. గాంధీనగర్లో సర్ విజ్జీ మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్ ఆవరణలో ఈ ఎన్నిక ప్రక్రియ ఆదివారం జరిగింది. ఏపీ హైకోర్టు న్యాయవాది కె.స్టాలిన్ రిటర్నింగ్ ఆఫీసర్ వ్యవహరించారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి (డీఎస్డీవో) కె.కోటేశ్వర రావు, ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు మహేష్, ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ అక్వాటిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఐ.మల్లికార్జునరావు పరిశీలకులుగా హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులు వీరే.. అసోసియేషన్ అధ్యక్షుడిగా కొంగర రవికాంత్, ఉపాధ్యక్షులుగా ఎం.ఓబుల్రెడ్డి, ఎల్.మేఘన, లావు సహదేవ్, కార్యదర్శిగా కొడాలి రమేష్, జాయింట్ సెక్రటరీలు ఇల్లిపిల్ల రమేష్, వల్లభనేని రాజేశ్వరి, ఎస్.వీర వెంకటసత్య నారాయణ, కోశాధికారిగా డి.శివ కుమార్, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. అశ్రునయనాలతో అంత్యక్రియలు గూడూరు: మండలంలోని పొట్టేలుగుంటాయి పేటలో శనివారం బలవన్మరణానికి పాల్పడిన ముగ్గురు మహిళలకు ఆదివారం అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అనుమకొండ రజనీకుమారి, అనుమకొండ మధుబాల భౌతిక దేహాలకు పొట్టేలుగుంటాయిపేట లోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. రజనీకుమారి చితికి ఆమె భర్త కృష్ణ, మధుబాల భౌతిక కాయానికి కుమారుడు విఖ్యాంత్ నిప్పంటించారు. తోట గౌరీదేవి భౌతిక కాయాన్ని ఆమె మెట్టినిల్లు అయిన కంకటావ శివారు కత్తులవానిపాలెం శ్మశాన వాటికలో ఆమె భర్త దేవచంద్రరావు దహనసంస్కారాలు నిర్వహించారు. అనుమకొండ మధుబాల తండ్రి బోయిడి నాంచారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం శనివారం బందరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం జరిపించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాంచారయ్య ఫిర్యాదు మేరకు మధుబాల భర్త అనుమకొండ దేవచంద్రరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్, గూడూరు, పెడన ఎస్ఐలు సీహెచ్.దివ్య ప్రకాష్, షేక్ బషీర్ పాల్గొన్నారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఏపీలో వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏపీ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ తారకేష్ మాట్లాడుతూ.. ఏటా 1,500 నుంచి 2,000 మెడికల్ సీట్లు పెంచుకోవచ్చని మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైద్య విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దంటూ వేడుకున్నారు. మెడికల్ సీట్ల సంఖ్యను పెంచి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో తక్కువ మార్కులు వచ్చినా సీట్లు లభిస్తుంటే, ఏపీలో మాత్రం మెరుగైన మార్కులు సాధించినా సీట్లు రాకపోవడం వెనుక ఇక్కడి కాలేజీల సంఖ్య, సీట్ల కొరతే ప్రధాన కారణమని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కె.రంగారావు, ఉపాధ్యక్షుడు పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ అందె గుంటూరు మెడికల్: పద్మశాలి వైద్యుల నూతన కార్యవర్గం ఎన్నిక విజయవాడ లోని పద్మశాలి కళ్యాణమండపం లో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ అందె వెంకటేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన డాక్టర్ సింగరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్ టి.మునిరామ ప్రసాద్, కోశాధికారిగా నగరానికి చెందిన డాక్టర్ కొల్లి జయకిషన్లు ఎన్నికయ్యారు. కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ సమీపంలోని గుంటుపల్లికి చెందిన కంచర్ల బెనర్జీ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,116ల విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేసింది. హైదరాబాద్ సరూర్నగర్కు చెందిన వి.వీరప్రకాష్ కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందించింది. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడకు చెందిన వై.యోహిత్ పేరిట కుటుంబ సభ్యులు అమ్మవారి అన్నదానం నిమిత్తం రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన వి.వి.మనుబ్రహ్మచారి అన్నదానానికి రూ. 1,00,116 విరాళం సమర్పించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ. లక్ష విరాళం చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఇందుకూరి నరేష్కుమార్రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేసవస్త్రాలను అందించారు. -
మద్యం మత్తులో యువకుల వీరంగం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మద్యం మత్తులో రెండు వర్గాల యువకులు వీరంగం సృష్టించారు. వారి మధ్య జరిగి కొట్లాటలో ఒకరు గాయపడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ పరమేశ్వరరావు కథనం మేరకు.. మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన వడ్లమూడి చాణక్య ఆదివారం మరో ఆరుగురు స్నేహితులు కలిసి డాబాపై మందు తాగుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వేముల చందు మధ్యాహ్నం ఇంటికి రాగా ఎదురుగా డాబాపై చాణక్య అతని స్నేహితులు మద్యం మత్తులో చేస్తున్న వీరంగం చూస్తూ ఇంట్లోకి వెళ్లిపోయాడు. దీంతో చాణక్య అతని స్నేహితులు తమ డాబాపైకి కోపంగా చూస్తూ వెళుతున్నావేంట్రా అంటూ చందుతో ఘర్షణకు దిగారు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. చాణక్య అతని స్నేహితులు చందుపై దాడి చేశారు. చందు భార్య జరిగిన విష యాన్ని అతని మేనమామ మణికంఠకు ఫోన్ చేసి చెప్పింది. విషయం తెలుసుకున్న మణికంఠ తని స్నేహితులతో కలిసి బలరామునిపేట చేరుకుని ఎందుకు దాడి చేశారంటూ చాణక్యను నిలదీశాడు. ఈ విషయంలో మణికంఠకు చాణక్య మధ్య ఘర్షణ జరిగింది. చాణక్య, అతని స్నేహితుల దాడిలో మణికంఠ చెవి తెగింది. ఆర్పేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రెండు వర్గాల వారిని స్టేషన్కు తరలిస్తుండగా కోనేరుసెంటర్ సమీపంలో మరలా చాణక్య అతని స్నేహితులు మణికంఠపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని రెండు వర్గాల వారిని స్టేషన్కు తరలించారు. బాధితుడు మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గాయాలపాలైన మణికంఠను చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. గంజాయి మత్తులోనే తమపై దాడి చేశారని బాధితుడు బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఎస్ఈ పోస్టుపై ఈఈ చూపు!
అనేక ఆరోపణలు లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ సర్కిల్ ఆర్అండ్బీ రెగ్యులర్ ఎస్ఈని ఆ పోస్టు నుంచి తప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనకు ఇంకా తొమ్మిది నెలల సర్వీసు ఉన్నా, ఆ స్థానంలో ఇన్చార్జిగా రావడానికి నగర సమీపంలోనే పనిచేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి రాజకీయ నాయకులతో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో వత్తిళ్లు తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శికి అమాత్యుల సిఫార్సు లేఖలు ఇచ్చిన ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇప్పుడు ఏకంగా సకల శాఖల మంత్రి చుట్టూ తిరుగుతూ ఇంజినీర్ ఇన్ చీఫ్కు ఫోన్లు చేయిస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమిలోని ఓ పార్టీకి చెందిన మంత్రి తన క్లాస్మెంట్ అంటూ ప్రచారం చేసుకుంటూ, ఎలాగైనా ఇన్చార్జి సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ) పోస్టు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మనస్తాపం చెందిన ఎస్ఈ! ప్రస్తుతం విజయవాడ సర్కిల్ ఎస్ఈగా పనిచేస్తున్న జి.వి.భాస్కరరావుకు మరో తొమ్మిది నెలల సర్వీసు ఉంది. రెగ్యులర్ ఎస్ఈ ఉద్యోగ విరమణ తర్వాత ఇన్చార్జిగా వచ్చేందుకు కిందిస్థాయి అధికారులు ప్రయత్నించడం సాధారణం. ఇప్పుడు నిజాయతీగా పనిచేసే ఉన్నతాధికారిని తప్పించి, ఆ పోస్టులో కిందస్థాయి ఉద్యోగి ఇన్చార్జిగా రావాలని ప్రయత్నించడం ఇప్పుడే చూస్తున్నా మంటూ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను సైతం ఇబ్బందులు పెట్ట కుండా సక్రమంగా విధులు నిర్వహించేలా ప్రస్తుత ఎస్ఈ వ్యవహరిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అలాంటి తనను తప్పించి కిందిస్థాయిలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇన్చార్జి ఎస్ఈగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియడంతో ప్రస్తుత ఎస్ఈ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మంత్రులతో సిఫార్సులు ప్రస్తుతం నగర సమీపంలోని డివిజన్లో పనిచేస్తున్న సదరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నెల రోజులుగా ఇన్చార్జి ఎస్ఈగా రావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన రాజకీయ పలుకుబడితో పాటు, గతంలో పరిచయాలను వాడుతున్నారు. కూటమి పార్టీలోని ఒక మంత్రి తన క్లాస్మేట్ అని చెప్పుకుంటూ ఉన్నతాధికారులపై వత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ శాఖ కార్యదర్శితో పాటు, ఇంజినీర్ ఇన్ఛీప్కు కూడా ఫోన్లు చేయిస్తున్నట్లు తెలిసింది. తాజాగా అన్ని శాఖలూ చూస్తున్న ఓ మంత్రి వద్దకు వెళ్లి సిఫార్సు చేయించినట్లు తెలిసింది. ఇన్చార్జిగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఆ శాఖలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగుల సర్వీసు మేటర్లో కూడా లంచాలు ఇస్తేనే పనిచేసే నైజం అతనిది అంటున్నారు. అలాంటి వ్యక్తి రాజధాని నగరంలోని సర్కిల్కు ఎస్ఈగా వచ్చే పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు అమాత్యుల పలుకుబడి ఉందని ఉద్యోగులందరిపై తప్పుడు పనులకు వత్తిడి చేస్తే అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. -
కనకదుర్గమ్మకు జేజేలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జై దుర్గ్గ.. జైజై దుర్గా అంటూ కనకదుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి పరిసరాలు పులకించాయి. దుర్గమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివారం తరలివచ్చారు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడం సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు, యాత్రికులతో పాటు వివాహ శుభముహూర్తం వేళ ఒక్కటైన నూతన వధువరులు, కుటుంబ సభ్యుల రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి జరిగే పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు సైతం విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోని అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. రద్దీ అధికం కావడంతో ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనం నిలిపివేశారు. రూ.300 టికెట్లపై వీఐపీలు, సిఫార్సు లేఖలు ఉన్న వారితో పాటు భక్తులందరికీ బంగారు వాకిలి దర్శనం కల్పించారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయంలో క్యూలైన్లను ఏఈవోలు చంద్రశేఖర్, ఎన్.రమేష్బాబు పర్యవేక్షించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొనగా, రాత్రి 9.30 గంటల వరకు భక్తుల తాకిడి కనిపించింది.దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తజనం -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
కంచికచర్ల: సెలవురోజు కావడంతో సెల్ఫోన్ బాగు చేయించుకుందామని స్నేహితుడితో బైక్పై వెళ్లి తిరిగి కళాశాలకు వస్తుండగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన బాలవోలు గణేష్(21), నందిగామకు చెందిన ప్రవీణ్ ఇబ్రహీంపట్నం మండలంలోని వేర్వేరు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ చదువుతున్నారు. వారిద్దరు స్నేహితులు. గణేష్ తన సెల్ఫోన్ బాగు చేయించుకునేందుకు ప్రవీణ్తోకలిసి మరో స్నేహితుడి బైక్పై నందిగామ వచ్చారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం కళాశాలలకు తిరిగి వెళ్తుండగా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడ్ను ఢీకొని రెండు రోడ్ల మధ్యలో ఉన్న సాగర్కెనాల్లో పడిపోయింది. ఆ సమీపంలో పెద్ద బండరాళ్లు ఉండటంతో గణేష్, ప్రవీణ్కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి గణేష్ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గిరిజన సంస్కృతి సంబరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): గిరిజన ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతూ వారి ఆత్మగౌరవాన్ని ఆకాంక్షిస్తూ శంకర్ షాలిని ఫౌండేషన్ సహకారంతో గిరిజన ప్రజా సమాఖ్య(జీపీఎస్), గిరిజన విద్యార్థి సమాఖ్య (జీవీఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం గిరిజన ఆదివాసి సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన నృత్యాలు అబ్బురపరిచాయి. మన్యం జిల్లా పార్వతీపురం సీతంపేట నుంచి వచ్చిన గిరిజనుల సవర నృత్యం, అదిలాబాద్ జిల్లా గిరిజనుల గుస్పాడి నృత్యం, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామం లంబాడీలు నెత్తిమీద బిందెలు పెట్టుకుని చేసిన నృత్యం, అరకు ప్రాంతం నుంచి వచ్చిన గిరిజనుల థింసా నృత్యం, భద్రాచలం చింతూరు గిరిజనులు కొమ్మ కోయ నృత్యం ఆహూతులను కట్టిపడేశాయి. ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ మాట్లాడుతూ గిరిజన ఆదివాసీల హక్కుల పరిరక్షణ, అభ్యున్నతి లక్ష్యంగా జీపీఎస్, జీవీఎస్ పని చేస్తున్నాయన్నారు. ఆధార్, రేషన్ కార్డు లేని కుటుంబాలను ఆదుకోవాలన్నారు. గాయకుడు డాక్టర్ కళాశ్రీ బిక్షు నాయక్, గాయని సుజశ్రీ వ్యాఖ్యాతలుగా వ్యహరించి అందరినీ ఉత్సాహ పరిచారు. సభలో జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, కార్యదర్శి రవి నాయక్, హనుమంతు నాయక్, మల్లు స్వామి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్, కృష్ణాజిల్లా అధ్యక్షుడు సమీర్ నాయక్, జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణు నాయక్, అంజు నాయక్, పేరం సత్యం, ధర్మ కుమార్, దుర్గా నాయక్, పార్వతి బాయ్, లక్ష్మణ నాయక్, కృష్ణా నాయక్, చంద్ర నాయక్, పాండు నాయక్, కాకినాడ మధుకుమార్, వరహాలు తదితరులు పాల్గొన్నారు.సందడిగా గిరిజన ఆదివాసి సమ్మేళనం -
అందని ద్రాక్షలా నగదు రహిత వైద్యం
ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందని ద్రాక్షలా మారిందని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు వాపోయారు. ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన పౌర గ్రంథాలయ ఉద్యోగి కొలకలూరి కృపానందం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతినెలా ఆరోగ్య బీమా ప్రీమియం ప్రభుత్వం మినహాయిస్తోందని, అయినా ఉద్యోగులు అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే హెల్త్ కార్డులు ఉపయోగపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృపానందం ఇద్దరు పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, మెడికల్ రీయింబర్స్మెంట్ ద్వారా ఆస్పత్రి ఖర్చులు చెల్లించాలని కోరారు. వారి కుటుంబానికి అసోసియేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం దగ్ధం
మధురానగర్(విజయవాడసెంట్రల్): దావు బుచ్చయ్యకాలనీలో ఆదివారం ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం దగ్ధమైంది. ఆ వాహనం పక్కనే ఉన్న కారు సైతం పాక్షికంగా దెబ్బతింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం నుంచి మంటలు వస్తుండటంతో ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందారు. స్థానికుల కథనం మేరకు.. ఆదివారం ఉదయం ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనం నుంచి మంటలు ఎగశాయి. చుట్టపక్కల వారు ద్విచక్రవాహనం యజమానికి సమాచారం ఇచ్చారు. ఆయన స్పందించి మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. అప్పటికే ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం దగ్ధమైంది. పక్కనే ఉన్న కారు సైతం పాక్షికంగా దెబ్బతింది. కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం సోమవారం జరుగుతుందని ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యక్రమం జరుగుతుందని వివరించారు. అందిన ప్రతి అర్జీపై చట్టపరిఽధిలో విచారణ జరిపించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. -
సంఘటితత్వంతో సమస్యల పరిష్కారం సాధ్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): సంఘీయులంతా సంఘటితంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమని సీనియర్ రాజకీయ నాయకుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కార్యవర్గ సమావేశం విజయవాడ భవానీపురంలోని కొండవీడు అకాడమీ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు, నాయ కులు రెడ్డి సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యఅతిథి వేమారెడ్డి మాట్లాడుతూ.. ఒక సామాజిక వర్గానికి సంబంధించి జిల్లాకొక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం సరికాదని, రాష్ట్రంలో ఉన్న అందరూ కలిసి ఒక సంఘంగా ఉంటే మంచిదని సూచించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు, హోదాలకు అతీతంగా రెడ్డి సామాజికవర్గ సంక్షేమం కోసం వారి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన సంఘం డిమాండ్లను వివరించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి పాలక మండ లిని నియమించాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో రెడ్డి విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహాల (హాస్టల్స్) ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయించాలని కోరారు. రెడ్డి సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బిక్క నరసింహారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల వెంకట రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం గౌరవ సలహాదారు పులుగు సుశీల రెడ్డి, ఉపాధ్యక్షురాలు త్రివేణిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెం సుబ్బారెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మచ్చ శ్రీనివాస్రెడ్డి, కోస్తాంధ్ర ఇన్చార్జ్ బోనం రామిరెడ్డి, రాష్ట్ర గౌరవ సలహాదారు జెమిలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొంతిరెడ్డి వేమారెడ్డిని సంఘం కార్యవర్గ సభ్యులు సత్కరించారు.ఏపీ రెడ్డి సంఘం సమావేశంలో దొంతిరెడ్డి వేమారెడ్డి -
సోమవారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2026
యూడైస్ గణాంకాలు విద్యార్థుల నమోదుతో వచ్చినవే. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది చేరికలు ఉన్నాయి. చేరికల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని చేరికలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. విద్యార్థుల నమోదుపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. – యూవీ సుబ్బారావు, కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిమచిలీపట్నం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు ఏటా నిర్వహించే ’బడిబాట’ కార్యక్రమం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ప్రచారానికి పెద్దపీట వేస్తూ సర్కారీ బడుల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెబుతున్నా, గణాంకాలు మాత్రం భిన్నమైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. ప్రధానంగా ఒకటో తరగతి ప్రవేశాలు వరుసగా తగ్గుతుండటం ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల విశ్వాసం ఇంకా పూర్తిస్థాయిలో పెరగలేదనే సంకేతాలనుఇస్తోంది. తగ్గుతున్న చేరికలు జిల్లా అధికారిక వివరాల ప్రకారం 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 7,981 మంది విద్యార్థులు ఉండగా, 2025–26లో ఈ సంఖ్య 7,509కు తగ్గింది. ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరంలో జూన్ 30 నాటికి కేవలం 6,802 మంది మాత్రమే చేరారు. మూడేళ్ల వ్యవధిలో 1,179 మంది తగ్గిపోవడంతో దాదాపు 15 శాతం క్షీణత నమోదైంది. ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం, ప్రత్యేక చేరికల డ్రైవ్లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. గణాంకాల్లో సందేహాలు చేరికల గణాంకాల విషయంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు 8,352 మంది లక్ష్యాన్ని నిర్ణయించి జూన్ 30 నాటికి 81.44 శాతం చేరికలు పూర్తయ్యాయని సమగ్ర శిక్ష అధికారులు ప్రకటిస్తున్నారు. గత ఏడాది నమోదైన విద్యార్థుల సంఖ్య, ఈ ఏడాది వెల్లడించిన చేరికల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల గణాంకాల్లోనూ ఇలాంటి తేడాలు ఉండటంతో విద్యా వర్గాలు లెక్కల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. యూడైస్లోనూ యూడైస్ గణాంకాలు కూడా జిల్లాలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. 2024–25లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం 96,042 మంది విద్యార్థులు ఉండగా, 2025–26లో అది 87,989కు పడిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 87,196కు చేరింది. రెండేళ్ల వ్యవధిలో మొత్తం 8,846 మంది విద్యార్థులు తగ్గడం విద్యాశాఖకు హెచ్చరికగా మారింది. విశ్వాసం పెరగాలంటే.. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరగాలంటే ప్రచార కార్యక్రమాలు మాత్రమే కాకుండా, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, బోధన నాణ్యత మెరుగుదల, మౌలిక వసతుల కల్పన, విద్యా ఫలితాలపై ప్రత్యేక దృష్టి అవసరమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు చేరికల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు మాత్రం ప్రభుత్వ విద్యా వ్యవస్థ ముందున్న సవాళ్లను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 20 మండలాల్లో 600 వరకూ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలోని వివిధ స్థాయిల్లో కొనసాగుతున్నాయి. ఆయా పాఠశాల్లోని మొదటి తరగతిలో సుమారు 15 వేల మంది ని చేర్చుకునే దిశగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే జిల్లాలో ఆ లక్ష్యాన్ని చేరుకోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఎనిమిది వేల మార్కును సైతం దాటలేదని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. కేవలం విజయవాడ అర్బన్ పరిధిలో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ అడ్మిషన్ల సంఖ్య దారుణంగా ఉన్నట్లుగా తెలిసింది. దీనిపై విద్యాశాఖ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
సింగ్నగర్లో గ్యాంగ్వార్
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ‘వాడా.. ఆడో పిరికిపంద. వాడ్ని మా అన్నే రెండు మూడుసార్లు కొట్టాడు. వాడికేంట్రా భయపడేది’ అంటూ ఒక వర్గం... ‘ఏంట్రా నా గురించి ఏదో వాగుతున్నావంటా. నీ తాట తీస్తా. దమ్ముంటే రారా చూసుకుందాం’ అంటూ మరో వర్గం మధ్య పది రోజుల నుంచి చెలరేగిన మాటల యుద్ధం కొట్లాటకు దారితీసింది. ఓ యువకుడిపై కత్తితో దాడికి పాల్పడేలా చేసింది. అజిత్సింగ్నగర్లో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది. పాయకాపురం ప్రశాంతినగర్ ప్రాంతానికి చెందిన కొళ్ల సూర్యతేజ(20) ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత నెలలో తన స్కూల్ ఫ్రెండ్స్ను కలిసేందుకు సూర్యతేజ సింగ్నగర్ వెళ్లాడు. సూర్యతేజ వద్ద అతని ఫ్రెండ్స్ శాంతినగర్కు చెందిన పార్థివ్నందన్ అలియాస్ పార్థు ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో సూర్యతేజ ‘ఆడికేంట్రా భయపడేది. వాడ్ని మా అన్న శివ గతంలో రెండుసార్లు కొట్టాడు. ఏం చేస్తాడంటా’ అంటూ చులకనగా మాట్లాడాడు. ఈ విషయం తెలుసుకున్న పార్థు, సూర్యతేజకు ఫోన్ చేసి ప్రశ్నించాడు. దీంతో కొన్ని రోజుల నుంచి వారిద్దరి వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ‘టైం.. ప్లేస్ చెప్పరా వస్తాం’ అని సూర్యతేజ అనడంతో పార్థు తన స్నేహితులైన సన్ని, మనోజ్, రజాక్, ఈశ్వర్ను వెంటబెట్టుకొని శనివారం సాయంత్రం సూర్యతేజ ఇంటికి వెళ్లారు. అతడిని తమ బండిపై ఎక్కించుకొని సింగ్నగర్ ఎక్సెల్ప్లాంట్ వద్ద ఉన్న జీప్లస్జీ అపార్ట్మెంట్ల వెంబడి ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ సూర్యతేజను తిట్టి, కొట్టడంతో పాటుగా పార్థు తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అతని కడుపులో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. సూర్యతేజ పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు స్పందించి అక్క డికి రావడంతో పార్థు అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న సూర్యతేజను స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి అందిన సమాచారం, బాధితుది ఫిర్యాదు మేరకూ పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో పార్థు, ఎండీ రజాక్ను అరెస్ట్చేశారు. మరో ముగ్గురు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సూర్యతేజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. సూర్యతేజ స్నేహితులు పార్థు స్నేహితులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పది రోజులుగా మాటల యుద్ధం ఓ యువకుడిని బైకుపై ఎత్తుకెళ్లి కత్తితో పొడిచిన ఓ గ్యాంగ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థి పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు, మరో ముగ్గురి కోసం గాలింపు -
పీఆర్సీ కమిషన్ తక్షణం వేయాలి
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనార్థం పీఆర్సీ కమిషన్ను తక్షణం నియమించి ఐఆర్ 30 శాతం ప్రకటించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం ఇబ్రహీంపట్నం స్వర్ణ కన్వెన్షన్లో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథి సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్కుమార్ మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ను నియమించని పక్షంలో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి దశల వారీ ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 30 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలంటే ఆందోళన చెందుతున్నారన్నారు. ఉపాధ్యాయుల ఆందోళన దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుందరయ్య. కోశాధికారి కె. గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చెస్ ఆడితే ఏకాగ్రత, క్రమశిక్షణ, సహనం పెరుగుతాయని నెక్ట్స్జెన్ సీబీఎస్ఈ స్కూల్ సీఈవో గౌతమి చెప్పారు. స్థానిక గుణదలలోని నెక్ట్స్జెన్ స్కూల్ ఆవరణలో ఆదివారం ఎన్టీఆర్ జిల్లా రాపిడ్ చెస్ టోర్నమెంట్ జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 82 మంది పాల్గొని ప్రతిభను చూపారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ పాషా, కార్యదర్శి పి.రేణుక, చీఫ్ ఆర్బిరేటర్లు డి.ప్రవీణ్కుమార్, ఎ.మణిరత్నం, నెక్ట్స్జెన్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.సుధా విజేతలను అభినందించారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వివిధ సేవా టికెట్ల ద్వారా ఆదివారం వచ్చిన ఆదాయం రూ. 8,59,037 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ డీసీ మాట్లాడుతూ స్వామివారికి సేవా టిక్కెట్ల ద్వారా రూ. 4,47,364 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,54,355, డొనేషన్ ద్వారా రూ. 1,67,918, స్వామివారి దర్శనానికి రూ. 59,550, కళ్యాణ కట్ట ద్వారా రూ. 25,640 మొత్తం రూ. 8,59,037 ఆదాయం వచ్చినట్లు వివరించారు. గన్నవరం: ప్రశ్నించే గొంతుకలపై డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ అనుసరిస్తున్న అణచివేత ధోరణి సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. గత నెల 28వ తేదీన ఏలూరులో జరిగిన సభలో ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలను తట్టుకోలేక పవన్కళ్యాణ్ అక్రమ అరెస్ట్లకు దిగడం అన్యాయమన్నారు. ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ పొందిన రావణ్ను భయంకరమైన తీవ్రవాదిగా చూపిస్తూ దేశద్రోహం కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నిస్తే ఇలా భయపెడతామనే హెచ్చరికలను ప్రజలకు పంపడమే కూటమి ఉద్దేశమన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అనేక వేదికలపై నుంచి తాట తీస్తాం, తోలు వలుస్తానని రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను వీడాలని ఆయన హితవు పలికారు. సమావేశంలో నేతలు వై. కేశవరావు, మల్లంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఐసీ వాటాల విక్రయం ఉపసంహరించుకోవాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు మచిలీపట్నంటౌన్: జీవిత బీమా సంస్థలో రూ.10 వేల కోట్ల వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడతామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక కోనేరు సెంటర్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎల్ఐసీని కాపాడాలని కోరుతూ ధర్నా చేశారు. నర్సింగరావు మాట్లాడుతూ.. ఔషధ రంగానికి సంబంధించి ఐడీపీఎల్ కంపెనీని కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్ పరం చేయడంతో సామాన్యులకు ఔషధాల ధరలు అందనంత విధంగా పెరిగిపోయా యని ఆందో ళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వంలో మోదీ నిరంకుశ విధానాలకు తోడు రాష్ట్రంలో చంద్రబాబు కూడా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయ డంలో ముందు వరుసలో ఉంటున్నారని దుయ్యబట్టారు. సీఐటీయూ పోరాటం చేయకుంటే 2021లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోయేదని పేర్కొన్నారు. 1956లో రూ.5 కోట్ల మూల నిధితో ప్రారంభమైన ఎల్ఐసీ నేడు లక్షల కోట్ల సొంత ఆస్తులు కలిగే పరిస్థితికి ఎదిగిన కామధేనువు లాంటి సంస్థను వాటాల విక్రయం పేరుతో ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను పోరాటాల ద్వారా తిప్పికొట్టాలన్నారు. ఐసీయూ మచిలీపట్నం డివిజన్ అధ్యక్షుడు దేవనబోయిన వాసు, ఎల్ఐసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బి.హెచ్.వి.ఎల్.రాధాకృష్ణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎం.పోలినాయుడు, కె.వి. గోపాల్రావు, ఆర్.సి.పి రెడ్డి, జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి. ధనశ్రీ, ఎల్ఐసీ విశ్రాంత ఉద్యోగులు పి.నాగయ్య, సీహెచ్.రాజేష్, ఎస్. ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల హౌసింగ్ నిర్మాణం చేపట్టాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): అమరావతి రాజధానిలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడి యాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు కోరారు. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వ ర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న పలువురు జర్నలిస్టులు ఈ మేరకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 2019లో జర్నలిస్టుల హౌసింగ్ నిర్మాణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 67 ద్వారా 30 ఎకరాల భూమిని అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయించిందని, ఆ భూమిలో సీఆర్డీఏ ఆధ్వర్యంలో బహూళ అంతస్తుల గృహ సముదాయాలను నిర్మించేలా సొసైటీ అధికారికంగా ఒప్పందం చేసుకుని తిరిగి ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చిందని గుర్తుచేశారు. నాలుగు కేటగిరీల్లో జర్నలిస్టులకు అపార్ట్మెంట్లు నిర్మించేలా ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 107ను విడుదల చేసిందన్నారు. హ్యాపీనెస్ట్ తరహాలో జర్నలిస్టుల కోసం ఆ పార్ట్మెంట్లు నిర్మిస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొందని గుర్తుచేశారు. ఇప్పుడు అమరావతిలో హ్యాపీనెస్ట్తో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరుతున్నందున వెంటనే ప్రభుత్వం జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించాలని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టులు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మొత్తం 11 తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు, డైరెక్టర్లు చావా రవి, ఈశ్వర్, నరసింహారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి సీనియర్ జర్నలిస్టుల విజ్ఞప్తి -
ఉద్యోగ భద్రత కల్పించండి
మధురానగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్త దశలవారీ ఆందోళన పోరాటంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందరినీ సంస్థలో విలీనం చేసి పర్మినెంట్ చేయాలని, పీస్ రేట్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు వెంటనే మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని, డీఏలు వెంటనే విడుదల చేయాలన్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని.. జేఎల్ఎం కన్వర్షన్స్ అయిన కార్మికులందరికీ ఏఎల్ఎం ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. 2008 ముందు జాయిన్ ఉద్యోగులందరికీ ఈపీఎప్ హయ్యర్ పెన్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని, సంస్థలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్య నిర్వాహక అధ్యక్షులు ఎల్.రాజు, జి.కనకలింగేశ్వరావు, జె.అనిల్కుమార్, ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.మోహనరావు, పలువురు నేతలు పాల్గొన్నారు. -
సమష్టి భాగస్వామ్యంతో సర్
భవానీపురం/పటమట(విజయవాడతూరు): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంలో సమష్టి భాగస్వామ్యం అవసరమని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం సీఈవో వివేక్ యాదవ్ విజయవాడ అర్బన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. చిట్టినగర్, కంసాలి పేట ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ 208, 217 పరిధిలో వీఎంసీ కమిషనర్, డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ ధ్యానచంద్రతో కలిసి క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించారు. నియోజకవర్గం స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను పరిశీలించి.. అక్కడి అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవల్ అధికారులతో మాట్లాడి ప్రక్రియ అమలుపై ఆరా తీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లేందుకు కీలకమైన ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో కీలక భాగస్వాములు కావాలని సీఈవో వివేక్ యాదవ్ కోరారు. ఈ పర్యటనలో విజయవాడ పశ్చిమ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) ఎ.రవీంద్రరావు, సహాయ ఈఆర్వోలు ఎన్. శ్రీనివాసరావు, డి.హరీష్, జి.సృజన, చంద్రబోస్, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు. -
అల్లూరి ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లోని సమావేశం హాలులో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి.. స్వాతంత్య్రోద్యమంలో చూపిన ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతి భారతచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణకు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం దేశ ప్రజలకు చిరస్మరణీయమన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కోసం కృషి చేసే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సైకిల్పై క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్కు వచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఇన్చార్జ్ డీఆర్వో పోతురాజు, గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిదూర్జటి, కలెక్టరేట్ ఏవో ఏఎస్ఎన్ రాధిక, సూపరింటెండెంట్లు నెల్సన్పాల్బాబు, ఎం.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
గడువు గుబులు!
డిజిటలైజేషన్ అయ్యేనా.. సర్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సర్ ప్రక్రియ గడువు ముగింపు సమయం ఇంకా పది రోజులే ఉంది. అయితే డిజిటలైజేషన్ చేయాల్సిన ఫారాలు ఇంకా 10 లక్షలు పైనే ఉండటంతో గడువు గుబులు సిబ్బందిని వెంటాడుతోంది. డిజిటలైజేషన్లో బీఎల్వోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు రాజస్తాన్కు చెందిన ఓ కుటుంబం ముప్పై ఏళ్లుగా విజయవాడలో నివసిస్తోంది. అద్దె ఇంట్లో ఉంటున్న ఈ కుటుంబం గత ఎన్నికల్లో గొల్లపూడిలోని ఓ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్ లో భాగంగా ఆ కుటుంబానికి బీఎల్వో ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. నాలుగైదు రోజుల్లో వచ్చి ఫారాలు వెనక్కు తీసుకుంటాం. ఈలోపు పూర్తి చేయాలని చెప్పారు. ఈ కుటుంబానికి 2002లో రాజస్తాన్లో ఓట్లు ఉన్నాయి. అష్టకష్టాలు పడి అక్కడ తమ బంధువులకు ఫోన్ చేసి ఎట్టకేలకు వివరాలు సేకరించి ఫారాలు నింపి బీఎల్వోకు అందజేశారు. డిజిటలైజేషన్ సమయంలో ఫారంలో పొంది పరిచిన వివరాల ఆధారంగా వేరే వారి పేర్లు వస్తున్నాయి. దీంతో డిజిటల్ చేయ కుండా ఆపివేశారు. బీఎల్వో మళ్లీ ఆ కుటుంబం వద్దకు వచ్చి వివరాలు తెలుసుకోగా అక్కడి ఓటర్ల జాబితాలో పార్ట్ నంబరు తప్పుగా ఫారంలో పొందుపరిచినట్లు గుర్తించి సరిచేశారు. ఈ ఒక్క కుటుంబం ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయడానికి బీఎల్వో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు విజయవాడ నగరంలో రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వేలాది కుటుంబాలు స్థిరపడ్డాయి. ఇక్కడే వారికి ఓటు హక్కు కూడా వచ్చింది. వారందరినీ ఇంచుమించు ఇదే సమస్య వేధిస్తోంది. కొందరైతే ఎక్కడ తప్పులు దొర్లుతాయోనని పది రోజులు గడుస్తున్నా ఫారాలు పూర్తి చేయకుండా వారి వద్దనే ఉంచుకున్న పరిస్థితి. ఇక రాష్ట్రానికే చెందిన మహిళల్లో కొందరి పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. తెలంగాణలో పుట్టి ఇక్కడ వివాహాలు చేసుకున్న వారి వివరాల కోసం 2002 ఓటర్ల జాబితాలోకి వెళుతుంటే అప్పటి నియోజకవర్గం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగమైన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. వివరాల్తో తేడా వస్తే.. సీరియల్ నంబర్, అప్పటి బూత్ నంబర్, పోలింగ్ స్టేషన్ పేరు, తల్లిదండ్రులు పేర్లు ఇలా ఏ ఒక్కటి తేడా వచ్చినా మొత్తం మొదటికి వస్తుందని కొందరు బీఎల్వోలు చెబుతున్నారు. విజయవాడ వన్టౌన్లో రాజస్తాన్, ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. గవర్నర్పేటలోని బంగారం దుకాణాల్లో పనిచేసే పశ్చిమ బెంగాల్కు చెందిన వారి వివరాల సేకరణ జాప్యమవుతోంది. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 2002 జాబితాలో పేర్లకు ఇప్పటి దానిలో పేర్లకు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు చిట్టినగర్కు చెందిన సయ్యద్ ముర్తుజా పేరు 2002లో సయ్యద్ మక్తిజగా నమోదై ఉంది. తండ్రి పేరు కూడా రసూల్కు బదులు సూల్ అని నమోదైంది. ఆ ఓటు అతనిదేనని నిరూపించుకోవాల్సి ఉంది. ఇలా ఫారాలు వెనక్కు తీసుకున్న తర్వాత తప్పులు గమనిస్తే మళ్లీ ప్రత్యేక సమయం కేటాయించాల్సి వస్తోంది. అటు బీఎల్వోలు, ఇటు ఓటర్లు సర్ పేరు చెప్పగానే భయపడిపోతున్నారు. గడువులోగా డిజిటలైజేషన్ కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 17,13,445 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికి 7,30,192 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం ఫారాల్లో 42.62 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. మిగిలిన సుమారు 10 లక్షల ఫారాలను డిజిటల్ చేయాల్సి ఉంది. ఫారాలు నింపే సమయంలో ఓటరు వివరాలు తప్పుగా నింపడం, కొందరు అసంపూర్తిగా ఇవ్వడం, ఇప్పటికీ ఫారాలు పూర్తి చేయకుండానే వారి వద్ద పెట్టుకోవడం వంటి కారణాల దృష్ట్యా డిజిటలైజేషన్ నిర్దిష్ట సమయానికి పూర్తయ్యేనా అన్న సందేహం కలుగుతోంది. అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటే ఒక్కో ఫారం డిజిటల్ చేయడానికి కనీసం 15 నిమిషాలు పడుతోంది. -
పార్టీల సహకారంతో పారదర్శక ఓటర్ల జాబితా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పార్టీల సహకారంతో పారదర్శక ఓటర్ల జాబితా రూపొందిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ శనివారం కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి హాల్లో సమగ్ర సవరణ ప్రక్రియ నేపథ్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సర్ ప్రక్రియ తీరుతెన్నులను కలెక్టర్ వివరించారు. 17,13,445 ఓటర్లకు గాను పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు, వాటి డిజిటైజేషన్ తదితరాలను వివరించారు. 2002 ఎస్ఐఆర్ జాబితా నుంచి ఓటరు సమాచారం పొందే విధానాన్ని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఓటర్లు ఫారాలు నింపడం, సమర్పించడంలో సహకరించేందుకు జిల్లాలోని 1,792 పోలింగ్ స్టేషన్ల పరిధిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామన్నారు. ఓటు భద్రతకే సర్ ప్రక్రియ చేపట్టామని.. అర్హులైన ప్రతిఒక్కరూ జాబితాలో ఉండేలా జాబితా రూపకల్పనలో సహకరించాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. సమావేశంలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేసి.. వారి నుంచి సూచనలు స్వీకరించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు పి.హరికృష్ణ (ఏఏపీ), కాకాని తరుణ్ (బీజేపీ), పి.డేనియల్ (బీఎస్పీ), డీవీ కృష్ణ (సీపీఎం), వై.ఆంజనేయరెడ్డి, జి.సుందర్ పాల్ (వైఎస్సార్ సీపీ) తదితరులు పాల్గొన్నారు. డిజిటలైజేషన్లో కచ్చితత్వానికి పెద్దపీట ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో కచ్చితత్వానికి పెద్ద పీట వేయాలని రోల్ అబ్జర్వర్ ఐఏఎస్ అధికారి ఎం.వి. శేషగిరిబాబు సూచించారు. శనివారం సర్ కార్యక్రమం పరిశీలకులు శేషగిరి బాబు.. కలెక్టర్ లక్ష్మీశతో కలిసి ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని సమీక్షించి.. కార్యక్రమం సజావుగా జరిగేందుకు సూచనలు చేశారు. -
కేయూలో నూతన భవనానికి పింగళి పేరు
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్మిస్తున్న నూతన భవనాల్లో ఒక దానికి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెడతామని ఉపకులపతి ఆచార్య కె.రాంజీ ప్రకటించారు. విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతిలో ఆయన ప్రసంగించారు. ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా. రాంబాబు, పలువురు సహాయ ఆచార్యులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలగిరికి పోటెత్తిన భక్తులు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): గ్రామంలో వేంచేసిన వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల ఉంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండ కింద స్వామి వారికి ప్రత్యేకంగా పాలపొంగళ్లు తయారు చేసి సమర్పించారు. పలువురు భక్తులు అన్నదానానికి విరాళాలు అందించారు. ఆలయ ఈఓ రంగారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ చైర్మన్ వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. గుణదల(విజయవాడ తూర్పు): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మాచవరం ఎలిశెల వారి వీధికి చెందిన ముత్యాల రాజేశ్వరరావు (39) నగర పాలక సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య శ్వేత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వీరిద్దరూ గొడవ పడ్డారు. ఈ గొడవలో భాగంగా శ్వేత కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోయింది. క్షణికావేశానికి గురైన రాజేశ్వరరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన శ్వేతకు తన భర్త ఉరికి వేలా డుతూ కన్పించాడు. దీంతో ఆమె మాచవరం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉంగుటూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం వేంపాడు గ్రామంలో వారం రోజుల క్రితం ఖననం చేసిన బాలిక మృతదేహానికి శనివారం అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామానికి చెందిన 9వ తరగతి సువర్ణ దీప్తి(14) గత నెల 28వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత ఆమె మృతిపై కుటుంబ సభ్యుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. బాలిక తల్లి మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఉంగుటూరు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఖననం చేసిన బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. తహసీల్దారు జాలాది విమలకుమారి, సీఐ బి.వి.శివప్రసాద్, ఎస్ఐ యు.గోవిందు సమక్షంలో వైద్యుల బృందం సువర్ణదీప్తి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు విచారణ చేపట్టానున్నట్లు సీఐ తెలిపారు. చిలకలపూడి(మచిలీపట్నం): ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జె.సత్యవతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈడీగా బీసీ సంక్షేమాధికారి జి.రమేష్ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహించారు. ఆ స్థానంలో కాకినాడ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న సత్యవతిని ఉద్యోగోన్నతిపై ఈడీగా నియమించారు. ఆమె కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. మచిలీపట్నంటౌన్: నగరంలోని డాక్టర్ పట్టాభి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ స్వర్ణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్లో ఆగస్టు 11 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 35 రోజులు పాటు శిక్షణ ఉంటుందన్నారు. యువతీ యువకులకు కార్ డ్రైవింగ్ ఈనెల 10 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు, జ్యూట్ బ్యాగ్స్ తయారీ 14 రోజులు, ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నేర్పిస్తామన్నారు. మహిళలకు ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె వివరించారు. మరిన్ని వివరాలకు 93907 74782 నంబర్ను సంప్రదించాలని ఆమె సూచించారు. -
గురజాడలో రూ.4 కోట్ల మట్టి దోపిడీ
పమిడిముక్కల: ‘గురజాడ వీర్రాజు చెరువులో అధికార పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు రూ.4 కోట్ల మట్టిని దోపిడీ చేశాడు. నిబంధనలకు విరు ద్ధంగా ఎనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువులో తాటిచెట్టంత లోతున తవ్వేశాడు. ఇందులో ఎమ్మెల్యే వాటా ఎంతో బయట పెట్టాలి? ఇంత భారీ మట్టి దోపిడీ జరుగుతుటే పంచాయతీ, మండల, జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలి?’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ప్రశ్నించారు. గురజాడ వీర్రాజు చెరువును పార్టీ నాయకులు, గ్రామస్తులతో కలిసి శనివారం పరిశీలించారు. కట్టలను బలపరచలేదని, తాటిచెట్టంత లోతు తవ్వేశారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. చెరువు వద్ద అనిల్కుమార్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మట్టి దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుడు సురేష్ బినామీ పేరుతో మట్టిని తవ్వి టిప్పర్లతో బయటకి తరలించి సొమ్ము చేసుకున్నా రని విమర్శించారు. మట్టి దోపిడీపై నిర్వాహకులను ప్రశ్నించిన గురజాడ గ్రామస్తులపై ఎస్ఐ, సీఐ బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి దోపిడీ నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి, రొయ్యూరు, లంకపల్లి క్వారీల నుంచి ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోదని కై లే అనిల్కుమార్ విమర్శించారు. ఇసుక, మట్టి బినామీగా ఉండి రూ.కోట్లు బొక్కుతు న్నారని దుయ్యబట్టారు. కొమరవోలులో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన రూ.23 కోట్లను దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఎంత మట్టి, ఎంత ఇసుక దోపిడీ చేస్తారు, అంతులేని దోపిడీని అడ్డుకునే వారు లేరా అని ప్రశ్నించారు. ఇసుక, మట్టి దోపిడీ చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. నియోజకవర్గంలో ప్రతి పనిలో అవి నీతి రాజ్యమేలుతోందని, అవినీతితో తనకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఎమ్మెల్యేకు ఉందా అని నిల దీశారు. అధికారులు విచారణ జరిపి మట్టి దొంగ లకు జరిమానా విధించాలని సోమవారం కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శొంఠి వెంకటేశ్వర రావు, యలమంచిలి గణేష్, కొడమంచిలి మహేష్, గొర్కెపూడి బుజ్జి, చింతలపూడి గవాస్కర్రాజు, తిరుమలశెట్టి బోసుబాబు, ఆరేపల్లి శ్రీనివాసరావు, రాజులపాటి మురళీ, యేనుగ మస్తాన్రావు, బొర్రా చినబాబు, రాజులపాటి గురవయ్య, నాగరాజు, షుకూర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
జిప్సం అక్రమాలపై అధికారుల కొరడా
కోడూరు: మండలంలోని వి.కొత్త పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో జిప్సం నిల్వల వ్యవహారంలో చోటు చేసుకున్న అక్రమాలు చివరికి పాలకవర్గంపై వేటుకు దారితీశాయి. జిప్సం అక్రమాలపై ‘సాక్షి’లో ప్రచురించిన వరుస కథనాల నేపథ్యంలో కేడీసీసీ బ్యాంక్ సెంట్రల్ అధికారులు స్పందించి ప్రత్యేక విచారణ చేపట్టారు. ప్రాథమికంగా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. దీంతో సంఘానికి సంబంధించిన త్రిసభ్య కమిటీని రద్దు చేస్తూ కేడీసీసీబీ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా 300 బస్తాల జిప్సం నిల్వ వి.కొత్తపాలెం పీఏసీఎస్లో సంఘ గోడౌన్లో అధికారిక స్టాక్లో నమోదు కాని 300 బస్తాల జిప్సంను సంఘ చైర్పర్సన్, జనసేన నేత రేపల్లె పిచ్చేశ్వరరావు అక్రమంగా నిల్వ చేసి, బ్లాక్ మార్కెట్ ద్వారా వీటిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేశారు. స్టాక్కు సంబంధించిన ఓఫామ్లు, రవాణా చార్జీల కాగితాలు, ఇతర పత్రాలు లేకపోవడంతో వ్యవసాయ అధికారులు స్టాక్ను పరిశీలించి ‘స్టాప్ సేల్’ ఆదేశాలు జారీ చేశారు. స్టాక్ బయటకు తరలించకుండా గోడౌన్ను సీజ్ చేసి తాళాలు కూడా వేశారు. ఈ వ్యవహారంలో సంఘం సీఈఓ తోట శ్రీకాంత్, చైర్పర్సన్ పిచ్చేశ్వరరావు మధ్య జరిగిన ఫోన్ సంభాషణపైనా కూడా అధికారులు దృష్టి సారించారు. బ్యాంక్ అధికారులను కొడతానంటూ ఫోన్ సంభాషణలో చైర్పర్సన్ హెచ్చరించడం, అక్రమ జిప్సంను నాగాయలంక మండలానికి గుట్టుచప్పుడు కాకుండా పంపేద్దామని మాట్లాడిన విధానాన్ని కూడా విచారణ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. త్రిసభ్య కమిటీ రద్దు విచారణలో వెలుగులోకి వచ్చిన ఆంశాల ఆధారంగా సంఘం నిర్వాహణలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని భావించిన అధికారులు త్రిసభ్య కమిటీపై చర్యలు చేపట్టింది. చైర్పర్సన్ రేపల్లె పిచ్చేశ్వరరావుతో పాటు సభ్యులు రేపల్లె నాగమల్లేశ్వరరావు, బాదర్ల నాగమల్లేశ్వరరావుతో కూడిన త్రిసభ్య కమిటీని రద్దు చేశారు. సంఘ కార్యకలాపాలు నిలిచిపో కుండా ఉండేందుకు అవనిగడ్డ అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎస్డీఎల్సీఓ డి.నాగమల్లేశ్వరరావును పర్సన్ ఇన్ చార్జిగా నియమించారు. -
హామీ గొప్ప.. అమలు లొట్ట
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలవాల్సిన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం జిల్లాలో ఇప్పటికీ అమలు కాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం పథకాన్ని ప్రకటించి, నిధులు మంజూరు చేసినట్లు తెలిపినా క్షేత్రస్థాయిలో మాత్రం కిట్లు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వేలాది మంది బాలింతలు లబ్ధికి దూరమయ్యారు. రెండేళ్లు గడిచినా.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ బేబీ కిట్ పేరుతో అమలైన ఈ పథకం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వం మారిన తర్వాత అదే పథకాన్ని ఎన్టీఆర్ బేబీ కిట్గా కొనసాగిస్తామని ప్రకటించినా, రెండేళ్లు గడిచినా జిల్లాకు ఒక్క కిట్ కూడా అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పేదలపై ఆర్థిక భారం జిల్లా వైద్యశాఖ గణాంకాల ప్రకారం 2024 నుంచి 2026 జూన్ వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 15,143 ప్రసవాలు నమోదయ్యాయి. ఈ బాలింతలందరికీ రూ.1,400 విలువైన బేబీ కిట్ అందాల్సి ఉన్నా, పథకం అమలు కాకపోవడంతో శిశువుకు అవసరమైన దుస్తులు, దోమతెర, న్యాప్కిన్లు, సబ్బులు, ఆయిల్, టవల్స్ వంటి వస్తువులను కుటుంబాలే కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ప్రైవేట్ వైపు మొగ్గు మరోవైపు జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు తగ్గుతుండగా, ప్రైవేట్ ఆస్పత్రుల వైపు గర్భిణుల మొగ్గు చూపుతున. పథకాల అమలులో జాప్యం కూడా ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిట్లు అందిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన ప్రతి బాలింతకు అందజేస్తామని హామీ ఇస్తున్నా, రెండేళ్లుగా ఎదురుచూస్తున్న పేద కుటుంబాలు మాత్రం ‘ప్రకటనలు కాదు... కిట్లు కావాలి’ అని కోరుతున్నాయి. -
‘సర్’తో అర్హులను తొలగించే ప్రమాదం
గన్నవరం: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ ద్వారా అర్హులైన పేద ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించే ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు శనివారం గన్నవరం మండలంలోని దావాజిగూడెంలో పర్యటించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికే ప్రభుత్వం సర్ పేరుతో కుట్రపూరిత ప్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. ఓటర్ల వెరిఫికేషన్కు 2002 సంవత్సరాన్ని కట్ ఆఫ్ ఇయర్గా తీసుకోవడం అత్యంత అహేతుకమన్నారు. ఈ ప్రకియంతో వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు 2002 రికార్డులు చూపలేక ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, నేతలు కళ్లం వెంకటేశ్వరరావు, మల్లంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు -
దుర్గమ్మకు కానుకగా రూ.3.16 లక్షల బంగారు నక్లెస్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తులు శనివారం రూ.3.16 లక్షల విలువైన బంగారు నక్లెస్ను కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన టి.శ్రీధర్ కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చే సింది. రూ.3.16 లక్షలతో 21 గ్రాముల బంగారం, పచ్చరాళ్లు, కెంపులు, ముత్యాలుతో తయారు చేయించిన నక్లెస్ను అమ్మవారికి సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను ఇచ్చారు. ఉద్యోగోన్నతుల నియామక పత్రాలు అందజేత చిలకలపూడి(మచిలీపట్నం): పలువురు జిల్లా పరిషత్ ఉద్యోగులకు ఉద్యోగోన్నతి పత్రాలను జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక శనివారం అందజేశారు. ఆమె కార్యాలయంలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా, 26 మంది ఆఫీస్ సబార్డినేట్లకు రికార్డు, లైబ్రరీ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ జెడ్పీ పరిధిలో వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న వివిధ స్థాయిల్లోని ఉద్యోగులకు పది రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యోగోన్నతులు ఇచ్చారన్నారు. తమ హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామకాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జె.అరుణ, డెప్యూటీ సీఈవో ఆనంద్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. నేడు జూనియర్ బాయ్స్ ఫుట్బాల్ జట్టు ఎంపిక మచిలీపట్నంఅర్బన్: ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాయ్స్ ఫుట్బాల్ జట్టును ఎంపిక చేసేందుకు అధికారిక సెలెక్షన్ ట్రయల్స్ను ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.అనిల్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 గంటలకు పోరంకిలోని నిడమానూరు రోడ్డుపై ఉన్న అస్త్ర మెడికల్ అకాడమీ ప్రాంగణంలోని హంటింగ్ టైగర్స్ గ్రౌండ్లో జరుగుతాయని పేర్కొన్నారు. జనవరి 2011 నుంచి డిసెంబర్ 2012 మధ్య జన్మించిన బాలురు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. హాజరయ్యే క్రీడాకారులు మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఫుట్బాల్ కిట్తో పాటు క్రీడా దుస్తులు తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన సూచించారు. ఆసక్తి, ఎంపికై న క్రీడా కారులు ఈ నెల 11 నుంచి 13 వరకు మదనపల్లిలో జరిగే రాష్ట్ర అంతర్ జిల్లా ఫుట్బాల్ చాంపియన్షిప్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు కోఆర్డినేటర్ కె.మణిబాబును 97032 85954 నంబర్లో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. దాసాంజనేయ దేవాలయానికి రూ. 2.30 లక్షలు విరాళం మధురానగర్(విజయవాడసెంట్రల్): స్వయంభూ మాచవరం శ్రీదాసాంజనేయస్వామి దేవాలయంలో స్వామివారికి శనివారం దాత ఆళ్ళ నాగ శ్రీనివాస్ మాలతి దంపతులు రూ. 2.30 లక్షలు విరాళాన్ని ఆలయ కార్య నిర్వహణాధికారి పాతూరి లోకేశ్వరికి అందజేశారు. దాత ఆళ్ళ నాగశ్రీనివాస్ మాట్లాడుతూ మహిమాన్వితమైన స్వామివారికి తన వంతు బాధ్యతగా తాను విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. మందిరం అభివృద్ధిలో తాను కూడా భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. తొలుత దాత దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి శేషవస్త్రం చిత్రపటంతో దాతలను సత్కరించారు. -
ఆర్టీఏ కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రవాణాశాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారికి హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (జేటీసీ) వడ్డే సుందర్ శనివారం ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగోన్నతి పొందిన కానిస్టేబుళ్లు ఏడుగురు ఎంజీ రోడ్డులోని కార్యాలయంలో ఉత్తర్వులు అందుకున్నారు. మచిలీపట్నానికి చెందిన వి.బాల కోటేశ్వరరావు, విజయవాడకు చెందిన కె.సుబ్బారెడ్డి, ఎన్.వెంకటేశ్వరరావు, ఎస్.సుబ్బారావు రాజమండ్రికి చెందిన ఎ.హనుమంతరావు, కాకినాడకు చెందిన ఎ.ఆర్.వి.సీహెచ్.రాజు, ఏలూరుకు చెందిన బి.నాగేశ్వరరావు ఉద్యోగోన్నతి పొందారు. వారిలో ఈ ఏడాది ఉద్యోగ విరమణ చేసే వారు కూడా ఉన్నారు. వారికి ప్రమోషన్లు కల్పించడం ద్వారా హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగ విరమణ చేసే అవకాశం కల్పించినట్లు జేటీసీ వడ్డే సుందర్ తెలిపారు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న హెడ్ కానిస్టేబుళ్ల ఉద్యోగోన్నతులను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా చేపట్టడం ద్వారా సిబ్బందిలో నూతన ఉత్సాహం నెలకొందని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, రవాణాశాఖ కానిస్టేబుళ్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేటీసీ వడ్డే సుందర్కు అభినందనలు తెలిపారు. ఆర్జేటీసీ కార్యాలయ ఉద్యోగి కె.ఆర్.శ్రీకాంత్, రవాణాశాఖ ఉద్యోగులు, కానిస్టేబుళ్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కారు, ద్విచక్ర వాహనం ఢీ
పెడన: పెడన – గుడివాడ జాతీయ రహదారిపై పల్లోటి స్కూలు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద జరిగిన ఓ కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. శని వారం మధ్యాహ్నం జరి గిన ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. ఓ కారు పెడన నుంచి గుడివాడ వైపు ప్రయాణిస్తూ పెట్రోల్ బంకులోకి వెళ్లే క్రమంలో గుడివాడ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న మండవల్లి ప్రాంతా నికి చెందిన పోగు నవీన్(38) కారును బలంగా ఢీకొట్టాడు. నవీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 సిబ్బంది అతడిని హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికులు పెడన పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
దుర్గగుడి ఆస్తుల రక్షణకు చర్యలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఈఓ శీనానాయక్ పేర్కొన్నారు. దేవస్థానానికి చెందిన కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని పలు భూములను ఈఓ శనివారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత గూడవల్లిలోని జాతీయ రహ దారి సమీపంలోని దేవస్థాన భూములను పరిశీలించారు. స్థలంలో పిచ్చి మొక్కలు, ముళ్ల కంప పెరిగిపోవడంతో వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానం భూములు ఉన్న ప్రతి చోట బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పాతపాడులోని దేవస్థాన పోలంలోని సోలార్ ప్లాంట్ను సందర్శించారు. పాతపాడు సోలార్ ప్లాంట్ ద్వారా నిత్యం ఏ మేరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది, నెలకు ఆలయానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతోందన్న వివరాలను అధికారులను అడిగి ఈఓ తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యుత్ ప్లాంట్ ద్వారా నెలకు 1.20 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దేవస్థానానికి నెలకు లక్ష యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నామని అధికారులు వివరించారు. ప్రతి నెలా 20 వేల యూనిట్ల వరకు విద్యుత్ మిగులుతోందని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని నెట్ మీటరింగ్ పక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఈఓ శీనానాయక్ సూచించారు. దేవస్థాన భూములు, పొలాలు ఆక్రమణలకు గురి కాకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలన్నారు. ల్యాండ్ బ్యాంక్ వివరాలు భక్తులందరికీ తెలిసేలా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఈఓ వెంట ఈఈ ఎల్.రమాదేవి, అసిస్టెంట్ ఇంజి నీర్ మస్తాన్, సునీల్కుమార్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
విజయవంతంగా గోదావరి రైల్వే బ్రిడ్జి పునరుద్ధరణ పనులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న చారిత్రాత్మక ఆర్చ్ బ్రిడ్జి పునరుద్ధరణ పనుల్లో దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ అద్భుత మైలురాయి సాధించింది. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ – విశాఖపట్నం మార్గంలోని గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జి పునరుద్ధరణ ప్రాజెక్ట్లో ప్రయాణికులు, సరుకు రవాణా రైళ్లకు ఎటువంటి అంతరాయం లేకుండా 28 స్పాన్లలో 672 తుప్పుపట్టిన హ్యాంగర్ కేబుళ్ల స్థానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక, తుప్పు నిరోధక 500 కేబుళ్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి భద్రత, నిర్వహణను బలోపెతం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఇన్స్ట్రుమెంటేషన్ నిపుణులతో కలసి వంతెనపై అత్యాధునిక బ్రిడ్జి హెల్త్ మానిటరింగ్ సిస్టం కూడా ఏర్పాటుచేసి ప్రారంభించారు. వంతెన నిర్మాణ తీరును 24 గంటలూ ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు 272లకు పైగా స్మార్ట్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ.. చారి త్రాత్మక గోదావరి ఆర్చ్ బ్రిడ్జిపై రైల్వే కార్యకలాపాలకు అంతరాయం లేకుండా 500 హ్యంగర్ కేబుళ్లను విజయవంతంగా మార్చడం ఇంజినీర్లు, ఫీల్డ్ బృందం అద్భుత ప్రతిభను కొనియాడారు. -
ఈ విధానం సరికాదు
ఎకరానికి ఎంత ఎరువు ఇస్తారో దానిని కార్డుపై రాసి ఇవ్వాలి. ఓటీపీలు చెప్పిన తరువాత దానిని ఆన్లైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓటీపీలు వీఏఏ వద్ద ఒక సారి, సొసైటీలు వద్ద లేదా ఎరువుల దుకాణం వద్ద మరోకసారి చెప్పాల్సి వస్తోంది. సర్వర్ స్లోగా ఉందని ఒకసారి, పనిచేయడం లేదని మరొక సారి చెబుతుండటంతో వారం రజులు నుంచి రైతులు యూరియా కోసం తిరగాల్సిన దుస్థితి ఏర్పడు తోంది. ఈ విధానం కరెక్ట్ కాదు. – వన్నెంరెడ్డి మహాంకాళరావు, రైతు, పెడన -
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును ఉపసంహరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు(ఆర్ఎస్కే) ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి శుక్రవారం గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. దస్తా వేజు లేఖరులు, అసిస్టెంట్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతకాయల నాగ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై, పూణేలో ఆర్ఎస్కే వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా లీజు, తనఖా వంటి రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తోందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని రకాల రిజిస్ట్రేషన్లు చేయడానికి రంగం సిద్ధం చేస్తోందన్నారు. ఆర్ఎస్కేల ఏర్పాటుతో దస్తావేజు లేఖర్ల పొట్ట కొట్టడం భావ్యం కాదన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే భవిష్యత్తులో తాము మరిన్ని నిరసన కార్యక్రమాలను చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి అధ్యక్షుడు పైలా సతీష్ మాట్లాడుతూ.. తాము దశాబ్దాల తరబడి దస్తావేజు లేఖర్లగా సేవలు అందిస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో ఎన్ని కొత్త తరహా విధానాలు తీసుకొచ్చినా వాటన్నింటినీ నేర్చుకొని అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నామని వివరించారు. అయితే ప్రస్తుతం పీపీపీ విధానంలో ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో కొత్తవారికి శిక్షణ ఇచ్చి ఉపయోగించుకోవడం కన్నా, ఎంతో అనుభవం, నైపుణ్యం గల దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు, ఐడెంటిటీ ఇచ్చి తమ జీవన భృతిని కొనసాగించుకునేలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు ఎం.చక్రధర్, ఎ.వరహాలరావు, సాంబశివరావు, వెంకటేశ్వర రావు, నరేంద్ర, కాజా రమేష్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దస్తావేజు లేఖరుల డిమాండ్ -
యాప్ చిక్కులు.. అందని ఎరువులు
● ఎరువులు బుక్ చేసేందుకు పనిచేయని సర్వర్ ● రైతులకు తప్పని రోజుల తరబడి నిరీక్షణ ● 48 గంటలపాటే చెల్లుతున్న క్యూఆర్ కోడ్ ● ఆ లోపు రైతులకు ఎరువులు అందని వైనం పెడన: ‘సర్వర్ పనిచేయడం లేదు. లైన్లో వేచి ఉండండి.., సర్వర్ చాలా స్లోగా ఉంది. ఒకదాని తరువాత ఒకటి చేస్తున్నాం. వేచి ఉండండి..’ ఇవీ ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు వింటున్న మాటలు. ఈ పదాలు వినీవినీ రైతులు విసిగి పోతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కాకినాడ, కృష్ణా జిల్లాలో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా రైతులు యూరియా బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ యాప్కు వినియోగించాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. అయితే చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్ లేదు. దీంతో వీఏఏలు రైతుల వద్ద ఉన్న కీప్యాడ్ ఫోన్లుకు ఓటీపీ చెప్పి, క్యూ ఆర్ కోడ్ జనరేట్ చేసి ఒక కాగితంపై రాసి ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉండి కూడా బుక్ చేసుకోలేని వారి వద్ద వివరాలను నమోదు చేసుకుని క్యూఆర్ కోడ్ ఫొటో తీసి పంపిస్తున్నారు. ఇక్కడి వరకు రైతుకు ఎటువంటి ఇబ్బందీ ఉండటం లేదు. ఒక రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఇచ్చేస్తున్నారు. అసలు కష్టం రైతుకు యూరియా కట్ట తెచ్చుకోవడమే. రైతు సేవా కేంద్రాల నుంచి తెచ్చుకున్న స్లిప్, కార్డులను మన గ్రోమోర్ కంపెనీ వద్దకు లేదా ఎదైనా సొసైటీ వద్దకు రైతులు తీసుకెళ్తే అక్కడే రెండు, మూడు రోజులు సమయం పడుతోంది. 48 గంటలే క్యూఆర్ కోడ్ చెల్లుబాటు రైతు యూరియా కోసం వీఏఏ క్యూఆర్ కోడ్ ఇచ్చిన 48 గంటల్లోపు రైతు యూరియా తీసుకోవాలి. సొసైటీలు వద్దకు, ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లిన రైతులకు క్యూలో ఉండాలని, సర్వర్ స్లోగా ఉందని, సర్వర్ పనిచేయడం లేదని, రేపు రావాలని చెబుతున్నారు. రైతులు మరుసటి రోజు వెళ్తే అదే పరిస్థితి పునరావృతం అవుతోంది. 48 గంటలు దాటితే మళ్లీ క్యూఆర్ కోడ్ కోసం వీఏఏ వద్దకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. -
కృష్ణాజిల్లా వైద్యాధికారి డాక్టర్ యుగంధర్
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ వైద్య సంస్థల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, ఐవీఆర్ఎస్ ద్వారా సానుకూల ప్రజాభిప్రాయం వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పి. యుగంధర్ సూచించారు. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నిరీక్షణ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా పర్యవేక్షకుల నెలవారీ సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ, గర్భిణులకు ముందస్తు ప్రసవ ప్రణాళిక (బర్త్ ప్లానింగ్)ను సమర్థంగా అమలు చేసి, పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటి పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆహారం, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు విస్తతంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని 100శాతం లక్ష్యంతో విజయవంతంగా పూర్తి చేసిన వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని అభినందించారు. -
ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేయడమే లక్ష్యం
మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంటౌన్: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసి వారి సమస్యలను సత్వరం పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 540 అర్జీలు అందగా, వాటిలో 447 అర్జీలను ఇప్పటికే పరిష్కరించామని చెప్పారు. మరో 77 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో 55 అర్జీలు గడువులోనే ఉండగా, గడువు దాటిన 22 అర్జీల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరిస్తామని వెల్లడించారు. మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవ విగ్రహాల్లా బీఎల్ఓలు!
నందిగామ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కోసం ప్రభుత్వం నియమించిన బీఎల్ఓలు ఉత్సవ విగ్రహాలుగా మారారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో బీఎల్ఓలు మొక్కుబడిగా వైఎస్సార్ సీపీ బీఎల్ఏలకు చెప్పి.. టీడీపీ బూత్ లెవెల్ కన్వీనర్లను మాత్రం వెంటబెట్టుకుని ఇంటింటికీ వెళ్తున్నారు. టీడీపీకి చెందిన బీఎల్ఏలే ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తున్నారు. బీఎల్ఓలు చూస్తుండిపోతున్నారు. అలాగే వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేలా టీడీపీ శ్రేణులకు అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్తతో పాటు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు ఇక్కడ ఉన్న ఓటును తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా.. వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు అడ్డుకొని ఆమెకు ఓటు హక్కు ఉండేలా చేశారు. – కంచికచర్ల -
గంపలగూడెం మండలంలో గవర్నర్ పర్యటన
గంపలగూడెం: మండలంలో శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటించారు. ఊటుకూరులోని ఓ కల్యాణ మండపంలో జరిగిన తన కార్యాలయ ఉద్యోగి దుర్గం గోపీ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వ దించి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ నుంచి ఊటుకూరుకు రాత్రి 7.50 గంటలకు చేరుకొని ఎనిమిది గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. వివిధ శాఖల అధికారులు పాల్గొనగా విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారా యణ, మైలవరం ఏసీపీ రామచంద్రరావు, తిరువూరు సీఐ గిరిబాబు, తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం ఎస్ఐలు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి సారిగా రాష్ట్ర గవర్నర్ గంపలగూడెంలో పర్యటించడం గమనార్హం. రైతులకు శాశ్వత సాగు నీటి భద్రత కల్పిస్తాం వేదాద్రి(జగ్గయ్యపేట): రైతులకు శాశ్వత సాగు నీటి భద్రత కల్పిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రూ.15 కోట్ల అంచనాలతో గ్రామంలోని కృష్ణా నది ఒడ్డునున్న వేదాద్రి– కంచల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. ఈ ఎత్తిపోతల పథకం నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని 17,366 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తుందని పేర్కొన్నారు. 2027 ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేసి శాశ్వత సాగు నీటి భద్రత కల్పిస్తామన్నారు. వత్సవాయి మండలం పోలంపల్లి ప్రాజెక్టును కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. అనంతరం రూ.33 లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన పంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, నాయకులు గద్దె అనురాధ, కోట వీరబాబు, రాటకొండ చంద్రశేఖర్ పాల్గొన్నారు. 6న రేబిస్ నిరోధక టీకాల కార్యక్రమం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఆరో తేదీన ఎన్టీఆర్ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పెంపుడు కుక్కల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.‘ఆరోగ్యకరమైన జంతువులు – ఆరోగ్యకరమైన మనుషులు – ఆరోగ్యకరమైన పర్యావరణం’ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి జూనోటిక్ వ్యాధుల నివారణకు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖరరావు, డాక్టర్ సునంద, డాక్టర్ మనోజ్, డాక్టర్ పంకజ్ పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు సమావేశం 7వ తేదీకి వాయిదా ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం వాయిదా పడింది. శనివారం జరగాల్సిన ట్రస్ట్ బోర్డు సమావేశం ఈ నెల ఏడో తేదీకి మారినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తొలుత ట్రస్ట్ బోర్డు సమావేశం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో జరగాల్సి ఉంది. ఈ సమావేశాన్ని ఈ దఫా సీవీ రెడ్డి చారిటీస్ సమావేశ మందిరంలో నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఏడో తేదీన జరిగే ట్రస్ట్ బోర్డు సమావేశంలో దుర్గగుడి ఆలయ అభివృద్ధి పనులతో పాటు ఈ నెలలో జరిగే ఆషాఢ మాసోత్సవాలు, తెలంగాణ బోనాలు, శాకంబరీ ఉత్స వాల నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించే అవకాశం ఉంది. -
నకిలీ నోట్ల తయారీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
అనంతపురంలో అదుపులోకి తీసుకున్నామన్న డీసీపీ రామకృష్ణ ఇబ్రహీంపట్నం: నకిలీ రూ.500 నోట్లు చెలామణి, తయారీ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసులు అనంతపురంలో శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద 100 నకిలీ రూ.500 నోట్లు, దొంగనోట్లు తయారీకి ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీసీపీ గుణ్ణం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు వెల్లడించారు. పరికరాలు స్వాధీనం.. జూన్ 30న దొంగనోట్లు చెలామణి చేస్తున్న గుంజా మంగారావు, వల్లభనేని పవన్కుమార్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. గుంజా మంగారావు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్ఐ ఎస్.శ్రీనివాసరావు అనంతపురం వెళ్లి నకిలీ రూ.500 నోట్లు తయారు చేస్తున్న పుల్లలరేవు రాజా, పొదిలి భాస్కరరావులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులతో పాటు నోట్లు తయారీకి ఉపయోగించిన రెండు కలర్ ప్రింటర్లు, ఒక ల్యాప్ టాప్, ఒక స్కానర్, ల్యామినేటర్ ఒకటి, ఆరు సెల్ఫోన్లు, 500 నోట్లు 100 (రూ.50వేలు) స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. కేసు రిపోర్ట్ అయిన మరుసటి రోజే ప్రధాన నిందితుడు అనంతపురానికి చెందిన పుల్లలరేవు రాజా, హిందూపురానికి చెందిన పొదిలి భాస్కరరావును అరెస్ట్ చేసినందుకు సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్ఐ ఎస్.శ్రీనివాసరావు, సిబ్బందిని అభినందించారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం రెండు ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అయిన పుల్లాలరేవు రాజా, పొదిలి భాస్కరరావుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ రామకృష్ణ వివరించారు. సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్ఐ ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రేపు రోల్బాల్ ఎన్టీఆర్ జిల్లా జట్ల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కంకిపాడులోని క్యాపిటల్ స్పోర్ట్స్ కార్నర్ ఆవరణలో ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 7 నుంచి 12గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా రోల్బాల్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నామని జిల్లా రోల్బాల్ అసోసియేషన్ చైర్మన్ టి.లలిత ప్రియ ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–11, 14, 17 విభాగాల్లో ఈ జట్ల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 9505950425లో సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు. తిరువూరు: మండలంలోని వావిలాలలో పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై గొడ్డలితో దాడిచేసి, హత్య చేయడానికి శుక్రవారం అదే గ్రామానికి చెందిన వ్యక్తి యత్నించిన సంఘటన సంచలనం కలిగించింది. గ్రామానికి చెందిన దుగ్గిరాల నాగరాజుపై అతని సమీప బంధువు దుగ్గిరాల రమేష్ గురువారం అర్ధరాత్రి గొడ్డలితో దాడి చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న నాగరాజుపై హఠాత్తుగా దాడి చేయడంతో మెడపైన, వీపుపైన తీవ్ర గాయాలయ్యాయి. తృటిలో తప్పించుకున్న నాగరాజు గ్రామస్తుల సహాయంతో తిరువూరు ఏరియా ఆస్పత్రిలో చేరాడు. రమేష్ పరారవ్వగా.. పోలీసులు గాలించి శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. గతంలో మద్యం మత్తులో నాగరాజు తనపై దాడిచేయడంతో కక్షసాధింపుగా అతనిపై దాడికి పాల్పడినట్లు రమేష్ చెప్పినట్లు ఎస్ఐ శాతకర్ణి తెలిపారు. మచిలీపట్నంటౌన్: నగరంలోని ఆస్థానాలు, పంజాల మరమ్మతు పనులకు ఎట్టకేలకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం నగదును అందజేశారు. మొహర్రం దుఃఖ దినాల సందర్భంగా ప్రభుత్వం ముందస్తుగానే ఆస్థానాలు, పంజాలకు మరమ్మతులు, రంగులు వేసేందుకు రూ. 5వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుతం దుఃఖ దినాలు ముగిసిన తర్వాత ముస్లింల డిమాండ్ల నడుమ శుక్రవారం నగరంలోని 139 ఆస్థానాలు, పంజాలకు రూ. 7.45లక్షలను మంజూరు చేసింది. ఈ మెత్తాలను నగరంలోని రాజుపేట షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రవీంద్ర వాటిని నిర్వాహకులకు అందజేశారు. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) శుక్రవారం ప్రకటించిన సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు సత్తా చాటినట్లు సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని శ్రీమేధ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నందకిషోర్ మాట్లాడుతూ జి. వంశీప్రియ 400 మార్కులకు 286 మార్కులతో టాపర్గా నిలిచాడని చెప్పారు. సీహెచ్ తన్మయి 283, ఎస్. రేణుక నందిని 272, వై.తన్విశ్రీ 267, షేక్ మొయినుద్దీన్ 258 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇందుకు శ్రీమేధ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సహకారం ఎంతో ఉందని తెలిపారు. సీఏ ఫౌండేషన్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఏ ఇంటర్ తరగతులు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయని వివరించారు. డైరెక్టర్ అన్నా శ్రీలక్ష్మి పాల్గొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు పట్టాలపై ఓ దివ్యాంగుడి మృతదేహం లభ్యమైంది. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం రామవరప్పాడు యార్డ్ వద్ద పట్టాలపై వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ సిబ్బంది వివరాలు సేకరించారు. మృతుడు సుమారు 45ఏళ్ల దివ్యాంగుడని, ఒంటిపై తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. -
యాప్తో చాలా కష్టాలు
పైలెట్ ప్రాజెక్టు అంటున్నారు. బాగానే ఉంది. కానీ రైతులు రోజులు తరబడి రావాలంటే చాలా కష్టం. నాకు 15 ఎకరాల పొలం ఉంది. ఓటీపీలు రెండు సార్లు చెప్పాల్సి వస్తోంది. ఉద్యోగులు విధుల్లో ఉంటారు. వారి పొలం కౌలుకు తీసుకుని చేస్తుంటే వారు ఓటీపీలు చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. అమెరికాలో ఉంటున్న వారిని రాత్రి సమయంలో నిద్రలేపి ఓటీపీలు అడగాల్సి వస్తోంది. యాప్లో ఎరువులు తీసుకోవాలంటే చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. – జోగి కృష్ణబాబు, మడక, పెడన మండలం -
చిన్న క్లూ కూడా దొరక లేదు!
కృత్తివెన్ను: నిండు ప్రాణాలు నీటిపాలు.. చంపేసిన ఆనవాళ్లు ఏటిపాలు అన్నట్లుంది చినగొల్లపాలెం జంటహత్యల మిస్టరీ. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో జంట హత్యలు జరిగి వారం రోజులు కావస్తోంది.. మృతదేహాలు లభ్యమై ఐదు రోజులైంది. కానీ హంతకులకు సంబంధించి చిన్న సమాచారం కూడా పోలీసులకు దొరకలేదు. రెండు జిల్లాలోనూ జల్లెడేసి గాలిస్తున్నా నిందితులు ఆచూకీ కొంచెం కూడా లభించకపోవడం ఈ కేసు పోలీసు యంత్రాంగానికి సవాల్గా మారింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో బందరు డీఎస్పీ నలుగురు సీఐలు, ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నారు. సముద్రంపై అవగాహన ఉన్నవారే? హత్య చేయడం.. మృతదేహాలను వారి బైక్కే కట్టి నీటిలో వేసేయడం చూస్తుంటే ఇది కచ్చితంగా సముద్రంపై అవగాహన ఉన్న వారు మాత్రమే చేయగలరని స్థానికుల అనుమానం. క్షణికావేశంలో హత్య చేసినా ఈ విధంగా ఏటిలో మృతదేహాలను జలసమాధి చేయాలంటే పడవ నడపడం, ఏటిలోతు తదితర అంశాలపై పూర్తిగా తెలిసిన వారే ఇది చేసుండాలని అంటున్నారు. బయట వ్యక్తులు అర్ధరాత్రి ఆ ప్రాంతంలో హత్య చేయడం, శవాన్ని మాయం చేయడం కష్టమైన పనని, ఇది పూర్తిగా ఆ ప్రదేశాలపై అవగాహన ఉన్నవారు మాత్రమే చేసుంటారన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. జల్లెడేసినా జాడలేదు.. నిందితుల కోసం పోలీసులు అణువణువూ వదలకుండా గాలిస్తున్నారు. కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. అనుమానితులను తీసుకొచ్చి విచారణ చేసినా ఫలితం శూన్యం. మృతులు యానాది సామాజిక వర్గానికి చెందిన వారు అదే సామాజిక వర్గంలో ఏమైనా విభేదాలుండి ఇలా జరిగిందా? అన్న కోణంతో పాటు, తమకు చేపల వేటలో భవిష్యత్తులో పోటీ అవుతారన్న అనుమానంతో వేరే సామాజిక వర్గం వారు ఈ దురాగతానికి పాల్పడి ఉంటారా అన్న అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. అయినా ఎక్కడా కొంచెం కూడా క్లూ లభించకపోవడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కేసులో నిందితులను పట్టుకుని కేసుకు త్వరలో ముగింపు పలికి ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు. -
రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రోజు వారీ విధుల్లో హిందీ తప్పనిసరి అని విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా పేర్కొన్నారు. డీఆర్ఎం అధ్యక్షతన అధికార భాష అమలు కమిటీ సమావేశం గురువారం డీఆర్ఎం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మోహిత్ సోనాకియా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాష హిందీని సమర్థవంతంగా అమలు చేయడం ఉద్యోగుల బాధ్యతని అన్నారు. అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ తనిఖీ జరిగే అవకాశం ఉన్నందున దైనందిన కార్యాలయ పనులు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీని వినియోగించాలని స్పష్టంచేశారు. ప్రతి తనిఖీ నివేదికలో కనీసం ఒక అంశాన్ని హిందీలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. డివిజన్లో అధికార భాష అమలులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో రాజభాష విభాగం కృషిని అభినందించారు. ఏడీఆర్ఎం పి.ఇ.ఎడ్విన్ మాట్లాడుతూ.. అధికార భాష అమలుకు నిర్దేశించిన లక్ష్యాలను విజయవాడ డివిజన్ గణనీయంగా అధిగమించిందన్నారు. హిందీలో నోటింగ్ కోసం నిర్దేశించిన 35 శాతం లక్ష్యానికి గాను 87.87 శాతం, హిందీలో వచ్చిన ఉత్తరాలకు అదే భాషలోనే సమాధానం ఇవ్వాలన్న 60 శాతం లక్ష్యానికి గాను 88 శాతం నమోదు చేసుకుందని వివరించారు. అనంతరం సీనియర్ రాజభాష అధికారి హేమంత్ వాడేకర్ త్రెమాసికంలో డివిజన్లో రాజభాష అమలులో భాగంగా ఉద్యోగుల కోసం నిర్వహించిన హిందీ వర్క్షాపులు, సెమినార్లు, టేబుల్ ట్రైనింగ్ కార్యక్రమాలను వివరించారు. దైనందిన అధికారిక పనుల్లో హిందీ వినియోగాన్ని మరింత పెంచాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా డీఆర్ఎం చేతుల మీదుగా అధికార భాష త్రైమాసిక మ్యాగజైన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం కొండా శ్రీనివాసరావు, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వి.ఎస్.కె.ప్రసాద్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డీఆర్ఎం మోహిత్ సోనాకియా -
నదిలో ఇసుక దోపిడీ పట్టదా?
● గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు బేఖాతర్ ● వందలాది టిప్పర్లతో ఇసుక దోపిడీ ● ఇసుక మాఫియాపై న్యాయపోరాటం ● మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ పమిడిముక్కల: ‘పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నామని సీఎం, డెప్యూటీ సీఎం చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మొక్కలు నాటుతున్నారు. అయితే గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ కృష్ణా నదిలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. ఇదేమి పాలన’ అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ప్రశ్నించారు. చోరగుడిలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని లంకపల్లి, రొయ్యూరు క్వారీల్లో అధికార పార్టీ నాయకుల ఇసుక దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు జూన్ రెండు నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు నదిలో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ సమావేశం పెట్టి నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని, అతిక్రమిస్తే కేసులు పెట్టాలని హెచ్చరించారని గుర్తు చేశారు. అయినా నదిలో నిత్యం యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోందని తెలిపారు. ఈ దోపిడీ గురించి తెలిసినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక్క లారీని కూడా ఆపి క్రిమినల్ కేసు నమోదు చేసిన దాఖలాలు లేవన్నారు. కలెక్టర్, ఎస్పీ, తహసీల్దార్ సీఐ, ఎస్ఐకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇసుక దోపిడీని ఆపడం లేదని, దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని పేర్కొన్నారు. పమిడిముక్కల సీఐ తన పరిధిలోని లంకపల్లి, రొయ్యూరు క్వారీల నుంచి వందలాది టిప్పర్లు ఇసుక తరలిపోతుంటే ఎందుకు నిలుపుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఇసుక రీచ్లోకి వెళ్లకుండా గండి కొట్టామని కలెక్టర్, తహసీల్దార్ చెబుతున్నారని, నదిలో పొక్లెయిన్, ఇసుకతో తరలివెళ్తున్న టిప్పర్లు కనబడతున్నాయని, కావాలంటే వారికి ప్రత్యక్షంగా చూపిస్తానని అన్నారు. వర్షం పడితే ఇబ్బంది లేకుండా అనకొండల్లా ఇసుక నిల్వ చేశారని, నదిలో ఇంకెంత దోచుకొంటారని ప్రశ్నించారు. ఇసుక దోపిడీపై తోట్లవల్లూరు, పమిడిముక్కల పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని, పట్టించుకోకపోతే జిల్లా, మండల అధికారులపై ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్, పార్టీ నాయకులు మర్రి బాబూరావు, పాతూరి చంద్రపాల్, గవాస్కర్ రాజు, వైస్ ఎంపీపీ గంజాల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
వీరులపాడు: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదం గురువారం జరిగింది. మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన నిమ్మల అచ్చమ్మ (50) గ్రామ శివారులో రోడ్డు దాటుతుండగా జయంతి నుంచి పెద్దాపురం గ్రామానికి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అభిమన్యు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉపాధి కూలీలకు సంపూర్ణ భరోసా
జి.కొండూరు: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ పథకంతో ఉపాధి హామీ కూలీలకు సరికొత్త భరోసా కలుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జి.కొండూరు మండల పరిధిలోని చెవుటూరు గ్రామంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వీబీ జీరామ్ జీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్తో కలిసి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల వాగు ఫీడర్ చానల్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జి.కొండూరు కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వీబీ జీరామ్ జీ పథకం ద్వారా ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు రోజువారీ వేతనాన్ని రూ.307 నుంచి రూ.312కు పెంచారన్నారు. ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, డ్వామా పీడీ ఎ.రాము, ఏపీడీ (విజయవాడ) శ్రీనివాస్, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య అధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఎంఎల్హెచ్పీలు కోసం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణను డాక్టర్ పోతన శాస్త్రి, డాక్టర్ శ్రీధర్ అందించగా, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ జవాద్ ఖాన్, డీపీఎంఓ డాక్టర్ అరుణ్ పర్యవేక్షించారు. మధుమేహం, అధిక రక్తపోటు, గర్భిణులు, ప్రసవానంతర తల్లులు సహా జీవనశైలి సంబంధిత వ్యాధుల నివారణ, నియంత్రణలో యోగా ప్రాముఖ్యతపై శిక్షణార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని(స్ట్రెస్) సమర్థంగా నిర్వహించడం ప్రతి ఉద్యోగికి అత్యంత అవసరమని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఉద్యోగులు మానసిక సమతుల్యత, సానుకూల దృక్పథం, సమయపాలనతో విధులు నిర్వర్తించినప్పుడే ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించగలరని పేర్కొన్నారు. ప్రత్యేక సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సెషన్లలో భాగంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. సైకాలజిస్టులు తేజావతి, జి.శంకర్ రావు, టీఎస్ రావు, బి.నవితశ్రీ బృందం రోజువారీ విధుల నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో మొత్తం 50 స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు, సమన్వయకర్త జి.జ్యోతి పాల్గొన్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ నేత దేవినేని అవినాష్ ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. అమెరికా వెళ్లేందుకు వీలుగా ఆయన పాస్పోర్ట్ను తిరిగి ఇవ్వాలని కింది కోర్టును ఆదేశించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితునిగా ఉన్న అవినాష్.. కోర్టు ఆదేశాల మేరకు తన పాస్పోర్ట్ను స్వాధీనం చేశారు. అమెరికాలో తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లేందుకు అనుమతినివ్వాలని, పాస్పోర్ట్ వెనక్కి ఇవ్వాలని కోరుతూ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను గత నెల 16న కోర్టు కొట్టేసింది. దీనిపై అవినాష్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ గురువారం తీర్పు వెలువరించారు. అవినాష్ అమెరికా పర్యటనకు అనుమతినిచ్చారు. భారత దేశానికి తిరిగి వచ్చి, ఈ నెల 13న దర్యాప్తు అధికారి లేదా కింది కోర్టు ఎదుట హాజరుకావాలని అవినాష్ను ఆదేశించారు. అమెరికా ప్రయాణ ప్రణాళికను సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కు, కింది కోర్టుకు సమర్పించాలని చెప్పారు. -
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
కృష్ణలంక(విజయవాడతూర్పు): చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.2.28 లక్షల విలువైన 15.2 గ్రాముల బంగారు నానుతాడు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ కార్యలయంలో ఈ కేసు వివరాలను సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. కిషోర్బాబు విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పెనమలూరు మండలం పోరంకికి చెందిన నరందాస్ చిన్మయి సాయిదుర్గారావు గతంలో నమోదైన ఒక కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్న సమయంలో మోదుగు రాజారావుతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన అనంతరం ఇద్దరూ కలిసి చైన్ స్నాచింగ్లు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మోటార్ సైకిల్పై కొత్తగూడెం వైపు వెళ్తూ మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మగళాపురం క్రాస్ రోడ్డు వద్ద బడ్డీ కొట్టులో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో బంగారు నానుతాడును లాక్కుని పారిపోయినారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పది గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్లో పదో ప్లాట్ఫాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నరందాస్ చిన్మయి సాయిదుర్గారావు, మోదుగు రాజారావును సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. 15.2 గ్రాముల బంగారు నానుతాడు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. -
సూర్యం.. సు‘వర్ణం’
సంధ్యా సమయం.. రెప్ప వాల్చనివ్వని మనోహర దృశ్యం.. చల్లని సాయంత్రం.. వర్ణాలమయమైన నింగి సింగారం.. మబ్బుల చాటుకు చేరిన దినకరుడి సహజ తేజం.. రామలింగేశ్వరుడి కొండపై పసిడికాంతుల ప్రవాహం.. కనుదృష్టిని మైమరపించే.. వర్ణనలకు అందని అద్భుతం.. చూసి పులకించని మది ఉంటుందా? కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంపై గురువారం సాయంత్రం సూర్య కిరణాలు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలయ్యా.. మీరు అధికారంలో ఉంటేనే నిరుపేదల బతుకులు బాగుపడతాయి. మళ్లీ మీరు వస్తేనే మాలాంటి వారికి అండ’ అంటూ పెద్ద సంఖ్యలో మహిళలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. ‘అన్నా.. ఒక్క ఫొటో తీసుకుంటా’ అంటూ ఆయనను అనుసరిస్తూ ముందుకు సాగారు. కృష్ణలంక పోలీసుల వేధింపుల కారణంగా మే 21న ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను గురువారం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ రాకతో లబ్బీపేట, గ్రీన్ల్యాండ్స్ ప్రాంతం జనసందోహంగా మారింది. తమ అభిమాన నేతను చూసేందుకు.. గ్రీన్ల్యాండ్స్ ప్రాంతంలో ఎక్కువగా పేదలు నివసిస్తుంటారు. ఆ ప్రాంతంలో నివసించే కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పనులకు వెళ్తుంటారు. కానీ తమ ప్రాంతానికి వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న మహిళలు పనులు మానుకొని ఇళ్ల వద్దే ఉన్నారు. తమ అభిమాన నేత రాక కోసం ఎదురు చూశారు. ఆయన మెయిన్ రోడ్డులో కారు దిగి క్రాంతికుమార్ ఇంటికెళ్లే దారిలో దాదాపు 300 మీటర్ల మేర మహిళలు పెద్ద ఎత్తున ఇరువైపులా నిల్చొని స్వాగతం పలికారు. ‘మీరు చల్లగా ఉండాలయ్యా.. మీరు ఉంటేనే మా లాంటి వాళ్లకు మేలు జరుగుతుంది. మళ్లీ మీరు అధికారంలోకి రావాలయ్యా’ అంటూ వృద్ధ మహిళలు వైఎస్ జగన్కు దీవెనలు అందించారు. అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తూ క్రాంతికుమార్ ఇంటివైపు వైఎస్ జగన్ కదిలి వెళ్లారు. అక్కడ క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేంతగా ఎందుకు వేధింపులు వచ్చాయనే విషయాలను కుటుంబ సభ్యులతో పాటు ఇతర నేతలు వివరించారు. అపార్ట్మెంట్లపై నుంచి.. వైఎస్ జగన్ రాకతో ఆ ప్రాంతంలో అపార్ట్మెంట్లు భవనాలపై జనాలు కిటకిటలాడారు. ఆయన క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తిరిగి వెళ్లే సమయానికి పకీరుగూడెం– లబ్బీపేట రోడ్డు జనసంద్రంగా మారింది. పకీరుగూడెంకి చెందిన మహిళలు తమ అభిమాన నేత ఆ ప్రాంతానికి వచ్చారని తెలుసుకుని తరలివచ్చారు. వైఎస్ జగన్ ఆ ఇంటి ప్రాంతం నుంచి మెయిన్రోడ్డుపై వచ్చే వరకూ వేచి చూశారు. హోరెత్తిన నినాదాలు.. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల కోసం వైఎస్ జగన్ కారు డోర్పై నుంచి నిల్చొని అభివాదం చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు అరాచక పాలన చేస్తున్న కూటమి సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తరలివచ్చిన నేతలు.. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్తో పాటు మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకరబాబు, నల్లగట్ల స్వామిదాసు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు ఎండీ రూహుల్లా, తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, పెనమలూరు పార్టీ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నత్తా యోనారాజు, మాజీ కార్పొరేటర్లు రెహానా నాహీద్, వియ్య పు అమర్నాథ్, పుప్పాల కుమారి, తంగిరాల రామిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అలీం, ఎస్కే సుభానీ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల వేధింపుల కారణంగా మరణించిన క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ రాకతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కృష్ణలంక సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేయగా, సౌత్ ఏసీపీ మానస, ఇంటెలిజెన్స్ ఏసీపీ మహేంద్ర, ట్రాఫిక్ ఏసీపీ పావన్కుమార్ ఆ ప్రాంతానికి వచ్చారు. వారితోపాటు, ఇంటెలిజెన్స్, స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచి సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారు. -
నిరుద్యోగుల్లో నైరాశ్యం!
నియామకాలపై కాలయాపన ఏల? ఆరు నెలలైనా.. మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువతకు వైద్య, ఆరోగ్యశాఖ మరోసారి మొండి చేయి చూపింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని నోటిఫికేషన్లు జారీ చేసి, ఆపై నియామకాలు నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆప్కాస్ ఆమోదం లేదంటూ కుంటి సాకులు చెబుతూ.. నియామక ప్రక్రియను నిలిపివేయడం వెనుక అసలు ఉద్దేశం పోస్టులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడమేనన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2024 డిసెంబర్లో జారీ చేసిన నోటిఫికేషన్ను 2025 డిసెంబర్లో రద్దు చేయడం వల్ల నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ, అనిశ్చితి నెలకొంది. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో మూడు కేటగిరీలకు సంబంధించిన మొత్తం 22 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టులు 4, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు 8, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మన్ పోస్టులు 10 ఉన్నాయి. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి 2024 డిసెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే, 2025 డిసెంబర్లో ఆ నోటిఫికేషన్ను రద్దు చేశారు. అదే నెలలో మొత్తం 60 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇందులో ఒక పోస్టు ఫార్మసిస్ట్ గ్రేడ్–2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టులు 07, నాలుగు డేటా ఎంట్రీ ఆపరేటర్, 10 పోస్టులు లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ కేడర్కు చెందినవి ఉన్నాయి. అలాగే పీహెచ్సీల్లో 12 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టులు, 16 ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు, 10 శానిటరీ అటెండెంట్ కం వాచ్మన్ కేడర్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీని కోసం 2025 డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత దీనిపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇలా తరచూ నోటిఫికేషన్లు రద్దు చేయడం, మార్పులు చేయడం వల్ల నిరుద్యోగుల్లో విశ్వాసం దెబ్బతింటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీహెచ్సీల్లో క్యాడర్ పోస్టుల నియామకాలను ప్రస్తుతం నిలుపుదల చేశాం. మిగతా ఎన్యూహెచ్ఎం పోస్టులకు సంబంధించిన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తాం. పీహెచ్సీల్లోని క్యాడర్ పోస్టులకు ఆప్కాస్ ఆమోదం వచ్చిన వెంటనే అవి కూడా నియామకాలు చేపడతాం. – డాక్టర్ పి. యుగంధర్, కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎన్యూహెచ్ఎంలో 22, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీలు) 38 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, 2025 డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆరు నెలలు గడిచినా నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఈ 60 ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. ఈ పోస్టులకు మొత్తం 2,994 దరఖాస్తులు అందగా, దరఖాస్తు రుసుముల రూపంలో అభ్యర్థులు సుమారు రూ.9 లక్షలు చెల్లించారు. అయినప్పటికీ నియామకాలపై ఎలాంటి పురోగతి లేకపోవడం అభ్యర్థుల్లో తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. -
కారు ఢీకొని ఒకరి మృతి
కంచికచర్ల: ఇంజినీరింగ్ చదివిన యువకుడు వర్క్ఫ్రం హోం ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి ఉద్యోగం ఇస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి టెలిగ్రామ్ నమ్మించి రూ.2 లక్షలు కాజేసిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు.. కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన వెంపరాల త్రిసాయి వర్క్ఫ్రం హోం ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు. ఓ ఆగంతకుడు వాట్సప్, టెలిగ్రామ్ ద్వారా అతనికి పరిచయమై ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.2 లక్షలు ఆన్లైన్ ద్వారా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఫోన్ చేయగా ఫోన్ పనిచేయటం లేదు. మోసపోయానికి గుర్తించిన త్రిసాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఒక్కటే మార్గం
పామర్రు: ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి యోగా మార్గం ఎంతో దోహద పడుతుందని పతంజలి దక్షణ భారతదేశ పతంజలి ఇన్చార్జి రిత్ దేవ్ బాబా అన్నారు. సమగ్ర శిక్ష విద్యాశాఖల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రగతి జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం 200 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు వారం రోజుల యోగా శిక్షణ తరగతులను డీఈవో యువీ సుబ్బారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిత్ దేవ్ బాబా మాట్లాడుతూ.. యోగ సాధనతో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా శక్తి యుక్తులు పొందగలుగుతారన్నారు. హరిద్వార్లో ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. డీఈవో సుబ్బారావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ గల జీవితం పెంపొందించేందుకు యోగా ఎంతో దోహద పడుతుందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం యోగా ప్రధానాచార్యులు డాక్టర్ రాధిక మాట్లాడుతూ.. యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలోనే కాకుండా ఆసియా ఖండ స్థాయిలో విద్యార్థులను పోటీలకు పంపుతున్నామన్నారు. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఇటేవల నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీలకు విశేష స్పందన లభించిందన్నారు. కార్యక్రమంలో ఏఎంవో శ్యామ్, గుడివాడ డీవైఈవో పద్మారాణి, ఎంఈవోలు భాను ప్రసాద్, పద్మవాణి, శ్రీలక్ష్మి, ఏవీ రమణ, ఎస్.శ్రీకాంత్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత స్టేట్ విన్నర్, యోగా గురువులు ముదిగొండ శాస్త్రి, బెనర్జీ లీలావతి మాట్లాడారు. మచిలీపట్నం బాలాజీ విద్యాలయం విద్యార్థి శోభశ్రీ వేసిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
సర్ను వేగవంతం చేయాలి
గూడూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల సంబంధిత అధికారులను ఆదేశించారు. గూడూరులో మంగళవారం పర్యటించిన కలెక్టర్... క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్వోలు), ఎన్నికల విభాగం అధికారులతో కలిసి ఇంటింటి సర్వే తీరును పరిశీలించి, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి సేకరణ, డేటా డిజిటైజేషన్ పురోగతిపై ఆరా తీశారు. ఫారాల పంపిణీపై ఆరా తీశారు. నిర్ణీత గడువు లోపు ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ డీఆర్వో పి.పోతురాజు, గూడూరు తహసీల్దార్ డి.రాజ్యలక్ష్మి, ఎంపీడీవో పి.శైలజ కుమారి, డిప్యూటీ ఎంపీడీవో చండిక ఉమామహేశ్వరరావు, బీఎల్వోలు పాల్గొన్నారు. పామర్రు: కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఒడిశా గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాల్గొని ప్రారంభోత్సవం చేస్తారని స్థానికుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ మంగళవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కనుమూరులో ఆర్టీసీ బస్సు వయా ముళ్లపూడి, అయినంపూడి, కూచిపూడి వరకు వెళ్లే విధంగా బస్ ప్రారంభం ఉంటుందని అన్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. -
మిస్టరీగానే జంట హత్యలు
మృతుడు సుబ్బన్న ఇంటి వద్ద విచారంలో బంధువులు హత్య జరిగిన ప్రాంతంలో పడి ఉన్న చేపలు కృత్తివెన్ను: కక్షలు కార్పణ్యాలకు అతీతంగా ఉండే పచ్చని పల్లెలో జంట హత్యల కలకలం మిస్టరీగా మారింది. అందరి నోటా ఒకటే మాటా మృతులు వివాదరహితులు ఎవరితోనూ విభేదాలు లేవు కానీ చంపేశారు. చంపడమే కాకుండా వారి మృతదేహాలను వారి బండి(బైక్)కే కట్టి నీటిలో జలసమాధి చేయడంతో దీవి వాసులు హడలిపోతున్నారు. ఇంత కర్కశమా.. మండల చరిత్రలో ఇప్పటి వరకు ఈ తరహాలో హత్యలు జరిగింది లేదు. ఏకంగా అల్లుడూ మామను చంపి ఏటిపాయలో వదిలేయడంపై సర్వత్రా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తీరప్రాంతంలో సరికొత్త తరహాలో హత్యలకు పునాది వేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతులు శెట్టి సుబ్బన్నకు ఎవరితోనూ ఎటువంటి వివాదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. యానాది సామాజిక వర్గానికి చెందిన సుబ్బన్నకు రెండు బోటులున్నాయని ఆర్థికంగా ఉన్నతంగానే ఉన్నట్లు తెలుస్తుంది. రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటున్న పశ్చిమగోదావరి జిల్లా రుస్తుంబాదుకు చెందిన సుబ్బన్న అల్లుడు గొలుసు అయ్యప్పకు కూడా ఇక్కడ ఎవరితోనూ విభేదాలు లేవంటున్నారు. పోలీసుల విచారణలో కూడా ఇదే విషయం తేలింది. అయినా ఇటువంటి హత్యకు కారణం ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రెండు జిల్లాల్లో గాలింపు.. ఈ హత్యలో ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది పాత్ర ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. మృతదేహాలు లభించిన కొద్దిదూరంలోనే కొన్ని చేపలు నేలపై పడి ఉన్నాయి. అంటే చేపల వేట పూర్తయిన తరువాతే హత్య జరిగి ఉండవచ్చన్నది స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే మూడు బృందాలు రంగంలో దిగాయి. ఎస్పీ ఐటీ కోర్ టీం సైతం గాలింపులో ఉన్నట్లు తెలిసింది. రెండు జిల్లాలోనూ గాలింపు ముమ్మరం చేసినట్లు బందరు రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. -
అమ్మా.. వీళ్లు మారరా !
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వీఐపీలు, సిఫార్సు లేఖలపై అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులను కట్టడి చేసి ఆలయానికి ఆదాయాన్ని పెంచాలని దుర్గగుడి అధికారులు రోజుకో టెక్నాలజీని తీసుకువస్తుండగా, ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది అమ్మవారి ఆదాయానికే గండికొడుతున్నారు. అధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదు. సోమవారం నుంచి దేవస్థానంలో తిరుమల తిరుపతి తరహాలోనే వీఐపీ, బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు కొత్త విధానాన్ని తెరపైకి తీసుకురాగా, అదే రోజు సాయంత్రం కాంట్రాక్ట్ సిబ్బంది రూ.500 టికెట్లను ఆరింటిని దారి మళ్లిస్తూ పట్టిపడిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం పంచహారతుల అనంతరం చోటు చేసుకోగా, ఈ వ్యవహారాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, సదరు కాంట్రాక్టు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఆరు టికెట్లు పక్కదారి.. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావుకు సంబంధించిన కొంత మంది భక్తులు సోమవారం సాయంత్రం అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. అయితే శ్రీనివాసరావు వారిని ప్రొటోకాల్ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. అదే తరుణంలో దేవస్థానంలో ఓ బ్యాంక్ తరుఫున ఐటీ విభాగంలో ఉద్యోగం చేస్తున్న విక్రాంత్ అనే యువకుడు ప్రొటోకాల్ కార్యాలయం వద్దకు వచ్చి దర్శనం చేయిస్తానని చెప్పాడు. శ్రీనివాసరావు తాలుకా 10 మంది, విక్రాంత్ తనతో పాటు మరో 10 మంది భక్తులు కలిపి మొత్తంగా 18 మందికి రూ.500 టికెట్లను అతను కొనుగోలు చేశాడు. అక్కడ కేవలం 12 టికెట్లను మాత్రమే ఆలయ సిబ్బందికి ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని శ్రీనివాసరావు గమనించారు. విక్రాంత్ మూడు టికెట్లు స్కానింగ్ చేయించకుండా తన వద్ద ఉంచుకున్నాడు. మిగతా మూడు టికెట్లను మహిళా సెక్యూరిటీ గార్డు వద్ద దాచినట్లు ఆలయ అధికారులు విచారణలో గుర్తించారు. సదరు వ్యవహారాన్ని ఆలయ ఈవో శీనానాయక్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది. బుధవారం ఆలయ ఈవో శీనానాయక్ విధులకు హాజరవుతున్న తరుణంలో ఈ వ్యవహారంపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. -
వెస్ట్ బైపాస్లో ఘోర ప్రమాదం..
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని బీబీగూడెం వద్ద విజయవాడ వెస్ట్ బైపాస్పై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు, అతని తల్లి, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. ఏలూరు జిల్లా కై కలూరు మండలం పెంచికలపర్రుకు చెందిన సోదరులు జయమంగళ వెంకట విజయ్కుమార్, వెంకటరాజు పొక్లెయిన్లు నడుపుతుంటారు. వారి తల్లి రమాదేవి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చారు. వెంకటరాజు భార్య, పిల్లలు ఆస్పత్రి వద్ద ఆగిపోగా, మిగిలిన వారు కై కలూరుకు తిరిగి కారులో బయలుదేరారు. పశ్చిమ బైపాస్పై బీబీగూడెం సమీపంలోకి రాగానే, వెనుక నుంచి వేగంగా వస్తున్న కంటైనర్ ముందు టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ట్యాంకర్తోపాటు వీరి కారును ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కంటైనర్, ట్యాంకర్ మధ్య కారు ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారు వెనుక సీటులో కూర్చున్న వెంకట విజయ్కుమార్ భార్య బాల వెంకట నాగదుర్గ (28), కుమారుడు కారుణ్య నాగసాయి(4) అక్కడికక్కడే మృతిచెందారు. కారు నడుపుతున్న వెంకటరాజు, ముందు సీట్లో కూర్చున్న విజయ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో ట్యాంకర్ అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టడంతో దానిపై వెళ్తున్న విజయవాడ సింగ్నగర్కు చెందిన హోటల్ కార్మికుడు దాసరి వెంకటేశ్వరరావు (49) కూడా మృతిచెందాడు. -
దుర్గమ్మ సేవలో ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కుటుంబ సమేతంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన వారిని ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు(బుల్లాబ్బాయ్) అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందించారు. అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి చల్లపల్లి: అనుమానాస్పద స్థితిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రాముడుపాలెం పుష్కర ఘాట్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కొలుసు శివరామకృష్ణ(35) తన భార్యతో సహా తోట్లవల్లూరులోని అత్త(స్వయాన శివరామకృష్ణ అక్క) ఇంటికి వచ్చారు. అయితే మంగళవారం తోట్లవల్లూరు నుంచి కారులో బయలుదేరిన శివరామకృష్ణ సాయంత్రం రాముడుపాలెం పుష్కర ఘాట్ వద్ద నీటిలో పడిపోయి చనిపోయి కనిపించాడు. స్థానికులు సమాచారం ఇవ్వటంతో ఎస్ఐ డి.దుర్గాంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తోట్లవల్లూరు నుంచి ఇక్కడకు ఎందుకు వచ్చాడనేది ప్రశ్నార్థకంగా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 22.71 శాతం ఫారాల డిజిటలైజేషన్ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో సర్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 16,53,294 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని, వాటిలో ఇప్పటికే 3,89,175 (22.71శాతం) ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
యోగా చాంపియన్ ఆనంద్ దేశానికే గర్వకారణం
మచిలీపట్నంటౌన్: అంతర్జాతీయ యోగా చాంపియన్ ఆనంద్ దేశానికే గర్వకారణమని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. మంగళవారం ఇంటర్నేషనల్ యోగా చాంపియన్ ఆనంద్ కలెక్టర్ డీకే బాలాజీ, కలెక్టర్ తండ్రి కృష్ణయ్యశెట్టితో కలిసి ఘనంగా సన్మానించారు. స్థానిక గాంధీనగర్లోని వాకర్స్ అసోసియేషన్ హాల్లో యోగా శిక్షణకు ఆనంద్ ప్రత్యేక అతిథిగా హాజరై, సభ్యులకు అడ్వాన్స్డ్ యోగా శిక్షణ ఇచ్చారు. యోగ సాధనలో సంపూర్ణ ఫలితాల కోసం పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోని వేలాది మంది యోగ సాధకులకు నిత్యం యోగ శిక్షణ ఇస్తూ, వారంతా పోటీల్లో విజేతలుగా నిలిచి, మెడల్స్ సాధించేందుకు విశేషంగా కృషి చేస్తున్న ఆనంద్ దేశానికే గర్వకారణమని అభినందించారు. అనంతరం ఆనంద్, జాతీయ స్థాయి యోగా గోల్డ్ మెడలిస్ట్ బీకే రాముడిని యోగా సభ్యులందరూ సన్మానించారు. శిక్షణా కార్యక్రమంలో జాతీయ యోగా విజేతలు బీకే రాముడు, శీలం రమేష్, వాకర్స్ అసోసియేషన్ ట్రస్టీ యారా జగన్మోహన్రావు, యోగా గురువులు పాల్గొన్నారు. ఉరేసుకుని వివాహిత మృతి వేదాద్రి(జగ్గయ్యపేట): ఉరేసుకుని వివాహిత మృతి చెందిన ఘటన గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన లాహోరి శ్రీకాంత్ గ్రామంలో డీజే ఆపరేటర్గా పని చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తెలంగాణాకు చెందిన అఖిల(25)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో ఇరు వర్గాల పెద్దలు సర్ది చెబుతున్నారు. ఈక్రమంలో సోమవారం రాత్రి దంపతులు ఘర్షణ పడ్డారు. తెల్లవారు జామున అఖిల ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మారుతి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాళం వేసిన ఇళ్లలో భారీ చోరీ 80 కాసుల బంగారం, 44 తులాల వెండి, 9 లక్షల నగదు అపహరణ పాయకాపురం(విజయవాడరూరల్): నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు వెళ్లిన వారి ఇళ్లలో దొంగలు పడి కోటి రూపాయల విలువైన 80 కాసుల బంగారం, 44 తులాల వెండి వస్తువులు, రూ.9 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. విజయవాడలో బైక్ మెకానిక్లుగా పని చేస్తున్న షేక్ చాన్బాషా, షేక్ రెహ్మాన్ అన్నదమ్ములు. వారి ఇద్దరి కుటుంబాలు జూన్ 26న నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగ కోసం ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చిన వారికి తమ ఇళ్ల తాళాలు పగుల గొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇళ్లలోకి వెళ్లి చూడగా బీరువాల తాళాలు ధ్వంసం చేసి అందులో దాచిన 80 కాసుల బంగారు నగలు, 44 తులాల వెండి వస్తువులతో పాటు రూ.9 లక్షల నగదును దొంగలు చోరీచేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై నున్న సీఐ షేక్ అహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబానికి పరామర్శ భారీ చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. పోలీసు కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. క్లూస్ టీమ్ను, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని నున్న సీఐ అహ్మద్ ఆలీని కోరారు. -
ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర
భవానీపురం(విజయవాడపశ్చిమ): దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజానీకానికి సేవలందిస్తున్న ప్రజా రవాణా(ఆర్టీసీ) సంస్థను మరింత బలోపేతం చేయాల్సిందిపోయి ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. దాదాపు రూ.6 వేల కోట్ల విలువైన ఆర్టీసీ భూములను ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు ధారాదత్తం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆర్టీసీ సంస్థకు చెందిన డిపోలను ఒక్కొక్కటిగా ప్రైవేట్కు కట్టబెట్టి నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకునేందుకు ప్రజల పక్షాన ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ విద్యాధరపురంలో నేలమట్టం చేసిన ఆర్టీసీ డిపోను వారు మంగళవారం పరిశీలించారు. డిపోలో ధ్వంసం చేసిన కట్టడాలు, డీజిల్ ఆయిల్, సీఎన్జీ బంకులు, గ్యారేజీ షెడ్ తదితరాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ–బస్ల నిర్వహణ పేరుతో డిపోలను ఖాళీ చేయించి ప్రజల ఆస్తులను ధ్వంసం చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ విధ్వంసకర పాలనకు నిదర్శనం సుమారు 50 వేల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ భవిష్యత్పై వారితో సంప్రదించకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా విద్యాధరపురం డిపో కూల్చివేత కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలనకు నిదర్శనం కాదా అని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో భూములు విలువ పెరగటం, అందునా బైపాస్ రహదారి పక్కనే ఉన్న డిపోను కబ్జా చేసి తమ అనుయాయులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ దుశ్చర్యలకు పాల్పడిందన్నారు. ఎలక్ట్రికల్ బస్ల నిర్వహణ కోసం ఈ ప్రాంతంలో సంస్థకు చెందిన అనేక ఖాళీ స్థలాలు ఉండగా ఉద్యోగులతో సందడి సందడిగా ఉండే ఈ డిపోను ఎంచుకోవడంలో ప్రభుత్వం కుట్ర బహిర్గతమవుతుందన్నారు. ఆర్టీసీ ఆస్తులు, భూములు ఆ సంస్థ ఆధీనంలోనే ఉండాలన్నారు. ఖరీదైన భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఖరీదైన ప్రభుత్వ, ఆర్టీసీ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గతంలో లులు మాల్ కోసం ఏలూరు రోడ్లో ఉన్న ఖరీదైన ఆర్టీసీ భూమిని కేటాయించినప్పుడు వైఎస్సార్ సీపీ పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఇప్పుడు విద్యాధరపురం డిపో స్థలాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతుందన్నారు. ప్రజాభిప్రాయాలను పట్టించుకోకుండా బినామీల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం వెంపర్లాడుతుందన్నారు. ఆర్టీసీ సంస్థ ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యోగులతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందించి పోరాడతామని తెలిపారు. ఇసుక, మట్టి, మైనింగ్ కొండలను స్వాహా చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ భూములపై కన్నేసిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియలో భాగంగానే విద్యాధరపురం డిపోను ఎంచుకున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఆర్టీసీ బలోపేతానికి రూ.5వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రభుత్వ చర్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు, పోర్టులను కూడా ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, పలువురు మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
రోగికి ఆశ.. వైద్యుడే శ్వాస
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి గుమ్మంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ముందుగా కనిపించేది తెల్లకోట్లులో ఉన్న వైద్యుడే. ఆ క్షణంలో ఆయన ప్రాణాలను నిలబెట్టే ఆశాకిరణం. గుండెపోటు నుంచి ప్రమాదాల వరకు, అత్యవసర పరిస్థితుల్లో క్షణాల వ్యవధిలో తీసుకునే నిర్ణయాలతో ఎన్నో జీవితాలను కాపాడుతున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే మానవీయ స్పర్వను కోల్పోకుండా, ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు అందిస్తూ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. బుధవారం జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా సేవే శ్వాసగా భావిస్తూ సమాజ ఆరోగ్యానికి అహర్నిశలు శ్రమిస్తున్న విజయవాడ వైద్యుల సేవలకు సలాం అంటున్నారు. వ్యక్తిగత సమస్యలు అధిగమిస్తూనే.. రోగులకు సేవలు అందించడమే పరమావధిగా భావిస్తూ 24 గంటలూ రోగుల సేవలోనే వైద్యులు మమేకమవుతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయాన్ని కూడా కోల్పోతుంటారు. రోగులకు సేవలు అందించే క్రమంలో వైద్యులు ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. రేడియేషన్ ప్రభావంతో కొందరు కార్డియాలజిస్టులు క్యాన్సర్ బారిన పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వారి వద్దకు వచ్చిన రోగిని చిరునవ్వుతో ఆత్మీయ పలకరింపే సగం టానిక్లా పనిచేస్తుంది. అందుకే వారిని దైవంతో కొలుస్తారు. పర్యావరణాన్ని ప్రేమిస్తే.. అది మనల్ని రక్షిస్తుందనే భావనతో మొక్కలు నాటడాన్ని డాక్టర్ కొండా వేణుగోపాలరెడ్డి(వీజీఆర్) పదేళ్ల క్రితం ప్రారంభించారు. ఏటా వర్షాకాలంలో వేలాది మొక్కలను తమ ఆస్పత్రికి తీసుకు వచ్చి ప్రతిరోజూ వచ్చే రోగులకు ఇవ్వడమే కాకుండా, రెడ్క్రాస్ వంటి సంస్థలకు ఇస్తుంటారు. అలా ఇప్పటి వరకూ 60 వేలకు పైగా మొక్కలను పంపిణీ చేశారు. మధుమేహ వైద్యుడిగా సైతం తనదైన ముద్ర వేశారు. మధుమేహానికి అవగాహనే మందు అని డాక్టర్ వీజీఆర్ అంటున్నారు. కె.వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు


