Wanaparthy
-
సేవలు విసర్తిసాం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూనివర్సిటీ సేవలను విస్తరించి.. జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు వనపర్తి పీజీ కళాశాల హాస్టళ్ల నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ● -
ఆధ్యాతిక, పర్యాటక కేంద్రంగా మార్చాలి
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి శివారులో గల వైరాల గుట్టను ఆధ్మాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యానాయక్ అన్నారు. బుధవారం వైరాల గుట్టలో వెలసిన శివాలయాన్ని దర్శించిన ఆయన డీఆర్డీఓ ఉమాదేవితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్ట చుట్టూ వేలాది మొక్కలు నాటి ప్రకృతి రమణీయంగా మార్చాలని డీఆర్డీఓకు సూచించారు. గుట్టకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న తహసీల్దార్ను ఆదేశించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేఘారెడ్డి సొంత నిధులతో గుట్ట చుట్టూ రోడ్డు పనులు పూర్తి చేశారని, త్వరలో గిరి ప్రదక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని అదనపు కలెక్టర్కు విన్నవించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీఓ పరిణతి, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, సర్పంచ్ మంజుల శ్రీశైలం, ఉప సర్పంచ్ రాములమ్మ హన్మంత్, గ్రామస్తులు కిరణ్కుమార్ రెడ్డి, లక్ష్మారెడ్డి, లక్ష్మణ్గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
మొలకెత్తిన ధాన్యంతో రైతుల నిరసన
పాన్గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో లారీలు రాక తూకం చేసిన వరి ధాన్యం బస్తాలతో పాటు రైతులు తీసుకొచ్చిన ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి బస్తాల్లోని ధాన్యం మొలకెత్తడంతో గురువారం రైతులు నిరసన తెలిపారు. వారికి సీపీఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా రైతులతో కలిసి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ మాట్లాడారు. కేంద్రంలో 60 మంది రైతులకు చెందిన 6 వేలకుపైగా ధాన్యం బస్తాలు లారీలు రాక 50 రోజులుగా నిల్వ ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షానికి సుమారు 100కు పైగా బస్తాల్లోని ధాన్యం మొలకెత్తినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్తో కలిసి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం తూకం చేస్తామని, ధాన్యం బస్తాలను తరలిస్తామని హామీ ఇచ్చినా.. చాలా కేంద్రాల్లో నేటికీ ధాన్యం, బస్తాల నిల్వలు పేరుకుపోయాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా స్పందించి ధాన్యం బస్తాలను తరలించకపోతే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
ఉపాధి పనుల్లో వేగం పెంచాలి
కొత్తకోట రూరల్: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు వేగంగా, నాణ్యతగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దమందడి మండలం జంగమాయపల్లి అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న కందకాల తవ్వకం పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, కార్మికుల హాజరు నమోదు, తవ్వకాలను చూసి కూలీలతో మాట్లాడి పని వేళలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాల్లో కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు, నీడ తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం పామిరెడ్డిపల్లి–బలిజపల్లి రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు కార్మికుల సంఖ్య పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తరహా పనులు ఇతర మండలాల్లో కూడా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, మండలస్థాయి అధికారులు ఉన్నారు. ధ్యానం త్వరగా దించుకోవాలి.. వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తీసుకొచ్చిన లారీలు గోదాముల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరగా దించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం మండలంలోని చిట్యాల శివారులో ఉన్న లక్ష్మీనర్సింహ రైస్మిల్లు గోదామును ఆయన సందర్శించి అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. లారీలు ఎక్కువ సంఖ్యలో వేచి ఉంటే కొన్నింటిని ఇతర గోదాములకు తరలించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారిని ఆదేశించారు. అవసరమైన హమాలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రమేష్రెడ్డి, తదితర అధికారులు ఉన్నారు. -
బాలకార్మిక వ్యవస్థను రూపుమాపుదాం
వనపర్తి: బాలకార్మిక వ్యవస్థ సమాజానికి శాపమని.. ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, స్వేచ్ఛాయుత బాల్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. అంతర్జాతీయ బాలకార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవాసంస్థ, మహిళా, శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా రూపొందించిన వాల్పోస్టర్ను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. బాల కార్మికులను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వారికి విద్యనందించేందుకు ప్రతి పౌరుడు సహకరించాలన్నారు. బాలకార్మిక రహిత సమాజ నిర్మాణమే నిజమైన అభివృద్ధికి నాంది అని.. పిల్లల చేతుల్లో పనిముట్లు కాకుండా పుస్తకాలు ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి, జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాంబాబు, సఖి కేంద్రం నిర్వాహకురాలు కవిత తదితరులు ఉన్నారు. పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తాం.. పాన్గల్ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తించే రాందాస్ జనవరిలో బ్రెయిస్ స్ట్రోక్తో మృతిచెందాడు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన భార్య లావణ్యకు ఎస్పీ సునీతారెడ్డి పోలీసు విడో కార్పస్ ఫండ్ కింద రూ.లక్ష చెక్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు పోలీసుశాఖ అన్ని విధాలుగా అండగా నిలుసుందన్నారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి అందాల్సిన అన్నిరకాల ప్రయోజనాలను సాధ్యమైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా లావణ్యతో మాట్లాడి కుటుంబ సభ్యుల స్థితిగతులు, పిల్లల చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్యాలయ ఏఓ సునందన, సూపరింటెండెంట్ ఇంతియాజ్ , రాందాస్ కుమార్తె నిఖిత తదితరులు ఉన్నారు. -
ధాన్యం పంచాయితీ
రాజధానికి చేరిన రైస్మిల్లులపై వరుస టాస్క్ఫోర్స్ దాడులు ● కనిపించని రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం ● తూతూమంత్రంగా జిల్లాస్థాయి అధికారుల చర్యలు ● చేసేది లేక రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ●వనపర్తి: జిల్లాలో గడిచిన పదేళ్లలో వరి సాగు, ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెరగగా.. అంతేస్థాయిలో ధాన్యం నిల్వల మాయం, కేటాయింపుల్లో లోపాలు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలు సైతం పెరిగాయి. కొంతకాలంలో జిల్లా నుంచి టాస్క్ఫోర్స్ అధికారులకు తరుచూ వెళ్తున్న ఫిర్యాదులతో వరుస దాడులు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం గమనార్హం. కొన్ని మిల్లుల్లో రూ.కోట్ల విలువజేసే ధాన్యం కాగితాల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాయం చేస్తూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. 2025, నవంబర్ 13న పెద్దమందడి మోజర్ల సమీపంలోని రెండు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా.. సుమారు రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించి మిగతా ధాన్యాన్ని సీజ్ చేశారు. గత నెల 22న తిరిగి అవే మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన మిగులు ధాన్యం నిల్వలను పరిశీలిస్తే సుమారు రూ.9 కోట్ల విలువజేసే ధాన్యం అక్కడ లేకపోవడం విస్మయానికి గురిచేసింది. సీజ్ చేసిన ధాన్యం ఎలా మాయమవుతుందనే విషయంపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, రూ.కోట్ల విలువజేసే ధాన్యం సంరక్షించాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించడానికి విముఖత చూపిస్తున్నారు. కొత్తకోట మండలం నాచాంపేట శివారులోని ఓ కొత్త మిల్లుకు గత సీజన్లో రూ.6.50 కోట్ల వరి ధాన్యం అధికారులు కేటాయించారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 9న టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. సుమారు రూ.2.50 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఇది చూసిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టాస్క్ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క.. రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటూ బియ్యం అడిగినప్పుడు రీసైక్లింగ్ పద్ధతిన సీఎస్సీకి అప్పగిస్తూ ఒక ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అధికారులపై ఫిర్యాదుల వెల్లువ.. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వరుస టాస్క్ఫోర్స్ దాడులు జరిగిన మిల్లుల్లో వరి ధాన్యం నిల్వలు మాయం కావడంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా అవినీతి బాగోతం రాజధాని చేరినట్లయింది. ఈ విషయంపై వారు స్పందించి సమగ్ర విచారణ చేస్తారా? లేక జిల్లా అధికారుల మాదిరిగానే నిమ్మకుంటారనే విషయంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయాలంటే కనీసం పదిశాతం బ్యాంకు గ్యారెంటీ బాండ్లు ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చింది. కానీ జిల్లాలోని కొందరు మిల్లర్లపై అధికారులు ఉదాసీనత కనబరుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసిన నాచారంపేట శివారులోని మిల్లు యజమాని కేవలం రూ.10 లక్షల బ్యాంకు గ్యారంటీ చెల్లిస్తే రూ.కోటి విలువ చేసే ధాన్యం మాత్రమే ఇవ్వాలి. కానీ అధికారులు సుమారు 6.50 కోట్ల ధాన్యం కేటాయింపులు చేయడం ఆరోపణలకు బలం చేకూరినట్లుగా భావించాల్సి వస్తుంది. ధాన్యం కేటాయింపులు, కొన్ని మిల్లుల్లో నిల్వలు లేకపోవడం తదితర అంశాలపై కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికాగానే విచారణ చేపడతాం. అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. బ్యాంకు గ్యారంటీ విలువ ఆధారంగానే ధాన్యం కేటాయింపులు చేయాలనే నిబంధన ఉంది. కొనుగోలు కేంద్రాలకు అత్యధికంగా ధాన్యం రావడంతో కొన్నిసార్లు ఎక్కువ మోతాదులో కేటాయింపులు చేయాల్సి వచ్చింది. – వినోద్కుమార్, అదనపు కలెక్టర్, వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలానికి చెందిన ఓ మిల్లర్ ప్రభుత్వం నుంచి సుమారు రూ.120 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకున్నారు. అందులో కనీసం పదిశాతం బియ్యం కూడా ఇవ్వలేదు. ఆయనకే కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపు కాంట్రాక్టును అధికారులు అప్పగించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకులు పలుమార్లు విమర్శలు చేసినా.. కనీసం విచారణ చేపట్టకపోవడం గమనార్హం. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
వనపర్తి రూరల్: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. గురువారం జిల్లాకేంద్రంలోని రాజారాం ఏజెన్సీస్, మన రైతుబజార్, రాఘవేంద్ర ఫర్టిలైజర్, మండలంలోని చిమనగుంటపల్లిలో ఉన్న వేంకటేశ్వర ట్రేడర్స్ను తహసీల్దార్ రమేష్రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు ఇచ్చిన రసీదులు, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ ద్వారా లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. వారి వెంట వ్యవసాయ అధికారి కురుమయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు. 2,972 మంది విద్యార్థులు పాస్ వనపర్తిటౌన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 2,972 మంది ఉత్తీర్ణులయ్యారని డీఐఈఓ నరేంద్రకుమార్ గురువారం తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు 3,482 మంది విద్యార్థులు రాయగా 2,155 మంది పాస్ కావడంతో 61.88 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఇందులో బాలురు 1,864 మందికిగాను 985 మంది.. బాలికల్లో 1,618 మందికిగాను 1,170 మంది పాసయ్యారని చెప్పారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలు 1,696 మంది విద్యార్థులు రాయగా 817 మంది విద్యార్థులు పాసై 48.17 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. ఇందులో బాలురు 1,112 మంది పరీక్షలు రాయగా 529, బాలికలు 584 మంది పరీక్షలు రాయగా 288 మంది పాసయ్యారని వివరించారు. -
పాప బతకాలంటేరూ.16 కోట్ల ఇంజెక్షన్ కావాలి
సాక్షి, హైదరాబాద్ : కూతురు పుట్టిందని సంతోషం ఆ కుటుంబానికి ఎక్కువ కాలం నిలవలేదు. పసికందుకు పట్టుమని నాలుగు నెలలు నిండకుండానే భయంకరమైన వ్యాధి సోకింది. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చూపించగా పాప బతకాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం పడుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల్లో గుండెల్లో ఒక్కసారిగా పిడుగు పడినట్లైంది. బతుకుదెరువుకోసం ఆటో నడిపించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తమకు రూ.కోట్లు చెల్లించి వైద్యం చేయించడం సాధ్యం కాదని, దాతల సాయం కోరుతున్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నెల్విడికి చెందిన బేరి రమేష్ స్థానికంగా ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మొదటి కుమార్తె చైత్రికకు స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్–1 అనే జన్యుపరమైన నరాల జబ్బు సోకిందని వైద్యులు గుర్తించారు. ఫలితంగా కండరాలు పూర్తిగా బలహీనపడి, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. పాపను ప్రాణాపాయం నుంచి కాపాడాలంటే రెండేళ్ల వయసు లోపు ఒనాసెమ్మోజీన్ అబెపార్వోవెక్ అనే ఇంజక్షన్ తీసుకోవాలని నిమ్స్ వైద్యులు సైతం సూచించారు. అయితే దీని ఖరీదు సుమారు రూ.16 కోట్లు ఉండటంతో రమేష్ కుటుంబం పాపను బతికించుకోవడం కోసం తల్లడిల్లుతోంది. పెద్దమనసుతో ముందుకొచ్చి పాపను ఆదుకోవడానికి సాయం చేయాలని రమేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాతలు 8985801524, 9553267573 నెంబర్లను సంప్రదించాలని వారు కోరారు. -
ఇన్చార్జి డీఈఓగా యాదయ్య
వనపర్తిటౌన్: ఇన్చార్జి జిల్లా విద్యాధికారిగా యాదయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డీఈఓ అబ్దుల్ ఘనీ ఈ నెల 1న వికారాబాద్కు బదిలీ కావడంతో ఆర్జేడీ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న వెంకటేశ్వర్రెడ్డికి వనపర్తి డీఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వెంకటేశ్వర్రెడ్డి బాధ్యతలు తీసుకోకపోవడం, మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి జెడ్పీ సీఈఓ యాదయ్యకు అదనంగా డీఈఓ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా డీఈఓ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు యాదయ్యను సన్మానించారు. ఓటరు జాబితా సవరణకు సహకరించాలి వనపర్తి రూరల్: ప్రభుత్వం అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తోందని.. ప్రతి ఒక్కరూ పాల్గొని అధికారులకు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పెబ్బేరు మండలంలోని రంగాపురం, పెబ్బేరు పురపాలికలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మొక్కలు నాటడంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. పర్యావరణ సమతుల్యతతో రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్ లభిస్తుందని వివరించారు. ప్రతి ఇంటా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, ఎంపీడీఓ వెంకటేష్, ఏఓ షేక్ మున్నా, ఎస్ఐ వెంకటేష్గౌడ్, కమిషనర్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి పాన్గల్: ప్రజలు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో సర్పంచ్ ఉషా లింగానాయక్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. చెత్తను ఇష్టానుసారంగా కాలనీలో పారబోయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా చెత్త తరలింపు ట్రాక్టర్ వచ్చినప్పుడు వేయాలన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఇంటా మరుగుదొడ్డితో పాటు ఇంకుడుగుంతను విధిగా నిర్మించుకోవాలని సూచించారు. ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలని.. ఎక్కువ మంది కూలీలు పనులకు హాజరుకావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. సమావేశంలో ఎంపీడీఓ గోవిందరావు, పంచాయతీ కార్యదర్శి కుర్మన్న, తండావాసులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ వనపర్తి: జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాం తనిఖీ చేసి సమగ్ర నివేదిక అందజేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆయన వెంట రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, సి–సెక్షన్ సిబ్బంది రాజేష్, కాంగ్రెస్ నుంచి వేణాచారి, సీపీఎం నుంచి పరమేశ్వరాచారి, బీజేపీ నుంచి కొమ్ము శ్రీనివాస్, పెద్దిరాజు, బీఆర్ఎస్ నుంచి జమీల్, ఎంఐఎం నుంచి అప్సర్, టీడీపీ నుంచి శంకర్ తదితరులు ఉన్నారు. -
ఒక్క క్షణం.. అంతా శూన్యం!
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరుకు చెందిన నర్సింహులు ఇంటి నిర్మాణం కోసం అప్పులు పెరిగిపోయి నిండా మునిగిపోవడం... అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో తాను కౌలుకు తీసుకున్న మామిడి తోటలో తన ఇద్దరు పిల్లలతో సహా భార్య కాళ్లూ చేతులు కట్టేసి సంపులో పడేశాడు. ఈ సంఘటన గత నెల 27వ తేదీన చోటు చేసుకుంది.. అప్పుల బాధ తట్టుకోలేక ఇలా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో కుటుంబాలకు శోకాన్ని మిగిలిస్తుంది. మహబూబ్నగర్ క్రైం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిలిస్తోంది..అంతకు మించి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు.. నమ్ముకున్న వారు అనాథలుగా మారుతున్నారు.. పచ్చని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆత్మహత్య ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటం.. ఈ సంఖ్య ఏటా పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నిత్యం ఏదో ఒకచోట బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది మహిళలు చిన్నపాటి విషయానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా భార్యాభర్తలు.. తల్లిదండ్రులు ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడంతో వందల సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తల్లి ఆత్మహత్య చేసుకున్నా.. తండ్రి బలవన్మరణానికి పాల్పడినా అనాథలుగా మారేది వారి పిల్లలే అన్న చిన్న విషయం గుర్తుకు వస్తే చాలా వరకు ఆత్మహత్యలు ఆలోచనలతోనే ఆగిపోతాయి. 2025 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 962 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలోనే 332 మంది ఉన్నారు. ఈ ఏడాది ఈ జిల్లాలో ఇప్పటికే 149 మంది ఆత్మహత్యలకు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ● ఆత్మహత్య చేసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. తీవ్రమైన నిరసన తెలపడం.. అభద్రతాభావం.. తన బాధ వినేవారు ఎవరూ లేరు అనే బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువగా నడివయస్కులవారే. తన మాట వినేవారు ఉన్నారు అని వారు భావిస్తే ఆత్మహత్య ఆలోచన రాకుండా ఉంటుంది. ● చదువుల్లో వెనుకబాటుతోపాటు ఆశించిన మార్కులు సాధించలేమనే కారణాలతో బలవన్మరణం చెందుతున్న విద్యార్థులెందరో ఉన్నారు. ప్రవేశ పరీక్షలలో విఫలమయ్యానని, పరీక్షల్లో అనుకున్న ర్యాంకు రాలేదని.. ఆ కళాశాలలో వాతావరణం బాగా లేదని.. లెక్చరర్స్ తిట్టారని.. ఇంట్లో అమ్మానాన్న మందలించారని.. ఫోన్ చూడొద్దంటున్నారని.. ప్రేమలో విఫలమయ్యామని.. ఇలా చిన్నపాటి కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 28 నుంచి 30 శాతం మంది చదువులో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి దశలో 14– 20 ఏళ్లలోపు వారు ఎక్కువగా మరణిస్తున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కలు బహిర్గతం చేసింది. ఈ తరహా ఆత్మహత్యలు జిల్లాలోనూ ఏడాదికి పదుల సంఖ్యలో ఉంటున్నాయి. ఇవీ కారణాలు.. బలవన్మరణాలు పాల్పడుతున్నవారిలో 16 నుంచి 40 ఏళ్ల వారే అధికం అనాథలుగా మారుతున్న పిల్లలు.. ఆగమవుతున్న బతుకులు కుటుంబంలో వచ్చే విభేదాలే కారణంఅంటున్న నిపుణులు ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలతో ఆందోళన -
సుస్థిర వ్యవసాయంతోనే రైతులకు భరోసా
మదనాపురం: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు శాసీ్త్రయ పద్ధతులు అవలంబిస్తూ సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఖేతి బచావో అభియాన్.. షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళికపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ ప్రధానశాస్త్రవేత్త డా. ఆర్డీ ప్రసాద్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. సురేష్కుమార్, కేవీకే హెడ్ డా. వి.రాజేంద్రకుమార్ హాజరై జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. వి.రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాంకేతికతను అందుపుచ్చుకోవాలని సూచించారు. పంటల సంరక్షణ, సమగ్ర కీటక యాజమాన్య పద్ధతులు, నేల ఆరోగ్య పరిరక్షణతో పాటు సహజ వనరులను సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలో రైతులకు సమగ్రంగా వివరించారు. శాస్త్రవేత్తలు డా. ఆర్డీ ప్రసాద్, డా. సురేష్కుమార్ మాట్లాడుతూ.. పంట మార్పిడీతో భూమి ఉత్పాదకత పెరుగుతుందన్నారు. ఆముదం, కుసుమ, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల పంటల్లో మెరుగైన రకాలను ఎంచుకోవాలని, విత్తనశుద్ధి, భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల యాజమాన్యం చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎస్సీఎస్పీ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల రైతులకు ఉన్న వివిధ ప్రయోజనాలు, అవకాశాలను వివరించారు. వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు తిప్పస్వామి ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాయితీలు, విత్తనాల పంపిణీ, పంటల బీమా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అర్హులైన రైతులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సుకు హాజరైన రైతులకు ఆముదం, కంది, రాగులు, జొన్న విత్తనాలను శాస్త్ర వేత్తలు ఉచితంగా పంపిణీ చేశారు. తక్కువ పెట్టు బడి, వాతావరణ ఒడిదొడుకులను తట్టుకొని అధిక ఆదాయం ఇచ్చే పంటలు సాగు చేయడమే ముఖ్య ఉద్దేశమని శాస్త్రవేత్తలు తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఆర్.అనిత, డా. జి.భవాని, కేవీకే సిబ్బ ంది, పరిసర ప్రాంతాల రైతులు పాల్గొన్నారు. -
పంటమార్పిడితో అధిక లాభాలు
గోపాల్పేట: రైతులు పంటమార్పిడి పద్ధతి అవలంబిస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని జయన్న తిర్మలాపూర్ నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇంకుడుగుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటా విధిగా నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు జిల్లాలో రెండ్రోజులు పర్యటించి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవడానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా ఐదు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. గ్రామంలో గత ఐదేళ్లలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారు మరణిస్తే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకొని రూ.20 వేలు పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తోందని.. ప్రతి ఒక్కరూ పాల్గొని అధికారులకు సహకరించాల ని కోరారు. గ్రామంలో రూ.పది లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతిగోపాల్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ముజాహిద్, నాయకుడు యాదయ్య, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి రంగాలను ప్రోత్సహించాలి
● రూ.5,990 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక పుస్తకం విడుదల ● రుణాల మంజూరులో లక్ష్యాలను అధిగమించిన అధికారులకుకలెక్టర్ అభినందన వనపర్తి: రైతులు, విద్యార్థులు, ఎంఎస్ఎంఈ యూనిట్లు, మెప్మా సంఘాలు, స్వయం ఉపాధి రంగాల రుణాల మంజూరులో బ్యాంకులు మరింత చొరవ చూపాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందరింలో కలెక్టర్ అధ్యక్షతన డీసీసీ (డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ), డీఎల్ఆర్సీ (డిస్ట్రిక్ట్ లెవల్ రివ్యూ కమిటీ) సమావేశం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, ఎంఎస్ఎంఈ, విద్య, స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ పథకాల రుణాల మంజూరు వారీగా సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,990 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రుణాల మంజూరులో సిబిల్ స్కోర్ను ప్రమాణంగా పరిగణించినప్పటికీ, అర్హులైన రైతులు, విద్యార్థులు, స్వయం ఉపాధి లబ్ధిదారుల రుణాలు తిరస్కరణకు గురికాకుండా సానుకూల దక్పథంతో వ్యవహరించాలన్నారు. కొన్ని బ్యాంకులు వివిధ ప్రభుత్వ పథకాల కింద రుణాల మంజూరులో వెనుకబడి ఉన్నాయని, తమ పనితీరు మెరుగుపర్చుకొని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన తదితర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు నిర్ణీత గడువులోగా రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకర్లను కోరారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ పథకాలను సమీక్షించిన కలెక్టర్ లబ్ధిదారులకు రుణాల మంజూరులో ఆలస్యం కాకుండా కారణాలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. బ్యాంకులు, జిల్లా పరిశ్రమలశాఖ అధికారులు సమన్వయంతో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఖాతాదారులు, ప్రభుత్వ పథకాల కింద రుణాలు తీసుకున్న లబ్ధిదారుకు బీమా పథకాలు వర్తింపజేయాలని సూచించారు. అవసరమైన విద్యార్థులకు విదేశీ విద్య, ఉన్నత విద్యా రుణాలు మంజూరు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేసిన యూబీఐ, ఎస్బీఐ, యూకో బ్యాంక్ ప్రతినిధులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికలు అందజేశారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలోని కోర్సుల గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్ మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,339 కోట్ల వార్షిక రుణ లక్ష్యాలకుగాను రూ.4,943 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. నాబార్డ్ డీడీఎం మాట్లాడుతూ.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక రూపొందించడానికి కావాల్సిన సమాచారాన్ని అందించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్బీఐ ఎల్డీఓ డా. ప్రదీప్చంద్ర, నాబార్డ్ డీడీఎం మనోహర్రెడ్డి, యూబీఐ ఏజీఎం మురళీకృష్ణ, ఎస్బీఐ ఆర్ఎం శ్రీచరణ్, ఇతర బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలి
వనపర్తి(గోపాల్పేట): కేసుల సమాచారాన్ని పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేయాలని అదనపు ఎస్పీ రాజేష్మీనా సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కేసుల నమోదు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఎస్ఐ శశిధర్తో మాట్లాడి కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పోలీసుశాఖలో సీసీటీఎన్ఎస్ ప్రత్యేకమైన కీలక వ్యవస్థ అని.. కేసుల నమోదు నుంచి దర్యాప్తు, చార్జ్షీట్ దాఖలు వరకు ప్రతి దశను సాంకేతికంగా పర్యవేక్షించేందుకు వ్యవస్థ పని చేస్తుందని, సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సీసీటీఎన్ఎస్లో వివరాలు నమోదు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి తప్పిదాలకు తావివ్వకూడదని, పెండెన్సీ లేకుండా చూసుకోవాలని చెప్పారు. డేటా ఎంట్రీలో అత్యుత్తమ పనితీరు కనబర్చి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు. సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకున్నప్పుడే పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. -
రాష్ట్ర టాస్క్ఫోర్స్ బృందం తనిఖీ
● రూ.2.50 కోట్ల వరి ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు కొత్తకోట: మండలంలోని మిరాసిపల్లి శివారులో ఉన్న సాంబశివ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్మిల్లులో మంగళవారం రాష్ట్ర టాస్క్ఫోర్స్ బృందం, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 25,426 బస్తాల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని అధికారులు వేశారు. పంచనామా నిర్వహించి మిల్లులో ఉన్న మిగులు ధాన్యాన్ని రాయిణిపేట శివారులోని ఏకేఆర్ ఇండస్ట్రీస్కు తరలించారు. పూర్తి నివేదికను అదనపు కలెక్టర్ (పౌరసరఫరాలు) సమర్పిస్తామని.. తదుపరి ఆదేశాల మేరకు సంబంధిత మిల్లర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఫిజికల్ పత్రాలు అడగొద్దు : ఈడీఎం వనపర్తి: మీ సేవా దరఖాస్తుల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్ పత్రాలు అడగొద్దని.. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వాటిని మాత్రమే పరిశీలించి మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని ఈడీఎం వెంకటేశ్ సూచించారు. మంగళవారం ఆయన అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోటలో పర్యటించి తహసీల్దార్లు, జీపీఓలు, ఆర్ఐలతో కలిసి మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తులకు సంబంధించి అవసరమైన పత్రాలను సక్రమంగా స్కాన్ చేసి మండల సిబ్బందికి సమయానుకూలంగా అందజేయాలని ఆదేశించారు. 25 మంది డీటీలకు పదోన్నతులు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 25 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేస్తూ జిల్లాలకు కేటాయించారు. ఇందులో నాగర్కర్నూల్ జిల్లాకు రాజీవ్రెడ్డి, రామకృష్ణ, రవి, పుష్పలత, మహబూబ్నగర్ జిల్లాకు సుజాతమ్మ, హరిందర్రెడ్డి, శ్రీను, సుదర్శన్రెడ్డి, బాలరాజు, నారాయణపేట జిల్లాకు గాయత్రి, రాజ్గోపాల్, కిషోర్కుమార్, దీపిక, వియోచన, వనపర్తి జిల్లాకు వెంకటేశ్, వేణుగోపాల్రెడ్డి, విజయ్కుమార్, కరుణాకర్, నదీమ్, గద్వాల జిల్లాకు రాఘవేందర్, తిలక్రెడ్డి, లక్ష్మీకాంత్, శ్రీనివాస్, వాసుదేవరావులను కేటాయించారు. వీరికి ఆయా జిల్లాలోని మండలాలను కలెక్టర్లు కేటాయిస్తారు. అయితే మహబూబ్నగర్లో చాలామంది డీటీలు ప్రమోషన్ను తీసుకోవడానికి ఇష్టంగా లేరని సమాచారం. మహబూబ్నగర్ను విడిచి ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. -
ప్రతి ఇంటా సోలార్ వెలుగులు : మంత్రి
వనపర్తి(చిన్నంబావి): ప్రతి ఇంటా సోలార్ వెలుగులు నింపాలన్న ప్రభుత్వ ఆశయానికి వడివడిగా అడుగులు పడుతున్నాయని.. ఇంటి మిద్దెలపై సొలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. మంగళవారం తన స్వంత గ్రామం మండలంలోని పెద్దదగడలో ఆయన పర్యటించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోలార్ ప్రాజెక్టులో పెద్దదగడను పైలెట్ గ్రామంగా ఎంపిక చేసిందని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని.. ప్రభుత్వం రాయితీ అందిస్తుందని వివరించారు. ఆయన వెంట విద్యుత్శాఖ అధికారి అప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి యాదవ్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, సర్పంచ్ ఉడుతల భాస్కర్, వడ్డెమాన్ బిచ్చన్న, బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత ఎన్నికలు
ఈ నెల 12న నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ●ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.. చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన సంఘాల ఎన్నికలు ఉన్నతాధికారుల నుంచి నోటిఫికేషన్ వెలువడగానే నిర్వహిస్తాం. సంఘాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి సంఘాలకు పంపించాం. యాక్టివ్గా ఉన్న చేనేత సహకార సంఘాల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల జిల్లా అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు చేనేత, జౌళిశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ● చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 4 నుంచి మే నెల 15 వరకు సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. చేనేత జౌళిశాఖ అధికారులు ఓటరు జాబితా సవరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించారు. ఈ నెల 12న 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడంతో పాటు వారిలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ప్రకటిస్తారు. ఈ వ్యవహారమంతా అభ్యర్థికి సభ్యులు చేతులెత్తి ఓటేసే ప్రక్రియతో కొనసాగనుందని అధికారులు తెలిపారు. 100 మంది కంటే ఎక్కువ మంది సభ్యులున్న సంఘాలకు ఇదే నెల చివరి వారంలో ఓటింగ్ విధానంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నాగర్కర్నూల్ 3 96 జిల్లాల వారీగా సంఘాలు. ఓటర్లు ఓటర్లు సంఘాలు మొదటివిడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకే.. ఓటరు జాబితా సిద్ధం చేసిన అధికారులు డిఫాల్టర్లు, మృతిచెందిన వారి ఓటుహక్కు తొలగింపు ఉమ్మడి జిల్లాలో 54 చేనేత సహకార సంఘాలు నారాయణపేట 10 739 వనపర్తి 8 2,014 -
నారాయణపేటపై వనపర్తి విజయం
గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తాం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: గ్రామీణ క్రీడాకారులకు భవిష్యత్లో మంచి అవకాశాలు కల్పిస్తామని భారత జట్టు మాజీ క్రికెటర్, హెచ్సీఏ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు అన్నారు. జిల్లాకేంద్రం బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లా అండర్–14, 16 వన్ డే క్రికెట్ టోర్నీ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్సీఏ నుంచి భారత జట్టుకు అధిక సంఖ్యలో క్రీడాకారులను ఎంపిక చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. గ్రామీణ క్రీడాకారులు భారత జట్టుకు ఆడాలన్నదే హెచ్సీఏ లక్ష్యం అన్నారు. హెచ్సీఏ కార్యదర్శి మన్నె జీవన్రెడ్డి మాట్లాడుతూ మొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ టీ–20 క్రికెట్ ప్రారంభం కానుందన్నారు. ప్రతి జట్టులో నలుగురు గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణ టీ–20 లీగ్ నుంచి రాష్ట్ర, జిల్లా క్రీడాకారులు భారత జట్టుతోపాటు ఐపీఎల్ తరపున ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామన్నారు. ఎండీసీఏ మైదానంలో ఫ్లడ్ లైట్లు, అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నీ అండర్–14లో విజేతగా మహబూబ్నగర్, రన్నర్గా జడ్చర్ల, అండర్–16లో విజేతగా జడ్చర్ల, రన్నర్గా నిలిచిన మహబూబ్నగర్ బాలుర జట్లకు బహుమతులు ప్రదానం చేశారు.ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, న్యాయవాది మనోహర్రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్, ప్రతినిధులు సురేష్కుమార్, వెంకటరామారావు, గోపాలకృష్ణ, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బాలాజీ ఐటీఐ కళాశాల మైదానంలో హెచ్సీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంట్రో డిస్ట్రిక్ అండర్–16 క్రికెట్ మ్యాచ్లో నారాయణపేట జట్టుపై వనపర్తి జట్టు విజయం సాధించింది. మంగళవారం వనపర్తి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 25 ఓవర్లలో 163 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన నారాయణపేట జట్టు 23 ఓవర్లు మాత్రమే ఆడి 99 పరుగులకే ఆలౌట్ అయింది. వనపర్తి జట్టులో పవన్ 52 బంతుల్లో 40 పరుగులు, మనోజ్ 28 బంతుల్లో 25 పరుగులు చేశారు. అదేవిధంగా బౌలింగ్లో 3 వికెట్లు తీసి వనపర్తి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మనోజ్కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలు ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. సమ్మర్ క్రికెట్ క్యాంపు ఇన్చార్జ్ రమణ, హెచ్సీఏ పరిశీలకుడు ముక్తార్, జహీర్, చెన్నారెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. జనరల్ ఆస్పత్రిలో భారీగా బదిలీలు పాలమూరు: మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోపాటు పాలమూరు మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న అన్నివిభాగాల హెచ్ఓడీలు హైదరాబాద్కు బదిలీ అయ్యారు. మొత్తం 9 విభాగాల ప్రొఫెసర్ల (హెచ్ఓడీ)లకు స్థానం చలనం కావడం విశేషం. మత్తు విభాగం హెచ్ఓడీ డాక్టర్ మాధవి ఉస్మానియా, రేడియాలజీ విభాగం హెచ్ఓడీ హన్మంతు ప్రసాద్ గాంధీ ఆస్పత్రి, ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ శ్రీకాంత్ కోఠి, చిన్నపిల్లల విభాగం (పీడియాట్రిక్) హెచ్ఓడీ డాక్టర్ సురేష్ శ్రీనివాస్ నిలోఫర్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ అమరావతి ఉస్మానియా, ఎస్పీఎం హెచ్ఓడీ డాక్టర్ ఉషారాణి ఉస్మానియా, ఫిజియాలజీ హెచ్ఓడీ డాక్టర్ సునందిని ఉస్మానియా, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పార్వతి ఉస్మానియా, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ రమాదేవి నిలోఫర్కు బదిలీ అయ్యారు. అదేవిధంగా జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీపద్మప్రియ నారాయణపేట, జనరల్ మెడిసిన్లో అసోసియేట్ ప్రొఫెసర్ స్వప్న ఉస్మానియాకు, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ నాగర్కర్నూల్కు బదిలీ అయ్యారు. ఇక జిల్లాకు వచ్చిన వారిలో ఎస్పీఎం హెచ్ఓడీగా డాక్టర్ కోటేశ్వరమ్మ గాంధీ నుంచి బదిలీపై వచ్చారు. మైక్రోబయాలజీ హెచ్ఓడీగా డాక్టర్ శ్రీవాణి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీగా డాక్టర్ శకుంతల రావడం జరిగింది. కొత్తవారు ఎప్పుడో..? జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాల్లో పనిచేసే హెచ్ఓడీలు (ప్రొఫెసర్లు) బదిలీ కావడంతో సదరు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారు వచ్చి విధుల్లో చేరే వరకు ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియడం లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి వచ్చే వారిలో ఇక్కడ విధుల్లో చేరడానికి ఆసక్తి చూపారు. ఒకవేళ చేరిన నిత్యం హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. డీఎంహెచ్ఓ కృష్ణ బదిలీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డీఎంహెచ్ఓగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కృష్ణ నాగర్కర్నూల్ డీఎంహెచ్ఓగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరిని కేటాయించలేదు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిగా డాక్టర్ సునీతరెడ్డి వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ)గా డాక్టర్ శైలజ నారాయణపేట నుంచి బదిలీపై వచ్చారు. ఇక పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్లు, 24 మంది ఏఎన్ఎంలు, ముగ్గురు ఎంపీహెచ్ఓలు, నలుగురు హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీహెచ్ఓలు బదిలీ కావడం జరిగింది. కిందిస్థాయి సిబ్బందికి జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ ఇవ్వగా.. కొందరు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. రోగులకు దిక్కెవరు..? ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్లకు బదిలీ అయిన నేపథ్యంలో కొత్త వారు వచ్చి విధుల్లో చేరడానికి ఇంకా సమయం పట్టనుంది. అలాగే కొంతమందిని ఇక్కడికి బదిలీ చేసిన విధుల్లో చేరడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు అవస్థలు తప్పవు. అందరూ విధుల్లో ఉన్న రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడేవారు ప్రస్తుతం అందరూ బదిలీ హడావుడిలో ఉండటంతో రోగులను పట్టించుకునే నాథుడే ఉండరు. దీంతో అడ్మిట్ అయిన రోగులతోపాటు అవుట్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందడం కష్టసాధ్యమే అనిపిస్తోంది. 9 విభాగాల హెచ్ఓడీలు, అసోసియేట్లకు స్థానచలనం డీఎంహెచ్ఓ కృష్ణ నాగర్కర్నూల్కు.. ఆరోగ్యశాఖలో వైద్యాధికారులు,ఏఎన్ఎంలు అందరూ బదిలీ జనరల్ ఆస్పత్రిలో కొత్త వైద్యులు విధుల్లో చేరే వరకు రోగులకు తప్పని అవస్థలు -
అర్హత ఇలా...
బాలలకు సంబంధించి పునరావాసం, దత్తత, పునరేకీకరణ, పోషణ వంటి తదితర అంశాలన్నీ జువైనల్ జస్టిస్ యాక్టు 2015 ప్రకారం జరిగి తీరాలి. దత్తత నియమావళి 2017ను కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. దత్తత కావాలనుకునే భార్యాభర్తలిద్దరి అంగీకారం ఎంతో ముఖ్యం. నియమాల ప్రకారం, ప్రమాణాలు అన్ని నెరవేర్చిన తరువాత ఒంటరి లేదా విడాకుల పొందిన వ్యక్తి కూడా దత్తత తీసుకోవచ్చు. ఒంటరిగా నివవించే మగ వ్యక్తి బాలికను దత్తత తీసుకునేందుకు అనర్హుడు. శిశుగృహ నుంచి దత్తత వెళ్లిన పిల్లలను మా సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి ఆరునెలలకోసారి పర్యవేక్షిస్తాం. దత్తత తీసుకున్న దంపతులు వారి ఆలనాపాలన సరిగా చూసుకుంటున్నారా.. లేదా.. అనేది తెలుసుకుంటాం. రెండేళ్లలో నాలుగు సార్లు పిల్లలను పర్యవేక్షిస్తాం. పిల్లలను సక్రమంగా చూసుకోకపోతే కారా చట్టం ప్రకారం దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అలాంటి సమస్య ఎదురుకాలేదు. – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి -
భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచండి
వనపర్తి: జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్అండ్ఆర్ కమిషనర్ కె.శివకుమార్నాయుడు ఆదేశించారు. ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులతో ఆయన సమావేశమై భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్అండ్ఆర్ కమిషనర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి, నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టులను పూర్తిచేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలోని గణపసముద్రం ప్రాజెక్టులో పెండింగ్ ఉన్న 197 ఎకరాల భూసేకరణకు గాను 164 ఎకరాలకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. రైతులను ఒప్పించి అవార్డు కూడా త్వరగా జారీచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న 17 ఎకరాల భూసేకరణకు సోమవారంలోగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఎంజీకేఎల్ఐ ప్యాకేజీ–29 మైనర్ కెనాల్స్కు సంబంధించి 77 ఎకరాల భూసేకరణకు పెగ్ మార్కింగ్ త్వరగా పూర్తిచేసి.. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఘణపూర్ బ్రాంచ్ కెనాల్కు 30 ఎకరాల భూమి పెగ్ మార్కింగ్ పూర్తిచేయడంతో పాటు ఎస్డీఆర్ స్టేజీలో ఉన్న 60 ఎకరాలకు కూడా త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. బుద్ధారం పెద్ద చెరువుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసిన 101 ఎకరాల భూమికి సంబంధించిన రైతులతో మాట్లాడి అవార్డు వేగంగా జారీచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాన్ చెరువుకు సంబంధించి చందాపూర్, సవాయిగూడెం, పెద్దగూడెం గ్రామాల పరిధిలో అటవీ భూమి అంశంపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని త్వరగా అనుమతులు పొందే విధంగా చూసుకోవాలన్నారు. భూ సేకరణలో భాగంగా ఇప్పటికే అవార్డ్స్ జారీ చేసిన వాటికి సంబంధించి టొకెన్స్ రైస్చేస్తే త్వరగా నగదు బదిలీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ రహీముద్దీన్, ఎస్ఈ చంద్రశేఖర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, సర్వే ఏడీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. పెండింగ్ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిర్ణీత గడువులోగా ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తెలంగాణ ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు -
అనాథలుగా మారుతున్న అభాగ్యులు
నవ మాసాలు మోసి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలను ఆ తల్లులకు మనసేలా ఒప్పుతుందో తెలియదు కానీ తమ పిల్లలను పెంట కుప్పలు, రోడ్లపై పాడేసి పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో స్థానికులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఐసీడీఎస్ సిబ్బంది సహకారంతో శిశుగృహకు చేర్చుతున్నారు. వీరితో పాటు కొందరు తల్లిదండ్రులు తాము సంతనాన్ని పోషించలేమంటూ స్వచ్ఛందంగా శిశుగృహ అధికారులకు అప్పగించి వెళ్తున్నారు. ఇందులో ఎక్కువ మంది బాలికలే ఉండడం గమనార్హం. ఆడపిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకునేందుకు ఆరు నెలల నుంచి ఏడాది, మగ పిల్లలను దత్తత తీసుకునేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుంది. దత్తత సలహా, సహాయ కేంద్రాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. అనాథలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారితో వెళ్లే చిన్నారుల యోగక్షేమాలను ఈ కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. ఎక్కడైనా లోపం తలెత్తితే తదనుగుణంగా చర్యలు సైతం తీసుకుంటుంది. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
అమరచింత/ఆత్మకూర్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులు అన్నారు. శనివారం అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో హకా సెంటర్లు, ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అమరచింత మండలంలోని కిష్టంపల్లి హకా సెంటర్ –3, ఈర్లదిన్నెలోని వెంకటేశ్వర ట్రేడర్స్లో స్టాక్ వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా విత్తనాల స్టాక్ వివరాలను నోటీస్ బోర్డుపై లిఖించకపోవడంతో సదరు డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, క్రిమిసంహారక మందులను మాత్రమే విక్రయించాలని సూచించారు. కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా విత్తనాలు కొనుగోలుచేసే రైతులు తప్పనిసరిగా రశీదులు పొందాలని ఆయన సూచించారు. డీఏఓ వెంట ఏఓలు రమేశ్, అరవింద్ ఉన్నారు. -
రేపటి ప్రజావాణి రద్దు
వనపర్తి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8న గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం జరిగే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక గ్రామసభల కార్యక్రమం కారణంగా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి.. ఫిర్యాదులు, అర్జీలు ఇచ్చేందుకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. 15వ తేదీన యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కొత్తకోట: తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రవికాంత్రెడ్డి, కార్యదర్శి మన్నె శశికుమార్ డిమాండ్ చేశారు. శనివారం కొత్తకోటలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎస్పీఎం కార్మికుల సర్వసభ్య సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. ఎస్పీఎం కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ ముందుండి పోరాడుతోందన్నారు. ఎస్పీఎం కార్మికులందరినీ బేషరతుగా సంస్థలో విలీనం చేయడంతో పాటు విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు. ఎం.బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీజీఎన్డీసీఎల్ అధ్యక్ష, కార్యదర్శులు రాందాస్ నాయక్, రమణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎద్దుల సత్యం, ఎస్పీఎం కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కోశాధికారి ఇల్లందుల రాజయ్య, వరదరాజు, మురళీధర్రావు, సాయి ప్రకాశ్గౌడ్, కవికుమార్రెడ్డి, కురుమూర్తి, సురేంద్ర ప్రసాద్, కొండయ్య ఉన్నారు. జలదోపిడీపై విచారణ జరపాలి వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులోని లిక్కర్ కంపెనీ జలదోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగేంధర్గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం లిక్కర్ కంపెనీ సమీపంలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఏబీడీ లిక్కర్ కంపెనీ నిర్వాహకులు కృష్ణాజలాలను అక్రమంగా వినియోగించడంతో పాటు కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాలను పైపుల ద్వారా నదిలో కలుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిబంధనల ప్రకారం నదీ జలాలను మొదటగా తాగడానికి, సాగుకు వాడుకోవాలని.. ఆ తర్వాతే ఇతర అవసరాలకు ప్రభుత్వ అనుమతులతో వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. లిక్కర్ కంపెనీ జలదోపిడీ చేస్తున్నా ఇరిగేషన్శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించి.. కృష్ణాజలాల అక్రమ వినియోగంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్, దేవర శివ, జితేందర్, రామన్గౌడ్, బీచుపల్లి సర్పంచ్ బీసీ రెడ్డి, ఉపసర్పంచ్ నాగరాజు, అదామ్, రాజశేఖర్గౌడ్, వీరేష్, నరేష్గౌడ్ పాల్గొన్నారు. ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్ల బదిలీ నారాయణపేట రూరల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట డీఎం టి.లావణ్య హైదరాబాద్లోని హయత్నగర్ డిపో–1కు బదిలీ కాగా.. ఆమె స్థానంలో హెడ్ఆఫీస్లోని ఏటీఎం కార్గో ఇన్చార్జి డీఎన్ రాజన్ను కేటాయించారు. అలాగే షాద్నగర్ డీఎం ఉషను జనగాంకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో హైదరాబాద్ డిపో–2 నుంచి కరుణశ్రీ రానున్నారు. అచ్చంపేట డీఎం పీఎండీ ప్రసాద్ హయత్నగర్ డిపో–2కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో డిప్యూటీ ఈ–ఎలక్ట్రికల్ హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ను కేటాయించారు. గద్వాల డీఎం సునీతను కూకట్పల్లి డిపోకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో రాణిగంజ్ డిపో నుంచి శ్రీధర్ వస్తున్నారు. కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్గౌడ్ను ఐటీ డిపార్ట్మెంట్కు బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్ బస్టాండ్ ఏటిఎంగా విధులు నిర్వహిస్తున్న మల్లేశ్వరయ్యను కేటాయించారు. కల్వకుర్తి డీఎం సుహాసినిని ఇల్లందు డిపోకు కేటాయించగా.. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు. -
ఎకరం @ రూ.2కోట్లు
రాష్ట్ర రాజధానికి తీసిపోని విధంగా భూముల ధరలు ●వనపర్తి: రాష్ట్ర రాజధానికి తీసిపోని విధంగా జిల్లాలోని భూముల విలువ పెరిగింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలను ప్రభుత్వం సవరించడంతో వాటి రెక్కలొచ్చాయి. జాతీయ రహదారిని అనుసరించి ఉన్న మండలాల్లో ఎకరా భూమి రూ. కోటి ఉన్న ధర.. ప్రస్తుతం రూ. 2కోట్లకు చేరింది. జిల్లాలోని భూముల విలువ, మార్కెట్ విలువ వ్యత్యాస్యాన్ని సేకరించిన ప్రభుత్వం.. స్వలంగా తేడాలు ఉన్నచోట 25 నుంచి 75 శాతం, డబుల్ కంటే ఎక్కువ తేడా ఉన్నచోట 100శాతం పెంచింది. భవనాల విలువ పెంపు విషయంలో 50 కంటే ఎక్కువగా జిల్లావ్యాప్తంగా ఎక్కడా పెంచలేదని తాజాగా అమల్లోకి వచ్చిన నూతన మార్కెట్ విలువల ధరల మేరకు తెలుస్తోంది. కొత్తకోట మండలంలో అత్యధికంగా.. జిల్లాలో జాతీయ రహదారిని అనుసరించి ఉన్న కొత్తకోట, పెబ్బేరు, పెద్దమందడి మండలాల్లోని భూముల ధరలు అత్యధికంగా పెరిగినట్లు తెలుస్తోంది. కొత్తకోట మండలం పాలెం పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన ఎకరం భూమి గతంలో రూ.కోటి ధర ఉండగా, మార్కెట్ విలువ అంతకు మించి ఉందని తెలుసుకున్న ప్రభుత్వం.. జిల్లావ్యాప్తంగా మరెక్కడా లేనంతగా ఎకరం భూమి విలువను రూ. 2కోట్లకు పెంచింది. దీంతో జిల్లాలోని భూముల విలువ రాష్ట్ర రాజధాని భూములతో పోటీ పడుతున్నాయని చర్చ సాగుతోంది. ఆ తర్వాత పెబ్బేరు, పెద్దమందడి శివారు ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన ఉన్న భూముల విలువ రూ. కోటి నుంచి రూ. 1.50 కోట్లకు పెంచినట్లుగా తెలుస్తోంది. ఈ ధరల పెంపుతో రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని పక్కనపెడితే.. కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కోసం రూ.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. స్వల్పంగా పెరిగిన భవనాల విలువ.. రోజురోజుకూ ధరలు తగ్గిపోయే ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ భవనాల ధరలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పోల్చితే కేవలం 25శాతమే పెంచారు. రేకుల, పెంకులతో పైకప్పు ఉన్న నిర్మాణాలను అతి స్వల్పంగా పెంచారు. వాటి విక్రయాల సమయంలో చెల్లించాల్సిన రిజిస్టేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ తదితర చార్జీలు అన్నింటిని చెల్లించినా గతంలో కంటే అతి స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచే ప్రభుత్వం పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. పెరిగిన రేట్ల ప్రకారం స్టాంఫ్, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలుచేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ఈ మేరకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు. ప్రశాంతంగా పెరిగిన ధరల ప్రకారం ప్లాట్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. వెంటనే నిర్మాణపు ఆస్తుల వివరాలు మున్సిపల్ రికార్డుల్లోనూ మారిపోతాయి. – చంద్రశేఖర్, సబ్ రిజిస్టార్, వనపర్తి వ్యవసాయ, వ్యవసాయేతర భూమి రేట్లు రెట్టింపు జిల్లాకేంద్రంలో గజం స్థలం గరిష్టంగా రూ.30,900 పెంపు మార్కెట్ విలువల సవరణతో భూముల ధరలకు రెక్కలు జిల్లావ్యాప్తంగా పెంచిన ధరల ప్రకారం అత్యధికంగా జిల్లా కేంద్రంలోని రామాలయం, మెట్టుపల్లి, శ్రీనివాసాపురం, మర్రికుంట, నాగవరం తదితర ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు ధరలు విపరీతంగా పెరిగాయి. స్థానిక రామాలయం ప్రాంతంలో గజం ధర రూ. 24,800 ఉండగా.. ప్రస్తుతం పెంచిన విలువతో రూ. 30,900 ధర పెరిగినట్లు అధికారిక లెక్కలతో వెల్లడవుతోంది. దీంతో సాధారణ 30/40 సైజు ప్లాటు సైతం ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం రూ. 41లక్షలకు పైబడి ధర నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో ఒక చిన్న ప్లాటు రిజిస్టేషన్ చేసుకోవాలన్నా రూ.లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో ఈ నెల 5 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు, ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ నిర్మాణాల విలువలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఈ మేరకు అధికారులు నెలరోజులపాటు కసరత్తు చేశారు. అయినప్పటికీ వనపర్తి, ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనుకున్న మేరకు రిజిస్ట్రేషన్ల సందడి కనిపించలేదు. సాధానంగా నెలవారీగా అయ్యే రిజిస్ట్రేషన్లతో పోల్చితే 10శాతం ఎక్కువగా అయినట్లు అధికారులు వెల్లడించారు. -
భూగర్భ జలాల వృద్ధికి..
భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడుతాయి. ప్రతి కుటుంబం తమ ఇళ్ల ఆవరణలో నిర్మించుకునేలా పంచాయతీ కార్యదర్శులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి గ్రామంలో 100 నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యం విధించారు. పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి, క్షేత్ర సహాయకులకు సూచిస్తున్నాం. – శ్రీనివాసులు, ఎంపీడీఓ, అమరచింత కొండలు, గుట్టల ప్రాంతంలోని వర్షపు నీరు నేరుగా భూమిలోకి ఇంకేవిధంగా జిల్లావ్యాప్తంగా 40 వేల కందకాలు పూర్తి చేశాం. దీంతోపాటు ప్రతి ఇంటి ఆవరణలో వ్యక్తిగత ఇంకుడుగుంతతో పాటు ఆలయాలు, బస్టాండ్, పాఠశాల ఆవరణలో సామూహిక ఇంకుడు గుంతలను తవ్వించాలని నిర్ణయం తీసుకున్నాం. వీటిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. – ఉమాదేవీ, డీఆర్డీఓ ● -
అన్లోడింగ్లో ఆలస్యంతో సమస్యలు
ఖిల్లాఘనపురం: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావస్తున్నందున మిల్లులు, గోదాముల దగ్గర అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లి తండా దగ్గర ఉన్న ఇన్వెస్టర్ గోదాం, మండల కేంద్రం సమీపంలోని శ్రీరామ రైస్మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదాములు, రైస్మిల్లుల దగ్గర ధాన్యం తీసుకొచ్చిన లారీలు, డీసీఎంలు రోజుల తరబడి నిలిచిపోతున్నాయని.. హమాలీల సంఖ్య పెంచి త్వరగా అన్లోడింగ్ చేయించాలని చెప్పారు. ఆలస్యం కావడంతో చాలా సమస్యలు వస్తున్నాయని.. రోజుల తరబడి ఉండటంతో తూకంలో తేడాలు వస్తున్నట్లు పలు గ్రామాల రైతులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు. మిల్లులో కేవలం సన్నరకం మాత్రమే కాకుండా దొడ్డురకం వరి ధాన్యం కూడా దించుకోవాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున మండలస్థాయి అధికారులు తరుచూ మిల్లుల దగ్గరకు వెళ్లి పరిశీలించి కొనుగోళ్లు, అన్లోడింగ్ త్వరగా పూర్తి చేసేందుకు సూచనలు చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, డీటీ పరమేశ్వర్ తదితరులు ఉన్నారు. -
ట్యాబ్ ఎంట్రీల్లో వేగం పెంచాలి
వనపర్తి: వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీల్లో వేగం పెంచి రైతుల ఖాతాల్లో వీలైనంత త్వరగా నగదు జమ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వరి ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి కేంద్రాల వారీగా ధాన్యం సేకరణ ప్రక్రియపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల్లో ఇప్పటికే తూకం చేసి తరలింపునకు సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు సరిపడా లారీలను సమకూర్చాలని, లేకుంటే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. జిల్లాలో నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం కుప్పలు, వాహనాల్లో లోడ్ చేసిన ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ ఆంజనేయులు, డీఆ ర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
వనపర్తిటౌన్: ప్రచారం, హంగుల కోసం కాకుండా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమత్యులత కోసం మొక్కలు నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రమాకాంత్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని జిల్లా న్యాయస్థానం ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు నాటి చేతులు దులుపుకొంటే కుదరదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ప్రకృతిని అందించాలంటే పర్యావరణాన్ని నాశనం చేయొద్దన్నారు. గాలి, నీరు, నేల కాలుష్యమై ఉష్ణోగ్రతల్లో సమతుల్యత కొరవడటానికి అధిక వాహనాల వినియోగం, ప్లాస్టిక్ వాడకమని.. వినియోగాన్ని తగ్గించి మొక్కలు నాటితే పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు 500 నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుందని, భవిష్యత్లో ప్లాస్టిక్ భూతం మానవాళికి ఎంతో హాని కలిగిస్తుందన్నారు. వాతావరణ మార్పులను అడ్డుకోవడం, గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడం, ప్రకృతి సమతుల్యతను కాపాడటం భవిష్యత్ తరాలకు ఇచ్చే కోట్ల ఆస్తి అని వివరించారు. రాబోవు తరాలకు ఆరోగ్యకర, సురక్షిత, నివాసయోగ్యమైన భూమి అందించాలంటే ప్రస్తుతం మనం నాశనం చేయకుండా ఉంటే చాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కవిత, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు శ్రీలత, అశ్విని, కార్తీక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, కార్యదర్శి వెంకటరమణ, అటవీశాఖ అధికారులు విజయ్, రాజుకుమార్, బాలకిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గ్రామంలో 100 ఇంకుడు గుంతలు..
ప్రతి గ్రామంలో కనీసం 100 ఇంకుడు గుంతలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో డీఆర్డీఓ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ప్రజాప్రతినిధులతో కలిసి ఇంకుడుగుంతల అవశ్యకతను ప్రజలకు వివరించనున్నారు. అనుకున్న లక్ష్య సాధన కోసం ముందుగా గ్రామ సర్పంచ్ ఇంటి ఆవరణలో మొట్టమొదటగా ఇంకుడుగుంత నిర్మించి కలిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాలని అధికారులు నిర్ణయించారు. లక్ష్యం మేర ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. -
పాలమూరుకు మంచి రోజులు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు వచ్చే ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నుంచి లక్ష్మీదేవునిపల్లి వరకు భూ సేకరణను మొదలుపెడతామన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాజెక్ట్లకు సంబంధించి ఆర్అండ్ఆర్, అటవీ శాఖ వంటి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు నెలరోజుల్లో రూ.630 కోట్లు ఆర్అండ్ఆర్ పరిహారం ఇవ్వడం అసాధారణ విషయమన్నారు. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 20 లక్షల పైచిలుకు ఎకరాలు.. ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న సదుద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి రెండు రోజులపాటు ప్రాజెక్ట్ల బాట పట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వలసలు, ఆత్మహత్యల జిల్లాగా ఉన్న పాలమూరును చూపించే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు. మాది చేతల ప్రభుత్వం.. ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందించిన ఘనత తమదేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గత బీఆర్ఎస్ నరకయాతన పాలన చూశామని, ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సీఎం రేవంత్రెడ్డి నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమచేసి ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. తమది చేతల ప్రభుత్వం అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సీఎంను చూడలేదు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో పర్యటిస్తున్న ఇలాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్ నిర్వాసితులను జైలుకు పంపితే.. తమ సీఎం నిర్వాసితులను కలిసేందుకు వచ్చారని కొనియాడారు. వచ్చేనెలలో సీఎం రేవంత్రెడ్డి మిడ్జిల్ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. రంగనాయకస్వామి గుట్టపై వంద అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలన్నది తన కోరిక అని, అదేవిధంగా జడ్చర్లకు బైపాస్, తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్ కర్నూల్ ‘ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు సంబంధించి త్వరలో శుభవార్త చెబుతాం. కృష్ణానది ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్కు 90 టీఎంసీలు, డిండికి 25 టీఎంసీలతో కేంద్రం నుంచి ఎన్ఓసీ తీసుకొస్తాం. ఈ మేరకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్లోగా ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకం పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రెండు రోజులుగా చేపట్టిన ప్రాజెక్ట్ల సందర్శన ముగిసింది. రెండోరోజు శుక్రవారం ఆయన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమ శిలలోని మృగవాణి రిసార్ట్ నుంచి బయలుదేరి వరుసగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లోని తదతర రిజర్వాయర్లు, పంప్హౌస్ల పనులను పరిశీలించారు. భూత్పూర్ మండలంలోని కర్వెన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ తర్వాత జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగసభలో మాట్లాడారు. రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రాజెక్ట్లకు రూ.8వేల కోట్లు ఖర్చు చేశాం గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చుచేస్తే అందులో రూ.8వేల కోట్లు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్లకే ఖర్చు చేశామని రేవంత్రెడ్డి వెల్లడించారు. మట్టికి పోయినా మనోడే ఉండాలె, ఎట్టికిపోయినా ఇంటోడే కావాలె. 60 ఏళ్ల గోస, వలసల బతుకులు మారాలి. ఇక్కడి బిడ్డనై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తానా? అని ప్రశ్నించారు. మీ పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్ట్లను పరిశీలించానని.. సమస్యలు ఏవిధంగా పరిష్కరించాలి.. ప్రాజెక్టులు ఏవిధంగా పూర్తి చేసుకోవాలో సూచనలు ఇవ్వడం జరిగిందని వివరించారు. ఆరు నెలలు సమయం ఇవ్వండి.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతా. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తానని పునరుద్ఘాటించారు. ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలకు నీరు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను రెండున్నరేళ్లలో పూర్తిచేసి తీరుతామని రేవంత్ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఏడాదిలోగా ఉదండాపూర్ వరకు నీరందిస్తామని చెప్పారు. తర్వాత ప్రణాళికాబద్ధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇంకా నాలుగు వేల ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని, రూపాయి ఎక్కువ ఇచ్చి అయినా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దీన్నే ప్రాధాన్యాంశంగా తీసుకుంటామని.. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్ట్ పనుల కోసం గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేసుకోలేమని, చరిత్ర కూడా మనల్ని క్షమించదన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్లను పూర్తిచేసి మొత్తం 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ‘జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. కేసీఆర్కు ఊడిగం చేయడం ఆపండి. భూసేకరణ పనులు, ప్రాజెక్ట్ పనులు ఆపాలని, కాళ్లలో కట్టెలు పెట్టాలని చూడకండి. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూద్దాం. ఈ రెండేళ్లు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారె డ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సభ అనంతరం రేవంత్రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్లారు. అమరచింత: కేంద్ర జలసంరక్షణ అభియాన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కందకాల నిర్మాణాలతో పాటు ఇంకుడు గుంతల ఏర్పాటును వేగవంతం చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 40 వేల కందకాలు పూర్తిచేసి జల సంరక్షణలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. వర్షాకాలంలో ప్రతి నీటిబొట్టు నేరుగా భూమిలోకి చేరేలా ఉపాధి కూలీలతో కందకాల తవ్వకం చేపడుతూ.. ప్రతి ఇంటా తప్పనిసరిగా ఇంకుడుగుంత తవ్వుకోవాలని అధికారులు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో ఎండలు ముదిరి వర్షాలు తగ్గే ప్రమాదం ఉందనే విషయాలను వివరిస్తూ వర్షపు నీరు నేరుగా భూమిలో ఇంకేందుకు వీలుగా ప్రత్యామ్నాయ కార్యక్రమాలను చేపట్టాలని సూచిస్తున్నారు. వేసవిలోనే వీటి లక్ష్యాలను పూర్తి చేసుకుంటూ వర్షాకాలంలో మొక్కలు నాటి సంరక్షించేందుకు వీలైనన్ని గుంతలను రహదారులకు ఇరువైపులా తవ్వేందుకు సిద్ధం చేస్తున్నారు. కందకాల నిర్మాణాలు.. గ్రామాల్లో కొండలు, గుట్టల ప్రాంతాలను గుర్తించిన అధికారులు వాటి చుట్టు వీలైనన్ని కందకాలు తవ్వించే కార్యక్రమాలు చేపట్టారు. కొండపైకి వెళ్లేందుకు వీలుగా ఖాళీ స్థలం వదులుతూ కందకం తవ్వుతున్నారు. దీంతో కొండ ఎగువ భాగంలోని వర్షపు నీరు జాలువారి నేరుగా కందకంలోకి చేరి భూగర్భ జలాలు పెంపొందించేందుకు దోహదపడనున్నాయి. అలాగే నీరు నిల్వ ఉండటంతో కొండలు, గుట్టల ప్రాంతంలో పచ్చదనం పెంపొంది పశువులు, జంతువులకు మేత దొరుకుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 40 వేల కందకాలు పూర్తి చేశారు. పీఆర్ఎల్ఐకి 90 టీఎంసీలతో ఎన్ఓసీ తీసుకొస్తాం డిసెంబర్లోపు దీన్ని నెరవేర్చే బాధ్యత నాదే.. కృష్ణాపై మరో కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తాం నాకు జడ్చర్లకు వస్తే గుండె వేగం పెరుగుతుంది.. మిడ్జిల్ జెడ్పీటీసీగా నాటిన మొక్క నేడు వృక్షమైంది.. నేనుండగా జిల్లాకు అన్యాయం జరుగనిస్తనా? జడ్చర్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముగిసిన ప్రాజెక్ట్ల సందర్శన ఇక్కడికి వస్తే నా గుండె వేగం పెరుగుతుంది.. ‘జడ్చర్ల ప్రాంతానికి వస్తే గుండె వేగం పెరుగుతుందని రేవంత్రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. నల్లమల అడవి, మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను సరిగ్గా 20 ఏళ్ల కిందట 2006 జూలై 4న మిడ్జిల్ జెడ్పీటీసీగా మీ భుజాలపై నిలబెట్టుకున్నారని... ఆనాడు మీరు నాటిన చిన్న మొక్కే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నేడు ముఖ్యమంత్రిగా ఎదిగి వృక్షమై మీ ముందు నిలబడ్డడని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఉండగా ఈ జిల్లాకు నష్టం జరుగనిస్తనా అని ప్రశ్నించారు. జైళ్లు కట్టాలని గత పాలకులు భావిస్తే.. స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నామని.. అందుకే ట్రిపుల్ ఐటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామని చెప్పారు. చదువు తోనే కష్టాలు పోతాయని.. బతుకులు బాగు పడతాయని.. పిల్లలను చదివించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష సభ్యు లు కొందరు పాదయాత్రలు చేస్తామంటున్నారని.. వారు కాశీదాక పొర్లు దండాలు పెట్టినా వారు చేసిన పాపాలు తొలిగిపోవని, ప్రజలు క్షమించరని చెప్పారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వల స వచ్చిన కేసీఆర్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఎంపీగా గెలిపించార ని గుర్తు చేశారు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని విమర్శించారు. ఇప్పటి వరకు 40 వేల కందకాల నిర్మాణం పూర్తి ప్రతి గ్రామానికి 100 ఇంకుడు గుంతలు లక్ష్యం ప్రజాప్రతినిధుల ఇంటి నుంచే ప్రారంభం కేంద్ర జల సంరక్షణ అభియాన్లో జిల్లా ముందంజ -
ఓటరు జాబితా సవరణపై అపోహలు వద్దు
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఖిల్లాఘనపురం: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సవరణపై ఎలాంటి అపోహలు వద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. మండలంలోని పర్వతాపురం, అల్లమాయపల్లి, తిర్మలాయపల్లి, అంతాయపల్లి, దొంతికుంటతండాలో గురువారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. పర్వతాపురంలో నిర్వహించిన గ్రామసభకు అదనపు కలెక్టర్తో పాటు డీఎల్పీఓ రఘునాథ్రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో చేపట్టే ఓటరు జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉంటుందని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా అధికారులకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాం, నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. సాగులో ప్రభుత్వం గుర్తించిన వరి, పత్తి తదితర పంటల విత్తనాలు మాత్రమే కొనుగోలు, ఈ ఏడాది రైతులు ఆరుతడి పంటల సాగు పెంచాలన్నారు. జాతీయ కుటుంబ సహాయ పథకానికి అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జల సంరక్షణ.. మన సంరక్షణ పథకంలో భాగంగా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత తవ్వుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయసింహారెడ్డి, మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, ఎస్సై వెంకటేష్, హౌసింగ్ ఏఈ సందీప్, సర్పంచ్ మహేందర్, ఉప సర్పంచ్ గోవర్ధన్రెడ్డి, పలువురు అధికారులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
మంగంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
కొత్తకోట రూరల్: మంగంపల్లిని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలనా.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన ప్రత్యేక గ్రామసభకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలస్థాయి అధికారులు రోడ్డు భద్రత, బాల్యవివాహాల నిర్మూలన, ఇంకుడు గుంతల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత, వన మహోత్సవం, జల సంరక్షణ, పాఠశాలల్లో సౌకర్యాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి మెప్పు పొందుతుందని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలోని మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.30 కోట్లు చెల్లించిందన్నారు. విద్యారంగానికి పెద్దపీట వేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుందని.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మంగంపల్లిని పైలట్ గ్రామంగా ఎంపిక చేశామని.. ఒక్క పూరి గుడిసె కూడా లేకుండా పక్కా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు తనవంతుగా రూ.10 లక్షలు కేటాయిస్తానని, జిల్లా కలెక్టర్ ద్వారా మరో రూ.10 లక్షల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎస్ఆర్ నిధులతో గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ ఏర్పాటుకు కృషి చేస్తానని, గ్రామంలో ఇప్పటికే సీసీ కెమెరాలు బిగించినట్లు చెప్పారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రత్యేక గ్రామసభలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులందరూ ఇంకుడు గుంతలు నిర్మించుకుంటామని తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు. ఇంకుడు గుంతలతో గ్రామంలో భూగర్భ జలమట్టం పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఐదేళ్ల వ్యవధిలో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వ్యక్తులు ఎవరైనా మరణిస్తే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా దరఖాస్తు చేసుకొని రూ.20 వేల లబ్ధి పొందవచ్చన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తుందని.. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని సూచించారు. అనంతరం ముఖ్యఅతిథులు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీడీఓ పరిణత, ఎస్ఐ జలంధర్రెడ్డి, వార్డు సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో దుమారం..!
గతంలో కాంగ్రెస్ నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవితో కలిసి ఆయన కారులో గద్వాలలోని జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ఇంటికి వెళ్లగా వారు విజయుడిని సన్మానించారు. ఆ తర్వాత ఎంపీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొనడం.. హైదరాబాద్లో పలు పర్యాయాలు ఆయన స్వయంగా ముఖ్యమంత్రిని కలవడం అప్పట్లోనే చర్చకు దారితీసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బాటలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన పనుల శంకుస్థాపనలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య లొల్లి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అనూహ్యంగా జరిగిన ఘటన అని ఎంపీ కొట్టేయడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా పాలమూరు ప్రాజెక్ట్పై విపక్ష బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టనున్నట్లు నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి ముఖ్యమంత్రిని కలవడం మరోసారి చర్చకు దారితీసింది. ఆయన బీఆర్ఎస్లోనే ఉంటారా.. కాంగ్రెస్లో చేరుతారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై స్పందన కోసం ఎమ్మెల్యేను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి వ్యవహారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి తొలి రోజు గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గుడ్డెందొడ్డి పంప్హౌస్ను సందర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన విజయుడు సీఎంను కలవడం.. ప్రాజెక్ట్ స్థితిగతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, అధికారుల ప్రజెంటేషన్లో ఆయనతో కలిసి పాల్గొనడం హాట్టాపిక్గా మారింది. తమ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందని.. ఈ మేరకు పనులు పూర్తి చేయించాలనే డిమాండ్తో జూన్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ నేతలు గత నెల చివరి వారంలో ప్రకటించారు. మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వగృహంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లాలోని ఒకే ఒక ఎమ్మెల్యే విజయుడు సైతం హాజరయ్యారు. బీఆర్ఎస్ పాదయాత్రకు పిలుపునివ్వడం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ల సందర్శన చేపట్టడంపై ఇరుపార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు.. సీఎం పర్యటనను అడ్డుకుంటామని గద్వాల కు చెందిన బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని వారు వదిలిపెట్టడం.. ఆయన ముఖ్యమంత్రిని కలవడం ఆ పార్టీలో దుమారం రేపింది. సీఎం పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గతంలోనూ పలు పర్యాయాలు స్వయంగా కలిసిన వైనం అప్పట్లో ఎంపీ మల్లురవితో కలిసి సరిత ఇంటికి వెళ్లడంతో రచ్చ ‘గులాబీ’ల పోరుబాట క్రమంలో రేవంత్ను కలవడంపై అనుమానాలు ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా రాజకీయ పరిణామాలు -
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
పాన్గల్: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని శాగాపూర్తండాలో సర్పంచ్ నాగేష్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభకు ఆమె హాజరై మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరు కావాలని, ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు పెంచి సంరక్షించాలన్నారు. ఇంటి, కొళాయి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ గోవిందరావు, వివిధ శాఖల అధికారులు, వార్డు సభ్యులు, తండా వాసులు పాల్గొన్నారు. -
వడివడిగా..
● కర్ణాటక మంత్రితో కలిసి రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థల పరిశీలన ● కొడంగల్–నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల ప్రగతిపై ఆరా ● ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్సాగర్, జూరాల డ్యామ్ వీక్షణ ● గుడ్డెందొడ్డి పంప్ హౌస్ సందర్శన.. ఆ తర్వాత సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్ష ● నేడు పీఆర్ఎల్ఐ, కేఎల్ఐ పనుల పరిశీలన.. జడ్చర్ల శివారులో బహిరంగసభ ● పలు చోట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకుల గృహనిర్బంధం పాలమూరులో తొలి రోజు ముగిసిన సీఎం రేవంత్రెడ్డి పర్యటన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం వడివడిగా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ఆయన ప్రత్యేక హెలీకాప్టర్లో బెంగళూరు నుంచి బయలుదేరి ముందుగా నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు బేగంపేట నుంచి మరో హెలీకాప్టర్లో, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తమ వాహనాల్లో వచ్చారు. ఆ తర్వాత వారు రోడ్డు మార్గాన మక్తల్ మండలం కాట్రేవులపల్లికి చేరుకుని కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకం పనులపై ఆరా తీశారు. తిరిగి మక్తల్కు వెళ్లి కోయిల్సాగర్తో పాటు కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థలం, గద్వాల జిల్లా పరిధిలోని జూరాల డ్యామ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ధరూర్ మండలంలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గూడెందొడ్డి రిజర్వాయర్కు చేరుకున్నారు. అక్కడ పంప్ హౌస్ పనులపై ఆరా తీశారు. ఆ తర్వాత హెలీకాప్టర్లో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్కు చేరుకున్నారు. విరామం అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్ట్లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీ చౌహాన్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గురువారం ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన సీఎం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మృగవాణి రిసార్ట్లో బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్ఐలో భాగమైన ఎల్లూరు, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లలో ఆయా చోట్ల నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, పంప్ హౌస్లలో పలు ప్యాకేజీల పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ రోడ్లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరనున్నారు. -
రేపట్నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
వనపర్తిటౌన్: శ్రీ శ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్తు సంయుక్తంగా రాజమండ్రిలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రాంగణంలో శని, ఆదివారం 7వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని.. కవులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రీశ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డా. నాయికంటి నరసింహశర్మ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గురువారం సాయంత్రం తెలుగు మహాసభల కరపత్రాలను జిల్లా కవులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహనీయుల స్ఫూర్తివేధిక రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్, కవి బైరోజు గిరిరాజాచారి, సంయుక్త కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యదర్శి, తపస్ రాష్ట్ర కార్యదర్శి అల్వాల వరప్రసాద్గౌడ్, విశ్రాంత తపాలా అధికారి, ఎమ్మార్పీఎస్ జిల్లా అనుబంధ సంఘాల సమన్వయకర్త గంధం గట్టయ్య, తెలుగు ఉపాధ్యాయుడు సత్యనారాయణ, సామాజిక విశ్లేషకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు రాములు, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త వెంకటస్వామి, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి ఉమామహేశ్వర్, మల్లికార్జున్ పాల్గొన్నారు. -
రవినాయక్ను అభినందించిన రాష్ట్రపతి
గోపాల్పేట: మండలంలోని బుద్దారం లక్ష్మీతండాకు చెందిన ముడావత్ రవినాయక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్డీ పూర్తిచేసి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ నెల 2న ఢిల్లీలో జన జాతీయ గరిమా ఉత్సవ్ వేడుకల్లో భాగంగా భారత గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా గిరిజన్ స్కాలర్షిప్ పొంది పీహెచ్డీ పూర్తిచేసిన 200 మందిని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సన్మానించి అభినందించారు. ఇందులో ముడావత్ రవినాయక్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రవినాయక్ ఏపీలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నేటి నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు వనపర్తిటౌన్: జిల్లాలో పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఏసీజీఈ గణేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లాకేంద్రంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 11 వరకు పరీక్షలు కొనసాగుతాయని.. జిల్లావ్యాప్తంగా ఒకేఒక్క పరీక్ష కేంద్రం చాణక్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 204 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మొదటిరోజు శుక్రవారం తెలుగు పరీక్ష 40 మంది విద్యార్థులు రాయనున్నారని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష కొనసాగనుందని వివరించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలుచేయాలి వనపర్తి రూరల్: చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతోనే మహిళా సాధికారిత సాధ్యమని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ 72వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై సంఘం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో కేవలం 33 శాతం రిజర్వేషన్ చట్టం చేశారని, బీజేపీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో కలిపి పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి అమలు కాకుండా అడ్డుపడిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును విడిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. మహిళలు వంటింటి కుందేళ్లుగా మారొద్దని, అన్యాయం జరిగినప్పుడు వీధులోకి వచ్చి పోరాడినప్పుడే హక్కులు దక్కుతుండటంతో పాటు న్యాయం కూడా జరుగుతుందన్నారు. మహిళలు ఏకమై పోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి గీత, శిరీష, శ్రీదేవి, వెంకటమ్మ, సాయిలీల, నాగమణి, వార్డుసభ్యురాలు సుజాత, శాన్వి, బబ్బి, లావణ్య పాల్గొన్నారు. పెంచిన వేతనాలు వర్తింజేయాలి ఖిల్లాఘనపురం: ఆస్పత్రి కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను వర్తింపజేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను వెంటనే రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న రెండు నెలల జీతాలు విడుదల చేయాలని, ముఖ్యమంత్రి 73 షెడ్యూల్ రంగాల్లోని 11 వేల మంది కార్మికులకు కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కనీస వేతన మండలి సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటే కార్మికులకు రూ.20 వేల కనీస వేతనం వచ్చేదన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
కందనూలు: సీఎం రేవంత్రెడ్డి కుమ్మెర పంప్హౌస్ సందర్శన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు కుమ్మెర కార్యక్రమ ఇన్చార్జి ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లోవివిధ జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున 350 మందితో పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నామని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగినా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో ఉన్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. డ్యూటీ సమయంలో సెల్ఫోన్లు చూడటం, ఇతర వ్యక్తిగత పనుల్లో నిమగ్నమవుతూ విధులను నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన పాయింట్ వద్ద అప్రమత్తంగా ఉంటూ, పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ.. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. -
బీడీ ప్యాకింగ్ రేట్లు పెంచాలి : టీయూసీఐ
అమరచింత: బీడీ ప్యాంకింగ్ రేటు వెయ్యికి రూ.15 పెంచాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని మార్స్స్ భవనంలో గురువారం ఉమ్మడి జిల్లా ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం నాయకుల సమావేశం నిర్వహించగా.. ఆయన హాజరై మాట్లాడారు. బీడీ కూలి వెయ్యికి రూ.20 పెరిగిందని.. అందుకు అనుగుణంగానే ప్యాకింగ్ రేట్లు పెంచాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో రూ.18 ఉండగా.. ఇక్కడ మాత్రం కేవలం రూ.8.50 మాత్రమే చెల్లించడం దారుణమన్నారు. బీడీ ప్యాకర్స్ వేతనాలు పెంచాలంటూ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నామని.. వారం రోజుల్లో యాజమాన్యం చర్చించకపోతే ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.. కార్యక్రమంలో దేవదానం, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు. బీడీ ప్యాకర్స్ కార్యవర్గం ఏర్పాటు.. బీడీ ప్యాకర్స్ గౌరవ అధ్యక్షుడిగా జేఎన్ దేవదానం, అధ్యక్షుడిగా గోపిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా సుందర్, ప్రధానకార్యదర్శిగా బ్రహ్మం, సహాయ కార్యదర్శిగా రవి, కోశాధికారిగా కురుమూర్తితో పాటు ఏడుగురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ఆశల పల్లకీలో..
జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనపై గంపెడాశలు ● శ్రీశైలం నిర్వాసితులకు దక్కని న్యాయం ● నాలుగు దశాబ్దాలుగా పరిహారం కోసం ఎదురుచూపులు ● ఇంజినీరింగ్ కళాశాల, పరిశ్రమల ఏర్పాటుపై హామీ దక్కేనా?సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ఆశలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధిపై ఇవ్వనున్న వరాలపై ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులతో పాటు ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతారన్న అంచనాలు ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పగా.. ఇప్పటివరకు ఎంతో మంది ఉద్యోగంతో పాటు పరిహారానికి సైతం నోచుకోలేదు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న భూ నిర్వాసితులు సీఎం రేవంత్రెడ్డిపై గంపెడాశలు పెట్టుకున్నారు. నాలుగు దశాబ్దాలైనా.. శ్రీశైలం ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పరిహారం అందిస్తామనే ప్రభుత్వ ప్రకటన నీటిమూటగానే మారింది. అందుకోసం 1984లో జారీ చేసిన జీఓ 98 సైతం నేటీకీ అమలు కాలేదు. శ్రీశైలం ప్రాజెక్టుతో సర్వస్వం కోల్పోయిన వారిలో ఇంకా 2,156 మంది ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో కొంత మంది మరణించగా.. మరికొందరు వృద్ధాప్యానికి చేరువయ్యారు. ప్రతి ఎన్నికల సమయంలో శ్రీశైలం భూనిర్వాసితుల అంశం ఎన్నికల హామీగానే మిగులుతోంది. ఈ క్రమంలో సీఎం అపాయింట్మెంట్ కోసం నిర్వాసితుల తరఫున ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు మంత్రులకు విజ్ఞప్తులు సమర్పించారు. అయితే జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తమకు పరిహారం విషయంలో సానుకూలంగా స్పందిస్తారని ఆశలు పెట్టుకున్నారు. -
అసంపూర్తిగానే.. ఆకాంక్ష
వనపర్తికేఎల్ఐతో మహర్దశ పట్టినా నామమాత్రంగానే సాగు ● భారీ సామర్థ్యం గల రిజర్వాయర్లు, కాల్వలు లేకపోవడమే కారణం ● వరప్రదాయినిగా నిలిచిన జూరాలలో పేరుకున్న పూడిక ● నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ పనులు పెండింగ్లోనే.. ● పుష్కర తెలంగాణలో సాగు నీళ్ల కోసం తప్పని నిరీక్షణ ● నేడు, రేపు సీఎం రేవంత్, మంత్రుల ప్రాజెక్ట్ల సందర్శన .. ప్లాస్టిక్ నిషేధం మహబూబ్నగర్ సమీపంలోని పర్వతాపూర్ మైసమ్మ అడవిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026–8లో uఅడుగులు పడినా పూర్తికాని ‘పాలమూరు’ ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడంతో పాటు హైదరాబాద్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు 2015లో అప్పటి ముఖ్యమంత్రి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తొలి విడతలో ఐదు (నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్) రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ వద్ద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి పంప్ను ప్రారంభించారు. రిజర్వాయర్ల వారీగా.. నార్లాపూర్: కొల్లాపూర్ మండలంలో 8.61 టీఎంసీల సామర్థ్యం గల నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. పంప్ హౌస్ పనులు చేపట్టారు. ఇక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు కెనాల్ నిర్మించాల్సి ఉండగా.. 400 మీటర్ల మేర పనులు పెండింగ్లో ఉన్నాయి. పంప్హౌస్ కోసం 400 కేవీ సబ్ స్టేషన్ నిర్మించాల్సి ఉంది. రిజర్వాయర్ కింద సబ్ కెనాళ్లు, బ్రాంచ్ కెనాళ్లు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను డెవలప్ చేయాల్సి ఉంది. పంప్ హౌస్ వద్ద 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. గత ప్రభుత్వం రెండు మోటార్లు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో మూడింటిని ఏర్పాటు చేసింది. ఇంకా నాలుగు మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని ఎంజీకేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల వ్యూ -
ఎస్ఐఆర్ మాటున ఓట్ల తొలగింపునకు కుట్ర
కొత్తకోట రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించిందని.. ఉద్యమ స్ఫూర్తితోనే పార్టీ ముందుకు సాగుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. భవిష్యత్లో కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలంటే పార్టీ శ్రేణులు సంఘటితంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం కొత్తకోట సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పార్టీ వనపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టు శ్రీనివాసులు, దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జ్ పల్లె రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొని ప్రతి కార్యకర్త, అభిమానిని సభ్యుడిగా నమోదు చేయాలని సూచించారు. మండల, గ్రామస్థాయి నాయకులు పార్టీ ఇన్చార్జీలతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని.. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అభివృద్ధి పరంగా అగ్రగామిగా నిలిచిందని, తొమ్మిదేళ్ల పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేశామన్నారు. కాంగ్రెస్పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తూ ప్రజలతో కలిసి పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, తామంతా ఒకే జట్టుగా కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పి.సుఖేషిని, సీడీసీ మాజీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.విశ్వేశ్వర్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక, కౌన్సిలర్ అయ్యన్న, పార్టీ నాయకులు గాడీల ప్రశాంత్, కొండారెడ్డి, బాబురెడ్డి, న్యాయవాది యాదగిరి, ఆకుల శ్రీనివాసులు, ఎద్దుల నాగేష్, మొద్దుబాబు, చీర్ల నాగన్నసాగర్, కటికె శ్రీనివాసులు, నరేష్సాగర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ -
నకిలీ విత్తనాలతో అప్రమత్తంగా ఉండాలి
వనపర్తి: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున జిల్లా రైతులు సాగుకు సిద్ధమవుతున్నారని.. నకిలీ విత్తనాల సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలకు సంబంధించి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించగా కలెక్టర్ హాజరై పలు సూచనలు చేశారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని.. ఒకవేళ రైతులు వరి ధాన్యం వేయడానికి మాత్రమే మొగ్గు చూపితే, కేవలం సన్నరకం సాగుచేసేలా ప్రోత్సహించాలని సూచించారు. యూరియా పక్కదారి పట్టకుండా చూడాలని, గత సీజన్లో అధిక మొత్తంలో యూరియా తీసుకున్న వారిని గుర్తించి వారు దేనికోసం వినియోగించారనే అంశంపై తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఆర్డీఓ సుబ్రమణ్యం, మండల వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు, ఎస్ఐలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘పది’లో 100 శాతం ఉత్తీర్ణతకు ప్రణాళికలు.. రాబోయే విద్యాసంవత్సరంలో పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. భౌతికశాస్త్రం, ఆంగ్లంపై శ్రద్ధ వహించి వెనుకబడిన విద్యార్థుల కోసం సులభమైన పద్ధతిలో ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భౌతికశాస్త్రం, ఆంగ్లం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది గణితంలో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించి, ప్రత్యేకంగా బోధించి మంచి ఫలితాలు సాధించినట్లే.. ఈసారి కూడా భౌతికశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో అదే విధానాన్ని అమలు చేయాలన్నారు. విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే విధంగా ప్రాథమిక అంశాలతో కూడిన ప్రత్యేక పుస్తకాలు రూపొందించాలని, నెలాఖరులోగా ఆయా పుస్తకాల తయారీ పూర్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ముందుగా ఈ ఏడాది పదోతరగతి చదివే విద్యార్థులకు సులభ పరీక్ష నిర్వహించి ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆయా సబ్జెక్టులతో పాటు అన్ని సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే న్యాణ్యమైన బోధన విద్య
ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన అందుతుందని సీఎంఓ ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సోళీపురం, ఉప్పరిపల్లి, రుక్కన్నపల్లి, అప్పారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. సోళీపురం గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాంలు ఉచితంగా అందించడమేగాక నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జయశంకర్, ఉపాధ్యాయుడు ఉమామహేశ్వర్రెడ్డి, సర్పంచ్లు సింధు, శేఖర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా గ్రామ, వార్డుసభల నిర్వహణ
వనపర్తి: జిల్లావ్యాప్తంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డుసభలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలు, గ్రామసభల నిర్వహణపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. పర్యావరణ వారోత్సవాలను కొనసాగిస్తూనే మండలాల వారీగా అనుకూలమైన తేదీలను చూసుకొని అన్ని గ్రామాల్లో గ్రామసభలు జరిగేలా చూడాలని డీపీఓను ఆదేశించారు. గ్రామసభల్లో బాల్య వివాహాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల భద్రతపై అవగాహన కల్పించాలని, రైతులు పంట మార్పిడి దిశగా అడుగులు వేసేలా చూడాలన్నారు. సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంకుడు గుంతల ప్రాధాన్యం, మొక్కల పెంపకంపై చైతన్యపర్చాలని, రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తం కావాలన్నారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లాస్థాయి వరకు అధికారులందరూ సమన్వయంతో గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జెడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, డీఆర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సకలజనులసంక్షేమమే ధ్యేయం
‘గృహజ్యోతి’కి రూ.51.98 కోట్లు.. జిల్లాలో ఇప్పటి వరకు 84,906 కుటుంబాలు గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటుండగా.. ప్రభుత్వం రూ.51.98 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు 378 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా వర్తింపజేయగా.. నామిని ఖాతాలో రూ.18.90 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. అలాగే 1,82,262 లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా.. 25,167 కొత్త రేషన్ కార్డులతో పాటు 1.57 లక్షల మంది అదనపు కుటుంబ సభ్యులను కూడా ఇదివరకే ఉన్న కార్డులలో చేర్చామన్నారు. 5,970 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 5,970 ఇళ్లు మంజూరుకాగా.. 86 శాతం ఇళ్ల పనులు కొనసాగుతున్నాయని, 1,063 తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద రూ.125.19 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. అదేవిధంగా 2వ విడతలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వనపర్తి: సకలజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. మహిళలకు వరం ‘మహాలక్ష్మి’.. ప్రజా ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు వారు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. మహిళాశక్తి పథకంలో భాగంగా జిల్లాలో మండల మహిళా సమాఖ్యల నుంచి 12 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతి మండల మహిళా సమాఖ్యకు నెలకు సుమారు రూ.69 వేల చొప్పున రూ.8.33 లక్షల ఆదాయం సమకూరుతోందన్నారు. అమరచింత, వనపర్తి మండలాల మహిళా సమాఖ్యలకు ‘కుసుమ్ ప్రాజెక్టు‘ ద్వారా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకుగాను రూ.60 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. కొత్తకోట మండలం మిరాసిపల్లిలో ఎకరా స్థలంలో మహిళా సంఘాలతో రూ.2 కోట్లతో పెట్రోల్బంక్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు. జిల్లాలోని 1,27,715 మంది మహిళాసంఘ సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేసినట్లు చెప్పారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని.. పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 10,536 మంది రూ.32.14 కోట్ల విలువైన వైద్య సేవలు విని యోగించుకున్నట్లు వెల్లడించారు. ప్రగతి నివేదిక చదువుతున్న చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. జిల్లాలోని వివిధ పాఠశాలలు, బాలభవనం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా పర్యావరణ అవగాహనలో ప్రతిభ చాటిన వనపర్తి జెడ్పీహెచ్ఎస్ బాలికలు, కొత్తకోట జెడ్పీహెచ్ఎస్ బాలికలు, పెబ్బేరు కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, పుర చైర్పర్సన్ మాధవి, జిల్లా అధికారులు, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా విద్యాధికారి బదిలీ
వనపర్తిటౌన్: జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘనీని వికారాబాద్కు బదిలీ చేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఆర్జేడీ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డికి జిల్లా విద్యాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, బాధ్యతల స్వీకరణపై స్పష్టత కొరవడిందని జిల్లా విద్యాశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బదిలీ అయిన అబ్దుల్ ఘనీని ఇక్కడి బాధ్యతలు సైతం నిర్వర్తించాలని జిల్లా ఉన్నతాధికారులు మౌఖికంగా సూచించినప్పటికీ ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. డీఈఓ అబ్దుల్ ఘనీని మంగళవారం ఎంఈఎఫ్, ఎమ్మార్పీఎస్, జ్లిలా ఉపాధ్యాయ సంఘాల నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధానకార్యదర్శి శశివర్ధన్, ఎస్ఎల్టీఏ జిల్లా ప్రధానకార్యదర్శి అమర్నాథ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవ, జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మహాసభలకు తరలిరండి మహబూబ్నగర్ న్యూటౌన్: నగరంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు సీపీఎం శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. మంగళవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహబూబ్నగర్లో తొలిసారి నిర్వహిస్తున్న మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని, 20న జరిగే భారీ బహిరంగ సభలో త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పాల్గొంటారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణతో పెద్దఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం మహాసభల వాల్పోస్టర్లు విడుదల చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వెంకట్రాములు, సాగర్, భూపాల్, ధర్మానాయక్, శ్రీరామ్నాయక్, రాములు, కిల్లె గోపాల్, కురుమూర్తి, జగన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,539 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 193 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,539, కనిష్టంగా రూ. 4,589, సరాసరి రూ. 6,589 ధరలు లభించాయి. అదే విధంగా 2 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. రూ. 6189 ధర పలికింది. 28 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,270, కనిష్టంగా రూ. 2,129, సరాసరి రూ. 2,269 ధరలు వచ్చాయి. -
‘సైబర్’ నియంత్రణలో మీడియా పాత్ర కీలకం
వనపర్తి: సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా మీడియా సంస్థలు విస్తృత ప్రచారం నిర్వహించాలని, బాధితులకు సత్వర సాయం అందించేందుకు హెల్ప్లైన్ నంబర్ 1930ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎస్పీ సైబర్ మోసాలు, 1930 గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా రోజురోజుకు కొత్త రూపాల్లో పెరుగుతున్నాయన్నారు. ఆన్లైన్, కస్టమర్కేర్తో మోసాలు, ఫేక్ లింక్లు, నకిలీ ఉద్యోగాలు, పెట్టుబడి పేరుతో మభ్యపెట్టడం వంటి ఘటనలు అధికమవుతున్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, పాస్వర్డ్లు ఎవరికీ తెలియజేయరాదని, సైబర్ బాధితులు ఆలస్యం చేయకుండా సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కు లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతతో పాటు మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఎంతో కీలకమన్నారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ బాధితులకు అందుబాటులో ఉన్న సేవలను చేరవేయడంలో సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. సమాజం సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు, మీడియా, ప్రజలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సైబర్ నేరాల నివారణ, డిజిటల్ భద్రత, ఆన్న్లైన్ మోసాల గుర్తింపు, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ గిరిబాబు, సీఐ సుగంధ రత్నం, రూరల్ ఎస్ఐ హృషికేష్, జిల్లాలోని అన్ని పత్రికలు, ఛానళ్ల పాత్రికేయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా జయశంకర్ పోరాటం
వనపర్తి: ప్రత్యేక రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా ప్రొ. జయశంకర్ చివరి శ్వాస వరకు పోరాడారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజపేట సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకం, పార్టీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏళ్లపాటు అహింసాయుతంగా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. రాష్ట్ర సాధనతో తెలంగాణ ప్రజల్లో నెలకొన్న నిరాశ, నిస్ప్రహలను తొలగించి ఆత్మగౌరవాన్ని పెంపొందించారన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొమ్మిదేళ్ల పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సుపరిపాలన అందించినట్లు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతు సంక్షేమం, మహిళలు, యువత, నిరుద్యోగులకు ప్రకటించిన పలు హామీలు ఇంకా నెరవేరలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి, జయశంకర్ ఆశయాల సాధనకు కేసీఆర్ చూపిన మార్గంలో ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ మళ్లీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకు లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కొత్తగా 3 రోడ్ కం బ్యారేజీలు
కర్ణాటకలో సత్ఫలితాలు ఇవ్వడంతో.. కృష్ణానదిపై కర్ణాటక రాష్ట్రం రాయచూర్ తాలూకాలోని గిరిజాపూర్ రోడ్ కం బ్యారేజీని 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం 194 గేట్లు అమర్చారు. అదేవిధంగా దేవదుర్గ తాలూకాలో 0.5 టీఎంసీల సామర్థ్యంతో గుగల్, ఆల్మట్టి డ్యాం కింది భాగంలోని బాగల్కోట్ జిల్లా పరిధిలో ఆరు టీఎంసీల సామర్థ్యంతో హిప్పర్గి రోడ్ కం బ్యారేజీలు నిర్మించారు. మరికొన్ని సైతం నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మట్టి దిగువన మూడు ప్రధాన బ్యారేజీలతో జూరాల వైపు ఆఫ్ సీజన్లో రీజనరేటెడ్ వాటర్ ఆశించినంత రావడం లేదు. అయినా రోడ్ కం బ్యారేజీలతో కర్ణాటకలోని పలు ప్రాంతాలకు సంబంధించి తాగు, సాగు నీటి అవసరాలు తీరుతున్నాయి. అంతేకాకుండా రోడ్ కం బ్యారేజీలతో కనెక్టివిటీ పెరగడం.. పలు ప్రాంతాలకు దూరాభారం తగ్గుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం రోడ్ కం బ్యారేజీల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వీటితో కుడివైపున కర్ణాటకలో సాగు నీటితోపాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్లకు నీరు సరఫరా చేసుకునే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కుడివైపు కర్ణాటక.. ఎడమవైపు తెలంగాణ రాష్ట్రాలకు ఉపయోగపడేలా కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఉభయులకు మేలు చేకూరేలా ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, అధికారుల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. మొత్తం మూడు చోట్ల రోడ్ కం బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజులపాటు ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్ట్ల సందర్శనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజు గురువారం కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ప్రతిపాదిత రోడ్ కం బ్యారేజీల నిర్మాణ స్థలాలను పరిశీలించనున్నారు. జూరాలకు ప్రత్యామ్నాయంగా.. ఉమ్మడి పాలమూరుకు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్ట్ సామర్థ్యం ఏటేటా తగ్గుతోంది. వరదలతో వస్తున్న ఒండ్రు పేరుకుపోవడం.. పూడిక తీయకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 9.675 టీఎంసీలు కాగా.. 2.50 టీఎంసీల పూడిక పేరుకుపోయినట్లు 2012లో నిర్ధారించారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఎండా కాలంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ నుంచి విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం సర్వసాధారణంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2024, 2025 వేసవిలో కర్ణాటక ప్రభుత్వం నీరు విడుదల చేసినా.. సగానికంటే తక్కువగానే జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జూరాలకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కృష్ణా, భీమా నదులపై మూడు రోడ్ కం బ్యారేజీల నిర్మాణానికి అడుగులు పడినట్లు తెలుస్తోంది. వీటి నుంచి జూరాలకు కావాల్సినప్పుడు నీటిని విడుదల చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కుసుమర్తి–సుకుర్ లింగంపల్లి గ్రామాల మధ్య భీమా నదిపై బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలం కృష్ణా, భీమా నదులపై ఏర్పాటుకు యోచన తెలంగాణలో నారాయణపేట, కర్ణాటకలో రాయచూర్ జిల్లాలకు మేలు ఉభయ రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందేలా ఉమ్మడి కార్యాచరణ ఇదివరకే ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారుల మధ్య ప్రాథమిక చర్చలు రేపు సీఎం రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు ప్రత్యక్ష పరిశీలన కృష్ణాపై ఒకటి.. భీమాపై రెండు.. నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కొల్పూరు–కొడ్తికొండ మధ్య కృష్ణా నదిపై 1.08 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి.. బీమా నదిపై కుసుమర్తి– సుకుర్ లింగంపల్లితోపాటు దేవసుగూర్లోని తంగిడి వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో ఒక్కొక్కటి చొప్పున బ్యారేజీల నిర్మించాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. కొల్పూరు–కొడ్తికొండ మధ్య రోడ్ కం బ్యారేజీకి సుమారు రూ.700 కోట్లు.. మిగతా రెండింటికి దాదాపు రూ.600 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనాలు సైతం వేసినట్లు తెలిసింది. -
ప్రొ. జయశంకర్ ఆశయ సాధనకు కృషి
వనపర్తి: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ ఆలోచనలు, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాలకు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గత పాలకులు తెలంగాణ విప్లవ గళం గద్దర్ను అవమానిస్తే.. ప్రజా ప్రభుత్వం ఆయన కుమార్తె వెన్నెలకు సముచిత స్థానమిచ్చి గౌరవించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకొని జై తెలంగాణ అంటూ నినదించిన శ్రీకాంతాచారి తల్లికి మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. తెలంగాణ గీతాన్ని అందించిన కవి అందెశ్రీని గత పాలకులు ఎన్నో అవమానాల పాలు చేశారన్నారు. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, మీరాకుమార్ కృషితోనే తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఉద్యమకారుల సంక్షేమానికి కమిటీ వేసి ఉద్యమకారుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. -
అమరుల కుటుంబాలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
మాది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నా కూతురు కావలి సువర్ణ 2010 జనవరి 19న తెలంగాణ కోసం ఉరేసుకుని చనిపోయింది. నాడు మా బాధను పంచుకోవడానికి ఎంతోమంది నాయకులు వచ్చి ఓదార్చి వెళ్లారు. 2014లో అప్పటి ప్రభుత్వం నా కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోవడంతో పాటు అమరుల కుటుంబాలను ఓదార్చిన పాపాన పోలేదు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి అమరుల కుటుంబాలను కలిసి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని అండగా నిలవాలి. – కావలి రాములమ్మ, మిరాసిపల్లి, కొత్తకోట మండలం ● -
ప్రగతి పథంలో..
తెలంగాణ వచ్చాక ఉన్నత విద్యాలయాల ఏర్పాటు వనపర్తి: జిల్లాకు మొదటి నుంచి విద్యాపర్తిగా పేరుంది. సంస్థానాధీశుల కాలం నుంచే పాలకులు విద్యకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. ఉన్నత విద్యాలయాల ఏర్పాటుకు నాంది పలికారు. ప్రజాప్రతినిధులుగా ఎవరు ఎన్నికై నా.. తమదైన శైలిలో విద్యాభివృద్ధికి కృషిచేశారు. 1959లోనే వనపర్తిలో సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. సంస్థానాధీశుల రాజప్రాసాదంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతులమీదుగా పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత పాలకులు డిగ్రీ, పీజీ, ఉద్యాన కళాశాలలను ఏర్పాటు చేయగా.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫిషరిస్ సైన్స్ కాలేజీ, వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలకు వనపర్తి నిలయమైంది. అదే విధంగా నర్సింగ్, మెడికల్ కాలేజీలు సైతం సువిశాలమైన విస్తీర్ణంలో రూపుదిద్దుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో యంగ్ ఇండియా స్కూల్ సైతం జిల్లాకు మంజూరు కాగా.. సొంత భవనంలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి విద్యనభ్యసించిన వనపర్తి జిల్లా పరిషత్ పాఠశాల, ఇంటర్ కాలేజీలను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రూ. 47కోట్లతో అధునాతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రిజర్వాయర్లుగా సప్త సముద్రాలు.. వనపర్తి సంస్థానాధీశురాలైన రాణి శంకరమ్మ హయాంలో వనపర్తి చుట్టూ వర్షపునీటిని నిల్వ చేసేందుకు సప్త సముద్రాలను నిర్మించారు. అయితే జలయజ్ఞంలో భాగంగా వాటిని రిజర్వాయర్లుగా మార్చేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారు బీజం వేయగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వాటిని పూర్తిస్థాయిలో నిర్మించి కృష్ణానీటితో నింపారు. దీంతో పాటు జిల్లాలోని సుమారు 1,075 చెరువులు, కుంటలను సైతం కేఎల్ఐ, బీమా, జూరాల సాగునీటి కాల్వలతో అనుసంధానం చేయడంతో జిల్లా నలుమూలల కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పెబ్బేరులోని ఫిషరీస్ సైన్స్ కళాశాల పుష్కర తెలంగాణ.. పచ్చని పాలమూరు! ఎడ్యుకేషన్ హబ్గా మారిన వనపర్తి అందుబాటులోకి ఆధునిక వైద్యం రికార్డుస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు -
ప్రజావాణి అర్జీలు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణిలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్ఓ సూర్యప్రకాశ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేకపోతే.. సంబంధిత శాఖకు లేఖ రాసి పంపించాలన్నారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయడం లేదో ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి తప్ప.. తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవద్దని తెలిపారు. ప్రజావాణిలో 59 దరఖాస్తులు అందినట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. -
వేడుకలకు ముస్తాబు
రాష్ట్ర అవతరణ వేడుకలకు సమీకృత కలెక్టరేట్ ముస్తాబైంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను సోమవారం ఏఓ భానుప్రకాశ్తో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఎక్కడా ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 7:50 గంటలకు ఎస్పీ సునీతారెడ్డి, 7:53 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి చేరుకుంటారు. 7:55 గంటలకు వచ్చే ముఖ్య అతిథికి వారు పుష్పగుచ్ఛ అందజేసి ఆహ్వానించనున్నారు. అనంతరం ముఖ్య అతిథి జాతీయ జెండావిష్కరణ, తెలంగాణ గీతాలాపన, పోలీసు గౌరవ వందన స్వీకరణ అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు చదివి వినిపిస్తారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను శాలువాతో సత్కరిస్తారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వర్తింపజేస్తూ.. మంజూరు పత్రాల అందజేత, స్టాల్స్ సందర్శనతో కార్యక్రమం ముగుస్తుంది. -
ప్రజలకు మెరుగైన వైద్యం..
తెలంగాణ ఏర్పాటు తర్వాత అనతికాలంలోనే వనపర్తి జిల్లాగా ఆవిర్భవించడం.. వెనువెంటనే జిల్లాకు నర్సింగ్, మెడికల్ కాలేజీల మంజూరుతో స్థానిక ఏరియా ఆస్పత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. దీంతో వైద్య సేవల కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ కేర్ సెంటర్ నుంచి.. రూ.లక్షలు వెచ్చించాల్సి వచ్చే మెటర్నటీ వైద్యసేవలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఎంసీహెచ్లో 90శాతం కాన్పులు కావడం విశేషం. -
చదరంగానికి పూర్వ వైభవం
వనపర్తి టౌన్: చదరంగం క్రీడలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. ఎల్.మురళీధర్ తెలిపారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7న స్విస్ లీగ్ పద్ధతిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపికలు జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రజా వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదరంగం క్రీడ మేధస్సును పెంచడంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందిస్తుందని, అందుకే విద్యార్థుల్లో ఈ క్రీడపై ఆసక్తి పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అండర్–9, 11, 13 విభాగాల్లో బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించడంతో పాటు ఆయా విభాగాల్లో ప్రఽథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు వెండి పతకాలు అందిస్తామన్నారు. స్విస్ లీగ్ పద్ధతిలో కొనసాగే పోటీల్లో ఆసక్తి గల విద్యార్థులు అత్యధికంగా పాల్గొని రాష్ట్రస్థాయి జట్టులో పాలమూరు ఖ్యాతిని చాటేలా సత్తా చాటాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. చెస్ పోటీలకు హాజరయ్యే బాల బాలికలకు భోజన వసతి కల్పిస్తామని, ఆసక్తిగల విద్యార్థులు 5వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఏ క్రీడ పోటీలు జరిగినా పాలమూరు ప్రాతినిథ్యం ఉంటుందని, చెస్ పోటీల్లోనూ అదే ఒరవడిని కొనసాగించేందుకు వనపర్తి చెస్ అసోసియేషన్ ధృఢ నిశ్చయంతో పని చేస్తుందన్నారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ట్రెజరర్ టీపీ కృష్ణయ్య, సంయుక్త కార్యదర్శి రాములు, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
వనపర్తిటౌన్: రాష్ట్ర ఆడపడుచుల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పెబ్బేర్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన మహిళా వారోత్సవాలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయంలో కట్టు, బొట్టుకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ప్రభుత్వం మహిళలకు కానుకగా ఇచ్చే చీర ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. అన్నిరంగాల్లో ముందుండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గత పాలకులు చేసిన అప్పుల భారాన్ని ప్రస్తుతం ప్రజలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిప్పులు చెరిగారు. కార్యక్రమంలో పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్ పాల్గొన్నారు. గోదాం నిర్మాణానికి శంకుస్థాపన.. వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గోదాం నిర్మాణం పూర్తయితే ధాన్యం నిల్వ ఇబ్బందులు తొలగి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు కొండన్న, రాములు, బాలరాజు, గ్రామ ప్రజలు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ.. వైభోగమే
● మన్యంకొండలో వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య గరుడగిరి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. మంత్రోచ్ఛరణాలు, సన్నాయి వాయిద్యాల మధ్య అపూర్వ మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను పల్లకీలో గరుడగిరి వరకు తీసుకెళ్లి పూజలు జరిపించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాలు అలంకరణలో స్వామి దంపతులు దగదగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజ్, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. శేషవాహనంపై స్వామివారి విహారం మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి స్వామివారి శేషవాహన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని శేషవాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. శేషవాహన సేవను తిలకించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. -
5 నుంచి జిల్లా ప్రశిక్షణ శిబిరం
వనపర్తిటౌన్: జిల్లాలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు జిల్లా ప్రశిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రశిక్షణ ప్రభారీ గిరమోని శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అధ్యక్షతన జిల్లాస్థాయి ప్రశిక్షణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి మే నెల 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో మండల ప్రశిక్షణ శిబిరాలు నిర్వహించామని, రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులకు ప్రతి జిల్లాలో ప్రశిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే జిల్లాకేంద్రం నాగవరంలోని సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్లో ఈ నెల 5 నుంచి 7వ తేదీవరకు జిల్లాస్థాయి ప్రశిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 250 మంది జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులతో నిర్వహించే శిబిరంలో మూడు రోజుల పాటు వివిధ కాలాంశాలపై 13 సెషన్లు ఉంటాయని.. ప్రతి సెషన్కు రాష్ట్రస్థాయి నాయకులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు ప్రధాన వక్తలుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్టీ రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్రెడ్డి, సబిరెడ్డి వెంకట్రెడ్డి, మున్నూరు రవీందర్, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పురుషోత్తంరెడ్డి, రామన్నగారి వెంకటేశ్వర్రెడ్డి, కేతూరి బుడ్డన్న, ఓబీసీ మోర్చా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి బి.శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, వారణాసి కల్పన తదితరులు పాల్గొన్నారు. 31 వేల బస్తాల ధాన్యం రాక నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం 31 వేల బస్తాల ధాన్యం వచ్చింది. ఇందులో ఆర్ఎన్ఆర్ 28,146 బస్తాలు రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.2,880, కనిష్టంగా రూ.2,212 ధర వచ్చింది. అలాగే 3 వేల బస్తాల 1010 రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.1,911, కనిష్టంగా రూ.1,711 ధర లభించిందని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. డైట్ సెట్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: డైట్ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు మంగళవారం నుంచి శుక్రవారం వరకు జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాలలో తమ ధ్రువపత్రాలను పరిశీలించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ మేరాజుల్లాఖాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ర్యాంక్ కార్డు, హాల్టికెట్, ఎస్సెస్సీ, ఇంటర్, కులం, ఆదాయం సర్టిఫికెట్లతోపాటు బోనోఫైడ్స్ తీసుకురావాలని సూచించారు. మరింత సమాచారం కోసం సెల్ నం.99499 93714ను సంప్రదించాలని కోరారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కొల్లాపూర్ రూరల్/భూత్పూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ సందర్శించి.. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్ను సందర్శించనున్నారని.. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. అనంతరం సోమశిలలో హెలిప్యాడ్ స్థలంతో పాటు కృష్ణా ఘాట్లను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రతాపరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వారి వెంట జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ మాధవి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ ఉన్నారు. భూత్పూర్ మండలంలోని కర్వెన ప్రాజెక్టును 5న సీఎం రేవంత్రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి హెలీప్యాడ్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట ఇరిగేషన్ అధికారి విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ సుశీల రెడ్యానాయక్, నరేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి ఉన్నారు. -
సర్వీస్ తంటాలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్లో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేందుకు ప్రభుత్వం సర్వీస్ బుక్ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ఐఎఫ్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టం)ను తీసుకువచ్చింది. ఉద్యోగులు తమ సర్వీస్ బుక్కులను డిజిటలైజేషన్ చేసేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే చాలామంది ఉద్యోగులు సకాలంలో సర్వీస్బుక్ల నమోదు, ఆన్లైన్లో అప్లోడ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ రాకపోవడం, సదుపాయాలు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి మే 31 నాటికే గడువు ముగియగా.. మరిన్ని రోజులు గడువు ఇవ్వాలని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. పారదర్శకత పెంచేలా.. ప్రతి ఉద్యోగికి సర్వీస్ బుక్ ఎంతో కీలకమైంది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు పూర్తి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. ఈ క్రమంలో సర్వీస్ బుక్కుల్లో పారదర్శకత పాటించేందుకు ఇప్పుడు ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా మ్యానువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యానువల్ వెరిఫికేషన్ వంటి అంశాలను తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ముఖ్యంగా పదోన్నతులు, బదిలీ వివరాలు, వివిధ డిపార్ట్మెంట్ల పరీక్షలు, ఉపాధ్యాయుల టెట్ అర్హత వివరాలను పొందుపర్చాలి. డిప్యూటేషన్లు, ఫారిన్ సర్వీస్ వివరాలను సాధారణంగా ఎంట్రీ చేయాల్సి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన హెల్త్ స్కీం వర్తించేందుకు సర్వీస్ బుక్కులో కుటుంబ సభ్యుల వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. నమోదులో ఇబ్బందులు.. సర్వీస్ బుక్కులు సీనియర్ ఉద్యోగి అయితే 50 నుంచి 60 పేజీలు, జూనియర్ ఉద్యోగి అయితే 40 నుంచి 50 పేజీలు ఉంటాయి. వీటిని ఆన్లైన్లో పొందుపర్చాలంటే అన్ని పేజీలను స్కాన్ చేయడంతోపాటు అన్నీ కూడా 50 ఎంబీలోపు ఉండేలా చూసుకోవాలి. అయితే చాలామంది సీనియర్ ఉద్యోగులు ఈ ప్రక్రియ తెలియకపోవడంతో ఆన్లైన్లో నమోదు కోసం కంప్యూటర్ ఆపరేటర్లను సంప్రదించాల్సి వస్తుంది. ఈ క్రమంలో బడిబాట, జనాభా లెక్కలు వంటి పనులు ఉపాధ్యాయ, ఉద్యోగులు సర్వీస్ బుక్కులో ఎంట్రీలను మరింత ఆసల్యం చేస్తున్నారు. కార్యాలయంలోనే ప్రక్రియ.. ప్రభుత్వం సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్ చేపడుతున్న క్రమంలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బుక్లకు సంబంధించి డ్రాయింగ్ అధికారి వద్ద మాత్రమే ఆన్లైన్ ప్రక్రియ చేయాల్సి ఉంది. ఐఎంఎఫ్ పోర్టల్కు సంబంధించిన పాస్వర్డ్, ఐడీలను సదరు అధికారులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రక్రియను వివిధ డిపార్ట్మెంట్లలోని మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్లను కాంప్లెక్స్ హెచ్ఎంలు చేపడుతున్నారు. వారు బుక్కులోని అంశాలను పూర్తిగా పరిశీలించి, అన్నింటినీ సరిచూసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఉపాధ్యాయుడి సర్వీస్ బుక్ను ఆన్లైన్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. కొన్నిచోట్ల నెట్ సమస్య, కొన్నిచోట్ల సిబ్బంది కొరత వంటివి అడ్డంకిగా మారుతున్నాయి. డిజిటలైజేషన్ ప్రక్రియలో వేధిస్తున్నసాంకేతిక, ఇతరత్రా సమస్యలు వివిధ స్థాయిలలో నమోదులో తీవ్రజాప్యంతో ఇక్కట్లు గత నెల 31 వరకే ముగిసిన గడువు మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 వేలఉపాధ్యాయ, 18 వేల ఇతర ఉద్యోగులు -
ఇబ్బందులు తొలగించాలి..
సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్కు సంబంధించి ఆన్లైన్ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలి. సెలవులు కావడంతో కొంతమంది టూర్లకు వెళ్లడం, ఇతర పనులు, ఆరోగ్యం సమస్యలు ఉన్నవారు ఉన్నారు. వెంటనే ఆన్లైన్ చేయడం వల్ల తప్పులు దొర్లితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పంచింది ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించడంతోపాటు సర్వీస్ బుక్ల ఆన్లైన్ నమోదులో ఇబ్బందులు లేకుండా చూడాలి. – మదన్మోహన్యాదవ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గడువు పొడిగించాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్కులను ఆన్లైన్ చేయడం మంచి నిర్ణయమే. ఇలా చేయ డం వల్ల భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లే కుండా ఉంటాయి. కానీ, వీటిని ఆన్లైన్ చేసేందుకు కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఇచ్చి ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది బడిబాట, కొంత మంది జనగనణలో ఉన్నారు. అలాంటి వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం గడువు తేదీని పొడిగించాలి. – శ్యాంబాబు, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు● -
బాల్య వివాహాలను వ్యతిరేకించాలి
వనపర్తి: బాల్య వివాహాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తూ సమాజంలోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్నేహ (కిషోర బాలికలు) సంఘాల సభ్యులకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు ఎస్పీ సునీతారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బాలికలు ప్రధాని, స్పీకర్, ఎంపీల పాత్రలు పోషిస్తూ పార్లమెంట్ సమావేశం నిర్వహించారు. మహిళా సంక్షేమం, మహిళల ఆరోగ్యం, అభివృద్ధి, వరి కొనుగోళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సామాజిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కిషోర బాలికలతో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. సమాజంలో ఐక్యత చాలా ముఖ్యమని, బాలికల కోసం మాక్ పార్లమెంట్ నిర్వహించడం మంచి సాధనగా అభివర్ణించారు. సమావేశంలో విద్యార్థినులు మహిళల్లో రక్తహీనత, సమాజంలో జరుగుతున్న పలు సమస్యలపై ప్రశ్నలు అడగడం బాగుందని కొనియాడారు. బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో పాటు వాటిపై గళం వినిపించాలని, ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే వివాహం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మూడేళ్లలో 60 బాల్య వివాహాలు జరిగినట్లు తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే హెల్ప్లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. బాలికలకు విద్యనే అత్యంత ప్రాధాన్యం కావాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రస్తుత కాలంలో బాలికలకు అనేక సవాళ్లు ఉన్నాయని.. వాటిని అవగాహనతో అధిగమించాలని కోరారు. పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రశ్నించేతత్వం అలవాటు చేసుకోవాలని, ఏ రంగంలో ఉన్నా ఉత్తమ స్థానాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వరి కొనుగోళ్లకు సంబంధించిన కమీషన్ చెక్కులు, ఎఫ్పీఓ సంఘాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ అందజేశారు. అదేవిధంగా బాలికల సంరక్షణకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఓ రాణి, డీఐఓ జ్యోతి, డీడబ్ల్యూఓ సుధారాణి, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, డీఐఈఓ నరేంద్ర, పలువురు అధికారులు, స్నేహ సంఘాల బాలికలు, విద్యార్థులు పాల్గొన్నారు. మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్న స్నేహ సంఘాల సభ్యులు -
ప్రజల భద్రతలో రాజీ లేదు
● కేసుల దర్యాప్తులో ప్రమాణాలు పాటించాలి ● సైబర్ మోసాలు, బాల్య వివాహలపై అవగాహన కార్యక్రమాలు ● ఎస్పీ డి.సునీతారెడ్డి సమీక్షలో పాల్గొన్న పోలీసు అధికారులు వనపర్తి: ప్రజల విశ్వాసమే పోలీసుశాఖకు అతిపెద్ద బలం.. ప్రతి అధికారి ప్రజలకు చేరువగా ఉంటూ, వారి సమస్యలు తెలుసుకొని వెంటనే స్పందించాలి.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలు, సైబర్ మోసాల నియంత్రణ, గ్రామస్థాయిలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతి పోలీసు అధికారి బాధ్యతని ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్టేషన్ల ఎస్ఐలతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రతి ఎస్ఐ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని, గ్రామ పోలీసు అధికారులు తమకు అప్పగించిన గ్రామాలపై పూర్తి అవగాహనతో ఉండి ముందస్తు సమాచార సేకరణపై దృష్టి సారించాలన్నారు. రౌడీషీటర్స్, సస్పెక్ట్ల కదలికలపై నిఘా ఉంచాలని, బూకోర్ట్, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది ఫింగర్ ప్రింట్ డివైస్లు వినియోగించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని.. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియోకాల్స్, డిజిటల్ అరెస్టులు, పోలీసుల పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్ను నమ్మవద్దని ప్రజలకు తెలియజేయాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యత వివరిస్తూ.. ప్రతి గ్రామం, వీధి, పరిశ్రమలు, పవిత్ర స్థలాల్లో ఏర్పాటు చేయించాలని సూచించారు. డయల్ 100 కాల్స్కు త్వరితగతిన స్పందిస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత పెంపొందించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలని, పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలు జరగకుండా గస్తీ నిర్వహిస్తూ రాత్రిళ్లు అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని కట్టడి చేయాలని సూచించారు. పోలీస్స్టేషన్లలోని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని.. ప్రతి రికార్డును కచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తామని, నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పని చేయాలన్నారు. సమీక్షలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి సీఐ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూర్ సీఐ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్ పాల్గొన్నారు. -
వారంలోగా ధాన్యం సేకరణ పూర్తి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారం రోజుల్లో (జూన్ 4, 5 తేదీలో)గా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. శనివారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వరిధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. వరి, మొక్కజొన్న ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ జూన్ 4 తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో వారం రోజుల్లోగా జూన్ 4, 5 తేదీల్లోగా కొనుగోళ్లు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. కొనుగోలు, రవాణా, నిల్వ, రైతులకు చెల్లింపుల ప్రక్రియను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాలు, 13 వేల వాహనాలు, 2 లక్షల మంది సిబ్బంది, 2008 రైస్ మిల్లులు భాగస్వామ్యం అయ్యాయని, 20.80 కోట్ల గన్నీ సంచులు సరఫరా చేశామన్నారు. శనివారం వరకు 62 లక్షల మె.ట., ధాన్యం సేకరించి.. 8.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,11,500 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా గోదాంలలో నిల్వ స్థలాల కేటాయింపుపై పరస్పర సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఆదేశించారు. జూన్ 4, 5 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల సందర్శిస్తారని, జూరాలతో పాటు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలిస్తారని చెప్పారు. రైతు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేస్తాం తడిసిన ధాన్యాన్ని కొని గోదాంలకు తరలించాం 4, 5 తేదీల్లో సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టుల సందర్శన రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
పొగాకుతో ప్రాణాంతక సమస్యలు
వనపర్తిటౌన్: పొగాకు వినియోగంతో క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని.. వినియోగదారుడికంటే కుటుంబమే అధిక భారం మోయాల్సి వస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ ఒకేషనల్ కళాశాల భవనం ఎదుట దినసరి కూలీలకు పొగాకుతో కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ.. ఇంటి పెద్ద పొగాకుకు బానిసై అనారోగ్యం బారినపడితే ఇంట్లో వాళ్లు బతికుండగానే నరకం చూడాల్సి వస్తోందని తెలిపారు. కొద్ది నిమిషాల ఆనందం కోసం తాగే పొగాకుతో కుటుంబాలు రోడ్డున పడుతాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆర్థిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. డా. రామచందర్రావు మాట్లాడుతూ.. మత్తుకు బానిసైన వ్యక్తులు ప్రభుత్వ ఆస్పత్రిలోని డి అడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ పొంది భవిష్యత్ను సుఖమయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ కళాజాత సువర్ణ బృందం తమ ఆటపాటలతో ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యపర్చారు. అనంతరం దినసరి కూలీలతో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, డా. రియాశ్రీ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, డా. శ్రీనివాస్, జూనియర్ వైద్యుడు డా. శశాంక్, పారా లీగల్ వలంటీర్లు రవీందర్, అనిల్, లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ పదిలో రాష్ట్రంలోనే ప్రథమం వనపర్తిటౌన్: ఓపెన్ పది, ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఓపెన్ పదిలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో, ఓపెన్ ఇంటర్ ఫలితాల్లో 5వ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. ఓపెన్ పదిలో 391 మందికిగాను 370 మంది పాసై 94.63 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అలాగే ఓపెన్ ఇంటర్లో 723 మందికిగాను 612 మంది పాసయ్యారని.. 80.21 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా తమ చదువు పూర్తి చేయాలని సూచించారు. -
నేడు దరఖాస్తునకు చివరి గడువు
వనపర్తి: ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుందని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్ ఖాన్, ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సీ ఖాజా బహుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు htt ps://cet.cgg.gov.in/tmreir వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించరాదన్నారు. మొత్తం 100 సీట్లు ఉంటాయని, ఇందులో మహిళలకు 33 శాతం దివ్యాంగులకు 5 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వివరి ంచారు. మరిన్ని వివరాలకు ఫోన్నంబర్ 040 23236112 సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం కింద విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే మైనార్టీ విద్యార్థులు జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు www.tela nganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశీ విద్యాలయాల్లో జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ప్రవేశాలు పొందిన వారు అర్హులని, కుటుంబ ఆదాయం రూ.5 లక్షలు మించరాదని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రూ.20 లక్షల ఉపకార వేతనంతో పాటు విమాన ప్రయాణ ఖర్చులు రూ.60 వేలు చెల్లిస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన హార్డ్కాపీలు రెండు సెట్లను అటెస్టెడ్ చేసి జులై 31 వరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయం లేదా సెల్నంబర్ 72078 54914, ఫోన్నంబర్ 08545 232500 సంప్రదించాలన్నారు. మండలానికి శిక్షణ ఐఏఎస్లు గోపాల్పేట: శిక్షణ ఐఏఎస్లు సాయిశివాని, సచిన్ బసవరాజ్ రెవెన్యూశాఖ గురించి తెలుసుకునేందుకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్ మండలంలోని చాక్పల్లికి తీసుకెళ్లి సర్వేనంబర్లు, దిక్కులు చూపే రాళ్లు చూపించారు. శనివారం కార్యాలయంలో రైతుల ఖాతాలు ఎలా చూడాలి, రికార్డులు ఎన్ని రకాలు, ఎలా పరిశీలించాలనే విషయాలను తహసీల్దార్ వారికి వివరించారు. వారి వెంట రెవెన్యూ సర్వేయర్లు ఉన్నారు. -
వరి సాగే అధికం..
మండలంలో సాగునీటి వనరులు అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు వరి సాగుపైనే దృష్టి సారిస్తున్నారు. జూరాల ఎడమ కాల్వతో పాటు అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా సమృద్ధిగా సాగునీరు అందుతుండటంతో ఎలాంటి వరి వంగడాలు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయనే విషయాలను రైతులకు వివరిస్తున్నాం. – అరవింద్, ఏఓ, అమరచింత జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆదేశాలతో పూర్తి చేశాం. ప్రభుత్వం సన్నరకం వరికి బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండోస్థానంలో పత్తి, చెరుకు, కంది సాగుకు మక్కువ చూపుతున్నారు. ఎంత మేర విత్తనాలు, ఎరువులు కావాలనే వివరాలను ఏఓలతో సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. పంటల సాగుకు ముందే నిల్వ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. – ఆంజనేయులుగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి -
పోక్సో.. కాస్కో
అమ్మాయిల పట్ల లైంగిక దాడులకు పాల్పడే వారు ప్రభుత్వ ఉద్యోగులైనా.. ఇతరులైనా పోక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 7వ తరగతి నుంచి ఈ చట్టంపై అవగాహన కల్పించే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాల, ఇంటర్ విద్యార్థులతో పాటు గ్రామాల్లో ప్రజలకు సైతం ఈ చట్టం గురించి వివరిస్తున్నాం. బాలికల పట్ల ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడం, పోలీసులకు ఫిర్యాదు వంటివి చేయాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రైం: బాలికలు, అమ్మాయిలను లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టాన్ని 2012 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సెక్షన్ కింద అభియోగం మోపబడిన వారికి రెండు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడేళ్లు లేకుంటే జీవితఖైదు శిక్ష పడుతుంది. ప్రధానంగా పోక్సో కేసు నమోదు చేసిన అతి తక్కువ కాలంలో పరిశోధన చేసి సంబంధిత వ్యక్తిపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరచాలి. ఆ తర్వాత న్యాయమూర్తి సంఘటన తీవ్రతను బట్టి నిందితుడికి జైలుశిక్ష ఖరారు చేస్తారు. గురువులు సైతం వక్ర బుద్ధి ఏం చేసిన బయటకు పొక్కదనో.. లేదా నోరు లేదనో అభంశుభం తెలియని బాలికలపై కొందరు ప్రబుద్ధులు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు యువత అశ్లీల వీడియోల ప్రభావంతో మైనర్లపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అలాగే విద్యార్థినులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు సైతం వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం బాధాకారం. కొంతకాలంగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా, తీవ్రతను బట్టి కోర్టులు జీవిత ఖైదు శిక్షలు విధిస్తున్నాయి. బెయిల్ దొరకడం కష్టమే.. పోక్సో కేసులు చాలా సున్నితమైనవి. అంతే కాకుండా నేరం రుజువైతే నిందితులకు బెయిల్ దొరకడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే ఆ తర్వాత ఇతర కేసుల మాదిరిగా రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా ఉండదు. కేవలం దోషిని కటకటాల్లోకి నెట్టడంతోనే దీని పర్యావసనం ఆగిపోదు. మొత్తం కుటుంబం సమాజంలో విలువను కోల్పోయి తలదించుకు బతకాల్సి వస్తుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో కలిపి 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,369 పోక్సో కేసులు నమోదయ్యాయి. వీటిలో నేరారోపణలు రుజువై 40 మందికి శిక్ష పడింది. దాదాపు 90 శాతం కేసులు ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 758 పోక్సో కేసులు నమోదయ్యాయి. శిక్షలు పడిన పలు కేసులు ఇలా.. మిడ్జిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో టీవీ చూడటానికి ఇంటికి వచ్చిన ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన రమేష్ అనే యువకుడికి ఈ నెల 7న న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 జవనరి 24న జడ్చర్ల పట్టణానికి చెందిన ఎండీ సాబిల్ ఓ బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించి బలవంతంగా జడ్చర్లలోని లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు దృశ్యాన్ని వీడియో తీసి తన మిత్రులు సయ్యద్ తాలిబ్, సయ్యద్ అల్తాప్లకు వాట్సాప్లో పంపించాడు. వారు కూడా వీడియోలు చూపించి అమ్మాయిని లొంగతీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుల్లో ఏ1 ఎండీ సాబిల్కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.90 వేల జరిమానా, ఏ2 సయ్యద్ తాలిబ్, ఏ3 సయ్యద్ అల్తాప్కు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 మే 7న ఇంటి బయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడగా.. నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మాయమాటలతో లోబరుచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసిన ఘటనపై 2017లో కోదండపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుపై గద్వాల ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు నిందితుడు చాకలి హరిచంద్రకు 35 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. మహబూబ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ధర్మాపూర్ పాఠశాలతోపాటు షాసాబ్గుట్ట, వన్టౌన్ స్టేషన్ పరిధిలో వీరన్నపేట హైస్కూల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి అమ్మాయిలపై లైంగిక దాడి చేయగా ఈ ముగ్గురిపై పోక్సో కేసులు నమోదయ్యాయి.’ 2020 నుంచి ఉమ్మడి జిల్లాలో 2,369 పోక్సోకేసులు ఏడేళ్ల వ్యవధిలో ఒక్క మహబూబ్నగర్లోనే 758 కేసులు నమోదు కీచకులుగా మారుతున్న కొందరు ఉపాధ్యాయులు పకడ్బందీగా చట్టం అమలుతో నిందితులకు కఠిన శిక్షలు -
సంతోషం కలిగించింది..
తమ వేతనాలు ఇక నుంచి ప్రతి నెల ఒకటో తేదీనే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం సంతోషం కలిగించింది. ఇంతవరకు వేతనం కోసం రెండు, మూడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండింది. తమలాంటి ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది. – చరణ్, పంచాయతీ కార్మికుడు, మస్తీపురం చిన్న పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరయినప్పుడే పని చేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెల ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించడం మాలాంటి కార్మికుల ఆశలకు ఊపిరి నింపింది. ఇక నుంచి మేము కూడా ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు తీసుకుంటామనే ప్రకటన సంతోషం కలిగిస్తోంది. – చుక్క అంజన్న చింతరెడ్డిపల్లి పంచాయతీ వర్కర్. గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు ఇక నుంచి ప్రతి నెల ఒకటో తేదీన చెల్లిస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయం. రెండు, మూడు నెలలు దాటినా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ప్రతినెల చెల్లించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని, అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించడం మంచిదే. ఇచ్చిన హామీ అమలు చేయకపోతే కార్మికులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తాం. – సి.రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు, టీయూసీఐ అమరచింత -
తరుగు పేరిట కోత విధిస్తే చర్యలు
● తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు ● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్గల్/వీపనగండ్ల: తరుగు పేరిట రైతుల ధాన్యంలో కోత విధించే రైస్మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. మండలంలోని కేతేపల్లిలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి మంత్రి పరిశీలించారు. మార్కెట్లో ఉన్న సమస్యలు, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని స్థానిక రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని.. తూకం చేసిన ధాన్యం తరలింపునకు లారీల సంఖ్య పెంచాలని సూచించారు. అలాగే మిల్లులకు చేరిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయించాలని, కేంద్రాల్లో రైతులకు సరిపడా టార్పాలిన్లు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. అలాగే సమీపంలో ఉన్న మైరూన్ రైస్మిల్లును సందర్శించి ధాన్యం అన్లోడ్, నిల్వలపై ఆరా తీశారు. మిల్లుల వద్ద లారీలు ఎట్టి పరిస్థితుల్లో ఆగొద్దని, అవసరమైతే స్థానికంగా హమాలీలను నియమించుకొని వేగంగా అన్లోడ్ చేయించాలని సూచించారు. హమాలీల సంఖ్య పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఎఫ్సీఐ ఇబ్బందులు మంత్రి దృష్టికి.. రైతులు తాలు, ధుమ్ము ఉన్న ధాన్యం తీసుకురావడంతో బియ్యంలో మెరికలు, నలుపుగా వస్తుండటంతో ఎఫ్సీఐ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మిల్లు యజమాని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. శుభ్రం చేసిన ధాన్యం తీసుకొస్తే ఇబ్బందులు ఉండవని తెలిపారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్దన్సాగర్, తహసీల్దార్ కార్తీక్రావు, కాంగ్రెస్ నాయకులు రవికుమార్, పుల్లారావు, భాస్కర్యాదవ్, రాముయాదవ్, పౌరసరఫరాల అధికారులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతితోనే రాష్ట్రం అభివృద్ధి
వనపర్తిటౌన్: త్వరలో నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె కనిపించకుండా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజీ చెక్కులు, రెండోవిడత ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల అభ్యున్నతితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా నమ్ముతుందని.. మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇప్పటి వరకు రూ.30.29 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆరోగ్య బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, జిల్లాలో 30 వేల తెల్ల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినట్లు తెలిపారు. విద్య, వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆరువేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించారు. త్వరలో వనపర్తి మహిళలకు పెట్రోల్బంక్ మంజూరు కాబోతుందని, ప్లాట్లు లేని పేదలకు వెయ్యి ప్లాట్లు మంజూరు చేసి అందులో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. మహిళలు సూపర్మార్కెట్, రైస్మిల్లు, గోదాములు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు జిల్లాలో ఇప్పటి వరకు రూ.83.76 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, మొదటి విడతలో మహిళలకు ఉచితంగా 12,669 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తే.. మలి విడతలో 15 వేల చీరలు వచ్చినట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. మహిళల చేతుల్లో సంసారం ఉంటేనే కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సంఘంలో ఉన్న మహిళ ప్రమాదవశాత్తు చనిపోతే తీసుకున్న రుణం మొత్తం మాఫీ అయ్యే విధంగా ప్రభుత్వమే బీమా చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, బస్సులు, గోదాములు అన్ని మహిళలకే కేటాయిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మహిళా సంఘాల సభ్యులకు రూ.3.40 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎన్యూమరేషన్ ప్రక్రియ
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఎన్యూమరేషనన్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ షెడ్యూల్, నిర్వహణపై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెనన్స్లో కలెక్టరేట్ కాన్ఫరెనన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ సూపర్వైజర్లతో మాట్లాడుతూ.. మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సూపర్వైజర్ తమ పరిధిలోని పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, సి–సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి వనపర్తిటౌన్: ఖాళీగా ఉన్న 600పైగా ఎంఈఓ పోస్టులు, 80 డిప్యూటీ ఈఓ కేడర్ పోస్టులను పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. గురువారం రాత్రి జిల్లాకేంద్రంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోస్టులు ఖాళీగా ఉండటంతో పాఠశాలల పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హెల్త్స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని, రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కొత్తగా ఉమ్మడి సర్వీస్ నిబంధనలు రూపొందించాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని కోరారు. మోడల్, ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సైతం హెల్త్కార్డు వర్తింపజేసి మినిమం బేసిక్ పే, సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్ ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం జిల్లా జిల్లా అధ్యక్షుడిగా నర్సింహనాయుడును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గజేందర్, ఆర్థిక కార్యదర్శి సభ్యుడు అలీ తదితరులు పాల్గొన్నారు. జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని పీజేపీ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 3,005 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 30 క్యూసెక్కులు ఆవిరి అయ్యిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.950 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. డెడ్ స్టోరేజీ లెవెల్లో ఉన్న జూరాల నీటిమట్టం స్థానికంగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా ఇన్ఫ్లోలు రావడంతో తాగునీటి పథకాలకు ఇబ్బందులు తప్పినట్లయింది. పీయూలో నలుగురికి ప్రొఫెసర్లుగా పదోన్నతి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పలు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదో న్నతులు కల్పించే ప్రక్రియను చేపట్టారు. 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్కు పదోన్నతులు కల్పించారు. ఇందులో మైక్రోబయోలజీ డిపార్ట్మెంట్లో మధుసూదన్రెడ్డి, కిషోర్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో చంద్రకిరణ్, నూర్జహాన్ ఉన్నారు. కామర్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ్కుమార్కు అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి కల్పించారు. -
అన్నదాతల నిరసన
వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట శివారులో ఉన్న గిరిజన భవనంలో అధికారులు వరి ధాన్యం నిల్వ చేస్తున్నారు. గురువారం గ్రామంలోని రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి దించుకోవాలని అధికారులను కోరారు. తడిసిన ధాన్యం మదనాపురం బాయిల్డ్ మిల్లుకు తీసుకెళ్లాలని సూచించగా.. ఇక్కడే దించుకోవాలంటూ రైతులు పట్టుబట్టారు. ఎస్ఐ హృశికేష్ అక్కడికి చేరుకొని సింగిల్విండో చైర్మన్ రఘువర్ధన్రెడ్డి, సర్పంచ్ ఎల్లయ్య కలిసి రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యం వేరే మిల్లుకు తరలించాలని, తడవని ధాన్యం ఇక్కడే దించుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు. కాగా.. లారీల్లోని సంచులు దించుతుండగా మొలకెత్తిన సంచులు కనిపించడంతో మళ్లీ గొడవ మొదలైంది. లారీలోని తడిసిన ధాన్యం దించుకుంటారు.. తమ ధాన్యం వేరే మిల్లుకు ఎందుకు తీసుకెళ్లాలని అధికారులను ప్రశ్నించారు. ఎంతచెప్పినా వినకపోవడంతో అధికారులు గోదాంకు తాళం వేసి వెళ్లిపోయారు. చివరకు పౌరసరఫరాల సంస్థ డీఎం ఆంజనేయులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం మదనాపురం బాయిల్డ్మిల్లుకు తరలించేలా ఒప్పించారు. -
ప్రజాసేవ.. గొప్ప మానవత్వం
వనపర్తి రూరల్: ప్రతి మనిషి తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రజాసేవకు వినియోగించడం గొప్ప మానవత్వమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో బూజుల సోమమ్మ, రంగారెడ్డి మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో వారి కుమారులు ఖగేంధర్రెడ్డి, హేమసుందర్రెడ్డి, భువనేశ్వర్డ్డి ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎస్పీ సునీతారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో ఉంటూ స్వగ్రామంలో తల్లిదండ్రుల పేరిట కంటి వైద్య శిబిరం నిర్వహించిన బీఎస్ఆర్ మెమోరియల్ సొసైటీ వ్యవస్థాపకులను ఆయన అభినందించారు. సమాజంలో ప్రతి మనిషి సంపాదించిన దాంట్లో కొంత పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ఖర్చు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. తాను కూడా తన స్వగ్రామం మంగంపల్లిలో 20 ఏళ్లు సర్పంచ్గా పని చేశానని, ఆ గ్రామంలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు తనవంతుగా రూ.21 వేలతో పాటు పుస్తే, మెట్టెలను అందిస్తూ వస్తున్నానని.. ఎంపీపీ అయిన తర్వాత మండలస్థాయిలో పేద కుటుంబాల్లో మృతిచెందిన వారి అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేలు మేఘన్న అభయాస్తం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ఎంతోమంది చదువుకునే విద్యార్థులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి, పేదలకు తనవంతు సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో తోడుగా నిలబడే మంచి మనసున్న వారందరికి సమాజం రుణపడి ఉంటుదన్నారు. కన్నవారిని, జన్మనిచ్చిన గ్రామాన్ని ఎప్పటికీ మరవొద్దని.. తమకు తోచిన సాయాన్ని అందిస్తూ రావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుట్టా నాగేష్, పెబ్బేరు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, బీఎస్ఆర్ సొసైటీ సభ్యులు, మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్రెడ్డి, ఉప సర్పంచ్ బొల్లి రాజు, సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
‘రుణ’ం తీర్చలేక.. ప్రాణాలతో ‘విముక్తి’
● ఉమ్మడి జిల్లాలో ఇటీవల పెరుగుతున్న బలవన్మరణాలు ● అర్ధంతరంగా తనువు చాలిస్తున్న యువతరం ● పిల్లల నూరేళ్ల జీవితాన్నీ చేజేతులా కాలరాస్తున్న వైనం ● ఆన్లైన్ లోన్, బెట్టింగ్ యాప్ల బారిన పడి కుంగుబాటు ● నారాయణపేట జిల్లా మక్తల్కి చెందిన కర్రెమ్ సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ సూర్య, అలియాస్ తిప్పియ్య అనే 27 ఏళ్ల వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్కు బానిసయ్యాడు. గత ఏడాది కాలంగా డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మక్తల్తో పాటు పరిసర ప్రాంతాల్లో కిరాణం, వైన్ షాపులు, తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. ఇటీవల పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 10 నెలల్లో సుమారు 25 మంది వరకు.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు సుమారు 25 మంది అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఒక్క గద్వాల జిల్లాలోనే 20 మంది వరకు ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో అత్యధికంగా అత్యాశతో అప్పులు చేసిన వారు.. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న యువకులు తనువు చాలించినట్లు తెలుస్తోంది. సాధారణ ఖర్చులు పెరగడంతో.. ఉమ్మడి పాలమూరులో ప్రధానంగా మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా వ్యవసాయం, కూలీ పనులు, చిరు వ్యాపారాలతో పాటు పలు ప్రైవేట్ సంస్థల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దెల వంటి సాధారణ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. ఇందుకనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో సరిపోక కుటుంబ పోషణ భారంగా మారింది. బ్యాంకుల్లో రుణాలు సులభంగా అందకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ఫైనాన్స్, రోజు వారీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. చిన్న మొత్తంతో ప్రారంభమైన అప్పు.. ఆ తర్వాత నెల నెలా వడ్డీలతో కలిపి అధిక భారంగా మారుతుండడం ఆయా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ● 2026 ఏప్రిల్ 6: గద్వాల జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ అవసరాల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. కొన్ని నెలలు సక్రమంగా వడ్డీలు చెల్లించాడు. ఆ తర్వాత చెల్లించకపోవడంతో ఒత్తిళ్లు రావడం.. తీర్చే స్థోమత లేకపోవడంతో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ● 2025 ఆగస్ట్ 15: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకి చెందిన ఓ విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని హెచ్చరించారు. అప్పులు ఇచ్చిన వారికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో విద్యార్థి మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ ఆడగా.. డబ్బులు పోయాయి. దీంతో మనస్తాపానికి గురై అతడు ఉరి వేసుకుని మృతిచెందాడు. ● గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో సెలూన్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కొంతకాలంగా మట్కా జూదానికి అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2025 డిసెంబర్ 12 : గద్వాలకి చెందిన ఓ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్తో పాటు ఫైనాన్స్, చిట్టీ వ్యాపారాలు చేసేవాడు. పెట్టుబడుల కోసం భారీగా అప్పు చేశాడు. నష్టాలు రావడం.. అప్పులు చెల్లించే స్థోమత లేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యాశతో సామర్థ్యానికి మించి అప్పులు.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు సామర్థ్యానికి మించి అప్పులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా యువకులు రియల్ ఎస్టేట్, ఇతరత్రా వ్యాపార పెట్టుబడుల కోసం భారీగా రుణాలు సేకరిస్తున్నారు. తమకు తెలిసిన వారి వద్ద, పలు ప్రైవేట్ బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం వంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్లకు నెలనెలా ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంటోంది. ఈ క్రమంలో మరో చోట రుణం తీసుకొచ్చి వడ్డీలు చెల్లించడం.. క్రెడిట్ కార్టుల నుంచి నెల వారీగా సర్దుబాటు చేయడం వంటివి చేస్తూ.. చివరకు అప్పులు తీర్చలేక చతికిలపడుతోంది. లోన్, బెట్టింగ్ యాప్ల బారిన పడి.. ప్రస్తుత తరంలో సెల్ఫోన్ నిత్యావసరంగా మారడం.. సామాజిక మాధ్యమాల్లో లోన్ యాప్ల ఆకర్షణీయ ప్రకటనలు కట్టిపడేసేలా ఉంటున్నాయి. ఆధార్, పాన్, ఫోన్ నంబర్ ఉంటే చాలు.. నిమిషాల్లో రుణాలు ఇస్తుండడంతో అప్పుల పాలైన వారు వాటిని ఆశ్రయిస్తున్నారు. ఆ తర్వాత వడ్డీల పేరుతో నిర్వాహకులు వేధింపులకు దిగడం.. చెల్లించని పక్షంలో రుణ గ్రహీతలు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్లకు ఫోన్లు చేసి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక పలువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో వీటిపై ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు. మరోవైపు త్వరగా డబ్బు వస్తుందనే ఆశతో చాలా మంది యువత ఆన్లైన్ బెట్టింగ్కు దిగుతున్నారు. మొదట చిన్న మొత్తాలతో ప్రారంభమైన బెట్టింగ్.. చివరకు లక్షల్లో నష్టాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో కుటుంబాలకు తెలియకుండా చేసిన అప్పులు కట్టలేక.. కుటుంబ సభ్యులకు చెప్పలేక అవమాన భారంతో బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నట్లు పలు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలి.. అందరికీ ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. ఆదాయానికి మించి అప్పులు చేయొద్దనే ప్రాథమిక సూత్రాన్ని మరవొద్దు. ఆన్లైన్ యాప్లు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. ఏ వ్యాపారమైతే చేయదలుచుకున్నారో దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పెట్టుబడులకు రుణాలు చేసే ముందు కుటుంబసభ్యులతో ఆర్థిక విషయాలు చర్చించాలి. ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడి పెరిగితే కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి. అప్పులు జీవితంలో ఒక సమస్య మాత్రమే. అది జీవితానికి ముగింపు కాదు. అవసరమైన పక్షంలో కౌన్సెలింగ్ తీసుకోవాలి. – డాక్టర్ అనిల్రాజ్, మానసిక వైద్య నిపుణుడు, మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
వనపర్తి రూరల్: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం ఆయన మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డును సందర్శించి ధాన్యం నిల్వ కోసం అదనంగా ఏర్పాటు చేసిన గోదాంను రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి తనిఖీ చేసి అక్కడ కొనసాగుతున్న అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. వచ్చే 15 రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల్లో అకాల వర్షాలకు 600 మెట్రిక్ టన్నుల ధాన్యం తడవగా.. వాటిని బాయిల్డ్ మిల్లుకు తరలించామని తెలిపారు. జిల్లాలో రెండేళ్లుగా రికార్డుస్థాయిలో వరి ధాన్యం దిగుబడులు వస్తున్నాయని.. గతంలో సీజన్కు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండగా, ప్రస్తుతం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు చేరిందన్నారు. ధాన్యం నిల్వకు గోదాముల్లో స్థలం కొరత ఏర్పడుతోందని తెలిపారు. ఆయన వెంట మార్కెట్యార్డు చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, డీఆర్డీఓ ఉమాదేవి, పౌరసరఫరాలసంస్థ డీఎం ఆంజనేయులు తదితర అధికారులు ఉన్నారు. రికార్డుస్థాయిలో వరి దిగుబడి.. వనపర్తి: జిల్లాలో రికార్డుస్థాయిలో వరి ధాన్యం దిగుబడులు వచ్చినందున నిల్వ కోసం అదనపు స్థలం అవసరం అవుతోందని.. రైస్మిల్లర్లు వరి ధాన్యాన్ని దించుకోవడంలో ప్రభుత్వానికి సహకరించి అన్లోడ్ ప్రక్రియ సజావుగా సాగేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి రైస్మిల్లర్లతో సమావేశమయ్యారు. మిల్లర్ల వారీగా గోదాములలో ఖాళీ స్థలాలపై చర్చించి అదనంగా ధాన్యం బస్తాల కేటాయింపుపై సూచనలు చేశారు. నిల్వ కోసం అందుకు తగిన అద్దె చెల్లిస్తామని తెలిపారు. సమావేశంలో డీఎస్ఓ కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ ఆంజనేయులు పాల్గొన్నారు. -
సురవరం సేవలు చిరస్మరణీయం : ఎమ్మెల్యే
వనపర్తి: గోల్కొండ పత్రిక సంపాదకులు, వనపర్తి తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. సురవరం 130వ జయంతి సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి, పక్కన ఉన్న పార్క్లోని సురవరం కాంస్య విగ్రహానికి శాట్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సమాజానికి చేసిన సేవలు.. మార్పు, సంస్కరణల కోసం చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం’ పాన్గల్/వీపనగండ్ల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం పాన్గల్ మండలం చింతకుంట, వీపనగండ్ల మండలం కల్వరాల వరి కొనుగోలు కేంద్రాలను శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డితో కలిసి సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు దాటినా తూకం చేయడం లేదని పలువురు రైతులు వివరించగా.. వెంటనే ఆయన కలెక్టర్, అదనపు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం బస్తాలను తరలించేందుకు జాప్యం లేకుండా లారీలను పంపాలని సూచించారు. సమస్యలను రెండ్రోజుల్లో పరిష్కరించాలని లేనిపక్షంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, సేకరించిన ధాన్యం బస్తాల తరలింపులో జాప్యంతో అకాల వర్షాలకు తడిసి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు గడుస్తున్నా తూకం చేయడంలో తీవ్ర జాప్యంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణం పాఠం చెబుతారన్నారు. నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నా మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు మోసపోతే గోస పడుతాం అనే మాట వంద శాతం నిజమైందని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, చంద్రశేఖర్నాయక్, రవికుమార్, వెంకటయ్యనాయుడు, గో పాల్రెడ్డి, తిలకేశ్వర్గౌడ్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
రైతుపై రవాణా భారం
కొనుగోలు కేంద్రాల నుంచి సొంత వాహనాల్లో ధాన్యం తరలింపు ● అద్దె కోసం రవాణా కాంట్రాక్టర్లను ఆశ్రయించాల్సిందే.. ● గతంలో వెచ్చించిన డబ్బులు ఇచ్చినట్లేనా..? ● జిల్లాలో 9 రూట్లు.. నిత్యం 360 లారీలు అందుబాటులో... పదిరోజుల కిందట 314 బస్తాల వరి ధాన్యాన్ని వీపనగండ్ల గోదాంకు ట్రాక్టర్లలో తరలించాం. బస్తాకు రూ.9 చొప్పున కాంట్రాక్టర్ ఇస్తామన్నారు. డబ్బుల కోసం వెళ్తే.. ఇంకా బిల్లు రాలేదని తర్వాత ఇస్తామంటున్నారు. అద్దె చెల్లించాలని ట్రాక్టర్ల యజమానులు వత్తిడి తెస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే రవాణా డబ్బులు ఇప్పించాలి. – కురుమయ్య, రైతు, గోపల్దిన్నె (వీపనగండ్ల) నేను దొడ్డురకం వరి పండించా. వారం కిందట సంచికి రూ.పది చొప్పున 270 సంచులు రెండు ట్రాక్టర్లలో గోపాల్పేట గోదాంకు తరలించాను. అప్పు చేసి రూ.ఐదు వేలు అద్దె చెల్లించాను. ధాన్యం తరలించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అధికారులు త్వరగా చెల్లించేలా చూడాలి. – బాషమోని శేఖర్, రైతు, ఏదుట్ల రైతులు ధాన్యం మిల్లుల వద్ద దించగానే వే బ్రిడ్జి రసీదు, మిల్లర్ ధాన్యం తీసుకున్నట్లుగా ఇచ్చిన రసీదు ట్రాన్పోర్టు కాంట్రాక్టర్కు చూపిస్తే వెంటనే డబ్బులు ఇవ్వమని ఆదేశాలిచ్చాం. ఎక్కడైనా లోపాలుంటే పరిశీలించి కాంట్రాక్టర్లతో వెంటనే రైతులకు అద్దె డబ్బులు ఇప్పిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. – వినోద్కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వనపర్తి: అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకొనేందుకు అష్టకష్టాలు పడటంతో పాటు ఆర్థిక భారం తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా ఒకేసారి ధాన్యం విక్రయాలు పుంజుకోవడంతో సకాలంలో తూకాలు, తరలింపు అసాధ్యంగా మారింది. ధాన్యం మిల్లులు, గోదాములకు తరలించేందుకు సరిపడా వాహనాలను రవాణా కాంట్రాక్టర్లు సమకూర్చడం లేదు. రైతులే తమ సొంత, అద్దె వాహనాల్లో ధాన్యాన్ని మిల్లులకు తరలించి అన్లోడ్ చేసిన వెంటనే మిల్లర్లు ఇచ్చిన రసీదు, వేబ్రిడ్జి రసీదును కాంట్రాక్టర్కు చూపిస్తే వెంటనే డబ్బులు చెల్లించాలని రవాణా కాంట్రాక్టర్లకు అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తమకు ఇంకా బిల్లులు రాలేదంటూ.. కొందరు కాంట్రాక్టర్లు రైతులకు వాహనాల అద్దె చెల్లించడం లేదు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నెలల తరబడి సదరు కాంట్రాక్టర్ల చుట్టూ తిరిగి వాహనాల అద్దె డబ్బులను వసూలు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. ప్రస్తుత సీజన్లో అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను ఉంచలేక రైతులు సొంత, అద్దె వాహనాల్లో మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులున్న దూరం ఆధారంగా బస్తాకు రూ.8 నుంచి రూ.10 వరకు వాహనదారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా రవాణా కాంట్రాక్టర్లు చెల్లింపుల విషయంలో రైతులు, అద్దె వాహనాలు సమకూర్చిన వారిని పలుమార్లు అడిగించుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మంత్రి జూపల్లి ఇలాకాలోని వీపనగండ్ల మండలంలో ఉన్న గోవర్ధనగిరి కొనుగోలు కేంద్రం నుంచి 16, గోపల్దిన్నె నుంచి 10, కల్వరాల నుంచి 12, వీపనగండ్ల కొనుగోలు కేంద్రం నుంచి 20 ప్రైవేట్ వాహనాల్లో రైతులు తమ ధాన్యాన్ని గోదాంకు తరలించారు. పదిరోజులు గడుస్తున్నా.. నేటికీ రవాణా కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించలేదు. డబ్బులు అడిగితే తనకే ఇంకా బిల్లు రాలేదంటూ చెబుతున్నారని రైతులు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు తరలించేందుకు సకాలంలో లారీలు రావడం లేదు. చేసేది లేక గ్రామాల్లోని ట్రాక్టర్లలో మిల్లులకు తరలించాం. ధాన్యం బస్తాలను మేము తరలిస్తే అద్దె రవాణా కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేస్తున్నారు. దీంతో మేము చాలా నష్టపోతున్నాం. రైతు ఖాతాలో అద్దె జమ చేయడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. – బంగి నర్సింహ, అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘనపురం -
9 రూట్లు.. 360 వాహనాలు...
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్ వరి ధాన్యం సుమారు 3.70 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయానికి వస్తుందని అధికారులు 400పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలించేందుకు తొమ్మిది రూట్లుగా విభజించి ఒక్కో రూట్కు 40 లారీల చొప్పున 360 లారీలు అందుబాటులో ఉంచాలని టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. కానీ వారు సకాలంలో సరిపడా వాహనాలు సమకూర్చకపోవడంతో ధాన్యం కేంద్రాల్లో పేరుకుపోయి అకాల వర్షాలకు తడిసి మొలకెత్తడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సరిపడా వాహనాలు సమకూర్చాలని జిల్లా అఽధికారులు రవాణా కాంట్రాక్టర్లకు చెప్పినా స్పందన లేకపోవడంతో రైతులే ట్రాక్టర్లలో తరలించుకుంటే అద్దె చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో ముందుకొచ్చారు. కానీ అద్దెకూడా వెంటనే చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. సంతోకర విషయం ఏమిటంటే గతంతో పోలిస్తే ధాన్యం విక్రయించిన డబ్బులు మిల్లర్ ధాన్యం తీసుకున్నట్లు రసీదు ఇచ్చిన కొన్ని గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడం విశేషం. -
ధాన్యం తరలింపునకు అదనపు లారీలు
కొత్తకోట రూరల్: వరి ధాన్యం తరలింపునకు అదనంగా లారీలను సమకూర్చాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రవాణా కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన పెద్దమందడి మండలంలోని సప్తగిరి, శ్రీ భవాని శంకర ఇండస్ట్రీస్ రైస్మిల్లులను తనిఖీ చేసి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి తనిఖీ చేశారు. అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని.. ఇందుకోసం మరింత మంది హమాలీలను సమకూర్చుకోవాలని సూచించారు. లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వెంటనే అన్లోడ్ చేయాలని, గోదాముల్లో ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేయాలన్నారు. శ్రీ భవాని శంకర ఇండస్ట్రీస్ వద్ద యజమానితో మాట్లాడిన కలెక్టర్ అదనపు నిల్వ స్థలాన్ని తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు తమ ప్రైవేట్ వాహనాలను కూడా వినియోగించాలని, వరి ధాన్యం నిల్వలకు అదనపు స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రం సందర్శన.. పెద్దమందడిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇప్పటి వరకు ఎన్ని వరి సంచులు తరలించారు.. ఇంకా ఎన్ని సంచులు కొనుగోలు చేయాల్సి ఉందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ను కలిసి లారీల కొరత తీవ్రంగా ఉందని.. అదనపు లారీలు సమకూర్చాలని కోరారు. ప్రస్తుతం రవాణా ఖర్చులను తామే భరిస్తున్నామని తెలిపారు. స్పందించిన కలెక్టర్ రవాణా కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే మరిన్ని లారీలను కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే రైతులకు రవాణా ఖర్చులను కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసి ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ పాండునాయక్, ఇతర అధికారులు ఉన్నారు. -
పాలమూరే ప్రధానాస్త్రం!
అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు తెలంగాణ ఉద్యమంలో పాలమూరు వెనుకబాటు ప్రధానాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నికలు పాలమూరు ప్రాజెక్ట్ చుట్టే నడిచాయి. తొలి పర్యాయంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. పీఆర్ఎల్ఐ ప్రాజెక్ట్కు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. నీటి తరలింపునకు సంబంధించి జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్కు మార్చిన సోర్సుపై ప్రధాన రాజకీయ పక్షాల మధ్య భిన్న వాదనలు నడిచాయి. ఎట్టకేలకు 2015 జూన్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. తొలి విడతలో ఐదు రిజర్వాయర్ల (నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్) పనులు మొదలుపెట్టారు. 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ వద్ద మొదటి పంప్ను ప్రారంభించారు. అయితే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు 16 కిలోమీటర్ల టన్నెల్, 8.3 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలించాల్సి ఉంటుంది. ఇందులో టన్నెల్ పూర్తి కాగా.. 2.5 కి.మీ. మేర ఓపెన్ కెనాల్ పెండింగ్లో ఉంది. ఇక్కడ దాదాపు 15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు రిజర్వాయర్లకు నీటిని తరలించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ రెండున్నరేళ్లుగా తట్టెడు మట్టి తీయడం లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే చివరలో మిగిలిన పనుల పూర్తిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని గత జనవరిలో మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ భవన్లో మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పీఆర్ఎల్ఐ పనులు పూర్తిచేయించేందుకు బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై జూన్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మధ్యలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొనేలా.. చివరకు ముగింపు రోజున కేసీఆర్ పాల్గొనేలా భారీ బహిరంగసభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడంతో రాజకీయ సందడి నెలకొంది. మరోవైపు పాలమూరు ప్రాజెక్ట్ అస్త్రంగా తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా పోరు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉమ్మడి జిల్లా రాజకీయాలను హీటెక్కించాయి. పీఆర్ఎల్ఐతో పాటు జిల్లాలోనిఎండింగ్ ప్రాజెక్ట్లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ నేతలు వినతిపత్రాలు ఇచ్చారు. పాలమూరు పథకంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీటిని డిండి ప్రాజెక్ట్కు తరలించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందని.. తాము పోరాటం చేస్తామని.. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అడ్డుకోవాలని జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం పర్యటన సందర్భంగా జేఏసీ నేతలు ఆయనను కలిసి వినతిపత్రం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టే అవకాశం ఉండగా.. రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పోరు వచ్చే నెలలో పాదయాత్ర, బహిరంగ సభకు సన్నాహాలు ఇదే అంశంతో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఉద్యమ బాట 2027 డిసెంబర్లోపు పూర్తి చేసేలా కాంగ్రెస్ కార్యాచరణ 2 రోజుల పాటు ప్రాజెక్ట్ల సందర్శనకు సీఎం సమాయత్తం పొలిటికల్ డ్రామాలకే పరిమితమని బీజేపీ విమర్శలు బీఆర్ఎస్ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ సైతం పోటాపోటీగా అడుగులు వేస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలో మిగిలిన పెండింగ్ ప్రాజెక్ట్లపై ఇటీవల హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ వేర్వేరుగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని.. గ్రీన్చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పాలమూరులోని అన్ని ప్రాజెక్ట్ల పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు డెడ్లైన్ పెట్టినట్లు తెలిసింది. అంతేకాదు.. సీఎం స్వయంగా ఈ నెల 30, 31న లేదంటే వచ్చే నెల మూడు, నాలుగో తేదీన రెండు రోజుల పాటు పాలమూరు–రంగారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాజెక్ట్ల సందర్శనకు సమాయతమైనట్లు సమాచారం. పెండింగ్ ప్రాజెక్ట్ల పూర్తికి చర్యలను వేగిరం చేయడంతో పాటు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్లకు ఏ విధంగా అన్యాయం చేసిందనే దానిపై ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. -
రెడ్క్రాస్ సేవలు మరింత చేరువ
వనపర్తి: జిల్లాలో అధికసంఖ్యలో సభ్యత్వ నమోదు చేపట్టి రెడ్క్రాస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సభ్యత్వ నమోదు నిర్వహించగా.. కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు చురుగ్గా పాల్గొనాలని కోరారు. సమాజ సేవలో రెడ్క్రాస్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. కార్యక్రమానికి జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి డా. ప్రియాంక నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేటర్ రాజేంద్రకుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహిళా ప్రగతి.. తెలంగాణ ఉన్నతి వనపర్తి: మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన ‘మహిళా ప్రగతి – తెలంగాణ ఉన్నతి’ అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తూడి మేఘారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదిగి కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలు గ్రామీణాభివృద్ధికి వెన్నముకగా నిలుస్తున్నాయని తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. డీపీఎంలు నాగమల్లిక, కె.ప్రభాకర్, ఆనంద్ తదితరులు మహిళా సంఘాల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మహిళా శక్తిని ప్రతిబింబించాయి. డీఆర్డీఓ ఉమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ఎల్ఎన్ మాధవి, అదనపు డీఆర్డీఓ సరోజ, జెడ్ఎంఎస్ అధ్యక్షురాలు ఇందిర, జిల్లాలోని 7 మండలాల ఎంఎంఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
ఖిల్లాఘనపురం/వనపర్తి రూరల్: ప్రతిసారి సమావేశాల్లో పెద్ద జీతగాడిలా పని చేస్తామంటూ చెప్పుకొనే వారికి ఇప్పుడు రైతుల కష్టాలు కనిపించడం లేదా అని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ఖిల్లాఘనపురం మండలంలోని ఉప్పరిపల్లి, మల్కాపురం, గట్టుకాడిపల్లి, పెబ్బేరు మండలం గుమ్మడం, సూగూరు, రంగాపురం, పెబ్బేరులోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసిందని, ఆ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో యాసంగిలో 65.42 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఎందుకు రైతులను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పిన 90 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఇప్పటి వరకు 42 శాతం మాత్రమే కొనుగోలు చేశారని.. రవాణా ఏజెన్సీల నిర్లక్ష్యంతో రైతులు అరిగోస పడుతున్నారని చెప్పారు. గన్నీబ్యాగులుంటే లారీలు రావు.. లారీలు వస్తే గన్నీబ్యాగుల కొరగ.. రెండూ ఉంటే హమాలీలు రావడం లేదని ఎద్దేవా చేశారు. రైతులు పంటలు పండించడానికి పడిన కష్టం కంటే ధాన్యం అమ్ముకోవడానికి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు, ట్రక్కులు లేని వారికి రవాణా ఏజెన్సీ ఎలా ఇచ్చారో ప్రభుత్వానికి, అధికార పార్టీ నాయకులకు తెలియాలన్నారు, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తరుగు పేరిట ధాన్యంలో కోతలు విధించినా పట్టించుకునే వారు కరువయ్యారని.. అకాల వర్షానికి తడిసిన, మొలకెత్తిన ధాన్యం పూ స్థాయిలో మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఉన్న రైతువేదికలను ధాన్యం నిల్వలకు వినియోగించాలని సూచించారు. అనంతరం గట్టుకాడిపల్లి శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
అప్పులుంటే.. చంపేస్తావా!
నీ మనసు ఇంత కఠినమా నాన్నా వనపర్తి: జీవనోపాధి కోసం మామిడితోటలు లీజుకు తీసుకుని మామిడి పండ్లు విక్రయిస్తూ.. మిగతా సమయంలో తోటల సంరక్షణ చేసుకుంటూ జీవించే ఓ కుటుంబం సరైన లాభాలు లేక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలను నీటిలో సంపులో పడేసి ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న ఉదంతం ఉమ్మడి పాలమూరు జిలాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) నాలుగేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తోటల లీజు, ఇతర అవసరాల కోసం గద్వాలలో కొందరితో అప్పు చేశాడు. డోకూరులోని తన సొంత ఇంటిపై ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఇటీవల ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటి గోడలపై ఈ ఇంటిని అప్పుకింద జప్తు చేయనున్నట్లు రాయడంతో గ్రామంలో తోటివారు, బంధువులు, సన్నిహితుల ఎదుట అవమానంగా భావించాడు. ఐపీ పెట్టే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న వాహనాలు, వస్తువులను అమ్మేసి అప్పులు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా.. వడ్డీలు వసూలు చేసేవారు, ఈఎంఐలు చెల్లించాల్సిన ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లు, చేతులు కట్టేసి తోటలోని సంపులోకి తోసి తాను నివాసం ఉండే కంటైనర్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాబు 10.. పాప 8 నర్సింహులు కుమారుడు నిహాల్ దేవరకద్రలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి పూర్తిచేయగా.. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి చదవాల్సి ఉంది. అలాగే పాప సాహితీశ్రీ అదే పాఠశాలలో 7 తరగతి పూర్తిచేయగా.. ఈసారి 8వ తరగతి చదవాల్సి ఉందని బంధువులు తెలిపారు. నర్సింహులు, ఎల్లమ్మ, నిహాల్, సాహితీశ్రీ (ఫైల్) దేవరకద్ర: నర్సింహులు కుటుంబం మరణంతో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో విషాదం అలుముకుంది. ఐదు దశాబ్దాల క్రితం గద్వాల నుంచి వలస వచ్చిన నర్సింహులు, తన సోదరులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పండ్ల తోటలను లీజుకు తీసుకుని వచ్చిన లాభాలతో ఆ కుటుంబాలు గడిపేవారు. కాలక్రమంలో పండ్ల తోటలకు నష్టం రావడంతో నర్సింహులు అప్పులు పేరుకుపోయాయి. గత జూన్లో దాదాపు రూ.కోటి బాకీ పడ్డాడని డోకూరు గ్రామస్తులు నర్సింహులుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇలా చేసిన అప్పులు తీర్చలేక భార్యాబిడ్డలను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామంలోని వారి కుటుంబ సభ్యులు వాపోయారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం డోకూరుకే తెస్తుండడంతో నర్సింహులు ఇంటి వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామ శివారులోని మామిడి తోటకు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నమ్మివచ్చిన భార్య, జన్మనిచ్చిన పిల్లల్ని కడతేర్చిన తండ్రి కాళ్లు చేతులు కట్టి నీటిసంపులో పడేసి.. తానూ ఉరేసుకుని బలవన్మరణం తాను చేసిన అప్పులు వారినేం చేస్తాయోననే భయంతో ఘాతుకం కౌలు రైతు కుటుంబాన్ని చిదిమేసిన అప్పులు -
సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం
● వారం రోజుల్లో భూసేకరణ పూర్తిచేయాలి ● త్వరలో ప్రాజెక్టుల సందర్శనకు సీఎం రేవంత్రెడ్డి ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కందనూలు: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–8 పరిధిలోని వట్టెం అతిథిగృహంలో కలెక్టర్లు హేమంత కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డితో కలిసి పాలమూరు ఎత్తిపోతల, ఎంజీకేఎల్ఐ, డిండి, ఉమామహేశ్వర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్, మార్కండేయ, కర్నెతండా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతోపాటు వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ప్రాజెక్టుల వారీగా చేపట్టిన పనులు, భూ సేకరణ పురోగతిని అధికారులు వివరించారు. ముఖ్యంగా కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ల అనుబంధ పనులు, పంప్హౌజ్ల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు రెవె న్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి పనిని గడువులోగా పూర్తిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భూ సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నా రు. నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని సహించం.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి జూపల్లి అన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. పనుల నాణ్యత విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. త్వరలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని.. ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రధాన సమస్యల పరిష్కారానికి అవసరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. -
పారాహుషార్..!
● పారామెడికల్ కళాశాలల్లో అడ్డగోలుగా అడ్మిషన్లు ● అక్రమార్జనే ధ్యేయంగా అనుమతి లేని కోర్సుల్లోనూ ప్రవేశాలు ● ఇక్కడ చేరికలు.. హైదరాబాద్లో పరీక్షలు ● ఉమ్మడి జిల్లాలో 8 అనుమతులు లేని కళాశాలలు ● అప్రమత్తంగా లేకపోతే విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ఇక్కడ చేరిక.. అక్కడ పరీక్ష జిల్లాకేంద్రంలోని పలు పారామెడికల్ కళాశాలల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. వీటిలో ఎంపీహెచ్డబ్ల్యూ, ల్యాబ్టెక్నీషియన్ వంటి ఇంటర్మీడియట్ స్థాయి చిన్నపాటి కోర్సులు నిర్వహించే అవకాశం ఉంది. కానీ, కొన్ని పారామెడికల్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ ఎమ్మెల్టీ వంటి కోర్సులకు అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడి కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకుని.. హైదరాబాద్లో అనుమతులున్న కళాశాలలకు పరీక్ష ఫీజు, ప్రాక్టికల్స్ చేయించడం, సర్టిఫికెట్ ఇప్పించడం వంటివి చేయిస్తున్నారు. చివరికి నామమాత్రంగా విద్యార్థులకు కళాశాలలో తరగతులు నిర్వహించి పరీక్షలు అన్నీ కూడా హైదరాబాద్లోనే రాయిస్తున్నారు. ఇందుకు రెగ్యులర్ కళాశాలలో వసూలు చేస్తున్న మాదిరిగా రూ.వేలల్లో ఫీజులు, రికార్డులు, ప్రాక్టికల్స్ వంటి వాటికి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయా కళాశాలల్లో జరుగుతున్న తతంగం అంతా ఇంటర్మీడియట్ అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ● పాలమూరు నగరంలోని ఓ పారామెడికల్ కళాశాల నుంచి నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన విద్యార్థిని తల్లికి ఫోన్ చేసి తమ కళాశాలలో బీఎస్సీ ఎమ్మెల్టీ, ఏఎన్ఎం, జీఎన్ఎం, ఇతర డిగ్రీ స్థాయి పారామెడికల్ కోర్సులు ఉన్నాయని, ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మీ విద్యార్థినిని చేర్పించాలని కోరారు. దీంతో సదరు బాలిక తల్లి జిల్లాకేంద్రంలోని తమ బంధువులకు ఫోన్ చేసి ఆ కళాశాలలో విద్యార్థినిని చేర్పిస్తున్నట్లు తెలిపింది. అయితే బంధువులు సదరు పారామెడికల్ కళాశాలకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో అవాకై ్కంది. ● పాలమూరు నగరంలోని న్యూటౌన్ వద్ద ఉన్న ఓ పారామెడికల్ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసిన కొడంగల్కు చెందిన ఓ విద్యార్థికి ఫోన్ చేసి తమ వద్ద జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులు ఉన్నాయని వాటిలో చేరాలని చెప్పగా విద్యార్థి ఫీజు మాట్లాడుకుని వచ్చారు. అనంతరం ఫీజు తగ్గించేందుకు స్థానికంగా ఉండే మీడియాలో పనిచేసే తన బంధువును తీసుకెళ్లగా.. తమ వద్ద ఎలాంటి కోర్సులు లేవని కళాశాల సిబ్బంది బుకాయించడంతో ఖంగుతినడం సదరు విద్యార్థి వంతైంది. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అక్రమార్జనే ధ్యేయంగా.. ఉమ్మడి జిల్లాలోని కొన్ని పారామెడికల్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ ఎమ్మెల్టీతోపాటు ఇతర మెడికల్ కోర్సులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. పలు ప్రభుత్వ కళాశాలల నుంచి విద్యార్థుల వివరాలు సేకరించి తమ వద్ద వివిధ కోర్సులు ఉన్నాయని నమ్మబలుకుతూ.. అడ్మిషన్లు తీసుకోవాలని తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది నుంచి విద్యార్థుల వివరాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం పారామెడికల్ కళాశాలల్లో ఎస్సెస్సీ తర్వాత కేవలం ఎంపీహెచ్డబ్ల్యూ, ఎమ్మెల్టీ, ఎక్స్రే టెక్నీషియన్ వంటి కోర్సులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కళాశాలల్లో నిర్వహించాల్సిన కోర్సులను పారామెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించడం విస్మయానికి గురిచేస్తుంది. అన్నీ తెలిసినా.. ఇంటర్మీడియట్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇప్పటికే కొన్ని కళాశాలల్లో పదుల సంఖ్యలో అడ్మిషన్లు అయ్యాయి. జిల్లాకేంద్రంలోని పలు కళాశాలల్లో ఈ వ్యవహారం పెద్దఎత్తున నడుస్తుంది. రికార్డుల్లో ఎక్కువ మంది విద్యార్థుల పేర్లు లేకుండా.. ఎవరికి అనుమానం రాకుండా వీటిని పలు కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 74 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వీటిలో కొన్ని కళాశాలలు రెన్యువల్, ఫైర్సేఫ్టీ వంటి ఇబ్బందుల కారణంగా పూర్తిస్థాయిలో అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రస్తుతం అడ్మిషన్లు తీసుకుంటున్నారు. గతేడాది పూర్తిస్థాయిలో అనుమతులు లేని ఓ కళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులను ఎంవీఎస్ కళాశాల నుంచి పరీక్షలు రాయించారు. ప్రతి సంవత్సరం జిల్లాలోని ఏదో ఒక కళాశాలకు అనుమతులు రాకపోవడం, విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల నుంచి పరీక్షలు రాయించడం పరిపాటిగా మారింది. దీంతో విద్యార్థులు త్రీవ ఇబ్బందుల పాలవుతున్నారు. సంబంధిత అధికారులు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీటిని గుర్తిస్తే అడ్మిషన్లు తీసుకోకుండా అడ్డుకోవచ్చని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే విద్యా శాఖ అధికారులు మాత్రం వచ్చేనెలలో తనిఖీలు చేపడుతామని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో విద్యార్థులు అప్రమత్తంగా లేకపోతే చివరికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో అనుమతులు లేకుండా, సంబంధం లేని కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్న కళాశాలలను గుర్తించి తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ఈ నెల 31 తర్వాత ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తాం. విద్యార్థులు కళాశాలలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే అడ్మిషన్లు తీసుకోవాలి. – రమణి, డీఐఈఓ -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
రాజోళి/ గట్టు: లంచం తీసుకుంటూ ప్రభుత్వ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడిన ఘటన వడ్డేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న 4.14 ఎకరాల భూమిని సర్వే చేయాలని సర్వేయర్ బ్రహ్మయ్యను సంప్రదించాడు. దీనికి గాను సర్వేయర్ ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. అడ్వాన్సుగా రూ.5 వేలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో.. విసిగిపోయిన రైతు మహబూబ్నగర్లో ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో మంగళవారం శాంతిగనర్లోని తహసీల్దార్ కార్యాలయంలో సదరు రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు సర్వేయర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఏసీబీ అధికారులు గట్టులోని సర్వేయర్ బ్రహ్మయ్య ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. రైతు దగ్గర నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వ్యవహారంపై ఏసీబీ అధికారులు నేరుగా గట్టులోని బ్రహ్మయ్య ఇంటికి చేరుకుని తనిఖీలు చేశారు. -
మిల్లుల్లో ధాన్యం త్వరగా దించుకోవాలి
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరుకునన్న వరి ధాన్యాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా దించుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. మంగళవారం శ్రీరంగాపురం మండల కేంద్రంతో పాటు కంభాళాపురం, పెబ్బేరు పరిసరాలు, రంగాపూర్లోని రైస్మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం అన్లోడింగ్, అదనపు ధాన్యం నిల్వలను పరిశీలించారు. మిల్లుల ఆవరణలో గోదాములు, స్థలాలను పరిశీలించి రాబోయే రోజుల్లో ధాన్యం నిల్వకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా హమాలీల సంఖ్య పెంచి ధాన్యాన్ని త్వరగా దించుకోవాలన్నారు. తూకంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించాలని, రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట తహసీల్దార్లు వరలక్ష్మి, సత్యనారాయణరెడ్డి, ఆర్ఐలు రాఘవేందరావు, సింగిల్విండో సిబ్బంది, రైస్మిల్లర్లు ఉన్నారు. -
క్యాన్సర్.. కలకలం
జిల్లాలో 404 కేసులు నమోదు ● బాధితుల్లో అత్యధికులు మహిళలే.. ● ఆహారపు అలవాట్లే ప్రధాన సమస్య అంటున్న నిపుణులు ● జిల్లా ఆస్పత్రిలో డే కేర్ కీమో థెరపీ సేవలు జిల్లాలో నమోదతువున్న కేసులు.. బ్రెస్ట్, మౌత్, సర్వికల్, కొలన్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు.. గుట్కా, కై నీ, మద్యం, పొగాకు సేవించడం, నిద్రిలేమి, పాకెట్ ఫుడ్స్, ఎక్కువగా వాడిన నూనె, ఆకుకూరగాయలపై పురుగు మందుల ప్రభావం, అసాధారణ నొప్పులు, రక్తస్రావం, దీర్ఘకాలిక ఆయసం, దగ్గు, ఆకస్మికంగా బరువు తగ్గడంలాంటివి క్యాన్సర్ లక్షణాలుగా చెప్పవచ్చు. స్క్రీనింగ్ తర్వాతే నిర్ధారణ అవుతుంది. స్థానిక డే కేర్ క్యాన్సర్ సెంటర్లో అందించే సేవలు కీమో థెరపీ, ఇమ్యూనో థెరపీ/టార్గెటెడ్ థెరపీ, రక్త మార్పిడి, ఇంజెక్షన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్, నిర్ధారణ పరీక్షలు, బయాప్సీ, చిన్న శస్త్రచికిత్సలు, నొప్పి నివారణ, పల్లియేటివ్ కేర్, పోషకాహార సలహాలు, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ సేవలు, చికిత్స తర్వాత పరిశీలన, ఫాలోఅప్, అత్యవసర వైద్య సాయం వనపర్తి: జిల్లాలో ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి, వ్యాధి సమాచార, పరిశోధన కేంద్రాలిచ్చే నివేదికలతో వైద్య, ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని చిన్న జిల్లాల్లో ఒకటైన వనపర్తిలో ప్రస్తుతం 404 వివిధ రకాల క్యాన్సర్ కేసులు నమోదు కావడం శోచనీయం. వీరిలో కొందరికి స్థానిక జీజీహెచ్లో డే కేర్ కీమో థెరపీ సేవలు అందిస్తుండగా.. మరికొందరు అందుబాటులోని ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు వెచ్చించి వైద్యం తీసు‘కొంటున్నారు’. మహిళలే అధికం.. జిల్లాలో నమోదైన క్యాన్సర్ కేసుల్లో 80 శాతం మహిళలే ఉండటం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 404 కేసులు నమోదు కాగా.. వారిలో 322 మహిళలు, 82 మంది పురుషులు ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించిన లెక్కలతో స్పష్టమవుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ మహిళలే అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని.. నివారణ కోసం భారత ప్రభుత్వం ఇటీవల 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ వ్యాక్సిన్ పెళ్లి తర్వాత వేసుకుంటే అంతగా పని చేయదని నిపుణులు చెబుతున్నారు. అందుకే వైద్యశాఖ అధికారులు పాఠశాల స్థాయిలోనే బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమా..? మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ఎక్కువగా ఎసిడిక్ ఆహార పదార్థాలను తీసుకోవడంతోనే క్యాన్సర్ కణాలు పుట్టుకొస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల్లో ఎక్కువగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందని, వాటితోనే ఎక్కువగా ప్రాణనష్టం కలుగుతునట్లు అధికారిక లెక్కలు సైతం వెల్లడిస్తున్నాయి. ప్రాథమిక దశలో గుర్తిస్తే మేలు.. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశ అంటే స్టేజ్–1, స్టేజ్–2, స్టేజ్–3లో గుర్తించి సరైన వైద్యం తీసుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చు. ఆలస్యంగా గుర్తించడంతో సమస్య జఠిలం కావచ్చు. ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. – డా. దయాకర్రావు, సర్జరీ అంకాలజీస్ట్, యశోద ఆస్పత్రి రోగులకు సేవలు అందిస్తున్నాం.. రోగి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఇంటి దగ్గర ఉంటూనే ఉదయం ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకొని వెళ్లవచ్చు. జీజీహెచ్తో పాటు వైద్య కళాశాలలోనూ కీమో థెరపీ, పాలియోటివ్ కేర్ సేవలు అందిస్తున్నాం. గ్రామీణప్రాంత పేద రోగులకు డేకేర్ సెంటర్ ప్రయోజనకర సేవలు అందిస్తోంది. – రాంచందర్రావు, పీఓ, క్యాన్సర్ డే కేర్ సెంటర్, వనపర్తి ●గోపాల్పేటలో 76 కేసులు.. జిల్లాలో అత్యధికంగా గోపాల్పేట పీహెచ్సీ పరిధిలో 76 కేసులు, రెండోస్థానంలో పెద్దమందడి పీహెచ్సీ పరిధిలో 39 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కమాలోద్దీన్పూర్ పీహెచ్సీ పరిఽధిలో 5 కేసులు నమోదయ్యాయి. ఎన్సీడీసీ ప్రోగ్రాం టెస్టులతో క్యాన్సర్ లక్షణాలున్న వారిని బయాప్సీ టెస్టులకు సిఫారస్ చేసి రోగులను గుర్తించి డే కేర్ సెంటర్లో వైద్యసేవలందిస్తున్నారు. -
పెంచిన ఇంధన ధరలు తగ్గించే వరకు ఉద్యమం
వనపర్తి: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే వరకు కాంగ్రెస్పార్టీ ప్రజల పక్షాన ఉద్యమం కొనసాగిస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస శ్రేణులు ఎద్దులబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్పార్టీ సమర్థవంతంగా పోషిస్తోందని, ధరల పెంపు దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్నామని చెప్పడం సరైంది కాదన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించాల్సిన నాయకులు రాజకీయ ప్రయోజనాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలను పట్టించుకోకుండా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రూ.లక్షల కోట్ల అప్పులు చేస్తూ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తోందని ఆరోపించారు. ఇలాగే ధరలు పెరిగితే భవిష్యత్లో ఎద్దుల బండ్లు, గుర్రపుబండ్లు, సైకిళ్ల వినియోగం పెరిగే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజల కోసం పనిచేసినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, కాంగ్రెస్పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్రెడ్డి, తిరుపతయ్య, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, కౌన్సిలర్లు ధనలక్ష్మి, మహేశ్వరి, విజయలక్ష్మి, పార్టీ అధికార ప్రతినిధులు శరవంద, కోళ్ల వెంకటేష్, ఆదిత్య పాల్గొన్నారు. -
అన్నదాత.. అరిగోస
వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్: జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డులో సుమారు 20 వేల బస్తాల వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఆదివారం ఉదయం తడిసిన ధాన్యాన్ని ఆరబోయలేక, తూకం చేసిన సంచులను నీటిలోంచి తీసి ఆరబెట్టలేక రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణానాతీతం. ఏ రైతును పలుకరించినా మార్కెట్కు ధాన్యం తెచ్చి 60 రోజులు అవుతుందని.. కొనుగోలు పూర్తి కాలేదని చెప్పడం కనిపించింది. రోజు అధికారులు సందర్శించి కొనుగోలు చేయాలని చెబుతారేగాని.. ఎక్కడికి తరలించాలనే ముందుచూపు లేక తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడిసిన తర్వాత అధికారులు వచ్చి మార్కెట్యార్డులో ఉన్న షెడ్డులోకి తరలిస్తామని చెబుతున్నారు. ఇదే పని నాలుగు రోజుల ముందు చేసి ఉంటే ధాన్యం తడిసేది కాదని అంటున్నారు. ● ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సింగిల్విండో, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. రోజు సాయంత్రం అయిందంటే చాలు ఈదురు గాలులు, పిడుగులు, అకాల వర్షాలకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం బస్తాలను వేగంగా గోదాంలకు తరలించాలని వేడుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నీటిలోనే తూకం చేసిన వరి ధాన్యం బస్తాలు -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
వనపర్తి రూరల్: రైతులు ఆందోళన చెందొద్దని.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. మండలంలోని పెద్దగూడెం గ్రామ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిందని ఆదివారం రైతులు ఆందోళన చేస్తుండగా విషయం తెలుసుకున్న ఆయన అక్కడకు చేరుకొని వారితో మాట్లాడారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్నిరైతులకు నష్టం కలగకుండా నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. వర్ష సూచన ఉన్నందున కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రభుత్వం రైతుల పక్షాన ఉటుందని.. కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను కొంటామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్రెడ్డి, ఎస్ఐ హృశికేష్, సర్పంచ్ పుష్పలత, ఏపీఎం బుచ్చన్న, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రేపు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష కందనూలు: నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కీలక సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పాడి పరిశ్రమ, క్రీడలు, యువజనశాఖల మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డా.మల్లు రవి, ఎమ్మెల్సీలతో పాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పనుల పురోగతి, భూసేకరణ సమస్యలు, పెండింగ్ పనులు, పునరావాసం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నేటి నుంచి డీఎడ్ పరీక్షలు వనపర్తిటౌన్: జిల్లాలో డీఎడ్ ప్రథమ సంవత్సర పరీక్షలు సోమవారం నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఏసీజీఈ గణేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 8:30 గంటల వరకు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. -
ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తం
వనపర్తి: అధికార, పాలకవర్గం నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ధాన్యం విక్రయానికి రైతులు అరిగోసపడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం ఆయన స్థానిక నాయకులతో కలిసి స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తూకం చేసిన ధాన్యం సకాలంలో తరలించి ఉంటే తడిసిపోయేదా అని ప్రశ్నించారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల సాగు సమయంలో యూరియా కోసం రైతులు వరుసలో నిలబడాల్సి వస్తోందన్నారు. జిల్లాలో వరి కొనుగోళ్లు ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు కొన్ని గ్రామాలకు ఒక్క లారీ కూడా వెళ్లని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక లేకనే ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాహనాలు లేని వారికి, డిఫాల్టర్ మిల్లర్లకు అధికారులు ధాన్యం తరలింపు బాద్యతలు అప్పగించడంతో కొనుగోలు కేంద్రాల నుంచి సకాలంలో ధాన్యం మిల్లులకు వెళ్లడం లేదని, చేసేది లేక రైతులు సొంత ట్రాక్టర్లలో తూకం చేసిన ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి సుమారు రూ.120 కోట్ల మేర బకాయి ఉన్న శ్రీరంగాపూర్కు చెందిన ఓ మిల్లర్కు అధికారులు రవాణా బాధ్యతలు ఎలా అప్పగించాలని ప్రశ్నించారు. కొన్ని మిల్లులకు 90 శాతం ధాన్యం కేటాయింపులు.. ప్రభుత్వ అనుబంధంతో రైస్మిల్లులు నడిపిస్తున్న కొందరికి ప్రతి సీజన్లో 90 శాతం ధాన్యం కేటాయింపులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని.. నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటే కేటాయింపుల్లో కాంగ్రెస్ అనుబంధంగా ఉండే మిల్లర్లకు అగ్రభాగం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కొందరు రాజకీయ బ్రోకర్లు, మిల్లర్లు, అధికారులు కు మ్మకై ్క ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలు అందరికీ సమానంగా అమలు చేయా లని, తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పౌరసరఫరాలశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. శ్రీధర్ హత్య కేసు ఏమైంది..? చిన్నంబావి మండలం బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి హత్య కేసును రెండేళ్లు పూర్తయినా.. ఎందుకు ఛేదించడం లేదని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. పోలీసు అఽధికారులు మారుతున్నారే తప్ప విచారణ కొలిక్కి రావటం లేదని విమర్శించారు. సహచర మంత్రిని కాపాడేందుకు సీఎం ఈ వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తుందన్నారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ పలుస రమేష్గౌడ్, నాయకులు లక్ష్మారెడ్డి, మాణిక్యం, నందిమళ్ల అశోక్, జోహెబ్, రాము తదితరులు ఉన్నారు. అధికారులు, పాలకల నిర్లక్ష్యంతోనే రైతులకు అవస్థలు -
యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు..
వనపర్తి: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి అనసూయ, ఇతర సహచర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎస్పీ సునీతారెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. లారీల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తడానికి వీలులేదని, రవాణాశాఖ అధికారులు చొరవ తీసుకొని ఖాళీగా ఉన్న లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లను ధాన్యం తరలించడానికి మళ్లించాలన్నారు. అదేవిధంగా ధాన్యం అన్లోడ్ చేయడానికి గోదాంలలో సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి 30వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు ప్రణాళిక ప్రకారం ఘనంగా నిర్వహించాలని కోరారు. నిర్దేశించిన విధంగా రోజువారి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్ఓ కాశీ విశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సాగు తీరు మారేనా?
మూస పద్ధతిలోనే పంటల సాగు వనపర్తి: నేలల స్వభావం, వాతావరణం, మార్కెటింగ్, స్థానిక డిమాండ్ ఆధారంగా పంటల ఉత్పత్తులు, నీటి లభ్యత తదితర పరిస్థితుల ఆధారంగా వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు రైతులు వివిధ రకాల పంటలు సాగుచేయడం ఆధునిక వ్యవసాయంగా చెప్పవచ్చు. కానీ జిల్లాలో దశాబ్ద కాలంగా మూస పద్ధతిలో ఒకేరకమైన పంటలు సాగు చేస్తుండటంతో మార్కెటింగ్, కూలీలు, ఎరువుల కోసం అవస్థలు తదితర ఘటనలు ఏటా పెరుగుతున్నాయి. ప్రస్తుత యాసంగిలో వరి ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులు, రవాణాకు సొంత ట్రాక్టర్లను సైతం మిల్లుల వద్ద వరుసలో నిలబెట్టి రోజుల తరబడి ధాన్యం వద్దనే పడిగాపులు పడాల్సిన దుస్థితిని చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2.35 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే.. పండ్ల తోటలు, అక్కడక్కడ ఆయిల్పాం, చెరుకు మినహా.. సుమారు 1.95 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. దీంతో ప్రస్తుత యాసంగిలోనే సుమారు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం విక్రయానికి వస్తుందని అధికారుల అంచనా. కాగా 40 రోజుల్లో సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ కొనుగోలు చేసింది. మరో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో వరి దిగుబడులు వచ్చినట్లు అధికారుల లెక్కలతో స్పష్టమవుతోంది. కాగా పప్పు దినుసులు, ఆకు, కూరగాయలు, నూనెగింజల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ కర్నూలు, బెంగుళూరు నుంచి కూరగాయాలు జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. కనీసం జిల్లాకు సరిపడా ఆకు కూరగాయలు సైతం ఇక్కడ పండించడం లేదు. పంటల వైవిద్యాన్ని పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నా.. అనాసక్తే చూపుతున్నారు. పంటలు 2021–22 2022–23 2023–24 2024–25 2025–26 జొన్న 1,868 1,455 776 1,933 1298 మొక్కజొన్న 11,631 12,077 11,111 9,054 4,100 కంది 13,890 6,185 3,954 6,791 5,998 పెసర 226 58 5 47 69 మినుములు 651 227 399 1,044 1,206 వేరుశనగకు డిమాండ్.. జిల్లాలో పండించిన వేరుశనగ (పల్లీ)కి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇందుకు కారణం ఇక్కడి వేరుశనగలో అఫ్లటాక్సిన్ అనే శిలీంద్రం లేకపోవడంతో ఎక్కువ కాలం నిల్వ ఉండటమే గాకుండా రంగు, రుచి మారదు. రెండేళ్ల కిందటి వరకు ఈ ప్రాంతంలో పండించిన వేరుశనగను యూరప్ దేశాలకు ఎగుమతి చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత నీటి లభ్యత పెరగడంతో మెట్ట పంటలు సాగుచేసే పొలాలను రైతులు వరి సాగుకు అనుగుణంగా మార్చడంతో ఏటా మెట్ట పంటల సాగు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం మొక్కజొక్క, పత్తి, కంది, పెసర, శనగ, మినుము సాగు చాలా వరకు తగ్గిపోయింది. పంటల వైవిధ్యంపై రైతుల అనాసక్తి ఏటా తగ్గుతున్న మెట్ట పంటలు, కూరగాయల సాగు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంతోనైనాప్రయోజనం చేకూరేనా? ఏటా వానాకాలంలో మెట్ట పంటల సాగు ఇలా.. (ఎకరాల్లో..) -
జూరాల పూడి‘నది’
గద్వాల: కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి, కోయిల్సాగర్తోపాటు నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచే నీరు విడుదల అవుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల జూరాల జలాశయం ప్రస్తుతం బురదతో పూడుకుపోయింది. ఫలితంగా జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయి.. రబీ సీజన్లో సాగు, తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూరాల జలాశయంలో పూడిక తీసేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా జలాశయంలో ఎంతమేర బురద పేరుకుపోయింది. ఎన్నిటీఎంసీల నీటినిల్వ సామర్థ్యం తగ్గిందనే లెక్కలు వేశారు. జలాశయంలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు సుమారు రూ.312 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించి నివేదికను మూడు నెలల కిందట ప్రభుత్వానికి సమర్పించారు. 2012 నాటికే.. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణాబేసిన్లో నిర్మించిన జూరాల ప్రాజెక్టులో 2012 సంవత్సరం నాటికే 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు, ఆ తర్వాత బురద పేరుకునేందుకు సరిపడా స్థలం కూడా లేకపోవడంతో వరదల సమయంలో నీటితోపాటు బురద సైతం దిగువకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు ఉన్న క్రస్టుగేట్లలో పెద్దఎత్తున బురద పేరుకుపోయి గేట్లు, ఇనుప రోపులకు నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు. జూరాల ప్రాజెక్టు జలాశయం 1,045 అడుగులు.. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు (1,045 అడుగులు) కాగా.. ఇందులో ప్రస్తుతం 2 టీఎంసీలపైనే బురద పేరుకుపోయింది. దీనిపై ప్రభుత్వం పలుమార్లు సర్వే చేయించగా.. సుమారు 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు అధికారులు లెక్క తేల్చారు. అంటే జలాశయం సామర్థ్యం 7.5 టీఎంసీలకు కుదించుకుపోయినట్లయింది. జలాశయంలో కష్టసాధ్యంగా పూడికతీత వ్యవహారం 2.30 టీఎంసీల మేర పేరుకుపోయిన బురద పలుమార్లు సర్వేలు.. రూ.312.77 కోట్ల అంచనా వ్యయం నివేదిక అందజేసిన సాగునీటి పారుదల శాఖ అంతర్గత చర్చలో అసాధ్యమనే అధికారుల అభిప్రాయం రాళ్లతో కూడినది కావడంతో.. సాధారణంగా జలాశయంలో బురద తొలగించిన అనంతరం బయటకు వచ్చే ఇసుక సుమారు 20– 30 శాతం మేర ఉంటుందని అధికారుల అంచనా. అయితే కృష్ణాబేసిన్ సహజ స్వరూపం రాళ్లతో కూడినది కావడంతో ఇసుక మేట్లు అనుకున్నంత స్థాయిలో ఏర్పడవు. అదే తుంగభద్ర నది సహజ స్వరూపం అధిక భాగం ఇసుకతో కూడుకున్నదై ఉంటుంది. దీంతో తుంగభద్ర బేసిన్లో ఏర్పడే ఇసుకమేట్లు కృష్ణాబేసిన్లో ఏర్పడవని అధికారులు తేల్చారు. ఏప్రిల్ చివరి వారంలో హైదరాబాద్లో ఈఎన్సీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 7 శాతం ఇసుక వస్తే బురద తొలగించేందుకు ఏజెన్సీలు ముందుకు రావని, దీంతో జూరాలలో బురద తొలగింపు అసాధ్యమైన పని అని సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వానిదే నిర్ణయం.. జూరాల ప్రాజెక్టులో సుమారు 2 టీఎంసీలకు పైనే బురద పేరుకుపోయినట్లు సర్వేలో తేలింది. ఈ క్రమంలో ఇసుకను తీసుకుని బురద తొలగించేందుకు పనులు దక్కించుకునే ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాలని తుది నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి మూడు నెలల కిందట పంపించాం. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. – జుబేర్, జూరాల డ్యాం ఈఈ -
ఈదురుగాలుల బీభత్సం
● నేలకొరిగిన వృక్షాలు.. తెగిన విద్యుత్ తీగలు ● స్తంభించిన రాకపోకలు మదనాపురం/వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్ /ఆత్మకూర్/అమరచింత/ పాన్గల్/ గోపాల్పేట/ ఖిల్లాఘనపురం: జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మదనాపురం – కొత్తకోట ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూర్, కొత్తకోట వైపు వెళ్లాల్సిన వందలాది వాహనాలు, బస్సులు, అత్యవసర అంబులెన్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్తకోటలో భారీ వేప చెట్లు, చెట్ల కొమ్మలు రోడ్డుకు పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై, రోడ్డుపై పడడంతో రాకపోకలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. స్థానికులు గుమిగూడి ప్రధాన రహదారిపై చెట్లను తొలగించారు. తడిసిన ధాన్యం.. వనపర్తి మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డులో వరి ధాన్యం తడిసిపోయింది. టారాలిన్లు కప్పినా అడుగున వర్షపునీరు నిలిచి తడిసి ముద్దవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరంగాపురం, పెబ్బేరుతో పాటు ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఽకొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఈదురుగాలులకు చందాపూర్ రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. ● అమరచింత–ఆత్మకూర్ మధ్యలో చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూర్ గాంధీచౌక్లో వర్షపునీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ● గోపాల్పేట మండలంలో పొలికెపాడు– తూడుకుర్తి, గోపాల్పేట – చాకల్పల్లి రహదారులపై చెట్లు విరిగి రోడ్డుపై పడిపోయాయి. ● పాన్గల్లో ప్రధాన రహదారిపై చెట్లు నెలకొరగగా.. నిరంజన్ ఇంటి పైకప్పు కూలిపడగా.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పినా అక్కడక్కడా తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ● ఖిల్లాఘనపురం మండలంలోని సోళీపురం నుంచి కోతులకుంట తండాకు వెళ్లే దారిలో 20 స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు పడిపోయాయి. దీంతో తండాలో అంధకారం నెలకొంది. మామిడిమాడలో తెలుగు శేషమ్మకు చెందిన రేకుల ఇంటి కప్పు ఈదురు గాలులకు ఎగిరిపోయింది. పిడుగు పాటుతో ఎద్దు మృతి.. కొత్తకోట మండలంలోని కనిమెట్టలో పిడుగు పాటుకు గురై రైతు బోయ కృష్ణయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. అదేవిధంగా కొత్తకోటలోని మాంసం మార్కెట్ సమీపంలో, పాత జూనియర్ కళాశాల సమీపంలోని ప్రధాన రోడ్డుపై భారీ వేపచెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శంకరమ్మపేటలో పిడుగుపాటు మదనాపురం మండలంలోని శంకరమ్మపేటలో బోయ సురేష్ ఇంటి ఎదుట ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. -
ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. నైపుణ్యాలు పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక యువజన, క్రీడా వారోత్సవాల సందర్భంగా మే 1వ తేదీన మహబూబ్నగర్లో జాబ్మేళా నిర్వహించగా.. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరై వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 17 మందికి నియామక పత్రాలు అందజేశారు. అలాగే ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక క్రీడా, యువజన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఫుట్బాల్, వాలీబాల్, హాకీ తదితర క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలెక్టర్, ఎమ్మెల్యే ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకర జీవన విధానానికి క్రీడలు ఎంతో అవసరమని, ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. యు వత క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటకశాఖకు సంబంధించిన బ్రాండింగ్ కిట్లను కలెక్టర్, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్రెడ్డి, ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
శిక్షలతోనే నేరాల నియంత్రణ
వనపర్తి: సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సమర్పణతో కోర్టుల్లో శిక్షల శాతాన్ని పెంచడం పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని, దీంతో ప్రజల్లో భద్రతాభావం, పోలీసులపై నమ్మకం, గౌరవం మరింత రెట్టింపు అవుతాయని అదనపు ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డీసీఆర్బీ అధికారులు, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని.. అనవసరంగా కేసులు పెండింగ్లో ఉండకుండా కోర్టు డ్యూటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కేసు పూర్తయ్యే వరకు అవసరమైన సాక్ష్యాలు, పత్రాలు, వాంగ్మూలాలు సమయానికి కోర్టుకు చేరేలా చూడడం బాధ్యతని తెలిపారు. అదేవిధంగా కోర్టు సమాచారం, విచారణకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎస్సైలకు తెలియజేయాలని, పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు, సమన్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన అమలు చేయాలన్నారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో పనిచేస్తేనే కోర్టులో కేసులు బలపడతాయని తెలిపారు. కేసులకు సంబంధించిన పత్రాలు, సాక్ష్యాలు, సాక్షుల హాజరు విషయంలో ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. ప్రతి కేసును బాధ్యతగా తీసుకొని సమగ్రంగా కోర్టులో ప్రవేశపెడితే శిక్షల శాతం గణనీయంగా పెరుగుతుందన్నారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, ఐటీ కోర్ సిబ్బంది గోవింద్, రవీందర్బాబు, డీసీఆర్బీ సిబ్బంది వెంకటన్నగౌడ్, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల కోర్టు డ్యూటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లగణన గడువులోగా పూర్తికావాలి : కలెక్టర్
వనపర్తి: జనగణన–2027లో భాగంగా ఇళ్లగణన ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి చార్జ్ అధికారులు, అదనపు చార్జ్ అధికారులు, సూపర్వైజర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చార్జ్ అధికారులు ఎన్యూమరేటర్లతో సమన్వయం చేసుకుంటూ ఇళ్లగణన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి సర్వే ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. ఇళ్లగణనలో ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా ఎన్యూమరేటర్లు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇళ్లగణన జూన్ 9లోగా పూర్తి చేయాలని కోరారు. సెన్సెస్ ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన కార్యక్రమమని.. అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, సైన్న్స్ అధికారి శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గణప సముద్రం నిర్వాసితులకు పరిహారం ఖిల్లాఘనపురం: మండలంలోని గణప సముద్రం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఎట్టకేలకు పరిహారం విడుదల చేసింది. మొత్తం 388 ఎకరాలకుగాను రూ.42,13,74,661 విడుదలైనట్లు ఖిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ క్యామ నవనీత, సింగిల్విండో చైర్మన్ కె.మురళీధర్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు టి.సాయిచరణ్రెడ్డి తెలిపారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయినట్లు చెప్పారు. నిధుల విడుదల సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రైతులకు ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిని నిరంతరం కలిసి నిధుల విడుదలకు కృషి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, పెద్దలు ఆగారం ప్రకాష్, క్యామ రాజు, గంజాయి రమేష్, నారాయణ, లింగస్వామి, శ్రీరాములు, రజినీకాంత్, నరేష్, బుచ్చిరెడ్డి, యాదగిరి, ముజాహిద్, హజీం, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం సరికాదు ఆత్మకూర్: వార్డు అధికారులు, సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని పుర కమిషనర్ చికినె శశిధర్ హెచ్చరించారు. శనివారం స్థానిక పుర కార్యాలయంలో వార్డు అధికారులు, మెప్మా ఆర్పీలు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం వార్డుల్లో పర్యటించి ఇంటి, కొళాయి పన్నులు వసూలు చేయాలని, తడి, పొడిచెత్త వేర్వేరుగా ఇచ్చే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొందరు చెత్తను రోడ్లు, డ్రైనేజీల్లో పారబోస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీంలో అర్హులను గుర్తించి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. స్వచ్ఛతలో పారుశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని.. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వాటర్మెన్లు నిత్యం అందుబాటులో ఉండి తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, స్థానికుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
చేయూత.. పరిశీలన
కొనసాగుతున్న పింఛన్దారుల వివరాల నమోదు ● మూడు నెలలకోసారి ముఖచిత్రాల నమోదు ● జిల్లాలో 70 వేల పైచిలుకు లబ్ధిదారులు ● పురపాలికల్లో వార్డు అధికారులు, గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ●చేయూత యాప్లో నమోదు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయూత పింఛన్దారుల వివరాలను చేయూత యాప్లో నమోదు చేస్తున్నాం. ఈ విషయాన్ని ముందస్తుగానే పట్టణంలోని అన్ని వార్డుల్లో టాం టాం వేయించాం. నడవలేని, మంచానికే పరిమితమైన వారి ఇళ్లకు వార్డు అధికారులు వెళ్లి నమోదు చేసుకుంటున్నారు. నెలాఖరు నాటికి వివరాల నమోదు పూర్తిచేస్తాం. – నూరుల్ నదీం, పుర కమిషనర్, అమరచింత ముందస్తు సమాచారం ఇస్తున్నాం.. చేయూత యాప్లో పింఛన్దారుల వివరాల నమోదు విషయాన్ని గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది ద్వారా ముందస్తుగా సమాచారం ఇస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరీష్ నమోదు చేసుకుంటున్నారు. వివరాలు నమోదు చేసుకోకపోతే వచ్చే నెల పింఛన్ రాదనే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేస్తూ నమోదును వేగవంతంగా చేపడుతున్నాం. – శ్రీనివాసులు, ఎంపీడీఓ, అమరచింత వచ్చే నెల 15 వరకు.. చేయూత పింఛన్ లబ్ధిదారుల వివరాలను చేయూత యాప్లో నమోదు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా వచ్చే నెల 15 వరకు నమోదు కార్యక్రమం కొనసాగనుంది. నమోదు ప్రక్రియ ఇకపై ప్రతి మూడు నెలలకు ఓ మారు ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలిసింది. – ఉమాదేవీ, డీఆర్డీఓ అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం నుంచి కొత్తగా చేయూత పింఛన్ మంజూరుకు శ్రీకారం చుట్టడమే కాకుండా ప్రస్తుత లబ్ధిదారుల వివరాలతో పాటు వారి ఐరిష్ను నమోదు చేసుకునే కార్యక్రమం చేపట్టింది. జిల్లాలోని అన్ని గ్రామాలతో పాటు పుర కేంద్రాల్లో మూడురోజులుగా పింఛన్దారుల వివరాలను ప్రత్యేక చేయూత యాప్లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుడి ఆధార్ నంబర్తో పాటు అతని కళ్లు, ముఖం ఫొటో క్యాప్చర్ చేస్తూ యాప్లో నమోదు చేసుకుంటున్నారు. సకాలంలో యాప్లో వివరాలు నమోదు చేసుకోకుంటే వారి పింఛన్ రద్దయ్యే అవకాశం ఉంది. కూలి పనులతో పాటు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన వారిని వారి కుటుంబ సభ్యులు స్వగ్రామానికి పిలిపించుకొని అధికారుల వద్ద వివరాలను నమోదు చేయిస్తున్నారు. ● జిల్లాలోని 255 గ్రామపంచాయతీలలో చేయూత నమోదు కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. జూన్ 15 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించడంతో ప్రతి లబ్ధిదారు తమ వివరాలతో పాటు అధికారులు అడిగిన సమాచారాన్ని అందిస్తున్నారు. జిల్లాలో చేయూత పింఛన్ పొందుతున్న వారి సంఖ్య 70 వేల పైచిలుకు ఉందని డీఆర్డీఓ అధికారులు వెల్లడిస్తున్నారు. చాలా గ్రామాల్లో లబ్ధిదారులు చనిపోయినా.. అతడి పేరుపై కుటుంబ సభ్యులు నేటికీ బ్యాంకు, పోస్టాఫీసు ద్వారా పింఛన్ పొందుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేయూత యాప్లో లబ్ధిదారుల నమోదుకు శ్రీకారం చుట్టింది. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అక్కడే ఐరిష్ నమోదు చేస్తుండటంతో ఇకపై మృతిచెందిన వారి పింఛన్లు నిలిచిపోవడం ఖాయమంటున్నారు. దీంతో అర్హత కలిగి నేటికి పింఛన్ తీసుకోలేని వారికి ఇది ఒక అవకాశంగా మారింది. వృద్ధాప్య 27,195 ఒంటరి మహిళలు 2,521 బీడీ కార్మికులు 963 చేనేత 564 పెబ్బేరు 1,592 అమరచింత 2,020 డయాలసీస్ 104 పైలేరియా 5 గీత కార్మికులు 389 ఆత్మకూర్ 1,237 మృతిచెందిన వారిని తొలగింపునకే.. -
ధాన్యం దించేందుకు సహకరించండి
వీపనగండ్ల: వరి ధాన్యాన్ని గోదాంలో దించేందుకు రైతులు తమవంతు సహకారం అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాంను ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని గోదాంలో దించేందుకు అదనంగా హమాలీలను ఏర్పాటు చేస్తున్నామని.. కొనుగోలు కేంద్రాల నుంచి ట్రాక్టర్లలో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని దించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తహసీల్దార్ ఖాజామైనుద్దీన్ను ఆదేశించారు. నాలుగు రోజులుగా గోదాం వద్ద పడిగాపులు పడుతున్నామని.. కనీస వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు అడిషనల్ కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. -
ఆధునిక సాగుపై అవగాహన
కొత్తకోట రూరల్: రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు మండలంలోని అమడబాకుల రైతువేధికలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. పాలెం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ప్రొ. డా. ప్రగతికుమారి హాజరై సాగునీటి పొదుపు పద్ధతులు, వాతావరణ అనుకూల పంటల సాగు విధానం, ఎరువుల సమతుల్యత, ఆధునిక వ్యవసాయంపై రైతులకు వివరించారు. తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే పద్ధతులను అవలంబించాలని సూచించారు. అనంతరం రైతుల సమస్యలు తెలుసుకొని సస్యరక్షణ చర్యలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కొత్తకోట వ్యవసాయ అధికారి జాస్మిన్, ఏఈఓ రవీందర్రెడ్డి, కళాశాల విద్యార్థులు కె.నర్సింహ, చంద్రవర్ధన్, సర్పంచ్ గాయత్రి, రైతులు పాల్గొన్నారు. -
తపాలశాఖలో కలవరం!
సీబీఐ ఎఫ్ఐఆర్లో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పేరు ● బదిలీ వేటు వేసి పోస్టింగ్ ఇవ్వని ఉన్నతాధికారులు ● పూర్తి వివరాలు సేకరిస్తున్న సీబీఐ అధికారులు ● బిల్లుల చెల్లింపులపై సృష్టత కరువు బదిలీ అయ్యారు.. ఇక్కడ విధులు నిర్వర్తించే పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న బదిలీ కావడంతో ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల కిందటే బాధ్యతలు తీసుకోవడంతో అదనపు విధుల బిల్లుల చెల్లింపు సమాచారం తీసుకోలేదు. పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతాం. – ఎన్.వెంకటేశ్వర్, ఇన్చార్జి సూపరింటెండెంట్, వనపర్తి వనపర్తిటౌన్: బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్ సేవక్ల అదనపు బిల్లుల చెల్లింపు కోసం పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ లంచం ఆశిస్తూ ఈ నెల 8న సీబీఐకి పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. ఈ వ్యవహారంలో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని భూమన్న ఖండించినప్పటికీ.. అనూహ్యంగా సీబీఐ ఎఫ్ఐఆర్లో అతడి పేరు నమోదు కావడంతో తపాలశాఖలో కలవరం మొదలైంది. భూమన్నను వనపర్తి నుంచి బదిలీ చేసిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రెండ్రోజుల కిందట సీబీఐ అధికారులు భూమన్న, పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్కు సంబంధించిన పూర్తి వివరాలను వనపర్తి ప్రధాన పోస్టల్ కార్యాలయం నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో పోస్టల్ సూపరింటెండెంట్ పేరు నమోదు కావడంతో సీబీఐ విచారణ ఎవరెవరికి తలనొప్పి తెచ్చిపెడుతుందోనని సిబ్బందిలో కలవరం మొదలైంది. భూమన్న ఎక్కడెక్కడ విధులు నిర్వర్తించారు.. ఆయన వ్యవహారం శైలిపై సీబీఐ దృష్టి సారించినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. -
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
వనపర్తి: ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత హాజరయ్యారు. కార్యక్రమాన్ని తెలంగాణ గీతాన్ని ఆలపించి ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దళారీ వ్యవస్థను పూర్తిగా అంతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల అర్జీలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని.. వేగంగా పరిష్కార మార్గం చూపాలని కోరారు. విద్య, వైద్యంపై దృష్టి సారించి వీటికే అధిక నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భూములకు సంబంధించి రైతుల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రతి వ్యక్తికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 65 ఏళ్లలో రూ.65 వేల కోట్ల అప్పు చేస్తే.. గత పాలకులు తొమ్మిదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పుచేసి రాష్ట్రాన్ని తిరోగమనంవైపు తీసుకెళ్లారని ఆరోపించారు. రూ.28 కోట్ల వడ్డీలేని రుణాలు.. జిల్లాలోని 8,258 స్వయం సహాయక సంఘాలకు రూ.28 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మహిళలకు 97,076 ఇందిరమ్మ చీరలు, 70,516 మందికి చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించామని.. పదోతరగతి ఫలితాల్లో గతేడాదితో పోలిస్తే మెరుగైన స్థానాన్ని సాధించామని, 97 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచినట్లు వివరించారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
‘జీల్దార్ తిప్ప’లు తప్పేనా..?
పైప్లైన్లో తరలించాలి.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డీ–5 కాల్వకు నీటిని తరలించేందుకు 338.5 ఎఫ్ఆర్ఎల్ లెవల్లో స్లూయిస్ ఏర్పాటు చేశారు. అక్కడే 318 ఎఫ్ఆర్ఎల్ లెవల్లో పైప్లైన్ నిర్మాణం చేపట్టి జీల్దార్తిప్ప చెరువు సమీపంలో 304 లెవల్లో నీటిని విడుదల చేయాలి. అక్కడి నుంచి ఆయకట్టు భూములుకు నీళ్లు పారించేందుకు మైనర్ కాల్వలు ఉన్నాయి. – వెంకట్రెడ్డి, నిర్వాహకుడు, గ్రామాభ్యుదయ సేవా సంస్థ ఎల్లూరు ఉన్నతాధికారుల పరిశీలనలో.. జీల్దార్తిప్ప చెరువుకు నీటి తరలింపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. మొదట మొలచింతలపల్లి వాగు వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలని, తర్వాత కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. కానీ, కాల్వలు తవ్వేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పైప్లైన్ ఏర్పాటు అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. – అమర్సింగ్, డీఈ, నీటిపారుదలశాఖ కొల్లాపూర్: కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టులకు కూతవేటు దూరంలోనే ఉన్న జీల్దార్తిప్ప చెరువుకు కృష్ణానదీ నీటిని తరలించే ప్రక్రియ ఏళ్ల తరబడి ప్రకటనలు, శిలాఫలకాలకే పరిమితమవుతోంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం, గేమ్యానాయక్తండా, మొలచింతలపల్లి, ఎర్రగట్టుబొల్లారం గ్రామాలు కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టులకు సమీపంలోనే ఉంటాయి. లక్షలాది ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులు పక్కనే ఉన్నా ఆ గ్రామాలకు మాత్రం సాగునీరు అందడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలో దశాబ్దాల క్రితం నిర్మించిన జీల్దార్తిప్ప చెరువుపైనే నేటికీ ఆయా గ్రామాల రైతులు ఆధారపడుతున్నారు. చెరువు నిండితేనే రెండు పంటలు పండిస్తారు. లేదంటే ఒక్క పంటతోనే సరిపెట్టుకోవాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీల్దార్తిప్ప చెరువుకు కృష్ణానది నీటిని తరలించాలని పాలకులు భావించారు. ఇందుకోసం నిధులు మంజూ రుచేసి, శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ, పనులు మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ● కృష్ణానది నీటిని మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాల్లోని పంటపొలాలకు అందించాలనే ఉద్దేశంతో 2004లో రూ.3 కోట్లతో కృష్ణా బ్యాక్వాటర్పై మినీ లిఫ్టు నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. కానీ పనులు చేపట్టలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరోసారి మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామ పొలాలకు సాగునీరు మళ్లించాలనే అంశం తెరపైకి వచ్చింది. 2019లో కేఎల్ఐ నుంచి జీల్దార్తిప్ప చెరువుకు నీటిని తరలించేందుకు రూ.19 కోట్లు కేటాయించగా.. అదే సంవత్సరం మార్చిలో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ భూసేకరణకు నిధులు సరిపోవనే సాకుతో పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.35 కోట్లతో మరోసారి నీటి తరలింపు పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ రద్దుచేసి నూతన ప్రతిపాదనలు తయారు చేసింది. జీల్దార్తిప్ప చెరువు కృష్ణా నీటికి నోచుకోని మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామాల రైతులు కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల పక్కనే ఉన్నా అందని సాగునీరు నీటి తరలింపునకు రెండుసార్లు శంకుస్థాపన పైప్లైన్ ద్వారా తరలింపు.. కేఎల్ఐ ప్రాజెక్టులోని డీ–5 కాల్వకు అనుసంధానంగా కాల్వలు తవ్వాలని గతంలో అధికారులు నిర్ణయించారు. డీ–5 కాల్వ పాలమూరు ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్లో మునిగిపోతోంది. దీంతో ఇప్పుడు నార్లాపూర్ రిజర్వాయర్కు అనుసంధానంగానే నీటి తరలింపు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాల్వలు తవ్వేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, కాల్వలకు బదులుగా ప్రెజర్మెయిన్స్ ఏర్పాటు చేసి.. పైప్లైన్లతో నీటిని జీల్దార్తిప్ప చెరువుకు తరలిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. దీనిపై నివేదిక అందజేసిన అధికారులు తర్వాత ప్రక్రియపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి జీల్దార్తిప్పకు వెళ్లే మార్గంలో పెద్దవాగు, ఉడుములు వాగు, చిన్నవాగులు ప్రవహిస్తుంటాయి. వీటిమీదుగా కాల్వల నిర్మాణాలు ఖర్చుతో కూడిన వ్యవహారం. పైగా కాల్వల కోసం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని ఇక్కడి రైతులు పైప్లైన్ ద్వారా నీటిని తరలించాలని కోరుతున్నారు. -
అన్నదాతల ఆందోళన
గోపాల్పేట: రవాణా ఏజెన్సీపై చర్యలు తీసుకొని మార్చాలని, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలంటూ శుక్రవారం గోపాల్పేటలో రైతులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి గోపాల్పేట మండలంలోని ఏదుట్ల, ఏదుల, చెన్నారం, సమీప గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని గోపాల్పేటలోని గోదాంకు తరలించాలని నిర్వాహకులు సూచించడంతో రైతులంతా ఒక్కసారిగా ధాన్యం ట్రాక్టర్లతో తీసుకొచ్చారు. దీంతో సుమారు కిలోమీటర్ మేర ట్రాక్టర్లు నిలిచాయి. గోదాంలో ధాన్యం దింపేందుకు కేవలం ఎనిమిది మంది హామాలీలు మాత్రమే ఉండటం.. ట్రాక్టర్లు రోడ్డు పక్కన ఉంచి లారీలు, డీసీఎంలలో వచ్చిన ధాన్యం మొదట దింపడంతో ఎన్నిరోజుల పాటు ధాన్యం దించుతారని రైతులు ఆగ్రహానికి గురయ్యారు. దీనికితోడు గోదాంకు సంబంధించిన కాంట్రాక్టర్ బస్తాకు అరకిలో తరుగు తీయాలని చెప్పడంతో రైతులు సాయంత్రం నాలుగు నుంచి గోదాం ఎదురుగా ఉన్న బీటీరోడ్డుపై ధర్నాకు దిగారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. 20 మంది హమాలీలు బస్తాలు దింపేందుకు వస్తే తిప్పి పంపారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎన్నిరోజులు పడిగాపులు పడాలి.. కొనుగోలు చేసిన తర్వాత మిల్లులకు తరలించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని.. సొంతంగా ట్రాక్టర్లలో తీసుకొస్తే దింపేందుకు హమాలీలు కూడా అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. వెంటనే కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ భీష్మించుకు కూర్చున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శశిధర్, తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నా విరమించాలని కోరారు. కలెక్టర్ వచ్చి రవాణా ఏజెన్సీపై చర్యలు తీసుకొని మార్చాలని, తరుగు లేకుండా ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. సాయంత్రం ఏడు వరకు జేసీ వస్తారని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రాత్రి 7.30 గంటలకు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ వచ్చి రైతులతో మాట్లాడారు. శనివారం నుంచి హమాలీల సంఖ్య పెంచుతామని, అలాగే ట్రాక్టర్లలో ఉన్న ధాన్యం మొదట దింపేలా చూస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ హామీతో విరమణ -
తరుగు పేరిట మోసం చేస్తే చర్యలు
పాన్గల్: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తూకం, తరలింపులో జాప్యం జరగకుండా చూడాలని, వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని దావాజిపల్లి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సేకరణ ప్రక్రియ, బస్తాల తరలింపుపై అధికారులతో ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రాలకు రైతులు తాలు, చెత్త, దుమ్ము లేకుండా ధాన్యం తీసుకొస్తే తూకం విషయంలో ఇబ్బందులు తలెత్తవని, శుభ్రం చేసిన ధాన్యం తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిబంధనల మేరకు తూకం చేయాలని.. మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని దించుకోవడంలో ఇబ్బందులకు గురి చేసినా, తరుగు పేరిట మోసం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రాల్లో ధాన్యం తూకం, బస్తాల తరలింపులో అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులు, ఆర్ఐ మహష్, సీసీ సువర్ణ, రైతులు ఉన్నారు. -
ా
మిల్లర్ల మాయ జాలం!మిల్లుల్లో కనిపించని సీజ్ చేసిన ప్రభుత్వ ధాన్యం● కస్టోడియన్ల నిర్లక్ష్యంతో రూ.కోట్ల విలువైన వడ్లు పక్కదారి? ● టాస్క్ఫోర్స్ అధికారుల తనిఖీల్లో బట్టబయలు.. మరో కేసు నమోదు ● జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేస్తే మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ●25వేల బస్తాలు ముందే తరలించాం.. పెద్దమందడి మండలంలోని రెండు మిల్లులను టాస్క్ఫోర్స్ అధికారులు సీజ్ చేసిన కొంత కాలానికి, నేను డీఎంగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించిన సమయంలో సుమారు 25 వేల బస్తాలను షిఫ్ట్ చేశాం. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎంకు కేసు నమోదు చేసిన సమయంలో బ్యాలెన్స్ ధాన్యం వేలం వేయాలని పంచనామాలో రాశాం. కానీ సదరు అధికారి వేలం వేయలేదు. – కాశీవిశ్వనాథ్, డీఎస్ఓ పరిశీలిస్తాం.. జిల్లావ్యాప్తంగా సీజ్ చేసిన మిల్లుల్లో ధాన్యం నిల్వల పరిశీలన చేస్తాం. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లలో బిజీగా ఉన్నాం. కస్టోడియన్లు ధాన్యం భద్రతా అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు, లోకల్ రెవెన్యూ అధికారులకు కస్టోడియన్ ఇస్తాం. పెద్దమందడి మండలంలోని రెండు మిల్లుల కస్టోడియన్ ఎవరూ.. ధాన్యం ఎక్కడికి తరలించారు. ఎవరు తరలించారనే అంశాలను పరిశీలిస్తాం. – వినోద్కుమార్, అదనపు కలెక్టర్ (రెవన్యూ) వనపర్తి: సీజ్ చేసిన రైస్మిల్లుల్లోని వరిధాన్యం మాయం కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని భద్రపర్చాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో మిల్లులకు వేసిన సీజ్లు అలాగే ఉండగానే.. ధాన్యం మాయం కావడం సంచలనం రేపుతోంది. కొన్ని నెలల క్రితం పెద్దమందడి మండలంలోని రెండు మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం కంటే తక్కువగా నిల్వలు ఉన్నాయని అందిన సమాచారం మేరకు రాష్ట్ర టాస్క్ఫోర్స్ అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. ధాన్యం నిల్వల్లో భారీగా తేడా ఉండటంతో కేసు నమోదు చేసి.. రెండు మిల్లులను సీజ్ చేశారు. అయితే ఆయా మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం పెద్దమొత్తంలో మాయమైనట్లు అందిన సమాచారం మేరకు తాజాగా మరోసారి తనిఖీలు చేపట్టారు. రెండు రోజులపాటు పలు దఫాలుగా తనిఖీలు నిర్వహించగా.. మిల్లుల్లోని ధాన్యం మాయమైనట్లు తేలడంతో మరో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
భానుడి భగభగ
గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాల వారీగా ఇలా.. పాలమూరు: ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగభగమంటూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేడి గాలులు అధికంగా వీస్తుండడంతో వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. ఉమ్మడి పాలమూరులో అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లపల్లిలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్కర్నూల్ (వెల్దండ)మహబూబ్నగర్ (బాలానగర్) 43.6 గద్వాల (ఉండవెల్లి) 43.3 నారాయణపేట (దామరగిద్ద) -
యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
వనపర్తి/వనపర్తి రూరల్: క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని.. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో క్రికెట్ టోర్నీ నిర్వహించగా.. పోలీసు, రెవెన్యూ, ప్రెస్ మీడియా, ఉపాధ్యాయ జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ పోటీల్లో పోలీసు జట్టు విజేతగా నిలవగా.. ఉపాధ్యాయుల జట్టు రన్నరప్గా నిలిచింది. రెవెన్యూ జట్టు తరఫున కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వయంగా ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అదనపు ఎస్పీ రాజేశ్ మీనా పోలీసు జట్టుకు నాయకత్వం వహించి అర్ధశతకం సాధించారు. టోర్నీ విజేత, రన్నరప్ జట్లకు చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి చేతులమీదుగా ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామీణ మట్టిలో మాణిక్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. శారీరక దారుఢ్యం క్రీడలతోనే సాధ్యమని.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాల్లో భాగంగా క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి పెబ్బేరు పట్టణంలోని ఖేలో ఇండియా ఫుట్బాల్ మైదానంలో కలెక్టర్ ప్రత్యేక నిధులు రూ. 10లక్షలతో ఏర్పాటుచేసిన నూతన ఫ్లడ్లైట్లను ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రారంభించారు. ఇదే మైదానంలో ఎమ్మెల్యే నిధులు రూ. 10లక్షలతో నిర్మించనున్న డ్రెసింగ్ రూమ్, జిమ్, టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఫుట్బాల్ పోటీలను వారు ప్రారంభించగా.. వనపర్తి, గోపాల్పేట, పెబ్బేరు, ఆత్మకూర్ జట్లు ఫుట్బాల్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. కార్యక్రమంలో పెబ్బేరు ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణకుమార్రెడ్డి, వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని, వైస్చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, కౌన్సిలర్ శివసాయి పాల్గొన్నారు. -
వడ్ల బస్తాలతో బారులు
వీపనగండ్ల గోదాం వద్ద బారులుతీరిన వరిధాన్యం వాహనాలు వీపనగండ్ల: మండల కేంద్రంలోని గోదాం వద్ద గురువారం వరిధాన్యం వాహనాలు బారులుతీరాయి. సుమారు 150 వాహనాల్లో వడ్ల బస్తాలను తీసుకురాగా.. అన్లోడ్ చేసేందుకు సరిపడా హమాలీలు లేకపోవడంతో 1.5 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. 5వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంగల గోదాంకు అమరచింత, ఆత్మకూర్ తదితర మండలాల నుంచి పెద్ద మొత్తంలో లారీలు, ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. అయితే బీహార్కు చెందిన 18 మంది హమాలీలు మాత్రమే ఉండటంతో అన్లోడ్ చేయడం కష్టసాధ్యంగా మారింది. పరిసర గ్రామాల్లోని హమాలీలను అన్లోడ్ చేసేందుకు కోరినా ఎవరూ రావడం లేదని తహసీల్దార్ ఖాజామైనొద్దీన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కామన్, డాన్ రకాల ధాన్యాన్ని మాత్రమే అన్లోడ్ చేస్తుండటంతో మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న స్థానిక సీపీఎం నాయకులు గోదాం వద్దకు చేరుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. గోదాం వద్ద హమాలీలు లేక నిలిచిన వాహనాలు -
మక్తల్ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతా
● 19 బీటీరోడ్ల నిర్మాణానికి రూ.68కోట్లు మంజూరు ● త్వరలోనే 150 పకడల ఆస్పత్రి అందుబాటులోకి ● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్లో అసంపూర్తి భవనాలను ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 19 బీటీరోడ్లను 65 కి.మీ. మేర నిర్మించేందుకు రూ. 68కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. కొల్పూర్ – కుర్తికొండ వద్ద జూరాల ప్రాజెక్టు తరహాలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. హిందూపూర్ వద్ద ఽథర్మల్ పవర్ స్టేషన్కు సైతం త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మక్తల్లో డిగ్రీ కళాశాల, రిజిస్ట్రర్ కార్యాలయం, కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మక్తల్ మండలంలోని గొల్లపల్లి –మంతన్గోడ్ బీటీరోడ్డు నిర్మాణానికి రూ. 1.50కోట్లు, చిట్యాల – గుర్రందొడ్డి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ. 20కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మక్తల్లో నిర్మిసు న్న 150 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, టౌల్ హాల్ నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజీవ్గాంధీ ఆశయసాధనకు కృషి.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్బంగా మక్తల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత శక్తిపై అపారమైన విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ.. 18 ఏళ్ల వయసు నుంచే ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో యువశక్తి ప్రాధాన్యం పెంచారన్నారు. రాజీవ్గాంధీ ఆశయాలను కాంగ్రెస్ ప్రబుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో యువత అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, నాయకులు వాకిటి హన్మంతు, కట్ట సురేశ్, ఫయాజ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, కావాలి తయాప్ప, రవికుమార్, మందుల నరేందర్, ఆనంద్గౌడ్, నర్సింహులు, గణేశ్, ఓబులేషు, వెంకటేశ్, లక్ష్మణ్, శ్యామ్, రవి పాల్గొన్నారు. -
వనమహోత్సవం లక్ష్యం 20.60లక్షల మొక్కలు
వనపర్తి: వనమహోత్సవంలో భాగంగా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 20,60,900 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వనమహోత్సవంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వచ్చేనెలలో వర్షాలు పడిన వెంటనే మొక్కలు నాటడం ప్రారంభించాలన్నారు. ముఖ్యంగా ఎవెన్యూ ప్లాంటేషన్పై ప్రత్యేక దృష్టిసారించాలని.. పండ్ల మొక్కలు, ఈత, మునగ వంటి మొక్కలు అధికంగా నాటాలన్నారు. అదే విధంగా నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని తెలిపారు. ● పని కావాలని అడిగే ప్రతి కూలీకి ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పనులను ముగించుకొని వెళ్లిపోవచ్చన్నారు. పని ప్రదేశాల్లో కూలీలకు చలువ నీడ, మంచినీరు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఉపాధి హామీ పథకంలో పని దినాల సంఖ్య పెంచితే.. గ్రామ పంచాయతీలకు సీసీరోడ్లు నిర్మించుకోడానికి మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుందని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి ఉన్నారు. చారిత్రక కట్టడాలపరిరక్షణ అందరి బాధ్యత కొల్లాపూర్ రూరల్: చారిత్రక కట్టడాల పరిరక్షణ మన అందరి బాధ్యత అని జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని సోమశిల గ్రామంలో ఉన్న పురాతన, ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి గ్రామ సమీపంలో నుంచి సోమేశ్వరాలయం వరకు హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల గ్రామానికి జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందని, గ్రామంలో పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయని, మన సంపదను కాపాడుకోవాల్సి బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. ఉపాధి హామీ కూలీలకు లలితా సోమేశ్వరాలయం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ మద్దిలేటి, పురాతన శాఖ పర్యవేక్షకుడు కుర్మయ్య, నాయకులు కాటం వెంకటస్వామి, నారాయణ, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీబీలో యూపీఐ సేవలు
● ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సులభంగా లావాదేవీలు ● నగదు రహిత చెల్లింపులకుముందడుగు ●మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) డిజిటల్ బ్యాంకింగ్ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1920 సంవత్సరంలో స్థాపించబడిన ఈ బ్యాంక్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా అండగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 22 బ్రాంచ్లతో సేవలందిస్తున్న డీసీసీబీ.. తాజాగా తన ఖాతాదారులకు యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త సేవలతో ఖాతాదారులు గూగుల్ పే, ఫోన్పే వంటి ప్రముఖ డిజిటల్ యాప్ల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకుని నగదు రహిత లావాదేవీలు సులభంగా నిర్వహించుకోవచ్చు. డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, చిన్న వ్యాపార లావాదేవీలను తక్షణమే పూర్తి చేయడం వంటి సేవలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. 3 లక్షలకుపైగా ఖాతాదారులు డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ బ్యాంక్ సేవలను వినియో గిస్తున్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో వీరికి బ్యాంక్ శాఖలకు వెళ్లే అవకాశం తగ్గి.. ఇంటి వద్ద నుంచే వేగవంతమైన డిజిటల్ సేవలు పొందే అవకాశం ఏర్పడింది. 24 గంటల పాటు.. ఖాతాదారులు తమ మొబైల్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుని యూపీఐ యాప్లో నమోదు చేసుకుంటే సేవలు వెంటనే యాక్టివేట్ అవుతాయి. రోజులో 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే డబ్బు బదిలీలు పూర్తవుతాయని పేర్కొన్నారు. చెల్లింపులపై అవగాహన.. సహకార బ్యాంకింగ్ వ్యవస్థను ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో డీసీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రజల్లో డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. -
లారీకి 30 బస్తాల చొప్పున హాంఫట్..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎండా కాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో ఇప్పటివరకు కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరుగుతురన్నాయి. సీజన్ ముగిసే దశకు చేరుకున్నా.. నిర్దేశిత లక్ష్యంలో కనీసం 30 శాతం చేరుకోలేదు. హమాలీలు, లారీల కొరతతోపాటు మిల్లుల్లో స్థలాభావం వంటి కారణాలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది చాలదన్నట్లు రోజుల తరబడి నిరీక్షణతో కష్టనష్టాలకు ఓర్చి సర్కారు సెంటర్లలోనే అమ్ముకుందామనుకున్న రైతులకూ భంగపాటు తప్పడం లేదు. మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు తాలు పేరిట నిలువు దోపిడీకి తెగబడడంతో వారు గుండెలు బాదుకుంటున్నారు. పాలక పక్షంలో కొరవడిన చిత్తశుద్ధి, అధికారుల తూతూమంత్రపు పర్యవేక్షణతోనే ఈ దుస్థితి నెలకొనగా.. అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కేవలం 2,89 లక్షల మెట్రిక్ టన్నులే.. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇందులో 900 వరకు మాత్రమే తెరుచుకున్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ధారించారు. అయితే 19వ తేదీ వరకు ఆయా ప్రభుత్వ కేంద్రాలకు సుమారు 3,42,939 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. ఇందులో ఇప్పటివరకు 2,89,135 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 66,082 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సరిపోను హమాలీలు లేకపోవడం, లారీల కొరతతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యంలో సుమారు 33,416 మెట్రిక్ టన్నులను ఇంకా మిల్లులకు తరలించాల్సి ఉండగా.. బస్తాల వద్ద రైతులు రోజుల తరబడి కాపలా కాస్తున్నారు. జిల్లాల వారీగా ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల వివరాలు.. జిల్లా మార్కెట్కు కొన్నది ఇంకా మిల్లులకు రసీదు వచ్చింది కేంద్రాల్లోఉంది తరలించింది ఇచ్చింది మహబూబ్నగర్ 67,420 56,620 10,800 54,338 53,150 వనపర్తి 1,20,000 94,291 36,000 70,000 69,000 నాగర్కర్నూల్ 6,500 4,600 2,000 4,028 1,966 జోగుళాంబ గద్వాల 46,019 34,735 11,284 34,462 34,462 నారాయణపేట 1,03,000 98,889 5,998 92,891 91,089 క్వింటాల్కు 3 నుంచి 5 కిలోల వరకు మాయాజాలం రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండానే వ్యవహారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందితో కుమ్మక్కు లారీ డ్రైవర్ల పేరు చెబుతూ పొంతనలేని సమాధానాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా నత్తనడకనే క్రయవిక్రయాలు తూతూమంత్రపు పరిశీలనలకే అధికారుల పరిమితం ‘పాన్గల్ మండలంలోని గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 20 కేంద్రాల్లో ఇప్పటి వరకు 94,367 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా.. కేవలం 45,716 బస్తాలను మాత్రమే మిల్లులకు తరలించారు. ఇంకా 48,651 బస్తాలు నిల్వ ఉండటంతో రైతులు కేంద్రాల్లోనే పడిగాపులు పడుతున్నారు. సేకరించిన ధాన్యం తరలింపునకు లారీలు సకాలంలో రాకపోవడంతో తూకం చేసిన బస్తాల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు తడిస్తే ఎవరు బాధ్యత వహించాలని ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల్లో ఓ వైపు కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల నిల్వలు.. మరోవైపు తూకం చేయని ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం తరలింపునకు తగిన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.’ సెంటర్లలో తూకం వేసిన రసీదు ఉంది.. నేరుగా మిల్లులకు వచ్చిన తర్వాత తూకం ఎలా తక్కువ వస్తుందని ప్రశ్నిస్తే తేమ ఎక్కువగా ఉంది.. ఒప్పుకోకుంటే తీసుకెళ్లండి అంటూ మిల్లుల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా రైతులకు సమాచారం ఇవ్వకుండానే మిల్లర్లు బస్తాల సంఖ్యను కుదించి.. ఆ మేరకు బిల్లులు చేస్తున్నట్లు సమాచారం. సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ్క దందా నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర వస్తుందనే ఆశతో రోజుల తరబడి పడిగాపులు కాచినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. చివరకు నష్టపోక తప్పడం లేదని ‘సాక్షి’ బృందం పరిశీలన సందర్భంగా పలువురు రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం తాలు, బస్తా బరువు పేరిట కిలోన్నర వరకు తరుగు తీస్తున్నారు. కొన్ని చోట్ల రెండు కిలోల చొప్పున కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 41.150 కిలోగ్రాముల చొప్పున బస్తా ధాన్యం తూకం వేసి.. రైతులకు రసీదు ఇస్తున్నారు. ఆ తర్వాత వాటిని లారీలు తదితర వాహనాల్లో కేటాయించిన మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లదే హవా నడుస్తుండగా.. రైతుల నడ్డి విరుస్తున్నారు. సెంటర్లలో తూకం వేసినప్పటికీ.. తూకం తక్కువగా వచ్చిందంటూ బస్తాకు అదనంగా కిలోన్నర నుంచి రెండు కిలోల కోత పెడుతూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. లారీకి సుమారు 30 బస్తాల చొప్పున (దాదాపు రూ.29 వేలు) కోత పెడుతూ అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మిల్లులన్నింటిలోనూ ఈ తరహా దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
కూరగాయలు.. కుతకుత
రెట్టింపైన ధరలు.. బెంబేలెత్తుతున్న ప్రజలు ●గతంలో రూ.వంద పట్టుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం ధరలు రెండింతలు అయ్యాయి. టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ లాంటి కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం రెట్టింపయ్యాయి. ప్రభుత్వం వెంటనే ధరలను అదుపు చేయాలి. – శ్రావణి, గృహిణి, దంతనూరు, మదనాపురం రోజువారీ కూలి పనులకు వెళ్లే పేద కుటుంబాలకు ధరల పెరుగుదల భారంగా మారింది. కూరగాయల ధరలు మాంసం ధరలతో పోటీ పడుతున్నాయి. ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరగడంతో పిల్లలకు ఏం వండి పెట్టాలో అర్థం కావడం లేదు. ధరలు తగ్గితేనే ఉపశమనం లభిస్తుంది. – మొగిలి, అజ్జకొల్లు, మదనాపురం మదనాపురం: సామాన్య ప్రజలు వంటింట్లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో మధ్యతరగతి బడ్జెట్ తలకిందులైంది. ఈ మధ్యకాలంలోనే ధరలు రెట్టింపు కావడంతో మార్కెట్కు వెళ్లిన వినియోగదారులు అరకొరగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 15 రోజుల కిందట కిలో రూ.30 లభించే టమాట నేడు రెండింతలు కాగా.. చివరకు కొనుగోలుదారు రూ.60 చెల్లించినా నాణ్యమైనవి దొరకడం లేదు. అలాగే క్యాబేజీ రూ.20 నుంచి రూ.35, ఉల్లిగడ్డ రూ.25, బంగాళదుంప రూ.30 నుంచి రూ,40, వంకాయ రూ.30 నుంచి రూ.45, బెండకాయ రూ.40 నుంచి రూ 50, గోరుచిక్కుడు రూ.60, క్యాప్సికం రూ.50 నుంచి రూ.70, బీనన్స్ బీర రూ.70, కాకర రూ.80, రూ.80 నుంచి రూ.100 కిలో అమ్ముతున్నారు. సొరకాయ ఒక్కటి రూ.25 పలుకుతోంది. క్యారెట్, దొండ కిలో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. ఆకుకూరలు గతంలో రూ.10 పది కట్టలు ఉండగా.. ఇప్పుడు రూ.20కి ఇస్తున్నారు. కొత్తిమీర చిన్న కట్టలు రూ.20కి 4 ఇస్తుండగా.. నిమ్మ, కీర ధరలూ పెరిగాయి. ఎండల తీవ్రతతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ఏటా మే నుంచి జూన్ వరకు ధరలు పెరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లోని రైతులు జిల్లాకేంద్రంతో పాటు పట్టణాల్లోని మార్కెట్లకు కూరగాయలు పెద్దగా తీసుకురావటం లేదు. హోల్సేల్ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. వీటిల్లో నాణ్యత ఉండటం లేదు. ఎండకు కాత, పూత రావడం లేదని.. అక్కడక్కడ పండిన అరకొర భానుడి దెబ్బకు పాడవుతున్నాయని రైతులు చెబుతున్నారు. రూ.60కి చేరువలో టమాట, పచ్చి మిర్చి సెంచరీ దిశగా అల్లం ఎండల తీవ్రతతోనే అంటున్న ఉద్యాన అధికారులు -
బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలి
వనపర్తి: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు బూత్ లేవల్ ఏజెంట్లను నియమించుకొని బీఎల్వోతో సమన్వయం చేసుకునేలా ప్రయత్నించాలని కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి 24వ తేదీ వరకు సన్నాహక కార్యక్రమాలు, బూత్ల మ్యాపింగ్, బీఎల్వోలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాల్సి ఉంటుందని.. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వివరించారు. ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం చేపట్టి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఇంటింటి సర్వే, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి చర్యలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, డీఆర్వో సూర్యప్రకాష్ , ఆర్డీఓ సుబ్రమణ్యం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. టూరిస్టు గైడ్లుగా యువతకు అవకాశం.. పర్యాటక రంగంపై ఆసక్తి ఉన్న యువత టూరిస్ట్ గైడ్లుగా మారేందుకు తెలంగాణ హెరిటేజ్, పర్యాటకశాఖ అవకాశాలు కల్పిస్తోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం కలెక్టర్ కలెక్టరేట్లోని తన చాంబర్లో తెలంగాణ హెరిటేజ్, పర్యాటకశాఖ రూపొందించిన టూరిస్ట్ గైడ్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రాంతాల గురించి పర్యాటకులకు సమగ్రంగా వివరించేందుకు శిక్షణ పొందిన టూరిస్ట్ గైడ్లు అవసరమన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తెలంగాణ వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పర్యాటక రంగంపై ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. -
‘జిల్లాస్థాయి ప్రజాపాలన’కు ఏర్పాట్లు
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి కార్యక్రమాన్ని 22వ తేదీన నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాస్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నామని, ప్రతి శాఖ తమకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కరపత్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కుర్చీలు తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పోలీసు సేవలు మరింత చేరువ వనపర్తి: పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జిల్లా పోలీస్శాఖ ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎస్పీ సునీతరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారు పోలీస్స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ఫిర్యాదును అక్కడే స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఈ విధానంతో బాధితులకు కాస్త ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఈ విధానంతో ప్రజలకు త్వరితగతిన, పారదర్శక, నమ్మకమైన పోలీసు సేవలు అందనున్నట్లు తెలిపారు. మహిళపై అత్యాచారాలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, చోరీలు, గొడవలు, మిస్సింగ్ కేసులు, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, ర్యాగింగ్, వృద్ధులు, దివ్యాంగులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులు పోలీస్స్టేషన్కు వెళ్లలేని పరిస్థితుల్లో డయల్ 100కు గాని సంబంధిత పోలీసు అధికారికి నేరుగా ఫోన్ చేసి సమాచారం అందజేయాలని సూచించారు. దీంతో సమయం ఆదా కావడంతో పాటు కేసుల దర్యాప్తు మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగనుందని, పోలీసులు ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ భద్రతా భావన పెంపొందించే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సురవరం జయంతిని ఘనంగా నిర్వహిస్తాం వనపర్తి: నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్రెడ్డి 130వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో సాహితీవేత్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి, సాహితీవేత్త, న్యాయవాదిగా ఆయన సురవం సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. సురవరం జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథులుగా వారి జీవితంపై పరిశోధన చేసిన గన్నమరాజు, గిరిజా మనోహర్బాబు, సాగునీటిరంగ నిపుణుడు శ్రీధర్రావు దేశ్పాండేతో పాటు తెలంగాణ అస్తిత్వవాదంతో పాటు రాజకీయ సామాజిక అంశాలు విశ్లేషిస్తున్న సహచర ఉద్యమకారుడు వి.ప్రకాష్ను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, సాహితీ కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్, సాహితీవేత్తలు వీరయ్య, బలరాం, బైరోజుచంద్రశేఖర్, కిరణ్, నాయకులు తిరుమల్లేశ్, జోహెబ్ హుస్సేన్, కుమార్, తోట శ్రీను పాల్గొన్నారు. కురుమూర్తిస్వామి హుండీ లెక్కింపు చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తి స్వామికి భక్తులు అమవాస్య, శని, సోమవారాలు పురస్కరించుకొని భక్తులు సమర్పించుకున్న కానుకల హుండీని బుధవారం లెక్కించారు. హుండీ ద్వారా ఆలయానికి రూ.9,10,636 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ బత్తుల బాల్రాజు, ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్, కమిటీ సభ్యులు మైపాల్రెడ్డి, తిరుపత్రెడ్డి, వేగనాత్, అర్జున్, భరత్రెడ్డి పాల్గొన్నారు. -
అన్నదాత.. గుండెకోత
తాలు పేరిట మిల్లర్ల నిలువు దోపిడీ రాత్రింబవళ్లు కష్టపడితే 514 క్వింటాళ్ల ధాన్యం పండింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన సెంటర్లో కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని గాయత్రి మిల్లుకు తీసుకెళ్లాం. అక్కడ మిల్లు నిర్వాహకులు తాలు పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. క్వింటాల్కు ఏకంగా 5 కిలోల చొప్పున తరుగు తీస్తేనే అన్లోడ్ చేస్తామని మొండికేశారు. నిబంధనల ప్రకారం క్వింటాల్కు కిలో కంటే ఎక్కువ తరుగు తీయొద్దు. అధికారులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. వాహన అద్దె భారం మోయలేక.. చేసేదేమీ లేక వారి దోపిడీకి తలవంచాల్సి వచ్చింది. దాదాపు 25 క్వింటాళ్ల పైగా ధాన్యాన్ని ఉచితంగా మిల్లర్ల పాలైంది. మా ఆవేదన ప్రభుత్వానికి వినబడడం లేదు. – రాజు, అజ్జకొల్లు, మదనాపురం, వనపర్తి ఈ ఫొటోలో ఉంది పెద్ద దర్పల్లిలోని సప్తగిరి పారా బాయిల్డ్ రైస్ మిల్లు నిర్వాహకులు ఇచ్చిన ట్రక్ షీట్. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం వింజమూరు ప్రభుత్వ సెంటర్లో భీమయ్యయాదవ్తో పాటు మరో ఏడుగురు రైతుల నుంచి 856 బస్తాల (342 క్వింటాళ్లు) ధాన్యాన్ని కొనుగోలు చేసి సదరు రైస్ మిల్లుకు తరలించారు. అక్కడ తూకం తక్కువగా వచ్చిందంటూ మిల్లర్లు 825 బస్తాలకే లెక్కగట్టారు. ఆ తర్వాత మరో మూడు బస్తాలు కలిపి 331 క్వింటాళ్లకు డబ్బులు చెల్లిస్తామని ఫైనల్ చేశారు. అంటే 31 బస్తాలు (11 క్వింటాళ్లు) తక్కువ చూపించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు రైతులు మిల్లు నిర్వాహకులను నిలదీశారు. తమకు చెప్పకుండానే ఎలా చేస్తారని ప్రశ్నించారు. సెంటర్ల నిర్వాహకులకు చెప్పామని మిల్లరు తెలపగా.. అక్కడికి వెళ్లారు. వారు లారీ డ్రైవర్కు చెప్పామని చేతులు దులుపుకోవడంతో మోసం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరో లారీకి సంబంధించి మోసపూరితంగా ఇలానే 30 బస్తాల కోత పెట్టారని.. సెంటర్లలో నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయాలనే స్పృహ అధికారుల్లో కొరవడిందని రైతు భీమయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ఖిల్లాఘనపురం: జిల్లాలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ కోరారు. బుధవారం మండలంలోని మానాజీపేట తెలంగాణ మోడల్ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని జిల్లా సెక్టోరియల్ అధికారులు మహానంది, ప్రతాప్రెడ్డి, ఎంఈఓ జయశంకర్. విశ్రాంత ఉప విద్యాధికారి విశ్వనాథంతో కలిసి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి శిక్షణలో నేర్పుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువుతో పాటు శిబిరాల్లో అందిస్తున్న కంప్యూటర్, కుట్లు అల్లికలు, క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. శిక్షణలో నేర్పిన అంశాలు మున్ముందు ఉపయోగపడతాయని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో వేసవి శిబిరం నిర్వహిస్తున్న మానాజీపేట హెల్పింగ్ హ్యాండ్ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతిని పురస్కరించుకుని క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. బడిబాట పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన వెంట సర్పంచ్ శ్రీలత, ఉపాధ్యాయులు రాఘవేందర్, క్యాంపు వలంటీర్లు తదితరులు ఉన్నారు. -
కొనుగోళ్లలో జాప్యం సరికాదు
వనపర్తి రూరల్: కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని కడుకుంట్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తాలు, చెత్త లేకుండా కేంద్రానికి తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని రైస్మిల్లుకు తరలించడానికి స్థానిక ట్రాక్టర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, తద్వారా రవాణా ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ధాన్యాన్ని సేకరించాలని.. రైతులు శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమించకూడదని, ఎక్కడైనా తరుగు పేరిట మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
వనపర్తిటౌన్: అందరి భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఏఎంఓ మహానంది, సీఎంఓ ప్రతాప్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో వేసవి శిబిరంలో భాగంగా బుధవారం నేషనల్ గ్రీన్కార్ప్స్ (ఎన్జీసీ) జిల్లా కో–ఆర్డినేటర్ ఐ.సుదర్శన్రావు ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన సదస్సు నిర్వహించగా వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పర్యావరణాన్ని భద్రంగా కాపాడితే మంచి గాలి, నీరు భవిష్యత్ తరాలకు అందుతాయన్నారు. నేటి బాలలే రేపటి యువత.. విద్యార్థులు కచ్చితంగా పర్యావరణంపై అవగాహన కలిగి ఉండి విధిగా మొక్కలు నాటడం అలవర్చుకోవాలని, భూగర్భ జలాలను కాపాడాలని, అడవుల సంరక్షణ గురించి తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఆదా, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపుపై విద్యార్థులు నిర్వహించిన స్కిట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు పర్యావరణంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం సుదర్శన్రావు విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వాడమని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేష్ కుమార్, నిరీషా తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో చేరిన ఎస్పీ
నిప్పుల కుంపటి జాగ్రత్తలు తప్పనిసరి.. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా శిశువులు, చిన్నారులు, వృద్ధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువసేపు ఎండలో ఉండటంతో వేడిగాలుల వల్ల వెంటనే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అన్ని వయస్సుల వారికి ఎండదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల ప్రభావం ప్రధానంగా దినసరి కూలీలు, రైతులు, వీధివ్యాపారులు, ఆరుబయట పనిచేసే వారిపై తీవ్రంగా ఉండనుంది. దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే రక్షణ కోసం గొడుగు, టోపీ ధరించాలని సూచిస్తున్నారు. సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి పాలమూరులో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిత్యం 41 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా లింగాలలో 42.7, గద్వాల జిల్లాకేంద్రంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పుల ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరింత వేడిని రగిల్చనుంది. కనీసం వారం రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని, ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 25 వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు సూచించింది. జోగుళాంబ గద్వాలలో అత్యధికం.. ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నమోదైన టాప్ 10 గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఐదు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. గద్వాల, అయిజ, ధరూరు, కేటీదొడ్డి, ఇటిక్యాల మండలాల్లో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తర్వాత నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, చారకొండ, లింగాల, తెలకపల్లి మండలాలు, మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్కొండలో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వనపర్తి: శిక్షణ నిమిత్తం వెళ్లిన ఎస్పీ సునీతరెడ్డి మంగళవారం తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఇటీవల విధుల్లో చేరిన అదనపు ఎస్పీ (అడ్మిన్) రాజేష్ మీనా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువ ఐపీఎస్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని, ప్రజాసేవలో నిబద్ధత, విధుల్లో కర్తవ్య నిష్ట, సమర్థ నాయకత్వ లక్షణాలతో జిల్లా పోలీసుశాఖకు మరింత బలాన్ని చేకూరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ వారం రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు కనీసం 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు బయటకు వెళ్తే జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు అత్యవసరమైతేనే బయటకు.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. ఎండలో తిరగాల్సి వస్తే గొడుగు, టోపీ వినియోగించాలి. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించాలి. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్కర్నూల్ -
పురాతన కట్టడాలనుసంరక్షించాలి
ఖిల్లాఘనపురం: పురాతన కట్టడాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పురావస్తుశాఖ అధికారులు గౌస్, జావిద్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండలానికి వచ్చిన వారు గ్రామపెద్దలు, యువత, విద్యార్థులతో కలిసి ఖిల్లా గట్టును సందర్శించి గుట్టపై ఉన్న ప్రధాన ద్వారాలు, ఫిరంగి, చెరువులు, గుర్రపు గాట్లు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజుల కాలం నాటి కోట, ఫిరంగి నేటికీ చెక్కు చెదరలేదన్నారు. గుట్టపై కాకతీయుల కాలంలో తవ్విన చెరువుల్లో నేటికీ నీళ్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఏటా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను ఖిల్లా గట్టును చూపించాలని సూచించారు. పురాతన కట్టడాలు, నిర్మాణాలు, ఆలయాలు విద్యార్థి దశలో చూస్తే గుర్తుండిపోతాయని చెప్పారు. వారి వెంట గ్రామపెద్దలు ఆగారం ప్రకాష్, నాగేష్, యాదయ్య, దేవేందర్, ముజాహిద్, వెంకటేష్, పలువురు వార్డు సభ్యులు ఉన్నారు. ముగిసిన ఇంటర్సప్లిమెంటరీ పరీక్షలు వనపర్తిటౌన్: జిల్లాలో ఈ నెల 13న ప్రారంభమైన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరిరోజు ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 1,778 మంది విద్యార్థులకుగాను 1,621 మంది హాజరుకాగా 157 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 622 మంది విద్యార్థులకుగాను 568 మంది హాజరుకాగా.. 54 మంది రాయలేదని డీఐఈఓ నరేందర్కుమార్ వివరించారు. మెడికల్ దుకాణాల బంద్తో ఇబ్బందులు ఉండవు వనపర్తి: జిల్లాలో బుధవారం మెడికల్ దుకాణాల బంద్ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రష్మిక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కెమిస్ట్, డ్రగిస్ట్ ప్రతినిధులతో సంప్రదింపు జరిపామని.. వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూర్, కొత్తకోటలో కనీసం మూడు దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న జీవన్ధారా, రెడ్క్రాస్ జనరిక్ మెడికల్ దుకాణం అందుబాటులో ఉంటాయని వివరించారు. మెడిప్లస్, అపోలో వంటి రిటైల్ ఫార్మసీ చైన్ ప్రతినిధులను సంప్రదించగా.. వారు కూడా బంద్ రోజున తమ సేవలు కొనసాగిస్తామని, మందుల లభ్యతలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ప్రాంతంలో కనీసం ఒక దుకాణం తెరిచేలా చూస్తామని చెప్పారని తెలిపారు. ఎక్కడైనా మెడిసిన్ అందుబాటులో లేకపోతే జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ను సెల్నంబర్ 83339 25874 సంప్రదించాలని సూచించారు. -
ఇబ్బందులు తొలగనున్నాయి..
జూరాల ప్రధాన ఎడమ కాల్వలో పూడికతీత పనులు చేపట్టడంతో సాగునీరు సాఫీగా చివరి ఆయకట్టు వరకు పారే అవకాశం ఉంది. కాల్వలో ఒండ్రుమట్టితో పాటు రాళ్లు, ముళ్లపొదలు ఏళ్లుగా తొలగించకపోవడంతో సాగునీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. వీటిని తొలగించడంతో సమృద్ధిగా పంటలకు అందే అవకాశం ఉంది. – హన్మంతు, రైతు, నందిమళ్ల ‘అమరచింత’ కాల్వలో సైతం.. జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం పరిధిలో మస్తీపురం, మూలమళ్ల, సింగంపేట, ఖానాపురం, పాంరెడ్డిపల్లి గ్రామాలతో పాటు అమరచింతకు సాగునీరు అందుతుంది. ఎత్తపోతల కాల్వలో సైతం పూడితీత పనులు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతంలో ఉపాధి పనులు లేకపోవడంతో మిగిలిన గ్రామాల్లో విస్తరించిన కాల్వలో ఉపాధి కూలీలతో పూడికతీత పనులు చేపట్టడం సంతోషం. – సత్యారెడ్డి, రైతు, అమరచింత కూలీలకు ఉపాధి కల్పించేందుకు.. జూరాల ఎడమ కాల్వలో పూడికతీత పనులు చేపట్టమని నీటిపారుదలశాఖ అధికారులు కోరడంతో ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలతో పూడికతీత పనులు చేపడుతున్నాం. మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తరించిన ఎడమ కాల్వతో పాటు అమరచింత, చంద్రగడ్ ఎత్తిపోతల కాల్వల్లో పేరుకుపోయిన పూడిక, ముళ్లపొదలు తొలగిస్తున్నాం. – శ్రీనివాసులు, ఎంపీడీఓ, అమరచింత -
సాగునీరు పారేలా...!
జూరాల ఎడమ, అనుబంధ కాల్వల్లో పూడికతీత ●అమరచింత: ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ, అనుబంధ కాల్వల్లో పూడికతీత పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కాల్వల్లో నీటిసరఫరా నిలిచిపోవడంతో రోజు ఉపాధి కూలీలతో పూడికతీతతో పాటు ముళ్లపొదల తొలగింపు పనులు కొనసాగుతోంది. యాసంగిలో ప్రధాన ఎడమకాల్వ ద్వారా కేవలం రామన్పాడు రిజర్వాయర్ వరకు 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించడంతో మిగిలిన ఆయకట్టు కాల్వలు నీటి ప్రవాహం లేక ఎండుముఖం పట్టాయి. ఈసారి వేసవిలో కాల్వల మరమ్మతులకు ప్రతిపాదనలు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన పీజేపీ అధికారులు జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను ఆయా మండలాల్లోని నీటిపారుదలశాఖ ఏఈలు ఎంపీడీఓలను సంప్రదించి కాల్వల్లో ఉపాధి పనులు చేపట్టాలని కోరడంతో సమీప గ్రామాల కూలీలతో పనులు చేపడుతున్నారు. వచ్చే వర్షాకాలంలో సాగునీరు సాఫీగా ముందుకు పారే విధంగా ప్రధాన, పిల్ల కాల్వల్లో సైతం పూడిక తొలగించి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా అధికారులు పనులు చేయిస్తున్నారు. నీటిపారుదలశాఖ సిఫార్సులతో ఉపాధిహామీ పథకంలో.. ఎంపీడీఓల పర్యవేక్షణలో ఊపందుకున్న పనులు వేసవిలో మరమ్మతులు లేకపోవడంతోనే.. -
దొడ్డురకం ధాన్యం దించుకోవాల్సిందే
వనపర్తి: రైస్మిల్లర్లు సన్నరకంతో పాటు దొడ్డురకం వరి ధాన్యాన్ని కూడా దించుకొని ప్రభుత్వానికి సహకరించాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైస్మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్ ధాన్యం కేటాయింపునకు జిల్లాలో 55 మిల్లులు మాత్రమే అర్హత సాధించాయని.. వాటిలో 9 మంది మినహా మిగతా మిల్లర్లు దొడ్డురకం వరి ధాన్యాన్ని దించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోందన్నారు. మిల్లర్లు ఈ సీజన్లో సన్న, దొడ్డురకం వరి ధాన్యం దింపుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సహకరించని మిలర్లను ప్రభుత్వ ఆదేశానుసారం బ్లాక్లిస్టులో ఉంచుతామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని.. పరిష్కారానికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలో ఖాళీగా ఉన్న గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు తగిన ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాల సంఘం జిల్లా మేనేజర్ ఆంజనేయులు, గిడ్డంగుల కార్పొరేషన్ రీజనల్ మేనేజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అన్నదాతల ఆగ్రహం.. రోడ్డెక్కి ఆందోళన
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా.. నేటికీ వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదంటూ ఆగ్రహించిన రైతులు మంగళవారం మండలంలోని రాజపేట కొనుగోలు కేంద్రం ఎదుట రహదారిపై బైఠాయించి ధాన్యానికి నిప్పంటించి రాస్తారోకో చేపట్టారు. వీరికి సర్పంచ్ ఎల్లయ్య, సింగిల్విండో చైర్మన్ రఘువర్ధన్రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నెల రోజులుగా ధాన్యం అమ్ముకోలేక.. ఇప్పటికే విక్రయించిన ధాన్యాన్ని రైస్మిల్లుకు తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతా మని రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఽతూకం చేసిన ధాన్యాన్ని రైతులు ట్రాక్టర్లలో మిల్లుకు తరలిస్తే మిల్లరు దించుకోకుండా తిప్పి పంపారని అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమేష్రెడ్డి, ఎస్ఐ హృశికేష్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ఇప్పటి నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామని.. తరలింపునకు లారీల కొరత తలెత్తకుండా చూస్తామని, ఎ లాంటి ఆందోళనలు చెందవద్దని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్నారెడ్డి, నాయకులు మాధవరెడ్డి, జయరాములు, సుదర్శన్రెడ్డి, తిరుపతయ్య, తెలుగు నారాయణ, మోహన్రెడ్డి, సత్యారెడ్డి, శంకర్రెడ్డి, మహిళా రైతులు పాల్గొన్నారు. ధాన్యానికి నిప్పంటించి నిరసన -
పంటమార్పిడితోనే అధిక దిగుబడులు
వనపర్తి రూరల్: పంటమార్పిడితోనే అధిక దిగుబడులు పొందవచ్చని.. రైతులు ఒకే రకం పంటలు కాకుండా పంటమార్పిడి చేపట్టాలని పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత డా. పద్మశ్రీ సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని చందాపూర్ రైతువేధికలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమెతో పాటు శాస్త్రవేతలు డా. ఆగ్రోనమి, శోభా రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఏళ్ల తరబడి వరి మాత్రమే సాగుచేస్తున్నారని, దీంతో చీడపీడల బాధ అధికమవుతుందని చెప్పారు. కూరగాయలు, పప్పుదినుసులు, వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి పచ్చిరొట్ట, జీవన ఎరువులు వాడాలని కోరారు. పంటను రోజు గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం ఉత్తమమని పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందులు సరైన మోతాదులో. సరైన సమయంలో వాడాలని.. ఇది పంటల నాణ్యతను పెంచడంతో పాటు సాగు ఖర్చు తగ్గిస్తుందని వివరించారు. ఏఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. భూ సారం పెంపొందించేందుకు వ్యవసాయశాఖ ద్వారా రాయితీపై జీలుగ, జనుము విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు. రైతులు వాటిని సాగుచేసి పూత దశలో భూమిలో కలియదున్ని భూ సారం పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఈఓ బాలప్రకాష్, వినోద్, విండో డైరెక్టర్ మహేందర్, ఉప సర్పంచ్ నరేందర్, శ్యాంయాదవ్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
జిల్లాలో ఇలా..
జూరాల ఎడమ కాల్వ జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు విస్తరించి ఉంది. మొత్తం 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు గోపాల్దిన్నె రిజర్వాయర్కు సైతం ఇదే కాల్వ ద్వారా నీరు సరఫరా అవుతుండటంతో అత్యధికంగా జిల్లా ప్రజలకే లబ్ధి చేకూరుతుంది. ఎనిమిదేళ్లుగా కేవలం వానాకాలంలోనే ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందిస్తున్న అధికారులు, యాసంగిలో మాత్రం వారబందీ విధానంలో ఆయకట్టు కుదించి నీటిని వదులుతున్నారు. ప్రతిసారి వేసవిలో మరమ్మతుల కారణంగా కాల్వలో పూడికతీత పనులు ముందుకు సాగకపోయేవి. ప్రస్తుత వేసవిలో కాల్వ మరమ్మతు లేకపోవడంతో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. -
ఘన వ్యర్థాల నిర్వహణపై విస్తృత అవగాహన
వనపర్తి: ఘన వ్యర్థాల నిర్వహణపై గ్రామస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఘన వ్యర్థాల నిర్వహణ, ఉపాధిహామీ లక్ష్యాలు తదితర అంశాలపై కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నాలుగు మార్గదర్శకాలను గ్రామపంచాయతీల్లో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. వ్యర్థాలు సేకరించే పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి శాసీ్త్రయ విధానంలో చెత్త నిర్వహణ చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి మండలంలో భారీస్థాయిలో వ్యర్థాలు ఉత్పత్తి చేసే బల్క్వేస్ట్ జనరేటర్లను గుర్తించి వారిపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అలాగే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా గ్రామపంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆదాయ వనరులను సృష్టించాలని కోరారు. ఫంక్షన్ హాళ్లు, ప్రజారవాణా సదుపాయాలు, హాస్టళ్లు వంటి ఆదాయాన్ని తెచ్చే ఆస్తులను గ్రామపంచాయతీలు అభివృద్ధి చేయాలని సూచించారు. ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంపునకు తగిన చర్యలు చేపట్టాలని.. నిరంతర ఉపాధి కల్పించే విధంగా పనులు గుర్తించాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి పనులను ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య ప్రారంభించేలా చూడాలని, పని ప్రదేశాల్లో కార్మికులకు తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ యాదయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్రెడ్డి, డీఎల్పీఓ రఘునాథ్, డీఆర్డీఓ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
వనపర్తి రూరల్: రైతులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. సోమవారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డులోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి చేశారు. ధాన్యం సేకరణ, తూకం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్మిల్లులు, గోదాములకు తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి దశలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. ‘ఖిల్లా’ మార్కెట్ చైర్పర్సన్గా క్యామ నవనీత ఖిల్లాఘనపురం: ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాలకు కలిపి ఖిల్లాఘనపురంలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా పట్టణానికి చెందిన క్యామ నవనీతను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం జీఓ జారీచేసింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా పెద్దమందడి మండలం దొడగుంటపల్లికి చెందిన కొత్తకాపు వెంకటేశ్వర్రెడ్డి, డైరెక్టర్లుగా దిండు రవీందర్, డి.బాలరాజు, ముప్పురి రత్నయ్య, తలకొండపల్లి రఘునాథ్, బయన్న, పాత్లావత్ బాషా, రవీందర్రెడ్డి, మర్యాద బాలకృష్ణారెడ్డి, బత్తుల దుర్గయ్య, ఎండీ ఖాజా నయీముద్ధీన్, రవీంద్రనాథ్, తూము రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. -
మక్క రైతుల తిప్పలు..
రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు వెంటనే తరలించాలి.. ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే 106 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే గన్నీబ్యాగులు లేవని చెబితే బయట ప్రైవేట్గా కొనుగోలు చేశాం. తూకం పూర్తయినా నేటికీ తరలించడం లేదు. 20 రోజులుగా లారీలు రావడం లేదు. కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం కుప్పలు 100కు పైగా ఉన్నాయి. వర్షం వస్తే మేమేం కావాలి. వెంటనే తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. – రాములు, రైతు, పొలికెపాడు, గోపాల్పేట గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బందులు.. మొక్కజొన్న విక్రయానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడూ లేని విధంగా గన్నీ బ్యాగుల కొరత తలెత్తడంతో ప్రైవేట్లో రూ.30కి సంచి చొప్పున కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంట విక్రయ సమయంలో అదృష్టవశాత్తు అకాల వర్షాలు కురవకపోవడంతో బయటపడ్డాం. – రమేష్, చిన్నంబావి డబ్బులు జమ చేస్తున్నాం.. గన్నీబ్యాగుల కొరత ఉన్నమాట వాస్తవమే. కానీ రైతులు ప్రైవేట్గా కొనుగోలు చేసి తీసుకొస్తే తూకాలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన డబ్బులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాం. ఇప్పటి వరకు 50 శాతానికి పైగా కొనుగోళ్లు పూర్తి చేశాం. చెల్లింపులు కూడా వెంటనే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. కేంద్రాలకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తాం. రైతులు అధైర్యపడొద్దు. – చంద్రమౌళి, మార్క్ఫెడ్ అధికారి, వనపర్తి వనపర్తి: మొక్కజొన్న విక్రయానికి జిల్లా రైతులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలోని గోపాల్పేట, రేవల్లి, ఏదుల, చిన్నంబావి, వనపర్తి, ఖిల్లాఘనపురం మండలాల్లో సాగు సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. దీని ప్రకారం మార్క్ఫెడ్ అధికారులు ధాన్యం కొనుగోళ్లకుగాను జిల్లావ్యాప్తంగా వనపర్తి, గోపాల్పేట, రేవల్లి, ఏదుట, వీపనగండ్ల, పెబ్బేరులో కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరణ బాధ్యతను పీఏసీఎస్లకు అప్పగించారు. కాగా అటు వరి, ఇటు మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టలేక పీఏసీఎస్ సిబ్బంది సతమతమవుతుండగా.. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. తప్పని ఆర్థిక భారం.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు పంట ఉత్పత్తులు తడిసిపోకుండా టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, కావాల్సిన మేర గన్నీబ్యాగులు, తూకం చేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు సరిపడా లారీలు, నిల్వలకు గోదాంలను సమకూర్చాల్సి ఉంది. కాగా మార్క్ఫెడ్ అధికారులు సరైన దృష్టి సారించకపోవడంతో తూకం చేసిన మొక్కజొన్న బస్తాలు కేంద్రాల్లోనే నిల్వ ఉండటం.. రాశులుగా పోసి పంట ఉత్పత్తులు నింపేందుకు సరిపడా గన్నీబ్యాగులు లేకపోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదేమిటని నిర్వాహకులను ప్రశ్నిస్తే గన్నీబ్యాగులు తీసుకొస్తే తూకం చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేది లేక కొందరు రైతులు ప్రైవేట్గా గన్నీబ్యాగులు కొనుగోలు తీసుకొస్తే తూకం చేసి అక్కడే నిల్వ చేసి వదిలేస్తున్నారు. ఈ విషయమై కమ్యూనిటీ పార్టీల నాయకులు సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టినా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. లారీలు, గన్నీబ్యాకుల కొరతే ప్రధాన కారణం తూకాలు చేసినా.. తరలని వైనం ధాన్యం తడుస్తుందని అన్నదాతల ఆందోళన వనపర్తిలో భారీగా నిల్వలు.. వనపర్తి మార్కెట్యార్డులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి వనపర్తి, గోపాల్పేట, ఖిల్లాఘనపురం తదితర ప్రాంతాల రైతులు పెద్దఎత్తున పంట ఉత్పత్తులు విక్రయానికి తీసుకొస్తున్నారు. 20 రోజులుగా కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతు లు మార్కెట్లోనే పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. కొనుగోలు చేసిన ఉత్పత్తులు అధికారు లు కేటాయించిన నిర్దేశిత గోదాంలకు చేరితేనే రై తుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతా యి. కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు నిల్వ ఉండడంతో విక్రయించి రోజులు గడుస్తున్నా.. డ బ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తూ క్రీడాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న యువజన, క్రీడా వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలో జిల్లా యువజన, క్రీడల అధికారి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించగా.. ముఖ్యఅతిథులుగా కలెక్టర్తో పాటు అదనపు ఎస్పీ రాజేష్ మీనా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి బస్డిపో మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు రన్న సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలని కోరారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటామని.. అందరూ ఫిట్నెస్ను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం బాక్సింగ్ స్పోర్ట్స్ క్యాంప్ను ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అదనపు ఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ.. క్రీడలను అలవాటు చేసుకోవడంతో శారీరకంగా దృఢంగా ఉండటం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కలిగి ఉండాలని.. తద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలమన్నారు. కార్యక్రమంలో భాగంగా యూత్, స్పోర్ట్స్ వీక్, టూరిజానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. వారోత్సవాల్లో ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా యువజన క్రీడల అధికారి తెలిపారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్, యూత్ పార్లమెంట్, స్వచ్ఛదనం.. పచ్చదనం, వివిధ రంగాల్లో రాణిస్తున్న యువతకు సన్మానం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ బాలాజీనాయక్, అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. -
మర‘మత్తు’లోనే..!
నడిగడ్డ సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యపు నీడలు గద్వాల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. దో హబ్గా పిలువబడే కృష్ణా, తుంగభద్ర నదులు నడిగడ్డలో పారుతున్నప్పటికీ.. సాగునీటి ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటంతో పంట పొలాలకు సాగునీరు పారడం గగనంగా మారుతోంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు పారి కళకళలాడాల్సిన వ్యవసాయ భూములు కాస్త బీళ్లుగా మారుతున్నాయి. జిల్లావ్యాప్తంగా యాసంగిలో జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 49వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. తుగభద్ర నది పరిధిలోని రాజోళిబండ డైవర్షన్ పథకం కింద రెండేళ్లుగా యాసంగిలో పూర్తిగా పంటలకు క్రాప్హాలిడే ప్రకటించారు. అదే విధంగా కృష్ణానది పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ర్యాలంపాడు జలాశయానికి పలుచోట్ల లీకేజీలు ఏర్పడటంతో ఆయకట్టుకు యాసంగిలో పూర్తిగా క్రాప్హాలిడే ఇస్తున్నారు. అదే విధంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన గేట్ల ఇనుప రోపులు తెగిపోగా.. మరమ్మతు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరమ్మతులను పూర్తిచేయడంలో పాలకులు, అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వానాకాలంలోనే పూర్తిస్థాయిలో.. కృష్ణానది పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద 1,09,296 ఎకరాలు, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1,42,000 ఎకరాలు, తుంగభద్ర నది పరిధిలో ఆర్డీఎస్ కింద 83,998 ఎకరాలతో కలిపి మొత్తం 3,35,294 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఏటా వానాకాలంలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు పారుతోంది. యాసంగిలో మాత్రం కేవలం 49వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు పరిమితమవుతోంది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వానాకాలం ముంచుకొస్తున్నా జూరాల గేట్లకు పూర్తికాని మరమ్మతు యాసంగిలో 26వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ర్యాలంపాడు జలాశయం 2 టీఎంసీలకే పరిమితం నత్తనడకన ఆర్డీఎస్ పనులు ఇదీ పరిస్థితి.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 62 క్రస్ట్ గేట్లు ఉండగా.. అందులో 12 గేట్లకు సంబంధించి ఇనుప రోపులు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఈ ఏడాది వరద సమయంలో ప్రాజెక్టు భద్రతపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు జూరాల ప్రాజెక్టును సందర్శించి.. అంతా బాగుందంటూ ప్రకటనలు చేసి వెళ్లారు. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్ల మరమ్మతు ఇంకా అసంపూర్తిగానే మిగిలింది. ఫలితంగా యాసంగిలో కేవలం 26వేల ఎకరాలకే సాగునీటిని అందిస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు జలాశయం అడుగు భాగాల్లో, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా జలాశయం ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. దీంతో 4 టీఎంసీల సామర్థ్యాన్ని కాస్త 2 టీఎంసీలకు కుదించి.. నాలుగేళ్లుగా ఏటా వానాకాలం పంటకే నీరందిస్తున్నారు. రాజోళిబండ డైవర్షన్ పథకం హెడ్వర్క్స్, గేట్లు, ప్రధాన కాల్వల మరమ్మతు 2007లో మొదలుపెట్టగా.. నేటికీ టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఆర్డీఎస్ కింద యాసంగిలో క్రాప్హాలిడే ప్రకటించడం ఆనవాయితీగా మారింది. -
ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
కొత్తకోట రూరల్: పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. సోమవారం కొత్తకోటలోని పీఏసీఎస్ కార్యాలయంలో కొత్తకోట, పామాపురం గ్రామాల వరి కొనుగోళ్లకు సంబంధించి అధికారులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించాలని సూచించారు. మిల్లర్లు ఆలస్యం చేయకుండా త్వరగా ధాన్యాన్ని దించుకోవాలని సూచించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. అంతకుముందు పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డును, కొత్త మున్సిపల్ భవనం నిర్మాణానికి సంబంధించిన నమూనాను పరిశీలించారు. పుర చైర్పర్సన్ పి.అరుణ, వైస్ చైర్పర్సన్ పి.పల్లవి, మార్కెట్యార్డ్ చైర్మన్ పి ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, రావుల కరుణాకర్రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ బాలరాజు, పామాపురం సీఈఓ రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు. కాజ్వే నిర్మాణానికి భూమిపూజ.. మదనాపురం: మండలంలోని దంతనూరు – శంకరంపేట మధ్యలో ఉన్న వాగుపై కాజ్వే నిర్మాణానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని.. సమస్యను పరిష్కరించేందుకు కాజ్వే నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. నాణ్యత ప్రమాణాలతో నిర్దేశిత కాలపరిమితిలోగా పనులు పూర్తి చేయాలని కోరారు. సర్పంచులు నాగరాజుగౌడ్, శ్రీనివాసులు, తహసీల్దార్ రేపోలు రాజు, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, సుక్క మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
50 శాతం చేరని లక్ష్యం..
జిల్లావ్యాప్తంగా 14 వేల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ లక్ష్యం నిర్దేశించినా.. ఇప్పటికింకా 50 శాతానికి సైతం చేరలేదని రైతులు, రైతు కూలీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సేకరించిన ధాన్యంలో చాలావరకు కేంద్రాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. వరి, మొక్కజొన్న కొనుగోళ్లు ఏకకాలంలో కొనసాగుతున్నాయని.. వరి ధాన్యాన్ని రైస్మిల్లులు, గోదాంలలో నిల్వ చేస్తుండటంతో మొక్కజొన్నకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. రైతులకు చేసిన డబ్బుల చెల్లింపుల వివరాలు చెప్పేందుకు కూడా మార్క్ఫెడ్ అధికారులు అనాసక్తి కనబరుస్తుండటం గమనార్హం. ఇప్పటికీ వనపర్తి మార్కెట్యార్డులో భారీగా మొక్కజొన్న రాశులు కనిపిస్తున్నాయి. -
భూ సేకరణ ప్రక్రియ సాగుతోంది..
లింక్ కెనాల్ నిర్మాణానికి దాదాపు 300 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. గ్రామాల వారీగా రైతులతో మాట్లాడాం. మంత్రి జూపల్లి కృష్ణారావు రెగ్యులర్గా కెనాల్ పనులపై ఆరా తీస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాల ని సూచించారు. ఇప్పటి వరకు కొంతమేరకు కాల్వ తవ్వకాలు పూర్తయ్యాయి. చాలా చోట్ల అక్విడెక్టు పనులు కూడా పూర్తి చేశారు. భూ సేకరణకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ ● -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీ వనపర్తి: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూ సారాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందజేస్తోంది. కొన్నేళ్లుగా వానాకాలం సీజన్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతుల అభ్యర్థనల మేరకు పాలమూరు జిల్లాలో జనుము, జీలుగ విత్తనాలను సిద్ధం చేసి పీఏసీఎస్లు, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లతో పాటు వివిధ కేంద్రాల్లో విక్రయిస్తోంది. రైతులు పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ఏటా పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లాల వారీగా వ్యవసాయశా ఖ అధికారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం వనపర్తి లోని తెలంగాణ రాష్ట్ర విత్తనశుద్ధి కేంద్రంలో 9,200 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు పీఏసీఎస్ కేంద్రాలకు వీటిని సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. ● గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి విత్తనాలు, వ్యవసాయ యంత్రాలపై ఇచ్చే రాయితీని ఎత్తివేసింది. కొంతకాలంగా రైతులకు పెట్టుబడి సాయం సక్రమంగా అందడం లేదు. విత్తనాలపై రాయితీ లేక, పెట్టుబడి సాయం సకాలంలో అందక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలపై 50 శాతం రాయితీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ● పచ్చిరొట్ట ఎరువుల్లో జీలుగ, జనుము, పిల్లిపెసర ఉండగా.. పాలమూరు రైతులు కేవలం జీలుగ, జనుముకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తన శుద్ధి కేంద్రంలో ఆయా విత్తనాలను ప్రాసెసింగ్ చేసి సిద్ధం చేసి ఉంచారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా అందుబాటులో ఉండగా.. పూర్తి ధర రూ.4,905. యాభై శాతం రాయితీతో రైతులు పొందవచ్చు. అలాగే జనుము విత్తనాలు 40 కిలోల బస్తాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ధర రూ.6,220 కాగా.. యాభై శాతం రాయితీతో రూ.3,110కే రైతులకు సరఫరా అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అంచనాల ప్రకారం జీలుగ విత్తనాలు 8,500 క్వింటాళ్లు.. జనుము విత్తనాలు 700 క్వింటాళ్లు సిద్ధం చేసి ఉంచారు. వనపర్తిలోని విత్తనశుద్ధి కర్మాగారంలో తరలింపునకు సిద్ధంగా ఉన్న విత్తనాలు ఉమ్మడి జిల్లా రైతుల కోసం 9,200 క్వింటాళ్లు.. సిద్ధం చేసిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఇప్పటికే నారాయణపేట, పాలమూరు జిల్లాలకు సరఫరా పంట విత్తనాలకు రాయితీ లేనట్టే.. జిల్లాలో వానాకాలం, యాసంగిలో సాగుచేసే వరి, వేరుశనగ, కంది, పెసర, మొక్కజొన్న, మినుములు, పత్తి, మిరప తదితర ఆహార ధాన్యాల విత్తనాలపై ప్రభుత్వం కొంతకాలంగా రాయితీని ఎత్తివేసింది. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన సుమారు 50 వేల క్వింటాళ్ల వరి (సన్నా, దొడ్డురకం) విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసి ఉంచింది. మరో 15 రోజుల తర్వాత పీఏసీఎస్లు, రైతు ఆగ్రో కేంద్రాల ద్వారా వరి, కంది విత్తనాలు రైతులకు విక్రయిస్తారు. వరి 25 కిలోల బస్తాలు, కంది 4 కిలోల బస్తాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. రెండు పర్యాయాలు వానాకాలంలో మెట్ట పంటల సాగు తగ్గిపోవటంతో జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారి విత్తనశుద్ధి కర్మాగారంలో కేవలం వరి, కంది విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేస్తోంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల రైతులకు వ్యవసాయ అధికారుల సిఫారస్ మేరకు జనుము, జీలుగ, ఆహార ధాన్యాల విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలకు 1,050 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు పంపిణీ చేశాం. వర్షాలు ప్రారంభం కాగానే వరి, కంది తదితర ఆహార ధాన్యాల విత్తనాలను సైతం పీఏసీఎస్, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లలో అందుబాటులో ఉంచుతాం. – ఆదినారాయణరెడ్డి, రీజియన్ మేనేజర్, విత్తన శుద్ధికర్మాగారం, మహబూబ్నగర్ -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
వనపర్తిటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారని.. సీఎంఆర్ఎఫ్ వరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో 111 మంది లబ్ధిదారులకు రూ.28.22 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోలేని వారికి వైద్యఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ అందజేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖలో 190 ఈఓ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం పొందే విధంగా కృషి చేసిన చిన్నారెడ్డిని కార్యనిర్వహణాధికారులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణ వేగవంతం
వనపర్తి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం కావాలని, అదేవిధంగా గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వరి కొనుగోళ్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా రోజు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద సరిపడా లారీలను అందుబాటులో ఉంచి, రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రస్తుత అవసరాల మేరకు నిర్దేశిత కొనుగోలు కేంద్రాలకు అదనపు లారీలను పంపాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు, లోడింగ్, అన్లోడింగ్ విషయంలో ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని, పోలీసు అధికారుల సమన్వయంతో అన్లోడింగ్ చేయించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్దేశిత లక్ష్యం ప్రకారం వరి ధాన్యం కొనుగోళ్లు జరగాలని.. రైతులు తెచ్చిన ధాన్యాన్ని వేగంగా తూకం వేసి కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా మేనేజర్ ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైస్మిల్లులు, గోదాంల తనిఖీ.. ఖిల్లాఘనపురం: గోదాములు, రైస్మిల్లుల వద్ద వరి ధాన్యం లారీల అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. ఆదివారం మండలంలోని మానాజీపేట దగ్గర ఉన్న ఖిల్లా ఆగ్రో గోదాం, శ్రీరామ ఇండస్ట్రీస్, లక్ష్మీనర్సింహ రైస్మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ధాన్యంతో ఉన్న లారీలు, డీసీఎంల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, గోదాములు, రైస్మిల్లులకు వచ్చిన వాహనాల్లోని ధాన్యం బస్తాలను దించే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. మండలస్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండాలని.. గ్రామాల్లోని కేంద్రాల దగ్గర వేగంగా తూకాలు చేయించడం, బస్తాలను వెంటనే లారీల్లో మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, ఎస్ఐ వెంకటేష్, ఆర్ఐ తిరుపతయ్య, సింగిల్విండో సీఈఓ కృష్ణ తదితరులు ఉన్నారు. -
ఆగుతూ.. సాగుతూ...
నత్తనడకన సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు ● పూర్తికాని భూసేకరణ ప్రక్రియ ● రూ.147.7కోట్ల వ్యయంతో నాలుగేళ్ల క్రితం పనులకు శ్రీకారం ● కెనాల్ పూర్తయితే 34 వేల ఎకరాలకు సాగునీరు కొల్లాపూర్: సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన కెనాల్ పనులు నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. భూ సేకరణలో జాప్యం కారణంగా నిర్మాణం ముందుకు సాగడంలేదు. ఈ కెనాల్పై ఐదు మండలాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. కెనాల్ నిర్మాణం పూర్తయితే వారికి సాగునీటి సమస్య తీరనుంది. శాశ్వత పరిష్కారం కోసం.. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ, భీమా కెనాల్ కింద వేలాది ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. చివరి ఆయకట్టు రైతులకు యాసంగి సీజన్లో సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని మళ్లించే విధంగా డిజైన్ రూపొందించారు. 2018లో ఈ కెనాల్ నిర్మాణానికి నిధుల కేటాయించగా.. 2022లో విడుదలయ్యాయి. రూ. 147.7కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు 2023లో వేగంగా జరిగాయి. తర్వాతి కాలంలో నిధుల విడుదలలో జాప్యం.. భూసేకరణ సమస్యల కారణంగా పనులు నిలిచిపోయాయి. 5 కి.మీ. మాత్రమే నిర్మాణం.. సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్దిన్నె రిజర్వాయర్ వరకు 22.5 కి.మీ. మేరకు కెనాల్ నిర్మించా ల్సి ఉంది. ఇందులో వనపర్తి జిల్లా పరిఽధిలో 18 కి. మీ., నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో 4.5 కి.మీ., కా ల్వ తవ్వాలి. అయితే వనపర్తి జిల్లా పరిధిలో 200 ఎకరాలు, నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో 100 ఎకరా ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. భూ నిర్వాసితు లకు ఎకరా రూ. 5లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత పరిహారాన్ని రూ. 6లక్షలకు పెంచారు. కానీ రైతులు రూ. 20 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని మొండికేయడంతో కాల్వ తవ్వకాలు రెండేళ్ల క్రితం నిలిచిపోయాయి. గోపల్దిన్నె రిజర్వాయర్ నుంచి దాదాపు 5 కి.మీ. మేరకు మాత్రమే కాల్వ తవ్వకాలు చేపట్టారు. ప్రయోజనం ఇలా.. సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్తో వీప నగండ్ల,చిన్నంబావి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం పాన్గల్ మండలంలో కొంత మేరకు సాగునీరు అందుతోంది. లింక్ కెనాల్కు తూములు ఏర్పా టుచేసి.. సమీపంలోని చెరువులు, కుంటలకు నీరు మళ్లించేలా డిజైన్లు రూపొందించారు. లింక్ కెనాల్ ద్వారా నీటి సరఫరా ప్రారంభమైతే జూరాల ఎడమ కాల్వ కింద ఉన్న 24, 500 ఎకరాల ఆయకట్టు భూములతో పాటు రాజీవ్ భీమా కాల్వల కింద ఉన్న 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుంది. అదే విధంగా వేసవిలో పలు గ్రామాలకు తాగునీటి సమస్యలు కూడా తీరుతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ నిర్మాణంపై నీటిపారుదలశాఖ అఽధికారులతో సమీక్షించారు. పనులు నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. పనుల పూర్తికోసం సంబంధిత కాంట్రాక్టు కంపెనీతో మాట్లాడారు. ఏడాది క్రితం కెనాల్ పనులను పునఃప్రారంభించారు. భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల భూ సేకరణ కోసం కలెక్టర్ల వద్ద రూ. 25కోట్ల మేరకు నిధులు ఉండటంతో రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని ఆయన సూచించారు. కానీ భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో ఇటీవల మంత్రి జూపల్లి మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులను ఒప్పించి భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా రైతులతో మాట్లాడతానని ఆయన వారికి సూచించారు. -
సమన్వయంతో పనిచేయాలి
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడలు, టూరిజం వారోత్సవాలను లైన్ డిపార్ట్మెంట్, మండలస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18వ తేదీన ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ కార్యక్రమం సందర్భంగా ఉదయం 6.30 గంటలకు ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం నుంచి బస్డిపో మీదుగా పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు 2కే రన్, యువ టూరిజం క్లబ్లను జాగృతం చేసే గోడపత్రిక ఆవిష్కరణ ఉంటుందన్నారు. రెండోరోజు కెరీర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, చారిత్రాత్మక పురాతన కట్టడాలపై అవగాహన.. మూడోరోజు యూత్ లీడర్షిప్ సమ్మిట్, పర్యాటకానికి సంబంధించి హెరిటేజ్ వాక్, లోకల్ గైడ్ వలంటీర్ల రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. అలాగే నాలుగోరోజు స్పోర్ట్స్డే సందర్భంగా పెబ్బేరులో ఫుట్బాల్ క్రీడ, ఐదోరోజు యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ, పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛదనం.. ఆరోరోజు ఉద్యోగ సాధన, టూరిజం బ్రాండ్ కిట్ విడుదల కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు. ఆయా కార్యక్రమాలను రోజువారీగా జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించి విజయవంతం చేయాలని ఆదేశించారు. డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, పరిశ్రమల అధికారి జ్యోతి పాల్గొన్నారు. కళా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.. వనపర్తిటౌన్: విద్యార్థులు చదువుతో పాటు కళా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్లో జెడ్పీహెచ్ఎస్ మద్దిగట్ల, మోజర్ల విద్యార్థులు బంజారా, తెలంగాణ బోనాల నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు కళా నృత్యాలను నేర్చుకొని నాటి కళలను, చరిత్రను బతికించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విద్యార్థులను డీఈఓ అబ్ధుల్ ఘనీ అభినందించారు. జీసీడీఓ ఇందిర, పెద్దమందడి మండల విద్యాధికారి మంజులత, ప్రధానోపాధ్యాయుడు ఎస్.వరప్రసాదరావు, జిల్లా కో–ఆర్డినేటర్లు శేఖర్, మహానంది, నారాయణమ్మ, ప్రతాప్రెడి పాల్గొన్నారు. -
సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం
పాలమూరులో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాలు, పర్యాటక క్షేత్రాల ద్వారా వచ్చే పేరు ప్రతిష్టలు, తద్వారా ప్రపంచస్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు నిస్తాయి. ఈ మధ్య కాలంలో దేశ, ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు పర్యాటక క్షేత్రాలు, స్థలాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే వేసవి సెలువు సగం పూర్తయ్యాయి. మరో నాలుగు వారాల్లో విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. అంతలోపు ఈ సెలవుల్లో ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు కుటుంబ సమేతంగా సందర్శించేందుకు మంచి సమయం. రెండు, మూడు రోజుల సమయం కేటాయించి అనుకున్న ప్రాంతాల్లో పర్యటించొచ్చు. ఉమ్మడి జిల్లాలో చూడదగ్గ ప్రాంతాలపై ప్రత్యేక కథనం.. – స్టేషన్ మహబూబ్నగర్ – వివరాలు 8లో.. -
ధాన్యం తరలింపులో జాప్యం సరికాదు
వనపర్తి: ధాన్యం తరలింపులో జాప్యం సరికాదని.. కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా లారీలను అందుబాటులో ఉంచి వేగంగా మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రవాణా కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, వీసీలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. రవాణా కాంట్రాక్టర్లు ప్రభు త్వ అవసరం మేరకు వాహనాలను సమాకూర్చాల్సిందేనని, అవసరమైతే సిమెంట్, ఇసుక తరలింపు లారీలను కూడా వినియోగించాలని సూచించారు. కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా వేగంగా తరలించాలని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లుల వద్ద ధాన్యం దించుకునే విషయంలో ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకు మాత్రమే తరలించాలని.. అలా కాదని ఇష్టం ఉన్నట్లు వ్యవహరించి అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ ఆంజనేయులు, డీటీఓ మానస పాల్గొన్నారు. -
పల్లెల్లో పబ్లిక్ స్కూల్స్
అచ్చంపేట: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఎంపిక చేసిన పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 13 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, పొల్కంపల్లి పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. ఆయా హంగులన్నీ సమకూర్చడంతో టీపీఎస్కు మంచి స్పందన వచ్చింది. డేటా ఆధారిత ఎంపిక.. పాఠశాలల ఎంపికను సాధారణ పరిపాలనా నిర్ణయంగా కాకుండా.. డేటా ఆధారంగా చేపట్టారు. యూడైస్ ఆధారంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలపై బేరీజు వేశారు. మండలస్థాయి నుంచి పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులు సంఖ్య, భవనాల స్థితి, ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలను సేకరించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతిపాదనలను విశ్లేషించి.. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల ఎంపిక చేపట్టారు. ఒక్కో టీపీఎస్కు రూ.15 కోట్లు.. వచ్చే ఏడాది నుంచే ఎంపికచేసిన పాఠశాల ల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభం కా నున్నాయి. ఒక్కో టీపీ ఎస్కు సమారు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. 1,000 నుంచి 1,500 మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే చోట విద్య అందుబాటులోకి రా నుంది. ప్రైవేటు స్కూళ్ల కు ఽధీటుగా డిజిటల్ క్లాస్రూమ్లు, ల్యాబ్ లు, లైబ్రరీలు, క్రీడా సామగ్రి, కొరత లేకుండా టీచర్లు, పూర్తిస్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ వాటర్, కిచెన్షెడ్, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, క్రీడా ప్రాంగణం తదితర అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. దూర ప్రాంతాల పాఠశాలలను విలీనం చేస్తే.. విద్యార్థుల కోసం ప్రభుత్వ స్కూల్ బస్సు ఏర్పాటు చేయనున్నారు. టీపీఎస్ల ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తల్లి దండ్రులు.. ఇప్పడు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వా సం పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా అడ్మిషన్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఆదర్శంగా వంగూరు టీపీఎస్.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న వంగూరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నమూనాను అనుసరించడం ద్వారా నూతన టీపీఎస్లకు ఒక స్థిరమైన ప్రమాణం లభిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం అమలు, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉన్నాయి. అదే విధానాన్ని ఉమ్మడి జిల్లాలో అమలుచేస్తే విద్యార్థుల సామర్థ్యాలు పెరగడంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. సెమీ రెసిడెన్షియల్స్గా.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పనిచేయనున్నాయి. ఒకే గ్రామంలో వేర్వేరు చోట్ల ఉన్న బడులు, జూనియర్ కళాశాలలను ఒకే ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. విద్యార్థులు నర్సరీ నుంచి పదో తరగతి లేదా ఇంటర్ వరకు చదువుకోవచ్చు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల విస్తరణ చర్యలు రాష్ట్ర విద్యారంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలిచే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలో 13 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు అంతర్జాతీయప్రమాణాలతో టీపీఎస్ల నిర్మాణానికి చర్యలు ఒకే చోట నర్సరీ టు ఇంటర్ విద్య వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం -
అకాల వర్షం..అపార నష్టం
ధాన్యం బురదమయం.... 10 రోజులుగా మార్కెట్యార్డులో వరి ధాన్యం ఆరబోస్తున్నా.. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కళ్లెదుటే వర్షానికి కొట్టుకుపోయి బురదమయమైంది. ఒక్కసారిగా వచ్చిన వర్షం మాకు కన్నీరే మిగిల్చింది. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసి న్యాయం చేయాలి. – హన్మంతు, రైతు, మూలమళ్ల పది రోజులుగా పడిగాపులు.. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి పది రోజులు అవుతోంది. తాలు, తేమశాతం ఎక్కువగా ఉందంటూ కాలయాపన చేశారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన వర్షానికి కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతుంటే ఆపలేకపోయాం. టార్పాలిన్లు కూడా లేవు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టా.. ఇప్పుడు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. – ఆంజనేయులు, రైతు, రామన్పాడు, మదనాపురం తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం అకాల వర్షానికి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో కొద్దిమేర ధాన్యం తడిసింది. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తాం. బాయిల్డ్ మిల్లులకు కేటాయించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం. – ఆంజనేయులు, డీఎం, పౌరసరఫరాల సంస్థ వనపర్తి/ఆత్మకూర్/మదనాపురం/కొత్తకోట/ గోపాల్పేట: అన్నదాతలపై వరణుడు కన్నెర్రజేశాడు. జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, అమరచింత, ఆత్మకూర్, గోపాల్పేట, రేవల్లి, మదనాపురం శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న రైతులు ధాన్యం రాశులపై కవర్లు, టార్పాలిన్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. వనపర్తి మండలం చిట్యాల శివారులోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సీసీ యార్డుపై వర్షపు నీరు భారీగా పారడంతో విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షపు నీటితో పాటు డ్రైనేజీలో చేరింది. రైతులు నీటిలో కొట్టుకుపోకుండా ధాన్యం ఆపే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. అలాగే మండలంలోని అచ్యుతాపురం, రాజాపేట, నాగవరం, ఉమ్మడి గోపాల్పేట మండలంలోని చెన్నారం, ఎదుట్ల, బుద్దారం, ఆత్మకూర్, మదనాపురం మార్కెట్యార్డుతో పాటు మండలంలోని అజ్జకొల్లు, రామన్పాడు, కొత్తకోటలోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం తగ్గించుకునేందుకు ఆరబెట్టిన ధాన్యంతో పాటు ఎండిన ధాన్యం కూడా చాలా వరకు తడిసింది. టార్పాలిన్లు కప్పేందుకు వర్షంలోనే ప్రయత్నించినా.. ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. కేంద్రాల్లో తూకం పూర్తయి తరలింపునకు ఉన్న ధాన్యం బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయకపోవడం, సేకరించిన ధాన్యం కూడా సకాలంలో తరలించకపోవడంతో కష్టాలు తప్పడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 వేల బస్తాల వరకు అకాల వర్షానికి తడిసి ఉంటుందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అఽధికారుల ప్రాథమిక అంచనా. కొత్తకోట శివారులో రహదారిపై తడిసిన వరి ధాన్యం కుప్ప ఆత్మకూర్ మండలం మూలమళ్లలో రోడ్డుపై కూలిన చెట్టును తొలగిస్తున్న ప్రయాణికులు రూ.లక్షల్లో నష్టం.. తోటలో మామిడి కాయ లు కోతకు వచ్చాయి. రెండ్రోజుల్లో తెంచాల్సి ఉండగా గాలివానకు రాలిపోయాయి. నాలుగు టన్నులకుపైగానే కాయలు రాలిపోయాయి. దీంతో రూ.లక్షల్లో నష్టం వచ్చింది. – కావలి భాగ్యలక్ష్మి, మామిడి రైతు, ఆరేపల్లి రాలిన మామిడి.. అకాల వర్షానికి మామిడి తోటలు దెబ్బతిన్నాయి ఈదురు గాలులకు కాయలు రాలిపోయాయి. ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, గుంటిపల్లి, తూంపల్లి, వీరరాఘవపూర్ తదితర గ్రామాల్లో ఉన్న తోటల్లో కాయలు కోతకు రాగా గాలికి రాలిపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో స్తంభాలు కూలి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వినియోగదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలి 12 రోజులుగా మార్కెట్యార్డులో ధాన్యం ఆరబోస్తున్నా. సకాలంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయకపోవడంతో వర్షానికి తడసింది. మళ్లీ ఆరడానికి రెండ్రోజులు పడుతుంది. మా బాధలు తీర్చేవారే కరువయ్యారు. – మధు, రైతు, ఆత్మకూర్●నిలిచిన విద్యుత్ సరఫరా.. అమరచింత – ఆత్మకూర్ మధ్యలో చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూర్ గాంధీచౌక్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడ్డారు. డ్రైనేజీ వద్ద కల్వర్టు నిర్మించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ట్రాన్స్కో అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


