-
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు
వనపర్తి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీని ఎదుర్కోలేక బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మకై ్క క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక నందిహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొన్ని గంటలకే బూత్లలో బీఆర్ఎస్ ఏజెంట్లు కనిపించలేదని.. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటింగ్ పర్సెంటేజీ తగ్గించేందుకు బీఆర్ఎస్ నాయకులు తెగబడ్డారన్నారు. మొన్నటి వరకు బీజేపీపై ఆరోపణలు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ నేత ఆస్తులు కాపాడుకునేందుకు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఈ ఎన్నికల్లో బలి పశువును చేశారన్నారు. అలాగే కొందరు సొంత పార్టీ నాయకులు కూడా ద్రోహం చేశారని.. పార్టీ పరిశీలకులు ఆధారాలతో సేకరించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలుసుకోలేని సుమారు 50 వేల మందిని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కలిసి కృతజ్ఞతలు తెలుపడంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించేందుకు ప్రచారం చేశామన్నారు. తమతో పాటు మిత్రపక్షాలు సైతం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్పార్టీకి ఊహకందని తీర్పు ఇవ్వనున్నారని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిపై దృష్టి సారిస్తా.. ఎన్నికల హడావుడి ముగిసింది.. ఇక నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బి–ఫారం ఇచ్చేది తానేనని.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో పుర చైర్మన్ పుట్టపాగ మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, నాయకులు చీర్ల చందర్, బాషానాయక్, సాయిచరణ్రెడ్డి, రహీం, వహీద్, నాయకులు కృష్ణ, ఉమ్మాల రాములు, సత్యశీలారెడ్డి, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. సొంత పార్టీలోనూ ప్రతిపక్ష ధోరణి చూశాం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి -
ఘనంగా మహర్షి భగీరథ జయంతి
వనపర్తి: మహర్షి భగీరథ జయంతిని మంగళవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మర్రికుంట సమీపంలోని మహర్షి భగీరథ విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగీరథుడు పట్టుదలతో తపస్సు చేసి దివి నుంచి భువికి గంగను రప్పించారని గుర్తుచేసుకున్నారు. పట్టుదలకు మారుపేరు.. మహర్షి భగీరథుడు పట్టుదలకు మారుపేరుగా చెప్పుకోవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం నాగవరం చౌరస్తాలో ఉన్న భగీరథుడి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. పితృదేవతల కోరిక మేరకు గంగను భూమిపైకి రప్పించేందుకు తపస్సు చేసినట్లు వివరించారు. -
వనపర్తి వాసికి అరుదైన గౌరవం
● కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆహ్వానం వనపర్తిటౌన్: జిల్లాకేంద్రానికి చెందిన ఉప్పుగంటి రాఘవేందర్కు ఈ నెలలో ఫ్రాన్స్లో జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. తాను ఎడిటింగ్ చేసిన ‘ఇన్రీట్రీట్’ అనే 1.15 గంటల చిత్రం ఫెస్టివల్లో ప్రదర్శించడానికి ఎంపిక కావడంతో ఈ మేరకు నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ఫిల్మ్ ఫెస్టివల్లో 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రదర్శించబడుతున్న చిత్రంగా ఇన్రీట్రీట్ నిలవనుంది. రాఘవేందర్ పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ ఇండియాలో పీజీ డిప్లొమా పూర్తిచేశారు. అదే కళాశాలలో చదివిన మైసమ్అలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. రాఘవేందర్ ఎడిటింగ్ చేశాడు. నాలుగు నెల ల కిందట ఆన్లైన్ వేదికగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఏప్రిల్ 15న అనుమతి లభించిందని.. ఈ నెల 20న చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా రాఘవేందర్ను పట్టణంలోని సాహితీవేత్తలు, ప్రజాసంఘాల నాయకులు అభినందించారు. స్ట్రాంగ్రూముల్లో ఈవీఎంలు భద్రం నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ లోక్సభ స్థానానికి సోమవారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలను మంగళవారం జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్రూములకు తరలించారు. ఈసందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంట్ నియోజకవర్గంలోని నాగర్కర్నూల్, కల్వకురి, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రుచేష్ జైవన్షీ, పలువురు అభ్యర్థుల సమక్షంలో సీల్వేసి స్ట్రాంగ్రూముల్లో భద్రపర్చినట్లు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూముల వద్ద సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రత నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అభ్యర్థులతో ఎన్నికల అధికారులు సమావేశమై పోలింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పలు పోలింగ్ కేంద్రాల పీఓ డైరీ, 17సీ 17 ఫార్మేట్లను జనరల్ అబ్జర్వర్ పరిశీలించి, ఓటింగ్ వివరాలను వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియ జరిగిన విధానంపై అభ్యర్థులు సంతృప్తిని వ్యక్తంచేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, కె.సీతారామారావుతో పాటు గద్వాల, వనపర్తి జిల్లాల అదనపు కలెక్టర్లు, ఏఆర్ఓలు ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రస్తుత 2024– 25 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వారు వివిధ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి పాండు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
‘పోల్’మార్టం..!
వివరాలు 8లో uలోక్సభ ఎన్నికల సరళిపై ప్రధాన పార్టీల అభ్యర్థుల మల్లగుల్లాలు ● గత ఎన్నికలతో పోలిస్తేమహబూబ్నగర్లో 7.12 శాతం,నాగర్కర్నూల్లో 7.23 శాతం పెరిగిన ఓటింగ్ ● ముఖ్య అనుచరులతో కలిసిబూత్ల వారీగా మంతనాలు ● క్రాస్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్పై క్షేత్రస్థాయిలో ఆరా ● గెలుపోటములపై ఎవరి లెక్కలు వారివే.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల శాతాన్ని బట్టి ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్ బూత్ల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలించి తమకు వచ్చిన ఓట్ల శాతం ఎంత అనేది అంచనా వేసుకుంటున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 72.43 శాతం ఓటింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 7.12 శాతం మేర ఓటింగ్ శాతం పెరిగింది. ఇది ఏ పార్టీకి నష్టం వాటిల్లనుంది, ఏ పార్టీకి ఎవరికి లాభం చేకూరనుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనుండటం, ఇందుకు దాదాపు మూడు వారాల సమయం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. జడ్చర్లలో అత్యధికం.. మహబూబ్నగర్లో అత్యల్పం.. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే జడ్చర్ల నియోజకవర్గంలోనే అత్యధికంగా 77.92 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 77.40 శాతం ఓటింగ్ జరిగింది. అత్యల్పంగా మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 66.27 శాతం పోలింగ్ నమోదైంది. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లలో 8,32,256 మంది పురుషులు, 8,50,172 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే 17,916 మంది ఎక్కువగా ఉన్నారు. అయితే ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 6,12,924 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకోగా 73.65 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 71.24 శాతంతో మహిళా ఓటర్లు 6,05,647 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 2,44,525 మంది మహిళా ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గతానికి మించి భారీగా పెరిగిన ఓటింగ్.. గత లోక్సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగి, పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా తగ్గుతూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం గత పార్లమెంట్ ఎన్నికల కంటే 7.12 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. 2004 లోక్సభ ఎన్నికల్లో 63.46 శాతం, 2009లో 67.68 శాతం, 2014లో 72.94 శాతం పోలింగ్ నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 65.31 శాతం పోలింగ్ కాగా, తాజాగా 72.43 శాతం ఓటింగ్ నమోదైంది. -
బస్టాండ్లు కిటకిట
పస్పులకు చేరిన కృష్ణమ్మ స్టేషన్ మహబూబ్నగర్: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలు తిరుగు ప్రయాణంతో మంగళవారం ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. బస్టాండ్లోని ఏ స్టాప్ వద్ద చూసినా ప్రయాణికులు భారీ సంఖ్యలో కనిపించారు. ముఖ్యంగా మహబూబ్నగర్ ఆర్టీసీ బస్టాండ్లో ప్లాట్ఫాంలన్నీ ప్రయాణికులతో సందడిగా మారాయి. తాండూరు, పరిగి, వననర్తి, నారాయణపేట, మద్దూరు, మక్తల్, నాగర్కర్నూల్ తదితర రూట్లలో బస్సులు ప్రయాణికులతో నిండుగా వెళ్లాయి. హైదరాబాద్ రూట్లో.. మహబూబ్నగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సొంత గ్రామాల్లో ఓట్లు వేసిన చాలామంది ప్రజలు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్కు వెళ్లే సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణికులు పోటీపడి ఎక్కారు. హైదరాబాద్ రూట్లో ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ప్రత్యేకంగా సిటీలోని పలు డిపోల నుంచి బస్సులను తెప్పించారు. రాజేంద్రనగర్, ఫలక్నుమా, ఫరూఖ్నగర్, మిథాని డిపోల నుంచి 60 బస్సుల ద్వారా మహబూబ్నగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ రూట్లో నడిపారు. ఇతర ప్రధాన బస్టాండ్ల నుంచి కూడా హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా కనిపించింది. ● తిరుగు ప్రయాణంతో ఆర్టీసీ బస్టాండ్లలో రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆర్ఎం వి.శ్రీదేవి మహబూబ్నగర్ బస్టాండ్లోని పలు స్టాప్లను పరిశీలించారు. ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తూ.. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేయించారు. ఆమె వెంట డిపో మేనేజర్ సుజాత, ఇతర అధికారులు ఉన్నారు. కృష్ణానదిలో నీటిమట్టం తగ్గడంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని వదిలింది. మంగళవారం ఉదయం నీరు మండలంలోని పస్పుల ఘాట్కు చేరింది. రాత్రి వరకు జూరాల జలాశయానికి చేరుకుంటుందని అధికారులు వివరించారు. కుర్మగడ్డకు వెళ్లేందుకు కృష్ణానదిలో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. కృష్ణానదిలో ప్రవాహం కనిపిస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. – మక్తల్ తిరుగు ముఖం పట్టిన ప్రయాణికులు రద్దీగా మారిన బస్టాండ్లు హైదరాబాద్ మార్గంలో బస్సులు ఫుల్ పర్యవేక్షించిన ఆర్ఎం, ఇతర అధికారులు -
పర్యాటకం.. పట్టింపేది?
జూరాల ప్రాజెక్టు వద్ద నీడ కరువు ● చంద్రగఢ్ కోటను గుర్తించేదెన్నడో.. ● పర్యాటకులకు తప్పని అవస్థలు అమరచింత: ఉమ్మడి జిల్లాకే తలమానికమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కృష్ణా పుష్కరాల సమయంలో ప్రాజెక్టు దిగువ భాగంలో నిర్మించిన పుష్కర ఘాట్లు నాణ్యత లేక వరద ప్రవాహానికి కొట్టుకుపోయి బండరాళ్లు తేలాయి. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులు కాసేపు సేద తీరడానికి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రాజెక్టు రహదారిలో అమరచింత మండలంలో ఉన్న చారిత్రక కట్టడం చంద్రగఢ్ కోటను సైతం పాలకులు విస్మరిస్తున్నారని మండల ప్రజలు అంటున్నారు. కుడి కాల్వ వైపు ఆహ్లాదం.. జూరాల ప్రాజెక్టు కుడికాల్వ వైపు పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో కాల్వ ఉండటం, ప్రాజెక్టు ప్రధాన కార్యాలయాలు సైతం అటువైపే ఉండటంతో ఆ ప్రాంతంలో పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చొరవతో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఎడారిని తలపిస్తున్న ఎడమ కాల్వ విభాగం.. ఎడమకాల్వ విభాగంలో ఆయకట్టుతో పాటు దిగువన విశాలమైన ప్రదేశం, ఇటువైపే రుచికరమైన చేప వంటకాలు లభిస్తుండటంతో సందర్శకులు అధికంగా ఇటువైపే వస్తుంటారు. చెట్ల నీడ సైతం లేకపోవడంతో ఎడారిని తలపిస్తుంది. పర్యాటకులు పిల్లాపాపలతో కాసేపు సరదాగా గడపడానికి వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. చారిత్రక చంద్రగఢ్ కోట.. గుప్తుల కాలంలో చంద్రగుప్తుడు తన రాజ్య విస్తరణతో పాటు పాలన, రక్షణ కోసం కృష్ణానది సమీపంలో తన భార్య చంద్రమతి పేరుతో కోట నిర్మించారు. శత్రువులను దూరం నుంచి పసిగట్టి మట్టుబెట్టేందుకు కోట పైభాగంలో ఫిరంగులు పేల్చడానికి వీలుగా కోట నిర్మాణం చేపట్టారు. ఆధ్యాత్మికత కోసం శివాలయం, రాతి కోనేరులు నిర్మిచారు. ఈ కోనేరుల్లో మండు వేసవిలో సైతం నీరు ఉండటం విశేషం. ప్రస్తుతం నిర్వహణ కొరవడి కోటలోని పలు గోడలు, నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వసతులు కల్పించాలి.. జూరాల ప్రాజెక్టు వద్ద వసతులు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతులతో పాటు బోటింగ్ ఏర్పాటు చేయాలి. – రాజు, మస్తీపురం ప్రతిపాదనలు పంపాం.. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగంలో పార్కుల ఏర్పాటుకు గతంలో అధికారులకు నివేదికలు సమర్పించాం. వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించేందుకు మారోమారు ప్రతిపాదనలు పంపుతాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం -
No Headline
వనపర్తి: పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది పోలీసు భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. సాయంత్రం ఆరు గంటలకు ఓటింగ్ పూర్తయిన వెంటనే రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లను సీజ్ చేసిన సిబ్బంది ప్రత్యేక బస్సుల్లో స్ట్రాంగ్రూంకు తరలించారు. ఇదిలా ఉండగా పెద్దమందడి, ఖిల్లాఘనపురం, కొత్తకోట మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ రక్షిత కె.మూర్తి తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇందుకు సహకరించిన ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు -
జిల్లాలో..
● పాన్గల్ మండలం మాందాపూర్ 114 పోలింగ్ బూత్లో ఈవీఎం 10 నిమిషాల పాటు మొరాయించడంతో పోలింగ్కు కాసేపు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే బాగు చేయడంతో తిరిగి ప్రారంభమైంది. ● వీపనగండ్ల మండలం వల్లభాపురంతండా గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన ఈవీఎం అరగంట పాటు మొరాయించగా టెక్నికల్ సిబ్బంది సరిచేశారు. ● ఖిల్లాఘనపురం మండలం కోతులకుంటతండా పోలింగ్ కేంద్రంలో 106 ఓట్లు పోలైన తర్వాత, పర్వతాపురం గ్రామంలో సాయంత్రం 5 ఓట్లు ఉన్న సమయంలో వీవీ ప్యాట్లు పనిచేయకపోవడంతో అధికారులు కొత్తవి ఏర్పాటు చేశారు. ● అమరచింత జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 228 పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 12.30 నుంచి ఈవీఎం, సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో ఓటర్లు గంటన్నరకు పైగా వేచి ఉన్నారు. ఈ విషయాన్ని ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లగా మక్తల్ నుంచి మరో ఈవీఎంను పంపించి పోలింగ్ ప్రారంభించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగ్ అధికారులను నిలదీయడంతో ఏఎస్పీ రాందాస్ తేజావత్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. ● మదనాపురం మండలం దుప్పల్లి 173 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం అరగంట పాటు మొరాయించింది. ● ఆత్మకూర్లోని కళాశాల పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలను వరుస క్రమంలో ఏర్పాటు చేయకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వరుస క్రమంలో అమర్చిన అనంతరం పోలింగ్ ప్రారంభించారు. మూలమళ్లలో ఈవీఎం మొరాయించడంతో గంటకుపైగా ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. -
No Headline
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల పోరు ముగిసింది. ఓటర్లు తమ తీర్పును ఇచ్చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో సోమవారం ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంది. నిర్దేశిత సమయం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసే నాటికి మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో 71.66 శాతం, నాగర్కర్నూల్లో 69.01 శాతం పోలింగ్ నమోదైంది. మహబూబ్నగర్ పరిధిలో పోలింగ్ ముగిసిన వెంటనే సిబ్బంది ఈవీఎంలు, వీవీప్యాట్లతో పాటు ఎన్నికల సామగ్రిని పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో, నాగర్కర్నూల్ పరిధిలో జిల్లాకేంద్రంలోని నెల్లికొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలకు తరలించారు. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. రెండు లోక్సభ సెగ్మెంట్లలో సైలెంట్గా క్రాస్ ఓటింగ్ కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్వల్ప తోపులాటలు.. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఉట్కూరు మండలం మల్లెపల్లి, నారాయణపేట సెగ్మెంట్లోని కోయిల్కొండ మండలం మల్కాపూర్, పెర్కివీడు గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. -
పంజాబ్ మార్పు కోరుకుంటోంది
అమరచింత: భారత్ను ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రజలు మరోమారు కోరుకుంటున్నారని బీజేపీ చత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాల కార్యనిర్వాహక కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం తన స్వగ్రామమైన అమరచింతలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం విలేకర్లతో మాట్లాడారు. పంజాబ్ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని.. బీజేపీకి మద్దతిస్తూ మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ కావాలంటున్నారని వెల్లడించారు. అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పంజాబ్ ప్రజలు విసిరిపోయారని.. తమ కష్టాలు తీరుస్తారనే నమ్మకంతో ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం కట్టబెట్టినా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల వి నియోగం పెరిగిపోతున్నా అరికట్టలేని దుస్థితికి చేరుకుందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతులను అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు.. ఆ రాష్ట్రానికి చెందిన కిరాయి మనుషులతో రైతు ఉద్యమాల పేరిట ఆందోళన చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రైతుకు వ్యతిరేకం కాదని.. వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో యువకులు, మహిళలు, రైతులులతో పాటు ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతిస్తూ పంజాబ్లో కమలానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వెంకటేశ్వర్లు, మరాఠి అశోక్, రాజేందర్రెడ్డి, మేర్వ రాజు, దుబాయ్ వెంకటేష్, మేర్వ అనిల్, మంగ అంజి పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటుతోనే సాధ్యం
అలంపూర్: ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటుతోనే సాధ్యమని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అలంపూర్ హరిజనవాడ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఆయన సోమవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగబద్దమైన ఓటు హక్కును సొంతగడ్డ అలంపూర్లో వినియోగించుకున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వృథా కావద్దన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం.. రాజ్యాంగాన్ని పరీరక్షించడం కోసం ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తన ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. -
ఓటేసిన ప్రజాప్రతినిధులు..
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరులో బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్, ఎంపీ రాములు కుటుంబసభ్యులతో కలసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలంపూర్ నియోజకవర్గకేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొల్లాపూర్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, తెలకపల్లి మండలం గౌరారంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అమ్రాబాద్ మండలం ఎల్మపల్లిలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, తలకొండపల్లి మండలం ఖానాపూర్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఉండవెల్లి మండలం పుల్లూరులో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ● మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి డి.నాగార్జున జిల్లాకేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి తన స్వగ్రామం గోపాల్పేట మండలం తిరుమలాపురంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ● జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి జిల్లాకేంద్రంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. ● సాట్ చైర్మన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తన సొంత గ్రామం వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జిల్లాకేంద్రంలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. -
ఈవీఎంల మొరాయింపు..
● కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలోని పోలింగ్స్టేషన్ 67లో సాంకేతిక సమస్యతో ఈవీఎం మొరాయించింది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఓటు వేయడానికి వచ్చిన వాళ్లు అసహనంతో తిరిగి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 తర్వాత మరో ఈవీఎంను ఏర్పాటు చేయగా.. పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇదే మండలంలోని కొత్తపల్లి పోలింగ్స్టేషన్ 101లో, 83లో సైతం ఈవీఎంలు మొరాయించాయి. కానుకుర్తిలోని 69వ బూత్లో అరగంట పాటు ఆలస్యంగా ఆరంభమైంది. ● జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్లోని పోలింగ్ స్టేషన్ 81లో ఉదయం 11:30 గంటలకు ఈవీఎం మొరాయించింది. అధికారులు వెంటనే మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు. మిడ్జిల్ మండలం వేముల గ్రామంలోని 255 పోలింగ్ సెంటర్లో వీవీ ప్యాట్ మొరాయించగా.. అధికారులు సరిచేశారు. నవాబుపేట మండలంలోని లింగంపల్లి పోలింగ్ స్టేషన్ 15లో ఉదయం 7.15 గంటలకు కరెంట్ పోయింది. సుమారు 20 నిమిషాల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అప్పటి వరకు పోలింగ్ సిబ్బంది టార్చిలైట్ వెలుతురులో పోలింగ్ కొనసాగించారు. ● మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం కున్సిలోని పోలింగ్స్టేషన్ 74లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈవీఎం సతాయించింది. గంట పాటు పోలింగ్కు అంతరాయం కలిగింది. ఉట్కూర్లోని 37,38 బూత్లలో అరగంట పాటు ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో ఓటింగ్ కొనసాగింది. ● దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కానాయపల్లిలోని పోలింగ్ స్టేషన్ 260లో ఈవీఎం మొరాయించింది. గంట తర్వాత ఆన్ కావడంతో పోలింగ్ కొనసాగింది. భూత్పూరు మున్సిపాలిటీలోని తొమ్మిదో బూత్లో కాసేపు ఈవీఎం మొరాయించింది. అధికారులు పరిద్ది వెంటనే పోలింగ్ ప్రారంబించారు. ● నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ పలుచోట్ల మాత్రం ఈవీఎం మొరాయింపుతో పోలింగ్ ఆలస్యమైంది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం గంగన్పల్లిలో, నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వెంకటేశ్వరబావిలోని రెండు పోలింగ్కేంద్రాల్లో, ఊర్కొండ మండలం రాంరెడ్డిపల్లిలో ఈవీఎం మొరాయింపుతో పోలింగ్ ఆలస్యమైంది. కొద్దిసేపటి తర్వాత అధికారులు ఈవీఎం మిషన్లను పునరుద్ధరించడంతో పోలింగ్ ప్రారంభమైంది -
పోలింగ్ అంచనాలు (శాతాల్లో)..
నాగర్కర్నూల్మహబూబ్నగర్9.81%10.33%27.74%26.99%45.84%45.15%58.92%57.17%68.04%66.21%71.66%69.01% -
సైలెంట్గా ‘క్రాస్’ ఓటింగ్ !
జనరల్ స్థానమైన మహబూబ్నగర్తో పాటు ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో సైలెంట్ ఓటింగ్ కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి 31 మంది, నాగర్కర్నూల్లో 19 మంది బరిలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే పోరు కొనసాగింది. ఉదయం మందకొడిగా.. తొమ్మిది తర్వాత కొంత పుంజుకోవడం.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తగ్గడం.. చివరి రెండు గంటల్లో అధిక సంఖ్యలో ఓటర్లు బారులుదీరిన క్రమంలో సైలెంట్ ఓటింగ్ కొనసాగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు మహబూబ్నగర్ పార్లమెంట్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో క్రాస్ఓటింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీల అభ్యర్థుల మధ్యే పోరు కొనసాగింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ పార్టీకి చెందిన ఓట్లు వేరే పార్టీ అభ్యర్థికి క్రాస్ అయినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి నాగర్కర్నూల్ పార్లమెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం చోటుచేసుకున్నట్లు జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. -
వనపర్తిలో 66.56 % పోలింగ్
వనపర్తి: జిల్లావ్యాప్తంగా సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. పెబ్బేరులోని ఓ పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్ నిర్వహించే క్రమంలో బ్యాలెట్ యూనిట్ మోరాయించడంతో సిబ్బంది మరో యంత్రాన్ని ఏర్పాటు చేసి పోలింగ్ ప్రారంభించారు. ఓటర్ల సౌకర్యార్థం కేంద్రాల్లో టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. వనపర్తి నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే సమయానికి 66.56 శాతం ఓట్లు పోలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్ వెల్లడించారు. ● వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో కృష్ణ అనే యువ ఓటరుకు ఎన్నికల సిబ్బంది కుడిచేతి చూపుడు వేలుకు సిరామార్క్ వేశారు. సదరు ఓటరు గ్రామంలోని వాట్సాప్ గ్రూప్లో తాను ఓటుహక్కు వినియోగించుకున్నట్లు కుడి చెయ్యి చూపించారు. బీఆర్ఎస్ కనుమరుగవుతుంది.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం తన స్వగ్రామం పెద్దమందడి మండలం మంగంపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకొని విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు, అధికారులు వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు -
అభ్యర్థుల సందర్శన..
● పెబ్బేరులోని 204, 206 పోలింగ్ కేంద్రాలను కాంగ్రెస్పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి సందర్శించారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ● పెబ్బేరులోని 203, 205 పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సందర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఏజెంట్లు ఉండకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, మరికొన్నిచోట్ల ఓట్లు వేయడానికి వెళ్లనివ్వడం లేదన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. -
పెరిగిన పోలింగ్ శాతం..
● మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్, షాద్నగర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం ఆరు గంటల వరకు 71.66 శాతం ఓట్లు పోయ్యాయి. గత ఎన్నికల్లో 65.38 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 6.28 శాతం ఓటింగ్ పెరిగింది. ● నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో అచ్చంపేట. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, వనపర్తి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా, 69.01 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 62.23 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 6.78 శాతం ఓటింగ్ పెరిగింది. -
నాగర్కర్నూల్లో 69.01 %, మహబూబ్నగర్లో 71.66 %
● గత ఎన్నికలతో పోలిస్తే రెండు స్థానాల్లోనూ పెరిగిన ఓటింగ్ శాతం ● బ్యాటరీ పరిశ్రమ వద్దంటూ ఎదిరలో గ్రామస్తుల ఎన్నికల బహిష్కరణ ● గుట్ట మైనింగ్ అనుమతులు నిలిపియాలని మైలారం వాసులు సైతం ● అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ సైలెంట్గా క్రాస్ ఓటింగ్..! ● పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు ● భారీ భద్రత మధ్య స్ట్రాంగ్రూమ్లకు ఈవీఎంల తరలింపు ● గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. జూన్ 4న ఓట్ల లెక్కింపు -
No Headline
వనపర్తి: జిల్లాకేంద్రంలోని చిట్యాల మార్కెట్ గోదాం వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రితో ఆదివారం మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో 16 కౌంటర్లు ఏర్పాటు చేసి పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించినా.. పనిచేయకపోయినా.. వెంటనే మరోటి అమర్చేందుకు 20 శాతం ఈవీఎంలు, బీయూలను అదనంగా సిద్ధం చేసి చెప్పారు. ఎన్నికల సిబ్బంది ఈసీ నిబంధనలు విధిగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. సోమవారం తెల్లవారుజామున ఏజెంట్లు, అందుబాటులో ఉన్న అభ్యర్థుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని.. ఓటర్లు సమయంలోగా తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతించినట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఓటర్లు తమ ఓటుహక్కును ఎలాంటి ప్రలోభాలు, వత్తిడిలకు గురికాకుండా నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం సిబ్బందిని తరలించే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. నియోజకవర్గంలోని 307 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని 32 రూట్లు విభజించి పోలీసు బందోబస్తుతో సిబ్బంది, సామగ్రిని పంపించారు. -
భారీ బందోబస్తు..
పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రక్షిత కె.మూర్తి వెల్లడించారు. ఆదివారం పోలీసు అధికారులకు సెట్ కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. ఓటర్లు తమ ఓటుహక్కు స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలన్నారు. భద్రత ఏర్పాట్లు, సిబ్బంది కేటాయింపు తదితర బాధ్యతలను ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలకు అప్పగించి వారికి సూచనలు చేశారు. ప్రతి కేంద్రంలో ఒక పోలీసు అధికారి ఉండాలని.. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే స్పందించాలన్నారు. రూట్ల వారీగా సెక్టార్ ఇన్చార్జ్లతో పాటు కొన్ని ప్రాంతాలకు డీఎస్పీ స్థాయి అధికారులను నియమించినట్లు వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాల కు కేంద్ర బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులను కేటాయించినట్లు తెలిపారు. -
రారండోయ్.. ఓటేద్దాం!
వనపర్తిసోమవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2024● నేడు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ● మహబూబ్నగర్ పార్లమెంట్లో 31 మంది.. నాగర్కర్నూల్ బరిలో 19 మంది అభ్యర్థులు ● రెండు స్థానాల్లో మొత్తం 34,20,724 మంది ఓటర్లు ● ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటాపోటీ ● ప్రలోభాల పర్వంలో పార్టీలు తలమునకలు సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల పర్వానికి సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఆదివారం సాయంత్రానికే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు అధికారులు ఎన్నికల సామగ్రిని తరలించారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. అలాగే ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు కృషిచేస్తున్నారు. సాధారణంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికలను నిర్వహిస్తుండగా.. ఈసారి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ చేపట్టి.. 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను అధికారులు సిద్ధంగా ఉంచారు. రెండేసి బ్యాలెట్ యూనిట్లతో.. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండేసి చొప్పున బ్యాలెట్ యూనిట్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి బ్యాలెట్ యూనిట్లో 1 నుంచి 16 వరకు అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉండగా.. మిగతా అభ్యర్థుల జాబితా రెండో బ్యాలెట్ యూనిట్లో ఉంటాయి. చివరి స్థానంలో నోటాకు అవకాశం ఉంటుంది. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో మొత్తం 16,82,470మంది ఓటర్లు ఉండగా, వీరిలో 8,32,256 మంది పురుషులు, 8,50,172 మంది సీ్త్రలు, 42 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 2,59,260 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,937 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా వీటిలో 21 వరకు వివిధ గిరిజన తండాలు, మారుమూల పల్లెల్లో పోలింగ్ ఉపకేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు.నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 8,64,875 మంది పురుషులు, 8,73,340 మంది సీ్త్రలు, 39 మంది ఇతరులున్నారు. ఈ స్థానం పరిధిలో అత్యధికంగా వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,73,863 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 2,057 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా.. వీటిలో 113 పోలింగ్ ఉపకేంద్రాలను చెంచుపెంటలు, గిరిజన ఆవాసాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. కొల్లాపూర్, కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లలో కాస్త పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం మహిళా ఓటర్లదే కీలక పాత్ర. పోలింగ్ శాతం పెంచేందుకు.. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటుహక్కు వినియోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ తీవ్రతను తగ్గించేందుకు నీడ కోసం టెంట్లు, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కరెంట్ సౌకర్యం, దివ్యాంగులకు ర్యాంప్ సౌకర్యం, అవసరమైన ఫర్నిచర్ సిద్ధంగా ఉంచారు. గత లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో 65.31 శాతం, నాగర్కర్నూల్ స్థానంలో 62.23 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి దీనిని పెంచేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం.... నియోజకవర్గం పోలింగ్ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం కేంద్రాలు మహబూబ్నగర్ 275 1,28,384 1,30,863 13 2,59,260 జడ్చర్ల 274 1,11,053 1,11,779 6 2,22,838 దేవరకద్ర 289 1,18,615 1,21,130 0 2,39,745 నారాయణపేట 270 1,16,497 1,19,682 3 2,36,182 మక్తల్ 284 1,19,809 1,24,363 1 2,44,173 కొడంగల్ 282 1,18,856 1,22,933 5 2,41,794 షాద్నగర్ 263 1,19,042 1,19,422 14 2,38,478 నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం..నాగర్కర్నూల్ 264 1,17,487 1,18,603 4 2,36,094 అచ్చంపేట 339 1,23,126 1,24,598 5 2,47,729 కొల్లాపూర్ 282 1,20,917 1,18,541 5 2,39,463 వనపర్తి 307 1,35,876 1,37,984 3 2,73,863 గద్వాల 303 1,25,644 1,30,982 11 2,56,637 అలంపూర్ 291 1,18,391 1,21,662 10 2,40,063 కల్వకుర్తి 271 1,23,434 1,20,970 1 2,44,405 లోక్సభ సమరానికి అంతా సిద్ధం -
బరిలో 50 మంది అభ్యర్థులు..
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో 31 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ తరపున చల్లా వంశీచంద్రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్ప్రసాద్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎన్నికల్లో తలపడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు సాగనుంది. శనివారం సాయంత్రం నుంచి ప్రచార పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణీ ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు సాగించినట్టు తెలుస్తోంది. -
No Headline
నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి, చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తాం. కృష్ణాజలాల వాటాను తేల్చడంలో, పాలమూరుకు సరైన వాటా దక్కేందుకు కృషి చేస్తాను. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా కోసం కృషిచేయడంతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, తుమ్మిళ్ల, భీమా, కోయిల్సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు అదనపు ఆయకట్టు పనులు, కాల్వల నిర్మాణాన్ని పూర్తిచేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంపై దృష్టి పెడతాను. అలంపూర్, వనపర్తి, నాగర్కర్నూల్ మీదుగా రైల్వేలైన్ నిర్మాణం, జాతీయ రహదారుల నిర్మాణానికి కృషి చేస్తాను. -
పార్లమెంట్లో ప్రజల గొంతుకనవుతా..
ఈ ప్రాంతం నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన అనుభవంతో నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలతో మమేకమవుతూ, అన్ని వేళల్లో అందుబాటులో ఉంటున్నాను. రాత్రింబవళ్లు ప్రజల వెంటే ఉన్నాను. ఎంపీగా అవకాశం కల్పిస్తే, ప్రజల తరఫున పార్లమెంట్లో గొంతుకనవుతాను. పాలకుడిలా కాకుండా సేవకుడిగా పనిచేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో ఈప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి, ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటాను.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement