Wanaparthy
-
రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్–ఇన్
వనపర్తి: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. ఏ.శ్రీనివాసులుతో శనివారం ‘సాక్షి’ ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బ, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. ఫోన్ చేయాల్సిన సెల్నంబర్లు : 94407 31801, 63049 67688 సమయం : శనివారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు -
యథేచ్ఛగా మట్టి దందా?!
కరుగుతున్న గుట్టలు ●దాడులు చేస్తున్నాం.. జిల్లాకేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూములను తవ్వి మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే దాడులు నిర్వహిస్తున్నాం. ఇటీవల శ్రీనివాసపురం ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వి తరలిస్తున్నందుకు రూ.20 వేల జరిమానా విధించాం. సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు ఏ ప్రభుత్వ గుట్టల్లో మట్టి తవ్వేందుకు అనుమతి ఇవ్వలేదు. – గోవింద్, ఏడీ, మైనింగ్శాఖ వనపర్తి వనపర్తి: జిల్లాకేంద్రం సమీపంలోని గుట్టలు రోజురోజుకు కరిగిపోతున్నాయి. మైనింగ్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొందరు అక్రమార్కులు పట్టపగలే పొక్లెయిన్లు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలిస్తూ యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. ఇందుకు జిల్లాకేంద్రంలో పరుగులు పెడుతున్న మట్టి ట్రాక్టర్లే సాక్ష్యం. అధికార పార్టీ నేతలతో సఖ్యతగా ఉన్న కొందరు మాజీ ప్రజాప్రతినిధుల అండదండలతో జిల్లాకేంద్రంలో ఈ దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. పట్టణంలోని శ్రీనివాసపురం శివారు, పాన్గల్ రోడ్, రాజనగరం శివారు వడ్డేవాట సమీపంలోని గుట్టలను పొక్లెయిన్లతో తోడేస్తూ భవన నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం మట్టిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్శాఖ అధికారులు సైతం వారితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని నామమాత్రపు దాడులు చేపడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తవ్వకాలు చేపడుతున్నట్లు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే తాము పరిశీలనకు వస్తున్నామని అధికారులు అక్రమార్కులకు సమాచారం అందిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు ట్రాక్టర్లు, పొక్లెయిన్లు గుట్టల ప్రాంతంలో కనిపించడం లేదు. శ్రీనివాసపురం శివారులోని గుట్టపై నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కొందరు అధికారులు, మీడియాకు మంగళవారం సమాచారం ఇచ్చారు. కాసేపటికే అధికారులు అక్కడికి చేరుకోగా.. మట్టితో నిండిన కొన్ని ట్రాక్టర్లు ముళ్లపొదల చాటున కనిపించకుండా నిలపడం, తవ్వకాలు చేసిన చోటే కొంత మట్టిని వదిలేసి వెళ్లడం, పొక్లెయిన్లు అక్కడ లేకుండా అక్రమార్కులు జాగ్రత్తలు పడ్డారు. మైనింగ్ అధికారులు కనీసం గుట్ట వద్దకు వెళ్లకుండానే ఎలాంటి తవ్వకాలు లేవని ధ్రువపరుస్తూ కాసేపు అక్కడ గడిపి వెళ్లడం గమనార్హం. నామమాత్రపు జరిమానాలే.. గుట్టల తవ్వకాలపై అతిగా ఫిర్యాదులు అందితే అధికారులు నామమాత్రపు జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకొంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిత్యం రూ.లక్షల్లో చేసే మట్టి దందాకు నామమాత్రంగా రూ.వేలల్లో జరిమానాలు విధిస్తే అక్రమ తవ్వకాలు ఎలా ఆగుతాయన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి భవిష్యత్ తరాలకు జాతి సంపదను కాపాడాలనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనూ పలు ప్రజాసంఘాలు కలెక్టర్, మైనింగ్శాఖ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేయడంతో కొన్ని నెలల పాటు ఈ దందాకు బ్రేక్ పడినా ఇటీవల తిరిగి జోరందుకుంది. అధికార పార్టీ అండదండలతోనే.. అధికార పార్టీలోని కొందరు ముఖ్యనేతల అండదండలతోనే జిల్లాకేంద్రంలో మట్టి దందా జోరుగా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతుందని విమర్శలు ఉన్నాయి. ఎవరికి ఫిర్యాదు చేసినా భ యపడేది లేదంటూ సదరు నేత అంటున్నట్లు స్థానికంగా వినిపిస్తోంది. ఈ నేత గతంలోనూ ప్రైవేటు పట్టా భూమిలో మట్టి తవ్వేందుకు మైనింగ్శాఖ నుంచి అ నుమతి తీసుకొని ప్రభుత్వ గుట్టలు తవ్వగా అధికారు లు గుర్తించి పెద్ద మొత్తంలో జరిమానా విధించారు.అధికారులు వస్తున్నారని తెలిసి ముళ్లపొదల చాటున కనబడకుండా నిలిపిన మట్టి ట్రాక్టర్లు నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్న మైనింగ్ అధికారులు అధికార పార్టీ నేతల అండదండలతోనేనా..? అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నట్లు అక్రమార్కులు ముందుగానే తెలుసుకొని మట్టి ట్రాక్టర్లను ముళ్లపొదల చాటున కనపడకుండా నిలిపి జాగ్రత్తలు తీసుకోవడం కనిపించింది. శ్రీనివాసపురం శివారులోని ఎత్తైన గుట్టలను పొక్లెయిన్లతో తవ్వినట్లుగా గుట్టలపై స్పష్టంగా గుర్తులు కనిపిస్తున్నాయి. మట్టి తవ్వకాలు జరిపేందుకు గుట్టపై ఉన్న చెట్లను సైతం తొలగించిన ఆనవాళ్లు ఉన్నాయి. -
శాంతిభద్రతలు, ఆరోగ్యం కీలకం
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని.. వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మలక్పేట యశోద హాస్పిటల్స్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ రావుల గిరిధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, బాలల సంరక్షణ కమిటీ రాష్ట్ర సభ్యురాలు అపర్ణ, ఐఎంఏ అధ్యక్షుడు బాబు, యశోద ఆస్పత్రి జనరల్ సర్జన్ శ్రావ్య, సింధు ముఖ్యఅతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కనీసం ఏడాదికి ఒకసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఏవైనా సమస్యలుంటే ముందుగానే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోగలుగుతామన్నారు. జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని.. అందులో భాగంగానే మిషన్ మధుమేహ, క్షయ తదితర కార్యక్రమాలతో ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని, కలెక్టర్ కూడా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వనపర్తి జీజీహెచ్, ఎంసీహెచ్కు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గంలోని పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి, జిల్లాకేంద్రంలో 500 పడకల ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. ఏవైనా సమస్యలు నిర్ధారణ అయితే చికిత్స కూడా అందిస్తారని, ఇందుకు సహకరించిన వైద్యశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ కూడా పోలీసుశాఖ బలోపేతానికి సహకారం అందిస్తున్నారని కొనియాడారు. ఏఆర్ విభాగం హెడ్క్వార్టర్ నిర్మాణానికి అడిగిన వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేశారని, అదేవిధంగా డీఎస్పీ కార్యాలయ భవనానికి కూడా సహకారం అందించారని వివరించారు. జిల్లాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్, ఎమ్మెల్యే సహకరిస్తున్నారని, అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించగలమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు పోలీసుశాఖ తరఫున శాలువాలు కప్పి సన్మానించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు జిల్లాలు
అట్టడుగున ● రాష్ట్రంలోనే సోలార్ మోడల్ విలేజ్గా నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి నిలిచింది. సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మొత్తం 1,451 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 499 డొమెస్టిక్, 66 కమర్షియల్, 867 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 422 గృహ వినియోగదారులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం పెంచడం, ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపర్చడం, పర్యావరణ హితంలో భాగంగా ప్రభుత్వం ఈ సోలార్ మోడల్ ప్రాజెక్ట్ను చేపట్టింది. సాక్షి, నాగర్కర్నూల్: వ్యక్తిగత ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల కల్పనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు ఇంకా అట్టడుగునే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆదాయం, ఉత్పత్తి, ఉపాధిలో వెనకబాటు కనిపిస్తోంది. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్–2025 రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అలాగే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో నూతన పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది. అనీమియా ముక్త్ కార్యక్రమంలో వైద్యసిబ్బంది తీసుకున్న చర్యల ఫలితంగా వనపర్తి జిల్లా 91.8 శాతం పనితీరుతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ● వస్తు సేవల ఉత్పత్తిగా లెక్కించే జీఎస్డీపీ లెక్కల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే వెనుకంజలో ఉన్నాయి. ఈ విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 30వ స్థానంలో ఉంది. జోగుళాంబ గద్వాల 27, వనపర్తి 26, నాగర్కర్నూల్ 19వ స్థానంలో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా మాత్రం రూ.32,767 కోట్ల జీఎస్డీపీతో రాష్ట్రవ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాలు వెనుకబడిపోయాయి. మహబూబ్నగర్ రూ.2,93,823 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో 6వ స్థానంలో ఉండగా.. నారాయణపేట 30, జోగుళాంబ గద్వాల 26, వనపర్తి 22, నాగర్కర్నూల్ 20వ స్థానంలో ఉన్నాయి. ● ఉమ్మడి పాలమూరులో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. నూతన పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉపాధి కల్పన విషయంలో ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉంది. నారాయణపేట జిల్లాలో 102 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. వీటి పరిధిలో 2,045 మంది ఉపాధి పొందుతున్నారు. కాగా మహబూబ్నగర్లో 462 యూనిట్లతో 32,443 మందికి ఉపాధి పొందుతున్నారు. మిగతా జిల్లాల్లో ఐదు వేల మందికి మించి ఉపాధి లేదు. ఇక అటవీ విస్తీర్ణంలో నాగర్కర్నూల్ జిల్లాలో 35.81 శాతం అటవీ భూమితో రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉండగా.. గద్వాల జిల్లాలో కేవలం 2.32 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉంది. డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లలో 57.4శాతంతో నాగర్కర్నూల్ అట్టడుగు స్థానంలో ఉండగా. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలు సైతం 65 శాతం లోపే కనెక్షన్లు ఉన్నాయి. భూ యజమానులు (సగటున హెక్టార్లలో..)1.081.030.980.860.83జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో వెనుకంజ మహబూబ్నగర్ జిల్లా కాస్త మెరుగు పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కరువు సోలార్ మోడల్ విలేజ్గా కొండారెడ్డిపల్లి తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్ లుక్ 2025లో వెల్లడి -
తల్లిదండ్రులు దైవంతో సమానం
వనపర్తి టౌన్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దైవంగా భావించి పిల్లలు వారికి సేవ చేయాలని.. ఎవరైనా నిరాశ్రయులను చేస్తే హెల్ప్లైన్ నంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కనీస అవసరాలు తీర్చకపోయినా, ఇళ్లలో స్థానం కల్పించకపోయినా సీనియర్ సిటిజన్ చట్టం 2007 ప్రకారం రూరల్ డెవలప్మెంట్ అధికారి వారికి పిల్లల నుంచి నెలకు సరిపడా డబ్బులు ఇప్పించాలని చెప్పారు. రూ.10 వేల వరకు మెయింటెనెన్స్ కోరవచ్చని, మెయింటెనెన్స్ ఫిర్యాదు ఇవ్వొచ్చని సూచించారు. పిల్లలు లేనివారి ఆస్తి తదనంతరం ఎవరికి చెందుతుందో వారి ద్వారా, దత్తత తీసుకున్న పిల్లల నుంచి కూడా మెయింటెనెన్స్ కోరే అవకాశం ఉందన్నారు. న్యాయ సలహాల కోసం హెల్ప్లైన్ నంబర్ 15100ను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ అసిస్టెంట్ కౌన్సిల్ ఎం.రఘు, జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, మండల సీనియర్ ఫోరం అధ్యక్షుడు నాగేంద్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘పది’ పరీక్షలు
జిల్లాకేంద్రంలో పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు ఆత్మకూర్: జిల్లాలో శుక్రవారం నుంచి పదోతరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 179 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 6,853 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 3,419 మంది, బాలికలు 3,434 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఫర్నీచర్, ఫ్యాన్లు, ఇతర సౌకర్యాలు సమకూర్చారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను బిగించారు. 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 400 మంది ఇన్విజిలేటర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నాలుగు రూట్ ఆఫీసర్ల బృందాలు ఏర్పాటు చేశారు. వనపర్తి, ఆత్మకూర్, పెబ్బేరు, కొత్తకోట, వీపనగండ్ల, పెద్దమందడి, పాన్గల్, ఖిల్లాఘనపురం, గోపాల్పేట, రేవల్లి పోలీస్స్టేషన్లలో ప్రశ్నపత్రాలు భద్రపర్చనున్నారు. జిల్లాలో 179 ఉన్నత పాఠశాలలు.. 6,853 మంది విద్యార్థులు 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు -
ప్రణాళికతో యాసంగి ధాన్యం కొనుగోలు
వనపర్తి: యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి వరి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2024–25 యాసంగికి సంబంధించి రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఏప్రిల్ రెండో వారంలోనే ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని.. పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో అందుకు తగినట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని, గన్ని బ్యాగులు, టార్పాలిన్ల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. వేసవి నేపథ్యంలో నీడ, తాగునీటి వసతి కల్పించాలన్నారు. తాలు తొలగింపునకు ఫ్యాన్లు, రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో ఏయే రోజు ఎంత తేమ శాతం ఉందనే వివరాలు రిజిస్టర్లలో నమోదు చేయాలని కోరారు. మార్చి 25లోపు తూకము, తేమ కొలిచే యంత్రాలు సిద్ధం చేయాలని మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా ఏఈఓలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లకు సన్నరకం ధాన్యాన్ని గుర్తించే విధానంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. రైస్మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇస్తేనే ధాన్యం కేటాయింపు జరుగుతుందని, లేదంటే ఇవ్వమని స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ అధికారి గోవింద్నాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్, జిల్లా సహకారశాఖ అధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఇసుక రీచ్లను గుర్తించాలి.. స్థానిక అవసరాల మేరకు ఇసుక వినియోగించుకునేందుకు జిల్లాలో అందుబాటులో ఉన్న రీచ్లను గుర్తించి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లతో కలిసి నిర్వహించిన జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖిల్లాఘనపురం మండలం కమాలుద్దీన్పూర్, పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి, మదనాపురం మండలం కరివేన, దుప్పల్లి, ఆత్మకూరు మండలం వీరరాఘవాపురం రీచ్లను పరిశీలించాలన్నారు. అదేవిధంగా ఫిల్టర్ ఇసుక దందా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేకుండా ఇసుక తరలించడానికి వీలులేదని.. అవసరం ఉంటే మన ఇసుక వాహనం ద్వారానే బుక్ చేసుకునేలా చూడాలన్నారు. -
అన్నివర్గాలకు సమన్యాయం..
ప్రజల భవిష్యత్కు భరోసా.. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా, ప్రజల భవిష్యత్కు భరోసానిచ్చేలా బడ్జెట్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ ద్రవ్యలోటును తగ్గించే చర్యలు చేపట్టింది. వ్యవసాయం, రైతుభరోసాకు కేటాయించిన నిధులు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. సాగునీటి రంగానికి రూ. 23వేల కోట్ల మేరకు కేటాయించడం శుభపరిణామం. మూలధన వ్యయాన్ని రూ. 36,504 కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వసతులు పెరుగుతాయి. ఆరు గ్యారంటీల హామీల అమలుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరపడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. జీఎస్డీపీలో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచడం, రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాఽధి కల్పించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. 2030 నాటికి 10 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 5 లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనందంగా ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంది. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబోయే పదేళ్లలో తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు దోహదపడుతుంది. వైద్యం, విద్య, సాగునీటి పారుదల శాఖలకు నిధులు కేటాయించి ప్రాధాన్యత కల్పించింది. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్ -
మోదం.. ఖేదం
ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకే ప్రాధాన్యం సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో నిధులు సమకూరుస్తారని భావించగా, బడ్జెట్లో కేవలం రూ.2,514 కోట్ల మేరకే కేటాయింపులు దక్కాయి. ఈ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు బడ్జెట్లో ప్రస్తావించింది. ప్రధానంగా ఇప్పటికే పెండింగ్లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కోయిల్సాగర్, సంగంబండ, నెట్టెంపాడు ప్రాజెక్ట్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో నిధులను కేటాయించింది. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కేఎల్ఐ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు.. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, విస్తరణ పనులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో రూ.800 కోట్లను కేటాయించింది. గతేడాది సైతం రూ. 715 కోట్లు కేటాయించగా, ఈసారి మరికొంత నిధులను పెంచింది. కల్వకుర్తి కింద పెండింగ్లో ఉన్న 28, 29, 30వ ప్యాకేజీ లను పూర్తిచేయడం ద్వారా ఆయా ప్రాజెక్ట్లకు పూర్తిస్థాయి లో ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కురుమూర్తిస్వామి ఆలయాభివృద్ధికి రూ.110 కోట్లు.. పాలమూరు ప్రజల ఆరాధ్యదైవం అమ్మాపురంలో ఉన్న కురుమూర్తిస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఘాట్రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం 20–25 ఎకరాల స్థలాన్ని కేటాయించి, నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. ● రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్ల పంపిణీ పథకాలకు నిధులను సమకూర్చింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ. 31,605 కోట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ రోడ్లు, గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొందనున్నారు. ● ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని చెబుతూ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ఇప్పటివరకు రుణమాఫీ కాని రైతుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. టైగర్ సఫారీ, ఎకో టూరిజం, కృష్ణానదిపై లాంచీ స్టేషన్లు, జెట్టీలు, వాటర్ స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పర్చనున్నారు. ● నల్లమలలో పర్యాటక అభివృద్ధితో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో గెస్ట్ హౌస్ల నిర్మాణాలు, ట్రెక్కింగ్ మార్గాలను అభివృద్ధి చేయనుంది. కృష్ణాతీరంలోని సోమశిల వద్ద బోటింగ్, క్యాంపింగ్, కారవాన్ క్యాంపింగ్ సదుపాయాల కోసం ప్రణాళిక చేపట్టింది. పెండింగ్లో ఉన్న కోయిల్సాగర్, సంగంబండ, నెట్టెంపాడు ప్రాజెక్ట్లకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులను కేటాయించింది. కోయిల్సాగర్కు రూ.80.73 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్ట్కు రూ.144 కోట్లు, సంగంబండకు రూ.98.08 కోట్ల నిధులను కేటాయించింది. కోయిల్సాగర్ ప్రాజెక్ట్కు అవసరమైన కేటాయింపులు దక్కడంతో పెండింగ్లో ఉన్న దేవరకద్ర గ్రావిటీ కెనాల్, ఎడమ కాల్వ, డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనుల్లో వేగం పెరుగనుంది. సంగంబండ కింద చేపడుతున్న భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. కోయిల్సాగర్, సంగంబండకు కేటాయింపులు కేఎల్ఐకు రూ.800 కోట్లు కేటాయింపు ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతలకు మరోసారి నిరాశే నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు రాష్ట్ర బడ్జెట్పై మిశ్రమ స్పందన -
‘పాలమూరు’కు ఇచ్చింది రూ. 2,514 కోట్లే..
ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 14.5 లక్షల ఎకరాల్లో సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఈ బడ్జెట్లో నిరాశే మిగిలింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ఇంకా కనీసం రూ.20 వేల కోట్లు అవసరం ఉంది. అలాగే ఇప్పటి వరకు చేపట్టిన పనులకు దాదాపు రూ.9వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం రూ.2,514 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది బడ్జెట్లోనూ ప్రభుత్వం రూ.2 వేల కోట్లే కేటాయించగా, ఆ మాత్రం నిధులను కూడా ఖర్చు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. సరైన నిధుల కేటాయింపులు లేకపోవడంతో ప్రాజెక్ట్ పను లు ముందుకు సాగే పరిస్థితులు కన్పించడం లేదు. -
‘ఆశాల హామీలు నెరవేర్చాలి’
వనపర్తి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు మర్రికుంట ధర్నా చౌక్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో కనీస వేతనం రూ.18 వేలు ప్రకటించాలని, రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. అదనపు పనులకు అదనపు వేతనం చెల్లించాలని, అధికారుల వేధింపులు ఆపాలని, పండుగ, వారాంతపు సెలవు సర్క్యులర్ ఇవ్వాలని, పని భారం తగ్గించాలని కోరారు. ఈ సమయంలో పోలీసులకు సీఐటీయూ నాయకులు, ఆశా కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలిసి డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు బొబ్బిలి నిక్సన్, పీఎన్ రమేష్, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బుచ్చమ్మ, కార్యదర్శి సునీత, భాగ్య, గిరిజ, ఇందిర, సత్యమ్మ, శాంతమ్మ, జ్యోతి, చిట్టెమ్మ, రమాదేవి, శారద పాల్గొన్నారు. -
ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్
వనపర్తి: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు మతపెద్దల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీర్మానించామని, తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, తహసీల్దార్ రమేశ్రెడ్డి, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. వైద్య కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా డా. డి.కిరణ్మయి వనపర్తి: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా డా. డి.కిరణ్మయి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకొని కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. డా. కిరణ్మయి జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్లో మూడేళ్లుగా గైనకాలజీ నిపుణురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రైస్మిల్లు తనిఖీ చేసిన డీఎస్ఓ కొత్తకోట రూరల్: మండలంలోని మిరాసిపల్లి సమీపంలో ఉన్న ఓ రైస్ మిల్లులో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు ఇదివరకు సీజ్ చేశారు. ఆ ధాన్యాన్ని రాత్రికి రాత్రి తరలిస్తున్నారన్న ప్రాథమిక సమాచారంతో డీఎస్ఓ కాశీవిశ్వనాథ్ బుధవారం మిల్లుకు చేరుకొని పరిశీలించారు. లారీలో ఉన్న వరి ధాన్యం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నుంచి మిల్లు యజమాని కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు పత్రాలు చూపించారని డీఎస్ఓ వివరించారు. సీజ్ చేసిన ధాన్యం భద్రంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.7,050 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,050, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,649, కనిష్టంగా రూ.6,111, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,329, కనిష్టంగా రూ.2,137, ఆముదాలు, జొన్నలు గరిష్టంగా రూ.4,379, కనిష్టంగా రూ.3,977 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో కందుల ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.6,019గా ఒకే ధర పలికింది. నల్లకుసుమలు రూ.4,109.. నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నల్లకుసుమలు క్వింటాల్కు గరిష్టం, కనిష్టంగా రూ.4,109 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,475, వేరుశనగ గరిష్టం రూ.5,449, కనిష్టం రూ.5,020, జొన్నలు గరిష్టం రూ.4,735, కనిష్టం రూ.2,812, అలసందలు గరిష్టం రూ.7,176, కనిష్టం రూ.5,109, ఎర్ర కందులు గరిష్టం రూ.7,311, కనిష్టం రూ.6,069, తెల్ల కందులు గరిష్టం రూ.7,305, కనిష్టం రూ.6 వేలు పలికాయి. -
అబద్ధాల చిట్టా చదివారు..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈసారి బడ్జెట్లో పాలమూరు యూనివర్సిటీకి కేటాయింపులు పెరిగాయి. గతేడాది యూనివర్సిటీకి వేతనాల కోసం రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది రూ.200 కోట్లు అభివృద్ధి కోసం, రూ.66 కోట్లు వేతనాల కోసం ప్రతిపాదించారు. వేతనాల్లో కొత్తగా వస్తున్న ఇంజినీరింగ్, లా కళాశాలు, పీజీ కళాశాల సిబ్బంది వివరాలు కూడా ఉన్నారు. కాగా..ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం సిబ్బంది వేతనాల కోసం రూ.15.19 కోట్లు, అభివృద్ధి కోసం రూ.35 కోట్లును కేటాయించింది. మొత్తంగా పీయూకి రూ.50.19 కోట్లను కేటాయించారు. వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్పలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతం కంటే అధికంగా నిధులు కేటాయించిందని, దీంతో యూనివర్సిటీ మరింత అభివృద్ధి జరుగుతుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన వికాసాన్ని కొద్ది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేసింది. డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా మళ్లీ అబద్ధాల చిట్టా చదివారు. ఒక్క ఏడాది నోరు కట్టుకొని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మూడో బడ్జెట్లోనే చతికిలబడ్డారు. అధికారం చేపట్టి రెండేళ్లుగాకముందే తెలంగాణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. 15 నెలల్లో రూ.58 వేల కోట్లు అప్పుజేసి సాధించిన ప్రగతి ఏంటో చెప్పాలి. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి అబద్ధాలు వండి వార్చారు. – సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ మంత్రి, వనపర్తి -
ప్రజామోద బడ్జెట్..
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో అన్నివర్గాలకు మేలు చేకూర్చే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 90 శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగునీటి రంగానికి సైతం తగిన ప్రాధాన్యతనిచ్చి నిధుల కేటాయింపులు చేశాం. పదేళ్లుగా నిర్వీర్యమైన కార్పొరేషన్లకు నిధులు కేటాయించి పునరుజ్జీవం వచ్చేలా పద్దులు ఉన్నాయి. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి బడ్జెట్లో వెనుకబడిన పాలమూరుకు ప్రత్యేకంగా చేసిన కేటాయింపులు ఏమీ లేవు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. 15 నెలల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రైతుభరోసాకు రైతులు ఎదురుచూసే దుస్థితి నెలకొంది. రుణమాఫీ అరకొరగా చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుంది. అంకెల గారడీతో రూ.మూడు లక్షల కోట్ల బడ్జెట్ అని గొప్పలు చెప్పుకోవడమే సరిపోయింది. – నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి ప్రత్యేక కేటాయింపులేవీ? -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
పాన్గల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని.. ఉన్నత లక్ష్య ఛేదనకు నిరంతరం శ్రమించి పట్టుదలతో సాధించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం మండలంలోని మాందాపూర్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం, పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పెద్ద పెద్ద కలలు కనాలని.. వాటి సాకారం కోసం సమయాన్ని వృథా చేయకుండా ప్రయత్నించాలని సూచించారు. పది విద్యార్థులు వార్షిక పరీక్షలను భయంతో కాకుండా ఇష్టంతో రాసి ఉత్తమ జీపీఏ సాధించాలన్నారు. చెడు అలవాట్లు, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని, ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయ బృందం ఎస్పీని శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, జిల్లా విద్యాశాఖ అధికారులు చంద్రశేఖర్, గణేష్, ఎంఈఓ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ జయరాములుసాగర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లు చరిత్రాత్మకం : కాంగ్రెస్
వనపర్తిటౌన్: వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లు చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోతుందని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు 62 రోజుల పాటు పకడ్బందీగా ఇంటింటి సర్వేతో సమగ్ర వివరాలతో ప్రజామోదానికి అనుగుణంగా అడుగులు వేసిందని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ ప్రచార లోపంతో వెనుకబడి ఉన్నామని అంగీకరించారు. బీసీ బిల్లుకు చొరవ తీసుకున్న కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు అండగా నిలవాలని కోరారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు మాని ప్రజా అభ్యున్నతికి విలువైన సూచనలు ఇచ్చేందుకు ముందుకు రావాలని హితవు పలికారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ నేత కోళ్ల వెంకటేష్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధనకు మాదిగ జాతి మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తోందని, వర్గీకరణ పోరులో ఎందరో అమరులయ్యారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు ముందుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించేందుకు ప్రతి ఊరిలో మాదిగలు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నారాయణ, గోర్ల జానకిరాములు, నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పంటల సంరక్షణకు చర్యలు
వనపర్తి రూరల్: జిల్లాలో రైతులు సాగుచేసిన యాసంగి పంటలు ఎండిపోకుండా సరిపడా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అన్నిరకాల చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెద్దగూడెంతండా పరిధిలో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. తామంతా బోరుబావులపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నామని.. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని, ఆదుకోవాలని రైతులు కలెక్టర్కు విన్నవించారు. మొత్తం 36 మంది రైతులకు చెందిన 45 ఎకరాల పంట ఎండిపోయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సరిపడా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అటవీశాఖ నుంచి అభ్యంతరాలున్నందున దానికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి పనుల పరిశీలన.. మండలంలోని తిరుమలయ్యగట్టు ప్రాంతంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. పని ప్రదేశాల్లో చలువ పందిళ్లు, తాగునీటి వసతిని తనిఖీ చేశారు. ఎన్ని గంటల వరకు పనులు చేస్తున్నారని కూలీలను అడగ్గా మధ్యాహ్నం 12 వరకు చేస్తున్నామని బదులిచ్చారు. కూలీలతో ఏయే పనులు చేయిస్తున్నారని డీఆర్డీఓను ప్రశ్నించగా.. నీటి గుంతలు తీయించే పనులు చేయిస్తున్నామని సమాధానమిచ్చారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ, జిల్లా వ్యవసాయశాఖ అధికారితోపాటు విద్యుత్శాఖ ఎస్ఈ రాజశేఖరం, డీఈ శ్రీనివాసులు, తహసీల్దార్ రమేష్రెడ్డి, ఇతర వ్యవసాయ అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఆయకట్టు రైతులను ఆదుకోవాలి
మదనాపురం: కురుమూర్తి ఎత్తపోతల పథకం ఆయకట్టులో రైతులు సాగు చేసిన యాసంగి పంటలు ఎండిపోకుండా నీటిని అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ కోరారు. మంగళవారం మండలంలోని రామన్పాడు జలాశయంలో నీటి నిల్వలు, పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుందని, పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట ప్రభుత్వం కర్ణాటక అధికారులతో మాట్లాడి జూరాల ప్రాజెక్ట్కు నీటిని విడుదల చేయించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వెంకట్రాములు, నాయకులు వెంకటేష్, చెన్నయ్య, కొత్తపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 152 మంది గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ పరీక్షలకు 152 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీరంగాపూర్, పెబ్బేర్, వీపనగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించినట్లు చెప్పారు. మొత్తం 6,012 మంది విద్యార్థులకుగాను 5,860 మంది హాజరైనట్లు వివరించారు. రామన్పాడులో 1,016 అడుగులు మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో మంగళవారం 1,016 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 39 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 112 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. బకాయి వేతనాలు చెల్లించాలంటూ ధర్నా వనపర్తి రూరల్: పెండింగ్ వేతనాలతో పాటు ఫీఎప్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ చట్టాలు అమలు చేయాలంటూ గ్రామపంచాయతీ కార్మికులు మంగళవారం తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ముందుగా మర్రికుంట నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అరుణ్కుమార్ హాజరై మాట్లాడారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతినెల వేతనాలు తీసుకోవడానికి డబ్బులుంటాయిగాని దళిత, బీసీ, మైనార్టీ, బహుజనులైన గ్రామపంచాయతీ కార్మికులకు ఇవ్వడానికి నెలకు రూ.60 కోట్లు లేవా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీల్లో సుమారు 60 వేల మంది కార్మికులు ఉన్నారని.. 2 నుంచి 7 నెలల వరకు బకాయి వేతనాలు చెల్లించాల్సి ఉందని వారంతా ఎలా బతకాలన్నారు. తక్షణమే కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డీఎల్పీఓకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బయ్య, ఘట ్టమ్మ, రామచంద్రయ్య, కురుమయ్య, ఖరీం, గంగమ్మ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటికే భద్రాచలం సీతారాముల తలంబ్రాలు వనపర్తి టౌన్: ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం రాత్రి ఆర్టీసీ డిపోలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను అధికారులతో కలిసి విడుదల చేశారు. అ నంతరం మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితు లు, అనారోగ్యం, దూరభారం తదితర కార ణాలతో భద్రాచలం వెళ్లలేని వారికి కార్గో ద్వారా తలంబ్రాలు ఇంటికి చేర్చుతామన్నా రు. కావాల్సిన భక్తులు సమీప ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో రూ.151 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ఫోన్ నంబర్లు 98663 44200, 88018 28143, 88868 48518, 73828 29494 సంప్రదించాలన్నారు. నేడు జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొమ్మిది ప్రైవేట్ కంపెనీల్లో 935 ఉద్యోగాల భర్తీ కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 99485 68830, 95502 05227, 91753 05435 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు. -
అంగన్వాడీల హామీలు నెరవేర్చాలి : సీఐటీయూ
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలంటూ మంగళవారం జిల్లాకేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కలెక్టరేట్ను ముట్టడించారు. ముందుగా సీఐటీయూ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద ఆధ్వర్యంలో మర్రికుంట ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్కు ర్యాలీ వెళ్లారు. కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీ ప్రకారం వేతనం రూ.18 వేలకు పెంచాలని, మినీ నుంచి ప్రధాన అంగన్వాడీగా మార్చిన టీచర్లకు పది నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేసవిలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా మే నెలలో సెలవులు ఇవ్వాలన్నారు. కొత్త జీఓలు విడుదల చేసి టీచర్లకు రూ.రెండు లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష రిటైర్మెంట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్, పీఎన్ రమేష్, నందిమళ్ల రాములు, మద్దిలేటి, నారాయణమ్మ, కవిత, రమాదేవి, శాంతాబాయి, రాజేశ్వరి, మహేశ్వరి, సంగీత, భారతి, రేణుక, శారద, వెంకటేశ్వరమ్మ, సుమతి తదితరులు పాల్గొన్నారు. -
నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?
ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణాలు కోయిల్సాగర్ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, డిస్ట్రిబ్యూటరీ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా సుమారు రూ.89.9 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కోయిల్సాగర్ ఎత్తిపోతల కింద నాగిరెడ్డిపల్లి పంప్హౌస్ వద్ద రూ.19.68 కోట్లు, తీలేరు పంప్హౌస్ వద్ద రూ.19.62 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. కోయిల్సాగర్ బ్యాక్వాటర్ నుంచి తవ్విన దేవరకద్ర గ్రావిటీ కెనాల్ చౌదర్పల్లి నుంచి లక్ష్మిపల్లి వరకు రూ.21 కోట్ల విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద, గ్రావిటీ కెనాల్ పరిధిలో, ఎడమ కాల్వ పొడిగింపు పనులకు గాను సేకరించిన భూములకు సంబంధించి ఇంకా 347 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. గద్వాల: వలసలకు మారుపేరైన పాలమూరు వరుస మార్చాలనే తలంపుతో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల పాలనలో దాదాపు పనులన్నీ 70– 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న రాజశేఖరరెడ్డి మరణం, వరదలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవి ర్భావం వంటి పరిణామాలతో ఆయా ప్రాజెక్టు పనుల గమనానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్లోనే కొనసాగుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు వాసి అయిన సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల వరద పారి పంట పొలాలకు సాగునీరు అందుతుందనే అన్నదాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. కోయిల్సాగర్ది అదే దారి.. గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ముందుకు సాగని వైనం తాజాగా సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాపై కరుణ చూపేనా పెండింగ్ పనులు పూర్తయితేనే పాలమూరు సస్యశ్యామలం నేడు రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆశలు -
ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలి
వనపర్తి: పోలీసు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సీఐలు, ఎస్ఐలను ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొమ్మిది మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి.. వాటిని సత్వర పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్ఐలు, సీఐలకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లా పోలీసు శాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. లక్ష్యం లేని చదువుతో గమ్యం చేరుకోలేం.. అమరచింత: విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని.. లక్ష్యం లేని చదువుతో గమ్యం చేరుకోవడం కష్టమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అమరచింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు బట్టి పట్టే చదువులకు స్వస్తి పలకాలన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని సూచించారు. నిత్యం ఉపాధ్యాయులను గౌరవించినప్పుడే చక్కగా అన్ని విషయాల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. గతంలో ఉపాధ్యాయులు ఏది చెప్పినా విద్యార్థులు వినే వారని.. అందుకే ఉన్నతంగా రాణించి మంచి ఉద్యోగాలు సాధించారన్నారు. నేటి తరం విద్యార్థుల్లో కొందరు సెల్ఫోన్ వినియోగించడం ద్వారా చదువుల్లో రాణించలేక పోతున్నారని తెలిపారు. విద్యార్థి ఏ రంగంలో ప్రావీణ్యం కలిగి ఉన్నాడో గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గురుకులంలో చదువుతున్న పూర్ణ అనే విద్యార్థినిలో ఉన్న లక్ష్యాన్ని అప్పటి కార్యదర్శి ప్రవీణ్కుమార్ గుర్తించి, తోడ్పాటు అందించడంతో ఎవరెస్టు శిఖరం ఎక్కి ప్రపంచ గుర్తింపు తెచ్చుకుందని గుర్తుచేశారు. పదో తరగతి విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శివకుమార్, హెచ్ఎం కృష్ణవేణి, రిటైర్డ్ టీచర్ షేక్ అహ్మద్ పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి
వనపర్తి రూరల్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనం ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సోమవారం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో 48 గంటల సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐసీడీఎస్ సేవలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం చట్టాన్ని అమలుచేసే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గ్రాడ్యూటీ అమలు చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. 10 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్, పీఎన్ రమేశ్, కవిత, రమాదేవి, జ్యోతి, నాగేంద్రమ్మ, సంధ్యారాణి, విజయమ్మ, గోవిందమ్మ, సుగుణబాయి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ను విస్మరిస్తే ఇబ్బందులు తప్పవు
వనపర్తి: అనుమతి లేని, అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకోకపోతే ఇబ్బందులు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి ఎల్ఆర్ఎస్పై మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో అనుమతి లేని, అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ఆదేశించారు. అనధికారిక ప్లాట్లను రెగ్యులరైజ్ చేయించుకోకపోతే భవిష్యత్లో వాటిని అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉండదన్నారు. అనుమతి లేని ప్లాట్లను తక్షణమే ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోవాలని సూచించారు. ఇప్పటికే రూ.వెయ్యి చెల్లించి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ వార్డు ఆఫీసర్ల ద్వారా ఫోన్కాల్స్ చేసి తెలియజేయాలని.. అవసరమైతే నోటీసులు కూడా జారీ చేయాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని తెలిపారు. దరఖాస్తుదారులకు ఫోన్కాల్స్ చేసినప్పుడు ఎల్ఆర్ఎస్ ప్రయోజనాల గురించి వివరించాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా ఆస్తిపన్ను వసూలును వేగవంతం చేయాలన్నారు. మొండి బకాయిదారులకు నోటీసులు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. నెలాఖరులోగా నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. భవిత కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్నిరకాలుగా శిక్షణ, సహకారం అందించి సాధారణ పిల్లలతో సమానంగా తీర్చిదిద్దడమే భవిత కేంద్రం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో ఉన్న భవిత కేంద్రంలో విద్యాశాఖ, సమగ్రశిక్ష, అలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 69 మంది పిల్లలకు ఉచితంగా ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, క్లచర్స్, వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత కేంద్రంలో శారీరకంగా బలహీనమైన పిల్లలకు ఫిజియోథెరపీ, వినికిడి సక్రమంగా లేని పిల్లలకు ప్రత్యేకమైన బోధన అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రాన్ని భవిత కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్ ఘని, భవిత కేంద్రం అధికారి యుగేందర్, ఎంఈఓ మద్దిలేటి, తహసీల్దార్ రమేశ్రెడ్డి పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు.. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ప్రజావాణికి 43 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు అనుమతి లేని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
గుర్రంగడ్డ పనుల్లో కదలిక
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో.. గత ప్రభుత్వం 2018లో రూ.12కోట్లతో బ్రిడ్జీ నిర్మాణం చేపట్టాలని పనులు మొదలుపెట్టింది. అయితే పనుల దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. దీనిపై అధికారులు పలుమార్లు నోటీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్లో మాత్రం చలనం లేదు. దీంతో గత ఏడేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా సదరు కాంట్రాక్టర్పై అధికారులు వేటు వేశారు. 60సీ నోటీసులు జారీ చేసి పాత కాంట్రాక్టర్, కన్స్ట్రక్షన్ ఏజెన్సీని తొలగించి నూతనంగా మరో ఏజెన్సీకి పనులు అప్పగించారు. దీంతో పనులు దక్కించుకున్న ఏజెన్సీ పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం పనులు వేగవంతం సాగుతున్నాయి. వేసవి కాలంలో పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని.. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గుర్రంగడ్డ వాసులు కోరుతున్నారు. నూతన ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు ●● కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం.. ● అత్యవసర పరిస్థితుల్లో నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ● వంతెన నిర్మాణంతో తీరనున్న కష్టాలు గద్వాల: ఏడాదిలో ఆర్నెళ్లు దీవిలో.. మరో ఆర్నెళ్లు మైదాన ప్రాంతంలో జీవిస్తున్నారు గుర్రంగడ్డవాసులు. విద్య, నిత్యావసర వస్తువులు, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు పొందాలన్నా పుట్టీల సాయంతో నది దాటాల్సిందే. కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం ఇదే. వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని ఏళ్లుగా గుర్రంగడ్డ వాసులు కోరుతున్నా.. బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తవడంలేదు. తాజాగా వంతెన నిర్మాణ పనులను కొత్త ఏజెన్సీకి అప్పగించామని, పనులు వేగవంతం చేసి కష్టాలు తొలగిస్తామని అధికారులు పేర్కొంటుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్నెళ్లు నది మధ్యలోనే.. వానాకాలం సీజన్లో భారీగా కురిసే వర్షాలకు వరద వచ్చి చేరడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటుంది. ఈ సమయంలో గుర్రంగడ్డ వాసులు పుట్టీలు, పడవల ద్వారా ప్రయాణించాల్సిందే. ఈక్రమంలో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నది మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈగ్రామంలో మొత్తం 600 కుటుంబాలు నివాసం ఉంటుండగా 450 మంది వరకు ఓటర్లున్నారు. మొత్తం వ్యవసాయ భూమి విస్తీర్ణం 2100 ఎకరాలు కాగా ఇందులో సుమారు 1600 ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. ఇందులో ప్రధాన పంట వరి. ఇలాంటి పరిస్థితిలో నదిలో భారీగా వరద ప్రవహిస్తున్నప్పుడు బాహ్యప్రపంచంతో దీవివాసులకు పూర్తిగా సంబంధాలు కోల్పోతాయి. ఏడాదిలో ఆర్నెళ్ల వరకు ఈ కష్టాలు వెంటాడుతుంటాయి. రూ.12 కోట్లతో బ్రిడ్జి పనులు ప్రారంభం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది మధ్యలో ఉన్న ఏకై క దీవి గ్రామం గుర్రంగడ్డ. ఈ గ్రామ ప్రజల రాకపోకలకు ఏకై క మార్గం నదిలో పుట్టీల ద్వారా ప్రయాణం చేయడం. దీవిగ్రామ ప్రజల కష్టాలు తీర్చాలని గత ప్రభుత్వం హయాంలో 2015లో రూ.12కోట్ల అంచనాలతో వంతెన నిర్మాణ పనులను చేపట్టారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పనులు మొదలు పెట్టకపోవడంతో గత ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులు ముందుకు సాగలేదు. తాజాగా అధికారులు పాత ఏజెన్సీని మార్చేసి కొత్త ఏజెన్సీకి పనులు అప్పచెప్పడంతో పనుల్లో కదలిక మొదలైంది. వచ్చే ఏడాది వరకు పనులు పూర్తి చేసి రాకపోకలు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఏడాదిలో పూర్తి చేస్తాం 2018లో రూ.12కోట్లతో గుర్రంగడ్డ వంతెన నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయలేదు. దీంతో పాత ఏజెన్సీకి 60సీ నోటీసులు ఇచ్చి తొలగించాం. కొత్త ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు అప్పగించాం. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. – రహీముద్దీన్, ఇన్చార్జ్ ఎస్ఈ -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
వనపర్తి టౌన్: జిల్లా ప్రజలు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ రాజశేఖరం చెప్పారు. జిల్లా విద్యుత్శాఖ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లోఓల్టేజీ సమస్యను అధిగమించేందుకు వనపర్తి మండలం రాజపేట, పెద్దమందడి మండలం వెల్టూర్, పెబ్బేరు మండలం గుమ్మడం, ఖిల్లాఘనపురం మండలం మానాజీపేట సబ్స్టేషన్లలో అదనంగా పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా మరో నాలుగు పవర్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయని చెప్పారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు దాదాపు రూ. కోటికి పైగా ఉంటుందన్నారు. వీటి కెపాసిటీ 5 ఎంవీఏ అని తెలిపారు. శ్రీరంగాపూర్, కంచిరావుపల్లి, పెబ్బేరు, చిన్నమందడి తదితర ప్రాంతాల్లో మరో రెండు వారాల్లో వీటిని ఏర్పాటు చేసి విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు లోఓల్టేజీ సమస్యను పూర్తిగా అధిగమిస్తామని తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 296 మంది గైర్హాజరు వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 7,245 మంది విద్యార్థులకు గాను 6,949 మంది హాజరు కాగా.. 296 మంది గైర్హాజరైనట్టు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సూర్య ఒకేషనల్ కళాశాల, వాగ్దేవి కళాశాల పరీక్ష కేంద్రాలను డీఐఈఓ తనిఖీ చేశారు. అంతకు ముందు వనపర్తి రూరల్ పోలీస్స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులను ఆదుకోవాలనే స్పృహ లేని ప్రభుత్వం వనపర్తి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యం కేసీఆర్ను నిందించడం తప్ప.. పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలనే ధ్యాస, స్పృహ, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి మండలం పెద్దగూ డెం తండాలో రైతు జూలానాయక్ సాగుచేసిన మూడెకరాల వరిపంట ఎండిపోగా.. సోమ వారం మాజీ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరెంటు కోతలతో నీరందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సాగునీటి కొరత, కరెంటు కోతలతో హరిగోస పడుతున్నారన్నారు. మరోవైపు మూడెకరాల వరకు రైతుభరోసా సాయం అందించామని చెప్పడం బూటకమని ధ్వజమెత్తారు. ఆర్థికశాఖ, విద్యుత్శాఖ, వ్యవసాయశాఖ మంత్రులు సమన్వయంతో పనిచేసి ఉంటే రైతుభరోసా కోసం గోస పడేవారు కాదని.. 448 మంది రైతుల ఆత్మహత్యలు జరిగేవి కావని.. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయ్యేవి కావన్నారు. ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, ధర్మానాయక్, కృష్ణానాయక్, చిట్యాల రాము, చంద్రశేఖర్, నారాయణ నాయక్, టీక్యానాయక్, రూప్లానాయక్ పాల్గొన్నారు. యూజీసీ సంస్కరణలను వ్యతిరేకిద్దాం వనపర్తి విద్యావిభాగం: రాష్ట్ర యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే యూజీసీ నూతన సంస్కరణలను ప్రతి విద్యార్థి వ్యతిరేకించాలని పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుకూరి పవన్కుమార్ పిలుపునిచ్చారు. యూ జీసీ సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ నెల 26న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించే సదస్సుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూజీసీ నూతన సంస్కరణలతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫెలోషిప్ల కోత పెట్టారన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా కుట్రలు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సాయికృష్ణ, రాకేష్, ప్రవీణ్, బీచుపల్లి, రాఘవేంద్ర, నరేష్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, ఆంజనేయులు, కార్తీక్, దాసురాం నాయక్ పాల్గొన్నారు. రామన్పాడులో 1,016 అడుగుల నీటిమట్టం మదనాపురం: రామన్పాడు జలశయంలో సో మవారం 1,016 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ కాల్వకు 28 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 57, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
● ఉమ్మడి జిల్లాలో 20 కాలేజీలు.. 1,600 సీట్లు ● ఈ నెల 31 వరకు దరఖాస్తులకు అవకాశం స్టేషన్ మహబూబ్నగర్: మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకుల కళాశాలలు కొనసాగుతుండగా.. వీటిలో 10 బాలుర, 10 బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. కాగా.. మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025– 26 ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31 వరకు ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఉమ్మడి జిల్లాలోని 20 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెండు ఒకేషనల్ మైనార్టీ బాలికల– 2 గురుకుల జూనియర్ కళాశాల (అడ్వాన్స్ అండ్ టాక్సేషన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ), బాలుర– 3 జూనియర్ కళాశాలలో (ఎంఎల్టీ, కంప్యూటర్ సైన్స్) 80 సీట్లు, మిగతా 18 జనరల్ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో చెరో 80 సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం.. ఒక్కో మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఒక్కో గ్రూప్లో 40 సీట్ల చొప్పున రెండు గ్రూప్ల్లో 80 సీట్లు ఉంటాయి.మైనార్టీలకు 75 శాతం రిజర్వేషన్ల ప్రకారం 30, (ముస్లింలకు 26, క్రిస్టియన్లు 2, జైన్స్, పార్సిస్, బుద్దిస్ట్, సిక్కులకు 2 సీట్లు), ఇతరులకు 25 శాతం రిజర్వేషన్ల ప్రకారం 10 (ఎస్సీ 2, ఎస్టీ 2, బీసీ 5, ఓసీ 1) సీట్లు కేటాయిస్తారు. నాణ్యమైన విద్య.. మైనార్టీ గురుకుల కళాశాలల్లో వి ద్యార్థులకు నాణ్యమైన విద్యతో పా టు మెరుగైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాం. విద్యా ర్థులు కళా శాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో ద రఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రవేశాలకు సంబంధించి మిగతా సమాచారాన్ని సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలి. – ఖాజా బాహుద్దీన్, ఆర్ఎల్సీ, మహబూబ్నగర్ -
‘రైతు హామీలు నెరవేర్చాలి’
ఆత్మకూర్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే నెరవేర్చాలని, సమస్యలన్నింటిని పరిష్కరించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మూడో మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాసన్న, ఉపాధ్యక్షులుగా భీమన్న, ప్రదీప్, కార్యదర్శిగా రాబర్ట్, సహాయ కార్యదర్శులుగా ఆర్ఎన్ కుమార్, మశప్పతో పాటు 15 మంది సభ్యులను ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, నాయకులు సీఎన్ శెట్టి, మోషా, భరత్, బాలరాజు, లింగన్న, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి కొత్తకోట రూరల్: పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఆదివారం కొత్తకోటలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన కృషితోనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. మహాత్ముడు బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు అందరం పునరంకితం అవుదామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బీచుపల్లి, ఏజే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, ఎల్లంపల్లి నరేందర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మయ్య, ఎజాజ్అలీ, తయ్యబ్, రఫీఖాన్, సంద వెంకటేశ్, వైశ్యసంఘం నాయకులు బాదం వెంకటేష్, రమేష్, ఆర్.వెంకటేష్, బాలరాజు యాదవ్, పసుపుల రమేష్, క్రాంతికుమార్, అంజి సాగర్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గోపాల్పేట: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని.. జిల్లాను క్రీడల హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రం నుంచి ఏదుట్ల వెళ్లే దారిలో హనీ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని.. అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. అనంతరం స్థానిక కార్యకర్తలతో మాట్లాడి స్థానిక విషయాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు సత్యశిలారెడ్డి, కొంకి వెంకటేశ్, శివన్న, కొంకి రమేశ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
మాధవరెడ్డి సేవలు మరువలేనివి
గోపాల్పేట: డా. మాధవరెడ్డి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో న్యూరోసర్జన్గా పనిచేస్తూనే జిల్లా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించారని.. ఆయన సేవలు మరువలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కొనియాడారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లెల మాధవరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి ఉచితంగా వైద్యసేవలు పొందిన ఎందరో పేదలు ఆయనను నేటికీ మర్చిపోలేదని గుర్తుచేశారు. మాధవరెడ్డి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల వనపర్తిలో జరిగిన సభలో ఖాసీంనగర్ ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టారని.. సంతోషించదగిన విషయమన్నారు. ఇదిలా ఉండగా వైద్య శిబిరంలో మహబూబ్నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రి నుంచి కంటి, పంటి, కీళ్ల నొప్పులకు సంబంధించిన వైద్యులు, నాగర్కర్నూల్ జిల్లా తూడుకుర్తిలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నుంచి పది మంది వైద్యులు, సిబ్బంది వచ్చి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే హైదరాబాద్ గ్రేస్ క్యాన్సర్ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు, సిబ్బంది క్యాన్సర్ నిర్ధారణ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. గోపాల్పేట, రేవల్లి, ఏదుల, పెద్దమందడి, వనపర్తి రూరల్ తదితర ప్రాంతాల నుంచి సుమారు ఆరు వేల మందికి పైగా రోగులు వచ్చిన వైద్య పరీక్షలు చేసుకున్నారు. వైద్య శిభిరానికి వచ్చిన ప్రజలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించారు. గ్రామాల నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించడంతో పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అడిగిన వెంటనే ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించిన డాక్టర్లు, సిబ్బందికి డా. చిన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆయన కుమారుడు జిల్లెల ఆదిత్యారెడ్డి, పరావస్తు ఫౌండేషన్ ఫౌండర్ మధుకర్స్వామి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
చంద్రగఢ్ కోట అభివృద్ధికి ప్రాధాన్యం
అమరచింత: చంద్రగఢ్ కోట చరిత్రను అధ్యయనం చేసి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ప్రాచీన చంద్రగఢ్ కోటను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించారు. కోట లోపల ఉన్న రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాతి కొలనులు, కోటను పరిశీలించి మాట్లాడారు. కోట, ఆలయ ప్రాచుర్యం, చరిత్రను వెలికి తీసేందుకు కృషి చేస్తామని.. కోట వద్ద మౌలిక సౌకర్యాల కల్పనకు ముందస్తుగా రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ నిధులతో కోటపై భాగానికి వెళ్లడానికి సీసీ రహదారి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోనే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉందని.. అక్కడి పర్యాటకులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కోటను చూడటానికి వస్తుంటారని, పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి పురావస్తుశాఖ అధికారులను పంపించి చరిత్రను గుర్తించి కోట అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శివకుమార్, ఎస్ఐ సురేశ్, కాంగ్రెస్పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి.. ఆత్మకూర్: గత పాలకుల నిర్లక్ష్యంతోనే పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని పరమేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే డా. వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పరమేశ్వరస్వామి ఆలయ చరిత్ర ఎంతో ఘనమైందని.. ఆలయంతో పాటు చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని, ఇందుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చాంద్పాషా, నాయకులు రహ్మతుల్లా, గంగాధర్గౌడ్, పరమేశ్, తులసిరాజ్, శ్రీను, సాయిరాఘవ, యాదగిరిశెట్టి, తెలుగు నాగేష్, మశ్ఛందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.25 లక్షలు మంజూరు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
అంతర్ జిల్లాల దారిలో.. అవస్థల ప్రయాణం
కేంద్రానికి ప్రతిపాదించాం.. స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో ప్రధానంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాలుగు రోడ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న రహదారుల మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి రోడ్ల ఆవశ్యకతను వివరించాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ -
జలం.. తగ్గుముఖం
రోజురోజుకు పడిపోతున్న భూగర్భ నీటిమట్టం రెండునెలలు గడ్డుకాలమే.. రానున్న ఏప్రిల్, మే మాసంలో భూగర్భ జలమట్టం మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా చెరువులు, రిజర్వాయర్లలో గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు కొంతమేర ఉండటం ఊరట కలిగిస్తున్నా.. పరిస్థితులు కఠినంగానే ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రెండునెలలు జిల్లా ప్రజలు, రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. వనపర్తి: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నాలుగు నెలల నుంచి వరుసగా భూగర్భ జలమట్టం తగ్గిపోతోంది. దీంతో జిల్లాలోని పానగల్, వనపర్తి, పెద్దమందడి, గోపాల్పేట, వీపనగండ్ల, కొత్తకోట, మదనాపురం తదితర మండలాల్లో సాగు చేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోనూ నీటినిల్వ తగ్గిపోవడం, జూరాల, భీమా, కేఎల్ఐ ప్రాజెక్టుల నుంచి సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో భూగర్భ జలాలు సైతం తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలో కొంతమేర స్థిరంగా ఉన్నా.. మార్చిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో చాలావరకు భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో 30 ఫిజియో మీటర్లు.. జిల్లావ్యాప్తంగా 15 మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో భూగర్భ జల పరిశోధనశాఖ ఆధ్వర్యంలో 30 ఫిజియో మీటర్లు (భూగర్భ జలాలను కొలిచే యంత్రాలు) ఏర్పాటు చేయగా ఇందులో 15 మాన్యువల్, మరో 15 ఆటోమేటిక్ పద్ధతిన పని చేస్తున్నారు. ప్రతినెల చివరి వారంలో భూగర్భ జలమట్టం ఎలా ఉందనే విషయాన్ని వీటి ద్వారా అధికారులు సేకరిస్తారు. ప్రస్తుతం సాగునీటి కాల్వల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. సాగునీరు సరిపడా అందక యాసంగి వరిసాగు చేసిన రైతులు పంటలు ఎండిముఖం పట్టడంతో లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా పంటలు కోత దశకు వచ్చిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వనపర్తి మండలం పెద్దగూడెం, శివారు ప్రాంతాల్లో సుమారు 80 ఎకరాల వరకు వరి పంటలు ఎండుముఖం పట్టినట్లు రైతులు చెబుతున్నారు. వరి పంటకు చివరి దశలో నీరందించకపోతే దిగుబడి తగ్గి నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్యను వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని చెబుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయా గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించి నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. ఫిబ్రవరిలో కొంత ఊరట.. జిల్లాలో గతేడాది అక్టోబర్ నుంచి వరుసగా భూగర్భ జలాలు తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలో కొంతమేర ఊరట కలిగించినా మార్చిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో తగ్గుతున్నాయి. – దివ్య జ్యోతి, ఏడీ భూగర్భ జలపరిశోధనశాఖ, వనపర్తి వట్టిపోతున్న బోరుబావులు.. ఎండుతున్న పంటలు మొదలైన సాగునీటి కష్టాలు లబోదిబోమంటున్న రైతులు -
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
● నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తా ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆత్మకూర్/అమరచింత/మదనాపురం: మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కాదని ప్రజలు తనను గెలిపించారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తానని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆత్మకూర్ మండలం తిప్పడంపల్లి, బాలకిష్టాపూర్లో పార్టీ జెండాలను ఆవిష్కరించడంతో పాటు తిప్పడంపల్లిలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అలాగే అమరచింత ఏడో వార్డులో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, మదనాపురం మండలం గోపన్పేటలో బీజేపీ జెండా ఆవిష్కరించి వివిధ పార్టీలకు చెందిన 40 మంది పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రం నిరుపేదలకు పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లని డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. అర్హులందరికీ ఇళ్లు ఇప్పిస్తానని, గ్రామాల్లో హైమాస్ట్ వీధిదీపాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే రేవంత్రెడ్డి పయనిస్తున్నారని.. కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుర కేంద్రాల్లో తాగునీటి ఇబ్బందులు దూరం చేయడానికే కేంద్రం అమృత్ 2.0 పథకం తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. జూరాల జలాశయంలో నీటినిల్వలు రోజురోజుకు పడిపోతున్నాయని.. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తాత్కాలిక మరమ్మతులకు నిధులు అవసరం ఉంటే తనను సంప్రదించాలని సూచించారు. ఆత్మకూర్లో జరిగిన కార్యక్రమంలో నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి, అశోక్జీ, అశోక్భూపాల్, అనీల్గౌడ్, మనోహర్, రాము, ఎల్లన్న, విష్ణురెడ్డి, శ్రీనివాస్, అమరచింతో జరిగిన కార్యక్రమంలో మంగ లావణ్య, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, రవికుమార్, పద్మజారెడ్డి, మేర్వ రాజు, భాస్కర్, మరాఠి అశోక్, వెంకటేశ్వర్లు, గోపన్పేటలో జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవం పోసినట్లయింది..
చంద్రగఢ్ ఎత్తిపోతల కింద మూడు ఎకరాల్లో వరి సాగుచేసే వాడిని. మరమ్మతులకు గురికావడంతో రెండున్నర ఏళ్లుగా సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం సాగునీరు వదులుతుండటంతో వరి పైరుకు జీవం పోసినట్లయింది. – ప్రభాకర్, రైతు, చంద్రగఢ్ మిగిలిన పథకాలు బాగుచేయాలి.. చంద్రగఢ్ ఎత్తిపోతలకు చిన్న చిన్న మరమ్మతులు చేపట్టి యాసంగి పంటలకు నీరు అందించడం హర్షణీయం. రైతుల ప్రయోజనాలకు కాపాడేందుకు బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు సైతం నిధులు మంజూరు చేయాలి. – రవి, రైతు, చంద్రగఢ్ ఎమ్మెల్యే చొరవతో .. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం స్టార్టర్ కాలిపోయిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి విన్నవించాం. సంబంధిత అధికారులతో మాట్లాడి అంచనాలు పంపడం, రూ.26 లక్షలు మంజూరు చేయించి పనులు పూర్తి చేయడం జరిగింది. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే చేసిన కృషి అభినందనీయం. – సర్వారెడ్డి, అధ్యక్షుడు, చంద్రగఢ్ ఎత్తిపోతల సంఘం ● -
హక్కులపై అవగాహన ఉండాలి
వనపర్తి: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు సూచించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లోని పౌరసరఫరాలశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. వినియోగదారులు ఎక్కడైనా, ఏవైనా వస్తువులు కొనేటప్పుడు నాణ్యత ప్రమాణాలు, గడువు ముగింపు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. నేటి కాలంలో ఆన్లైన్ వేదికగా చాలా మోసాలు జరుగుతున్నాయని.. ఏదైనా కొనుగోలు చేసి మోసపోతే ఆన్లైన్ ద్వారానే వినియోగదారుల ఫోరంను సంప్రదించవచ్చన్నారు. డిజిటల్ విధానంలో ఫిర్యాదు చేయడంతో పాటు వర్చువల్ హియరింగ్తో సకాలంలో సత్వర న్యాయం పొందవచ్చని.. ఈ సేవలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, డీటీలు, ఇతర అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు. -
ఏఐ ఆధారిత బోధన కేంద్రం ప్రారంభం
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మనిగిళ్ల ప్రాథమిక పాఠశాలలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్) ఆధారిత బోధన కేంద్రాన్ని శనివారం జిల్లా మానిటరింగ్ అధికారి మహానంది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు, నాలుగు, ఐదోతరగతి విద్యార్థులకు భాషా నైపుణ్యాలు, గణిత సామర్థ్యాల మీద పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏఐ విద్య ఉపయోగపడుతుందని వివరించారు. జిల్లాలోని 11 పాఠశాలలు ఎంపికకాగా.. అందులో మనిగిళ్ల పాఠశాల ఉందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ బాణం విష్ణు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు శాంతన్న, స్థానిక ప్రజాప్రతినిధులు తిరుపతిరెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్సాగర్, సురేష్, పల్లవి, హెచ్ఎం వెంకటేష్, రాముడు, లావణ్య, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 113 మంది విద్యార్థులు గైర్హాజరు కొత్తకోట రూరల్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంతో పాటు కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నివేదిత జూనియర్ కళాశాల, ప్రతిభ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. 4,917 మంది విద్యార్థులకుగాను 4,804 మంది హాజరయ్యారని.. 113 మంది గైర్హాజరైనట్లు వివరించారు. డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ పెబ్బేరు రూరల్: మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం జిల్లా వైద్యాధికారి డా. అల్లె శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలను పరిశీలించి సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. మండలంలోని నాలుగు ప్రైవేట్ వైద్యశాలలు, మూడు ల్యాబ్లు, 12 ప్రథమ చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేశామని చెప్పారు. స్థాయికి మించిన వైద్యం చేయరాదని ఆర్ఎంపీలు, పీఎంపీలను హెచ్చరించినట్లు వివరించారు. త్వరలోనే మండలంలోని అన్నిగ్రామాల్లో ఉన్న కేంద్రాలను తనిఖీలు చేస్తామని చెప్పారు. ఆయన వెంట డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బండారు శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్ ఉన్నారు. రామన్పాడులో 1,017 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శనివారం 1,017 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 69 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా లేదని చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 131 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
ప్రాధాన్యం ఇస్తున్నాం..
యూనివర్సిటీలో అధ్యాపకులు, ఇటు రీసెర్చ్ స్కాలర్ ఎంతో ఉత్సహంగా పరిశోధనలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కొన్ని పేటెంట్లు కూడా వచ్చాయి. దీని ద్వారా పీయూకు ప్రాజెక్టులు, రీసెర్చ్ పరమైన అంశాల్లో ముందంజ వేస్తున్నాం. నిర్మాణంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ఉంది. అది అందుబాటులోకి వస్తే పీయూ రీసెర్చ్ హబ్గా మారనుంది. అందులో పూర్తిస్థాయిలో ల్యాబ్లో అధునాతన ప్రయోగ పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం. – శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పాలమూరు యూనివర్సిటీ ● -
ఆవిష్కరణలకు గుర్తింపు
పీయూలో పరిశోధనలపై దృష్టి సారించిన అధ్యాపకులు ● ఇప్పటికే కెమిస్ట్రీ విభాగంలో పూర్తిస్థాయి పేటెంట్ హక్కులు ● డిజైన్ విభాగంలో రెండు, యుటిలిటీలో ఒకటి, పరిశీలనలలో మరొకటి ● గుర్తింపు వస్తే పూర్తిస్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశం పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకులు బోధనపైనే కాకుండా.. పరిశోధనలపై సైతం దృష్టిసారించారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న పరిశోధనలతో పలు అంశాల్లో పేటెంట్ రైట్స్ సైతం సాధించారు. మొత్తం కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకులు పర్యావరణహిత రీ ఏజెంట్లు, ఎలాంటి కెమికల్స్ లేకుండా సాధారణ పర్యావరణానికి అనుకూలమైన విధానంలో తయారు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ఓ మైలురాయి. దీనికి పేటెంట్ రైట్ రావడంతో టీచర్స్ అసోసియేట్ షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఫెల్లోషిప్ అధ్యాపకులు చంద్రకిరణ్ ఎంపికయ్యారు. మ్యాథ్స్ విభాగంలో అధ్యాపకులు రిమోట్ కంట్రోల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తయారీ, రోలర్ స్టాంప్ తయారీకి డిజైన్ విభాగంలో పేటెంట్ రాగా.. స్ట్రెచింగ్ షీట్పై కాసన్ నానోఫ్లూయిడ్స్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పంచే పద్ధతి వంటివి ఇటీవలే ఆవిష్కరించారు. ఇవి పరిశీలన దశలో ఉండగా.. మరో ఆవిష్కరణను ఎంబీఏ అధ్యాపకులు ఆన్లైన్ ట్రేడింగ్ ప్రిడెక్టర్ వంటి పరికరాలు ఆవిష్కరించారు. దీంతో ఇటు అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్స్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల అనంతరం ఒక కొత్త యంత్రాల ఆవిష్కరణతో జరిగే ప్రయోజనం వంటి అంశాలపై దృష్టిసారించారు. – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్● రోలర్ స్టాంప్ పరికరాన్ని మ్యాథ్స్ విభాగం అధ్యాపకులు మధు ఆవిష్కరించగా.. పేటెంట్ రైట్ లభించింది. గణితం అంటే భయపడే పాఠశాల స్థాయి విద్యార్థులకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా గణిత ప్రక్రియలను సులభతరం చేసేందుకు అవకాశం ఉంది. ● రసాయన శాస్త్రంలో కెమికల్స్ ప్రాసెసింగ్, ఏరో స్పేస్, బయో మెడికల్ ఇంజినీరింగ్ పారిశ్రామిక అనువర్తనాల్లో వేడి, ద్రవ్యరాశి బదిలీలో కీలకపాత్ర పోషిస్తున్న స్ట్రెచింగ్ షీట్పై కానస్ నానోఫ్లూయిడ్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పెంచే పద్ధతిలో కూడా మ్యాథ్స్ విభాగంలో పరిశోధనలు పూర్తి కాగా పేటెంట్ రైట్ పరిశీలనలో ఉన్నాయి. -
కీలకంగా పర్యావరణహిత రీ ఏజెంట్లు
రసాయన పరిశ్రమలు, ట్యాబ్లెట్లు, ఇతర పరిశ్రమల్లో కెమికల్స్ తయారు చేసేందుకు రీ ఏజెంట్లు ఎంతో కీలకంగా మారనున్నాయి. ఇందులో రీ ఏజెంట్లు మొదట తయారు చేసేందుకు పెద్ద పరిశ్రమలను స్థాపించడం, పెట్టుబడి, ఇతర పర్యావరణానికి నష్టం చేసే విధంగా ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కానీ, పీయూ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు చేసిన ప్రయోగాలు పూర్తిగా పర్యావరణ హితం కానున్నాయి. సాధారణ గది ఊష్టోగ్రతల వద్ద చిన్న గదుల్లో సైతం రీ ఏజెంట్లను శాసీ్త్రయ పద్ధతిలో తయారు చేసే విధానాన్ని కొనుగొనడంతో మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పేటెంట్ రైట్ ప్రకటించింది. ఇందులో అధ్యాపకులు చంద్రకిరణ్, సిద్ధరామగౌడ్, రీసెర్చి స్కాలర్ స్వాతి భాగస్వాములయ్యారు. వీటితోపా టు మరో 20 రీఏజెంట్లో పరిశోధనలో ఉన్నాయి. -
రిమోట్ కంట్రోల్తో ఆక్సిజన్..
పీయూ మ్యాథ్స్ విభాగంలో పేటెంట్ రైట్స్ దృష్టిసారించింది. ఇందులో డిజైన్ విభాగంలో శ్వాసకోశ రోగులకు ఆక్సిజన్ థెరపీ అందించేందుకు రిమోట్ కంట్రోలర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ రూపొందించారు. ఇందులో పేషెంట్ ఆరోగ్యం, పరిస్థితి తదితర అంశాలను కాన్సన్ట్రేటర్ పరిశీలించిన తర్వాత రోగికి ఆక్సిజన్ అందిస్తుంది. అయితే రోగికి మ్యానువల్ పద్ధతిలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండే నేపథ్యంలో కేవలం రిమోట్ కంట్రోల్ ద్వారా ఆక్సిజన్ను అవసరం మేరకు అందిస్తే ఇబ్బందులు తప్పనున్నాయి. ఇందులో పలు యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు శంకర్రావు, మధు, భారతి, సత్తమ్మ, లిపిక, అరుంధతి పాలుపంచుకున్నారు. -
నాణ్యతపై గొంతు విప్పండి
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంమనిషి సమగ్ర వికాసానికి న్యాయ పరిజ్ఞానం అవసరం అవుతుంది. సమాజంలో ప్రజలు ఉత్తమ వినియోగదారులుగా ఉండాలంటే చట్టాలను ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. మార్కెట్లో వ్యాపారులు చేసే మోసాలు గుర్తించి వాటిపై పోరాటం చేయడానికి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. లోపాలు ఉన్న వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో వాటి వల్ల వినియోగదారుడు నష్టపోతే దానిని ప్రశ్నించడానికి ఉన్న చట్టాలు ఉపయోగించుకోవాలి. మనుషులు ఉపయోగించే ప్రతి వస్తువును పరీక్షించి నాణ్యత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి వస్తువు అయినా సక్రమంగా లేకపోతే అలాంటి వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీపై పోరాటం చేసే అవకాశం వినియోగదారుడికి హక్కు ఉంది. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – మహబూబ్నగర్ క్రైం ● ప్రతి వస్తువు నాణ్యతను తెలుసుకోవాలి ● జిల్లాలో వినియోగదారుల హక్కుల కోసం ప్రత్యేక కోర్టు ● ఆశించిన స్థాయిలో ప్రచారం కల్పించని జిల్లా వినియోగదారుల కేంద్రం వినియోగదారుల ఫోరం కోర్టులో కేసుల వివరాలు (ఏడాది వారీగా ..)ఎలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది వినియోగదారులు ఎయిర్లైన్స్, మెడికల్, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్, టెలికాం, పోస్టల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇళ్ల నిర్మాణం, రవాణా, చిట్ఫండ్స్, వ్యవసాయం, కస్టమర్ గూడ్స్, కొరియర్ సర్వీస్, విద్యారంగం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వల్ల నష్టపోతే కేసులు వేయడానికి అవకాశం ఉంది. వినియోగదారుల్లో చైతన్యం రావాలి జిల్లాలో ప్రతిరోజు హక్కుల ఫోరానికి రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత బీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ రావడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన లేకుంటే 08542–245633 నంబర్కు ఫోన్ చేయాలి. – సృజన్కుమార్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరింటెండెంట్ ●మారిన చట్టం.. 1986 వినియోగదారుల రక్షణ చట్టం స్థానంలో 2019 వినియోగదారుల కమిషన్గా మార్పు చేశారు. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టంలో ఆన్లైన్లో లేని వస్తువులను లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా కొనుగోలు చేసిన వారికి హక్కులు వర్తించడం కోసం 2019 చట్టం పరిధిలో చేర్చారు. ఈ చట్ట ప్రకారం నాణ్యత లేని వస్తువులను ఉత్పత్తి చేసినందుకు, వాటిని విక్రయించడానికి ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలకు సైతం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల నుంచి పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించే విధంగా రూపొందించారు. అలాగే ఆన్లైన్ ద్వారా విక్రయించే వస్తువులకు సంబంధించి పూర్తి వివరాలతో మార్కెట్లోకి విడుదల చేయాలి. నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తే వస్తువులు ఉత్పత్తి చేసిన వారితో పాటు అమ్మిన వ్యక్తులపై కేసులు వేయడానికి చట్టంలో సవరణ తెచ్చారు. -
హోలీ.. సంబరాల కేళి
వనపర్తి: జిల్లావ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. మోదుగపూల రంగు నీళ్లకు బదులుగా.. దుకాణాల్లో లభించే రసాయన రంగులతో జిల్లాకేంద్రమైన వనపర్తితో పాటు వివిధ ప్రాంతాల్లో చిన్నారులు, యువత, మహిళలు పండుగ జరుపుకొన్నారు. యువత రంగులు వేసుకొని మోటార్ సైకిళ్లపై తిరుగుతూ కనిపించారు. గతంతో పోలిస్తే ఈసారి పురుషుల కంటే మహిళలు ఎక్కువగా హోలీ వేడుకల్లో కనిపించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో.. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులు, మీడియా మిత్రులతో కలిసి ఎస్పీ రావుల గిరిధర్ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బందికి రంగులు పూశారు. కార్యాలయ ఆవరణలో ఉట్టి కొట్టడం, జారుడు స్తంభం ఎక్కే పోటీలు నిర్వహించగా సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ తన చిన్నతనంలో హోలీ పండుగలో చోటు చేసుకున్న ఘటనలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. వేడుకల్లో ఇన్చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి సీఐ కృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్స్లో సత్తా చాటిన యువకుడు
గోపాల్పేట: మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన గురగల శేఖర్ గ్రూప్–2, గ్రూప్–3లో ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇటీవల వెలువడిన గ్రూప్–2లో 356 మార్కులతో రాష్ట్రస్థాయిలో 1,060 ర్యాంకు, శుక్రవారం విడుదల చేసిన గ్రూప్–3లో 273 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 879 ర్యాంకు సాధించారు. తన తల్లిదండ్రులు గురగల నర్సింహ, లక్ష్మీదేవమ్మ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తారని.. వారి సహకారంతోనే ఎలాంటి శిక్షణ లేకుండానే పోటీ పరీక్షలు రాశానని వివరించారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాల, ఆరు నుంచి పది వరకు తూడుకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ వనపర్తిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల, డిగ్రీ వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం (కంప్యూటర్స్) చదివానని చెప్పారు. అమరచింతలో.. అమరచింత: శనివారం వెలువడిన గ్రూప్–3 ఫలితాల్లో పట్టణానికి చెందిన కృష్ణమూర్తి 285 మార్కులతో రాష్ట్రస్థాయిలో 364 ర్యాంకు సాధించారు. ఆర్నెల్ల కిందట వెలువడిన గ్రూప్–4లో సత్తాచాటి హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసి గ్రూప్స్కు ప్రిపేర్ అయినట్లు తెలిపారు. జిల్లాకు 39 మంది జూనియర్ అధ్యాపకులు వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 39 మంది అధ్యాపకులను కేటాయించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శుక్రవారం తెలిపారు. ఇందులో రసాయన శాస్త్రం–7, ఆంగ్లం–6, వృక్షశాస్త్రం–5, చరిత్ర–5, జంతుశాస్త్రం–4, భౌతికశాస్త్రం–3, గణితం–2, తెలుగు–2, హిందీ–2, ఆర్థికశాస్త్రం–2, వాణిజ్యశాస్త్రం–1 ఉన్నారు. ఇప్పటి వరకు 25 మంది విధుల్లో చేరగా.. మిగిలిన 14 మంది రెండు, మూడు రోజుల్లో చేరుతారని డీఐఈఓ తెలిపారు. వైభవం.. శివపార్వతుల కల్యాణం కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి శివారులో ఉన్న దత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించగా.. అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం జరిపించారు. ఆది దంపతులకు అర్చకులు తలంబ్రాలు, ఆడపడుచులు అమ్మవారికి వడిబియ్యం పోశారు. కల్యాణ క్రతువు తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వచ్చిన భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. రామన్పాడులో 1,018 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శుక్రవారం 1,018 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని వివరించారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 187 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 126 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు. -
ప్రాథమిక స్థాయిలో కృత్రిమ మేధ
3, 4, 5 తరగతుల విద్యార్థులకు ‘ఏఐ’ బోధన● నేటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 66 స్కూళ్లలో నిర్వహణ ● నారాయణపేటలో గత నెల 25నే ప్రారంభం ● సత్ఫలితాలు ఇవ్వడంతో అన్నిచోట్ల అమలుకు చర్యలు ● కంప్యూటర్ ల్యాబ్లు, ఇతర పరికరాల ఏర్పాటు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధన గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల ద్వారా బోధన సాగుతుండగా.. విద్యార్థి అక్షర పరిజ్ఞానం, అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసి.. వాటిని మదింపు చేయడం అనుకున్నంత మెరుగ్గా జరగడం లేదు. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు చదువులో వెనకబడి పోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో విద్యార్థి విద్యా సామర్థ్యాలను మదింపు చేసేందుకు ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈకే స్టెఫ్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎంతో కీలకంగా మారింది. దీని సేవలను పాఠశాలలో వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదట పైలెట్ ప్రాజెక్టు కింద నారాయణపేటలో 10 పాఠశాలల్లో గత నెల 25న ప్రారంభించారు. అక్కడ సత్ఫలితాలు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన మరో 56 పాఠశాలల్లో శుక్రవారం నుంచి అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ ఇందుకోసం ఎంపిక చేశారు. హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తే ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కూడా వినియోగించేందుకు వీలుగా రూపొందించారు. ప్రతి జిల్లాలో నలుగురు రీసోర్సుపర్సన్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. వారు ఆయా జిల్లాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ల్యాబ్ల ఏర్పాటుకు దాదాపు అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు వచ్చినా ఇందులో టేబుళ్లు, కుర్చీలు, హెడ్ఫోన్స్, ఇంటర్నెట్ వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. జిల్లాల వారీగా ఇలా.. మరో 56 పాఠశాలల్లో.. స్థాయిని బట్టి బోధన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా చిన్నారులను ఆకట్టుకునేలా ఏఐ బోధన ఉంటుంది. ఎంపిక చేసిన 3, 4, 5 తరగతుల వారిని ఐదుగురిని ఒక బ్యాచ్గా విభజించి.. ఒక్కో బ్యాచ్కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తుంది. ఆ విద్యార్థి అర్థం చేసుకున్నాడా.. లేదా.. అని ఏఐ గుర్తించి అర్థం కాకపోతే సరళమైన మార్గంలో మళ్లీ బోధన అందిస్తుంది. ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయడానికి నివేదిక రూపొందిస్తాం. – రమేష్కుమార్, డీఈఓ, నాగర్కర్నూల్ సులభంగా ఉంది.. ఉపాధ్యాయులు పుస్తకాలతో ప్రతిరోజు పాఠ్యాంశాల బోధన చేస్తుంటారు. కానీ, ఇటీవల మా పాఠశాలలో కంప్యూటర్ ద్వారా చదువు చెబుతున్నారు. దీంతో పుస్తకాల్లోని అంశాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయి. చదవాలనే ఉత్సాహం మరింత పెరిగింది. – మీనాక్షి, 5వ తరగతి, నారాయణపేట అర్థం అవుతున్నాయి.. మా తరగతిలో విద్యార్థులు చాలా వరకు పాఠశాలకు గైర్హాజరు అయ్యేవారు. పాఠాలు అర్థం కాక హోంవర్క్ చేసుకుని రాకపోతే టీచర్లు కొడతారని డుమ్మా కొట్టేవారు. విద్యార్థుల స్థాయిని బట్టి కంప్యూటర్లో బోధన వేగంగా, నిదానంగా జరుగుతుండటంతో అన్ని విషయాలు బాగా అర్థం అవుతున్నాయి. – భార్గవ్, 5వ తరగతి, నారాయణపేట సామర్థ్యాల మదింపు.. ఎంపిక చేసిన పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు వెనకబడి ఉండే విద్యార్థులను గుర్తించి కంప్యూటర్ ముందు కూర్బోబెడతారు. ఇందులో ప్రధానంగా ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో విద్యార్థి అభ్యాసనా సామర్థ్యాలను పరిశీలించాల్సి ఉంది. ముందుగా విద్యార్థికి కేటాయించిన పెన్ నంబర్ (పర్మనెంటర్ ఎడ్యుకేషన్ నంబర్) ద్వారా ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ నంబర్ ఎంటర్ చేసిన ప్రతిసారి విద్యార్థి గత కొన్ని రోజులుగా చేస్తున్న పర్ఫామెన్స్, డెవలప్మెంట్, నేర్చుకున్న అంశాలు ఇందులో నిక్షిప్తమవుతాయి. -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
అమరచింత: ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర నాయకుడు కె.సూర్యం ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మార్క్స్ భవనంలో ఉమ్మడి మండలాల మాస్లైన్ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక, కర్షక చట్టాలకు వ్యతిరేకంగా నడుచుకుంటుందన్నారు. మోదీ ప్రభుత్వం అదాని, అంబానీలాంటి కార్పొరేట్ యాజమానులకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారి వ్యవస్థలు నడుపుకోవడానికి రాయితీలు ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్కు అప్పజెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి మనిషికి పని, పనికి భద్రత, విద్య, ఆరోగ్యం, కూడు, గూడు ప్రధానమైనవి కాగా.. కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని.. ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని నెరవేర్చలేకపోతోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి హన్మంతు, ప్రసాద్, రాజు, రాజన్న, ఆశన్న, సామేలు, ప్రేమరత్నం, మస్లమణి, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు. -
కిలోకు వంద గ్రాములు తరుగు..
నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంతోపాటు అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో మాంసం విక్రయాల్లో పెద్దఎత్తును మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల పరిధిలో మాంసం విక్రయదారులు సిండికేట్గా ఏర్పడి ధరలను నిర్ణయించడమే కాకుండా తాము చెప్పినట్లు, తాము తూకం వేసిందే సబబు అన్నట్లుగా దౌర్జాన్యాలు సాగిస్తున్నారు. కిలోకు సరాసరిగా వంద గ్రాముల చొప్పున తరుగు తీస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వినియోగదారులు మారు మాట్లాడకుండా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై వినియోగదారలు మున్సిపల్లో గాని, సంబంధిత శాఖ అధికారులకు గాని ఫిర్యాదు చేసినా కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పట్టించుకోవడం లేదు.. మాంసం విక్రయ కేంద్రాల్లో ఎక్కువగా తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. మటన్ మార్కెట్లో గొర్రె మాంసంను పొట్టేలు మాంసంగా చిత్రీకరించి అమ్ముతున్నారు. ఇంతే కాకుండా అనారోగ్యం కలిగిన మేకలు, గొర్రెలను కోసి వినియోగదారులకు అమ్ముతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఏటిగడ్డ శ్రీనివాసులు, నాగర్కర్నూల్ నాగర్కర్నూల్లో చేపల విక్రయం -
సమీకృతం.. అసంపూర్ణం
కొత్త పురపాలికల్లో మూడేళ్లవుతున్నా సాగని పనులు ఆత్మకూర్/అమరచింత/వనపర్తిటౌన్/కొత్తకోట రూరల్: పుర కేంద్రాల్లో కూరగాయలు, మాంసం విక్రయాలకుగాను అన్ని హంగులతో సమీకృత మార్కెట్యార్డు నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట శ్రీకారం చుట్టింది. అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఒక్కో నిర్మాణానికిగాను రూ.2 కోట్లు విడుదల చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం వెంటనే టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించినా నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. జిల్లాలోని కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత పురపాలికల్లో కాంట్రాక్టర్ల అలసత్వం, నిధుల లేమితో పనులు ముందుకు సాగడం లేదు. అన్ని పురపాలికల్లో నిర్మాణాలు సగమే పూర్తయ్యాయి. అప్పట్లో వేసిన టెండర్కు.. ప్రస్తుతం పెరిగిన ధరలకు వ్యత్యాసం ఉండటంతో అదనపు భారం అవుతుందని పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికితోడు పనులను పర్యవేక్షిస్తూ వేగం పెంచాల్సిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని చిరు వ్యాపారులు, పుర ప్రజలు కోరుతున్నారు. పనులు పూర్తి చేయాలి.. పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డు నిర్మాణం త్వరితగతిన పూర్తిచేస్తే రహదారులకు ఇరువైపులా కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులకు మేలు చేకూరుతుంది. అలాగే వాహనాల రాకపోకల ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారులు, వినియోగదారులకు సౌలభ్యంగా మారనున్న మార్కెట్ నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు, పాలకులు చొరవచూపాలి. – తోట రవి, కూరగాయల వ్యాపారి, ఆత్మకూర్ జిల్లాకేంద్రంలో పూర్తయినా నిరుపయోగంగానే.. రహదారులపై కూరగాయల విక్రయం రాకపోకలకు తప్పని అవస్థలు త్వరగా పూర్తిచేయాలంటున్న చిరు వ్యాపారులు -
వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు
వనపర్తి: జిల్లాలో సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో క్షయ, మధుమేహం, వడదెబ్బ తదితర అంశాలపై వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిషన్ మధుమేహలో భాగంగా 40 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేయాలన్నారు. ఇప్పటి వరకు 70 శాతం పూర్తయిందని.. ఈ నెల 25లోపు లక్ష్యం చేరుకోవాలని సూచించారు. మధుమేహం బారిన పడకుండా ఉండటానికి, వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా వాల్పోస్టర్లతో ప్రచారం చేయాలన్నారు. క్షయ అనుమానితులను గుర్తించి వందశాతం వైద్య పరీక్షలు చేయాలని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని ఆదేశించారు. ఇప్పటి వరకు 99 శాతం పూర్తయిందని.. మిగిలిన ఒక శాతం త్వరలోనే పూర్తి చేస్తామని ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్రెడ్డి తెలిపారు. తెమడ పరీక్షతో పాటు ఎక్సరే తీసి క్షయ నిర్ధారణ పకడ్బందీగా చేయాలని సూచించారు. మందులు అందుబాటులో ఉంచాలి.. వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి పని ప్రదేశాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, క్షయ ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్రెడ్డి, డా. రామచందర్రావు, డా. పరిమళ, బాసిత్ తదితరులు పాల్గొన్నారు. సహజ రంగులతో హోలీ జరుపుకోవాలి జిల్లా ప్రజలు సాంప్రదాయ పద్ధతిలో ప్రకృతిలో లభించే, చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని సహజ రంగులను వినియోగించి ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ హోలీ పండుగ జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే పండుగ జరుపుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు సున్నిత ప్రదేశాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, గుర్తు తెలియని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని చల్లడం నిషేధించామని వివరించారు. గుంపులుగా తిరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కార్యకలాపాలను గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
203 మంది గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని జాగృతి, విజ్ఞాన్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలు, పెబ్బేరు, శ్రీరంగాపురంలోని పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. మొత్తం 5,802 మంది విద్యార్థులకుగాను 5,599 మంది హాజరుకాగా.. 203 మంది గైర్హాజరైనట్లు వివరించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా వనపర్తి రూరల్/ఖిల్లాఘనపురం: వ్యవసాయ, గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఇన్చార్జ్ ప్రత్యేక అధికారి, చీఫ్ ఇంజినీర్ పాండే అధికారులకు సూచించారు. వేసవి ముందస్తు చర్యల్లో భాగంగా వనపర్తి మండలంరాజపేట ఉపకేంద్రం, ఖిల్లాఘనపురం మండలం మానాజీపేట విద్యుత్ సబ్స్టేషన్లో కొనసాగుతున్న 5 ఎంవీఏ అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో రాజపేట, అచ్యుతాపురం, నాగవరం తదితర పరిసర గ్రామాలు, తండాల్లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కొనసాగుతుందన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఈ రాజశేఖరం,డీఈలు శ్రీనివాసులు, వెంకటశివం, ఆనంద్బాబు, ఏఈ కొండయ్య అధికారులు జావీద్ అహ్మద్, చంద్రశేఖర్ ఉన్నారు. రాయితీ సద్వినియోగం చేసుకోవాలి ఆత్మకూర్: ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం కల్పించిన రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడిజిల్లా రిజిస్ట్రార్ రవీందర్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్థానికులకు ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించారు. అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2020లో రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ డబ్బుల చెల్లింపులో 25 శాతం రాయితీ లభిస్తుందని వివరించారు. ఈ అవకాశం నెలాఖరు వరకు ఉందని వినియోగించుకోవాలని కోరారు. సబ్ రిజిస్ట్రార్ ప్రకాశ్, ఆశీర్వాదం, అరుణ పాల్గొన్నారు. ‘కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు’ అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని మార్స్ భవనంలో జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. కార్మిక సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత రేవంత్ సర్కార్ 2024, జనవరిలో అడ్డగోలుగా 73 జీఓలను సవరించిందని.. అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల రూ.9,500 వేతనం కూడా పూర్తిస్థాయిలో చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కావెంజర్లకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదని, మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు సైతం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్, ప్రసాద్, హన్మంతు, సామెలు, రాజు, చెన్నయ్య, గణేష్ పాల్గొన్నారు. -
కొత్తకోట, పెబ్బేరులో అసంపూర్తిగా..
కొత్తకోటతో పాటు పెబ్బేరులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డుల నిర్మాణాలు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. కొత్తకోటలో పాత ఆర్అండ్బీ అతిథిగృహం స్థానంలో పనులు ప్రారంభించినా నేటికీ పూర్తి కాలేదు. 2022లో అప్పటి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డు నిర్మాణానికి రూ.2.20 కోట్లు మంజూరు చేసింది. అప్పటి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మొదట్లో పనులు వేగంగా జరిగినప్పటికి రెండేళ్లుగా పూర్తిగా ఆగిపోయాయి. దీంతో కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలు రోడ్డు పక్కనే కొనసాగుతున్నాయి. వారాంతపు సంత సైతం ప్రవేట్ స్థలంలో కొనసాగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపాలి.. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డు పనులు ప్రారంభించినప్పటికీ అదే ప్రభుత్వ పాలనలో పనులు ఆగిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించాలి. పట్టణంలో చేపలు, మాంసం, కూరగాయలు ఒక్కో ప్రాంతంలో విక్రయిస్తుండటంతో పుర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డు నిర్మాణం పూర్తయితే అన్ని ఒకేచోట లభిస్తాయి. – చీర్ల నాగన్నసాగర్, మాజీ కౌన్సిలర్, కొత్తకోట ● -
అమరచింతలో రహదారులపైనే..
పుర కేంద్రంలో గత ప్రభుత్వం సమీకృత మార్కెట్యార్డు నిర్మాణం ప్రారంభించినా నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. దీంతో ప్రధాన రహదారులకు ఇరువైపులా వారాంతపు సంత కొనసాగుతుండటంతో వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సంత నిర్వహణతో పాటు నిత్యం కూరగాయలు, పండ్ల విక్రయాలకు ప్రత్యేక స్థలం కేటాయించాలని పుర ప్రజలు కోరుతున్నారు. మార్కెట్లో చిరు వ్యాపారుల నుంచి పుర అధికారులు తైబజార్ వసూలు చేస్తున్నా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. -
జిల్లాకేంద్రంలో వృథాగా..
జిల్లాకేంద్రంలోని గంజి ప్రాంతంలో కూరగాయలు, మాంసం విక్రయాలకు అనువుగా రెండు అంతస్తుల్లో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సమీకృత మార్కెట్యార్డ్ నిరుపయోగంగా మారింది. గాంధీచౌక్, హనుమాన్ టేకిడీ, శంకర్గంజ్, కమాన్ చౌరస్తా, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చిరు వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా చేపలు, మాంసం విక్రయాలు కూడా సుమారు 10 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. వీరందరినీ సమీకృత మార్కెట్యార్డుకు తరలించాల్సి ఉన్నా నేటికీ అడుగులు పడటం లేదు. రూ.కోట్లు వెచ్చించిన భవనం అలంకారప్రాయంగా మారింది. -
రంగనాథస్వామి ఆలయంలో రాష్ట్ర కూటుల ఆనవాళ్లు
ఖిల్లాఘనపురం: మండలంలోని సల్కెలాపురం రంగనాథస్వామి ఆలయంలో రాష్ట్రకూటుల కాలపు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు డా. శివనాగిరెడ్డి తెలిపారు. ఆలయ చైర్మన్ తూము బుచ్చారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం ఆయన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో సుమారు 1,200 ఏళ్లనాటి చరిత్ర కలిగిన రాష్ట్రకూటుల స్తంభాన్ని, దానిపై చెక్కిన శిల్పాలను గుర్తించినట్లు తెలిపారు. దీని ఆధారంగా గ్రామంలో నాడే ఆలయం నిర్మించినట్లు తెలుస్తుందన్నారు. ఆల యం చుట్టూ నాటి వీరుల శిల్పాలు ఉన్నాయని.. ఇంతటి ప్రాధాన్యం ఉన్న స్తంభాన్ని, శిల్పాలను సంరక్షించాలని గ్రామస్తులకు సూచించారు. -
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
పాన్గల్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినుల ఫిర్యాదుకు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు ఒకరికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈఓ అబ్దుల్ ఘని బుధవారం రాత్రి తెలిపారు. ఉపాధ్యాయులు చిన్ననాగన్న, రఘురాంను సస్పెండ్ చేయడంతో పాటు కిరణ్కు షోకాజ్ నోటీసులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ప్రవర్తనపై ఈ నెల 6న విద్యార్థినులు ఎంఈఓకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. మరోమారు విచారణ చేసి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి డీఆర్డీఓ ఉమాదేవిని ఆదేశించడంతో ఆమె కూడా ఈ నెల 10న పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించి నివేదిక అందజేశారు. రెండు నివేదికల ఆధారంగా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నట్లు డీఈఓ వివరించారు. ‘ఆదర్శ’ దరఖాస్తు గడువు పొడిగింపు పెబ్బేరు రూరల్: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు పెబ్బేరు ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డా. తూర్పింటి నరేష్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీకి మారిందని పేర్కొన్నారు. ఐసీడీఎస్ను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం’ వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రైవేటీకరణలో భాగంగా ఐసీడీఎస్ను నిర్లక్ష్యం చేస్తోందని.. అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానం అనే చట్టాన్ని తీసుకొచ్చిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొత్త విధానం అమలైతే ఐసీడీఎస్ స్వతంత్రంగా ఉండదని.. అనేక మార్పులు చోటు చేసుకొని మూతబడే పరిస్థితికి దారి తీస్తుందని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 17, 18 తేదీల్లో 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చామని.. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇస్తామని ప్రకటించి నేటికీ అమలు చేయకుండా వెట్టిచాకిరి చేయించుకుంటోందని మండిపడ్డారు. మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చి వారికి 10 నెలలుగా వేతనాలు ఇవ్వలేదడం లేదని చెప్పారు. వెంటనే వారికి బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, నారాయణమ్మ, రాజేశ్వరి, శారద, రేణుక, లత, రామచంద్రమ్మ, సంగీత, భారతి, ఈశ్వరమ్మ, విజయ, సుమిత్ర పాల్గొన్నారు. ఆలయాల్లో అదనపు కమిషనర్ విచారణ అలంపూర్: అలంపూర్ ఆలయాల్లో దేవాదాయ ధర్మాదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు బుధవారం విచారణ జరిపారు. కొద్ది రోజులుగా ఆలయంలోని సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన సందర్శించారు. ఆలయాలకు సంబంధించిన భూములు, టెండర్ల వివరాలు, రోజువారి డీసీఆర్, క్యాష్ బుక్, అన్నదాన విరాళాలు, రసీదు బుక్కులను పరిశీలించారు. అలాగే అన్నదాన సత్రంలోని అన్న ప్రసాద వితరణ, ప్రసాదాల తయారీ, నాణ్యత, వాటి పరిమాణం, కౌంటర్లను తనిఖీ చేశారు. విచారణ నివేదికను దేవాదాయశాఖ కమిషనర్కు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,931 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,931, కనిష్టంగా రూ.5,800 ధరలు లభించాయి. కంది రూ. 6,910–రూ.6,540, మొక్కజొన్నరూ.2,335– రూ.19,66, పెబ్బర్లు రూ.6,210– రూ.5,521, జొన్నలు గరిష్టంగా రూ.4,270, కనిష్టంగా రూ.3,810, ఆముదాలు గరిష్టంగా రూ.6,075, కనిష్టంగా రూ.6,040, పత్తి రూ.5,100 ధరలు పలికాయి. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. బుధవారం ఉదయం 8.15కు జిల్లాకేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్కు వెళ్లి సీఎస్, డీఓలకు సూచనలు చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాల, పెద్దమందడి, ఖిల్లాఘనపురం పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షలు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బుధవారం పరీక్షకు 5,987 మంది విద్యార్థులకుగాను 5,837 మంది హాజరుకాగా.. 150 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. -
పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించండి
ఆత్మకూర్: పట్టణ ప్రజలు సకాలంలో పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. బుధవారం స్థానిక పుర కార్యాలయంలో అధికారులు, వార్డు ఇన్చార్జ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూలు లక్ష్యం రూ.2.23 కోట్లుకాగా.. ఇప్పటి వరకు రూ.1.13 కోట్లు వసూలయ్యాయని, సుమారు రూ.1.10 కోట్లు బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి మూడు వేలకు పైగా దరఖాస్తులు రిజిస్ట్రేషన్ కాగా.. కేవలం పది మంది మాత్రమే రుసుం చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ రాయితీ, పన్ను వసూళ్లపై ఇల్లిల్లూ తిరిగి అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ శ్రీపాద్, పుర కమిషనర్ శశిధర్, సబ్ రిజిస్ట్రార్ ప్రకాశ్ ఉన్నారు. -
పకడ్బందీగా పంట వివరాల నమోదు
వనపర్తి/కొత్తకోట రూరల్: జిల్లాలో పంట వివరాల నమోదు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో రైతు నాగరాజు పొలం వద్ద పంట వివరాల నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఏ రకం వరి వేశారు.. పంట సాగుకు అనుకూలమైన వాతావరణం ఉందా.. సరైన నీటి వనరులు ఉన్నాయా అనే వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ఎరువులు ఎక్కడ కొంటున్నారు?.. ట్రేడర్లు నాణ్యమైన మందులు, విత్తనాలు ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు. రైతులు సాగు చేసిన పంటకు సంబంధించి అన్ని వివరాలు పక్కాగా నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో వేగం పెంచాలి.. జిల్లాలో పంచాయతీరాజ్శాఖ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కొత్తకోట, పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణాలను ఆయన పరిశీలించారు. కొత్తకోట పాఠశాలలో సీబీఎఫ్ నిధులతో చేపడుతున్న ఆరు అదనపు తరగతి గదులు, బాలికల పాఠశాలలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మిస్తున్న రెండు తరగతి గదుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా కంచిరావుపల్లి పాఠశాలలోని రెండు మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా నెలాఖరులోగా పూర్తి కావాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్, కొత్తకోట, పెబ్బేరు తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, లక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈలు నరేష్, కార్తీక్, ఇతర అధికారులు ఉన్నారు. -
రంగనాథస్వామి ఆలయంలో రాష్ట్ర కూటుల ఆనవాళ్లు
ఖిల్లాఘనపురం: మండలంలోని సల్కెలాపురం రంగనాథస్వామి ఆలయంలో రాష్ట్రకూటుల కాలపు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు డా. శివనాగిరెడ్డి తెలిపారు. ఆలయ చైర్మన్ తూము బుచ్చారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం ఆయన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో సుమారు 1,200 ఏళ్లనాటి చరిత్ర కలిగిన రాష్ట్రకూటుల స్తంభాన్ని, దానిపై చెక్కిన శిల్పాలను గుర్తించినట్లు తెలిపారు. దీని ఆధారంగా గ్రామంలో నాడే ఆలయం నిర్మించినట్లు తెలుస్తుందన్నారు. ఆల యం చుట్టూ నాటి వీరుల శిల్పాలు ఉన్నాయని.. ఇంతటి ప్రాధాన్యం ఉన్న స్తంభాన్ని, శిల్పాలను సంరక్షించాలని గ్రామస్తులకు సూచించారు. -
దుర్వాసన వస్తోంది..
కొత్తకోటలో.. కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి ఆలయ సమీపంలో ఉన్న డంపింగ్యార్డును పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. పట్టణంలో సేకరించిన చెత్తను ఆటోలు, ట్రాక్టర్లలో తరలించి పట్టణ నడిబొడ్డున ఉన్న భవానీమాత ఆలయం ఎదురుగా ఉన్న ఖాన్చెరువు కట్టపై పోసి తగలబెడుతున్నారు. దీంతో ఉదయం వేళలో పొగతో పాటు దుర్వాసన వస్తుండటంతో పరిసరాల్లో ఉండే ఇళ్ల వారు, ఉదయపు నడకకు వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయ సమీపంలో మా ఇల్లు ఉంది. పట్టణంలో సేకరించిన చెత్తను చెరువుకట్టపై పోసి నిప్పంటించడంతో విపరీతమైన పొగతో పాటు వర్షాకాలంలో దుర్వాసన వస్తోంది. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. – రామచంద్రారెడ్డి, 1వ వార్డు, కొత్తకోట ● -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. బుధవారం ఉదయం 8.15కు జిల్లాకేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్కు వెళ్లి సీఎస్, డీఓలకు సూచనలు చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాల, పెద్దమందడి, ఖిల్లాఘనపురం పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షలు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బుధవారం పరీక్షకు 5,987 మంది విద్యార్థులకుగాను 5,837 మంది హాజరుకాగా.. 150 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. -
భవిష్యత్ అంతా యువతదే..
వనపర్తి: యువత సంస్కారవంతంగా, బాధ్యతాయుతంగా ఉండాలని.. భవిష్యత్ అంతా వారిదేనని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నెహ్రూ యువకేంద్రం, మహబూబ్నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి ‘యువ ఉత్సవ్–2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడా లేని యువశక్తి మన దేశంలో ఉందని, వారు సరైన మార్గం ఎంచుకుంటే ప్రపంచంలో మనకు తిరుగులేదని పేర్కొన్నారు. యువత తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని అందులో గొప్పగా రాణించాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు, సాటివారిని గౌరవించే తత్వాన్ని అలవర్చుకోవాలని.. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుత ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని వివరించారు. అనంతరం సైన్స్ మేళాను ఆయన తిలకించి చక్కటి ఎగ్జిబిట్లు తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. యువ ఉత్సవ్లో భాగంగా 15 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు యువతకు నిర్వహించిన కవిత్వం, చిత్రలేఖనం, సైన్స్ మేళా, ఉపన్యాసం తదితర పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు కోటనాయక్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. జగన్, జిల్లా సైనన్స్ అధికారి శ్రీనివాస్, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ రాజేందర్, తెలుగు అధ్యాపకుడు ఎజ్జు మల్లయ్య, నిస్వార్థ ఆర్గనైజేషన్ సభ్యుడు అరవింద్, నెహ్రూ యువకేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్లు రాజేందర్గౌడ్, అనిల్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్–1లో సత్తాచాటిన వడ్డెవాట యువకుడు
కొత్తకోట రూరల్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మండలంలోని వడ్డెవాటకు చెందిన మండ్ల పవన్కుమార్ 510 మార్కులు సాధించి సత్తా చాటారు. తండ్రి వెంకటస్వామి స్థానిక సర్కిల్ కార్యాలయంలో రైటర్గా పనిచేస్తున్నారు. ఉత్తమ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు. సమయస్ఫూర్తి కోల్పోవద్దు వనపర్తిటౌన్: అతి తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఆశ, అత్యాశతోనే ఉన్న నగదును కోల్పోవాల్సి వస్తోందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, వనపర్తి సీనియర్ సివిల్కోర్టు న్యాయమూర్తి వి.రజని అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రధానమంత్రి కౌశల్ యోజన శిక్షణ కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు చూపే ఆశకు లోనుకాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. తెలియని వెబ్సైట్లను ఓపెన్ చేసి అనవసర ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేసేందుకు న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహాలు, పోక్సో, మోటార్ వెహికిల్, బాలకార్మిక వ్యవస్థ తదితర చట్టాల గురించి వివరించారు. శిక్షణ కేంద్రం నిర్వాహకుడు చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. మహిళా సాధికారతకు పాటుపడాలి మదనాపురం: మహిళా సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల కోరారు. సోమవారం రాత్రి మండలంలోని అజ్జకొల్లులో ఐద్వా గ్రామకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రీబాయి పూలే వర్ధంతి కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మహిళా రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ అధ్యక్ష కార్యదర్శులు స్వాతి, లక్ష్మి, భాగ్యలక్ష్మి, రేణుక, రమాదేవి, శిరీష, కృష్ణవేణి పాల్గొన్నారు. ఆ భూములు గిరిజనులకే దక్కాలి ఊర్కొండ: గిరిజనులకు సంబంధించిన భూములు వారికే దక్కాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ అన్నారు. మండలంలోని గునగుండ్లపల్లి పంచాయతీ రెడ్యాతండా సమీపంలోని ఊర్కొండపేట రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నం.186లో గల 109 ఎకరాల అసైన్డ్ భూమి తరతరాల నుంచి గిరిజనుల స్వాధీనంలో ఉందని, ఆ భూమిని ప్రస్తుతం ఇతరులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో తండావాసులు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం రెడ్యాతండాను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు సందర్శించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అసైన్ భూములు గిరిజనులకు దక్కే విధంగా చూస్తామని, అదేవిధంగా తండా ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినప్పటికీ వారు ఏనాడు కూడా ఇక్కడ సేద్యం చేయలేదని, అలాంటి వారు ఇప్పుడు గిరిజనులను మా భూములు మాకే చెందుతాయని భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. గిరిజనులకు సంబంధించిన భూములను గిరిజనులకు చెందేలా తనవంతు కృషిచేస్తానన్నారు. అధికారులు ఎలాంటి తప్పిదాలు చేయకుండా అసైన్డ్ భూములు నిరుపేద గిరిజనులకు దక్కేలా చూడాలని ఆదేశించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చామని, గిరిజన నాయకులు మాట్లాడిన విధానం చూస్తుంటే ఇక్కడ కొందరు కావాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలుస్తుందని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు వాస్తవాలను నెల రోజుల్లో తెలియజేసేలా చూడాలని సూచించారు. -
పందుల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఆత్మకూర్లో పందుల దొంగతనానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆత్మకూర్లోని పరమేశ్వరస్వామి చెరువుకట్ట సమీపంలో చెన్నయ్య షెడ్ వేసుకొని 73 పందులను పెంచుతున్నారు. ఫిబ్రవరి 16న బింగిదొడ్డి అంజి, మాదిరె మహేష్, నందవరం బాలరాజు రెక్కి నిర్వహించి పందులు ఉన్నట్లు ఎరుకలి భీమన్న, కందేనతి సుంకన్నకు సమాచారం ఇచ్చారు. 17వ తేదీన అందరూ కలిసి ఎరుకలి సిద్ధప్ప బొలెరో వాహనంలో సింధనూర్ నుంచి బయలుదేరి మార్గమధ్యంలో ఎరుకలి అంజి, ఎరుకలి నాగరాజును ఎక్కించుకొని ఎమ్మిగనూర్కు వచ్చి అక్కడ ఎరుకలి భీమన్న, గుల్లి నాగరాజు, కందెనతి సుంకన్న, మదిరె మహేశ్, హోలిగుంది అంజి కలిసి అదేరోజు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో 30 పందులను వాహనంలో ఎక్కించారు. కాపలాగా ఉన్న ఇద్దరు లేచి అరుస్తూ దగ్గరగా వస్తుండగా వారిపై గాజు సీసాలు, రాళ్లతో దాడిచేయగా గాయాలయ్యాయి. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కొని మార్గమధ్యంలో జూరాల జలాశయంలో పడేసి వెళ్లి బెంగుళూరులో రూ.90 వేలకు విక్రయించారు. ఇలా దొరికారు.. మంగళవారం ఉదయం సిద్ధప్ప తన బొలెరో వాహనంలో హోలిగుంది అంజి, సిరిగెరి నాగరాజు, బింగిదొడ్డి అంజి కలిసి దొంగతనం చేయడానికి అమరచింత వైపు వస్తున్నారు. మస్తీపూర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా గమనించి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారిస్తే గతంలో వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల, పెద్దమందడి మండలం దొడగుంటపల్లి, గద్వాల జిల్లాలోని అలంపూర్, శాంతినగర్, అయిజ, కర్నూల్ జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూర్, నందవరం, మాధవరం, కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్, మస్కి, హుబ్లి, సింధనూర్ ప్రాంతాల్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి బొలెరో వాహనం, రూ.90 వేల నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ, అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, ఆత్మకూరు సీఐ శివకుమార్, ఆత్మకూరు ఎస్ఐ నరేందర్, అమరచింత ఎస్ఐ సురేష్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
జిల్లాకేంద్రంలోనూ..
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంతో పాటు విలీన గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదు. ఇటీవల జరిగిన పుర బడ్జెట్లో వెనుకబడిన, మురుగువాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు అన్నీ వార్డుల్లాగే రూ.60 లక్షలు ప్రతిపాదించారు. 21, 23 కొత్త కాలనీలు, 6, 13, 15, 22 వార్డులు, కొత్తగా వెలుస్తున్న శివారు కాలనీలైన 11, 10, 12, 4 వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లో మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది. పుర కార్యాలయం ఎదుట కూడా డ్రెయినేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. పాతబజార్లో రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నచోట కాల్వల నిర్మాణాలు మధ్యలోనే వదిలేశారు. రహదారి విస్తరణ అరకొరగా చేపట్టిన పాన్గల్ మార్గంలోనూ కొన్నిచోట్ల డ్రెయినేజీలు శిథిలావస్థకు చేరుకోగా.. మరికొన్ని చోట్ల మధ్య మధ్యలో పూర్తి చేయాల్సి ఉంది. దీనికితోడు తాళ్ల చెరువు అలుగు కాల్వను పూర్తిస్థాయిలో ఆధునికీకరించకపోవడంతో మురుగు నిలిచి ఉంటుంది. మర్రికుంట, నర్సింగాయపల్లి, శ్రీనివాసపురం తదితర విలీన గ్రామాల్లోనూ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. -
‘ఎల్ఆర్ఎస్’ వేగవంతం చేయాలి
వనపర్తి: జిల్లాలోని ఐదు పురపాలికల్లో ప్లాట్ల క్రమబద్దీకరణకు సుమారు 25 వేల మందికి నోటీసులు జారీ చేసినా.. ఆశించినస్థాయిలో ఫలితం కనిపించడం లేదని, లేఅవుట్లు చేసిన వారు, బిల్డర్లు, ప్లాట్ల యజమానులకు వార్డు అధికారులతో ఫోన్ చేయించి డబ్బులు కట్టించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పుర కమిషనర్లు, టౌన్ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లతో ఎల్ఆర్ఎస్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ ఉంటే ప్లాట్కు రక్షణ ఉంటుందని, ఎవరూ ఆక్రమించడానికి అవకాశం ఉండదని, పురపాలిక ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్లో ప్లాట్ విక్రయించాలనుకున్నా ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్కు మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారి నుంచి డబ్బులు వసూలు చేసి క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు 25 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించిందని.. తర్వాత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ప్రస్తుత మార్కెట్ విలువకు 14 శాతం జరిమానా చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని.. ఎట్టి పరిస్థితిలోను అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. అనంతరం ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించిన ప్లాట్ల యజమానులకు కలెక్టర్ క్రమబద్ధీకరణ ఉత్తర్వు కాపీలు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు యూనివర్సిటీలో 27, 28 తేదీల్లో వర్క్షాప్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కన్వీనర్ అర్జున్కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు. -
పురం.. అపరిశుభ్రం
మున్సిపాలిటీల్లో రహదారులపై పారుతున్న మురుగు అమరచింత: జిల్లాలోని పురపాలికల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అమరచింత, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరులో నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో మురుగు రహదారులపై పారుతుండటంతో పాటు ఇళ్ల నడుమ నిలిచి మురుగు కుంటలను తలపిస్తున్నాయి. వరాహాలు, దోమల వ్యాప్తిచెంది ప్రజలు అనారోగ్యం బారినపడి ఆస్పత్రుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో పెద్ద గ్రామపంచాయతీలను పురపాలికలుగా మార్చే సమయంలో సమీప గ్రామాలను విలీనం చేశారు. పెబ్బేరులో చెలిమిళ్ల, ఆత్మకూర్లో ఖానాపురం గ్రామాన్ని విలీనం చేయడంతో ఆయా గ్రామాలు పురపాలికలోని వార్డుగా మారడంతో ఆయా గ్రామాల్లో మున్సిపాల్టీ నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కొత్త పురపాలికలకు ఆదాయ వనరులు సరిగా లేకపోవడంతో వచ్చే బడ్జెట్ నుంచే సీసీ రహదారులు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలి. కానీ పూర్తిస్థాయిలో డ్రెయినేజీలు నిర్మించడంలో పుర పాలకులు విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. అవసరం ఉన్న చోట్ల వదిలి ఇతర ప్రాంతాల్లో కాల్వల నిర్మాణాలు చేపట్టడంతో పుర నిధులు వృథా అయ్యాయన్న ఆరోపణలున్నాయి. పాలకుల నిర్లక్ష్యం.. ఎన్టీఆర్ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక ఇబ్బందులు పడుతున్నాం. పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకమండలి పదవీకాలం ముగిసి మూడు నెలలు గడుస్తున్నా అధికారులు డ్రెయినేజీల్లోని మురుగు తొలగించే చర్యలు చేపట్టడం లేదు. పుర కమిషనర్ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. – లాల్కోట రవి, 7వ వార్డు, కొత్తకోట డ్రెయినేజీ అస్తవ్యస్తం.. జోగినీకాలనీలో ఏళ్లుగా మురుగు వ్యవస్థ అధ్వానంగా ఉంది. మున్సిపాలిటీగా మారినా నేటికీ కొత్త డ్రెయినేజీలు నిర్మించడం లేదు. దీంతో ఇళ్ల నుంచి వస్తున్న మురుగంతా రహదారులపై పారుతోంది. అధికారులు స్పందించి మురుగు కాల్వలు నిర్మించాలి. – వెంకటేష్, 7వ వార్డు, అమరచింత మురుగు పేరుకుపోయింది.. పట్టణంలోని 2వ వార్డులో మురుగు సమస్య తీవ్రంగా ఉంది. చెరువు కాల్వ పూడుకుపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నిలిచి పరిసరాల్లో దుర్వాసన వస్తోంది. దీనికితోడు దోమల బెడద తీవ్రంగా ఉంది. అధికారులు స్పందించి మురుగు తొలగించడంతో పాటు డ్రెయినేజీ నిర్మించాలి. – చింతకుంట వెంకటేష్, 2వ వార్డు, అమరచింత ● ఆత్మకూర్లో ఆశించిన స్థాయిలో కాల్వల నిర్మాణం పూర్తిగాకపోవడంతో మురుగు రహదారులపై పారుతోంది. విలీన గ్రామమైన ఖానాపురం గ్రామంలో సైతం డ్రైనేజీలు నిర్మించాల్సి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ● పెబ్బేరు పురపాలికలో మురుగు వ్యవస్థ కాస్త మెరుగ్గా ఉన్నా.. వనపర్తి రోడ్లో రహదారి విస్తరణ పనులు చేపట్టడంతో కాల్వలు దెబ్బతిన్నాయి. దీంతో మురుగు రహదారిపై పారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీవాసులు వాపోతున్నారు. విలీన గ్రామమైన చెలిమిళ్లలో సైతం డ్రెయినేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ● కొత్తకోట పురపాలికలో 15 వార్డులు, సుమారు 25 వేల జనాభా ఉంది. ఆయా వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో మురుగంతా రహదారులపైనే పారుతోంది. పట్టణంలోని విద్యానగర్కాలనీలో ఉన్న కాల్వల్లో మురుగు పేరుకుపోయినా తొలగించడం లేదు. దీంతో దోమలు, పందుల బెడద అధికమైంది. పలు వార్డుల్లో అవసరం మేరకు డ్రెయినేజీలు నిర్మించలేదు. పురపాలికల వారీగా ఇలా.. నివేదిక తయారు చేస్తాం.. పురపాలికలో డ్రెయినేజీల నిర్మాణం ఎక్కడెక్కడ చేపట్టాలో పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి నిధుల మంజూరుకుగాను ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. పట్టణంలోని 2, 7వ వార్డులో డ్రెయినేజీలు లేవని మా దృష్టికి వచ్చింది. నిర్మాణాలకు అవసరమయ్యే నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం. – రవిబాబు, పుర కమిషనర్ అమరచింత పట్టించుకోవడం లేదు.. కాలనీలో డ్రెయినేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల ఆవరణలో మురుగు నిలుస్తోంది. దుర్వాసనతో పాటు దోమల బెడద అధికమైంది. సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. – జయమ్మ, అంబేడ్కర్చౌక్ సమీపకాలనీ, వనపర్తి ● అమరచింత మున్సిపాలిటీలో పది వార్డులుండలు 2, 7 వార్డుల్లో సీసీ రహదారులు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపట్టలేదు. 7వ వార్డులో మురుగు కాల్వలు లేక ఇళ్ల నుంచి వస్తున్న మురుగును రహదారులపై వదలుతున్నారు. దీంతో కాలనీలో దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద అధికంగా ఉండటంతో ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. ముందుకుసాగని డ్రెయినేజీల నిర్మాణాలు చేసిన తీర్మానాలు.. ప్రతిపాదనలకే పరిమితం దోమలు, వరాహాల సంచారంతో జనం బెంబేలు -
ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించండి
వనపర్తి: ప్రజావాణికి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 51 అర్జీలు వచ్చాయని.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవిలో జాగ్రత్తలు పాటించాలి.. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురికాకుండా ప్రజలు ముందుజాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. కలెక్టరేట్లో డీఎంహెచ్ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్పీసీసీహెచ్, హీట్ వేవ్ టాస్క్ఫోర్స్ కమిటీలతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పనులు చేసుకోవాలని.. అత్యవసర పనులు ఉంటేనే మధ్యాహ్నం బయటకు వెళ్లాలని సూచించారు. అన్నిశాఖల అధికారులు ఎండల తీవ్రతపై అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎవరికైనా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలన్నారు. శిశువులు, బాలబాలికలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం వైద్యారోగ్యశాఖ రూపొందించిన ‘వడదెబ్బ నుంచి రక్షించుకుందాం ‘ వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
ఖిల్లాఘనపురం: విద్యార్థులకు చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి వి.రజని అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాల్యవివాహాలు జరిపించే వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. అదే విధంగా సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్చేసి లాటరీ తగిలింది.. మీ ఖాతాకు డబ్బులు వస్తాయి.. ఓటీపీ చెప్పాలని అడిగితే చెప్పరాదన్నారు. ఫోన్లో ఏదైనా గుర్తుతెలియని లింక్ వచ్చినా ఓపెన్ చేయరాదన్నారు. ఎవరికై నా న్యాయ సేవలు అవసరమైతే 15100 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా కరాటే విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంఈఓ జయశంకర్, హెచ్ఎంలు మునవర్ సుల్తానా, లలిత, ప్రశాంతి, సఖి లీగల్ కౌన్సెల్ డి.కృష్ణయ్య, పారా లీగల్ వలంటీర్ అహ్మద్, కరాటే మాస్టర్ శేఖర్, వరుణ్, శివ పాల్గొన్నారు. -
కనుచూపు మేరలోనే..
పర్యాటక ప్రాంతమైన సోమశిలకు నిత్యం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఇక్కడికి రావడం నిత్యకృత్యం. సోమశిలలోని టూరిజం కాటేజీలు, పుష్కరఘాట్ల వద్ద నుంచి చూస్తే.. అలవి వలలతో చేపల వేట సాగించే మత్స్యకారుల గుడారాలతో పాటు నదీ తీరానికి రెండు వైపులా ఆరబెట్టిన చేపపిల్లలు కనిపిస్తాయి. కానీ ఎవరూ అటువైపు కన్నెత్తి చూడరు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోలు, అమరిగిరిలోని నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అలవి వలల గుడారాలే కనిపిస్తాయి. -
అన్ని పోలీస్స్టేషన్లకు అధునాతన కంప్యూటర్లు
వనపర్తి: మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అధునాతన కంప్యూటర్లు అవసరమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని స్టేషన్ల అధికారులకు కంప్యూటర్లు, ప్రింటర్లు, అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడే పోలీసు శాఖలో జిల్లాలోని అన్ని గ్రామాలు, విభాగాల సమాచారం అందుబాటులో ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల పరిధిలోని గ్రామాల వివరాలతో పాటు నేర సంబంధిత విషయాలను భద్ర పరచడానికి, సులభంగా తెలుసుకోవడానికి సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అధునాతన కంప్యూటర్లతో పోలీసు ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారన్నారు. ● పోలీసు ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు ప్రజావాణికి మొత్తం తొమ్మిది ఫిర్యాదులు అందాయని.. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత సీఐ, ఎస్ఐలకు సూచించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ, ఇన్చార్జి అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐలు కృష్ణ, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ శివకుమార్, సిబ్బంది సుదర్శన్, భరత్ పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు పాన్గల్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని.. మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల మహిళా సమాఖ్య భవనంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాన్గల్ మండల మహిళా సమాఖ్యకు రూ. 36లక్షల విలువగల ఆర్టీసీ అద్దె బస్సును కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా 150 మండలాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించగా.. అందులో పాన్గల్ మండల మహిళా సమాఖ్య ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ ఆదర్శ్ సురభిలకు మహిళా సమాఖ్య తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్ యాదవ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ ఎంపీటీసీ హైమావతి పాల్గొన్నారు. 23న సీపీఐ శతాబ్ధి ఉత్సవాలు వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలో ఈ నెల 23న నిర్వహించే సీపీఐ శతాబ్ధి ఉత్సవాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని జిల్లా కార్యదర్శి విజయరాములు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో కె.శ్రీరామ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హాజరవుతారన్నారు. ఉత్సవాలకు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, నాయకులు చంద్రయ్య, భాస్కర్, రమేశ్, రాబర్ట్, మోష, అబ్రహం, నర్సిహయ్య శెట్టి, శ్రీహరి ఉన్నారు. -
మిగిలింది 20 రోజులే..
మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే ● సీఎం ఇలాఖాలో 57 శాతమే వసూలుతో రాష్ట్రస్థాయిలో 63వ స్థానం ● ఉమ్మడి జిల్లాలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లే దిక్కు ● ప్రత్యేకంగా సోమ, గురువారాల్లో రెవెన్యూ మేళాలు ● గడువు నేపథ్యంలో పరుగులు పెట్టిస్తున్న ప్రత్యేకాధికారులు నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు ఆస్తి పన్ను రాబడి కీలకం. నివాసగృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్ అధికార యంత్రాంగం డిజిటల్ చెల్లింపులపై దృష్టిసారించింది. క్యూఆర్ కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా మున్సిపాలిటీ ఖాతా లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలతోనే మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు అధికారులు ఒక అడుగు ముందుకు.. మూడు అ డుగులు వెనక్కి పడినట్లు చెబుతున్నారు. అయితే ము న్సిపాలిటీల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వసూలు అంతంత మాత్రమే ఉండటం.. టార్గెట్ చేరుకునేందుకు కేవలం 20 రోజులే ఉండటంతో అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. 80 శాతంతో నాలుగో స్థానం.. రాష్ట్రస్థాయిలో పన్నులు వసూలు చేయడంలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 4 వేల ఆస్తులకు రూ.98 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.78 లక్షలు (80 శాతం) వసూలు చేశారు. రాష్ట్రస్థాయిలో 63వ స్థానం.. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో 5,332 ఆస్తులకు రూ.1.94 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లు (57 శాతం) వసూలు చేశారు. దీంతో ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 63వ స్థానంలో నిలిచింది. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లపూర్లో సైతం 6,406 ఆస్తులకు రూ.1.28 కోట్లకు రూ.72 లక్షలు వసూలు (56 శాతం) చేశారు. ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 68వ స్థానంలో నిలిచింది. అదనపు కలెక్టర్లకు బాధ్యతలు.. ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు మున్సిపల్ రెవెన్యూ, బి ల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వారం రోజులుగా ప్రత్యేక దృష్టిసారిస్తూ రోజూవారిగా పన్నుల వసూళ్లపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, రివిజన్ పిటిషన్ సహా ఇతర సమస్యల పరిష్కారం కోసం సోమ, గురువారాల్లో ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మున్సిపాలిటీల్లో రెవెన్యూమేళా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీల్లో ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ప్రాపర్టీ పేరు మార్పు, మ్యూటేషన్, ఇంటి నంబర్ కేటాయింపు లేదా మార్పు వంటి సేవలు పొందవచ్చు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆస్తులు పన్నులు, వసూలు (రూ.కోట్లలో) రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లేక.. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులే దిక్కయ్యారు. మున్సిపాలిటీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో పన్నుల వసూలు చేయడంలో జాప్యం జరుగుతుందని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. రెవెన్యూకు సంబంధించిన విషయం కావడంతో ప్రధాన మున్సిపాలిటీల్లో తప్పా కొత్తగా ఏర్పాటైన వాటిలో ఇప్పటి వరకు ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని సమాచారం. పన్నులు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండటం మరో సమస్యగా చెబుతున్నారు. లక్ష్యం చేరుకుంటాం.. ప్రతి ఏడాది మార్చిలోనే అత్యధికంగా పన్నులు వసూలు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి పట్టణ ప్రజలు, వ్యాపారులు తమ ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలి. గత వారం రోజులుగా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు కృషిచేస్తున్నాం. – భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట -
లోక్అదాలత్లో 6,266 కేసులు పరిష్కారం
వనపర్తిటౌన్: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న కేసులను లోక్అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు చెప్పారు. ఏడు బెంచ్ల ద్వారా 2,663 క్రిమినల్, 8 సివిల్, 3,595 ప్రీ లిటిగేషన్ కేసులతో కలిపి మొత్తం 6,266 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్అదాలత్ గొప్ప అవకాశమన్నారు. కక్షిదారులు సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు కోర్టు ఫీజు వాపస్ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్జడ్జి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి బి. రవికుమార్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి జానకి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి బి. శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా చెస్ పోటీలు వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో శనివారం జూనియర్, సీనియర్స్ విభాగాల్లో చెస్ పోటీలు నిర్వహించారు. ముందుగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి, కార్యదర్శి వేణుగోపాల్, ఆర్థిక కార్యదర్శి టీపీ కృష్ణయ్య పోటీలను ప్రారంభించగా.. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూనియర్ విభాగంలో పి.కృతిక, వైష్ణవి, సీనియర్స్ విభాగంలో ఎం.వేణుగోపాల్, పి.మోహన్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండోర్ స్టేడియంలో ప్రతినెలా రెండో శనివారం, ఆదివారం చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సీఎంను కలిసిన పీయూ వీసీ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీయూకు మంజూరైన ఇంజినీరింగ్, లా కళాశాలలను త్వరలో ప్రారంభించాల్సి ఉందని, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ చేయాలని వీసీ ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తెచ్చారు. పీయూ అభివృద్ధికి నిధుల కేటాయింపు, అదనపు పోస్టుల మంజూరు, వనపర్తి పీజీ సెంటర్లో బాలుర, బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు. రేపు అప్రెంటిస్షిప్ మేళా వనపర్తి విద్యావిభాగం: జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ఈ నెల 10న అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కె.రమేస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పలు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు http://www.appr enticeshipindia.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు మహ్మద్ ఇస్తేముల్ హక్ 98492 44030 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. -
మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి
వనపర్తి: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో శనివారం మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు పలు రంగాల్లో సాధిస్తున్న విజయాలు రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ప్రస్తుత రోజు ల్లో మహిళలు ఏదో ఒక్క రంగంలో అని కాకుండా.. విద్య, వైద్యం, పారిశ్రామిక, అంతరిక్షం ఇలా అన్ని రంగాల్లో రాణించడం హర్షనీయమన్నారు. మహిళా అధికారులు తమ వృత్తిపరమైన బాధ్యతలను ధైర్యంగా నిర్వర్తించాలని సూచించారు. మహిళా పోలీసు సిబ్బంది సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పురుషులతో పోటీపడుతూ ఉద్యోగ అవకాశాలు, విధుల్లో సమానంగా పని చేయడం గొప్ప విషయమన్నారు. ఉన్నతంగా ఆలోచించే మహిళలకు తమ కుటుంబాలను ఉన్నత స్థాయికి చేర్చే సత్తా ఉంటుందన్నారు. ప్రత్యేకంగా పోలీసు శాఖలో ఎస్ఐ నుంచి హోంగార్డు వరకు మహిళా అధికారులు శాంతి భద్రతల విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అదే విధంగా విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఎస్పీ పాల్గొని వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను శాలువాలతో సత్కరించారు. ముందుగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాల్లో డీసీఆర్బీ ఇన్చార్జి అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వు సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, షీటీం ఎస్ఐ అంజద్, శిక్షణ ఎస్ఐలు హిమబిందు, దివ్యశ్రీ, భరోసా సెంటర్ కోఆర్డినేటర్, శిరీష, విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తిరుపతయ్య, యాదగిరి, బ్రహ్మాచారి, బైరోజు చంద్రశేఖర్, సూర్యనారాయణ, గణేశ్, నరసింహ, భాస్క ర్, రవి, గిరిరాజాచారి, అలివేలమ్మ, జ్యోతి, కల్పన, సుకన్య, సువర్ణదేవి తదితరులు పాల్గొన్నారు. -
అక్కరకు రాని చేపల మార్కెట్..
జిల్లా కేంద్రం నడిబొడ్డున 2005లో రూ. 23లక్షలతో చేపల మార్కెట్ ప్రారంభించారు. మొదట్లో మార్కెట్ భవనాన్ని వినియోగించుకున్న మత్స్యకారులు.. తదనంతరం రోడ్లపైనే విక్రయాలు చేసేందుకు ఆసక్తి చూపడంతో మార్కెట్ భవనం ముణ్నాళ్ల ముచ్చటగా మారింది. రాజకీయ నాయకులు కొందరు రోడ్లపై విక్రయాలను ప్రోత్సహించడంతో 16 ఏళ్లుగా చేపల మార్కెట్ అక్కరకు రావడం లేదు. మార్కెట్ ఆవరణ ఆటో స్టాండ్గా మారింది. జిల్లా కేంద్రంలో చేపల మార్కెట్ ఉందనే విషయాన్ని చివరకు అందరూ మరిచిపోయారు. భవనం వినియోగంపై మున్సిపల్, మత్స్యశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షల ప్రజాధనంతో నిర్మించిన భవనం శిఽథిలావస్థకు చేరుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
వీపనగండ్ల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీని పూర్తిచేసిందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని సంగినేనిపల్లిలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు రూ. 20లక్షలతో సీసీరోడ్డు, రూ. 5లక్షలతో ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గోపల్దిన్నెలో రూ. 20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అదే విధంగా రూ. 90 లక్షలతో గోఽవర్ధనగిరి – రంగవరం రోడ్డు, రూ. 80 లక్షలతో రంగవరం – నాగసానిపల్లి బీటీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రంగవరం, గోపల్దిన్నె, పుల్గర్చర్ల తదితర గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపల్దిన్నె రైతువేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేస్తున్నట్లు వివరించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 2లక్షల వరకు రుణాన్ని మాఫీ చేశామన్నారు. అర్హులైన పేదలందరికీ 200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అయితే సాంకేతిక సమస్యతో కొందరికి జీరో బిల్లులు రావడంలేదనే విషయం తన దృష్టికి వచ్చిందని.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా రూ. 500లకే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రంగవరం, గోపల్దిన్నె గ్రామాల మధ్య నెలకొన్న భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులందరి పంట రుణాలు మాఫీ అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గోపల్దిన్నె గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండు రోజులుగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలను మంత్రి జూపల్లి కృష్ణారావు విరమింపజేశారు. గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేపట్టగా.. ఆయా సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హుందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్య యాదవ్, నాయకులు నారాయణరెడ్డి, బాల్రెడ్డి, ఇంద్రకంటి వెంకటేష్, సుదర్శన్రెడ్డి, గోపాల్నాయక్, చక్ర వెంకటేష్, చిన్నారెడ్డి, రాంరెడ్డి, మోహన్, సీపీఎం మండల కార్యదర్శి బాల్రెడ్డి, వెంకటయ్య, నిరంజన్, శేఖర్రెడ్డి, చంద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలి
వనపర్తి రూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని దళితవాడ, చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్లు, చందాపూర్ రోడ్డులోని పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీల్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాన్వెస్లీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని దళితవాడలో లోఓల్టేజీ, శ్మశానవాటిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితవాడ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్ల వద్ద తాగునీరు, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు, రేషన్షాపు లేక అవస్థలు పడుతున్నారని.. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీని అనుసరించి చిరు వ్యాపారులు, మెకానిక్లు ఏర్పాటుచేసుకున్న డబ్బాలను రోడ్డు విస్తరణలో తొలగించడంతో రోడ్డున పడ్డారని.. వారికి అడ్డాలు చూపించి ఆదుకోవాలని కోరారు. పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీలో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు అలుపెరగని పోరాటం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛన్ రూ. 4వేలకు పెంచుతామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎ.లక్ష్మితో కలిసి జాన్వెస్లీ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఎండీ జబ్బార్, మండ్ల రాజు, పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి, గంధం మధన్, జి.బాలస్వామి, గట్టయ్య, నందిమల్ల రాములు, డీఏ శ్రీను, జి.బాలరాజు, రాబర్ట్, మద్దిలేటి, ఎం.మన్యం, సాయిలీల, కవిత, ఉమా, రేణుక పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధన
కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రపస్తుతం బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో మొత్తం రూ.3,225 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1, అల్టమిన్, లోహం మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని తెలుగులో ‘నమస్తే.. బాగున్నారా..!’ అని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘పుష్ప తగ్గేలే..’ డైలాగ్ను ప్రస్తావిస్తూ ‘దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. ఇక నిరంతర అభివృద్ధే..’ అని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి అమరరాజా కంపెనీలో 80 శాతం మహిళలే పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. కాగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో పాటు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్త లు ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ డి.శ్రీధర్బాబు అన్నారు. ఇటీవల దావోస్ సమ్మిట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వివిధ పెద్ద సంస్థలు సుమారు రూ.78 వేల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ, చైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న గిగా ఫ్యాక్టరీ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్షంగా, మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక మాధ్యమాల ప్రభావం
70 శాతం ఫిర్యాదులు సోషల్ మీడియా పరిచయాలతోనే.. వనపర్తి: దేశం శాస్త్ర, సాంకేతికరంగంలో ఎంత పురోగతి సాధించినా.. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా.. ఏటా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఇన్స్టా, నోచాట్ లాంటి సామాజిక మాధ్యమాల యాప్లలో పరిచయాలు పెంచుకొని మొదట స్నేహం, తర్వాత ప్రేమ పేరుతో దగ్గరై తర్వాత దాడులకు పాల్పడుతున్నట్లు భరోసా కేంద్రంలోని అధికారులు, సభ్యులు వెల్లడిస్తున్నారు. కేంద్రానికి వచ్చిన ఫిర్యాదుల్లో 70 శాతానికిపైగా అలాంటివే ఉండటం శోచనీయం. మహిళలపై దాడులకు సోషల్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తుందని షీటీమ్స్, భరోసా, సఖి కేంద్రాలకు అందుతున్న ఫిర్యాదులతో స్పష్టమవుతోంది. మైనర్లే అధికం.. జిల్లాలో భరోసా కేంద్రం ఏర్పాటై సుమారు ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు 51 కేసులు నమోదు కాగా.. అందులో 50 కేసులు పోక్సో చట్టం ప్రకారం నమోదు చేసినట్లు కేంద్రం పర్యవేక్షకుడు, ఎస్ఐ ఎండీ అంజాద్ వెల్లడించారు. జిల్లాలోని విద్యాసంస్థలు, ఇతర ప్రదేశాల్లో కేంద్రం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 59 అవగాహన సదస్సులు నిర్వహించారు. నేటి వరకు భరోసా కేంద్రానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే సామాజిక మాధ్యమాల్లో పరిచయమై మోసం చేశారన్న ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. కేంద్రానికి వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికం మైనర్ల నుంచే రావడం శోచనీయం. గతేడాది 147 కేసులు.. మహిళల భద్రతకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో కొనసాగే షీటీం విభాగానికి కొంతకాలంగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2024లో 147 ఫిర్యాదులు అందగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 32 ఫిర్యాదులు వచ్చాయి. వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు నుంచే ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి. బైక్లపై వెంబడిస్తూ వేధిస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. షీటీం బృందాలు వివిధ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. కళాశాలలు, వాణిజ్య సముదాయాలు, బస్టాండ్లలో షీటీం బృందాలు గస్తీ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. మానసిక ధైర్యాన్నిస్తున్నాం.. తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వొదు. సోషల్ మీడియాలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి దురలవాట్లకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆడ పిల్లలకు డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరిన తర్వాతే సెల్ఫోన్లు ఇవ్వడం మంచిది. భరోసా కేంద్రానికి వచ్చే ఫిర్యాదుల్లో చాలావరకు పరిష్కరిస్తూ వారికి ఆర్థిక, మానసిక ధైర్యాన్ని అందిస్తున్నాం. – ఎండీ అంజద్, ఎస్ఐ, భరోసా కేంద్రం, వనపర్తి మహిళలకు ‘భరోసా’.. పోలీస్స్టేషన్లు, ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలకు భరోసా కేంద్రాలు అండగా ఉంటున్నాయి. ఫిర్యాదుదారును కేంద్రానికి తీసుకొచ్చి వారికి మానసిక ధైర్యం కల్పించడంతో పాటు కేంద్రంలోని ఏఎన్ఎం జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తారు. అనంతరం కేసు నమోదు చేసి వర్చువల్గాగాని నేరుగాగాని న్యాయమూర్తిని కల్పించి స్టేట్మెంట్ను రికార్డు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి వారికి న్యాయం జరిగేలా సలహాలు ఇవ్వడంతో పాటు ఓ కుటుంబంలా తోడుంటుంది. -
బీసీడీఓ సస్పెన్షన్
వనపర్తి: జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారిక బ్యాంకు ఖాతా నుంచి నిధులు డ్రా చేసిన విషయంపై గత నెల 27న ‘అడ్డగోలు చెల్లింపులు’, ఈ నెల 6న ‘నిధుల గోల్మాల్’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు కలెక్టర్ స్పందించారు. సమగ్ర విచారణ జరిపి ముందుగా షోకాజ్ నోటీసు జారీచేసిన అనంతరం శుక్రవారం సస్పెండ్ చేశారు. ఈయన వ్యవహారంపై పీడీఎస్యూ, బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు సైతం వేర్వేరుగా రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందజేశారు. ఎట్టకేలకు కలెక్టర్ సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో కలెక్టరేట్లోని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల్లో అలజడి మొదలైంది. -
No Headline
మక్తల్: జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన పోరాటం ఆదర్శనీయం.. ఒక దృఢ సంకల్పతో ముందుకు సాగుతూ.. ఏ ఒక్కరినీ జోగినిగా మార్చకుండా అడ్డుకోవడంతో పాటు ఆదర్శ వివాహాలు జరిపిస్తూ.. జోగినుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఊట్కూరుకు చెందిన దళిత మహిళ హాజమ్మ. చిన్నతనం నుంచే జోగిని వ్యవస్థను వ్యతిరేకించిన ఆమె.. ఓఎంఐఎఫ్, ఏహెచ్టీయూ సంస్థల సహకారంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జోగినులకు అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం ఆశ్రయ్ సంస్థ నిర్వాహకురాలు గ్రీస్ నిర్మలతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన సంస్థ’ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు హాజమ్మ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా జోగిని వ్యవస్థను అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు 30 మంది జోగినులకు వివాహాలు జరిపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 వేల మంది జోగినులు ఉన్నారని.. అందులో 2 వేల మందికి ప్రభుత్వం నేటికీ పునరావాసం కల్పించలేదని హాజమ్మ తెలిపారు. -
25 శాతం రాయితీపై విస్తృత ప్రచారం
వనపర్తి: ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు నెలాఖరు వరకు 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు పురపాలికల్లో విస్తృత ప్రచారం చేస్తున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి పురపాలికశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్, ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో 48 వేల మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుని కేవలం 160 మంది మాత్రమే డబ్బులు చెల్లించేందుకు ముందుకొచ్చారని వివరించారు. గడువు ముగిసిన తర్వాత ప్రస్తుత మార్కెట్ విలువకు 14 శాతం అదనంగా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్రెడ్డి, మిగతా పురపాలికల కమిషనర్లు, పట్టణ ప్రణాళిక ఇంజినీర్లు పాల్గొన్నారు. నేడు జాన్వెస్లీ రాక వనపర్తి రూరల్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ శనివారం జిల్లాకేంద్రానికి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజా సమస్యలపై కొనసాగుతున్న సర్వేలో పాల్గొంటారని పేర్కొన్నారు. -
నాణ్యమైన బియ్యం సరఫరా
ఖిల్లాఘనపురం: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు పురుగులు పట్టిన బియ్యం సరఫరా అయ్యాయి. శుక్రవారం ‘ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భోజన సమయానికి ముందే నాణ్యమైన బియ్యాన్ని వనపర్తి స్టాక్ పాయింట్ నుంచి ఆటోలో వెనికితండా, అప్పారెడ్డిపల్లి, సోళీపురం పాఠశాలలకు తరలించారు. అలాగే పురుగులు పట్టిన బియ్యాన్ని తీసుకెళ్లినట్లు మండల విద్యాధికారి జయశంకర్ వివరించారు. వెనికితండా పాఠశాలకు వచ్చిన నాణ్యమైన బియ్యం -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 25 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరిగాయి. కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఏర్పాట్లు, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ రావుల గిరిధర్, కొత్తకోటలోని పరీక్ష కేంద్రాన్ని డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరావు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. జిల్లాకేంద్రంలోని వాగ్దేవి, సీవీ రామన్, త్రివేణి, విజ్ఞాన్ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను డీఐఈవో ఎర్ర అంజయ్య తనిఖీ చేశారు. జనరల్ విభాగంలో 5,798 మంది విద్యార్థులకుగాను 5,663 మంది హాజరుకాగా.. 132 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఉదయం 8.25కి పోలీస్స్టేషన్కు వెళ్లి సీఎస్, డీవోలు ప్రశ్నాపత్రాలు ఉంచిన ప్రదేశాన్ని పరిశీలించారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు వేర్వేరుగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. ఎస్పీ వెంట సీఐ కృష్ణ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ, డీఐఈఓ -
ఏమైపోయారో..
లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా.. భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం సొరంగం ప్రాంతానికి చేరుకుంది. వారితో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి.. సర్వే చేసి కచ్చితమైన నివేదిక అందించాలని కోరారు. గురువారం అమ్రాబాద్ రేంజ్లో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా సర్వే చేయనున్నట్లు తెలిసింది. స్థానిక ఫారెస్టు అధికారులు వారికి సహకరిస్తున్నారు. ● సహాయక చర్యలను కేంద్రం నుంచి వచ్చిన మినిస్ట్రీ ఫర్ హోం అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్కుమార్ టన్నెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. ప్రస్తుతం టీబీఎంను కొద్దికొద్దిగా కట్ చేస్తూ కార్మికులను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. కన్వేయర్ బెల్ట్ మళ్లీ ప్రారంభం కావడంతో మట్టిని బయటికి తరలించే ప్రక్రియ మొదలైతే సహాయక చర్యలు వేగవంతం కానున్నాయని పేర్కొన్నారు. నేటికీ అంతుచిక్కని 8 మంది కార్మికుల ఆచూకీ ● ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు ● తాజాగా రంగంలోకి కేరళ క్యాడావర్ డాగ్స్ ● ఐఐటీ నిపుణులతో టన్నెల్లోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అచ్చంపేట రూరల్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. తిండీ తిప్పలు దేవుడెరుగు.. కనీసం గాలి, వెలుతురు కూడా లేకుండా ఊపిరి సలపని చీకటి గుహలో తమ వారు ఎలా ఉన్నారో.. ఏమైపోయారో అంటూ టన్నెల్ వెలుపల కార్మికుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురుచూస్తూనే ఉన్నాయి. దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 13 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. గురువారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ సూచనలు చేశారు. ఈ క్రమంలోనే సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడావర్ డాగ్స్ రప్పించినట్లు అరవింద్కుమార్ తెలిపారు. గురువారం ఉదయం షిఫ్టులో సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు సొరంగం లోపలికి వెళ్లారు. మట్టి తరలింపులో ఇబ్బందులు.. సొరంగంలో పేరుకుపోయిన, మట్టి, రాళ్లు, బురద బయటకు పంపడానికి సింగరేణి కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీపీఆర్ మిషన్ చూయించిన చోట 6, 7 మీటర్ల లోపల ఉన్న అవశేషాల కోసం ప్రతిరోజు అన్వేషణ కొనసాగుతోంది. జీపీఆర్ చూయించిన ప్రదేశంలోనే ఎక్కువ శాతం పనులు కొనసాగిస్తుండటం, చివరికి ఆ ప్రాంతంలో ఎలాంటి అవశేషాలు కనిపించకపోవడంతో శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు నిరాశే మిలుగుతోంది. దీనికి తోడు 7 మీటర్ల లోతులో మట్టిని తవ్వి పక్కనే పడేస్తున్నారు. మట్టిని తవ్వడానికి కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పనులు కొనసాగితే ఆ మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను బయటకు పంపిస్తే పని సులువవుతుందని కార్మికులు అంటున్నారు. గోతులు తవ్వితే అధికంగా నీరు, బురద వస్తుంది. దీంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అందుబాటులో ఉండాలి.. సొరంగం వద్ద సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. అందరూ సమన్వయంతో, సహకారం అందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విపత్తుల ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది సొరంగ ప్రాంతానికి వస్తున్నారని, వారికి అన్ని వసతులు కల్పిస్తూ.. సర్వే, ఇతర పనులు చేయించుకోవాలన్నారు. ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉదయం ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బందితో పాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ మనుషులు బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. టన్నెల్ లోపల పనిచేసే వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి అధికారులు, ఐఐటీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబసభ్యుల పడిగాపులు.. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు సంబంధించి కుటుంబసభ్యులు దోమలపెంట జేపీ కంపెనీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కంపెనీ యజమానితో మాట్లాడటానికి కుటుంబ సభ్యులు చూస్తుండగా.. కంపెనీ అధికారులు, సిబ్బంది పొంతన లేని సమాధానం చెబుతూ వారిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఓ కార్మికుడి కుటుంబసభ్యులు కార్యాలయం వద్దకు వచ్చి ఆరా తీశారు. అదే సమయంలో జేపీ కంపెనీ యజమాని హెలీకాప్టర్లో వస్తుండటంతో అక్కడి నుంచి వారిని పంపించేశారు. -
ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా
ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగే మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవల పంపిణీ చేసిన బియ్యం పురుగుపట్టి ఉండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గత నెల మామిడిమాడ ఉన్నత పాఠశాలకు వచ్చిన 18 బస్తాల బియ్యంలో పురుగులు ఉండటంతో హెచ్ఎం చెన్నప్ప విషయాన్ని గ్రామపెద్దలు దృష్టికి తీసుకెళ్లారు. వారు వనపర్తి స్టాక్ పాయింట్ అధికారులతో మాట్లాడి తిప్పి పంపించి మంచి బియ్యం తీసుకొచ్చారు. రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న బియ్యం మంచిగా ఉన్నాయని.. పాఠశాలలకు పురుగులు పట్టిన బియ్యాన్ని ఎందుకు పంపిణీ చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని వెనికితండా, అప్పారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసిన పురుగుల బియ్యం ఏం చేయాలో తెలియక అలాగే ఉంచారు. ఈ విషయాన్ని ఎంఈఓ జయశంకర్ వద్ద ప్రస్తావించగా.. వెనికితండా, అప్పారెడ్డిపల్లి, మామిడిమాడ ఉన్నత పాఠశాలలకు వచ్చిన బియ్యంలో పురుగులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని జిల్లా అధికారులకు వివరించామని తెలిపారు. 1,018 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో గురువారం 1,018 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదన్నారు. ఎన్టీఆర్ కాల్వకు 84 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 119 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. శిక్షణ కేంద్రాలను వినియోగించుకోవాలి ఖిల్లాఘనపురం: గిరిజన మహిళల అభ్యున్నతికి నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వనితాజ్యోతి మహిళా సంఘం అధ్యక్షురాలు ఏకే కమర్ రహమాన్ కోరారు. గురువారం మండలంలోని సోళీపురం, కోతులకుంటతండాతో పాటు పలు తండాల్లో ఆమె పర్యటించారు. వీజేఎంఎస్ ఆవాజ్ వనపర్తి కమ్యూనిటీ రేడియో ద్వారా గిరిజన సంక్షేమశాఖ అందిస్తున్న అనేక పథకాల గురించి వినిపించారు. త్వరలోనే సోళీపురం గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందరు సహకరిస్తే వేసవిలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆమె వెంట గ్రామపెద్దలు పురేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనునాయక్, గంధం చిట్టెమ్మ తదితరులు ఉన్నారు. 24 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత ఖిల్లాఘనపురం: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తక్కువ ధరకు కొనుగోలు చేసి రైస్మిల్లుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పౌరసరఫరాలశాఖ నయాబ్ తహసీల్దార్ దుబ్బాక పరమేశ్వర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గోపాల్పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన శ్రీమాన్పాడు రామకృష్ణ బుధవారం పలు గ్రామాల్లో 24 బస్తాల రేషన్ బియ్యం కొనుగోలు చేసి రాత్రి సమయంలో ఖిల్లాఘనపురం మండలం సోళీపురం గ్రామంలో ఉన్న సింధు రైస్మిల్లుకు వాహనంలో తరలించారు. జిల్లా సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారంతో వాహనాన్ని వెంబడించారు. రైస్మిల్లులో బియ్యం దింపుతుండగా పట్టుకొని అదే వాహనంలో వనపర్తి స్టాక్ పాయింట్కి తరలించారు. గురువారం రైస్మిల్ యజమాని, బియ్యం తీసుకొచ్చిన రామకృష్ణపై కేసునమోదు చేయాలని ఖిల్లాఘనపురం పోలీసులకు ఫిర్యా దు చేశారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్గౌడ్ తెలిపారు. -
మహిళలు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి
వనపర్తి: ప్రతి మహిళ తమ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్యాన్సర్ వంటి రోగాలు దరి చేరకుండా కాపాడుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నర్సింగాయపల్లిలోని ఎంసీహెచ్లో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్చేసి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డయాబెటిస్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, విటమిన్ డి–3, విటమిన్ బి–12, థైరాయిడ్ తదితర వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళా ఉద్యోగులు తప్పనిసరిగా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రధాన సమస్యగా మారిందని.. ముందుగానే గుర్తించడంతో నియంత్రించవచ్చన్నారు. క్యాన్సర్ మహమ్మారిని స్క్రీనింగ్తో ముందుగానే గుర్తిస్తే ప్రాణానికి ముప్పు ఉండదని.. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స చేయించుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చని వివరించారు. జిల్లాలోని పీహెచ్సీల్లో నాణ్యమైన వైద్యం అందుతుందని.. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలోని ఎన్ఆర్సీ కేంద్రం ద్వారా 400 మంది సామ్, మామ్ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడినట్లు తెలిపారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్కు అంగన్వాడీ టీచర్లు, ఏపీఎంలు, సీసీలు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, మహిళలు హాజరయ్యారు. క్రిటికల్ కేర్ యూనిట్ పరిశీలన.. నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ప్రాంగణంలో క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. నెలాఖరు వరకు పనులు పూర్తి చేసేలా వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, ఎంసీడీ ప్రోగ్రాం అధికారి రాంచందర్, ఇతర వైద్యాధికారులు ఉన్నారు. -
దివ్యాంగులకూ గుర్తింపు
సదరం ధ్రువీకరణ పత్రాల జారీకి స్వస్తి పలకనున్న ప్రభుత్వం●ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం.. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం యూడీఐడీ కార్డు తీసుకురావడం హర్షణీయం. సదరం ధ్రువపత్రం గడువు ముగిసిన ప్రతిసారి స్లాట్ బుక్ శిభిరానికి వెళ్లి రెన్యూవల్ చేసుకునేందుకు ఇబ్బందులు ఉండేవి. కొత్త విధానంలో దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేలా యూడీఐడీ కార్డు అందించడంతో దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. – ప్రభుస్వామి, జిల్లా అధ్యక్షుడు, దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక నెలాఖరు వరకు అవకాశం.. దివ్యాంగులు యూడీఐడీ కార్డుల కోసం మీ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. నెలాఖరుకు స్లాట్ బుకింగ్ ముగుస్తుంది. సదరం శిభిరాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. యూడీఐడీ పోర్టల్లో నమోదు చేసుకుంటేనే కార్డు వస్తుంది. – ఉమాదేవి, డీఆర్డీఓ అమరచింత: కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన గుర్తింపుకార్డు అమలులోకి తీసుకురానుండటంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు జారీ చేస్తున్న సదరం ధ్రువపత్రాలకు ఇక నుంచి స్వస్తి పలకనుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో యూడీఐడీ (యూనిక్ డిసెబులిటీ ఐడెండిటీ కార్డు) అందుబాటులో రాగా.. తెలంగాణలో మాత్రం సదరం ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. మార్చి 1 నుంచి మన రాష్ట్రంలో కూడా యూడీఐడీ కార్డుల విధానం అమలులోకి వచ్చింది. రానున్న రోజుల్లో ఈ కార్డు ఉంటేనే దివ్యాంగులకు పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న దివ్యాంగులు తప్పనిసరిగా యూడీఐడీ కార్డు వివరాలను తమ సర్వీస్ రికార్డుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ధారిత రంగుల్లో కార్డులు.. వికలత్వం శాతం ఆధారంగా నిర్ధారిత రంగుల్లో ఈ కార్డులను జారీ చేయనున్నారు. కార్డు ఒక్కసారి జారీచేస్తే మళ్లీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉండదు. బస్సులు, రైళ్లలో రాయితీతో పాటు దివ్యాంగులకు వర్తించే అన్ని సౌకర్యాలు యూడీఐడీ కార్డు ద్వారా పొందవచ్చు. జిల్లాలో 13,680 మంది.. జిల్లావ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పింఛన్ పొందుతున్న దివ్యాంగులు సుమారు 13,600 మందికి పైగా ఉన్నారని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. భవిష్యత్లో వీరంతా వన్ నేషన్ వన్ డిసెబిలిటీ కింద యూడీఐడీ కార్డులు పొందాల్సి ఉంటుంది. త్వరలో శాశ్వత గుర్తింపు కార్డుల మంజూరుకు సన్నాహాలు కార్డు ఆధారంగానే పింఛన్, సంక్షేమ పథకాల వర్తింపు స్లాట్ బుకింగ్కు నెలాఖరు వరకు అవకాశం -
ఆయుధ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
వనపర్తి: విధుల్లో వినియోగించే ఆయుధాలపై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎరవ్రల్లిలోని 10వ బెటాలియన్లో గురువారం ఉదయం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి మూడురోజుల ఫైరింగ్ శిక్షణ నిర్వహించారు. పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఒక్కొక్కరు పది రౌండ్లు కాల్చే అవకాశం కల్పించారు. ఎస్పీ స్వయంగా పాల్గొని జిల్లా సాయుద దళాల అదనపు ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్ చేసి ఆయుధ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. ఫైరింగ్ శిక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయుధాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని, శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వర్తించవచ్చన్నా రు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి జీవ న విధానాన్ని అలవర్చుకోవాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి జిల్లాకు, పోలీసుశాఖకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, డ్యూటీలో ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాయుద దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సైబర్క్రైం డీఎస్పీ రత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, రిజర్వ్ ఎస్ఐలు వినోద్, ఎండీ మొగ్ధుం, జిల్లాలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి.. ఆత్మకూర్: వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి సారించాల ని ఎస్పీ రావుల గిరిధర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక పోలీస్స్టేషన్ను ఆ యన తనిఖీ చేసి సీఐ శివకుమార్, ఎస్ఐ నరేందర్తో మాట్లాడి కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పందుల చోరీ, కాపలాదారుడిపై దాడి, అయ్యప్పకాలనీలోని ఇంట్లో జరిగిన చోరీ తదితర కేసుల గురించి ఆరా తీశారు. పక్కాగా విచారణ చేపట్టి దొంగలను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రావుల గిరిధర్ -
పాత విధానంలోనే స్లాట్ బుకింగ్..
యూడీఐడీ కార్డు కోసం ఎప్పటి మాదిరిగానే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహించే సదరం క్యాంపునకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీ–సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకొని నిర్దేశిత తేదీన సదరం శిభిరానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం దరఖాస్తుదారుడి వివరాలు, వికలత్వ శాతం వైద్యుల లాగిన్కు చేరుతుంది. వివరాలను పరిశీలించి అప్లోడ్ చేయగానే కార్డు మంజూరవుతుంది. జారీ చేసిన అధికారి డిజిటల్ సంతకంతో కార్డు ఉంటుంది. దాని ప్రకారమే ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయనుంది. నకిలీల ఆటకట్టు.. కేంద్రం తీసుకొచ్చిన యూడీఐడీ కార్డు విధానంతో ఇప్పటికే నకిలీ ధ్రువపత్రాలతో దివ్యాంగుల పింఛన్తో పాటు సంక్షేమ పథకాలు పొందిన వారిని గుర్తించి తొలగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అర్హులైన దివ్యాంగులకే సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో వీటిని పక్కాగా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. గతంతో జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపునకు వెళ్లి అక్రమ మార్గంలో ధ్రువపత్రాలు పొందినవారు సైతం ప్రస్తుతం యూడీఐడీ కార్డు పొందాల్సి ఉంటుంది. -
కారం, తొక్కులే నిత్య భోజనం..
నల్లమలలో మొత్తం 88 చెంచు ఆవాసాలు ఉండగా, చెంచుల మొత్తం జనాభా 9 వేల లోపే. ప్రభుత్వం వీరి సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంలో చెంచులు కనీసం సరైన తిండికీ నోచుకోవడం లేదు. చెంచుల్లో చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు నిత్యం కారం, తొక్కులతోనే కాలం గడుపుతున్నారు. అప్పాపూర్, భౌరాపూర్, మేడిమల్కల తదితర చెంచుపెంటల నుంచి కూరగాయలు కావాలంటే సుమారు 40 కి.మీ.దూరంలో ఉన్న మన్ననూరుకు వెళ్లాల్సి ఉంటుంది. పదిహేను, నెలరోజులకు ఒకసారి తెచ్చుకున్న కూరగాయలు, సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో తేనే, చెంచుగడ్డలు తదితర ఆహారం వారికి అరకొరగా దొరికినా, వాటిని ఆహారంగా తీసుకోకుండా ఇతరులకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. నల్లమలలోని కొమ్మెనపెంటలో చెంచు మహిళలు -
12 రోజులైనా జాడే లేదు
మాట్లాడుతున్న కలెక్టర్ ఆదర్శ్ సురభిఅచ్చంపేట/అమ్రాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. రోజు మాదిరిగానే బుధవారం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగించాయి. కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా లభించని ఎస్ఎల్బీసీ కార్మికుల ఆచూకీ టన్నెల్ వద్ద కనిపించని అధికారుల హడావుడి మళ్లీ పని చేయని కన్వేయర్ బెల్టు లోకో ట్రైన్ ద్వారానే మట్టి, ఇతర వ్యర్థాల తరలింపు సహాయక బృందాల మధ్య కొరవడిన సమన్వయం ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఇందుకు సంబంధించిన నివేదిక అందించాల్సి ఉంది. కాగా, కార్మికుల వెలికితీతకు చేపట్టాల్సిన చర్యలపై రెస్క్యూ బృందాల ప్రతినిధులతో విపత్తుల నిర్వహణ స్పెషల్ చీఫ్ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నమూనా టీబీఎంను పరిశీలించారు. -
అడ్డగోలు చెల్లింపులు!?
అధికారిక బ్యాంకు ఖాతా నుంచి ఇష్టానుసారంగా డబ్బులుడ్రా ●వాహనాల అద్దె చెల్లింపులపై అనుమానాలు.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్న వాహనాల అద్దె చెల్లింపుల్లోనూ భారీఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్లు వదంతులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు పసుపురంగు నంబర్ప్లేట్ ఉన్న వాహనాలను మాత్రమే అద్దెకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ చాలా శాఖల్లోని అధికారులు మాత్రం తెలుపురంగు నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలనే అద్దెకు తీసుకొని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న అంశంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వానికి నివేదిస్తాం.. వచ్చిన ఫిర్యాదుల మేరకు బీసీ అభివృద్ధిశాఖ అధికారిక ఖాతా నుంచి నగదు ఉపసంహరణలపై సమగ్ర విచారణ చేపట్టాం. కార్యాలయ సిబ్బంది పేర్లతో రాసిన చెక్కుల విషయమై వారితో సే్ట్ట్మెంట్ రికార్డ్ చేశాం. ఇప్పటికే సదరు అధికారికి షోకాజ్ నోటీసు కూడా జారీ చేశాం. సమగ్ర విచారణ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం. గతంలో వైద్య, ఆరోగ్యశాఖలో చోటు చేసుకున్న ఘటన విషయం నాకు తెలియదు. – జి వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ), వనపర్తి వనపర్తి: అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి ఇష్టానుసారంగా నగదు డ్రా చేస్తున్న ఘటనలు రోజుకో ప్రభుత్వ శాఖలో వెలుగుచూస్తున్నాయి. గతంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో అటెండర్లు, కార్యాలయ సిబ్బంది పేర్లతో నగదు విత్డ్రా చేసిన ఘటనలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా అప్పటి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ విచారణకు ఆదేశించారు. ఇటీవల నారాయణపేట జిల్లాకు బదిలీ అయిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ను విచారణ అధికారిగా నియమించి సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు. విచారణ ప్రారంభించి ఏడాదికావస్తున్నా... నేటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం. తాజాగా కలెక్టరేట్లోని బీసీ అభివృద్ధి కార్యాలయంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. విద్యార్థి సంఘాలు, బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు ఆ శాఖలో అక్రమాలు జరిగాయంటూ జిల్లా నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేశారు. రాజకీయ జోక్యం ఉండటంతో జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల అభ్యున్నతికి వెచ్చించాల్సిన నిధులను అధికారిక చెక్కులపై కార్యాలయ సిబ్బంది పేర్లతో అడ్డగోలుగా డ్రా చేసుకొని వినియోగించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీసీ అభివృద్ధిశాఖలో చోటు చేసుకున్న ఘటనపై రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు విచారణ జరిపి వచ్చిన ఆరోపణలపై సంజయిషీ కోరుతూ సదరు అధికారికి నోటీసు ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా ప్రభుత్వ శాఖల ఖాతాల నుంచి సదరు శాఖలో పనిచేసే సిబ్బంది పేర్లతో నిధులు డ్రా చేయడం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని మరికొన్ని ప్రభుత్వ శాఖల్లోనూ చోటు చేసుకున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. మరిన్ని శాఖల్లో జరిగిన అవినీతిని అతి త్వరలోనే బయట పెడతామని.. నిధుల గోల్మాల్కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామంటూ వివిధ ప్రజా, విద్యార్థి సంఘాలు మీడియా, సోషల్ మీడియా వేధికలుగా హెచ్చరికలు చేస్తున్నాయి. మొన్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో.. నిన్న బీసీ అభివృద్ధిశాఖలో... విచారణ పేరుతో కాలయాపన రికవరీపై సన్నగిల్లుతున్న ఆశలు -
మహిళాశక్తి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి
వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర మహిళాశక్తి పథకంలోని 16 రకాల యూనిట్ల గ్రౌండింగ్ వందశాతం పూర్తిచేసి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో మహిళాశక్తి పథకం యూనిట్లు, బ్యాంకు లింకేజీ రుణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఇందిర మహిళాశక్తి కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నెలాఖరు వరకు పథకం లక్ష్యాలను చేరుకోవాలని, మహిళా స్వయం సహాయక బృందాలకు పెండింగ్లో ఉన్న రూ.30 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా గ్రూపు, వ్యక్తిగత యూనిట్లకు సంబంధిత బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేయించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఎం బాషానాయక్, ఏఎల్డీఎం సాయి తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 14 మండలాల్లో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష జరగగా 6,714 మంది విద్యార్థులకుగాను 6,476 మంది హాజరుకాగా.. 238 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పాన్గల్లోని పరీక్ష కేంద్రాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్రాల పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. -
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
వనపర్తి: సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ ఎన్బీ రత్నం సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ౖనిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూ, కొన్నిసార్లు భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు కాజేస్తారన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్కు స్పందించవద్దని సూచించారు. ఒకవేళ డబ్బులు నష్టపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. నేటి సమాజంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో నమోదు చేయొద్దని సూచించారు. విద్యార్థులు బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, సైబర్ క్రైం ఎస్ఐ రవిప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తిండికీ తిప్పలే..
కొమ్మెనపెంటలో చెంచుల ఆవాసాలు(బొడ్డు గుడిసెలు) నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో అధికశాతం మందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక చెంచులు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో గర్భిణులకు ప్రసవ సమయంలో వేధన తప్పడం లేదు. కొన్ని సార్లు పుట్టిన శిశువులు సైతం మృత్యువాత పడుతుండటం కలచివేస్తోంది. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం కనీసం 12 వరకు ఉండాలి, అయితే చెంచు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో 60 శాతానికి పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 25 శాతం మంది మహిళలు 9 శాతం కన్నా తక్కువ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేసుల్లో 3–6 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉంటున్న తీవ్రమైన ఎనిమియా కేసులు చోటుచేసుకుంటున్నాయి. నల్లమలలోని చెంచు మహిళల్లో రక్తహీనత సమస్యపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్(ఎన్ఐఎన్) హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం, శిశు మరణాలు, పురుషులతో పాటు మహిళల్లోనూ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించింది. అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న చెంచుల జీవితాలు సరైన తిండి, ఆదాయం లేక మరింత దుర్భరంగా మారుతున్నాయి. నిత్యం కారం, తొక్కులే ఆహారం చెంచు మహిళల్లో 60 శాతం మందికి ఎనిమియా సమస్య గర్భిణులు, బాలింతల్లో రక్తం లేక పెరుగుతున్న శిశుమరణాలు -
తొక్కు,చింత పులుసే తింటాం
మేం ఎక్కువగా కారం, తొక్కులు, చింతపులుసు తింటాం. మా పిల్లలు కూడా అవే తింటారు. కూరగాయలు కావాలంటే మన్ననూరుకు పోయి తెచ్చుకుంటాం. 15 రోజులు, నెలకు ఒకసారి వెళ్లి తెచ్చుకుంటాం. వారం తర్వాత కూరగాయలు పాడవుతాయి. ఎక్కువ రోజులు కారం పొడి, తొక్కు వేసుకుని అన్నం తింటాం. – దంసాని ఈదమ్మ, కొమ్మనపెంట, అమ్రాబాద్, నాగర్కర్నూల్ జిల్లా సరైన ఆహారం లభించట్లేదు.. చెంచులు ఎక్కువగా రైస్, కారం, తొక్కులపైనే ఆధారపడుతున్నారు. కూరగాయలు, కూరలు, పౌష్టికాహారం లేక రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. పుట్టిన శిశువులు రక్తహీనతతో 2 నుంచి 2.5 కిలోల లోపే జన్మిస్తున్నారు. చలికాలంలో న్యూమోనియా, ముక్కు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. – డాక్టర్ సైఫుల్లా ఖాన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ -
మహిళా సాధికారతతోనే సమగ్రాభివృద్ధి
వనపర్తి విద్యావిభాగం: మహిళా సాధికారతతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎస్వీఎంఆర్ డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను వినియోగించుకొని మహిళలు అన్నిరంగాల్లో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు. బాల్యవివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలు, మహిళలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయసేవలు అందిస్తుందన్నారు. బాల్యవివాహాలు, పోక్సో, బాల కార్మిక, మోటారు వెహికల్ చట్టం గురించి వివరించారు. ఉచిత న్యాయ సలహాల కోసం టోల్ఫ్రీ నంబర్ 15100 సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది చాంద్పాషా, కల్పన, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కుడి, ఎడమ కాల్వల పరిధిలో..
ఈ ఏడాది యాసంగిలో జూరాల కుడి కాల్వ కింద 15 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని అధికారులు ముందస్తుగా ప్రకటించారు. సాగుపై మక్కువతో రైతులు కాల్వల ద్వారా నీరందుతుందని వరి పంటలు సాగు చేశారు. వారబందీ విధానంలో నాలుగు రోజులు నీటి సరఫరా ఉండగా.. ప్రస్తుతం రెండ్రోజులకు తగ్గించడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. సమాంతర కాల్వ నుంచి నీటిని తరలించుకుపోతున్నారని.. కుడి, ఎడమ కాల్వలకు మాత్రం సాగునీరు అందించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని అమరచింత, ఆత్మకూర్ రైతులు ఆరోపిస్తున్నారు. సమాంతర కాల్వ షెట్టర్లు తెరిచి వారంలో మూడురోజులు భీమా ఫేజ్–2కు నీటిని తరలిస్తున్నారని.. ఇక్కడి పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : డీఐఈఓ
వనపర్తి విద్యావిభాగం: బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హాల్టికెట్పై క్యూఆర్ కోడ్ ముద్రించబడి ఉందని.. దానిని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎంత సమయం పడుతుందనే వివరాలు తెలుస్తాయన్నారు. సెల్ఫోన్లు, చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి అనుమతించరని.. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అరుణాచలానికి ప్రత్యేక బస్సు కొత్తకోట: ఈ నెల 14న పౌర్ణమిని పురస్కరించుకొని తమిళనాడులోని అరుణాచలం దైవ క్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. ఈ నెల 12న రాత్రి 8 గంటలకు వనపర్తి బస్స్టేషన్ నుంచి బస్సు బయలుదేరుతుందని వివరించారు. ఈ యాత్ర మూడు రోజుల పాటు కొనసాగుతుందని, 13వ తేదీన కాణిపాకం, అదేరోజు సాయంత్రం వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. 14వ తేదీన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, దర్శనానంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి బయలుదేరుతుందని పేర్కొన్నారు. అడ్వాన్సుగా సీట్ బుక్ చేసుకోవాలనుకుంటే సెల్నంబర్ 94906 96971 సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోరుబావులను గుర్తించాలి : ఆర్డీఓ ఖిల్లాఘనపురం: గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణానికిగాను సేకరించిన భూముల్లో బావులు, గొట్టపు బావులు తదితర వాటిని గుర్తించి రికార్డుల్లో నమోదు చేయాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. మంగళవారం మండల కేంద్రం సమీపంలో కొనసాగుతున్న రిజర్వాయర్ పనులను తహసీల్దార్ సుగుణ, భూ సేకరణ తహసీల్దార్ సుభాష్తో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్ భూములతో పాటు గట్టుకాడిపల్లికి వెళ్లే రహదారి, కట్ట నిర్మాణం తదితర వాటిని పరిశీలించి మాట్లాడారు. పనులు వేగంగా కొనసాగుతున్నాయని.. భూ నిర్వాసితుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు చెప్పారు. కట్ట వెనుకభాగం పెంచడంతో గట్టుకాడిపల్లి గ్రామానికి వెళ్లే రహదారి ముంపునకు గురవుతుందని.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఆయన వెంట ఆర్ఐ తిరుపతయ్య, సర్వేయర్ ఆనంద్ తదితరులు ఉన్నారు. పకడ్బందీగా వివరాల నమోదు పాన్గల్: గ్రామాల్లో క్షయ, మధుమేహ వ్యాధిగ్రస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పకడ్బందీగా నమోదు చేయాలని ఎన్సీడీ ప్రోగ్రామ్ జిల్లా అధికారి డా. రాంచందర్రావు సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అనుమానితుల వివరాలను ఆన్లైన్లో తప్పక నమోదు చేయాలన్నారు. అలాగే చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించాలని, ప్రతి గర్భిణి పీహెచ్సీలోనే కాన్పు చేయించుకునేలా సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య పరీక్షల విషయంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించడం సరికాదన్నారు. సమావేశంలో పీహెచ్సీ వైద్యుడు డా. చంద్రశేఖర్, సీహెచ్ఓ రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నదాత.. ఆందోళన
జూరాల ఆయకట్టుకు వారంలో రెండ్రోజులే నీటి సరఫరా ●రెండ్రోజులే అంటున్నారు.. అమరచింత ఎత్తిపోతల పథకానికి జూరాల ఎడమ కాల్వ నుంచి సాగునీరు అందుతుంది. ఎత్తిపోతల ఆయకట్టు కింద ఉన్న మూలమళ్ల, సింగపేట, ఖానాపురం, మస్తీపురం, అమరచింత, పాంరెడ్డిపల్లి గ్రామాల పరిధిలో యాసంగిలో 800 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రాజెక్టు అధికారులు వారబందీ విధానంలో కోత విధించి కేవలం రెండ్రోజులు మాత్రమే నీటిని అందిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులకు వాట్సాప్లో సమాచారమిస్తూ అప్రమత్తం చేస్తున్నాం. – ఆంజనేయులు, ప్రధానకార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం ఉన్నతాధికారుల ఆదేశాలతో.. జూరాల ప్రాజెక్టులో నిల్వనీటి మట్టం రోజురోజుకు పడిపోతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి సరఫరాలో కోతలు విధించాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే ఆలోచనలతో వారంతో రెండ్రోజులే కాల్వలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వ విభాగం అమరచింత: ఈ ఏడాది యాసంగిలో ఆయకట్టు విస్తీర్ణం తగ్గించిన ప్రాజెక్టు అధికారులు సాగునీటి సరఫరాలో కోతలు విధించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం పడిపోతుండటంతో వారబందీ విధానంలో వారంలో నాలుగు రోజులు కాల్వలకు నీరు వదలాల్సి ఉండగా.. అధికారులు రెండ్రోజులకు కుదించారు. సోమ, మంగళవారం కాల్వలకు నీరు వదిలి బుధవారం నుంచి నిలిపివేయనున్నారు. ఈ విధానాన్ని ప్రాజెక్టు అధికారులు ఈ నెల 2 నుంచి ప్రారంభించారు. ఏప్రిల్ 15 వరకు నీరందితేనే పంట చేతికందే అవకాశం ఉందని.. అకస్మాత్తుగా నీటి విడుదలను కుదిస్తే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ప్రాజెక్టు అధికారులకు విన్నవించుకుంటున్న పరిస్థితులు తలెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో సందేశాలు.. జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులకు లిఫ్ట్ నిర్వాహకులు నీటి కుదింపుపై వాట్సాప్ సందేశాలు పంపుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇకపై వారంలో రెండ్రోజులే కాల్వలకు నీటిని వదులుతున్నారని.. రైతులు పంటలు ఎండకుండా సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచిస్తుండటంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రాజెక్టులో నీటిమట్టం కేవలం 3.50 టీఎంసీలే.. బుధవారం నుంచి కాల్వలకు నీరు నిలిపివేత ఆయకట్టు రైతుల్లో మొదలైన ఆందోళన కుడి, ఎడమ కాల్వల పరిధిలో 35 వేల ఎకరాల సాగు -
ఆయిల్పాం సాగు లక్ష్యాన్ని చేరుకోవాలి
వనపర్తి: 2025–26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఆయిల్పాం సాగు లక్ష్యం 6,548 ఎకరాలు సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట సాగుతో కలిగే లాభాలను రైతులకు వివరించి పంట మార్పిడి చేసేలా చూడాలని.. ఏమైనా అపోహలుంటే తొలగించాలని సూచించారు. వ్యవసాయ అధికారులకు మండలాల వారీగా లక్ష్యాలిచ్చి పర్యవేక్షణ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో ఆయిల్పాం ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్, జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, ఎంఏఓలు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నెలాఖరు వరకు జిల్లావ్యాప్తంగా 30 పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ప్రజలు గుమిగూడేలా కార్యక్రమాలు నిర్వహించొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు చేపడితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు, కులమతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తిచేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత.. బుధవారం నుంచి జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పరీక్ష కేంద్రాల ఆవరణలో 163 బీఎన్ఎస్ఎస్– 2023 (144) సీఆర్పీసీ చట్టం అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరిగే సమయాల్లో కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని, 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని తెలిపారు. పరీక్ష సమయంలో పోలీస్ అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి మానసిక ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు
కొత్తకోట రూరల్: మహిళలు ఆర్థికంగా ఎదగడం చాలా ముఖ్యమని.. నాబార్డ్ అందిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ మహబూబ్నగర్ క్లస్టర్ డీడీఎం మనోహర్రెడ్డి సూచించారు. మంగళవారం పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో నాబార్డ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ వ్యవసాయ ఆర్థిక బలోపేతంతో గ్రామాలు గొప్పగా ఎదుగుతాయన్నారు. అనంతరం మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైదయ్య మాట్లాడుతూ.. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని.. అన్నిరంగాల్లో రాణించే శక్తి వారి సొంతమని కొనియాడారు. వ్యవసాయ రంగంలో విత్తనం పొలంలో నాటిన దగ్గర్నుంచి పంట ఉత్పత్తులు మార్కెట్లో విక్రయించే వరకు మహిళల పాత్ర కీలకమన్నారు. వ్యవసాయంలో రోజురోజుకు మహిళల ప్రాధాన్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. అనంతరం ఉత్తమ మహిళా రైతులు, ఉత్తమ స్వయం సహాయక బృందాల మహిళలను విద్యార్థులు, ప్రొఫెసర్లు సన్మానించారు. వనపర్తి జిల్లా అడిషనల్ డీఆర్డీఓ భాస్కర్, వనపర్తి లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, కళాశాల ఉమెన్ సెల్ ప్రొటెక్షన్ ఇన్చార్జ్ డా. ఆర్.పూర్ణిమా మిశ్రా, డా. విద్య, డా. గౌతమి, నవ్య, శ్వేత, ఏఈఓ రమేష్కుమార్, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు మహిళా రైతులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ లేకుంటే ఇబ్బందులే
వనపర్తిటౌన్: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 25 శాతం రాయితీతో నెలాఖరు వరకు అవకాశం ఇచ్చిందని.. సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయ సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ లేకుండా ప్లాట్లు కొనుగోలు చేస్తే మున్ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇళ్లు నిర్మించుకునే సమయంలో మార్కెట్ విలువపై 14 శాతం జరిమానా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 29 వేల మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారని.. క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కేవలం 38 మంది మాత్రమే డబ్బులు చెల్లించినట్లు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలోని 5 పురపాలికల్లో సుమారు 25 వేల మందికి నోటీసులు జారీ చేసినప్పటికీ ఫోన్నంబర్లు, చిరునామాల్లో తేడాలు ఉండటంతో వారికి సమాచారం చేరడం లేదన్నారు. ఏదైనా కారణంతో ఎల్ఆర్ఎస్ తిరస్కరిస్తే చెల్లించిన డబ్బు నుంచి 10 శాతం ప్రాసెసింగ్ ఫీజు మినహాయించుకొని మిగిలిన 90 శాతం తిరిగి యజమాని ఖాతాలో జమ చేస్తామని వివరించారు. ఓ రియల్ వ్యాపారి చిట్యాల సమీపంలో నాలా కన్వర్షన్ చేసి వెంచర్ వేశామని చెప్పగా ఆ వెంచర్ను వెంటనే రద్దు చేయాలని పుర కమిషనర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, అన్ని పురపాలికల కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లు, బిల్డర్లు, టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లు, రియల్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్సురభి -
ఆచూకీ లభించేనా.?
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరం ● ఎట్టకేలకు కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ ● ఎలాంటి సమాచారం బయటికి పొక్కనివ్వని అధికారులు అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ప్రశ్నార్థకంగా మారింది. రోజూ విడతల వారీగా ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా.. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. షిఫ్ట్ల వారీగా సొరంగంలోకి వెళ్లి వచ్చిన వారు కూడా సమాచారం అందించడం లేదు. కాగా, సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీటి ఊట రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లోకో ట్రైన్లో సహాయ బృందాలు 13.5 కిలోమీటర్లు వెళ్లడానికి సుమారు 2 గంటల సమయం పడుతోందని.. అక్కడికి వెళ్లి గంట పాటు పనులు చేసి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. టీబీఎం మెషీన్ విడి భాగాలను రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్తో తొలగిస్తున్నారు. ● భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం ఢిల్లీ నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకుంది. ఈ బృందం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సొరంగం కుప్పకూలిన ప్రదేశంలో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫోరెన్సిక్ బృందం రాక.. సొరంగంలో సహాయక బృందాలకు దుర్వాసన వస్తుందని.. మట్టి తవ్వకాల్లో ఎముకలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ బృందం సొరంగ ప్రాంతానికి చేరుకోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఉన్నతాధికారుల సమీక్ష.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. టన్నెల్ ఇన్ లెట్ ఆఫీస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న బృందాల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, మైనింగ్, ఫైర్ సర్వీసెస్, ర్యాట్ మైనింగ్ ప్రత్యేకతలు, ప్లాస్మా కట్టర్స్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన కారణంగా గంటకు 800 టన్నుల మట్టిని బయటకు తీసుకురాగలమని అధికారులు వెల్లడించారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని.. కన్వేయర్ బెల్టు ద్వారా వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకురానున్నట్లు చెప్పారు. సహాయక బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కాగా, సహాయక చర్యలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కల్నల్ పరిక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న తదితరులు ఉన్నారు. అందుబాటులోకి కన్వేయర్ బెల్టు.. సొరంగంలో టీబీఎం మెషీన్తో పాటు పనిచేసే కన్వేయర్ బెల్టు ధ్వంసమైంది. దీంతో సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను బయటికి తరలించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. సింగరేణి కార్మికులు పదుల సంఖ్యలో సొరంగంలోకి వెళ్లి పనులు చేసినప్పటికీ పురోగతి కనిపించలేదు. మట్టి, నీరు, బురదను బయటకు పంపడానికి శ్రమతో కూడుకున్న పనిగా మిగిలింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు కన్వేయర్ బెల్టును పునరుద్ధరించారు. అయితే ప్రమాదం జరగకముందు సొరంగంలో జరిగిన పనులకు సంబంధించిన మట్టి, రాళ్లు కన్వేయర్ బెల్టుపై ఉండటంతో, వాటిని మాత్రమే బయటికి తరలించారు. -
కాంగ్రెస్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని హంగామా సృష్టించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. రూ. 550 కోట్ల పనులకే పరిమితం కావడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అనే కాంగ్రెస్ నైజం వనపర్తి వేదికగా బయటపడిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా ఉందని ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఒకే పార్టీలో ఉంటూ కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన కిషన్రెడ్డిపై అనవసర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ నాయకులు చిత్తారి ప్రభాకర్, రామన్గౌడ్, పెద్దిరాజు, శ్రీనివాస్, కుమారస్వామి, వెంకటేశ్వర్రెడ్డి, కుమార్, గోపినాథ్, రాజశేఖర్గౌడ్, నవీన్చారి, రవికుమార్ ఉన్నారు. -
పాలమూరుకు అన్యాయం చేయం
వనపర్తిటౌన్: పాలమూరుకు అన్యాయం జరిగితే తట్టుకోలేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీరు తీసుకుపోవడాన్ని మంత్రి మండలి సమావేశంలో తాను విభేదించినట్లు చెప్పారు. 6, 7 టీఎంసీలు నిల్వ ఉండే ఏదుల రిజర్వాయర్ నుంచి కాకుండా వట్టెం నుంచి రెండు ప్రాంతాల్లో లిఫ్ట్ చేస్తే కేవలం రూ. 200 కోట్లతో డిండికి నీరు తీసుకెళ్లవచ్చని సూచించినట్లు వెల్లడించారు. కొన్ని శాఖల అధికారులు, గత ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 62కోట్లతో కొత్తగా మంజూరు చేసిన కాశీంనగర్ ఎత్తిపోతల పథకంతో అంజనగిరి, దత్తాయిపల్లి, జయన్న తిర్మలాపూర్, అప్పాయిపల్లి, కాశీంనగర్తో పాటు 19 తండాల్లో 4వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. డీ– 8 కాల్వ నుంచి గ్రావిటీ ద్వారా రామన్నగట్టు రిజర్వాయర్లో నీరు నిల్వచేసి, లిఫ్ట్ ద్వారా ప్రతిపాదిత ప్రాంతాలకు సాగునీరు అందుతాయన్నారు. వనపర్తి వాసులకే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు స్థానికంగా, హైదరాబాద్ వేదికగా వైద్యసేవలు అందించిన డాక్టర్ మాధవరెడ్డి విగ్రహాన్ని వనపర్తిలో ఏర్పాటు చేయడంతో పాటు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్కు ఆయన పేరు పెడతామన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ సంస్థలతో కలిసి ముందుకు సాగారని.. ఆ తర్వాత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో విపత్కర సమస్య ఉత్పన్నమైందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నాయకులు ఖమర్, కోట్ల రవి, బాబా, సహదేవ్, కోళ్ల వెంకటేష్, యాదయ్య, ప్రవీణ్కుమార్రెడ్డి, పెంటన్న, సమద్, జాన్ తదితరులు ఉన్నారు. -
కొనసాగుతున్న అన్వేషణ
● బురద, ఊట నీరే ప్రధాన సమస్య ● నిమిషానికి 10– 20 వేల లీటర్ల నీటి ఊట ● సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తేవడంలో అవరోధాలు ● పదోరోజు కొనసాగిన సహాయక చర్యలు ● రెస్క్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం అచ్చంపేట/మన్ననూర్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు సోమవారం పదో రోజు కూడా కొనసాగాయి. కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే భారీస్థాయిలో పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న నీటి ఊటతో వీరి అన్వేషణకు అవరోధాలు కలిగిస్తున్నాయి. దాదాపు 10– 20 వేల లీటర్ల మేర నీటి ఊట ఉబికి వస్తుంది. మరోవైపు తమవారి రాక కోసం కుటుంబసభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎస్ఎల్బీసీ సందర్శించిన సీఎం రేవంత్రెడ్డి కన్వేయర్ బెల్టు మరమ్మతు సోమవారం సాయంత్రానికి పూర్తవుతాయని చెప్పారు. కానీ, ఇక్కడి పరిస్థితి చూస్తే మరో రెండు రోజులైనా కన్వేయర్ బెల్టు మరమ్మతు జరిగే అవకాశం కనిపించడం లేదు. దీనికోసం సింగరేణి, రాబిట్ బృందాలు కష్టపడుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను సింగరేణి బృందాలు మాన్యువల్ పద్ధతిలో తవ్వకాలు చేపడుతున్నారు. ఆ మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కూడా ఒకింత ఆటంకం సృష్టిస్తుంది. దీనిని బట్టి 15 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, మట్టి బయటికి తేవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రాడార్ (జీపీఆర్) స్కానింగ్ గుర్తించిన మూడు, నాలుగు ప్రదేశాల్లో శిథిలాలు తొలగించినా ఆనవాళ్లు దొరకలేదు. ఎంత తవ్వితే అంత ఊట బయటికి వస్తుండటంతో ఎప్పటిప్పుడు డీవాటరింగ్ చేస్తున్న పనులకు అడ్డంకులు కలిగిస్తుంది. -
సీసీరోడ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
ఖిల్లాఘనపురం: సీసీరోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పంచాయతీరాజ్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఖిల్లాఘనపురం, వెంకటాంపల్లి గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 10లక్షలతో నిర్మించిన సీసీరోడ్లను ఏఈ రమేష్ నాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో ఎస్సీ సబ్ప్లాన్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పోరాటాలతోనే హక్కుల సాధన వనపర్తి రూరల్: పోరాటాలతోనే కార్మికుల హక్కులు సాధ్యమవుతాయని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ్మ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సెకండ్ ఏఎన్ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికవర్గం సంఘటితంగా పోరాడితేనే పాలక వర్గాలు దిగివస్తాయన్నారు. సెకండ్ ఏఎన్ఎంలకు వందశాతం గ్రాస్ శాలరీతో పాటు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని.. ఏఎన్ఎంల పోస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, సెకండ్ ఏఎన్ఎంల సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మమ్మ, సుమిత్ర, అరుణ, మాధవి, పార్వతి, విజయ, లక్ష్మి, శివలీల, నాగలక్ష్మి, హారతి, ఈశ్వరమ్మ ఉన్నారు. ఉపాధి హామీ కూలీలకు వసతులు కరువు పాన్గల్: ఉపాధి హామీ పథకం పనులు చేపడుతున్న ప్రాంతాల్లో కనీస వసతులు లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యుడు బాల్యానాయక్ అన్నా రు. సోమవారం మండలంలోని తెల్లరాళ్లపల్లిలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కూలీలకు సకాలంలో కూలి డబ్బు లు అందకపోవడంతో పాటు పని ప్రదేశంలో సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు ఉపాఽ ది హామీ పనులను పర్యవేక్షిస్తూ.. కూలీల ఇబ్బందులను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కృష్ణయ్య, సా యిలు, భీమయ్య, భగవంతు పాల్గొన్నారు. -
సర్వం సన్నద్ధం
ఇంటర్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు అమరచింత: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 5నుంచి 25వ తేదీ వరకు జరిగే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో మొత్తం 12,150 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 6,457 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,693 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 600 మంది ఇన్విజిలేటర్లను నియమించడంతో పాటు నాలుగు సిట్టింగ్ స్క్వాడ్స్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని.. విద్యార్థులు 8:45 గంటలలోగా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి.. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య అన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తూ.. విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లోని అన్ని గదుల్లో విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. డ్యూయల్ డెస్క్ బెంచీలు, తాగునీటి వసతులను యథావిధిగా కల్పించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా కళాశాలల్లో విద్యార్థులను వార్షిక పరీక్షలకు అన్నివిధాలా సన్నద్ధం చేశారు. పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సీసీ నిఘాలో.. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు ఈసారి సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక స్క్వాడ్స్తో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్పడి పట్టుబడితే విద్యార్థులు తమ విలువైన గమ్యాన్ని కోల్పోతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. 163 సెక్షన్ అమలు.. ఇంటర్ పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమ యం ముగిసే వరకు మూసి ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రా సేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు పూర్తి.. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 12,150 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు 25 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే విద్యార్థులకు హాల్టికెట్లు అందాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. – ఎర్ర అంజయ్య, డీఐఈఓ జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల ఏర్పాటు హాజరుకానున్న 12,150 మంది విద్యార్థులు రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు -
వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి
వనపర్తి టౌన్: వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్, చీఫ్ ఇంజినీరు పాండే ఆదేశించారు. వేసవి యాక్షన్ ప్లాన్ పనుల పరిశీలనలో భాగంగా సోమవారం జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయాలన్నారు. వ్యవసాయ, గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని సూచించారు. వేసవి యాక్షన్ ప్లాన్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 33కేవీ బుద్ధారం ఫీడర్ ఓవర్లోడ్ను నియంత్రించాలన్నారు. అందుకోసం 33/11 కేవీ పొలికేపాడ్ సబ్స్టేషన్ లోడ్ను 33కేవీ బుద్ధారం ఫీడర్ నుంచి 33కేవీ గోపాల్పేట ఫీడర్కు మార్చాలని ఆదేశించారు. అదే విధంగా 33 కేవీ సోళీపూర్ ఫీడర్ నిర్మాణంలో ఉన్న లైన్ను పర్యవేక్షించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పెద్దమందడి మండలం వెల్టూర్ 33/11 కేవీ సబ్స్టేషన్లో 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో రూ. 1.10కోట్ల బడ్జెట్తో 5 ఎంబీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పెద్దమందడి మండలం అనకాయపల్లి తండాలో రైతులతో ఆయన సమావేశమై విద్యుత్ సమస్యలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎస్ఈ రాజశేఖరం, వెంకటశివరాం తదితరులు ఉన్నారు. -
క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం
జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియను ఈ నెల 17వ తేదీలోగా వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో క్షయవ్యాధి, మిషన్ మధుమేహం, పిల్లలకు టీకాల కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1.60 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 1.26 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 281 మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. అదే విధంగా మిషన్ మధుమేహలో భాగంగా మొత్తం 2.30 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు లక్ష మందికి మాత్రమే పరీక్షలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారిని ఈ నెల 20 వరకు నిర్ధారణ పరీక్షలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 23వేల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పిల్లలకు సమయానుసారం ఇవ్వాల్సిన వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో ఇవ్వాలని సూచించారు. టీకాలు ఏ ఒక్కటి పెండింగ్లో ఉండకూడదన్నారు. గర్భిణులకు సకాలంలో ఏఎన్సీ నమోదు చేయించడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో సుఖ ప్రసవాలు జరిగే విధంగా కృషి చేయా లన్నారు. అనంతరం పోలియో రహిత సమాజం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూపొందించిన క్యా లెండర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు సాయినాథ్, పరిమళ, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
పంటలకు సాగునీరు అందిస్తాం
వనపర్తి: జిల్లాలో యాసంగి పంటలకు సకాలంలో తడి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి యాసంగి పంటలు, ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెనూ అమలు తదితర అంశాలపై కలెక్టర్, ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది యాసంగిలో దాదాపు 90వేల ఎకరాల్లో వరిసాగు చేయగా.. ఈసారి 52 శాతం అధికంగా 1.41 లక్షల ఎకరాల్లో సాగుచేయడం జరిగిందన్నారు. ఏదుల, పెబ్బేరు మండలాలకు కొంత సాగునీటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని.. జూరాల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీరు వదిలితే సమస్య తీరుతుందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. వీసీలో డీఏఓ గోవింద్ నాయక్, విద్యుత్శాఖ ఎస్ఈ రాజశేఖర్, ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ ఉన్నారు. నిబంధనల మేరకే అనుమతులు.. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లాలో కొత్తగా ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, డెంటల్ ఆస్పత్రుల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టరేట్లో డీఎంహెచ్ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పరిశీలించింది. దరఖాస్తులో పొందుపరిచిన విషయాలు, ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలు, డాక్టర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లినికల్ యాక్ట్ ప్రకారం ఉన్న వాటికి అనుమతులు మంజూరు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. నేటి ప్రజావాణిలో 22 అర్జీలు వచ్చాయని.. వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. గతేడాది కంటే ఈసారి 52 శాతం అధికంగా సాగు కలెక్టర్ ఆదర్శ్ సురభి -
మరో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధికి హామీ
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం సుమారు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని.. మరో రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపర్తిలో విద్య అభ్యసించిన అభిమానంతో ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్గా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారన్నారు. అతి తక్కువ కాలంలో సీఎం సభ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం.. విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల విషయమై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన ఆరోపణలు సత్యదూరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ నిర్మాణాలకు మాత్రమే జీఓలు ఇచ్చారని.. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసింది 500 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి మాత్రమేనన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అదే విధంగా గతంలో కేటీఆర్ ఐటీ టవర్, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వ జీఓలు లేకుండానే శంకుస్థాపన చేశారని.. ఈ విషయమై పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దివంగత మాజీ ఎమ్మెల్యేలు జయరాములు, బాలకిష్ట్ణయ్య పేర్లతో గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రికి నామకరణం చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చందర్, నాయకులు కిచ్చారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
కొత్తకోట రూరల్: వసతిగృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కమిషనర్ క్షితిజ ఆదేశించారు. ఆదివారం కొత్తకోట పట్టణంలోని ఎస్సీ బాలుర, బాలికల వసతిగృహాలతో పాటు కానాయపల్లి శివారులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో స్టోర్ రూంలతో పాటు డార్మెంటరీ హాల్స్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. హాస్టల్లో భోజనం మంచిగా ఉంటుందా? కూరగాయలు రుచికరంగా ఉన్నాయా లేదా? అని తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. వసతిగృహాల్లో ఉంటూ చదువుతున్న ప్రతి విద్యార్థి 10/10 జీపీఏ సాధించాలని సూచించారు. వార్షిక పరీక్షలను భయంతో కాకుండా ఇష్టంతో రాస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులందరూ భవిష్యత్లో ఉన్నతంగా జీవించాలని ఆకాంక్షించారు. కమిషనర్ వెంట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఎం.మల్లికార్జున్, డివిజనల్ ఆఫీసర్ జె.మల్లేశం, వసతిగృహ సంక్షేమ అధికారులు బెనర్జీ, సంతోష్ కుమార్, జ్యోతి, గోపాల్ నాయక్ ఉన్నారు. -
పరిస్థితి సంక్లిష్టం
ఎస్ఎల్బీసీ సొరంగంలో అవశేషాల గుర్తింపుపై వీడని సందిగ్ధం అచ్చంపేట రూరల్: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభ్యతపై స్పష్టత కరువైంది. వారి కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వారి ప్రాణాలపై ఆశలు వదులుకున్నప్పటికీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాల్లో పొంతన లేకుండా పోయింది. నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. సహాయక చర్యలను వేగిరం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయక చర్యల్లో మొత్తం 11 బృందాలు పాల్గొంటున్నప్పటికీ.. ప్రధానంగా సింగరేణి కార్మికులే అధికంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా.. కార్మికుల ఆచూకీ లభ్యతపై సందిగ్ధం వీడటం లేదు. మరోవైపు జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలు కనుగొన్నామని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. నిజ నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి.. అక్కడ చేపడుతున్న సహాయ చర్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో దాదాపు గంటన్నర పాటు సమీక్షించారు. కానీ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యతపై స్పష్టతనివ్వలేదు. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని, మరో రెండు, మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్వయంగా సీఎం ప్రకటించడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొండల నుంచి నీరు వస్తుండటంతోనే.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కొండల నుంచి నీరు రావడమేనని అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వు టైగర్ ఫారెస్ట్లో ఉన్న తిర్మలాపూర్ సమీపం నుంచి లేదా మల్లెలతీర్థం నుంచి నీరు వస్తున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే జియోలాజికల్ సర్వే అధికారులు అటవీ శాఖ అధికారులతో కలిసి నీటి ధారలు ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయనే కోణంలో సర్వే చేపట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదస్థలంలో సముద్ర మట్టానికి 450 మీటర్ల లోతులో కుర్తిపెంట ప్రదేశంలో నీటి పొరలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నీటి పొరలు అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామ పరిసర అడవుల్లోని ఉసురు వాగు, మల్లె వాగు, మల్లెల తీర్థం తదితర ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్లు చెబుతున్నారు. వాగుల ప్రవాహంతోనే నీరు వస్తుందని అధికారులు నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది. టన్నెల్లోకి వెళ్లిన రెస్క్యూ బృందం గంటల తరబడి మట్టి, రాళ్ల శిథిలాలను తొలగించింది. అయితే నీటి ఊటతో బురద పెరుగుతుందని చెబుతున్నారు. టన్నెల్లో నలుగురి అవశేషాలను గుర్తించిన ప్రాంతంలో 8 మీటర్ల వరకు మట్టి, రాళ్లను తొలగించారు. మరో మూడు మీటర్లు తొలగిస్తే కాని ఏ విషయం తేలే అవకాశం లేదని తెలుస్తోంది. సింగరేణి కార్మికులు షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒక్కో షిఫ్ట్కు 40 నుంచి 80 మంది వరకు సొరంగంలోకి ప్రవేశించి.. అక్కడ మట్టి, నీరును వేరు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. సహాయక చర్యలను కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులు పర్యవేక్షించారు. నీటి ఊటతో పెరుగుతున్న బురద.. కార్మికుల ఆచూకీ కోసం తప్పని ఎదురుచూపులు తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు భారీగా ఉబికి వస్తున్న నీరు, బురదతో ఆటంకాలు -
పాలమూరు రుణం తీర్చుకుంటా
కేసీఆర్ వల్లే కృష్ణా జలాల కేటాయింపుల్లో అన్యాయం ● పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు ● మహిళల పేరుతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ● ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే సహించను ● వనపర్తి బహిరంగసభలో సీఎం రేవంత్రెడ్డి కార్పొరేషన్ల వ్యవస్థ మళ్లీ బలోపేతం ఎీస్స, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పదేళ్ల పాలనలో కేసీఆర్ నిర్వీర్యం చేశారని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు కార్పొరేషన్ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లుకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.14,870 కోట్లను రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లించిందన్నారు. సన్న రకాలు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో రూ.1804 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసా సంక్షేమ పథకాల కోసం, ప్రజాభివృద్ధి కోసం ఉపయోగిస్తామని వెల్లడించారు. ● ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని పేర్కొన్నారు. ●● మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే నిలిచాయన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా 50 రోజుల్లో కులగణన చేపట్టి పూర్తి చేసిందన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జాబ్మేళాలు నిర్వహించి 295 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ●వనపర్తి: ‘నల్లమల ప్రాంతంలో పుట్టి.. చైతన్యవంతమైన వనపర్తిలో పెరిగి విద్యాభ్యాసం చేశాను. స్వస్థలమైన పాలమూరు ప్రాంత రుణం తీర్చుకుంటాను.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని విస్మరించారని, కృష్ణా జలాల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరుతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఆడ బిడ్డలను విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలంటే సలాకి కాల్చి వాత పెట్టాలన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అప్పగించి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇప్పటికింకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు. ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి ● వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రాంతంలో విద్యను అభ్యసించిన సీఎం ఈ ప్రాంతంపై అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటికే రూ.375 కోట్ల అభివద్ధి పనులను చేపట్టామని, మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను చేసేందుకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో చాలా సంక్షేమ హాస్టల్లో ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయని.. వాటికి పక్కా భవనాల నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా సీఎంను కోరారు. జిల్లాలో నూతనంగా నిర్మించనున్న 500 పడకల ఆస్పత్రికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకిష్టయ్య పేరు పెట్టాలని, రాజమహల్ మరమ్మతులు చేసేందుకు అనుమతిచ్చి.. కావాల్సిన నిధులు మంజూరు చేయాలని, వనపర్తి నియోజకవర్గంలోని 133 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు. పాలమూరు వాసులు అమాయకులేం కాదు.. -
మందకొడిగా ఆస్తిపన్ను వసూలు
బహిరంగ సభకు హాజరైన ప్రజలు జిల్లాలో మండలాల వారీగా ఆస్తిపన్ను వసూలు లక్ష్యం ఇలా.. (రూ.లలో) మండలం గ్రామాలు లక్ష్యం వసూలు శాతం వనపర్తి 26 19,58,306 16,44,577 83.98 ఆత్మకూర్ 13 13,70,596 10,78,976 72.00 పెబ్బేరు 20 30,10,606 13,47,837 44.77 వీపనగండ్ల 14 14,05,306 10,85,228 77.27 మదనాపూర్ 17 19,55,803 7,31,0030 37.38 అమరచింత 14 10,46,667 6.62,871 63.33 గోపాల్పేట 15 21,72,579 10,12678 46.61 రేవల్లి 12 08,38,766 5,58,544 66.59 ఖిల్లాఘనపూర్ 27 29,12,286 22,91,747 78.69 శ్రీరంగాపూర్ 8 08,52,461 5,74,616 65.82 పాన్గల్ 28 24,14,567 22,39,428 92.75 చిన్నంబావి 17 14,49,673 13,33,306 91.97 కొత్తకోట 22 26,12,637 23,28,643 89.13 పెద్దమందడి 22 16,36,701 11,10231 67.83 ● గ్రామపంచాయతీల్లో ఇప్పటి వరకు 70శాతం మాత్రమే రాబడి ● ముంచుకొస్తున్న గడువు ● లక్ష్యాన్ని చేరుకుంటామంటున్న అధికారులు ఆత్మకూర్: గ్రామపంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు పన్నులే. ఇలాంటి పన్నుల వసూలులో పురోగతి కనిపించడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు కేవలం 28 రోజుల వ్యవధి మాత్రమే ఉండగా.. జిల్లాలోని 14 మండలాల్లో పన్ను వసూలు మందకొడిగా సాగుతోంది. ప్రస్తుతం వేగవంతంగా పన్ను రాబడితేనే లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరం రూ. 2.41 కోట్ల పన్ను వసూలుచేసి వందశాతం పూర్తిచేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,56,57,445 పన్ను లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ. 1,79,99,712 మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ. 1,95,67,051 పన్ను వసూలు కావాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా జీపీలకు 70 శాతం మాత్రమే పన్ను రాబడి వచ్చింది. ఈ నెలాఖరు నాటికి వందశాతం పన్ను వసూలు చేసి.. లక్ష్యాన్ని చేరుకుంటామని సంబందిత అధికారులు అంటున్నారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాగా, ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలోనే పన్ను వసూలుపై అధికారులు హడావుడి చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. వేగవంతం చేశాం.. జిల్లాలోని అన్ని జీపీల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఆస్తిపన్ను వసూలును వేగవంతం చేశాం. ఈ విషయమై మండలాల వారీగా పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల రెండో వారంలోనే వందశాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. – సురేష్, డీపీఓ -
సమస్య మోదీ కాదు.. కిషన్రెడ్డి: సీఎం రేవంత్
సాక్షి, వనపర్తి: బీఆర్ఎస్, బీజేపీ నేతల తప్పుడు మాటలు నమ్మొద్దని.. ఆ పార్టీలు కలిసి కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒకేసారి రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశాం. 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పథకాలు అమలు చేయడం లేదని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలకు వాతలు పెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ చేశామని సీఎం పేర్కొన్నారు.కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రాష్ట్రానికి సమస్య మోదీ కాదు.. కిషన్రెడ్డి’ అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. తెలంగాణపై కిషన్రెడ్డి పగబట్టారు. ఆయనకు ఎందుకంత అక్కసు?. ఖట్టర్ సమీక్షకు హాజరుకాని కిషన్రెడ్డి.. మెట్రోకు సహకరిస్తున్నారంటే నమ్మాలా?. కిషన్రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు. ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గత ప్రభుత్వమే కారణం. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
నేడు జిల్లాకు సీఎం రాక
వనపర్తి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకుగాను అధికార, పాలకవర్గం భారీఎత్తున ఏర్పాట్లు చేసింది. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4:35 వరకు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. హెలీకాప్టర్లో హైదరాబాద్ నుంచి 11.30కి జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని స్వామి వారి దర్శనానంతరం ఆలయ అభివృద్ధికి రూ.కోటి ప్రొసీడింగ్ పత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ అయ్యలూరి రఘునాథశర్మకు అందజేస్తారు. అటు నుంచి తను విద్యనభ్యసించిన జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకొని అక్కడే పాఠశాల, కళాశాల భవన నిర్మాణాలు, జీజీహెచ్ భవనం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఐటీ టవర్, శ్రీరంగాపురం ఆలయ అభివృద్ధి పనులు, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవనం, జిల్లాకేంద్రంలోని రాజనగరం శివారు నుంచి పెద్దమందడి వరకు బీటీరోడ్డు నిర్మాణం, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ బిల్డింగ్, నియోజకవర్గంలోని సీఆర్ఆర్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని తన పాఠశాల, కళాశాల మిత్రులు, గురువులతో కాసేపు గడిపి వారితో కలిసి భోజనం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20కి బయలుదేరి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడే రేవంతన్న కా భరోసా అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, కుట్టుమిషన్లు, నియామక పత్రాలు అందజేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు హెలీకాప్టర్లో తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నారు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జోగుళాంబ డీఐజీ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ నుంచి జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల వరకు రూట్ బందోబస్తును పరిశీలించారు. సభాస్థలి, సీఎం పర్యటించనున్న ప్రదేశాలు, పైలెట్ వాహనాల ట్రయల్రన్ నిర్వహించారు. వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ ఓపెనింగ్ పార్టీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లపై చిరు వ్యాపారులు, వాహనాలు నిలుపరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ సభకు వచ్చే వాహనాలకు ఆర్టీసీ బస్డిపోలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని.. కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని సూచించారు. బందోబస్తును మొత్తం ఏడు సెక్టార్లుగా విభజించామని.. నలుగురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 28 మంది ఎస్ఐలు, 140 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 420 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్, 250 మంది హోంగార్డులు విధులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట సీఐ కృష్ణ, ఇతర పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు. రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ‘రేవంతన్న కా భరోసా’ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి -
చివరి అంకానికి..
ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది కార్మికుల అవశేషాల గుర్తింపు సాక్షి, నాగర్కర్నూల్/అచ్చంపేట రూరల్: ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను వెలికితీసేందుకు చేపడుతున్న సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. నేడో, రేపో సొరంగం నుంచి కార్మికులను బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదట గుర్తించిన ఒక స్పాట్ నుంచి నలుగురు, ఆ తర్వాత మరో స్పాట్ నుంచి నలుగురు కార్మికులను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి ఊట పెరుగుతుండటం, మట్టి తొలగింపునకు కన్వేయర్ బెల్టు అందుబాటులోకి రాకపోవడంతో ఆలస్యం అవుతోంది. శనివారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి సంఘటన స్థలానికి చేరుకుని, పనులను పర్యవేక్షించారు. నీటి ఊట, మట్టి తొలగింపుతో పనులు ఆలస్యం.. మొత్తం 13.85 కి.మీ. సొరంగ మార్గంలో 13.61 పాయింట్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి. మిగతా చోటును గాలించేందుకు అక్కడ సుమారు 18 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, శిథిలాలు ఆటంకంగా మారాయి. జీపీఆర్ గుర్తించిన చోట తవ్వకాలు జరిపేందుకు సింగరేణి, ర్యాట్ మైనింగ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి మిషనరీ లేకుండా వారు మ్యానువల్గా తవ్వకాలు చేపడుతున్నారు. టీబీఎం సంబంధిన విడిభాగాలు, శిథిలాలను కట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సహాయక బృందాల రాకపోకలకు, మట్టి, శిథిలాల తరలింపునకు దారిని ఏర్పాటు చేస్తున్నారు. కట్టర్ చివరి భాగంలో కా ర్మికులు ఉన్నట్టుగా భావిస్తున్న చోట తవ్వకాలు చేపడుతుండగా, పెద్ద ఎత్తున వస్తున్న నీటి ఊటతో అవరోధాలు ఏర్పడుతున్నాయి. నీటిని తోడేందుకు డీవాటరింగ్, మట్టిని తొలగించేందు కు చేపడుతున్న చర్యలతో ఆలస్యం అవుతోంది. అదనపు మోటార్ల ఏర్పాటు.. సొరంగం సెగ్మెంట్ బిగిస్తుండటంతో ఏర్పడిన రంధ్రాల ద్వారా నీటి ఊట టన్నెల్లోకి అధికమైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఏర్పాటు చేసిన మోటార్లు సరిపోవడం లేదు. టన్నెల్లోకి నీట ఊట అధికమవడంతో ఐదు అదనపు మోటార్లను, ప్రత్యేకంగా పైపులను ఏర్పాటు చేసి.. నీటిని తోడేస్తున్నారు. బురద గట్టి పడటంతో సింగరేణి కార్మికుల వద్ద ఉన్న పారలు సైతం వాడకంలోకి రావడం లేదు. దీంతో అదనంగా గడ్డపారలు తెప్పించారు. పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్లు వాడుతున్నారు. ఊట నీటిని, మట్టిని తొలగిస్తేనే చిక్కు కున్న వారి అవ శేషాలు వెలికి తీసేం దుకు వీల వుతుంది. టీబీఎంకు ఇరువైపులా ఉన్నట్లు గుర్తించిన జీపీఆర్ స్కానింగ్ నేడు నలుగురు, 2 రోజుల తర్వాత మరో నలుగురు కార్మికులను వెలికి తీస్తారని అంచనా సహాయక చర్యలను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సీఎస్ శాంతికుమారి ఆశలు లేనట్లేనా..? సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నిష్ణాతులైన రెస్క్యూ టీంలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. టన్నెల్లో పేరుకుపోయిన బురద, నీటి ఊటలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని అధికారులు చెబుతున్నా.. ప్రమాదం జరిగిన సందర్భంలోనే చిక్కుకున్న వారి ప్రాణాలు పోయాయని పలువురు చర్చించుకుంటున్నారు. కుటుంబీకుల ఎదురుచూపులు.. పొట్టకూటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు, సిబ్బంది ఎస్ఎల్బీసీ సొరంగంలో పనులు చేస్తూ చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎస్ఎల్బీసీలో జేపీ కంపెనీలో పనులు చేస్తున్నారు. కాగా ఏడు రోజుల నుంచి సొరంగంలో తమ వారు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను చూసి సొరంగంలో చిక్కుకున్న వారి బంధువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. క్షేమంగా బయటపడతారని ఇన్ని రోజులు ఎదురు చూశామని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు భిన్నంగా ఉన్నాయని వాపోతున్నారు. జేపీ కంపెనీ సమీపంలోకి పెద్దఎత్తున పార్థివ అంబులెన్సులు రావడంతో తమవారి ప్రాణాలపై ఆశలు లేవని అర్థమైందని అక్కడికి వచ్చిన బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. -
ఎన్నికల ప్రచార బోర్డులు రాసిన ప్రాంతానికి సీఎం హోదాలో..
ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో రేవంత్రెడ్డి గోడలపై ప్రచార రాతలు రాశారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయనే వెల్లడించారు. అదే ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో రానుండటంతో ఈ ప్రాంత ప్రజలు ఆయనను చూసేందుకు, పలకరించేందుకు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో తన గుర్తింపు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని స్థానికులు ఆశిస్తున్నారు. -
భారీ జన సమీకరణ..
స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వేదికగా జరగనున్న ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభకు పెద్దఎత్తున జన సమీకరణ చేసేందుకు అధికార, పాలకవర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. సుమారు 20 వేల మందిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్లు కాంగ్రెస్పార్టీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. పలువురు ప్రధాన నాయకులు సీఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. -
నాటి స్నేహితులతో ఆత్మీయ భేటీ..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 1979–80లో స్థానిక కేడీఆర్ యూపీఎస్లో ఏడోతరగతి, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు, 1983–85 వరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆయనతో కలిసి చదువుకున్న మిత్రులతో పాటు చదువు చెప్పిన గురువులను సైతం ఈ పర్యటనలో కలవనున్నారు. ఈ మేరకు అధికారులు మిత్రబృందం, గురువులు సుమారు 300 మందికి ప్రత్యేక పాసులు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీరితో ముఖ్యమంత్రి సుమారు రెండు గంటల పాటు గడిపి అక్కడే భోజనం చేయనున్నారు. ఇందుకుగాను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఏర్పాట్లు చేశారు. ఆయన మిత్రుల్లో రైతుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ వ్యాపారులు, రాజకీయ నాయకులు తదితర వర్గాలవారు ఉండటం గమనార్హం. -
దివ్యాంగులు యూడీ ఐడీ కలిగి ఉండాలి
వనపర్తి: దివ్యాంగులందరూ యూడీఐడీ (యూనిక్ డిజేబుల్ ఐడి) కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. అనంతం సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. యూడీఐడీ దరఖాస్తుల నమోదుపై మీ–సేవ కేంద్రాల నిర్వాహకులు, పంచాయతీ కార్యదర్శులు, వీఓఏలు, సీసీలు, ఎంపీడీఓలు, ఏడీఎంలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రుల్లో వికలత్వం నిర్ధారణకు అవసరమైన వైద్యులు, పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, శిబిరాల్లో దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆస్పత్రుల్లో స్లాట్ బుకింగ్ చేసి సమాచారం ఇవ్వాలని, నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత యూడీఐడీ కార్డు ఇవ్వాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సంక్షేమాధికారి సుధారాణి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సైన్స్మేళాలు దోహదం వనపర్తి రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందేందుకు, భవిష్యత్లో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు సైన్స్ మేళాలు దోహదపడుతాయని డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు. శనివారం మండలంలోని చిట్యాల శివారు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో నిర్వహించిన పీఎంఎస్హెచ్ఆర్ఐ పాఠశాలల జిల్లాస్థాయి సైన్స్మేళా, గణితమేళాను ఆయన ప్రారంభించారు. జిల్లాలోని 15 పాఠశాలల విద్యార్థులు పాల్గొని గణితం, సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు. ఏఎంఓ మహానంది, జిల్లా ప్లానింగ్ కో–ఆర్డినేటర్ శేఖర్, ఎస్ఓ యుగంఘంర్, జీసీడీఓ శుభలక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్స్పాల్ గురువయ్యగౌడ్, డిగ్రీ కళాశాల అధ్యాపకులు దామోదర్రెడ్డి, శ్రీనివాస్, ఆర్పీ బలరాముడు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ప్రదర్శనలను తిలకరించారు. పాఠశాల చైర్మన్ రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పటిష్ట చర్యలు
వనపర్తి: మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ శాంతికుమారి ఇంటర్ పరీక్షలు, ఎల్ఆర్ఎస్ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఈ ఏడాది 12,150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని.. నిర్వహణకు 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఇన్విజిలేటర్లకు శిక్షణ సైతం పూర్తి చేశామని.. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు, పరీక్ష సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. కేంద్రాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు అందుబాటులో ఉంచాలని పుర, పంచాయతీ అధికారులను ఆదేశించామని చెప్పారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఐఈఓ అంజయ్య, డీపీఓ కృష్ణ పాల్గొన్నారు. పరీక్షలు సక్రమంగా జరిగేలా చూడాలి.. వనపర్తి విద్యావిభాగం: త్వరలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలు సక్రమంగా జరిగేలా చూడాలని ఇంటర్బోర్డ్ పరిశీలకుడు విశ్వేశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. వార్షిక పరీక్షల నిర్వహణ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీఐఈఓ ఎర్ర అంజయ్య వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని వివరించారు. సమావేశానికి 25 కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు, బఫర్ స్టాఫ్ హాజరయ్యారు. రామన్పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఎన్టీఆర్ కాల్వకు 940 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 24 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 862 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
అదనపు బృందాల రాక
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు శుక్రవారం రామగుండం, కొత్తగూడెం నుంచి అదనంగా సింగరేణి బృందాలు చేరుకున్నాయి. సింగరేణి కార్మికులు ఎక్కువగా కష్టపడుతూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు సింగరేణి కార్మికులు సొరంగంలో బురద మట్టిని తొలగించడానికి శాయశక్తులా పనిచేశారు. సింగరేణి కార్మికులు విడతల వారీగా సొరంగంలోకి వెళ్లి పనులు చేపడుతున్నారు. వీరితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, బీఆర్ఓ, రైల్వే శాఖతో పాటు పలు ప్రైవేట్ నిర్మాణ సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ● అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం టన్నెల్లో 11.560 కి.మీ., నుంచి 12.950 కి.మీ., వరకు వాటర్, బురద పేరుకుపోగా.. రెండు రోజులుగా వీటిని తొలగిస్తున్నారు. అలాగే 150 మీటర్ల మేర పేరుకున్న మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టీబీఎం శిథిలాలను తొలగించే చర్యలు ముమ్మరం చేశారు. -
‘యూపీఎస్పై యుద్ధభేరి’ జయప్రదం చేయండి
పాన్గల్: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టే ‘యూపీఎస్పై యుద్ధభేరి’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బౌద్దారెడ్డి, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, చింతకుంట పాఠశాల జీహెచ్ఎం షేక్యానాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని చింతకుంట ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్లను వారు ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కార్యక్రమానికి భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, మనోహర్గౌడ్, భాస్కర్రెడ్డి, బక్కన్న, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ రావుల గిరిధర్, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. బహిరంగ సభకు వచ్చే ప్రముఖులు, రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. -
కాలుష్య కారకం
కాలం చెల్లిన వాహనం.. ●15 ఏళ్లుపై బడిన వాహనాలతో తీవ్రమైన కాలుష్యం ఆదేశాలు ఇచ్చాం.. ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ ఎంవీఐలు, ఆర్టీఓలకు 15 ఏళ్లు పైబడిన వాహనాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి అలాంటి వాహనాలు గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 15, 20 ఏళ్లు పైబడిన వాహనదారులు ప్రతిఒక్కరూ వారి వాహనాల రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువన్ లేని వాహనాలు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో పట్టుబడితే సీజ్ చేస్తాం. ప్రధానంగా రోడ్లపై వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ సీటు బెల్ట్, హెల్మెట్ తప్పక ధరించాలి. – కిషన్, డీటీసీ ఉమ్మడి జిల్లా ● రోగాల విజృంభణ నేపథ్యంలో కట్టడికి చర్యలు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 32,181 వాహనాలు ● గ్రీన్ ట్యాక్స్ భారీగా పెంచిన ప్రభుత్వాలు పాలమూరు: భారీగా పెరిగిపోతున్న వాహన కాలుష్యంతో వాతావరణంలో సమతుల్యత లోపించి కొత్త రకం జబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15, 20 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ భారీగా విధిస్తోంది. 15 ఏళ్లు దాటిన ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.2 వేలు, 20 ఏళ్లు దాటిన బైక్లకు రూ.5 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక 15 ఏళ్లు దాటిన కార్లకు రూ.5 వేలు, 20 ఏళ్లు దాటిన వాటికి రూ.10 వేల పన్నులు వసూలు చేయాలని ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కార్లు, ద్విచక్రవాహనాలు 20 ఏళ్లు పైబడినా అలాగే రోడ్లపై నడుపుతున్నారు. అలా కాలం చెల్లిన వాహనాల నుంచి భారీస్థాయిలో పొగ విడుదల కావడంతో మిగిలిన వాహనదారులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ● ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాహనం కలిగి ఉండటం సర్వసాధారణమైపోయింది. వాహనం ఉండటం సరే.. దాని నుంచి వచ్చే కాలుష్యమే పర్యావరణానికి హాని కలిగిస్తోంది. వాహనాల నుంచి వచ్చే కార్బన్ మోనాకై ్సడ్ వల్ల ఓజోన్ పొర బాగా దెబ్బతింటోంది. వాహనాల నుంచి మోతాదుకు మించి కాలుష్యం విడుదల కాకుండా ఆర్టీఏ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. డీజిల్ వాహనాల నుంచి 60 శాతానికి మించి పొగ రాకూడదు. అలాగే పెట్రోల్ వాహనాల నుంచి ద్విచక్రవాహనమైతే 3.5శాతం, కార్లు ఇతర వాహనాలైతే 4.5 శాతానికి మించరాదు. కానీ, కాలం చెల్లిన వాహనాల నుంచి అధిక మోతాదులో పొగ విడుదలవుతుంది. దేశ రాజధానిలో వాహనాల వినియోగం ఎక్కువ కావడంతో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకరోజు కొన్ని వాహనాలను మాత్రమే రహదారి మీదికి అనుమతిస్తున్నారు. మన పట్టణంలోనూ రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలోని పలు గుంతల రహదారులతో పాటు వాహనాల పొగతో వెలువడే కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ వాధ్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 15ఏళ్లు పైబడిన అన్ని రకాల వాహనాల వివరాలు జిల్లా వాహనాలు మహబూబ్నగర్ 13,965 నాగర్కర్నూల్ 5,295 వనపర్తి 4,059 జోగుళాంబ గద్వాల 3,672 నారాయణపేట 5,190 -
ముగిసిన చెరుకు కోతలు
కృష్ణవేణి చక్కర ఫ్యాక్టరీ పరిధిలో 2.65 లక్షల టన్నులు ●యాజమాన్యం దృష్టికి సమస్యలు.. చెరుకు రైతుల సమస్యలను ఎప్పటికప్పడు కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నాం. పంట తరలించిన 15 రోజుల్లోపూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని విన్నవించాం. సమయం దాటితే 16 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని కోరాం. సకాలంలో కోత కార్మికులు, యంత్రాలు రప్పించాలని సూచించాం. – జీఎస్ గోపి, రాష్ట్ర అధ్యక్షుడు, చెరుకు రైతు సంఘం సకాలంలో కోతలు.. రెండేళ్లుగా సకాలంలో చెరుకు కోతలు పూర్తవుతున్నాయి. గతంలో వేసవి పూర్తయినా కోతలు పూర్తిగాకపోయేవి. కోత కార్మికుల కొరత కారణంగా జాప్యం జరిగేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. అప్పట్లో పండించిన చెరుకును ఫ్యాక్టరీకి తరలించేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. – మునెప్ప, మస్తీపురం, అమరచింత అమరచింత: జిల్లాలోని కృష్ణవేణి చక్కర ఫ్యాక్టరీ పరిధిలో గతేడాది నవంబర్ 20న ప్రారంభమైన చెరుకు కోతలు ఫిబ్రవరి 19తో ముగిశాయి. మొత్తం 4.20 లక్షల టన్నుల చెరుకును గానుగ ఆడించి ఈ సీజన్ లక్ష్యాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం చేరుకోగలిగింది. గతంలో కోత కార్మికులు అందుబాటులో లేకపోవడంతో కోతలు సకాలంలో పూర్తిగాక ఇటు రైతులు, అటు యాజమాన్యానికి ఇబ్బందులు ఎదురయ్యేవి. రెండేళ్లుగా యాజమాన్యం ముందుస్తుగా కోత కార్మికులతో పాటు యంత్రాలను రప్పించడంతో ఎలాంటి సమస్యలు లేకుండా అనుకున్న సమయానికి కోతలు పూర్తి చేయగలుగుతున్నారు. ఈ ఏడాది మహాఽరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి 120 కోత కార్మిక బృందాలు, 8 యంత్రాలను వినియోగించినట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం వెల్లడించింది. కోత లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు జహీరాబాద్ నుంచి 1.65 లక్షల టన్నుల చెరుకును దిగుమతి చేసుకొని గానుగా ఆడించామని వివరించారు. పదెకరాల్లో సాగు చేశా.. నేను పది ఎకరాల్లో చెరుకు సాగు చేశా. ఈ సారి 350 టన్నుల దిగుబడి రాగా ఫ్యాక్టరీకి సకాలంలో తరలించా. గతంలో చెరుకు తోట కోతకు సిద్ధంగా ఉందని ఫ్యాక్టరీ యాజమాన్యానికి విన్నవించినా కోత కూలీలు సకాలంలో రాకపోయేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కోత కార్మికులను ముందస్తుగానే గ్రామానికి పంపడంతో సకాలంలో కోతలు పూర్తి చేయగలిగాను. – దోసు హన్మంతు, మస్తీపురం, అమరచింత టన్నుకు రూ.3,366.80 చొప్పున.. చెరుకును ఫ్యాక్టరీకి తరలించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.75 కోట్లు జమ చేయగా.. రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ సీజన్లో టన్నుకు రూ.3,366.80 చొప్పున ధర చెల్లించినట్లు డీజీఎం వెల్లడించారు. నాలుగు నెలల్లో కోతలు పూర్తిచేసి సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. కంపెనీ పరిధిలో సాగు విస్తీర్ణం తగ్గుతున్నందున రైతులకు రాయితీలు ప్రకటించడంతో ఈసారి 6 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుల బకాయిల చెల్లింపులు ఈ నెల రెండో వారంలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పూర్తిస్థాయిలో చెల్లింపులు.. ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో సకాలంలో డబ్బులు చెల్లించేలా యాజమాన్యం ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు రూ.75 కోట్లు చెల్లించగా.. బకాయి ఉన్న మరో రూ.20 కోట్లు రెండవ వారంలోగా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు సాగు విస్తీర్ణం 9 వేలకు పెంచేందుకు కృషి చేస్తున్నాం. – మురళి, డీజీఎం, కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ సాగు విస్తీర్ణం పెంపునకు.. ఫ్యాక్టరీ ప్రారంభంలో రైతులు చెరుకు సాగుపై దృష్టి సారించారు. అప్పట్లో సకాలంలో కోత కార్మికులు రాకపోవడం, యాజమాన్యం డబ్బులను సకాలంలో చెల్లించకపోవడంతో 8,500 ఎకరాల విస్తీర్ణం కాస్త 4,500కు పడిపోయింది. దీంతో రెండేళ్లుగా ఫ్యాక్టరీ యాజమాన్యంతో పాటు సిబ్బంది సాగు పెంపుపై దృష్టిసారించి రైతులకు రాయితీలు ప్రకటించడంతో ప్రస్తుతం సాగు విస్తీర్ణం ఆరు వేలకు పెరిగింది. రాయితీపై విత్తనాలు, కౌలు రైతులకు రాయితీలు, గ్రామాల్లో చెరుకు సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తుండటంతో రైతులు సాగుకు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. గానుగ ఆడింది 4.20 లక్షల టన్నులు జహీరాబాద్ నుంచి 1.65 లక్షలు దిగుమతి రైతులకు చెల్లింపులు రూ.75 కోట్లు.. బకాయిలు రూ.20 కోట్లు వచ్చే సీజన్లో సాగు విస్తీర్ణం 9 వేల ఎకరాలకు పెంచే యోచన రాయితీలు ఇలా.. రైతులకు చెరుకు సాగుపై ఆసక్తి పెంపొందించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం అనేక రాయితీలు ప్రకటిస్తుంది. ప్రతి ఏటా అక్టోబర్ 20 నుంచి జనవరి 20 వరకు చెరుకు ప్లాంటేషన్ చేసే రైతులకు దిగుబడిపై టన్నుకు అదనంగా రూ.350 బోనస్ అందించనుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్లో సాగుచేసిన రైతులకు టన్నుకు రూ.300 చొప్పున చెల్లించనుంది. రెండోసారి పంట కోత సమయంలో రూ.300, నాలుగు, ఐదు కోతల్లో రూ.500 చొప్పున చెల్లిస్తోంది. అలాగే కొత్తగా చెరుకు సాగు చేసే రైతులకు 1.20 ఎకరాల సాగుకు రెండున్నర టన్నుల చెరుకు విత్తనాన్ని రాయితీపై అందిస్తోంది. అదేవిధంగా డ్రిప్ కొనుగోలుకు రూ.20 వేల వరకు రుణం ఇస్తోంది. -
అడ్డంకులు దాటుతూ..
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏడోరోజు కొనసాగిన సహాయక చర్యలు అచ్చంపేట: దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. గ్యాస్ కటింగ్ పరికరంతో టీబీఎం మిషన్ కట్ చేసే పనులు వేగవంతమయ్యాయి. తొలగించిన భాగాలను ఎప్పటికప్పుడు బయటకు తీసుకొస్తున్నారు. శుక్రవారం ఏడోరోజు లోకో ట్రైన్కు సింగిరేణి బొగ్గు గనుల నుంచి తెప్పించిన పెద్ద సైజు ట్రేలను బిగించి గ్యాస్, ఫాస్మ కటర్ల ద్వారా తొలగించిన టీబీఎం విడి భాగాలు, ఇతర ఇనుప రాడ్లు, పైపులను రెస్క్యూ టీం సభ్యులు మోయగలిగిన సైజులో కట్ చేసి సొరంగం బయటికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించలేదు. సొరంగం లోపల 14.85 కిలోమీటర్ల వద్ద టీబీఎం మిషన్ ఉండగా పైకప్పు కూలింది. ఇక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు లోకో ట్రైన్ను 13.500 కిలోమీటరు వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గట్టి పడిన మట్టిని తీయడానికి మినీ పొక్లెయిన్లను వినియోగిస్తున్నారు. పొక్లెయిన్లు, బృందాలు లోపలి బురదను తొలగిస్తూ బయటికి పంపిస్తున్నారు. మూడు బోగీలు (ట్రేలు) ద్వారా బురద బయటికి తరలించారు. సొరంగంలోకి చేరిన నీటిని బయటకు పంపింగ్ చేయడానికి అదనపు మోటార్లను తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో మట్టిని తరలించకపోయినా లోపల ఓ పక్కకు వేస్తూ కార్మికుల ఆచూకీ కనుకొనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాధితుల కోసం సొరంగంలో టెషర్స్ అందుబాటులో ఉంచారు. రక్షణ కోసం.. టన్నెల్లోకి వెళ్లే సహాయక బృందాల రక్షణ కోసం కృత్రిమ ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐరన్ షీట్లు, పైపులను రౌండ్గా బెండ్ చేసి వెల్డింగ్ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్తున్నారు. దీని ద్వారా లోపలికి ప్రవేశించేలా చర్యలు చేపట్టారు. సొరంగం కూలిన, రాళ్లు, రప్పలు ఊడిపడినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా వీటిని తయారు చేసున్నారు. దీంతో ఏమైనా ప్రమాదం జరిగినా తప్పించుకునే అవకాశం ఉంటుందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ టన్నెల్ వద్దకు ఇతరులు వెళ్లకుండా నివారిస్తున్నారు. ముమ్మరంగా బురద, మట్టి, శిథిలాల తరలింపు అత్యాధునిక పరికరాలతో గాలింపు సొంతూళ్లకు కార్మికులు.. టన్నెల్లో జరిగిన ప్రమాదంతో భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కొక్కరుగా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కుటుంబసభ్యులు ఫోన్ చేసి తిరిగి రావాలని వేడుకుంటున్నారని, గత్యంతరం లేక మూడు నెలల జీతాలు రావాల్సి ఉన్నా వదిలి వెళ్తున్నామని కార్మికులు వాపోయారు. సొరంగం వద్ద పనులు సాగుతాయో లేదో అని.. తమ సొంత రాష్ట్రంలోనే ఏదో ఒక పని చేసుకుంటామని పేర్కొంటున్నారు. జీతాలు లేకున్నా సరే మా ప్రాణాలే ముఖ్యం అంటున్నారు. టన్నెల్ వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, విపత్తుల విభాగం ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
సమన్వయంతోనే విజయవంతం..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రావుల గిరిధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్, బారికేడ్ల ఏర్పాట్లను జిల్లా పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం పర్యటన సజావుగా సాగేందుకు శాఖాపరంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. వీఐపీ, ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్కు వేర్వేరుగా అనువైన స్థలాలను గుర్తించాలని కోరారు. అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ కృష్ణా, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ రవిపాల్, ఎస్ఐలు హరిప్రసాద్, జలంధర్రెడ్డి, నరేష్, జగన్, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
విద్యాపర్తి సిగలో..
జిల్లాకేంద్రంలో ఏర్పాటుకానున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల వనపర్తి: పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు జిల్లాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జిల్లాకు కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడంతో విద్యలో మరో అడుగు ముందుకు పడినట్లు విశ్లేషకులు విద్యావంతులు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రిని ఒప్పించి జిల్లాకు పాఠశాలతో పాటు భవన నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేయించారు. ఈ పాఠశాల భవన నిర్మాణానికి జిల్లాకేంద్రంలోని పీర్లగుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదీ లక్ష్యం.. జిల్లాలో చాలా గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటిన అధిగమించి బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల విద్యార్థులను ఒకే గొడుగు కిందకు తెచ్చి బోధన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో నిర్మించాలన్నదే లక్ష్యం. ఈ క్యాంపస్లో తరగతి గదులు, డార్మెంటరీలు, ల్యాబ్స్, క్రీడా మైదానాలు, అవుట్డోర్ జిమ్, థియేటర్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చదువుకున్న వనపర్తిలో తొలి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి 2న జిల్లా పర్యటనలో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కార్పొరేట్స్థాయిలో బోధన అందించేందుకే.. వనపర్తి ప్రాంత పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. విద్యాపర్తిని మరింత అభివృద్ధి చేయాలన్నదే ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే సీఎం రేవంత్రెడ్డిని ఒప్పించి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయించాను. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి ‘వనపర్తికి విద్యాపర్తిగా పేరుంది. జిల్లాకేంద్రంగా మారిన తర్వాత జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు ప్రభుత్వ వైద్య, నర్సింగ్, ఫిషరీస్ తదితర కళాశాలలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కూడా మంజూరు చేసింది.’ రూ.200 కోట్లతో భవన నిర్మాణం శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి -
ఆధార్ అప్డేట్ తప్పనిసరి
వనపర్తి: ఆధార్కార్డు అన్ని సేవలకు కీలకమని.. ప్రతి ఒక్కరూ వివరాలు, బయోమెట్రిక్ను అప్డేట్ చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు కోరారు. గురువారం సమీకృత కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యూఐడీఏఐ అసిస్టెంట్ మేనేజర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. పుర కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు వెబెక్స్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పౌరసేవలు పొందాలంటే ఆధార్ అప్డేట్ తప్పనిసరి అన్నారు. ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలకు భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివరాలు పునరుద్ధరించుకోవాలని పేర్కొన్కారు. పుట్టిన శిశువు మొదలు ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆధార్ నమోదు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని సూచించారు. ఆధార్కార్డులో చిన్న మార్పులకు నివాస ధ్రువపత్రం సరిపోతుందని.. జన్మతేదీ సవరణకు జనన ధ్రువీకరణపత్రం అవసరమని స్పష్టం చేశారు. జనన ధ్రువీకరణపత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని పుర కమిషనర్లు, ఆర్డీఓను ఆదేశించారు. విద్యార్థులు అపార్ కార్డు నమోదుకు ముందు ఆధార్ వివరాలు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. పాఠశాలల్లోనే బయోమెట్రిక్ అప్డేట్ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఆధార్ నమోదు, అప్డేట్ కోసం క్యాంపులు నిర్వహించాలని సూచించారు. నవీకరణ ప్రక్రియకు సంబంధించి ఆధార్ సేవాకేంద్రాలకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ–డిస్ట్రిక్ మేనేజర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, యూఐడీఏఐ అసిస్టెంట్ మేనేజర్ సత్యకళ, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్, ఈడీఎం విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మార్చి 2న జిల్లాకు రానున్నారని.. నియోజకవర్గంలో రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తోందన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11.8 కిలోమీటర్ల వరకు వెళ్లి వచ్చానని.. అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అక్కడికి సీఎం రాలేదని మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడుతున్నారని.. కొండగట్టులో 70 మంది, శ్రీశైలం పవర్ హౌస్లో 8 మంది, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో కార్మికులు చనిపోతే నాటి సీఎం కేసీఆర్ ఎక్కడికై నా వెళ్లారా అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సహా 11 సంస్థలను రప్పించి సహాయ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సీఎం ఘటన స్థలికి రాకపోయినప్పటికీ రోజూ సమీక్షిస్తున్నారని చెప్పారు. సీఎం హోదాలో రేవంత్రెడ్డి మొదటిసారి వనపర్తికి రాబోతున్నారని.. తాను చదివిన పాఠశాలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి 14 నెలల్లో రూ. వందల కోట్ల అభివృద్ధి పనులను నియోజకవర్గానికి తీసుకొచ్చారని.. జాబ్మేళా, రుణమేళా, స్కిల్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలతో సుమారు వెయ్యి మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించే పని చేస్తున్నారన్నారు. సీఎంకు వనపర్తితో అనుబంధం ఉంది.. సీఎం రేవంత్రెడ్డి వనపర్తిలో చదువుకున్నందున ఈ ప్రాంతంతో మంచి అనుబంధం ఉందని ఎంపీ మల్లు రవి తెలిపారు. ఆయనతో పాటు చదువుకున్న వారితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.కోటి, రూ.257 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఆయన చదివిన జెడ్పీ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో రూ.60 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారని తెలిపారు. రూ.22 కోట్లతో ఐటీ టవర్, రూ.81 కోట్లతో కోర్టు కాంప్లెక్స్, రూ.40 కోట్లతో రాజనగరం నుంచి పెద్దమందడి వరకు రహదారి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం హోదాలో జిల్లాకు తొలిసారిగా రేవంత్రెడ్డి రాక ఎస్ఎల్బీసీలో భయానక పరిస్థితులు రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
దోచుకొని దాచుకోవడం బీఆర్ఎస్ నైజం : ఎమ్మెల్యే
మదనాపురం: గత ప్రభుత్వ హయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుందని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని గోవిందహళ్లిలో ఆయన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే దంతనూరు, తిర్మలాయపల్లి, మదనాపురం, నెల్విడి, కొన్నూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి దంతనూరులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తోందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, చర్లపల్లి శేఖర్రెడ్డి, జగదీశ్, వడ్డె కృష్ణవర్ధన్రెడ్డి, నాగన్న యాదవ్, హనుమాన్రావు, వడ్డె రాములు, మహదేవన్గౌడ్, వెంకట్నారాయణ, శ్రావణ్కుమార్, సాయిబాబా, శ్రీధర్రెడ్డి, డైరెక్టర్ పావని, ఆవుల రాఘవేంద్ర, వడ్డె బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
వనపర్తి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 2న ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. శిలా ఫలకాలు, బహిరంగ సభ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా బాధ్యతలను పుర కమిషనర్కు అప్పగించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం, జిల్లాలో జరిగిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్న నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులను సభాస్థలికి తీసుకొచ్చి తిరిగి వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చే బాధ్యతలను అధికారులు, సిబ్బందికి అప్పగించారు. మండలాల వారీగా బస్సులు కేటాయించడం జరిగిందని, సభకు వచ్చే వారికి భోజనం, తాగునీరు, మజ్జిగ, కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
శిథిలాల తొలగింపు షురూ
లోకో ట్రైన్ మూడు కోచ్ల ద్వారా మట్టి వెలుపలికి.. ● 20 మంది చొప్పున మూడు షిఫ్ట్లో పనిచేస్తున్న రెస్క్యూ బృందాలు ● ఈ ప్రక్రియ పూర్తయితేనే కార్మికుల జాడ ● ఆరు రోజులైనా మరమ్మతుకు నోచుకోని కన్వేయర్ బెల్ట్ మరికొన్ని వివరాలు.. ● మధ్యాహ్నం 12.16 గంటలకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎస్ఎల్బీసీ జేపీ కార్యాలయం వద్ద ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ● 12.30 గంటలకు కార్యాలయానికి వచ్చారు. అంతకు ముందే కార్యాలయం ముందున్న మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి గేటు బయటకు పోలీసులు పంపించారు. ● 2.16 గంటలకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్రావుతో పాటు పలువురు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాంతానికి వెళ్లారు. కొందరికే అనుమతి ఇవ్వడంతో రెండు కార్లలో ఉన్నవారు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. 5 నిమిషాల తర్వాత సొరంగానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చి ప్రెస్మీట్లో మాట్లాడారు. అచ్చంపేట/ అచ్చంపేట రూరల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ఇంకా బయటికి రాలేదు. టన్నెల్ నుంచి వారిని క్షేమంగా బయటికి తెచ్చే ఆపరేషన్ గురువారం మొదలైంది. సహాయక చర్యల్లో అధికారులు వేగం పెంచారు. లోకో ట్రైన్ మూడు డబ్బాల ద్వారా మట్టి శిథిలాలను తీసుకొచ్చారు. టీబీఎం మిషన్ ఉన్న ప్రాంతానికి లోకో ట్రైన్ పూర్తిగా చేరుకోలేకపోతోంది. 13.95 కి.మీ. వద్ద టీబీఎం మిషన్ ఉండగా చివరి వరకు లోకో ట్రైన్ వెళ్లేందుకు పట్టాలు ఉన్నాయి. అయితే భారీగా పేరుకుపోయిన మట్టి, బురద, సెగ్మెంట్లు, టీబీఎం శిథిలాల వల్ల టన్నెల్ చివరి వరకు లోకో ట్రైన్ వెళ్లలేకపోతోంది. ఈ రెండింటి మధ్య 300 మీటర్ల దూరం ఉంది. దీంతో టీబీఎం వరకు చేరుకునేందుకు లోకో ట్రైన్ పట్టాలు, సొరంగంలోని మట్టి, రాళ్లు, బురద తొలగించేందుకు కార్యాచరణను రెస్క్యూ బృందాలు చేపట్టాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే లోకో ట్రైన్ టీబీఎం చివరి వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత టీబీఎం ఉన్న ప్రాంతంలోని శిథిలాలు తీసే పని మొదలవుతుంది. అప్పటివరకు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ కనిపించే అవకాశం లేదు. ఈ ఆపరేషన్లో సింగరేణి బృందాలు కీలకంగా పని చేస్తున్నాయి. సొరంగం పైకప్పు కూలకుండా పటిష్టమైన పునః నిర్మాణం చేస్తున్నారు. సింగరేణితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్ తదితర బృందాలు కలిపి 20 మంది చొప్పున మూడు షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. అయితే దెబ్బతిన్న కన్వేయర్ బెల్టు మరమ్మతు మాత్రం చేపట్టలేకపోతున్నారు. సొరంగం లోపలికి వెళ్లేందుకు లోకో ట్రైన్ ఒక్కటే ఉండటం వల్ల అందులోనే సిబ్బంది వెళ్తూ.. దానిలోనే మట్టి తీసుకురావడం వల్ల కొంత కష్టంగా మారింది. అయితే తెగిపోయిన కన్వేయర్ బెల్ట్, ఆక్సిజన్ పైపులు పునరుద్ధరిస్తే సహాయక చర్యలు మరింత వేగవంతం అవుతాయి. ముమ్మరంగా డీవాటరింగ్ టన్నెల్లో ప్రతి నిమిషానికి 5 వేల లీటర్ల నీళ్లు ఊరుతోంది. కూలిన రెండోరోజు నుంచే డీవాటరింగ్ చేస్తున్నా అదుపులోకి రాలేదు. రెండు రోజుల క్రితం నుంచి 100 హెచ్పీ మోటార్లతో ముమ్మరంగా డీవాటరింగ్ చేయడంతో పూడిక ఉన్న ప్రాంతం వరకు వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే సొరంగంలో చిక్కుకున్న వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించి బయటికి తేవాలనే కృతనిశ్చయంతో సహాయక చర్యలు చేపడుతోంది. ఎన్జీఆర్ఐ ప్రత్యేక బృందం.. సొరంగంలో శిథిలాల కింద చిక్కుకున్న మానవ శరీరాలు గుర్తించేందుకు ప్రత్యేకంగా ఎన్జీఆర్ఐ ప్రత్యేక బృందం గురువారం ఉదయం సహాయ చర్యలు చేపట్టింది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేకంగా గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ ఆంటీనాను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా వారి ఆచూకీ లభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కఠిన ఆంక్షలు.. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాంతానికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. రాజకీయ నాయకుల సందర్శనను తిరస్కరిస్తున్నారు. కేవలం రెస్క్యూ ఆపరేషన్ బృందాలు, అధికారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మరో 72 గంటల్లో సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తాం అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. టన్నెల్ చుట్టూ ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఆంక్షలు విధించారు. -
టీబీఎం మిషన్ కటింగ్
టీబీఎం మిషన్ను కట్ చేసేందుకు జేపీ కంపెనీ సంస్థ యజమాని జయప్రకాష్ గౌర్ అనుమతి లభించింది. దీంతో గత అర్ధరాత్రి నుంచి గ్యాస్ కటింగ్ మిషన్తో టీబీఎంను కట్ చేసే పనులను వేగవంతం చేసినట్లు సమాచారం. ఇందులో 11 బృందాలతో పాటు ర్యాట్ హోల్ మైనర్స్ ప్రత్యేక నిపుణులు భాగస్వామ్యం అయ్యారు. ప్రమాద స్థలం సమీపానికి చేరుకొని పేరుకుపోయిన బురదను బయటికి పంపే చర్యలు చేపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి.. అనే విషయాలను అధికార యంత్రం బయటకుతెలువనివ్వడం లేదు. -
నిధుల గోల్మాల్..!
వనపర్తి: జిల్లాలోని బీసీ అభివృద్ధిశాఖ కార్యాలయంలో ఓ అధికారి అధికారిక బ్యాంకు ఖాతా నుంచి ఇష్టానుసారంగా నిధులు డ్రా చేసిన ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై పీడీఎస్యూ, బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆ శాఖ రాష్ట్రస్థాయి అధికారులకు వేర్వేరుగా ఫిర్యాదులు అందించడంతో పాటు మీడియాతో వెల్లడించారు. ఫిర్యాదుకు ఏకంగా కార్యాలయ సిబ్బంది పేర్లతో అధికారిక బ్యాంకు ఖాతా నుండి నగదు ఉపసంహరించిన జాబితాను జతపర్చారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో వైద్య కళాశాల ప్రారంభమైన సమయంలో విద్యార్థినుల వసతిగృహం కోసం అప్పటికే బీసీ సంక్షేమశాఖ నిర్మించిన ఓ భవనాన్ని నెలకు రూ.50,030 అద్దె చొప్పున అప్పటి కలెక్టర్ కేటాయించారు. నెలవారీ అద్దె ఆ శాఖ అధికారిక బ్యాంకు ఖాతాలో జమ అవుతూ వస్తోంది. నిబంధనల మేరకు అద్దెను బీసీ సంక్షేమశాఖ రాష్ట్రశాఖకు పంపించాల్సి ఉన్నా.. కార్యాలయంలో సౌకర్యాలు కల్పించుకోవాలనే సాకు చూపి విడతల వారీగా భారీ మొత్తంలో నగదు ఉపసంహరించినట్లు తెలుస్తోంది. డ్రా చేసిన సమయంలో చెక్కులపై కొన్నిచోట్ల సెల్ఫ్ అని, మరికొన్ని కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పేర్లతో డ్రా చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై గత కొన్నిరోజులుగా విచారణ కొనసాగుతోంది. ఉద్యోగ నియామకాల్లోనూ.. జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఇటీవల చేసిన తాత్కాలిక సిబ్బంది నియామకాల్లోనూ ఆ అధికారి నిబంధనను గాలికొదిలి ఇష్టానుసారంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు ఆర్థిక, ఇతర ప్రయోజనాలు చేకూర్చిన వారిని ఎలాంటి నిబంధనలు పాటించకుండా నియమించినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలపై కూడా అదనపు కలెక్టర్, ఆర్డీఓ వేర్వేరుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. బీసీ అభివృద్ధిశాఖ కార్యాలయంలో ఓ అధికారి చేతివాటం? కిందిస్థాయి ఉద్యోగుల పేరిట నగదు ఉపసంహరణలు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. కొనసాగుతున్న విచారణ విచారణ కొనసాగుతోంది.. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించాం. 2023లో కార్యాలయ సిబ్బంది పేర్లతో బ్యాంకు నుంచి నగదు ఉపసంహరించినట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. బ్యాంకు నుంచి వివరాలు సేకరించి రెండేళ్ల లావాదేవీలను పరిశీలిస్తున్నాం. కార్యాలయ సిబ్బంది పేర్లతో డబ్బులు ఎందుకు డ్రా చేయాల్సి వచ్చిందనే అంశాన్ని తెలుసుకోవాల్సి ఉంది. విచారణ త్వరగా పూర్తిచేసి నివేదికను కలెక్టర్కు అందజేస్తాం. – జి.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వనపర్తి వడ్డీ డబ్బులేవి..? బీసీ అభివృద్ధి రాష్ట్రశాఖ నుంచి జిల్లాకు వివిధ పద్దుల కింద కేటాయించిన నిధులు నెలల పాటు ఖర్చు చేయకపోవడంతో బ్యాంకు ఇచ్చిన వడ్డీ రూ.లక్షల్లో జమ అయింది. వడ్డీ డబ్బులను ఎలాంటి అవసరాలకు వినియోగించరాదని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. వాటిని పక్కనబెట్టి కార్యాలయ అవసరాల పేరుతో విత్డ్రా చేసినట్లు ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా అంశాలపై కొన్నాళ్లుగా విచారణ కొనసాగుతుండగా.. తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. సిబ్బంది పేరున చెక్కులు రాసి డబ్బులు డ్రా చేయడంతో అందరూ చిక్కుల్లో పడ్డారు. విచారణలో తమకు సంబంధం లేదంటూ సిబ్బంది లబోదిబోమన్నట్లు ప్రచారం సాగుతోంది. -
అట్టహాసంగా బండలాగుడు పోటీలు
పాన్గల్: మహా శివరాత్రి సందర్భంగా బుధవారం మండలంలోని రేమద్దులలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. మొత్తం 8 జతల ఎద్దులు పాల్గొనగా ప్రథమ స్థానంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్పల్లికి చెందిన ఎం.నాగయ్య ఎద్దులు.. ద్వితీయ స్థానంలో కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వల్కూరు గ్రామానికి చెందిన దొడ్డికాటి తిరుమల్లేష్ ఎద్దులు.. తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ మండలం గుడికల్కు చెందిన దాసు ఎద్దులు.. నాలుగో స్థానంలో రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం గ్రామానికి చెందిన వెంకటేష్యాదవ్ ఎద్దులు.. ఐదో స్థానంలో చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన గోపాలకృష్ణ ఎద్దులు విజేతలుగా నిలిచాయి. ప్రథమ బహుమతి రూ.60 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, తృతీయ బహుమతిగా రూ.40 వేలు, నాలుగో బహుమతిగా రూ.30 వేలు, ఐదో బహుమతిగా రూ.20 వేలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్రావు, మధుసూదన్రెడ్డి, ప్రసాద్రావు, దామోదర్రెడ్డి, కతాల్, తిరుపతయ్య, బక్కిరెడ్డి, హమాలీ సంఘం నాయకులు శాంతయ్య, రాములు వ్యాఖ్యాత శివశంకర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మల్లెల తీర్థం జలపాతమే కారణమా?
సొరంగం ఘటన జరిగిన ప్రదేశం మల్లెలతీర్థం జలపాతం లోయ ప్రాంతం అయి ఉండవచ్చని వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచితలబైలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ నుంచి 13.93 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదాన్ని నేరుగా పరిశీలిస్తే.. ఆ ప్రాంత వరకు వెళ్తోంది. ఇక్కడ 500 అడుగుల ఎత్తు నుంచి నిరంతరం హోరెత్తుతూ దూకే జలధార మూడు సరస్సులను నింపుతూ.. నల్లమల అడవి గుండా కృష్ణానదిలో కలుస్తుంది. మల్లెల తీర్థంలో ఏడు గుండాలు ఉన్నాయి. ఈ గుండాల వద్దనే నీటి నిల్వ ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి సొరంగం వద్ద లికేజీ అయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొరంగంలో కిలోమీటరు వరకు సీపేజీ ఉండే అవకాశం ఉందని.. ముందే తెలిసినా జేపీ కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు రోజులైనా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన సహాయక చర్యలను వేగవంతం చేసి.. రెండు రోజుల్లో ఎనిమిది మంది కార్మికులను బయటికి తెస్తామని మంత్రులు ప్రకటించారు. -
ముగిసిన ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో రెండురోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ఐ మహాసభలు బుధవారం ముగిశాయి. మహాసభలో ఎనిమిది తీర్మానాలను ఆమోదించి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.మల్లేష్, ఉపాధ్యక్షుడిగా రాఘవ, కార్యదర్శిగా ఎం.ఆది, సహాయ కార్యదర్శిగా రామకృష్ణ, సభ్యులుగా రాజవర్ధన్, ఆంజనేయులు, వీరన్ననాయక్, మోహన్, మల్లీశ్వరి, రమేశ్, కార్తీక్గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామన్పాడులో 1,021 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాలువ నుంచి 550 క్యూసెక్కుల వరద వస్తుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని చెప్పారు. ఎన్టీఆర్ కాల్వకు 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 88 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నామని వివరించారు. -
హెలీప్యాడ్లు లేక..
సొరంగం ఘటన జరిగిన రోజు నుంచి రెండు, మూడు హెలిక్యాప్టర్లు వచ్చి పోతున్నాయి. జేపీ కంపెనీ కార్యాలయం వద్ద ఒకటి నిలిచేందుకు హెలీప్యాడ్ ఉంది. ఒకటి వస్తే మరొకటి గాలిలో చక్కర్లు కొడుతుంది. కొన్ని సందర్భాల్లో సున్నిపెంట, శ్రీశైలం వెళ్లి ల్యాండ్ అవుతున్నాయి. బుధవారం మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి హెలిక్యాప్టర్లో రాగా.. జేపీ కంపెనీ అధినేత జయప్రకాశ్గౌర్ మరో హెలిక్యాప్టర్లో వచ్చారు. ఒక హెలీప్యాడ్ మాత్రమే ఉండటంతో దిగడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మరొకటి గాలిలోకి ఎగరాల్సి వచ్చింది. దీంతో హుటాహుటిన మరో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. -
కనిపించని పురోగతి
ఐదు రోజులైనా దొరకని కార్మికుల జాడ ● ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కోసం భగీరథ యత్నం ● నీరు, బురద తొలగించడం పెద్ద సవాలే.. ● రెండ్రోజుల్లో తీసుకొస్తామన్న మంత్రులు అచ్చంపేట/అచ్చంపేట రూరల్/ ఉప్పునుంతల: దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రమాదం జరిగి ఐదు రోజులైనా ఇంత వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం న్యూఢిల్లీలోని బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్, టన్నెల్ వర్క్స్లో నిష్టాతులైన వారిని ప్రత్యేకంగా పిలిపించారు. సొరంగంలోకి వెళ్లి వచ్చిన రెస్క్యూ బృందాలు మాత్రం శిథిలాలను తొలగించడం.. అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడటం కష్టంగా ఉందని చెబుతున్నారు. సొరంగంలో భారీగా మట్టి, రాళ్లు కూలి పడటంతో.. వాటిని కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శిథిలాలు, మట్టిని తొలగించేందుకు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. కాగా, ఉత్తరఖండ్లోని డెహ్రాడూన్లో 41 మందిని రక్షించినప్పటికీ అక్కడికి ఇక్కడికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రయత్నాలు చేయడం కూడా కష్టంగా మారిందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నెల్ ప్రమాదాల్లో ఇదే అత్యంత కఠినమైనదని చెబుతున్నారు. అయితే 12 కి.మీ. వద్ద మరో మార్గం ద్వారా లోపలికి వెళ్లాలని సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. సొరంగంపై నుంచి లేదా పక్క నుంచి రంధ్రం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రయత్నాలు చేస్తున్నారు. అంతుచిక్కడం లేదు.. సొరంగంలో చేరిన నీటిని, బురదను తొలగించి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడటం పెద్ద సవాల్గా మారింది. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడం నిపుణులు, ఇంజినీర్లు, రెస్క్యూ బృందాలను సైతం కలవరపెడుతోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన వారికి ఈ ప్రమాదం అంతుచిక్కుడం లేదు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనే దానిపై ఇప్పటి వరకు ఓ నిర్ణయానికి రాలేదు. లోపల ఉన్న బురద, రాళ్లు, నీటిని బయటికి తీసుకురావడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. తెగిపోయిన కన్వేయర్ బెల్టును కూడా ఇప్పటి వరకు పునరుద్ధరించ లేదు. వాస్తవానికి టన్నెల్ బోరింగ్ మెషీన్ నడిస్తేనే ఈ బెల్టు పని చేస్తుంది. కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన.. సొరంగంలో చిక్కుకున్న వారు ఎక్కుడున్నారో.. ఎలా ఉన్నారో అనే ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. టన్నెల్ వద్దకు తమను పంపడం లేదని.. షెడ్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని వాపోతున్నారు. ఎలాంటి సమాచారం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని.. రోజుకు రెండు, మూడు హెలిక్యాప్టర్లు రావడం చూసి ఏమైందోనన్న ఆందోళన చెందుతున్నామని గోడు వెలిబుచ్చారు. మంత్రుల పర్యవేక్షణ.. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద చేపట్టిన సహాయక చర్యలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్మార్రెడ్డి, రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఉన్నతాధికారులు, జేపీ కంపెనీ, వివిధ రెస్క్యూ బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను రెస్క్యూ బృందాలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చాయి. గాలి, వెలుతురు లేని సొరంగంలో ఆక్సిజన్ అందకపోవడంతో సహాయక బృందాలు ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాయని.. ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చితే లోపల ఎక్కువ సమయం ఉండేందుకు అవకాశం ఉంటుందని.. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వ్యూహాలు రచించవచ్చని తెలిపారు. -
బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి
వనపర్తి: బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఏఎల్డీఎం) సాయి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆశా కార్యకర్తలకు ఆర్థిక అక్షరాస్యతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్యఅతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎల్డీఎం మాట్లాడుతూ.. ఆర్థిక అక్షరాస్యత పొదుపుతోనే సాధ్యమవుతుందని, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్షా బీమా యోజనను వినియోగించుకోవాలని సూచించారు. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన గురించి వివరించారు. రూ.20తో బీమా చేయించుకుంటే ఆపద సమయాల్లో బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా సొమ్ము అందుతుందన్నారు. బీమా చేయించుకొని ధీమాగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
వనపర్తి: జిల్లాలోని ఐదు పురపాలికల్లో ఆస్తి, కొళాయి పన్ను వసూళ్లను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని.. వేగంగా లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని జంగిడిపురం ప్రాంతంలో పర్యటించి పుర సిబ్బంది పన్ను వసూలు తీరును పరిశీలించారు. అనంతరం పుర కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చి పన్నులు వసూలు అయ్యేలా చూడాలని సూచించారు. బిల్ కలెక్టర్లు, సిబ్బంది ఉదయం 7 గంటలకు కార్యాలయంలో హాజరు వేసి క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లు ప్రారంభించాలన్నారు. సిబ్బంది వద్ద తప్పనిసరిగా అత్యధిక బకాయిలు ఉన్న వారి జాబితా ఉండాలని.. డబ్బులు ఎలా తీసుకోవాలనే విషయంపై వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. బకాయిదారులకు నోటీసులు పోస్ట్, ఇళ్లకు వెళ్లినప్పుడు అందజేయాలన్నారు. అలాగే స్మార్ట్ఫోన్ నుంచి సందేశాలు పంపించాలని సూచించారు. అన్ని బ్లాక్లలో పన్ను వసుళ్ల కోసం ప్రత్యేక శిభిరాలు కూడా ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. నల్లచెరువు సుందరీకరణ, అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచి గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర పుర సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి