breaking news
Wanaparthy
-
రెండోరోజు 239 నామినేషన్లు దాఖలు
వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండోరోజు గురువారం ఊపందుకుంది. జిల్లాలోని ఐదు పురపాలికల్లో మొత్తం 239 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా వనపర్తి పురపాలికలో 108 నామినేషన్ పత్రాలను వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. అభ్యర్థులు ఆయా వార్డుల నుంచి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్లు పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ 38, బీజేపీ 19, బీఆర్ఎస్ 31, సీపీఎం 2, సీపీఐ 1, స్వతంత్ర అభ్యర్థులు 17 మంది నామినేషన్లు వేశారు. పెబ్బేరులో.. వనపర్తి రూరల్: పెబ్బేరులోని పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో గురువారం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీజేపి నుంచి 9, కాంగ్రెస్పార్టీ పార్టీ 11, బీఆర్ఎస్ పార్టీ నుంచి 7, బీఎస్పీ నుంచి ఒకరు, టీజీఎస్ఈసీ నుంచి 3, ఇండిపెండెంట్గా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారని పుర కమిషనర్ ఖాజా ఆరీఫుద్దీన్ వివరించారు. ఆత్మకూర్లో 36 మంది.. ఆత్మకూర్: పుర పరిధిలోని 10 వార్డులకుగాను గురువారం కాంగ్రెస్పార్టీ తరుఫున 16 మంది, బీఆర్ఎస్ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ఏడుగురు, స్వతంత్రులు ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇదివరకు 36 నామినేషన్లు దాఖలైనట్లు పుర కమిషనర్ చికినె శశిధర్ తెలిపారు. అమరచింతలో 32.. అమరచింత: పుర ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండోరోజు గురువారం జోరందుకుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ రాత్రి 7.30 వరకు కొనసాగింది. సాయంత్రం 5 వరకు క్యూలో నిల్చున్న అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించడానికి సమయం పట్టిందని పుర కమిషనర్ తెలిపారు. కాగా గురువారం బీజేపీ నుంచి 9 మంది, సీపీఐ(ఎం) నుండి 4, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి ఐదుగురు, స్వత్రంత్రులు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కొత్తకోటలో.. కొత్తకోట రూరల్: కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో గురువారం 35 నామినేషన్లు దాఖలైనట్లు పుర కమిషనర్ సైదయ్య తెలిపారు. కాంగ్రెస్ నుంచి 12, బీఆర్ఎస్ నుంచి 13, బీజేపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, టీఆర్పీ నుంచి ఒకరు, స్వతంత్రులు నలుగురు నామినేషన్లు వేశారు. -
జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు
పాన్గల్: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని.. రైతులు ఆందోళన చెందవద్దని ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి దామోదర్గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూరియా పంపిణీపై అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని, అవసరం ఉన్న రైతులే తీసుకోవాలని సూచించారు. గురువారం ఒక్కరోజే 1,650 బస్తాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు పంపిణీ చేసిన వివరాలను ఆయన పరిశీలి ంచారు. కార్యక్రమంలో ఏఓ మణిచందర్, సింగిల్విండో అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆన్లైన్లోనే యూరియా బుకింగ్.. కొత్తకోట రూరల్: వానాకాలంలో యూరియా కొరత, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సాగుకుగాను బుకింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి, కొత్తకోట ఏడీఏ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని.. ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు. జిల్లా రైతులు సమీప ఫర్టిలైజర్ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలుసుకొని ఫోన్నంబర్, పట్టాదారు పాసు పుస్తకం ఉపయోగించి బుక్ చేసుకోగలరని సూచించారు. ఏమైనా సందేహాలుంటే ఏఈఓలు లేదా ఏఓలను సంప్రదించాలన్నారు. -
పుర ఎన్నికల్లో ఆర్వోలే కీలకం
వనపర్తిటౌన్: పుర ఎన్నికల నిర్వహణలో కీలకమైన నామినేషన్ల పత్రాల పరిశీలన విధానాన్ని ఎన్నికల సంఘం సరళతరం చేసింది. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా నామినేషన్ల స్వీకరణ నుంచి విజేతలకు ధ్రువపత్రాల ఽజారీ వరకు అన్నింటిని చూసుకునే పుర కమిషనర్లకు ఎన్నికల నిర్వహణ భారాన్ని తప్పిస్తూ రిటర్నింగ్ అధికారులకు బాధ్యతలు కట్టబెట్టింది. ఈసారి పుర ఎన్నికలకు గెజిటెడ్ హోదా ఉన్న అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. మున్సిపాల్టీకి రిటర్నింగ్ అధికారి ఒక్కరుంటే సమస్యలు ఉత్పన్నమవుతాయని గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు వార్డులకు ఒకరు బాధ్యతలు నిర్వర్తించేలా నియమించింది. దీంతో ఎన్నికల ప్రక్రియలో వేగం పెరగడంతో పాటు ఆయా వార్డులకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. దీనికితోడు ప్రతి రిటర్నింగ్ అధికారికి మరో సహాయ రిటర్నింగ్ అధికారిని సైతం నియమించారు. ఎన్నికల ఫలితాలు సైతం ఆయా వార్డుల ఆర్వోలే ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. ఏదేని పురపాలికలో ఒక్క వార్డు ఎక్కువైతే ఒక అధికారికి అదనంగా కేటాయించారు. తక్కువైతే రెండింటికే పరిమితం చేస్తారు. అంతేగాకుండా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఆటంకం కలిగే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో రిజర్వ్ అధికారులను సైతం నియమించారు. పెరగనున్న పరిశీలన.. పుర ఎన్నికల్లో నామినేషన్ పత్రాల పరిశీలన సుశితంగా ఉండనుంది. ఏ చిన్న పొరపాటు గుర్తించినా తిరస్కరిస్తారు. నామినేషన్ పత్రాల ఆమోదానికి అభ్యర్థులు పొందుపర్చిన పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఏ చిన్న తప్పు జరిగినా అధికారిదే బాధ్యత. పురపాలికల వారీగా సిబ్బంది కేటాయింపు ఇలా.. మున్సిపాలిటీ ఆర్వోలు ఏఆర్వోలు రిజర్వ్ రిజర్వ్ ఆర్వోలు ఏఆర్వోలు వనపర్తి 11 11 2 2 కొత్తకోట 5 5 2 2 పెబ్బేరు 4 4 2 2 ఆత్మకూర్ 4 4 1 1 అమరచింత 4 4 1 1 నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ధ్రువీకరణ పత్రాల జారీ వరకు వారిదే బాధ్యత నామినేషన్ల పరిశీలన సరళీకృతం అభ్యర్థులకు తప్పనున్న అనుమానాలు -
పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ
కొత్తకోట రూరల్/వనపర్తి రూరల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తకోటలోని ఎంపీడీఓ కార్యాలయం, పెబ్బేరులోని పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన సందర్శించి ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారులు పబ్లిష్ చేసిన ఎన్నికల నోటీస్ ఫారం–1ను పరిశీలించారు. అభ్యర్థులకు కావాల్సిన సమాచారాన్ని హెల్ప్డెస్క్లో అందించాలని, ఓటరు జాబితాను సైతం అందుబాటులో ఉంచాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, వివరాలను ఎప్పటికప్పుడు టీపోల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. స్వతంత్రులకు గుర్తులు చూపించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్రూం పరిశీలన.. కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెబ్బేరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విశాలమైన ప్రాంతంలో సులువుగా అర్థమయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ఓట్ల లెక్కింపు కేంద్రంలో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్రూమ్ను స్వయంగా పరిశీలించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ రాంబాబు, కొత్తకోట ఎంపీడీఓ వినిత్, పుర కమిషనర్ సైదయ్య, పెబ్బేరు తహసీల్దార్ మురళీగౌడ్, పుర కమిషనర్ ఖాజా ఆరీఫోద్దీన్ రెవెన్యూ అధికారులు ఉన్నారు. -
కాంగ్రెస్పై తిరుగుబాటు మొదలైంది
వనపర్తిటౌన్: కాంగ్రెస్పార్టీ అబద్ధాల వైపు కాకుండా నిజమైన అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు నిలబడాలని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కోరారు. గురువారం జిల్లాకేంద్రంలోని మాజీ నిరంజన్రెడ్డి నివాసంలో ఆయనతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు పునాదులు, అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందని తెలిపారు. మహిళ నుంచి మొదలు అన్నివర్గాల ప్రజలు పుర ఎన్నికల వేధికగా నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నిరంజన్రెడ్డి హయంలో జరిగిన అభివృద్ధి.. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు విడతల వారీగా అమలు చేస్తామని చెప్పి నేటికీ నెరవేర్చడం లేదన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అభిప్రాయాపడ్డారు. పుర ఎన్నికల్లో లబ్ధికే సిట్ నోటీసులు.. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపిందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ది భయపడే నైజం కాదని.. బరి గీసి కొట్లాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబులాంటి నాయకులే తెలంగాణవాదాన్ని అణిచివేసేందుకు, ఉద్యమస్ఫూర్తిని దెబ్బతీసేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొన్నారని వివరించారు. ఆయన కంటే సీఎం రేవంత్రెడ్డి మించినోడు కాదని.. కేసీఆర్ స్థాయిని పలుచన చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చిల్లర రాజకీయాలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి సానుకూలత ఉందని, కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉందని తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ -
ఎట్లైనా పోరుబాట..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలక ఎన్నికలకు సంబంధించి డివిజన్లు/వార్డుల వారీగా కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. బీఫాంలు ఎవరికి ఇస్తారనేది తేలలేదు. నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. ప్రధానంగా అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లోనూ అనిశ్చితి నెలకొంది. టికెట్పై మీమాంస కొనసాగుతుండగా.. పలువురు ఆశావహులు ప్లాన్–ఏ లేదంటే ప్లాన్–బీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఏదేమైనా బరిలో నిలిచే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరమైతే పార్టీ మార్పు లేదంటే స్వతంత్రంగానైనా రంగంలోకి దిగేలా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు పలు మున్సిపాలిటీల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ వైపు చూపులు.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లో టికెట్ ఖరారు కాని పక్షంలో పలువురు పార్టీ మారి.. బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు ఎక్కువ శాతం స్వతంత్రంగా పోటీలో ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీఆర్ఎస్కు చెందిన వారు మాత్రం బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి డీకే అరుణ గెలుపొందగా.. అప్పుడు నగర పరిధిలో ఆ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్ ఎన్నికలను కమలం నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే 43 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే 17 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిలువరించేందుకేనా.. అధికార కాంగ్రెస్లో భారీగా ఆశావహులు ఉండడం ఆ పార్టీ ముఖ్య నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని.. ఇది పాత కాంగ్రెస్ కాదు, కొత్త కాంగ్రెస్.. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. జీపీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచినప్పటికీ.. బీఆర్ఎస్ సత్తా చాటింది. కొన్ని చోట్ల తక్కువ ఓట్లతోనే ఇతర అభ్యర్థులు గెలుపొందారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రెబల్స్ను నిలువరించేందుకు ఆయన ఆ విధంగా హెచ్చరికలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పలు మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పొత్తులకు తెరలేపాయి. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, వనపర్తి జిల్లాలోని అమరచింతతో పాటు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఈ తరహా రాజకీయాలు నడుస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర పురపాలికలో గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరుదామనుకున్నా అడ్డుకోవడంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఓ నాయకుడు తన భార్యను చైర్మన్గా చేయాలనే లక్ష్యంతో పావులు కదిపినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచేలా స్కెచ్ వేయడంతో పాటు బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ నారాయణపేటలో ఎంఐఎం, అమరచింతలో కాంగ్రెస్, సీపీఎంతో పొత్తు పెట్టుకునేలా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండగా.. ఇదే రోజు ప్రధాన పార్టీలు డివిజన్లు/వార్డుల వారీగా తమ తమ కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. కొన్ని ఉదాహరణలు.. కాంగ్రెస్కు సంబంధించి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా అన్ని డివిజన్లలో కార్పొరేటర్ కోసం ఇద్దరికి మించి పోటీపడుతున్నారు. ఒకటో డివిజన్లో 19 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ డివిజన్లో ఇప్పటివరకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో డివిజన్కు ముగ్గురు నామినేషన్లు వేశారు. 39వ డివిజన్లో ముఖ్య నాయకులు ఇద్దరు నామినేషన్లు వేయడం పోటాపోటీకి నిదర్శనంగా నిలుస్తోంది. కార్పొరేషన్లోని 52వ డివిజన్కు సంబంధించి బీఆర్ఎస్ నాయకుడైన మాజీ కౌన్సిలర్ ఒకరు పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన బీజేపీ వైపు అడుగుల వేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆ డివిజన్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయన చేరిక ఖాయమని తెలుస్తోంది. భారీగా ఆశావహులతో అనిశ్చితి.. తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో కార్పొరేటర్ పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పదవులకు పోటీ చేయాలని అనుకుంటున్న అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ రెండు పర్యాయాలు, బీఆర్ఎస్ ఒకసారి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంగ్రెలో తొలుత 376, ఆ తర్వాత 292 దరఖాస్తులు రాగా.. బీఆర్ఎస్లో 440 మంది వరకు అర్జీ పెట్టుకున్నారు. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులతో ఆయా పార్టీల్లో అభ్యర్ధిత్వాల ఖరారుపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని పలు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో రెబల్స్ ప్రభావం లేకుండా పార్టీల ముఖ్యులు ఆయా వ్యక్తులతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో అభ్యర్థుల ఫైనల్ జాబితా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. -
వెంకటేశ.. నమోస్తుతే...
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం సమీపంలోని కోటకదిరలో ఉన్న ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్ ఇంటి నుంచి స్వామి ఉత్సవమూర్తిని మన్యంకొండ గుట్టపైకి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోలాటాలు, భజనలతో కోటకదిర గ్రామం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. ముందుగా స్వామివారిని వివిధ బంగారు ఆభరణాలతో అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారికి గరుడవాహన సేవ నిర్వహించారు. -
మొదటిరోజు 34 నామినేషన్లు
● వనపర్తిలో అత్యధికం.. అమరచింతలో నిల్ వనపర్తిటౌన్: జిల్లాలోని ఐదు పురపాలికల్లో బుధవారం మొదటిరోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. పుర కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్లో మొత్తం 34 నామినేషన్లు రాగా.. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్పార్టీ నుంచి 16 మంది, బీఆర్ఎస్ నుంచి 8 మంది, బీజేపీ, స్వతంత్రంగా ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అమరచింత మున్సిపాలిటీలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పెబ్బేరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు దూరంగా ఉండగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి 6వ వార్డు నుంచి నామినేషన్ వేశారు. ● కొత్తకోటలోని 1 వార్డులో 2, 7వ వార్డులో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా వార్డుల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కొక్క నామినేషన్ వేశారు. ● ఆత్మకూర్లో 4 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో కాంగ్రెస్ నుంచి 3, బీఆర్ఎస్ నుంచి ఒక నామినేషన్ ఉన్నాయి. ● వనపర్తి మున్సిపాలిటీలో 25 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో కాంగ్రెస్ నుంచి 11, బీఆర్ఎస్ నుంచి 6, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల నుంచి నాలుగేసి నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. 1, 2, 6, 7, 9, 10, 12, 13, 18, 21, 23, 26, 27, 28, 33వ వార్డులో ఒక్కో నామినేషన్, 16, 24, 25వ వార్డుల్లో రెండేసి నామినేషన్లు, 14వ వార్డులో నలుగురు నామినేషన్లు వేశారు. 14వ వార్డులో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్.. జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను బుధవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనల ప్రకారం కొనసాగించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్డెస్క్ ఏర్పాటు, నమూనా నామినేషన్ పత్రాలు, ఓటరు జాబితా అందుబాటులో ఉంచడం తదితర సౌకర్యాలు కల్పించడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చిన నామినేషన్లను ఎప్పటికప్పుడు స్కాన్చేసి టీపోల్ యాప్లో అప్లోడ్ చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలని, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగించాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఎన్.వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఆయన వెంట స్పెషల్ ఆఫీసర్, అదనపు కలెక్టర్ యాదయ్య, సిబ్బంది ఉన్నారు. పురపాలికల వారీగా దాఖలైన నామినేషన్లు.. మున్సిపాలిటీ నామినేషన్ల సంఖ్య వనపర్తి 25 కొత్తకోట 4 ఆత్మకూర్ 4 పెబ్బేర్ 1 అమరచింత – -
నోడల్ అధికారుల పాత్ర కీలకం
వనపర్తి: మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్నికల నోడల్ అధికారుల సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందని, కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా పాటించేలా డీఆర్డీఓ ఉమాదేవి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ అనంతరం వాటిని పోలీసు రక్షణలో తీసుకొచ్చే బాధ్యతను మత్స్యశాఖ అధికారి లక్ష్మప్పకు అప్పగించారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన విభాగాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిబంధనలను క్షుణ్ణంగా చదవాలని, ఏవైనా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి సకాలంలో ఉత్తర్వులు అందజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఎఫ్ఎన్టీ, ఎస్ఎస్టీ బృందాలకు వాహనాలతో పాటు ఎన్నికల సామగ్రి తరలించేందుకు కావాల్సిన రవాణా సౌకర్యాలను సమకూర్చాలని జిల్లా రవాణాశాఖ అధికారికి సూచించారు. అదేవిధంగా నోడల్ అధికారులు తమ కార్యాలయాల్లో ఉన్న రాజకీయ సంబంధిత చిహ్నాలు, పోస్టర్లు తొలగించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్, డీపీఆర్ఓ సీతారాం, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, డీటీఓ మానస తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఉండాలి పుర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని.. రాజకీయ పార్టీల ప్రతినిధులు నియమావళి, నిబంధనలకు కట్టుబడి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు ముందస్తుగా తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాలని, సంబంధిత రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకునే నాటి వరకు ఫారం–బి సమర్పించేలా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : ఎమ్మెల్యే
వనపర్తి టౌన్/రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో పట్టణంలోని 30వ వార్డు సాయినగర్కాలనీ, ఐజానగర్కాలనీ, జంగిడిపురం, నందిహిల్స్ నుంచి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో 60 మంది, శ్రీరంగాపురం మండలం తాటిపాముల ఉపసర్పంచ్ కుర్మయ్యతో పాటు 60 మంది, పెబ్బేరుకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ నేత ఐజాక్తో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి సమక్షంలో కాంగ్రెస్పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సరైన సమయంలో పార్టీలో చేరడం శుభ పరిణామన్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో పదవుల్లో ఉన్నమే తప్ప ఎలాంటి గౌరవ మర్యా దలు దక్కలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వాటికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. -
పురం పిరం..!
పురపాలికల్లో ఇదే రాజ‘కీ’యం ● ఆర్థిక స్థోమత ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ● కౌన్సిలర్/కార్పొరేటర్ నుంచి చైర్మన్/మేయర్ వరకూ.. ● ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు.. అన్ని పార్టీలదీ ఇదే దారి ● కర్ణాటక సరిహద్దు జిల్లాలోని ఓ మున్సిపాలిటీకి భలే గిరాకీ ● చైర్మన్ గిరికి పలికిన ధర సుమారు రూ.5 కోట్లు? ● ఎన్హెచ్పై ఉన్న మరో దాంట్లో ఆర్థిక బలమే పరమావధిగా.. -
ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి
వనపర్తి: పుర ఎన్నికల ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచార సామగ్రి అయిన వాల్పోస్టర్లు, కరపత్రాల్లో కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించరాదని, వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలన్నారు. పబ్లిషర్ నుంచి ఫారం–ఏలో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఏ, బీతో పాటు ముద్రించిన రెండు కరపత్రాలను జతపర్చి కలెక్టరేట్కు పంపించాలన్నారు. ముద్రించిన కరపత్రం లేదా గోడపత్రికపై ప్రింటింగ్ప్రెస్ పేరు, చిరునామా కచ్చితంగా పేర్కొనాలని, అంతేగాకుండా పబ్లిషర్ పేరు ఫోన్నంబర్ ముద్రించాలని సూచించారు. ఎన్ని పేజీలు ముద్రించారు.. అందుకు తీసుకున్న డబ్బులు ఎన్ని అనే వివరాలు ఫారం–బిలో చూయించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
ఆత్మకూర్: బీఆర్ఎస్ హయాంలో ప్రజాప్రతినిధులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చూసి పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. బుధవారం రాత్రి మంత్రి నివాసంలో స్థానిక పురపాలికకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు దండు శ్రీను ఆధ్వర్యంలో పలువురు మంత్రి సమక్షంలో కాంగ్రెస్పార్టీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలకులు ఆత్మకూర్కు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 300 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. అలాగే రూ.3.14 కోట్లతో చెరువుకట్ట విస్తరణ, సుందరీకరణ పనులతో పాటు రూ.15 కోట్లతో వార్డుల్లో సీసీ రహదారులు, డ్రైనేజీలు, రూ.123 కోట్లతో కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పుర ఎన్నికల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, మరింత అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు గంగాధర్గౌడ్, పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, భాస్కర్, దామోదర్, మహేష్, సాయిరాఘవ, షాలం, జుబేర్, కరణ్లాల్, జహంగీర్, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు. -
ఐదురోజుల పని విధానం అమలు చేయాలి
వనపర్తిటౌన్: ఐబీసీ ప్రతిపాదించిన వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్ చౌక్లో ఉన్న ఎస్బీఎన్ మెయిన్ బ్రాంచ్ ఎదుట ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదురోజుల పని విధానం అమలుచేస్తే రోజు 40 నిమిషాలు అదనంగా ఖాతాదారులకు సేవలందించ వచ్చన్నారు. అంతకుముందు బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూఎఫ్బీయూ సభ్యులు, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
పీఎఫ్తో కార్మికులకు ప్రయోజనం
అమరచింత: కంపెనీల్లో పనిచేసే కార్మికులకు పీఎఫ్తో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని హైదరాబాద్ పీఎఫ్ కార్యాలయ అధికారి రుధీర్రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘాన్ని సందర్శించిన ఆయన కార్మికులతో సమావేశమై ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన, ఎంప్లాయి ఎన్రోల్మెంట్ కాంపెయిన్ గురించి అవగాహన కల్పించారు. కంపెనీ యాజమాన్యాలతో పాటు ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. యాజమాన్యం ప్రతి కార్మికుడు, ఉద్యోగికి పీఎఫ్, ఇన్సూరెన్స్, పింఛన్ అందేలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో కంపెనీ సీఈఓ ఎం.చంద్రశేఖర్, కంపెనీ డైరెక్టర్ పొబ్బతి అశోక్, సిబ్బంది మహేష్తో తదితరులు పాల్గొన్నారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు పాన్గల్: రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నామని ఓ పక్క అధికారులు చెబుతుండగా.. మరోపక్క తమకు అందడం లేదని మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉదయం వచ్చి వరుసలో నిలబడి ఆధార్కార్డు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ అందజేసినా యూరియా అందకపోవడంతో ఆగ్రహించిన వివిధ గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అనంతరం సింగిల్విండో అధికారులను పిలిపించి జిరాక్స్ ప్రతులు అందజేసిన వారికి పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించి సింగిల్విండో కార్యాలయానికి చేరుకున్నారు. పుర కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా కొత్తకోట: బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలంటూ స్థానిక పుర కార్మికులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నిక్సన్ మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు చెల్లించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏడాదిగా పీఎఫ్ డబ్బులు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం లేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, కార్మికుల చదువు, వృత్తి నైపుణ్యాలను గుర్తించి జవాన్లు, డ్రైవర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం, పండుగ రోజుల్లో సెలవులు ఇవ్వాలని, పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త సిబ్బందిని నియమించాలని కోరారు. ఫిబ్రవరి 12న జరగనున్న ఒకరోజు సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జె.ఎర్రన్న, కొండన్న, బాలస్వామి, రమేష్, పెద్దరాజు, ఎర రాజు, శిరీష, సుశీల, మణెమ్మ, సుగుణమ్మ, నయోమి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ తూట్లు
● పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ● శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ వనపర్తిటౌన్: బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంతో పని చేయాలని శాసనమండలి మాజీ చైర్మన్, పుర ఎన్నికల ఇన్చార్జ్ స్వామిగౌడ్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రమేష్గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆంధ్ర పాలకుల తొత్తుగా మారి తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. పుర ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని, టికెట్ రాలేదని నిరాశ చెందకుండా అవకాశం కోసం వేచి ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలుచేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి, తీవ్ర వ్యతిరేకత ఉందని.. పుర ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారాని తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. హస్తానికి ప్రజల అండ లేదని, మున్సిపల్ ఎన్నికలతో హస్తం అస్తమిస్తోందని జోస్యం చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అంతర్గత సర్వే నిర్వహిస్తోందని, విశ్వాసం, విధేయత, కార్యకర్తల ఏకాభిప్రాయం మేరకే అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు. టికెట్ పొందిన అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్కు మన తరఫున బహుమతి ఇద్దామని ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు జిల్లాకేంద్రం నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కె.మాణిక్యం, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పుర ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు
వనపర్తి: పురపాలిక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ సునీతారెడ్డి పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 80 వార్డులకుగాను 6 ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. పోలీస్శాఖ సహకారంతో ఈసీ నిబంధనల మేరకు అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల నియమావళి అమలులోకి.. పుర ఎన్నికల ప్రకటన వెలువడటంతో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, అధికారులు నిష్పాక్షికంగా నిబంధనలకు లోబడి పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పుర ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం పుర కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సిబ్బందితో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పురపాలికల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులు, సిబ్బంది ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫొటోలు, ఫ్లెక్సీలు, ఇతర రాజకీయ చిహ్నాలను 24 గంటల్లోగా, బహిరంగ ప్రదేశాల్లోని రాజకీయ పోస్టర్లు, కటౌట్లను 48 గంటల్లో తొలగించాలని ఆదేశించారు. తదుపరి 24 గంటల్లో ప్రైవేట్ ప్రదేశాల్లోని రాజకీయ సంబంధిత ఫ్లెక్సీలు తీసివేయాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులు బుధవారం ఉదయం 10.30 లోగా తమ వార్డులకు సంబంధించి ఫారం–1 ఎన్నికల నోటీస్, ఓటరు జాబితాను పబ్లిష్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఓటరు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికీ అనుకూలంగా వ్యవహరించొద్దని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన రిపోర్టులను వేగంగా టీ–పోల్ యాప్లో అప్లోడ్ చేసేలా ఆపరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. రోజువారీ నివేదికలను ఎప్పటికప్పుడు పంపించేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎల్పీఓ రఘునాథ్, డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్రెడ్డి, సీపీఓ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత.. మహిళా సంఘాల బాధ్యత
కొత్తకోట రూరల్: గ్రామస్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని.. తమ కుటుంబాలతో పాటు సమాజాన్ని కూడా ప్రమాదాల నుంచి రక్షించాలని ఎస్పీ సునీతరెడ్డి కోరారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అలైవ్.. అరైవ్’ కార్యక్రమంలో భాగంగా 10వ రోజు మంగళవారం ఉదయం పెద్దమందడిలోని రైతువేదికలో మహిళా స్వయం సహాయక సంఘాలు, విలేకర్లకు ‘అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కుటుంబంలోని భర్త, పిల్లలు, అన్నాదమ్ములు సురక్షితంగా ఇంటికి చేరాలంటే మహిళలు వారికి హెల్మెట్ వినియోగంపై నిరంతరం గుర్తుచేయాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, అది చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా కుటుంబ ప్రాణాలను కాపాడే భద్రతా కవచమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. అనంతరం అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ సహకారంతో 65 హెల్మెట్లను పాత్రికేయులు, పోలీసు సిబ్బంది, మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంవీఐ సైదులు, కొత్తకోట సీఐ రాంబాబు, పెద్దమందడి ఎస్ఐ జలంధర్రెడ్డి, అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ నిర్వాహకులు, సర్పంచ్ గంగమ్మ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబ్నగర్లోని జడ్చర్ల, నాగర్కర్నూల్లోని అచ్చంపేట పురపాలికల పాలక వర్గాల పదవీ కాలం మే నెలలో ముగియనుంది. ఇవి పోనూ మిగిలిన 19 (ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలు) వాటిలో ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. ఇదే జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న దేవరకద్ర, నారాయణపేట జిల్లాలో మద్దూర్ మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ఈ మూడు పురపాలికల్లోనూ తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. -
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి
ఆత్మకూర్: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను కై వసం చేసుకొని సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మంత్రి నివాసంలో ఆత్మకూర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు మంత్రి సమక్షంలో హస్తం గూటికి చేరగా.. ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆత్మకూర్లో రూ. 3.14కోట్లతో చెరువుకట్ట సుందరీకరణ, వార్డుల్లో రూ. 15కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీలు రూ. 123 కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని.. మరింత రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేశ్, తులసీరాజ్, నల్లగొండ శ్రీను, కుర్ని రవికాంత్, సద్దల వెంకట్రాములు, దామోదర్, మహేశ్, అశోక్, సాయిరాఘవ, షాలం, జూబేర్, కరణ్లాల్ పాల్గొన్నారు. -
ఇంటింటా సంక్షేమం
జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు ● అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం ● కలెక్టర్ ఆదర్శ్ సురభి ● ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు ‘‘జిల్లాలో అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కాకుండా.. ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్య, వైద్యం అందించడం.. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను అందరూ గౌరవించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుచేస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరం పునరంకితమవుదాం.’’ – కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్పీ డి.సునీతారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డిలతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా.. జిల్లాలో రూ. 126.34కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. 85,237 మందికి రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు వివరించారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో మండల మహిళా సమాఖ్యల ద్వారా 10 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వగా.. ప్రతినెలా దాదాపు రూ. 69వేల చొప్పున ఆదాయం లభిస్తుందన్నారు. అమరచింత, వనపర్తి మండలాలకు ‘కుసుమ్ ప్రాజెక్టు‘ ద్వారా 2 మెగావాట్ల సోలార్ పవర్ప్లాంట్లు మంజూరైనట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో పెట్రోల్బంక్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎకరా స్థలం కేటాయించిందన్నారు. రూ. 5కోట్లతో చేపట్టిన జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలోని 1,22,472 మంది మహిళా సంఘ సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో 22,051 మందికి ఉచితంగా చికిత్సలు అందించేందుకు రూ. 57.37 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గృహజ్యోతి పథకంతో 83,882 మందికి జీరో బిల్లులు జారీ చేసి.. రూ.41.7 కోట్ల సబ్సిడీని అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతుందన్నారు. జిల్లాలో 6,047 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా.. 73 శాతం నిర్మాణాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 51 గృహాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని.. లబ్ధిదారులకు రూ. 81.71 కోట్ల బిల్లులు చెల్లించినట్లు కలెక్టర్ వివరించారు. చేయూత పథకంతో 70,909 మందికి ప్రతినెలా రూ. 17.61 కోట్ల పింఛన్లు అందిస్తున్నామన్నారు. పంట రుణమాఫీ పథకం కింద జిల్లాలో మొత్తం 60,545 మంది రైతులకు రూ. 480.91 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతు బీమా పథకంతో 245 మంది నామినీల బ్యాంకు ఖాతాల్లో రూ. 12.25కోట్లు జమ చేసినట్లు వివరించారు. రైతుభరోసా పథకంతో వానాకాలం 2025 సీజన్లో 1.75 లక్షల మంది రైతులకు రూ. 205.93 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించడం జరిగిందన్నారు. 2025–26 సీజన్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరిధాన్యం విక్రయించిన 30వేల మంది రైతులకు రూ.76.18 కోట్ల బోనస్ చెల్లించినట్లు తెలిపారు. వానాకాలంలో 395 కేంద్రాల ద్వారా 2.86 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 1,80,857 రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 10,847 కొత్త రేషన్ కార్డులతో పాటు 66,929 మంది అదనపు కుటుంబ సభ్యులను కూడా ఇదివరకే ఉన్న కార్డుల్లో చేర్చడం జరిగిందన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ద్వారా 1.70లక్షల టీబీ అనుమానిత కేసులను గుర్తించగా.. వారిలో 339 మందిని నోటిఫై చేయడం జరిగిందన్నారు. వీరికి సీఎస్ఆర్ ద్వారా పోషణ కిట్లు, ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా మిషన్ మధుమేహ ద్వారా గతేడాది 19,643 మంది బాధితులను గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఎదగాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రూ. 47.50 కోట్లతో చేపట్టిన వనపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలుర), జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నా యన్నారు. 2025–26 సంవత్సరానికి గాను పీఎంశ్రీ ర్యాంకింగ్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించిందన్నారు. -
మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలి
దేవరకద్ర: మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయని, పార్టీపరంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు అందరు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. పార్టీ టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దని వారిని పార్టీ ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తుందన్నారు. టికెట్ రాని వారు నిరాశకు గురి కాకుండా పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు. దేవరకద్ర మున్సిపాలిటీలోని 12 వార్డులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తామని, అలాగే వార్డుల వారీగా సర్వేలు చేసి, అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి అందరూ ఐక్యమత్యంగా పని చేయాలని కోరారు. సమావేశంలో నాయకుల లక్ష్మీకాంత్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, బాలస్వామి, అంజన్కుమార్రెడ్డి, వెంకటేశ్, వేణుగోపాల్రెడ్డి, ఫారూఖ్, ఆదిహన్మంతరెడ్డి, శంకర్, శ్రీనివాస్రెడ్డి, బాల్రాజు, చెన్నయ్య, రాము, రాములు, చంద్రమౌలి, బుచ్చన్న, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల ఇంటికే బంగారం..
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇటు ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు అటూ ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా పార్సింగ్, కొరియర్ సేవలు అందజేస్తోంది. దీంతో టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంలో రాఖీ పండుగ సందర్భంగా దూరంగా ఉన్న సోదరీ మణులు రాఖీలను తమ సోదరులకు పంపించేలా కొరియర్ సేవలు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందజేశారు. ● ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే అందజేసేలా టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ తగిన ఏర్పాట్లు చేస్తోంది. మేడారం సమ్మక్క–సారక్క జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. అయితే జాతరకు వెళ్లలేని భక్తులకు అమ్మవార్ల ప్రసాదాలను అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.299తో బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే ప్రసాదాన్ని అందజేస్తారు. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయనున్నారు. రీజియన్లోని పది డిపోల పరిధిలోని లాజిస్టిక్ కేంద్రాల్లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమ్యాయి. భక్తులు www.tsrrtclogistics. co.in వెబ్సైట్ లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ మేడారం ప్రసాదానానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆర్టీసీ వినూత్న కార్యక్రమం రూ.299తో బుకింగ్ చేసుకుంటే చాలు.. ప్రసాదంతో పాటు దేవతల ఫొటో, పసుపు, కుంకుమ వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం -
దేశాభివృద్ధికి పాటుపడాలి
కొల్లాపూర్: స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాణకర్తల త్యాగాలు, విశేష కృషి ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తిని కొనసాగిస్తూ.. వారి అడుగుజాడల్లో నడిచినప్పుడే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడుతూ ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు వనపర్తి రూరల్: జిల్లా మహిళా శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం పెబ్బేరు పట్టణంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దివ్యాంగులకు స్కూటీలు, ల్యాప్టాప్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 11వ వార్డు నాగులకుంటలో అమృత్ స్కీమ్ కింద రూ. 3.14 కోట్లతో పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అంతకుముందు పెద్దగూడెం తండాలో రూ.20లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్నాయక్, రవికిరణ్, మధుసూదన్రెడ్డి, ఎత్తంరవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, వైస్చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, దయాకర్రెడ్డి, రంజిత్కుమార్, భానుప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు. నేడు అండర్–16 క్రికెట్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్కార్డు, ఎస్ఎస్సీ మెమో, జననఽ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, రెండు ఫొటోలతో మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎంపికయ్యే ఉమ్మడి జిల్లా జట్టు ఈనెల 30 నుంచి సంగారెడ్డిలో ప్రారంభమయ్యే హెచ్సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో పాల్గొంటుందని ఆయన తెలిపారు. -
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఊసే లేదు
వనపర్తిటౌన్: కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 25 నెలలు అవుతున్నా అభివృద్ధి ఊసే లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 420 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ పాలన మధ్య భేదం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ అంటే అభివృద్ధి.. అభివృద్ధి బీఆర్ఎస్ అనే స్థాయిలో జిల్లాను అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి ఊసెత్తని కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ను ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టణ ప్రజల దశాబ్దాల కల రోడ్ల విస్తరణ, జిల్లాకేంద్రంగా ఏర్పాటు, పార్కుల సుందరీకరణ, చెరువుల ఆధునీకరణతో అన్నివిధాలా అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుత పాలకులు గాలి మాటలు మాట్లాడకుండా, గద్దెనెక్కేందుకు ఇచ్చిన హమీలను అమలుచేసి చూపించాలన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి స్వామిగౌడ్ జిల్లా కేంద్రానికి వస్తున్నారని.. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
చిన్నారులను మింగిన పాంపాండ్
● నీటిలో పడిన బంతి తీసేందుకు వెళ్లి ముగ్గురు మృతి ● త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ మరో బాలిక ● నాగర్కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లిలో విషాదం తల్లిదండ్రులతో కలిసి సరదాగా సొంతూరికి వచ్చిన చిన్నారులు వ్యవసాయ పొలంలో ఆడుకునేందుకు వెళ్లి విగత జీవులుగా మారారు. ఉదయం నుంచి హుషారుగా కేరింతలు కొడుతూ.. సెల్ఫీలు దిగుతూ.. ఆడుకున్న ఆ చిన్నారుల ఆనందం ఊహించని ఘటనతో ఆవిరైపోయింది. పాంపాండులో పడిన బంతి తీసుకునేందుకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృత్యుఒడికి చేరిన విషాదకర ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ముచ్చర్లపల్లిలో చోటుచేసుకుంది. కల్వకుర్తి టౌన్/ ఊర్కొండ: ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డి, రజని దంపతుల సంతానం మాదు సిరి(14), మాదు శ్రీమన్యు(12), రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రావిర్యాల గ్రామానికి చెందిన అతని సోదరి చంద్రకళ కూతురు స్నేహ(15), అదే గ్రామానికి చెందిన అతని అన్న వేణుగోపాల్రెడ్డి కూతురు విద్యాధరణి కలిసి వేణుగోపాల్రెడ్డి పొలంలో ఉదయం నుంచి సరదాగా ఆడుకున్నారు. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేశాక వేణుగోపాల్రెడ్డి పొలంలో ఉన్న పాంపాండ్ వద్ద బంతితో సరదాగా ఆడుకుంటుండగా అందులో పడిపోయింది. దీంతో పాంపాండులో బంతిని తీసుకునేందుకు ముందుగా శ్రీమన్యు వెళ్లగా.. అతనికి ఈత రాక మునిగిపోవడంతో అక్క మాదు సిరి చూసి తమ్ముడిని కాపాడేందుకు వెళ్లింది. ఇద్దరూ గుంతలో మునిగిపోతున్నారని గమనించిన స్నేహ సైతం వారి ని రక్షించాలని గుంతలో దిగగా ముగ్గురికి ఈత రాకపోవడం, పాంపాండు లోతుగా ఉండటంతో అక్కడే ఉన్న మరో చిన్నారి విద్యాధరణి గమనించి పాంపాండులోకి దిగుతూ గట్టిగా కేకలు వేసింది. వెంటనే శ్రీకాంత్రెడ్డి ఈత రాకపోయినా తన కాలుకు తాడు కట్టుకొని గుంతలోకి వెళ్లి విద్యాధరణిని బయటకు తీశాడు. మళ్లీ గుంతలోకి వెళ్లేసరికి ముగ్గురు చిన్నారు లు అప్పటికే పాంపాండులో బురదనీటిని మింగడంతో మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న ఊర్కొ ండ ఎస్ఐ కృష్ణదేవరాయ ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు చిన్నారులను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిన్నారుల తల్లి రజని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపారు. ఈ జీవితం మాకు వద్దు.. కళ్లెదుటే తమ ఇద్దరు సంతానం విగత జీవులుగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు మా పిల్లలు లేని ఈ జీవితం మాకు వద్దు అని బోరున విలపించారు. మా పిల్లలు చనిపోయిన ఈ గుంతలోనే మేం కూడా చనిపోతామని అనడంతో స్థానికులు వారిని ఓదార్చారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా.. నాయకులు, గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే పరామర్శ ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతిచెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పరామర్శించారు. ఒకే కుటుంబంలోని చిన్నారులను కోల్పోవడం దురదృష్టకరణమన్నారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఆయన చిన్నారుల మృతదేహాలను సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను కుటుంబ సభ్యులు, పోలీసులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చెట్టును పట్టుకోవడంతో బతికాను మేము నలుగురం కలిసి ఆడుకునేందుకు పొలం వద్దకు వెళ్లాం. బంతి ఆట ఆడుకుంటూ గుంతలోకి వెళ్లడంతో సిరి, శ్రీమన్యు, స్నేహ మునిగిపోయారు. వారిని కాపాడేందుకు చుట్టుపక్కల వాళ్లను మా బాబాయి శ్రీకాంత్రెడ్డి పిలిచారు. మా బాబాయి నన్ను అక్కడే ఉన్న చెట్టు పట్టుకోమని చెప్పడంతో నేను బతికిపోయాను. బాబాయి పిలిచిన వారంతా గుంత వద్దకు వచ్చే సరికి ఆ ముగ్గురూ నీటి లోపలికి మునిగిపోయారు. – విద్యాధరణి, ప్రాణాలతో బయటపడిన బాలిక -
పాలమూరు పద్మం
మహబూబ్నగర్లోని పాలకొండ వెంకట్రాంరెడ్డి, దమయంతి దంపతుల కుమారుడు విజయానంద్ రెడ్డి 1982లో ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొన్ని రోజులపాటు భూత్పూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత రేడియేషన్ అంకాలజీలో ఎండీ, డీఎన్బీ పూర్తి చేసి గత 30 ఏళ్లుగా అపోలో ఆస్పత్రిలోని అంకాలజీ విభాగం ప్రొఫెసర్ హెచ్వోడీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ శశికళ ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్డ్ కాగా.. ఇద్దరు కొడుకులలో ఒకరు వైద్యుడిగా, మరొకరు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. పాలమూరు సిగలో మరో పద్మశ్రీ చేరింది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్లోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కిన్నెర మొగులయ్య, నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ వాయిద్య కారుడు దాసరి కొండప్పలను పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తాజాగా పాలమూరు నగరంలోని వల్లబ్నగర్కు చెందిన వైద్యుడు పాలకొండ విజయానంద్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయానంద్రెడ్డి గత 44 ఏళ్లుగా వైద్యరంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు ఈ పురస్కారం దక్కిందని కొనియాడారు. – సాక్షి ప్రతినిధి మహబూబ్నగర్/ పాలమూరు -
అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు
● అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని.. నవసమాజ నిర్మాణానికి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్లో 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిజిటల్ ప్లాట్ఫారమ్స్ ద్వారా కూడా సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 5.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారని.. అందులో సగానికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. మహిళలు ఓటింగ్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆయన అభినందించారు. మై ఇండియా మై ఓటు అనే ఇతివృత్తంతో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఓటరు జాబితా తయారీ, ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. అదే విధంగా కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లను సన్మానించారు. అంతకుముందు, ఓటర్లలో అవగాహన కల్పించేందుకు మర్రికుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పాఠశాల నుంచి ఐడీఓసీ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించే గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. గణతంత్ర దినోత్సవానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరేడ్ నిర్వహణ, అతిథుల సీటింగ్, జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేశ్రెడ్డి, డీపీఆర్ఓ సీతారాం, సీఐ కేఎస్.రత్నం, ఎస్ఐ హరిప్రసాద్ ఉన్నారు. -
వడ్డీ సొమ్ము వాపస్..
మహిళా సంఘాలకు చేయూత ● వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం ● ప్రతినెలా బ్యాంకు కంతులు చెల్లించే వారికి ప్రాధాన్యత ● జిల్లాలో 956 సంఘాలకు లబ్ధి ●డబ్బులు వచ్చాయి. బ్యాంకు ద్వారా తీసుకు న్న రుణం క్రమం త ప్పకుండా తిరిగి చెల్లించ డంతో తమ సంఘానికి వడ్డీ డబ్బులు వచ్చాయి. మొత్తం రూ. 6,920 బ్యాంకు ఖాతాలో జమ కావడం సంతోషంగా ఉంది. గతంలో వడ్డీ ఇస్తామని ఆశ చూపారే తప్ప చెల్లించలేదు. – భాగ్యమ్మ, గణపతి మహిళా సంఘం, అమరచింత సంతోషంగా ఉంది.. వడ్డీ లేని రుణాలు ఇస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతినెలా ఎంతో ప్రయాసతో అనుకున్న సమయానికి బ్యాంకు అప్పు తీరుస్తున్నాం. తమ సంఘానికి ప్రభుత్వం రూ. 5,600 వడ్డీ చెల్లించింది. వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – సునీత, మధూరి మహిళా సంఘం, అమరచింత క్రమం తప్పకుండా చెల్లించిన వారికే.. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించిన మహిళా సంఘాలకు మాత్రమే పావలా వడ్డీ వర్తిస్తుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బ్యాంకు రుణాలను రెగ్యులర్గా చెల్లించి తిరిగి కొత్త రుణాలను తీసుకుంటున్న వారి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపడం జరిగింది. మొత్తం 956 సంఘాలకు రూ. 3.16కోట్లు మంజూరయ్యాయి. – బాల్రాజ్, జిల్లా కోఆర్డినేటర్, మెప్మా అమరచింత: స్వయం సహాయక మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వివిధ రంగాల్లో మహిళా సంఘాల సభ్యులను ప్రోత్సహిస్తూ, భారీగా రుణాలు అందిస్తున్న ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వడ్డీ డబ్బులను తిరిగి చెల్లిస్తోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బ్యాంకు రుణాలను క్రమం తప్పకుండా తీరుస్తున్న 956 సంఘాలను గుర్తించిన అధికారులు... మొత్తం రూ. 3,16,92,822 వడ్డీని ఆయా సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. మొత్తం 13వేల మంది మహిళలకు లబ్ధి చేకూరుతోంది. వడ్డీ చెల్లింపు డబ్బులకు సంబంధించిన చెక్కులను జిల్లా మంత్రుల చేతుల మీదుగా ఆయా పట్టణ సమాఖ్యలకు అందజేశారు. జిల్లాలో సంఘాలు, వడ్డీ డబ్బుల చెల్లింపు ఇలా (రూ.పాలలో) మున్సిపాలిటీ సంఘాలు వడ్డీ డబ్బులు అమరచింత 124 61,40,579 ఆత్మకూరు 53 13,95,206 కొత్తకోట 174 65,29,903 పెబ్బేరు 76 15,56,683 వనపర్తి 529 1,60,61,651 మొత్తం 956 3,16,92,822 పదేళ్లుగా రాని వడ్డీ.. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను చెల్లించలేకపోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంపై పొదుపు సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడమే కాకుండా పెట్రోల్బంక్ల నిర్వహణ, అద్దెకు ఆర్టీసీ బస్సులను ఇవ్వడం, కుటీర పరిశ్రమల ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో మహిళలు ఆర్థికంగా ముందుకెళ్తున్నారు. -
గణతంత్ర వేడుకలకు ముస్తాబు
విద్యుత్ దీపాల వెలుగులో కలెక్టరేట్ వనపర్తి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సోమవారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశభక్తి ఉట్టిపేడలా మువ్వన్నెల జెండావిష్కరణ, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమాలతో పాటు పోలీస్ కవాతు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు జాబితా సిద్ధంచేశారు. ప్రభుత్వ శాఖల ప్రగతిని వివరించేందుకు ఏర్పాటుచేసే ప్రత్యేక స్టాల్స్, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కూర్చొని వేడుకలు తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పోలీసు కవాతు నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్ సందేశం, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, సాంస్కృతిక పదర్శనలు, ప్రభుత్వశాఖల స్టాళ్ల సందర్శన, ప్రశంసా పత్రాల పంపిణీ చేయనున్నారు. కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కొత్తకోట రూరల్: రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట మండలం వడ్డెవాట, భూత్కూర్, నాటవెళ్లి పెద్దతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామస్థాయిలో మహిళల ఆర్థికాభివృద్ధికి మహిళా సమాఖ్య భవనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం వడ్డెవాటలో రెడ్డి అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వడ్డేవాటకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరగా.. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, పి.కృష్ణారెడ్డి, బోయేజ్, భానుప్రకాశ్రెడ్డి, సర్పంచులు మండ్ల రాములు, బంగారయ్య, పాండునాయక్ పాల్గొన్నారు. -
రైతులకు తప్పని యూరియా కష్టాలు
● గంటల తరబడి నిరీక్షించినా నిరాశే ● గోపాల్పేటలో రోడ్డెక్కి ఆందోళనకు దిగిన అన్నదాతలు గోపాల్పేట: యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూసినా యూరియా రాలేదని.. కనీసం అధికారులు టోకెన్లు కూడా జారీ చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ గోపాల్పేట పీఏసీఎస్ కార్యాలయం ఎదుట వనపర్తి – హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పీఏసీఎస్కు వచ్చిన యూరియా శుక్రవారం సాయంత్రం వరకు అయిపోయింది. శనివారం వస్తే ఇస్తామని అధికారులు చెప్పడంతో తెల్లవారుజామునే పీఏసీఎస్ వద్దకు రైతులు చేరుకున్నారు. తమ పట్టాదారు పాస్బుక్కులను లైన్లో పెట్టి యూరియా కోసం వేచి చూశారు. మధ్యాహ్నం వరకు యూరియా లోడ్ రాలేదు. కనీసం క్యూలో నిరీక్షించిన రైతులకు టోకెన్లు కూడా ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు ఆందోళనకు దిగారు. పీఏసీఎస్ సీఈఓ రామ్మోహన్రావు రైతులకు నచ్చజెప్పారు. మధ్యాహ్నం 3 గంటల వరకు యూరియా వస్తుందని చెప్పడంతో ధర్నా విరమించారు. కాగా, మధ్యాహ్నం తర్వాత ఈ–పాస్ మిషన్ పనిచేయకపోవడంతో వ్యవసాయాధికారులు 180 మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. వారికి మంగళవారం యూరియా అందిస్తామని తెలిపారు. గంటల తరబడి పడిగాపులు ఖిల్లాఘనపురం: మండలంలోని మామిడిమాడ సింగిల్విండో కేంద్రానికి శనివారం యూరియా వస్తుందని సమాచారం ఇవ్వడంతో తెల్లవారుజామునే వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేంద్రం వద్ద భూ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్కార్డు జిరాక్స్ లైన్లో పెట్టి గంటల తరబడి పడిగాపులు కాశారు. మధ్యాహ్నం 3 గంటలైనా యూరియా లోడ్ రాకపోవడంతో చాలా మంది రైతులు ఆకలితో అలమటించారు. ఇక చేసేది లేక అక్కడ ఉన్న సిబ్బంది రైతులకు టోకెన్లు ఇచ్చి పంపించారు. -
అచ్చంపేటలో మోస్ట్ వాంటెడ్..
ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో కీలకంగా పనిచేస్తున్న దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు, కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న మీసాల సాలోమాన్తోపాటు ఆయన భార్య సన్బట్టిని పోలీసులు అచ్చంపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సాలోమాన్ 32 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా అగ్రనేతలు తిప్పరి తిరుపతి, దేవ్జీ, హిడ్మా వంటి వారితో పనిచేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ అక్కడి మావోయిస్టు దళాలకు గెరిల్లా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన భార్య సైతం దండకారణ్యం డీవీసీఎం కేడర్, పీఎల్జీ బెటాలియన్ సభ్యురాలిగా కీలకంగా పనిచేస్తున్నారు. ఈ దంపతులు దండకారణ్యాన్ని వదిలి నల్లమల ప్రాంతానికి చేరుకోవడం.. ఈ క్రమంలోనే అరెస్ట్ కావడం స్థానికంగా అలజడి సృష్టించింది. -
నల్లమలలో అలజడి
కలకలం రేపిన మవోయిస్టుల అరెస్టు సాక్షి, నాగర్కర్నూల్: దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమాలు, తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లిన నల్లమల మరోసారి ఉలిక్కిపడింది. నల్లమలకే చెందిన ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులతోపాటు ఇద్దరు మావోయిస్టు కీలక నేతలను అచ్చంపేటలో అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. నల్లమలలో సుమారు 20 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు తెరమరుగు పడుతూ రాగా.. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి సృష్టించింది. ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దు, దండకారణ్యంలో కేంద్ర బలగాల ముమ్మర కూంబింగ్, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్టులు ఆశ్రయం కోసం నల్లమల ప్రాంతానికి చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఆశ్రయం కోసమే వచ్చారా.. లేక ఈ ప్రాంతంలో మావోయిస్టు పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిశిత పరిశీలన.. మావోయిస్టు పార్టీలో కీలక నేతలకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు అన్నిరకాలుగా మద్దతుగా నిలుస్తున్నట్టుగా నల్లమల ప్రాంతానికి చెందిన వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల నేతలపై పోలీసులు నిఘా ఉంచి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లమల ప్రాంతంలోని పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల అంబయ్య ఇప్పటికే పలుమార్లు చత్తీస్ఘడ్ వెళ్లి మావోయిస్టులతో సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆయన తెలంగాణ ప్రజాఫ్రంట్ కో కన్వీనర్గా పనిచేస్తున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన జక్క బాలయ్య పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానికంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. అలాగే లింగాల మండలం క్యాంపురాయవరం గ్రామానికి చెందిన మన్శెట్టి యాదయ్య గతంలో మావోయిస్టుగా పనిచేసి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ గ్రామంలో ఉంటున్నాడు. నల్లమల ప్రాంతానికే చెందిన ఈ ముగ్గురు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరులో.. రెండు దశాబ్దాల కిందట నల్లమల దళం కేంద్రంగా ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా సాగింది. అనేక మెరుపుదాడులు, ఎన్కౌంటర్లు, పరస్పర దాడులకు ఉమ్మడి జిల్లా సాక్ష్యంగా నిలిచింది. నాగర్కర్నూల్ జిల్లా సోమశిల సమీపంలో 1993 నవంబర్ 13న పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై మావోయిస్టులు దాడి చేయడంతో ఏకంగా ఎస్పీ పరదేశినాయుడితో పాటు ఇద్దరు ఎస్ఐలు, ఆరుగురు పోలీసులు మరణించారు. అలాగే 2005 ఆగస్టు 15న ధన్వాడలో అప్పటి ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రస్థాయిలో కొనసాగింది. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి రేగింది. ఉమ్మడి జిల్లాలో మళ్లీ మవోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. అచ్చంపేటలో కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడు సాలోమాన్తో పాటుమరో ముగ్గురు స్థానికులు అదుపులోకి.. ఆశ్రయం కోసం వచ్చారా.. పునరుజ్జీవం చేసేందుకా? ఉమ్మడి జిల్లాలో బలోపేతానికియత్నించినట్లు పోలీసుల వెల్లడి -
నామినేషన్ల స్వీకరణకు 11 కేంద్రాలు
వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రమైన వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. ప్రతి 3 వార్డులకు ఒక నామినేషన్ స్వీకరణ కేంద్రం చొప్పున మొత్తం 11 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు శనివారం మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు యూనుస్, శ్రీనివాసులు, ఉమామహేశ్వర్రెడ్డి, బాలరాజుతో కలిసి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఖరారు చేశారు. అదే విధంగా 99 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా.. అవసరమైన బ్యాలెట్ బాక్స్లను ఎంపీడీఓ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. మొత్తం 139 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయని కమిషనర్ తెలిపారు. -
మెరుగైన విద్య అందించడమే లక్ష్యం
వనపర్తి: సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న మైనార్టీ వర్గాల పిల్లలకు మెరుగైన విద్య అందించడమే తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ లక్ష్యమని టీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి షఫీవుల్లా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులతో వారు ముఖాముఖి నిర్వహించి, విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. అనంతరం షఫీవుల్లా మాట్లాడుతూ.. ఇంటర్ తర్వాత నిర్వహించే వివిధ పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ సొసైటీ ద్వారా మంచి సదుపాయాలను కల్పిస్తోందని, విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలు నిర్దేశించుకొని నిరంతరం కష్టపడాలని సూచించారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సొసైటీ పరిధిలోని అన్ని పాఠశాలలు కళాశాలల్లో వందశాతం అడ్మిషన్లు అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ● కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థల కన్నా ప్రభుత్వ రెసిడెన్షియల్ సొసైటీల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సొసైటీ పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, ఆర్ఎల్సీ ఖాజా, కళాశాల ప్రిన్సిపాల్ హవిలారాణి పాల్గొన్నారు. -
పెరగనున్న మెడికల్ కళాశాల సీట్లు
పాలమూరు: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పాలమూరులోనే ఏర్పాటు చేశారు. 2016లో 150 ఎంబీబీఎస్ సీట్లతో మొదలైన కళాశాల ప్రస్తుతం 175 సీట్లతో కొనసాగుతోంది. పదేళ్ల కాలంలో నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు కోర్సు పూర్తి చేసుకొని బయటకు వెళ్లాయి. ఒక్కో బ్యాచ్లో 150 విద్యార్థుల చొప్పున 600 మంది విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. అలాగే కళాశాలలో 34 పీజీ సీట్లు ఉండటం విశేషం. తాజాగా మరో 25 సీట్లు పెంచడానికి శనివారం పాలమూరు మెడికల్ కళాశాలను, జనరల్ ఆస్పత్రిని ఎన్ఎంసీ(జాతీయ మెడికల్ కౌన్సిల్) బృందం సభ్యులు డాక్టర్ మల్లిఖార్జున్, డాక్టర్ అనిల్ బాబు సందర్శించారు. ఉదయం వారు మెడికల్ కళాశాలకు వెళ్లి స్థానికంగా బోధకుల సంఖ్య, పరిపాలన సిబ్బంది, తరగతి గదులు, ఇతర వసతులపై ఆరా తీశారు. అక్కడి నుంచి జనరల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో రోజు వారీగా వచ్చే ఓపీ రోగులు, ఐపీ రోగుల సంఖ్య, క్యాజువాలిటీ, అన్ని రకాల ఆపరేషన్ థియేటర్స్, వార్డులు, ఐసీయూ, మాతా శిశు విభాగం ఇలా ప్రతి వార్డును సందర్శించి స్థానికంగా ఉన్న వసతులపై నివేదిక తయారు చేశారు. ఎన్ఎంసీ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్ల పెంపు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎంసీ పర్యటన పూర్తయిన నేపథ్యంలో పాలమూరు మెడికల్ కళాశాల అధికారులు ఈ నెల 28 వరకు 200 ఎంబీబీఎస్ సీట్లు ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఎంసీ ఈ ప్రతిపాదనలు పరిశీలించి మరోసారి పర్యటిస్తారా? లేదా ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేస్తారా? అనేది ఈ నెల చివరి నాటికి తెలుస్తుంది. ఎన్ఎంసీ బృందం వెంట కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా ఇతర వైద్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. 2016లో 150 సీట్లతో ప్రారంభం ఇప్పటి వరకు నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు పూర్తి తాజాగా 25 సీట్ల కేటాయింపు కోసంఎన్ఎంసీ బృందం పర్యటన -
వెట్టి చాకిరి నుంచి విముక్తి..
● మహారాష్ట్రలో పనిచేస్తున్న 26 మందిని నాగర్కర్నూల్ జిల్లాకు తరలింపు సాక్షి, నాగర్కర్నూల్: బతుకుదెరువు కోసం వలసజీవిగా మహారాష్ట్రకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అక్కడి అధికారులు విముక్తి కల్పించారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన 26 మంది మహారాష్ట్రలోని పర్బాణీ జిల్లాలో రోడ్డు నిర్మాణం కోసం కూలీలుగా పనిచేస్తున్నారు. అతి తక్కువ జీతంతో రోజంతా పనిచేయించుకుంటూ, ఇక్కట్లకు గురిచేస్తుండటంతో స్థానిక అధికారులకు ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టిన అధికారులు బాండెడ్ లేబర్గా గుర్తించి శనివారం నాగర్కర్నూల్ జిల్లాకు తరలించారు. నాగర్కర్నూల్, తెలకపల్లి, బిజినేపల్లి, కోడేరు, అచ్చంపేట మండలాలకు చెందిన మొత్తం 26 మందిని నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, ఫౌండేషన్ ఫర్ సస్టైనేబుల్ డెవలప్మెంట్(ఎఫ్ఎస్డీ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వారి స్వస్థలాలకు తరలించారు. రోజుకు 200 మాత్రమే కూలీ ఇస్తూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయించారని, అనారోగ్యం బారిన పడినా తమను పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. -
రైతులను మోసం చేసిన బీఆర్ఎస్
వనపర్తిటౌన్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల పేరుతో ఎన్నో మోసాలు చేశారని.. రైతులను మోసం చేసిన పార్టీకి భవిష్యత్ ఉండదని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శనివారం వనపర్తి మండల రైతువేదికలో రైతులకు రాయితీపై వ్యవసాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి రైతు పక్షపాతిగా పనిచేస్తోందన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు, రాయితీలను అందిస్తోందన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతులకు రూ.లక్షలు ఆదా అయ్యే వ్యవసాయ ఉపకరణాలపై రాయితీలను ఎత్తేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులకు బొక్కలుపెట్టి నీళ్లు తెచ్చామని గొప్పలు చెబుకున్నారని దుయ్యబట్టారు. ● జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై మాట్లాడారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి 40 మందికి పైగా సర్పంచులు యువకులేనని.. పార్టీ యువకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువకులకు సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో వీధి దీపాలను ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్రెడ్డి, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మురళీధర్రెడ్డి, సాయిచరణ్రెడ్డి, శారద, సయ్యద్ ఖలీద్, మాజీద్, ఆదిత్య, శివాంత్రెడ్డి, సుకన్య పాల్గొన్నారు. -
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
అమరచింత: బాలికలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. శనివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని దేశాయి మురళీధర్రెడ్డి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ, తమ లక్ష్యాలను సాధించాలన్నారు. బాలికలకు న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు తమ సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బాల్యవివాహ ముక్త్ భారత్లో భాగంగా ప్రతి ఒక్కరూ బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును బాలికలు ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిక్షఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డా.మానస వివరించారు. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ స్వాతి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, దేశాయి ప్రకాశ్రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు కలాంపాషా, హెచ్ఎం పద్మ, సీఆర్పీ స్వామి పాల్గొన్నారు. -
వీబీజీ రామ్జీ చట్టంతో పేదలకు నష్టం
వనపర్తి రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టంతో పేదలకు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు కె.శివసేనారెడ్డి అన్నారు. శనివారం వనపర్తి మండలం పెద్దగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలిచిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడమంటే.. సామాన్య ప్రజలపై బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు. గతంలో ఉపాధి హామీ చట్టంలో కాంట్రాక్టర్లపై నిషేదం ఉండేదని.. కేంద్రం తెచ్చిన కొత్త చట్టంలో కన్వర్జేన్స్ పేరిట కాంట్రాక్టర్లకు ప్రవేశం కల్పించి దోపిడీకి తెరతీశారన్నారు. కేవలం కార్పొరేట్ సంస్థల లబ్ధికే బీజేపీ ప్రభుత్వం పరిమితమైందని.. రైతులు, కార్మికులు ,పేదల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. కొత్త చట్టంతో దళిత, ఆదివాసీ కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు పుష్పలత, వాల్యానాయక్, ఉపసర్పంచ్ పోలికమ్మ, మాజీ ఎంపీపీ శంకర్నాయక్, గుముడాల రాములు, శివకుమార్, రొయ్యల రమేశ్, శేఖర్రెడ్డి, బుచ్చిబాబు, శివయ్య, రవికుమార్, రమేశ్, ఇసాక్, నాగన్న, మల్లేష్, రాములు, వెంకటేశ్, ఆంజనేయులు ఉన్నారు. -
కాంట్రాక్టు, ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేయాలి
వనపర్తి రూరల్/ఖిల్లాఘనపురం: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత లేక శ్రమ, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని.. వెంటనే ఆయా వ్యవస్థను రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ, ఖిల్లా ఘనపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్మికులు, సిబ్బందితో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి కార్మికులతో మాట్లాడారు. కనీస వేతనం రూ.26 చెల్లించి వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.15 లక్షలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న ఏజెన్సీల మూడేళ్ల కాలవ్యవధి ముగిసి దాదాపు పది నెలలు గడుస్తోందని.. కొత్త టెండర్ల ప్రక్రియ కాలయాపనతో తీవ్రమైన పనిభారంతో పాటు ఆర్థికంగా కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీల విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా నేరుగా వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్లు థర్డ్పార్టీ ఏజెన్సీల కింద ఎలాంటి ఉద్యోగ భద్రతకు నోచుకోవడం లేదన్నారు. ఖిల్లాఘనపురంలో జరిగిన కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆస్పత్రి బ్రాంచ్ నేతలు, కార్మికులు సాయికృష్ణ, నాగన్న, వెంకటేష్, మునీందర్, భీమయ్య, నజ్మా, రంగమ్మ, వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో నాయకులు గోపాలకృష్ణ, గంధం శ్రీనివాస్, నర్సింహ, నరేందర్, భరత్, రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పుర ఎన్నికల్లో ఆర్ఓలదే కీలకపాత్ర
● అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: త్వరలో జరిగే పురపాలక ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఎన్నికల సంఘం నియమాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలని, ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పుర ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో ఉంటాయని, చాలా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ ప్రక్రియలో చాలా అనుమానాలు వస్తుంటాయని.. గుర్తులు, క్రమసంఖ్య కేటాయింపుల్లో తప్పులు దొర్లకుండా నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వివరించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థితో పాటు ప్రతిపాదకుడు, మరో వ్యక్తిని మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలని.. నామినేషన్ పత్రంలో ఏమైనా తప్పులు, లోపాలు ఉంటే పరిశీలించి నోటీసు ఇవ్వాలన్నారు. జనరల్ అభ్యర్థులు రూ.2,500 చెల్లించాల్సి ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. నామినేషన్ దాఖలు నుంచి స్క్రూటినీ, విత్డ్రా, గుర్తుల కేటాయింపు, ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, వనపర్తి పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, పెబ్బేరు మున్సిపల్ కమిషనర్లు, శిక్షణ నోడల్ అధికారి రామమహేశ్వర్రెడ్డి, ట్రైనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి.. ప్రతి ఓటరు ఎన్నికల్లో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, ఐడీఓసీ సిబ్బందితో ఓటరు దినోత్సవంపై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పిల్లలను విధిగా కళాశాలకు పంపించాలి
వనపర్తి రూరల్: తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా కళాశాలకు పంపించాలని డీఐఈఓ ఎర్ర అంజయ్య కోరారు. శుక్రవారం శ్రీరంగాపురం, పెబ్బేరు జూనియర్ కళాశాలల్లో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ అధ్యక్షతన జరిగిన విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశాలకు ఆయనతో పాటు తహసీల్దార్లు రాజు, మురళీగౌడ్, ఎంపీడీఓ రవినారాయణ, ఎస్ఐ హిమబిందు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లల ప్రవర్తనను నిత్యం గమనిస్తూ ఉండాలని, పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధ్యాపకులతో చర్చించాలన్నారు. -
పురపాలికల అభివృద్ధే ధ్యేయం
● అమరచింతలో 50 ఎకరాల్లో రొయ్యల పెంపకం ● పట్టణ చెరువుల ఆధునికీకరణకు సిద్ధం ● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అమరచింత/ఆత్మకూర్: అమరచింత మండలంలోని ప్రభుత్వ స్థలంలో రూ.50 కోట్లతో 50 ఎకరాల్లో రొయ్యల పెంపకం చేపడతామని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం అమరచింతలో రూ.3 కోట్లతో పెద్ద చెరువు ఆధునికీకరణ, రూ.3.14 కోట్లతో ఆత్మకూర్లోని పరమేశ్వరస్వామి చెరువుకట్ట విస్తరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమరచింత చెరువుకట్టపై ఉన్న కట్ట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, సయ్యద్షా రాజావళి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అమరచింతలో రెండేళ్లలో రూ.40 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. జూరాల ప్రాజెక్టు సమీపంలో చేప వంటకాలు చేస్తున్న వారితో పాటు మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేపల ఎగుమతి కేంద్రం, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయించానన్నారు. ప్రాజెక్టు రక్షణతో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల నుంచి అక్రమ రవాణా జరగకుండా రూ.2.50 కోట్లతో ఎడమ కాల్వ సమీపంలో పోలీస్ ఔట్పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుసంవర్దకశాఖ ద్వారా 200 యూనిట్లను మంజూరు చేయించి ఒక్కో లబ్ధిదారుకి రెండు గేదెలను రాయితీపై అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేగాకుండా ఇక్కడే పాలను నిల్వచేసి విజయ డైరీకి పంపేందుకు పాల శీతలకేంద్రం సైతం మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. అభివృద్ధికే పట్టం కట్టాలి.. ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్పార్టీని ఆదరించాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపిస్తే పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. చేనేత రుణమాఫీ చెక్కు అందజేత.. బ్యాంకుల్లో రూ.లక్షలోపు చేనేత రుణం పొందిన కార్మికులకు రుణమాఫీ వర్తింపజేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక యూనియన్ బ్యాంకులో రూ.67,02,800 చెక్కును మంత్రి చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందు సమక్షంలో మేనేజర్కు అందించారు. మిగిలిన వారి రుణమాఫీ డబ్బులు త్వరలోనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ఏడీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్ఖాన్, కాంగ్రెస్పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, చెరువు సంఘం అధ్యక్షుడు పోసిరిగారి విష్ణు, శ్యాం, రవికాంత్, మోహన్, కమలాకర్గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యులు తిరుమల్లేష్, హన్మంతునాయక్, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు. -
జీవిత అనుభవమే అసలైన జ్ఞానం
వనపర్తిటౌన్: అక్షర జ్ఞానం కంటే జీవిత అనుభవం చదివిన వారే అసలైన జ్ఞానులని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ సామాజికవేత్త గంధం చిన్నబాలయ్య సంస్మరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరాస్యులందరు జ్ఞానవంతులు కాదని, నిరక్షరాస్యులందరూ గొప్ప జ్ఞానవంతులు అయ్యేందుకు వారి జీవిత పాఠాలే నిదర్శనమని పేర్కొన్నారు. సామాజిక, అధ్యాత్మిక, విద్య, సేవాపరంగా ఇతరులకు సాయం చేసేందుకు చిన్నబాలయ్య ముందుండే వారని కొనియాడారు. చదువుకోలేదని నిరాశ చెందకుండా ఎందరినో అక్షర జ్ఞానులు చేసేందుకు తనవంతు కృషి చేశారని, దళితజాతికే కాకుండా సమాజానికి ఆదర్శప్రాయుడన్నారు. జిల్లాకేంద్రంలో అంబేడ్కర్ విగ్రహాన్ని దశాబ్దాల కిందటే నిర్ణయించి ప్రతిష్టించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైద్యులు డా. మురళీధర్, డా. రాఘవులు, డా. భగవంతు, సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు శంకర్గౌడ్, వెంకట్రావు, మాణిక్యం, నాయకులు గంధం పరంజ్యోతి, చిట్యాల రాము, జనజ్వాల, రాధాకృష్ణ, పుట్టా ఆంజనేయులు, జోగు శాంతన్న, డప్పు స్వామి, గులాం ఖాదర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన సీఐ సుగంధ రత్నం వనపర్తి: వనపర్తి సీఐగా కె.సుగంధ రత్నం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వర్తిస్తానన్నారు. ప్రజల సహకారం అత్యంత అవసరమని, పోలీసులు, ప్రజల మధ్య సమన్వయం ఉంటేనే నేరాలు నియంత్రించవచ్చని చెప్పారు. ప్రశాంత వనపర్తిగా రూపొందించేందుకు సిబ్బంది సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా రత్నం మహబూబ్నగర్ సీసీఎస్లో సీఐగా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ కృష్ణయ్య డీఐజీ కార్యాలయానికి వెళ్లారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి సాధించాలి వనపర్తిటౌన్: సర్పంచ్లు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో కొత్తకోట, ఖిల్లాఘనపురం, పెద్దమందడి, మదనాపురం, అమరచింత, ఆత్మకూర్, గోపాల్పేట మండలాల పరిధిలోని 133 మంది సర్పంచ్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టే ప్రతి పనిలో వార్డు సభ్యులను భాగస్వాములు చేయాలని సూచించారు. స్వచ్ఛత, తాగునీరు, వీధి దీపాలు, మురుగు, విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. గ్రామస్థాయిలోని ఆరోగ్య కేంద్రాల్లో ఔషదాల నిల్వలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్లదేనని చెప్పారు. గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని, భవనాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో చేసే సేవ ప్రతి ఒక్కరు అభినందించేలా, జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలని కోరారు. రెండోవిడత శిక్షణకు మిగతా గ్రామాల సర్పంచులు హాజరవుతారని పేర్కొన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన సర్పంచులకు ఎమ్మెల్యే ధ్రువపత్రాలు అందజేశారు. -
నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం : ఎస్పీ
కొత్తకోట రూరల్: వాహనాలు వేగంగా నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్బెల్ట్ ధరించడంలో నిర్లక్ష్యం వంటి కారణాలతోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఒక్క కుటుంబానికే కాదు.. సమాజానికే తీరని నష్టం కలిగిస్తాయని చెప్పారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మండలంలోని అప్పారాల సమీపంలో ఉన్న కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు, చెరుకు రవాణా వాహనాల డ్రైవర్ల అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పరిశ్రమల ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. కార్మికులు విధులు ముగించుకొని సురక్షితంగా ఇంటికి చేరడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడమే లక్ష్యంగా విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ రాంబాబు, ఎస్ఐ ఆనంద్, షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్ రామరాజు, షుగర్ ఫ్యాక్టరీ లీగల్ అడ్వయిజర్ భాస్కర్, పోలీస్ సిబ్బంది, షుగర్ ఫ్యాక్టరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
లీడర్ల ‘లడాయి’..!
దూకుడు పాలి‘ట్రిక్స్’ (కేరాఫ్) నడిగడ్డ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంతో పాటు పాలమూరులో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు గద్వాల, అలంపూర్ పెట్టింది పేరు. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నది మధ్య నడిగడ్డ (జోగుళాంబ గద్వాల)గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఒకవైపు ఏపీ, మరోవైపు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గాలు రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఆధిపత్యమే హద్దుగా అసమాన రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఈ జిల్లాలో ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని విపక్ష నేతల మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ చిచ్చు రాజకీయ రగడకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పలువురు లీడర్ల లడాయి, వారి వ్యవహార శైలి హాట్టాపిక్గా మారింది. గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గ పోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఆయా వర్గాల మధ్య పోటాపోటీ నడిచింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇరువర్గాలు కసరత్తు మొదలుపెట్టాయి. మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉండగా.. తమకు 16 వార్డులు కేటాయించాలని ఓ వర్గం వారు పార్టీ ముఖ్య నేతలకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని.. లేకుంటే మీ ఇష్టమంటూ మరో వర్గ నేత సమాధానమిచ్చినట్లు సమాచారం. స్వపక్షంలో విపక్షంలా ముదిరిన పంచాయితీ కీలక నేతలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ లొల్లి రాష్ట్ర పెద్దల వద్దకు చేరినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ‘ఆధిపత్య’మే హద్దుగా అసమాన రాజకీయాలు అటు అధికార, ప్రతిపక్షాలు.. ఇటు స్వపక్షంలోనే విపక్షం నాగర్కర్నూల్ ఎంపీ, అలంపూర్ఎమ్మెల్యే మధ్య రగడతో మళ్లీ తెరపైకి.. హాట్టాపిక్గా ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతల వ్యవహార శైలి -
ఎగబడి పోవాలె..!
ఉమ్మడి జిల్లాలో బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అగచాట్లు పాఠశాల, కళాశాల విద్యార్థులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్సు, ఫుట్బోర్డుపై ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులను ఈ దృశ్యంలో చూడవచ్చు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఊట్కూర్, తిప్రాస్పల్లి నుంచి ఈ బస్సు నారాయణపేటకు వస్తోంది. ఈ బస్సులో రద్దీ ప్రతిరోజూ సర్వసాధారణంగా మారింది. ..ఇదీ భావి భారత పౌరుల దుస్థితి. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక.. ఉన్నప్పటికీ సమయపాలన పాటించకపోవడం.. వచ్చినా ఆపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పడుతున్న అగచాట్లకు ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కాలినడకన కొందరు.. ప్రమాదమని తెలిసినా ఆటోల్లో కిక్కిరిసి వేళ్లాడుతూ మరికొందరు.. బస్సుల్లో ఫుట్బోర్డ్పై ప్రయాణం చేస్తూ ఇంకొందరు నరకయాతన అనుభవిస్తున్నారు. స్థానికంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు లేకపోవడం.. రవాణా ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టడంలో పాలకుల వైఫల్యం వెరసీ విద్యార్థులు నానా ఫీట్లతో దినదినగండంగా రాకపోకలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరులోని పలు గ్రామాల్లో నిత్య సవాళ్ల మధ్య చదువుల యుద్ధం కొనసాగిస్తున్న విద్యార్థులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ టంకర, కిష్టారం (హన్వాడ), కొత్తపల్లి (మిడ్జిల్), రామచంద్రపూర్ (మహబూబ్నగర్ రూరల్) జిల్లాలో 423 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధి 45 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. నాలుగు గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టంకర మినహాయించి మూడు గ్రామాలకు చెందిన వారు బస్సులు నడపాలని విజ్ఞప్తులు చేసినా.. అమలు కాలేదు. జిల్లాలో మొత్తం 212 గ్రామాలు ఉన్నాయి. ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధిలో 189 గ్రామాలకు మాత్రమే సర్వీస్లు నడిపిస్తున్నారు. 23 పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు రవాణా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని 11 గ్రామాల నుంచి అర్జీలు రాగా.. ఆరు పల్లెలకు మాత్రమే నడుపుతున్నారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్న గ్రామాలు.. దావాసిపల్లి (పాన్గల్), నగరాల (శ్రీరంగాపురం), కంభాళపూర్తండా (ఖిల్లాఘనపురం), చె న్నూర్ (గోపాల్పేట), మిరాస్పల్లి (కొత్తకోట). ఫీట్లు.. పాట్లు అనేక గ్రామాల్లో కిక్కిరిసిన ఆటోల్లోనే పాఠశాలలకు.. కొన్నిప్రాంతాల్లో ఎడ్ల బండ్లు, కాలినడకే శరణ్యం నిత్యం కిలోమీటర్ల కొద్దీ ప్రమాదకర ప్రయాణం అరకొరగా ఆర్టీసీ సర్వీస్లు.. సమయానికి రాక.. వచ్చినా ఆపక ఇబ్బందులు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు -
25 నుంచి ఐద్వా మహాసభలు
పాన్గల్: హైదరాబాద్లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ఐద్వా ఆలిండియా మహాసభలు జరగనున్నాయని.. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు సాయిలీల కోరారు. గురువారం ఆమె మండల కేంద్రంలో మహాసభల వాల్పోస్టర్లను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వివక్ష వంటి అంశాలపై సంఘం పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు మాధవి, ఇందిర, మహిళలు పాల్గొన్నారు. -
నాగర్కర్నూల్ : 85 గ్రామాలు..
జిల్లాలో మొత్తం 360 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో నాలుగు డిపోలు ఉండగా.. 275 గ్రామాలకు సర్వీసులు నడుస్తుండగా.. మరో 85 పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. సుదూర ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రధానంగా 50 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని ఈ విద్యాసంవత్సరంలో ఆర్టీసీకి 16 దరఖాస్తులు రాగా.. 12 గ్రామాలకు పునరుద్ధరించారు. ఇబ్బంది పడుతున్న గ్రామాలు.. మర్రిపల్లి (ఉప్పునుంతల), జమిస్తాపూర్ (నాగర్కర్నూల్), చెన్నంపల్లి, పద్మనపల్లి, కొత్త చెరువు, ఎంసీతండా (లింగాల), మైలారం, లక్ష్మీపల్లి, బాణాల, అంబగిరి, నర్సాయిపల్లి (బల్మూరు), ఖానాపూర్, గుడ్ల నర్వ, నెల్లికొండ (బిజినేపల్లి). జిల్లాలో మొత్తం 261 గ్రామాలు ఉన్నాయి. ఒక డిపో ఉండగా.. 252 పల్లెలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. తొమ్మిది గ్రామాలకు మాత్రం బస్సు సర్వీసులు నడుస్తలేవు. 2025– 26లో బస్సు సౌకర్యం కల్పించాలని ఏడు గ్రామాలకు చెందిన ప్రజలు అర్జీలు పెట్టుకోగా.. తుంకుంట (అయిజ), మల్లెందొడ్డి (మల్దకల్)కి మాత్రమే సర్వీస్లు నడిపిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బంది పడుతున్న గ్రామాలు.. రాయపురం (గట్టు), తుమ్మిళ్ల (రాజోళి), కుర్వపల్లి, పరాముల (గద్వాల), మైలగడ్డ (ధరూర్), ఇటిక్యాలపాడు (మానవపాడు). జిల్లాలో మొత్తం 276 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో రెండు డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 157 గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. 119 పల్లెలకు ఆర్టీసీ సర్వీసులు లేవు. 2025–26 విద్యా సంవత్సరంలో ఉజ్జని (మాగనూర్), సంగంబండ (మక్తల్), రాయికోడ్ (నర్వ) గ్రామాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉంది. ఏయే గ్రామాలు అంటే.. షేర్నపల్లి, మేకహనుమాన్తండా, వందరగుట్ట తండా, పిల్లిగుండ్లతండా, బోయిన్పల్లి తండా (నారాయణపేట), చిన్నపొర్ల, పెద్దపొర్ల, మల్లేపల్లి, నాగిరెడ్డిపల్లి (ఊట్కూరు), అల్లీపూర్, తిమ్మారెడ్డిపల్లి (కొత్తపల్లి), ఎలిగండ్ల, పసుపుల, మాధవరం (మరికల్). ● వనపర్తి జిల్లాలో గోపాల్పేట మండలంలో జింకలబీడు, తండా, లక్ష్మీదేవిపల్లి, ఆముదాలకుంట తండాలకు బస్సు సౌకర్యం లేదు. పోలికేపాడు, మున్ననూరు, తిర్మలాపూర్కు బస్సు సౌకర్యం ఉన్నా పాఠశాల సమయానికి రావడం లేదు. రేవల్లి మండలంలోని కేశంపేట, కేశంపేట పాతతండా, కొత్త తండాకు బస్సు సౌకర్యం లేదు. ప్రతిరోజూ 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి చదువుకుంటున్నారు. వీపనగండ్ల మండలంలో నాగర్లబండతండాకు చెందిన విద్యార్థులు తూంకుంట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు వెళ్తున్నారు. వీరు ప్రతిరోజూ పది కిలోమీటర్లు కాలిబాటన ప్రయాణిస్తున్నారు. కొత్తకోట మండలంలో 24 గ్రామాలకు గాను రామనంతపురం, నిర్వేన్, నాటవెళ్లిపెద్దతండా గ్రామాలకు చెందిన విద్యార్థులు 5 కి.మీ.,లు కాలినడకన హైస్కూల్కు వెళ్తున్నారు. రోడ్డు సౌకర్యం ఉన్నా.. బస్సు సర్వీసులు లేకపోవడం వారికి శాపంగా మారింది. మా గ్రామానికి బీటీ రోడ్డు ఉన్నా ఆర్టీసీ బస్సు రావడం లేదు. దీంతో చదువుకోవాలంటే నడక తప్పడం లేదు. అరగంట ముందుగానే పాఠశాలకు బయలుదేరాల్సి వస్తుంది. బస్సు సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికై నా స్పందించి ఇబ్బందులు తొలగించాలి. – గోపాలకృష్ణ, 10వ తరగతి గోప్లాపూర్ (పాన్గల్) బస్సు సౌకర్యం లేకపోవడంతో మా ఇద్దరు పిల్లలు రోజు పాఠశాలకు ఆటోకు వెళ్తున్నారు. రోజు రూ.40 ఖర్చు అవుతుంది. ఆటో లేకపోతే బ్యాగులు వేసుకొని 3 కిలోమీటర్లు నడిచి కంచిరావుపల్లికి చేరుకొని అక్కడి నుంచి బస్సులో వెళ్లాల్సి వస్తుంది. గ్రామానికి రెండు పూటల బస్సు సౌకర్యం కల్పించాలి. – చెన్నకేశవరెడ్డి, తాటిపాముల, శ్రీరంగాపురం అవకాశం ఉన్న ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. రహదారి వెసులుబాటు ఉన్న ప్రతి ప్రాంతానికి బస్సు సౌకర్యం ఉంది. రహదారి సరిగాలేని ప్రాంతాలకు రాకపోకలు ఉండకపోవచ్చు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు ఏర్పాటు చేస్తున్నాం. కొత్త బస్సులు వస్తే ప్రతి పల్లెకు ఆర్టీసీ సేవలు అందేలా చొరవ తీసుకుంటాం. – దేవేందర్గౌడ్, ఆర్టీసీ డిపో మేనేజర్, వనపర్తి -
‘స్థానికం’లో పోలీసుల కృషి అభినందనీయం
వనపర్తి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, ఓటర్లకు పూర్తి భద్రత కల్పిస్తూ నిర్వహించడంలో ఎన్నికలసెల్ పోలీసు అధికారులు, సిబ్బంది అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని, వారి కృషి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల సెల్ పోలీసు అధికారులు, సిబ్బందికి నగదు రివార్డులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిబంధనల అమలు, పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా ఎలక్షన్సెల్ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించారని కొనియాడారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో భద్రత ఏర్పాట్లు చేయడం, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తతతో విధులు నిర్వహించడంతో జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా ముగిశాయన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సెల్ పోలీసు అధికారులు స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రామేశ్వర్రెడ్డి, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, పోలీసు సిబ్బంది వెంకటన్నగౌడ్, రవీంద్రబాబు, నగేష్, శ్రీనునాయక్, రంజిత్కు నగదు రివార్డు అందజేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే స్థాయిలో ప్రజలకు సేవలు అందించాలన్నారు. పదోన్నతులు గౌరవం, బాధ్యత పెంచుతాయి.. పోలీసుశాఖలో పదోన్నతి అనేది కేవలం హోదా మార్పు మాత్రమే కాదని.. ప్రజలపై మరింత బాధ్యత, నిబద్ధతను గుర్తు చేసే గౌరవ సూచికని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పొందడం ప్రతి పోలీసు సిబ్బందికి గర్వకారణమన్నారు. కొత్తకోట పోలీస్స్టేషన్్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న కె.వెంకట్రామారెడ్డి ఏఎస్సైగా పదోన్నతి పొందడంతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంకట్రామారెడ్డికి ఒక స్టార్ను అలంకరించి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పదోన్నతి పొందిన ప్రతి పోలీసు అధికారి రెట్టింపు ఉత్సాహం, నిజాయితీతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. క్రమశిక్షణ, బాధ్యత, అంకితభావంతో విధులు నిర్వర్తించే సిబ్బందికి శాఖాపరంగా తగిన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం లభిస్తాయని తెలిపారు. -
ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం
● ఈ నెల 9 నుంచి 20 వరకు రూ.22 కోట్లు ఆర్జన ● 34 లక్షల కి.మీ. ప్రయాణం.. 39 లక్షల ప్రయాణికుల వినియోగం ● ఓఆర్లో రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ అగ్రస్థానం స్టేషన్ మహబూబ్నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులను నడిపింది. మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి పది డిపోలకు 430 బస్సులు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 20 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులు నడిపారు. ముఖ్యంగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని స్వస్థలాలకు వెళ్లడానికి అధికంగా బస్సులు తిప్పారు. వీటిలో సెలవులు ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. అత్యధికంగా 109 శాతం.. మహాలక్ష్మి పథకం కింద ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణంలో జీరో టికెట్ ఉన్నప్పటికీ అందులో వారు తిరిగిన రూట్ ఆధారంగా టికెట్ చార్జీ కూడా పొందుపరిచారు. సాధారణ, మహిళల ఆదాయాన్ని కలుపుకొని సంక్రాంతి పండుగ రోజులకు సంబంధించి ఈ నెల 9 నుంచి 20 వరకు (14, 15, 16 తేదీలు మినహా) మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో అదనపు బస్సు సర్వీసులు నడపగా రూ.22,69,54,338 కోట్ల ఆదాయం వచ్చింది. 9 నుంచి 20 వరకు రీజియన్లోని బస్సులు 34,47,623 కిలోమీటర్లు తిరిగాయి. మహాలక్ష్మి పథకం ప్యాసింజర్లు, టికెట్ చార్జీ ప్రయాణికులతో కలిపి 39,20,918 మంది బస్సుల్లో ప్రయాణించారు. ఆక్యుపెన్షి రేషియాలో మహబూబ్నగర్ రీజియన్ రాష్ట్రంలో అత్యధికంగా 109 శాతం సాధించి అగ్రస్థానంలో నిలవడం విశేషం.డిపో కిలోమీటర్లు ఆదాయం ప్రయాణికులు మహబూబ్నగర్ 5,40,780 3,38,01,857 5,14,321 వనపర్తి 4,57,678 3,09,42,056 5,33,909 గద్వాల 4,06,181 2,46,20,151 4,95,360 అచ్చంపేట 3,34,898 2,44,05,169 3,39,395 కల్వకుర్తి 3,65,956 2,38,98,638 4,23,531 నారాయణపేట 3,66,405 2,37,08,913 3,66,638 షాద్నగర్ 3,18,770 2,24,55,052 4,09,820 నాగర్కర్నూల్ 3,17,478 2,09,87,807 4,39,589 కొల్లాపూర్ 2,71,300 1,81,41,848 3,05,620 కోస్గి 68,177 39,92,947 92,735 -
చట్టాలపై అవగాహనతోనే సత్వర న్యాయం
వీపనగండ్ల: చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటేనే సత్వర న్యాయం పొందే అవకాశం ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి రజని అన్నారు. బాల్యవివాహ ముక్త్ భారత్లో భాగంగా గురువారం మండలంలోని గోవర్ధనగిరిలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. యువత, విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలని.. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, ఎస్ఐ రాణి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పుర ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
వనపర్తి: త్వరలో జరిగే పుర ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఉమ్మడి పాలమూరు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి సమీక్షించారు. ఫొటోలతో కూడిన ఎలక్ట్రోరల్ ప్రచురణ, పంపిణీ, లెక్కింపు కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల ఎంపిక, పోలింగ్ సిబ్బంది తదితర అంశాలపై ఆరా తీశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని బ్యాలెట్ పత్రాల ముద్రణ పకడ్బందీగా జరిగేలా చూడాలని సూచించారు. నామినేషన్ సమయంలో వెబ్కాస్టింగ్, వీడియో చిత్రీకరణ జరగాలన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఐదు పురపాలికల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఫొటోతో కూడిన ఎలక్ట్రోరల్ విడుదల చేశామని, ప్రజల నుంచి వచ్చిన సుమారు 200 అభ్యంతరాలు పరిశీలించి పరిష్కరించినట్లు చెప్పారు. జిల్లాలోని 80 వార్డులు, 1,17,441 మంది ఓటర్లకు సరిపడా 191 పోలింగ్ కేంద్రాలను గుర్తించి మున్సిపల్ అధికారులు పరిశీలించి వాటిలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. గురువారం రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఉంటుందని, పోలింగ్ సిబ్బంది వివరాలు ఇప్పటికే టి–పోల్లో నమోదు చేసినట్లు వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పోలింగ్ సామగ్రి పంపిణీ, రిసెప్షన్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీపీఓ రఘునాథ్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అమరచింత: తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడమేగాకుండా పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పశుసంవర్దకశాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలోని పది వార్డుల్లో రూ.15 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. తమ ప్రభుత్వం స్థానిక పురపాలికకు ఇప్పటి వరకు రూ.35 కోట్లు కేటాయించిందని.. మునుపెన్నడూ లేని విధంగా సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వార్డుల్లో సీసీ రహదారులు, డ్రైనేజీలు, పార్క్లు, కూడళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని.. అనంతరం ప్రతి ఒక్కరూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్ఖాన్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, మార్కెట్ డైరెక్టర్లు పోసిరిగారి విష్ణు, శ్యామ్, కమలాకర్గౌడ్, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు. -
అతివకే అవకాశం
● కొత్తకోట పుర పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో ఆశావహులు కొందరు ఆశలు వదులుకోగా.. మరికొందరు తమ సతీమణులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇద్దరి మఽ ద్యలో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ● పెబ్బేరు పురపాలిక జనరల్కు కేటాయించగా రెండు ప్రధాన పార్టీల్లో ఇద్దరేసి నాయకులు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇందులో ఓ మాజీ ప్రజాప్రతినిధి ఉన్నట్లు తెలుస్తోంది. ● అమరచింత, ఆత్మకూర్ మున్సిపాలిటీలు జనరల్కు కేటాయించడంతో రాజకీయం వేడెక్కింది.● తీవ్ర నిరాశలో ఆశావహులు ● సతులను రంగంలోకి దింపేందుకు పతుల పాట్లు కొత్తకోట సమీపంలో హైదరాబాద్ బైపాస్ రహదారిపై బ్లాక్స్పాట్ను పరిశీలిస్తున్న ఎస్పీ సునీతరెడ్డి వనపర్తి టౌన్: స్థానిక పుర పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. అధికార కాంగ్రెస్పార్టీలో ఎన్నికల ప్రకటన వెలువడక ముందే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. వనపర్తి, కొత్తకోటలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార కాంగ్రెస్పార్టీలోని పలువురు ఆశావహులు రెండేళ్లుగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. చైర్మన్ బరిలో ఐదారుగురి పేర్లు ఉన్నట్లు ప్రచారంలో ఉన్నా.. అందులో ఇద్దరు, ముగ్గురి పేర్లు అధికంగా వినిపించాయి. పుర చైర్మన్ రేసులో ఉన్న నాయకులు తమ సతులను ఒప్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రాజకీయాలపై అవగాహన లేని వారిని సైతం బరిలో నిలబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. వనపర్తి మున్సిపాలిటీ 9 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండటం, ఆర్థికంగా బలంగా ఉన్న పురపాలికగా పేరుండటం తదితర పరిణామాల నేపథ్యంలో పీఠం చేజిక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వనపర్తిలో సరిగ్గా 21 ఏళ్ల తర్వాత పుర పీఠం మళ్లీ జనరల్ మహిళకే దక్కనుంది. 2000, మార్చి నెలలో జనరల్ మహిళ రిజర్వేషన్లో భాగంగా నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో ప్రమీలమ్మ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి, అంతకుముందు కూడా పురుషులే పుర చైర్మన్లుగా పనిచేశారు. ప్రస్తుతం జనరల్ మహిళకు కేటాయించడంతో చైర్పర్సన్ బరిలో ఎవరు ఉంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆశావహులు తమ సతీమణులను బరిలోకి దింపుతారా, లేక కొత్తవారికి కౌన్సిలర్గా అవకాశం ఇస్తారా? లేక ఇప్పటికే పార్టీలో ఉన్న మహిళా నాయకులకు ప్రాధాన్యం ఇస్తారా?, ఏ సామాజిక వర్గం అభ్యర్థిని చైర్పర్సన్గా ఎంపిక చేస్తారనేది ఉత్కంఠంగా మారింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీల నుంచి చైర్మన్ పదవులు ఎవరికీ దక్కలేదు. ఆయా వర్గాలకు ఇస్తారా? లేక బీసీ వర్గానికి ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. -
క్రీడలతో ఆరోగ్యకర జీవితం
వనపర్తిటౌన్: క్రీడలతో ఆరోగ్యకర జీవితం, ప్రశాంత మనస్సు, సమతుల వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బుధవారం జరిగిన మాధవరెడ్డి స్మారక ఫుట్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు నగదు, జ్ఞాపికలు అందజేసి మాట్లాడారు. ఆసియాలో క్రికెట్కు, ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్కు ఎక్కువ ఆదరణ ఉందని చెప్పారు. క్రీడలు కేవలం విద్యార్థులకు మాత్రమే కాదని.. అందరూ పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, నియమనిష్టలు అలవడుతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించడం నేర్చుకుంటామని చెప్పారు. ఫుట్బాల్, క్రికెట్ ఆడటంతో టీం వర్క్, ఇతరులను గౌరవించడం, నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. క్రీడల్లో ఏజీ హైదరాబాద్ జట్టు విజేతగా నిలవగా రూ.50 వేలు, జ్ఞాపిక, రన్నర్గా నిలిచిన వనపర్తి జట్టుకు రూ.30 వేలు, జ్ఞాపిక, మూడోస్థానంలో నిలిచిన గ్లోబ్ హైదరాబాద్ జట్టుకు రూ.20 వేలు, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు ఆదిత్యారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పీఎఫ్తో కార్మికులకు ప్రయోజనం అమరచింత: కంపెనీల్లో పనిచేసే కార్మికులకు పీఎఫ్ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని.. ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం రంగారెడ్డి, హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘాన్ని సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనా, ఎంప్లాయ్ ఎన్రోల్మెంట్ కాంపెయిన్ గురించి వివరించారు. కంపెనీ యాజమాన్యాలతో పాటు ఉద్యోగులకు కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశారు. యాజమాన్యం ప్రతి కార్మికుడు, ఉద్యోగికి పీఎఫ్, ఇన్స్యూరెన్స్, పింఛన్ అందించేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో కంపెనీ సీఈఓ ఎం.చంద్రశేఖర్, కంపెనీ డైరెక్టర్ పబ్బతి అశోక్, స్టాఫ్ మహేష్ పాల్గొన్నారు. రాజాగారి బంగ్లా మరమ్మతుకు రూ.10 కోట్లు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో శిథిలావస్థకు చేరిన రాజాగారి బంగ్లా మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతిగృహాల పునరుద్ధరణకు రూ.13.15 కోట్లు కేటాయించినట్లు వివరించారు. వచ్చిన నిధులతో రాజాగారి బంగ్లాను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. 25 నుంచి ఐద్వా మహాసభలు పాన్గల్: హైదరాబాద్లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆలిండియా మహాసభలు కొనసాగుతాయని.. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల కోరారు. మండలంలోని తెల్లరాళ్లపల్లిలో బుధవారం సాయంత్రం మహాసభల వాల్పోస్టర్లను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు, విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన హక్కులు తదితర అంశాలపై చర్చించేందుకు మహాసభలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా ఐద్వా నిరంతరం పోరాడుతుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం నాయకురాలు పావని, సాయమ్మ, సుశీల, దేవమ్మ, కవిత, శాంతమ్మ, లక్ష్మి, వెంకటమ్మ, అలివేలు, బతుకమ్మ, లక్ష్మి, నారమ్మ, ఈదమ్మ, చంద్రమ్మ పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
వనపర్తి: జిల్లాలో జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై అన్నిశాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. బందోబస్తు, ఫ్లాగ్మార్చ్ బాధ్యతలను పోలీస్శాఖకు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, ప్రొటోకాల్, ముఖ్యఅతిథులకు ఆహ్వానం బాధ్యతను ఆర్డీఓకు, బారికేడ్లు, స్టాల్స్, డయాస్ ఏర్పాట్లను రోడ్లు, భవనాలశాఖకు అప్పగించారు. వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాట్లుకు అన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. 25న జాతీయ ఓటరు దినోత్సవం.. 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. 23న కార్యాలయాలు, విద్యాలయాల్లో విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించాలని, ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రైతుల ఉత్సాహానికే బండలాగుడు పోటీలు
వనపర్తి రూరల్: ఎలాంటి బెట్టింగులు లేకుండా రైతుల ఉత్సాహం కోసమే బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెబ్బేరులోని చెలిమిళ్ల, కిష్టారెడ్డిపేటలో ఉన్న వేణుగోపాలస్వామి ఉత్సవాల సందర్భంగా మంగళవారం రెండోరోజు నిర్వహించిన న్యూ కేటగిరి విభాగం అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన అనన్యారెడ్డి ఎద్దులు మొదటి స్థానంలో నిలిచి రూ.50 వేలు గెలుపొందాయి. వీరికి దాత బొజ్జమ్మ, లచ్చమ్మ నగదు అందజేశారు. చిన్నంబావి మండలం కొప్పునూర్కు చెందిన బంకుమీది దర్శన్రెడ్డి ఎద్దులు రెండోస్థానంలో నిలవగా రూ.40 వేలు.. అనంతపురం జిల్లా పెంచలపాడుకు చెందిన రాకెట్ల భీమలింగప్ప, ఉబ్బిచెర్ల గ్రామ ఆముదాల రమేష్ ఎద్దులు మూడోస్థానంలో నిలిచి రూ.30 వేలు.. కొత్తకోటకు చెందిన గుర్నాథ్ ఎద్దులు నాలుగోస్థానంలో నిలిచి రూ.20 వేలు, గద్వాల జిల్లా జమ్మిచేడుకు చెందిన వెంకటేష్, కర్నూల్ యామిని ఎద్దులు ఐదో స్థానంలో నిలిచి రూ.15 వేలు, లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన ధనుష్ ఎద్దులు ఆరోస్థానంలో నిలిచి రూ.10 వేలు గెలుచుకున్నాయి. ఆయా వృషభాల యజమానులకు ఆలయ కమిటీ సభ్యులు నగదు అందజేశారు. కమిటీ సభ్యులు రామన్గౌడ్, కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, నాగిరెడ్డి, నవీన్కుమార్గౌడ్, ఆంజనేయు లు, మోహన్గౌడ్ ,రాముడు, పరశురాముడు, కార్తీక్, కుర్వ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రూ.5 లక్షల విరాళం.. పెబ్బేరులోని చౌడేశ్వరిదేవి ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్థానిక నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికిగాను రూ.5 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, కాంగ్రెస్పార్టీ నాయకులు శ్రీనివాస్గౌడ్, వెంకట్రాములు, దయాకర్రెడ్డి, రంజిత్కుమార్, రాములుయాదవ్ పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు వీపనగండ్ల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుంచి ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శివగౌడ్ తెలిపారు. మొదటిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్, గురువారం రెండోసంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్, శుక్రవారం తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. 24వ తేదీ శనివారం మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. రామన్పాడులోపూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: రామన్పాడు జలాశయంలో మంగళవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా నిలిచినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 925 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
ఎవరిదో పైచేయి..!
కాంగి‘రేసు’లో పురపాలక పీఠాల లొల్లి ఇద్దరు నుంచి ఆరుగురు వరకు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందు లో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మిన హా మిగిలిన 19 పురపాలికల్లో ఎన్నికలు జరగనున్నా యి. కార్పొరేషన్లో 60 డివిజన్లు, మిగతా మున్సిపాలిటీల్లో 310 వార్డులు ఉండగా.. ఒక్క దాంట్లో కనీ సం ఇద్దరు.. అధికంగా ఆరుగురు వరకు ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్లో పోటాపోటీ నెలకొంది. అదేవిధంగా మేయర్, చైర్మన్ పదవులకూ ప్రధానంగా ఇద్దరు నుంచి నలుగురు వర కు ద్వితీయ శ్రేణి ముఖ్య నాయకులు ఆశలు పెట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సి‘పోల్స్’కు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడం.. ఎన్నికలకు రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి పాలమూరులోని నగర, పట్టణాల్లో రాజకీయ సందడి ఊపందుకుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనుండడంతో నాలుగైదు రోజుల్లోపే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు డివిజన్లు,వార్డుల పరిధిలో కార్పొరేటర్లు,కౌన్సిలర్ల ఆశావహులు యువతను వెంటేసుకుని విందులకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు మేయర్, చైర్మన్, చైర్పర్సన్ పదవుల కోసం అధికార పార్టీ కాంగ్రెస్లో పలువురి మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో గ్రూప్ రాజకీయాలు మరోసారి తెరపైకి రాగా.. నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మేయర్/చైర్మన్ గిరి కోసం ఆశావహుల తీవ్ర ఒత్తిళ్లు కార్పొరేటర్/కౌన్సిలర్ పదవులకు సైతం.. వర్గాల వారీగా చీలిన ఎమ్మెల్యేలు, డీసీసీ, కీలక నేతలు తమ అనుచరులకు దక్కేలా ఎవరికి వారు పావులు రసవత్తరంగా మారిన గ్రూప్ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం లోకసభ స్థానాల వారీగా ఇన్చార్జీలను నియమించిన విషయం తెలిసిందే. మహబూబ్నగర్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి దామోదర రాజనర్సింహ, నాగర్కర్నూల్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి వాకిటి శ్రీహరికి అప్పగించింది. వీరు ఆయా మున్సిపాలిటీల పరిధిలో నేతలను సమన్వయం చేసుకుంటూ గెలుపు గుర్రాలను బరిలో నిలిపేలా కసరత్తు చేపట్టాలి. ఆయా మున్సిపాలిటీల్లో ఆయా పదవులకు ఆశావహులు అధికంగా ఉండడంతో పాటు గ్రూప్ రాజకీయాలు వారికి గుదిబండగా మారాయి. సరైన వ్యూహంతో ముందుకు సాగకపోతే పంచాయతీ ఎన్నికల మాదిరిగా రెబల్స్ బరిలో నిలిచే అవకాశముందని పార్టీలోని సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి లక్ష్మీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
కొత్తకోట రూరల్: తిరుమల వేంకటేశ్వరస్వామికి ప్రతిరూపంగా ప్రసిద్ధిగాంచిన మండలంలోని అమడబాకుల స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాఘశుద్ధ తదియ నుంచి నవమి వరకు స్వామివారి ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు మరిగంటి జగన్మోహనాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు. ● బుధవారం ఉదయం 10 గంటలకు పందిర్లు, సాయంత్రం 7 గంటలకు అంకురార్పణ. ● గురువారం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6 గంటలకు పిల్లలతో తల్లిదండ్రులకు పాదపూజ, రాత్రి 7 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం. ● శుక్రవారం ఉదయం 8 గంటలకు హోమం, బలిహరణం, 9.30కి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాల సేవ, 11.55 గంటలకు కల్యాణం, మధ్యాహ్నం 2 నుంచి ప్రసాద వితరణ (అన్నదానం), రాత్రి 9 గంటలకు డోలోత్సవం. ● 24న ఉదయం 9, రాత్రి 7 గంటలకు హోమం, బలిహరణం, రాత్రి 9కి ప్రభోత్సవం. ● 25న ఉదయం 9, సాయంత్రం ఆరు గంటలకు హోమం, బలిహరణం, రాత్రి 9కి రథోత్సవం. ● 26న ఉదయం 9 గంటలకు హోమం, బలిహరణం, సాయంత్రం 6 గంటలకు గ్రోమోత్సవం (ఊరేగింపు), రాత్రి 7 గంటలకు హోమం, బలిహరణం, 9 గంటలకు దోపోత్సవం. ● 27న ఉదయం 8 గంటలకు హోమం, పూర్ణాహుతి, తీర్థావళి (చక్రస్నానం), రాత్రి 8 గంటలకు నాగవెల్లి, దేవత ఉద్వాసన, ధ్వజ అవరోహణంతో కార్యక్రమాల ముగింపు. ● 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 5 వరకు జాతర. అభయమిస్తున్న అఖండ జ్యోతి.. ఆలయంలోని అఖండజ్యోతి దివ్యజ్యోతిగా వెలుగుతూ భక్తులకు అభమిస్తోంది. 2002లో తిరుపతి నుంచి జ్యోతి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 118 కుండల గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు. నాటి నేటి వరకు జ్యోతి నిర్విరామంగా వెలుగుతూ భక్తులకు దర్శనమిస్తోంది. ఘనంగా ఆభరణాల ఊరేగింపు బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామివారి ఆభరణాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కొత్తకోటలోని యూనియన్ బ్యాంకు లాకర్లో ఉన్న ఆభరణాలను గ్రామపెద్దల సమక్షంలో ఆలయ నిర్వాహకులు తీసుకొని మేళతాళాలు, భక్తుల ఊరేగింపు నడుమ పాదయాత్రగా ఆలయానికి తీసుకొచ్చారు. ఈ ఆభరణాలను బుధవారం స్వామివారిని అలంకరించనున్నట్లు అర్చకులు తెలిపారు. 23న కల్యాణం.. 25న రథోత్సవం -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
వనపర్తి: జిల్లాలోని జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆర్అండ్బీశాఖ ఆధ్వర్యంలో పోలీసు, జాతీయ రహదారులు, వైద్య, ఆరోగ్య, పీఆర్ తదితర శాఖల అధికారులతో రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించగా.. కలెక్టర్తో పాటు ఎస్పీ సునీతరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని, రహదారుల నిర్మాణాలు, మరమ్మతు చేపట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వేగాన్ని కట్టడి చేసేందుకు అవసరమైన చోట రాంబల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలన్నారు. పెబ్బేరు సమీపంలోని మోడల్ స్కూల్, రంగాపురం గ్రామం వద్ద అధిక ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ వంతెనల నిర్మాణానికి సిఫారస్ చేయాలని సూచించారు. రంగాపురం గ్రామం వద్ద యూటర్న్ ప్రమాదకరంగా ఉందని, అండర్ పాస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తకోట సమీపంలోని ముమ్మాళ్లపల్లి, అమడబాకుల, పాలెం స్టేజీల వద్ద రోడ్ క్రాసింగ్ ప్రమాదకరంగా ఉందని ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా హైమాస్ట్ లైటింగ్, రాంబుల్ స్ట్రిప్స్, బ్లింకర్స్, సైన్బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో అండర్పాస్ల నిర్మాణాలకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రులకు తీసుకెళ్లే వ్యవస్థపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కూడళ్లలో వాహనాల వేగాన్ని కట్టడి చేసేందుకు రాంబల్ స్ట్రిప్స్ వేయడంతో పాటు మిర్రర్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. రాజపేట పాఠశాల వద్ద సైన్బోర్డులు, ఆత్మకూరు చెరువుకట్టపై లైటింగ్తో పాటు స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు బిగించాలని సూచించారు. మదనాపురం వంతెన అప్రోచ్ పనులు పూర్తిచేసి వంతెనను వినియోగంలోకి తేవాలన్నారు. జిల్లాలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు వెంటనే చేపట్టాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్అండ్బీ అధికారి దేశ్యానాయక్, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
శారీరక దృఢత్వం, క్రమశిక్షణ కీలకం
వనపర్తి: పోలీసు వృత్తిలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ అత్యంత కీలకమని.. క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా, సిబ్బందిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి సమన్వయంతో కూడిన పనితీరును అలవరుస్తాయని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు క్రీడా మైదానంలో జోగుళాంబ జోన్–7 జోనల్ పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్–2026 ఎంపికలను నారాయణపేట జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్తో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు బలగాల శక్తి కేవలం ఆయుధాల్లోనే కాకుండా క్రీడా మైదానాల్లోనూ ప్రతిఫలిస్తుందని తెలిపారు. జోనల్ సెలక్షన్స్ ద్వారా ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని, జోగుళాంబ జోన్–7 పేరు ప్రతిష్టలను మరింత పెంచేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శాసీ్త్రయంగా, నిష్పక్షపాతంగా ఎంపికలు నిర్వహించామని, క్రీడల్లో ప్రతిభ కనబర్చే ప్రతి పోలీసు యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పోటీల్లో వనపర్తి, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. 100, 200, 400, 800, 1600 మీటర్ల పరుగు పందెం, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పరుగు పందెం, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్, ఖో–ఖో, హైజంప్, లాంగ్జంప్, షాట్పుట్, షటిల్ తదితర 31 క్రీడల్లో మొత్తం 370 మంది పోలీసులు పోటీపడ్డారు. ప్రతిభ కనబర్చిన 90 మంది క్రీడాకారులు ఫిబ్రవరి 2 నుంచి హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, సీఐ కృష్ణయ్య, వనపర్తి, మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు, వెంకటేష్, విజయభాస్కర్, కృషయ్య, నర్సింహ, రాఘవరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఐదు జిల్లాల ఎస్ఐలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సునీతరెడ్డి -
వంతెన నిర్మాణంతో తగ్గనున్న దూరం
ఆత్మకూర్: జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్యనున్న కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణంతో ఆయా ప్రాంతాల మధ్య దూరం తగ్గనుందని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆయన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కార్యకర్తలతో కలిసి కృష్ణానదిపై రూ.123 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు, తాత్కాలిక రోడ్డుపై జూరాల పుష్కరఘాట్ నుంచి కొత్తపల్లి శివారు వరకు నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలంలోని పార్టీ కార్యకర్తలు, ఆయా గ్రామస్తులు మంత్రి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లావాసి కావడం అదృష్టమని, అడిగిన వెంటనే వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని వివరించారు. నిర్మాణం పూర్తయితే వనపర్తి నుంచి మంత్రాలయం, ఎమ్మిగనూరు వెళ్లే ప్రయాణికులకు సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గునుందని వివరించారు. ఆత్మకూరు నుంచి గద్వాల వెళ్లాలంటే 35 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉందని.. బ్రిడ్జి పూర్తయితే కేవలం 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవచ్చన్నారు. త్వరలో నాలుగు వరుసల రహదారి రాబోతుందని వెల్లడించారు. ఏడాదిన్నరలో పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, గద్వాల మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, గద్వాల, మక్తల్ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి : సీఐటీయూ
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దుచేసి కార్మికుల హక్కులను కాపాడాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ కోరారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం సంయుక్తంగా జిల్లాకేంద్రంలోని రాజాగారి బంగ్లా నుంచి ఆర్టీసీ డిపో, రాజీవ్చౌక్ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానిలాంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్ల అమలు, విద్యుత్ సవరణ చట్టం, విత్తనబిల్లు, వీబీ జీ రాంజీ చట్టం, బీమా రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడుల అనుమతి, అణురంగంలోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతిస్తూ చట్టం చేసిందన్నారు. వీటికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా చేపట్టే ఆందోళనల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని అన్ని సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొని ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బొబ్బిలి నిక్సన్, ఉనితా, శారద, రాజు, రాము, కవిత, హనీఫ్, కార్మికులు పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణికి ఆయనతో పాటు ఆర్డీఓ సుబ్రమణ్యం హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 33 వినతులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య -
ఎస్పీ గ్రీవెన్స్కు 15 వినతులు..
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 15 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ సునీతరెడ్డి హాజరై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులకు ఫోన్చేసి తక్షణమే సదరు ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అంబులెన్స్ సేవలు వినియోగించుకోవాలి వీపనగండ్ల/చిన్నంబావి: రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవల కోసం అందుబాటులో ఉంచిన 102, 108 వాహనాలను ప్రజలు వినియోగించుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి కోరారు. సోమవారం వీపనగండ్ల కమ్యూనిటీ హెల్త్సెంటర్, చిన్నంబావిలో ఉన్న 102, 108 వాహనాలను తనిఖీ చేసి పరికరాలు, వాటి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద బాధితులను దగ్గర్లోని ఆస్పత్రులకు 108 వాహనాల్లో చేరవేస్తున్నామని, గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లడం, ప్రసవం తర్వాత తల్లీబిడ్డను ఇంటికి చేర్చడం, 5 ఏళ్లలోపు చిన్నారులకు అవసరమయ్యే టీకాలు వేయించేందుకు 102 అమ్మఒడి వాహనాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బంది ఆపదలో ఉన్నవారితో గౌరవంగా వ్యవహరించి సత్వర వైద్యసాయం అందేలా చూడాలని కోరారు. ఆయన వెంట జిల్లా ఎగ్జిక్యూటివ్ మహబూబ్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సాయికుమార్, పైలెట్ మైనుద్దీన్ ఉన్నారు. ‘ఆదర్శ’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి టౌన్: జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో (టీజీఎంఎస్) 2026–27 విద్యాసంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశాలు, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు http://tgrns.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్లో ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఉంటుందని.. పూర్తి వివరాలకు మోడల్ స్కూల్ వెబ్సైట్లో సంప్రదించాలన్నారు. ఆసక్తిగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్కు అదనపు బస్సులు వనపర్తిటౌన్: సంక్రాంతి సెలవుల తర్వాత ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ మార్గంలో 82 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్లో సూపర్వైజర్లు, సిబ్బందితో కలిసి ఆయన బస్సుల రాకపోకలు, ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా బస్సులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మార్గంలో 60 ట్రిప్పులు నడుపుతుండగా సోమవారం ప్రయాణికుల సంఖ్య పెరగడంతో అదనంగా మరో 22 ట్రిప్పులు పెంచినట్లు వివరించారు. వనపర్తి–బిజినేపల్లి, వనపర్తి–కొత్తకోట మీదుగానే కాకుండా పెబ్బేరు నుంచి కూడా హైదరాబాద్కు బస్సులు నడిపేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్కు రద్దీ పెరగడంతో ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో ఉంచామని.. రాత్రి 9 వరకు బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఎండీ ఆదేశాల మేరకు ఆర్టీసీ సిబ్బందికి బస్టాండ్లోనే భోజనం అందించినట్లు తెలిపారు. -
రూ.5 లక్షల వ్యయంతో..
సుమారు రూ.5 లక్షలతో జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ షట్టర్ల మరమ్మతుతో పాటు రబ్బర్ల బిగింపు పనులు మూడేళ్ల కిందట చేపట్టారు. సదరు కాంట్రాక్టర్ రెండేళ్ల పాటు పనులు చేపట్టగా షట్టర్ల మరమ్మతు పూర్తయిందని చేతులు దులుపుకొన్న అధికారులు లీకేజీలు ఎందుకు ఏర్పడ్డాయన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. షట్టర్లకు చిన్నపాటి కప్లింగ్ జాయింట్ బోల్ట్ను బిగిస్తే నీటి వృథాను నిలువరించవచ్చని అధికారులకు తెలిసినా నేటి వరకు ఆ పనులు చేపట్టడం లేదు. చిన్న బోల్ట్ బిగించాలని.. అదికూడా కార్యాలయంలో ఉందని త్వరలోనే బిగిస్తామని చెప్పడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి నీటిలీకేజీ నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని.. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఇందిరమ్మ చీరలు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు, మహిళలకు ప్రాధాన్యమిస్తూ వారి పేరునే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ప్రతి మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. మహిళలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీలో వెయ్యి బస్సులకు యజమానులను చేశామని చెప్పారు. వడ్డీలేని రుణాలు, సోలార్ యూనిట్లు, మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ తదితర వాటిని మహిళా సంఘాలకే అప్పగించామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందిస్తున్నామని తెలియజేశారు. అనంతరం ఇందిరా మహిళాశక్తి కింద కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన మహిళ సంఘాలకు రూ.65 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పుర కమిషనర్ సైదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, నాయకులు ఎన్జే బోయేజ్, కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, డా. పీజే బాబు, వేముల శ్రీనివాస్రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, ఎల్లంపల్లి నరేందర్రెడ్డి, సర్పంచ్ మాసన్న, ఉమామహేశ్వర్రెడ్డి, ముజీబ్, సంద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్లు బాధ్యతగా మెలగాలి
వనపర్తి: నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు గ్రామాల్లో బాధ్యతగా మెలిగి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం రాజపేట శివారు వైటీసీ భవనంలో సర్పంచ్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు. సర్పంచ్లకు విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోందని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న అన్ని అంశాలను వివరిస్తారని.. తమ విధులు తెలుసుకొని సమర్థవంతంగా పని చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి తాను ఎప్పుడు సహకరిస్తానని చెప్పారు. ఇదివరకు సర్పంచ్గా పనిచేసిన వారితో కాసేపు మాట్లాడించి వారి అనుభవాలు పంచుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్లకు కలెక్టర్ శిక్షణ సామగ్రిని పంపిణీ చేశారు. సమావేశంలో డీపీఓ తరుణ్, డీఎల్పీఓ రఘునాథ్, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సజావుగా ఇందిరమ్మ చీరల పంపిణీ.. జిల్లాలోని ఐదు పురపాలికల్లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సోమవారం నుంచి ఇందిరమ్మ చీరలు, మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు లింకేజీ రుణాల చెక్కుల పంపిణీ ప్రారంభించినట్లు చెప్పారు. పురపాలికలకు ఇప్పటికే 32 వేల పైచిలుకు ఇందిరమ్మ చీరలు రాగా.. వార్డుల వారీగా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీఓ ఉమాదేవి, వనపర్తి పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు
వనపర్తి రూరల్: పెబ్బేరులోని చెలిమిల్ల కిష్టారెడ్డిపేటలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ కమిటీ సభ్యులు అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చెలిమిల్లకు చెందిన కంచె తిరుపతయ్య వృషభాలు మొదటి స్థానంలో నిలవగా దాత గార్లపాటి శంకరయ్య రూ.40 వేల నగదు అందజేశారు. అదే గ్రామానికి చెందిన కంచె రాముడు ఎద్దులు రెండోస్థానంలో నిలవగా రూ.30 వేలు.. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన డీఆర్కే బుల్స్ శశాంక్ ఎద్దులు మూడోస్థానంలో నిలవగా రూ.20 వేలు.. ఇటిక్యాల మండలం బుడ్డారెడ్డిపల్లికి చెందిన చిన్న శివన్న ఎద్దులు నాలుగో స్థానంలో నిలిచి రూ.15 వేలు.. వడ్డెమాన్కు చెందిన ఆంజనేయరెడ్డి ఎద్దులు ఐదోస్థానంలో నిలవగా రూ.10 వేలు.. వనపర్తికి చెందిన శ్రీనివాస్ ఎద్దులు ఆరోస్థానంలో నిలవగా రూ.5 వేలు దాతలు గగనం భీముడు, గగనం హరికృష్ణ అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామన్గౌడ్, కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, నాగిరెడ్డి, నవీన్కుమార్గౌడ్, ఆంజనేయులు, మోహన్గౌడ్ ,రా ముడు, పరశురాముడు కార్తీక్, కుర్వ శేఖర్ పాల్గొన్నారు. -
సాగునీటి వృథా!
జూరాల ప్రధాన ఎడమకాల్వ షట్టర్లకు లీకేజీలు ● మూసినా ఆగని ప్రవాహం ● మూడేళ్ల కిందట మరమ్మతు..అయినా ఫలితం శూన్యం ● జలాశయంలో రోజురోజుకు తగ్గుతున్న నీటిమట్టం అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన ఎడమ కాల్వ షట్టర్లకు మూడేళ్ల కిందట మరమ్మతు చేపట్టారు. షట్టర్లు మూసినా లీకేజీల కారణంగా నీటి ప్రవాహం నిలువరించలేని పరిస్థితి నెలకొంది. కాల్వ వెంట వారంలో మూడు రోజుల పాటు సుమారు 60 క్యూసెక్కుల నీరు వృథాగా పారుతోంది. దీంతో ప్రాజెక్టులోని నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జలాశయంలో 4.264 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో 20 వేల ఎకరాల ఆయకట్టుతో పాటు ఉమ్మడి జిల్లాలోని తాగునీటి పథకాలకు నీటిని అందించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జలాశయం ప్రధాన గేట్లతో పాటు కుడి, ఎడమ కాల్వల షట్టర్ల లీకేజీలతో నీరు మరింత వృథా అవుతోందని ఆయకట్టు రైతులతో పాటు ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ షట్టర్లు వారబందీ విధానంలో.. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టుకు వారబందీ విధానంలో రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున వారంలో 4 రోజుల పాటు సాగునీటిని వదులుతున్నారు. మిగిలిన మూడు రోజులు పూర్తిస్థాయిలో మూసి నీటి సరఫరాను నిలిపివేస్తారు. కాని ఆ సమయంలోనూ లీకేజీలతో రోజుకు 60 క్యూసెక్కుల నుంచి 70 క్యూసెక్కుల వరకు నీరు వృథాగా కాల్వలో పారుతుండటంతో జలాశయంలో నీటిమట్టం తగ్గి వేసవిలో ఆయకట్టుకు సాగునీటి కష్టాలతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. -
మాధవరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకం
వనపర్తిటౌన్: ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తూ నిరాడంబర జీవితం గడిపిన స్వర్గీయ జిల్లెల మాధవరెడ్డి జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పశుసంవర్దక, క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మూడురోజుల పాటు జరిగే స్వర్గీయ జిల్లెల మాధవరెడ్డి స్మారక ఫుట్బాల్ పోటీలను సోమవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, శాట్స్ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మంత్రి క్రీడాజ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యూరాలజిస్ట్గా సంపాదించుకునే అవకాశాలున్నా, వాటిని కాదని జిల్లా ప్రజలకు ఉచిత వైద్యం అందించి వారి హృదయాల్లో నిలిచారని కొనియాడారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని జయన్న తిర్మలాపూర్లో పుట్టిన తన పెద్దన్న మాధవరెడ్డి 11వ తరగతి వరకు వనపర్తిలో, ఉన్నత విద్య హైదరాబాద్లో పూర్తి చేసినట్లు చెప్పారు. వారంలో 5 రోజులు నిమ్స్ ఆస్పత్రిలో.. రెండ్రోజులు జిల్లాకేంద్రంలోని సత్యసాయిబాబా ఆలయంలో రోగులకు ఉచిత వైద్యం అందించేవారన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని రోజులు బతికామని కాకుండా ఎలా బతికామన్నదే ముఖ్యమని, ప్రజలు గొప్పగా చెప్పుకొనేలా జీవించాలన్నారు. మాధవరెడ్డి తమ జిల్లా వాసిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. శాట్ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మాధవరెడ్డి పేరున క్రీడాపోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. మాధవరెడ్డి పేరున ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని కోరారు. స్థానిక కళాకారులు రాజారాం ప్రకాష్, రాంరెడ్డి తమ పాటల ద్వారా మాధవరెడ్డి జీవితాన్ని వివరించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి 12 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణకుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.శ్రీనివాస్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ సురేందర్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
జిల్లాల రద్దు అవివేకం : మాజీ మంత్రి
వనపర్తిటౌన్: జిల్లాల ఏర్పాటుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శాసీ్త్రయంగా కమిటీ వేసి నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకొని ఏడాది పాటు కసరత్తు చేసిందని రూపొందించిందని.. పదేళ్లుగా ప్రజలు అలవాటు పడ్డారని, శాశ్వత నిర్మాణాలు జరిగిన తర్వాత నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామనడం అవివేకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల్లో కలిపి 3.50 కోట్ల జనాభా ఉంటే 45 జిల్లాలు ఉన్నప్పుడు.. 4.50 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 33 జిల్లాలు ఉండటం తప్పేందటని ప్రశ్నించారు. త్వరలో జరిగే పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే జిల్లాల రద్దుకు లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుందని.. జిల్లాల మనుగడ కోసం ఓటేయొద్దని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానికులకు 95 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా నాటి సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చారని గుర్తుచేశారు. అసలైన కాంగ్రెస్ నాయకులు స్పందించకపోతే రేవంత్రెడ్డే కాంగ్రెస్పార్టీని భూస్థాపితం చేస్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని.. ప్రజలు, కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయిస్తారో తెలియకుండా తానే మళ్లీ సీఎంనని చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ దిమ్మెలను కూలదోయండని సీఎం స్థాయిలోని వ్యక్తి చెప్పడం హింసను ప్రేరేపించినట్లేనని.. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయకపోతే బీఆర్ఎస్ తరఫున పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని.. తెలంగాణ పక్షాన నిలవనందుకే ఈ ప్రాంతంలో కనుమరుగైందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, బి.లక్ష్మయ్య, రమేష్గౌడ్, కరుణ, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు రఘుపతిరెడ్డి, భీమన్న, మాజీ ఎంపీపీ కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత రుణమాఫీకి బ్రేక్!
నారసింహుడి రథోత్సవం● కనులపండువగా సాగిన లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం ● సంప్రదాయబద్ధంగా వేడుకను నిర్వహించిన సురభి రాజవంశీయులు ● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ● జనసంద్రంగా మారిన శ్రీవారి సముద్రకట్ట, జాతర ప్రాంగణం ● స్వామివారి నామస్మరణతో పులకించిన సింగోటం ● పూర్తిస్థాయిలో మంజూరయ్యే వరకు నిలిపివేయాలని ఆదేశాలు ● ఉమ్మడి జిల్లాలో 2,321 మంది కార్మికులు ● డబ్బులు చెల్లించాలంటూ బ్యాంకర్ల వత్తిడి ● ఆందోళనలో నేతన్నలు రథోత్సవానికి పోటెత్తిన భక్తజనం – వివరాలు 8లో.. – కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్●అమరచింత: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా గతేడాది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేనేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించారు. 16 నెలలు గడుస్తున్నా.. నేటి వరకు సగం నిధులు మాత్రమే విడుదల చేసి వాటిని కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయొద్దని ఆదేశాలిచ్చింది. పూర్తిస్థాయిలో విడుదల చేసిన తర్వాతే కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో చెల్లించాలని చెప్పడంతో చేనేత రుణమాఫీ ప్రక్రియ నిలిచిపోయింది. రుణమాఫీకి అర్హులైన వారి వివరాలను చేనేత జౌళిశాఖ అధికారులు బ్యాంకర్ల నుంచి సేకరించి నివేదికను రాష్ట్ర కమిటీకి అందజేసినా.. నిధులు మాత్రం జమకాలేదు. అప్పుడు.. ఇప్పుడంటూ ఏడాదిన్నరగా కాలం వెళ్లదీస్తున్నారని, బ్యాంకర్లు మాత్రం తీసుకున్న రుణం చెల్లించాలని వత్తిడి పెంచడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. చేనేత రుణాలు తీసుకున్న వారి ఖాతాల లావాదేవీలను అమరచింత యూనియన్ బ్యాంక్ మేనేజర్ నిలిపివేయడంతో ఆయన తీరును తప్పుబడుతూ బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రుణమాఫీ నిధులు వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,321 మంది చేనేత కార్మికులు రుణమాఫీకి అర్హులని జిల్లా అధికారులు గుర్తించి రూ.15.36 కోట్లు అవసరమని రాష్ట్ర జౌళిశాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం మాత్రం మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలకు మొత్తం నిధులు.. జోగుళాంబ గద్వాల, వనపర్తికి సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భావించి అన్ని జిల్లాలకు మొత్తం నిధులు మంజూరయ్యే వరకు రుణమాఫీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లా కార్మికుల మంజూరు సంఖ్య కావాల్సిన నిధులు (రూ.కోట్లలో..) జో. గద్వాల 1,792 11.79 వనపర్తి 338 2.50 నారాయణపేట 122 0.70 మహబూబ్నగర్ 54 0.27 నాగర్కర్నూల్ 15 0.09 ఏడీ ఖాతాలో సగం నిధులు మాత్రమే వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో చేనేత రుణాలు తీసుకున్న కార్మికుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. వీటికి సంబంధించి ప్రభుత్వం సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. పూర్తిస్థాయి నిధులు మంజూరైన వెంటనే నేత కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల -
రామన్పాడు.. సమస్యలు మెండు
మదనాపురం: రామన్పాడు జలాశయం ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రాజెక్టు భద్రత నుంచి సాగునీటి నిర్వహణ వరకు ప్రతి విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రూ.లక్షలు వెచ్చిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అంధకారంలో ప్రాజెక్టు కట్ట.. ప్రాజెక్టు రక్షణలో భాగంగా ప్రధాన డ్యామ్, కట్టకు ఇరువైపులా రాత్రివేళల్లో వెలుతురు కోసం 48 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం కేవలం 4 లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. మిగిలినవన్నీ మరమ్మతుకు గురై అలంకారప్రాయంగా మారాయి. రాత్రివేళ ప్రాజెక్టు ప్రాంతమంతా అంధకారం నెలకొని అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించడం కష్టతరమవుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వృథా అవుతున్న నీరు.. ఓఏపీ కాల్వ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జలాశయం నుంచి కాల్వకు నీటిని నియంత్రించే షట్టర్లు లేకపోవడంతో నిరంతరం వాగులోకి ప్రవహిస్తూ వృథా అవుతున్నాయి. నిల్వ నీరు ఇలా వృథా అవుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అజ్జకొల్లు, అప్పరాల, రామాపురం, శాఖాపురం రంగాపురం, రాంపూర్ గ్రామాలకు సరఫరా చేయాల్సిన సాగునీరు షట్టర్లు లేక రైతులకు శాపంగా మారింది. మొక్కలకు బిందెలతోనే.. ప్రాజెక్టు పర్యవేక్షణకు వచ్చే అధికారుల కోసం నిర్మించిన అతిథిగృహంలో నీరు కూడా లేని దుస్థితి నెలకొంది. అక్కడ పనిచేసే సిబ్బంది పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఆవరణలో నాటిన మొక్కలకు ప్రాజెక్టు నుంచి బిందెలతో మోసుకొచ్చి అందిస్తున్నారు. ప్రాజెక్టు నిండా నీరున్నా.. గెస్ట్హౌస్ ఆవరణలో మాత్రం నీటికరువు వేధించడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోంది. అంధకారంలో రామన్పాడు జలాశయం ఆనకట్ట ఓఏపీ కాల్వకు షట్టర్లు లేక వృథా అవుతున్న నీరు ఓఏపీ కాల్వకు షట్టర్లు లేక వృథా అవుతున్న నీరు కట్టపై 48 విద్యుద్ధీపాలు.. వెలిగేది నాలుగే... అతిథిగృహంలో నీటి కరువు పట్టించుకోని అధికార యంత్రాంగం ప్రాజెక్టు వద్ద నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఒక్కొక్కటిగా ప్రతిపాదనలు తయారుచేసి నివేదించాం. వీధిదీపాలు, మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. సత్వరమే పరిష్కరిస్తాం. – వరప్రసాద్, ఏఈ, రామన్పాడు జలాశయం -
వడ్డీ చెల్లించాలంటూ వత్తిడి..
అమరచింత యూనియన్ బ్యాంక్లో రూ.75 వేల చేనేత రుణం తీసుకున్నా. ఏటా వడ్డీ చెల్లిస్తూ రుణాన్ని పునరుద్ధరించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం చేనేత రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడంతో చెల్లించలేదు. ఇప్పుడు ఏడాది అవుతుందని.. వడ్డీ చెల్లించి పునరుద్ధరించుకోవాలని మేనేజర్ వత్తిడి చేస్తున్నారు. డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. – కొంకతి శకుంతలమ్మ, చేనేత కార్మికురాలు, అమరచింత రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాఫీపై ప్రకటన చేసి ఏడాదిన్నర గడుస్తున్నా.. నేటికీ సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై బ్యాంకు మేనేజర్ వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వం త్వరగా రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసి నేతన్నలను ఆదుకోవాలి. – వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు, చేనేత సహకార సంఘం, అమరచింత -
25 నుంచి హాజీమలాంగ్ బాబా ఉర్సు
అమరచింత: మండలంలోని మస్తీపురం గుట్టలో వెలిసిన సయ్యద్షా హజ్రత్ హాజీమలాంగ్ బాబా ఉర్సు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు కొనసాగుతుందని ముర్షద్ మైనుద్దీన్ ఆదివారం తెలిపారు. 25న గంధోత్సవం, 26న ఉర్సు, 27న ఫాతేహాలు ఉంటాయని వివరించారు. ఉర్సు సందర్భంగా దర్గా పరిసరాలను సుందరీకరించే పనుల్లో నిర్వాహకులు లీనమయ్యారు. హాజీమలాంగ్ బాబా దర్గా షరీఫ్ను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచేగాక మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలివచ్చి కందూర్లు నిర్వహించడం అనాదిగా వస్తోంది. ఉర్సుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని నిర్వాహకులు వివరించారు. రామన్పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం పూర్తిస్థాయి నీటిమ ట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడ మ, సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా నిలిచిపోగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కు లు, కుడి, ఎడమ కాల్వకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. ‘ప్రతిపక్షాల విజయాన్ని దెబ్బతీసేలా రిజర్వేషన్లు’ వనపర్తిటౌన్: స్థానిక పురపాలికలో వార్డుల రిజర్వేషన్లు శాసీ్త్రయ పద్ధతిలో జరగలేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాల విజయ అవకాశాలు దెబ్బతీసేలా, అధికార పార్టీకి అనుకూలంగా రిజర్వేషన్లు ఇచ్చారని మండిపడ్డారు. లక్కీడిప్ విధానంలో రిజర్వేషన్లు కేటాయిస్తున్నప్పుడు అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకుండా తర్వాత ఫిర్యాదు చేయమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్ధులు మెజార్టీ స్థానాలు గెలవలేరనే.. రిజర్వేషన్లలో గందరగోళాన్ని స్పష్టించారని ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యవర్గసభ్యుడు బత్తిని మధుసూదన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్ పాల్గొన్నారు. జాతీయ మహాసభలను జయప్రదం చేయండి వనపర్తిటౌన్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగే ఐద్వా 14వ జాతీయ మహాసభలకు మహిళలు, ప్రజలు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని భగత్సింగ్నగర్లో జాతీయ మహాసభల వాల్పోస్టర్లను స్థానిక నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వానికి నిరంతరం పోరాడుతున్న ఐద్వా.. ఈ మహాసభలతో ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవనుందని చెప్పారు. మహిళా ఉద్యమాలకు కొత్త దశను చూపనుందని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు సాయిలీల, సహాయ కార్యదర్శి ఉమా, సుగుణమ్మ, బాలకిష్టమ్మ, జయమ్మ ,రేణుక, అలివేల, శశికళ పాల్గొన్నారు. రేపటి నుంచి పాలెం వేంకన్న బ్రహ్మోత్సవాలు బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు శ్రీవారి అభిషేకం, కోయిల్ అళ్వార్ తిరుమంజనం, యాగశాల ప్రవేశం, రక్షాబంధన్, హంసవాహన సేవ, బుధవారం నిత్యారాధన, బలహరణం, ధ్వజారోహణం, గరుడ పొంగళి నివేదన, సంతానం లేని వారికి ప్రసాద వితరణ, హనుమత్ వాహన సేవ, నివేదన ఉంటుంది. గురువారం నిత్య పూజలు, ప్రబంధ పారాయణం, లక్ష పుష్పార్చన, గరుడ వాహన సేవ, శుక్రవారం అలివేలు మంగ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం, గజ వాహన సేవ, శనివారం హోమం, పల్లకిసేవ, ఆదివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, రథోహోమం, కుంభ పూజ, శ్రీవారి మాఢ వీధుల్లో రథోత్సవం (తేరు), వచ్చే సోమవారం స్వామివారి ఉద్దాల మహోత్సవం, బలహరణం, అశ్వవాహన సేవ, వచ్చే మంగళవారం స్వామివార్లకు పూర్ణాహుతి, చక్రస్నానం, ధ్వజ అవరోహణం, పుష్పయాగం, శేషవాహన సేవ, పవళింపు సేవ, పండిత సన్మానాలు, ఉత్సవ పరిసమాప్తితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
రాత్రిళ్లు భయమేస్తోంది..
ప్రాజెక్టు నిర్వహణ ముఖ్యం. 48 విద్యుద్దీపాలకు 4 మాత్రమే వెలుగుతున్నాయంటే అధికారుల పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. రాత్రిళ్లు ఇక్కడకు రావాలంటేనే భయమేస్తోంది. వెంటనే మరమ్మతు చేయించాలి. – నర్సింహగౌడ్, అజ్జకొల్లు షట్టర్లు లేక నీరు వృథాగా వాగులోకి చేరడం బాధాకరం. అజ్జకొల్లు, రాంపురం తదితర గ్రామాలకు సాగునీరందక రైతులు ఇబ్బంది పడుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నీటి వృథాను అరికట్టే బాధ్యత వారిదే. – బొబ్బిలి నిక్సన్, జిల్లా ఉపాధ్యక్షుడు, సీఐటీయూ ● -
శ్రీరామకొండ జనసంద్రం
దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరిన భక్తులు కోయిలకొండలోని శ్రీరామకొండ భక్తజనసంద్రంగా మారింది. ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీరామ పాదదర్శనం కోసం తెల్లవారు జామున 3 గంటల నుంచే ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది భక్తులు క్యూలైన్లో బారులుతీరారు. పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, నైవేద్యం, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ నామస్మరణతో కొండమొత్తం మార్మోగింది. కొండపై మహిమాన్వితమైన కోనేరులో స్నానం ఆచరించి కోనేటి నీటితో పాటు కొండపై ఉన్న వనమూలికలను తమ వెంట తీసుకెళ్లారు. 8లో.. గణనకు సిద్ధం -
పకడ్బందీగా నిర్వహిస్తాం..
జిల్లాలో సోమవారం నుంచి జంతుగణన పకడ్బందీగా చేపడుతాం. ఇందుకు గాను 214 బీట్లలో తమ సిబ్బందితోపాటు వలంటీర్లను నియమించాం. వీరికి తోడుగా బేస్ క్యాంపు సిబ్బంది, వాచర్లు ఉంటారు. డీఆర్ఓలు, బీట్ అధికారులు, వలంటీర్లు బీట్కు ఇద్దరు చొప్పున లెక్కిస్తారు. మొదటి మూడు రోజులు మాంసాహార, తర్వాత మూడు రోజులు శాకాహార జంతువుల గణన ఉంటుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు లెక్కించి ఆ తర్వాత యాప్లో నమోదు చేస్తారు. – రేవంత్చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి● -
రామన్పాడుకు నీటి సరఫరా నిలిపివేత
మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా నిలిచిపోగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి పాన్గల్: ప్రభుత్వం క్రీడారంగంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ కోరారు. మండలంలోని రేమద్దులలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. యువత చెడుమార్గంలో పయనించకుండా చదువు, క్రీడలపై దృష్టి సారించి సమాజంలో మార్పునకు తమవంతు ప్రయత్నం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను సకాలంలో భర్తీ చేయకనే నిరుద్యోగ సమస్య పెరిగిందని.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి డీవైఎఫ్ఐ అండగా ఉంటుందని చెప్పారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆవాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జబ్బార్ అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి సర్పంచులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సమస్యలపై దృష్టి సారించాలని, సమాన పనికి సమాన వేతనం అందడం లేదని ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మి తెలిపారు. సమావేశంలో సర్పంచ్ నిరంజన్, గోపల్దిన్నె సర్పంచ్ కవిత, ఆయా సంఘాల నాయకులు, క్రీడాకారులు, ప్రజానాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు. డీఎంఆర్ఎం ట్రస్ట్ సేవలు అభినందనీయం అమరచింత: డీఎంఆర్ఎం ట్రస్ట్ సేవలు అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తులు మాధవిదేవి, అనిల్కుమార్ జూకంటి అన్నారు. శనివారం మక్తల్లో కోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన వారు తిరుగు పయనంలో అమరచింతలోని మాజీ అడ్వొకేట్ జనరల్, హైకోర్టు న్యాయవాది దేశాయి ప్రకాష్రెడ్డి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్రెడ్డి పుట్టిన ఊరి కోసం చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకొని అభినందించారు. యువత, ప్రజలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే గ్రామాలు అన్నింటా అభివృద్ధి సాధిస్తాయన్నారు. వీరి వెంట నారాయణపేట జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు ఉన్నారు. ఇంటి వద్దకే మేడారం బంగారం ప్రసాదం స్టేషన్ మహబూబ్నగర్: ములుగు జిల్లాలో ఈనెల 28వ తేదీ నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేడా రం వెళ్లలేని భక్తులకు ఇంటివద్దకే అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా అందజేయనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ తెలిపారు. ఆర్ఎం కార్యాలయంలో టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ మేడా రం కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. భక్తులు రూ.299 చెల్లిస్తే దేవాదాయశాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయడం జరుగుతుందన్నారు. భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్సైట్ లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని తెలిపారు. -
పుర వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు
● వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లక్కీడిప్ తీసిన కలెక్టర్ వనపర్తి టౌన్: పుర ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లాలోని 5 పురపాలికలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లక్కీడిప్ తీసి రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వార్డుల్లోని కుల జనాభా ఆధారంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ చెప్పారు. సీప్–2024 సర్వే ప్రాతిపదికన వార్డుల వారీగా రిజర్వేషన్లను పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం గెజిట్ విడుదల చేసి జాబితాను కలెక్టరేట్, ఆయా పుర కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తామన్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారు చేసే సమయంలో వివరాలను ఎల్ఈడీ స్క్రీన్పై ప్రదర్శించారు. జనాభా తక్కువగా ఉన్నచోట రిజర్వ్డు స్థానాలు ఎలా కేటాయిస్తారని పలువురు అడగగా.. పీఆర్ చట్టం, మున్సిపల్ చట్టం వేర్వేరని, పుర చట్టానికి లోబడి ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, వనపర్తి పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమం
అమరచింత: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని మార్క్ భవనంలో నిర్వహించిన సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వం కార్మికవర్గంపై విధిస్తున్న ఆంక్షలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కార్మికులు, కర్షకులకు నష్టం కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలని, దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆదివారం హైదరాబాద్లోని ఎస్వీకే మినీహాల్లో జరిగే రాష్ట్ర సదస్సుకు కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రధాని మోదీ కార్పొరేట్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్పరం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్, పెట్టుబడిదారులను అందలం ఎక్కించే కుట్రలో భాగంగానే లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధిహామీ పథకం పేరు మార్చి బడ్జెట్లో కేటాయించాల్సిన నిధులు, కూలీల పనిదినాలు తగ్గించి వారికి ఉపాధిని దూరం చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి అరుణ్కుమార్, సహాయ కార్యదర్శి గణేష్, కోశాధికారి ఎదుట్ల కురుమయ్య, జిల్లా నాయకులు కురుమన్న, ప్రేమరత్నం, చెన్నయ్య, సుబ్బయ్య, రాజు పాల్గొన్నారు. కేంద్ర విధానాలపై ఉద్యమిద్దాంవనపర్తి రూరల్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులు, వ్యవసాయ కూలీల విధానాలపై ఉద్యమించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఐటీయూ, రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టగా ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక ఏళ్లు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా విభజించిందని.. ఓ పక్క ప్రజా సంక్షేమం అంటూనే మరోపక్క కార్పొరేట్లకు రూ.వేల కోట్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు. 2005 విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని రద్దుచేసి వీబీజీ రామ్జీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి పేదల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎస్ రమేశ్, కార్యదర్శి రాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి, కార్యదర్శి పరమేశ్వరాచారి, ఉపాధ్యక్షులు గోపి, ఉమా పాల్గొన్నారు. -
కేంద్రం నుంచి పూర్తి సహకారం..
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి ఎలాంటి ఎలాంటి కృషి చేయలేదని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.పాలమూరు అభివృద్ధి దిశగా పయనించేందుకు సీఎం రేవంత్రెడ్డిపై గురుతర బాధ్యత ఉందన్నారు. అందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. కేంద్ర, రాష్ట్ర వాటా నిధులతో వివిధ పథకాల పూర్తికి కృషి చేస్తామన్నారు.విద్యపరంగా పీయూ అభివృద్ధికి రూ.120 కోట్లు ఇచ్చామన్నారు. పాలమూరులో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, వెంటనే బాగు చేయించాలని కోరారు. -
పాలమూరు, రాష్ట్ర సరిహద్దు వరకూ దాన్ని తరిమికొట్టాలి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడగట్టాం. 2024లో గుండుసున్నా ఇప్పించినం. కాంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బొందపెట్టినం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 66శాతం సర్పంచ్లను గెలిపించుకున్నం. అంతే నాకు శత్రువులు ఎవరూ లేరు. పేదరికం, మహిళలకు అన్యాయం చేసేవాళ్లు, విద్యార్థులకు నష్టం చేసేవాళ్లు మాకు శత్రువులు. పేదరికాన్ని పాలమూరు నుంచి, రాష్ట్ర సరిహద్దు దాటే వరకూ తరిమి కొట్టాలన్నదే మా లక్ష్యం.’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లో రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంవీఎస్ మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రజనుద్దేశించి మాట్లాడారు. ఉచితంగా ఏది ఇచ్చినా శాశ్వతం కాదని.. విద్య ఒక్కటే శాశ్వతం. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత తీరాలను చేరాలని ఆకాంక్షించారు. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో విద్య, సాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. చదువే మన భవిష్యత్ను మారుస్తుందని.. పాలమూరులో పంటలు పండి రైతుల కళ్లల్లో ఆనందం నిండాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. ఇది వేగంగా సాగేలా ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ భూసేకరణ, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెండింగ్లకు సంబంధించి బాధితులకు నష్ట పరిహారం ఇప్పించాలని సూచించారు. రేవంత్రెడ్డి ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే.. పర్యాటక ప్రాంతాలుగా మార్చి ప్రాజెక్ట్లు చూపించాలి.. గతంలో టోనీబ్లెయర్, బిల్గేట్స్ వంటి వారు దేశంలో పర్యటనలు చేసేవారు. పాలమూరు పేదరికాన్ని చూపెట్టేందుకు ఆనాటి ముఖ్యమంత్రులు వారిని మన ప్రాంతానికి తీసుకొచ్చేవారు. ఇక్కడ ప్రజలు వలసపోతున్నారు.. బట్టలు లేవు.. తిండి లేదంటూ వారికి చూపించి బిచ్చం వేయాలని కోరేవారు. ఇది ఎంత బాధాకరం. అందుకే మన అభివృద్ధిని చూపించేలా మార్పురావాలి. పర్యాటక ప్రాంతాలుగా మార్చి మన ప్రాజెక్ట్లను చూపాలి, ట్రిపుల్ ఐటీ, ఐఐఎంలు చూపించాలి. పాలమూరు నుంచి దేశానికి సేవలు అందించాలి. అదే లక్ష్యంగా కృషి.. విద్య, సాగునీటికే మా మొదటి ప్రాధాన్యం త్వరలో 35 లక్షల మంది పట్టణ మహిళలకు ఇందిరమ్మ చీరలు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి రూ.1,284 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
తెగ తాగేశారు..!
● ఉమ్మడి జిల్లాలో 4 రోజుల్లో రూ.64.9కోట్ల మద్యం విక్రయాలు మహబూబ్నగర్ క్రైం: సాధారణ రోజుల్లోనే మద్యం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. దానికి తోడు పండుగలు కలిసి వస్తే ఇంకా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు పెరుగుతాయి. సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 మద్యం దుకాణాల్లో నాలుగు రోజుల్లో భారీ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే మటన్, చికెన్, నాటుకోడి అమ్మకాలు గణనీయంగా జరిగాయి. ప్రధానంగా నగరంలో శుక్రవారం ఉదయం నుంచే రోడ్లపై ప్రత్యేకంగా తాత్కాలికంగా అడ్డాలు ఏర్పాటు చేసుకుని మటన్, చేపల విక్రయాలు అధికంగా చేశారు. తిమ్మాజిపేట డిపో పరిధిలో రూ.39.9కోట్ల మద్యం, కొత్తకోట డిపో నుంచి రూ.25 కోట్ల వరకు లిఫ్ట్ చేసి దుకాణాలకు తరలించారు. -
పాలమూరు అస్త్రంగా..
నేడు మహబూబ్నగర్కు సీఎం రేవంత్రెడ్డి రాక సాక్షి ప్రతినిధి మహబూబ్నగర్: జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి శనివారం మహబూబ్నగర్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సుమారు రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు పుర పాలక ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా.. ముఖ్యమంత్రి సభలో ఏం మా ట్లాడుతారోననే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూ.883 కోట్లతో యూజీడీ, శాశ్వత తాగునీరు.. కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శాశ్వత తాగునీటి సరఫరా, పైపు లైన్లు తదితర సమస్యల పరిష్కారం కోసం రూ.883 కోట్లు ఇదివరకే మంజూరైన విషయం తెలిసిందే. ఇందులో రూ.603 కోట్లతో మురుగు నీటిని నగరం బయటకు తరలించే సీవర్ లైన్ కాల్వ ఏర్పాటు చేయనున్నారు. ● నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీకి అనుబంధంగా క్యాంపస్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గతేడాది మేలో మంజూరు కాగా.. ఈ విద్యాసంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్ ఐటీ కోసం సొంత భవనాన్ని నేషనల్ హైవేకు సమీపంలో ఉన్న దివిటిపల్లి–ఎదిర, జడ్చర్ల మండలం చిట్టబోయిన్పల్లి, మల్లెబోయిన్ పల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ 44 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో.. అక్కడ పనులు మొదలు పెట్టేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపింది. ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణం కోసం రూ.600 కోట్లను అవసరం కాగా.. రూ.200 కోట్ల చొప్పున మొత్తం మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయనుంది. తాజాగా మొదటి విడత కింద రూ.200 కోట్లు మంజూరు చేయగా.. భవన నిర్మాణ పనులకు నేడు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. సీఎం పర్యటనపై సర్వత్రా ఆసక్తి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతేఏడాది డిసెంబర్ ఒకటిన నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పర్యటించారు. రూ.4,500 కోట్లతో చేపట్టనున్న కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు. అనంతరం సభలో త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని సూచన ప్రాయంగా చెప్పారు. ఈ మేరకు రెండు రోజులకే ఎన్నికల షెడ్యుల్ విడుదల అయింది. ఆ తర్వాత అదే నెల డిసెంబరు 24న తన సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గికి వచ్చారు. నూతనంగా గెలుపొందిన నియోజకవర్గ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రకటించారు. తాజాగా శనివారం ఆయన మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో పుర ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మహబూబ్నగర్లో పర్యటించిన క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీనిపై సైతం సీఎం స్పందించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇలా.. సుమారు రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణానికి భూమిపూజ నగరంలోయూజీడీ, తాగునీటి పనులకు.. ఎంవీఎస్ మైదానంలో బహిరంగ సభ ముఖ్యమంత్రి సభపై సర్వత్రా ఆసక్తి -
ఎన్ఏటీఎస్ డైరెక్టర్గా సాయిప్రసాద్గౌడ్
వనపర్తిటౌన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (ఎన్ఏటీఎస్) డైరెక్టర్గా జిల్లాలోని ఏదుట్లకు చెందిన డా. పలుస సాయిప్రసాద్గౌడ్ ఎన్నికయ్యారని సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్ శుక్రవారం తెలిపారు. ఉత్తర అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను 2026–27 సంవత్సరానికిగాను ఎంపిక చేశారన్నారు. రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటూ విద్య, ఉద్యోగ నిమిత్తం వచ్చే తెలుగు వారికి తనవంతు చేయూతనిస్తూ సహకరిస్తున్నారని చెప్పారు. సాయిప్రసాద్గౌడ్ సేవలను గుర్తించిన అక్కడి తెలుగు సంఘం ఆయనను డైరెక్టర్గా ఎంపిక చేశారన్నారు. -
సంక్రాంతి సంబురం
వనపర్తినేటి నుంచి బ్రహ్మోత్సవాలు ఊర్కొండపేట అభయాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమై ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి.శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026–IIలో uవనపర్తిటౌన్: సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. అందమైన రంగవల్లులతో ఇళ్ల లోగిళ్లు, డూడూ బసవన్నల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గురువారం పండుగ రోజున జిల్లాలోని ఆలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సహిత వేంకటేశ్వరస్వామివారి పల్లకీసేవ, ఆదిత్య హృదయ పారాయణం, మహా మంగళహారతి, నక్షత్ర హారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతల హనుమాన్ ఆలయంలో శివదీక్షదారులు శివుడిని ప్రత్యేకంగా అలంకరించి తమ ఆటపాటలతో స్తుతించారు. ప్రతి ఇంటా తీపి వంటకాలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించారు. పట్టణాలు, గ్రామాల్లో సాయంత్రం వేళ చిన్నా పెద్దా తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేయడం కనిపించింది. అలాగే గ్రామాల్లో శకటాల ఊరేగింపు ప్రత్యేకంగా నిర్వహించారు. వృషభాలతో పాటు బండ్లు, ట్రాక్టర్లను రంగురంగుల కాగితాలు, కొబ్బరి, మామిడి ఆకులతో అలంకరించి వీధుల్లో తిప్పారు. శుక్రవారం కనుమ రోజున మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. రోజువారి కంటే రెండింతలు విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పండుగ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్తమంగా వేసిన వారికి గ్రామపెద్దలు బహుమతులు అందజేశారు. -
చింతలకుంట.. భక్తులతో కిటకిట
● మూడురోజుల పాటు ఘనంగా సాగిన ఉత్సవాలు ● కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి ప్రత్యేక పూజలు ● బందోబస్తు నిర్వహించిన పోలీసులు వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం పాతపల్లి శివారు చింతలకుంట ఆంజనేయస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి రోజుల్లో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి ఎక్కడా లేని విధంగా స్వామి వారికి కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అన్నం, మాంసం ముక్కలు, రొట్టెలు, పులుసు, కల్లు సీసా, గుగ్గిళ్లు సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు కొనుగోలు చేసిన వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పెబ్బేరు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడంతో పాటు భక్తుల రద్దీని నియంత్రించేందుకు బారికేట్లు ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి నంబి వెంకటేశ్వర్లు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
గత పాలకులు అభివృద్ధిని మరిచారు
● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ● రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ ఆత్మకూర్: నియోజకవర్గంలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి పనులు కొనసాగుతుంటే గత పాలకులు తట్టుకోలేకపోతున్నారని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం రాత్రి పుర పరిధిలోని పలు వార్డుల్లో రూ.15 కోట్లతో నిర్మించే సీసీ రహదారులు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను 90 శాతం గెలిపించి తన ఉత్సాహాన్ని రెట్టింపు చేశారని, ఇదే ఉత్సాహాన్ని పుర ఎన్నికల్లో చూపాలని కోరారు. అడిగిన వెంటనే నిధులిచ్చే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నారని.. పురపాలికకు రూ.15 కోట్లు, మండలానికి రూ.250 కోట్లు మంజూరయ్యాయని, రానున్న మూడేళ్లలో మరో రూ.300 కోట్లు తెచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే జాతీయ రహదారి.. జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో హైలెవల్ వంతెన పనులు కొనసాగుతున్నాయని.. దీని అనుసంధానంగా మంత్రాలయం, ఎమ్మిగనూర్ నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ వచ్చిందని మంత్రి వాకిటి వెల్లడించారు. త్వరలోనే రెవెన్యూ డివిజన్ ప్రకటన రాబోతుందని, సీఎం నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గత పాలకుల చేతగానితనం, వైఫల్యాలను గడపగడపకు వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రూ.23 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, రూ.15 కోట్లతో సీసీ రహదారులు, రూ.5 కోట్లతో ఇండోర్ స్టేడియం, మార్కెట్యార్డు భవనం, షాపింగ్ కాంప్లెక్స్, చెరువుకట్ట అభివృద్ధి ఇలా ఎన్నో పనులు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, గంగాధర్గౌడ్, భాస్కర్, అనీల్గౌడ్, సుదర్శన్శెట్టి, షబ్బీర్, ఖలీం, రవికాంత్, రవీందర్, నాగేష్, దామోదర్, గంగ, సాయిరాఘవ, మహేష్, షాలాం, జుబేర్, కరణ్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన యూరియా కష్టాలు
● చెప్పులు, రాళ్లను వరుసలో పెట్టిన అన్నదాతలు ● పోలీసుల పర్యవేక్షణలో టోకన్ల పంపిణీ పాన్గల్: ప్రభుత్వం ఎన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చినా.. రైతులకు మాత్రం యూరియా కష్టాలు తప్పడం లేదు. తాజాగా సోమవారం అన్నదాతలు మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం ఎదుట చెప్పులు, రాళ్లను వరుసలో ఉంచడం కనిపించింది. 450 బస్తాల యూరియా వచ్చిందనే విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు ఉదయాన్నే కార్యాలయానికి చేరుకొని క్యూలైన్లో నిలబడటం ఇబ్బందిగా ఉండటంతో చెప్పులు, రాళ్లను వరుసలో ఉంచి వారు మాత్రం కార్యాలయం ఎదుట పడిగాపులు పడ్డారు. రైతులు ఒకరినొకరు తోసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొనగా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని రైతులను వరుసలో నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరిని వదిలి బయోమెట్రిక్ విధానంలో సరఫరా చేశారు. యూరియా కోసం వరుసలో ఉంచిన చెప్పులు, రాళ్లు -
ప్రజావాణికి 22 అర్జీలు
వనపర్తి: ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. మొత్తం 22 అర్జీలు వచ్చాయని.. పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధితశాఖల జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీసు గ్రీవెన్స్కు 15 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 15 వినతులు వచ్చాయి. ఎస్పీ సునీతరెడ్డి పాల్గొని ఫిర్యాదుదారులతో మాట్లాడి వినతులు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. వచ్చిన వినతుల్లో భూ తగాదాలకు సంబంధించి 9, భార్యాభర్తల గొడవలకు సంబంధించి 3, పరస్పర ఘర్షణలకు సంబంధించి 3 ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ : ఎమ్మెల్యేవనపర్తిటౌన్: భారతదేశ ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. సోమవారం స్వామి వివేకానంద జయంతిని వివేకానంద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాకేంద్రంలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశ భవిష్యత్కు మూల స్తంభం యువతేనని వివేకానంద చెప్పారని గుర్తుచేశారు. ఆయన మాటలు యువతకు అమూల్య ప్రేరణని, సందేశాలు ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు కోటేశ్వర్రెడ్డి, భానుప్రసాద్, పిచ్చయ్య, రాజశేఖర్రెడ్డి, రామకృష్ణగౌడ్, జిల్లా మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, కాంగ్రెస్పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు చీర్ల చందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ, వైద్యుడు పగిడాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిండుకుండలా రామన్పాడు జలాశయం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో సోమవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా నిలిచినట్లు చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. జోగుళాంబ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం అలంపూర్: జోగుళాంబదేవి వార్శిక బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డితోపాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసినట్లు చెప్పారు. ఈ నెల 19 నుంచి 23 వరకు జోగుళాంబ అమ్మవారి ఆలయంలో వార్శిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వచ్చేనెల 14 నుంచి 18 వరకు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వీరితోపాటు ఆలయ అర్చకులు కృష్ణమూర్తిశర్మ, జానకిరామశర్మ తదితరులున్నారు. -
మహిళలే కీలకం..!
పురుషులతో పోలిస్తే 10,891 మంది అధికం ఓటర్ల తుది జాబితా ఖరారు సోమవారం రాత్రి వరకు కొనసాగింది. దీంతో ఫొటోల వారీగా డివిజన్లు/వార్డుల ఓటర్ లిస్ట్ను మంగళవారం ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మిగిలింది డివిజన్లు/వార్డులు, పురపాలికల పీఠాల వారీగా ఎస్టీ, ఎస్టీ మహిళ, ఎస్సీ, ఎస్సీ మహిళ, బీసీ, బీసీ మహిళ, అన్రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్కు అనుగుణంగా ఆయా సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేలా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈనెల రెండో వారంలో పురపాలికల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలికల ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 18 పురపాలికలకు సంబంధించి సోమవారం తుది ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జయాపజ యాల్లో వారి కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. పురుషులు 3,03,839.. మహిళలు 3,14,730 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లు.. మరో 18 మున్సిపాలిటీల్లోని 316 వార్డుల పరిధిలో మొత్తం 903 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఫైనల్ చేశారు. ఈ మేరకు పురుష ఓటర్లు 3,03,839 మంది, మహిళా ఓటర్లు 3,14,730 మంది, ఇతర ఓటర్లు 35 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 10,891 మంది అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, భూత్పూర్ పురపాలికల్లో మొత్తంగా పురుషుల కంటే 2,921 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో 2,409.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పురపాలికల్లో 2,807.. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో 2,053.. నాగర్కర్నూల్ జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ పురపాలికల్లో మొత్తంగా 701 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శాతాల వారీగా గమనిస్తే గద్వాల జిల్లాలో 2.58 శాతం మంది మహిళలు అధికంగా ఉన్నారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 2.24 శాతం, వనపర్తిలో 2.05 శాతం, మహబూబ్నగర్లో 1.33 శాతం, చివరగా నాగర్కర్నూల్ జిల్లాలో అత్యల్పంగా 0.87 శాతం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇంటి నంబర్ల ప్రకారం ఓటు హక్కు కల్పించలేదని.. ఇతర వార్డుల్లో ఓట్లు నమోదయ్యాయని.. వేరే జిల్లాలు, గ్రామాలు, ఇతర ప్రాంతాల ఓటర్లు తమ వార్డుల్లో నమోదైనట్లు వందలాది మంది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీనే తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా.. మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైనల్ ఓటర్ల జాబితాను వెల్లడించగా.. ఇందులోనూ పలు అభ్యంతరాలకు పరిష్కారం చూపలేదని రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్, అయిజ, పెబ్బేరు, అమరచింత, మద్దూరు పురపాలికల్లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదులు పరిష్కరించి.. తుది జాబితాను వెల్లడించినట్లు చెబుతున్నారు. మున్సిపాలిటీ/ డివిజన్లు/ పోలింగ్ ఓటర్లు.. కార్పొరేషన్ వార్డులు కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్నగర్ 60 279 97,636 1,00,191 14 1,97,841 దేవరకద్ర 12 12 4,909 5,161 0 10,070 భూత్పూర్ 10 11 5,975 6,089 0 12,064 వనపర్తి 33 95 31,655 32,527 8 64,190 కొత్తకోట 15 30 8,822 9,370 0 18,192 పెబ్బేరు 12 24 7,076 7,257 0 14,333 అమరచింత 10 18 4,364 4,783 0 9,147 ఆత్మకూరు 10 20 5,624 6,013 0 11,637 గద్వాల 37 78 31,730 33,630 10 65,370 అయిజ 20 26 11,233 11,790 0 23,023 అలంపూర్ 10 20 4,681 4,940 1 9,622 వడ్డేపల్లి 10 19 5,256 5,347 1 10,604 నారాయణపేట 24 54 17,244 18,216 0 35,460 మక్తల్ 16 35 11,407 11,938 0 23,345 కోస్గి 16 32 10,028 10,219 1 20,248 మద్దూర్ 16 20 6,171 6,530 0 12,701 నాగర్కర్నూల్ 24 48 17,460 17,918 0 35,378 కల్వకుర్తి 22 44 12,975 13,048 0 26,023 కొల్లాపూర్ 19 38 9,593 9,763 0 19,356 జిల్లాలవారీగా పురపాలికల ఓటర్లు ఇలా.. మున్సిపాలిటీ డివిజన్లు/ పోలింగ్ ఓటర్లు.. వార్డులు కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్నగర్ 82 302 1,08,520 1,11,441 14 2,19,975 వనపర్తి 80 187 57,541 59,950 08 1,17,499 జోగుళాంబ గద్వాల 77 143 52,900 55,707 12 1,08,619 నారాయణపేట 72 141 44,850 46,903 01 91,754 నాగర్కర్నూల్ 65 130 40,028 40,729 00 80,757 మొత్తం 376 903 3,03,839 3,14,730 35 6,18,604 పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో వెల్లడి జడ్చర్ల, అచ్చంపేటకు పూర్తి కాని పదవీ కాలం ఉమ్మడి జిల్లాలో పట్టణ ఓటర్లు 6,18,604 మంది పలు మున్సిపాలిటీల్లో పరిష్కారం కాని అభ్యంతరాలు? పురపాలికల వారీగా ఓటర్ల వివరాలు.. -
పకడ్బందీగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు
వనపర్తి: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి అనంతరం సంబంధిత అధికారులతో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చూడాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. అనంతరం డీఐఈఓ అంజయ్య మాట్లాడుతూ.. ప్రయోగ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని చెప్పారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 5,639 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రయోగ పరీక్షలకుగాను జిల్లావ్యాప్తంగా 29 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కొనసాగుతాయని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పుర ఎన్నికలకు సర్వం సిద్ధం.. జిల్లాలో పురపాలికల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. సోమవారం వార్డుల వారీగా తుడి ఓటరు జాబితా ప్రదర్శించామన్నారు. వీసీ అనంతరం పుర కమిషనర్లకు ఎన్నికల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఓటరు జాబితాను అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు అందజేసి అక్విటెన్స్ తీసుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. 16వ తేదీన పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితా ప్రదర్శించాలని ఆదేశించారు. చనిపోయిన వారు, గ్రామీణ ఓటర్లను జాగ్రత్తగా అన్మ్యాప్ చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియకు ఎంపిక చేసుకున్న భవనాల్లో ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలను కమిషనర్లు ప్రత్యక్షంగా పరిశీలించి వసతులు తనిఖీ చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరుకు నీళ్లు
కేసీఆర్ వస్తేనే సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆరే రావాలి. ఐటీ హబ్ పునర్ వైభవం పొందాలంటే, ఉద్యోగాలు రావాలంటే, అమర్ రాజా కంపెనీ మళ్లీ రావాలన్నా, రైతులు, మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నా, భూముల ధరలు పెరగాలన్నా మళ్లీ కేసీఆర్ రావాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్లో ఎస్వీఎస్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీసీ మైదానం వరకు బీఆర్ఎస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీసీ మైదానం నిర్వహించిన బీఆర్ఎస్ నూతన సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్తో సహా 14 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. అభ్యర్థిగా ఎవరున్నా గులాబీ జెండాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్దే.. పాలమూరు బిడ్డనంటూ రేవంత్ గద్దెనెక్కారు రెండేళ్లయినా ఒక్క పనీ చేయలేదు పాలమూరు నుంచే పుర ఎన్నికల జైత్రయాత్ర మహబూబ్నగర్లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
సేవాతత్పరులు
స్వామి వివేకానంద.. తన జీవన విధానంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహనీయుడు. లక్ష్యం లేకుండా పయనించే యువతకు ఆయనే ఓ దిక్సూచి. మానవ సేవయే.. మాధవసేవగా భావించి సామాన్య ప్రజలపై అసామాన్య సానుభూతిని కనబరిచిన మానవతావాది. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది యువకులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆశించకుండా మనల్ని మనమే సంస్కరించుకోవాలని ముందడుగు వేస్తున్నారు. రక్తదానం, అన్నదానం, విద్యాదానం, విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్లు పంపిణీ, మొక్కల పెంపకం, శ్రమదానంతోపాటు.. సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం కల్పిస్తూ ఇతరుల్లోనూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఏటికేడాది తమ లక్ష్యాలను మార్చుకుంటూ.. వాటి సాధన కోసం అవిశ్రాంతగా శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. సోమవారం స్వామి వివేకానందుడి జయంతి (జాతీయ యువజన దినోత్సవం)ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న యువజన సంఘాలపై ప్రత్యేక కథనం.. ముందుండి.. రక్తదానం నవాబుపేట: సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన రక్తదానాలకు పెట్టింది పేరు నవాబుపేట స్వామి వివేకానంద సేవాసమితి. మరికొందరు యువత తమ తల్లిదండ్రుల పేరుతో సంస్థలను స్థాపించి.. పేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఒకరు ఏర్పాటు చేస్తుంటే.. మరొకరు అన్నదాన కార్యక్రమాలు, పేదలకు ప్రతినెలా కొంత ఆర్థిక సాయం అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక సేవలో తరిస్తున్న యువతరం రక్తదానం, అన్నదానంతోపాటు ప్రగతిలో మమేకం సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు.. నేడు జాతీయ యువజన దినోత్సవం -
పుర ఎన్నికల్లో పోటీకి సిద్ధం
● ప్రజా పోరాటాలే లక్ష్యం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అమరచింత: ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న పార్టీ సీపీఎం అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎస్ భవన్లో జరిగిన పార్టీ మండల నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై త్వరలో జరిగే పుర ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం అభ్యర్థులు తమ బలం ఉన్న చోట పోటీచేస్తే ప్రజలు ఆదరించి గెలిపించడం సంతోషకరమన్నారు. రాబోయే పుర ఎన్నికల్లో సైతం పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని.. ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. దేశం, రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషించే రాజకీయ పార్టీలను ఓడించడమే తమ ధ్యేయ్యమని.. తమతో కలిసివచ్చే పార్టీలతో ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని మూడేళ్ల కిందట పార్టీ గుడిసెల పోరుకు శ్రీకారం చుట్టి పేదల పక్షాన నిలిచిందని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్పార్టీ వారి సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. పట్టణ పేదల ఇళ్ల స్థలాల విషయంలో మాట ఇచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి నేటికీ నెరవేర్చకపోవడం దారుణమన్నారు. గతంలో జరిగిన పుర ఎన్నికల్లో సీపీఎం పోటీచేసి వైస్ చైర్మన్ పదవి కై వసం చేసుకుందని.. ప్రస్తుతం పేదల సమస్యలు తీరాలంటే పార్టీ అభ్యర్థులను పూర్తిస్థాయిలో గెలిపించి చైర్మన్ స్థానం ఇవ్వాలని పట్టణ ప్రజలను కోరారు. పూటకో పార్టీ, కండువాలు మార్చే వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, ఎండీ మహమూద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జీఎస్ గోపి, వెంకటేష్, అజయ్, రాజు, రాఘవేంద్ర, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
గోపాల్పేట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రశాంత్ జాతీయస్థాయి అండర్–17 ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ సురేందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు నల్గొండలో జరిగిన అండర్–17 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబర్చినందుకు జాతీయస్థాయికి ఎంపికయ్యారని వివరించారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు హర్యానాలో జరిగే జాతీయస్థాయి పోటీ ల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రశాంత్ను ప్రధానోపాధ్యాయుడు రంగస్వా మి, ఉపాద్యాయ బృందం అభినందించారు. చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది : బీఆర్ఎస్ వనపర్తిటౌన్: స్థానిక పురపాలికలో బీఆర్ఎస్ హయంలో చేసిన అభివృద్ధి పనులే త్వరలో జరిగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి అధికారాన్ని కట్టబెట్టి తీరుతుందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్గౌడ్ అధ్యక్షతన జరిగిన పుర ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో పార్టీపై కన్నబిడ్డపై ఉన్న ప్రేమ ఉందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్పార్టీపై కసిగా ఉన్నారని, ఓట్ల రూపంలో ఒడిసిపట్టుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలో పనిచేసే నాయకులకు తప్పక ఆదరణ లభిస్తుందని.. ప్రతి నాయకుడు, కార్యకర్త వారి వారి వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం అత్యంత ప్రాధాన్యంగా భావించాలని సూచించారు. పురపాలికలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని.. అవకాశమిస్తే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వాలన్నారు. కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని.. సంఘటితంగా ఉండి పురపాలికపై గులాబీజెండా ఎగురవేసి పార్టీ ప్రతిష్ట పెంచాలని పిలుపునిచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఐక్యమత్యంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థుల గెలుపునకు శక్తివంచన లేకుండా పని చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు కేసీఆర్, బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారని చె ప్పారు. పుర మాజీ చైర్మన్ గట్టుయాదవ్, మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, నాయకులు కురుమూర్తి యాదవ్, గంధం బాలపీరు పాల్గొన్నారు. నేడు పాలమూరుకు కేటీఆర్ రాకజెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పాలమూరుకు రానున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుసభ్యులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ఎంబీసీ గ్రౌండ్లో సన్మాన కార్యక్రమం, బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ఆదివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. మరోవైపు జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో గులాబీ తోరణాలతో అలంకరించి.. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారన్నది సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. మహబూబ్నగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మ న్ యాదయ్య, నాయకులు శివరాజు, ప్రభాక ర్, మున్నూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
సేవ చేయడం అదృష్ట్రం..
ఆత్మకూర్లో వివేకానంద సేవాసమితిని నెలకొల్పిన నాటి నుంచి యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నాం. రక్తదాన, వైద్యశిబిరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. పేదలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. – బాలు, సేవాసమితి అధ్యక్షుడు, ఆత్మకూర్ ఆత్మకూర్: పట్టణానికి చెందిన డాన్స్మాస్టర్ బాలు, మ్యాడం శ్రీను, ల్యాబ్ టెక్నీషియన్ రాజేశ్ తదితరులు ఎనిమిదేళ్ల క్రితం స్వామి వివేకానంద సేవాసమితిని నెలకొల్పి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం క్లాత్ సంచులను పంపిణీ చేస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. ఇప్పటివరకు 275 మందితో రక్తదానం చేయించారు. నేత్రం ఫౌండేషన్ సహకారంతో విద్యార్థుల్లో కంటి లోపాలను గుర్తించి.. చికిత్స అందేలా చూస్తున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. ●తలసేమియా బాధితులకు అండగా.. -
పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
వనపర్తిటౌన్: పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో 86 మంది లబ్ధిదారులకు రూ.21.45 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని.. నేడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్రమశిక్షణతో గాడిలో పెడుతున్నారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డుస్థాయిలో సీఎం రిలీఫ్ఫండ్ అందిస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం కాంగ్రెస్ హయంలోనే అమలైందని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీపీీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఏఐపీసీ అధ్యక్షుడు నాగార్జున, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్జీటీయూ డైరీ ఆవిష్కరణ.. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర 2026 డైరీని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఆవిష్కరించారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్జీటీయూ జిల్లాశాఖ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి జి.నరేందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామ్మూర్తి, జిల్లా ప్రధానకార్యదర్శి భాస్కర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి
గోపాల్పేట: సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. ఆదివారం పల్లెబాటలో భాగంగా మండలంలోని మున్ననూరులో ఆయన పర్యటించి గ్రామస్లుతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీలకతీతంగా తాము పనిచేస్తున్నామని.. అందుకు నిదర్శనం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపేనన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ కార్యాలయానికి పక్కా భవనం, పల్లె దవాఖాన, సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామం నుంచి ఏదుట్ల, కాశీంనగర్ వెళ్లే రహదారి నిర్మాణం, శివాలయంలో కల్యాణ మండపం నిర్మించడంతో పాటు బస్సు సౌకర్యం కల్పనకు కృషి చేస్తానని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మమత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, ఉమ్మడి మండల ఇన్చార్జ్ సత్యశిలారెడ్డి, గ్రామ అధ్యక్షుడు ధీరమల్లు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. వీధిదీపాలు ప్రారంభం.. వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలో ఆదివారం రూ.60 లక్షలతో ఏర్పాటు చేసిన వీధిదీపాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికిగాను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో రూ.807 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఇటీవల ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.2.50 కోట్లు విడుదల కావడంతో అధునాతన వీధిదీపాలకు రూ.60 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా డీసీసీ కార్యాలయంలో లాల్ బహద్దూర్శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని నాగవరం మైసమ్మ, భూలక్ష్మీ మాత ఆలయాల్లో పూజలు చేశారు. కార్యక్రమంలో డీఈ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ, పుర మాజీ కౌన్సిలర్లు, మార్కెట్యార్డ్ డైరెక్టర్లు, కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం.సోమిరెడ్డి అన్నారు. జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్ఐఈపీఏ– నీపా) ఆధ్వర్యంలో మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు సాధికారతపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతోపాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రుల వద్ద కంటే విద్యార్థి నులు ఎక్కువ సమయం ఉపాధ్యాయులు, వార్డెన్లతోనే గడుపుతారని వారి భవిష్యత్ కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థినులకు ఉత్తమ విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే గాక సత్ప్రవర్తనతో ఆదర్శంగా మెలగాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను కేజీబీవీలలో తప్పక అమలు చేయాలని సూచించారు. -
వసూళ్లలో తగ్గిన దూకుడు
2025–26లో కేటాయించిన లక్ష్యంలో డిసెంబర్ 31 వరకు చేరుకున్నది ఇలా.. (రూ.కోట్లలో..) పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్టీఏ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలల గడువు ఉన్న క్రమంలో అప్పటి వరకు ఇచ్చిన లక్ష్యం కంటే అధిక మొత్తంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో వాహనాలకు జరిమానాలు, అధిక లోడ్, పత్రాలు లేకుండా, డ్రైవర్కు లైసెన్స్ లేకుండా తిరిగే వాహనాలకు జరిమానాలు విధించడానికి తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. జిల్లా ఆర్టీఏ శాఖ జీవిత కాల పన్నుతోపాటు ఫీజుల వసూలులోనూ పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రధానంగా త్రైమాసిక పన్నులు అయితే పూర్తిగా తగ్గిపోవడంతో సమస్యగా మారింది. దీంతోపాటు తనిఖీల వల్ల వచ్చిన ఆదాయం కూడా తగ్గింది. ప్రతిరోజు తనిఖీలు చేయాలని లక్ష్యం ఉన్నా.. సిబ్బంది కొరత వల్ల అది సాధ్యం కావడం లేదు. అరకొరగా ఉన్న అధికారులు రోడ్ల మీద వాహన తనిఖీలకు వెళ్తే కా ర్యాలయంలో పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అధిక లోడ్.. పత్రాలు.. జిల్లాలో జాతీయ రహదారి–44 ఉండటంతో అధిక లోడ్ కలిగిన వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి.. అలాంటి వాహనాలపై ఆర్టీఏ శాఖ కొరడా ఝులిపిస్తుంది. అదేవిధంగా పత్రాలు లేకుండా కూడా అధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాహనాల కోసం ఆర్టీఏ శాఖ వారు జాతీయ రహదారిపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు పత్రాలు లేకుండా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సర్వీస్ ఫీజు, డిటెక్షన్, గ్రీన్ట్యాక్స్ వసూలులో లక్ష్యానికి మించి సాధించారు. మహబూబ్నగర్ జిల్లాలో వసూలు చేసిన పన్నుల వివరాలు పన్ను రకాలు లక్ష్యం వసూలు చేసింది శాతం (రూ.లక్షల్లో..) మూడునెలల పన్ను 1,735.01 1,639.03 94.46 జీవితకాల పన్ను 5,301.00 4,230.19 79.79 ఫీజులు 990.00 798.84 80.69 సర్వీస్ ఫీజు 243.00 295.46 121 డిటెక్షన్ 207.00 338.68 163 గ్రీన్ట్యాక్స్ 117.00 119.28 101 లక్ష్యం చేరుకోవడంలో వెనకబడిన ఉమ్మడి జిల్లా ఆర్టీఏ శాఖ జీవితకాల ఫీజు, త్రైమాసిక పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం సిబ్బంది కొరతతో నామమాత్రంగా తనిఖీలు మూడు నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నాం. ప్రత్యేక టీంల ద్వారా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసి ఆదాయం పెరిగే విధంగా చూస్తాం. జీవిత కాల బీమా, నూతన వాహనాల ట్యాక్స్ ఇతర ఆదాయ మార్గాల్లో లక్ష్యం పూర్తి చేస్తాం. మరో మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల వాహనాల ధ్రువపత్రాలపై తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాం. – రఘుకుమార్, ఆర్టీఓ, మహబూబ్నగర్ -
లక్ష్యం.. గ్రీన్ గంగాపురం
జడ్చర్ల టౌన్: స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని గంగాపురం గ్రామంలో 6 మంది సభ్యులతో 2013 ఏడాదిలో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ (స్వామి వివేకానంద యూత్) పేరిట ఏర్పాటైనన యువజన సంఘం నేడు 222 మంది సభ్యులకు చేరింది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతిఒక్కరిలోనూ సేవాభావం పెంపొందిస్తున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం గ్రామంలో విరాళాలు సేకరించి అప్పటి కలెక్టర్కు అందజేశారు. తొలి అడుగు విజయవంతం కావడంతో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ సంఘం నమోదు చేయించారు. 6 మందితో ప్రారంభమైన సంఘంలో ప్రస్తుతం 222 మంది సభ్యులు చేరారు. ఎన్నో భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా గ్రీన్ గంగాపురంగా మార్చడానికి కృషిచేస్తున్నారు. -
పరవశించే మది
ప్రకృతి ఒడి..● పర్యాటక ప్రియులను ఆకర్షిస్తున్న నల్లమల టూరిజం ● ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఫర్హాబాద్, ఆక్టోపస్ వ్యూపాయింట్లు ● జంగిల్ సఫారీలో పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల కనువిందు ● వారాంతాలు, సెలవు రోజుల్లో విశేషంగా పెరుగుతున్న ఆదరణ ● రెండు రకాల ప్యాకేజీల్లో అవకాశం కల్పిస్తున్న అటవీశాఖ – సాక్షి, నాగర్కర్నూల్ -
ఆర్టీసీకి పండుగే..
● సంక్రాంతి వేళ.. పెరిగిన ప్రయాణికుల రద్దీ ● హైదరాబాద్కు 18.. కర్నూలుకు ఆరు అదనపు ట్రిప్పులు వనపర్తిటౌన్: సంక్రాంతి సెలవులు ఆరంభం కావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. జిల్లా కేంద్రం నుంచి గద్వాల, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కొత్తకోట, ఆత్మకూర్తో పాటు హైదరాబాద్, కర్నూలుకు అదనపు ట్రిప్పులను ఆర్టీసీ నడుపుతోంది. సాధారణంగా హైదరాబాద్కు రోజు 50 ట్రిప్పులు నడిపేవారు. ఈ మార్గంలోనే అత్యధిక ఆదాయం రానున్నందున మరో 18 ట్రిప్పులు నడుపుతున్నారు. పండుగ రోజుల్లో ప్రతి పది నిమిషాలకు ఓ బస్సును అందుబాటులో ఉంచారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సంఖ్యను మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలుకు రోజు ఆరు ట్రిప్పులు నడవనుండగా.. అదనంగా మరో ఆరు నడిపేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ ప్రతేక్యంగా సిబ్బందిని బస్టాండ్లో నియమించి సర్వీసుల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. -
యాదవులు అన్నిరంగాల్లో రాణించాలి
కొత్తకోట రూరల్: యాదవులు రాజకీయంతో పాటు విద్య, వ్యాపారం, సామాజిక సేవ తదితర రంగాల్లోనూ రాణించాలని రాష్ట్ర హౌసింగ్బోర్డు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాములు యాదవ్ కోరారు. శనివారం పట్టణ సమీపంలోని శ్రీకృష్ణ ఆలయంలో నిర్వహించిన జిల్లాలోని యాదవ సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరుడని, గ్రామస్థాయిలో సర్వాధికారాలు ఉంటాయన్నారు. ప్రతి యాదవ సర్పంచ్ భవిష్యత్లో ఉన్నతస్థాయి పాలకులుగా ఎదగాలనే దిశగా పని చేయాలని సూచించారు. కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా గెలిచే శక్తిగా ఎదగాలన్నారు. జిల్లాలో యాదవ జనాభా గణనీయంగా ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో వారి పాత్ర మరింత బలపడాలని కోరారు. గతంలో అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ.. భవిష్యత్లోనూ అన్నిపార్టీల ప్రజాప్రతినిధులు యాదవుల సంక్షేమానికి సహకరించాలన్నారు. సర్పంచులు, ఉపసర్పంచులు ఒకే వేదికపై కలిసి పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా మాజీ చైర్మన్ కురుమూర్తియాదవ్, కాంగ్రెస్పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్యాదవ్, అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్యాదవ్, యాదవ సంఘ నాయకులు, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
హైలెవల్.. ముందడుగు
జూరాల వద్ద ప్రారంభమైన వంతెన నిర్మాణం ● రూ.123 కోట్ల అంచనా వ్యయంతో.. ● తాత్కాలిక రోడ్డు ఏర్పాటు.. కొనసాగుతున్న రాకపోకలు ● ఆత్మకూర్, గద్వాల మధ్య తగ్గనున్న దూరం ● ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రాంతవాసులు ●గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నా. ప్రస్తుతం నిర్మాణానికి అడుగులు పడగా.. తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఏళ్లనాటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి (గద్వాల) మండలంలోని జూరాల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొందరు కావాలని అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురిచేసినా సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. – పరమేష్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు, ఆత్మకూర్ మా ఊరి మీదుగా ఆత్మకూర్, గద్వాలకు వాహనాలు తిరుగుతుంటే సందడిగా మారింది. గతంలో మా గ్రామంవైపు కన్నెత్తి చూడనివారు సైతం ఊరి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఊరి రూపురేఖలు మారడం ఖాయం. – నర్సింహ, సర్పంచ్, జూరాల (ఆత్మకూర్) ఆత్మకూర్: ఈ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల సాకారం కాబోతుంది. మండలంలోని జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై హై లేవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల మధ్య తాత్కాలిక రోడ్డు నిర్మించడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. రూ.123 కోట్లతో హై లేవల్ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న శంకుస్థాపన చేశారు. వెంటనే తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టి రాకపోకలు ప్రారంభించారు. ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లాలంటే 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం పూర్తయితే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం అనంతరం గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారపరంగా ఆత్మకూర్, జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించడంతో ఆర్అండ్బీశాఖ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. గత నెలలోనే పనులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరతగతిన నిర్మాణం పూసేందుకు సంబంధిత కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు. కృష్ణానదిపై హైలేవల్ వంతెన నిర్మాణ పనులు రెండేళ్లలోపు పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా మొదట తాత్కాలిక రోడ్డు నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ కంపెనీ పనులు వేగంగా కొనసాగిస్తోంది. – దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ -
గతంలో రెండు పంటలకు సాగునీరు..
గతంలో అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా రెండు పంటలకు సాగునీరు అందేది. గతేడాది యాసంగిలోనూ నీరు వదలడంతో 5 ఎకరాల్లో వరి సాగు చేశా. ప్రస్తుత యాసంగిలో ఎత్తిపోతలకు నీటి సరఫరా నిలిపినట్లు అధికారులు ప్రకటించడంతో వ్యవసాయ పనులు మానుకున్నాం. పంట సాగుకు దూరమై నష్టపోతున్నాం. – కడియాల నర్సింహులు, రైతు, అమరచింత ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాసంగిలో పంటల సాగుకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. సాగునీరు అందించాలని ఏఈలు, ఈఈలకు విన్నవించాం. జూరాలలో నిల్వ నీటిమట్టం తగ్గుతున్నందున వేసవిలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జూరాలలో సమృద్ధిగా నీరు నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం ప్రభుత్వ ఆదేశాల మేరకు అమరచింత, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాస ంగిలో సాగునీరు ఇవ్వలేమని ముందస్తుగా ప్రకటించాం. ఈ విషయాన్ని సంబంధిత ఎత్తిపోతల నిర్వహణ కమిటీ సభ్యులకు వివరించాం. జూరాలలో ప్రస్తుతం 4 టీఎంసీలు మాత్రమే ఉండటంతో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఎత్తిపోతల పథకాలకు నీటి సరఫరా నిలిపివేశాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం ● -
సీఎంఆర్ అప్పగింతలో నిర్లక్ష్యం తగదు
వనపర్తి: సీఎంఆర్ అప్పగింతలో నిర్లక్ష్యం తగదని.. జాప్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రైస్మిల్లర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2024–25 యాసంగి సీజన్న్ వరి ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా వందశాతం పూర్తి చేయాలని కోరారు. 2014–15 నుంచి 2023–24 వరకు సీఎంఆర్ అప్పగింతలో విఫలమైన మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 125 శాతం బియ్యాన్ని తక్షణమే ప్రభుత్వానికి అందించాలన్నారు. బకాయిల చెల్లింపునకు ఇదే చివరి గడువని.. బియ్యం అప్పగించని పక్షంలో సదరు మిల్లర్లపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ఆర్అండ్ఆర్ చట్టం కింద రికవరీ చేపడతామని, మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. బియ్యం నాణ్యతగా ఉండాలని, పౌరసరఫరాలశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథం, జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, రైస్మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ట్యాబ్ఎంట్రీలను నిర్లక్ష్యం చేయొద్దు.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత ట్యాబ్ ఎంట్రీలు చేయడంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హెచ్చరించారు. ఓపీఎంఎస్ ట్యాబ్ ఎంట్రీల నిర్వహణలో ఏపీఎంలు, పీఏసీఎస్ సీఈఓలు చూపుతున్న జాప్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గురువారం తన చాంబర్లో నిర్వహించిన సమీక్షలో ధాన్యం కొనుగోలు ప్రగతిని పరిశీలించి ట్యాబ్ఎంట్రీలు మందకొడిగా సాగుతుండటంపై అధికారులను నిలదీశారు. ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో పూర్తి చేయకపోవడంతో రైతులకు చెల్లింపులు ఆగిపోతున్నాయని, ఏపీఎంలు, సీఈఓల పనితీరు సంతృప్తికరంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాప్యానికి బాధ్యులైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మిల్లులకు చేరిన ధాన్యం వివరాలను మిల్లర్ల ద్వారా తక్షణమే ఆన్లైనన్లో అకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలని, రెండ్రోజుల్లో పెండింగ్లో ఉన్న ట్యాబ్ఎంట్రీలన్నీ పూర్తి కావాలని, రోజూ నివేదిక సమర్పించాలన్నారు. -
జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదాం
వనపర్తి: రోడ్డు భద్రత నియమాలు పాటించడంలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ నుంచి నల్ల చెరువు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా.. ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత జెండా ఊపి ప్రారంభించడమేగాక ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమేగాక సిబ్బంది కూడా పాటించేలా చూడాలని కోరారు. అతివేగంగా వాహనాలు నడిపి జీవితాలను నాశనం చేసుకోకుండా, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని, ఇటీవల అధికంగా ప్రమాదాలు జరిగినందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారోత్సవాలను మాసోత్సవాలుగా మార్చాయని చెప్పారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడమే గాకుండా ఎదుటి వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని కోరారు. అతివేగంతోనే అనర్థాలు.. రోడ్డు ప్రమాదాలతో నిత్యం ఎందరో మృతిచెందుతున్నారని.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ఇతరులకు అవగాహన కల్పించాలని ఎస్పీ డి.సునీతరెడ్డి కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధునిక వాహనాలు కొనివ్వడమే కాకుండా అధిక వేగంతో వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. యువత స్టైల్ కోసం హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం చేస్తారని.. ఆ పద్ధతి ప్రాణాలకే ముప్పు తెస్తుందని హెచ్చరించారు. బైక్ ర్యాలీ సందర్భంగా నల్లచెరువు కట్టపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బాలాజీనాయక్, జిల్లా రవాణాశాఖ అధికారి మానస, జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం పాల్గొన్నారు. -
డీఎస్పీ ఆకస్మిక తనిఖీ
వీపనగండ్ల: స్థానిక పోలీస్స్టేషన్ను గురువారం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల ఆన్లైన్ నమోదు, వచ్చిన ఫిర్యాదులు, తీసుకుంటున్న చర్యలు, పరిసరాలను పరిశీలించారు. ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఎస్ఐ రాణి తదితరులు పాల్గొన్నారు. రూ.2.50 కోట్లతో ఆధునిక ఠాణా.. అమరచింత: మండల కేంద్రంలో రూ.2.50 కోట్లతో ఆధునిక వసతులతో పోలీస్స్టేషన్ నిర్మాణానికి మరో మూడు ఎకరాల ప్రభుత్వ స్థలం అవసరం అవసరం ఉండటంతో గురువారం డీఎస్పీ వెంకటేశ్వర్లు పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం దుంపాయికుంటలో ఉన్న 14 ఎకరాల్లో 7 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారని, మిగిలిన 7 ఎకరాలు పేదల ఇంటి స్థలాలకు ఇచ్చారని నాయకులు డీఎస్పీకి వివరించారు. చర్చలు సఫలం కాకపోవడంతో సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. కార్యక్రమంలో సీఐ శివకుమార్, ఎస్ఐ స్వాతి, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి వనపర్తి టౌన్: విద్యార్థులు మహనీయుల స్ఫూర్తితో జీవితంలో ఉన్నతంగా ఎదగాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, డీఐఈఓ ఎర్ర అంజయ్య ఆకాంక్షించారు. గురువారం పట్టణంలోని ఆయా కార్యాలయాల్లో ఎస్ఎఫ్ఐ క్యాలెండర్ను సంఘం నాయకులతో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, కుటుంబం భరోసాను కోల్పోతుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వీరన్న నాయక్, నాయకులు హరీశ్, నరేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అంబాభవాని ఆలయంలో ఆంధ్రా ఎమ్మెల్సీ పూజలు కొత్తకోట రూరల్: పట్టణంలోని అంబాభవాని ఆలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్కు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎల్లారెడ్డిగారి శివరాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఎమ్మెల్సీ ఆలయాన్ని తరచూ దర్శించుకుంటారని.. హైదరాబాద్ నుంచి అనంతపూర్కు వెళ్తూ వచ్చినట్లు వర్గీయులు తెలిపారు. నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో గురువారం 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 730 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా నిలిచినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
పుర ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
అమరచింత/ఆత్మకూర్: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా గురువారం ఆయన అమరచింత, ఆత్మకూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా పురపాలికల్లో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూం, లెక్కింపు కేంద్రాలతో పాటు మౌలిక వసతులను పరిశీలించారు. ఆయా పుర కమిషనర్లు నాగరాజు, చికినె శశిధర్తో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితా సవరణ కొనసాగుతుందన్నారు. వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తూ తుడి ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆత్మకూర్లో 11 ఫిర్యాదులు అందగా వెంటనే పరిష్కరించామన్నారు. 10 వార్డులకుగాను 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. -
లైంగిక వేధింపులకు పాల్పడితే చర్యలు
వనపర్తి: పని ప్రదేశంలో మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని.. నిర్భయంగా లోకల్ కంప్లయింట్ కమిటీలో ఫిర్యాదు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లోకల్ కంప్లయింట్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళలు పని చేసుకునేలా రక్షణ చట్టాలు ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు ఇప్పటికే స్థానికంగా ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు, జిల్లాస్థాయిలో లోకల్ కంప్లయింట్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. బాధితులు 90 రోజుల్లో కమిటీకి లేదా షీ బాక్స్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల రక్షణ చట్టాలు, లైంగిక వేధింపుల విధానాలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ బాలాజీనాయక్ మాట్లాడుతూ.. 64 శాఖల్లో ఇంటర్నల్ కమిటీలు, లోకల్ కమిటీ సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు బాధ్యులను విచారించి ఆరోపణ నిర్ధారణ అయితే శిక్షలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, లోకల్ కమిటీ సభ్యురాలు డా. శ్రీలేఖ, జీసీడీఓ సుబ్బలక్ష్మి, శ్రీదేవి, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, డీసీపీఓ రాంబాబు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు
వనపర్తి: జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని.. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాలు మూసివేసి ధ్యానం వచ్చే చోట ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేకరణ ప్రక్రియ కొనసాగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ తెలిపారు. బుధవారం వరి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. బంగ్లాదేశ్తో సమస్యలు ఉత్పన్నమైనందున జనపనార దిగుమతి తగ్గి గన్నీబ్యాగుల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. యాసంగి సీజన్లో సమస్యలు రాకుండా కొనుగోలు కేంద్రాలు, రైస్మిల్లుల నుంచి తిరిగి తీసుకొని గోదాముల్లో భద్రపర్చాలని ఆదేశించారు. సీఎంఆర్ అప్పగించని మిల్లులపై ఒత్తిడి పెంచి త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు వారి ఖాతాలో జమ చేసేలా చూడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్, కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి, జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
వనపర్తి రూరల్: వాహన చోదకులు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి రజని కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పెబ్బేరులోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వాహనదారులు రహదారుల పక్కన బోర్డులపై సూచించిన గుర్తులను అనుసరిస్తూ వాహనాలు నడపడంతో ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్కాల వాహన చోదకులు సీట్బెల్ట్ కచ్చితంగా ధరించాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, 18 ఏళ్లు నిండిన తర్వాతే వాహనాలు నడుపుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి అశ్విని, మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ సైదులు, పీపీ రాజేష్, పుష్పలత, హెచ్ఎం విష్ణువర్ధన్రావు, న్యాయవాదులు బాలనాగయ్య, శిరీష్, చంద్ర, గిరిజ, వాలంటీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే
మదనాపురం: పేద ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 3వ నంబర్ రేషన్ దుకాణాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అర్హులందరికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ ఫలాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. కొత్త రేషన్ దుకాణం ఏర్పాటుతో నిత్యావసర సరుకుల పంపిణీ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద, మార్కెట్ ఛైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, తహసీల్దార్ మోహన్, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, నాయకులు రాంచంద్రయ్య, డీలర్ రాజశేఖర్, టీసీ నాగన్నయాదవ్, వెంకట్నారాయణ, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామన్పాడులో 1,020 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకుగాను 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 730 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో సరఫరా లేదని వివరించారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు. ‘లేబర్ కోడ్లతో కార్మికులకు అన్యాయం’ వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేసిందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లేబర్ కోడ్లలో 3 కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని.. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ కూడా అదే చెప్పిందన్నారు. వీటి ఫలితంగా సంఘం ఏర్పాటు, సమ్మె, వేతనాల పెంపునకు పోరాడే హక్కులు కోల్పోతామని వివరించారు. రోజకు 8 గంటల పనిదినం ఉండగా.. 12 గంటలకు పెంచిందన్నారు. కార్మికుల శ్రమను పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టేందుకు కోడ్లు తీసుకొచ్చారని.. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును పాలకులు అమలు చేయడం లేదని వివరించారు. కనీస వేతనం, కార్మికుల హక్కుల కోసం సంఘం రాష్ట్రంలో అలుపెరగని పోరాటం కొనసాగిస్తుందన్నారు. శ్రీహరి, శ్రీరాం, మోషా, భాస్కర్ పాల్గొన్నారు. -
డయాలస్ట్రెస్!
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ బాధితులు ● వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో అధికం ● అధునాతన పరికరాలున్నా.. వైద్యులు కరువు ● గతేడాది 7,270 మందికి డయాలసిస్.. ప్రస్తుతం 900 మందికి చికిత్స పాలమూరు: రోజురోజుకు మూత్రపిండ సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అలవాట్లు, భూగర్భజలాలు కలుషితం కావడం వంటివి కూడా బాధితుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతేడాది 7,270 మందికి డయాలసిస్ చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వ సెంటర్లలో 550 మంది, ప్రైవేటులో మరో 350 మందికి పైగా బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రధానంగా మక్తల్, నారాయణపేట, వనపర్తి ప్రాంతాలతో పాటు భూత్పూర్ మండలంలోని గ్రామాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితులు అధికమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 సెంటర్లు ఉండగా.. కొత్తగా మళ్లీ ప్రతి 20 కి.మీ. పరిధిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో.. ఉమ్మడి జిల్లా నుంచి 20 సెంటర్లు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. ● రెండు నెలల్లో గద్వాలలో అత్యధికంగా డయాలసిస్ చేయించుకున్న బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో గద్వాల సెంటర్లో 12 మిషన్లు ఉండగా.. నవంబర్లో 963, డిసెంబర్లో 976 మందికి డయాలసిస్ సేవలు అందించారు. కాగా.. అధునాత కేంద్రాలున్నా.. పాలమూరులో రోగులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఒక్క నెఫ్రాలజిస్టు అందుబాటులో లేకపోవడం గమనార్హం. -
దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి
● 21న దివ్యాంగుల ప్రజావాణి ● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల్ల చిన్నారెడ్డి వనపర్తి: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకుగాను ఈ నెల 21న ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నామని.. జిల్లాలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పాత మార్కెట్యార్డు ప్రాంగణంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా.. ఆయనతో పాటు ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఆలింకో డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్సింగ్, గ్రిడ్ కార్యనిర్వాహక సంచాలకుడు ఎంకే రమేష్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 730 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేసి మాట్లాడారు. దివ్యాంగులు బాగా చదువుకొని సకలాంగులతో సమానంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని.. అందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మిత్రుల్లో ఒకరు దివ్యాంగుడైతే ఇతర స్నేహితుల కంటే దివ్యాంగుడైన స్నేహితుడిపై ఎక్కువ ప్రేమ, ఆప్యాయత చూపాలని సవ్యాంగులకు సూచించారు. కళ్లు లేని వారికి స్పర్శ ద్వారా చదువుకొనే అవకాశం కల్పించిన లూయిస్ బ్రెయిలీ, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత జైపాల్రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. రాష్ట్రస్థాయి ప్రజావాణికి వచ్చే దివ్యాంగుల అర్జీలను మొదటి ప్రాధాన్యతగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతేడాది దివ్యాంగుల దినోత్సవం రోజున సంక్షేమ భవన నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయించామని.. భవన నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 728 మంది దివ్యాంగులకు రూ.70.73 లక్షల విలువగల ఉపకరణాలు అందజేస్తున్న యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదు.. వైకల్యం అనేది శరీరానికి మాత్రమేగాని లక్ష్య సాధనకు కాదని, అన్నిరంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బ్యాటరీ ట్రై సైకిల్ 97, వినికిడి యంత్రాలు 44, చంక కర్రలు 178, అడ్జస్టబుల్ వాకింగ్ స్టిక్స్ 108, ట్రై సైకిల్స్ 149, టీఎల్ఎం కిట్స్ 30 ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్సింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎస్ఆర్ నిధులతో దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తున్నట్లు చెప్పారు. అలింకో సంస్థ గ్రామస్థాయికి చేరుకొని వారికి అవసరమైన ఉపకరణాలు అందిస్తుందన్నారు. గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక సంచాలకుడు రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని దివ్యాంగులకు ఉపకరణాలు అందించే అవకాశం కల్పించినందుకు జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, దివ్యాంగురాలైన గాయత్రి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 20 మంది మైనార్టీలకు ఒక్కొక్కరికి రూ.30 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డీడబ్ల్యూఓ సుధారాణి, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పి.శ్రీనివాస్గౌడ్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, తహసీల్దార్ రమేష్రెడ్డి, దివ్యాంగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మీసాల మోహన్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. -
‘భూములు కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోం’
కొత్తకోట: రాజకీయాలు, ఆర్థిక పలుకుబడిని ఉపయోగించుకొని ఇతరుల భూములు, ప్రభుత్వ స్థలాలు అడ్డగోలుగా కబ్జా చేస్తుంటే బీసీ పొలిటికల్ జేఏసీ చూస్తూ ఊరుకోదని సంఘం రాష్ట్ర చైర్మన్ డా. రాచాల యుగంధర్గౌడ్ హెచ్చరించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లును కలిసి కబ్జాకు గురైన భూములపై విచారణ జరపాలని ఫిర్యాదు అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పుర పరిధిలోని కుమ్మరికుంటను పరిశీలించడానికి వెళ్తుండగా.. కొన్ని ఆసక్తికర నిజాలు వెలుగు చూశాయన్నారు. సర్వేనంబర్ 295, 296, 297, 302లోని 4 ఎకరాల భూమి 2009–10 వరకు హాజీ భద్రోద్దీన్ అనే వ్యక్తి పేరుపై ఉండగా.. 2010–11లో ఎలాంటి ఆధారం లేకుండా ఇతరుల పేరుపై మార్పిడి జరిగిందని, రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా ఈ భూమి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, ఇతర పట్టా భూములు కూడా కబ్జాకు గురైనట్లు తెలుస్తోందని, నిగ్గు తేలుస్తామన్నారు. అక్రమాలకు రాజకీయ పలుకుబడి ఉపయోగించారా? లేక అధికారులకు లంచాలు ఎరవేసి మార్పిడి చేసుకున్నారా? అనే వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి వెంటనే విచారణ జరిపించి అక్రమార్కులు, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, లోకాయుక్తను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంజన్న యాదవ్, సయ్యద్ గూడూషా, వీవీ గౌడ్, మహేందర్, బత్తుల జితేందర్, శివ, ధర్మేంద్రసాగర్, రాఘవేందర్గౌడ్, రమేష్ పాల్గొన్నారు. -
పాలమూరును ఎడారి చేసేందుకు కుట్ర
● 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుపై నిందలా.. ● జూరాల నుంచి కొడంగల్కు నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుంది ● సీఎం, మంత్రులకు ‘పాలమూరు’పై కనీస అవగాహన లేదు ● ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో మాజీ మంత్రుల ధ్వజం అమరచింత/ కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్: కేవలం 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి కొడంగల్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు కృష్ణా నీటిని తరలించి పాలమూరును ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జలపోరులో భాగంగా జూరాల, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను మంగళవారం ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ముందుగా జూరాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు ముందుకు సాగలేదని విమర్శించడం సరికాదన్నారు. జూరాలలో నీటి నిల్వలను కాపాడుకునే ప్రయత్నం చేయలేని సీఎం రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. వేసవి రాక ముందే జూరాలలో నీటి నిల్వలు అడుగంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వలేక క్రాప్ హాలీడే ప్రకటించడమే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు. కేవలం 9 టీఎంసీల సామర్థ్యం కలిగిన జూరాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తరలించేలా పనులు ప్రారంభించి 90 శాతం పూర్తిచేశారని చెప్పారు. ప్రస్తుతం మిగులు పనులు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి నీటి కొరత ఉంటుందనే సాకుతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటి తరలింపు దండగని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత నష్టపోయిందని అలాంటి జిల్లాలో సాగునీటితోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కృష్ణానది జలాలు వందశాతం వాడుకునే హక్కు పాలమూరుకే ఉందన్నారు. -
గ్రామాల్లో క్రీడల సందడి
● సీఎం కప్ నిర్వహణకు సన్నాహాలు ● గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోటీలు ● 17 నుంచి ఫిబ్రవరి 26 వరకు క్రీడల నిర్వహణ ఔత్సాహికులకు మంచి అవకాశం సీఎం కప్ క్రీడలు ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశం. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటికి వస్తుంది. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశం. అధికారులు, క్రీడాసంఘాలు, పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల సహకారంతో జిల్లాలో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. ఆసక్తిగల క్రీడాకారులు https://sat. telangana.gov.in/cmcup వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది కూడా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రామస్థాయి, మండల–అర్బన్, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 17, 22 వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల/అర్బన్, వచ్చేనెల 3 నుంచి 7 వరకు అసెంబ్లీ స్థాయి, 10 నుంచి 14 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో క్రీడలతో ఒక నూతన ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది. ఈసారి చిన్నారులు, ఇతరులకు కూడా రీక్రియేషన్ క్రీడలు జరగనున్నాయి. సీఎం కప్ సందర్భంగా జనవరి 8 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. వివిధ క్రీడాంశాల్లో పోటీలు సీఎం కప్లో 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, షూటింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్తక్రా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాకెట్, కనోయింగ్–కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్బాల్, తైక్వాండో, బిలియర్డ్స్ స్నూకర్స్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్బాల్, సెయిలింగ్, బాల్బ్యాడ్మింటన్, మల్లకంబ్, పారా గేమ్స్, రీక్రియషనల్ క్రీడలులకు పోటీలు నిర్వహిస్తారు. గతేడాది 90 పతకాలు.. సీఎం కప్ క్రీడాపోటీలు క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్నాయి. 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి 2వ తేదీ వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మొదటి సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. మహబూబ్నగర్లో రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్బాల్ పోటీలు జరిగాయి.రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు 90 పతకాలు సాధించడం విశేషం. వీటిలో 26 బంగారు పతకాలతో సత్తాచాటారు. మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారులు 9 బంగారు, 15 రజతం, 11 కాంస్య పతకాలతో మొత్తం 35 పతకాలు సాధించారు. వనపర్తి జిల్లా 8 బంగారు, 6 రజతం, 5 కాంస్య పతకాలు మొత్తం 19 పతకాలు, నారాయణపేట జిల్లా 6 బంగారు, 6 రజతం, 2 కాంస్యంతో 14 పతకాలు, జోగుళాంబ గద్వాల జిల్లా 2 బంగారు, 2 రజతం, 5 కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు, నాగర్కర్నూల్ జిల్లా ఒక బంగారు, 2 రజతం, 10 కాంస్యంతో 13 పతకాలు సాధించారు. -
‘పది’లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
పాన్గల్: పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థుల అల్పాహారానికి సంబంధించిన నిధులు త్వరలోనే విడుదల అవుతాయన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రైవేటుకు ధీటుగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశాల వారీగా విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని.. కోడిగుడ్ల ధర పెరిగినందున వారంలో రెండుసార్లు అందించడంతో పాటు ఒకసారి అరటి పండు ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులు వర్గాలుగా ఏర్పడి విద్యార్థులకు నష్టం కలిగించే పనులు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమష్టిగా ఉంటూ విద్యార్థుల అభివృద్ధి, విద్య బలోపేతానికి కృషి చేయాలన్నారు. మండలంలోని పలువురు ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా గతంలో జరిగిందని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అలా కాకుండా చూస్తామని తెలిపారు. పీఎంశ్రీ నిధులను పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేయాలని హెచ్ఎంకు సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి ఆనంద్, జీహెచ్ఎం నాగలీల, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు వనపర్తిటౌన్: ఆదిలాబాద్లో జరగబోయే రాష్ట్రస్థాయి 11వ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు జిల్లా జట్టు ఎంపికలు గురువారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో ఎంపికలు ఉంటాయని.. అండర్ 8 జట్టుకు 19.01.2018 నుంచి 18.01.2020 మధ్య, అండర్ 10 జట్టుకు 19.01.2016 నుంచి 18.01.2018 మధ్య, అండర్ 12 జట్టుకు 19.01.2014 నుంచి 18.01.2016 మధ్య, అండర్ 14 జట్టుకు 19.01.2012 నుంచి 18.01.2014 మధ్య, అండర్ 20 జట్టుకు 19.01.2006 నుంచి 18.01.2012 మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులని వివరించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 9 గంటలలోపు మైదానంలో రిపోర్ట్ చేయాలని.. పూర్తి వివరాలకు సెల్నంబర్లు 80961 15222, 94413 53375 సంప్రదించాలని పేర్కొన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
వనపర్తి టౌన్: రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని రవాణశాఖ అధికారులు సైదులు, శ్రీకాంత్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించగా వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. వాహనాలు నడిపే సమయంలో చేసే తప్పిదంతో మన జీవితమే కాకుండా ఎదుటి వారి జీవితం, కుటుంబం రోడ్డున పడుతుందని.. అలసత్వం వీడి బాథ్యతగా నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు విధిగా సీట్బెల్ట్ ధరించాలన్నారు. యువత వేగంగా వాహనాలు నడిపే సమయంలో అమ్మ, నాన్నను గుర్తు చేసుకోవాలని, మన కొరకు ఎదురు చూస్తుంటారనే విషయాన్ని మరిచి పోవద్దని వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, త్రిపుల్ రైడింగ్ చట్టరీత్యా నేరమని తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎం ఉమాదేవి, సీఎంఓ ప్రతాపరెడ్డి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతగా, వేగంగా ఔట్పోస్టు నిర్మాణం
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సమీపంలో నిర్మిస్తున్న పోలీస్ ఔట్పోస్టు పనుల్లో నాణ్యత పాటించడంతో పాటు అనుకున్న సమయంలోగా పూర్తి కావాలని ఎస్పీ సునీతరెడ్డి ఆదేశించారు. మంగళవారం ప్రాజెక్టు రహదారిలో సత్యసాయి తాగునీటి పంప్హౌజ్ వద్ద రూ.కోటితో నిర్మిస్తున్న పోలీస్ ఔట్పోస్టు పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. పనుల్లో అధికారుల నిర్లక్ష్యంతో పాటు కాంట్రాక్టర్ అలసత్వాన్ని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల భద్రతకు పునాది పోలీసు మౌలిక వసతులేనని వెల్లడించారు. ఔట్పోస్టు నిర్మాణంతో ప్రాజెక్టుకు రక్షణతో పాటు అంతర్రాష్ట్ర రవాణాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పటిష్ట నిఘా ఉంటుందన్నారు. ప్రాజెక్టు సమీపంలో అల్లరిమూకలు, ఆకతాయిల బెడద ఉండదని.. ప్రజా రక్షణ కోసమే ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఠాణా నిర్మాణానికి స్థల పరిశీలన.. పట్టణంలోని దుంపాయికుంటలో పోలీస్స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మంగళవారం ఎస్పీ సునీతరెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం 1.20 ఎకరాల స్థలం కేటాయించారని.. అదనంగా 1.20 ఎకరాలు రెవెన్యూ అధికారులు అప్పగిస్తే పోలీస్స్టేషన్తో పాటు సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఆధునిక వసతులతో నిర్మించే పోలీస్స్టేషన్కు మూడు ఎకరాల స్థలం అవసరమని.. సంబంధిత అధికారులకు నివేదిక అందించాలని సీఐ శివకుమార్ను ఆదేశించారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ శివకుమార్, ఎస్ఐ స్వాతి, ఆత్మకూర్ ఎస్ఐ జయన్న, సిబ్బంది ఉన్నారు. -
అభ్యంతరాల పరిష్కారానికి కృషి
వనపర్తి: పుర ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో ఫొటోలు లేకపోవడం, డబుల్ ఓట్లు, తప్పుగా వార్డుల మ్యాపింగ్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాల కల్పన తదితర అభ్యంతరాలను ప్రతినిధులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముసాయిదా ఓటరు జాబితాలో ఫొటోలు లేని విషయం వాస్తవమని, ఫొటోలతో కూడిన జాబితా ప్రచురించేలా ఎన్నికల సంఘానికి నివేదిస్తామని చెప్పారు. అదేవిధంగా డబుల్ ఓట్లు ఏవైనా ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని.. వార్డు మ్యాపింగ్లోని అభ్యంతరాల ఆధారంగా సరి చేస్తామని తెలిపారు. గ్రామీణ ఓటర్లు ఎక్కడైనా నమోదై ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని వివరించారు. అలాంటి ఓటర్లు ఎవరైనా ఉన్నట్లు తెలిస్తే అధికారులకు తెలియజేయాలని సూచించారు. 10వ తేదీన చివరి డ్రాఫ్ట్ వెలువరిస్తామని, ప్రతి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఓటరు జాబితా కాపీలను తప్పనిసరిగా ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు వేలకుపైగా ఓటర్లున్న వార్డుల్లో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని.. మిగతా వార్డుల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పనుల్లో వేగం పెంచాలి.. ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల్ని వేగంగా పూర్తిచేసి ఫిబ్రవరి 15లోగా అప్పగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వైద్య కళాశాల భవనంతో పాటు, మెనస్, వసతిగృహం, పార్కింగ్ ఏరియాను పరిశీలించి ఆర్అండ్బీ, ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు చివరి దశకు చేరుకున్నందున వేగం పెంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్అండ్బీ కార్యనిర్వాహక ఇంజినీర్ దేశ్యానాయక్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ఇతర అధికారులు ఉన్నారు. -
అభివృద్ధి వైపు అడుగులు
‘పుర’ ఎన్నికల వేళ పనులకు శ్రీకారం చుట్టిన అధికారులు ఒక్కో వార్డుకు రూ.56 లక్షలకు పైగా.. ప్రాధాన్యత ఆధారంగా ఒక్కో వార్డుకు రూ.56 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చుచేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. సగటున ఒక్కో వార్డుకు రూ.56 లక్షల చొప్పున ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. అవసరాలు, అవకాశాల ఆధారంగా నిధులను పెంచే అవకాశం ఉంది. మౌలిక వసతుల కల్పనకు.. పురపాలికలో వీధిదీపాలు లేని ప్రతి కాలనీలో ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం రూ.10 లక్షలు వెచ్చించి 500కు పైగా ఎల్ఈడీ బల్బుబు తెప్పించాం. సిబ్బంది హైమాస్ట్ లైట్ల మరమ్మతుకు నిచ్చెన ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అలాగాకుండా క్రేన్ సాయంతోనే పనులు చేసేలా చూస్తాం. యూఐడీఎఫ్ నిధులు మంజూరైతే టెండర్లు పిలిచి ప్రతి వార్డులో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – యూనుస్, డీఈ, వనపర్తి పురపాలిక వనపర్తి టౌన్: పుర ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానిక పురపాలికలో హస్తం పార్టీ పట్టు సాధించేందుకు ప్రకటన వెలువడక ముందే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. శివారు ప్రాంత కాలనీల్లో ఎక్కడ వీధి దీపాలు లేకపోవడంతో అంధకారం నెలకొంది. కలెక్టర్, ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు ఆయా కాలనీల్లో వెలుగులు నింపేందుకు సుమారు 500కు పైగా కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. మరో ఐదు రోజుల్లో రూ.10 లక్షలు వెచ్చించి ఆయా స్తంభాలకు వీధి దీపాలు బిగించనున్నారు. వీటికితోడు ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన 45కు పైగా హైమాస్ట్ లైట్లు వెలగడం లేదని సిబ్బంది గుర్తించారు. వీటి మరమ్మతులకు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు. ప్రమాదకరంగా మరమ్మతు.. 10 నుంచి 15 మీటర్ల ఎత్తున్న హైమాస్ట్ స్తంభాలకు సగం మేర నిచ్చెనలు వేసుకొని సిబ్బంది మరమ్మతు చేస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కిందపడే ప్రమాదం ఉంది. గతంలో క్రేన్ సాయంతో పనులు చేపట్టే వారు. అందుకు విరుద్ధంగా చేపడుతుండటంతో అధికార యంత్రాంగంపై పుర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రూ.18.70 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రహదారుల నిర్మాణానికి నిర్ణయం సాంకేతిక అనుమతులకు ఉన్నతాధికారులకు చేరిన దస్త్రం ఆమోదం లభించగానే టెండర్ ప్రక్రియ షురూ రూ.10 లక్షలతో వీధిదీపాల ఏర్పాటు -
పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
వనపర్తి: జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్లో మండల స్థాయి నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ లాగిన్కు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఫిజికల్ ఫైళ్లను రెండు రోజుల్లో పంపించాలని తహసీల్దార్లకు సూచించారు. వాటికి సంవత్సరం వారీగా పహాణీలను కూడా జత చేయాలన్నారు. కొత్త మండలాల్లో కార్యాలయాల భవనాల నిర్మాణంపై ఆరా తీశారు. జనవరి 26న ప్రభుత్వ భవనాల్లోనే జెండా ఎగురవేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో ప్రకటించిన ఓటరు ముసాయిదాపై ఫిర్యాదులు వస్తున్నాయని, తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లను సమన్వయం చేసుకొని వాటిని పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ఖీమ్యానాయక్, ఏఓ భానుప్రకాష్ పాల్గొన్నారు. వక్ఫ్ భూములు కాపాడాలి జిల్లాలో గెజిట్ ప్రకారం వక్ఫ్ భూములు 898.36 ఎకరాలు ఉండగా.. అక్కడక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని, వాటిని కాపాడాలని సంబంధింత అధికారులను కలెక్టర్ ఆదర్శ్సురభి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వక్ఫ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్ఫ్ భూముల ఆక్రమణలపై కమిటీ సభ్యులు కలెక్టర్కు వివరించగా.. వాటికి సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భరోసానిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బాలాజీనాయక్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాక్టికల్స్కు ఏర్పాట్లు పూర్తి చేయాలి
వనపర్తిటౌన్: ఈ నెల 21 నుంచి జరగబోయే ఇంట ర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ప్రైవేట్ కళాశాలలు సర్వం సిద్ధం చేసుకోవాలని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం డీఐఈఓ కార్యాలయంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న మొదటి సంవత్సరం, 22న ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు, 23న నైతికత – మానవ విలువల పరీక్ష, 24న పర్యావరణ విద్య పరీక్ష జరగనుందన్నారు. సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రాక్టికల్స్ నిర్వహణకు సీసీ కెమెరాలు, ల్యాబ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇంటర్ బోర్డ్ కొత్తగా ప్రవేశపెట్టిన హాల్ టికెట్ల ప్రివ్యూను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని అందులోని వివరాలు సరి చూసుకునేలా అవగాహన కల్పించాలని, అభ్యంతరాలు ఉంటే ప్రిన్సిపాల్స్ వెంటనే జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పారు. నామినల్ రోల్స్ చెక్ చేయడం, స్టాఫ్ డేటా మొదలైన వాటిపై చర్చించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘ఉపాధి’ని యథావిధిగా కొనసాగించాలి
పాన్గల్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని రేమద్దులలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2004 సంవత్సరంలో సీపీఎం ఒత్తిడి యూపీఏ ప్రభుత్వం సంవత్సరానికి 100 రోజుల పని దినాలు కల్పిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందన్నారు. అప్పటి నుంచి 2025 వరకు ఈ పథకం కొనసాగిందన్నారు. ప్రజలందరూ 200 పని దినాలకు పెంచి రోజు, వారి వేతనం రూ.600 ఇవ్వాలని పోరాటాలు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడగులు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. వెనిజులాపై అమెరికా దాడులను పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అమెరికా కస్టడీలో ఉన్న వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మధుర దంపతులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్, నాయకులు వెంకటయ్య, భగత్, భాస్కర్, చంద్రశేఖర్, ఎండీ ఖాజా, మల్లేష్, కె.వెంకటయ్య, శివరాజు, రేవతిరెడ్డి, అంజనేయరెడ్డి, చిన్ననిరంజన్ పాల్గొన్నారు. -
వ్యూహరచన..!
‘పుర’ పోరుపై ముమ్మర కసరత్తు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పుర’ పోరుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కార్పొరేషన్/మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కాంగ్రెస్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ సం‘గ్రామంశ్రీలో బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకోవడం.. శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. గతంతో పోల్చితే మెరుగైన పంచాయతీ స్థానాలను సాధించడంతో బీజేపీలోనూ జోష్ నెలకొంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలు పోటాపోటీగా పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టాయి. పుర పాలికల ఎన్నికల్లో పాగా వేసేలా వ్యూహాలు పన్నుతున్నాయి. వెలిసిన ఫ్లెక్సీలు.. విందులు పురపాలిక ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించిన క్రమంలో ఆయా డివిజన్లు/వార్డుల్లోని ఆశావహ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. యువతను ఆకట్టుకునేందుకు విందులకు తెర లేపారు. తాము బరిలో నిలుస్తామనే సంకేతాలను వార్డు ప్రజలకు తెలిసేలా ప్రచారం ప్రారంభించారు ఈ క్రమంలో దాదాపుగా అన్ని వార్డుల్లోనూ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి, ఉగాది శుభాకాంక్షలు చెబుతూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే తమకే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల కార్యాలయాలతో పాటు వార్డుల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రధానంగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన మహబూబ్నగర్ పీఠంపై అన్ని రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో పాటు పార్టీల నాయకుల మధ్య కూడా పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్: పట్టు నిలుపుకొనేలా.. గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల క్రమంలో పట్టు నిలుపుకునేలా తగిన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రత్యక్షంగా ఇప్పటివరకు ఎలాంటి సన్నాహక సమావేశాలు నిర్వహించకున్నా.. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు తమ తమ అనుచరుల ద్వారా గెలుపు గుర్రాలపై జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయా వార్డుల్లో ఆశావహులను ప్రోత్సహిస్తూ రంగం సిద్ధం చేసుకోవాలని.. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ నిర్ణయం మేరకు నడుచుకునేలా వారిని సమాయత్తం చేస్తున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలను పరిశీలిస్తూ.. పై ఎత్తులతో పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీలసన్నాహకాలు షురూ అభ్యర్థుల జల్లెడకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఆశావహుల నుంచి వ్యక్తిగత సమాచార సేకరణ బీఆర్ఎస్, బీజేపీ సైతం రంగంలోకి.. ఎత్తులకు పైఎత్తులతో ముందుకు.. -
భరోసా ఏది?
ఉపాధి కల్పించాలి మున్సిపాలిటీగా మారితే తమ బతుకులు మారుతాయని ఆశపడ్డాం. కానీ ఉన్న ఉపాధి పనులు తీసేస్తారని అనుకోలేదు. ఆరేళ్ల నుంచి ఉపాధి పనులు లేక ఇంట్లో బీడీలు చుడుతూ కాలం వెళ్లదీస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి పనులు చేపట్టి తమలాంటి పేదలకు ఉపాధి చూపాలి. లేదా ఏడాదికి ఇస్తామన్నా రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆదుకోవాలి. – ఎస్.నర్సింహులు, అమరచింత పనులు లేక ఇబ్బంది వంద రోజుల పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. అప్పుడు చేసిన పనికి తగ్గ కూలి వచ్చేది. ఇప్పుడు వ్యవసాయం కూలీ పనులు దొరకడం లేదు. వయస్సు భారమవ్వడంతో నాటు వేసే పనులు చేయలేకపోతున్నా. దీనికి తోడు కూలీలకు ఇచ్చే ఆత్మీయ భరోసా అందడం లేదు. దీంతో ఉపాధి లేక బతుకు భారంగా మారింది. – వెంకటమ్మ, అమరచింత ఆందోళన ఉధృతం చేస్తాం మున్సిపాలిటీల్లో తొలగించిన ఉపాధి హామీ పనులను యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయ భరోసాను వర్తింపచేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు ప్రవేశ పెట్టాలని ఆందోళన నిర్వహిస్తున్నాం. – అజయ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. పట్టణ ప్రాంతాలకు వర్తించదు 2023–24 సంవత్సరంలో ఏర్పడిన మున్సిపాలిటీ ప్రాంతాల్లోని కూలీలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తిస్తుందని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అంతకు ముందు ఏర్పడిన మున్సిపాలిటీలో ఇది వర్తించదు. వీటిపై పట్టణ కూలీలకు అవగాహన కల్పించాం. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేసే వారిని గుర్తించే వీలుంది. – రఘపతిరెడ్డి, ఏపీఓ, అమరచింత మున్సిపాలిటీల్లో పేదలకు దూరంగానే ఉపాధి హామీ పథకం అమరచింత: నిరుపేద వ్యవసాయ కూలీలతో పాటు పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2006 ఫిబ్రవరి 2న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లోనే పేదలకు 100 రోజులు పని కల్పిస్తూ.. అందుకు తగ్గ కూలి చెల్లించేది. అనంతరం ఏడాదికి 150 రోజుల పనిదినాలకు పెంచారు. దీంతో గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు వేసవిలో పనులు దొరకడంతో కుటుంబ పోషణ సాఫీగా సాగేది. ప్రస్తుతం పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఉపాధి పనులను తొలగించడంతో ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గతంలో గ్రామ పంచాయతీలుగా ఉండి కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పడిన పట్టణాలోల పేదలకు ఉపాధికి దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా సంవత్సరానికి రూ.12 వేలు చెల్లిస్తుండడంతో ఉపాధి కోల్పోయిన పట్టణ ప్రాంత కూలీలు సైతం తమకు పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిలో కనీసం 20 రోజుల పనిదినాలు చేసిన కూలీలు అర్హులంటూ నిబంధనలు ఉండడంతో.. మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పథకమే అమలులో లేని కారణంగా వీరు ఆత్మీయ భరోసా అనర్హులుగా మిగిలారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో 13,242 మంది జాబ్ కార్డు ఉండగా.. వారికి ఉపాధి హామీ, ఆత్మీయ భరోసా రెండు పథకాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తుంది. జిల్లాలో ఇలా.. జిల్లాల పునర్విభజనలో భాగంగా 2018 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే మున్సిపాలిటీగా ఉన్న వనపర్తితో పాటు పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత పట్టణాలను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో ఉపాధి పనులపై ఆధారపడి జీవిస్తున్న 13,242 మంది కూలీలు పనులు కోల్పోయారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో రాజనగరంలో 479, నాగవరంలో 643 శ్రీనివాసపురంలో 1,020, నర్సింగాపురంలో 70 మంది ఉపాధి పనులకు దూరమయ్యారు. పెబ్బేరు మున్సిపాలిటీలో పెబ్బేరు పట్టణంలో 2,245, చెలిమిలలో 872 మంది, కొత్తకోట మున్సిపాలిటీలో 1,915 మంది, ఆత్మకూర్ మున్సిపాలిటీలో 1,975 విలీన గ్రామమైన ఖానాపురంలో 568 మంది, అమరచింత మున్సిపాలిటీలో 4,093 మంది కూలీలు జాబ్కార్డులు కలిగి ఉన్నా ఉపాధి పనులు చేసేందుకు అనర్హులుగా మిగిలారు. దీంతో అప్పటి నుంచి తమకు ఉపాధి పనులు కల్పించాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరుగుతున్నా తమను పట్టించుకునే వారే కరువయ్యారని కూలీలు వాపోతున్నారు. పట్టణ కూలీలకు అందని ‘ఆత్మీయ భరోసా’ భారమవుతున్న దినసరి జీవనం ఇందిరమ్మ రాజ్యంలోనూ ఉపాధి కలే.. మున్సిపాలిటీల ఏర్పాటుతో పేదల బతుకుల్లో చీకటి -
జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
వనపర్తిటౌన్: హైదరాబాద్లోని సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ స్టేడియంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 69వ అండర్–19 పోటీల్లో స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న కార్తీక్ జాతీయస్థాయికి ఎంపికయ్యాడని ఎస్జీఎఫ్ సెక్రటరీ కుమార్ తెలిపారు. జయసూర్య ఉత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. ఈ మేరకు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, వనపర్తికి గౌరవం దక్కేలా ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. గతేడాది జయసూర్య జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడన్నారు. కార్యక్రమంలో పీడీలు నవీన్ నందన్, నరేందర్, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. 616 ఫిర్యాదులు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పురపాలికల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. మిగిలిన 18 మున్సిపాలిటీలో మొత్తం 316 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మొత్తంగా 616 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా సోమవారం ఆయా పురిపాలికల పరిధిలో అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు అభ్యంతరాలు చెబుతూ.. పరిష్కరించాలని విన్నవించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్ల పరిధిలో 144 ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. దేవరకద్రలో 9, నాగర్కర్నూల్లో 121, కొల్లాపూర్లో 8, కల్వకుర్తిలో 36, నారాయణపేటలో 4, మక్తల్ 10, కోస్గిలో 5, మద్దూరులో 16, గద్వాలో 17, అయిజలో 22, వడ్డేపల్లిలో 36, వనపర్తిలో 8, కొత్తకోటలో 6, అమరచింత 4, ఆత్మకూర్లో 11, పెబ్బేరులో 71 ఫిర్యాదులు రాగా.. అలంపూర్ మున్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. రామన్పాడులో 1,020 అడుగుల నీటి మట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో సోమవారం నాటికి సముద్రమట్టానికి పైన పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు గాను 1,020 అడుగుల వద్ద నీటి నిల్వ ఉంది. జూరాల ఎడమ కాల్వ, సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 875 క్యూసెక్కులు, కుడి ఎడమ కాల్వ ద్వారా 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ వరప్రసాద్ తెలిపారు. -
అటు సీఎం.. ఇటు మాజీ సీఎం!
● ‘పాలమూరు’ వేదికగా ఎన్నికల శంఖారావం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ప్రాజెక్టుల బాట పట్టారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం మహబూబ్నగర్నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తొలుత వచ్చేనెల మూడో తేదీన జడ్చర్ల నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అంతకన్నా ముందుగానే మహబూబ్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి శుద్ధీకరణ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈనెల 10న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా.. ఆ తర్వాత పురపాలికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచే ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు తెలుస్తోంది. -
‘మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు’
కొత్తకోట రూరల్: మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. సోమవారం కొత్తకోటలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల (వీపనగండ్ల)లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటార్ వెహికల్ యాక్ట్, డ్రగ్స్ నివారణ, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం మైనర్ల వివాహాలు చేసినా, సహకరించినా శిక్షార్హులు అవుతారని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, 18 ఏళ్లు నిండిన తర్వాతే వాహనాలు నడుపుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బందికి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. సువర్ణ సారథ్యంలోని కళాబృందం ప్రదర్శన ఇచ్చారు. డిపో నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ రఘు, డిపో మేనేజర్ దేవేందర్గౌడ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సైదులు, జి.సురేందర్ ఉన్నారు. -
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
వనపర్తి: పోలీస్ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహిరించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీతరెడ్డి హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఎస్పీ సునీతారెడ్డి హాజరై వివిధ ప్రాంతాల నుంచి 10 మందితో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను ఆయా పోలీస్స్టేషన్లకు బదిలీ చేశామని తెలిపారు. అక్కడి సిబ్బంది ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రం ఉండాలి
ఖిల్లాఘనపురం: ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసేలా చూడాలని హార్ట్ఫుల్నెస్ ధ్యాన సంస్థ మహబూబ్నగర్ జోనల్ అధికారి కృష్ణారావు, వనపర్తి, గద్వాల జోనల్ అధికారి లలిత కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలి కల్యాణ మండపంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమం, 500 మీటర్లు, కిలోమీటర్, రెండు కిలోమీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించగా.. వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ధ్యానం చేయడంతో ఉత్తేజం, జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. 500 మీటర్ల పరుగు పందెం బాలికల విభాగంలో నందు, స్రవంతి, నవ్య.. బాలుర విభాగంలో మహేష్, కార్తీక్, జగన్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. అదేవిధంగా కిలోమీటర్ పరుగు పందెంలో బాలుర విభాగంలో శివ, ప్రవీణ్, శ్రీరాం.. బాలికల విభాగంలో చందన, శిరీష, నందిని, రెండు కిలోమీటర్ల పరుగుపందెంలో శివ, రాజేష్, శ్రీనునాయక్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. అనంతరం సర్పంచ్లు, ఉపసర్పంచ్లను శాలువాలతో సన్మానించడంతో పాటు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. -
అంతటా అంతేగా..!
● మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఇతర జిల్లాల ఓటర్లు ● ఉమ్మడి పాలమూరులోని అన్ని పురపాలికల్లోనూ గందరగోళం ● ఇప్పటివరకు మొత్తం 291 ఫిర్యాదులు.. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 98 ● అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శల వెల్లువ బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరిగినట్లు తెలిసింది. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది ముసాయిదా జాబితానే.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నామంటూ కొట్టిపారేస్తూనే.. గడువులోపు పరిష్కరిస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీ వార్డులు ఫిర్యాదులు మ.నగర్ (కా) 60 98 భూత్పూర్ 10 20 దేవరకద్ర 12 03 నాగర్కర్నూల్ 24 51 కొల్లాపూర్ 19 05 కల్వకుర్తి 22 32 నారాయణపేట 24 – మక్తల్ 16 07 కోస్గి 16 03 మద్దూర్ 16 03 గద్వాల 37 06 అలంపూర్ 10 – అయిజ 20 06 వడ్డేపల్లి 10 01 వనపర్తి 33 18 కొత్తకోట 15 01 అమరచింత 10 – ఆత్మకూర్ 10 06 పెబ్బేరు 12 31 మొత్తం 376 291 మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెల్లడించిన ఓటర్ల ముసాయిదా జాబితాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో జడ్చర్ల, అచ్చంపేట మినహా ఎన్నికలు జరిగే మహబూబ్నగర్ కార్పొరేషన్.. మిగిలిన 18 మున్సిపాలిటీలు అన్నింటిలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు నివ్వెరపరుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరులోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల పరిధిలో గురువారం పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. అదేరోజు నుంచి అభ్యంతరాలు స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు అన్ని పురపాలికల్లో కలిపి ఆదివారం వరకు మొత్తం 291 ఫిర్యాదులు వచ్చాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 98 రాగా.. ఆ తర్వాత నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 51 అభ్యంతరాలు వచ్చాయి. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిష్కారం గడువును ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని.. అన్నింటినీ పరిష్కరించి ఈ నెల 10న తుది జాబితా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రఽదానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. కార్పొరేషన్గా ఆవిర్భవించిన క్రమంలో డివిజన్ల వారీగా తీసిన లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రకారం.. ఆయా పురపాలికల్లో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు. ఇంటి నంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్లు/ వార్డుల్లో పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను చేర్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రహసనంగా మారగా.. తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. పలు డివిజన్లు/ వార్డుల్లో ఇంటి నంబర్లు లేకుండా.. కొన్నిచోట్ల ఇంటి నంబర్లకు బై నంబర్లు చేర్చి జాబితా వెల్లడించినట్లు అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడం కారణంగా పలు వార్డుల్లో ఆయా ఓట్లను సర్దుబాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ● ఒకే జిల్లా ఒక మున్సిపాలిటీలోని వార్డుల్లో వేరే పురపాలిక పరిధిలోని ఓటర్లు చేరిక ● మున్సిపాలిటీల్లో గ్రామాలకు సంబంధించిన ఓటర్ల పేర్లు దర్శనమివ్వడం.. ● జాబితాలో ఇంటి నంబర్లు వరుసగా లేకపోవడం.. తప్పులతడకగా ముసాయిదా ఓటర్ల జాబితా -
మత్స్యబీజ సంబురం
● లక్ష్యం 1.60 కోట్లు.. ఇప్పటి వరకు వదిలినవి 60 లక్షలు ● 10వ తేదీలోపు పూర్తి చేస్తామంటున్న అధికారులు జిల్లాలో కొనసాగుతున్న రాయితీ చేప పిల్లల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను త్వరగా పంపిణీ చేస్తే లబ్ధి చేకూరుతుంది. పెద్ద చెరువులో నీరు సమృద్ధిగా ఉండటంతో చేప పిల్లలు ఎదిగే అవకాశం ఉంది. ఈ చెరువుపై ఆధారపడి 300 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. – గోపి, మత్స్యకారుడు, అమరచింత ప్రభుత్వం ఈసారి రాయితీ చేప పిల్లలను ఆలస్యంగా పంపిణీ చేస్తోంది. వానాకాలంలో వదలాల్సిన చేప పిల్లలు చలికాలం మధ్యలో చెరువులకు చేరుతున్నాయి. చేప పిల్లల ఎదుగుదలకు వాతావరణం సహకరించక కొన్ని చనిపోయినా.. మిగిలినవి పెరిగే అవకాశం ఉంది. అధికారులు త్వరితగతిన పంపిణీ ప్రక్రియ పూర్తి చేసి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. – తెలుగు రాములు, పాన్గల్ రాయితీ చేప పిల్లల సరఫరాకు టెండరింగ్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో మరోమారు రీటెండరింగ్ నిర్వహించాం. ప్రస్తుతం నలుగురు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. జిల్లావ్యాప్తంగా 1.60 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 60 లక్షలు అందించాం. జనవరి 10 లోగా లక్ష్యం మేర పంపిణీ చేస్తాం. నీరు సమృద్ధిగా ఉన్న చెరువులు, కుంటలు గుర్తించి సొసైటీల అభ్యర్థన మేరకు చేప పిల్లలు వదులుతాం. – డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ అమరచింత: జిల్లాలో వారం రోజులుగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుండగా.. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి చేప పిల్లలు చేరనున్నాయని మత్స్యకారులు సంబురపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1.60 లక్షల చేప పిల్లల పంపిణీకి టెండర్ల ప్రక్రియ పూర్తికాగా.. ఇప్పటి వరకు 60 లక్షలు పంపిణీ చేశారు. ఈ నెల 10లోగా పంపిణీ పూర్తి చేస్తామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. వారం వ్యవధిలో రీటెండర్ ప్రక్రియ పూర్తిచేసి సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా కేటాయించిన చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఉచిత చేప పిల్లలు వదిలేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇది వరకే సొసైటీల్లో నిల్వ ఉన్న డబ్బులతో మత్స్యకారులు చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో వదులుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ చేప పిల్లలు సైతం వదిలితే మరింత లాభం చేకూరనుందని సంబురపడుతున్నారు. సకాలంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదలకపోతే పెరుగుదల నిలిచి బరువు తగ్గుతాయనే సందేహాలను సైతం వ్యక్తమవుతున్నాయి. గతేడాది 1.50 కోట్ల చేప పిల్లలను అందించాలనే లక్ష్యం ఉన్నా అనుకున్న మేర నిధులు మంజూరు కాకపోవడంతో కేవలం 54.84 లక్షలు మాత్రమే మత్స్యశాఖ అధికారులు సరఫరా చేయగలిగారు. ప్రస్తుత సంవత్సరం 1.60 కోట్ల మేర ఉచిత చేప పిల్లలను అందించేందుకు సిద్ధమయ్యారు. నీరున్న చెరువులకే ప్రాధాన్యం.. ప్రస్తుతం రాయితీ చేప పిల్లలను ఆయా గ్రామాల్లోని మత్స్యకార సొసైటీల విన్నపం మేరకు చేప పిల్లలను అందించనున్నారు. చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉంటేనే రాయితీ చేప పిల్లలు అందిస్తామని మత్స్యశాఖ ఏడీ వెల్లడించారు. వానాకాలం ప్రారంభంలో నీటితో నిండి ఉంటాయని.. ప్రస్తుతం కాస్తా తగ్గుముఖం పట్టడంతో ఎదుగుదల ఉండదని, దీంతో నీరు సమృద్ధిగా ఉన్న చెరువులను గుర్తించి చేప పిల్లలను అందిస్తున్నామని చెబుతున్నారు. మత్స్య సహకార సంఘాలు 143 మత్స్యకారులు 13,600 గతేడాది పంపిణీ చేసిన చేప పిల్లలు 54.84 లక్షలు -
క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యం
వనపర్తిటౌన్: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ఎంతో ముఖ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన రామన్ ఐఐటీ టాలెంట్ టెస్ట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రమశిక్షణ లేకుండా ఎంత చదువు చదివినా ఉపయోగం ఉండదని తెలిపారు. కేవలం కలలుగని కూర్చుంటే విజయం వరించదని.. సాకారానికి అనుగుణంగా కృషి చేయాలని సూచించారు. రానున్న తరానికి అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం, విద్య అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని, కన్న నేలకు సేవలందించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం మరవొద్దని కోరారు. జెడ్పీ మాజీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, ప్రజా వైద్యశాల డైరెక్టర్ డా. మురళీధర్, సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నతస్థాయికి ఎదుగుతారని, చదువు, ఆటలు, పాటలు ఏ రంగంపై ఆసక్తి ఉంటే వాటినే ఎంచుకొని సత్తా చూపాలని కోరారు. తల్లిదండ్రులు సైతం పిల్లల ఆశయాలకు అనుగుణంగా దారి చూపాలన్నారు. అనంతరం విజేతలకు చిన్నారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రతినిధి నందిమళ్ల యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కళావేదిక సభ్యులు, కవులు, ప్రజా ప్రతినిధులు రాములు, బైరోజు చంద్రశేఖర్, సత్తార్, గంధం నాగరాజు, రమాదేవి, ప్రవీణ్, భాస్కర్, రాజేంద్రప్రసాద్చారి, మద్దిలేటి, షఫీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘రైతుభరోసా’ అందేనా..?
● పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు ● ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు మదనాపురం: జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సీజన్లో అన్నదాతలు ప్రధానంగా వరి సాగు చేయనుండగా.. కొన్నిచోట్ల రైతులు నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే రైతుభరోసా కోసం కొండత ఆశతో ఎదురు చూస్తున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. సాగు భూములకే.. కాంగ్రెస్పార్టీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.10 వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామని రైతులకు హామీ ఇచ్చింది. ఈ మేరకు మొదట యాసంగి సీజన్లో రైతు భరోసా పథకాన్ని పాతపద్ధతిలోనే అమలు చేసి తర్వాత వానాకాలంలో ఎకరాకు రూ.6 వేల చొ ప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. గుట ్టలు, రహదారులు, వెంచర్లు తదితర సాగుకు యోగ్యం కాని భూములకు రైతుభరోసాను నిలిపివేసింది. వానాకాలంలో అధిక వర్షాలు, యూరియా కొరతతో జిల్లాలో సాగుచేసిన పంటలు సరైన దిగుబడి రాక రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా అందడం లేదు. చివరకు పంటలకు కనీస మద్దతు ధరలు కూడా లేకపోవడంతో అప్పులతో కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడికి చేసిన అప్పు తీరకపోవడంతో ఆర్థికంగా కుదేలయ్యారు. యాసంగి సాగుకై నా వీలైనంత త్వరగా రైతు భరోసా సాయం అందించాలని కోరుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో సుమారు 1.75 లక్షల మంది రైతులు రైతుభరోసా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వానాకాలంలో సుమారు రూ.205 కోట్ల నిధులు విడుదల కాగా.. యాసంగి సాగుకు రూపాయి కూడా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఏడాదికి రెండుసార్లు పంటసాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. యాసంగిలో పంటలు సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నామని వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా నిధులను సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.6 వేలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. పండుగ ముగిసిన వెంటనే నిధులు జమయ్యే అవకాశం ఉంది. – దామోదర్, ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి -
భోజనం సరిగ్గా చేయలేదని తల్లి మందలించడంతో..
మహబూబ్ నగర్ జిల్లా: తల్లి మందలించిదని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్, తండావాసుల కథనం ప్రకారం.. వాల్యాతండాకు చెందిన డేగావత్ వసురాం, భార్య శారద, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లతో కొన్నేళ్ల కిందట హైదరాబాద్లోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్నారు. కొన్నిరోజులుగా డేగావత్పూజ(రెండో కుమార్తె) భోజనం సరిగ్గా చేయడంలేదని తల్లి మందిలించింది. శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాకు (నాయనమ్మ) వద్దకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వచ్చింది.శివరాంపల్లి నుంచి వాహనంలో వచ్చి వాల్యాతండా స్టేజీ వద్ద దిగి తండా సమీపంలోనే వ్యవసాయ పొలం వద్ద ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కొద్ది దూరంలో ఉన్న వ్యవసాయ పొలం వద్ద తండాకు చెందినవారు వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా పొగ రావడం గమనించిన వెళ్లి చూడగా యువతి మంటల్లో ఉన్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108వాహనంలో జనరల్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పూజ డీఆర్డీఏలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తుందని, పూజ తండ్రి వసురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
400 ఏళ్ల చరిత్ర
జడ్చర్ల టౌన్: పాలవాది వంశస్థులు కావేరమ్మపేట ఈదమ్మ ఆలయం ఎదురుగా 400 ఏళ్ల క్రితం గచ్చుబావి నిర్మించారు. కాలక్రమేణా గచ్చుబావి చెత్తాచెదారంతో నిండిపోగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జయపాల్ అనే యూట్యూబర్, వార్డు కౌన్సిలర్ బుక్క మహేష్ స్పందించి పరిరక్షణ కోసం చర్యలు చేపట్టారు. అలాగే జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కన దాదాపు 10వ శతాబ్దంలో నిర్మించిన కోనేరు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఈ కోనేరు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కోనేరుకు ఎంతో విశిష్టత ఉంది. కోనేరుకు ఒకవైపు శివాలయం, మరోవైపు ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. కోనేరులోంచి నేరుగా పైఆలయాలకు వెళ్లేలా సొరంగ మెట్ల మార్గాలు నిర్మించారు. ఒకవైపు మాత్రమే మెట్లు ఉండగా.. రెండు వైపులా గోడలున్నాయి. ప్రస్తుతం కోనేరు పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కావేరమ్మపేటలోని గచ్చుబావి -
ప్రారంభమైన పీఎంశ్రీ క్రీడాపోటీలు
గోపాల్పేట: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పీఎంశ్రీ క్రీడాపోటీలను శనివారం జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, సర్పంచ్ స్వప్నభాస్కర్ ప్రారంభించారు. విద్యార్థులకు క్రీడలపై మక్కువ పెంచేందుకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పీడీ సురేందర్రెడ్డి తెలిపారు. అంతకుముందు పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ చంద్రశేఖర్, ప్రధానోపాద్యాయుడు రంగస్వామి, సీఆర్పీ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఓటరు జాబితా
వనపర్తి టౌన్: పురపాలికల వార్డుల వారీగా ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి పుర కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను ఆయన పరిశీలించి మాట్లాడారు. అక్టోబర్ 1, 2025 నాడు ప్రచురించిన అసెంబ్లీ తుది ఓటరు జాబితా ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత నమోదు చేసుకున్న కొత్త ఓటర్లు, మృతిచెందిన ఓటర్లను పరిగణలోకి తీసుకోమని తెలిపారు. తుది ఓటరు జాబితా పార్ట్ల వారీగా వార్డుల మ్యాపింగ్ చేపట్టాలని, ఇంటి చిరునామా ఆధారంగా వార్డు ఓటరు జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఒక ఇంట్లో ఉన్న ఓటర్లందరూ ఒకే వార్డులో ఉండేలా చూడాలని, అదేవిధంగా కౌన్సిలర్గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల పేర్లు వారి సొంత వార్డులోనే ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం పుర కార్యాలయంలో ప్రదర్శించిన ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి మార్పుచేర్పులు ఉంటే 5వ తేదీలోగా ఫిర్యాదు చేయాలని కోరారు. తుది ఓటరు జాబితా జనవరి 10న అన్ని మున్సిపాలిటీల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. వార్డుల వారీగా తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేసుకుంటే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్రెడ్డి, పుర సిబ్బంది పాల్గొన్నారు. -
ఇన్స్ట్రాగాంలో వచ్చి.. వాట్సప్లో మెరిసి
కల్వకుర్తి రూరల్: ఒకానొక సందర్భంలో కల్వకుర్తి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన సుభాష్నగర్లోని గచ్చుబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ఈ బావి దుస్థితిని పట్టణానికి చెందిన యువకుడు కల్వ కార్తీక్ ‘కల్వకుర్తి డైరీ ఇన్స్ట్రాగాం’ పేజీలో కళ్లకు కట్టినట్లు వీడియో తీసి పోస్టు చేయడంతో పెద్దఎత్తున స్పందన లభించింది. వందలాది మంది యువకులు ముందుకు వచ్చి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ‘సేవ్ గచ్చుబావి కమిటీ’ పేరిట చైతన్యం చేశారు. దీంతో గత 52 రోజులుగా శివాలయం మెట్ల బావి మరమ్మతు చేపట్టారు. మేముసైతం అంటూ మహిళలు శ్రమదానంలో పాల్గొని తమవంతు సహకారం అందించారు. అయితే బావి లోతు తీయడానికి ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం మరమ్మతుకు నిధులు మంజూరు చేయించి పెద్ద క్రేన్ ఏర్పాటు చేయించారు. దీంతో వేగంగా పనులు పూర్తి కావొస్తున్నాయి. శివరాత్రి నాటికి శివాలయం, గచ్చు బావికి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషిచేస్తున్నారు. శివాలయంలోని శివలింగానికి బావినీటితో అభిషేకం చేసేందుకు సేవ్ గచ్చుబావి కమిటీ సభ్యులు సంసిద్ధులు అవుతున్నారు. సేవ్ గచ్చుబావి పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో యువకుల శ్రమ ఫలించనుంది. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. ఇందుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన చైతన్యం కూడా గచ్చుబావి పూర్వవైభవానికి ఒక మెట్టులా ఉపయోగపడింది అనేది అక్షర సత్యం. -
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అమరచింత/ఆత్మకూర్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. అమరచింత మండలం చంద్రానాయక్తండాలో హైమాస్ట్ లైట్లతో పాటు అయ్యప్ప ఆలయంలో రూ.ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్రం, ఆత్మకూర్ మండలం మూలమళ్లలో అరబిందో ఫార్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని విస్మరిస్తోందని.. కేంద్ర నిధులను తమవంటూ ప్రచారం చేసుకోవడం అవివేకమన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాలమూర్–రంగారెడ్డి ఎప్పుడు పూర్తి చేస్తారో జిల్లా రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ మద్దతుతో గెలిచిన చంద్రనాయక్తండా సర్పంచ్ కృష్ణానాయక్తో పాటు కిష్టంపల్లి సర్పంచ్ మల్లారెడ్డిని సన్మానించారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి, మేర్వరాజు, క్యామ భాస్కర్, మరాఠి అశోక్, మంగ లావణ్య, మూలమళ్లలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు దేశాయి పద్మజారెడ్డి, కాంతారెడ్డి, రతంగ్పాండురెడ్డి, అశ్విన్కుమార్, అశోక్, లావణ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


