breaking news
Wanaparthy
-
‘సర్’ను నిర్లక్ష్యం చేయొద్దు : మాజీ ఎమ్మెల్యే
పాన్గల్: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్లక్ష్యం చేయొద్దని.. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్ఏల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ శ్రేణులు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తూ అర్హుల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడాలన్నారు. గ్రామాల్లో అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి ఫారాలు అందించాలని సూచించారు. నియోజకవర్గంలో ఏకంగా 24 వేల డబుల్ ఓట్లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి జూపల్లి నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రికి అఽధికార దాహం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పనిచేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు. కిష్టాపూర్ సమీపంలో రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణంతో మండలంలోని సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగుతాయని.. చేపట్టే వరకు పార్టీ పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వీరసాగర్, చంద్రశేఖర్నాయక్, సుధాకర్యాదవ్, తిలకేశ్వర్గౌడ్, రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిక.. మండలంలోని శాగాపూర్ 5వ వార్డు సభ్యుడు లక్ష్మీనర్సింహ, మాజీ వార్డు సభ్యుడు కుర్మయ్య మాజీ ఎమ్మెల్యే బీరం సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు తిరుపతయ్యయాదవ్, కృష్ణయ్యయాదవ్, డా. తిరుపతయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పొలంబాట ఆక్రమించారు..
గ్రామంలోని 10 మంది రైతులం 15 ఎకరాలు సాగు చేసుకోవడానికి 70 ఏళ్లుగా సర్వేనంబర్ 467 ప్రభుత్వ భూమిలో నుంచి పొలానికి వెళ్తున్నాం. గ్రామానికి చెందిన రైతు బండారు చంద్రయ్య దారిని ఆక్రమించి రాళ్లతో గోడ కట్టి రాకపోకలు నిలిపివేశారు. మోఖాపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశాం. – పెద్దదగడ రైతులు, చిన్నంబావి మండలం భూ పరిహారం చెల్లించాలి.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండేళ్ల కిందట గ్రామశివారులోని 25 మంది రైతుల భూముల్లో నుంచి డీ–5 కాల్వను తవ్వారు. కాల్వ తవ్వకంతో 22 ఎకరాల భూమి కోల్పోయాం. ఇప్పటి వరకు నష్ట పరిహారం చెల్లించ లేదు. మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాలని కలెక్టర్కు విన్నవించాం. – పర్వతాపూర్ రైతులు, ఖిల్లా ఘనపురం మండలం ● -
సీజేపీ ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగుతాం
చిన్నంబావి: ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనత పార్టీ (సీజేపీ) ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మలిదశ ఉద్యమానికి శ్రీకారం చూడతామని.. ఈసారి కచ్చితంగా న్యాయం జరిగే వరకు పొరాడుతామని, అవసరమైతే ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీశైలం నిర్వాసితులు వివరించారు. సోమవారం మండలంలోని పెద్దమారూర్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. తరాలు మారినా నిర్వాసితుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా.. సమస్యను ఎన్నికల హామీగానే తీసుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చిన మరుక్షణం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి తమకు న్యాయం చేస్తామని చెప్పడం తప్ప చేతల్లో కనిపించడం లేదని, మంత్రి 30 ఏళ్లు అధికారంలో ఉన్నా తమకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దామోదర్రెడ్డి, దాగోజి గోవిందు, షబ్బీర్, సోమ భాస్కర్, బాలయ్య, మైనుద్దీన్, మహబూబ్పాషా, జహంగీర్పాషా, రంగస్వామి, కొండన్న, రాఘవేంద్ర శెట్టి, కాంతయ్య, గూడెం బాలస్వామి, పెద్దమారూర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఉద్యాన సాగుపై దృష్టి సారించాలి
వనపర్తి: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కృష్ణా, గోదావరి జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఉద్యాన పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగుపై దృష్టి సారించాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. డి.రాజిరెడ్డి సూచించారు. జిల్లాలోని నందిమళ్లగడ్డలో కూరగాయలు సాగు చేస్తున్న రైతుల పొలాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమగ్ర సాగు విధానాలు అనుసరించడంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందడంతో పాటు రైతులకు నికర లాభాలు పెరుగుతాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత సాగు, సూక్ష్మ నీటిపారుదల విధానాలను వినియోగించి తక్కువ నీటితోనే కూరగాయల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చన్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. భగవాన్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డా. చీనా, విశ్వవిద్యాలయ కన్సల్టెంట్ డా. వీరాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. వీణాజోషి, కేవీకే శాస్త్రవేత్త డా. రాజేందర్రెడ్డి, మండల ఉద్యాన అధికారులు శ్రీకాంత్, సాయితేజ, సురేష్, డా. శంకరస్వామి, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
భూ వివాదాలకు కోర్టుల్లోనే శాశ్వత పరిష్కారం
వనపర్తి: భూ వివాదాలు సివిల్ స్వభావం కలిగినవని.. వాటి శాశ్వత పరిష్కారం కోర్టుల్లోనే సాధ్యమని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఆమె హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, బెదిరింపులు, ధౌర్జన్యాలు, మోసాలకు పాల్పడితే పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి, వేగవంతమైన స్పందనతో పోలీసుశాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. మొత్తం 25 వినతులు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్చేసి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. -
ఆగని సంతర్పణం..!
పెబ్బేరులో ఏళ్లుగా నిలిచిన సంత బహిరంగ వేలం ● కోర్టు వివాదంతో నిలిపివేత ● అక్రమార్కుల చేతికి ఆదాయం ● నకిలీ రసీదులతో వసూళ్లకు తెగబడిన వైనం ● నిద్రావస్థలో పాలకవర్గం విచారించి చర్యలు తీసుకుంటాం.. కొందరు అక్రమార్కులు పుర కార్యాలయం పేరిట రసీదులు ముద్రించి సంతలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృషికి వచ్చింది. విచారించి చర్యలు తీసుకుంటాం. గతంలో వీరిపై స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. సంతకు ప్రభుత్వ స్థలం లేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న స్థలం కోర్టు కేసులో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్తాం. – గణేష్, పుర కమిషనర్, పెబ్బేరు త్వరలోనే పరిష్కారం.. సంత స్థల వివాద పరిష్కారానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృషి చేస్తున్నారు. కోర్టు తీర్పు వరకు వేచి చూ డాలి. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. పురపాలికకు చెల్లించే సొమ్ము వేణుగోపాలస్వామి ట్రస్ట్ పేరిట బ్యాంకులో జమ చేస్తున్నాం. – అక్కి శ్రీనివాస్గౌడ్, పుర చైర్మన్, పెబ్బేరు ‘రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సమకూరే సంతగా పెబ్బేరు సంతకు పేరుంది. పుర ఖజానాకు చేరాల్సిన రూ.కోట్ల ఆదాయం కొందరు అక్రమార్కులు దోచేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడి అధికార పాలకవర్గం నిద్రావస్థలో ఉండటంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఆదాయాన్ని కొల్లగొడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ విషయాన్ని మీడియా, పలు రాజకీయ పార్టీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించడం లేదు.’ వనపర్తి: పెబ్బేరులోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 30.19 ఎకరాల భూమిలో 16 దశాబ్దాలుగా ప్రతి శనివారం వారాంతపు సంత కొనసాగేది. సంతపై వచ్చే ఆదాయాన్ని నాడు పంచాయతీ, నేడు పుర పాలకవర్గం తీర్మానం మేరకు పట్టణాభివృద్ధికి వెచ్చించడం ఆనవాయితీ. ఈ స్థలం తమదంటూ ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మధ్యలో కొన్నేళ్లపాటు కోర్టులో కేసు నడుస్తోంది. నాలుగేళ్ల క్రితం తీర్పు వెలువడగా.. నాటి నుంచి ఇప్పటి వరకు ఏటా నిర్వహించే సంత వేలం నిలిపివేశారు. చివరిసారి నిర్వహించిన వేలంలో పురపాలికకు రూ.కోట్లలోనే ఆదాయం సమకూరింది. సీపీఎం నాయకుల ఫిర్యాదుతో వెలుగులోకి.. ఇటీవల సీపీఎం జిల్లా కమిటీ నాయకులు పలువురు పెబ్బేరు సంతలో అక్రమార్కులు చేస్తున్న దోపిడీతో పాటు పురపాలిక పేరుతో ముద్రించిన నకిలీ రసీదుల విషయాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరోసారి పెబ్బేరు సంత ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుందనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై పుర అధికార, పాలకవర్గం స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
హే.. కృష్ణా!
గద్వాల: కృష్ణా బేసిన్లో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాలకు ఎగువ నుంచి వరద తాకిడి ఎట్టకేలకు మొదలైంది. కృష్ణమ్మ పరవళ్లను చూసిన అన్నదాతల్లో రేకెత్తిన ఆశలు.. ఎక్కువసేపు నిలవలేదు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నిరాశగా మారాయి. ఎగువ ప్రాంతంలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి తగ్గింది. ఆదివారం రాత్రి 33వేల క్యూసెక్కుల వరద రాగా.. సోమవారానికి 27వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో వచ్చిన వరద నీటిని జూరాల జలాశయం ఎఫ్ఆర్ఎల్ 3,018 మీటర్ల వరకు నింపి.. తాగునీటి అవసరాలకు వినియోగించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరద జలాలతో వానాకాలంలో పంటలు సాగుచేసుకోవచ్చని ఆశపడిన రైతన్నలకు నిరాశే ఎదురైంది. అగమ్యగోచరంగా ఆయకట్టు సాగు.. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎల్నిన్ ప్రభావంతో వరుణుడు మోహం చాటేశాడు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సరైనా వర్షాలు లేక పంట పొలాలు బీడుపడ్డాయి. జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో కూడా అదే పరిస్థితి నెలకొంది. గతేడాది మే నెలలోనే వరద జలాలు జూరాలకు చేరగా.. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వర్షాకాలంలో జూరాల జలాశయం అడుగంటిందంటే.. పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని 69వేల ఎకరాలు, కుడి కాల్వ పరిధిలోని 37,400 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఆరుతడి పంటల వైపు.. రాష్ట్రంలో తలెత్తిన ఎల్నినో పరిస్థితులను గుర్తించిన అధికారులు.. వానాకాలంలో తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలు సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలైన మినుములు, పెసలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. అయితే జూరాల ఆయకట్టులో చాలా వరకు వరిసాగు తప్ప.. ఇతర పంటలను సాగుచేయడానికి రైతులు మొగ్గు చూపడం లేదు. 80వేల ఎకరాల్లో నారుమళ్లు.. ఏటా వానాకాలంలో జూరాల ఆయకట్టు రైతులు వరిసాగు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఏర్పడ్డాయి. అయితే రైతులు మాత్రం వరుణ దేవుడు కరుణించకపోతాడా అన్న భరోసాతో యథావిధిగానే వరిపంట సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఎడమ, కుడి కాల్వల పరిధిలో సుమారు 80వేల ఎకరాలకు పైగా నారుమళ్లు పోసుకున్నారు. అయితే మూడు రోజులుగా జూరాలకు వరద వచ్చి చేరుతుండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే రెండు రోజులకే వరద తగ్గిపోవడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే జూరాలకు తగ్గిన వరద వరద జలాల్లో తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ప్రశ్నార్థకంగా 1.9లక్షల ఆయకట్టు సాగు ఆందోళనలో అన్నదాతలు -
అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి
వనపర్తి/వనపర్తి రూరల్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా ప్రజావాణికి వచ్చిన అర్జీలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టర్లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణికి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్తో కలిసి ఆయన హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. సంబంధిత అంశం తమ శాఖ పరిధిలో కానిదైతే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని సూచించారు. ఉదయం 10.30 నుంచి మధాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగిన ప్రజావాణికి 45 అర్జీలు, ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 2 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, శిక్షణ ఉప కలెక్టర్ శ్రావ్య, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పుట్టిన ఊర్లో ఉండాలని..
నేను ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వస్తుంటాం. అక్కడ ఓటు వద్దని.. ఇక్కడే ఉంచుకున్నా. ఏ ఎన్నిక వచ్చినా సొంత ఊరుకు వచ్చి ఓటు వేయడం ఇష్టం. అందుకోసం ఎన్యూమరేషన్ ఫారం నింపి వెళ్లాను. మా ఓటు మా ఊరిలో ఉంటేనే ఆనందం. – కట్టా జనార్దన్రెడ్డి, ఉప్పునుంతల అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా బీఎల్ఓలు చొరవ చూపాలి. ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే చేపట్టి.. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టాక 10న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ఆపై అభ్యంతరాలు స్వీకరించి.. పరిశీలన అనంతరం 12న తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. డిజిటలైజేషన్ వందశాతం పూర్తయ్యేలా రాజకీయ పార్టీల నాయకుల సహకరించాలి. – హేమంత కేశవ పాటిల్, కలెక్టర్ ● -
సొంతూరులోనే ఓటు
● ఎన్యూమరేషన్ ఫారాలు అప్పగిస్తున్న జనం ● సర్ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు చెక్ ● ఓటరు జాబితా నుంచి తొలగింపు దిశగా చర్యలు అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వేగంగా సాగుతోంది. గ్రామాల్లో బీఎల్ఓలు ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తుండగా.. సూపర్వైజర్లు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఉన్నత విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో ఎక్కువ మంది పుట్టిన ఊరిలో ఓటు ఉంచుకునేందుకే మక్కువ చూపుతున్నారు. స్వయంగా స్వగ్రామానికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్ఓలకు అందిస్తున్నారు. అసలైన ఓటర్లు 75 – 85 శాతమే.. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో అసలైన ఓటర్లు 75 నుంచి 85శాతం మాత్రమే మిగలనున్నారు. మిగతా ఓటర్లు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, మరికొందరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నట్లు లెక్కలు తేలుతున్నాయి. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్ఓలకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలన్నింటిని వందశాతం డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇందులో అసలైన ఓటర్లను గుర్తిస్తూనే.. మిగిలిన వారిని నాలుగు కేటగిరీల్లో నమోదు చేయాలి. బీఎల్ఓల విచారణలో ఓటరు మరణించినట్లు తేలితే మృతుల కేటగిరీలో, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతే పర్మినెంట్గా షిఫ్ట్ అయినట్లుగా, ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటరుగా నమోదైతే సదరు ఓటరు ఎంపిక చేసుకున్న చోట జాబితాలో ఉంచి.. రెండో దాని డూప్లికెట్గా, ఫారాలు తీసుకోని వారు, తిరిగి ఇవ్వని వారి పేర్లను ఇతర కేటగిరీలో చేరుస్తున్నారు. ఇలా నమోదైన వారి పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వందశాతం పూర్తికి.. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలకు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిస్థాయిలో అందక డిజిటలైజేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒకవైపు గడువులోగా డిజిటలైషన్ ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం.. మరోవైపు టెక్నికల్ అధికారుల నుంచి పూర్తి సహకారం అందకపోవడంతో బీఎల్ఓలు తలలు పట్టుకుంటున్నారు. ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేసుకున్న వారు సైతం ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాల్సి ఉండగా.. చాలామంది ఇవ్వడం లేదని బీఎల్ఓలు పేర్కొంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారం డిజిటలైషన్ ప్రక్రియ పూర్తి చేస్తుండగా.. సాంకేతిక సమస్యతో ‘నో మ్యాపింగ్’ అని వస్తుండటంతో మరోసారి సరిచేయాల్సి రావడం తలనొప్పిగా మారింది. ఇంకా ఓటర్ల నుంచి 10 నుంచి 15 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందాల్సి ఉందని చెబుతున్నారు. పట్టణాల్లో మందకొడిగా.. సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ గ్రామాల్లో జోరుగా.. పట్టణాల్లో మందకొడిగా సాగుతోంది. కొందరు ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అధికారులు పాట్లు పడుతున్నారు. ఓటర్లకు స్వయం ఫోన్చేసి అడుగుతున్నా అప్పుడు, ఇప్పుడు అని అంటున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇలా.. జిల్లా మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ ఫారాలు శాతం రానివి మహబూబ్నగర్ 7,32,488 5,93,167 55,743 86.12 నాగర్కర్నూల్ 7,31,632 5,80,793 56,482 79.38 వనపర్తి 2,75,570 2,18,488 16,515 79.29 జోగుళాంబ గద్వాల 5,03,859 4,19,973 43,961 83.32 నారాయణపేట 4,95,574 3,93,911 45,959 79.49 -
పాలకవర్గానికి పట్టింపేది?
నేడు వనపర్తి పుర కౌన్సిల్ సమావేశం వనపర్తిటౌన్: పుర ఎన్నికలు జరిగి ఏడు నెలలు.. పాలకవర్గం కొలువుదీరి ఆరు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు కేవలం రెండు సాధారణ కౌన్సిల్ సమావేశాలు మాత్రమే నిర్వహించడంపై పుర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల లోలోపల ఒక సభ నిర్వహించినట్లు చెబుతున్నా.. అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా పుర కార్యాలయం నుంచి విడుదల కాకపోవడం గమనార్హం. రహస్యంగా కౌన్సిలర్లతో సంతకాలు తీసుకొని సమావేశం నిర్వహించే ముందు, తర్వాత ఎలాంటి ప్రకటన లేకుండా ముగిసినట్లు చెప్పుకోవడం పాలక మండలి నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది. దీనిపై ప్రతిపక్ష, అధికార పార్టీ కౌన్సిలర్లు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల నిర్వహణ గాలికొదిలేయడంతో పుర పాలనలో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం నెలకొకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. మార్చిలో బడ్జెట్ మీటింగ్, మే నెలలో సాధారణ సమావేశం నిర్వహించి చేతులు దులుపుకొన్నారు. నిబంధనల ప్రకారం మూడు నెలల పాటు సమావేశం జరపకపోతే పాలకమండలిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశాలు జరిగితేనే చైర్పర్సన్కు రూ.15,600, వైస్ చైర్మన్కు రూ.6,900, కౌన్సిలర్లకు రూ.3,250 చొప్పున గౌరవ వేతనం తీసుకోవాలి. సమావేశాలు నిర్వహించకుంటే గౌరవ వేతనం తీసుకునే అవకాశం ఉండదని సీనియర్ కౌన్సిలర్లు, అధికారులు పేర్కొంటున్నారు. అభివృద్ధిపై ప్రభావం.. పట్టణాభివృద్ధిలో భాగంగా వార్డుల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్లైన్ల లీకేజీల మరమ్మతు తదితర అంశాలను ప్రతి నెల కౌన్సిల్లో ఆమోదించాల్సి ఉంటుంది. చైర్పర్సన్ అధ్యక్షతన సభ నిర్వహించాలి. చైర్పర్సన్ అందుబాటులో లేకపోతే వైస్ చైర్మన్ కూడా సభ నడపొచ్చు. ఒకవేళ ఆయన కూడా అందుబాటులో లేకపోతే ఎవరైన ఒక కౌన్సిలర్ కౌన్సిల్ను కొనసాగించొచ్చు. సభలో 1/3 మెజార్టీ సభ్యులు ఉంటే కౌన్సిల్ నిర్వహణకు అర్హత ఉంటుంది. కానీ పాలక పెద్దలు తాము అనుకుప్పుడే సభలు జరగాలనే ధోరణితోనే ప్రతి నెల నిర్వహించడం లేదని అధికారపార్టీ సభ్యులు వాపోతున్నారు. కో–ఆప్షన్ ఊసే లేదు.. పుర ఎన్నికలు జరిగి 7 నెలలు గడుస్తున్నా.. కో–ఆప్షన్ ఎన్నిక ఉంటుందా? ఉండదా అనేది అధికారపార్టీ ఆశావహుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో హామీ పొందిన ఆశావహులు ఎదురుచూస్తున్న ఎన్నిక జరగడం లేదు. పెబ్బేరు, వనపర్తి మున్సిపాలిటీలో 20మందికి పైగా దర ఖాస్తు చేసుకున్నా.. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. గతంలో రెండునెలల్లోపే ఈ ప్రక్రియ ముగిసేది. చైర్పర్సన్ మౌనం వీడేనా..? ఇప్పటి వరకు జరిగిన రెండు సాధారణ సమావేశాల్లో చైర్పర్సన్ పట్టణ ఎజెండా అంశాల, కౌన్సిలర్లు లేవనెత్తుతున్న అభ్యంతరాలు, సమస్యలపై చైర్పర్సన్ మౌనంగానే ఉంటున్నారు. ఈ మౌనం అధికార పార్టీ సభ్యుల్లో చర్చకు దారితీస్తుంది. ఈ విషయమై చైర్పర్సన్తో ప్రస్తావించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. వనపర్తి పురపాలిక ఏడు నెలల్లో కేవలం రెండుసార్లే నిర్వహణ కో–ఆప్షన్ ఎన్నికపై వీడని సందిగ్ధం ఈ సమావేశంలోనైనా చైర్పర్సన్ గళం విప్పేనా? పుర కమిషనర్ లేకపోవడంతోనే సమావేశాలు నిర్వహించలేదు. ఒక్క జూన్లోనే ఇద్దరు కమిషనర్లు మారడంతో సమావేశం నిర్వహించేందుకు వీలు కాలేదు. కమిషనర్ లేకుండా సభ నిర్వహించడం సాధ్యం కాదు. మున్సిపాలిటీలోని పలు విభాగాల్లో అధ్యాయనం చేసేందుకు ఎమ్మెల్యే సూచించిన కమిటీలను త్వరలోనే వేస్తాం. – మధుసూదన్ గౌడ్, వైస్ చైర్మన్, వనపర్తి పురపాలిక -
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
గద్వాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం మొదలైంది. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు ఆదివారం జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ఎగువ నుంచి 18,300 క్యూసెక్కుల కొత్త నీరు వచ్చింది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.356 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.310 మీటర్ల 5.653 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్నినో ప్రభావంతో వరిపంట సాగుపై ఆశలు వదులుకున్న రైతులు కృష్ణానదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూరాల జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం -
వర్షాభావాన్ని అధిగమించేందుకే ‘జలసిరి’
మదనాపురం: వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు నీటి సంరక్షణే శాశ్వత పరిష్కారమని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. ఆదివారం స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ఎంసీఎల్ఎఫ్ (మోడల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్) శిక్షణకు ఆమె హాజరై సంఘ సభ్యులకు ‘విజన్ బిల్డింగ్’ అనే అంశంపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ‘జలసిరి’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి గ్రామాల్లో విస్తృతంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులకు నీటి సంరక్షణ ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూగర్భ జలమట్టం పెంపునకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంట, ప్రతి రైతు పొలంలో ఊట కుంటలు ఏర్పాటు చేసుకునేలా చైతన్యపర్చాలన్నారు. ప్రతి నీటి చుక్కను సంరక్షించడంతో భవిష్యత్లో నీటి కొరతను అధిగమించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఐబీ ఏపీఎం వెంకన్న, ఏపీఎంలు, ఏపీఓలు, సీసీలు, వీఓఏలు, మండల సమాఖ్య సిబ్బంది, కార్యవర్గ సభ్యులు, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరు పారేనా..?
జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద ● వరి సాగుకు సన్నద్ధమవుతున్న ఆయకట్టు రైతులు ● ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల ఆయకట్టు ● నీటి విడుదలపై స్పష్టత లేదంటున్న అధికారులు ●నేను ఇప్పటికే 16 ఎకరాల్లో వరి సాగు చేశాఆ. బోరు ద్వారా పారే నీరు సరిపోక ఎండుముఖం పడుతోంది. జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ప్రధాన ఎడమ కాల్వ ద్వారా విడుదల చేసి పంట ఎండిపోకుండా కాపాడాలి. – ఎర్రన్న, రైతు, మూలమళ్ల జూరాల ప్రధాన ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని అందించడంతో ఆయకట్టు రైతులు వరి సాగుచేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నారుమడులను సిద్ధం చేసుకొని సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చొరవచూపి సాగునీరు అందించి ఆదుకోవాలి. – కృష్ణారెడ్డి, రైతు, అమరచింత ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఇప్పుడిప్పుడే ఎగువ నుంచి వరద వచ్చి చేరుతోంది. సాగునీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అధికారికంగా ఆదేశాలు వస్తే తప్ప సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వలేం. – షమీ ఉల్లా, డీఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు రెండ్రోజులుగా ఎగువ నుంచి వరద చేరుతుండటంతో ఆయకట్టు రైతుల్లో సాగు ఆశలు చిగురించాయి. కాల్వలకు ఎలాగైనా నీటిని వదులుతారని వరి నారుమడులు సిద్ధం చేసుకోవడంతో పాటు పొలాలు దుక్కిదున్ని చదును చేసే పనులకు సిద్ధమయ్యారు. యాసంగిలో కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందడంతో.. ఈ ఏడాది వానాకాలంలో పూర్తి ఆయకట్టు 85 వేల ఎకరాలకు సాగునీరు వదులుతారని ఆశించారు. ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవకపోవడం.. ప్రాజెక్టుకు సకాలంలో వరద చేరకపోవడంతో ఆశలు వదులుకున్నారు. కాగా ఆయకట్టు పరిధిలో అక్కడక్కడ బోరుబావులున్న రైతులు వరి నారుమడులు వేసుకున్నారు. మిగిలిన రైతులు కాల్వ ద్వారా ఎప్పుడు నీరు వస్తుందోనని ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎగువనున్న నారాయణపూర్ డ్యాం క్రస్ట్గేట్లు తెరిచి రెండోజ్రులుగా నీటిని వదలడంతో జూరాలకు 18,300 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నందిమళ్ల శివారులో వరి నారుమడి -
కేంద్ర ప్రభుత్వంపై యువత విజయం : సీపీఎం
అమరచింత: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే యత్నంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై యువత విజయం హర్షనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎస్ భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దేశ రాజధానిలో యువత చేసిన ఆందోళన చివరకు విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దారితీసిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కేవలం మొదటి అడుగు మాత్రమేనని.. ఇప్పుడు ఎన్టీఏను రద్దు చేయాలని కోరారు. విద్యార్థి వ్యతిరేక, వాణిజ్యపరమైన, మతతత్వ ధోరణి కలిగిన ఎన్ఈపీ –2020 కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోరాట మార్గంలో అన్నిరకాల బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొని దృఢంగా నిలిచిన విద్యార్థి సంఘాలకు అభినందనలు తెలిపారు. క్రీడలు, కళలు, సినిమా, సంస్కృతి తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడం సంతోషకరమన్నారు. ఐక్య పోరాటాలు విజయాన్ని సాధిస్తాయని చెప్పడానికి ఇదో ఉదహారణ అన్నారు. డిమాండ్లన్నీ నెరవేరే వరకు యువత ధృడంగా ఉంటూ పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లాకార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యులు జబ్బార్, సీనియర్ నాయకులు మహమూద్, మండల కార్యదర్శి జీఎస్ గోపి, వెంకటేష్, అజయ్, రాఘవేంద్ర పాల్గొన్నారు. -
అర్హుల పేర్లు ఓటరు జాబితాలో ఉండాలి
వనపర్తిటౌన్: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ఓటర్లు తుది జాబితాలో కచ్చితంగా ఉండేలా చూడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని 9వ వార్డులో సర్ ప్రక్రియను పరిశీలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని, మృతిచెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు దొంగ ఓట్లకు తావివ్వొద్దన్నారు. అదేవిధంగా బీఎల్వోలు, బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు దేవర్ల నర్సింహ, డేగ మహేశ్వర్రెడ్డి, చిట్యాల రాము, శ్రీనివాసులు, బేదడి కుమార్, గోవర్ధన్ సాగర్, కిరణ్కుమార్, నాగేంద్రం, నాగనమోని రవి, బీఎల్వోలు అనురాధ, నాగలక్ష్మి ఉన్నారు. సాగునీరు వదలాలి.. వనపర్తి రూరల్: రాజకీయాలు పక్కనబెట్టి రైతులను ఆదుకునేందుకు వెంటనే కన్నెపల్లి, పాలమూరు–రంగారెడ్డితో పాటు అన్ని ఎత్తిపోతల పథకాల మోటార్లను ప్రారంభించి సాగునీరు విడుదల చేయాలని మాజి మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి చంద్రబాబుకు తాబేదారుగా మారారని.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమైఖ్యవాది, ఆయనకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఎద్దేవా చేశారు. సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి తెలంగాణ ప్రజల ఆకలి, ఆకాంక్షల మీద సోయి లేదని పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ఒడిసిపట్టడాన్ని సర్కారు మరిచిందని తెలిపారు. కుంటిసాకులతో పంటలను ఎండబెడితే అన్నదాతలు కన్నెర్ర చేయడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మోటార్లు ప్రారంభించి ఎత్తిపోతల పథకాల కింద ఉన్న చెరువులు, కుంటలు నీటితో నింపాలని డిమాండ్ చేశారు. ‘పీఆర్సీ వెంటనే ప్రకటించాలి’ వనపర్తిటౌన్: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్పార్టీ మరిచిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్గౌడ్, ప్రధాన కార్యదర్శి డి.కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఊర్దూ మీడియం హైస్కూల్లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా.. నేటికీ పీఆర్సీ ప్రకటించడం లేదని, ఇకపై తాత్సారం చేస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు విడతల డీఏలు పెండింగ్లో ఉన్నాయని.. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగే ఓబీఎస్ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని, ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ కార్డుల్లో ఎన్నో లోపాలున్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి.వెంకటేష్, కె.జ్యోతి, జిల్లా కోశాధికారి తిమ్మప్ప, జిల్లా కార్యదర్శులు పి.శ్రీనివాస్ గౌడ్, ఎండీ హమీద్, జి.మురళి, లక్ష్మణ్ నాయక్, బి.అరుణ తదితరులు పాల్గొన్నారు. -
సాగు, తాగునీటి ఇబ్బందులు
కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్లే.. ● మాజీమంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ మక్తల్/ కృష్ణా: కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న జలదోపిడిని అరికట్టకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ బృందంతో కలిసి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా వారు కృష్ణానదిపై ఉన్న గూగల్ ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో దిగువకు వచ్చే నీరు తగ్గిపోతుందని, ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురుస్తున్నందున తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే చర్యలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే జూరాలలో పూడిక పేరుకుపోవడంతో 11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ప్రాజెక్టు నిర్మిస్తే.. కేవలం 6 నుంచి 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నామన్నారు. ఈ విషయం గ్రహించే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి, ఎక్కడికక్కడ నీటిని నిల్వలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం నర్సిరెడ్డి ఉన్న సమయంలో నియోజకవర్గంలో కృష్ణా, భీమానదులపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారని, ప్రస్తుతం నదిలో నీళ్లులేక అవి మూతపడ్డాయన్నారు. ఏడారిగా మారుతుంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. కృష్ణా, భీమా నదులపై దివంగత ఎమ్మెల్యే నర్సిరెడ్డి నిర్మించిన ఎత్తిపోతల ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం కొంతకాలంగా ఎగువన ఉన్న ప్రాజెక్టుల ఎత్తును పెంచడంతో పాటు కొత్తగా ఎక్కడపడితే అక్కడ బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మిస్తుందని, ఇదిలాగే కొనసాగితే త్వరలోనే ఉమ్మడి పాలమూరు ఎడారిగా మారుతుందని వాపోయారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు కలుగకుండగా తగు చర్యలు తీసుకోవాలని, కూసుమర్తి వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, అంజయ్యయాదవ్, నాయకులు శ్రీనివాస్గుప్తా, నర్సింహగౌడ్, మహిపాల్రెడ్డి, శివరాజ్పాటిల్, సంతోష్, సురేష్రెడ్డి, నర్సింహారెడ్డి, ఈశ్వర్ పాల్గొన్నారు. -
‘నకిలీ’పై నజర్..!
జిల్లాలో విస్తృతంగా వ్యవసాయ అధికారుల స్పెషల్ డ్రైవ్ ● చిన్నంబావి ఘటనతో రంగంలోకి.. ● ఇద్దరు డీలర్ల అరెస్ట్ ● నాణ్యతపై రైతుల్లో పెరుగుతున్న అనుమానాలు ●వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా నకిలీ ఎరువులు వెలుగు చూస్తున్న నేపథ్యం.. జిల్లాలోని చిన్నంబావి మండలం వెల్టూరులో అక్రమ డీఏపీ విక్రయాల ఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 15 మండలాల వ్యవసాయశాఖ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ జిల్లాలోని సుమారు 300కుపైగా ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లోని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నిల్వలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ అనధికారిక ఎరువుల విక్రయాలు జరిగినా, లైసెన్స్ పొందిన కంపెనీలు కాకుండా ఇతర కంపెనీల ఎరువులు, పురుగు మందులు విక్రయించినా కఠిన చర్యలు తీసుకునేలా నిఘా పెంచారు. అనధికారిక మిశ్రమ ఎరువుల పట్టివేత.. అధికారుల స్పెషల్ డ్రైవ్లో రాష్ట్ర ఎకై ్సజ్మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకాలోని పాన్గల్ మండలంలో ఉన్న ఓ ఫర్టిలైజర్ దుకాణంలో ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన అనధికార ఎరువు (మిశ్రమ ఎరువు) 25 బస్తాలు పట్టుబడింది. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఎరువుల విక్రయాల ఘటనలు వెలుగుచూస్తున్న వేళ సమీప మండలంలో అక్రమ డీఏపీ విక్రయంలో పోలీసు కేసులు, అరెస్టులు అవుతున్నా.. సదరు దుకాణ యజమాని అనధికారిక మిశ్రమ ఎరువును రైతులకు విక్రయించేందుకు గోదాంలో నిల్వ చేయడం శోచనీయం. ల్యాబ్కు నమూనాలు.. అనధికారికంగా రైతులకు విక్రయించిన డీఏపీ నమూనాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. నివేదికలు వచ్చేందుకు కనీసం 15 రోజుల వ్యవధి పడుతుండగా.. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. రిపేర్టు నకిలీ అని వస్తే.. కోర్టులో దాఖలు చేసే చార్జిషీట్లో ఈ విషయాన్ని పోలీసులు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తమైన రైతులు.. నకిలీ, అనధికారిక ఎరువుల విక్రయాల ఘటనలతో అప్రమత్తమైన రైతులు ఎరువులు కొనుగోలు చేసేందుకు వెళ్లినప్పుడు అక్కడి బస్తాల ఫొటోలను ఆయా మండలాల ఏఓలకు పంపిస్తున్నారు. వారు పరిశీలించి అనుమతించిన తర్వాతే కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎరువులు, యూరియా నిల్వలు (మెట్రిక్ టన్నుల్లో..) చిన్నంబావి మండలం వెల్టూరులో అనధికారిక డీఏపీ విక్రయాలను గుర్తించి వ్యవసాయశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేసునమోదు చేశారు. వారిలో ఇద్దరిని ఇటీవలే అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. వీరిలో ఒకరు గద్వాల జిల్లాకు చెందిన వారు కాగా.. మరొకరు జిల్లాలోని పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ దుకాణ యజమాని. మరొకరు హైదరాబాద్లో అనధికార ఎరువులను స్టాక్ చేసిన వ్యక్తి ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడైన అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
అర్హుల ఓట్లు కాపాడాలి : మాజీ మంత్రి
కొత్తకోట రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులు, బీఎల్ఏలపై ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం పెద్దమందడి మండలం బుగ్గపల్లితండా, అమ్మపల్లి, అమ్మపల్లితండాలో పర్యటించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం బీఎల్వోలు, పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. సమయం తక్కువగా ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించి అర్హుల ఓట్లు తప్పకుండా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని బూత్లలో బీఎల్వోలపై పని భారం అధికంగా ఉందని, అదనపు సిబ్బందిని నియమించి సకాలంలో ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను కోరారు. వెంట జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, జెడ్పీ టీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి పాన్గల్: వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవాలని డీఆర్డీఓ ఉమాదేవి సూచించారు. శనివారం మండలంలోని చింతకుంటలో సర్పంచ్ కోట్ల రాములు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక గ్రామసభకు ఆమె హాజరై మాట్లాడారు. పొలాల్లోని బోరుబావుల దగ్గర ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో వీబీజీ రాంజీ ద్వారా రూ.7 వేలు, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునే వారికి రూ.12 వేలు అందుతాయన్నారు. పశువుల షెడ్, ఫాంపాండ్ నిర్మాణాలు చేపడితే ఆర్థిక సాయం మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కొలతల ప్రకారం పనిచేస్తేనే ఉపాధిహామీ డబ్బులు వస్తాయన్నా రు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సమా వేశంలో ఎంపీడీఓ గోవిందరావు, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. నేడు బ్యారేజీల పరిశీలన మహబూబ్నగర్ మున్సిపాలిటీ: భీమా, కృష్ణానదులపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న చెక్డ్యాంలు, బ్యారేజీలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం పరిశీలిస్తామని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైడ్రాలిక్ గేట్లు ఏర్పాటు చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆర్డీఎస్ వద్ద కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, కర్ణాటక నుంచి నీరు రాకుంటే తెలంగాణ రైతులు వచ్చే యాసంగిలో పంటలు వేసే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. ఈ పరిస్థితి మారే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేపడుతామని హెచ్చరించారు. -
ఎల్నినోను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
కొత్తకోట రూరల్: ఎల్నినో నేపథ్యంలో తాగునీటి నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. శనివారం పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తాగునీటి కొరత ఏర్పడకుండా భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు వర్షపు నీటిని ప్రతి గ్రామంలో సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. రైతులు వరి, చెరకు వంటి అధిక నీరు అవసరమున్న పంటల సాగును తగ్గించి ఆరుతడి పంటలు, ఆయిల్పాం సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ సాగు వైపు మళ్లాలని, వ్యవసాయశాఖ అధికారుల సలహాలు తీసుకొని శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేపట్టాలన్నారు. జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్ పాల్గొన్నారు. నిల్వ గోదాములు తనిఖీ వనపర్తి రూరల్: పెబ్బేరులోని సాయి గోపాల్ రైస్మిల్లుకు కేటాయించిన ధాన్యం ఎర్రవల్లి మండలం బీచుపల్లి సమీపంలో ఉన్న స్టాక్ గోదాంలలో భద్రపర్చారు. శనివారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు కాలేదని సమాచారం. -
కృష్ణమ్మ వచ్చింది
పాలమూరు మురిసేలా.. పుడమితల్లి మెరిసేలా.. సాగు ఆశలు తీర్చేలా.. రైతన్న పంట పండేలా.. కరువును పారద్రోలేలా.. కృష్ణమ్మ వచ్చింది అంటూ అన్నదాతలు సంబరపడ్డారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి రెండు రోజుల క్రితం దిగువకు నీటిని విడుదల చేయగా.. శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని మొట్టమొదటి గ్రామమైన తంగిడి వద్ద తెలంగాణలోకి అడుగుపెట్టింది. కృష్ణానదిలో నీటిని చూసిన తీర ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పంటలకు అవసరమయ్యే నీరు వచ్చిందని.. ఎల్నినోపై దిగులు పోయిందని అభిప్రాయపడుతున్నారు. – కృష్ణా కృష్ణా మండలంలోని గుడేబల్లూరు వద్ద కృష్ణానదిలో పారుతున్న వరద నీరు -
ఆయుధ వినియోగంలో నైపుణ్యాలు ఉండాలి
వనపర్తి: పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయుధాల వినియోగంపై సంపూర్ణ అవగాహన, నైపుణ్యం అవసరమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎరవ్రల్లి 10వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన రెండ్రోజుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ శనివారం ముగిసింది. చివరిరోజు ఎస్పీ పాల్గొని అదనపు ఎస్పీ, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్ నిర్వహించి తమ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. శిక్షణలో భాగంగా విధుల్లో వినియోగించే ఆయుధాలతో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పది రౌండ్ల ఫైరింగ్ చేసే అవకాశం కల్పించారు. ఫైరింగ్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ వద్ద ఉన్న ఆయుధాల పనితీరు, వినియోగ విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ సక్రమంగా ఉంచాలన్నారు. విధి నిర్వహణలో శారీరక దృఢత్వం ఎంతో కీలకమని, రోజు వ్యాయామం జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఆరోగ్యం, మానసిక స్థైర్యం, అప్రమత్తతతో పనిచేస్తేనే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలమన్నారు. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, పోలీసుశాఖ గౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదని కోరారు. వ్యక్తిగత, కుటుంబ, విధి నిర్వహణ, ఆరోగ్య సంబంధిత సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, రిజర్వ్ సబ్ ఇనన్స్పెక్టర్ వినోద్, జిల్లా పోలీసు అధికారులు, ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో పోలీసు సిబ్బంది ఫైరింగ్ చేస్తున్న ఎస్పీ డి.సునీతారెడ్డి -
సాగు విధానాల్లో మార్పు అవసరం
గోపాల్పేట: ఎల్నినో కారణంగా సాంప్రదాయ సాగు విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తిర్మలాపూర్లో ఎన్నినో ప్రభావం.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రైతులు దిగుబడి మాత్రమే కాకుండా పెట్టుబడి, నీటి లభ్యత, మార్కెటింగ్ అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం సూచిస్తున్న పద్ధతులను పాటించాలని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులు ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు నీటిగుంతలు, ఇంకుడు గుంతలు, సూక్మ నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. కంది, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్నినో రాష్ట్ర కమిటీ చైర్మన్గా డా. చిన్నారెడ్డి ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో ఈ ఏడాది 34 శాతం మేర కరువు పరిస్థితులు ఉన్నాయని.. మండలంలో 40 శాతం వరకు నమోదు అయిందని తెలిపారు. జయన్న తిర్మలాపూర్లో సుమారు మూడు వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా.. అందులో 700 ఎకరాలు పూర్తిగా వర్షాధార పంటలే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సమయాల్లో అధిక నీరు అవసరం ఉన్న వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీగోపాల్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మండల ప్రత్యేక అధికారి సుధీర్రెడ్డి, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు గగనం నరహరి, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
30 ఏళ్లుగా పనిచేస్తున్నా..
ఆలయంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నా. అర్చకుడు మరణించి రెండేళ్లు గడుస్తుంది. నాటి నుంచి ఆలయం మూతబడింది. ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో మేలు జరుగుతుందని భావించా. అర్చకుడు బతికి ఉన్నప్పుడు కూడా నెలకు రూ. వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. ఉన్నతాధికారులు స్పందించి ఆలయాన్ని తెరిపించాలి. – బాలీశ్వరమ్మ, స్వీపర్, వీపనగండ్ల ఆలయ భూములు పేదలు సాగు చేసుకునేలా చేస్తే ఆర్థికంగా బలపడుతారు. ఒకే వర్గానికి చెందినవారు ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారేగాని కనీసం అర్చకుడిని కూడా నియమించడం లేదు. దేవాదాయశాఖ అధికారుల ఏక పక్ష నిర్ణయం సరికాదు. ఉన్నతాధికారులు స్పందించి భూముల వేలం నిర్వహిస్తే ఆదాయం సమకూరడంతో పాటు నిత్య పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. – ఎత్తం కృష్ణయ్య, మాజీ అధ్యక్షుడు, మండల రైతుబంధు సమితి చెన్నకేశవస్వామి ఆలయ భూములను అదే గ్రామానికి చెందిన పలువురు రైతులు సిట్టింగ్ టెనెంట్ యాక్టు కింద మూడేళ్లు సాగు చేసుకునేందుకు దేవాదాయశాఖ కమిషరేట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. గ్రామానికి చెందిన మరికొందరు సాగుహక్కు కోసం నిరాహార దీక్షలు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామంలో పర్యటించి సమస్యను పూర్తిగా తెలుసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. ఆలయంలో నిత్య పూజలు కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లను వీలైనంత త్వరలో చేపడతాం. – శేఖర్గౌడ్, ఈఓ, దేవాదాయశాఖ, వనపర్తి ● -
ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
పాన్గల్: వాతావరణ మార్పులకు అనుగుణంగా శాసీ్త్రయ పద్ధతులను అవలంబిస్తూ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని రాయినిపల్లి, బుసిరెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వరికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలన్నారు. భూసార పరీక్షల నివేదికల ఆధారంగా ఎరువులు వినియోగించాలని, భూసారాన్ని కాపాడటంతో దిగుబడులు పెరగడంతో పాటు వ్యవసాయం స్థిరమైన అభివృద్ధి దిశగా సాగుతుందని తెలిపారు. భూమి, ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ఆయా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణల్లో మొక్కలు నాటి నీరు పోశారు. ఆయన వెంట డీఆర్డీఓ ఉమాదేవి, తహసీల్దార్ కార్తీక్రావు, ఎంపీడీఓ గోవిందరావు, ఆయా గ్రామాల సర్పంచులు హేమాద్రినాయుడు, ప్రభాకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా భూముల రీ సర్వే
ఖిల్లాఘనపురం: పారదర్శకంగా భూముల రీ సర్వే చేపడుతున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. మండలంలోని మల్కాపురం గ్రామం ల్యాండ్ రీ సర్వేకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై ంది. సర్వే గురించి గ్రామస్తులకు వివరించేందుకు శుక్రవారం గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్న భూముల రీ సర్వేకు గ్రామం ఎంపికై ందని.. గ్రామంలోని భూములు రీ సర్వే చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భూములకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా, పారదర్శకంగా నవీకరించడంతో పాటు సర్వేనంబర్ల వారీగా హద్దులను గుర్తించి వివాదాలను పరిష్కరిస్తామన్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో సర్వే కొనసాగుతుందని.. రైతులు సర్వే అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఎలాంటి సందేహాలున్నా సంబంధిత అఽధికారుల దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని.. రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుగుణ, సర్పంచ్ రవీందర్, ఆర్ఐ తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శి ఖాదర్బీ పాల్గొన్నారు. -
అడ్మిషన్లు ‘ఓపెన్’
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ పరిస్థితులతో చదువు మధ్యలో ఆపేసిన వారికి దిక్సూచిగా నిలుస్తోంది ఓపెన్ స్కూల్ సొసైటీ. ఒకవైపు సొంత పనులు లేదా ఉద్యోగాలు చేసుకుంటూనే.. మరోవైపు పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసేలా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సుల ద్వారా వచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్ విద్యతో సమానమైన గుర్తింపు కలిగి ఉంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా విద్యార్థుల సౌకర్యార్థం 104 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపిక చేసిన మండలాల్లో.. ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానాన్ని 2008–09 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట కేవలం ఎస్సెస్సీ చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా.. 2011 నుంచి ఇంటర్ చదివే వారికి కూడా అవకాశం కల్పించారు. అయితే ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మండలాల్లో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు (అధ్యయన కేంద్రాలు) ఏర్పాటు చేశారు. ఇలా ఉమ్మడి పాలమూరులో మొత్తం 104 స్టడీ సెంటర్లలో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. వారంలో మొత్తం వారికి అవసరం ఉన్న పనులు చేసుకుంటూ ఆదివారం స్టడీ సెంటర్లలో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంది. నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్ వంటి కొన్ని అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల్లో వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులతో మధ్యలో ఆపేసిన వారికి సదావకాశం ఇతరత్రా పనులు చేసుకుంటూనే చదివేందుకు అవకాశం సర్టిఫికెట్కు రెగ్యులర్ కోర్సులతో సమాన ప్రాధాన్యం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలంటున్న అధికారులు డిస్టెన్స్ విధానంలో ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ చదవాలనుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. ఆసక్తి గల విద్యార్థులు సూచించిన ఫీజులను చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టును.. తమకు అనుకూలమైన సమయంలో చదువుకునేందుకు అవకాశం ఉంది. ఆది, రెండో శనివారాల్లో తరగతులు నిర్వహిస్తాం. – శివయ్య, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఆన్లైన్ విధానంలో WWW.TELANGA NAOPENSCHOOL.ORG వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్సెస్సీలో జనరల్ వారికి రూ.1,400, మహిళలు ఇతర రిజర్వేషన్ వారు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు రిజిస్ట్రేషన్కు రూ.150 సాధారణంగా చెల్లించాలి. ఇంటర్లో పురుషులు జనరల్ వారు రూ.1,500, మిగతా వారికి రూ.1,200తోపాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు చెల్లించిన రశీదు, అడ్మిషన్ ఫాం భర్తీ చేసి స్టడీ సెంటర్లో అందజేయాలి. చెల్లించిన ఫీజులోనే పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో స్టడీ సెంటర్లు.. గతేడాది ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తీర్ణత పొందినవారు ఇలా.. ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ చదివిన వారికి రెగ్యులర్ కోర్సులకు సమానంగా సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్తో అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సెస్సీ బోధన అంశాలను మూడు గ్రూపులుగా విభజించి బోధిస్తారు. గ్రూప్–ఏలో భాషలు, గ్రూప్–బీలో ప్రధాన అంశాలు, గ్రూప్–సీలో వృత్తి విద్యకు సంబంధించిన కోర్సులు ఉంటాయి. మొదటి రెండింటిని కలిపి కనీసం రెండు సబ్జెక్టుల చొప్పున ఐదింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, ఒరియా భాషల్లో కొనసాగిస్తారు. ఇంటర్లో గ్రూప్–ఏలో భాషలు, బీలో ఆప్షనల్స్, సీలో వృత్తి విద్యా కోర్సులు ఉండగా.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషలు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్–ఏలో ఇంగ్లిష్తోపాటు నచ్చిన ఏదో ఒక భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బీ, సీలో నచ్చిన ఆప్షనల్స్, వృత్తి విద్య కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
ఆస్తుల కంటే విజ్ఞానం గొప్పది
వనపర్తిటౌన్: ఆస్తుల కంటే విజ్ఞానం గొప్పదని.. విద్యార్థులు కష్టపడి చదివి ఎంచుకున్న ఉన్నత లక్ష్యాన్ని సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నగదు ప్రతిభ ప్రోత్సాహక పురస్కార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆస్తులు తింటే తరుగుతాయి.. కానీ విజ్ఞానం ఉంటే ఎన్ని ఆస్తులైనా సంపాదించ వచ్చన్నారు. వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవడంతో పాటు తోటి వారిని ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2026లో 10వ తరగతిలో 566 మార్కులు సాధించి మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన నజీరా, కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న కృతికకు నగదు ప్రోత్సాహకం అందజేయడంతో పాటు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కృతిక ఉన్నత విద్యకు ఆత్మకూర్ బాలవర్ధన్ రెడ్డి గతేడది రూ.20 వేలు, ఈ ఏడాది రూ.50 వేలు, 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్ రూ.10 వేలు, సీనియర్ ఉపాధ్యాయుడు వాకిట రవికుమార్ రూ.10 వేలు, అరవింద్ రూ.10 వేలు అందజేశారు. 500కు పైగా మార్కులు సాధించిన అబ్దుల్ ఆదిల్, భార్గవి, భానుప్రకాశ్, జయచంద్ర, జ్ఞానేశ్వరికి ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ రూ.వెయ్యి, ఆత్మకూర్ బాలవర్ధన్రెడ్డి రూ.వెయ్యి చొప్పున నగదు అందజేశారు. కార్యక్రమంలో ఏసీజీ అండ్ జీహెచ్ఎం గణేష్కుమార్, సామాజిక కార్యకర్తలు గంధం నాగరాజు, భోజరాజు వెంకటేష్, విశ్వంబాబు, శంకర్గౌడ్, చంద్రశేఖర్, శ్రీనివాసులు, మహిపాల్రెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బకాయి వేతనాలు చెల్లించాలి ఖిల్లాఘనపురం: సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ తదితర కార్మికులకు మూడునెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. ప్రభుత్వం ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని చెప్పినా ఎక్కడా అమలుకావడం లేదని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు సాయికృష్ణ, భీమయ్య, శివ, స్వాతి, ప్రియాంక, నజ్మ, నాగయ్య, వెంకటేష్, మునీందర్ పాల్గొన్నారు. ‘కేంద్ర విధానాలు దేశానికి ప్రమాదం’ వనపర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు దేశానికి తీవ్ర ప్రమాదకరమని.. యువత భవిష్యత్ను దోచుకుంటున్న పాలకులపై ఉద్యమించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కల్లూరి ధరేంద్ర పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన 3వ మహాసభలు నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీలో జాప్యం, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ దోపిడీ, పరిశ్రమల కొరతతో జిల్లా యువత వలసబాట పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ల కోసం యువత జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారని.. నీట్ అక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. శాశ్వత ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, వైద్యం, క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడమే నిజమైన ప్రగతని స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, శాంతి, అభ్యుదయం, శాసీ్త్రయ సోషలిజం అనే సిద్ధాంతంతో ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి బిజ్జ శ్రీనివాసులు, కుతుబ్, సీపీఐ నేత రమేష్, సురేష్, విష్ణు, మహబూబ్, పరమేష్, వివిధ మండలాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సకాలంలో యూనిఫామ్స్ పంపిణీ
వనపర్తి: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఆగస్టు 15లోగా యూనిఫామ్స్ అందజేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటమార్పిడి చేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని, అందుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందజేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించామన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు విద్యార్థుల యూనిఫామ్స్ పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 512 పాఠశాలల్లో 38,653 విద్యార్థులు, 15 కేజీబీవీల్లో 4,531 మంది విద్యార్థులు, 3 మోడల్ స్కూళ్లలో 1,919 విద్యార్థులు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో శిక్షణ పొందిన 358 స్వయం సహాయక సంఘాల టైలర్లను గుర్తించామని.. ఇప్పటి వరకు వచ్చిన వస్త్రాన్ని ఎప్పటికప్పుడు మండలాలకు విభజించి కుట్టేందుకు టైలర్లకు అందజేస్తామన్నారు. ప్రతి విద్యార్థికి ఆగస్ట్ 15లోగా ఒక జత, ఆగస్టు 25లోగా రెండోజత అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను ఆదేశించారు. ● వ్యవసాయశాఖకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, సమస్యాత్మక గ్రామాలు, ఇప్పటి వరకు చేపట్టిన సాగు విస్తీర్ణాన్ని వివరించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కంది, నువ్వులు, వేరుశనగ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో కూరగాయల సాగు సైతం పెంచేందుకు వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించామని చెప్పారు. వీడియో కాన్ఫరెనన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ఆదర్శ్సురభి.. జిల్లా అధికారులు -
రికార్డుస్థాయిలో సెల్ఫోన్ల రికవరీ : ఎస్పీ
వనపర్తి: జిల్లా పోలీసు అధికారులు నెలరోజుల వ్యవధిలో సుమారు రూ.65 లక్షల విలువైన 236 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు ఫోన్లను అందజేసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. స్మార్ట్ఫోన్ పోగొట్టుకుంటే ఎలా ఫిర్యాదు చేయాలనే విషయాన్ని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఉన్న సెల్ఫోన్లను స్థానిక బృందాలు ప్రత్యేక దృష్టి సారించి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ సీఈఐఆర్ వ్యవస్థను ఉపయోగించి చోరీకి గురైన ఫోన్లను గుర్తించి బాధితులకు అందించినట్లు చెప్పారు. పోగొట్టుకున్న మొబైల్ విలువ కంటే అందులోని ఫొటోలు, సమాచారం, కాంటాక్ట్ నంబర్ల విలువ ఎంతో ఎక్కువని అభిప్రాయపడ్డారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకోవడం, చోరీకి గురైనప్పుడు బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్సైట్లోగాని దగ్గర్లోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 500 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశామన్నారు. సెల్ఫోన్ల రికవరీకి కృషి చేసిన సీసీఎస్ సీఐ పవార్ అశోక్కుమార్, ఎస్ఐ రామరాజు, ఏఎస్ఐ తిరుపతిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు ఎన్.రాజగౌడ్, శ్రీనివాస్రెడ్డి, కృష్ణయ్య, బాలయ్య, రాఘవేందర్, కానిస్టేబుళ్లు బెద్దడి స్వామి, మురళీకృష్ణ, సమరసింహారెడ్డి, మురళి, సత్యనారాయణ, భూపాల్కు ఎస్పీ క్యాష్ రివార్డ్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కల్వకుర్తి టౌన్: ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజన్ టెక్నీషియన్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోఆర్డినేటర్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ (ఎంపీసీ/ బైపీసీ) ఉత్తీర్ణులైన 18–23 ఏళ్ల మధ్య వయస్సు గల యువత అర్హులని, ఒకేషనల్ ఇంటర్ చదివిన వారికి అవకాశం లేదన్నారు. అచ్చంపేట, లింగాల, కల్వకుర్తి, కొల్లాపూర్, కొత్తకోట, వనపర్తి, తెలకపల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష శుక్రవారం ఉదయం 10 గంటలకు తూడుకుర్తిలోని రామచంద్రారెడ్డి నేత్ర వైద్య కేంద్రంలో ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్ మార్కుల మెమోతోపాటు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 77309 93383, 99634 78751లను సంప్రదించాలని సూచించారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఎల్నినోను సమర్థంగా ఎదుర్కొందాం వనపర్తి రూరల్: ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి స్థానికల సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. గురువారం పెబ్బేరు మండలం వై–శాఖాపూర్, శ్రీరంగాపురంలోని రైతువేధికలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్నిశాఖలు సమన్వయంతో ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ ముందస్తు చర్యలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీత, వ్యవసాయ అధికారి హైమావతి, సర్పంచ్లు మద్దిలేటి, నిఖిత, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆరుతడి పంటలు సాగు చేయాలి పాన్గల్: ఎల్నినో నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని డీఆర్డీఓ ఉమాదేవి, ఏడీఏ తిప్పేస్వామి రైతులకు సూచించారు. గురువారం మండలంలోని శాగాపూర్, శాగాపూర్తండాలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఏడీఏ, మల్లాయిపల్లిలో డీఆర్డీఓ పాల్గొని మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. తక్కువ నీరు అవసరమయ్యే కంది, మినుము, జొన్న వంటి పంటలతో పాటు అంతర పంటలుగా కంది–మినుము, ఆముదం–మినుముతో పాటు టమాటా, బెండకాయ, చిక్కుడు వంటి కూరగాయాల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగం, మల్చింగ్, వర్షపు నీటి సంరక్షణ, సూక్ష్మ సాగునీటి పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం ఎల్నినో ప్రభావంపై ముద్రించిన కరపత్రాలను రైతులతో కలిసి అధికారులు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో అసిస్టెంట్ జల శాస్త్రజ్ఞుడు ఉమేష్, తహసీల్దార్ కార్తీక్రావు, ఎంపీడీఓ గోవిందరావు, ఏఈఓలు, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 397 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 397 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.7,269, కనిష్టంగా రూ.3,549, సరాసరిగా రూ.4,279 ధరలు లభించాయి. అలాగే 6 క్వింటాళ్ల వరి (సోన) రాగా క్వింటా రూ.2,585 ధర పలికింది. -
వరదల సమయంలోనే..
జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద వచ్చి చేరుతున్న సమయంలోనే సమాంతర కాల్వ ద్వారా నీటిని తరలించాల్సి ఉంటుంది. వరద నిలిచిన వెంటనే ప్రధాన కాల్వ షట్టర్లను మూసి ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. గతంలో షట్టర్ల లీకేజీతో నీరంతా వృథాగా పారేది. ప్రస్తుతం షట్టర్ల మరమ్మతులు చేపడుతున్న అధికారులు నీటి వృథాను అరికట్టాలి. – వెంకటేష్, రైతు, నందిమళ్ల సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల మరమ్మతుకు రూ.60 లక్షలు మంజూరయ్యాయి. మరో పదిరోజుల్లో పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. అనుకున్న సమయానికి పూర్తి చేసి షట్టర్లు మూసిన సమయంలో నీరు వృథాగా పారకుండా చూస్తాం. – కేశవరావు, ఈఈ, భీమా ఫేజ్–2 -
ఎస్జీఎఫ్ సందడి
● పాఠశాల, కళాశాల స్థాయిలో క్రీడలు ● తెలంగాణ స్కూల్గేమ్స్ షెడ్యూల్ విడుదల ● వచ్చేనెల మొదటి వారం నుంచి నాలుగు దశల్లో పోటీల నిర్వహణ మహబూబ్నగర్ క్రీడలు: పాఠశాల, కళాశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అండర్ 14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా మండలస్థాయి నుంచి మొదలుకొని జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో క్రీడాపోటీలను నిర్వహిస్తారు. ఎంతో మంది పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఎస్జీఎఫ్ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదిగి తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు విద్యార్థులకు ఒక వేదికలా ఉపయోగపడుతున్నాయి. ● ప్రతి ఏడాది పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభం అనంతరం జిల్లాలోని పీఈటీలతో సమావేశం నిర్వహించి, ఎస్జీఎఫ్ పోటీల ఎంపికలపై నిర్ణయం తీసుకుంటారు. ఆగస్టు నుంచి ఈ ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని ఎస్జీఎఫ్ క్రీడా పోటీలకు 2026–27 సంవత్సరానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ క్రీడా షెడ్యూల్ను ఇటీవల విడుదల చేశారు. నాలుగు దశల్లో ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్ నాలుగో వారం వరకు నాలుగు దశల్లో ఎస్జీఎఫ్ క్రీడలు జరగనున్నాయి. మండల, జిల్లా, ఉమ్మడి జిల్లా (జోనల్), రాష్ట్రస్థాయిల్లో ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు జరగనున్నాయి. జిల్లాల ఎంపిక పోటీలను నిర్వహించుకొని పాత ఉమ్మడి జిల్లా జట్టుగా ఏర్పడి రాష్ట్ర పోటీలకు హాజరుకానున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా షెడ్యూల్ విడుదలకావడంతో ఇక క్రీడల సందడి నెలకొనుంది. పకడ్బందీగా నిర్వహిస్తాం... ఈ ఏడాది అండర్–14, అండర్–17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలను వ్యాయా మ ఉపాధ్యాయుల సహకారంతో పకడ్బందీగా నిర్వహిస్తాం. డీఈఓ ఆదేశాల మేరకు త్వరలో జిల్లాలోని పీడీ, పీఈటీలతో సమావేశం నిర్వహిస్తాం. గత ఏడాది వనపర్తి జిల్లాలో నాలుగు ఎస్జీఎఫ్ హాకీ టోర్నీలు నిర్వహించాం. ఈ ఏడాది కూడా జిల్లాకే ఏమైనా రాష్ట్రస్థాయి టోర్నీలు కేటాయిస్తే విజయంతంగా నిర్వహిస్తాం. – బి.కుమార్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి, వనపర్తి -
‘సర్’లో భాగస్వాములు కావాలి
ఖిల్లాఘనపురం: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. గురువారం మండలంలోని తిర్మలాయపల్లి, గారం, కమాలోద్ధీన్పూర్, వెంకటాంపల్లి, మానాజీపేటలో పర్యటించి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ బాలీశ్వర్రెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, కార్యదర్శి పురేందర్రెడ్డితో సర్ ప్రక్రియను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో బీఎల్వోలు, బీఎల్ఏలతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 100 శాతం పూర్తి చేసిన బీఎల్వోలు, బీఎల్ఏలను శాలువాలు, పూలమాలలతో సన్మానించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని.. అర్హలందరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, బీఎల్వోల పాత్ర ఎంతో కీలకమని.. ఇంటింటికి ఫారాలు పంచడమేగాకుండా ఎలా నింపారు.. ఏమైనా తప్పులున్నాయా అనే వివరాలను పరిశీలించి తిరిగి తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లోని చదువుకున్న యువత ముందుకొచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విషయంలో సహకారం అందించాలన్నారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం
ఖిల్లాఘనపురం: విద్యాపరంగా జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని ఇన్చార్జి జిల్లా విద్యాధికారి యాదయ్య కోరారు. మండలంలోని సోళీపురం ఉన్నత పాఠశాలలో మూడురోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే దొంతికుంటతండా స్టేజీ సమీపంలో ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాలను సందర్శించి కొనసాగుతున్న మరమ్మతులను పరిశీలించారు. ఇంటర్ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి వసతులపై ఆరా తీశారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఐదేళ్లుగా నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా రెండోస్థానంలో నిలిచిందని, ఇందులో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రతి తరగతిలో వెనుకబడిన విద్యార్థులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై శిక్షణనిస్తున్నట్లు చెప్పారు. శిక్షణలో అందించే అంశాలను ఉపాధ్యాయులు అర్థం చేసుకొని విద్యార్థులను టాపర్లుగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో పాల్గొని ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో జీసీడీఓ నారాయణమ్మ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఎస్ఓ శేఖర్, ఎంఈఓ జయశంకర్, ఏఓ మల్లయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
యూబీఐ సేవలు వినియోగించుకోవాలి
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనియన్ బ్యాంక్ వేతన ఖాతాల క్యాంపెయిన్ నిర్వహించగా.. అదనపు కలెక్టర్తో పాటు బ్యాంకు డీజీఎం వెంకటేశ్వర్లు, ఎస్డీసీ తిరుపతయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ.. జూన్ 25న రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక వేతన ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్, ప్రీమియర్, ఎలైట్ ఖాతాలు ఉన్నాయని.. వ్యక్తిగత, ప్రమాద బీమా, టర్మ్ ఇన్సూరెన్్స్, ఇతర బీమా సదుపాయాలు, ఆకర్షణీయ రుణ సౌకర్యాలు, ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం బ్యాంకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వేతన ఖాతాల ప్రత్యేకతలు, బీమా రక్షణ, రుణ సదుపాయాలు, ఇతర ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో ఎల్డీఎం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైకుంఠధామాల్లో ‘స్వచ్ఛ’ పనులు
మదనాపురం: జిల్లాలోని వైకుంఠధామాల దుస్థితిని వివరిస్తూ గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆఖరి మజిలీకి ఆటంకాలు..’ శీర్షిక కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన మదనాపురం ఎంపీడీఓ ప్రసన్నకుమారి, ఎంపీఓ ఉషనప్ప మండలంలోని అజ్జకొల్లు, కొత్తపల్లి, నిల్విడి తదితర గ్రామాల్లోని వైకుంఠధామాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, వ్యర్థాలను పొక్లెయిన్ సాయంతో తొలగించారు. వైకుంఠధామాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం శుభ్రంగా ఉంచాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం -
సైబర్ భద్రతపై అవగాహన అవసరం
వనపర్తి: రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా పనిచేయాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరస్తులను వేగంగా గుర్తించి చట్టం ముందు నిలబెట్టడంతో పాటు ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో సైబర్ మోసాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. గురువారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం నుంచి పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి ఎస్పీ డి.సునీతరెడ్డి పాల్గొని వివరాలు వెల్లడించారు. వీసీలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, సైబర్క్రైమ్ సీఐ శ్రీను నాయక్, సైబర్ క్రైమ్ ఎస్ఐ రవిప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు మంజునాథరెడ్డి, నరేష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, ఐటి కోర్ సిబ్బంది గోవింద్, రవీంద్రబాబు పాల్గొన్నారు. జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాల్సిందే మహబూబ్నగర్ న్యూటౌన్: జీఓ నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాల్సిందేనని రాష్ట్ర మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేశ్ డిమాండ్ చేశారు. గురువారం జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఏజెన్సీ నిర్వాహకులతో యూనియన్ నేతలు, కార్మిక సంఘం నాయకుల ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. కనీస వేతనాలు అమలు చేయాలని, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్స్ కార్మికులకు పూర్తిస్థాయి వేతనం అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేతనాల సమస్యపై మరోసారి సమావేశం నిర్వహించి, నిర్ణయం తీసుకుంటామని ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు శ్రీవాణి, రాఘవేందర్, యూనియన్ నాయకులు రంగన్న, చెన్నయ్య, యాదయ్య పాల్గొన్నారు. -
నిరుపయోగంగా మారాయి..
మా ఊళ్లో ఉన్న పాత శ్మశానంలోనే ఇప్పటికీ అంత్యక్రియలు చేస్తున్నాం. కొత్తగా కట్టిన వైకుంఠధామానికి ఎవరూ వెళ్లడం లేదు. ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అది వృథాగా మారింది. ఇప్పటికై నా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి. – విష్ణు, గోపాల్పేట గత ప్రభుత్వ హయంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన వైకుంఠధామాలు నేడు వృథా మారాయి. గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో మృతదేహాలను కాల్చేందుకు ముందుకు రావడం లేదు. మా పొలాల్లో, శ్మశానవాటికల్లో అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. అఽధికారులకు ఈ విషయం ప్రజలకు అవగాహన కల్పించాలి. – అశోక్కుమార్ యాదవ్, మదనాపురం జిల్లావ్యాప్తంగా ఉన్న వైకుంఠ ధామాల వినియోగం తక్కువగా ఉన్న మాట వాస్తవమే. నీటివసతి, విద్యుత్ కనెక్షన్లు లేని చోట త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. గ్రామాల్లో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సర్పంచులు, స్థానిక నాయకులతో మాట్లాడి, ప్రతి గ్రామంలోనూ వైకుంఠధామాల్లోనే అంత్యక్రియలకు ఉపయోగించేలా చూస్తాం. ప్రజాధనం వృథా కాకుండా త్వరలోనే అన్నింటినీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తాం. – రఘునాఽథ్రెడ్డి, డీపీఓ, వనపర్తి ● -
కేంద్రాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా? : కాంగ్రెస్
వనపర్తిటౌన్: కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్లకు పాల్పడుతున్నారని కాంగ్రెస్పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండారు శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. టీపీసీసీ, డీసీసీ అధ్యక్షుల పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్, రాహుల్గాంధీ అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా మౌనం పాటించడమేమిటని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇంటి ఎదుట ప్రతిపక్ష నేతలు ధర్నా చేస్తే అక్రమంగా అరెస్టులకు పాల్పడ్డారని, రాహుల్గాంధీని అక్రమ అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతును నొక్కేయాలనుకుంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని, రాహుల్గాంధీపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్పార్టీ విద్యార్థులు, పేదల పక్షాన గళం విప్పుతోందని, పేపర్ లీక్లతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న రాహుల్గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. అనంతరం రాజీవ్చౌక్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. కార్యక్రమంలో పుర వైస్ చైర్మన్ మధుసూదన్, పట్టణ అధ్యక్షుడు కదిరి రాములు, మండల అధ్యక్షుడు రవికిరణ్, గోపాల్పేట మండల అధ్యక్షుడు నరహరి, కాంగ్రెస్ నాయకులు లక్కాకుల సతీష్, ఆదిత్య, జానకిరాములు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల కృషితోనే మూడో స్థానం
కొత్తకోట రూరల్: ఉపాధ్యాయులు బోధనా విధానాలను మరింత మెరుగుపర్చుకుని జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. పెద్దమందడి మండలం బలిజపల్లి–జంగమాయపల్లి ఉన్నత పాఠశాలలో గణిత, ప్రాథమిక ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మూడురోజుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం రెండోరోజు శిక్షణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత విద్యాసంవత్సరంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమంపై నిర్వహించిన సర్వేలో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానం సాధించడం ఉపాధ్యాయుల అంకితభావం, కృషికి నిదర్శనమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తే జిల్లా మరింత మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం శిక్షణ తరగతులను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణ, అటల్ టింకరింగ్ ల్యాబ్, బడితోటలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. రెండోతరగతి ఎఫ్ఎల్ఎన్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడంపై ఉపాధ్యాయులను అభినందిస్తూ, ఇదే ఉత్సాహంతో మరింత కృషి చేసి ప్రథమ స్థానం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ అధికారి మహానంది, శిక్షణ ఆర్డీఓ రంజిత్రెడ్డి, మండల విద్యాధికారి ఎస్.మంజులత, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన కల్పించాలి
వనపర్తి: ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్తో కలిసి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలో గుడిసెలు, టార్పాలిన్ షెడ్లలో నివసిస్తున్న కుటుంబాలపై క్షేత్రస్థాయిలో మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం గుడిసెల్లో నివసించే వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. జిల్లాలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి సంబంధించి ఇప్పటికే గుర్తించిన 1,367 కుటుంబాల జాబితాపై ప్రభుత్వం రీ–సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినందున ఎంపీడీవోలు, వెరిఫికేషన్ అధికారులు ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అలాగే ఈ ఏడాది జిల్లాపై ఎల్నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రస్తుతం వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో రైతులతో సమావేశాలు నిర్వహించి, వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుములు, వేరుశనగ, కూరగాయలు తదితర పంటల సాగుపై అవగాహన కల్పించాలని కోరారు. అదేవిధంగా ఉద్యాన పంటలైన ఆయిల్పాం ఇతరాత్ర వాటిని కూడా ప్రోత్సహించాలన్నారు. రోజు కనీసం రెండు గ్రామాల్లో రైతు అవగాహన సమావేశాలు నిర్వహించాలని, వర్షాధార వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడకుండా రైతులను చైతన్యపర్చాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని ఓ సవాలుగా స్వీకరించి, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాధార పంటలు వేసి రైతులు నష్టపోకుండా వారిని అవగాహన కల్పించి రక్షించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, హౌసింగ్ పీడీ విఠోబా, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యానశాఖ అధికారి విజయభాస్కర్, పంచాయతీ అధికారి రఘునాథ్ రెడ్డి, మండల స్థాయిలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఏఓ లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు సమగ్ర సవరణ సామాజిక బాధ్యత
వనపర్తి రూరల్: రాజకీయ పార్టీలు బాధ్యతగా తీసుకొని సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అచ్చుతాపురం, రాజనగరంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ విధానాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. పట్టణ కేంద్రంలో 57 శాతం పూర్తయిందని.. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు అప్రమత్తమై ప్రతి ఇంటికి తిరుగుతూ అర్హులైన ఓటర్లను గుర్తించి తుది జాబితాలో పేరు ఉండేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో జాబితా సవరణ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. అనంతరం గ్రామంలోని మండల మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు సిలిమూర్తి చిట్టెమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. వారి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ శాంతయ్య, జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మాధవరెడ్డి, మండల అధ్యక్షులు మాణిక్యం, ధర్మానాయక్, డేగ మహేశ్వర్రెడ్డి, చిట్యాల రాము, శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఆగస్టు 15లోగా యూనిఫామ్స్ అందించాలి పాన్గల్: పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15లోపు యూనిఫామ్స్ అందించేలా దర్జీలు ప్రయత్నించాలని డీపీఎం నాగమల్లిక అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో యూనిఫామ్స్ వస్త్రాన్ని ఆమె పరిశీలించి అనంతరం ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈఓ ఆనంద్తో సమావేశమయ్యారు. మండలంలోని పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య, ఆయా గ్రామాల్లో యూనిఫామ్స్ కుట్టేందుకు అవసరమైన దర్జీలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ క్లాథ్ను పాఠశాలల వారీగా దర్జీలకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. దర్జీలకు అందజేసిన యూనిఫామ్స్పై సీసీలు పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కోరారు. ఐకేపీలో ఏపీఎం పోస్టును భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకరాగా డీఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీసీలు సువర్ణ, వసంత పాల్గొన్నారు. న్యాయ సేవలపై అవగాహన ఉండాలి వనపర్తి రూరల్: ఉచిత న్యాయ సేవలపై విదార్థులు అవగాహన కలిగి ఉండాలని డీసీఓ శ్రీవేణి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి కళార్చన ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని పెద్దగూడెం శివారులో ఉన్న కడుకుంట్ల ఎంజేపీ గురుకుల పాఠశాలలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్యతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. వాహనంపై ఏర్పాటు చేసిన తెరపై లఘు చిత్రాలను ప్రదర్శించి విద్యార్థులకు చట్టాలపై సులభంగా అవగాహన కల్పించారు. విద్యా హక్కుచట్టం, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, సైబర్క్రైమ్ చట్టాల గురించి వివరించారు. ఉచిత న్యాయ సేవలకు టోల్ఫీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ సభ్యులు పాల్గొన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్లో గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాకింగ్ వంటి పోస్టులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి విష్ణునందన్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్లో వచ్చే నెల14లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో శిక్షణ పొందిన వారు అనర్హులని, మరింత సమాచారం కోసం 74167 31371 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
వీడని మరమ్మత్తు
ఎంజీకేఎల్ఐలో ఐదేళ్ల క్రితం పాడైన పంపు మోటార్లు కొల్లాపూర్: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు– రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్ఐ) పథకం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 మోటార్ల ద్వారా ఏటా కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి.. కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ సాగు, తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం గల ఎత్తిపోతల పథకం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఐదేళ్ల క్రితం పాడైన రెండు మోటార్లు నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారు లు కాలయాపన చేస్తుండటంతో.. మిగతా మూడు మోటార్లతోనే నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో వాటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదీ పరిస్థితి.. కేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు పంప్హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి.. ఎల్లూరు, సింగోటం, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న చెరువులను నింపుతున్నారు. ఎల్లూరు పంప్హౌజ్లో నీటి ఎత్తిపోతల కోసం 5 మోటార్లను ఏర్పాటుచేశారు. వీటిలో రెండు మోటార్లు పాడయ్యాయి. ఐదేళ్ల క్రితం పంప్హౌజ్లోకి నీరు చేరుకోవడంతో ఒక మోటార్, రెండున్నర ఏళ్ల క్రితం మరో మోటార్ దెబ్బతింది. వీటికి మరమ్మతు చేపట్టడంలో ఆలస్యం అవుతుండటంతో మూడు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. వివిధ రకాల కారణాలతో సమస్య పరిష్కరించని అధికారులు ఎల్లూరు పంప్హౌజ్లో మూడు పంపులతోనే ఎత్తిపోతలు దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టుపై తీవ్రభారం తాజాగా వరదలు వచ్చే సీజన్ కావడంతో ఈసారి అదే పరిస్థితి పూర్తిగా నిలిపివేస్తేనే.. ప్రాజెక్టులో మోటార్ల మరమ్మతుకు పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ స్కీం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండటంతో రెగ్యులర్గా నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. దీంతో మోటార్ల మరమ్మతుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మోటార్లకు మరమ్మతు చేయాలంటే నీటి ఎత్తిపోతలు కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే.. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నిలిపివేసేందుకు వీలు ఏర్పడుతుంది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా ప్రారంభమయ్యే వరకు మోటార్లకు మరమ్మతు చేపట్టడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
అమరచింత (ఆత్మకూర్): ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు ముందుండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. ఆత్మకూర్లో కొత్తగా చేపడుతున్న లేఅవుట్లను బుధవారం ఆయన పరిశీలించి అనుమతులకు కావాల్సిన పత్రాలను తనిఖీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు, మిగిలిన అన్నిరకాల పత్రాలు సక్రమంగా ఉంటేనే అనుమతులిస్తామని చెప్పారు. అనంతరం స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న సోలార్ ప్లాంట్ పనులను పరిశీలించారు. పనుల పురోగతి, విద్యుదుత్పత్తి సామర్థ్యం, నిర్వహణ విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సోలార్ ప్లాంట్ను సకాలంలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. పుర, గ్రామపంచాయతీలోని పాత లేఅవుట్లతో పాటు కొత్త లేఅవుట్లలో పురపాలికకు చెందాల్సిన 10 శాతం స్థలాలను స్వాధీనం చేసుకొని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా స్థలాలు కబ్జాకు గురైనట్లు తెలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పుర కమిషనర్ నరేష్కుమార్కు సూచించారు. అభివృద్ధితో పాటు స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. -
ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
వనపర్తిటౌన్: జిల్లాలో ఓటు చోరీకి తావు లేకుండా సర్ ప్రక్రియ పారదర్శకంగా నమోదు చేయించాలని డీసీసీ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సర్ ప్రక్రియ పురోగతిపై పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.. సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి మండలాలు, గ్రామాల వారీగా నివేదికను పరిశీలిస్తూ మందకొడిగా నడుస్తున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆయా ప్రాంతంలో ఉన్న బీఎల్ఏ–2 క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ జూమ్ కాల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారని, గ్రామాల్లో, మండలాల్లో ఉంటూ సర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, పట్టణాధ్యక్షుడు కదిరె రాములు, ఇన్చార్జీలు కోళ్ల వెంకటేష్, శరవంద, విజయలక్ష్మి, బి.కృష్ణ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: తెలంగాణ ఓపెన్ స్కూల్స్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రవీందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ స్కూల్, దూర విద్య విధానం ద్వారా అందించే ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్లో ప్రవేశానికి ఈనెల 28 వరకు నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఫారాన్ని అప్లోడ్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయం, ww-w.telanganaope nschool.org వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. పెద్దమ్మ తల్లీ కరుణించమ్మా.. గోపాల్పేట: మండల కేంద్రంలో మంగళవారం పెద్దమ్మ బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకేరోజు పెద్దమ్మతల్లికి బోనమెత్తి కుటుంబసమేతంగా అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మొదట మహిళలు అందంగా అలంకరించిన కుండల్లో నైవేధ్యం తయారు చేసి, ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 25న లక్ష్మీచెన్నకేశవుడికి లక్ష పుష్పార్చన జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామికి ఆషాఢ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడుక కొనసాగుతుందన్నారు. అనంతరం 4 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన ఉంటుందన్నారు. తెల్లవారుజామన సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే వేడుక 6.30 గంటలకు పంచామృతాభిషేకం, 9 గంటలకు పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, సాయంత్రం 5 గంటలకు ప్రదోశ పూజ, రాత్రి 9 గంటలకు శయనోత్సవం జరిపించి మరుసటి రోజు ఆదివారం 7 గంటలకు స్వామికి సహస్రనామార్చన, 8 గంటలకు మహానివేదన చేస్తామన్నారు. -
బాలికల విద్యాభివృద్ధికి తోడ్పడాలి
వనపర్తి: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి, వారు ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందించడం అభినందనీయమని కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. గ్రామీణ భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థ (వీఐపీ) వ్యవస్థాపకులు నాగేంద్రస్వామి ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన బాలికలకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి మండలం నుంచి పదో తరగతి తెలుగు మాధ్యమంలో అత్యధిక మార్కులు సాధించిన 15 మంది విద్యార్థినులను సత్కరించి, ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు, మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రంజిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఖజానాకు గండి!
● పెబ్బేరు సంతలో నకిలీ రశీదుల కలకలం ● రూ 5.50 కోట్ల అక్రమ వసూళ్లు వనపర్తి రూరల్: పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని సంతలో టెండర్లు లేకుండానే కొందరు కాంట్రాక్టర్లు మున్సిపల్ కార్యాలయం పేర నకిలీ రశీదులతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ 5.50 కోట్ల మేర నష్టం వాటిల్లితుందన్నారు. ఈ మేరకు మంగళవారం వారు మున్సిపల్ కమిషనర్ గణేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కన్వీనర్ మండ్ల రాజు, బాలయ్య మాట్లాడుతూ.. 2025, జనవరి నుంచి 2026, జూలై వరకు మున్సిపాలిటీ తరఫున సంతకు ఎలాంటి టెండర్లు వేయలేదన్నారు. అయినప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు మున్సిపాలిటీ పేరుతో నకిలీ రశీదులను ముద్రించి, పురపాలక సంఘానికి ఎలాంటి సంబంధం లేకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వారానికి రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు వసూలు చేస్తున్నా.. ఆ సొమ్మును మన్సిపాలిటీకి గానీ, ప్రభుత్వానికి గాని చెల్లించకుండా కాంట్రాక్టర్లే కాజేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రకంగా ఇప్పటి వరకు సుమారు రూ.5.50 కోట్ల మేర అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు కనపడకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. వెంటనే స్పందించి అక్రమ వసూళ్లకు పాల్పడిన కాంట్రాక్టర్ల నుంచి సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని, నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటాం.. మున్సిపల్ కార్యాలయం పేరు మీద నకిలీ రశీదులు ముద్రించి పెబ్బేరు సంతలో దళారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మా దృషికి వచ్చింది. దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ వసూళ్లపై గతంలో స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. సంతకు సంబంధించిన భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున్న మేము ఏ చర్యలు తీసుకోలేకపోతున్నాం. – గణేష్ మున్సిపల్ కమిషనర్, పెబ్బేరు -
చిగురించి ‘ఆయిల్’ ఆశలు
నర్వ: దేశంలో నూనెగింజల ఉత్పత్తి తగ్గటం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం కారణంగా ప్రతిఏటా రూ.70 వేల కోట్ల ఆయిల్ను దిగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో డిమాండ్ మేర నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రారంభంలో ఆసక్తి చూపని రైతులు తదనంతరం ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో ముందుకు వస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం మార్కెట్లో టన్ను ఆయిల్పాం ధర రూ.24 వేల వరకు పలుకుతుండడంతో సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. మొదట్లో పైలెట్ ప్రాజెక్టుగా నారాయణపేట జిల్లాలో 2020–21 ఏడాది ప్రారంభంలో 430 ఎకరాలు మాత్రమే ఆయిల్పాం సాగు ప్రారంభించిన అధికారులు 2021లో జిల్లాకు 4.60 లక్షల మొక్కలు దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి 2025 వరకు ఉమ్మడి జిల్లాలో 33,999 ఎకరాల్లో విస్తరించగా.. నారాయణపేట జిల్లాలోనే 7 వేల ఎకరాల్లో ఆయిల్పాంను రైతులు సాగు చేస్తున్నారు. అయితే జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు గెలలను తరలిస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. గతేడాది జిల్లాలో ఆయిల్ఫెడ్ కార్పొరేషన్కు చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి రూ.300 కోట్లతో ఆయిల్పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించగా.. మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలం సేకరణలో భాగంగా దాదాపు 40 ఎకరాలు కేటాయింపు కొలిక్కివచ్చింది. కోస్గి, మక్తల్లో ఏర్పాటు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి సైతం సీఎం రేవంత్రెడ్డిని కోరడంతో ఆయిల్పాం రైతులకు ఆశలు రెట్టింపయ్యాయి. నారాయణపేట 6,907 వనపర్తి 6,400 30 కి.మీ., ఒకటి చొప్పున.. పంట కోత మొదలైనప్పటి నుంచి కొనుగోలు వరకు అయ్యే రవాణా ఖర్చులను ఆయిల్ఫెడ్ కార్పొరేషనే చెల్లిస్తోంది. ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున జిల్లాలో మక్తల్, మరికల్, మాగనూర్, కృష్ణా, నారాయణపేట, కోస్గి, మద్దూరు ప్రాంతాల్లో గెలల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగువిస్తీర్ణం ఇలా (ఎకరాలు).. ‘పేట’ జిల్లాలో మూడు చోట్ల పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు చిత్తనూర్ వద్ద ఆయిల్పాం నర్సరీ, పరిశ్రమకు భూమి కేటాయింపు స్థానికంగా విక్రయించుకుంటేనే రైతులకు ప్రయోజనం ఇన్నాళ్లు ఫ్యాక్టరీ లేకపోవడంతో గెలల విక్రయానికి అవస్థలు జోగుళాంబ గద్వాల 7,700 నాగర్కర్నూల్ 7,692 మహబూబ్నగర్ 5,300 -
14 ఎకరాలకు సరిపోయేలా..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు నర్సింహారెడ్డి. ఆత్మకూర్ మండలంలోని మూలమళ్ల గ్రామం. జూరాల ఆయకట్టు పరిధిలో ఈసారి 14 ఎకరాల్లో వరి పంటను సాగుచేసేందుకు అవసరమైన నారును సిద్ధం చేసుకుని, కరిగెట చేయించాడు. ఇప్పటికే రూ.లక్ష పైగా ఖర్చుతో సాగు పనులు పూర్తి చేసిన తర్వాత సాగునీరు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. ఎడమ కాల్వలో నీరు లేదని సమాంతర కాల్వ ద్వారా పైప్లైన్ వేసి నీరు తీసుకుందామనుకున్న కాల్వను మూసేశారని వాపోతున్నాడు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి వానాకాలంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని చెప్పుకొస్తున్నాడు. -
ఓటరు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతం
వనపర్తి రూరల్: పారదర్శక ఓటరు జాబితాతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అంజనగిరి, వెంకటాపురం గ్రామాల్లో జరుగుతున్న ఓటరు ఎన్యూమరేషన్ విధానాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం బీఎల్ఓలతో మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు. పార్టీ శ్రేణులు అప్రమత్తమై అర్హులైన ఓటర్లను తది జాబితాలో ఉండేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంజనగిరి ప్రాథమిక పాఠశాలను సందర్శించి తర గతి గదిలో ఉపాధ్యాయుడై విద్యార్థులకు పాఠాలు బోధించి, విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులంతా ప్రతిరో జు పాఠశాలకు హాజరు కావాలన్నారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు పృత్వీనాథ్ రెడ్డి, శాంతమ్మ మండల అధ్యక్షులు మానిక్యం, సింగిల్ విండో అధ్యక్షులు రాఘువర్దన్ రెడ్డి, ధర్మనాయక్, మాదవరెడ్డి, మహేశ్వర్ రెడ్డి,చిట్యాల రాము పాల్గొన్నారు. -
కరువు.. ఛాయలు
● సాగునీటి కోసంఅన్నదాత ఎదురుచూపు ● వర్షాలు కురవక నోరెళ్లబెట్టిన జలాశయం ● జిల్లాలో 85 వేల ఎకరాల ఆయకట్టుపై ప్రభావంప్రశ్నార్థకంగా మారుతున్న జూరాల ఆయకట్టు సాగు భూములు కోల్పోయిన వారికే సాగునీరు లేదు జూరాల ప్రాజెక్టు నిర్మాణంలో భూమలను కొల్పోయిన నందిమల్ళ, ములమళ్ళ గ్రామాల రైతులకు సాగునీరును ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సమాంతర కాల్వ పేరిట ప్రాజెక్టులో ఉన్న నీటిని ముందు మండలాలకు తరలించుకుని వెలుతున్న పట్టించుకునే పాలకులే కరువయ్యారు. నీటి తరలింపు వ్యవహరంలో తమ రైతుల పొట్టకొట్టి వ్యవసాయంకు దురం చేస్తున్నారు. – భాస్కర్రెడ్డి, రైతు, నందిమళ్ల అమరచింత: ప్రస్తుత ఖరీప్ సాగుపై అన్నదాతల్లో ఆందోళన మొదలయింది. వానాకాలం సీజన్ అర్ధభాగం ముగిసినా ఇప్పటికీ జలాశయాలు నోరెళ్లబెట్టి ఉన్నాయి. మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది జూరాల ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపరించాయి. ఆరుద్ర కార్తీ నాటికి వరి నాడుమడులు సిద్ధం చేసుకుని వరినాట్లను వేసుకునే పనుల్లో నిమగ్నమయ్యే ఆయకట్టు రైతులు నేడు సాగునీటి కోసం కళ్లలో ఒత్తులు పెట్టుకుని మేఘాల వైపు ఆశగా చూసే దుస్థితి నెలకొంది. ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వానాకాలంలో పంటలకు సాగునీరు అందని దాఖలాలు లేవని అన్నదాతలు అంటున్నారు. జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో 1.20 లక్షల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించి, యాసంగి సాగులో మాత్రం కొంత ఆయకట్టుకు కోతలు విధించేవారు. వారాబందీ పద్ధతిలో.. పదేళ్లుగా ప్రాజెక్టు అధికారులు సాగునీటి విడుదల విషయంలో పొదుపు చర్యలు పాటిస్తూ.. వారబందీ విధానం ప్రవేశపెట్టి వారంలో కేవలం 4 రోజులు మాత్రం నీరు ఆయకట్టుకు వదిలేవారు. మూడేళ్లుగా ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గుతుండటంతో ఎడమ కాల్వ పరిధిలో 20 వేల ఎకరాలు, కుడికాల్వ పరిధిలో 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించి మిగిలిన ఆయకట్టుకు క్రాప్ హలీడే ప్రకటించేవారు. గత యాసంగిలో సైతం కుడి, ఎడమ కాల్వల పరిధిలో 35 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని వదిలారు. -
అర్ధరాత్రి 12.30 దాటిన తర్వాతే..
ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రికి చెందిన ఓ అధికారిక రీచ్తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కృష్ణా పరివాహకంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి కూటమి నేతల సహకారంతో ఆయా ప్రాంతాల నుంచి అక్రమార్కులు ఇసుక వాహనాలను కర్నూలు మీదుగా జాతీయ రహదారి మార్గంలో గద్వాల జిల్లా పుల్లూరు టోల్ప్లాజా గుండా సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రాత్రివేళల్లో నిత్యం 50 నుంచి 60 వరకు బెంజ్ వాహనాల్లో ఇసుక రవాణా కొనసాగుతుండగా.. ఇందులో అధికంగా 16 టైర్ల లారీల్లోనే తరలిస్తున్నారు. ఏపీలో ఉచిత ఇసుక నేపథ్యంలో అక్కడ ఒక లారీ లేదా బెంజ్ లోడ్కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. చౌకగా లభిస్తుండడంతో ఇసుక మాఫియా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి దూరాన్ని బట్టి టన్నుకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా 16 టైర్ల బెంజ్ ఇసుక (47 టన్నులు.. అయితే పరిమితి మించి అదనంగా 25 నుంచి 30 టన్నుల వరకు వేస్తారు)ను కనిష్టంగా రూ.84 వేలు, గరిష్టంగా రూ.లక్ష వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్ర సరిహద్దు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం టైరోడ్డు సమీపంలోని ఓ ఆశ్రమం వద్ద కృష్ణానది పరివాహకంలో గతేడాది ఇసుక మాఫియా ఆధ్వర్యంలో నదిలో సుమారు ఆరు కి.మీ.ల మేర మట్టి రోడ్డు వేశారు. ప్రస్తుతం దీన్ని వదిలేసిన ఇసుకాసురులు వాసునగర్ వద్ద రెండు, ముడుమాల్ వద్ద ఒకటి మొత్తంగా మూడు చోట్ల నదికి అడ్డంగా మట్టి రోడ్లు వేసి దందా కొనసాగిస్తున్నారు. వరద వచ్చినప్పడు నీరు సజావుగా వెళ్లేలా సిమెంట్ పైపులతో తూములు ఏర్పాటు చేశారు. నది ప్రవహిస్తున్న క్రమంలో తప్పితే మిగతా రోజుల్లో ఆయా ప్రాంతాల్లో జేసీబీ, హిటాచీలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పగలు నది నుంచి ఇసుకను తోడి సమీప పొలాల్లో డంప్ చేయడం.. రాత్రి 8 గంటల తర్వాత ఆయా ప్రాంతాల నుంచి కర్ణాటకకు చెందిన 12 చక్రాల బెంజ్ వాహనాల్లో యాద్గిరి, సైదాపూర్, గుల్బర్గా వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో బెంజ్ ఇసుకను దూరాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక దందాతో వేసిన పంటకు నీరందించే పైపులైన్లు దెబ్బతింటున్నాయని రైతులు ప్రశ్నించగా.. వారిపై మాఫియా దాడులకు పూనుకుంటోంది. మూడుమాల్కు చెందిన ఓ రైతుపై 8 నెలల క్రితం దాడులకు తెగబడింది. దీంతోపాటు ప్రశ్నించిన పలువురిని బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. దీనిపై కృష్ణా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. అడ్డొస్తే చంపేస్తామని దందా నిర్వాహకులు బెదిరించడంతో ఓ పార్టీకి చెందిన వ్యక్తి ఈ విషయాన్ని నారాయణపేట జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన కరువైందని తెలుస్తోంది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ యదవేంద్రస్వామి ఆలయం పక్కన నదిలో నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు నారాయణపేట జిల్లా కృష్ణ్ణా మండలంలోని ముడుమాల్ జెడ్పీహెచ్ఎస్ బ్యాక్ సైడ్లో కృష్ణానదిలోకి వేసిన రోడ్డు మక్తల్ నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో కర్ణాటక బార్డర్లో కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి పలువురు ఇసుకదందా నిర్వహిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కృష్ణా మండలంలో గతంలో ఇసుక అక్రమాల్లో చక్రం తిప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన ఓ వ్యక్తి, ఓ బంధువు, మరికొందరు అనుచరుల ద్వారా ఇసుక లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక రవాణా అటు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కర్నూలుకు చెందిన ఓ నేత, తెలంగాణలోని అలంపూర్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అయిన ముఖ్యనేత కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక రవాణాలో ఆటంకాలు కలగకుండా మాఫియా జాగ్రత్తలు తీసుకుంటోంది. అర్ధరాత్రి పోలీసుల గస్తీ, వాహనాల రద్దీ నామమాత్రమే కావడంతో 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఇసుక లోడ్ వాహనాలను పుల్లూరు టోల్ప్లాజా దాటిస్తోంది. వాహనాలు బయలుదేరే పది నిమిషాల ముందు ఓ ఎస్కార్ట్ కారు వెళ్లి ఆయా ప్రాంతాల్లో పోలీసుల పహారాపై ముందస్తు సమాచారమిచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్హెచ్ వెంట పోలీస్స్టేషన్లు ఉన్నా.. ఇసుకాసురులు తమ పని కానిచ్చేస్తున్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 17 వినతులు : ఎస్పీ
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది వినతులు అందజేశారు. ఎస్పీ సునీతారెడ్డి ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వినతులపై చట్టబద్ధంగా, పారదర్శకంగా, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాకుండా వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రజావాణి ఉద్దేశమన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండాలి వనపర్తి రూరల్: అర్హులైన ఓటర్లందరి పేర్లు తుది జాబితాలో కచ్చితంగా ఉండేవిధంగా బీఎల్వోలు కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. సోమవారం పెద్దగూడెం, రాజాపేట, ఆర్.తండా, కడుకుంట్ల, పెద్దగూడెంతండా, కిష్టగిరి, నాచహళ్లి, సవాయిగూడెం గ్రామాల్లో కొనసాగుతున్న సర్ ప్రక్రియను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి బీఎల్వోలకు పలు సూచనలు చేశారు. సర్ ప్రక్రియను ఇంటింటికి చేరవేసి విజయవంతం చేయాలని సూచించారు. బీఎల్వోలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు తప్పులు లేకుండా నింపి తిరిగి అందజేసి ఓటును కాపాడుకోవాలన్నారు. ఓటరు జాబి తా అత్యంత పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలన్నారు. బీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్యం, సింగిల్విండో అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, సర్పంచ్లు ఎల్లయ్య, తిరుపతయ్య, పద్మ, మాజీ సర్పంచ్లు మాధవ రెడ్డి, ధర్మానాయక్, నాయకులు పాల్గొన్నారు. అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు వనపర్తి రూరల్: పెబ్బేరు బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జయచంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 2, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 4, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ 3, ఇంగ్లీష్ 1, మాథ్స్ 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1 ఖాళీలు ఉన్నాయని.. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్, బీటెక్, పీహెచ్డీ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. అనుభవం, అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, సంబంధిత ధ్రువపత్రాలతో 23వ తేదీ సాయంత్రం 4లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని వివరించారు. 24న నిర్వహించే మౌఖిక పరీక్షకు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోల తో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు సెల్నంబర్ 80969 07523 సంప్రదించాలన్నారు.జీఓనంబర్ 12 రద్దు చేయాలి : సీఐటీయూ వనపర్తి రూరల్: జీఓనంబర్ 12, కార్మికులకు నిర్వహిస్తున్న సీఎస్సీ ఆరోగ్య పరీక్షలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలంటూ సోమవారం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో కార్మికులు జిల్లాకేంద్రంలోని మర్రికుంట నుంచి కలెక్టరేట్కు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గేటు ఎదుట ఆందోళన చేపట్టి రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మదన్, కార్యదర్శులు బొబ్బిలి నిక్సన్ పాల్గొని మాట్లాడారు. కార్మికులకు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అందించాలని, ఇన్స్యూరెన్స్ కంపెనీలకు నిధులను మళ్లించరాదని డిమాండ్ చేశారు. చిన్న వెంకటయ్య, రామచంద్రయ్యగౌడ్, రాబర్ట్, బాలస్వామి, పుల్లయ్య, ఆశన్న శాంతన్న, కురుమూర్తి, యాదగిరి, రాజు, స్వామి పాల్గొన్నారు. -
సర్ సా..గుతోంది!
● జిల్లాకేంద్రంలో నెమ్మదించిన ప్రక్రియ ● వలస ఓటర్లపై అధికారుల ప్రత్యేక దృష్టి ● సమీపిస్తున్న గడువు.. బీఎల్వోలపై పెరుగుతున్న ఒత్తిడి ●అర్హులందరూ తమ ఓటుహక్కు కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎన్యూమరేషన్ ఫార్యాలను తప్పులు లేకుండా ప్రస్తుత వివరాలు, ఫొటోతో పూరించి నిర్దేశిత గడువులోగా బీఎల్వోలకు అందజేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పదిరోజుల గడువు పొడిగించింది. మరోసారి పెంచే అవకాశం చాలా తక్కువ. ఓటర్లంతా త్వరపడి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. – సుబ్రమణ్యం, ఆర్డీఓ, వనపర్తి వనపర్తి: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో బీఎల్వోలు, అధికారులకు క్షేత్రస్థాయిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో గడువు పదిరోజులు పొడిగించినా.. సరిపోతుందా అనే సందిగ్ధం అధికారులు, ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నాయి. ఆర్డీఓ నిత్యం పోలింగ్స్టేషన్ల వారీగా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడెక్కడ నెమ్మదించిందో తెలుసుకుని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 12 మండలాలు.. 316 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,75,570 మంది ఓటర్లు ఉండగా, అందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నా.. చాలామందికి ఫారాలు చేరలేదు. కొందరు బీఎల్వోల ఇంటికెళ్లి ఫారాలు తెచ్చుకుని తమ ఓటుహక్కును కాపాడుకునే ప్రయత్నం చేసిన వారిలో అక్షరాస్యులు, నిరక్షర్యాసులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉన్నారు. మండలం ఓటర్లు పూర్తయిన శాతం వనపర్తి 32,496 72.44 ఏదుల 9,587 76.79 రేవల్లి 13,258 78.31 పెద్దమందడి 32,142 79.04 గోపాల్పేట 27,321 79.33 పెబ్బేరు 27,999 80.90 శ్రీరంగాపురం 16,451 81.70 అడ్డాకుల 3,959 83.78 ఖిల్లాఘనపురం 33,496 86.32 మూసాపేట 1355 91.00 పురపాలికలు.. వనపర్తి 63,246 53.12 పెబ్బేరు 14,260 65.29 జిల్లాలో ఇప్పటి వరకు 72.88 శాతమే పూర్తి సోమవారం ఉదయం పది వరకు 72.88 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు అధికారిక లెక్క. మరో 14 రోజుల్లో 26.22 శాతం పూర్తి చేయాల్సి ఉంది. వివిధ రాజకీయ పార్టీలు సైతం పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్ఏలను నియమించుకొని ఓటర్లకు సాయం చేస్తూ వారి ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి బీఎల్వోలకు అందజేస్తున్నారు. అయినా ప్రక్రియ నెమ్మదిగానే సాగుతుండటం గమనార్హం. తెలంగాణాలో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువును ఆగస్టు 4 వరకు పొడిగించారు. అయినా ఇచ్చిన గడువు సరిపోతుందా లేదా అనే సందేహంలో బీఎల్వోలు ఉన్నారు. గడువు దగ్గర పడుతున్నా కొద్ది వారిపై వత్తిడి పెరుగుతోంది. -
‘ప్రజావాణి’ అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు
● రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ వనపర్తి/వనపర్తిరూరల్: ప్రజావాణి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు మొత్తం 61 అర్జీలు దాఖలయ్యాయి. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి రెండు అర్జీలు రాగా.. పరిష్కారం కోసం ఆర్డీఓ అధికారులకు సిఫారస్ చేశారు. -
‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ వ్యతిరేకం’
అమరచింత: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సృజన ఆరోపించారు. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా మూడో మహాసభలు సోమవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సంఘం జెండాను ఎగురవేసి మాట్లాడారు. డీలిమిటేషన్ లింకుతో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడాన్ని పూర్తిగా వ్యతిరేస్తున్నామన్నారు. బిల్లు అమలు బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టం చేశారు. దేశంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు, ధౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. మహిళలు లేనిదే దేశంలో ఏ కార్యక్రమం లేదని.. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై ఆ పార్టీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్, వనపర్తి జిల్లా అధ్యక్షులు పద్మ, కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి సీత మ్మ, నాయకులు జయమ్మ, కళావతమ్మ, పద్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మండల కార్యదర్శి అబ్రహం, పట్టణ కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు. -
డిప్యుటేషన్ రద్దు చేయాలి..
ఆరేళ్ల కిందట కాంట్రాక్టు పద్ధతిన గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు క్రాఫ్ట్, ిపీఈటీ ఉపాధ్యాయులను నియమించారు. కాగా డిప్యూటేషన్పై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ప్రస్తుత విద్యాసంవత్సరంలో తిరిగి పాఠశాలలో చేరాల్సి ఉండగా రాలేదు. ఇక్కడ పనిచేయకుండా వేతనాలు పొందుతున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు క్రాఫ్ట్, క్రీడల్లో వెనకబడుతున్నారు. ఆయా ఉపాధ్యాయులను స్కూల్కు పంపించాలని అర్జీ దాఖలు చేశాం. – విద్యార్థుల తల్లిదండ్రులు, వై శాగాపూర్, పెబ్బేరు -
అభివృద్ధిపై అరోపణలు అర్థ రహితం
అమరచింత: నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుంటే.. అభివృద్ధి ఎక్కడంటూ బీఆర్ఎస్ నాయకులు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని, ఇది సరికాదని రాష్ట్ర గీత పారిశ్రామిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజ్గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంత్రి వాకిటి శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 14 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురాని చేతగాని పాలన చేశారని.. కాంగ్రెస్ హయంలో జరుగుతున్న అభివృద్ధికి చూడలేకపోతున్నారని విమర్శించారు. అమరచింత మండలానికి ఇప్పటి వరకు రూ.124.95 కోట్లు మంజూరు చేశామని.. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులే నిదర్శనమన్నారు. ఆత్మకూర్కు రూ.248.02 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. ఎత్తిపోతల పథకాలను విస్మరించడంతో అవి మరుగునపడి రైతులకు సాగునీరు కరువైన పరిస్థితులు బీఆర్ఎస్ పాలనలో కొనసాగాయని ఆరోపించారు. లిఫ్ట్ల మరమ్మతుతో పాటు ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతుంటే కేవలం లబ్ధి కోసం నీచ రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. మరుగునపడ్డ చంద్రగఢ్ లిఫ్ట్ను వినియోగంలోకి తీసుకొస్తున్నామని, ఆత్మ కూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన పనులు కొనసాగుతున్నాయని వివరించారు. హద్దు మీరితే చర్యలు తప్పవు.. పార్టీలో ఉంటూ ఎవరైనా అక్రమాలకు పాల్పడటం, రౌడీయిజం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని నాగరాజుగౌడ్ హెచ్చరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ జింక సువర్ణ రవి, కాంగ్రెస్పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు రవికాంత్, రాజేందర్రెడ్డి, డీసీసీ కార్యదర్శి రమేష్ ముదిరాజ్, పార్టీ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్కుమార్, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పౌల్ట్రీ ఫాంపై ఈగల్ బృందం దాడులు
● రూ.20 లక్షల విలువచేసే 1.150 కిలోల ఆల్ఫాజోలం సీజ్ ● ఆల్ఫాజోలం డాన్తోపాటు మరో ముగ్గురి అరెస్టు మహబూబ్నగర్ క్రైం: గతంలో ఆల్ఫాజోలం తయారు చేసి పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు.. అయినా అతనిలో మార్పు రాకపోగా.. మళ్లీ అదే పద్ధతిని ఎంచుకొని ఆల్ఫాజోలం తయారు చేస్తూ.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని తుంకినీపూర్ గ్రామానికి చెందిన ఎం.జయప్రకాష్గౌడ్, అదే గ్రామానికి చెందిన బాల ఆంజనేయులు ఇద్దరూ కలిసి అన్నాసాగర్ గ్రామ శివారులో బోయ నర్సింహులు అనే వ్యక్తి దగ్గర నెల రోజుల కిందట లక్ష్మీనర్సింహ పౌల్ట్రీ ఫాంను అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత పౌల్ట్రీ ఫాంలో రూ.40 లక్షల విలువ చేసే మిషన్ ఏర్పాటు చేసి.. ఆల్ఫాజోలం తయారు చేయడానికి రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్ సమకూర్చారు. అనంతరం వికారాబాద్కు చెందిన కృష్ణయ్యగౌడ్తో కలిసి జయప్రకాష్గౌడ్ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ ఈగల్ పోలీస్ బృందం ఆదివారం మధ్యాహ్నం ఆకస్మిక దాడులు చేసి.. రూ.20.30 లక్షల విలువ చేసే 1.150 కిలోల ఆల్ఫాజోలంతోపాటు మరో రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్ను సీజ్ చేశారు. అలాగే ఆల్ఫాజోలం సూత్రధారి జయప్రకాష్గౌడ్తోపాటు కృష్ణయ్యగౌడ్, బాలాంజనేయులు, నర్సింహులును సైతం ఈగల్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించింది. బీటెక్ చదివి.. తుంకినీపూర్కు చెందిన జయప్రకాష్గౌడ్ బీటెక్ చదువు మధ్యలో వదిలేశాడు. మొదట్లో వీఆర్ఐగా కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైస్కూల్ ఏర్పాటు చేసి దాదాపు తొమ్మిదేళ్లు నడిపాడు. ఇదే సమయంలో ఓ వ్యక్తితో ఆల్ఫాజోలం తయారు చేసే ఫార్ములాను నేర్చుకున్నాడు. ఆ తర్వాత స్వయంగా అతను నిర్వహిస్తున్న పాఠశాలను అడ్డాగా చేసుకొని ఆల్ఫాజోలం తయారు చేయడం మొదలుపెట్టాడు. పాఠశాలలో అయితే ఎవరికి అనుమానం రాదని భావించి అక్కడే రెండు గదుల్లో ఈ దందా సాగించాడు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 13న ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అతని నుంచి 8 కిలోల ఆల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన జయప్రకాష్గౌడ్ మళ్లీ ఈ ఏడాది మార్చి 16న జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి మకాం మార్చాడు. మూడు రోజుల నుంచి తనిఖీలు హైదరాబాద్కు చెందిన ఈగల్ ఫోర్స్ బృందాలు మూడు రోజుల నుంచి అన్నాసాగర్ శివారులో ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. చివరికి ఆదివారం ఆరు కారులలో దాదాపు 20 మంది ఈగల్ ఫోర్స్ పోలీసులు స్థావరంపై ఆకస్మిక దాడులు చేసింది. ఆల్ఫాజోలం తయారీలో మంచి పట్టుసాధించిన జయప్రకాష్గౌడ్ రెండేళ్ల వ్యవధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాలకు సుపరిచితుడిగా మారాడు. అతను తయారు చేసిన ఆల్ఫాజోలం ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు కల్లు దుకాణాలకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. వీటిని సరఫరా చేయడానికి స్థానికంగా మంచి నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సైతం ప్రత్యేకంగా కొందరిని ఏర్పాటు చేసుకొని కల్లు దుకాణాలకు వీటిని సరఫరా చేసినట్లు తెలుస్తోంది. -
22న కార్గో పార్సళ్ల బహిరంగ వేలం
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని బస్టాండ్లో ఉన్న ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ విభాగంలో చాలా రోజులుగా తీసుకెళ్లని పార్సళ్లకు ఈ నెల 22న ఉదయం 11 గంటలకు డిపో ఆవరణలో వేలం నిర్వహిస్తున్నామని డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్, ఆటోమొబైల్స్ స్పేర్స్, క్లాథ్ బ్యాగ్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులు ఉన్నాయని.. ఆసక్తి గల వ్యాపారులు, పట్టణవాసులు వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్నంబర్ 91542 98609 సంప్రదించాలని సూచించారు. ‘సర్’ ప్రక్రియకు సహకరించాలి వీపనగండ్ల: గ్రామాల్లోని ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు సకాలంలో అందజేయాలని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ కోరారు. ఆదివారం మండలంలోని కల్వరాలలో ఇల్లిల్లూ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించారు. అర్హులైన ఓటర్లు బాధ్యతగా వ్యవహరించి తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు బీఎల్వోలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిరక్షరాస్యులు ఎన్యూమరేషన్ ఫారాలు పూరించేందుకు గ్రామాల్లోని బీఎల్ఏల సహకారం తీసుకోవాలని, వలస ఓటర్లు తమ ఓటు హక్కును నిలుపుకోవాలని ఆయన కోరారు. స్వీపర్లపై వేధింపులు ఆపాలి : ఏఐటీయూసీ వనపర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్టైం స్వీపర్లు, స్కావెంజర్లపై వేధింపులు ఆపాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు మోషా డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన స్వీపర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వీపర్లకు తక్కువ వేతనం చెల్లిస్తూ ఎక్కువ పని చేయిస్తున్నారని.. ఉపాధి కూలీలకు రోజుకు రూ.307 ఇస్తుంటే వీరికి మాత్రం రూ.170 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. అరకొర వేతనానికి రోజంతా పాఠశాలల్లోనే ఉంచి వెట్టిచాకిరీ చేయించుకోవడం అన్యాయమన్నారు. ఉదయాన్నే పాఠశాల ఊడ్చడం, తాగునీరు అందించడం మాత్రమే స్వీపర్ల పనని.. గతంలో ప్రభుత్వం మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా స్కావెంజర్లను నియమించి తర్వాత తొలగించిందని తెలిపారు. ముఖ్యంగా కొత్తకోట మండలంలో వేధింపులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 30న పెబ్బేరులో జరగబోయే ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, నేతలు గోపాల్గౌడ్, మాలిక్, శోభారాణి, చంద్రమ్మ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. టూడేలీగ్లో విజేతగా నిలవాలి మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లో సోమవారం నుంచి జరిగే హెచ్సీఏ బీ–డివిజన్ టూడేలీగ్ చాంపియన్షిప్లో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. హెచ్సీఏ టూడేలీగ్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఆదివారం స్థానిక పిల్లలమర్రి రోడ్డులోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో రాజశేఖర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూడేలీగ్లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రదర్శన చాటాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమష్టిగా, ఏకాగ్రతతో ఆడితే విజయం సాధించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రానున్న రోజుల్లో రంజీ, భారతజట్టుకు ఆడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు. టూడే లీగ్ గ్రూప్–సీలో సోమవారం మహబూబ్నగర్ జిల్లా జట్టు తన తొలి మ్యాచ్లో చేతన్ ఆనంద్ సీఏ జట్టుతో తలపడనుంది. ఉమ్మడి జిల్లా జట్టు ఇదే.. ఎ.శ్రీకాంత్– కెప్టెన్ (మహబూబ్నగర్), సంజయ్ (నాగర్కర్నూల్), అభిలాష్గౌడ్ (నారాయణపేట), వర్షిత్రెడ్డి, కేతన్ (జడ్చర్ల), ఎన్.జశ్వంత్ (నాగర్కర్నూల్), శశాంక్ (మహబూబ్నగర్), జి.జశ్వంత్ (నాగర్కర్నూల్), ముఖిత్ (మహబూబ్నగర్), గగన్ (నాగర్కర్నూల్), వెంకట్సాగర్ (గద్వాల), సాయి ప్రమోద్, అరవింద్, అద్నాన్ (మహబూబ్నగర్), విగ్నేష్ (జడ్చర్ల), కేతేశ్వర్ (నాగర్కర్నూల్), అఖిల్ (వనపర్తి), హర్షిత్ (జడ్చర్ల) ఉన్నారు. -
గుర్తింపు పొందిన దుకాణాల్లో కొనుగోలు చేయాలి..
పీఏసీఎస్లు, రైతు ఆగ్రో సేవాకేంద్రాలు, హాకా సెంటర్లు, ఫర్టిలైజర్ దుకాణాల్లో మాత్రమే ఎరువులు, విత్తనాలు అధికారికంగా సరఫరా చేస్తారు. ఈ–పాస్ యంత్రం సాయంతో పంపిణీ ఉంటుంది. అనధికారిక ఎరువులు, విత్తనాలను రైతులు విశ్వసించొద్దు. అపరిచితుల వద్ద ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయొద్దు. చిన్నంబావిలో పట్టుబడిన డీఏపీ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించాం. నివేదికలు వచ్చాక వివరాలు వెల్లడిస్తాం. అక్రమ విక్రయాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ● -
రైతుల సంక్షేమమే బలమైన పునాది
వనపర్తిటౌన్: రైతుల సంక్షేమం, అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ధనలక్ష్మి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ, రైతుబీమా, రైతు భరోసా అందిస్తూ అండగా నిలుస్తుందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధిలో రైస్మిల్లర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని.. రైతులు, వ్యాపారులు, వినియోగదారుల మధ్య వారధిగా నిలవాలని కోరారు. రైతులు పండించిన ధాన్యానికి విలువను జోడించి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడం రైస్మిల్లర్ల గొప్ప సేవ అని కొనియాడారు. జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు రైస్మిల్లర్ల సహకారం ఎంతో అవసరమని, ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ధనలక్ష్మిని అధ్యక్షురాలి కుర్చిలో కూర్చొబెట్టి సన్మానించారు. కార్యక్రమంలో కార్యవర్గసభ్యులు, రైస్మిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఫర్టిలైజర్ దుకాణం
వనపర్తి: నకిలీ ఎరువులు, విత్తనాల కట్టడికి వ్యవసాయ, పోలీసు శాఖలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కులు కొత్తదారులు వెదుక్కుంటున్నారు. మొన్న సూర్యాపేట.. నిన్న హైదరాబాద్.. నేడు వనపర్తి జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కాగా.. ఫర్టిలైజర్ డీలర్లే అక్రమ దందాకు సూత్రదారులని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందాకు బీజం పడినట్లు అఽధికారులు భావిస్తున్నారు. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకొని అక్రమార్జనే లక్ష్యంగా ఈ దందాకు తెర తీశారు. జిల్లాలోని చిన్నంబావి మండలంలో ఏటా వర్షాకాలంలో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తారు. ఓ కంపెనీకి చెందిన డీఏపీ వాడితే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు మొక్కజొన్న విత్తేందుకు సిద్ధం చేసుకున్నారు. డీఏపీ కొరత తలెత్తడంతో వెల్టూరుకు చెందిన ఓ వ్యక్తిని ఆశ్రయించారు. ఆయన రైతులకేదో మేలు చేసినట్లుగా తనకు పరిచయం ఉన్న పెబ్బేరు మండలం గుమ్మడంకు చెందిన ఒక డీలర్, గద్వాలకు చెందిన వంశీధర్రెడ్డి అనే మరో డీలర్లతో సంప్రదింపులు జరిపారు. గద్వాల డీలర్ హైదరాబాద్ ఆటోనగర్ నుంచి గద్వాలకు చెందిన డీసీఎంలో 200 బస్తాల అదె కంపెనీకి చెందిన డీఏపీని వెల్టూరుకు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. రైతులు వీరన్నగౌడ్ 60 బస్తాలు, ప్రవీణ్కు 20 బస్తాలు దించుకున్నారు. మార్కెట్లో కొరత కారణంగా ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1,350 ఉండగా రూ.1,550కి విక్రయించేందుకు ప్రయత్నించారు. ధర ఎక్కువగా ఉంది.. నాణ్యత ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆయా రైతులు వ్యవసాయశాఖ అఽధికారులను అడిగే ప్రయత్నం చేశారు. తమకు తెలియకుండా మండలానికి డీఏపీ రావడం ఏమిటని ఏఓ డాకేశ్వర్గౌడ్ వెల్టూరుకు వెళ్లి చూడగా అక్కడ గద్వాలకు చెందిన డీసీఎం డ్రైవర్ పరశురాముడు డీఏపీ విక్రయిస్తూ కనిపించాడు. వే బిల్స్, ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపించాలని ప్రశ్నించగా.. గద్వాలకు చెందిన వంశీధర్రెడ్డి సూచన మేరకు హైదరాబాద్లో లోడ్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినట్లు వివరించారు. ఏఓ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి 120 బస్తాల డీఏపీతో పాటు డీసీఎంను పోలీస్స్టేషన్కు తరలించారు. ఏఓ ఫిర్యాదు మేరకు ఛీటింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పట్టుబడిన డీఏపీ నకిలీదా, అసలుదా పరీక్షించేందుకు ల్యాబ్కు పంపించనున్నట్లు అధికారులు చెప్పారు. రైతులు డీఏపీ నాణ్యత కోసం చేసిన ప్రయత్నం ఓ పెద్ద అక్రమార్కుల ముఠా గుట్టును రట్టుచేసినట్లు అయింది. నకిలీ డీఏపీరాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం, మండలంలో నకిలీ ఎరువుల విక్రయాల గుట్టురట్టు కావడంపై ఆయన సీరియస్గా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదవుతున్న నకిలీ డీఏపీ ఘటనలపై ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొరతను ఆసరాగా చేసుకొని అక్రమార్జనే ధ్యేయంగా.. స్థానికులను మచ్చిక చేసుకొని ఇద్దరు డీలర్ల రహస్య దందా నాణ్యతన పరిశీలనకు అధికారులను పిలవడంతో విషయం వెలుగులోకి.. -
పీయూలో విద్యార్థుల నిరసన
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ సెమినార్ను యూనివర్సిటీలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పీయూ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పీయూ ఫార్మసీ కళాశాల హాస్టల్ వద్ద మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. యూనివర్సిటీకే తలమానికంగా నిలిచే నేషనల్ సెమినార్ను హైదరాబాద్లో నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. అధికారులు మొండిపట్టు వీడి యూనివర్సిటీలోనే కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీఎం ఉషా ద్వారా రూ.100 కోట్లు విడుదలైతే వాటికి సంబంధించిన నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాలేదని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే అధికారులు కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు నిర్ణయం మార్చుకోకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. -
ప్రాజెక్టుల సాధనకు సమష్టిగా కృషి
● అసంపూర్తి పనులు పూర్తిచేస్తే బీడు భూములు సస్యశ్యామలం ● విస్తృత స్థాయి రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లాలోని బీడు భూముల సాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేసిందని, ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లుగా హంగామా చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తే బీడు భూములను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ పాలమూరు వలసల జిల్లా, వెనకబడిన ప్రాంతంగా ఉండేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కనీసం రూ.30 వేల కోట్లు కావాలన్నారు. నిజాలను నిర్భయంగా చెప్పాలని, నిజాయితీగా మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జేఏసీ నాయకులకు సూచించారు. కృష్ణానది నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కలిసి చర్చలు జరిపితేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ జిల్లా ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాటం చేద్దామని అన్నారు. జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు ఉండగా ఇప్పుడు 6, 7 టీఎంసీల నీరు కూడా లేదని, పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు సాయిబాబా, షేక్ ఫరూఖ్ హుస్సేన్, బెక్కెం జనార్దన్, వీరబ్రహ్మచారి, జగపతిరావు, ప్రవీణ్కుమార్, రమేష్రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పంటమార్పిడిపై విస్తృత అవగాహన
వనపర్తి: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వర్షాధార సాగుపై ఆధారపడే రైతులు నష్టాల పాలుకాకుండా పంట మార్పిడీపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉద్యాన అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించాలని.. కేవలం వరి సాగుకే పరిమితం కాకుండా భూభాగం, నేల స్వభావం, నీటి లభ్యత ఆధారంగా కూరగాయలు, ఉల్లి, మినుము, కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. ఆయా ప్రాంతాలకు అనుకూలమైన, లాభదాయకమైన పంటల సాగు వైపు మళ్లించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఉద్యాన అధికారులు ఆయిల్పాం సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి అధికారి సాగు లక్ష్యాలను నిర్దేశించుకొని తప్పనిసరిగా సాధించాలన్నారు. రాబోయే 15 రోజులు వ్యవసాయ, ఉద్యాన అధికారులు సెలవులు లేకుండా పూర్తిస్థాయిలో గ్రామాల్లో పర్యటిస్తూ రైతులను చైతన్యపర్చాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, ప్రి–యూనిక్ సంస్థ సీపీఓ సింగారెడ్డి, ఏఓలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
దోమల నివారణకు చర్యలు ముమ్మరం
వనపర్తి: వర్షాకాలంలో దోమల నివారణ, పారిశుద్ధ్య చర్యలను మరింత ముమ్మరం చేసి ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పుర పరిధిలోని 2వ వార్డు కమలానగర్లో పర్యటించి డ్రై డే కార్యక్రమ అమలు తీరును పరిశీలించారు. డ్రై డే సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. స్వచ్ఛత, వీధిదీపాల పనితీరు, వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో శుభ్రత పాటించడం, దోమల నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. అనంతరం గోపాల్పేట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. రికార్డులను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో అమలవుతున్న ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమాలు, పారిశుద్ధ్య చర్యలు, దోమల నివారణ కార్యక్రమాలను పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఆయన వెంట పుర కమిషనర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, పుర సిబ్బంది, గ్రామపంచాయతీ అధికారులు ఉన్నారు. -
అర్ధరాత్రి త్రీఫేజ్ సరఫరా..
● జిల్లాలో 64,235 వ్యవసాయ కనెక్షన్లు ● బోరుబావుల కింద 1.20 లక్షల ఎకరాల వరి సాగు ● ఆందోళనలో రైతులు ‘ఈ ఫొటోలోని రైతు పేరు పోసిరిగారి రాజు. అమరచింత సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలంతో పాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని గత నెలలో కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు నాటారు. ప్రస్తుతం వాన జాడ కనిపించకపోవడంతో పక్క పొలం రైతు బోరుమోటారుకు స్ప్రింకర్లను బిగించి పొలం తడుపుతున్నారు. నిత్యం విద్యుత్ కోతలతో 6 ఎకరాలు కూడా తడవని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రూ.రెండు లక్షల పెట్టుబడి అయిందని.. పంట కాపాడుకునేందుకు పొలానికే పరిమితం కావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.’ అమరచింత: బోరుబావుల కింద వానాకాలం పంటలు సాగు చేసిన అన్నదాతలు అప్రకటిత విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బోరుబావుల కింద వరి వరి నాట్లు వేసుకున్నారు. ప్రస్తుతం కేవలం రోజుకు 15 గంటల మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. నీరు సమృద్ధిగా ఉన్న బోరుబావుల కింద వరి సాగు చేయగా.. నీటి సౌకర్యం అంతంత మాత్రం ఉన్న బోరుబావుల కింద ఆరుతడి పంటలైన పత్తి, కంది సాగు చేపట్టారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక భూగర్భ జలాలు సైతం తగ్గడంతో ఆరుతడి పంటలు కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు వర్ణానాతీతం. జిల్లాలోని ప్రధాన జలాశయాలైన జూరాలతో పాటు రామన్పాడు, శంకరసముద్రం, సరళాసాగర్లోనూ నీటినిల్వలు అడుగంటడంతో ఆయకట్టు రైతులకు సాగు కష్టాలు నెలకొన్నాయి. వీటికితోడు గ్రామాల్లోని చెరువులు, కుంటలు సైతం ఎండుముఖం పట్టడంతో బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి ఆపి ఆపి నీటిని బయటకు వదులుతున్నాయి. మండలం కనెక్షన్ల సంఖ్య పాన్గల్ 7,775 వీపనగండ్ల 5,781 గోపాల్పేట 5,638 పెద్దమందడి 5,136 చిన్నంబావి 4,926 ఖిల్లాఘనపురం 4,716 వనపర్తి టౌన్ 4,958 కొత్తకోట 4,848 పెబ్బేరు 4,070 రేవల్లి 3,612 అమరచింత 3,469 మదనాపురం 3,021 ఆత్మకూర్ 3,054 శ్రీరంగాపురం 2,353 వనపర్తి 878 రోజు సాయంత్రం 5.30 గంటలకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న అధికారులు అర్ధరాత్రి 3, 4 గంటల సమయంలో వదులుతుండటంతో రైతులు పొలాల జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదేమిటని ట్రాన్స్కో అధికారులను ప్రశ్నించినా స్పందించడం లేదని.. తప్పరి పరిస్థితుల్లో ఉన్న సమయంలో నే పొలాలకు నీటిని వదులుతున్నామని చెబుతున్నారు. ఈసారి ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక జలాశయాలు నిండక విద్యుదుత్పత్తి ప్రశ్నార్థకంగా మారింది. విద్యుదుత్పత్తి లేకపోవడం, ఉన్న విద్యుత్ను సద్వినియోగం చేసుకొనేందుకు అప్రకటిత కోతలు విధించాల్సి వస్తోందని ట్రాన్స్కో అధికారులు తెలిపారు. -
నారుమడి ఎండింది..
4 ఎకరాల్లో వరి సాగు చేయడానికి నారుమడి సిద్ధం చేసుకున్నా. పొలం దుక్కిదున్ని నాట్ల కోసం సిద్ధం చేసుకున్నా. తీరా బోరుబావి నుంచి నీరు ఆగి ఆగి వస్తుండటంతో చేసేది లేక వరినారు వదిలేశా. విద్యుత్ కష్టాలతో పాటు జూరాల జలాశయంలో నీరు లేకపోవడంతో బోరుబావిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. – సుధాకర్రెడ్డి, రైతు, నందిమళ్ల ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక ప్రధాన జలాశయాల్లో నిల్వ నీటిమట్టం తగ్గడంతో విద్యుదుత్పత్తి చేపట్టడం లేదు. ఉన్న విద్యుత్ను జాగ్రత్తగా వినియోగించుకునేందుకు బోరుమోటార్లకు నిత్యం 15 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రైతులు వరిసాగుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆరుతడి పంటలు వేసుకుంటే ఉన్న విద్యుత్తో పంటలకు నీరు వాడుకోవచ్చు. – తాతారావు, ఏఈ, ట్రాన్స్కో -
‘సర్’ను సమర్థంగా పూర్తిచేస్తే నగదు పురస్కారం
● ఓటర్ల గుర్తింపులో బాధ్యతగా వ్యవహరించాలి ● బీఎల్వోలు, బీఎల్ఏల సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్గల్/వీపనగండ్ల: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్దేశితా గడువులోగా అత్యంత సమర్థవంతంగా పూర్తిచేసిన బీఎల్వోలు, బీఏల్ఏలకు నగదు బహుమతులు అందజేస్తామని.. ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు చెల్లించనున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం పాన్గల్, వీపనగండ్ల రైతువేధికల్లో బీఎల్వోలు, బీఎల్ఏలతో నిర్వహించిన సమీక్షలో మంత్రితో పాటు నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జ్ సిద్ధేశ్వర్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొన్నారు. గ్రామాల వారీగా సర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు సజావుగా జరగాలని.. ఓటు చోరీ జరగొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తూ పశ్చిమబెంగాల్, బిహార్లో ఓట్ల చోరీ జరిగిందని.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ యావత్ దేశానికి తన తెలియపర్చారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరును ఆన్లైన్లో నమోదు చేసేందుకు బీఎల్వోలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నిరక్షరాస్యులు, వలస వెళ్లిన వారి వివరాలు సేకరించి వారి పేర్లను కూడా ఓటరు జాబితాలో ఉండేవిధంగా చూడాలని, అందుకు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, బీఎల్వోలకు అవసరమయ్యే సహకారం అందివ్వాలని సూచించారు. మనిషికి ఓటు లేకపోతే మనగడకు అంతరాయం కలుగొచ్చని.. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సర్ ప్రక్రియ పార్లమెంట్ ఇన్చార్జ్ సిద్దేశ్వర్ సూచించారు. బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంగా పనిచేస్తూ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి కోరారు. తక్కువ సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ త్వరితగతిన పూర్తి చేసేలా దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో కాంగ్రెస్పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, సాయిచరణ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, వీపనగండ్ల తహసీల్దార్ ఎండీ ఖాజామైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్యవివాహ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ఖిల్లాఘనపురం: సమాజంలో బాల్యవివాహాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన అన్నారు. శనివారం మండలంలోని మానాజీపేటలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు చేయడం, అందుకు సహకరించడం చట్టరీత్యా నేరమన్నారు. నియంత్రణకు అధికారులు, ఆశా, అంగన్వాడి కార్యకర్తలు, పోలీసులే కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాలలతో పనులు చేయించడం చట్టపరంగా నేరమన్నారు. బాల బాలికలు, వయోవృద్ధులు, బడుగు బలహీనవర్గాలు, మహిళలకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మోటారు వాహనాలు, సైబర్క్రైమ్, పోక్స్, డ్రగ్స్ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం చట్టాలపై రూపొందించిన లఘు చిత్రాలను ప్రజలతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కార్తీక్రెడ్డి, ప్రథమ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అశ్విని, ఎస్ఐ వెంకటేష్, సర్పంచ్ శ్రీలత, సభ్యులు బాలయ్య, కృష్ణయ్య, శ్రీదేవి, రఘు, విశ్వనాథం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు మన్ననూర్: స్థానిక పీవీటీజీ గురుకుల పాఠశాల/కళాశాల వసతిగృహంలో ఇటీవల ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఇందుకు బాధ్యులైన ప్రిన్సిపల్ పద్మావతి, డిప్యూటీ వార్డెన్ గీత, ఏఎన్ఎం హుస్సేనమ్మతో పాటు మరో నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన వారి స్థానంలో ఇన్చార్జిలతో పాటూ తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది నియామకాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్లకు ఓటుహక్కు కల్పించాలని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సర్పంచ్ల సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వివిధ కమిటీల పేరుతో ఇతరులను అధ్యక్షులుగా నియమించడం తగదన్నారు. జాయింట్ చెక్పవర్ను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ఎన్ఆర్జీసీ నిధులను ఆయా గ్రామాలకే కేటాయించాలన్నారు. సర్పంచ్ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని, కలెక్టర్ వెంటనే గ్రీన్ చానల్ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే విజన్–2047, వికసిత్ భారత్ వంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రాజశేఖర్, వనపర్తి జిల్లా కన్వీనర్ శేఖర్గౌడ్, నాగర్కర్నూల్ జిల్లా నాయకురాలు వీరోజు సుప్రియ తదితరులు పాల్గొన్నారు. హుండీ ఆదాయం రూ.10.67 లక్షలు చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయానికి సంబంధించి అమావాస్య, శని, సోమవారాలను పురస్కరించుకొని భక్తులు కానుకలుగా సమర్పించిన హుండీ డబ్బులను ఆలయ అధికారులు శనివారం లెక్కించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.10,67,669 వచ్చినట్లు ఆలయ చైర్మన్ బాలరాజు, ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బాలాజీ ట్రస్ట్ సభ్యులు, ఆలయ ఇన్స్పెక్టర్ వాసు, సభ్యులు తిరుపతిరెడ్డి, భాస్కరచార్యులు, నాగార్జున, భరత్కుమార్రెడ్డి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ, పారదర్శకతో మెరుగైన సేవలు
వనపర్తి: పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, పారదర్శకతతో పనిచేస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని.. ప్రతి పని సమయానికి పూర్తి చేయడంతో పోలీసుశాఖపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ ప్రత్యేక సమీక్ష నిర్వహించి పనితీరును ప్రశంసిస్తూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. స్పెషల్ బ్రాంచ్ విభాగం జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోందని.. క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ నేర నియంత్రణలో ముఖ్యమైన సహకారం అందిస్తోందని తెలిపారు. పాస్పోర్ట్, ఉద్యోగ వెరిఫికేషన్ ప్రక్రియ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల జారీ ఇతర విభాగాలకు సమన్వయంతో సహకారం అందించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఎస్ఐలు మంజునాథ్రెడ్డి, నరేష్, పర్వతాలు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలి.. కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పుచేసిన వారికి శిక్ష పడేలా చేయడంతో ప్రజలకు పోలీసుశాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు లైజన్, కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకుగాను కేసులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కేసు పూర్తయ్యే వరకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించడంలో కోర్టు పోలీసు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాధితులు, సాక్షులకు కేసుకు సంబంధించిన విషయాల్లో అవగాహన కల్పించాలని.. ప్రాసిక్యూషన్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఎస్ఐలకు తెలియజేయాలన్నారు. పలువురు కోర్టు కానిస్టేబుళ్లతో మాట్లాడి కేసుల పురోగతిపై ఆరా తీశారు. సమావేశంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. -
నకిలీ.. మకిలీ
● నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వెలుగులోకి.. ● మహదేవునిపేటలో 117 ఎరువుల బస్తాలు స్వాధీనం ● రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులు సైతం.. ● కర్ణాటక నుంచి వచ్చి విక్రయించినట్లు అనుమానాలు ● గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ విక్రయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కరువు మేఘాలు కమ్ముకుని.. వానాకాలం సాగుపై ఇప్పటికే సందిగ్ధత కొనసాగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతాంగంలో నిరాశ వ్యక్తమవుతోంది. దీనికి తోడు నకిలీ ఎరువులు కలకలం సృష్టిస్తుండడంతో వారికి కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఇటీవల కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నకిలీ డీఏపీ విక్రయాలు వెలుగుచూడగా.. తాజాగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో పట్టుబడ్డాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెలుగులోకి ఇలా.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామానికి గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తక్కువ ధరకు డీఏపీ ఎరువు ఇస్తామని తొలుత ఓ ఇద్దరు రైతులకు ఆశ చూపారు. వారి సహకారంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మొత్తంగా ఎనిమిది మంది రైతులకు 156 బస్తాలు విక్రయించి వెళ్లిపోయారు. ఒక్కో బస్తాకు ఒక్కొక్కరి వద్ద ఒక్కో రకంగా రూ.1,300 నుంచి రూ.1,500 తీసుకున్నారు. వారు వెళ్లిన కొన్ని గంటలకు ఈ సమాచరం వెలుగులోకి రాగా పలువురు రైతులు నకిలీవనే అనుమానంతో ఏఈఓకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం కలెక్టర్, ఎస్పీ జిల్లా వ్యవసాయాధికారి దృష్టికి రాగా.. వారు వెంటనే గ్రామానికి చేరుకుని విచారించారు. 116 బస్తాల డీఏపీతో పాటు రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు. వారి విచారణలో అవి నకిలీ ఎరువు బస్తాలని తేలినట్లు సమాచారం. దీంతో శాంపిళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించనున్నట్లు వెల్లడించారు. గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ.. నకిలీ డీఏపీ ఎరువులకు సంబంధించి కర్ణాటకకు చెందిన పలువురు దళారులు ఉన్నట్లు సమాచారం. నాగర్కర్నూల్ జిల్లాలో బిజినేపల్లిలో వెలుగులోకి రాగా.. సమీప మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. అంతేకాదు.. వనపర్తి, గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లో తక్కువ ధర పేరిట వేలాది మంది రైతులకు అంటగట్టినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో పలు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో అమాయక రైతులను టార్గెట్గా చేసుకుని కేటుగాళ్లు దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నకిలీ డీఏపీ ఎరువుల దందా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మోసపోయిన రైతులు కలవరపడుతున్నారు. తమ బాధను వెల్లగక్కలేక, మింగలేక మథనపడుతున్నారు. రైతుల్లారా బీ అలర్ట్.. డీఏపీ.. డై అమ్మోనియం ఫాస్పేట్. వ్యవసాయంలో అత్యంత ప్రాముఖ్యత గల ఎరువు. విత్తనాలు విత్తే సమయంలో గానీ.. నాట్లు వేసేటప్పుడు గానీ దీన్ని బేసల్ ఎరువుగా వేస్తారు. వేరు వ్యవస్థ అభివృద్ధి, పంట ఎదుగుదల, అధిక దిగుబడికి ఇది దోహదం చేస్తుంది. అలాంటి ఈ ఎరువు అసలుదా.. నకిలీదా అని గుర్తు పట్టేందుకు మూడు రకాలుగా పరీక్షించాలని రైతులకు వ్యవసాయాధికారులు పలు సూచనలు చేశారు. డీఏపీ గింజను గోరుతో గట్టిగా నొక్కాలి. గింజ రాయిలా గట్టిగా ఉండి.. పగలకుంటే మంచిది. మట్టిగడ్డలా పొడిపొడిగా రాలిపోతే నకిలీది. కొన్ని డీఏపీ గింజలను చేతిలోకి తీసుకుని పాన్ (తాంబూలం)లో వేసే తడి సున్నం కలిపి బాగా రుద్దాలి. ఘాటైన వాసన (అమ్మోనియా) వస్తే అసలైన డీఏపీ. ఎలాంటి వాసన రాకపోతే రాతి పొడితో చేసిన నకిలీ ఎరువు అని గ్రహించవచ్చు. కొన్ని డీఏపీ గింజలను ఇనుప పెనం మీద వేసి వేడి చేయాలి. వేడికి ఉబ్బి కరిగిపోతే అసలైన డీఏపీ. కరగకుండా గట్టిగా ఉంటే నకిలీది. లైసెన్స్ ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు కొనాలి. కొన్న తర్వాత దుకాణాదారుడి నుంచి కచ్చితంగా రశీదు తీసుకోవాలి. రాత్రి వేళ లేదా అనుమానాస్పద వ్యక్తుల వద్ద తక్కువ ధరకే వస్తుందని ఎట్టిపరిస్థితుల్లోనూ కొనుగోలు చేయొద్దు. ఎరువుల నాణ్యతపై అనుమానం వస్తే వెంటనే వ్యవసాయాధికారికి సమాచారం అందించాలి. నాగర్ కర్నూల్ జిల్లాలో అనుమతి ఉన్న విత్తన, ఎరువుల దుకాణాల్లో ఈ సారి పత్తి విత్తనాలు తక్కువగా అమ్ముడుపోయాయి. రైతులు ఎక్కడి నుంచో పత్తి విత్తనాలు కొనుగోలు చేసినట్లు అనుమానం ఉంది. నిఘా పెట్టడంతో పలు చోట్ల నకిలీ విత్తనాలు దొరికాయి. కానీ నకిలీ డీఏపీ ఎరువులు పట్టుబడడం ఉమ్మడి జిల్లాలో ఇదే మొదటిసారి అనుకుంటా. కర్ణాటక, గద్వాల సరిహద్దుల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. రైతులు విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. – చంద్రశేఖర్, జిల్లావ్యవసాయాధికారి, నాగర్కర్నూల్ నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై రైతులు అలర్ట్గా ఉండాలి. వీటిని విక్రయించిన వారు, ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదు. కొనుగోలు చేసిన రైతులు నకిలీ డీఏపీ ఎరువులను అంటగట్టిన వారి వివరాలు వెల్లడించకపోతే.. వారిపైనా చర్యలు తప్పవు. అవసరమైతే కేసులు పెట్టాల్సి వస్తుంది. – హేమంత్ కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్కర్నూల్ నాగర్కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ డీఏపీ విక్రయాలకు సంబంధించి పోలీసులు కొందరు డీలర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేటలో 111 బస్తాలు నకిలీ డీఏపీ దొరికిన వ్యవహారంపై పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో తిమ్మాజిపేట మండలంలోని అమ్మపల్లిలో సైతం విక్రయించినట్లు తెలిసింది. దీంతో మాహదేవునిపేట, అమ్మపల్లి గ్రామాల్లో ఫర్టిలైజర్ దుకాణాలు నడిపే కొందరు డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. వ్యవసాయాధికారులు నకిలీ డీఏపీ నమూనాలను శనివారం టెస్టింగ్ కోసం హైదరాబాద్కు పంపించగా.. మంగళవారం నివేదిక రానుందని సంబంధిత అధికారి పేర్కొన్నారు. -
నిధులున్నా.. నిట్టూర్పే!
కొత్త పురపాలికల్లో కానరాని అభివృద్ధి పనులు● ప్రత్యేక నిధులు రూ.15 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ● సీసీ రహదారులు, డ్రైనేజీలు తదితర పనులకు ప్రాధాన్యం ● అరకొర టెండర్లు.. ప్రారంభం కాని పనులు జిల్లాలో అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరు కొత్త పురపాలికలు. ఆయా పురపాలికల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించిన జీఓలు సైతం విడుదల కావడంతో ఆయా పుర ప్రజలు సంబురపడ్డారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కౌన్సిలర్లు ఆ నిధులతో తమ వార్డుల్లో అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించారు. కానీ నేటికీ ఆయా పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అనే విషయాలు సైతం తెలియని పరిస్థితి నెలకొంది. అమరచింతలో రూ.3 కోట్లు, ఆత్మకూర్లో రూ.7 కోట్ల పనులకు సంబంధించి టెండర్లు, అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిందని ఆయా పుర కమిషనర్లు చెబుతున్నారు. ఇక కొత్తకోట, పెబ్బేరు పురపాలికల్లో మాత్రం వాటి ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. నిధులు మంజూరయ్యాయి.. మరి పనులెప్పుడు ప్రారంభిస్తారని అడుగగా నిధుల మంజూరు కేవలం జీఓలకే పరిమితమైందని అధికారులు బదులివ్వగడం గమనార్హం. అమరచింత: కొత్త పురపాలికల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని నాలుగు పురపాలికలకు కూడా ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున రూ.60 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులను గతేడాది జారీ చేసింది. పుర ఎన్నికల సమయంలో జనవరి 13న అమరచింత పురపాలికలో అభివృద్ధి పనులకుగాను రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపనలు కూడా చేశారు. ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా పనుల గురించి చర్చించే అధికారులే కరువయ్యారు. పుర అధికారులను అడిగిన ప్రతిసారి టెండర్ల ప్రక్రియ పూర్తయింది.. త్వరలోనే ప్రారంభిస్తామని సమాధానం చెప్పడమే తప్పా ఆచరణలో అమలు కావడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ రహదారులు, డ్రైనేజీలు, పురపాలిక భవనం, టౌన్హాల్తో పాటు వివిధ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని పుర ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం పురపాలికల్లో కొనసాగుతున్న అమృత్ 2.0 తాగునీటి పథకం పనులతో సీసీ రహదారులు దెబ్బతిన్నాయని.. వచ్చే నిధులతో వేగవంతంగా నిర్మించాలంటున్నారు. -
జననాల్లో మహబూబ్నగర్ టాప్..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సీఆర్ఎస్–24 నివేదిక ప్రకారం మొత్తంగా 86,288 జననాలు, 19,605 మరణాలు, 198 శిశు మరణాలు, 369 మృత శిశు (నిర్జీవ పుట్టుక) జననాలు నమోదయ్యాయి. లింగ నిష్పత్తి ప్రకారం పరిశీలిస్తే ఐదు జిల్లాల్లోనూ మహిళా జననాల వాటా 45.7 శాతం నుంచి 48.0 శాతం మధ్య ఉండగా, పురుష జననాల వాటా 52 నుంచి 54 శాతం మధ్య నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలో మగశిశు జననాల శాతం అత్యధికంగా 54.30 శాతంగా నమోదైంది. మొత్తంగా ఆడపిల్లల జననాల శాతం 2022తో పోలిస్తే 0.68 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. జోగుళాంబ గద్వాలమగ, ఆడ శిశువుల వారీగా జనన గణాంకాలు.. -
‘సర్’ ప్రక్రియ వేగవంతం
వనపర్తి రూరల్: సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఆన్లైన్ నమోదును వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం మండలంలోని చిమనగుంటపల్లిలో పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఆన్లైన్ వివరాల నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, పూర్తి చేసిన తర్వాత త్వరిగతిన సేకరించాలన్నారు. సేకరించిన ఫారాల వివరాలను రోజువారీగా ఆలస్యం లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని, పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. ఫారాలు నింపడంలో ఓటర్లకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయాలని.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు గ్రామపంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసి తరగతి గదులను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడి మధాహ్న భోజనంపై ఆరా తీశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రమేష్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మధు, బీఎల్వోలు, బీఎల్ఏలు ఉన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలి పాన్గల్: తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి అభివృద్ధికి సహకరించేలా మహిళా సంఘాల సభ్యులకు సమాఖ్య సిబ్బంది అవగాహన కల్పించాలని డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) నాగమల్లిక అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సమాఖ్య కార్యాలయంలో జరిగిన ఈసీ సమావేశం, సీఆర్పీల శిక్షణకు ఆమె హాజరై మాట్లాడారు. సభ్యులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించడంతో కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సభ్యులకు వివరించాలన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు యూనిఫామ్స్ను సర్పంచ్ నాగలక్ష్మితో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ హేమలత, సమాఖ్య సీసీలు సువర్ణ, వసంత, సమాఖ్య అధ్యక్షురాలు జయమ్మ, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల వివరాలు నమోదు చేయాలి పాన్గల్: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను గ్రామాల వారీగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఎన్సీడీ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. మారుతినందన్గౌడ్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చేపట్టే పరీక్షలు, అందించే మందులు, ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రక్తపోటు(బీపీ), మధుమేహం, క్యాన్సర్ (నోరు, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు) పరీక్షలు ఉచితంగా నిర్వహించడమేగాక చికిత్స, మందులు అందించే విషయాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సిబ్బందికి సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. విధుల్లో అలసత్వం సరికాదని హెచ్చరించారు. సమావేశంలో ఎన్సీడీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్లు కొండ శ్రీనివాస్, అశోక్, మధుమోహన్, ఆయుష్మాన్ వైద్యులు డా. మైథిలి, లారెన్స్, నాగరాజు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఉండవెల్లి: ఉమ్మడి జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్గౌడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీతోపాటు బీఎడ్ అర్హతతో పీజీలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలన్నారు. ఆసక్తి గలవారు విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్, అనుభవ ధ్రువపత్రాలు, జడ్చర్లలోని ఆర్సీఓ ఆఫీస్లో ఈ నెల 20లోగా దరఖాస్తులతోపాటు అందజేయాలని సూచించారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో వేగం పెంచాలి
వనపర్తి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెనన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆయనతో పాటు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో 2018 నుంచి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాటి విచారణ, ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి, బాధితులకు అందిన పరిహారంపై సమీక్షించారు. 2025 నుంచి 2026 వరకు విచారణలో ఉన్న 12 కేసులపై చర్చించగా.. ఎస్పీ సునీతారెడ్డి వాటి పురోగతి, స్థితిగతులను కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 2020 నుంచి 2026 వరకు ఒక్క కేసు నేరారోపణ జరగలేదని ఇందుకు బాధ్యులెవరని ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం కచ్చితంగా శిక్ష పడాలని, బాధితులకు న్యాయం జరగాలన్నారు. ఒకవేళ తప్పుడు కేసులు నమోదు చేస్తే విజిలెనన్స్ కమిటీ సభ్యులు నచ్చజెప్పి కేసు ఉపసంహరించుకునేలా చూడాలని సూచించారు. తప్పుడు కేసులు నమోదు చేయడం, తప్పు చేసినవారు శిక్ష పడకుండా బయట దర్జాగా తిరుగుతుండటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కేసులను సమగ్రంగా విచారించి తగిన ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 2020లో నమోదైన ఒక కేసు 2026లో ట్రయల్కు రావడం ఇంకా తేదీ ఖరారు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమావేశానికి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలి.. భూ సమస్యలు, భూ కబ్జాల వంటి కేసులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేకూర్చి అండగా నిలవాలని పోలీస్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతినెల పౌరహక్కుల దినోత్సవం పకడ్బందీగా నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించి భరోసా ఇవ్వాలని సూచించారు. మంజూరైన సంక్షేమ పథకాలపై శాఖల వారీగా అధికారులతో ఆరా తీశారు. ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులకు సకాలంలో అందేవిధంగా చూడాలన్నారు. ప్రభుత్వం మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచి విద్యార్థులకు అండగా నిలిచేందుకు కృషి చేస్తుంటే.. వసతి గృహాల్లో వార్డెన్లు సరిగా ఉండటం లేదని, పర్యావసానంగా విద్యార్థులు నష్టపోతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి -
దత్తాయిపల్లి అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరు
వనపర్తి రూరల్: దత్తాయిపల్లి గ్రామ అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని దత్తాయిపల్లిలో రెండు అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనం, గోదాంల నిర్మాణం, ఆంజనేయ ఆలయ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఇంటి యజమానులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు రహదారులు, ప్రభుత్వ భవనాలు, తాగునీరు, విద్యుత్, ఇతర ప్రజావసరాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, శంకర్నాయక్, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఉప సర్పంచ్ కిషన్నాయక్ నాయకులు అధికారులు పాల్గొన్నారు. -
బీఎల్ఏలు సమన్వయంలో పనిచేయాలి
వనపర్తి రూరల్: బీఎల్ఏలు, బీఎల్ఓలతో సమన్వయంగా పనిచేస్తూ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆదేశించారు. బుధవారం మండలంలోని పెద్దగూడెంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) పక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎల్ఏ–2 ఇన్చార్జ్లతో మాట్లాడి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఓటరు నమోదు వివరాల సవరణ, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో పూర్తి సహకారం అందించాలని సూచించారు. ప్రతి బీఎల్ఏ–2 కనీసం 100 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయాలని, సర్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, మాజీ సర్పంచ్ కొండయ్య, నాయకులు శివకుమార్, భాస్కర్రెడ్డి, రొయ్యల రమేష్, బుచ్చిబాబు, సురేష్, శారదమ్మ, విష్ణువర్ధన్రెడ్డి, మల్లేష్, గుండాల రాములు, బాలు తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’పై నిర్లక్ష్యం వద్దు
అమరచింత (ఆత్మకూర్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)పై బీఎల్ఓలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకొని ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉందని నారాయణ పేట జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. ఆత్మకూర్ పట్టణంలో కొనసాగుతున్న సర్ కార్యక్రమాన్ని ఆయన తహసీల్దార్ జేకే మోహన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు సేకరించి ఓటరు సవరణ కార్యక్రమం గురించి వివరించి, ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని బీఎల్ఓలకు సూచించారు. ప్రతినిత్యం తమకు కేటాయించిన క్యాచ్మెంట్ ఏరియాలో ఉంటూ.. ఫారాలు సేకరించి వందశాతం ఆన్లైన్ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్, మేనేజర్ సీత్యానాయక్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
విద్య.. నీరు.. పారిశ్రామికం
ఇవే మా మొదటి ప్రాధాన్యం: సీఎం రేవంత్రెడ్డి –8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/వనపర్తి: ‘నేను పాలమూరు బిడ్డను. అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా, ఆదర్శ జిల్లాగా చేయాలనేదే నా ప్రయత్నం. గతంలో ఈ జిల్లాను ఎవరెవరో దత్తత తీసుకున్నారనే చర్చలు జరిగేవి. ఈ రోజు మనమే ఇతర జిల్లాలను ద్తతత తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది పాలమూరు జిల్లాకు గర్వకారణం. ఈ జిల్లాలో మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇండస్ట్రియల్ పాలసీలు అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కాలేజీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఏటీసీ సెంటర్లను తీసుకొచ్చాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్లో బుధవారం ఆయన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం కొత్తకోటలో రూ.1.77 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. త్వరలో శుభవార్త చెబుతాం.. ‘సాగురంగం అభివృద్ధి సాధించాలంటే జిల్లాలో కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్సాగర్, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్ పూర్తి చేసుకోవాలి. ఆయా పథకాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నాం. పీఆర్ఎల్ఐకి సంబంధించిన 90 టీఎంసీలు సాధించడానికి కేంద్రం, ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి సంపూర్ణమైన అనుమతులు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో రైతులకు శుభవార్త చెబుతాం. డిండి ప్రాజెక్ట్కు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపులు కోసం కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ జిల్లాను సస్యశ్యాలం చేస్తాం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం తీసుకొస్తాం. నిరుద్యోగులకు ఉపాధి, అవకాశాలు కల్పిస్తాం. ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగాలు పోయి లక్షల మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. వైట్ కాలర్ జాబులు పోతున్నాయి. అయితే బ్లూ కలర్ జాబులు తెచ్చేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోంది. బ్లూ కలర్ జాబులు కావాలంటే ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుత విద్యతో స్పోర్ట్స్ నూతన విధానం అమలు చేసి చదువులో వెనకబడిన వారు క్రీడల్లో రాణించి ఉన్నత జీవితాన్ని కొనసాగించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలోని మాణిక్యాలను వెలికితీయాలి. విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి. మీ భవిష్యత్కు నాదీ హామీ. క్రీడల్లో రాణించే వారిని ఉన్నతస్థాయిలో నిలిపే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఏడాదికి రూ.30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీలు డీకే అరుణ, మల్లురవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణ, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాల సరిత, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి ఆదర్శ జిల్లాగా పాలమూరును మారుస్తామని హామీ కొత్తకోటలో బాలికల నూతన పాఠశాల భవనం ప్రారంభోత్సవం -
త్వరలోనే నాలుగు పంపుల ద్వారా నీటి విడుదల
● ‘పాలమూరు’ ప్రాజెక్టు సలహాదారు పెంటారెడ్డి కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి మొదటి లిస్టు ద్వారా నెల వ్యవధిలో పూర్తయిన నాలుగు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి అన్నారు. మంగళవారం పంపుల విధివిధాలపై ఉన్నతాధికారులతో కంట్రోల్ బోర్డులో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడేళ్ల క్రితం ప్రారంభించిన మొదటి పంపులో చాలా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరిష్కరించేందుకు దాదాపు 10 రోజుల సమయం పట్టిందన్నారు. అన్నిరకాల సాంకేతిక సమస్యలను అధిగమించి మంగళవారం దాదాపు గంటపాటు నీటిని రిజర్వాయర్లోకి విడుదల చేశామన్నారు. బుధవారం నుంచి రెండో పంపు డ్రైరన్ ప్రారంభిస్తామని, వారం రోజుల్లో రెండో పంపు నుంచి నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. మోటార్లలో తలెత్తుతున్న చిన్నపాటి సమస్యలు పరిష్కరిస్తూ.. నాలుగు పంపుల నుంచి నెల వ్యవధిలో రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తామన్నారు. కృష్ణానదికి నీళ్లు వచ్చే వరకు నాలుగు పంపులు సిద్ధం చేస్తామన్నారు. అలాగే ప్యాకేజీ–3లో ఉన్న పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. ఏదుల, వట్టెం, కర్వెనలో ఉన్న పంపులను సైతం సిద్ధం చేసి.. అన్ని రిజర్వాయర్లకు త్వరలో నీటిని తరలించాలని సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్ఈ రవీందర్, ఈఈ లోకిలాల్, డీఈ ప్రవీణ్ తదితరులున్నారు. -
జోగుళాంబ క్షేత్రంపై విస్తృత ప్రచారం
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం, స్థల పురాణంపై విస్తృతంగా ప్రచారం చేస్తామని హైదవ సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం అలంపూర్ క్షేత్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపురంగా పిలువబడుతున్న దేవాలయాల ఆసలు పేరు హేమలాపురం అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హేమలపురం పేరు తెలియపరచాలనే ఆకాంక్షతో పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. జేఏసీ సహాయ కార్యదర్శి రాఘవులు, నర్సింహ, వీరేందర్ గుప్తా, సాయిగౌడు, శ్రవణ్ కుమార్, రమేశ్, రామకృష్ణ పాల్గొన్నారు. -
ఆశా.. నిరాశాయే..
చాలీచాలని జీతం, ఉద్యోగ భద్రత కరువు ● జిల్లాలో 548 మంది వర్కర్ల ఆవేదన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా ఆశావర్కర్లకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. ప్రస్తుత ధరలతో కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది. వచ్చిన వేతనంతో పిల్లల చదువులు, కుటుంబం గడవడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. – సునీత, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆరోగ్యపరంగా గర్భిణులతో పాటు బాలింతలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూ సేవలు అందిస్తున్నాం. వారి ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారులకు క్రమం తప్పకుండా నివేదిక సమర్పిస్తాం. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మాకు న్యాయం చేయాలి. – బుచ్చమ్మ, ఆశావర్కర్ ఆశా వర్కర్ల వేతనాలు పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరో ఆందోళనకు శ్రీకారం చుడతాం. ఆశాల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే కాలయాపన చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – బొబ్బిలి నిక్సన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆశావర్కర్ల సమస్యలు, వారి డిమాండ్లపై ఇప్పటికే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాం. జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 548 మంది ఆశాలు విధులు నిర్వహిస్తున్నారు. వేతనాల పెంపు అనేది ప్రభుత్వ పరిధిలోని నిర్ణయం. మా పరిధిలో ఉన్న పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. ప్రతి ఆశా కార్యకర్తకు రూ.10 వేలకు తగ్గకుండా వేతనం అందేలా చూస్తున్నాం. – సాయినాథ్రెడ్డి, డీఎంహ్చ్ఓ, వనపర్తి మదనాపురం: పని ఒత్తిడి, చాలీచాలని వేతనం, భరోసా లేని ఉద్యోగం వెరసి ఆశా కార్యకర్తలు తీవ్ర నిరాశలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనం చెల్లిస్తామని చెప్పి అధికారం చేపట్టి సుమారు మూడేళ్లవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తమను నిర్లక్ష్యంగా చూస్తుందని ఆశాలు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ నిత్యం రోగులకు అందుబాటులో ఉంటున్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో అన్ని శాఖలు లాక్డౌన్లోకి వెళ్లినా.. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన వారికి నిత్యం వైద్య సేవలు అందించినా తమకు కనీస గుర్తింపు దక్కలేదని వాపోతున్నారు. తమ శ్రమకు తగ్గట్టుగా రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలని ఏళ్లుగా వేడుకుంటున్నా వారి గోస వినే వారే కరువయ్యారు. ప్రభుత్వం స్పందిచకుంటే జిల్లావ్యాప్తంగా ఆశావర్కర్లు మరోసారి ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి వస్తుందని ఆశాలు అంటున్నారు. గర్భిణులకు అర్ధరాత్రి ప్రసవ నొప్పులు వచ్చినా.. అత్యవసర వైద్య పరిస్థితులు తలెత్తినా కుటుంబాలను పక్కనబెట్టి బాధితులను ఆస్పత్రులకు తీసుకెళ్లే బాధ్యత ఆశా వర్కర్లదే. వారికి నిర్దిష్టమైన పని గంటలు లేవు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాల ధరలతో వారికి ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.9,600 వేతనం ఏమాత్రం చాలడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం క్షేత్రస్థాయి సేవలే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి కొత్త యాప్లో సమాచారాన్ని నమోదు చేయడం, ఆన్లైన్ నివేదికలు తయారు చేయడం వంటి అదనపు భారం వీరిపై పడింది. ఆరోగ్య రంగంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నప్పటికీ వీరికి ఎలాంటి పీఎఫ్, ఈఎస్ఐ లేదా కనీస బీమా సదుపాయాలు లేవు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. జిల్లాలోని 15 మండలాల్లో గల 14 పీహెచ్సీలు, 2 యూపీఎస్సీల పరిధిలో 548 మంది ఆశాలు పని చేస్తున్నారు. ప్రతి 1000 మంది జనాభా ఒక్కరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. -
ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులకు ఇబ్బందులు
కొత్తకోట రూరల్: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరైన సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ డి.సునీతారెడ్డి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ ఒకరు, డీఎస్పీలు నలుగురు, సీఐలు 16 మంది, ఎస్ఐలు 54 మంది, ఏఎస్లు, హెడ్ కానిస్టేబుల్స్ 181, మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ 595 మంది కలిపి మొత్తం సుమారు 850 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి సాయంత్రం 4:49 గంటలకు కొత్తకోటకు చేరుకోగా.. ఆయన రాకకు గంట ముందే పట్టణంలోని ప్రధాన రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ట్రాఫిక్ను నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వనపర్తి, ఆత్మకూరు మార్గంలో ప్రయాణించే వాహనాలను సంకిరెడ్డిపల్లి స్టేజీ వద్ద నిలిపివేయడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల భవన ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కానాయపల్లిలోని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి నివాసానికి వెళ్లి తేనేటి విందులో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుని సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్కు బయలుదేరారు. ముఖ్యమంత్రి పర్యటన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
కేజీబీవీల్లో స్పాట్ అడ్మిషన్లు
వనపర్తిటౌన్: జిల్లాలోని కేజీబీవీల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఇన్చార్జ్ డీఈఓ యాదయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఓఈ స్కూల్స్లోని అమరచింత కేజీబీవీలో ఎంపీసీ, బైపీసీలో 2 చొప్పున, వనపర్తి కేజీబీవీలో ఎంపీసీలో 7, గోపాల్పేట కేజీబీవీలో ఎంపీసీలో 3 సీట్లు, శ్రీరంగాపూర్ కేజీబీవీ ఎంపీసీలో 10, ఆత్మకూర్లోని కేజీబీవీ సీఈసీలో 7, రేవల్లిలో 10, పెద్దమందడిలో ఎంఎల్టీలో 5, ఖిల్లాఘనపురంలో కంప్యూటర్ సైన్స్లో 3, పాన్గల్లో కంప్యూటర్ సైన్స్లో 4, కొత్తకోటలో అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్లో 5, మదనాపురంలో ఫార్మా అండ్ టెక్నాలజీలో 15, ఖిల్లాఘనపురం (జనరల్) కేజీబీవీలో కమర్షియల్ గార్మెంట్ అండ్ టెక్నాలజీ కోర్సులో 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ప్రవేశాలు పొందాలని సూచించారు. గురువారం నుంచి 18వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్స్కు అవకాశం ఉంటుందని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం వనపర్తి రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి పాలమూరులో పర్యటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులను ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రతిపక్ష నేతలను, ప్రశ్నించే వారిని అరెస్టు చేస్తేగాని క్షేత్రస్థాయిలో తిరగలేని దుస్థితిలో సీఎం రేవంత్తెడ్డి ఉన్నారా.. ప్రజాపాలన అంటే ప్రజలను నిర్భందించడమేనా.. అని ప్రశ్నించారు. తన పాలన మీద తనకే నమ్మకం లేని వ్యక్తి సీఎంగా ఎలా కొనసాగుతారని ఎద్దేవా చేశారు. పోలీసుల పహారా మధ్య ప్రజాపాలన సాగుతుందని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్గాంధీకి రాష్ట్రంలో రేవంత్ అరాచకాలు కనిపించకపోవడం విస్మయానికి గురి చేస్తుందన్నారు. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. వర్షాల కోసం తీరొక్క మొక్కులు కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వరుణుడి జాడే లేకుండాపోయింది. అప్పుడప్పుడు అరకొరగా కురిసిన వర్షాలకు రైతులు సాగుచేసిన పంటలు ఎండుమఖం పడుతున్నాయి. వ్యయ, ప్రయాసలకోర్చి సాగుచేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు వర్షాల కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తూ.. తీరొక్క మొక్కులు మొక్కుకుంటున్నారు. బుధవారం పెంట్లవెల్లి మండలం గోపులాపురం శివాలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. పరమశివుడిని జలదిగ్బంధనం చేశారు. పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండ తండాలో మహిళలు కప్పల కావడి నిర్వహించారు. కప్పల కావడితో వాడవాడ తిరుగుతూ వానమ్మా.. వానమ్మ ఒక్కసారన్నా వచ్చి పోవమ్మా అంటూ పాటలు పాడారు. లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతివ్వాలి అచ్చంపేట: ఈ నెల 25న తొలి ఏకాదశి సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలోని లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతించాలని భజరంగ్దళ్ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లమల ప్రాంత ప్రజలతో పాటు ఆదివాసీ చెంచుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు లొద్ది మల్లయ్య ఆలయం ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి సందర్భంగా చెంచు పూజారుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది కూడా అటవీశాఖ అనుమతులు ఇచ్చి.. భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో భజరంగ్దళ్ డివిజన్ కన్వీనర్ సీతారాల శివచంద్ర, చందులాల్ చౌహాన్, శివాజీ, నరేశ్, చందర్, అజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలుపరిష్కరించాలి : టీపీయూఎస్
వనపర్తి విద్యావిభాగం: ఉపాధ్యాయులు, విద్యాశా ఖ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీపీయూఎస్ రాష్ట్రశాఖ పిలుపు మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని మర్నికుంట ధర్నా చౌక్లో సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేసి 51 శాతం పీఆర్సీ ప్రకటించాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు చేయాలని కోరారు. జీఓనంబర్ 317 బాధితులకు న్యాయం చేయాలని, జీఓనంబర్ 25 రద్దు, 2010కు ముందు నుంచి విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు, కేజీబీవీ, ఎస్ఎస్ఏ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన గ్రాంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అదృశ్యం ఆంతర్యమేంటి?
జిల్లాలో ఏటా పెరుగుతున్న మిస్సింగ్ కేసులు ● మూడున్నర ఏళ్లలో 919 కేసులు నమోదు ● దర్యాప్తు చేసినవి 872 ● ఫిర్యాదుకు రాని కేసులు మరెన్నో.. ‘వనపర్తి మండలం అంకూరుకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల భార్యతో విభేదించి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మూడురోజుల పాటు కాలినడకన ఎక్కడెక్కడో తిరిగి చివరకు పెద్దగూడెం క్రాస్ రోడ్ సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. పోలీసులు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడి సెల్ఫోన్ సిగ్నల్స్ను పరిశీలించగా.. రాణిపేట, కొత్తకోట తదితర ప్రాంతాల్లో తిరిగినట్లుగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా నమోదవుతున్న మిస్సింగ్ కేసుల్లో వనపర్తిటౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో అధికంగా ఉన్నట్లు అఽధికారులు వెల్లడించిన లెక్కలతో తెలుస్తోంది.’ వనపర్తి: జిల్లాలో ఏటా అదృశ్యం (మిస్సింగ్) కేసుల సంఖ్య పెరుగుతుండగా.. అందులోనూ మహిళలు, యువతులు, మైనర్లే అత్యధికంగా నమోదు కావడం శోచనీయం. కేసుల విచారణలో అధికంగా క్షణికావేశానికి లోనై ఇళ్లు వదిలి వెళ్తున్న సంఘటనలు ఉండగా.. మరికొన్ని కేసులు మూడేళ్లవుతున్నా నేటికీ ఆచూకీ లభించనివి ఉన్నాయి. ఇంకొన్ని ప్రాణాలతో ఇంటి నుంచి వెళ్లి విగతజీవిగా ఇంటికి తిరిగి వస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇటీవల పిల్లల అదృశ్యం కేసుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు వాటిలో మహిళలు, మైనర్లు, ముఖ్యంగా చిన్నారుల మిస్సింగ్లపై రాష్ట్ర పోలీస్బాస్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిత్యం భరోసా కేంద్రం ఆధ్వర్యంలో జీవన విధానంపై గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఘటనలు ఆగకపోవడం శోచనీయం. ఏడాది మిస్సింగ్ కేసులు మైనర్ల మొత్తం మహిళలు/ యువతులు 2023 183 18 233 2024 215 34 300 2025 219 58 322 2026 58 19 64 అభద్రతలో ‘ఆమె’.. జిల్లాలో మూడున్నరేళ్లలో నమోదైన మిస్సింగ్ కేసులు పరిశీలించగా.. మహిళలు, యువతులే అత్యధికంగా ఉండటం గమనార్హం. ఇంటిని చక్కబెట్టే మహిళలు, కుటుంబ పరువుగా భావించే యువతుల మిస్సింగ్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమేనని పలువురు సీనియర్ సిటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 47 కేసులు పెండింగ్.. జిల్లావ్యాప్తంగా గడిచిన మూడున్నర ఏళ్లలో 919 మిస్సింగ్ కేసులు నమోదుకాగా.. 872 కేసులను పోలీసు ఛేదించారు. మరో 47 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2023 నాటి కేసులు 6, 2024 కేసులు 8, 2025 కేసులు 22, తాజాగా 2026లో ఇప్పటి వరకు కేసులు 19 ఉన్నాయి. సాంకేతికతతో ఛేదిస్తున్నాం జిల్లాలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులను మా అధికారుల బృందం ఆధునిక సాంకేతికతను వినియోగించి సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా ఛేదిస్తున్నారు. పెండింగ్లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా ఛేదించాలని ఆదేశాలిచ్చాం. నిరంతరం స్టేషన్ల వారీగా రివ్యూ చేస్తున్నాం. క్షణికావేశంలో ఇంటి నుంచి వెళ్తున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి పంపిస్తున్నాం. – సునీతారెడ్డి, ఎస్పీ ఏడాది వారీగా నమోదైన మిస్సింగ్ కేసులు -
నేడు ఉమ్మడి పాలమూరుకు సీఎం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. మొదట పాలమూరు సమీపంలోని దివిటిపల్లిలో ఉన్న అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను, అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను మహబూబ్నగర్, వనపర్తి కలెక్టర్లు ఖుష్బూగుప్తా, ఆదర్శ్ సురభి వేర్వేరుగా వెల్లడించారు. సీఎం పర్యటించనున్న ప్రదేశాలను మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్, భద్రత ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో వేదిక (డయాస్), సీటింగ్, రాకపోకలు, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా అధికారులు, కంపెనీ ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి వనపర్తి కలెక్టర్, ఎస్పీలతో కలిసి సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో మహబూబ్నగర్, వనపర్తి ఎస్పీ డి.జానకి, సునీతారెడ్డి, వనపర్తి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్, సీఎం సెక్యూరిటీ ఇన్చార్జ్ శ్రీధర్, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయిశివాని, ఆర్డీఓ నవీన్, ఆయా శాఖల అధికారులు, అమరరాజా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పర్యటన షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి 1.15 గంటలకు దివిటిపల్లికి చేరుకుంటారు. 1.20 నుంచి 2.20 గంటల వరకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవం, ప్లాంట్ పర్యటన, ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి 2.45 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత
కొత్తకోట రూరల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి బుధవారం కొత్తకోటలో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. మంగళవారం కొత్తకోటలోని బీపీఆర్ గార్డెన్ ఫంక్షన్హాల్లో విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైందని, భద్రతలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. బందోబస్తును ఎనిమిది సెక్టార్లుగా విభజించామని.. ఎస్పీ, అదనపు ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 54 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ప్రత్యేక బృందాలు, డాగ్ స్క్వాడ్, సెక్యూరిటీ వింగ్, మఫ్టీ పార్టీలు తదితరులతో మొత్తం 850 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి విధుల్లో పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, సెల్ఫోన్లు చూస్తూ లేదా వ్యక్తిగత పనుల్లో నిమగ్నమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్, వీఐపీ రూట్లు, సభా ప్రాంగణం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూనే భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదన్నారు. సమన్వయంతో పనిచేస్తేనే ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమవుతుందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీలు గిరిబాబు, బాలాజీనాయక్, శ్రీనివాసులు, కొత్తకోట, వనపర్తి సీఐలు రాంబాబు, సుగంధరత్నం, కొత్తకోట ఎస్ఐ శివానందంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సమగ్ర వ్యవసాయ పథకం’ వినియోగించుకోవాలి
ఖిల్ల్ఘానపురం: కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న వాతావరణ ఆధారిత సమగ్ర వ్యవసాయ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు కోరారు. మంగళవారం మండలంలోని పర్వతాపురం రైతువేదికలో పథకంపై అవగాహన, అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015 నుంచి 2022 వరకు ఖిల్లాఘనపురం మండలంలోని పర్వతాపురం, ఆగారం, అంతాయపల్లి, వెంకటాంపల్లి, అల్లమాయపల్లి వాతావరణ ఆధారిత సమగ్ర వ్యవసాయ పథకానికి ఎంపికయ్యాయన్నారు. ఈ పథకంలో అప్పట్లో రైతులకు ఒక్కో యూనిట్కు రూ.91 వేల విలువ చేసే గేదెలు, స్ప్రింక్లర్ పైపులు, కోడిపిల్లలు, మొక్కలు అందించామన్నారు. ఆ పథకంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.27 కోట్లు మంజూరయ్యాయని.. గతంలో మాదిరిగా రైతులకు యూనిట్లు అందిస్తామని చెప్పారు. పథకాన్ని ఎలా కొనసాగించాలనే విషయంపై రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, రైతులు పాల్గొన్నారు. ఘనంగా ఆరుద్ర పూజలు కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న దత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని వరుణ సహిత రుద్రహోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. పూజా కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్న ప్రసాద విచారణ చేపట్టారు. స్థల పరిశీలన వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి సమీపంలో ఉన్న పల్లెగుట్టపై అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకుగాను మంగళవారం తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కో–ఆర్డినేటర్ నవత స్థల పరిశీలన చేపట్టారు. అక్కడి సౌకర్యాలు, నేల రకం పరిశీలించి సానుకూలంగా స్పందించారని స్థానిక నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడంతో గతంలోనూ ఈ ప్రాంతాన్ని అధికారులు రెండుసార్లు పరిశీలించారు. వారి వెంట స్థానిక నాయకులు లక్ష్మణ్ నాయుడు, బాలకృష్ణ నాయుడు, బాలరాజుశెట్టి ఉన్నారు. -
‘సర్’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ఖిల్లాఘనపురం: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు సోళీపురం గ్రామంలో జిల్లా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ బాలీశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ మాసీ సభ్యుడు సామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్యతో కలిసి సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్వోలు, బీఎల్ఏలతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారాలు నింపే సమయంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంచడమే కాకుండా వారు ఫారాలు ఎలా నింపారు.. ఏమైనా తప్పులున్నాయా అనే వివరాలను పరిశీలించి తిరిగి తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న బీఆర్ఎస్ బీఎల్ఏలు మాత్రమే కాకుండా చదువుకున్న యువత ముందుకొచ్చి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విషయంలో సహకారం అందించాలన్నారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగిన పార్టీ కార్యకర్త కుమ్మరి కృష్ణయ్యను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి పురేందర్రెడ్డి, సర్పంచ్లు బాలరాజు, గిరమ్మ వెంకటయ్య, ఉప సర్పంచులు పీన్యానాయక్, కృష్ణయ్యగౌడ్ ఉన్నారు. -
పీజీఐ–డీలో సత్తా
ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిన నాగర్కర్నూల్ కల్వకుర్తి టౌన్: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ ) 2025–26 నివేదికలో ఉమ్మడి పాలమూరులో నాగర్కర్నూల్ జిల్లా మరోసారి ప్రత్యేకత చాటుకుంది. పాఠశాల విద్యా ప్రమాణాలను 6 కీలక అంశాలపై విశ్లేషించి రూపొందించిన నివేదికలో మొత్తం 600 మార్కులకు గాను 333 మార్కులు సాధించి.. ప్రచేష్ట–1 గ్రేడ్ దక్కించుకుంది. అలాగే ఉమ్మడి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు బార్డర్ మార్కులతో ప్రచేష్ట–1లో నిలవగా.. మహబూబ్నగర్ మాత్రం ప్రచేష్ట–2కే పరిమితమైంది. ఒకే విధమైన ప్రమాణాలతో.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను ఒకే విధమైన ప్రమాణాలతో అంచనా వేయడానికి కేంద్ర విద్యాశాఖ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ)ను ప్రవేశపెట్టింది. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడంతోపాటు ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దేందుకు ఈ సూచికను రూపొందించారు. ప్రతి జిల్లాకు 600 మార్కుల స్కోరు కేటాయించి వివిధ ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. ఆరు అంశాలే కీలకం.. జిల్లాల పనితీరులో అభ్యసన ఫలితాలు, తరగతి గది బోధన, మౌలిక వసతులు– విద్యార్థుల హక్కులు, పాఠశాల భద్రత– విద్యార్థుల సంక్షేమం, డిజిటల్ లెర్నింగ్, పాలన– నిర్వహణ అనే ఆరు ప్రధాన విభాగాల్లో పరిశీలిస్తారు. ప్రతి విభాగానికి నిర్దిష్ట సూచికలు ఉండగా.. వాటి ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అధికారిక గణాంకాలే.. పాఠశాల విద్యకు సంబంధించిన సమాచారం జిల్లా, రాష్ట్రస్థాయిల్లోని యూడైస్ ప్లస్, ఎన్ఏఎస్, పీఎం పోషణ్, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ తదితర అధికారిక డేటాబేస్ల నుంచి సేకరిస్తారు. రాష్ట్రాలు నివేదించిన అధికారిక సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ పరిశీలించి తుది స్కోర్లు ప్రకటిస్తుంది. అందువల్ల ఈ గ్రేడింగ్ పూర్తిగా ప్రభుత్వ అధికారిక గణాంకాల ఆధారంగానే ఉంటుంది. ప్రమాణాల మెరుగుకు.. ఈ సూచిక ద్వారా ఏ జిల్లా ఏ రంగంలో వెనకబడి ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు ఒక జిల్లాకు అభ్యసన ఫలితాల్లో మంచి మార్కులు వచ్చినా, డిజిటల్ లెర్నింగ్ లేదా మౌలిక వసతుల్లో తక్కువ స్కోరు వస్తే.. ఆయా రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జిల్లాల మధ్య పోటీ పెరిగి విద్యా ప్రమాణాలు మెరుగుపడటానికి ఇది దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన నివేదికలో నాగర్కర్నూల్ ఉమ్మడి పాలమూరులో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ.. డిజిటల్ లెర్నింగ్, పాఠశాల భద్రత, మౌలిక వసతుల విభాగాల్లో స్కోరు పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తే ‘ప్రచేష్ట–1’ నుంచి ‘ఉత్తమ్’ గ్రేడ్ సాధించే అవకాశం ఉంది. బార్డర్ మార్కులతో ‘ప్రచేష్ట–1’ గ్రేడ్ సాధించిన నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు ‘ప్రచేష్ట–2’కే పరిమితమైన మహబూబ్నగర్ బోధన, అభ్యసన ఫలితాలు, పాలనలో మెరుగైన పనితీరు మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్లో మెరుగుదల అవసరం -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
వనపర్తి రూరల్: నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లితండా, రంగాపురం గ్రామాల్లో 23 మంది ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రంగాపురం గ్రామంలో రైతులకు మంజూరైన ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయడంతో పాటు గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణను పరిశీలించారు. గ్రామంలో 80 శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేసినందున బీఎల్వోలను శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన ఓటర్ల పేరు జాబితాలో నమోదు కావడం ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని పేర్కొన్నారు. మిగిలిన నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను కోరా రు. కార్యక్రమంలో పుర చైర్మన్ అక్కి శ్రీని వాస్గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, సర్పంచ్ హే మలత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ రోజారెడ్డి, ఉప సర్పంచ్ నందీశ్వర్, మండల, పట్టణ అధ్యక్షులు రాంరెడ్డి, దయాకర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేస్తాం
● పాలమూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ● రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వనపర్తి: రానున్న సాధారణ ఎన్నికల నాటికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 20కి చేరుతుంది.. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేపట్టిన పర్యటనలో ప్రజల నుంచి లభించిన ఆదరణను చూస్తే, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేస్తుందనే నమ్మకం వచ్చిందని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో రూ. 359.09 కోట్లతో చేపట్టనున్న 171.96 కి.మీ. హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి,, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక రాజీవ్చౌక్లో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. పాలమూరు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 2028 నాటికి అద్దంలాంటి రహదారులను నిర్మిస్తామని అన్నారు. అందులో భాగంగా ఆత్మకూరు రోడ్డు ఆధునికీకరణకు రూ. 6.04 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లా మాధారం నుంచి మార్చాల రోడ్డు విస్తరణకు రూ. 32.96 కోట్లు, వనపర్తి జిల్లాలోని పెద్దదగడ – వెలగొండ రోడ్డు విస్తరణకు రూ. 45.60కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతినెలా రూ. 4.50లక్షల ప్రజాధనాన్ని వేతనంగా తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ 30 నెలలుగా ఫాంహౌస్కు పరిమితమయ్యారని విమర్శించారు. ఓడినా.. గెలిచినా నిత్యం ప్రజల మధ్య ఉండే సీఎం రేవంత్రెడ్డి కావాలో.. ఫాంహౌస్లో ఉండేవారు కావాలో తేల్చుకోవాలని సూచించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రైతు భరోసా, రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీల అమలును ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తోందన్నారు. ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి, జీఎంఆర్ మాట్లాడుతూ..జిల్లా అభివృద్ధికి ఇప్పటికే రూ. 2వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చామని.. మరో రూ.124 కోట్లను మంజూరుచేస్తే, అన్ని ప్రధాన రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, అదనపు కలెక్టర్ వినోద్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్చైర్మన్ మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గ ోవర్ధన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మొర ఆలకించి.. వినతులు స్వీకరించి
● ప్రజావాణిలో అర్జీల వెల్లువ ● సత్వర పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం వనపర్తి/వనపర్తి రూరల్: సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను కలెక్టర్ ఆదర్శ్ సురభితో పాటు అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్కుమార్ తెలుసుకొని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేకపోతే సంబంధిత శాఖకు లేఖ రాసి పంపించాలన్నారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదుదారుడికి తెలియజేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దని అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 60, ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 9 అర్జీలు అందినట్లు ఆయా కార్యాలయాల అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్.తిరుపతయ్య, ట్రెయినీ అదనపు కలెక్టర్లు శ్రావ్య, రజనీకాంత్రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకుపకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి: జిల్లాలోని కొత్తకోటలో ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎస్పీ సునీతారెడ్డితో కలిసి సీఎం పర్యటనపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కొత్తకోటకు చేరుకుంటారని తెలిపారు. 2:15 గంటలకు ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారని.. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఆయా శాఖల అధికారులకు పలు బాధ్యతలు అప్పగించారు. వీసీలో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్ కుమార్, డీఈఓ యాదయ్య, డీఎస్పీ బాలాజీ నాయక్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు రజనీకాంత్, మేడం శ్రావ్య తదితరులు ఉన్నారు. విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి కొత్తకోట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. కొత్తకోటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని 15న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. రూ. 1.77కోట్ల సీఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో బాలికల ఉన్నత పాఠశాల, రూ.33.50 లక్షలతో సీఎంశ్రీ కింద లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు వెల్లడించారు. విద్యార్థినుల సౌకర్యార్థం ఆధునిక వసతులతో కూడిన భవనాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అనంతరం హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్సీ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్అండ్బీ అధికారి దేశ్యా నాయక్ పాల్గొన్నారు. చివరి బిల్లు ఎప్పుడో? ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎదురుచూపులు -
ఆశలు.. అడియాశలు!
ప్రశ్నార్థకంగా మారిన జూరాల ఆయకట్టు సాగు ఎదురుచూస్తున్నాం.. జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని మూలమళ్ల శివారులో 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నా. గత యాసంగిలో కేవలం 5 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. ఈసారైనా పుష్కలంగా నీరు అందుతుందని వరినారు సిద్ధం చేసుకున్నా. ఆరుద్ర కార్తెలో వరినాట్లు వేసుకోవచ్చని అనుకోగా.. ఇప్పటికీ జూరాల డ్యాంకు నీరు చేరలేదు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్నాం. – ఎల్లన్న, కౌలు రైతు, మూలమళ్ల యాసంగిలో కూడా పంట వేయలేదు.. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టుకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకానికి సాగునీటిని విడుదల చేయాలి. యాసంగిలో ప్రాజెక్టులో నీరు లేక ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు క్రాప్హాలిడే ప్రకటించారు. వానాకాలం సాగుకై నా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. – నర్సింహులు, రైతు, అమరచింత ప్రాజెక్టుకు నీరు వస్తేనే.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పుష్కలంగా వస్తేనే కాల్వలకు సాగునీరు వదిలే అవకాశం ఉంటుంది. రైతులు తొందరపడి నారుమడులను వేసుకోవద్దనే విషయాన్ని సైతం ఆయకట్టు గ్రామాల్లో చెప్పడం జరిగింది. ఆయకట్టు రైతులు అధికారుల సూచనలు పాటించాలి. – సమి ఉల్లా, డీఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ అమరచింత: ఈసారి వానాకాలం సాగుపై రైతన్నలు ఆశలు వదులుకునే పరిస్థితులు దాపురించాయి. ఎల్నినో ప్రభావంతో వరుణుడు కరుణించకపోవడం.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద లేక జలకళ తప్పడం వంటి పరిస్థితులతో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రతి ఏటా ఇదివరకే జూరాలకు వరద వచ్చేది. ఆయకట్టు పొలాలు వరిసాగుతో కళకళలాడేవి. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది. గత యాసంగి సీజన్లోనూ ఎడమ కాల్వ పరిధిలో కేవలం 20వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని వదులుతామని ప్రాజెక్టు అధికారులు ప్రకటించడంతో అమరచింత, ఆత్మకూర్, మదనాపురం మండలాలకు చెందిన రైతులు మాత్రమే వరిసాగు చేసుకున్నారు. ఎడమ కాల్వ దిగువన ఉన్న కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల రైతులకు క్రాప్హాలిడే ప్రకటించారు. వానాకాలంలో అయినా వరిసాగు చేసుకుందామని ఆశపడిన ఆయకట్టు రైతులకు.. నిరాశే ఎదురవుతోంది. జూరాల జలాశయంలో క్రమంగా నీటిమట్టం అడుగుంటిపోతుండటంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో జలాశయానికి చేరని వరద గత యాసంగిలోనూ 20వేల ఎకరాలకే సాగునీరు వానాకాలం సాగుపై ఆశలు వదులుకుంటున్న రైతులు ఎడమ కాల్వ పరిధిలో ఇలా.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వపైనే చంద్రఘడ్, అమరచింత, కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకాలు ఆధారపడి ఉన్నాయి. ఈ కాల్వ పరిధిలో ఆయకట్టు విస్తీర్ణం 85వేల ఎకరాలకు చేరింది. జిల్లాలోనే అత్యధికంగా 35 కి.మీ. మేరకు ఎడమ కాల్వ విస్తరించి ఉండటంతో ప్రాజెక్టు ప్రధాన ఆయకట్టు జిల్లా పరిధిలోనే ఉంది. అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, పెబ్బేరు, కొత్తకోట, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు చెందిన కొందరు రైతులు కొంతమేర తమ భూములను ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి ఇచ్చారు. మిగిలిన భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుందని అప్పట్లో రైతులు ఆశపడ్డారు. కానీ ప్రతి సంవత్సరం సాగునీటి సమస్యతో పంట పొలాలను బీడుగా వదిలేస్తున్నారు. -
హైవే కష్టాలు.. ఇంకెన్నాళ్లు?
ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్–44పై ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కొన్నాళ్ల నుంచి హైవేపై అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు సాగుతుండటమే ఇందుకు కారణమవుతోంది. బ్రిడ్జి నిర్మాణం జరిగే చోట పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయడం లేదు. దీంతో పనులు నెలల తరబడిగా సాగుతుండటంతో ప్రతిరోజు ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు ఎన్హెచ్–44 సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే చోట బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అక్కడ అండర్ బ్రిడ్జిల నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, భూత్పూర్ మండలం శేర్పల్లి, మూసాపేట మండలం పోల్కంపల్లి స్టేజీ, జానంపేట, వేముల స్టేజీ, వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజీ, కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద అండర్ బ్రిడ్జిల పనులు చేపడుతున్నారు. ఇందులో బాలానగర్, రాజాపూర్, వేముల స్టేజీ వద్ద సుమారు ఏడాదిన్నర కిందట ప నులు మొదలయ్యాయి. కాగా.. హైవేపై పనులు జ రిగే చోట తీసుకోవాల్సిన కనీస రక్షణ చర్యలను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. రోడ్డు పనులు జరి గే చోట అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలు పా టించడం లేదు. పనులు జరిగే ప్రదేశాల్లో సరైన ఏ ర్పాట్లు చేయకపోవడంతో సర్వీస్ రోడ్లు సక్రమంగా కనిపించడం లేదు. దీంతో వాహనాలు వరుస క్ర మంలో ఢీకొంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బాలానగర్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులతోనిలిచిన వాహనాలు (ఫైల్) దుమ్ముతో తంటాలు బ్రిడ్జి పనులు మొదలైనప్పటి నుంచి విపరీతమైన దుమ్ము షాపులోకి వస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. పనులు ఎప్పుడు పూర్తి అవుతా యో. ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ సమస్యలో సంబంధిత అధికారులు చర్య లు తీసుకుని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. – అనూష, బాలానగర్ ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాం.. బాలానగర్లో ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాం. వారంలో రెండుమూడు రోజులు మా సొంత గ్రామం ఎన్మన్గండ్లకు వచ్చి వెళ్తుంటాను. బాలానగర్ వచ్చిందంటే చాలు ట్రాఫిక్లో చిక్కుకొని సమయం అంతా వృథా అవుతోంది. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేయాలి. – శేఖర్రెడ్డి, వాహనదారు ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్–44పై అండర్ బ్రిడ్జి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం బాలానగర్, రాజాపూర్ వద్ద నిత్యం ట్రాఫిక్ కష్టాలు వేముల స్టేజీ వద్ద నెలల తరబడిగా సాగుతున్న పనులు హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు నరకప్రాయంగా ప్రయాణం గంటల తరబడి ట్రాఫిక్లోచిక్కుకొని వాహనదారుల అవస్థలు ఎక్కడెక్కడ ఎలా అంటే.. బాలానగర్, రాజాపూర్ వద్ద ప్రతిరోజు అరగంట, గంటపాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ అండర్ బ్రిడ్జిల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూసాపేట మండలం వేముల స్టేజీ వద్ద ఏడాదిన్నర కిందట పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికితోడు ఇక్కడ సర్వీస్ రోడ్లను అరకొరగా చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పోలీస్స్టేషన్ వైపు ఒక సర్వీస్ రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై వాహనాలు వెళ్తే దుమ్ముతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అలాగే హనుమాన్ విగ్రహం వద్ద కూడా సర్వీస్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. పోల్కంపల్లి స్టేజీ, వెల్టూరు స్టేజీల వద్ద సర్వీస్ రోడ్ల పనులే చేయిస్తున్నారు. ఇక్కడ వాహనాలు ప్రధాన రోడ్డుపైనే వెళ్తున్నాయి. కనిమెట్ట వద్ద సర్వీస్ రోడ్లు పూర్తి కాగా అండర్ బ్రిడ్జి పనులు సాగుతున్నాయి. వాహనాలు సర్వీస్ రోడ్లపైనే వెళ్తున్నాయి. భూత్పూర్ మండలం శేర్పల్లి(బీ) వద్ద కర్నూ లు వైపు సర్వీస్ రోడ్డు పూర్తికాగా.. వాహనాలు దానిపైనే వెళ్తున్నాయి. హైదరాబాద్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు పూర్తి కాలేదు. అండర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
అవగాహన కల్పించాలి..
ఫార్మర్ రిజిస్ట్రీపై సంబంధిత అధికారులు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన పథకం మేలు గురించి రైతులను చైతన్యపర్చాల్సిన అవసరం ఉంది. చాలామందికి తెలువకపోవడంతో నమోదు చేసుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. – లక్ష్మణ్, రైతు, అమడబాకుల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పంటల బీమా, వివిధ రకాల పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించేందుకు సంబంధిత అధికారులు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. ఫార్మర్ రిజిస్ట్రీపై నేటికీ రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో నమోదు చేసుకోవడం లేదు. – బకెట రాజు, రైతు, కొత్తకోట ఫార్మర్ రిజిస్ట్రీ నిరంతరం కొనసాగే ప్రక్రియ. పలు కారణాలతో కాస్త ఆలస్యంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం వద్ద రైతులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలనే లక్ష్యంతో యూనిక్ కోడ్ నంబర్ కేటాయింపు ప్రక్రియను ప్రారంభించింది. భవిష్యత్లో ప్రభుత్వం అమలు చేసే రైతు సంక్షేమ పథకాల అనుసంధానం చేసే అవకాశం ఉండవచ్చు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకుంటే మంచిది. – షేక్ మున్నా, ఇన్చార్జ్ ఏడీఏ, కొత్తకోట -
డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలి
వనపర్తి: ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంతో పాటు పట్టణంలోని కేడీఆర్నగర్, చందాపూర్లో ఆకస్మికంగా పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి బీఎల్వోలు, సూపర్వైజర్లకు కీలక సూచనలు చేశారు. ప్రతి బీఎల్వో రోజుకు కనీసం 100 ఫారాలను డిజిటలైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే వలంటీర్ల సాయం తీసుకొని ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నింపిన ఫారాలను తప్పనిసరిగా సంబంధిత బీఎల్వోకు తిరిగి అందజేసేలా, లేనిపక్షంలో ఓటరు జాబితా నుంచి పేరు తొలగిపోయే ప్రమాదం ఉందని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను తనిఖీ చేసి 2002 ఎస్ఐఆర్కు సంబంధించిన వివరాలను గుర్తించడంలో పూర్తి సహకారం అందించాలని సూచించారు. కేడీఆర్నగర్లో ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందజేసి సకాలంలో వాటిని సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేయాలని హెచ్చరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని, ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేష్రెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఖమ్మం కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రీ సర్వేకు లైసెనన్స్ సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలని.. వారికి సమాచారం చేరవేసి వచ్చేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, సర్వే ఏడీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
కొత్తకోట రూరల్: విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాసీ్త్రయ దక్పథం అలవర్చుకొని సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలని ప్రముఖ శాస్త్రవేత్త చంద్రశేఖర్రెడ్డి సూచించారు. శనివారం మండలంలోని అమడబాకుల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో చోటుచేసుకుంటున్న ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత, శాసీ్త్రయ పరిశోధనల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అలాగే సేంద్రియ ఆహార పదార్థాలు, వాటిలోని ఔషధ గుణాలు, ఆరోగ్య పరిరక్షణలో వాటి విశిష్టతపై అవగాహన కల్పించారు. భవిష్యత్లో సైనన్స్, టెక్నాలజీ, వైద్య, పరిశోధనా రంగాల్లో ఉన్న అవకాశాలను తెలియజేశారు. 21వ శతాబ్ద నైపుణ్యాలు, శాసీ్త్రయ ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఓ చందన, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐక్య పోరాటాలతోనే సామాజిక న్యాయం : సీపీఐ
వనపర్తి రూరల్: విశాల ఐక్య ప్రజా పోరాటాలతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర నాయకుడు మధుకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం రెండోరోజు జరిగిన పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ‘మతోన్మాదం, లౌకిక వాదం, కేంద్రంలో అమలవుతున్న హిందుత్వ ఫాసిస్ట్ ఎజెండా’ అనే అంశంపై మాట్లాడారు. ప్రజల సంస్కృతి సాంప్రదాయాలపై కులం, మతం అంశాలు పెనవేసుకున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ స్వలాభం కోసం దేశంలో విధ్వేష మత రాజకీయాలకు ఆజ్యం పోస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో దేశ ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థ ప్రమాద ఘంటికలు లెక్కిస్తుందన్నారు. దేశంలో ప్రజల మధ్య తీవ్రమైన ఆర్థిక వ్యత్యాసం పెరిగిపోయిందని, దేశసంపదను కొద్దిమంది అక్రమ పద్ధతుల్లో కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలపై అచంచలమైన విశ్వాసం, అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రముఖ సైకాలజిస్ట్ డా. లక్ష్మణ్ పాల్గొని నాయకత్వ లక్షణాలు అనే అంశంపై వివరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బాలనర్సింహ, జిల్లా కార్యదర్శులు విజయరాములు, ఎస్ఎండీ ఫయాజ్, బాలకిషన్, ఆంజనేయులు, నర్సింహ, నాయకులు కేశవులుగౌడ్, కళావతమ్మ, రమేష్, సురేష్, గోపాలకృష్ణ, శ్రీరాములు, మోషా, భాస్కర్, కృష్ణవేణి, గీత, ఎండీ కుతుబ్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
వనపర్తిటౌన్: మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే 4వ తెలంగాణ రాష్ట్రస్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ మీట్కుగాను సోమవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14 పోటీలకు 18.07.2012–17.07.2014 మధ్య జన్మించిన బాలబాలికలు, అండర్–16 పోటీలకు 18.07.2010–17.07.2012 మధ్య జన్మించిన వారు, అండర్–18 పోటీలకు 18.07.2008–17.07.2010 మధ్య జన్మించిన వారు, అండర్–20 పోటీలకు 18.07.2006 – 17.07.2008 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. అండర్–14లో 600 మీటర్లు, ట్రయోత్లోన్–ఏ,బీ,సీ, అండర్–16లో వెయ్యి, 2 వేల మీటర్లు, అండర్–18లో 800, 1,500, 3 వేల మీటర్లు, అండర్–20లో 800, 1,500, 5 వేలు, 10 వేల మీటర్లు, ఉమెన్ ఆండ్ మెన్ కేటగిరీలో 800, 1,500, 3 వేలు (ఉమెన్), 5 వేల మీటర్లు (మెన్ ), 10 వేల మీటర్ల పరుగు పందెం పోటీలు ఉంటాయని వివరించారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకు స్థానిక స్టేడియం గ్రౌండ్లో రిపోర్ట్ చేయాలని.. పూర్తి వివరాలకు సెల్నంబర్ 94413 53375 సంప్రదించాలని సూచించారు. -
నమోదు.. నత్తనడక!
2006లో నేను ఆర్మీలో చేరే ముందు అప్పటి ఉమ్మడి పాలమూరు కలెక్టర్ ఉషారాణి ఆర్మీ శిక్షణ కోసం ఉచిత వసతి కల్పించి ప్రోత్సహించారు. చాలామంది మాజీ సైనికులు మమ్మల్ని భారత సైన్యంలోకి పంపించేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్, రాత పరీక్షపై అవగాహన కల్పించారు. వారి స్ఫూర్తితో తాము జిల్లాలోని యువతను అగ్నివీర్ విభాగంలోకి పంపించేందుకు కృషిచేస్తున్నాం. తొలిసారే అనుకున్న మేరకు అగ్నివీరులను తయారు చేశాం. రెండో బ్యాచ్ను సిద్ధం చేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. సాధ్యమైనంత కాలం ఈ ఉచిత ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ కొనసాగిస్తాం. – మహేష్, మాజీ సైనికుడు, జై జవాన్, జై కిసాన్ ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వాహకులు, వనపర్తి 9 రోజులు.. రూ.99.04 కోట్లు జమ : ఎమ్మెల్యే వనపర్తి రూరల్: నియోజకవర్గంలోని 92,115 రైతుల ఖాతాల్లో కేవలం 9 రోజుల్లో రూ.99.04 కోట్ల రైతుభరోసా నిధులు జమ చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70,40,286 మంది రైతుల ఖాతాల్లో రూ.8,759.60 కోట్లు జమ చేయడం ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జిల్లాలో 1,83,011 మంది రైతులకు రూ.212.57 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామని.. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన అనేక వ్యవసాయ రాయితీలను గత ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తుచేశారు. ప్రతి రైతు కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు త్వం అండగా నిలుస్తుందని వివరించారు. మంత్రాలయానికి ప్రత్యేక బస్సు కొత్తకోట: ఈ నెల 14న అమావాస్య సందర్భంగా మంత్రాలయం, పంచముఖి ఆంజనేయస్వామి దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా డీలక్స్ బస్సు నడుపుతున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ శనివారం తెలిపారు. 14వ తేదీ మంగళవారం వనపర్తి బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి పంచముఖి ఆంజనేయస్వామి దర్శనానంతరం మంత్రాలయం చేరుకుంటుందని.. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు తిరిగి బయలుదేరుతుందని వివరించారు. టికెట్ ధర ఒక్కరికి రూ.600గా నిర్ణయించామని.. ఆసక్తిగల ప్రయాణికులు వనపర్తి బస్టాండ్ రిజర్వేష న్ కౌంటర్ నంబర్ 73828 29151, 73828 29379 బుక్ చేసుకోవచ్చని సూచించారు. శనేశ్వరుడికి అభిషేకాలు కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు తిలతైలాభిషేకాలు జరిపించినట్లు అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. పూజారి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తి మేరకు పూజించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచ్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆర్మీ సెలెక్షన్ కోసం ఫిజికల్ ఫిట్నెస్ వ్యాయామం చేస్తున్న యువకులు మా గ్రామం ఆర్మీ జవాన్లకు పుట్టినిల్లు లాంటిది. మండలంలోనే అతిచిన్నదైన మా గ్రామంలో సుమారు 38 మంది యువకులు భారత సైన్యంలో పని చేస్తున్నారు. అలాంటి దేశభక్తులు ఉన్న గ్రామంలో పుట్టిన నేను కూడా భారత సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకోవాలనే పట్టుదలతో అగ్నివీర్లో స్థానం దక్కించుకున్నాను. – మొహిలా అలీ, కొన్నూరు గ్రామం, మదనాపురం వనపర్తి: సాయుధ దళాల్లో యువశక్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పేరుతో సైనిక నియామక పథకం రూపొందించింది. ఈ విభాగంలో చేరిన వారిలో 75 శాతం మంది సైనికులను నాలుగేళ్లకు ఇంటికి పంపిస్తారు. అందుకు తగిన ఆర్థిక భరోసా కల్పిస్తూ.. మిగతా 25 శాతం మంది సైనికులకు అర్హత పరీక్షల ఆధారంగా పదోన్నతలు కల్పించి దేశ రక్షణకు ఉపయోగించుకుంటారు. వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సైనికులు మొదట్లో వేర్వేరుగా.. కొద్దిరోజుల నుంచి కలిసి యువతకు శిక్షణ ఇస్తూ అగ్నివీరులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశరక్షణ వ్యవస్థలో అత్యంత ఆధునికతతో నిర్వహించే అగ్నివీర్ (అగ్నిపథ్)లోకి పంపించేందుకు ఫిజికల్, రాత పరీక్షలపై ఉచిత శిక్షణ ఇస్తూ.. యువతను ప్రోత్సహిస్తుండటం.. అందుకు దేశభక్తి గల యువకులు ఆసక్తి చూపిస్తుండటంతో అనుకున్న మేరకు ఫలితాలనిచ్చాయి. ఈ క్రమంలోనే 2025– 26లో జారీ చేసిన నోటిఫికేషన్లో జిల్లాకు చెందిన మాజీ సైనికులు పి.మహేష్, గబ్బర్సింగ్ ట్రైనింగ్ ఇచ్చిన 16 మందితో పాటు పెద్దమందడి ముందరితండాకు చెందిన మరో యువకుడు ఎంపికయ్యారు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చే వీరు ఒక్కొక్కరు వందమంది యువకులను దేశ రక్షణ కోసం తయారు చేసేలా ప్రస్తుత మాజీ సైనికులు శిక్షణ ఇస్తూ చైతన్యం చేస్తున్నారు. గతంలో పలుమార్లు సైన్యంలోకి వెళ్లాలని నోటిఫికేషన్ వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకుని వెళ్లాను. కానీ, ఫలితం దక్కలేదు. మాజీ సైనికులు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వారితో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అగ్నివీర్లో చోటుదక్కింది. ఆర్మీలో ఫిజికల్ ట్రైనర్గా పనిచేసిన వారు కావడంతో వారిచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది. – రాఘవేంద్ర, ద్వారకానగర్, మదనాపురం ●సుమారు 18 ఏళ్లు సైన్యంలో పనిచేసిన మాజీ సైనికుడు పి.మహేష్ తనవంతుగా దేశరక్షణ కోసం యువతను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ‘జై జవాన్.. జై కిసాన్.. ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్’ సెంటర్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి.. కలెక్టర్ ఆదర్శ్ సురభితో యువతకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు అనుమతి పొందారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధాన భవనం వెనక భాగంలో యువతకు ఫిజికల్ ఎడ్యుకేషన్పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈయన ఆర్మీలో ఏఐపీటీగా నాలుగేళ్ల అనుభవం ఉండటంతో ఒక సైనికుడికి కావాల్సిన ఫిట్నెస్ యువతలో కలిగేలా శిక్షణ ఇస్తూ.. అగ్నివీర్ విభాగానికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గత బ్యాచ్లో తన శిష్యులు ఏడుగురు ఉద్యోగం సాధించగా.. మరో మాజీ సైనికుడు గబ్బర్సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న మరో తొమ్మిది మందిని ఇప్పటికే అగ్నివీర్కు పంపించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి మరో 15 మందికి ఫిజికల్ ఎడ్యుకేషన్పై శిక్షణ ఇస్తున్నారు. గుర్తింపు లేకుంటే సంక్షేమ పథకాలపై ప్రభావం అవగాహన లేదంటున్న అన్నదాతలు నిరంతర ప్రక్రియ అంటున్న అధికారులు -
అగ్నివీరులు..!
దేశ రక్షణకు యువత ముందడుగు ● 2025– 26లో వనపర్తి జిల్లా నుంచి 17 మంది ఎంపిక ● యువతలో ఆసక్తిరేపుతున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ల ఉచిత శిక్షణ ● 2027 నోటిఫికేషన్ కోసం మరో 15 మందికి తర్ఫీదు ● ఆర్మీలో ఏఐపీటీగా పనిచేసిన అనుభవంతో మెరుగైన శిక్షణకు అవకాశం ● -
బీఆర్ఎస్ నేతల మాటలు హాస్యాస్పదం
● నేను లోకల్.. ఎవరినీ మోసం చేయలేదు ● వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి: ‘నాగర్కర్నూల్ ప్రాంతంలో పుట్టి పాన్గల్లో పెరిగి వనపర్తిలో రాజకీయం చేసే వాళ్లు నన్ను విమర్శిస్తే ప్రయోజనం శూన్యమే.. నియోజకవర్గంలో పుట్టి పెరిగాను నేను లోకల్.. ఇక్కడే రాజకీయం చేస్తున్నా’ అంటూ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తరహాలో పాలు పిండినా.. టిప్పర్ నడిపినా.. వ్యవసాయం చేశా.. కానీ ఎవరినీ మోసం చేయలేదంటూ సంచలన వాఖ్యలు చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలపై మాటల దాడి చేశారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, రోడ్ల విస్తరణ కొంత భాగం, వైద్య, వ్యవసాయ కళాశాలలు బీఆర్ఎస్ హయాంలోనే చేపట్టారు.. అంతమాత్రాన గడిచిన 28 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని నిత్యం మీడియా ముందు మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి రూ.2,147 కోట్లు తీసుకొచ్చామని.. వివరాలు కావాలంటే చర్చకు వస్తే జీఓలు చూపిస్తామని బదులిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పెబ్బేరు, శ్రీరంగాపూర్ తదితర ప్రాంతాల్లో 55 వేల ఎకరాలకు భీమా, జూరాల కాల్వలతో సాగునీరందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని.. కానాయపల్లి వద్ద రింగ్బండ్, అల్లీపూర్ గేట్ వద్ద గండికొట్టి నీళ్లు మలిపి తామే సాగునీటి కాల్వల రూపకర్తలమని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 13,167 మంది లబ్ధిదారులకు రూ.79.89 కోట్ల ఆర్థిక సాయాన్ని 17 విడతలుగా అందించామన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత చెల్లి కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప చేతగాదుగాని.. సీఎం రేవంత్రెడ్డిని విమర్శించేందుకు ఒంటికాలుపై నిలబడటం హాస్యాస్పదంగా ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న రూ.1,400 కోట్ల లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన్ను ఓడించే దమ్ము బీఆర్ఎస్, బీజేపీకి లేవన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న వారు హుందాగా వ్యవహరించాలని, నిత్యం బూతు పురాణం వినిపిస్తే.. ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోలేరని పేర్కొన్నారు. -
అమరచింతలో కమలం.. కొత్తకోటలో గులాబీ...
అమరచింత/కొత్తకోట రూరల్: కొత్తకోట చేనేత సహకార సంఘంలో బీఆర్ఎస్.. అమరచింతలో బీజేపీ ప్యానల్ అభ్యర్థులు విజయం సాధించారు. కొత్తకోటలో 9 డైరెక్టర్ స్థానాలకుగాను 8 బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలువగా.. అమరచింతలో మొత్తం తొమ్మిది స్థానాలను బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. విజేతలకు రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అమరచింతలో తిరుమల రఘురాం, మేర్వ అనిల్, మ్యాడం కృష్ణయ్య, పారుపల్లి గోవర్ధన్, ఎంకంపల్లి శ్రీను, వగ్గు వెంకటేష్, తిరుమల రఘు, మహంకాళి సులోచన, నాగమణి గెలుపొందారు. అదేవిధంగా కొత్తకోట చేనేత సహకార సంఘంలో సాక నర్సింహ, దిడ్డి చంద్రశేఖర్, జన్ను లలిత, పగడాకులు నర్సమ్మ, సాక ఆంజనేయులు, సాంబరి వెంకటస్వామి, పగడాకుల రాములు, జన్ను సత్యనారాయణ, మహంకాళి వెంకటయ్య విజయం సాధించగా.. విజేతలను ఆయా పార్టీల నాయకులు పూలమాలలు వేసి సన్మానించి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. -
అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
వనపర్తి రూరల్: అంతరాలు లేని సమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యమని, అందుకు ప్రజలను చైతన్యం చేసి పోరాడాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సీపీఐ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుల మూడు రోజుల శిక్షణ తరగతుల ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు యుద్ధకాంక్షతో నరమేధాన్ని సృష్టిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ రామ మందిరంతో పేరుతో అధికారంలోకి వచ్చి, అదే రామ మందిరంలో దొంగలు పడి రూ.కోట్లు కొల్లగొడుతున్నా.. ప్రధాని మోదీ నేటికీ పెదవి ఇప్పకపోవడం సరైందికాదన్నారు. ఆరు గ్యారెంటీల అమలు అంతంతే.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యం పెరిగిందని, అర్హులెవరికీ ఇళ్లు కేటాయించిన దాఖలాలు లేవని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగులను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి, కేఎల్ఐ, భీమా, జూరాల పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు విజయరాములు, బాలకిషన్, ఆంజనేయులు, రాష్ట్ర సమితి సభ్యుడు కేశవులుగౌడ్, నియోజక వర్గ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు కళావతమ్మ, నరసింహ, శ్రీరామ్, మోష, గోపాలకృష్ణ, సురేష్, ఇందిర, కృష్ణవేణి, గీత, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత.. గుండెకోత!
నీరు లేక వెలవెలబోతున్న సరళాసాగర్ ● వానాకాలంలో వీడని జలగండం ● ముదురుతున్న నారుమడులు ● 9 గ్రామాలు.. 4,200 ఆయకట్టు ● కాల్వల్లో పారని జలం.. ఆందోళనలో ఆయకట్టు రైతులు రెక్కల కష్టం నమ్మి అప్పు చేసి నారుమడి పోశా. కాల్వల్లో నీరు పారుతోందని పొలాన్ని దున్ని సిద్ధం చేశా. కాల్వలకు నీటిని ఎప్పుడు వదులుతారని అధికారులను అడిగితే ఇప్పుడు అప్పుడు అంటున్నారే తప్ప వదలడం లేదు. ఇంకొద్ది రోజులు నీరు రాకపోతే నారు ముదిరి పనికిరాకుండా పోతుంది. అధికారులు సత్వరమే స్పందించి మోటార్లు ప్రారంభించాలి. – రాజ్కుమార్, ఆయకట్టు రైతు, శంకరమ్మపేట సరళాసాగర్ 4,200 ఎకరాల ఆయకట్టు ఉన్న జలాశయం. కాల్వల ద్వారా నీరు వస్తుందని 9 గ్రామాల ఆయకట్టు రైతులు బోరుబావుల కింద నారుమడులు పోశారు. జూరాల, రామనన్పాడు నిండే వరకు ఊరుకుంటే వానాకాలం సీజన్ దాటిపోతుంది. సమస్యను అధికారులకు విన్నవించినా స్పందించడం లేదు. కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రామన్పాడు మోటార్లు ప్రారంభించాలి. – వంగూరు రామకృష్ణారెడ్డి, మదనాపురం ఏటా జూలై కల్లా సాగునీరు పారేది. పైప్లైన్ పనులు పూర్తి కావడంతో రామన్పాడు జలాశయంలో ఉన్న కాస్త నీటినైనా పంటల సాగుకు అందించాలని అనుకున్నాం. రెండ్రోజుల్లో ప్రారంభిస్తాం. – వెంకటయ్య, చైర్మన్, సరళసాగర్ జలాశయం మదనాపురం: వానాకాలం.. కాల్వల్లో వరద పారుతోందనే ఆశతో ఆయకట్టు రైతులు అప్పులు తెచ్చి చెమటోడ్చి వరి నారుమడులు పోశారు. సీజన్ ముగుస్తున్నా.. నేటికీ నీటి జాడ కనిపించకపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఆయకట్టు రైతులు ఉన్నారు. మండలంలోని చారిత్రాత్మక సరళసాగర్ జలాశయం ప్రస్తుతం నీరులేక వట్టిపోయి కనిపిస్తోంది. నారు ముదిరిపోతుండటంతో ఆయకట్టు పరిధిలోని 9 గ్రామాల రైతులు వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడా.. కాల్వల్లో నీరు ఎప్పుడు పారుతుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కూలీలకు బతుకుదెరువు కరువు.. ఈ ఏడాది నీరు రాకపోతే సాగు విస్తీర్ణం పడిపోయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. వేలాదిమంది వ్యవసాయ కూలీలకు పనులు కరవవుతాయి. కొంతకాలంగా సరళాసాగర్ ఆయకట్టుకు శాపంగా మారిన రైల్వేవంతెన కింద పైప్లైన్ పనులు రెండు, మూడురోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రతి ఏటా ఈ పాటికే ఎగువన కురిసే భారీ వర్షాలకు కృష్ణానది ఉరకలెత్తి జూరాల గేట్లు ఎత్తడంతో రామన్పాడు జలాశయం పూర్తిస్థాయిలో నిండేది. కానీ ఈసారి కృష్ణానదికి వరద రావడం ఆలస్యమైంది. రామన్పాడులో ఆశించిన మేర నీరు లేదని అధికారులు మోటార్లు ప్రారంభించడంలో జాప్యం చేస్తున్నారు. రైల్వేవంతెన కింద ఉన్న పైప్లైన్ పనులు తుది దిశకు చేరుకున్నాయి. కాల్వల ద్వారా నీటిని వదలడానికి అంతా సిద్ధంగా ఉన్నా.. రామన్పాడు జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటిమట్టం మోటార్లు నడపడానికి తగినంతగా లేదు. నీటిమట్టం పెరిగిన వెంటనే మోటార్లు ప్రారంభిస్తామని, సరళాసాగర్ ఆయకట్టుకు నీటిని వదులుతామని నీటిపారుదలశాఖ ఏఈ వరప్రసాద్ వివరించారు. సరళాసాగర్ ఎడమ ఎడమ కాల్వ కింద శంకరమ్మపేట, దంతనూరు, మదనాపురం, తిర్మలాయపల్లి, వడ్డెవాట, అజ్జకొల్లు, రామన్పాడు గ్రామాల్లోని 3,800 ఎకరాలు, కుడి కాల్వ కింద కొన్నూరు, నర్సింగాపురం, నెల్విడి గ్రామాల్లోని 400 ఎకరాల ఆయకట్టు ఉండగా.. రైతులు పూర్తిగా వరి సాగు చేస్తారు. వ్యవసాయానికి జూన్, జూలై నెలలు అత్యంత కీలకమైనవి.. ఈ సమయంలో నీరు అందితేనే నాట్లు సకాలంలో పడి పంట కాలం సజావుగా సాగుతోంది. బోరుబావులున్న రైతులు ఉన్న నీటితో నారుమడలైతే సిద్ధం చేసుకున్నారు. ప్రధాన పొలాల్లో నాట్లు వేయాలంటే భారీగా నీరు అవసరం.. కాల్వల్లో నీరు పారకపోతే పోసిన నారుమడ లు ఎండిపోయి పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుంది. -
పనితీరే ప్రజల విశ్వాసానికి పునాది : ఎస్పీ
వనపర్తి: పనితీరే ప్రజల విశ్వాసానికి పునాది.. రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, నాణ్యత ఉంటేనే పోలీసుశాఖపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆమె వనపర్తి సర్కిల్ కార్యాలయాన్ని ఆమె సందర్శించగా డీఎస్పీ గిరిబాబు, సీఐ సుగంధ రత్నం పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సర్కిల్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు వివరాలను సీఐని అడిగి తెలుసుకున్నారు. ప్రతి రికార్డును నిబంధనలకు అనుగుణంగా నవీకరిస్తూ కేసుల దర్యాప్తును నాణ్యతతో నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, డిజిటల్ నమోదు, సిబ్బంది క్రమశిక్షణ వంటి అంశాల్లో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని.. ప్రజలతో స్నేహపూర్వకంగా, మర్యాదగా వ్యవహరిస్తూ సేవలు అందించాలని సూచించారు. ఎస్పీ వెంట డీసీఆర్బీ ఎస్ఐ శివకుమార్, సర్కిల్ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
‘సర్’ను నిర్లక్ష్యం చేస్తే చర్యలు : కలెక్టర్
వనపర్తి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండలస్థాయి అధికారులు, బీఎల్వోలతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవలం 15 రోజుల గడువు మిగిలి ఉండగా ఇప్పటి వరకు కేవలం 24 శాతమే డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ వేగాన్ని మరింత పెంచి నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కోరారు. బీఎల్వోలకు గ్రామపంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించాలని, ప్రతి పోలింగ్ కేంద్రానికి 3 వలంటీర్లను నియమించి ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ వేగవంతం చేయాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా పని చేయాలని, అలసత్వం ప్రదర్శిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న 15 రోజులు ఎస్ఐఆర్ పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని, తహసీల్దార్ అనుమతి లేకుండా ఎవరూ సెలవులు తీసుకోవద్దని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పూరించడంలో అవసరమైన సాయం అందించాలని, రోజూ 100 ఫారాల డిజిటలైజేషన్ లక్ష్యంగా పనిచేస్తూ 20వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘చేనేత’ ఎన్నికలు
● అమరచింతలో 88, కొత్తకోటలో 90 శాతం ఓటింగ్ నమోదు ● ఓటేసేందుకు ఇతర గ్రామాల నుండి తరలొచ్చిన నేతన్నలు ● సీఐ నేతృత్వంలో బందోబస్తు అమరచింత: జిల్లాలోని అమరచింత, కొత్తకోటలో శుక్రవారం జరిగిన చేనేత సహకార సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. అమరచింత చేనేత సహకార సంఘం పరిధిలో అమరచింత, తిప్పడంపల్లి, చిన్నచింతకుంట, లాల్కోట, ముచ్చింతల గ్రామాలు ఉండగా.. ఆయా గ్రామాల చేనేత కార్మికులు పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగగా.. ఓటర్లు వరుసలో నిలబడి తమ ఓటు వేశారు. అమరచింతలో ఎన్నికల అధికారి ప్రసాదరావు ప్రొసీడింగ్ అధికారులకు సూచనలిస్తు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 762 మంది ఓటర్లుండగా.. 676 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారు సైతం వచ్చిన ఓటు వేశారు. అమరచింతలో 88 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. సమయం ఇవ్వాలంటూ వాగ్వాదం.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసినా.. మధ్యాహ్నం రెండు వరకు అని సమాచారం ఇచ్చారని, దీంతో చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారంటూ ఎస్ఐ స్వాతితో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్, వనపర్తి నుంచి ఓటర్లు వచ్చారని.. సమయం లేదని పోలింగ్ నిలిపివేయడం ఏమిటని ఆందోళనకు దిగారు. దీంతో కేంద్రం వద్ద కొంత సమయం ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఐ జోక్యం చేసుకుని ఎన్నికల అధికారిని బయటకు పిలిపించి ఎన్నికల సమయం చెప్పించడంతో ఆందోళన సద్దుమణిగింది. కొత్తకోట చేనేత సహకార సంఘంలో 76 మందికి ఓటు హక్కు ఉండగా.. 62 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించినట్లు ఎన్నికల అధికారి మహబూబ్ అలీ తెలిపారు. ప్రశాంతకర వాతావారణంలో ఎన్నికలు జరిగాయని వెల్లడించారు. -
గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు
వనపర్తి: గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని.. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. గ్రామ వనరులను వినియోగించుకొని ఆదాయాన్ని పెంచుకోవాలని, జీపీ యాప్లో ప్రొఫైల్స్ అప్డేట్ చేయాలన్నారు. పారిశుద్ధ్య పనులు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని కోరారు. తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అయితేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా జాబ్కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి పని కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని కార్యక్రమాలు అమలు జరిగేలా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకొని ఎన్యూమరేషన్ ఫారాలను పూరించడం, ఆన్లైన్ చేయడం వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీవో రఘునాథ్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ శ్రావ్య, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు
వనపర్తి: ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల ఆధారంగా రైతులు పంటల సాగు చేపట్టేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. అనంతరం నీటిపారుదల, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించి జూరాల, రామన్పాడు జలాశయాల్లో నీటినిల్వలు, రిజర్వాయర్లలోకి వస్తున్న వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూరాలకు ఎగువ నుంచి ఎలాంటి ప్రవాహం లేవని, మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు బాగా కురిస్తే ఆల్మట్టి నుంచి నీరు వదిలినప్పుడే వచ్చే అవకాశం ఉందని, అవి తాగునీటికి సరిపోతుందని ఇరిగేషన్ సీఈ రహీమొద్దీన్ వివరించారు. మండలాల వారీగా రైతులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేసే విధంగా అవగాహన కల్పించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలన్నారు. మినుములు, కంది తదితర పంటలు సాగు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. వీడియో కాన్ఫరెనన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, డీఏఓ ఆంజనేయులు, ఉద్యానవ అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు చేనేత ఎన్నికలు
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. శుక్రవారం ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు వెల్లడించారు. అమరచింత సహకార సంఘంలో 760 ఓట్లు ఉండగా.. మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 250 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు 14 మంది సిబ్బందిని కేటాయించారు. అదేవిధంగా కొత్తకోట చేనేత సహకార సంఘంలో 78 మంది ఓట్లు ఉండగా.. ఒకే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు నలుగురు సిబ్బందిని నియమించారు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల దూరం వరకు దుకాణాలు తెరవకుండా ముందస్తు సమాచారం ఇచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కోరినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. సాయంత్రం ఫలితాలు వెల్లడించి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుందని రిటర్నింగ్ అధికారి వివరించారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
జవహార్ నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులు
వనపర్తి: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ సురభి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు http s:// navodaya.gov.in వెబ్సైట్లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న ఆయా జిల్లాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. అతిథి ఉపాధ్యాయులకు.. ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ (ఇంగ్లీష్ మీడియం) విద్యాలయలో అతిథి ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి లలిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ (ఒకేషనల్ కోర్సు) బోధించుటకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా కళాశాలకు వచ్చి దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. దరఖాస్తునకు చివరి గడువు 11వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. బ్యాంకు సేవలు మరింత చేరువ వీపనగండ్ల: ౖరెతులు, విద్యార్థులు, వృద్ధులకు తమ బ్యాంకు సేవలను మరింత చేరువ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటామని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నాగర్కర్నూల్ రీజినల్ మేనేజర్ సంగీత అన్నారు. గురువారం మండల కేంద్రంలో కొత్త బ్రాంచ్ను సర్పంచ్ మీసాల పార్వతమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 943 శాఖలు కొనసాగుతున్నాయని, రైతులకు పంట రుణాలు, సాగు సామగ్రి కొనుగోలుకు అవసరమయ్యే రుణాలతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు, కొత్త ఖాతాలు తెరుస్తున్నామని వివరించారు. ఖాతాదారులకు మొబైల్ ఏటీఎం ద్వారా మెరుగైన సేవలు అందజేస్తామన్నారు. బ్యాంకు అభివృద్ధికి మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్, బ్రాంచ్ మేనేజర్ మదర్వలీ, క్యాషియర్ అరుణ్కుమార్, ఉపసర్పంచ్ బాలపీరు, వార్డు సభ్యుడు పెబ్బేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా?
ఖిల్లాఘనపురం/గోపాల్పేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి సంబంధించిన వివరాలతో రాజీవ్చౌక్కు వస్తామని.. తొమ్మిదిన్నర బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన ఆధారాలతో రావాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. గురువారం ఖిల్లాఘనపురంలోని పద్మశాలి కల్యాణ మండపంలో ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాలు, గోపాల్పేట మండలం బుద్దారం గండి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో జరిగిన గోపాల్పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రాంతాల్లో మార్కెట్యార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండు మార్కెట్యార్డులు ఏర్పాటు చేయడంతో ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట్, ఏదుల, రేవల్లి మండలాల రైతులకు మేలు చేకూరుతుందన్నారు. నూతన పాలకవర్గ సభ్యులు నిరంతరం రైతుల మేలు కోరి పని చేస్తుండాలని.. రైతులకు మేలుచేసే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో కల్వకుర్తి కాల్వ తీస్తే దానికి రెండు ప్రాంతాల్లో రంధ్రాలు చేసి తాము సాగునీరు తెచ్చామని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇక్కడి నాయకులు మంత్రులుగా ఉండి కూడా రైతులకు చేసిందేమీ లేదన్నారు. త్వరలోనే మహిళా సంఘాల ద్వారా రైస్మిల్లులు ఏర్పాటు చేయించబోతున్నామని చెప్పారు. పొలికెపాడు, బుద్దారం శివారులో రూ.60 కోట్లతో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని.. జీఓ వచ్చిందన్నారు. ఏ ఒక్క కుటుంబానికి రేషన్కార్డు ఇవ్వని గత పాలకులు అలా చెప్పడం సిగ్గుచేటన్నారు. ఖిల్లా ఘనపురంలో జరిగిన కార్యక్రమంలో చైర్పర్సన్ నవనీత, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, డైరెక్టర్లు, మార్కెట్యార్డు జిల్లా అధికారి పుష్పలత, నాయకులు రవీంధర్రెడ్డి, మురళీధర్రెడ్డి, సాయిచరణ్రెడ్డి, క్యామ వెంకటయ్య, వెంకటేశ్వరరావు, బాలకృష్ణారెడ్డి, క్యామరాజు, పద్మమ్మ, రమేష్, ఆగారం ప్రకాష్, కృష్ణయ్య పాల్గొన్నారు. -
ఓట్లు తొలగించేందుకు కుట్ర : బీఆర్ఎస్
ఆత్మకూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నాయని.. అర్హులైన వారి ఓట్లు తప్పిపోకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు కార్యదీక్షతో ముందుకెళ్లాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో పార్టీ మండల అధ్యక్షుడు రవికుమార్యాదవ్ నివాసంలో నిర్వహించిన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్ఏలు బీఎల్వోలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారి ఓట్లు నమోదు చేసుకునేలా సహకరించాలని సూచించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పడకేసిందని.. హామీలే తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. పుర మాజీ చైర్పర్సన్ గాయత్రి, మాజీ ఎంపీపీలు బంగారు శ్రీనివాసులు, విరేష లింగం, మాజీ వైస్ ఎంపీపీ కోటేష్, యుగంధర్రెడ్డి, రామకృష్ణ, రియాజ్ అలీ పాల్గొన్నారు. -
చిన్నారులతో పనులు చేయిస్తే చర్యలు..
బడిలో ఉండాల్సిన చిన్నారులతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. అధికారుల బృందం ఏటా రెండుసార్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. చిన్న పిల్లలతో పనులు చేయిస్తూ పట్టుబడితే యజమానులపై కేసులు నమోదు చేస్తాం. ఇప్పటి వరకు పలువురికి జరిమానాలు కూడా విధించాం. – సుధారాణి, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ ●వనపర్తి: బాల కార్మికులను గుర్తించి వారికి ఉజ్వల భవిష్యత్ అందించేందుకు ప్రభుత్వం 12 ఏళ్లుగా ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోంది. ఆయా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అధికారుల బృందం 30 రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహించి భిక్షాటన చేస్తున్న, ప్రమాదకర, సాధారణ పనులు చేస్తున్న బాలకార్మికులను గుర్తించి వారికి వసతితో పాటు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఒకవేళ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి పనులు చేయిస్తే వారి సొంత ప్రాంతం, కుటుంబంతో కలిపే సౌకర్యాలను అధికారుల బృందం కల్పిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు పేర్కొన్న ఘటనల్లో రాజస్థాన్ నుంచి వచ్చిన బాలలను ఎక్కువగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఏడాది పట్టుబడిన బాల కార్మికులు బాలురు బాలికలు మొత్తం 2023 68 11 79 2024 42 04 46 2025 71 03 74 2026 9 – 9 ఆపరేషన్ ముస్కాన్లో గుర్తించిన బాలకార్మికులు ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్.. జూలైలో ఆపరేషన్ ముస్కాన్ 12 ఏళ్లుగా కొనసాగుతున్న తనిఖీలు ఇప్పటి వరకు పట్టుబడిన చిన్నారులు 968 పని ప్రదేశం నుంచి నేరుగా పాఠశాలకే.. -
వృత్తి నైపుణ్యాలకు వేదిక పోలీస్ డ్యూటీ మీట్
వనపర్తి: పోలీసు డ్యూటీ మీట్లు వృత్తి నైపుణ్యాలకు పదును పెట్టే ఉత్తమ వేదికలని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. ఇటీవల మహబూబ్నగర్లో నిర్వహించిన డ్యూటీ మీట్–2026లో పతకాలు సాధించిన వారికి గురువారం ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతిభ కనబర్చారని ఎస్పీ ప్రశంసించారు. మొత్తం 11 పతకాలు సాధించగా.. అందులో 5 బంగారు, 5 రజత, 1 కాంస్య ఉన్నట్లు వెల్లడించారు. జిల్లా వాసులు రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్కు అర్హత సాధించినట్లు వివరించారు. ఇలాంటి పోటీలు పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసే నైపుణ్యం, క్లిష్ట పరిస్థితులను వేగంగా విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతి సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతాయని తెలిపారు. ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, షీటీం, భరోసా ఎస్సై అంజద్ తదితరులు పాల్గొన్నారు. -
రహదారుల ప్రగతి పరుగులు
● అలంపూర్– అయిజ, ఎరిగేర 57 కి.మీ, గద్వాల– ఎర్రవల్లి 9 కి.మీ., బలిగెర– మాచర్ల 5 కి.మీ., గద్వాల– రాయచూర్ 22 కి.మీ., గట్టు– మాచర్ల 5 కి.మీ., 6 ప్రధాన రహదారుల విస్తరణ ● వనపర్తి– ఆత్మకూర్ రహదారిలో పరిధిలో 0 నుంచి 31కి.మీ., వరకు బీటీ రోడ్డు, ఆత్మకూర్– మరికల్ రోడ్డు 13.40 కి.మీ. విస్తరణ అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రహదారులను విస్తరించడంతోపాటు మరమ్మతు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల టెండర్లకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా హ్యామ్ విధానం ద్వారా రహదారులను అభివృద్ధి చేయనుంది. దీంతో జిల్లాలో ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్ల ముఖచిత్రం మారబోతోంది. ఇందులో భాగంగా మొదటి దశలో మహబూబ్నగర్ ఆర్అండ్బీ సర్కిల్లో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి 2 ప్యాకేజీల్లో మొత్తం 378.04 కి.మీ., మేర రోడ్లను నిర్మించనున్నారు. అలాగే వనపర్తి సర్కిల్లో వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో మొదటి దశలో 18 రహదారులను 2 ప్యాకేజీల కింద ఎంపిక చేసిన మొత్తం 319.4 కి.మీ., మేర నిర్మించనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా చివరి దశలో ఉంది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టింది. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం ప్రభుత్వం ముందుగా భరిస్తోంది. మిగిలిన 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు బ్యాంకు ద్వారా రుణం పొంది రోడ్లను నిర్మిస్తారు.కాంట్రాక్టర్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లిస్తుంది. ఈ విధానం ప్రకారం కాంట్రాక్టర్ నిర్మించిన రహదారులను 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఆర్అండ్బీ సర్కిళ్ల వారీగా నిర్మించే హ్యామ్ రోడ్లు.. జిల్లా ప్యాకేజీలు రోడ్ల కి.మీ., వ్యయం సంఖ్య (రూ.కోట్లలో) మహబూబ్నగర్ 2 26 378.04 912.67 వనపర్తి 2 18 319.4 697.77 హ్యామ్ రోడ్లలో ఉమ్మడి పాలమూరుకు పెద్దపీట నాలుగు ప్యాకేజీల కింద 697.44 కి.మీ., మేర ఆధునికీకరణ రూ.1,610.44 కోట్లతో 44 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రణాళిక ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం మారనున్న గ్రామీణ ప్రాంత రహదారుల ముఖచిత్రం ఎంపిక చేసిన రోడ్లు ఇవే.. బుద్దారం నుంచి మరికల్ వరకు 33 కి.మీ., రోడ్డును 10 మీటర్లుగా విస్తరించి ఆధునికీకరించనున్నారు. వనపర్తి– బుద్దారం 11.60 కి.మీ., రోడ్డు స్టెతన్ చేయనున్నారు. మంగనూర్ నుంచి తెలకపల్లి వరకు 45.50 కి.మీ రోడ్డును ఆధునికీకరణ. బల్మూర్– నాగర్కర్నూల్ (పీడబ్ల్యూడీ) 13 కి.మీ., రోడ్డును రెండు వరుసలుగా విస్తరణ. ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్, మామిళ్లపల్లి, రాకొండ వరకు 28.40 కి.మీ. మేర రెండు వరుసలు. పదర, వంకేశ్వరం, చిట్లంకుంట, ఉడిమిళ్ల, ఇప్పలపల్లి వరకు 34.20 కి.మీ., సింగిల్ రోడ్డును రెండు వరుసలుగా విస్తరణ. పెంట్లవెల్లి ఎక్స్రోడ్డు నుంచి కొండూరు, తూంకుంట మీదుగా శ్రీరంగాపూర్ వరకు 0 నుంచి 3 కి.మీ., మేర రెండు వరుసలుగా విస్తరణ, 3 నుంచి 28.16 కి.మీ వరకు డబుల్ లైన్ తారు పునరుద్ధరణ పనులు. చిన్నంబావి– చెల్లెపాడు 14.20 కి.మీ., రోడ్డును ఆధునికీకరణ. కొల్లాపూర్– వనపర్తి మధ్య కేతేపల్లి నుంచి వీపనగండ్ల వరకు 11.10 కి.మీ., సింగిల్ రోడ్డును డబుల్గా విస్తరణ మహబూబ్నగర్– నవాబ్పేట 18.30 కి.మీ., జడ్చర్ల– మాచారం 20 కి.మీ., మరికల్– మినాస్పూర్ (ధన్వాడ, లింగంపల్లి మీదుగా) 37.68 కి.మీ., మక్తల్– నారాయణపేట (ఊట్కూర్ మీదుగా) 25.68 కి.మీ., రాజాపూర్– తిర్మలాపూర్ 10 కి.మీ., మహబూబ్నగర్– మంగనూర్, వేపూర్ జెడ్పీ రోడ్డు– కొమిరెడ్డిపల్లి (షేక్పల్లి, కురుమూర్తి టెంపుల్ రోడ్డు), గుడిబండ– తిర్మలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్కొండ (మల్కాపూర్, మణికొండ మీదుగా), జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్త మొల్గర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. -
నీటి ధార ఎక్కడ..?
చెరువులు, కుంటల్లో తగ్గిన నీటి మట్టం చర్యలు చేపట్టాలి... ప్రతి వేసవిలో తాగునీటి కష్టాలు వస్తూనే ఉన్నాయి. దీనికితోడు వానాకాలం వచ్చిన వర్షాలు కురవక పోవడంతో గ్రామాల్లో నీటి సరఫరాలో కోతలు పెడుతున్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పాలకులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు నీటిని అందించాలి. – మండ్ల రామకృష్ణ, మాజీ కౌన్సిలర్, ఆత్మకూర్. భూగర్భ జలం తగ్గుతోంది ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండడంతో పాటు ఆశించిన వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. వరి పంటలు ఎక్కువగా సాగు చేస్తుండడంతో నీటి వినియోగం పెరిగి బోర్ల వాడకం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోతున్నాయి. ప్రతి ఇంటికి ఒక ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవడంతో పాటు చెరువులు, కుంటలు, చెక్డ్యాంలలో నీరు నిల్వ ఉంటే భూగర్భజలం పెరుగుతుంది. – ఉమేష్, భూజల విజ్ఞానవేత్త, వనపర్తి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం జిల్లాలోని తాగునీటి పథకాల నుంచి నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటి సరఫరా చేపడుతున్నాం. తాగునీటి పథకాలను ప్రస్తుతం నీటి కొరత సమస్యలు లేదు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. ముందస్తుగా 1,150 బోర్లు, 450 చేతిపంపులతో పాటు ట్యాంకర్లను వినియోగిస్తున్నాం. జిల్లా ప్రజలు తాగునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – అంజద్పాష, ఈఈ, మిషన్ భగీరథ ఆత్మకూర్: వానాకాలం ప్రారంభమైన నెల గడుస్తున్నా.. జిల్లాలో వర్షం పడిన దాఖలాలు లేవు. దీంతో చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గిపోతుంది. దీంతో భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు ఏకంగా 2 టీఎంసీలకు పడిపోగా.. రామన్పాడు రిజర్వాయర్లో కూడా ఆశాజనకంగా ఏమి లేదు. ఈ కారణంగా తాగునీటి ముప్పు ముంచుకొస్తుంది. తాగునీటి ఇబ్బందులు రానీయకుండా ఎండాకాలంలో మిషన్ భగీరథ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. కానీ ప్రస్తుతం ఎండల తీవ్రత, గాలుల వేగానికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందంటున్నారు. జిల్లాలోని 6.46 లక్షల మంది అవసరాలు తీర్చేందుకు నిత్యం మిషన్ భగీరథ పథకం ద్వార 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీలకు 27.6 ఎంఎల్డీ (మిలియన్ లీటర్లు ఫర్ డే), గ్రామాలకు 48.435 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్పైనే తాగునీటి పధకాలు కొనసాగుతున్నాయి. జూలైలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యమ్నాయంగా మార్గాలను చూసు కుంటూ బోర్లు, చేతిపంపులు, ట్యాంకర్లను సిద్ధం చేశామని అధికారులు పేర్కొంటున్నారు. వనపర్తి జిల్లాలో.. 2 టీఎంసీలకు పడిపోయిన జూరాల నిల్వలు ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు 255 గ్రామాలు, 6.46 లక్షల జనాభా.. నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటి సరఫరా తాగునీటి సరఫరా.. భూగర్భ జలాల వివరాలు (మీటర్లలో..) -
పకడ్బందీగా శిక్షణా తరగతుల నిర్వహణ
వనపర్తి: పంచాయతీల సమగ్ర అభివృద్ధి, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, పరిపాలనా అంశాలపై జిల్లాలో సర్పంచులకు పకడ్బందీ ప్రణాళికతో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యానాయక్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జీపీ సాప్ అమలు, పరిపాలనా అంశాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్కు జిల్లా నుంచి హాజరైన అదనపు కలెక్టర్ జిల్లా పరిస్థితులను మంత్రికి వివరించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమైన ఆయన గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని, గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వీధి దీపాలు, మురుగు నీటి పారుదల, హరితహారం, ప్రజా వసతులు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. బుధవారం నుంచే జిల్లాలో మూడు రోజుల పాటు ఏర్పాటు చేయనున్న శిక్షణ తరగతులకు సర్పంచులు అందరూ విధిగా హాజరు కావాలన్నారు. వీబీ జీ రామ్ జీ చట్టంపై ప్రతి సర్పంచ్, కార్యదర్శికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ రఘునాథ్రెడ్డి, అధికారులు ఉన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
వనపర్తి రూరల్: రాష్ట్రంలో నిరుపేదలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన, ఆధునిక యాంత్రీకరణ సేవలు అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులతో కలిసి ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. జనరల్ వార్డులోని రోగులతో మాట్లాడి, అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మందుల దుకాణం, రక్త పరీక్షల కేంద్రం, భోజనశాలను సందర్శించి నాణ్యతను పరిశీలించారు. ఆస్పత్రిని పర్యవేక్షిస్తున్న ఆర్ఎంఓ ప్రసాద్తో వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో జరుగుతున్న లోపాలు, అవసరమైన నియామకాలను, స్థానిక డిమాండ్ను పరిశీలించేందుకు సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి, తమ దృష్టికి వచ్చిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేందుకు రెండు నెలల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులపై పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యే, మంత్రులు, సీఎం స్థాయి వరకు తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జబ్బార్, బాల్రెడ్డి, గోపి, మండ్ల రాజు, పట్టణ కార్యదర్శి పరమేవ్వరచారి తదితరులు పాల్గొన్నారు. -
చికెన్ వేస్టేజ్ వేలం రూ.32.52 లక్షలు
వనపర్తిటౌన్: 2026–27 ఆర్థిక సంవత్సరం మార్చి 30 నాటికి 9 నెలల కాలం పరిమితికి వనపర్తి మున్సిపాలిటీలో నిర్వహించిన చికెన్, మటన్, చేపల వ్యర్థాల సేకరణకు మున్సిపల్ చైర్పర్సన్ మాధవి అధ్యక్షతన మంగళవారం పుర కార్యాలయంలో వేలం నిర్వహించారు. వేలానికి 14 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ తరఫున వేలాన్ని రూ.12 లక్షలకు మొదలుపెట్టగా.. ఒక్కొక్కరు పోటాపోటీగా వేలం పాడటంతో చివరకు వెంకటయ్య అనే వ్యక్తి రూ.32.52 లక్షలకు చికెన్ వేస్టేజ్ వేలాన్ని దక్కించుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 12 నెలలకు రూ.15.50 లక్షలకు చికెన్ వేస్టేజ్ వ్యర్థాల సేకరణ వేలాన్ని దక్కించుకోగా.. ఈ ఏడాది రెండింతలకు పైగా వేలం పాడటంతో మున్సిపాలిటీకి తొమ్మిది నెలల కాలానికే రూ.32.52 లక్షల ఆదాయం సమకూరనుంది. అలాగే జంతు వధశాల వేలానికి ఒకే దరఖాస్తు రావడంతో రూ.1,08,900 కు గోర్ల జగన్నాథం దక్కించుకున్నారు. వారాంతపు సంతకు ఎలాంటి టెండర్లు దాఖలు చేయకపోవడంతో వేలాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జి.మధుసూదన్ గౌడ్, కమిషనర్ బి. నిరంజన్, ఆర్ఐ రాజ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అశోక్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు పాకనాటి కృష్ణ, పరశురాం, మహేశ్వరి, విజయలక్ష్మి, క్రాంతికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఆత్మకూర్/అమరచింత: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ది, క్రీడలు, యువజన, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆత్మకూర్, అమరచింత మండలాల్లో రాష్ట్ర కల్లు గీత సహాకార సంఘం వైస్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్తో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఆత్మకూర్ మార్కెట్ యార్డులో రూ.85 లక్షలతో నూతన భవన నిర్మాణానికి, అమరచింత మండలంలోని చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం మరమ్మతుల కోసం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూరాల గ్రామం వద్ద రూ.122 కోట్ల నిధులతో బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఆత్మకూర్లో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణం త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల మరమ్మతుల కోసం 6.60 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రితో రైతు వాగ్వాదం.. చెరువులను నింపుతామని అమరచింత లిఫ్టుకు రూపకల్పన చేశారని, అలాంటిది లిఫ్టు నీటితో చెరువులను నింపకుండా రైతులను ఆగం చేస్తున్నారని స్థానిక రైతు వెంకటయ్య మంత్రి వాకిటి శ్రీహరితో వాగ్వాదానికి దిగారు. నాగిరెడ్డిపల్లిలో చెరువు నీటితో కొందరికి మాత్రమే ప్రయోజనం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు దాటినా మిట్టనందిమళ్ల రోడ్డు మరమ్మతు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదని గ్రామస్తులు నిలదీశారు. దీంతో సభలో కాస్త గందరగోళం మారింది. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఆత్మకూర్ మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, పురచైర్పర్సన్ నాగమణి, వైస్చైర్మన్ నల్గొండ శ్రీను, రాజేందర్ రెడ్డి, చుక్క ఆశిరెడ్డి, సర్వారెడ్డి, వెంకట్ రెడ్డి, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి
వనపర్తి: గ్రామాల్లో ఓటరు జాబితా సవరణపై కార్యక్రమంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ.. పార్టీ శ్రేణులు, కార్యకర్తల ఓట్లను కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నాయకులకు సూచించారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఎల్ఓలకు సమర్పించే ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు సక్రమంగా రాయకున్నా.. ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. బీఎల్ఓలతో పాటు పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త, నాయకుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు దొంగ ఓట్లను నమోదు చేయించేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని, అలాంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాలన్నారు. తప్పులు లేకుండా నింపాలి గోపాల్పేట: మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరహరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిముఖ్య అతిథులుగా హాజరైన కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎన్యూమరేషన్ ఫారాలపై అవగాహన కల్పిస్తూ తప్పులు లేకుండా వాటిని నింపేలా కార్యకర్తలు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
పాన్గల్: మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏడు రకాల వరి సన్న విత్తనాలను కొనుగోలు చేసిన రైతుల వివరాలను ఆన్లైన్ లైసెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓఎల్ఎమ్ఎస్)లో తప్పక నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు ఆదేశించారు. మంగళవారం మండలంలోని దొండాయిపల్లి రైతువేదికలో పాన్గల్ డివిజన్ స్థాయి ఓఎల్ఎమ్ఎస్పై విత్తన డీలర్లకు నిర్వహించిన శిక్షణ, సమీక్ష సమావేశంలో డీఏఓ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతుల అవసరాలకు అనుగుణంగా మినుము, కంది, జొన్న తదితర ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను తగిన నిల్వలో అందుబాటులో ఉంచుకోవాలని ఆయన డీలర్లకు సూచించారు. రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటనే సాగు చేయకుండా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. రైతులు విత్తనం, ఎరువులు కొనుగోలు చేసిన సమయంలో తప్పక రశీదు తీసుకోవాలన్నారు. గడువు తీరిన, నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏఓ మణిచందర్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల ఏఓ డాకేశ్వర్గౌడు, బీటీఎం సునీత, విత్తన డీలర్లు పాల్గొన్నారు. -
నందిమళ్లలో టెన్షన్.. టెన్షన్
మహబూబ్నగర్ క్రైం/ అమరచింత: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిమళ్ల గ్రామానికి చెందిన కిషోర్కుమార్రెడ్డి జైలు నుంచి పరారై.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్వగ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. అమరచింత మండలంలోని నందిమళ్ల గ్రామానికి చెందిన కిషోర్కుమార్రెడ్డి ట్రాక్టర్ నడుపుతూ, వ్యవసాయం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమించి.. గత నెల 2న పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అమరచింత పోలీస్స్టేషన్లో జూన్ 7న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. జూన్ 10న పోలీసులు ఇద్దరిని ఆత్మకూర్ స్టేషన్కు తీసుకువచ్చారు. అమ్మాయి మైనర్ (మేజర్ కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది) కావడంతో కిశోర్కుమార్రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసి జూన్ 12న రిమాండ్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించారు. సదరు బాలికను వనపర్తి సఖి సెంటర్లో ఉంచారు. దాదాపు 25 రోజులపాటు జైలు జీవితం గడిపిన కిశోర్కుమార్రెడ్డి సోమవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి తప్పించుకొని స్వగ్రామానికి చేరుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటీ ఖైదీలతో చెస్ ఆడి.. జైలు నుంచి పరారైన కిశోర్కుమార్రెడ్డి అర్ధరాత్రి వరకు జైలులో తోటీ ఖైదీలతో చెస్ ఆడినట్లు తెలుస్తోంది. జైలు నుంచి తప్పించుకోవాలని ముందే ప్రణాళిక వేసుకున్నాడా..? లేక అప్పటికప్పుడు ఆలోచించి తప్పించుకున్నాడా.. అనేది స్పష్టత లేదు. జనరల్ బ్యారక్లో అందరి మధ్య ఉన్న అతను ఒంటరిగా వెనక భాగం వైపు వెళ్లినప్పుడు విధుల్లో ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారనేది ప్రశ్నగా మారింది. జైలులో సాధారణంగా అధికారులు, సిబ్బంది 24 గంటలపాటు అప్రమత్తంగా ఉంటారు. కానీ, ఒక రిమాండ్ ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నాడంటే జైలులో భద్రతా లోపంపై విమర్శలు వస్తున్నాయి. సుదీర్ఘంగా విచారణ జిల్లా జైలు నుంచి ఖైదీ పరారైన విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జైలుకు చేరుకున్నాడు. అప్పటి నుంచి సాయంత్రం వరకు ఖైదీ పరారైన ఘటనపై సుదీర్ఘంగా విచారణ సాగించారు. మహబూబ్నగర్ జిల్లా జైలు జైలు నుంచి రిమాండ్ ఖైదీ తప్పించుకొని రావడంతో కలకలం తాను ప్రేమించిన అమ్మాయి కావాలంటూ గొడవ.. ఆత్మహత్యాయత్నం జిల్లా జైలులో బయటపడిన భద్రత డొల్లతనం.. జైళ్ల శాఖ డీఐజీ విచారణ స్వగ్రామంలో కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న కిశోర్కుమార్రెడ్డి నేరుగా స్వగ్రామానికి వచ్చాడన్న సమాచారంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కిశోర్ తమ ప్రేమ పెళ్లిని కాదని విడదీసిన పంచాయతీ పెద్దలను దూషిస్తూ.. తన ప్రియురాలు లేని జీవితం తనకు వద్దంటూ నానో యూరియా తాగడంతో సర్వత్రా కలకలం రేగింది. తాను పేదవాడినని, ఖాళీగా తిరుగుతున్నాననే సాకుతో తమను విడదీశారని, అమ్మాయిని కలవకుండా మైనర్ అని సఖి కేంద్రంకు పంపారనే కారణాలతో కిశోర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. వనపర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిశోర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. -
ఎన్నికల బరిలో 20 మంది
అమరచింత: అమరచింత చేనేత సహకార సంఘం ఎన్నికల బరిలో 20 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి ప్రసాదరావు తెలిపారు. సోమవారం నలుగురు నామినేషన్లను ఉపసంహరించుకోగా మిగిలిన వారు ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థులకు గుర్తులను కేటాయించడంతో ఎన్నికల కోలాహలం నెలకొంది. పదోతేదీన ఎన్నికలు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు మంగళవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలు జరిగితే సంఘం ద్వారా రూ.లక్ష ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన ఉండటంతో మూడు రోజులుగా ఏకగ్రీవానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. మొత్తం 9 డైరెక్టర్ స్థానాలకు 20 మంది బరిలో ఉండగా.. వీరిలో 16 మంది పురుషులు, నలుగుగురు మహిళలు ఉన్నారు. -
99.87 శాతం ఫారాల పంపిణీ పూర్తి
వనపర్తి: జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోందని.. ప్రస్తుతం 99.87 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని రెవెన్యూ అదనపు టి.వినోద్కుమార్ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. వనపర్తి నియోజకవర్గంలో 2,75,570 మంది ఓటర్లుండగా.. ఇప్పటి వరకు 2,75,214 మంది ఓటర్లకు బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారన్నారు. ప్రస్తుతం పూరించిన ఫారాలను తిరిగి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని.. ఇప్పటి వరకు 17,411 దరఖాస్తులు డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 ఓటర్లు మించకుండా, 2 కిలోమీటర్ల పరిధి దాటకుండా రేషనలైజేషన్ తయారు చేసే ప్రక్రియ సైతం ప్రారంభించినట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీలు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జెడ్పీ సీఈఓ యాదయ్య, శిక్షణ కలెక్టర్ శ్రావ్యతో కలిసి హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి పరిశీలించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరగగా.. మొత్తం 44 అర్జీలు దాఖలైనట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి 11 వినతులు వచ్చినట్లు ఆర్డీఓ సుబ్రమణ్యం తెలిపారు. -
ఎరువుల పిచికారీతో కాపాడుకోవచ్చు..
కొన్నిరోజులుగా వర్షాలు కురవకపోవడంతో సాగు చేసిన మెట్టపంట మొక్కల వేర్లు పోషకాలను సేకరించలేవు. కావున నీటిలో కరిగే ఎరువులను ఉపయోగించి మొక్కల ఆకులపై పిచికారీ చేస్తే పంటను కాపాడుకోవచ్చు. 13–0–45 పొటాషియం నైట్రేట్ లీటర్ నీటిలో పది గ్రాములు కలపాలి. మరో రకం 19–19–19 నత్రజని, భాస్వరం, పొటాష్ను అందిస్తే వడదెబ్బ తిన్న మొక్క త్వరగా కోలుకుంటుంది. ఈ పద్ధతితో పంట ఎండిపోకుండా కాపాడుకోవచ్చు. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి, వనపర్తి ● -
రక్షణ చర్యలు చేపట్టాలి..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో చారిత్రక శిలాశాసనాలు, పురాతన విగ్రహాలు ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు స్థానికులపై ఉంది. పురావస్తు అధికారులు వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. జటప్రోల్ మధనగోపాలస్వామి ఆలయం వంటి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషిచేయాలి. – శివకృష్ణ యాదవ్, కొల్లాపూర్ మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన కాలభైరవ విగ్రహం, 11వ శతాబ్దానికి చెందిన శేషశయన విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోనే టూరిజం అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామంలోని పురాతన విగ్రహాల రక్షణ, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలి. – అశోక్నంద, మల్లేశ్వరం ● -
గడువులోగా వివరాల నమోదు
వనపర్తి: ఎన్నికల సంఘం నిర్ణయించిన గడువు జూలై 24లోగా పూరించిన ఎన్యూమరేషన్ ఫారాల్లోని వివరాలను యాప్లో నమోదు చేయాలని ఓటరు నమోదు అధికారి, ఆర్డీఓ సుబ్రమణ్యం బీఎల్వోలను ఆదేశించారు. ఆదివారం పుర పరిధిలోని గాంధీనగర్, హరిజన్వాడ, నాగవరంలో ఉన్న 120, 122, 123, 160, 170 పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులు, పర్యవేక్షకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పూరించే విధానం పరిశీలించి పలు సూచనలు చేశారు. ఓటర్లతో ఫారాలను తప్పులు లేకుండా పూరించి నిర్ణీత గడువులోగా యాప్లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ఓటర్లతో మాట్లాడి ఫారాలు నింపడంలో తలెత్తుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పూరించిన ఫారాలను కచ్చితంగా తిరిగి బీఎల్వోలకు ఇవ్వాలని.. లేనిపక్షంలో ఓటరు జాబితాలో పేరు నమోదు కాదని అవగాహన కల్పించారు. -
ఆశించిన స్థాయిలో లేదు..
ప్రభుత్వం డిగ్రీలో వివిధ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మూడు దశల్లో పూర్తి అయ్యింది. అయినా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు. ఈ క్రమంలో ఎప్ సెట్ వంటి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిస్తే మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని తెలుస్తుంది. ప్రభుత్వం త్వరలో మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్కు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ అవుతాయి. కౌన్సెలింగ్లో విద్యార్థులు ఏ కళాశాల ఎంపిక చేసుకుంటే అందులో సీటు వస్తుంది. – చంద్రకిరణ్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్, ఆడిట్సెల్ ● -
విధేయులకు మినహాయింపులున్నాయా..?
● ఒకే కేంద్రం పరిధిలో రెండు ఘటనలు వెలుగులోకి.. ● జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ ● ఐదుగురిపై సస్పెనన్ వేటు.. పోలీస్ కేసులు నమోదు ● అధికార పార్టీ విధేయులకు మినహాయింపు ఇచ్చారా? వనపర్తి: జిల్లాలో ఎప్పటిలాగే యాసంగి సీజన్లోనూ వరి ధాన్యం కొనుగోళ్లు భారీగా చేపట్టారు. సుమారు 300కుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించారు. కొనుగోళ్లు తుదిదశకు చేరుకున్న సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ పరిధిలోని పాన్గల్ మండలం మాందాపూర్లో కొందరు పాత ధాన్యం విక్రయించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా అధికారులు విచారణకు ఆదేశించిన విషయం విధితమే. ఒకే గ్రామంలోని ఒకే కేంద్రం (ఐకేపీ) పరిధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇందులో ఒకటి శ్రీరంగాపురం మండలంలోని గోదాంలో ధాన్యం నిల్వ చేసే సమయంలో అక్కడి గోదాం ఇన్చార్జ్లు గుర్తించగా.. మరో ఘటనలో వికయ్రానికి లారీలో తీసుకొచ్చిన ధాన్యం పాతదిగా అధికారులు గుర్తించి పౌరసరఫరాలశాఖ అఽధికారులకు సమాచారం ఇవ్వటంతో విచారణ చేపట్టి నిర్ధారించుకున్నారు. రెండు వేర్వేరు కేసులు పాన్గల్ పోలీస్స్టేషన్లో నమోదు కావడం గమనార్హం. ఈ రెండు ఘటనల్లో అదే గ్రామానికి చెందిన రెండు మిల్లర్ల కుటుంబాలకు చెందిన వారిపై అభియోగాలు రావడం ఆలోచించాల్సిన అంశంగా చెప్పవచ్చు. మిల్లర్లు, అధికారుల వాదనలకు పొంతన లేకపోయినా.. మొదటి ఘటనపై స్వయంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఏఈఓ, ఏపీఎంల నిర్లక్ష్య ధోరణి ఉన్నట్లు గుర్తించి చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వారిచ్చిన సమాధానం సంతృప్తిగా లేదని సస్పెన్షన్ వేటు వేసినట్లు సంబంధిత శాఖల జిల్లా అధికారులు ధ్రువీకరించారు. కేంద్రంలో గుర్తించకపోవడం ఏమిటి..? పాత ధాన్యం విక్రయానికి తీసుకొస్తే కొనుగోలు కేంద్రం నిర్వాహకులు గుర్తించకపోవడానికి కారణం ఏమిటి..? ఒకవేళ కేంద్రంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుంటే మార్గమధ్యంలో ధాన్యం మార్చారా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారా..? ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ లారీకి బదులు ప్రైవేట్ లారీలో ధాన్యం తరలించడంతో పాత ధాన్యం అందులోకి వచ్చిందా అనే కోణంలో విచారణ చేశారా అనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడం శోచనీయం. పాత ధాన్యం విక్రయానికి వ్యవసాయ విస్తరణ అధికారి టోకెన్ ఎలా జారీ చేశారనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు జిల్లావ్యాప్తంగా ఇంకా ఎన్నెన్ని జరిగాయోనన్న చర్చలు లేకపోలేదు. ఇందిరాక్రాంతి పథం విభాగానికి వస్తే.. గ్రామ అధికారి లేకపోవడం, ఇన్చార్జ్ బాధ్యతలు ఎవరికై నా ఇచ్చారా.. ఇస్తే ఈ విషయంపై వారి పాత్ర ఏమిటనే విషయం ఈ సందర్భంగా చర్చకు రాకపోవడం ప్రశ్నించాల్సిన అంశమే. పాత వరి ధాన్యం విక్రయాల ఉదంతంలో కొందరు అధికార పార్టీకి విధేయులైన ఉద్యోగులు ఉన్నారు. వారిపై చిన్నపాటి కారణాలు చూపించి చర్యలను తప్పించారనే విమర్శలు పాన్గల్ మండలంతో పాటు డిపార్ట్మెంట్లో వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో సూత్రధారులైన మరికొందరిని అధికార పార్టీ నేతలు కాపాడినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. వీఆర్ఏల సస్పెన్షన్లోనూ అధికార పార్టీ పెద్ద నాయకుల నుంచి ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై వివరణ కోసం రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ను ఫోన్లో సంప్రదించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
జిల్లాలో పురాతన విగ్రహాలు, శిలాశాసనాలకు రక్షణ కరువు
● దశాబ్దాలుగా నిరాధరణకు గురవుతున్న వైనం ● చారిత్రక ఆలయాల సంరక్షణ సైతం పట్టని యంత్రాంగం ● టూరిజం సర్క్యూట్ నిధులు మంజూరై ఏడాదైనా కానరాని పురోగతి కొల్లాపూర్: ఉమ్మడి జిల్లాలోని పలు దేవాలయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. భవిష్యత్ తరాలకు చరిత్రను తెలియజెప్పే శాసనాలను సైతం ఈ ప్రాంతంలో గుర్తించారు. కానీ, వాటిని పూర్తిస్థాయిలో పరిరక్షించడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. చారిత్రక ఆలయాలు, పురాతన దేవతామూర్తుల విగ్రహాలు, శిలాశాసనాల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వివిధ కారణాలతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రాభవం కోల్పోతున్న జటప్రోల్.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోల్ సమీపంలో కృష్ణానది తీరాన కొన్ని శతాబ్దాల క్రితం సురభి రాజులు అద్భుతమైన శిల్పకళతో మధనగోపాలస్వామి ఆలయం నిర్మించారు. రాజుల పాలనలో ఈ ఆలయంలో ప్రతిఏటా నెల రోజులపాటు జాతర సాగేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆలయం నీటిలో మునిగిపోవడంతో తర్వాతి కాలంలో జటప్రోల్లో పునర్నిర్మించారు. కొన్నేళ్లపాటు పూజలు యథాతథంగా సాగినా.. కాలక్రమంలో ఈ ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయింది. జటప్రోల్లోనే ఉన్న అగస్తేశ్వర ఆలయం, 19 మూకగుడుల నిర్వహణను సైతం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆదరణ లేక.. జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్థ్యమున్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. మంచాలకట్ట వద్ద కృష్ణానది తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయంలో దేవతామూర్తులు నిత్య ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోవడం లేదు. అమరగిరి సమీపంలో కృష్ణాతీరంలోనే మునులు ప్రతిష్ఠించిన మల్లయ్యస్వామి గుడి పరిస్థితి కూడా ఇంతే. పెద్దకొత్తపల్లి మండలం దేవల్తిర్మలాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో తిరుపతిగా ఒకప్పుడు పేరుండేది. క్రమంగా ఆ గుడి ప్రాభవం కోల్పోతోంది. పెంట్లవెల్లిలోని శివాలయం, చిన్నంబావి మండలం బెక్కెం సమీపంలోని సూర్యదేవాలయం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ శివాలయం, నందీశ్వరాలయం, బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్లోని ఆలయాలకు సరైన ఆదరణ లభించడం లేదు. శాసనాలు, విగ్రహాల పరిస్థితి అంతే.. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్లో 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శిలాశాసనం ఉంది. దీన్ని పట్టించుకునే వారే లేరు. కొల్లాపూర్లోని ఆర్ఐడీ కళాశాల సమీపంతోపాటు పలు ప్రాంతాల్లో సురభిరాజులకు సంబంధించిన శాసనాలు ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన దేవతామూర్తుల విగ్రహాలు పూజలకు నోచుకోవడం లేదు. సోమశిలలో పురాతన విగ్రహాలను మ్యూజియంలో ఉంచగా.. కొన్ని చెట్ల కిందే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పురాతన విగ్రహాలు, శిలాశాసనాలు చాలా చోట్ల రక్షణ లేకుండా ఉన్నాయి. సాస్కీ నిధులపైనే ఆశలు.. సోమశిల పరిసర పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి కోసం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ (సాస్కీ) ద్వారా కేంద్రం రూ.68.10 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వినియోగం, పర్యాటక అభివృద్ధి అంశాలను గతేడాది రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు. సోమశిల, అమరగిరి, జటప్రోల్, మంచాలకట్ట, మల్లేశ్వరం ప్రాంతాలను తిలకించారు. సాస్కీ నిధులతోనైనా పురాతన ఆలయాలు, విగ్రహాలకు పూర్వవైభవం తీసుకొచ్చే పనులు త్వరగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
కాల్వలు ఇలా.. నీరు పారేదెలా..?
ఖిల్లాఘనపురం మండలం అల్లమాయపల్లి సమీపంలో కమాలొద్ధీన్పూర్ బ్రాంచ్ కెనాల్లో ఏపుగా పెరిగిన జమ్ము మద్దిగట్ల రోడ్ సమీపంలో పైపుల వద్ద ఇసుక మేటలు ఖిల్లాఘనపురం మండలంతో పాటు ముసాపేట, అడ్డాకుల మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన కేఎల్ఐ కాల్వలు జమ్ము, ముళ్లపొదలతో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పైపుల్లో ఇసుక మేటలు వేయడంతో నీరు ముందుకు పారని పరిస్థితి నెలకొంది. బిజినేపల్లి మండలంలోని మంగనూరు శివారులో కేఎల్ఐ ప్రధాన కాల్వ నుంచి ఖిల్లాఘనపురం, కమాలొద్ధీన్పూర్ బ్రాంచ్ కెనాల్స్కు నీటిని వదులుతారు. అన్ని గ్రామాల చెరువులకు నీరు పారేలా చిన్న కాల్వలు తవ్వారు. చెరువులు నిండిన తర్వాత మిగిలిన నీరు పెద్ద వాగుకు చేరుతుంది. ప్రస్తుతం రెండు ప్రధాన కాల్వల్లో ఇసుక మేటలు వేయడంతో పాటు జమ్ము, ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. వీటిని తొలగిస్తే తప్పా నీరు ముందుకు పారదు. అధికారులు స్పందించి త్వరితగతిన తొలగింపునకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదలశాఖ డీఈ బాబుచంద్ను సంప్రదించగా.. త్వరలోనే ఖిల్లాఘనపురం, కమాలోద్ధీన్పూర్ బ్రాంచ్ కాల్వలను పరిశీలించి అవసరమైన చోట ఏజెన్సీ వారితో మాట్లాడి జమ్ము, ఇసుక మేటలు తొలగిస్తామని సమాధానమిచ్చారు. – ఖిల్లాఘనపురంపర్వతాపురం, మామిడిమాడ శివారులో ఖిల్లాఘనపురం బ్రాంచ్ కెనాల్ ఇలా..అప్పారెడ్డిపల్లి మైనర్ కాల్వకు ఏర్పాటుచేసిన పైపులో నిండిన ఇసుక -
సమయానికి.. పూర్తయ్యేనా.. సర్!
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఓటర్లు తంటాలు పడుతున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలి.. ఏ వివరాలు, ఎక్కడ రాయాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి వివరాలు ఇప్పుడు అడిగితే ఎలా తెలుస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడో మరణించిన తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చదువుకోని నిరక్షరాస్యులు పాత వివరాలు ఎలా తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. 24 ఏళ్ల క్రితం ఓటరు గుర్తింపు కార్డు నంబరు, ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. చాలామంది తెలియక 2002లో ఉన్న ఓటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాత జిల్లా పేర్లు కాకుండా కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా పేర్లు రాయడం వంటి తప్పులు చేస్తున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి ఇబ్బుందులు ఎదురవుతున్నాయి. 97.68 శాతం పంపిణీ పూర్తి ఉమ్మడి పాలమూరులో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27,39,123 మంది ఓటర్లు ఉండగా.. 26,75,580 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 97.68 శాతం లక్ష్యం చేరుకుంది. కేవలం 63,543 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా.. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు శ్రమిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ఇలా.. జిల్లా మొత్తం ఓటర్లు పంపిణీ చేసిన శాతం ఇ.డి.. ఫారాలు శాతం ఫారాలు మహబూబ్నగర్ 7,32,488 7,20,825 98.41 23,009 3.14 నాగర్కర్నూల్ 7,31,632 7,20,402 98.47 1,0257 1.40 జో.గద్వాల 5,03,859 4,90,142 97.28 25,645 5.09 నారాయణపేట 4,95,574 4,69,844 94.81 29,036 5.86 వనపర్తి 2,75,570 2,74,367 99.56 8,752 3.18 ఇ.డి.. ఫారాలు : ఇప్పటి వరకు డిజిటలైజేషన్ చేసిన ఫారాలు 2002 నాటి వివరాలు లభించక ఓటర్ల తికమక ఉమ్మడి జిల్లాలో 97.68 శాతం ఫారాల పంపిణీ బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసి.. వివరాలు పూరించి తిరిగి ఇవ్వాలని చెబుతున్నా ఓటర్ల నుంచి స్పందన లేదని, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్లు లభించని కారణంతో బీఎల్ఓలు ఫారాలు అందించలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల బీఎల్ఏల సహకారంతో ఒకే దగ్గర ఉండి ఫారాలు ఇవ్వడం, నింపడం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల్లో 96,699 (3.53 శాతం) డిజిటలైజేషన్ చేశారు. ఈ నెల 30 వరకు ఫారాలు సేకరణ పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలి. ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. ఈలోగా ఫారాలు నింపి.. వాటిని డిజిటలైజేషన్ చేయడం పెద్ద సవాల్గా మారింది. -
ప్రజలకు పారదర్శక, నాణ్యమైన సేవలు
వనపర్తి: ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ క్రమశిక్షణ, సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఎస్పీ డి.సునీతారెడ్డి ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్, డీసీఆర్బీ, కంట్రోల్ రూమ్, సైబర్ క్రైం, నార్కోటిక్, ఏఆర్, జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. విభాగాల వారీగా విధులు, బాధ్యతలు, సమన్వయం, సమాచార మార్పిడి, సాంకేతిక వ్యవస్థల వినియోగం, పెండింగ్ పనుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. డీజీపీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చర్చించిన అంశాలను వివరించి ప్రతి విభాగం విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా అవసరమైన మార్గదర్శకాలను అందించారు. ప్రతి విభాగం ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేసినప్పుడే ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించగలుగుతామని చెప్పారు. సమాచార సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సమయపాలన, బాధ్యతాయుత పనితీరే పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయని తెలిపారు. ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునంద, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘సంచార లోక్ అదాలత్’ వినియోగించుకోవాలి వనపర్తి రూరల్: సంచార లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కళార్చన కోరారు. శనివారం మండలంలోని చిట్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కక్షిదారులు రాజీపడి కేసులు పరిష్కరించుకోవడంతో సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు. రాజీమార్గం ఎంచుకున్న కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే సంచార లోక్అదాలత్ వాహనం ద్వారా గ్రామాలకే వచ్చి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వాహనంలో ఏర్పాటు చేసిన తెరపై లఘు చిత్రాలను ప్రదర్శించి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, డ్రగ్స్, సైబర్క్రైమ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సర్పంచ్ శోభ , ఏస్ఐ హృశికేష్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి వనపర్తి రూరల్/వనపర్తి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య ఆదేశించారు. శనివారం మండలంలోని చందాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల, దత్తాయపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతుల వారీగా విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్, మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు, అసంపూర్తిగా ఉన్న డైనింగ్ హాల్, నీటి సంపును పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, బోధన–అభ్యసన ప్రక్రియపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం నాణ్యతగా అందించాలన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. చందాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బొజ్జిబాబు, ఉపాధ్యాయ బృందం డీఈఓను శాలువాతో సన్మానించింది. ఆయన వెంట సెక్టోరియల్ అధికారి చంద్రశేఖర్, ఎస్ఎంసీ చైర్మన్ రాములు, ఉపాధ్యాయులు బాలనాగయ్య, విష్ణు, మంజుల తదితరులు ఉన్నారు. -
గడువులోగా వివరాల నమోదు పూర్తిచేయాలి
వనపర్తి: ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లతో తప్పులు లేకుండా పూరించి గడువులోగా యాప్లో నమోదు చేయాలని రాష్ట్ర అదనపు ఓటరు నమోదు అధికారి చిన్నయ్య బీఎల్వోలకు సూచించారు. శనివారం పుర పరిధిలోని 117, 125, 158 పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ఫారం పూరించే విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఓటర్లతో మాట్లాడి ఫారం నింపడంలో వస్తున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పూరించిన ఫారాలను కచ్చితంగా తిరిగి బీఎల్వోలకు ఇవ్వాలని లేనిపక్షంలో ఓటరు జాబితాలో పేరు నమోదు కాదని తెలిపారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేష్రెడ్డి ఉన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: రాష్ట్రంలోని క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాలకు శనివారం నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుట్టుమిషన్లు, చిరు వ్యాపారాలకు 21 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు.. ఈ–బైక్, ఈ–స్కూటీ, మోటార్బైక్ యూనిట్లకు 21 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వార్షిక కుటుంబ ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మించరాదని.. ఆసక్తి, అర్హల కలిగిన వారు tso bmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొని ప్రతులను జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించా లని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్న ంబర్ 040–23391067 సంప్రదించాలన్నారు. ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు 2025–26, 2026–27 విద్యాసంవత్సరానికిగాను ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి మజూహీద్ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.4 వేల ఉపకార వేతనం అందజేస్తామని.. విద్యార్థులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎస్ఎస్పీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆధార్ ఫేస్ ఐడి ద్వారా 14 అంకెల ఓటీఆర్ నంబర్ను పొందాలని సూచించారు. అనంతరం మీ సేవా కేంద్రాల్లో ఈ–పాస్ వెబ్సైట్లో ఫ్రెష్ లేదా రెన్యూవల్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్సైజ్ ఫొటో, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్బుక్, కుల, ఆదాయ, విద్యార్హత ధ్రువపత్రాలు జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెండోరోజు.. రెండు నామినేషన్లు అమరచింత: చేనేత సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రెండోరోజు శుక్రవారం ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు తెలిపారు. శనివారం నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందని.. చివరిరోజు 9 డైరెక్టర్ స్థానాలకుగాను అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ మీడియా సదస్సుకు డీపీఆర్వోలు నారాయణపేట: జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) ఎంఏ రషీద్, వనపర్తి డీపీఆర్వో సీతారాం ఢిల్లీలో శుక్రవారం జరిగిన మీడియా కమ్యూనికేషన్ అధికారుల జాతీయ సదస్సుకు హాజరయ్యారు. జాతీయ సదస్సుకు తెలంగాణ నుంచి ఎంపికై న కొద్దిమంది అధికారుల్లో ఇరు జిల్లాల అధికారులు ఉన్నారు. ఎన్నికల సమాచార వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సదస్సు అనుభవాలు ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు పేర్కొన్నారు. -
త్వరలోనే అల్పాహార పథకం అమలు
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని.. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం సైతం అమలు కానుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని రాయిణిపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి కొత్తగా నిర్మించిన కిచెన్ షెడ్ను ప్రారంభించడంతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు అధిక డిమాండ్ ఉందని, భవిష్యత్లో ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించి వారి ఆరోగ్యంతో పాటు విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కలెక్టర్ తన నిధుల నుంచి రూ.23.80 లక్షలు మంజూరు చేసి పాఠశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని, ఇందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధా (ఏఐ) విద్యను కూడా ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ.. రాయిణిపేట ప్రభుత్వ పాఠశాలలో సమర్థవంతమైన ఉపాధ్యాయ బృందం పనిచేస్తోందని.. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సర్పంచ్ భాగ్యలక్ష్మి, డీఎస్ఓ శ్రీనివాస్, తహసీల్దార్ సుభాష్నాయుడు, ఎంపీడీఓ వినీత్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాలకే న్యాయ సేవలు
వనపర్తిటౌన్: రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలనుకునే కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే వారి గ్రామానికే వచ్చి పరిష్కరిస్తామని.. జిల్లాలోని కక్షిదారులు సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో సంచార లోక్ అదాలత్ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సంచార లోక్ అదాలత్ వాహనం నెలరోజుల పాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు అందిస్తుందన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన లఘు చిత్రాలను వాహనంపై ఉన్న తెరపై ప్రదర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, బార్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల ఓటుహక్కు తొలగించొద్దు
ఆత్మకూర్/అమరచింత/నర్వ: సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్, మక్తల్ నియోజకవర్గ ఈఆర్ఓ శ్రీను ఆదేశించారు. శుక్రవారం నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, ఆత్మకూర్ పురపాలికలోని ఖానాపూర్, అమరచింత మండలం కొంకన్వానిపల్లి, పాంరెడ్డిపల్లిలో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలు ఇల్లిల్లూ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణి చేశారా అని అడిగి తెలుసుకున్నారు. పంపిణీ చేసిన ఫారాలను ఎలా నింపుతున్నారని బీఎల్వోలను ప్రశ్నించారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసిన తర్వాత నేరుగా సేకరించి తుది జాబితాలో ఓటరు పేరు నమోదయ్యే వరకు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. వలస వెళ్లిన కుటుంబాల ఓటర్ల ఫోన్నంబర్లకు తీసుకొని సమాచారం అందించాలని, గ్రామానికి వచ్చి ఫారాలు పూర్తిచేసి ఇవ్వమంటూ సందేశాలు పంపాలని సూచించారు. ఫారాలు నింపే సమయంలో తప్పొప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. ఫారాల్లో ఓటర్ల కొత్త ఫొటోలు అతికించి వివరాలను మొబైల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా దగ్గరుండి ఫారాలు పూర్తి చేయాలని కోరారు. వివరాలు తప్పుగా నింపి ఓటు తొలగించేలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి నిరంతరం ఓటర్ల వివరాలను సేకరించి అప్లోడ్ చేయాలన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఆత్మకూర్, అమరచింత తహసీల్దార్లు జేకే మోహన్, రవికుమార్ యాదవ్ సూపర్వైజర్ దండు శ్రీశైలం, బీఎల్వో కవిత ఉన్నారు. -
విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి
వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్యతో కలిసి మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుముఖం పట్టకుండా పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రతి గ్రామంలో తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ముఖ హాజరును పక్కాగా నమోదు చేయాలని, ఈ ప్రక్రియపై ఎంఈఓలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం తయారీలో వంట గ్యాస్ వినియోగించాలని.. కట్టెల పొయ్యిపై వండుతున్నట్లు కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే యూడైస్ పోర్టల్లో విద్యార్థుల వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయడంతో పాటు బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, మరుగుదొడ్లు లేని పాఠశాలలను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. పదోతరగతి విద్యార్థులకు గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంచేలా నాణ్యమైన సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. గతేడాది గణితంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు రూపొందించిన పుస్తకం మాదిరి ఈ ఏడాది కూడా సైనన్స్, ఇంగ్లిష్లో ప్రత్యేక పుస్తకాలను రూపొందించి విద్యార్థులకు మెరుగైన బోధన అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన.. జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్లు రమేష్రెడ్డి, వెంకటేశ్వర్లు ఇతర అధికారులు ఉన్నారు.


