Karnataka
-
ఉల్లి ధర పతనం.. రైతన్న స్థితి దైన్యం
సాక్షి,బళ్లారి: ఏడాది నుంచి ఉల్లి ధరలు రోజురోజుకు తగ్గిపోతుండటంతో ఉల్లి పంటను సాగు చేసిన రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పని చేసి పంట చేతికందిన తర్వాత, దళారుల చేతుల్లో ధర నిర్ణయం కావడంతో రైతులు ఎవరికి తమ గోడు చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి గడ్డల ధరలు కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, రైతుకు కనీసం కిలోకు రూ.10లు కూడా దక్కకపోతే ఆ రైతుకు పెట్టుబడి కాదు కదా కనీసం కూలి కూడా దక్కని పరిస్థితి ఏర్పడుతోంది. పంట చేతికందిన తర్వాత మార్కెట్కు తీసుకెళ్లిన ఉల్లిని సాగు చేసిన రైతుకు మార్కెట్లో ఉన్నఫళంగా క్వింటాల్ ధర రూ.250లు పలకడంతో ఒక కిలో కేవలం రూ.2.50 మాత్రమే పలుకుతుండటంతో రైతు ఏం చేయాలో పాలు పోక, మార్కెట్ మాయజాలం చూసి భరించలేక సదరు రైతు వినూత్నంగా నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాలను దుమ్మెత్తిపోస్తూ, దళారుల మోసాన్ని ఎండగడుతూ తాను కష్టపడి పండించిన పంటను నడిరోడ్డుపై పారబోశారు.రోడ్డుపై పారబోసి రైతన్న పొర్లుదండాలువందకు పైగా ఉల్లిగడ్డల సంచులను రోడ్డుపై పారబోసి వాటిపైన దొర్లుతూ తమ ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన మంగళవారం విజయపుర నగరంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. విజయపుర జిల్లా కొల్హార తాలూకా రోణిహాళ గ్రామానికి చెందిన నందప్ప గుడ్డద మల్లికార్జున గూలగుండ అనే రైతు తాను పండించిన ఉల్లిగడ్డలను విజయపురకు తీసుకురాగా అమాంతంగా క్వింటాల్కు రూ.250లు ధర మాత్రమే పలకడంతో రైతు కన్నీరు పెట్టుకున్నారు. తాను పండించిన పంటను పారవేస్తాను లేదా దానం చేస్తాను కాని క్వింటాల్కు రూ.250లు అమ్మబోనని చెబుతూ వాటిని అందరూ చూస్తుండగా, మార్కెట్ పక్కనే ఉన్న జాతీయ రహదారిపై పారవేసి వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేయడం అందరిని కలిచివేసింది. ఏడాది నుంచి ఉల్లిగడ్డల ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంట చేతికందిన తర్వాత ధరలు పడిపోతే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలిఉల్లిగడ్డల ధర కిలో రూ.70 దాటితే వెంటనే ప్రభుత్వం ఏపీఎంసీల్లో తక్కువ ధరలకు ఉల్లిగడ్డలు విక్రయిస్తుందని, అదే ఉల్లిగడ్డల ధరలు పడిపోతే ప్రభుత్వం రైతుల నుంచి ఎందుకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయకూడదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక్క విజయపుర జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లిగడ్డలు సాగు చేసిన రైతులందరూ ఽఉల్లిధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా దక్కక అప్పుల పాలవుతూ కన్నీరు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు కొంటున్న ధరలకు, రైతులకు మార్కెట్లో పలుకుతున్న ధరలకు కూడా చాలా వ్యత్యాసం ఉండటంతో రైతులకు మరింత నష్టాలు వస్తున్నాయి. ఉల్లిగడ్డల ధరలు పడిపోయినప్పుడు వినియోగదారుల గురించి ఆలోచించడం సరైందేనని, అయితే అదే సందర్భంలో ఉల్లిగడ్డల ధరలు పడిపోయినప్పుడు కూడా వాటిని పండించిన ఉల్లి రైతుల దయనీయ పరిస్థితులను కూడా పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఉల్లిగడ్డలు సాగు చేసిన రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. -
టెన్త్ ఫెయిలయినా.. పాఠశాలకు వెళ్లొచ్చు
కర్ణాటక: ఎస్ఎస్ఎల్సీ (టెన్త్)లో 3 పాఠ్యాంశాల్లో ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులు పాఠశాలకు వెళ్లి చదువుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కూడా తెలిపింది. మళ్లీ పరీక్షలు రాసుకోవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలను విధించింది. ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మళ్లీ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవాలి. మామూలు విద్యార్థులకు మాదిరే చేరవచ్చు, చదువుకోవచ్చు. అందరు విద్యార్థులకు లభించే సౌకర్యాలు ఈ విద్యార్థులకూ లభిస్తాయి. డ్రాపౌట్స్ను తగ్గించడానికి, ఫెయిలయ్యామని చదువు మానివేయకుండా ఈ వెసులుబాటును కల్పించినట్లు తెలిసింది. -
కమల్ మీద తగ్గని కన్నెర్ర
శివాజీనగర/ దొడ్డబళ్లాపురం: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడమైనది. నేను ఎవరికీ బాధ కలిగించే ఉద్దేశంతో మాట్లాడలేదు. కన్నడ భాషకు ఘనమైన చరిత్ర ఉందనేది నిస్సందేహం అని కన్నడిగుల కన్నెర్రకు గురైన ప్రముఖ నటుడు కమల్హాసన్ పేర్కొన్నారు. ఈ మేరకు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి కి లేఖ రాశారు. తన కొత్త సినిమా థగ్ లైఫ్ని కర్ణాటకలో ఆడనివ్వబోమని మండలి, కన్నడ సంఘాలు ఖరాఖండిగా చెప్పడంతో కమల్ లేఖ ద్వారా బుజ్జగించే ప్రయత్నం చేశారు. మనమంతా ఒకే కుటుంబం, కన్నడ భాష గౌరవాన్ని తగ్గించే ఉద్దేశం లేదు, కన్నడ సంస్కృతిని గౌరవిస్తాను అని లేఖలో తెలిపారు. ఏ భాషను కించపరచినా నేను పోరాటం చేశాను అని చెప్పారు. అయితే లేఖలో ఎక్కడా కమల్ క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం. కోర్టులో గుణపాఠం దక్కింది కమల్హాసన్కు ఇకపై కర్ణాటకలోకి ప్రవేశం ఉండదని కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణగౌడ అన్నారు. హైకోర్టు కమల్కు తగిన రీతిలో గుణపాఠం చెప్పిందన్నారు. హైకోర్టు జడ్జి కన్నడిగుల మనసుని బాగా అర్థం చేసుకున్నారన్నారు. థగ్ లైఫ్ ఒక్కటే కాదు, ఇకపై కమల్ సినిమాలు ఏవీ కర్ణాటకలో రిలీజ్ కావన్నారు. మరోవైపు బెళగావిలో కన్నడ సంఘాలు బృహత్ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కమల్ ఫోటోని చించి నిప్పు పెట్టారు. ● కమల్ది మొండితనం: డీకే నటుడు కమల్హాసన్పై తమకు ఎలాంటి మెతక ధోరణి లేదు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమల్హాసన్ క్షమాపణ చెబుతారని అనుకున్నాం. కమల్హాసన్ వ్యాఖ్యలపై సోమవారం సాహితీవేత్త హంప నాగరాజయ్య తదితరులతో చర్చించాను. ద్రావిడ భాషలన్నీ కూడా ఒక్కటే. తమిళు, కన్నడ, తెలుగు, మలియాళం పరస్పరం మిళితమయ్యాయి. ఇక్కడ ఎక్కువ, తక్కువ అనేదానికి చోటు లేదు అని అన్నారు. కమల్ మొండిగా ఉన్నారు. న్యాయస్థానం ఆదేశాలను అందరూ పాటించాలి అని చెప్పారు. యడ్డి మండిపాటు చరిత్ర, భాషాశాస్త్రం పరిజ్ఞానం లేని నటుడు కమల్హాసన్, కన్నడ భాషను కించపరిచేలా మాట్లాడటం ఖండనీయమని బీజేపీ నేత, మాజీ సీఎం బీ.ఎస్.యడియూరప్ప అన్నారు. కన్నడ ఏ భాష నుంచి పుట్టలేదని అనేక మంది సీనియర్ భాషా పండితులు రుజువులు చూపించారన్నారు. కొనసాగిన ఆందోళనలు కమల్హాసన్ బుజ్జగింపు లేఖ -
నాల్వడి ఒడెయర్కు భారతరత్న ఇవ్వాలి
మైసూరు: ఆధునిక మైసూరు నిర్మాణం, అభివృద్ధిలో మైసూరు సంస్థానాన్ని పాలించిన మహారాజు నాల్వడి కృష్ణరాజ ఒడెయర్ సేవలు అపారమని చామరాజ నియోజకవర్గ ఎమ్మెల్యే కే.హరీష్గౌడ అన్నారు. మంగళవారం ఒడెయర్ 141వ జయంతి సందర్భంగా విఖ్యాత అంబావిలాస ప్యాలెస్ ముందు నివాళులు అర్పించారు. మైసూరు రాష్ట్రాన్ని దేశమే తిరిగి చూసేలా అభివృద్ధి పనులు చేశారన్నారు. విద్యా రంగానికి పెద్ద పీట వేసి 1916లో మైసూరు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పలు చోట్ల ఆస్పత్రులను తెరిచారన్నారు. ఒడెయర్ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జన్మదినం రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలన్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల సీజ్ యశవంతపుర: బెంగళూరు సీసీబీ పోలీసులు గౌడాన్పై దాడి చేసి రూ.61.82 లక్షలు విలువగల నిషేధిత పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను సీజ్ చేశారు. తలఘట్టపుర పోలీసుస్టేషన్ పరిధిలోని కనకపుర మొయిన్ రోడ్డులోని గోదాములో సోదాలు చేశారు. పెద్దమొత్తంలో పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.61.82 లక్షలుగా అంచనా వేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.70 వేల విలువగల ఈ సిగరెట్లు, హుక్కా ఫ్లేవర్లు, విదేశీ సిగరేట్ను స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఆర్బీఆర్ లేఔట్ సెకండ్స్టేజీలోని అంగడిలో అమ్ముతున్నట్లు తెలిసి దాడి చేశారు. 201 ఈ–సిగరెట్లు, 297 హుక్కా ఫ్లేవర్ల బాటిళ్లు లభించాయి. అంగడి యజమాని పరారయ్యాడు. ట్రాఫిక్ ఉల్లంఘనులపై చలానాల జోరు యశవంతపుర: ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘనులపై బెంగళూరు పశ్చిమ విభాగం పోలీసులు కార్యాచరణ చేసి 1408 కేసుల్లో రూ.7.38 లక్షల జరిమానాలను వసూలు చేశారు. సోమవారం 45 త్రిబుల్ రైడ్ కేసుల్లో రూ.22,500, 114 రాంగ్ రూట్ కేసుల్లో 58,500, 240 అక్రమ పార్కింగ్ కేసుల్లో రూ.1.36 లక్షలు, 210 నో ఎంట్రీ కేసుల్లో రూ.1.5 లక్షలు, ఇతరత్రా 795 అతిక్రమణల్లో రూ.4.16 లక్షలు జరిమానా విధించారు. పొగరాయుళ్ల మీద ప్రపంచ పోగాకు రహిత దినోత్సవాల సందర్భంగా బెంగళూరు నగర పోలీసులు మూడు రోజుల పాటు తనిఖీలు చేసి 11,507 కేసులను నమోదు చేసి రూ.21.19 లక్షలు జరిమానాలను వసూలు చేశారు. బహిరంగంగా ధూమపానం చేస్తున్నవారికి జరిమానాలు వేశారు. కాగా, నగరంలో పొగాకు వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. విద్యార్థుల డ్రగ్స్ దందా ●● ఇద్దరు కేరళవాసుల అరెస్టు బనశంకరి: గంజాయి విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరు కేరళ విద్యార్థులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ.13 లక్షల విలువచేసే గంజాయి, హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ బి.దయానంద్ మంగళవారం తెలిపారు. నిందితులు బీబీఏ చదువుతూ సంపిగేహళ్లిలోని అపార్టుమెంటులో నివసించేవారు. దాడి చేసి పట్టుకుని 1200 గ్రాముల గంజాయి, 220 గ్రాముల హైడ్రో గంజాయి, 2 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.13 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనావేశారు. విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదన కోసం డ్రగ్స్ను అమ్ముతున్నట్లు తెలిపారు. ఎండీఎంఏ స్వాధీనం బ్యాడరహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య లేఔట్లో ఇద్దరు డ్రగ్స్ విక్రేతలను అరెస్ట్చేశారు. మండ్య జిల్లా బెళ్లూరు క్రాస్లో ఓ వ్యక్తి నుంచి గంజాయి, ఎండీఎంఏ క్రిస్టల్ను తక్కువ ధరతో కొని, బెంగళూరులో అమ్ముతున్నట్లు నిందితులు తెలిపారు. వీరి వద్ద నుంచి 1.9 కేజీల గంజాయి, 13.5 గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు. -
తండ్రీకుమార్తెకు గాయాలు
● బైక్ను ఢీకొన్న టిప్పర్ లారీ శివమొగ్గ: టిప్పర్ లారీ ఢీకొని తండ్రీ కుమార్తె గాయపడ్డారు. ఈ ఘటన శివమొగ్గ శివార్లలోని శివరామపుర సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. కుమార్తెను స్కూల్లో దింపడానికి బైక్లో తీసుకు వెళ్తుండగా అరనూరు నుంచి శివమొగ్గ వైపు వస్తున్న టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొంది. తండ్రీ కుమార్తె గాయపడగా ఆస్పత్రికి తరలించారు. వారు స్పృహలో లేనందున ఏ గ్రామానికి చెందిన వారనేది తెలియరాలేదు. తుంగా నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
టెక్కీకి రూ.2.39 కోట్ల మస్కా
● షేర్ల పేరుతో బడా మోసం బనశంకరి: ఎంతో చదువుకున్నవారు ఇట్టే సైబర్ మోసగాళ్ల వలలో పడిపోతున్నారు. తరువాత పోలీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఫేస్బుక్లో వచ్చిన షేర్మార్కెట్ ప్రకటనను చూసి ఐటీ ఇంజనీర్ రూ.2.39 కోట్లు పెట్టుబడి పెట్టి మునిగిపోయాడు. బెంగళూరు వైట్ఫీల్డ్ కు చెందిన 41 ఏళ్ల టెక్కీ బాధితుడు. వివరాలు.. జనవరి 21 తేదీన టెక్కీ ఫేస్బుక్ చూస్తుండగా అలిస్బ్ల్యూ అనే షేర్ల ట్రేడింగ్ ప్రకటన కనబడింది. దీనిపై క్లిక్చేయగానే సదరు వాట్సాప్ గ్రూప్లో చేరాడు. ఇందులో పూజా శైన్ అనే యువతి, టెక్కీ కి ఫోన్చేసి షేర్మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభం లభిస్తుందని, మీకు లింక్ పంపించానని తెలిపింది. ఇందులో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుబడి పెట్టాలని డిమాండ్ చేసింది. యువతి మాటలు నమ్మిన టెక్కీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ముందుగా రూ.50 వేలు పెట్టుబడి పెట్టగా లాభం కూడా పొందాడు. ఈసారి ఎక్కువ పెట్టుబడి పెడితే ఇంకా లాభం లభిస్తుందని ఆశపెట్టారు. అలా వివిధ బ్యాంకు అకౌంట్లకు దశలవారీగా నగదు జమ చేశాడు. యాప్లో లాభం పొందినట్లు చూపించింది. విత్ డ్రాకు యత్నించగా కొన్నిరోజుల క్రితం లాభం విత్డ్రా చేయడానికి టెక్కీ ప్రయత్నించగా సాధ్యం కాలేదు. విత్ డ్రా చేయడానికి రుసుముల కింద నగదు చెల్లించాలని మోసగాళ్లు తెలిపారు. సరేనని ముందు వెనుకా ఆలోచించకుండా టెక్కీ లక్షలాది రూపాయలను వారి అకౌంట్లకు జమచేసి లాభం విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా ఫలితం లేదు. నిర్వాహకులకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. మొత్తం రూ.2.39 కోట్లు అలా మోసపోయాడు. వైట్ఫీల్డ్ సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్: యాదగిరి నగరంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తామని నగరసభ అధ్యక్షురాలు లలిత అనాపూరె పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని గాంధీనగర్ తాండాలో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రమైన యాదగిరిలో నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎక్కువ కాలం మన్నిక వచ్చే విధంగా నాణ్యతగా రోడ్లను నిర్మించాలన్నారు. వర్షాలు మొదలయ్యేలోగా రోడ్ల నిర్మాణపు పనులను పూర్తి చేయాలని ఆమె సూచించారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ హుబ్లీ: జిల్లాలోని కుందగోళ తాలూకా రట్టిగేరి గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న 6 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సదరు అడ్డాపై దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.13,200 నగదు, పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై కేసు దర్యాప్తులో ఉందని, పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు గుడిగేరి పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. పరిహారం పంపిణీ రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా సిరవార తాలూకా గుడదిన్నిలో ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మంగళవారం మంత్రి బోసురాజు, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్ రూ.5 లక్షల పరిహారధనం చెక్ను మృతుడు సాయణ్ణ తల్లికి అందించి సానుభూతిని తెలిపారు. వారి వెంట తహసీల్దార్ రవి, నేతలు కరిలింగప్ప, సిద్దనగౌడ, శ్రీనాథ్లున్నారు. నకిలీ నోట్ల చెలామణి నిందితుల అరెస్ట్ రాయచూరు రూరల్: నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన సోమవారం జిల్లాలోని మాన్వి తాలూకాలో జరిగినట్లు సీఐ సోమశేఖర్ ఎస్ కెంచరెడ్డి తెలిపారు. గత నెల 13న ఇండియన్ బ్యాంక్లోని ఏటీఎం కేంద్రంలో సీకల్కు చెందిన విరుపాక్షి తమ ఖాతాలోకి 35 నకిలీ రూ.500 నోట్లను చేర్చి రూ.18 వేలను జమ చేశాడన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టి సీకల్ విరుపాక్షి, శేఖర్, హుసేన్ బాషా, మాచనూరు ఖాజాహుసేన్, సిరవార సిద్దనగౌడ, అమరేష్, మాన్వి అజ్మీర్, సింధనూరు ఆలం బాషా, రాయచూరు నరసయ్య శెట్టి, కారటిగి భీమేష్లను అరెస్ట్ చేశామన్నారు. నకిలీ రికార్డుల దహనం● ముగ్గురు అధికారుల సస్పెండ్ రాయచూరు రూరల్: నకిలీ రికార్డులను తయారు చేసి వాటిని తగులబెట్టిన అధికారులను సస్పెండ్ చేసిన ఘటన యాదగిరి నగరసభలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్తులను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన యాదగరి నగరసభ రెవిన్యూ అధికారి మానప్ప బడిగేర, ఇంచార్జి రెవిన్యూ అధికారి మైనుద్దీన్ మహ్మద్ హజరత్, శహాపుర నగరసభ నీటి సరఫరా సూపర్వైజర్ హన్మంతప్పలను అరెస్ట్ చేశారు. యాదగిరిలో సర్వే నంబర్–151లో 42వ ఇంటి నంబర్ మల్లమ్మ రామణ్ణ పేరు మీద ఉన్న దానిని ఈ ముగ్గురు అధికారులు జూన్ 1న నగరసభ కార్యాలయంలోకి ప్రవేశించి రికార్డులను తారుమారు చేసినట్లు వాస్తవాలు వెల్లడి కావడంతో వారిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు యాదగిరి నగరసభ కమిషనర్ చౌహాన్ తెలిపారు. ఘనంగా కరుణానిధి జయంతి కేజీఎఫ్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 101వ జయంతిని మంగళవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ సర్కల్ వద్ద డీఎంకే కార్యకర్తలు కరుణానిధి ఫ్లెక్సీకి పూలదండలు వేసి నివాళులర్పించారు. గౌరవాధ్యక్షుడు మునిరత్నం మాట్లాడుతూ కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. చక్రపాణి, ఏసు, కణ్ణన్, రవీంద్ర, మురుగన్, శివ తదితరులు పాల్గొన్నారు. -
అనుచిత వ్యాఖ్యలపై ధర్నా
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాధికారిణి ఫౌజియ తరన్నంను నిందించిన ఎమ్మెల్సీ రవి కుమార్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేను అవహేళనకరంగా మాట్లాడిన విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు నారాయణ స్వామిపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అందోళనలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ రవి కుమార్ ఒక ఉత్తమ జిల్లాధికారిణిని అవమానించడం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేను విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు అవమానించడం తగదన్నారు. వారిపై చర్యలు చేపట్టి పదవుల నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శాసన సభ్యులు శరణేగౌడ బయ్యాపూర్, హంపయ్య నాయక్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్ రామస్వామి, జిల్లాధ్యక్షురాలు నిర్మల, బసవరాజ్ పాటిల్, రుద్రప్ప, అమరేగౌడ, శాంతప్ప, అస్లాం పాషా, ఈశప్ప, పామయ్య, రామన్న, జయన్నతదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులపై చర్యలకు డిమాండ్ కదం తొక్కిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు -
ఆల్మట్టి ఎత్తు పెంపునకు మహారాష్ట్ర పేచీ
రాయచూరు రూరల్: కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సర్కార్ మొండి వైఖరిని అవలంబిస్తోంది. కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.25 మీటర్ల వరకు పెంచుకోడానికి అవకాశం ఉంది.బ బచావత్ తీర్పు మేరకు ఎత్తు పెంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ డ్యాం ఎత్తు పెంపుదలకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గత నెల 9న లేఖ రాసి ఆనకట్ట ఎత్తు పెంచితే సాంగ్లీ, కోల్హాపూర్ జిల్లాలు వరద ముంపునకు గురి కావడం తథ్యమని, దీనిని పున పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు. 2010 డిసెంబర్ 30న కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు సభ్యుడు బ్రిజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు తెలపని సర్కార్ నేడు మొండి వాదన చేస్తోంది. కోర్టులో ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్పీ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) కేసు వేసిందని మహారాష్ట్ర సర్కార్ వాదిస్తోంది. రాష్డ్రంలోని లోక్సభ సభ్యులు ఏకమై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుదల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎత్తు పెంపుదలతో విజయపుర, బెళగావి, బాగల్కోటె, యాదగిరి, రాయచూరు, గదగ, కొప్పళ జిల్లాల జీవనాడి కృష్ణా నదికి నీటి విడుదలతో 5.30 లక్షల హెక్టార్లకు నీటి పారుదల సౌకర్యం లభిస్తుంది. మరో వైపు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే 75,563 ఎకరాలు ముంపునకు గురవుతుంది. 20 చోట్ల పునర్ వసతి కేంద్రాల స్థాపనకు 64,670 ఎకరాలు, కాలువల నిర్మాణానికి 51,847 ఎకరాలు కలిపి మొత్తం 1,33,867 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. ఎత్తు పెంచితే 130 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం లభిస్తుంది. 2010 నుంచి పెండింగ్లో ప్రతిపాదన 524.25 మీటర్లకు డ్యాం ఎత్తు పెంచుకునేందుకు అవకాశం -
రోడ్డెక్కిన మామిడి రైతులు
శ్రీనివాసపురం : సీజన్ ప్రారంభంలోనే ధరలు తగ్గడంతో మామిడి రైతులు రోడ్డెక్కారు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మామిడి ఉత్పత్తిదారుల క్షేమాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఇందిరా సర్కిల్ వద్ద ప్రతిఘటన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నీలటూరు చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ శాశ్విత నీటిపారుదల సౌలభ్యాలు లేని తాలూకాలో రైతులు బోర్ల కింద మామిడి పంట సాగు చేశారన్నారు. సీజన్లోనే ధరలు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. టన్ను మామిడి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు మాత్రమే ధర పలుకుతోందని. ఈ ధరలు కూలి కార్మికులకు, ట్రాక్టర్ బాడుగలకు కూడా సరిపోవన్నారు. మామిడి పంటతో లాభాలు పొందవచ్చని భావించిన రైతుల కలలు కల్లలు అవుతున్నాయన్నారు. మామిడి రైతుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం మామిడికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు భైరెడ్డి పాల్గొన్నారు. టమాట, మామిడి రైతులను ఆదుకోండి కోలారు : టమాట, మామిడికి మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఉప విభాగాధికారి డాక్టర్ మైత్రికి వినతిపత్రం సమర్పించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.నారాయణగౌడ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ప్రజా ప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్య ధోరణిని అనుసరిస్తున్నారు. లక్షలు ఖర్చుచేసి పండించిన టమాట, మామిడికి ధరలు లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్, మరగల్ శ్రీనివాస్, మంగసంద్ర తిమ్మణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు
శ్రీనివాసపురం : తాలూకాలోని హోదలి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో తాగునీరు, సీసీ రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు తదితర సదుపాయాలు కల్పిస్తామని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఎస్ శ్రీనివాస్ తెలిపారు. పంచాయతీ సభాంగణంలో మంగళవారం నిర్వహించిన సామాన్య సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు త్వరితగతిన రెవెన్యూ శాఖకు సంబంధించిన పింఛన్ తదితరాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీడీఓ సంపత్కుమార్, కార్యదర్శి శివశంకర్, సభ్యుడు గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు గె లుపొందాలి
● సీఎం సిద్దరామయ్య అభిలాష హుబ్లీ: అత్యంత ఉత్కంఠ రేపిన ఐపీఎల్– 2025 క్రికెట్ పోటీల ఫైనల్లో పంజాబ్ జట్టుతో తలపడుతున్న ఆర్సీబీ జట్టు గెలవాలని సీఎం సిద్దరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. గదగ్ జిల్లా లక్కుండిలో ప్రాచీన వస్తువుల తవ్వకాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఈసారి ఫైనల్కు వచ్చిన ఆర్సీబీ జట్టు మంచి ఊపు మీద ఉందన్నారు. పంజాబ్ జట్టు ఆర్సీబీ కన్నా ముందు క్వాలిఫైడ్ మ్యాచ్లో 101కే ఆలౌట్ అయిందన్నారు. ఆ తర్వాత ముంబైపైన గెలిచిందన్నారు. ముంబై కూడా స్ట్రాంగ్ టీం. అందులో కూడా మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈ సారి ఆర్సీబీ కప్ గెలవాలన్నదే అందరి ఆకాంక్ష అని, తాను కూడా ఆ జట్టు గెలవాలని కోరుకుంటున్నానన్నారు. ఒక వేళ జట్టు గెలవక పోయినా గెలిచిన జట్టుకు అభినందనలు తెలుపుతానన్నారు. హెచ్ఎంపై కమీషన్ ఆరోపణలుహుబ్లీ: ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాను పని చేసే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే షూ, సాక్స్ తదితరాల్లో సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ రూపంలో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని నవలగుంద తాలూకా అణ్ణిగేరి ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు బుర్హానుద్దీన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ డీడీ ఆ తాలూకా బీఈఓ, లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్టీఐ కార్యకర్త మాబుసాబ్ మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, బీఈఓకు కూడా తెలియజేశానన్నారు. 2024 డిసెంబర్ 20న సదరు వస్తువుల పంపిణీకి రూ.1500 కమీషన్ను లంచంగా తీసుకున్నట్లు ఫిర్యాదు చేశానని మాబుసాబ్ ఓ ప్రకటనలో తెలిపారు. టికెట్ లేని ప్రయాణికుల నుంచి జరిమానా వసూలుహుబ్లీ: హుబ్లీ బీఆర్టీఎస్ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి రూ.42 వేలు జరిమానా వసూలు చేశారు. టికెట్ లేకుండా, అనుమతి పొందిన పాస్కు విరుద్ధంగా విద్యార్థులు తదితరులకు విధించిన జరిమానా గత నెలలో సుమారు రూ.42 వేలు వసూలు చేసినట్లు వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా నగర విభాగం డీసీ ఓ ప్రకటనలో తెలిపారు. హుబ్లీ నగర పరిధిలో సిబ్బంది, అధికారుల బృందం 34 బీఆర్టీఎస్ బస్సుల్లోని పాయింట్లలో ఈ తనిఖీ కార్యాచరణ చేపట్టారు. ప్రయాణికులు టికెట్ తీసుకొని బీఆర్టీఎస్ బస్సుల్లో ప్రయాణించాలని, లేకుంటే జరిమానా విధిస్తామని సంబంధిత డివిజనల్ కంట్రోలర్ ఓ ప్రకటనలో తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టండి రాయచూరు రూరల్: జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు ముందడుగు వేయాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాహుల్ తుకారాం పాండే పేర్కొన్నారు. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ విషయంపై చర్చించారు. యువతులు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలన్నారు. న్యూట్రిన్ పునర్ వసతి కేంద్రాల ద్వారా పిల్లల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలని సీడీపీఓలను ఆదేశించారు. సమావేశంలో సీడీపీఓ వెంకటేష్ దేశాయి, మహేష్ నాయక్, శరణమ్మలున్నారు. గ్రంథాలయ భవనం ప్రారంభమెప్పుడో? హొసపేటె: కంప్లి పట్టణంలోని సోమప్పన కెరె క్యాంపస్లో దాదాపు రూ.కోటి ఖర్చుతో నిర్మించిన ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్(పీఈబీ) గ్రంథాలయం చాలా నెలలుగా ప్రారంభానికి నోచుకోకుండా ఉంది. ఇది స్థానిక విద్యార్థులు, ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. విద్యార్థులు, విద్యావంతులు ఈ ప్రాంత ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తూ విద్యార్థుల విద్యా హక్కులను హరించకూడదని, గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు, ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకొని గ్రంథాలయాన్ని ప్రజల ఉపయోగం కోసం తెరవాలని విద్యార్థులు, ప్రజలు ఒత్తిడి చేశారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి మాలూరు : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని హెచ్ హొసకోటె గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు రాజేశ్వరి సుబ్రమణి పిలుపునిచ్చారు. బరగూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం ఆమె విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించి మాట్లాడారు. సర్కార్ బడుల్లో పిల్లలందరికీ ఉచితంగా యూనిఫాం, బ్యాగు, భోజనం అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ప్రారంభిస్తుండడం విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రధానోపాధ్యాయుడు ఎన్ వెంకటేష్, ఎస్డీఎంసీ అధ్యక్షుడు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కమల్ హాసన్కు కర్ణాటక హైకోర్టు చివాట్లు
సాక్షి,బెంగళూరు: ప్రముఖ నటుడు కమల్ హాసన్ను కర్ణాటక హైకోర్టు చివాట్లు పెట్టింది. ‘మీరేమైనా చరిత్రకారులా అంటూ మండిపడింది. ప్రజలకు క్షమాపణలు చెబితే సరిపోతుంది కదా. కానీ మీరు రక్షణ కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది. జూన్ 5న థగ్లైఫ్ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కన్నడ భాష.. తమిళం నుంచి పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో థగ్లైఫ్ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ కన్నడ మద్దతు దారులు ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కర్ణాటకలో థగ్లైఫ్ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్షణ కల్పించాలని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది. ‘మీరు కమల్ హాసన్ అయితే కావొచ్చు ప్రజల మనోభావాలు దెబ్బ తీయోచ్చా?. ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు చెప్పమనే కోరారు.. కానీ మీరు థగ్ లైఫ్ సినిమా విడుదల విషయంలో రక్షణ కల్పించాలని ఇక్కడి వచ్చారు. సినిమా సాఫీగా విడుదల కావాలంటే క్షమాపణ చెబితే సరిపోతుంది కదా.మీరు కన్నడ భాష.. తమిళం నుంచి పుట్టిందని స్టేట్మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ.. ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కన్నడిగుల మనోభావాలో తక్కువగా అంచనా వేశారు. 75ఏళ్ల క్రితం ఇలాంటి వ్యాఖ్యలే చేసినా శ్రీరాజగోపాలకృష్ణ చార్య క్షమాపణలు చెప్పారు. మీరూ క్షమాపణలు చెప్పండి అని సూచించింది.అందుకు తన స్టేట్మెంట్ను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ కమల్ హాసన్ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కమల్ హాసన్ తప్పని సరిగా ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని సూచించింది. -
కేక్ కటింగ్.. ఆపై కటకటాలు
గౌరిబిదనూరు: పుట్టినరోజు అని లాంగ్ కత్తితో కేక్ కట్ చేసిన వ్యక్తి, తరువాత పోలీసుస్టేషన్కు అతిథిగా వెళ్లాడు. ఆకతాయి చర్యల ఫలితం ఇలాగే ఉంటుంది. వివరాలు.. తాలూకాలోని వైచకూరహళ్ళి గ్రామంలో ఆటోడ్రైవర్ అనిల్ పుట్టినరోజును స్నేహితులతో జరుపుకొన్నాడు. పెద్ద ఖడ్గంతో కేక్ను కత్తిరించాడు. ఈ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని చూసిన రూరల్ పోలీసులు అనిల్ను అరెస్టు చేశారు. నిబంధనల ప్రకారం పెద్ద కత్తిని కలిగి ఉండడం, దానిని ప్రదర్శించడం చట్టరీత్యా నేరం. దీంతో ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. Auto Driver Anil Kumar Arrested For Cutting Cake With A Long pic.twitter.com/e1UQnAKzG8— Suryakumari T (@SuryakumariT) June 3, 2025 -
ఫొటోషూట్కు రూ.25 వేల జరిమానా
మైసూరు: ఇది ఫోటోషూట్ల కాలమైంది. పెళ్లికి ముందు, ఆ తరువాత, తల్లీ తండ్రి కాబోతుంటే మరోసారి ఇలా అనేక సందర్భాలలో ఫోటోషూట్లు ఉండాల్సిందే. కొన్నిసార్లు ఇవి వెర్రిగా మారుతుంటాయి కూడా. ఇదే మాదిరిగా మైసూరులోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని బండీపుర వన్యప్రాణుల అభయారణ్యంలోకి చొరబడి ఫోటోలు తీసుకున్న జంటకు అటవీశాఖ రూ. 25 వేల జరిమానా వడ్డించింది. బెంగళూరుకు చెందిన పల్లవి, ఘోష్ అనే వ్యక్తులు విహారానికి వచ్చారు. బండీపుర మంగళ రోడ్డు సమీపంలో అడవిలోకి వెళ్లి ఫోటో షూట్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం. అటవీ అధికారి నవీన్కుమార్కు పర్యాటకులకు సమాచారం అందించారు. వెంటనే ఆ జంటను పట్టుకుని హెచ్చరిక లేఖ ఇచ్చి రూ. 25 వేలు జరిమానా విధించారు. -
చిన్న వయసు, విష్ణుప్రియ డాక్టర్ ఆశలకు 'ఉరి'
శివమొగ్గ(కర్ణాటక): శివమొగ్గలో ఉన్న సుబ్బయ్య మెడికల్ కళాశాలలో హాస్టల్లో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు విష్ణుప్రియ (22). వివరాలు.. ఈమె కుటుంబం బెంగళూరుకు చెందినది కాగా, జర్మనీలోని బెర్లిన్లో నివసిస్తోంది. విష్ణుప్రియ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇంటర్న్షిప్ చేస్తోంది. మరికొన్ని రోజుల్లో పూర్తయి డాక్టర్ కానుంది. అయితే ఏమి జరిగిందో మరి.. హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. కారణాలు తెలిసి రాలేదు. డెత్నోట్ ఏదీ దొరకలేదు. శివమొగ్గ గ్రామీణ పోలీసులు ఆమె శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెప్పుతో కొట్టి.. కాళ్ల బేరానికి
శివాజీనగర: ఆవేశంలో కన్నుమిన్ను కానక ఆటో డ్రైవర్ను హిందీ మహిళ చెప్పుతో కొట్టింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు. జైలు జీవితం తప్పదని గ్రహించిన ఆమె కాళ్ల బేరానికి వచ్చింది. బిహార్కు చెందిన వివాహిత పంఖూరి మిశ్రా, ఆమె భర్త ఆటోడ్రైవర్ కాళ్లపై పడి క్షమాపణ చెప్పారు. క్షమించండి ప్లీజ్ రోడ్డుపై తమ స్కూటర్కు తగిలాడని ఆటోడ్రైవర్ లోకేశ్ను పంఖూరి మిశ్రా చెప్పుతో బాదింది. వీడియో తీస్తావా.. తీయ్ అని కూడా బూతులు తిట్టింది. ఈ వీడియో వైరల్ కాగా మిశ్రా అకృత్యంపై జనం మండిపడ్డారు. ఆటోడ్రైవర్ ఫిర్యాదు మేరకు ఆమె మీద బెళ్లందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆ జంటను పిలిపించి విచారణ జరిపారు. నేను గర్భవతిని, ఆస్పత్రికి వెళ్తుండగా ఆటో తగిలింది, కోపంతో దాడి చేశాను, ఆటోడ్రైవర్ నాపై దాడికి ప్రయత్నించాడు అని తెలిపింది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని బెయిలు ఇచ్చి పంపారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఆటోడ్రైవర్కు క్షమాపణలు చెప్పారు. కన్నడిగులు తమను క్షమించాలని, బెంగళూరును, ఇక్కడి సంస్కృతిని ప్రేమిస్తున్నామని, కావాలని చేయలేదని పంఖూరి వివరణ ఇచ్చింది. ఆటోడ్రైవర్ల ధర్నా మరోవైపు చెప్పుల దాడిని ఖండిస్తూ బెంగళూరులో ఆటోడ్రైవర్ల సంఘం ధర్నా చేసింది. ఫ్రీడంపార్క్లో వందలాదిగా చేరి నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు భద్రత కల్పించాలని, దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టి అనంతరం క్షమాపణ చెప్పిన యువతిబెంగుళూరు పట్టణంలోని బెల్లందూరు పరిధిలో తన స్కూటీపై వెళ్తున్న బీహార్కు చెందిన మహిళను వెనక నుండి ఢీకొన్న ఆటోదీంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన సాఫ్ట్వేర్ ఉద్యోగినిఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు… pic.twitter.com/QFu8B3EwC3— Telugu Scribe (@TeluguScribe) June 2, 2025 -
బెంగళూరులో క్రికెటర్ కోహ్లీ పబ్పై కేసు
సాక్షి బెంగళూరు: ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన బెంగళూరులోని పబ్, రెస్టారెంట్ ‘ఒన్ 8 కమ్యూన్’ మరోసారి వార్తల్లోకెక్కింది. మే 29న సోదాలు చేపట్టిన పోలీసులు స్మోకింగ్ జోన్ లేని విషయాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించి మే 31న కేసు నమోదు చేశారు. స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఈ రెస్టారెంట్, పబ్కు సహయజమానిగా ఉన్న కోహ్లీకి, సిబ్బందికి నోటీసులు సైతం జారీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో తప్ప నిసరిగా స్మోకింగ్జోన్లను ఏర్పాటు చేయాలి. అయితే, ‘ఒన్ 8 కమ్యూన్’గతంలోనూ ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భాలున్నాయి. 2024 జూలై 6న అర్ధరాత్రి దాటాక 1.20 గంటల వరకు పబ్ను తెరిచే ఉంచడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదంటూ గతేడాది డిసెంబర్లో నగర పాలక సంస్థ నోటీసులు పంపింది. -
పార్టీని మరింత బలోపేతం చేద్దాం
రాయచూరు రూరల్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేద్దామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నిర్మల బెణ్ణె అధికార బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు బీజేపీ పట్ల విసుగు చెందారన్నారు. అక్రమాల పుట్ట, కమీషన్ పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారన్నారు. రారష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ జారీ చేసిన పంచ గ్యారెంటీలు త్వరలో జరుగనున్న నగరసభ, జెడ్పీ, టీపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సహాయకారి అవుతాయన్నారు. సమావేశంలో శాంతప్ప, నరసమ్మ, శాలం, అమరేగౌడ, శ్రీనివాసరెడ్డి, తాయన్న, శివమూర్తి, అరుణ్, రాజశేఖర్, నాగేంద్రలున్నారు. ట్రాక్టర్ టిల్లర్ కింద పడి వ్యక్తి మృతిహుబ్లీ: ధార్వాడ తాలూకా ఎత్తినగుడ్డ వద్ద పొలంలో ట్రాక్టర్ టిల్లర్(నాగలి) కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన నారాయణ ఈళిగేర మృతుడు. పరిచయం ఉన్న వ్యక్తి రుద్రగౌడ పాటిల్తో కలిసి ఈయన ట్రాక్టర్తో నాగలి దున్నించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆకస్మికంగా నాగలి కింద పడి మృతి చెందాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు. అయితే పొలంలో వ్యక్తి మృతదేహం లభించగా తొలుత హత్యగా అనుమానం వ్యక్తమైంది. పోలీసులు విచారించగా నాగలి దున్నేటప్పుడు పొరపాటున నారాయణ పడి మృతి చెందినట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి డ్రైవర్ రుద్రగౌడ పాటిల్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టినట్లు ధార్వాడ ఉపనగర పోలీసులు తెలిపారు. పాల ప్రాముఖ్యతపై అవగాహన అవసరంరాయచూరు రూరల్: పాల వాడకం ప్రాముఖ్యతపై అవగాహన అవసరమని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. నగరంలోని బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ క్షీర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పాలను తాగాలని, పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినాలన్నారు. తద్వారా పాల వాడకం కూడా పెరిగి ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. చెరువులోకి ట్రాక్టర్ బోల్తా.. బాలుడు దుర్మరణం రాయచూరు రూరల్: చెరువులోకి ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటనలో అమరేష్(15) అనే బాలుడు దుర్మరణం చెందిన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో చోటు చేసుకుంది. ఆదివారం కరడకల్ చెరువు గట్టుపై ట్రాక్టర్ నడుపుతుండగా డ్రైవర నిర్లక్ష్యంతో ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులోకి పడింది. డ్రైవర్ నీటిలో మునిగి ఈత కొడుతూ బయట పడ్డాడు. కానీ బాలుడు చెరువులో మునిగి ప్రాణాలు వదిలాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు. పిల్లలకు కిట్ల పంపిణీరాయచూరు రూరల్: సమాజంలో ప్రామాణికతో పేద పిల్లలకు సహాయం చేయడం మానవ ధర్మమని రోటరీ క్లబ్ అధ్యక్షుడు శరణ బసవ పేర్కొన్నారు. ఆదివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందింరలో కలా సంకుల సంస్థ ఆధ్వర్యంలో పేద పిల్లలకు స్కూల్ బ్యాగ్ కిట్లను అందించి మాట్లాడారు. విద్యారంగంలో జిల్లా వెనుక బడిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు విద్యను అందించాలన్నారు. కార్యక్రమంలో కలా సంకుల సంస్థ అధ్యక్షురాలు రేఖ, ఇన్కంటాక్స్ అధికారి శోభా యాదవ్, సురేఖ, ప్రసన్న, ఫాతిమా, దండెప్ప, శ్రీనివాస్, మంజుల, సంతోషి, మారుతిలున్నారు. -
వ్యక్తి దారుణ హత్య
హుబ్లీ: కొప్పళలో సోమవారం ఓ దారుణ హత్య జరిగింది. బేకరీలో తన పని మీద ఉన్న వ్యక్తిని బయటకు లాగి వేటాడి మారణాయుధాలతో దారుణంగా హత్య చేశారు. వివరాలు.. కొప్పళ జిల్లాలోని కుష్టిగి తాలూకా తావరగెరా పట్టణం నడిబొడ్డున ఉన్న ఓ బేకరీ దుకాణంలో కొనడానికి వచ్చిన ఓ వ్యక్తిని దుండగుల గుంపు మారణాయుధాలతో దాడి చేసి క్రూరంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ప్రమోద్, నాగరాజు, ప్రదీప్, రవి, గౌతమ్, మంజునాథ్గా గుర్తించగా, మరో వ్యక్తి పేరు తెలియరాలేదు. మొత్తం మీద ఏడుగురు అరెస్టు అయ్యారు. మృతుడిని చెన్నప్ప నారినాళ్గా గుర్తించారు. ఆస్తుల గొడవకు సంబంధించి బేకరీలో ఉన్న చెన్నప్పను లోపలికి వెళ్లి మారణాయుధాలతో హత్య చేయడానికి ప్రయత్నిస్తుండగానే అతడు బేకరిలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో దుండగులు ఇద్దరు అతనిని వెంటపడి మారణాయుధాలతో దాడిఆ చేసి దారుణంగా హత్య చేశారు. మరో వ్యక్తి చేతికి దొరికినా కలపదిమ్మెతో తలపై కొట్టాడు. కాగా ఈ హత్య దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొత్తం మీద హత్య చేయడానికి వచ్చిన దుండగులు తమ పని ముగించుకొని దర్జాగా వెళ్లిపోయినట్లుగా తెలిసింది. కాగా తావరగెరె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ దారుణ హత్యతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఆర్టీఓ ఇన్స్పెక్టర్పై వేటుకు ఆదేశం
సాక్షి బళ్లారి: నగరంలోని ప్రాంతీయ రవాణా అధికారి(ఆర్టీఓ) కార్యాలయంలో తనిఖీకి వెళ్లిన జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణిలతో సరైన విధంగా నడుచుకోకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలో జిల్లాధికారి, ఎస్పీ ఇద్దరూ ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించారు. స్పీడ్ కంట్రోల్కు సంబంధించి అధికారులతో చర్చలు జరుగుతున్న సమయంలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడే టికాణా వేసుకొన్న ఆర్టీఓ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ నడుచుకొన్న తీరు, మాట్లాడిన పద్ధతి సరిగా లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కాకు గుండీ కూడా పెట్టుకోక పోవడంతో ఎస్పీ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు బటన్ వేసుకొని మాట్లాడాలని మండిపడ్డారు. సినిమాలో విలన్ తరహాలో నడుచుకుంటున్న తీరును నిలదీశారు. దీంతో జిల్లాధికారి మాట్లాడుతూ తక్షణం ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆర్టీఓ కార్యాలయాన్ని జిల్లాధికారి, ఎస్పీ సందర్శించడానికి రావడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఆర్టీఓ ఇన్స్పెక్టర్ ఉన్నతాధికారులతో నడుచుకొన్న తీరు స్థానికులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. తక్షణం ఆ అధికారిని సస్పెండ్ చేయాలని సూచించిన నేపథ్యంలో సదరు రవాణా శాఖాధికారులు ఆర్టీఓ సీఐని సస్పెండ్ చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. అధికారులతో ఆర్టీఓ ఇన్స్పెక్టర్ దురుసు ప్రవర్తన ఫలితం -
శ్మశాన వాటికకు దారేదీ?
హొసపేటె: శ్మశాన వాటికకు వెళ్లే దారిలో తీగ కంచె ఏర్పాటుతో అంత్యక్రియలకు ఆటంకం కలిగిన ఘటన మరియమ్మనహళ్లిలో జరిగింది. శ్మశాన వాటికకు వెళ్లే దారి మూసుకొని పోవడంతో ఖననం చేయడానికి దారి లేకుండా పోయింది. దీంతో దాణాపుర గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాపుర హంపినకట్టె గ్రామంలో ముస్లింలు ఆందోళనలో ఉన్నారు. గ్రామంలోని ముస్లింలు ఎవరైనా మరణిస్తే అదే శ్మశాన వాటికలో ఖననం చేస్తారు. ఆ గ్రామానికి చెందిన హొన్నూరు సాబ్ అనే వ్యక్తి శనివారం మరణించగా, అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించారు. దాదాపు ఏడాది కాలంగా ఉన్న ఆ రోడ్డుపై ఒక ప్రైవేటు వ్యక్తి ఇనుప కంచె వేసి దారి లేకుండా చేశాడు. మృతదేహాన్ని మోసుకెళ్తున్న మృతుడి బంధువులు తమకు దారి తెలియక కొంతసేపు ఇబ్బంది పడ్డారు. శ్మశాన వాటిక దగ్గర భూమిని కొన్న ఒక వ్యక్తి వందలాది ఏళ్లుగా ఉన్న శ్మశాన వాటికకు దారిని వదలడానికి బదులుగా తీగతో కంచెను ఏర్పాటు చేశాడు. ఏళ్ల తరబడి అక్కడ ఉన్న శ్మశానవాటికకు వెళ్లే రోడ్డు పక్కన ఒక ప్రైవేటు వ్యక్తి అకస్మాత్తుగా ముళ్ల కంచెను నిర్మించాడు. దీంతో మృతదేహాన్ని పొరుగున ఉన్న పొలం గుండా తీసుకెళ్లి శ్మశాన వాటికలో దహనం చేయాల్సి వచ్చింది. ఇనుప కంచె వేయడంతో రాకపోకలకు ఆటంకం -
జొన్నల కొనుగోలు కోసం రైతుల ఆందోళన
రాయచూరు రూరల్: రైతులు ఖరీఫ్ సీజన్లో పండించిన జొన్నలను కొనుగోలు చేయాలంటూ రైతులు వారం రోజుల నుంచి ఆందోళనకు దిగారు. సోమవారం సింధనూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది రైతులతో ఆందోళన, బంద్ చేపట్టిన సందర్భంగా అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు. అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు కేంద్రాలను బంద్ చేసి జొన్నల కొనుగోళ్లను నిలిపివేయడాన్ని తప్పుబట్టారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద డీహెచ్ పూజార్ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు. మూడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో వాహన రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కాగా సింధనూరు బంద్కు రైతులు, న్యాయవాదులు, వ్యాపారులు మద్దతు పలకడంతో విజయవంతమైంది. సింధనూరు బంద్ విజయవంతం న్యాయవాదులు, వ్యాపారుల మద్దతు -
కలబుర్గిలో రైల్వే డివిజన్ కార్యాలయం ప్రారంభిస్తాం
రాయచూరు రూరల్: కలబుర్గిలో రైల్వే డివిజన్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ పేర్కొన్నారు. ఆదివారం కలబుర్గిలో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రైల్వే ఆధునికీకరణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాన్య ప్రజలకు అనుకూలమయ్యే విధంగా భారతీయ రైల్వే 10 వేలకు పైగా జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో వందే భారత్ రైలు సంచారం ఉందన్నారు. బెంగళూరు–బెళగావి మధ్య త్వరలో వందే భారత్ రైలు సంచారానికి చర్యలు తీసుకుంటామన్నారు. డీజిల్ ఇంజిన్లను తొలగించి విద్యుత్ రైళ్లను నడపడం వల్ల ఏడాదికి రూ.18 వేల కోట్లు ఆదా అవుతోందన్నారు. కమల్ హాసన్ కన్నడ భాషపై అవహేళనకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. కేంద్రం పేదలకు తక్కువ ఖర్చుతో మందులు లభించేలా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాలను మూసివేయరాదని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశానన్నారు. హేమావతి నీటి విడుదల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య దారి మళ్లారన్నారు. హేమావతి నీటిని రామనగరకు తీసుకెళ్లే పథకంలో రైతులపై కేసులు నమోదు చేయడం తగదన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మొండివాడిగా మారాడన్నారు. రైతులకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ఈ విషయంపై గతంలో ముఖ్యమంత్రికి లేఖ రాసి హేమావతి నీటి విషయంలో రాజకీయాలు వీడి రైతులకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. నూతన పైపులైన్లు అమర్చుకోవాలన్నారు. హేమావతి నీటి పథకాన్ని వదిలి పెట్టాలని కోరామన్నారు. -
జిందాల్లో అగ్ని ప్రమాదం
●త్రుటిలో తప్పిన పెను ప్రమాదం సాక్షి బళ్లారి: దేశంలో పేరు గాంచిన స్టీల్ ఇండస్ట్రీ జిందాల్ పవర్ హౌస్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం జిల్లాలోని తోరణగల్లు సమీపంలో వేలాది ఎకరాల్లో వెలసిన జిందాల్ స్టీల్ ప్లాంట్ ఆవరణలో ఉన్నఫళంగా పవర్ హౌస్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఎలక్ట్రానిక్ వస్తులు పూర్తిగా కాలిపోయాయి. తక్షణం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పడంతో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఈ ఘటనపై తోరణగల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. క్లీనర్ దుర్మరణం పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో పెద్దవడుగూరు మండల పరిధిలోని కాశేపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఐషర్ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఈ ప్రమాదంలో ఐషర్ వాహనం క్లీనర్ మహమ్మద్ (31) అనే వ్యక్తి మృతి చెందాడు. రాయచూరు నుంచి అనంతపురానికి సరుకులు తీసుకొని వచ్చి అన్లోడ్ చేసి తిరిగి రాయచూరుకు వెళ్తుండగా కాశేపల్లి టోల్ప్లాజా దాటగానే నిద్రమత్తులో ఐషర్ డ్రైవర్ ఖలీల్ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఐషర్ క్లీనర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇతని స్వస్థలం కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి అని తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం రాయచూరు రూరల్: మనిషి సంపూర్ణ ఆరోగ్య రక్షణకు యోగా దోహదపడుతుందని మాజీ ఇంజినీర్ వెంకటేష్ పేర్కొన్నారు. సోమవారం బిల్లవ మందిరంలో యోగా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. యోగాతో వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. శారీరకంగా, మానసికంగా ఎదుగుదలకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున స్వామి, సత్యవతి, బూదెప్ప, సహదేవ్, భావన, నేత్ర, విజయలక్ష్మి, ప్రభాకర్లున్నారు. డెంగీ కట్టడికి ఏకతాటిపై కదలండి రాయచూరు రూరల్: డెంగీ వ్యాధిని కట్టడి చేసేందుకు అందరూ కలిసి ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని జిల్లా ఆరోగ్యాధికారి డాక్టర్ సురేంద్రబాబు పిలుపు ఇచ్చారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్య శాఖ, నగరసభ ఆధ్వర్యంలో డెంగీ దినోత్సవంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిం చాలన్నారు. అందరిని ఏకతాటి పైకి తెచ్చి నలుగురితో సమానంగా కలిసి జీవించాలన్నారు. ఇంటి ముందు నీరు నిలవకుండా ముందుకు ప్రవహించేలా చూడాలన్నారు. ఇంటి మందు దోమలు రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. హెడ్ మాస్టర్ శ్రీనివాస్, నోడల్ అధికారులు చంద్రశేఖరయ్య, యఽశోద, ఆర్సీహెచ్ అధికారిణి నందిత, అరుణ, రాధిక, అనిత, అన్నపూర్ణలున్నారు. యథేచ్ఛగా సంబరాలు.. 8 మంది అరెస్ట్రాయచూరు రూరల్: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో తమ జట్టు గెలుపుపై మితిమీరిన సంబరాలు చేసుకుంటున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన జిల్లాలోని మస్కి తాలూకాలో చోటు చేసుకుంది. మస్కి తాలూకా హసమకల్లో ఆర్సీబీ జట్టు విజయం సాధించిన రోజు రాత్రి 8 మంది ఆర్సీబీ అభిమానులు యథేచ్ఛగా సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చడంతో పాటు పెట్రోలు పోసిన యువకులు నడి రోడ్డుపై నిప్పంటించి అల్లరి చేసి న్యూసెన్స్ సృష్టించినందున పోలీసులు అరెస్ట్ చేశారు. సింధనూరు తాలూకా బళగానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు. కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ధర్నా రాయచూరు రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలలకు కమిషనరేట్తో పాటు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లాధ్యక్షుడు శ్రీశైల నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో నిరవధిక ధర్నా ప్రారంభించి మాట్లాడారు. నవోదయ, మొరార్జి దేశాయి, రాణి కిత్తూరు చెన్నమ్మ, మైనార్టీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. జీఎఫ్, పీఎఫ్లను కూడా మంజూరు చేయాలని కోరారు. -
మానవతా విలువలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు మానవతా విలువలను పెంచుకోవాలని సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, మంగళవారపేటె మఠాధిపతి వీరసంగమేశ్వర శివాచార్య పేర్కొన్నారు. వీరశైవ కళ్యాణ మంటపంలో గాణిగ సమాజం ఆధ్వర్యంలో 2024–25లో ఉత్తమ శ్రేణిలో పాసైన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పచ్చని నగరం, ప్లాస్టిక్ నిర్మూలనకు పాటు పడాలన్నారు. గాణిగ సమాజం అధ్యక్షుడు చెన్నప్ప సజ్జన్,ి ససిద్రామప్ప, శకుంతల, లక్ష్మీబాయి, బసప్ప గొరేబాళ్, విజయ్ కుమార్లున్నారు. -
నిర్మాణంలో ఉండగానే కూలింది
● కూలీ మృతి, నలుగురికి గాయాలు మండ్య: నిర్మాణ దశలో ఉన్న మహాద్వారం కుప్పకూలిన ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని దేవరహళ్ళి గ్రామంలో జరిగింది. వివరాలు.. తపసీరాయ స్వామి దేవాలయం ముందు భాగంలో మహాద్వారాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 20 అడుగుల ఎత్తు, 35 అడుగుల పొడవునా నిర్మాణమవుతోంది. పై భాగంలో కాంక్రీట్ వేయడం కోసం కడ్డీలతో చట్రం బిగించారు. సోమవారం మధ్యాహ్నం కాంక్రీటు వేస్తుండగా బరువు తట్టుకోలేక చట్రం కుప్పకూలి కార్మికుల మీద పడింది. ఐదుమంది కార్మికులు చిక్కుకున్నారు. జేసీబీని తీసుకొని వచ్చి శిథిలాలను తొలగించి కూలీలను బయటకు తీవారు. ఆస్పత్రికి తరలిస్తున్నప్పుడు కల్బుర్గి జిల్లాకు చెందిన శరన్ (27) అనే కూలి చనిపోయాడు. మిగతావారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. నాగమంగళ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. నాసిరకంగా సెంట్రింగ్ను వేయడమే కూలడానికి కారణమని అనుమానాలున్నాయి.పెళ్లిలో రూ.25 లక్షల నగల చోరీ దొడ్డబళ్లాపురం: కళ్యాణ మండపంలో వధువుకు చెందిన రూ.25 లక్షల విలువైన బంగారు నగలు చోరీకి గురైన సంఘటన బెంగళూరు రాజాజినగర పరిధిలో చోటుచేసుకుంది. గవిపురం నివాసి ఎల్.శివశంకర్ ఈమేరకు మాగడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివశంకర్ కుమార్తె దివ్య వివాహం రాజాజినగర సప్తపది కళ్యాణ మండపంలో జరిగింది. మే 29న జరిగిన రిసెప్షన్కు అనేకమంది అతిథులు హాజరయ్యారు. పెళ్లికూతురికి చెందిన ఖరీదైన కానుకలు, రూ.25 లక్షల విలువైన నగలను సూట్కేస్, బ్యాగుల్లో భద్రపరిచి నిద్రపోయారు. మే 30న ఉదయం అందరూ లేచి గదికి తాళంవేసి ముహూర్తానికి వెళ్లారు. ఇంతలో ఎవరో దొంగలు నకిలీ తాళంచెవితో గది తాళం తీసి నగల బ్యాగులను అపహరించారు. చోరీ వల్ల పెళ్లిలో ఉత్సాహం బదులు విచారం తాండవించింది. కొట్లాడుతూ ఉంటే హిందీని రుద్దుతారు దొడ్డబళ్లాపురం: కన్నడ, తమిళం అంటూ మనం కొట్లాడుతూ సమయం వృథా చేస్తే కేంద్రం వచ్చి మనపై హిందీ భాషను రుద్దుతుందని మంత్రి కృష్ణభైరేగౌడ అన్నారు. తాజా కన్నడ, తమిళ వివాదాన్ని ప్రస్తావించారు. సోమవారంనాడు కెంపేగౌడ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని భాషలూ సమానమే అన్నారు. అయితే బలవంతంగా మనపై హిందీ రుద్దాలని చూస్తున్నారని ఇదే అసలు సమస్య అన్నారు. స్వయంప్రేరితంగా హిందీ నేర్చుకొంటే తప్పులేదని, నేర్చుకో అని ఒత్తిడి చేయడం సబబు కాదన్నారు. ఫొటోషూట్కు రూ.25 వేల జరిమానా ● జంటకు అటవీశాఖ వడ్డన మైసూరు: ఇది ఫోటోషూట్ల కాలమైంది. పెళ్లికి ముందు, ఆ తరువాత, తల్లీ తండ్రి కాబోతుంటే మరోసారి ఇలా అనేక సందర్భాలలో ఫోటోషూట్లు ఉండాల్సిందే. కొన్నిసార్లు ఇవి వెర్రిగా మారుతుంటాయి కూడా. ఇదే మాదిరిగా మైసూరులోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని బండీపుర వన్యప్రాణుల అభయారణ్యంలోకి చొరబడి ఫోటోలు తీసుకున్న జంటకు అటవీశాఖ రూ. 25 వేల జరిమానా వడ్డించింది. బెంగళూరుకు చెందిన పల్లవి, ఘోష్ అనే వ్యక్తులు విహారానికి వచ్చారు. బండీపుర మంగళ రోడ్డు సమీపంలో అడవిలోకి వెళ్లి ఫోటో షూట్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం. అటవీ అధికారి నవీన్కుమార్కు పర్యాటకులకు సమాచారం అందించారు. వెంటనే ఆ జంటను పట్టుకుని హెచ్చరిక లేఖ ఇచ్చి రూ. 25 వేలు జరిమానా విధించారు. -
బెళగావి నీళ్లు ధార్వాడకా?
● కన్నడ సంఘాల ధర్నా దొడ్డబళ్లాపురం: జిల్లాలోని హిడకల్ డ్యాం నుంచి హుబ్లీ–ధార్వాడలోని పరిశ్రమలకు నీటి విడుదలను ఆపకపోతే బెళగావి బంద్ తప్పదని కర్ణాటక రక్షణ వేదిక నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు. సోమవారంనాడు బెళగావిలోని రాణి చెన్నమ్మ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ఖాళీ బిందెలతో ర్యాలీ చేసి, కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా చేపట్టారు. వారంలోపు నీటి విడుదల ఆపకపోతే తామే ముందుండి నీటి విడుదల అడ్డుకుంటామని, బెళగావి జిల్లా బంద్ చేస్తామని చెప్పారు. జిల్లాలోని హిడకల్ డ్యాం నుంచి ప్రజలకు, రైతులకు నీటిని ఇవ్వాలని కోరారు. పరిశ్రమలకు ఇస్తే రైతుల పంటలు ఎండిపోతాయన్నారు. కలెక్టర్ కార్యాలయానికి తాళం వేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేసి తరలించారు. మెడికో ఆత్మహత్య శివమొగ్గ: శివమొగ్గలో ఉన్న సుబ్బయ్య మెడికల్ కళాశాలలో హాస్టల్లో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు విష్ణుప్రియ (22). వివరాలు.. ఈమె కుటుంబం బెంగళూరుకు చెందినది కాగా, జర్మనీలోని బెర్లిన్లో నివసిస్తోంది. విష్ణుప్రియ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇంటర్న్షిప్ చేస్తోంది. మరికొన్ని రోజుల్లో పూర్తయి డాక్టర్ కానుంది. అయితే ఏమి జరిగిందో మరి.. హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. కారణాలు తెలిసి రాలేదు. డెత్నోట్ ఏదీ దొరకలేదు. శివమొగ్గ గ్రామీణ పోలీసులు ఆమె శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిమ్స్లో బాలిక మృతిపై విచారణ మండ్య: బాలిక సాన్వి మరణానికి మిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం కారణమని ఆరోపణలు రావడంతో విచారణ కోసం బృందాన్ని ఏర్పాటు చేశాం, 15 రోజుల్లోగా నివేదిక ఇస్తారని ఎమ్మెల్యే పి.రవికుమార్ చెప్పారు. సోమవారం మండ్య నగరంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఇంట్లో టైల్స్ పడడం వల్ల బాలిక కాలు విరిగింది, నాలుగు రోజుల్లో ఎలా చనిపోతుందని అన్నారు. గాయానికి ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు తెలిపారన్నారు. మిమ్స్లోని పలు విభాగాల సర్జన్లతో కమిటీని రచించినట్లు తెలిపారు. జిల్లాధికారి కార్యాలయంలో మిమ్స్ వైద్య నిపుణులతో కలెక్టర్ చర్చించారు. బాలికను వైద్యం కోసం చేర్పించగా మరణించడం, మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన చేయడం తెలిసిందే. సకాలంలో వైద్యం చేయకపోవడం వల్లే తమ బిడ్డ దూరమైందని తల్లిదండ్రులు ఆరోపించారు. అరెస్టు చేయాలని ధర్నా బనశంకరి: బెళగావి తాలూకా సంతిబస్తవాడ మసీదులో ఖురాన్, హదీస్లను కాల్చివేసిన ఘటనలో దుండగులను అరెస్టు చేయాలని ముస్లింలు సోమవారం ఆ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఘటన జరిగి 20 రోజులు గడిచినప్పటికీ దుండగులను అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు కారణమౌతోందని, గ్రామంలో అశాంతి సృష్టించడానికి దుండగులు కుట్రపన్నారని ఆరోపించారు. ఇటీవల సంతిబస్తవాడలో మరో వర్గంవారు తమతో వ్యాపారాలను బహిష్కరించారని, మత సామరస్యం దెబ్బతీస్తున్నారని చెప్పారు. చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. -
ఆల్మట్టి ఎత్తు పెంపునకు అడ్డంకులా?
బనశంకరి: కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం కర్ణాటక రాష్ట్రం వాటా నీటిని ఉపయోగించుకోవడానికి ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524 మీటర్లకు పెంచాలని ట్రైబ్యునల్లో కోరినప్పుడు మౌనంగా ఉన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హఠాత్తుగా అభ్యంతరం చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు. సోమవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి రాష్ట్ర రైతులు హితరక్షణ కాపాడటానికి రాష్ట్ర ఎంపీలు, కేంద్రమంత్రులు సహకరించాలని చేతులెత్తి మొక్కుతానని అన్నారు. గత నెల 9వ తేదీన దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారని తెలిపారు. ఆలమట్టి ఎత్తు పెంచితే మహారాష్ట్రలో సాంగ్లి, కొల్హాపుర జిల్లాలు వరద ముంపు సమస్యను ఎదుర్కొంటాయని లేఖలో రాశారన్నారు. ఫడ్నవీస్ వైఖరి తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. 2010 ట్రైబ్యునల్ తీర్పు పట్ల మహారాష్ట్ర ఎప్పుడూ ప్రశ్నించలేదని, ఈ పథకాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర కూడా చెప్పిందని, కానీ ఇప్పుడు మళ్లీ డ్యాం ఎత్తు పెంచరాదని లేఖ రాసిందని డీకేశి ఆరోపించారు. ఎత్తు పెంపు అనేది ట్రైబ్యునల్లో తమకు దక్కిన హక్కు అని, దీనిపై సీఎం సిద్దరామయ్య ఒకటి రెండు రోజుల్లో తిరుగు లేఖ రాస్తారని తెలిపారు. వరద వారి సమస్య మహారాష్ట్రలో వరదలు తలెత్తితే, అది వారి సమస్య. వారే సరిదిద్దుకోవాలని కేంద్రమంత్రులను, ప్రధానిని కలిసి చెబుతామని డీకే అన్నారు. ఇందులో రాష్ట్ర ఎంపీలు, కేంద్రమంత్రులు సమైక్యంగా ఉండాలన్నారు. 2013 నుంచి ఈ పథకానికి గెజిట్ నోటిఫికేషన్ కావాలని వేచి చూస్తున్నామని, ఇంకా ఎన్నిరోజులు నిరీక్షించాలని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సోమణ్ణ ఆల్మట్టి గురించి స్పందిస్తూ ఈ ప్రాజెక్టు రాష్ట్ర హితమని, మాకు వేరే రాష్ట్రాలతో గొడవ ఇష్టంలేదని, మన వాటా నీరు కావాలని అన్నారు. ఆలస్యం కావడం వల్ల ఖర్చు పెరిగిపోతోంది. భూస్వాధీనానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమని అన్నారు. మహారాష్ట్ర సీఎం లేఖపై డిప్యూటీ సీఎం ధ్వజం -
చిన్నారుల్లో నేర ప్రవృత్తి విశృంఖలం
హుబ్లీ: ఇటీవల పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. దీనిపై తల్లిదండ్రుల పాత్ర గురించి మనోవైద్యులు, పోలీస్ అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మద్యం తాగిన మత్తులో గాని, మత్తు పదార్థానికి బానిసలైనప్పుడు గొడవ జరగడం పర్యవసానంగా హత్యకు దారి తీయడం అక్కడక్కడ జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం వాణిజ్య నగరి హుబ్లీలో చిన్న కారణంగా 13 ఏళ్ల బాలుడు తనకన్నా మూడేళ్లు పెద్దవాడైన మరో బాలుడిని చాకుతో దాడి చేసి హత్య చేసిన ఘటన సర్వత్ర ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లలు తెలిసో తెలియకో హత్య వరకు ఎలా వెళుతున్నారు. పిల్లల మనోగతంలో ఇంత క్రౌర్యం కలగడానికి కారణం ఏమిటి? ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? అన్న దానిపై సమాధానంగా పిల్లల పరివర్తన ఎలా ఉంటుందన్న దాని గురించి మనోవైద్యులు, పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు. ఇటీవల హుబ్లీ ధార్వాడ నేర, ట్రాఫిక్ విభాగం డీసీపీ సీఆర్ రవీష్ మాట్లాడుతూ తన 30 ఏళ్లకు పైగా వృత్తి జీవితంలో ఇలాంటి ఘటన తొలిసారిగా చూశానన్నారు. 13 ఏళ్ల బాలుడు హత్య చేయడం అత్యంత ఆవేదన కలిగించే ఘటన అన్నారు. పిల్లలను బాగా పెంచడం ప్రతి తల్లిదండ్రి ప్రథమ కర్తవ్యం అన్నారు. వేప విత్తనానికి తేనె పోస్తే విషం పోతుందా? వేప విత్తనానికి బెల్లం, పాలు, తేనె పోసినంత మాత్రాన వేపలోని విషం పోతుందా? అంటూ వేప ఎప్పటికై నా తియ్యదనం ఇస్తుందా? అని బసవణ్ణ వచనాన్ని ఉదాహరణగా వివరించారు. పిల్లల ఎదుగుదల తదితర బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో నడుచుకొనే తీరు వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దీనికి తోడు మొబైల్, టీవీలు, సినిమాల్లో నేరాలు, ఘోరాలను వైభవీకరించడం వల్ల సుతిమెత్తని చిన్నారుల మనసుపై పరిణామం చోటు చేసుకుంటుందన్నారు. పిల్లల మనసు మొగ్గలాంటిది. తల్లిదండ్రులు వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పిల్లలు రోజు ఎక్కడికి వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? అన్నదాంతో పాటు అసహజ వ్యక్తిత్వాన్ని గమనిస్తూ వాటికి పరిష్కారం కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పిల్లల్లో తల్లిదండ్రులు దుర్గుణాలను తగ్గేలా చూడాలన్నారు. నైతిక, నీతి పాఠాలను వివరించి చెప్పాలన్నారు. పబ్జీ, బ్లూగేమ్స్ వంటి ఆన్లైన్ ఆటలు చిన్నారి పువ్వులాంటి మనసుపై ముల్లులాంటి క్రౌర్యాన్ని కలిగిస్తుందన్నారు. అందుకే పిల్లలకు మొబైల్, ల్యాప్టాప్లో ఏం చేస్తున్నారో సదా గమనించి మంచి చెడ్డలను వివరించాలన్నారు. పిల్లలపై ఇంటి వాతావరణ ప్రభావం మనోవైద్యుడు డాక్టర్ శివానంద హిరేమఠ మాట్లాడుతూ 13 ఏళ్ల బాలుడు హత్య ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇటీవల పిల్లల్లో అమాయకత్వం తగ్గిపోతోందన్నారు. సోషల్ మీడియా, సినిమాలోని హింసను భారీగా చూపడం వంటి దృశ్యాలు చిన్నారుల మనసులను కనిష్టం చేస్తున్నాయన్నారు. తమ చుట్టు పక్కల తమ కన్నా పెద్దలు అలాంటి ప్రవృత్తిలో ఉంటే వారినే పిల్లలను అనుసరిస్తారు. ఇంట్లోని వాతావరణంలో తల్లిదండ్రుల మధ్య జగడాలు వంటి కారణాలు పిల్లలపై తీరని ప్రభావం చూపుతాయన్నారు. ఈ విషయాలపై తల్లిదండ్రులు సదా జాగృతంగా ఉండి తమ పిల్లలకు అవసరమైనప్పుడు కౌన్సిలింగ్, థెరపీ ద్వారా సమస్యలను పరిష్కరించాలి. ఆన్లైన్ ఆటలలో హింసాత్మక ప్రవృత్తి నానాటికి పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం, తల్లిదండ్రులు వాటి నుంచి దూరంగా ఉంచే పని చేయాలి. తండ్రే ఆ కుటుంబ ఆదర్శ వ్యక్తిగా ఉత్తమ నడత కలిగి ఉండాలి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదితో కూడిన వాతావరణ కౌటుంబిక సౌహార్ధ ఉండాలి. తండ్రి తమ పిల్లలకు తగిన సమయాన్ని కేటాయించి పిల్లలతో చక్కటి అనుబంధాన్ని పాదుగోల్పేలా తమ తీరును తల్లిదండ్రులు మార్చుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లలను మంచిగా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత మనో వైద్యులు, పోలీస్ అధికారుల సలహా సూచనలు -
థగ్ లైఫ్ ఆడకూడదు
శివాజీనగర/ మైసూరు: తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్పై వ్యతిరేకత అధికమవుతోంది. ఆయన నటించిన కొత్త సినిమా థగ్ లైఫ్ ను కర్ణాటకలో విడుదల చేయరాదని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఒక్క థియేటర్లో సినిమా ఆడినా బెంగళూరును బంద్ చేస్తామని కర్ణాటక రక్షణా వేదిక నాయకులు తెలిపారు. ఈ సినిమా జూన్ 5న దేశమంతటా విడుదల అవుతోంది. కమల్ క్షమాపణ చెప్పకపోవడంతో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమా ఆడిస్తే థియేటర్ లోపలికి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కన్నడ సంఘాలన్ని ఏకమై ఈ తీర్మానం చేసినట్లు నేతలు తెలిపారు. కమల్ని అరెస్టు చేయాలి కమల్ హాసన్ను వెంటనే అరెస్టు చేయాలని మైసూరులో కన్నడ చళువళి పోరాటదారుడు వాటాల్ నాగరాజు, సంఘాల నేతలు కమల్ చిత్రానికి నిప్పుపెట్టారు. కమల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాటాల్ మాట్లాడుతూ కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలను పూర్తిగా బహిష్కరణ చేయాలని అన్నారు. కన్నడ ప్రజలు కమల్ సినిమాలను వ్యతిరేకించాలని చెప్పారు. కన్నడ సంఘాల హెచ్చరిక -
బాను ముష్తాక్ గర్వకారణం: సీఎం
శివాజీనగర: సాహిత్యానికి సమాజాన్ని వృద్ధిచేసే శక్తి ఉందని, సాహిత్యం ద్వారా సమాజాన్ని ఐకమత్యం చేయాలే గాని విభజించరాదని సీఎం సిద్దరామయ్య అన్నారు. సోమవారం విధానసౌధలో బుకర్ పురస్కార గ్రహీత, కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ అభినందన సభ జరిపారు. ఆమెను సీఎం సన్మానించి మాట్లాడారు. బాను ముష్తాక్ కన్నడ కీర్తిని పెంచారు. ఇది కన్నడ ప్రపంచానికే గర్వకారణమని ప్రశంసించారు. బాను ముష్తాక్ను, ఆమె రచనలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తికి రూ.10 లక్షల చొప్పున నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించారు. పాత్రికేయురాలిగా, రచయితగా, న్యాయవాదిగా, ఉద్యమకారిణిగా సమాజంలో రాణించారని బాను ముష్తాక్ను కొనియాడారు. ముస్లిం సముదాయపు మహిళ మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ రాసే ప్రగతిపరమైన శ్రద్ధ ఆమెలో ఉందని అన్నారు. -
హైకోర్టుకు కమల్ హాసన్.. ‘థగ్లైఫ్’ సినిమాను అడ్డుకొని తీరుతాం
సాక్షి,బెంగళూరు: కన్నడ భాషా వివాదంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును (karanataka high court) ఆశ్రయించారు. ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ‘థగ్లైఫ్’ (Thug Life) సినిమాను కర్ణాటకలో విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. జూన్ 5న ఈ సినిమా విడుదల ఎలాంటి అడ్డంకులు లేకుండా తగిన భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ క్రమంలో కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎం.నరసింహులు కమల్ హాసన్కు హెచ్చరికలు జారీ చేశారు. కన్నడ భాషనే కాదు, రాష్ట్రాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ కన్నడ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.🚨THUG LIFE BAN ISSUE IN KARNATAKA : #KamalHaasan has approached the #Karnataka HC seeking directions to ensure the release and screening of the film #ThugLife in the state, following widespread backlash over his recent comments about the origins of the Kannada language. pic.twitter.com/IGrUQFHU0d— Venkatramanan (@VenkatRamanan_) June 2, 2025 ‘కమల్ హాసన్ (kamal hasan) క్షమాపణలు చెప్పాలనేది సినిమా ఇండస్ట్రీ కోసం కాదు.. రాష్ట్రం కోసం. కమల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ రాజకీయ,కన్నడ అనుకూల సంస్థలు తమ అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పాయి. క్షమాపణలు చెప్పకుండా థగ్ లైఫ్ సినిమాను విడుదల చేస్తామంటే తాము ఒప్పుకోబోమని, అడ్డంకులు సృష్టించామని సూచించారు. రాష్ట్రంలో ఎగ్జిబిటర్లు,డిస్టిబ్యూటర్లు సినిమాను విడుదల చేయడం లేదు. క్షమాపణలు చెప్పకుండా థగ్లైఫ్ ఎలా విడుదల చేస్తామో మేమూ చూస్తాం’ అని హెచ్చరికలు జారీ చేశారు.తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, కన్నడ భాషను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను కమల్ తన వ్యాఖ్యలకు క్షమాణలు చెప్పాలని కోరారు. ఆ విజ్ఞప్తులపై కమల్ హాసన్ స్పందిస్తూ బలవంతంగా తనతో క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేయొద్దని నొక్కాణించారు. ఈ తరుణంలో థగ్ లైఫ్ సినిమా విడుదల కోసం కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. -
ఆటోడ్రైవర్ను తిట్టి.. చెప్పుతో కొట్టి, ఆపై శిరస్సు వంచి క్షమాపణలు
బెంగళూరు: రాష్ట్రంలో కన్నడిగులపై.. కన్నడేతర వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. వీటిని అక్కడి ప్రజలు కూడా అంతే తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓ ఆటోడ్రైవర్ను ఇస్టానుసారం తిడుతూ చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. గంటల వ్యవధిలోనే ఆమెతో క్షమాపణలు చెప్పించిన మరో వీడియో బయటకు వచ్చింది. పంకూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో స్కూటీ మీద శనివారం బయటకు వెళ్లింది. శివాజీనగర్ ప్రాంతంలో.. వాళ్ల బండి పక్కనే ఆగిన ఆటోడ్రైవర్తో ఒక్కసారిగా ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో టైర్ తన కాలు మీద నుంచి వెళ్లిందని చెబుతూ ఆమె అతని దూషించసాగింది. అయితే అలాంటిదేం జరగలేదు కదా అని ఆ ఆటోడ్రైవర్ ఆమెకు బదులిచ్చాడు. అయినా ఆమె అస్సలు తగ్గలేదు. ఆమె తిట్ల పురాణాన్ని ఆ డ్రైవర్ ఫోన్లో వీడియో తీయబోయాడు. అంతే.. ఆ పరిణామంతో ఆ యువతి రగిలిపోయింది. ‘‘వీడియో తీస్తావా.. తీసుకో’’ అంటూ కాలికున్న చెప్పు తీసి అతన్ని కొట్టింది. స్థానికులు కొందరు సర్దిచెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఘటన జరిగిన వెంటనే ఆ ఆటోడ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పేరు లోకేష్గా తెలుస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగర పోలీసులు సత్వర చర్యలకు దిగారు. ఆ యువతిని అరెస్ట్ చేశారు. ఆపై ఆమె స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆదివారం సాయంత్రం ఆ ఆటోడ్రైవర్, మరికొందరి సమక్షంలో పంకూరి మిశ్రా క్షమాపణలు కోరింది. తాను గర్భవతినని, ఏదైనా అనుకోని ఘటన జరగొచ్చనే ఆందోళనతో తాను అలా ప్రవర్తించానని చెప్పుకొచ్చింది. జరిగిందానికి లోకేష్కు క్షమాపణలు చెబుతూ.. శిరస్సువంచి నమస్కారాలు చెప్పింది. బెంగళూరు నగరమన్నా.. కన్నడ సంప్రదాయాలన్న తనకు మంచి ఉద్దేశాలే ఉన్నాయని, కన్నడ ప్రజలనుగానీ.. భాషనుగానీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని.. జరిగిందానికి తనను క్షమించాలని ఆ భార్యాభర్తలు వేడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. In #Bengaluru: The female software engineer, who was arrested for assaulting an autorickshaw driver with her slipper in Bellandur area over a road dispute, has apologised to the autodriver, his family & Kannadigas. Videos of assault & apology👇@timesofindia pic.twitter.com/61xXewMgI8— TOI Bengaluru (@TOIBengaluru) June 2, 2025 VIDEO CREDITS: TOI Bengaluru -
యువతి పైకి బస్సును ఎక్కించేయత్నం
బనశంకరి: సిలికాన్సిటీలో కొందరు బీఎంటీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్ల దుష్ప్రవర్తన వల్ల ఆ సంస్థకే చెడ్డపేరు వస్తోంది. బస్ను అడ్డగించిన యువతిపై బస్ ఎక్కించడానికి ప్రయత్నించిన బీఎంటీసీ బస్డ్రైవరు ఉదంతమిది. గతనెల 23 తేదీ సాయంత్రం 5.30 సమయంలో నగరంలోని ఓ కూడలిలో చోటుచేసుకుంది. బీఎంటీసీ బస్ పక్కన కారులో వెళ్తున్న యువతి దిగి, బీఎంటీసీ డ్రైవరు ప్రశాంత్ని ఏదో విషయమై ప్రశ్నించింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా బస్ ముందుకు కదిలింది, సిగ్నల్లో బస్ను యువతి అడ్డుకుంది. కానీ డ్రైవరు ఆమైపె బస్ను ఎక్కించడానికి ప్రయత్నించగా యువతి తప్పించుకుంది. డ్రైవరు చర్యతో ప్రజలు హడలిపోయారు. డిపో నెంబరు 17, చంద్రాలేఔట్ డిపో కు చెందిన బీఎంటీసీ బస్ అని తెలిసింది. ఈ ఘటన మీడియాలో ప్రసారం కావడంతో రవాణా మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలతో డ్రైవరును సస్పెండ్ చేశారు. -
కన్నడ వైపునే నిలబడతా: శివు
యశవంతపుర: కన్నడ భాష గురించి ప్రముఖ నటుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడ నటుడు శివరాజ్కుమార్ స్పందిస్తూ తాను కన్నడ బాషకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానన్నారు. కమల్ మాట్లాడిన వేదికపై నేనున్నాను, ఎలా మాట్లాడాలో కమల్ తెలుసుకొని మాట్లాడి ఉండాలి. కన్నడ భాషకు ఎలాంటి సమస్య వచ్చినా నేను కన్నడకు మద్దతుగా నిలబడతానన్నారు. కన్నడ కోసం తాను ఏమి చేశానో ప్రజలందరికీ తెలుసన్నారు. కమల్ ఇష్ట ప్రకారమే మాట్లాడి ఉండవచ్చు. క్షమాపణ చెప్పడం అనేది ఆయనకే వదిలేస్తున్నట్లు తెలిపారు.బ్యాంకు లాకర్లో నగలు మాయం యశవంతపుర: ఇంట్లో ఉంటే దొంగలు పడి దోచుకుంటారనే భయంతో కొందరు నగలను బ్యాంక్ లాకర్లో భద్రపరుస్తారు. కానీ అక్కడ కూడా మాయమైతే ఏం చేయాలి? బంగారు ఆభరణాలు అదృశ్యమైన ఘటనలో బెంగళూరు చిక్కమారనహళ్లి డాలర్స్ కాలనీ బ్రాంచ్ మేనేజర్ కేఎస్ భారతీశ్, డిప్యూటీ మేనేజర్ ఫిల్జిత్ జాన్, సిబ్బందిపై కేసు నమోదైంది. చిక్కమారనహళ్లికి చెందిన మహిళా ఖాతాదారు ఫిర్యాదు చేసింది. వివరాలు.. 2022లో ఆమె ఆ బ్రాంచిలో ఖాతాను తెరిచారు. లాకర్ను తీసుకొని 145 గ్రాముల బంగారం ఉంచారు. గత మార్చి 29న బ్యాంక్కు వెళ్లి పరిశీలించగా ఖాళీ లాకర్ కనిపించింది. పై నిందితులకు చెప్పగా, మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. పైగా బంగారం బిల్లు ఉంటే ఆన్లైన్ ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. ఈ అన్యాయంపై బ్యాంక్ వినియోగదారుల సేవా కేంద్రంతో పాటు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా ఆమె గోడును ఎవరూ పట్టించుకోలేదు. దీంతో స్థానిక డీసీపీ కి ఫిర్యాదు చేయగా, ఆ మేరకు సదాశివనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికపై మూకుమ్మడి అత్యాచారం దొడ్డబళ్లాపురం: మైనర్ బాలికపై దారుణం జరిగింది. ఆరుమంది కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బెళగావి శివారులోని చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై నిందితులు రెండుసార్లు గ్యాంగ్ రేప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 6 నెలల క్రితం బాలిక స్నేహితుడు ఆమెను నిర్జనప్రదేశానికి తీసికెళ్లి అత్యాచారం చేసి వీడియో తీశాడు. తరువాత ఆ వీడియోను చూసి ఆమెను బెదిరించి ఆరుమంది యువకులు మరోసారి ఘోరానికి ఒడిగట్టారు. మళ్లీ వీడియో తీసి బెదిరిస్తుండడంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఏపీఎంసీ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. -
ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులకు ఉత్తేజం
బళ్లారిటౌన్: విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు ఇవ్వడం వల్ల వారిని ఉత్తేజ పరిచినట్లు అవుతుందని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎస్ఎన్ రుద్రేష్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని పత్రికా భవనంలో కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేపట్టిన ఎస్ఎస్ఎల్సీ, ద్వితీయ పీయూసీల్లో ప్రతిభ కనబరిచిన విలేకరుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలను అందజేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్కు పేష్వా చేసిన సహాయంతో దేశ రాజ్యాంగాన్ని రచించేలా ఎదిగారని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్న విద్యార్థులకు కొంత ప్రోత్సాహ ధనం ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేకే ట్రస్ట్ నేత జోళదరాశి తిమ్మప్ప మాట్లాడుతూ డబ్బును దొంగలు దోచుకుపోవచ్చు కానీ విద్యను ఎవరూ దోచుకోలేరని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్.వీరభద్రగౌడ, అడహక్ కమిటీ సభ్యులు కే.మల్లయ్య పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు దివ్యశ్రీ, కాంచన, నాగాంబిక, అశ్విత చౌదరి, కార్తీక్, సంజన, హేమంత్కుమార్, యశ్వంత్కుమార్లకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. -
నేత్రపర్వం.. మహా రథోత్సవం
బళ్లారిఅర్బన్: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో చేళ్లగుర్కిలో వెలసిన శ్రీఎర్రితాత మహా రథోత్సవం ఆదివారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. ప్రతి ఏటా ఆనవాయితీ మాదిరిగా మహా రథోత్సవం ఈ ఏడాది కూడా సప్త భజనలతో ప్రారంభమై ఎర్రితాతకు వెండి ఆభరణాలు, పూలతో అలంకరణ పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం మహా రథోత్సవం సందర్భంగా ఆలయంలో అగ్ని దీపాలతో భక్తులు 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. మహా రథోత్సవంలో వివిధ సాంస్కృతిక కళా బృందాలు పాల్గొని అందరినీ ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పైళ్లెన కొత్త జంటలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి వేలాది మంది భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. చేళ్లగుర్కి ఎర్రితాతకు ఆభరణాల అలంకరణ వేలాదిగా పాల్గొన్న చుట్టుపక్కల భక్తులు -
పౌర కార్మికుల నిరసన.. పేరుకున్న చెత్త
హొసపేటె: గత ఐదు రోజులుగా పౌర కార్మికులు తమ వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం విధులు బహిష్కరించి నిరసన తెలపడంతో నగరంలో అనేక రహదార్లు చెత్తకుప్పల్లా దర్శనం ఇస్తున్నాయి. దీంతో హొసపేటె నగరం మురికివాడగా మారుతోంది. హొసపేటె నగరం నుంచి హంపీకి ప్రతి రోజూ వేలాది మంది పర్యాటకులు వచ్చిపోతుంటారు. అయితే పౌర కార్మికులు నిరసన కారణంగా చెత్త సేకరించడం నిలిపి వేశారు. నగర ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తున్నారు. దీంతో చెత్త దుర్వాసన వెదజల్లుతోంది. ప్రజలు వీధుల్లో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. పైగా ప్రజలు ఎక్కడ పడితే అక్కడ పడేసే చెత్త కుప్పలను పశువులు, కుక్కలు, పందులు చెల్లాచెదురు చేస్తున్నాయి. చెత్త కుళ్లిపోయి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నగరసభ యంత్రాంగం వెంటనే రహదార్లలో ఉన్న చెత్తను తొలగించే దిశగా దృష్టి పెట్టాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేశారు. -
10 నుంచి ముంగారు ఉత్సవాలు
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అఖిల భారత ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఏ.పాపారెడ్డి వెల్లడించారు. ఆదివారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 25 ఏళ్ల నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఎద్దుల పోటీల్లో భాగంగా ఈనెల 10న కర్ణాటక ఎద్దుల ఒకటిన్నర టన్నుల రాతి దూలం లాగే పోటీలను జిల్లా ఇన్చార్జి, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ ప్రారంభిస్తారన్నారు. 11న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎద్దుల రెండు టన్నుల బరువుగల రాతిదూలం లాగే పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాశీ జగద్గురువులు, 12న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఎద్దుల రెండున్నర టన్నుల బరువైన రాతి దూలం లాగే పోటీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారన్నారు. 11న లక్ష్మీదేవి జాతర, ఎద్దుల ఊరేగింపు, కళా బృందాలతో ఉత్సవం జరుగుతుందన్నారు. 8 నుంచి ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 5న సద్భావన యాత్ర, కవిగోష్టులు, 6న రంగుల పోటీలు, 7న సేవకులకు సన్మానం, 8న వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో బసవరాజరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 11న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య 12న హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి 25వ ఏడాది పోటీలకు ముఖ్యమంత్రుల రాక -
హావేరి జిల్లాలో అధికం
వ్యవసాయం చేయాలని అందరికీ మక్కువ. కొందరికి హాబీ అయితే చాలామంది అదే జీవనాధారమైన అన్నదాతలు. కానీ రైతుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కలిసిరాని రుతుపవనాలు, అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి. విత్తనాలు, ఎరువులు, కూలీలకు విపరీతమైన ఖర్చులు. పంట పండినా దక్కని లాభం ఇలాంటివి కర్షకులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. కుటుంబం మొత్తం కష్టించినా ప్రతిఫలానికి గ్యారెంటీ లేదు.. కొప్పళ వద్ద పొలం పనులు సాక్షి, బెంగళూరు: గత ఏడాది మంచి వర్షాలు పడినా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గలేదు. ప్రభుత్వ ఐదు గ్యారెంటీలు అమలవుతున్నా రైతుల బలవన్మరణాలు ఆగడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ రెండేళ్ల అధికారాన్ని పూర్తి చేసుకుంది. అయితే ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది 2024–2025 ఆర్థిక ఏడాదిలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వ్యవసాయంలో వచ్చిన నష్టాలు, అప్పుల ఊబిలో చిక్కుకుని రైతులు మరో మార్గం లేక ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే వరకు మొత్తం 983 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లాధికారులతో సీఎం సిద్దరామయ్య గత రెండురోజులు నిర్వహించిన ప్రగతి పరిశీలన సమావేశంలో తేల్చారు. పరిహారంలోనూ కోత నిబంధనల ప్రకారం రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. కానీ అధికారులు ఏదో సాకుతో తగ్గించేందుకే చూస్తారు. ఈ 983 మంది రైతుల ఆత్మహత్యల్లో 139 కేసులను ప్రభుత్వం రైతు మరణాలు కాదని తిరస్కరించింది. 828 రైతుల ఆత్మహత్యలు పరిహారానికి అర్హమైనవిగా తేల్చారు. జిల్లా స్థాయిలో మరో 16 కేసులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అప్పుల బాధనే అని తేలింది. పంట నష్టం , సాగు కోసం ఇతర కారణాల వల్ల అప్పులు చేసి వాటిని తీర్చే మార్గం కనిపించక మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబాలు మరింత దారుణంగా మారుతున్నాయి. ఏటా సుమారు వెయ్యి మంది కన్నడనాట గడిచిన మూడేళ్లలో వేలాదిమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2022– 23లో సుమారు 922 మంది రైతులు తనువు చాలించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో సుమారు 1,061 మంది, 2024–25లో సుమారు 983 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏటికేడాది ఈ విష వలయం విస్తరిస్తోందే తప్ప తగ్గడం లేదు. ప్రతి ఏటా వెయ్యికి అటుఇటుగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ సగటున ఇద్దరి నుంచి ముగ్గురు రైతులు పురుగుల మందునో, ఉరినో ఆశ్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పలు పథకాలు, కార్యక్రమాలు రైతు అనుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఈ సమస్యను నియంత్రించడం సాధ్యపడడం లేదని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర తగ్గిపోవడం, అతివృష్టి లేదా అనావృష్టి వల్ల పంటలు ధ్వంసం కావడం వల్ల, అప్పులు పెరిగిపోవడం వల్ల రైతులు జీవితం మీద విరక్తి చెందుతున్నారు. ఆత్మహత్యల గ్రాఫ్ ఏటా ౖపైపెకి గత ఆర్థిక ఏడాదిలో 983 మంది ఆత్మహత్య ఏటేటా ఇదే విషాదం పకృతి విపత్తులు, సర్కార్ల నిర్లక్ష్యం రైతుల ఆత్మహత్యల్లో హావేరి జిల్లా మొదటి స్థానంలో ఉంది. హావేరి జిల్లాలో సుమారు 128 మంది రైతులు బతుకు చాలించారు. ఆ తర్వాత స్థానంలో కలబురిగి – 82, సీఎం సొంత జిల్లా మైసూరు – 73 ఉన్నాయి. ధారవాడ జిల్లాలో 72 మంది, బెళగావిలో 71, హాసన్ జిల్లాలో 47, బీదర్లో 45, శివమొగ్గ జిల్లాలో 45, గదగ జిల్లాలో 44, యాదగిరి జిల్లాలో 43 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక దక్షిణ కన్నడ జిల్లాలో 5 మంది, కొడగు జిల్లాలో 5 మంది, బళ్లారిలో నలుగురు, చామరాజనగరలో నలుగురు, రామనగరలో ముగ్గురు, చిక్కబళ్లాపురలో ముగ్గురు చొప్పున అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు నమోదు అయ్యాయి. అలాగే కొన్ని జిల్లాల్లో ఒక్క రైతు ఆత్మహత్య కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఉడుపి, కోలారు, బెంగళూరు, బెంగళూరు గ్రామీణం జిల్లాల్లో ఒక్క రైతు బవవన్మరణం కూడా నమోదు కాలేదు. -
విత్తనాలు, ఎరువుల కోసం రైతుల క్యూ
హొసపేటె: రుతుపవననాల ప్రభావంతో వర్షాలు ప్రారంభం కావడంతో జిల్లాలో వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రైతులు విత్తనాల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. ఈసారి రుతుపవనాలు ముందుగానే రావడంతో వర్షాలు బాగా కురిశాయి. ఇది రైతులకు ప్రయోజనకరంగా ఉంది. అదనంగా రుతుపవనాలు ముందుగానే వస్తాయనే సూచన ఉంది. అందువల్ల వర్షాభావ ప్రాంతాల్లో కొన్ని చోట్ల విత్తనాలు విత్తడం ప్రారంభమైంది. జూన్ 10వ తేదీ తర్వాత చాలా చోట్ల విత్తన ప్రక్రియ ప్రారంభమవుతుంది. వివిధ పంటల విత్తనాలను కొనుగోలు చేయడానికి రైతులు నగరంలోని ప్రైవేట్ దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. అవసరమైన విత్తనాలను సరఫరా చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని ఐదు తాలూకాలకు అవసరమైన వివిధ పంటల మొత్తం 11,766 క్వింటాళ్ల విత్తనాలు నిల్వ చేశారు. వర్షాకాలం కోసం మొత్తం 1,08,102 మెట్రిక్ టన్నుల ఎరువుల డిమాండ్ ఉంది. ఇందులో మే నెలాఖరు వరకు 3,031 మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా, వ్యవసాయ శాఖ 40,228 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేసింది. స్టాక్ అందుబాటులో ఉంది. ఈసారి వరి, మొక్కజొన్న, వేరుశెనగ, కంది, జొన్న విత్తనాలను సేకరించారు. వీటిని రైతు కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయినప్పటికీ విత్తనాల కోసం రైతులు ప్రైవేట్ దుకాణాల వద్ద క్యూ కట్టారు. -
భారీ వర్షంతో టమాటా పంటకు దెబ్బ
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హరపనహళ్లి, హడగలి, కొట్టూరు తాలూకాల్లోని అనేక గ్రామాలకు చెందిన రైతుల పొలంలో వర్షంతో టమాటా పంట దెబ్బతింది. ఇటీవల కురిసిన భారీ వర్షంతో తాలూకాలోని అనేక రైతుల పొలంలో టమాటా పంట దెబ్బతినడంతో కోయకుండా వదిలేశారు. టమాటా ధర పడిపోవడంతో కోత మరింత ఆర్థిక భారం అవుతుందని రైతులు నాగరాజు, హనుమంతప్ప పంటను పొలంలోనే వదిలేశారు. దీంతో ఏపుగా పెరిగిన టమాటా పొలంలో కుళ్లిపోతోంది. ఎకరానికి దాదాపు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేశారు. అయితే పంట దిగుబడి వచ్చినా మార్కెట్లో ధర మాత్రం లేదు. కిలోకు కేవలం రూ.3 నుంచి రూ.4 ల ధరకు అడుగుతున్నారు. దీని వల్ల కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో టమాటాలను పొలంలోనే వదిలేశామని రైతు హనుమంతు విచారం వ్యక్తం చేశారు. వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు తగిన పరిహారం అందించడంపై జిల్లా యంత్రాంగం, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు దృష్టి సారించాలని కోరారు. -
వరుణ జోరుకు విరామం
బనశంకరి: రాష్ట్రంలో నైరుతి ముందస్తు వర్షాలు తగ్గుముఖం పట్టగా కరావళి, మలెనాడు ప్రదేశాల్లోనూ వానలు అదుపులోకి వచ్చాయి. గత 10 రోజులుగా కరావళి, మలెనాడు ప్రాంతాల్లో నిరంతరం భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మంగళూరు శుక్రవారంనాడు అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరుచేరింది. అనూహ్యంగా శనివారం నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. ఉత్తర, దక్షిణ ఒళనాడులో వరుణుడు విరామం ఇచ్చాడు. ఇప్పటివరకు ఉత్తర కన్నడ జిల్లాలో క్యాజల్రాక్, బంట్వాళలో తలా 4 సెంటీమీటర్లు, కోటాలో 3, సె.మీ, కద్రి, మంగళూరులో తలా 2 సెంటీమీటర్లు, కుమటా, సిద్దాపుర, ఉడుపి, కారవార, కార్కళ, మూడుబిదిరె, పణంబూరు, కుందాపుర, ముల్కి, ఉప్పినంగడి, పుత్తూరు, హొన్నావరలో తలా ఒక సెంటీమీటరు వర్షం కురిసింది. భారీ వర్షాలతో ప్రముఖ నదులు, జలాశయాల్లో నీటిమట్టం పెరిగింది. మేలో గణనీయంగా వానలు మే నెలలో సాధారణం కంటే రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. కర్ణాటక వాతావరణశాఖ సమాచారం ప్రకారం గత ఒకవారంలో 298 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మే లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 73.6 మిల్లీమీటర్లు కాగా, 218.7 మిల్లీమీటర్లు వర్షం కురిసింది, అలా మామూలు కంటే 197 శాతం అధిక వర్షం పడింది. రాష్ట్రమంతటా తగ్గిన వర్షాలు -
జొన్నల కొనుగోలు కోసం రాస్తారోకో
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో పండించిన జొన్నలను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం సింధనూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది రైతులతో కలిసి చేపట్టిన రాస్తారోకోను ఉద్దేశించి సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు. అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు కేంద్రాలను బంద్ చేసి జొన్నల కొనుగోళ్లను నిలిపివేయడాన్ని తప్పుబట్టారు. రైతులు మార్కెట్కు తెచ్చిన జొన్నలు కొనుగోలు చేయాలని విన్నవించినా అధికారులు బేఖాతరు చేశారన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు లేకపోవడం, ఆ కేంద్రాలను మూసివేయడాన్ని ఖండించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఓపీఎస్ కల్పించాలి రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ వ్యవస్థ(ఓపీఎస్)ను కల్పించాలని అఖిల కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల వేదిక అధ్యక్షుడు జై కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు వ్యతిరేకంగా ఉందన్నారు. పాత పింఛన్ పద్ధతికి బదులుగా నూతన పింఛన్ పద్ధతి అమలుతో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 లక్షల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయాలని కోరారు. అనుచిత వ్యాఖ్యలపై నిరసన బళ్లారిఅర్బన్: కన్నడ భాషను అవమానిస్తూ మాట్లాడిన తమిళ నటుడు కమల హాసన్ సినిమా థగ్లైఫ్ను రాష్ట్రంలో విడుదల చేయరాదని కన్నడ రక్షణ వేదిక నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం రాయల్ సర్కిల్లో వేదిక శివరామగౌడ బణ జిల్లాధ్యక్షుడు కురిహట్టి రాజశేఖర్ ఆధ్వర్యంలో డాక్టర్ మహేశ్వర స్వామి, కరవే పదాధికారులు పాల్గొని నిరసన తెలిపారు. కన్నడ భాషను అవమానించిన కమల హాసన్ తక్షణమే కన్నడిగులకు క్షమాపణ చెప్పాలన్నారు. కరవే పదాధికారులు కట్టిగె సూరి, సుంకన్న పాల్గొన్నారు. రాయచూరు రూరల్: తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని సినీ నటుడు కమల హాసన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరవే ఆందోళన చేపట్టింది. ఆదివారం రంగమందిరం వద్ద చేపట్టిన ఆందోళనలో కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడారు. నటుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. కాగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నటుడి చిత్రపటంపైకి కరవే కార్యకర్తలు గుట్కాను ఉమ్మి తమ నిరసన తెలిపారు. ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలి రాయచూరు రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలకు కమిషనరేట్తో పాటు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లాధ్యక్షుడు శ్రీశైల నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నవోదయ, మొరార్జి దేశాయి, రాణి కిత్తూరు చెన్నమ్మ, మైనార్టీ పాఠశాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. జీఎఫ్, పీఎఫ్లను కూడా మంజూరు చేయాలని కోరారు. కన్నడ భాషను ప్రోత్సహించాలిరాయచూరు రూరల్ : నగర, పట్టణ ప్రాంతాల్లో కన్నడ భాషను ప్రోత్సహించాలని కరవే అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ పిలుపునిచ్చారు. ఆదివారం కన్నడ భవనంలో కన్నడ భాష కార్యకర్తల శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భాషలో నేటికీ తెలుగు, కన్నడలు కలిపి వ్యాఖ్యానించడం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తహసీల్దార్ సురేష్ వర్మ, జైలర్ అనిత, వీర హనుమాన్, మ్యాదర్, బషీరుద్దీన్ హొసమని, కృష్ణ, నిజాముద్దీన్, రామలింగప్పలున్నారు. -
శిథిలావస్థలో బీఈఓ కార్యాలయం
రాయచూరు రూరల్ : విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే పాఠశాలలకు తోడు తాలూకా విద్యాశాఖాధికారి (బీఈఓ) కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. బీఈఓ కార్యాలయానికి 50 ఏళ్లు దాటినా భవనానికి మరమ్మతులు మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. తాలూకా కార్యాలయం పైకప్పు పెచ్చులూడుతున్నాయి. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు ఏ రోజునా కూడా కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ, జిల్లా విద్యాశాఖాధికారి కూడా కార్యాలయం స్థితిగతుల గురించి ఏనాడూ పరిశీలించిన సందర్భాలు లేవు. ఇటీవల కురిసిన వానలకు భవనంపై నీరు నిలబడి కారడంతో పెచ్చులూడి కిందకు పడగా సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బిక్కుబిక్కుమంటూ విధులు.. అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏ సమయంలో పెచ్చులూడి తమపై పడతాయోననే భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. తాలూకా విద్యా శాఖాధికారి కార్యాలయం ముందు భాగంలో పెచ్చులూడి పడ్డాయి. నూతన జిల్లాధికారి కార్యాలయం మినీ విధానసౌధకు తరలి పోవడం నగరసభ కార్యాలయం పాత జిల్లాధికారి కార్యాలయానికి తరలించారు. అందులోకి బీఈఓ కార్యాలయాన్ని తరలించడానికి అవకాశం కల్పిం చాలని బీఈఓ ఈరణ్ణ కోస్గి జిల్లాధికారి నితీష్కు లేఖ రాసి 45 రోజులు గడుస్తున్నా నేటికీ జిల్లాధికారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు, సిబ్బంది వాపోయారు. త్రుటిలో సిబ్బందికి తప్పిన ప్రమాదం 50 ఏళ్లు దాటినా మరమ్మతులు శూన్యం -
రియల్టర్ ఇంట్లో బడా దోపిడీ
బనశంకరి: సెక్యూరిటీకి పెట్టుకున్న నేపాలీ దంపతులు ఆ ఇంటిని ఊడ్చిపెట్టేశారు. భారీగా నగదు, రెండు కేజీల బంగారు ఆభరణాలు, పిస్టల్ను దోచుకెళ్లారు. ఈ సంఘటన బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. హెచ్ఏఎల్ శాస్త్రి నగరలో రియల్టర్, రాజకీయనేత రమేశ్ నివాసం ఉంటున్నారు. మూడునెలల క్రితం నేపాల్ కు చెందిన రాజ్, దీపా దంపతులు ఆయన ఇంట్లో కాపలాదారు పనిలో చేరారు. బాగా పనిచేస్తూ ఇంటి యజమానికి నమ్మకంగా ఉండేవారు. తిరుమలకు వెళ్లగానే గత నెల 27వ తేదీన రమేశ్ కుటుంబం తిరుమల తిమ్మప్ప దర్శనానికి వెళ్లారు. ఇదే అవకాశం కోసం వేచిచూస్తున్న నేపాలీ దంపతులు మరో ముగ్గురు నేపాలీలను పిలిపించుకున్నారు. సీసీ కెమెరాల సిస్టమ్ని ఆఫ్ చేశారు. రమేశ్ బెడ్రూమ్ తలుపులు బద్ధలుకొట్టి అందులో ఉన్న రూ.10 లక్షల నగదు, 2 కిలోలు బంగారు ఆభరణాలు, లైసెన్సుడ్ పిస్టల్ను మూటగట్టారు. అద్దె కారు బుక్ చేసుకున్న దుండగులు దర్జాగా ఉడాయించారు. కారు డ్రైవరుకు చోరీ విషయం తెలియదు. యజమానికి అనుమానం 28వ తేదీ వేకువజామున రమేశ్ మొబైల్ఫోన్ సీసీ కెమెరా చిత్రాలను పరిశీలించగా కనెక్ట్ కాలేదు. కరెంట్ లేనందున సీసీ కెమెరా ఆఫ్ అయి ఉంటుందని అనుకున్నాడు. పక్కింటి వారికి ఫోన్ చేసి విచారించగా ఇంట్లో ఎవరూ లేరని తెలిపారు. అనుమానం వచ్చి స్నేహితులకు ఫోన్ చేసి ఇంటి వద్దకు వెళ్లాలని సూచించాడు. స్నేహితులు వెళ్లి చూడగా దోపిడీ వెలుగులోకి వచ్చింది. హెచ్ఏఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నేపాలీ ముఠా తీవ్రంగా గాలిస్తున్నారు. గతంలోనూ నేపాలీ పనివారు ఓ నగల వ్యాపారి ఇంట్లో నుంచి రూ.14 కోట్ల డబ్బు, బంగారాన్ని దోచుకెళ్లారు. సిటీలో నేపాలీ ముఠా ఘాతుకం రూ.10 లక్షలు, 2 కేజీల బంగారం, పిస్టల్తో ఉడాయింపు -
మొబైల్ జామర్తో ప్రజలకు పాట్లు
బళ్లారి అర్బన్: నగరంలోని కనకదుర్గమ్మ గుడి సమీపంలో ఉన్న సెంట్రల్ జైల్లో ఇటీవల కొత్తగా మొబైల్ జామర్ను ఏర్పాటు చేయడంతో జైల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జామర్ సామర్థ్యాన్ని వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్రెడ్డి పోలీస్ సూపరింటెండెంట్కు విన్నవించారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో జైల్ సూపరింటెండెంట్కు ఆయన వినతిపత్రాన్ని అందించారు. జామర్ ఏర్పాటుతో సమీపంలోని వ్యాపార దుకాణాలు, ఫోన్ పే, ఆర్టీజీఎస్తో సహా డబ్బు బదిలీలు నెట్వర్క్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యాపారాలు కూడా తగ్గిపోయాయన్నారు. ప్రజలు తమ మొబైల్ సంభాషణలను చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత రెండు మూడు నెలల నుంచి ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జామర్ సామర్థ్యాన్ని తగ్గించి స్థానికుల సమస్యలకు పరిష్కారం కల్పించాలన్నారు. జైల్లో ఉన్న ఖైదీల భద్రత కోసం జామర్ ఏర్పాటు చేయడం మంచిదే అయినా జైలు నగర శివార్లలో ఉండి ఉంటే ఇలా జామర్ను ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరం అన్నారు. నగర నడిబొడ్డున జైలు ఉన్నప్పటికీ జామర్ సామర్థ్యాన్ని ప్రజలకు అనుకూలం అయ్యేలా తగ్గించాలని కోరినట్లు తెలిపారు. బీజేపీ జిల్లాధ్యక్షుడు అనిల్నాయుడు, కార్పొరేటర్ గుడిగంటి హనుమంతు, కార్పొరేటర్ కే.హనుమంతు, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు. సామర్థ్యం తగ్గించాలని జైలు సూపరింటెండెంట్కు వినతి -
4న శ్రీగురు చిరంతప్ప స్వాముల వర్ధంతి
బళ్లారిటౌన్: నగరంలోని బసవభవన్లో ఈ నెల 4న శ్రీగురు చిరంతప్ప స్వాముల 21వ స్మరణోత్సవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమ్మరచేడు మఠం కళ్యాణ స్వామీజీ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపేందుకు వివిధ సమితులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు రేణుకాచార్య, బసవణ్ణ, స్వాముల చిత్రపటాలను శ్రీకనకదుర్గమ్మ దేవస్థానం నుంచి బసవభవన్ వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 వివిధ మఠాల స్వాములు పాల్గొంటారని తెలిపారు. ఇందులో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరం, పుస్తక ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా నగరంలో వివిధ రంగాల్లో సమాజ సేవ చేసిన 11 మంది సాధకులను అవార్డులు ఇచ్చి సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు 30 మందికి పైగా వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో శంభులింగ స్వామి, జంగమ హొసళ్లి స్వామి, నేతలు పంచాక్షరప్ప, జయప్రకాశ, మెట్రి మృత్యుంజయ, బీఎం స్వామి, గంగావతి వీరేష్, రాజన్న, నందీష్, దుర్గేష్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు. హెచ్జీఎంలో ఎయిర్ బ్లాస్ట్తో కార్మికుడి దుర్మరణం రాయచూరు రూరల్: జిల్లాలోని హట్టి బంగారు గనుల(హెచ్జీఎం) కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు ఎయిర్ బ్లాస్ట్ కావడంతో దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం విధులు నిర్వహిస్తున్న సమయంలో ఽశరణ బసవ(35) అనే కార్మికుడిపైకి 28 అడుగుల్లో ఎయిర్ బ్లాస్ట్ కావడంతో రాళ్లు ఎగిరి ఆయనపై పడ్డాయి. దీంతో తీవ్ర గాయాలతో శరణ బసవ మరణించగా, మరొక కార్మికుడు గాయాల పాలు కావడంతో లింగసూగూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఉచిత కంప్యూటర్ శిక్షణకు అర్జీల ఆహ్వానం హొసపేటె: 2025–26వ సంవత్సరంలో ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ, డిప్లొమాతో సహా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన లేదా అనుత్తీర్ణులైన పురుష, మహిళా విద్యార్థులకు మరియమ్మనహళ్లిలోని ప్రభుత్వ పరికరాల శిక్షణా కేంద్రం(జీటీటీసీ)లో రెండు నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ టూల్స్ ట్రైనింగ్ సెంటర్, హొసపేటె అనే చిరునామాలో లేదా 9845416198, 8722999929 నంబరులో సంప్రదించాలని జీటీటీసీ కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సైక్లింగ్ జాతాకు శ్రీకారంరాయచూరు రూరల్: నగరంలో సైకిలింగ్ జాతాకు జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య శ్రీకారం చుట్టారు. ఆదివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కి పచ్చజెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. నాడు పూర్వీకులు నడిచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారన్నారు. నేటి ఆధునిక యుగంలో నడకను విస్మరించి అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతాలో బసవరాజ్, రవి, చెన్నబసవనగౌడ, విశ్వనాథ్, జయప్రకాష్, శరణే గౌడ, నాగరాజ్, సందీప్, పవన్, సకలేష్, విజయ, రాఘవేంద్ర, గురురాజ్, వెంకటేష్లున్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం హొసపేటె: ఎస్సీఎస్పీ, టీఎస్పీ పథకాల కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థుల నుంచి పర్యాటక, ఆతిథ్య రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం పర్యాటక శాఖ దరఖాస్తులను ఆహ్వానించిందని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రభులింగ ఎస్.తళకేరి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 2వ తేదీ నుంచి విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని కమలాపుర లోటస్ మహల్ సమీపంలోని పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం నుంచి దరఖాస్తు ఫాంను పొంది, భర్తీ చేసి ఈనెల 9వ తేదీలోగా అదే కార్యాలయంలో సమర్పించాలి. శిక్షణ పొందుతున్న అభ్యర్థి వయస్సు కనీసం 20– 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ స్టీవార్డ్ శిక్షణ కాలం 4 నెలలు ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మల్టీ క్యుసిన్ కుక్ శిక్షణ కాలం 5 నెలలు ఉంటుంది. అభ్యర్థి 8వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. రూమ్ అటెండెంట్ శిక్షణ కాలం 4 నెలలు ఉంటుంది. అభ్యర్థులు ఐదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరిన్ని వివరాలకు విజయనగర జిల్లా హొసపేటె తాలూకా కమలాపురలోని లోటస్ మహల్ సమీపంలోని పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో లేదా 08394–295640 నెంబర్లో సంప్రదించవచ్చని ప్రకటనలో తెలిపారు. -
ఇకపై చెత్త నిర్వహణ బాధ్యత ప్రైవేట్కు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ జంట నగరాలు పెరుగుతున్న చందంగానే సిటీ కార్పొరేషన్లో చెత్త సేకరణ, నిర్వహణ పెను సవాల్గా మారింది. జంట నగరాల్లో నిత్యం వందలాది టన్నుల చెత్త సేకరిస్తారు. దీని నిర్వహణకు పాలికె కొత్త మార్గానికి శ్రీకారం చుట్టింది. ఆ రోజు చెత్తను ఆరోజే నిర్వహణ చేసేలా బాధ్యతలను ప్రైవేట్ వారికి అప్పగిస్తూ పాలికె నిర్ణయం తీసుకుంది. ఇది తొలి ప్రయత్నంగా చెబుతున్నారు. జంట నగరాల్లో చెత్త నిర్వహణ సమర్థవంతంగా లేదు. దీంతో ఎక్కడ చూసినా పర్వతాల్లా చెత్త కుప్పలే కనిపిస్తుంటాయి. ఎన్నో దశాబ్దాల నుంచి చెత్త గుట్టలను కరిగించడానికి సాధ్యం కాక వాటిని బయో మైనింగ్ చేస్తున్నా అటు ధార్వాడ, హొసయల్లాపుర, అలాగే హుబ్లీ కార్వార రోడ్డులో చెత్త రాశులు పేరుకు పోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రాశులు తరగడం లేదు. ప్రస్తుతం దీన్ని బయో మైనింగ్ ద్వారా కరిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కొద్ది మేర సత్ఫలితాన్ని సాధించారు. రోజూ 500 టన్నుల చెత్త సేకరణ ఈ నేపథ్యంలో ప్రతి రోజు హుబ్లీలో 300 టన్నులు, ధార్వాడలో 150 టన్నులు మొత్తం కలిపి 450 నుంచి 500 టన్నుల చెత్త సేకరణ అవుతోంది. దీని నిర్వహణ పాలికెకు క్లిష్టంగా మారింది. బయో మైనింగ్ ద్వారా ఇంతకు ముందు సేకరించిన చెత్తను కరిగించినా కూడా ప్రతి రోజు 450 టన్నుల చెత్త సేకరణ అవుతూనే ఉంది. దీంతో చెత్త కరిగిన చందంగానే పెరుగుతోంది కూడా. రోజు సేకరించే చెత్తను శాసీ్త్రయంగా నిర్వహణ చేయాలని పాలికె సంకల్పించింది. ఇదే విషయాన్ని తమ సలహా, సూచనగా గ్రీనరీ ట్రిబ్యునల్ మండలి కూడా పేర్కొంది. కాగా రోజు పేరుకు పోయే 450 టన్నుల చెత్తను డంపింగ్ యార్డ్కు తరలిస్తారు. దీన్ని ఆ రోజే యార్డ్లో చెత్త పడగానే ఉన్న చెత్త సంస్కరణ పూర్తి కావాలన్న షరతుతో ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించారు. తడి, పొడి చెత్తను ప్రత్యేకించి డంపింగ్ యార్డ్లో వేస్తారు. ఇందులో పొడిచెత్తను సేంద్రీయ ఎరువుగా సంస్కరిస్తారు. అలాగే పొడి చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపడానికి అనువుగా సంస్కరించి సేకరించి పెడతారు. ఏడాదిపాటు ప్రైవేట్ వారికి కాంట్రాక్ట్ ఈ మేరకు ఓ ఏడాది పాటు ఈ చెత్త నిర్వహణ యూనిట్ను ప్రైవేట్ వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సంబంధిత యూనిట్ పాలికె ఇంజినీర్ సంతోష్ యర్రంగళి మీడియాకు తెలిపారు. హుబ్లీలో 300 టన్నుల సామర్థ్యం గల యూనిట్, ధార్వాడలో 150 టన్నుల సామర్థ్యం గల యూనిట్లు ఉన్నాయి. ఆ రోజు చెత్త ఆ రోజే సంస్కరణ చేస్తే ఎటువంటి చెత్త సమస్య తలెత్తదు. దీంతో రోజు ఉత్పత్తి అయ్యే రెండు ప్లాంట్లలో నిర్వహణకు నిర్ణయించారు. ఆ మేరకు హుబ్లీలోని 300 టన్నుల సామర్థ్యం గల యూనిట్ నిర్వహణను రూ.9 కోట్లకు, అలాగే ధార్వాడ చెత్తను రూ.6 కోట్ల టెండర్కు ఇవ్వడానికి ప్రతిపాదించారు. ఈ విషయమై పాలికె సాధారణ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపుతాం. అక్కడి నుంచి అనుమతి లభించిన తర్వాత టెండర్లు పిలుస్తామన్నారు. మొత్తం మీద 30–40 ఏళ్లుగా వేధిస్తున్న ఈ చెత్త నిర్వహణ పెను సమస్యకు ఇప్పటికై నా పరిష్కారం లభిస్తే అదే పది వేలు అని జంట నగరాల వాసులు అభిప్రాయపడ్డారు. ఏ రోజు చెత్త ఆరోజే సేకరణ, నిర్వహణ హుబ్లీ–ధార్వాడ మహానగర పాలికె నిర్ణయం -
యువతిని గుద్ది చంపేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ యత్నం?.. వీడియో వైరల్
బెంగళూరు,సాక్షి: బస్సు డ్రైవర్లతో గొడవ పడతున్నారా? అయితే,తస్మాత్ జాగ్రత్త. ఓ యువతి తనతో గొడపడిందని బస్సుతో ఢీకొట్టి ప్రాణాలు తీసేందుకు ఓ బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ ఘటనలో యువతి తృటిలో ప్రాణలు దక్కించుకుంది. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బెంగళూరులో బీఎంటీసీ (బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) డ్రైవర్ అరాచకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. నగరంలోని ఓ సిగ్నల్ దగ్గర యువతిపైకి బస్సును పోనిచ్చాడు. యువతి తనతో గొడవ పడిందన్న కారణంతో డ్రైవర్ కర్కశంగా వ్యవహరించాడు. బస్సు ముందు యువతి ఉందని తెలిసినా ఆమెను తోసుకుంటూ బస్సును నడిపాడు డ్రైవర్. అయితే, ఆ ప్రమాదం నుంచి యువతి తృటిలో తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే.. కేఏ57ఎఫ్2046 నంబర్ గల బస్సు డ్రైవర్ మే 23న చినస్వామి స్టేడియం సిగ్నల్ వద్ద ఓ యువతిని ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. మ్యూజియం రోడ్ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్తున్న సమయంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు బస్సు డ్రైవర్,యువతి మధ్య వాగ్వాదం జరిగింది. అందుకు కారణాలేంటనేది తెలియాల్సి ఉండగా.. బస్సు డ్రైవర్తో గొడవ జరిగిన తర్వాత యువతి సిగ్నల్ వద్ద ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించింది.డ్రైవర్ ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు. లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. పైగా, యువతిని ఢీకొట్టేందుకు బస్సు నడపడంతో ఉద్దేశపూర్వకంగానే సదరు బస్సు డ్రైవర్ యువతి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడనే స్పష్టంగా తేలింది. మరోవైపు, ఈ దుర్ఘటనపై బెంగళూరు వాసులు నిత్యం ప్రాణ భయంతోనే కాదు, సురక్షితమైన బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కోరుతున్నారు. వీడియోతో ఆధారంగా బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
హుక్కా.. నిషేధం పక్కా!
బనశంకరి: రాష్ట్రంలో హుక్కాబార్లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంతో పాటు సిగరెట్, బీడీ వంటి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చట్టబద్ధ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచింది. ఇటీవల కేంద్రం ఆమోదించిన చట్టానికి అనుగుణంగా శనివారం నాడు ఉత్తర్వులను జారీచేసింది. హుక్కాబార్లపై వేటు కొత్త చట్టంలో హుక్కా బార్ల నిర్వహణను పూర్తిగా నిషేధించారు. ఏ వ్యక్తి లేదా ఇతర వ్యక్తులు టిఫిన్ సెంటర్లు , పబ్, బార్ అండ్ రెస్టారెంట్ తో పాటు ఎలాంటి ప్రదేశాల్లో హుక్కాబార్ తెరవరాదు, హుక్కాలను సేవించరాదు. ధూమపానాన్ని దూరం చేయడమే ఈ చర్యల ఉద్దేశం. ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారికి ఏడాది నుంచి మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. సందు సందుల్లో హుక్కాబార్లు బెంగళూరులో విచ్చలవిడిగా హుక్కాబార్లు నడుస్తున్నాయి. తొమ్మిది, పదో తరగతి బాలలు కూడా వీటికి అలవాటు పడినట్లు సమాచారం. గతంలో అధికారుల దాడుల్లో బాలలు దొరికిపోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్లను నడుపుతూ ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. పాలికె, పోలీసు అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించినా మళ్లీ మామూలుగానే దందా సాగుతోంది. ఈ చట్టంతోనైనా హుక్కాలు బంద్ అవుతాయని సామాజిక కార్యకర్తలు ఆశిస్తున్నారు.కఠిన నిబంధనలు ⇒ ఇకపై రాష్ట్రంలో 21 ఏళ్లలోపువారికి సిగరెట్, పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదు. విద్యాసంస్థలకు 100 మీటర్ల చుట్టుపక్కల ప్రదేశాల్లో బీడీ, సిగరెట్లను అమ్మరాదు. ⇒ బహిరంగ స్థలాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించారు. అలా పట్టుబడితే రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. గతంలో ఈ జరిమానా రూ.200 ఉండేది.⇒ 30 గదులు కలిగిన హోటల్ లేదా, 30 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు కలిగిన రెస్టారెంట్లలో ప్రత్యేక స్థలంలో ధూమపానం చేయవచ్చునని ఓ మినహాయింపునిచ్చారు. -
జ్వరం, దగ్గు, జలుబు.. స్కూలుకు పంపొద్దు
శివాజీనగర(కర్ణాటక): రాష్ట్రమంతటా పాఠశాలలు పునర్ ప్రారంభం అవుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ దిగులు నెలకొంది. ఆరోగ్య శాఖ పాఠశాలల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ సాంకేతిక కమిటీ ఆదేశాలతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలను ఇచ్చింది.ఇవీ మార్గదర్శకాలు● పాఠశాల పిల్లల్లో జ్వరం, దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు కనిపిస్తే బడికి పంపరాదు,● వెద్యులతో చికిత్స చేయించాలి. సుస్తీ నయమైన తరువాతనే పిల్లలను పాఠశాలలకు పంపించాలి.● జ్వరం, దగ్గు, జలుబు, ఇతర రోగ లక్షణాలు ఉన్న పిల్లలు పాఠశాలకు వస్తే, వారి తల్లిదండ్రులకు తక్షణమే సమాచారమిచ్చి ఆ పిల్లలను ఇంటికి పంపించాలి.● పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే వైద్యసేవలను పొందాలి.● అన్ని పాఠశాలల్లో కోవిడ్ ముందు జాగ్రత్తా చర్యలను తప్పకుండా పాటించాలి.రాజధానిలో 150కి పైగా కేసులుబెంగళూరులో కోవిడ్ కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. క్రియాశీల కేసులు 150 ని మించిపోయాయి. మహాదేవపుర, తూర్పు జోన్తో పాటుగా బెంగళూరులోని పలు ఏరియాల్లో కోవిడ్ బాధితులు పెరుగుతున్నారు. రోగ బాధితులు, వారి పక్కన ఉండేవారు కోవిడ్ నియమావళిని పాటించాలని వైద్య నిపుణులు తెలిపారు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికై నా సిద్ధంగా ఉండాలి. వెంటిలేటర్లు, ఆక్సిజన్, బెడ్లకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య ఆదేశించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇది తీవ్రతరమైన వైరస్ కాదు. వృద్ధులు, వివిధ జబ్బు పీడితులు తప్పకుండా మాస్క్ ధరించాలి. అందరూ మాస్క్ ధరించాలన్న నియమం లేదు అని చెప్పారు. -
పేదలకు ఇళ్ల హక్కు పట్టాలిప్పిస్తాం
రాయచూరు రూరల్: మురికి వాడల్లో నివసించే పేదలకు ఇళ్ల హక్కు పట్టాలిప్పిస్తామని ఎమ్మెల్సీ వసంత్ కుమార్ వెల్లడించారు. శనివారం పండిట్ సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో మురికి వాడల క్రియా వేదిక ఆధ్వర్యంలో జరిగిన స్లం హబ్బను ప్రారంభించి మాట్లాడారు. గత 20 ఏళ్ల నుంచి మురికి వాడల ప్రాంతంలో నివసిస్తున్న వారికి నగరసభ అధికారులు, నగరాభివృద్ధి ప్రాధికార అధికారులతో చర్చించి సమస్యలకు పరిష్కారం కనుగొంటామన్నారు. నగరంలో నివసించే పేదల్లో 2024లో 1.64 లక్షల మందికి హక్కు పట్టాల పత్రాలను అందించారన్నారు. ఇళ్ల స్థలాలను కేటాయించాలని ఆర్డీఏ అధికారులతో ప్రతిపాదించి చర్యలు చేపడతామన్నారు. సర్కార్ మురికి వాడల ప్రజలకు ఇంటి హక్కు పట్టాలివ్వడానికి సిద్ధమన్నారు. అంతకు ముందు అంబేడ్కర్ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి, పవన్ కుమార్, రజాక్ ఉస్తాద్, రవీంద్ర జాలదార్, అంబన్న, అనిల్, మురికి వాడల క్రియా వేదిక అధ్యక్షుడు జనార్దన్లున్నారు. -
కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఉరవకొండ, ఉరవకొండ రూరల్: ఉరవకొండ మండల పరిధిలోని బూదగవి గ్రామ సమీపంలోని అనంతపురం–బళ్లారి 42వ జాతీయ రహదారిలో కేసీఆర్టీసీ బస్సు, కారును వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరానికి చెందిన జాన్రెడ్డి, చెన్నమ్మ దంపతులు తమ కుమార్తె సైనీ దీప్తి అల్లుడు రోహన్రెడ్డితో కలిసి కర్ణాటకలోని హంపీ క్షేత్రాన్ని సందర్శించి శనివారంనాడు ధర్మవరానికి తిరిగి వెళ్తున్నారు. బళ్లారి నుంచి ఉరవకొండకు వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు బూదగవి సమీపంలో ఓవర్టేక్ చేసే క్రమంలో కారును వెనుకభాగంలో ఢీకొట్టింది. దీంతో కారులో అదుపుతప్పి దూసుకెళ్లింది, కారు ధ్వంసం కాగా, అందులో ప్రయాణిస్తున్న జాన్రెడ్డి (80) అక్కడికక్కడే చనిపోయాడు, సైనీదీప్తి, రోహన్రెడ్డి, చెన్నమ్మతో పాటు కారు డ్రైవర్ వెంకటరమణకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని 108 అంబులెన్సులో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి పంపించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు ఢీకొని కూలీలకు గాయాలు పావగడ: పట్టణంలోని తేజస్ హోటల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రజవంతి గ్రామానికి చెందిన 14 మంది మహిళా కూలీలు గాయాలపాలై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాలూకాలోని నీలమ్మనహళ్లికి వేరుశనగ పంట కలుపును తీయడానికి ఆటోలో వెళ్లి తిరిగి స్వగ్రామం రజవంతికి ఆటోలో వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. స్థానిక పీయూ కళాశాల లెక్చరర్ విశ్వనాథ్, రాజవంతికి చెందిన మంజునాథ్ తదితరులు బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. బూదగవి సమీపంలో ఘటన కారులోని ఒకరు మృతి, నలుగురికి గాయాలు -
క్రస్ట్గేట్ నిర్మాణ పనులపై నిరాసక్తి
హొసపేటె: తుంగభద్ర డ్యాం 32 క్రస్ట్గేట్ల భర్తీ పనులకు మళ్లీ టెండర్ పిలిచినా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోలేదు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల కంపెనీలు మళ్లీ ఈ–టెండర్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. తుంగభద్ర డ్యాం గేట్లను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ఎన్డీటీ సర్వీస్ కంపెనీ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత నిపుణులు కూడా మార్పు అవసరమని చెప్పారు. అందువల్ల తుంగభద్ర బోర్డు 32 గేట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అప్పుడు కూడా నాలుగు కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. సాంకేతిక కారణాల వల్ల, మళ్లీ టెండర్ పిలిచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పుడు నాలుగు కంపెనీలు మాత్రమే దరఖాస్తులను సమర్పించాయి. గుజరాత్కు చెందిన అనార్ కంపెనీ, హార్డ్వేర్ టూల్స్, మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీలు తుంగభద్ర డ్యాం 32 గేట్ల పునర్నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాయి. తెలంగాణ నుంచి రెండు కంపెనీలు.. మరో వైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వప్రా, బెకామ్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పుడు సాంకేతిక బిడ్ తెరిచి ఉంది. రాబోయే రోజుల్లో టెండర్ ఎవరు దక్కించుకున్నారో తెలుస్తుందని తుంగభద్ర బోర్డు వర్గాలు తెలిపాయి. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల నిర్మాణంలో స్థానిక కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ను కోరారు. అయితే తుంగభద్ర బోర్డు మళ్లీ టెండర్లు పిలిచినా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోలేదు. జలాశయం క్రస్ట్గేట్ల నిర్మాణంలో అనుభవం, అర్హతలు కలిగిన ఏవైనా కంపెనీలు కర్ణాటకలో ఉన్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్గేట్ 2024 ఆగస్టు 10న కొట్టుకుపోయింది. ఈ గేటుకు స్టాప్లాగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు క్రస్ట్గేట్ నిర్మాణం కోసం గుజరాత్కు చెందిన హార్డ్వేర్ టూల్స్, మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీకి టెండర్ అప్పగించారు. ఈ కంపెనీ మెటీరియల్ను కొనుగోలు చేసి, గేట్ తయారీ పనిలో బిజీగా ఉంది. జూన్ నెలాఖరు నాటికి ఈ కంపెనీ గేట్ను ఏర్పాటు చేయాలని టెండర్లో పేర్కొన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కర్ణాటక, ఆంధ్రల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోని వైనం -
పొగ.. ఆరోగ్యానికి సెగ
హొసపేటె: దురలవాట్లకు బానిసయ్యే ముందు మీ జీవితం, జీవనోపాధి విలువలను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండగలరని సివిల్ జడ్జి ప్రశాంత్ నాగలాపుర అన్నారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన అవగాహన మార్చ్ను శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. యువత పొగాకు, నికోటిన్ వంటి ఉత్పత్తులపై ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నారు. దేశంలో 267 మిలియన్లకు పైగా పొగాకు వినియోగదారులు ఉన్నారన్నారు. ప్రతి సంవత్సరం 13.5 లక్షలకు పైగా ప్రజలు పొగాకు సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారన్నారు. హాస్యాస్పదంగా పొగాకు వినియోగదారుల్లో 47.6 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. కర్ణాటకలో 22.8 శాతం మంది వ్యక్తులు ఏదో ఒక రకమైన పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పొగాకు ఉత్పత్తుల చీకటి ఉద్దేశ్యాల గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు. జిల్లాను పొగాకు రహితంగా మార్చడంలో ప్రజల సహకారం చాలా ముఖ్యం అన్నారు. పొగాకు వాడకం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వస్తున్నాయి. నోరు, రక్తనాళాల నష్టం, తల, మెడ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, స్వరపేటిక, మెదడు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్కు కారణమవుతుందన్నారు. పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన తేవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి శంకర్ నాయక్, వైద్యులు భాస్కర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. దురలవాట్లకు బానిస కావద్దు బళ్లారిటౌన్: దురలవాట్లు, పొగాకు ఉత్పత్తుల సేవనానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీహెచ్ఓ వై.రమేష్బాబు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రపంచ పొగాకు రహిత దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పొగాకులో దాదాపు 2000 రసాయనిక అంశాలు దాగి ఉన్నాయన్నారు. అది మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. ఇందులో ముఖ్యంగా కిడ్నీలు, నరాల సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉత్పత్తి అవుతాయన్నారు. పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనే పథకాలను రూపొందించిందన్నారు. విద్యా సంస్థల వద్ద 100 మీటర్లలోపు పొగాకు అమ్మకం నిషేధం అని, అధికారులు కూడా మరింత జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ఈశ్వర్ దానప్ప, ఇంద్రాణి, జబిన్తాజ్, శ్రావణి, రాఘవేంద్ర, గోవిందప్ప, విరుపాక్షి, అంబదాసు, శివకుమార్, ఉమా మహేశ్వరి, సవిత తదితరులు పాల్గొన్నారు. పొగాకు సేవనానికి దూరంగా ఉండండి సివిల్ జడ్జి ప్రశాంత్ నాగలాపుర పిలుపు -
పరిశ్రమలకు ఈ–ఖాతా వర్తించదు
రాయచూరు రూరల్: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటికి ఈ–ఖాతాలను చేయించుకోవాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని సిటీ కార్పొరేషన్ అధికారులు ఉపసంహరించుకోవాలని కాటన్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు, హౌసింగ్, ఏపీఎంసీ, కేఏఐడీబీ, కేఎస్ఎస్ఐడీసీ వంటి వాటికి ప్రభుత్వమే కావేరి–2.0లో తీసుకుంటుందని, లేకపోతే సబ్ రిజిస్త్ట్రార్ కార్యాలయంలో అధికారులు నమోదు చేసుకోవడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. సర్కారు ఈ నిర్ణయంపై సరైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. నగరసభ అధికారులు ఈ విషయంలో పునరాలోచించాలన్నారు. -
ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం
బళ్లారిటౌన్: జిల్లాలోని కురుగోడు తాలూకా కోళూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిని కంప్లి ఎమ్మెల్యే జేఎన్.గణేష్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పురాతన కాలం నుంచి వచ్చిన మన ఆయుర్వేద వైద్యం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలగవన్నారు. ఈ మందుల వాడటం వల్ల రోగాలు పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీన్ని స్థానికులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యులు కూడా రోగులతో సౌజన్యంగా నడుచుకొని సేవలు అందించాలన్నారు. కోళూరు జీపీ అధ్యక్షురాలు దొడ్డబసమ్మ, ఉపాధ్యక్షుడు చెన్నప్ప, జిల్లా ఆయుష్ అధికారి ఎన్.విరుపాక్షప్ప, వైద్యాధికారి కేపీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఆక్యుప్రెషర్లో బంగారు పతకం రాయచూరు రూరల్: బెంగళూరులో జరిగిన బసవ ఆక్యు ప్రత్యామ్నాయ మందుల అకాడమీ ఆధ్వర్యంలో రాయచూరుకు చెందిన రాజా శంకర్ ఆక్యుప్రెషర్లో బంగారు పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షుడు బసవరాజ్, హెచ్.భోజరాజు, తమిళనాడు హిలర్ అధ్యక్షుడు డా.మణికణ్ణన్లున్నారు. ఎమ్మెల్సీపై చర్యలకు డిమాండ్ రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాధికారి ఫౌజియ తరన్నంను నిందించిన ఎమ్మెల్సీ రవి కుమార్పై చర్యలు తీసుకోవాలని అంజుమన్–ఏ–రాయచూరు డిమాండ్ చేసింది. శనివారం అదనపు జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు సయ్యద్ అమీనుల్లా హసన్ మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ జిల్లాధికారిని అవమానించడం తగదన్నారు. ఆయనపై చర్యలు చేపట్టాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానంద ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. అధిక ఫీజుల వసూలు తగదు రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని జనసేవా ఫౌండేషన్ అధ్యక్షుడు జావిద్ఖాన్ పేర్కొన్నారు. శనివారం మాన్విలోని పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యా శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు ఉన్నారన్నారు. అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యా శాఖాధికారులను డిమాండ్ చేశారు. జనౌషధి కేంద్రాల మూసివేత సరికాదురాయచూరు రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన జనౌషధి కేంద్రాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని బీజేపీ నాయకులు ఆరోపించారు. శనివారం బాగల్కోటె జిల్లా ఇలకల్ ప్రభుత్వాస్పత్రి వద్ద చేపట్టిన ఆందోళనలో ఇలకల్ నగర అధ్యక్షుడు అరవింద్ మాట్లాడారు. పేదలు దుబారా వ్యయంతో కూడిన మందులు కొనుగోలు చేయడం కష్టమని భావించి ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలను ప్రారంభించి వారికి సౌకర్యం కల్పించారన్నారు. కాంగ్రెస్ సర్కార్ వాటిని మూసివేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేశారు. ఆందోళనలో తృప్తి సాలిమఠ, మల్లికార్జున, శ్యాం సుందర్, బసప్ప, చంద్రశేఖర్, నాడగౌడ, ప్రకాష్, విజయ్ గిరెడ్డి, నాగేష్, శ్రీనివాస్, శివరాజ్, వీరేష్, పరశురామ్, సూగూరేష్, రాజేంద్రలున్నారు. -
రేప్ కేసులో ఎమ్మెల్యేకు ఊరట
దొడ్డబళ్లాపురం: అత్యాచారం కేసులో బెంగళూరు ఆర్ఆర్ నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. మునిరత్న, అతని అనుచరులు అత్యాచారం కేసులో ముందస్తు బెయిలు కోరుతూ కోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన కోర్టు వారిపై పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణని జూన్ 2కి విచారణ వాయిదా వేసింది. మైక్రో వేధింపులు.. మాజీ జవాన్ ఆత్మహత్య యశవంతపుర: రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ మైక్రోపైనాన్స్ సంస్థల వేధింపులు తగ్గడం లేదు. డెత్నోటు రాసి విశ్రాంత జవాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా మడికెరిలో జరిగింది. మాజీ జవాన్ దేవజన జగదీశ్ (56) మడికెరిలో నివాసం ఉండేవాడు. డబ్బు అవసరాల కోసం కొన్ని మైక్రో ఫైనాన్స్ల నుంచి అప్పులు తీసుకున్నాడు. వాటిని వెంటనే తీర్చాలని సిబ్బంది సతాయించసాగారు. దీంతో జగదీశ్ డెత్నోటులో ఆర్థిక సమస్యలతో పాటు మైక్రో పైనాన్స్ సిబ్బంది వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. ఓ గోదాములో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. రాష్ట్ర పోలీసుకు కేంద్ర పోలీసు వంచన యశవంతపుర: పెళ్లి చేసుకొంటానని నమ్మించి రాష్ట్ర మహిళా పోలీసు కానిస్టేబుల్ను లైంగికంగా వాడుకుని మోసం చేసిన కేంద్ర రిజర్వు కానిస్టేబుల్ బాగోతమిది. మోసగానిపై బెంగళూరు రాజాజీనగర పోలీసులు కేసు నమోదు చేశారు. యాదగిరి జిల్లాకు చెందిన సంజీవ చవాన్ నిందితుడు, ఓ మహిళ కానిస్టేబుల్తో సంజీవ్ ప్రేమాయణం నడిపారు. ఇద్దరూ యాదగిరి జిల్లాకు చెందినవారు కావడంతో పరిచయం మొదలై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెతో సంజీవ్ షికార్లకు వెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. పెళ్లి చేసుకుందామని మహిళా పోలీసు కోరగా, అతడు తప్పించుకు తిరగసాగాడు. ఆమె నిలదీయటంతో నీ ప్రైవేటు ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించసాగాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, రాజాజినగర పోలీసులు నిందితునికి విచారణకు రావాలని నోటీసులు పంపారు. శ్రీకంఠేశ్వరునికి కానుకల వెల్లువ మైసూరు: మైసూరు జిల్లాలో దక్షిణ కాశీగా పిలువబడే నంజనగూడులోని శ్రీకంఠేశ్వరస్వామి ఆలయానికి ఈ త్రైమాసికంలో భక్తుల నుంచి నగదు కానుకలు విరివిగా లభించాయి. రూ. 1.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఆలయ దాసోహ భవన్లో హుండీల లెక్కింపు జరిగింది. మహిళా స్వయం సహాయక బృందాలకు చెందిన వంద మందికి పైగా మహిళలు నగదు లెక్కింపులో పాల్గొన్నారు. దేవస్థానం ఏఈ జగదీష్, ఆలయ ఈవో సతీష్, తలకాడు వెంకటేష్ ప్రసాద్, బ్యాంకు సిబ్బంది ఉన్నారు. నగదు, బంగారం సొత్తు రూపంలో రూ.కోటిన్నర ఆర్జన లభ్యమైంది. సర్కారీ బడికి జడ్జి పుత్రుడు తుమకూరు: ప్రభుత్వ పాఠశాల అంటే పేదల పిల్లలు మాత్రమే చదివించుకుంటారని అనుకుంటారు. అధికారులు, ధనవంతులైతే ఇటు వైపు కన్నెత్తి చూడరు. లక్షల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు స్కూల్లో చదివించాలనుకుంటారు. మధ్యతరగతి కుటుంబాలు కూడా అప్పు చేసైనా ప్రైవేటు స్కూళ్లకే పంపుతారు. ఇలాంటి భావన ప్రబలిపోయిన నేటి సమాజంలో.. ఓ మహిళా జడ్జి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. శిర పట్టణ సీనియర్ సివిల్ జడ్జి జరీఫాబాను తమ కుమారుడు ఆజాద్ను ప్రభుత్వ కన్నడ మీడియం పాఠశాలలోని 5వ తరగతిలో చేర్పించారు. ఈ పాఠశాలలో 350 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు విద్యాబోధన ఉంది. ఇంగ్లిష్, కన్నడ మీడియం రెండూ ఉన్నాయి. న్యాయమూర్తి చొరవకు తాలూకా వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కమల్ క్షమాపణ చెప్పాలి: మంత్రి దొడ్డబళ్లాపురం: కన్నడ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు కమల్ హాసన్ కన్నడిగులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన సినిమాలు కర్ణాటకలో నిషేధిస్తామని కన్నడ, సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తండగడి అన్నారు. శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కమల్ క్షమాపణ చెప్పకపోతే వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే ఫిలిం చాంబర్తో, నటుడు శివ రాజ్కుమార్తో చర్చించామని, ఆయన కూడా అర్థం చేసుకోవాలన్నారు. కన్నడ భాష విషయంలో రాజీ అయ్యే ప్రశ్నే లేదన్నారు. అహంకారమే శివమొగ్గ: తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని చెబుతూ కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసిన నటుడు కమల్హాసన్పై కఠిన చర్యలు తీసుకోవాలని శివమొగ్గలోని డీసీ కార్యాలయం ఎదుట కరునాడు రక్షణ వేదిక నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. ఆయన కన్నడ భాషకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి, కానీ ఇలా మాట్లాడడం అహంకారానికి పరాకాష్ట అని ఆరోపించారు. తొందరపాటు ప్రకటనలు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య గందరగోళం సృష్టించకూడదని అన్నారు. -
టెన్త్ ఉత్తీర్ణత అంతేనా?
శివాజీనగర: ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల్లో 60 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత పొందిన జిల్లాల డీడీపీఐలకు నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్ను ఆదేశించారు. శనివారం విధానసౌధలో జరిగిన రాష్ట్ర ప్రగతి పరిశీలన సభలో అన్ని జిల్లాధికారులు, జడ్పీ సీఈఓలతో సీఎం మాట్లాడారు. ఎక్కువ జిల్లాల్లో ఫలితాలు ఎందుకు తగ్గాయో డీడీపీఐలు ఇచ్చే సమాధానం సబబుగా లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్ఎస్ఎల్సీలో ఉత్తీర్ణత తగ్గడంపై ఆగ్రహించారు. జిల్లా కేంద్రాల్లో కూర్చోవద్దు ఉపాధ్యాయుల కొరత, సిబ్బంది కొరత అని నెపం చెప్పరాదని ఘాటుగా సీఎం హెచ్చరించారు. డీడీపీఐలు, జిల్లా ఇన్చార్జ్ కార్యదర్శులు పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులు సరిగా పనిచేస్తున్నారో, లేదో పరిశీలించాలి. శ్రద్ధతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు. డీడీపీఐలు జిల్లాల్లో కూర్చోకుండా అంతటా పర్యటిస్తూ ఉండాలని తెలిపారు. పాఠశాలల నూతన గదుల నిర్మాణం పూర్తి కాకపోవడంపై జిల్లాధికారులను ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల అడ్మిషన్లు తగ్గరాదు, డ్రాపవుట్లు పెరగరాదని ఆదేశించారు. దీనికి తగిన చర్యలను తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పిల్లలకు గుడ్డు, పాలు, రాగిమాల్ట్, హాస్టల్ సదుపాయం అన్నిటిని ఇచ్చినా కూడా ఎందుకు బడుల్లో చేరడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. బాల్య వివాహాలపై ఎస్సీ ఎస్టీలు, బీసీలు, పేదల జనాభా ఎక్కువగా ఉన్నచోట్ల బాల్య వివాహాలు, బాల గర్భిణీ కేసులు ఉంటాయి. దీనిని తప్పకుండా అరికట్టాలని సీఎం చెప్పారు. నిఘా వహించి, రిపోర్ట్ ఇవ్వని పీడీఓలు, రెవెన్యూ సిబ్బంది విరుద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. డీడీపీఐలు, ఉపాధ్యాయులకు శ్రద్ధ లేదా! కలెక్టర్ల భేటీలో సీఎం సిద్దు మండిపాటు -
పొగాకు వ్యసనం మానండి
బనశంకరి: ఇటీవల రోజుల్లో పాఠశాల విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు చాలా సులభంగా లబించడం చాలా ప్రమాదకరమని ఫిడిలిటస్ ఎండీ అచ్యుత్గౌడ అన్నారు. ప్రపంచ పోగాకు రహితదినోత్సవం సందర్బంగా శనివారం శిల్పా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో బనశంకరి రెండోస్టేజ్ ట్రాఫిక్సిగ్నల్ వద్ద జనజాగృతి నిర్వహించారు. సిగరెట్, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు నేటి యువత, బాలలు బానిసలు కావడం బాధాకరమని చెప్పారు. పొగాకు సేవనాన్ని త్యజించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి లభిస్తుందని తెలిపారు. పొగ తాగడానికి బదులు పుస్తక పఠనం మంచి అభ్యాసమని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు పూలు, పండ్లు అందించి పొగాకు వ్యసనాన్ని మానాలని కోరారు. -
ఉద్యోగ విరమణ సహజం
రాయచూరు రూరల్: ఉద్యోగంలో పదవీ విరమణ సహజమని టాగూర్ స్మారక విద్యా మండలి అధ్యక్షుడు అమరేష్ అభిప్రాయపడ్డారు. శనివారం టాగూర్ స్మారక విద్యా సంస్థ కళాశాలలో పదవీ విరమణ చేిసిన ప్రిన్సిపాల్ శ్రీనివాస రాయచూరుకర్ను సన్మానించి వీడ్కోలు పలికి మాట్లాడారు. విద్యార్థులకు ఉత్తమ బోధనలతో పాటు గ్రామాల్లో ఎలా సమాజ సేవ చేయాలో నేర్పిన వ్యక్తిగా కొనియాడారు. మండలి పదాధికారులు శివబసప్ప మాలి పాటిల్, విరుపాక్షప్ప, శాంతప్ప, పంపనగౌడ, నిర్మల, హేమరెడ్డి, నాగభూషణ్, రాజేశ్వరి, విజయ్ కుమార్, అళ్లప్ప, వెంకటేష్, దేవిరెడ్డి, చెన్నమల్లికార్జున, వీరప్ప, కల్లయ్యలున్నారు. -
కాంగ్రెస్ వల్లే మత కలహాలు పెచ్చు
హుబ్లీ: వర్గాల మధ్య ధ్వేష వాతావరణం సృష్టించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మాజీ సీఎం, బెళగావి ఎంపీ జగదీష్ శెట్టర్ ఆరోపించారు. హావేరిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి మత కలహాలు పెరిగాయన్నారు. దీంతో ఓ వర్గం కాంగ్రెస్ కార్యకర్తలకు విరక్తి పుట్టిందని మంగళూరు ఘటనను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఒక మెసేజ్కు ఓ వర్గం వేలాది మంది యువకులు గుమిగూడతారన్నారు. అప్పటి కమిషనర్ ముందస్తు చర్యలు తీసుకోక పోవడంతో పెను ముప్పు జరిగిందన్నారు. మంగళూరులో ప్రతీకార హత్యలు జరుగుతున్నాయి. హావేరి గ్యాంగ్ రేప్ నిందితులు ఊరిలో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మొత్తం మీద నిందితులకు చట్టంపై భయం లేని వాతావరణం కాంగ్రెస్ సర్కారు వల్ల నెలకొందన్నారు. పీఎఫ్ఐ కార్యకర్తల కేసు రద్దు చేసినందుకు గతంలో కేజీ హళ్లి, డీజీ హళ్లి అల్లర్లు జరిగాయి. మైనార్టీలను ఆకర్షించేందుకు మంత్రి వర్గంలో ఇష్టమొచ్చినట్లుగా కేసుల రద్దు నిర్ణయాలను తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. ఇక మీదటైనా ఇలా జరగరాదు. హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానన్నారు. ధార్వాడలో కోవిడ్ కేసు నమోదుహుబ్లీ: ధార్వాడ జిల్లాలో ఓ కోవిడ్ కేసు నమోదైంది. కోవిడ్ లక్షణాలతో 71 ఏళ్ల మహిళ జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని జిల్లా యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొంది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయండి హుబ్లీ: విధాన పరిషత్లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు అర్హులైన వ్యక్తులను ఎంపిక చేసి నామినేట్ చేయడానికి సిఫార్సు చేసే గురుతర బాధ్యత మీదేనని సీఎం సిద్దరామయ్యకు విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ హొరట్టి సూచించారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఓ లేఖ రాశారు. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా అర్హులైన వ్యక్తులను ఎంపిక చేయాలన్నది తన అభిలాష అని తెలిపారు. రాష్ట్రంలో మంచి పనులను చేసి సీఎం ప్రజల మనసులో ఆదరణ చూరగొన్నారు. సాహిత్యం, సంగీతం, కళలు, సాంస్కృతిక, విద్య, పత్రికా రంగం, సమాజ సేవ తదితర రంగాల్లో సాధకులను ఈసారి నామినేట్ చేస్తారని తాను నమ్ముతున్నానని తెలిపారు. పర్మినెంట్ చేయాలని ఒత్తిడిరాయచూరు రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లా సంచాలకులు శ్రీశైల నాయక డిమాండ్ చేశారు. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద అధికారికి వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. నవోదయ, మొరార్జి దేశాయి, రాణి కిత్తూరు చెన్నమ్మ, మైనార్టి పాఠశాలకు ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. మున్సిపల్ ఉద్యోగుల ధర్నా విరమణ హొసపేటె: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో పాటు 19 డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నీటి సరఫరా మినహా అన్ని సేవలను నిలిపివేసి గత 4 రోజుల నుంచి మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక ధర్నాను శనివారం మున్సిపల్ ఉద్యోగులు విరమించుకున్నారు. రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘం విజయనగర జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర వర్మ మాట్లాడుతూ నెల రోజుల్లోగా తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. సల్మాన్ శేషన్న, రవికుమార్, భారతి, ఈరన్న, సురేష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. నడిరోడ్డులో గుంత.. ప్రయాణికులకు చింత హొసపేటె: నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పక్కనే ఉన్న బసవణ్ణ కాలువ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చారు. దీనిని మెరుగు పరచనందున గుంతలు పడి ప్రతి రోజూ వేలాది మంది విద్యార్థులను తీసుకెళ్లే వాహనదారులు, ఆటోలు, కార్లు ప్రయాణికులు ఇప్పుడు ప్రాణభయంతో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే నియంత్రణ కోల్పోయి బసవణ్ణ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం రోడ్డు పన్నుతో సహా అన్ని రకాల పన్నులను వసూలు చేస్తోంది. కానీ వాటి నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలను సంబంధిత అధికారులు వెంటనే మూసివేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేశారు. -
దక్షిణ కాశీ.. హరిహరేశ్వరాలయం
బళ్లారి రూరల్ : శతాబ్దాల క్రితం శైవులు (శివభక్తులు) వైష్ణవుల (విష్టుభక్తులు) మధ్య అంతరాలు పెరిగి మేము గొప్ప అంటే మేముగొప్ప అని వాదులాడుకొనేవారు. అలాంటి వారికి మేమిద్దరం ఒక్కటేనన్న సందేశాన్ని ఇచ్చేలా దావణగెరె జిల్లా హరిహరలోని హరిహరేశ్వర ఆలయం తార్కాణంగా నిలిచింది. దక్షిణకాశీగా పేరొందిన హరహరేశ్వరాలయం తుంగభద్ర నదికి కుడివైపున వెలసింది. సువిశాల ప్రాంగణంలో హొయ్సళ శిల్పకళా నిర్మాణ శైలి ఉట్టిపడుతోంది. క్రీ.శ.1224 హొయ్సళ రాజు రెండో నరసింహ సేనాధిపతి పోళాల్వ నిర్మించాడు. ఉత్సంగి పాండ్యులు, విజయనగర పాలకులు ఽఈ ఆల యాన్ని అభివృద్ధి పరిచినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం పొడవుగా కాకుండా వెడల్పుగా నునుపైన 56 స్తంభాలతో చతురస్రాకారంతో నవరంగ మహామండపంలా ఉంటుంది. ఈ ఆలయంలో ఏకశిలలో పరమశివుడు, విష్ణుమూర్తి దర్శమిస్తారు. మూల విరాట్ హరిహరేశ్వరుడు కుడివైపున జపమాల, త్రిశూలంతో, ఎడమవైపు కిరీటం, పీతాంబరాలతో శంఖు, చక్రంతో స్వయంభువుగా వెలశాడు. ఆలయ ప్రాంగణంలోనే మహాలక్ష్మిద ఆలయం ఉంటుంది. గర్భగుడికి ఆనుకొని ఎడమ వైపున శివలింగం, ఎదురుగా బసవేశ్వర శిలలు ఉంటాయి. ఈ ఆలయంలో శైవ, వైష్ణవ ఆచారాలను పాటిస్తారు. ఆలయ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. గుహాసురుని సంహారానికి హరిహరుల అవతారం స్కంధపురాణం ప్రకారం ఈ ప్రాంతంలో గుహాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో మహాశివుడు, విష్ణుమూర్తి వల్ల మరణం సంభవించకుండా వరం పొందాడు. అనంతరం దేవతలను, రుషులను, మానవులను బాధించేవాడు. హోమాలు, యగ్న యాగాలకు విఘ్నాలు కలిగించేవాడు. దీంతో దేవతలు, రుషులు విష్ణువును వేడుకొనగా శివుడు, నారాయణుడు కలసి హరిహరేశ్వరుడుగా అవతారమెత్తి గుహాసురున్ని సంహరించి ఇక్కడే కొలువు తీరారని స్థలపురాణం చెబుతోంది. అద్భుత శిల్పకళా నైపుణ్యంతో చతురస్రాకారంలో గుడి ఒకే మూలవిరాట్టుగా భక్తులకు హరిహరుల దర్శనం 56 నునుపైన సుందర స్తంభాలతో విరాజిల్లుతున్న వైనం -
వృథా ప్రకటనలు మానుకోవాలి
రాయచూరు రూరల్: నాయకులు వృథా ప్రకటనలను ఇవ్వడం మాని నిజమైన మాదిగలకు న్యాయం చేకూర్చాలని, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు నాయకులే అడ్డంకి అని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు దేవమిత్ర పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లికార్జున ఖర్గే, ఆంజనేయ, ప్రియాంక్ ఖర్గే అంటరానితనం నిర్మూలనకు కృషి చేయకుండా అంబేడ్కర్ ఆశయాలకు తిలోదకాలిస్తున్నారన్నారు. మాజీ మంత్రి ఆంజనేయ తాను మాదిగ అని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఇతర కులాలను ఎస్సీ జాబితాలో చేర్చడం తగదన్నారు. -
జోగ్ అందాలు అదరహో..కళకళలాడుతున్న జలపాతాలు
బనశంకరి: వర్షాకాలంలో ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. పర్వతాలు, అడవులు పచ్చదనంతో అలరారుతున్నాయి. భారీ వర్షాలతో జలపాతాలు పాలనురగలా పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. ప్రకృతి అందాలను వర్షాకాలంలో వీక్షించేందుకు రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఆగుంబె.... భారతదేశంలో అత్యధిక వర్షం లేదా తేమతో కూడిన ప్రదేశాల్లో ఒకటి మలెనాడులోని ఆగుంబె. దట్టమైన అడవితో కూడిన పర్వతప్రాంతంలో ఆగుంబె అందాలను వర్షకాలంలో వీక్షిస్తే అ అనుభూతే వేరు. ఈ కారణంతో ఆగుంబెను దక్షిణభారతదేశ చిరపుంజీ అని పిలుస్తారు. సొగసైన జలపాతాలు, సూర్యాస్తమయ నయన మనోహరదృశ్యాలు వీక్షించవచ్చు. జోగ్జలపాతం... వర్షాకాలంలో పర్యాటకులు భారీ ఎత్తున సందర్శించే స్థలాల్లో జోగ్జలపాతం ఒకటి. వర్షాకాలంలో జోగ్జలపాతం నయమనోహర దృశ్యాలు చూపరులను కనువిందుచేస్తాయి. 830 అడుగులు ఎత్తునుంచి నీరు జాలువారుతుండగా ఏర్పడే పొగ మంచులో జోగ్ అందాలను వీక్షించడం మధురానుభూతిని మిగుల్చుతుంది. జోగ్జలపాతం నాలుగు విభిన్నభాగాలుగా జాలువారుతుంది. కర్ణాటక వాసులే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. కొడగు... భారత్ స్కాట్ల్యాండగ్గా పిలిచే కొడగు లేదా కూర్గ్ కర్ణాటక ప్రకృతిరమణీయ ప్రదేశాల్లో ఒకటి. ఇది హనీమూన్, కుటుంబపర్యటన, ట్రెక్కింగ్కు సరైన పర్యాటక స్థలం. కూర్గ్ వర్షాకాలం సమయంలో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీపై ఇష్టం ఉండేవారు అందమైన ఫొటోలు తీసుకోవచ్చు. ఇక్కడ ఇరుప్పుజలపాతం, కాపీ తోటలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. సకలేశపుర... కర్ణాటకలో అత్యంత సొగసైన పర్వతప్రాంతాల్లో సకలేశపుర ఒకటి. సకలేశపుర హిల్స్టేషన్గా గుర్తింపుపొందింది. వర్షాకాలం సమయంలో అధికంగా పర్యాటకులు సందర్శిస్తారు. ఇక్కడ పురాతన సకలేశ్వరస్వామి ఆలయం ఉంది. ట్రెక్కింగ్కు అనుకూలం, మంజేహళ్లిజలపాతం, బిస్లే ఘాట్పాయింట్, మంజరాబాద్ కోట ఆకట్టుకుంటాయి. చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?ఉత్తరకన్నడ జిల్లా పశ్చిమమకనుమల్లో ఒకటైన దాండేలి ప్రకృతి ప్రేమికులను, సాహసికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ సాహసక్రీడలైన ర్యాప్టింగ్, వన్యజీవులు వీక్షణ, వైట్ రివర్రాప్టింగ్ లాంటి జలక్రీడలతో సందడిచే యవచ్చు. దాండేలి వన్యజీవి అభయారణ్యం, కవలేగుహలు, సిందేరిరాక్, సాతోడి జలపాతం తదితర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కుదురేముఖ్... చిక్మగళూరు జిల్లాలో కుదురేముఖ్ పశ్చిమకనుమల్లో ఒక సుందరమైన పట్టణం. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు పచ్చని లోయలు, ట్రెక్కింగ్ ప్రదేశాలను వీక్షించవచ్చు. కుదురేముఖ్లో కాపీ ఎస్టేట్లు వర్షాకాలంలో అద్భుతంగా ఉంటాయి. కుదురేముఖ్ నేషనల్ పార్కు, మాన్సున్ ట్రెక్కింగ్తో పాటు అనేక పర్యాటకప్రాంతాలను వీక్షిస్తూ సందడిచేయవచ్చు. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్ -
డ్రైవర్తో వివాహేతర సంబంధం.. చివరికి..!
యశవంతపుర(కర్ణాటక): ఇన్స్టా.. సోషల్ మీడియా లవ్ కాపురాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఏం చేస్తున్నామో అనే స్పృహ లేకుండా ప్రవర్తిస్తూ కుటుంబాలను వీధుల్లో పడేస్తున్నారు. పెళ్లయిన మహిళ, పురుషుడు ఇన్స్టా ద్వారా ప్రేమ అనే వ్యామోహంలో పడి, ఆపై బావిలోకి దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద సంఘటన దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె తాలూకా బడగమిజారు లో వెలుగులోకి వచ్చింది.వివరాలు.. మూడబిదిరె తాలూకా బడగమిజారుకు చెందిన వివాహిత నమీక్ష శెట్టి (29), ఆమె ప్రియుడు బాగలకోటలో నిడ్డోడిలో నివాసం ఉంటున్న ప్రశాంత్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నమీక్ష శెట్టికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్త పూణెలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె పుట్టింటిలో ఉంటోంది. ఆమెకు ఇన్స్టా గ్రాంలో ప్రశాంత్తో పరిచయం ఏర్పడింది. డ్రైవర్ అయిన ఇతనికి కూడా పెళ్లయి భార్యతో విడాకులు తీసుకున్నారు. అప్పుడప్పుడు ప్రశాంత్, నమీక్ష ఇంటికి వచ్చి వెళ్లేవాడు. బుధవారం కూడా ఆమె ఇంటికి వచ్చాడు, అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె పరుగున వెళ్లి ఇంటి పక్కనే ఉన్న బావిలోకి దూకింది. వెంటనే ప్రశాంత్ కూడా బావిలోకి దూకేశాడు. ఫైర్ సిబ్బంది, పోలీసులు గాలించి మృతదేహాలను బావిలోంచి బయటకు తీశారు. మూడబిదిరె ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతుదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. -
స్పా నిర్వాహకుడిని కిడ్నాప్ చేసి దాడి
యశవంతపుర(కర్ణాటక): సెలూన్, స్పా నిర్వాహకుడిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడిన ఘటన బెంగళూరులో జరిగింది. సంజు అనే వ్యక్తి గతంలో స్మిత అనే మహిళ నిర్వహిస్తున్న స్పాలో పనిచేసేవాడు. అనంతరం కొందరితో కలిసి భువనేశ్వరినగర మొయిన్ రోడ్డులో రాయల్ చాయ్స్, సెలూన్ స్పా ఏర్పాటు చేశాడు. దీంతో స్మిత, కావ్య, మహమ్మద్లు ఈ నెల 29న గురువారం రాత్రి సంజును కారులో ఎక్కించుకొని దాసరహళ్లి మొయిన్రోడ్డులో జక్కూరు వైపు తీసుకెళ్లారు. డ్యాగర్, బీర్ బాటిల్తో దాడి చేశారు. పెట్రోల్ పోసి నిప్పు పెడుతామంటూ బెదిరింపులకు పాల్పడారు. అనంతరం అమృతహళ్లి శారద స్కూల్ వద్ద వదిలి వెళ్లారు. ఈమేరకు బాధితుడు అమృతహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. -
తాళి కట్టే సమయంలో పెళ్లి ఆపేసిన వధువు
అన్నానగర్: ఓ యువతి తాళి కట్టే సమయంలో తనకు ఈ పెళ్లి వద్దని ఆపివేసింది. వివరాల్లోకి వెళితే.. తేని జిల్లాలోని ఆండిపట్టి ప్రాంతానికి చెందిన యువ గ్రాడ్యుయేట్ అమెరికాలోని ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతని తల్లిదండ్రులు తమ కొడుకు కోసం పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన ఒక యువతితో వివాహం కుదిర్చారు. ఈ సందర్భంలో ఇరు కుటుంబాలు అంగీకరించినందున, వివాహ వేడుక గురువారం ఆండిపట్టి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కల్యాణ మండపంలో జరగాల్సి ఉంది. అంతకుముందు, ఈ జంట బుధవారం నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు.ఆ సమయంలో వధూవరుల తల్లిదండ్రుల మధ్య విభేదాలు తలెత్తి, వాదనగా మారింది. సమీపంలోని బంధువులు ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత పెళ్లి సన్నాహాలు జోరుగా జరిగాయి. ఇదిలా ఉండగా, గురువారం ఉదయం, వధూవరులు బంధువుల చుట్టూ వివాహ వేదికపై కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత, వరుడు తల్లిని తీసుకుని వధువుకు తాళి కట్టడానికి వెళ్లాడు. అప్పుడు వధువు అకస్మాత్తుగా పెళ్లి పీటల పైనుంచి లేచింది. ఈ వివాహం తనకు వద్దని, తనకు ఆసక్తి లేదని వధువు చెప్పింది. ఇది విన్న వరుడు, అతని బంధువులు దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహం ఆగిపోయింది. -
కమల్హాసన్ దిష్టిబొమ్మ దగ్ధం
మండ్య: కన్నడ భాషను అవమానిస్తూ మాట్లాడిన తమిళ నటుడు కమల్ హాసన్ సినిమా థగ్లైఫ్ను రాష్ట్రంలో విడుదల చేయకూడదని, ఆయన కన్నడిగులకు క్షమాపణలు చెప్పాలని కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు నగరంలోని జేసీ సర్కిల్లో శుక్రవారం గుమిగూడిన కార్యకర్తలు కమల్హాసన్ చిత్రపటానికి నిప్పంటించి దహనం చేశారు. కన్నడిగుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు.నిధుల దుర్వినియోగం ● మున్సిపల్ మేనేజర్ సస్పెన్షన్ దొడ్డబళ్లాపురం: ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలపై దావణగెరె జిల్లా మలెబెన్నూరు మున్సిపాలిటీ కార్యాలయ మేనేజర్ భజక్కనవర్ను సస్పెండ్ చేశారు. ఈ–ఖాతా ప్రక్రియలో అక్రమాలు చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని స్వంతానికి వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. ఆరోపణలు రుజువు కావడంతో భజక్కనవర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గంగాధరస్వామి ఆదేశాలు జారీ చేశారు.కప్ గెలిస్తే సెలవు ఇవ్వాల్సిందే ● సీఎం సిద్దరామయ్యకు క్రికెట్ అభిమాని లేఖ సాక్షి బెంగళూరు: ఏటా ఐపీఎల్ సందర్భంగా ‘ఈ సల కప్ నమ్దే’ అంటూ హోరెత్తిపోయి ఆ తర్వాత ఆర్సీబీ ప్రదర్శనతో నిరాశ చెందే కన్నడిగుల్లో ఈ పర్యాయం కొత్త జోష్ చోటు చేసుకుంటోంది. 18వ సీజన్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిన ఆర్సీబీకి అభిమానుల మద్దతు భారీగా పెరిగింది. ఆర్సీబీ ఫైనల్లో గెలిచి సంబరాల్లో మునగాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిస్తే సెలవు కావాలంటూ బెళగావి జిల్లా గోకాక్కు చెందిన శివానంద మల్లన్నవర్ అనే యువకుడు సీఎం సిద్ధరామయ్యకు ఈ మేరకు లేఖ రాశాడు. ఆర్సీబీ ఫైనల్లో గెలుపొందితే ఏటా ‘ఆర్సీబీ ఫ్యాన్స్ పండుగ’ పేరిట ఉత్సవాలు జరపాలని, విజ్ఞప్తి చేశాడు. కరెంటుకు విద్యార్థి బలి దొడ్డబళ్లాపురం: విద్యుత్ షాక్తో టెన్త్ విద్యార్థి మృతి చెందిన సంఘటన చిక్కబళ్లాపుర తాలూకా దొడ్డకిరుకుంబి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాదేశ్(16) గురువారం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. తన ఇంటి వద్ద ఇనుప కడ్డీతో డ్రైనేజీ పైప్ క్లీన్ చేస్తుండగా పైన ఉన్న విద్యుత్ తంతి తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. నందిగిరిధామ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మంత్రిపై హనీట్రాప్ కేసులో డీజీపీకి సిట్ నివేదిక బనశంకరి: సహకార శాఖ మంత్రి కేఎన్.రాజణ్ణపై హనీట్రాప్ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం దర్యాప్తు పూర్తి చేసి శుక్రవారం డీజీపీ ఎంఏ సలీంకు నివేదిక అందజేసింది. దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులకు ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదు. ఫిర్యాదుచేసిన మంత్రి రాజణ్ణ ఒకటి రెండు సార్లు తన కార్యాలయానికి యువతి వచ్చిందని, తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె చెంపపై కొట్టి పంపానని తెలిపారు. ఆమె జతలో గడ్డంతో ఉన్న యువకుడు కూడా వచ్చాడని తెలపగా, దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు. అంతేగాక మంత్రి ఆప్తులు, గన్మ్యాన్, సెక్యూరిటీ, పీఏను విచారణ చేసినా ఎలాంటి సాక్ష్యాలు దొరకనందున దర్యాప్తు పూర్తి చేసిన సిట్ అధికారులు డీజీపీకి నివేదిక అందజేశారు. -
సాహితీవేత్త హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి కన్నుమూత
శివాజీనగర: ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేశ్ మూర్తి (80) శుక్రవారం కన్నుమూశారు. వయస్సు పైబడిన వ్యాఽధితో బాధపతున్న ఆయన బెంగళూరులోని బీజీఎస్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అనేక సినిమాలకు పాటలు, కథ, సంభాషణ రాసిన ఆయన 85వ కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడయ్యారు. వెంకటేశమూర్తి మృతికి అనేక మంది ప్రముఖులు సంతాపం తెలిపారు. 1944 జూన్ 23న దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హూదిగెరె గ్రామంలో జన్మించిన వెంకటేశ్మూర్తి.. కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి బీఏ, బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి కన్నడలో ఎం.ఏ పట్టాపొందారు. కన్నడలో పీహెచ్డీ చేశారు. 1973లో బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ వాణిజ్య కాలేజీలో కన్నడ అధ్యాపక వృత్తి ఆరంభించిన ఆయన 2000లో రిటైర్డ్ అయ్యారు. వెంకటేశమూర్తి పార్థీవదేహం అంతిమ దర్శనానికి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్ర వెను భాగం బయలు రంగమందిరంలో ఏర్పాటు చేశారు. సీఎం సిద్దరామయ్య సంతాపం: హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి కన్ను మూయటం బాధకు గురి చేసిందని సీఎం సిద్దరామయ్య ఎక్స్లో పోస్టు చేశారు. కవితలు, నాటకం, పిల్లల సాహిత్యం, అనువాదం ఇలా సాహిత్యంలో వివిధ రీతుల్లో నిమగ్నమై అపారమైన చదవరులను కలిగిఉన్న విశిష్ట రచయిత వెంకటేశమూర్తి మృతి సాహితీ లోకానికి తీరని లోటన్నారు. అదేవిధంగా హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి మృతికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వేంకటేశమూర్తి సాహిత్య రంగానికి తనదైన సేవలు అందించారన్నారు. -
సమస్యలపై స్పందించకుంటే చర్యలు
శివాజీనగర: మేము, మీరంతా ప్రజల పన్నుల సొమ్ముతో పరిపాలన చేస్తున్నాం. అన్ని సదుపాయాలను అనుభవిస్తున్నది ప్రజల పన్నుల సొమ్ము ద్వారానే అనేది మరువరాదు. అందువల్ల ప్రజల సమస్యలపై స్పందించకపోతే అటువంటి అధికారుల విరుద్ధంగా నిర్ధాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం సిద్దరామయ్య అన్ని జిల్లాధికారులు, జిల్లా పంచాయితీల సీఇఓలకు కట్టుదిట్టమైన హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల జిల్లాధికారులు, సీఇఓలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. చట్టాన్ని నాశనం చేస్తే చర్యలు తీసుకోండి: రాజ్యాంగ, ప్రజా వ్యతిరేక దుష్ట శక్తులు ఎంతటి ప్రభావం కలిగినా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకుంటామని సీఎం జిల్లా అధికారులను హెచ్చరించారు. శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా మారితే అభివృద్ధి సాధ్యపడదన్నారు. డీసీ, సీఇఓల పర్యటన కార్యక్రమం ప్రకటించాలి: జిల్లాధికారులు, సీఇఓలు తమ పర్యటన కార్యక్రమం వివరాలు ముందుగానే ప్రజలకు తెలిసేలా ప్రకటించాలి. తనిఖీల నివేదిక ఆధారాలను సక్రమంగా ఉంచుకోవాలి. పాఠశాలలు, హాస్టళ్లను ముందుగా సూచన లేకుండా తనిఖీ చేయాలని గతంలో ఆదేశించినా చాలా మంది పాటించలేదనే నివేదిక తనకు వచ్చిందని సీఎం అన్నారు. జిల్లాలో సామాన్య ప్రజలకు ఆరోగ్య, రవాణా సంచారం లాంటి మౌలిక సదుపాయాలు లభించకపోతే దానిని పరిపాలన వైఫల్యమనే పరిగణించాల్సి ఉంటుందన్నారు. అడవుల్లో పాఠశాల, రోడ్డు, ఆసుపత్రిలాంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎందుకు సాధ్యపడలేదని ప్రశ్నించారు. సీఇఓలు ఇటువంటి అడవులకు నిరంతరం భేటీ చేయాలని సూచించారు. జిల్లాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి కొందరు జిల్లాధికారులు, సీఇఓలు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వచ్చాయి. అణగారిన వర్గాలు, పేదలు, సామాన్య ప్రజలు సాధారణంగా జిల్లాధికారుల కార్యాలయానికి వస్తారు. అటువంటి వారి కష్టాలను మీరే ఆలకించకపోతే దానిని పరిష్కరించేవారు ఎవరు?, ఎవరి వద్ద వారు తమ కష్టాలను చెప్పుకోవాలి? అని సీఎం ప్రశ్నించారు. తాలూకా, జిల్లా కేంద్రాల్లో అధికారులు కేంద్ర స్థానంలో ఉండాలన్నారు. జిల్లా ఇన్చార్జి కార్యదర్శులు నెలలో కనీసం రెండు సార్లు ఆయా జిల్లాలకు భేటీ చేసి అభివృద్ధి పనులను పరిశీలించాలన్నారు. జిల్లాధికారులు తప్పు చేసినా నిర్ధాక్షిణ్యంగా చర్యలు: జిల్లాధికారి, జిల్లా భద్రతాధికారులు, సీఈఓలు తమ అహంభావం పక్కకుపెట్టి సమన్వయంతో పని చేస్తేనే రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం సిద్దరామయ్య అన్నారు. రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధంగా పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అధికారులను హెచ్చరించిన సీఎం సిద్దూబాల్య వివాహాలను అడ్డుకోలేరా?బాల్య వివాహాల గురించి సీఎం మాట్లాడుతూ బాల్య వివాహాలను ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నించారు. మీ కింది స్థాయివారు మీకు రిపోర్ట్ ఇవ్వటం లేదా? మీకు వారిపై నియంత్రణ లేదా? అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం 700 బాల్య వివాహాలు జరిగాయని, బాల్యంలోనే తల్లులైన ఘటనలు కూడా వార్తల్లో వచ్చాయన్నారు. ఈ మేరకు కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదనేది తమ దృష్టికి వచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి సంవత్సరాలు గడిచినా బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే ఎలా?, బాల్య వివాహాలు అరికట్టేందుకు ఉన్న చట్టాలు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. -
పేదలకు భూములు పంచండి
రాయచూరు రూరల్: జిల్లాలో భూమి లేని పేదలకు భూములు పంచాలని భూ వసతి పోరాట సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సమితి అధ్యక్షుడు ఆంజనేయ మాట్లాడారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి భూములు పంపిణీ చేయాలని ఒత్తిడి చేశారు. అనంతరం స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. కేంద్రీయ పాఠశాలలో విద్యార్థులకు శిబిరం హొసపేటె: టీబీ డ్యాం పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం విద్యార్థులకు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. 3 నుంచి 10వ తరగతి ఆంగ్ల మీడియం విద్యార్థులకు తెలుగు భాష గురించి అక్షరాలను ఉపాధ్యాయురాలు జీ.సునీత తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయం ఈ సారి రీజినల్ లాంగ్వేజ్లో ఒకటైన తెలుగు అక్షరాలను చదవడం, రాయడంపై ఒక వారం పాటు విద్యార్థులకు ఈ శిబిరాన్ని చేపట్టామని ప్రిన్సిపల్ మనోహర్లాల్ తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు. నిలిచిన లారీకి కారు ఢీ.. ముగ్గురి దుర్మరణం హుబ్లీ: నిలబడిన లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన జిల్లాలోని అణ్ణిగేరి తాలూకా భద్రపుర వద్ద హైవేలో గురువారం చోటు చేసుకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మదన్, సురేష్, ఎల్ఎన్.వేణుగోపాల్ మృతి చెందారు. తోట చూసుకొని ముండరగి నుంచి బెంగళూరు వైపునకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను మైసూరు, బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అణ్ణిగేరి పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి రాయచూరు రూరల్ : జిల్లాలో సంచార నియమాలను తప్పకుండా ప్రతి ఒక్క వాహనదారు పాటించాలని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయం వద్ద ప్రచారాందోళనకు శ్రీకారం చుట్టి ఆయన మాట్లాడారు. యువత, ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అధిక శాతం మంది గ్రామీణ ప్రజలు సైబర్ నేరాలకు బలవుతూ లక్షల్లో డబ్బులు కోల్పోయారన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏఎస్పీ హరీ్ష్, డీఎస్పీ శాంతవీర, సీఐలు ఉమేష్ నారాయణ కాంబ్లే, మహేష్, సాబయ్య పాల్గొన్నారు. ఆకాశవాణి అధికారికి ఘనంగా వీడ్కోలు రాయచూరు రూరల్: రాయచూరు ఆకాశవాణిలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన అధికారి బావలత్తిని ఎద్దుల బండిలో ఊరేగించి ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం పదవీ విరమణ సందర్భంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలపడానికి భారీగా తరలివచ్చి నూతన ఒరవడితో వీడ్కోలు పలికారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప పాల్గొని మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన అధికారి బావలత్తి అందరి మనస్సులను దోచుకున్నారన్నారు. వెంకటేష్ బేవినబెంచి, సరోజ, విజయ రాజేంద్ర, బండేష్, ఈరణ్ణలున్నారు. -
తుంగభద్ర నీటి విడుదలపై స్పష్టత ఇవ్వండి
సాక్షి,బళ్లారి: తుంగభద్ర జలాశయం నుంచి ఈ ఏడాది రైతులు నీరు పొందే విషయంపై ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర డ్యాంలోకి భారీగా వచ్చిన వరదలతో 19వ క్రస్ట్గేట్ కొట్టుకు పోయిందని గుర్తు చేశారు. అష్టకష్టాలతో క్రస్ట్గేటు యథావిఽఽధిగా అమర్చడం వల్ల ఖరీఫ్, రబీ పంటలకు నీరు అందాయన్నారు. అయితే క్రస్ట్గేట్లు అన్నింటికీ మరమ్మతులు చేయాలని, అవి సక్రమంగా లేవని నిపుణులు, ప్రభుత్వ పెద్దలు కూడా సూచించారని గుర్తు చేశారు. అయినా ఈ విషయంలో అధికారులు ఎందుకు పక్కా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అధికారులు చొరవ తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిపుణులు సూచించినా క్రస్ట్గేట్లు మరమ్మతులు చేయక పోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. 33 క్రస్ట్ గేట్లను మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు ఇచ్చిన సూచనలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఈ ఏడాది రైతుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం నీటి పారుదల సలహా సమితి అధ్యక్షుడు శివరాజ్ తంగడిగి రబీలో నీటి విడుదలను నిలుపుదల చేసి క్రస్ట్ గేట్లను మరమ్మతు చేస్తామని చెప్పినా ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం డ్యాంలోకి ఇన్ఫ్లో వస్తోందని, ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం అయిందన్నారు. త్వరలో కాలువలకు కూడా నీరు వదలాల్సిన పరిస్థితులు ఉన్నందున రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ఈసందర్భంగా రైతు సంఘం నాయకులు భీమన్నగౌడ, మల్లప్ప, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. క్రస్ట్గేట్లకు ఎందుకు మరమ్మతులు చేయలేదు? అధికారులపై రైతు సంఘం అధ్యక్షుడు మండిపాటు -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి బాలుడి ఘనత
హుబ్లీ: పాత హుబ్లీ ఇంద్రప్రస్థ నగర్ నివాసి సుస్విన్ అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం సైకిల్ తొక్కడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును దాఖలు చేసి ఘనత సాధించాడు. 4.8 ఏళ్ల సుస్విన్ 39.24 నిమిషాల్లో 11.18 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం ద్వారా అందరినీ ఆశ్చర్య పరిచాడు. కాగా ఇంతకు ముందు 5.3 ఏళ్ల తమిళనాడు చిన్నారి అదవ్ అశోక్కుమార్ అనే బాలుడు 10.3 కిలోమీటర్ల దూరాన్ని 39.44 నిమిషాల్లో అధిగమించాడు. దీన్ని సవాల్గా తీసుకున్న సుస్విన్ 2025 ఏప్రిల్ 5న సత్తూరు ఆశ్రయ కాలనీ నుంచి ఉదయం 6.40 గంటలకు సైక్లింగ్ ప్రారంభించి 7.19 గంటలకు ఉణకల్ క్రాస్ వరకు తొక్కి ఘనత చాటాడు. ప్రతి రోజు హుబ్లీ ఆనంద్నగర్ చుట్టు పక్కల ప్రాంతంలో తండ్రి వినాయక్ బాలుడికి సైక్లింగ్లో శిక్షణ ఇచ్చే వారు. రోజు అభ్యాసం చేస్తూ అలాగే అభ్యాసాన్ని రెట్టింపు చేసుకుంటూ చివరుకు 11 కిలోమీటర్ల దూరాన్ని 39.05 నిమిషాల్లో చేరుకున్నాడు. రింగ్ రోడ్డులో సాధన షురూ తొలుత హుబ్లీ రింగ్ రోడ్డులో సైకిల్ తొక్కడం ప్రారంభించి ఆ తర్వాత జంట నగరాల్లోని రోడ్లల్లో తొక్కడం ప్రారంభించారు. అనంతరం అభ్యాసంతో సైకిల్ రైడింగ్ అలవాటు చేసుకున్నాడని బాలుడి తల్లి సుష్మ తెలిపారు. పిల్లల ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో కీలకం అన్నారు. సుస్విన్ సైక్లింగ్లో సాధన ప్రారంభించిన వేళ మేమందరం చిన్నారికి మద్దతుగా నిలిచామన్నారు. ప్రస్తుతం చిరంజీవి రికార్డు సాధించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. తండ్రి వినాయక హళపేటె మాట్లాడుతూ తమిళనాడు బాలుడు రికార్డును బద్దలుగొట్టాలన్న లక్ష్యంతోనే కుమారుడు సుస్విన్కు నిరంతరం శిక్షణ ఇచ్చానున్నారు. ఆ విధంగా బాలుడు ప్రతి రోజు రెండు గంటలు ప్రాక్టీస్ చేయించేవాడినని, ప్రస్తుతం కుమారుడి రికార్డును ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దాఖలు చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. 11 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి చరిత్ర సృష్టించిన బాలుడు -
ఇందిరా క్యాంటీన్ ప్రారంభం
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో రిబ్బన్ కట్ చేసి ఇందిరా క్యాంటీన్ను ఎంపీ ఈ.తుకారాం, హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్, పట్టణ పంచాయతీ అధ్యక్షురాలు బీ.రేఖా రమేష్, ఉపాధ్యక్షుడు సిద్ధయ్య ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రవాసి మందిరంలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఇందిరా క్యాంటీన్ ఏర్పాటుతో ఆస్పత్రికి వచ్చే రోగులకు, కార్మికులకు, పేదలకు ఎంతో అనుకూలం అవుతుందన్నారు. అయితే కొట్టూరులో ఉన్న ప్రస్తుత సమస్యల గురించి విలేకరులు అడగగా ఇక్కడ నెలకొన్న సమస్యలను రాబోయే రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు దొడ్డ రామణ్ణ, ఎంఎంజీ సత్యప్రకాష్, బీడీసీసీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకేష్, పట్టణ పంచాయతీ చీఫ్ నసరుల్లా, అడికె మంజునాథ్, ఇంజినీర్ అశోక్, డీఎస్ఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ బీ.మరిస్వామి, పట్టణ పంచాయతీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు వ్యవసాయ సలహాలివ్వాలి
రాయచూరు రూరల్: జిల్లాలో రైతులకు వ్యవసాయంపై శాస్త్రవేత్తలు సలహాలివ్వాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప సూచించారు. రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద ఖరీఫ్ సీజన్ విత్తనాల అభియాన్ను వికసిత వ్యవసాయ సంకల్ప అభియాన్ జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వ్యవసాయ అంశాల గురించి రైతులకు వివరించాలన్నారు. 15 రోజుల పాటు జరిగే జాతా సందర్భంగా గ్రామాల్లో పర్యటించాలన్నారు. జాతాలో అధికారులు దురుగేష్, స భ్యులు మధుసూదన్, మల్లేష్, మధుసూదనరెడ్డిలున్నారు. -
జనౌషధి కేంద్రాలను పునఃప్రారంభించాలి
బళ్లారి రూరల్ : ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరనలో జనౌషధి కేంద్రాలను మూసివేయాలని రాష్ట్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం బీఎంసీఆర్సీ ఆసుపత్రి ముందు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జనౌషధి కేంద్రాలను పునః ప్రారంభించాలన్నారు. కేవలం ప్రధాని మోదీ బొమ్మ ఉన్నందునే అధికార రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని ఆరోపించారు. అధిక మొత్తం చెల్లించి మందులు కొనలేని పేదలకు జనౌషధి కేంద్రాలు ఎంతో సహాయకారిగా ఉండేవన్నారు. జనౌషధి కేంద్రాలను మూసివేస్తే, మందులు కొనలేని పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. డ్రగ్ మాషియాలో భాగంగానే తక్కువ ధరకు మందులను అందించే జనౌషధి కేంద్రాలను మూసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. బీఎంసీఆర్సీ ఆసుపత్రిలో కుక్కకాటుకు వినియోగించే రేబిస్ మందుల కొరత ఉందన్నారు. అందువల్ల వైద్యులు బయట మందులషాపులకు చీటీలు రాసిస్తున్నారన్నారు. అందోళనలో భాగంగా బీజేపీ నాయకులు నినాదాలతో కూడిన ప్లకార్డులతో ఆసుపత్రి ముందు బైటాయించారు. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణుల ఆందోళన బీఎంసీఆర్సీ ఆసుపత్రి ముందు బైటాయించి ధర్నా -
5లోగా ఫీజు వివరాలు వెల్లడించండి
హొసపేటె: విజయనగర జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజు వివరాలను జూన్ 5వ తేదీలోపు ప్రకటించాలని, విస్మరిస్తే ఆ పాఠశాలల సమాచారాన్ని జిల్లా వెబ్సైట్లో ప్రకటిస్తామని విజయనగర జిల్లాధికారి ఎం.ఎస్.దివాకర్ హెచ్చరించారు. నగరంలోని తన కార్యాలయ సభాంగణంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పాలక మండళ్ల సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏ పాఠశాల అయినా అదనపు ఫీజులు వసూలు చేస్తే ఎలాంటి సంకోచం లేకుండా నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. ఫీజు వివరాలను అన్ని పాఠశాలల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలన్నారు. సమగ్ర సర్వే 86 శాతం పూర్తి షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేలో పని కోసం వారి వారి నగరాలు, తాలూకాలు, గ్రామాల నుంచి వలస వచ్చిన షెడ్యూల్డ్ కులాల కుటుంబాల సమగ్ర సర్వే 86 శాతం పూర్తయిందని జిల్లాధికారి దివాకర్ తెలిపారు. గురువారం నగరంలోని తన కార్యాలయ హాల్లో షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేకు సంబంధించి కమ్యూనిటీ నాయకులు, వివిధ సంఘ సంస్థల ఆఫీస్ బేరర్లతో ఏర్పాటు చేసి సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేపై జస్టిస్ నాగ మోహన్దాస్ సింగిల్ మెంబర్ విచారణ కమిషన్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పనులను పూర్తి చేసిందన్నారు. ఉపాధి, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలను మినహాయించిందన్నారు. సర్వేలో 14 శాతం మాత్రమే ఇంకా పెండింగ్లో ఉందన్నారు. -
దుకాణాల్లో డ్రగ్స్ విక్రయిస్తే ఖబడ్దార్
రాయచూరు రూరల్ : జిల్లాలో మత్తు పదార్థాలను మందుల దుకాణాల్లో విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య సూచించారు. గురువారం తన కార్యాలయంలో మందుల దుకాణాల వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిస కారాదన్నారు. యువతకు మత్తు పదార్థాలు విక్రయించే ముందు వైద్యుల సలహాలను పాటించాలన్నారు. మత్తు పదార్థాల సేవనంతో అనారోగ్యానికి తోడు మానసికంగా కుంగిపోతారన్నారు. సమావేశంలో ఏఎస్పీ హరీ్ష్, డీఎస్పీ శాంతవీర, సీఐలు ఉమేష్ నారాయణ కాంబ్లే, మహేష్, సాబయ్యలున్నారు.వ్యక్తి అదృశ్యంహొసపేటె: తాలూకాలోని 32వ వార్డు బాణదకేరిలోని గరడిమనె నివాసి కే.వెంకటేష్(57) అనే వ్యక్తి ఈనెల 10వ తేదీ నుంచి అదృశ్యం కావడంపై టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని తలకు గాయమై మానసిక అనారోగ్యంతో ఉన్నాడు. చాలా చోట్ల చికిత్స చేయించినా పూర్తిగా నయం కాలేదు. 5.4 అడుగుల ఎత్తు, గుండ్రని ముఖం, ముదురు రంగు శరీరఛాయ గల ఇతను కనిపించకుండా పోయినప్పుడు లేత నీలం రంగు పుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించాడు. కన్నడ భాషలో మాట్లాడగలడు. ఇతని ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీస్ స్టేషన్ను లేదా సెల్– 9480805745, 08394–224033, 224204 నంబర్లలో సంప్రదించాలని కోరారు.గంజాయి విక్రయం.. నిందితుల అరెస్ట్రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో హైడ్రో గంజాయిని విక్రయిస్తున్న కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అభిరామ్ ఎల్ వరసిద్ధి వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంగావతిలో అక్రమంగా సరఫరా చేస్తున్న రూ.18.06 లక్షల విలువైన 1.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. థాయిలాండ్ నుంచి భారత్కు అక్రమంగా గంజాయిని తెప్పించుకొన్న కేరళకు చెందిన భాగస్వాములు సౌజేష్(28), సలీం(27), దుర్గా ప్రసాద్(27), బాద్షా(32), మదన్ (26), సూర్యప్రతాప్రెడ్డి(19), మహ్మద్ హమీద్(22), మణికంఠ(23)లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.మిఠాయిలతో విద్యార్థులకు స్వాగతంరాయచూరు రూరల్: జిల్లాలో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు మిఠాయిలతో స్వాగతం పలికారు. 2025–26వ విద్యా సంవత్సరానికి సంబంధించి తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ తాలూకాలోని బిజినగేర, విజయ నగర క్యాంప్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అందాల్సిన పుస్తకాలు, యూనిఫాం, ఇతర సౌకర్యాలను కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.బాలిక ఆత్మహత్యదొడ్డబళ్లాపురం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దొడ్డబళ్లాపురం పట్టణ పరిధిలోని దర్గాపురలో చోటుచేసుకుంది. బీహార్కు చెందిన ధర్మేంద్రకుమార్ దర్గాపురలోని పిళ్లేగౌడ అనే వ్యక్తికి చెందిన తోటలో నివాసం ఉంటోంది. ధర్మేంద్ర సమీపంలోని రైల్వేస్టేషన్లో సిమెంటు మూటలు అన్లోడ్ చేసే పని చేస్తుండగా భార్య గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్తోంది. వీరికి నలుగురు సంతానం. రెండవ కుమార్తె చాందిని కుమారి(12) మానసిక రోగంతో బాధపడుతుండేది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లగానే ఇంట్లో తమ్ముడిని బయటకు పంపించి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
నన్ను బెదిరించి క్షమాపణలు చెప్పించలేరు: కమల్ హాసన్
ఢిల్లీ: కన్నడ భాష వివాదంపై ప్రముఖ నటుడు కమల హాసన్ స్పందించారు. కన్నడ భాష వివాదంపై క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. నన్ను బెదిరించి క్షమాపణ చెప్పించలేరు. కన్నడపై నా ప్రేమ నిజం. అజెండా ఉన్నవారికి మాత్రమే నా మాటలపై అభ్యంతరం’ అని వ్యాఖ్యానించారు.కన్నడ సినిమాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్లను కమల్ హాసన్ శుక్రవారం తోసిపుచ్చారు. తాను తప్పు చేసి ఉంటేనే క్షమాపణ చెబుతానని, ప్రస్తుత వివాదం అలాంటి కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తన జీవన విధానం. దీనిలో ఇతరులు జోక్యం చేసుకోవద్దని కోరారు.తప్పు చేస్తే నేనే క్షమాపణ చెబుతాను. నేను తప్పు చేయకపోతే క్షమాపణ చెప్పను. ఇది నా జీవనశైలి. దయచేసి దాన్ని చెడగొట్టకండి. మనదేశం ప్రజాస్వామ్య దేశం. నేను చట్టం. న్యాయాన్ని నమ్ముతాను’ అని ఆయన అన్నారు. -
‘ముందెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పండి’
బెంగళూరు: బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఐఏఎస్ అధికారిణి ఫౌజియా తరన్నుమ్ (Fouzia Taranum)పై చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు మండిపడింది. ముందెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన్ని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఓ కార్యక్రమంలో.. సీనియర్ ఐఏఎస్ ఫౌజియాను ఉద్దేశించి ‘పాకిస్తానీ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకుగానూ ఆయనపై కేసు కూడా నమోదయ్యింది.అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ రవికుమార్ హైకోర్టును (Karnataka High Court)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మధ్యప్రదేశ్లో ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సుప్రీం కోర్టు ఎలా స్పందించిందో మీరూ చూశారు. కాబట్టి మీరేం అందుకు అతీతులు కారు. మీరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. కాబట్టి మొక్కుబడిగా కాకుండా మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పండి’’ అని ధర్మాసనం రవికి స్పష్టం చేసింది.మధ్యప్రదేశ్లో ఏం జరిగిందంటే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత మీడియాకు కర్నల్ సోఫియా ఖురేషీ (Sofiya Qureshi) ఆ వివరాలను వెల్లడించారు. అయితే.. మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కున్వర్ విజయ్ షా (Kunwar Vijay Shah) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని (సోఫియా ఖురేషీని ఉద్దేశించి) సైనిక విమానంలో మోదీజీ పాక్కు పంపించి పాఠం నేర్పించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదుకు పోలీసులను ఆదేశించగా.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే..చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆయన తీరును తీవ్రంగా తప్పు బట్టింది. పదవిలో ఉంటూ అవేం మాటలంటూ మందలించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు క్షమాపణలు తెలియజేయగా.. ఆపై ద్విసభ్య ధర్మాసనం వాటిని అంగీకరించ లేదు. ఏదో మొక్కుబడిగా క్షమాపణలు చెప్పారని.. మొసలి కన్నీరు కార్చరని మళ్లీ ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు సమగ్ర నివేదికను కోర్టు కోరింది. అయితే అరెస్ట్ నుంచి మాత్రం కున్వర్కు ఊరట ఇచ్చిన న్యాయస్థానం.. తాజాగా ఆ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.కర్ణాటకలో ఏం జరిగిందంటే..బీజేపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష చలవాడి నారాయణస్వామి (Chalavadi Narayanaswamy) ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే (ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు)ను ఉద్దేశిస్తూ.. ‘కుక్క’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట రాజకీయ దుమారం రేపాయి. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నారాయణస్వామి గెస్ట్ హౌజ్ వద్ద నిరసనలు తెలిపారు. అయితే..అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. నారాయణస్వామికి భద్రతా కల్పించడంలో డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరన్నుమ్ విఫలమయ్యారంటూ ఎమ్మెల్సీ రవికుమార్ (MLC N Ravikumar) పార్టీ అనుచరులతో నిరసనలకు దిగారు. ఈ క్రమంలో.. ఫౌజియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కలబురాగి డిప్యూటీ కమిషనర్ ఇక్కడ ఐఏఎస్ అధికారిణేనా? లేదంటే పాకిస్తాన్ నుంచి వచ్చారా? ఆమె తీరు చూస్తుంటే పాక్ నుంచి వచ్చినట్లే ఉంది’’ అంటూ రవికుమార్ వ్యాఖ్యానించారు.మతపరమైన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్థానికంగా పీఎస్లో ఫిర్యాదు నమోదు కాగా.. రవికుమార్పై కేసు ఫైల్ అయ్యింది. మరోవైపు.. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఐఏఎస్ అధికారుల సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ తరుణంలో తాను ఏదో భావోద్వేగంలో అలా అనేశానంటూ వివరణచ్చారు. మరోవైపు.. రవికుమార్పై చర్యలు కోరుతూ గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు.. ఈ వ్యవహారంపై స్పందించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఫౌజియా నిరాకరించారు. ఇదీ చదవండి: మస్క్ ఎగ్జిట్పై స్పందించిన ట్రంప్, ఏమన్నారంటే.. -
అమ్మ చేసిన బొమ్మలు
కూతురు ఆడుకోవడానికి అమ్మ చేసిన బొమ్మల ఆలోచన ఇప్పుడు నెలకు రూ. 2 లక్షల వ్యాపారం చేసేలా ఎదిగింది. కూతురికి ఉల్లాసాన్నిచ్చే ఒక సాధారణ ఆలోచన నుండి వీణా పీటర్ ‘తారాస్ డాల్ హౌస్’ పేరుతో బెంగళూరులో ఒక ప్రసిద్ధ బ్రాండ్గా మారింది. ప్లాస్టిక్ బొమ్మల ప్రపంచం నుంచి పిల్లలకు ఆలోచనాత్మక, పర్యావరణ హితమైన బొమ్మలను అందిస్తూ తల్లులకు ప్రేరణగా నిలిచింది. రెండేళ్ల క్రితం 30 బొమ్మలతో మొదలుపెట్టిన వీణా పీటర్ బిజినెస్ ప్రయాణం మనల్నీ తన వెంట తీసుకెళుతుంది.‘‘ముందస్తు వ్యాపార ప్రణాళిక లేదు, ఓ పేరూ లేదు, ధరల వ్యూహం అసలే లేదు. చేతితో తయారు చేసిన, పాతకాలం నాటి వస్తువులను అమ్మే ఓ మార్కెట్లో మొదటిసారి నా బొమ్మల ధరలను నిర్ణయించాను. ప్లాస్టిక్తో నిండిన పిల్లల బొమ్మల ప్రపంచంలో ఆలోచనాత్మకమైన, సున్నితమైన ప్రత్యామ్నాయమిది. చెన్నైలో మాస్టర్స్ చేసిన తర్వాత కార్పొరేట్ కంపెనీలలో దశాబ్దం పాటు ఉద్యోగినిగా కొనసాగాను. కానీ 2015లో నెక్ట్స్ ఏంటి అనే ఆలోచన నన్ను కుదురుగా ఉండనిచ్చేది కాదు. నా మార్గాన్ని వెతుకుతూనే నా భర్త ఎడ్యుకేషనల్ స్టార్టప్లో సాయం చేయడం ప్రారంభించాను. డిజిటల్ లోకం నుంచి డాల్ హౌస్కు...నా కూతురు తారా పుట్టాక నా ప్రపంచమే మారిపోయింది. డిజిటల్ లోకం నుంచి తప్పుకున్నాను. నా కూతురుతో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకున్నాను. తారా పెరిగేకొద్దీ, బొమ్మల పట్ల ఆమెకు ప్రేమ పెరగడం గమనించాను. అయితే ఆమె ఆడుకునే బొమ్మల ఎంపిక నాకు ఇబ్బందిగా అనిపించేది. అన్నీ ప్లాస్టిక్, సింథటిక్ బొమ్మలు. పైగా అవి ఎక్కువ కాలం ఉండేవి కావు. పర్యావరణ అనుకూలమైనవి అసలే కావు. తారా నా జుట్టును చేత్తో పట్టుకొని పడుకునేది. ఆ అలవాటును ఎలా పోగొట్టాలో తెలిసేది కాదు. ఓ రాత్రిపూట జుట్టున్న బొమ్మను కొంటే..? అనే ఆలోచన వచ్చింది. దాని కోసం చాలా స్టోర్స్ వెతికాను. కానీ, అవన్నీ నాణ్యత లేనివి. నేనే ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. వాడిన ఫ్యాబ్రిక్తో బొమ్మమా అమ్మ పాత కాటన్ చీరలను ఉపయోగించి మొదటి బొమ్మను తయారు చేశాను. ఉన్ని దారాలతో జుట్టు కుట్టాను. తర్వాత మరికొన్నింటిని అలాగే కుట్టాను. తారాకు ఆ బొమ్మలు బాగా నచ్చాయి. మా ఫ్రెండ్స్ వాటిని చూసి, తమ పిల్లలకు కూడా అలాంటి బొమ్మలను తయారు చేసిమ్మన్నారు. దీంతో ఇది నా వ్యక్తిగతప్రాజెక్ట్గాప్రారంభమైంది. ఓ 30 బొమ్మలను తయారు చేశాను. వాటికి ధర ఎలా నిర్ణయించాలో తెలియలేదు. హస్తకళాకృతులు అమ్మే వీకెండ్ మార్కెట్కు వాటిని తీసుకెళ్లి, అక్కడ ప్రదర్శనకు పెట్టా. ఈవెంట్ అయ్యేలోపు బొమ్మలన్నీ అమ్ముడయ్యాయి. దీంతో నమ్మకం వచ్చేసింది. అలా నా కూతురి పేరుతోనే ‘తారాస్ డాల్ హౌస్’ పుట్టింది.బొమ్మల తయారీ కళను నేర్చుకోవడం2023ప్రారంభంలో మొదలుపెట్టిన ఈ వ్యాపారం కొన్ని నెలల వ్యవధిలో నెమ్మదిగా ఊపందుకుంది. ముందుగా ముడి బొమ్మలను తయారుచేయడాన్ని బాగా అధ్యయనం చేశాను. ప్రతి బొమ్మను కాటన్ పై ఒక ట్రేస్డ్ ప్యాటర్న్ తోప్రారంభించి, కత్తిరించి, అవుట్ లైన్ల వెంట కుట్టి,. తర్వాత దానిని లోపలి వైపుకు తిప్పి, కాటన్–పాలిస్టర్ ఫ్యాబ్రిక్తో నింపుతాను. దానివల్ల ఇది ఒకసారి ఉతికిన తర్వాత కూడా ముడుచుకుపోదు. బొమ్మల ముఖాలను ఫాబ్రిక్ మార్కర్లతో గీసి, విడిగా డ్రెస్సులు కుట్టి ఇస్తాను. పిల్లల చేతే బొమ్మలకు ఆ డ్రెస్సులు వేయిస్తే, వారికి సరదాగా ఉంటుంది. మొదట్లో ఈ పనిని ఒక్కదాన్నే చేసేదాన్ని. డిమాండ్ పెరిగేకొద్దీ, మరో ముగ్గురిని నియమించుకున్నాను. ఒకేసారి 100 బొమ్మలుబొమ్మల తయారీలో అసెంబ్లింగ్ విధానాన్ని రూ΄÷ందించాను. మొదట్లో ఒక బొమ్మకు రెండు రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఒక రోజులో 100 బొమ్మలను తయారు చేస్తున్నాం. బొమ్మలతో పాటు వాటికి వేసే నైట్ సూట్లు, గౌన్లు, సాంప్రదాయ దుస్తులు వంటి వివిధ రకాల దుస్తులను కూడా డిజైన్ చేస్తాం. మిగిలిపోయిన అతి చిన్న బట్టలను బొమ్మల పడకలు, దిండ్లు, ఇతర ఉపకరణాలలో తిరిగి ఉపయోగిస్తాం. ఏదీ వృథా కాదు. పిల్లలు ఈ బొమ్మలతో ఆటలో నిమగ్నమవ్వడం మాకు అతిపెద్ద బహుమతి. పిల్లలు బొమ్మలను కౌగిలించుకోవడం, వాటికి పేర్లు పెట్టడం వంటి ఫోటోలను చూసినప్పుడు అది నా బాధ్యతను మరింత గుర్తు చేసినట్లవుతుంది. ప్రతి బొమ్మకు మోడర్న్, ట్రెడిషనల్ రెండు డ్రెస్ డిజైన్లు చేసి ఇస్తాం. ఒక చిన్నారి పంజాబీ ఇంటి నుండి వచ్చినట్లయితే, ఆ బొమ్మకు ఘాగ్రా ఉంటుంది. దక్షిణ భారతదేశ పిల్లలకు లంగా వోణి ఎంపిక కావచ్చు. చిన్న డిజైన్ లకు ధర రూ.500, అదనపు దుస్తులతో వచ్చే 12 అంగుళాల బొమ్మకు రూ. 1,000, వార్డ్రోబ్, పరుపులతో పూర్తి చేసిన డీలక్స్ డాల్హౌస్ సెట్లకు రూ. 3,500 వరకు ధరలు ఉన్నాయి. కుట్టుపని చేసిన మొదటి రోజు నాటి నుండి ఇప్పుడు నెలకు 200 బొమ్మలు అమ్మే వరకు, తారాస్ డాల్ హౌస్ నెలకు రూ. 2 లక్షల ఆదాయాన్ని ఆర్జించే వ్యాపారంగా ఎదగడం చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది’’ అని తన బొమ్మల ప్రయాణాన్ని మురిపంగా వివరించింది వీణ. -
కామ స్వామి మఠం ధ్వంసం
దొడ్డబళ్లాపురం: బాలికపై అత్యాచారం చేసిన దొంగ స్వామికి చెందిన మఠాన్ని అధికారులు జేసీబీలతో ధ్వంసం చేయించారు. బెళగావిలోని రామ మందిరమఠం లోకేశ్వర స్వామీజీ ఒక బాలికకు మాయమాటలు చెప్పి రాయచూరు, బాగలకోటకు తీసుకెళ్లి కొన్ని రోజులపాటు లాడ్జీలలో ఉంచి అత్యాచారం చేసాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిసి ఫిర్యాదుచేయగా అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించడం తెలిసిందే. గురువారంనాడు రాయభాగ తహసీల్దార్ ఆధ్వర్యంలో పోలీసులు మేఖళి గ్రామంలో ఉన్న సదరు మఠాన్ని జేసీబీలతో పడగొట్టించారు. 8 ఏళ్ల క్రితం స్వామిజీ 8 ఎకరాలను ఆక్రమించుకుని మఠం నిర్మించాడు. అనుమతులు లేనందున ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.16 మంది రైల్వే ఉద్యోగులపై కేసుదొడ్డబళ్లాపురం: తోటి ఉద్యోగిపై హత్యకు కుట్ర చేయడంతోపాటు కుల దూషణ చేశారని ఓ ఉద్యోగి కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు 16మంది రైల్వే ఉద్యోగులపై కేసు నమోదైన వ్యవహారం యలహంక న్యూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యలహంక సమీపంలోని రైల్వే వీల్ ఫ్యాక్టరీలో సీనియర్ మెకానిక్గా పని చేస్తున్న బసవలింగప్ప ఫిర్యాదుదారుడు. వేతనం, ప్రమోషన్ రాకుండా తోటి ఉద్యోగులు 16మంది తనపై హత్యకు కుట్ర చేసి, కుల దూషణతో వేధించారని ఆయన కేసువేశారు. కోర్టు ఆదేశాల మేరకు యలహంక న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.స్కూలు బస్సు పల్టీదొడ్డబళ్లాపురం: స్కూళ్లు తెరిచిన గురువారంనాడే స్కూల్ బస్సు ఒకటి అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన గదగ్ పట్టణ పరిధిలోని ఆర్కే నగరలో జరిగింది. స్థానిక శ్రీపార్శ్వనాథ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన స్కూల్ ఉదయాన్నే విద్యార్థులను తీసుకురావడానికి వెళ్తుండగా డ్రైవర్ బ్రిడ్జి కింద నిర్లక్ష్యంగా నడపడంతో బోల్తాపడింది. డ్రైవర్ స్వల్ప గాయపడ్డాడు. పోలీసులు క్రేన్ తెప్పించి బస్సును రోడ్డుపై నుండి తొలగించారు. ఖాళీ బస్సు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యయశవంతపుర: డెత్నోటు రాసి ఇంజినీరింగ్ విద్యా ర్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా పొన్నంపేట తాలూకా హళ్లిగట్టులో జరిగింది. తేజస్విని (19) సీఐటీ కాలేజీలో ఫస్టియర్ బీటెక్ చదువుతూ కాలేజీ హాస్టల్లో ఉంటోంది. గురువారం తెల్లవారుజామున గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. డెత్నోటులో 6 విషయాలు తెలిపింది. సబ్జెక్టుల్లో బ్యాక్లాగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు రాసింది.తుపాకుల విక్రేతల అరెస్టుదొడ్డబళ్లాపురం: నాటు తుపాకులు, రివాల్వర్లు తీసుకువచ్చి బెంగళూరులో అమ్ముతున్న ఇద్దరు నిందితులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక నాటు తుపాకి, ఒక రివాల్వర్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు కేజీ హళ్లి రౌడీషీటర్ కాగా మరొకరు ఆయుధాల విక్రేత. అరెస్టయిన రౌడీషీటర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పంజాబ్లోని తేజ్ బహద్దూర్ నగర్లో నివసిస్తున్న ఆయుధాల విక్రేతను అరెస్టు చేసి తీసుకువచ్చారు. తుపాకులను ఎవరెవరికి విక్రయించారు అనేది విచారిస్తున్నారు.సీఎం, డీసీఎం బదిలీల వార్బనశంకరి: సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బదిలీల గురించి విభేదాలు వచ్చాయి. ప్రజాపనుల శాఖ నుంచి జలవనరుల శాఖకు సీనియర్ ఇంజనీర్లను బదిలీ చేయడంపై డీకే శివకుమార్ అసహనం వెలిబుచ్చారు. తమ శాఖలో సీఎం జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. దీనిపై ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిసింది. డీకే మీడియాతో మాట్లాడుతూ.. జలవనరుల శాఖలో ఎక్కువ మంది ఇంజనీర్లు లేరు, మాకు అర్జెంటుగా ఇంజనీర్లు కావాలని అడిగాను. కానీ మా శాఖలోకి వచ్చి పదోన్నతి తీసుకుని ప్రజాపనులశాఖ, జిల్లా పంచాయతీ తో పాటు ఇతర శాఖలకు బదిలీ అవుతున్నారని వాపోయారు. మీ అనుమతి లేకుండా ఎవరు బదిలీచేశారని విలేకరులు ప్రశ్నించగా, ఉన్నతస్థాయిలో జరుగుతోందని పరోక్షంగా సీఎంను ప్రస్తావించారు. నాకు చెప్పకుండా ఎవరినీ బదిలీ చేయరాదని తెలిపానన్నారు. -
గుండెపోటుతో యువతి మృతి
యశవంతపుర: కరోనా వైరస్ ఉత్పన్నమయ్యాక యువతీ యువకులు కూడా గుండెపోటుతో బలవుతున్నారు. ఇదే మాదిరిగా హాసన్ జిల్లా కెలవత్తి గ్రామంలో కవన కె.వి (21) గుండెపోటుతో చనిపోయింది. ఆమె హాసన్ పట్టణంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. వార్షిక పరీక్షలు జరుగుతుండగా మూడు పరీక్షలను రాసింది. మరో మూడు రాయవలసి ఉంది. బుధవారం సాయంత్రం పరీక్ష రాసి ఇంటికి వెళ్లింది. దాహంగా ఉంది, నీళ్లివ్వాలని తల్లిని అడిగింది. ఆమె ఫిల్టర్ వద్దకెళ్లి నీటిని తీసుకువచ్చేలోపు కవన కుప్పకూలి పడిపోయింది. తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జిల్లాలోనే వారం రోజుల కింద సంధ్య అనే విద్యార్థిని కూడా గుండెపోటుతో మరణించింది. -
1న ప్రతిభా పురస్కారాలు ప్రదానం
సాక్షి,బళ్లారి: కర్ణాటక వీరశైవ లింగాయత్ ఉద్యోగుల క్షేమాభివృద్ధి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జూన్ 1న సముదాయంలోని ప్రతిభావంత విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఈమేరకు ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు చెన్నబసవస్వామి గురువారం వివరాలు వెల్లడించారు. 10వ తరగతి, పీయూసీలో 85శాతం పైగా మార్కులను తెచ్చుకున్న వారిని సన్మానించి, పురస్కారం అందజేస్తామన్నారు. ఇప్పటికే 10వతరగతి విద్యార్థులు 130 మంది, పీయూసీ విద్యార్థులు 135 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరిలో అర్హులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామన్నారు. సమావేశంలో బసవరాజు బిసలహళ్లి,ఎస్పీ జగదీష్,నాగేష్ తదితరులు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: గాణిగ సమాజం ఆధ్వర్యంలో జూన్ 1న ప్రతిభాపురస్కారాలు ప్రదానం చేయనుననట్లు ఆ సముదాయం అధ్యక్షుడు చెన్నప్ప తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టెన్త్, పీయూసీలో ఉత్తమ మార్కులు సాధించిన సముదాయానికి చెందిన విద్యార్థులకు నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలిపారు. బసప్పహళి, శంకరప్ప, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
డీసీసీబీ ఎన్నికల్లో కాంగ్రెస్కు భంగపాటు
కోలారు: తీవ్ర కూతూహలం రేకెత్తించిన డిసిసి బ్యాంకు డైరెక్టర్ల ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. బ్యాంకు పాలక మండలిలో 18 మండి డైరెక్టర్లు ఉండి ఇందులో 6 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. మిగిలి 12 డైరెక్టర్ల స్థానాలకు జరిగిన ఎన్నికలో 8 స్థానాల ఫలితాలు వెలువడి, ఇంకా 4 స్థానాల ఫలితాలు కోర్టు ఆదేశాల మేరకు రిజర్వులో ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పాలక కాంగ్రెస్ పార్టీకి నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఎన్నికలలో డిసిసి బ్యాంకు మాజీ అధ్యక్షుడు బ్యాలహళ్లి గోవిందగౌడతో పాటు మాజీ డైరెక్టర్లు, కొత్త అభ్యర్థులు బరిలోకి దిగారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, కేజీఎప్ ఎమ్మెల్యే రూపా శశిధర్, బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బరిలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర కసరత్తులు చేసినా ఫలించలేదు. బ్యాలహళ్లి గోవిందగౌడను ఓడించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నిక అనంతరం విలేకరులతో మాట్లాడిన బ్యాలహళ్లి గోవిందగౌడ తనకు ప్రాణహాని జరిగితే అందుకు మాజీ మంత్రి కె ఆర్ రమేష్కుమార్ కారణమని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చ చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. గోవిందగౌడ ఎన్నిక -
నకిలీ ఐఎస్ఐ ఫ్లైవుడ్ స్వాధీనం
హుబ్లీ: ఉత్తర కన్నడ జిల్లా కార్వారలోని ఒక దుకాణంలో నకిలీ ఐఎస్ఐ మార్కుతో మేరిన్ ఫ్లైవుడ్ విక్రయిస్తుండగా అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఫ్లైవుడ్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులు ధ్రువీకరించుకోవాలని, ఆల్మార్కింగ్ ఉన్నవాటినే వినియోగదారులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. గంజాయి విక్రయాలు అరికట్టండి రాయచూరు రూరల్: యువతలో నేర ప్రవృత్తికి కారణమైన గంజాయి విక్రయాలను అరికట్టాలని, జిల్లాలో జరుగుతున్న హత్యలకు అడ్డుకట్ట వేయాలని కర్ణాటక రాష్ట్ర ది లేజండ్ టిప్పుసుల్తాన్ సంఘం అధ్యక్షుడు రశీద్ డిమాండ్ చేశారు. గురువారం ఆబ్కారీ శాఖ కార్యాలయం వద్ద ఆయన ధర్నా చేశారు. నగరంలో గంజాయి, హఫీం వంటి విక్రయాలు జరుగుతున్నాయని, వాటిని సేవించి యువత నేరాలకు పాల్పడుతోందన్నారు. దీనికితోడు జిల్లాలో హత్యల సంస్కృతి పెరుగుతోందన్నారు. రాత్రి 10 గంటల అనంతరం దుకాణాలు, హోటల్స్ బంద్ చేయాలన్నారు. అనంతరం ఆబ్కారీశాఖ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఫుట్పాత్ల్లో ఆక్రమణలు తొలగించుకోండి రాయచూరురూరల్: నగరంలో ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్లపై దుకాణాలు తొలగించుకోవాలని యజమానులకు డీఎస్పీ శాంతవీర్ సూచించారు. బుధవారం ఆయన నగరంలోని జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం నుంచి జైల్ రోడ్, ఏక్మీనార్, సూపర్ మార్కెట్, తీన్కందిల్, షరాఫ్ బజార్, మహవీర్ సర్కిల్ వరకు పర్యటించారు. ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను పరిశీలించారు. పాదచారులకు ఇబ్బందిగా ఉందని, వెంటనే దుకాణాలు తొలగించుకోవాలని యజమానులకు సూచించారు. లేని పక్షంలో తామే ఆక్రమణలు తొలగించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సదర్ బజార్ సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, ట్రాఫిక్ ఎస్ఐ సణ్ణ వీరణ్ణ పాల్గొన్నారు. రైల్వే ట్రాక్పై తనిఖీలు హుబ్లీ: భారీ వర్షాలు నేపథ్యంలో నైరుతి రైల్వే జోన్ జీఎం ముకుల్ శరణ్మాతూర్ గురువారం అటవీ ప్రాంతాలలోని రైల్వే ట్రాక్ను పరిశీలించి అవసరమైన సూచలను అందజేశారు. హుబ్లీ–కోలం విభాగంలో విండో ట్రయల్ ద్వారా ఈపరిశీల చేశారు. క్యాతల్రాక్, కోలం తదితర అటవీ ప్రాంతంలో పట్టాలు, వంతెనల స్థితిగతులపై ఆరా తీశారు. ట్రాక్ రిలేయింగ్ టైన్ యంత్రం వినియోగించి అమర్చిన ఇటీవల ఆధునీకరించిన ట్రాక్ స్లీపర్లను కూడా పరిశీలించారు. తనిఖీల్లో ఆర్డీఎస్ఓ ట్రాక్ డైరెక్టర్ బీపీ సింగ్,హుబ్లీ డీఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న స్థానికులు హుబ్లీ: జిల్లాలో ఉన్న కబేళాలకు మూగజీవాలను అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు అడ్డుకొని 40 ఆవులను రక్షించారు. ఈఘటన కలఘటగి పట్టణంలో జరిగింది. ఏపీఎంసీ ఆవరణంలో పాడుబడిన రెండు గోదాములలో ఈ పశువులను నిర్బంధించారు. వీటిని బుధవారం రాత్రి వాహనంలో తరలించడానికి ప్రయత్నిస్తుండగా స్థానిక యువకులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శ్రీశైల కౌజలగి తన సిబ్బందితో చేరుకుని దాదాపు రూ.6 లక్షల విలువైన గోవులను రక్షించారు. -
తగ్గని కమల్ సెగలు
శివాజీనగర: కన్నడ భాష పుట్టుక గురించి ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కమల్ సినిమాలను నిషేధించాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి నేతలు సమావేశమయ్యారు. నిర్మాత సా.రా గోవిందు మాట్లాడుతూ, కమల్ హాసన్పై మాకెవరికీ కనికరం లేదు. శుక్రవారంలోగా కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే.. కన్నడనాట ఆయన సినిమాలను విడుదల చేయనివ్వం అని హెచ్చరించారు. ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ కన్నడ సంఘలు కమల్ సినిమాను బ్యాన్ చేయాలని పట్టుబట్టారు. కాబట్టి కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కమల్హాసన్ చేత క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆగని నిరసనలు రాష్ట్రంలో కమల్ సినిమాలను నిషేధించాలని కన్నడ సినిమా పంపిణీదారులు కమలాకర్ నేతృత్వంలో మరో భేటీ జరిగింది. ఈ సమయంలోనే కొన్ని కన్నడ సంఘాల కార్యకర్తలు ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పాలని కన్నడ సంఘాల పట్టు -
కోవిడ్కు వృద్ధుడు బలి
బనశంకరి: రాష్ట్రంలో కోవిడ్ కలవరం రేపుతోంది. బెంగళూరులో 100 కేసులకు పైగా చేరుకున్నాయి. బెళగావి తాలూకా బెనకనహళ్లి గ్రామంలో 70 ఏళ్ల వృద్ధుడు వయోభారంతో అనారోగ్యం బారినపడి బిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. వెంటనే కోవిడ్ వార్డులోకి తరలించారు. బుధవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. కోవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు చేశారు. కాగా రాష్ట్రంలో కోవిడ్ మరణాలు 3కు చేరాయి. కొత్తగా కేసులు నమోదు కాలేదని తెలిసింది. మాస్కుల వాడకం పెరిగింది. బీజేపీ ఎమ్మెల్సీలపై గవర్నర్కు ఫిర్యాదు శివాజీనగర: కల్బుర్గి జిల్లాధికారి ఫౌజియా తరున్నుం ని పాకిస్తానీ అని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్ దూషించారు. మరో చలవాది నారాయణస్వామి మంత్రి అయిన ప్రియాంక ఖర్గేను కుక్కతో పోల్చారు, వీరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గురువారం గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఎన్.ఎస్.బోసురాజు, సలీం అహమ్మద్ తదితరులు ఇందులో ఉన్నారు. ఆ ఎమ్మెల్సీలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సమాజాన్ని విడగొట్టే పని చేస్తున్నారని ఆరోపించారు. స్మారకాల సంరక్షణకు రారండి ● సంఘసంస్థలకు పర్యాటక మంత్రి పిలుపు బనశంకరి: రాష్ట్రంలో చారిత్రక స్థలాలు నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదని, రాష్ట్రంలో 25 వేలకు పైగా చారిత్రక స్థలాలను దత్తత ఇవ్వాలని నిర్ణయించామని పర్యాటక మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. బెంగళూరు చిత్రకళా పరిషత్లో నమ్మ ఆర్ట్స్ బెంగళూరు పేరుతో 5 రోజుల పాటు నిర్వహించే జాతీయ కళా ఉత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు, మఠాలు, ట్రస్టులు, సంఘసంస్థలు స్మారక దత్తు పథకం కింద స్మారకాలను దత్తత తీసుకోవచ్చునని తెలిపారు. దీంతో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి స్మారకాల రక్షణకు అవసరమైన సౌకర్యాల కల్పనకు వీలవుతుందన్నారు. చిత్రసంతెను చూస్తే చిత్రకళలో అభిరుచి లేనివారు కూడా ఆశ్చర్యానికి లోను అవుతారని తెలిపారు. కోల్కతా తరువాత కళల పట్ల ఆసక్తి కలిగిన రాజధాని బెంగళూరు కావడం గర్వకారణమన్నారు. ప్రముఖ కళాకారుడు విలాస్నాయక్ గీసిన చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిత్రకళాపరిషత్ అద్యక్షుడు బీఎల్.శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూ.25 లక్షలు నిధులు అందించి ప్రోత్సహిస్తోందని తెలిపారు. చిత్రకళావేడుక ఆదివారం వరకు జరుగుతుంది. -
ఆలమట్టికి పోటెత్తిన వరద
రాయచూరు రూరల్: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు వరద పోటెత్తింది. ఫలితంగా ఆలమట్టి జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. రెండు రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు ఉపనది మలప్రభ ఉధృతంగా ప్రవహిస్తోంది. ముదోళ్ తాలూకా ధవళేశ్వరం బ్రిడ్జి కమ్ బ్యారేజీని వరద జలాలు తాకుతూ ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలోని రాజాపూర్, హిప్పరిగి జలాశయాల నుంచి వరద నీరు అలమట్టికి చేరుతున్నాయి. దీంతో 50 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. గుర్జాపూర వంతెన గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. యాదగిరి జిల్లాలో భారీ వర్షాలు యాదగిరి జిల్లాలో కుంభవృష్టి కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శహపుర తాలూకా యడళ్లిలో ఇళ్లలోకి నీరు చేరి వస్తు సామగ్రి, ధాన్యం తడిసి ప్రజలు నిరాశ్రయులయ్యారు. యాదగిరిలోని విద్యాభారతి పాఠశాల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిపైకి వరద నీరు చేరింది. వరదతో కృష్ణా నది పోటెత్తుతుండటందతో ప్రజలు నీటి వనరుల వద్దకు వెళ్లరాదని అధికారి నితీష్ ఆదేశాలు జారీ చేశారు. -
‘సలాం బళ్లారి’తో సమస్యలు పరిష్కారం
● ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి బళ్లారిఅర్బన్: నగరంలో సమస్యల పరిష్కారానికి సలాం బళ్లారి కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పేర్కొన్నారు. సలాం బళ్లారి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.1200 కోట్లతో నగరంలో శాశ్వత మంచినీటి పరిష్కారానికి త్వరలో శ్రీకారం చుడుతామన్నారు. గడిగి చెన్నప్ప సర్కిల్ త్వరలో ప్రారంభోత్సవం చేస్తామన్నారు. సీఎం, డీసీఎంలు హాజరవుతారన్నారు. ఇంతకు ముందు తాను పర్యటించిన వార్డుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. -
కసాప సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహిద్దాం
● మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి సాక్షి,బళ్లారి: బళ్లారి జిల్లాలో 68 సంవత్సరాల తర్వాత జరగనున్న అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళననాన్ని ఘనంగా నిర్వహిద్దామని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కసాప బళ్లారి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాలి రుక్మిణమ్మ, చెంగారెడ్డి కామర్స్ కాలేజీలో తల్లిదండ్రుల పేరుమీదుగా గురువారం ఏర్పాటు చేసిన స్మారక దత్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కన్నడ నేల, నీరు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. కన్నడ భాషాభివృద్ధికి కసాప చేస్తున్న కృషి శ్లాఘనీయమన్నారు. మాతృభాషను, పుట్టిన నేలను ఎప్పుడూ మరవకూడదని సూచించారు. కన్నడ కస్తూరి పరిమళాన్ని నలుదిశలా ప్రసరింపజేయడానికి అఖిలభారత భారత కన్నడ సమ్మేళాన్ని కన్నుల పండువగా నిర్వహించాలన్నారు. ఆ సమ్మేళనం బళ్లారిలో సువర్ణాక్షరాలతో లిఖించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టూరుస్వామి బీఎడ్ కళాశాల సహప్రాధ్యాపకులు ఎన్ జీ జయణ్ణ మాట్లాడుతూ ప్రాచీన కన్నడ సాహిత్యం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో కసాప జిల్లాధ్యక్షుడు నిష్టిరుద్రప్ప, మహానగర పాలికె విపక్ష నాయకుడు, కార్పొరేటర్ ఇబ్రహీంబాబు, కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీదొంగల అరెస్టు
యశవంతపుర: జాతీయ రహదారిలో దోపిడీకి ప్లాన్ వేసిన గురుడ గ్యాంగ్కు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి కారంపొడి, కత్తిని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళూరు చొక్కబెట్టుకు చెందిన జలీల్ హుసైన్, భట్కళ హెబళె గాంధీనగరకు చెందిన డ్రైవర్ నాసీర్ హకీమ్ను అరెస్ట్ చేశారు. జలీల్పై ఇప్పుటీకే 11 కేసులు, నాసీర్పై 2 కేసులున్నట్లు భట్కళ పోలీసులు తెలిపారు. మరో నిందితుడు మైనర్ బాలుడు కాగా, అతనిపై కూడా ఒక కేసు ఉన్నట్లు పోలీసులు వివరించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హైవే మీద తెల్లవారుజామున ఐదు మంది పొంచి ఉండి, ఎవరైనా కనిపిస్తే దోచుకోవాలని సిద్ధమయ్యారు. అదే మార్గంలో వెళ్లతున్న భట్కళ పోలీసుల కంట పడ్డారు. ముగ్గురిని పట్టుకుని ఠాణాకు తరలించారు. ఇటీవలి కాలంలో నేరగాళ్లు గరుడ పేరుతో ముఠాలను ఏర్పాటు చేసుకుని హల్చల్ చేయడం పెరిగింది. డ్యాన్స్మాస్టర్ వంకరబుద్ధి కృష్ణరాజపురం: డ్యాన్స్ మాస్టర్ వంకర బుద్ధి ప్రదర్శించాడు. డ్యాన్స్ పేరుతో బాలికను తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.ఈ ఘటన బెంగళూరు నగరం మహదేవపుర నియోజకవర్గంలోని కాడుగొడిలో జరిగింది. భారతీ కన్నన్(32) అనే వ్యక్తి చిన్నారులకు డ్యాన్స్లో శిక్షణ ఇస్తుంటాడు. ఈ నెల 24న ఓ బాలికను డ్యాన్స్ శిక్షణ పేరుతో కారులో ఎక్కించుకొని నగరంలో పలు ప్రాంతాల్లో తిప్పాడు. ఈక్రమంలో లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో కాడుగోడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
నగరంలో పచ్చదనం పెంచుదాం
రాయచూరు రూరల్: నగరాన్ని పచ్చదనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటి పోషించాలని కమిషనర్ జుబీన్ మోహపాత్రో పిలుపునిచ్చారు. రాయచూరు కార్పొరేషన్ భవనంలో మేయర్ నరసమ్మ అధ్యక్షతన బుధవరం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. జూన్ 5న నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన రహదారిలో కుడి ఏడమ వైపుల మొక్కలు నాటుతామని, నగరవాసులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఉప కమిషనర్ గురు సిద్దయ్య పాల్గొన్నారు.కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాంరాయచూరు రూరల్: నగరంలో పౌర కార్మికుల సమస్యలపై స్పందిస్తామని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ హమీచ్చారు. గురువారం నగరసభ కార్యాలయం వద్ద అందోళన చేపట్టిన కార్మికులను ఎమ్మెల్యే కలిసి మాట్లాడారు. ప్రభుత్వం పౌర కార్మి కుల సర్వీసులు రెగ్యులర్ చేసిందన్నారు. జ్యోతి సంజీవినీ, కేజీఐడీ ఇతర సౌలభ్యాలు కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు.గోవుల రక్షణకు చెక్పోస్టులు ఏర్పాటు చేయండిరాయచూరు రూరల్: జిల్లాలో గోవుల రక్షణకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని గోసేవా సంఘం కార్యదర్శి వినయ్ ిసింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గోవుల అక్రమ రవాణా జరుగుతోందని, దానిని నిలువరించేందుకు నగరంలోని నవోదయ, యరగేర, శక్తినగర. కల్లూర్ క్రాస్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. స్వప్న సింగ్, బాలప్ప, రాయరెడ్డి పాల్గొన్నారు.చికిత్స పొందుతూ క్షతగాత్రుడి మృతిహుబ్లీ: నగరంలోని నూల్వీక్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజాటౌన్ నివాసి ఆటో డ్రైవర్ నజీర్ అహమ్మద్ గురువారం మృతి చెందాడు. ఇతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. హుబ్లీ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.రాజకాలువలను శుభ్రం చేయాలితుమకూరు: ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని, వరదనీరు సక్రమంగా వెళ్లేలా నగరంలో రాజకాలువలను శుభ్రం చేయాలని నగర ఎమ్మెల్యే జ్యోతిగణేష్ జిల్లాధికారి శుభ కళ్యాణ్ను మనవి చేశారు. గురువారం జిల్లాధికారిని కలిసి నగరంలో ఉన్న అమాని చెరువు, చుట్టుపక్కలున్న గార్డెన్ రోడ్డు, దిబ్బూరు, ఎస్.మాల్ వెనుక భాగం, శిరా గేట్, ఈ ప్రాంతంలో వర్షాలు పడితే నీళ్లు ముంచెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. వర్షాలు పడటానికిముందే కాలువలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తీసేయాలి, మరమ్మత్తులు చేయించాలని కోరారు. నగరంలో అనేక లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు వస్తోందని, పరిష్కారం చేయాలని తెలిపారు.బ్రేక్ ఫెయిలై ప్రమాదంతాడిమర్రి: సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండల పరిధిలోని కేయన్ పాళ్యం వద్ద గురువారం ఓ కారు బ్రేక్ ఫెయిలై రాళ్ల కుప్పను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్పల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలు.. బెంగుళూరుకు చెందిన షరీఫ్, ఐదు మంది తమ బంధువులతో గూగూడు కుళ్లాయస్వామి దర్శనానికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు వస్తూ తాడిమర్రికి రావడానికి బదులు దారి తప్పి చిల్లకొండయ్యపల్లికి గ్రామానికి వెళుతున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో కేయన్ పాళ్యం వద్దకు రాగానే కారు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. దీంతో రోడ్డు పక్కన రాళ్ల కుప్పను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో వారికి స్పల్ప గాయాలయ్యాయి. -
గురువుల ఉపదేశం బంగారం
చింతామణి: తాలూకాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన కై వార శ్రీ యోగినారేయణ స్వామి ఆలయంలో కాలజ్ఞాని శ్రీ యోగి నారేయణ తాతయ్య 190వ జీవ సమాధి ప్రవేశ పర్వ ఆరాధన ఉత్సవాలు గురువారం ఘనంగా ఆరంభమయ్యాయి. తాతయ్య విగ్రహానికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేసిన ధర్మాధికారి జయరాం మాట్లాడుతూ గురువుల ఉపదేశాలను మనం పాటిస్తే జీవనం బంగారంగా సాగుతుందన్నారు. మానవుడు అనేక ఆశలకు లోనవుతుంటాడు. అయితే యోగి ఆశలను వదిలి సాధనకర్తగా తయారువుతాడన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి కాషాయ వస్త్రాలను బహూకరించారు. తాతయ్య రచించిన తాటాకుల పుస్తకాలను విశేషంగా పూజించారు. నలమూలల నుంచి భక్తజనం తరలివచ్చారు. రాత్రి అఖండ భజన సాగింది. -
Comment X: పబ్లిక్ రోడ్లు కాస్త..
నడిరోడ్డులో.. పగలురాత్రి తేడాల్లేకుండా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనలెన్నో ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల కారణంగా అవి వైరలూ అవుతున్నాయి. మొన్నీమధ్యే మధ్యప్రదేశ్లో ఓ నేత రోడ్డు మీదే ఓ మహిళతో నగ్నంగా శృంగారం జరిపి కటకటాల పాలయ్యాడు. తాజాగా కర్ణాటకలో కదిలే కారులో రెచ్చిపోయింది ఓ జంట.బెంగళూరుకు చెందిన ఓ జంట మే 27వ తేదీన కోరమంగళలో డిన్నర్ చేసింది. ఆపై కారులో వెళ్తూ.. సన్రూఫ్ నుంచి బయటకు వచ్చి రొమాన్స్ చేయసాగింది. దారినపోయే వాహనదారులు ఆ తతంగం అంతా రికార్డు చేశారు. అయితే.. Karnataka Portfolio అనే ఎక్స్ పేజీ ఆ వీడియోను హైలైట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇలాంటి జుగుప్సాకరమైన చేష్టలు ప్రజలకు ఇబ్బందికరమైనవని, కారులో ఉన్నవాళ్లతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం ఇబ్బందుల్లోకి నెడతాయని పేర్కొంది. వీడియో బాగా వైరల్ కావడంతో నగర పోలీసులు స్పందించారు. వీడియోలో నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసి ఓనర్ను పట్టుకున్నారు. ప్రమాదకరీతిలో వాహనం నడపడం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కింద మొత్తం రూ.1,500 జరిమానా చేతిలో పెట్టి ఈసారికి వార్నింగ్తో వదిలిపెట్టారు. మొన్నీమధ్యే.. ఏప్రిల్లో నగరంలోని మాదవర మెట్రో స్టేషన్లో ఓ జంట అభ్యంతరకర చేష్టలకు దిగడం.. ఈ వీడియో సైతం నెట్టింట తెగ వైరల్ అవ్వడం తెలిసే ఉంటుంది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. పబ్లిక్ రోడ్లు కాస్త ప్రైవేట్ బెడ్రూంలుగా మారిపోయాయంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అయ్యింది.ఇదీ చదవండి: మెట్రోలో వెళ్లే అమ్మాయిలను సీక్రెట్గా ఫొటో తీసి.. -
భర్త కర్కశత్వం.. భార్య హతం
యశవంతపుర(కర్ణాటక): ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తివేటుకు బలి చేశాడు కర్కోటక భర్త. ఈ ఘటన చిక్కమగళూరు తాలూకా కైమరా చెక్పోస్టు వద్ద జరిగింది. అవినాశ్(32) కీర్తి(26)లు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండన్నరేళ్ల చిన్నారి ఉంది. వీరి సంసారం సవ్యంగా సాగుతుండగా ఇటీవల కలతలు ఏర్పడ్డాయి. విడాకులు ఇవ్వాలని అవినాశ్ ఒత్తిడి చేసేవాడు. భార్య నాలుగు నెలల గర్భిణిగా ఉండగా అబార్షన్ చేయించినట్లు తెలిసింది. కొంతకాలంగా పుట్టింటిలో ఉన్న కీర్తి బట్టలు తీసుకురావటానికి బుధవారం భర్త వద్దకు వచ్చింది. ఆ సమయంలో అవినాశ్ కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. చుట్టు పక్కలవారు గమనించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందింది. అవినాశ్ అక్క వల్లనే తమ కుమార్తె కాపురంలో కలతలు ఏర్పడ్డాయని మృతురాలి తల్లిదండ్రులు చిక్కమగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న అవినాశ్ కోసం గాలింపు చేపట్టారు. -
దుష్ట శిక్షణలో రాజీ లేదు
శివాజీనగర: శిష్ట రక్షణ, దుష్టుల సంహారంలో భారతదేశం ఏనాడూ రాజీ పడలేదు, మునుముందు కూడా జరగదని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరు టౌన్హాల్లో జై హింద్ పేరిట కాంగ్రెస్ పార్టీ దేశభక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో రిటైర్డు సైనిక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు వందనం చేశారు. సీఎం మాట్లాడుతూ భారతీయ సైనికుల శక్తిని కొనియాడారు. దుష్టుల సహారానికి ప్రతి ఒక భారతీయుల కట్టుబడి ఉన్నారని అన్నారు. సైనికులు, రైతులు, వైద్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చిరస్మరణీయులని తెలిపారు. రిటైర్డ్ సైనికుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టామని తెలిపారు. -
ఏకధాటి వాన.. చామంతికి వేదన
చిక్కబళ్లాపురం: గత 10 రోజుల నుంచి కురుస్తున్న జడి వానలకు చామంతి పూల తోటలు పాడవుతున్నాయి. చెట్లు కుళ్లిపోవడంతో రైతులకు భారీ నష్టం వస్తోంది. తాలూకాలోని బన్నికుప్పె, నంది దిబ్బూరు, కత్తిరగుప్ప, గుండ్లగుర్కి, రాంపుర ఇతర గ్రామాలలో చామంతి పూల తోటలు ఎక్కువగా ఉన్నాయి. పూలను బెంగళూరుకు తరలించి అమ్ముతారు. గతేడాది ఇదే నెలలో 1 కేజీ పూలు రూ.300 పలికేవి. అన్ని రకాలుగా నష్టమే ఇప్పుడు అధిక వర్షాల వల్ల గిరాకీ తగ్గింది, పైగా తోటలు తడిసిపోయి చెట్లు కుళ్లిపోతున్నాయని శ్రీనాథ్ అనే రైతు తెలిపాడు. రెండు ఎకరాల పంటకు రూ.4 లక్షలు ఖర్చుచేశానని, అప్పులు చేసి పంట పెట్టానని తెలిపారు. వర్షపు నీరు పీల్చుకొని పూలు చెడిపోతాయి, మార్కెట్లో విలువ ఉండదని విచారం వ్యక్తంచేశాడు. చేతికి వచ్చిన చామంతి పూల చెట్లను పీకేస్తున్నారు. మామూలుగా నవంబరు, డిసెంబరు నెలల్లో రావలసిన తుపానులు మేలో వచ్చి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తమకు పరిహారాన్ని అందజేయాలని కోరుతున్నారు. కుళ్లిపోతున్న చెట్లు, పువ్వులు రైతులకు తీవ్ర నష్టం -
హెచ్ఏఎల్ను తరలిస్తే సహించేది లేదు
శివాజీనగర: బెంగళూరులోని హెచ్ఏఎల్ని తరలిస్తారా.. అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెంగళూరులోని హెచ్ఏఎల్ను ఏపీలో విస్తరించాలని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. కేంద్రానికి చంద్రబాబు వినతి నేపథ్యంలో హెచ్ఏఎల్ ఉత్పత్తి యూనిట్లు ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్నాయని కొన్ని వర్గాలు ప్రచారం ప్రారంభించాయి. హెచ్ఏఎల్కు ఆంధ్ర కర్ణాటక సరిహద్దుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షిలో 10,000 ఎకరాల భూమిని అందించేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పారు. కర్ణాటకలో బెంగళూరు, తుమకూరులో హెచ్ఏఎల్కు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, శిక్షణా విమానాలు ఇందులో తయారవుతున్నాయి. నెహ్రూ స్థాపించిన సంస్థ: డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ హెచ్ఏఎల్ను బీజేపీ (మోదీ ప్రభుత్వం) ఏర్పాటు చేయలేదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ బెంగళూరులో స్థాపించారు. కర్ణాటక హెచ్ఏఎల్ యూనిట్లను కాపాడుకోవడానికి మేము దేనికై నా సిద్ధం అని అన్నారు. ఈ విషయంలో కర్ణాటక బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బీ.పాటిల్ మాట్లాడుతూ, హెచ్ఏఎల్ బెంగళూరులోని కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి. కొత్త యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే చేసుకోనీ అన్నారు. ఐదోతరం అత్యాధునిక మధ్యతరహా యుద్ధ విమానం (ఏఎంసీఏ) ప్రాజెక్ట్ బెంగళూరులో ఉన్న ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ఆధ్వర్యంలో హెచ్ఏఎల్ సహకారంతో నడుస్తోంది. ఈ తరుణంలో వివాదం రేకెత్తడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తేల్చిచెప్పిన సీఎం, డిప్యూటీ సీఎంలు సీఎం చంద్రబాబు ధోరణిపై ఆగ్రహంఅది సాధ్యం కాని పని: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రభుత్వ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఈ విషయమై మాట్లాడుతూ హెచ్ఏఎల్ తరలింపు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కర్ణాటకలో హెచ్ఏఎల్ యూనిట్లను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. నాకు తెలిసినంతవరకూ ఇది సాధ్యపడదు, హెచ్ఏఎల్ తరలింపు జరగదు అని సిద్దరామయ్య పేర్కొన్నారు. -
కమల్.. గోల్మాల్
శివాజీనగర: ప్రముఖ బహుభాషా సినీనటుడు కమల్హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. కన్నడం తమిళం నుంచి పుట్టింది అని ఆయన చెప్పడం మీద కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందా? కమల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ కొద్దివారాల్లో విడుదల కానుంది, మంగళవారం చైన్నెలో జరిగిన సినిమా ప్రి– రిలీజ్ వేడుకలో కమల్ మాట్లాడుతూ, కన్నడం.. తమిళం నుంచి పుట్టింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్కుమార్ కూడా ఉన్నారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కమల్ ప్రసంగాన్ని ఉయిరే, ఉరవే తమిళే.. అంటే నా జీవితం, నా బంధం అన్నీ తమిళమే అనే మాటలతో ప్రారంభించారు. వేదికపై ఉన్న కన్నడ నటుడు శివ రాజ్కుమార్ను చూస్తూ, ఇక్కడ ఉన్నది నా కుటుంబం. అందుకే ఆయన (శివ రాజ్కుమార్) ఇక్కడికి వచ్చారు. అందుకే నా జీవితం, బంధం, తమిళ్ అని మొదలుపెట్టారు. మీ భాష (కన్నడ) తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే అని అన్నారు. సంస్కృతి తెలియని వ్యక్తి: సీఎం సీఎం సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. కన్నడ భాష సంస్కృతికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది, పాపం కమల్కు ఆ విషయం తెలియదేమో అని హేళన చేశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర కమల్ను సంస్కారం లేని వ్యక్తి అని విమర్శించారు. కమల్హాసన్ గత కొన్నేళ్లుగా హిందూ మతాన్ని అవమానిస్తూ, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇప్పుడు 6.5 కోట్ల కన్నడగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కన్నడను అవమానించారు. కమల్ హాసన్ వెంటనే కన్నడిగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని విజయేంద్ర డిమాండ్ చేశారు. ఆయన భాషా చరిత్రలో నిపుణుడు కూడా కాదని విమర్శించారు. నిరసనలు కన్నడ భాషా అభిమాన సంఘాలు కమల్పై మండిపడ్డాయి. బెంగళూరులో కమల్హాసన్ పోస్టర్లను చించి, దిష్టిబొమ్మను తగులబెట్టారు. కన్నడను చిన్నచూపు చూడటం తగదని హెచ్చరించాయి. కన్నడ భాషను తక్కువ చేసేలా మాటలు సీఎం, నేతలు సహా ప్రజల మండిపాటు -
కిల్లర్ చిరుత కోసం గాలింపు
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా నాగపుర హాడి సొళ్లెపుర అటవీ ప్రాంతంలో సోమవారం మేకలు మేపుతున్న హరీష్ అనే యువకున్ని ఓ చిరుత హతమార్చింది. దానిని పట్టుకోవడానికి అటవీ శాఖ సిబ్బంది కూంబింగ్ చేపట్టారు. పెంపుడు ఏనుగులతో గాలింపు సాగిస్తున్నారు. నాగరహొళె విభాగంలోని 30 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. హుణసూరు వలయంలోని హనగోడు కురుబర హొసహళ్లి గ్రామానికి చెందిన హరీష్ (24) తండ్రి కృష్ణతో కలిసి అటవీ శాఖ స్థలంలో మేకలు మేపుతుండగా, చిరుత వచ్చింది. దానిని తరిమేందుకు ప్రయత్నించగా అది హరీష్ మీద పడి తీవ్రంగా కొరికింది. తీవ్రంగా గాయపడిన హరీష్ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. హరీష్కు మూడు నెలల క్రితమే పెళ్లయింది. రూ.20 లక్షల పరిహారం మృతుడు హరీష్ కుటుంబానికి అటవీ శాఖ రూ.20 లక్షల పరిహారం ప్రకటించింది. హరీష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, అక్కడికక్కడే రూ.5 లక్షల చెక్ను అందజేశారు. మిగతా రూ.15 లక్షల పరిహారధనం చెక్ను త్వరలో అందజేస్తామని డీసీఎఫ్ సీమా తెలిపారు. డ్రోన్, ఏనుగులతో.. చిరుత ఆచూకీ కోసం ఒక పెద్ద బోను, నాలుగు చిన్న బోనులు, 15 కెమెరా ట్రాప్లు అమర్చారు. ఒక డ్రోన్ ద్వారా ఆకాశం నుంచి తనిఖీ చేస్తున్నారు. 2 కుంకీ ఏనుగులు కూడా పాల్గొంటున్నాయి. చిరుతను పట్టుకుంటామని అధికారులు తెలిపారు. నవ వివాహితున్ని బలిగొన్న మృగం -
ఇద్దరిని బలిగొన్న ఆర్టీసీ బస్సు
తుమకూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు, బైకును ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. జిల్లాలోని తిపటూరు తాలూకా మత్తిహళ్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. బస్సు ఢీకొని అయ్యనబావి నివాసులు ఉమేష్ (32), రజనీకాంత్ (33) మరణించారు. మత్తిహళ్లి గ్రామంలో కూలిపనులు చేసుకుని స్వగ్రామానికి వాపసు వస్తున్నారు. ఆ సమయంలో తిపటూరు వైపు నుంచి కుందాపుర వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు వారిని నేరుగా ఢీకొనింది. ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడే కన్నుమూశారు. బస్సు డ్రైవర్పై హొన్నవళ్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనాస్థలిలో కుటుంబాల రోదనలు మిన్నంటాయి. వరద ప్రాంతాల్లో సమీక్ష ● మంత్రులకు సీఎం ఆదేశం శివాజీనగర: రాష్ట్రంలో వర్షంతో హానికి గురైన ప్రాంతాలకు తక్షణమే వెళ్లి సమీక్ష చేయాలని సీఎం సిద్దరామయ్య, జిల్లా ఇన్చార్జి మంత్రులకు, కార్యదర్శులకు ఆదేశించారు. ఈ నెల 30, 31న అన్ని జిల్లాధికారులు, జిల్లా పంచాయితీ సీఈఓ తదితరులతో వర్ష హాని గురించి సమావేశం అవుతానని తెలిపారు. వరద నష్టాల గురించి బుధవారం సీఎం సమీక్ష చేశారు. వరద బాధిత జిల్లాల్లో ప్రమాదాలు జరగకుండా సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. 170 తాలూకాలకు హాని రాష్ట్రంలో 170 తాలూకాలు వరద బీభత్సానికి గురైనట్లు సర్కారు తెలిపింది. బెంగళూరు పాలికె పరిధిలో 201 స్థలాలు వరదలకు గురయ్యాయి. మే 26 వరకు వర్షంతో రాష్ట్రంలో 45 ఇళ్లు కూలిపోగా, 1385 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చినట్లు సీఎంఓ తెలిపింది. మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం వాయిదా! శివాజీనగర: చాలా రోజులుగా ఎదురు చూస్తున్న బెంగళూరు మెట్రోలో ఎల్లో లైన్లో సంచారానికి మళ్లీ ఆటంకం ఏర్పడింది. సిగ్నలింగ్లో సమస్య వచ్చినట్లు బీఎంఆర్సీఎల్ తెలిపింది. ఆర్వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు సంచరించే ఎల్లో మార్గంలో మెట్రో రైలు సర్వీసులు జూన్ నుంచి మొదలవుతాయని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు కూడా అదే ఆశతో ఉన్నారు. కానీ సిగ్నలింగ్లో సమస్య రాగా దీనిని సరిచేసేందుకు నెల రోజులు కావాల్సి ఉంది. అందుచేత జూన్లో ఆరంభం అనుమానమేనని తెలిసింది. ఈ మార్గంలో రైలు పరీక్షలు పూర్తయ్యాయి, రైల్వే మండలి ఆమోదం తెలిపింది. ఫైనల్ దశ పరిశీలన కోసం త్వరలోనే మెట్రో రైలు సురక్షతా కమిషనర్ రావాల్సి ఉంది. ఇంతలో సిగ్నలింగ్లో సాంకేతిక లోపం బయటపడింది. సిగ్నలింగ్ కాంట్రాక్ట్ను చేపట్టిన సీమెన్స్ నిపుణులు ఇటీవల సిగ్నలింగ్ వ్యవస్థను తనిఖీ చేశారు. ఆ సమయంలో సాఫ్ట్వేర్ డేటా సెట్లలో లోపం కనిపించింది. పొగాకు ఉత్పత్తులపై వేటు యశవంతపుర: ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ–సిగరెట్, వేపింగ్ సాధనాలను, హుక్కాను నిషేధించినట్లు నగర పోలీసు కమిషనర్ బి.దయానంద తెలిపారు. మాల్లు, కాఫీ బార్లు తదితరాలలో నిత్యం తనీఖీలు చేయాలని పోలీసులకు సూచించారు. పొగాకు ఉత్పత్తుల వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్లు తీసుకోవాలన్నారు. ప్రజలలో కూడా జాగృతి తీసుకురావాలన్నారు. 2024–25లో బెంగళూరు నగరంలో సిగరెట్లతో పాటు పొగాకు కేంద్రాలపై 57,130 కేసులను నమోదు చేసి రూ.80.8 లక్షలు జరిమానాలు విధించినట్లు తెలిపారు. విశ్వ ధూమపాన దినం సందర్భంగా ఈ నెల 27వ నుంచి జూన్ 2 వరకు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
నైజీరియన్ అరెస్టు, రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని అమృతహళ్లి పోలీసులు భారీ ఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయిని స్వాధీనపరచుకుని ఆఫ్రికన్ని అరెస్టు చేశారు. వివరాలు.. నైజీరియాకు చెందిన పేపె మోరె పేయి(43) అనే డ్రగ్స్ నేరగాన్ని పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి సుమారు రూ.3 కోట్ల విలువ చేసే 3 కేజీల డ్రగ్స్, గంజాయిని జప్తు చేశారు. అమృతహళ్లి లో ఎండీఎంఏ క్రిస్టల్, గంజాయిని నిందితుడు విక్రయించేవాడు. రెండేళ్ల కిందట వ్యాపార వీసాతో ఇండియాకు వచ్చిన పేపె.. హెబ్బాళలోని టాటానగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదన కోసం డ్రగ్స్ వ్యాపారిగా మారాడు. కమ్మనహళ్లి లో మరో విదేశీ వ్యక్తి నుంచి ఎండీఎంఏను కొనుగోలు చేసి వస్త్ర వ్యాపారం పేరుతో నగరంలో సంచరిస్తూ విక్రయించేవాడు. డ్రగ్స్, ఓ స్కూటర్, మొబైళ్లు, కొంత నగదును సీజ్ చేశారు. కావేరి నదిలో మెడికో గల్లంతు ● ముగ్గురు క్షేమం మైసూరు: కావేరి నదిలో స్నానానికి దిగి ఒకరు గల్లంతు కాగా, ముగ్గురు యువకులు ప్రాణాలతో బయట పడిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల తాలూకాలోని శివనసముద్ర దర్గా వెనుక భాగంలో జరిగింది. వివరాలు.. బెంగళూరులోని దయానంద సాగర్ మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు శివనసముద్ర వద్ద ప్రవహించే కావేరీ నది సందర్శనకు వచ్చారు. అక్కడ నది అందాలను చూసి పులకించిపోయారు. వీరిలో నందకుమార్, ప్రఫుల్, తుషార్, ప్రమోద్ అనే నలుగురు స్నానం చేయాలని నదిలోకి దిగారు. అయితే ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండగా నందకుమార్ నీటిలో కొట్టుకునిపోయాడు. మిగతా ముగ్గురిని స్థానికులు, కొళ్లెగాల అగ్నిమాపక కేంద్రం అధికారి అరుణ్కుమార్ సిబ్బంది కాపాడారు. గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు కొనసాగుతోంది. జై కనక దుర్గా మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామ చెరువు సమీపంలో వెలసిన దుర్గాదేవి దేవాలయంలో బుదవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని విశేషంగా పూలతో అలంకరించారు. అభిషేకంతో పాటు వేదమంత్ర పారాయణం నిర్వహించారు. హంసల మధ్యన కూర్చున్న భంగిమలో అమ్మవారిని పుష్పాలతో అలంకరించడం భక్తులను ముగ్ధుల్ని చేసింది. వందలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజల కోసం పనిచేయండి ● ఉప లోకాయుక్త వీరప్ప మండ్య: సామాన్య ప్రజల కోసం మంచి పనులు చేసేవారికి అవసరమైతే కాళ్లు కూడా మొక్కుతానని, కానీ అవినీతికి పాల్పడేవారికి ఉరి శిక్ష పడేలా చేస్తానని ఉపలోకాయుక్త బీ.వీరప్ప హెచ్చరించారు. బుధవారం మండ్య నగరంలోని అంబేడ్కర్ భవనంలో జిల్లా యంత్రాంగం నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన ప్రసంగిస్తూ కష్టపడి సంపాదించింది కొంత సొమ్మే అయినా సంతోషాన్ని ఇస్తుందని, అవినీతికి పాల్పడి ఎంత డబ్బు ఆర్జించినా మనశ్శాంతిని ఇవ్వదని అన్నారు. అధికారులు కానీ, ఎవరైనా కానీ ప్రజలకు మంచిచేస్తే పాదాభివందనాలు చేస్తానని, తప్పుడు పనులు చేస్తే మాత్రం ఉరిశిక్ష పడేలా చేస్తానని చెప్పారు. అవినీతి అనేది సామాన్యమైన రోగం కాదని, ఇది క్యాన్సర్ కంటే చాలా పెద్ద వ్యాధి అని అన్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే నయం కాదని అన్నారు. -
క్షమాపణలు చెప్పను: కమల్ హాసన్
కన్నడ భాష వివాదం నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోనంటూ స్పష్టం చేశారాయన. బుధవారం థగ్ లైఫ్ ఈవెంట్లో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో తనను విమర్శించిన నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ఈ ఇష్యూపై గందరగోళం నెలకొంది. అందుకే స్పష్టత ఇవ్వదల్చుకున్నా. చాలామంది చరిత్రకారులు(రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ..) నాకు భాష చరిత్ర గురించి పాఠాలు బోధిస్తున్నారు. కానీ, నాతో సహా రాజకీయ నాయకులెవరికీ భాష వ్యవహారంపై మాట్లాడే అర్హత లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. తమిళంతో పాటు మీనన్, రెడ్డి, అయ్యంగార్ ముఖ్యమంత్రులయ్యారు. చాలా కాలం కిందట కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడుకు సీఎం అయిన వ్యక్తి నుంచి నాకు సమస్య ఎదురైంది. ఆ సమయంలో కర్ణాటక నాకు మద్దతు ఇచ్చింది. ఎక్కడికీ వెళ్లొద్దు.. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోండి అంటూ కన్నడ ప్రజలు ప్రేమ చూపించారు. కాబట్టి ఇప్పుడు కూడా థగ్ లైఫ్, కమల్ హాసన్ను ప్రజలే చూసుకుంటారు.#WATCH | Thiruvananthapuram, Kerala: On his recent remarks where he said, 'Kannada was born out of Tamil', MNM President and actor Kamal Haasan says, "... What I said was said out of love and a lot of historians have taught me language history. I didn't mean anything. Tamil Nadu… pic.twitter.com/YjW8qAUIB3— ANI (@ANI) May 28, 2025భాషా వ్యవహారం చాలా లోతైన అంశం. నాతో సహా ఏ రాజకీయ నాయకుడికి దాని గురించి మాట్లాడే అర్హత లేదు. కాబట్టి ఈ చర్చను భాషా నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్లకు వదిలేయండి. శివన్న, ఆయన తండ్రి మీద ప్రేమతో ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడిందే తప్ప అందులో మరే ఉద్దేశం లేదు. ప్రేమతోనే మాట్లాడినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఆ పని చేయను’’ అని కమల్ అన్నారు. ఇటీవల చెన్నైలో తన చిత్రం థగ్ లైఫ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని శివరాజ్ కుమార్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కన్నడ సంఘాల నాయకులు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. ‘కన్నడ- కస్తూరి’ అనే విషయాన్ని ఆ నటుడు మర్చిపోయినట్లు ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. రెండున్నర వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భాషను కమల్ మర్చిపోయినట్లు ఉందని సీనియరు నటుడు జగ్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్ర ప్రదర్శనను కర్ణాటకలో అడ్డుకుంటామని వివిధ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆయనపై నిషేధం విధిస్తామని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ తదితరులు కమల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. -
ఔషధ దుకాణాల్లో మత్తు పదార్థాలు అమ్మొద్దు
రాయచూరు రూరల్: జిల్లాలో మత్తు పదార్థాలను మందుల దుకాణాల్లో విక్రయించరాదని, మత్తు పదార్థాల నియంత్రణకు సహకరించాలని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో మందుల దుకాణాల వ్యాపారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడరాదన్నారు. రోగులకు ఔషధాలు ఇచ్చే ముందు వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. మత్తు పదార్థాల సేవనంతో అనారోగ్యానికి తోడు మానసికంగా కుంగిపోతారన్నారు. -
బస్సుల్లో దొంగతనాలు.. అత్తా కోడలు అరెస్టు
కెలమంగలం: బస్సులో ప్రయాణికుల వద్ద డబ్బులు దొంగలించుకెళ్లిన అత్తా, కోడలిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. డెంకణీకోట సమీపంలోని జారకాలట్టి గ్రామానికి చెందిన మహిళ గత నెల 30వ తేదీన క్రిష్ణగిరిలో బంగారం కొనాలని రూ. లక్ష నగదుతో బస్సులో బయల్దేరింది. బస్సు దిగాక చూసుకుంటే డబ్బులు కనిపించలేదు. డెంకణీకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా, బస్టాండు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన అలమేలు (45), కోడలు భువన (22)ను అరెస్టు చేశారు. విచారణ చేయగా తామే దొంగతనం చేశామని చెప్పారు. బస్సుల్లో ప్రయాణిస్తూ డబ్బు, బంగారం కొట్టేస్తుంటామని తెలిపారు. వీరిపై కడలూరు, కల్లకురిచ్చి, పెరంబలూరు, సేలం, తంజావూరు, తిరుచ్చి, విళ్లుపురం పోలీస్ స్టేషన్లలో 11 చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
31న క్యాన్సర్ పరీక్ష శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 31న ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ఏర్పాటు చేసినట్లు బెట్టదూరు ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ జయ ప్రకాష్ పాటిల్ వెల్లడించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రిలో కలబుర్గి హెచ్సీజీ క్యాన్సర్ కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. స్తన, గర్భకోశ, శ్వాసకోఽశ, థైరాయిడ్, రక్త, లుకేమియా వంటి వ్యాధులకు చికిత్స అందిస్తారన్నారు. అక్రమ రేషన్ బియ్యం పట్టివేతహొసపేటె: నగర శివార్లలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బియ్యాన్ని తరలిస్తున్న వాహనంతో పాటు నిందితులను పట్టుకున్నారు. తాలూకా శివార్లలోని జంబునాథ ఆలయం మీదుగా జాతీయ రహదారి–67లో బళ్లారి నుంచి హుబ్లీ మార్గంలో వస్తున్న వాహనంపై పోలీసులు దాడి చేసి, బియ్యాన్ని పట్టుకుని, నిందితులను అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న రూ.11.33 లక్షల విలువ చేసే బియ్యం పట్టుబడిందని అధికారులు పేర్కొన్నారు. అలాగే బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని జప్తు చేశారు. ఈ రెండింటి విలువ మొత్తం రూ.38.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కాగా లారీ యజమాని ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు హొసపేటె రూరల్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రైలును బళ్లారి, గుంతకల్లు మీదుగా నడపాలి సాక్షి,బళ్లారి: సింధనూరు నుంచి బెంగళూరుకు వయా కారటగి, గంగావతి, హుబ్లీ మీదుగా రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అయితే సింధనూరు–హుబ్లీ–బెంగళూరు రైలు మార్గం మధ్య దూరం 681 కిలోమీటర్లు అవుతుందని రైల్వే క్రియాశీల సమితి నేత కేఎం మహేశ్వరయ్యస్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మార్గం మీదుగా ప్రయాణం వల్ల చాలా సమయం తీసుకోవడంతో పాటు ప్రయాణికులకు టికెట్ ధర భారం అవుతుందని తెలిపారు. ఈ రైలు సర్వీసును బళ్లారి, గుంతకల్లు మీదుగా బెంగళూరుకు నడిపితే మధ్య దూరం 502 కిలోమీటర్లు అవుతుందన్నారు. దీని వల్ల ప్రయాణికులకు డబ్బులతో పాటు సమయం కలిసి వస్తుందన్నారు.హైదరాబాద్, చైన్నె, తిరుపతి,వెళ్లే ప్రయాణికులకు గుంతకల్లులో పలు రైళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అందువల్ల సింధనూరు, బెంగళూరు రైలును బళ్లారి, గుంతకల్లు మీదుగా నడిపేందుకు సంబంధిత రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. హత్యలను నియంత్రించండి రాయచూరు రూరల్: నగరంలో హత్యల నియంత్రణకు పోలీస్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కర్ణాటక రాష్ట్ర ది లెజెండ్ టిప్పుసుల్తాన్ సంఘం అధ్యక్షుడు రషీద్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నగరంలో గత ఏడాది నుంచి నగరంలో గంజాయి, హఫీం వంటివి అధికంగా విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. రహదారుల్లో ప్రతి నిత్యం యువకులు మద్యం తాగి కేరింతలు కొడుతూ ట్రాపిక్ జామ్ చేస్తూ అల్లర్లకు పాల్పడుతున్నారన్నారు. నగరంలో రాత్రి 10 గంటల అనంతరం దుకాణాలు, హోటళ్లను బంద్ చేయడానికి పోలీసులు ముందుకు రావాలన్నారు. నగరంలో ఆరు మంది హత్యకు గురయ్యారన్నారు. భాషాభివృద్ధికి పాటు పడదాం సాక్షి,బళ్లారి: రక్షణ వేదిక కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్క కన్నడిగులు నేల, నీరు, సంస్కృతి సంపద్రాయాల విషయంలో అన్యాయం జరిగినప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలని కరవే ప్రవీణ్శెట్టి వర్గం నేత హర్దగేరి రామణ్ణ సూచించారు. ఆయన బుధవారం కరవే ఆధ్వర్యంలో కనక దుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా, వివిధ తాలూకాల పదాధికారులు నియామక ఆదేశ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ సంఖ్యలో వచ్చి వేదికలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అయితే పోరాటాలు చేస్తూ తమ హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు వచ్చినప్పుడు సంఘటితం కావాలన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని, తాము పోరాటాలకు ఎప్పుడూ సహకారం అందిస్తామన్నారు. కరవే ప్రముఖులు తిమ్మారెడ్డి, వీరారెడ్డి, ఉమేష్గౌడ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
సెంట్రల్ జైలులో నిందితుల రాద్ధాంతం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలోని జైళ్లలో పేరుగాంచిన, బ్రిటిష్ హయాంలో నిర్మించిన అప్పటి సెంట్రల్ జైలులో నిందితుల గొడవలు, రాద్ధాంతాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో పాటు, అందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని సెంట్రల్ జైలులో ఓ హత్య కేసులో నిందితులు లేనిపోని సాకులు చూపుతూ జైలు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. శివమొగ్గలో ఇటీవల జరిగిన భజరంగదళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో నిందితులను బళ్లారి సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే వీరి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతూ జైలు సిబ్బందికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం జైలులోని నిందితుల ఆగడాలు, కిరికిరి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జైలు ఉన్నతాధికారులకు ఏం చేయాలో పాలుపోక తికమక పడుతున్నారు. రోజూ ఏదో సాకుతో గొడవ ఈ కేసులో నిందితులు జిలాన్, సయ్యద్ నిహాల్ అనే ఇద్దరు జైలులో రోజుకు ఒకటి చొప్పున సమస్యను సాకుగా చూపుతూ జైలు సిబ్బందిని వేధిస్తున్నారు. ఇటీవల ఈ వివాదం పతాక స్థాయికి చేరడంతో సిబ్బంది, నిందితుల మధ్య వాగ్వాదం జరిగిన కీలక వీడియో దృశ్యాలు వైరల్ కావడం సర్వత్రా చర్చానీయాంశమైంది. హర్ష హత్య కేసులో నిందితుడైన జిలాన్ను ఇంతకు ముందు కలబుర్గి జైలులో ఉంచారు. అయితే కలబుర్గి జైలులో వసతులు సరిగా లేవని, అతడు ధార్వాడ జైలుకు మార్చుకున్నారు. అక్కడ కూడా వసతులు సరిగా లేవని ఫిర్యాదు చేసి, మరొక చోటకు తరలించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే జిలాన్ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. జిలాన్కు బళ్లారి జైలు వసతులు మింగుడు పడటం లేదు. ఈ కేసులో మరో నిందితుడు సయ్యద్ నిహాల్ను జిలాన్ కన్నా ముందే బళ్లారి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అధికారులు, సిబ్బందికి దినదిన గండం మొత్తం మీద ఈ ఇద్దరు నిందితులు ఒకచోట చేరడంతో మొత్తం సీన్ మారింది. జైలు అధికారులు, సిబ్బంది రోజుకు గండంలా తయారైంది. తమను ప్రత్యేకంగా ఉంచరాదని, అందరితో పాటు ఉంచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాన్య ఖైదీలుగా ఉండేందుకు తమను వదలాలని, లేదా వేరే జైలుకు మార్చాలని పదే పదే డిమాండ్ చేస్తున్నట్లు, అది కూడా న్యాయవాది ద్వారాా చెప్పించేవారు. జైలు పాలనా నియమాలు వీటిని అంగీకరించకపోవడంతో ఉన్నఫళంగా వారికి వారే గొడవ పెట్టుకుని రాద్ధాంతం సృష్టించారని జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఇద్దరు ఏదో విషయమై రాద్ధాంతం సృష్టించినట్లు తెలియడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. గొడవల నేపథ్యంలో ఇద్దరిపీ వేర్వేరు సెల్లో ఉంచామని జైలు అధికారులు తెలిపారు. కాగా శివమొగ్గ హర్ష, దక్షిణ కన్నడ ప్రవీణ్ నెట్టార్ హత్య కేసుల్లోని నిందితులు కూడా బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్నారు. వీరందరినీ సాధారణ ఖైదీలుగా ఉంచామని జైలు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అధికారులకు తలనొప్పిగా మారిన వైనం -
ఆ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాధికారి ఫౌజియ తరన్నంను నిందించిన విధాన పరిషత్ సభ్యుడు రవికుమార్పై చర్యలు తీసుకోవాలని తెహ్రిక్–ఏ–నిసా మైనార్టీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కలబుర్గి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు రబియా ఖానం మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్ ఒక ఉత్తమ జిల్లాధికారిని అవమానించడం తగదన్నారు. బాధ్యుడైన ప్రజాప్రతినిధిపై చర్యలు చేపట్టాలని కోరుతూ పోలీస్ కమిషనర్ శరణప్ప ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. పాఠశాలల మూసివేత సరికాదు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కన్నడ పాఠశాలలను మూసివేయడం తగదని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. బుధవారం తాలూకాలోని విజయనగర క్యాంప్లో తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ప్రీతి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలకు పైగా ప్రభుత్వ కన్నడ పాఠశాలలను మూసివేతకు కుట్ర చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని కోరుతూ సంతకాల సేకరణ చేశారు. కమల్ వ్యాఖ్యలపై కరవే ఆందోళన రాయచూరు రూరల్: తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ప్రముఖ సినీ నటుడు కమల హాసన్ చేసిన వ్యాఖ్యలను కరవే తీవ్రంగా ఖండించింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్లో చేపట్టిన ఆందోళనలో కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడారు. కమల్ హాసన్ వ్యాఖ్యలను ఖండిస్తూ అతని చిత్రపటానికి పాదరక్షలతో దండించారు. అనంతరం చిత్రపటాన్ని తగలబెట్టారు. తాను చేసిన వ్యాఖ్యలను కమల్ హాసన్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారీగా గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్ హుబ్లీ: గబ్బూరు సమీపంలోని కుందగోళ క్రాస్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని బెండిగేరి పోలీసులు, సీసీబీ విభాగం సిబ్బంది సంయుక్తంగా కార్యాచరణ చేపట్టి అరెస్ట్ చేశారు. హావేరికి చెందిన మహమ్మద్ షాహిద్, రెహమాన్ బేగ్, నిసార్ అహమ్మద్ అరెస్ట్ అయిన నిందితులు. వీరి నుంచి రూ.12.64 లక్షలు విలువ చేసే 10.5 కేజీల గంజాయి, మూడు మొబైళ్లు, కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పునర్వసతి కల్పించాలని డిమాండ్రాయచూరు రూరల్: హస్మియా కాలనీ వాసులకు పునర్వసతి కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. బుధవారం హస్మియా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 40 ఏళ్ల నుంచి హస్మియా ప్రాంతంలో నివసిస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారులు ఉన్నఫళంగా వాహనాలతో వచ్చి స్థలాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వకుండా తొలగించారని ఆరోపించారు. హస్మియా స్థలం వక్ఫ్ బోర్డుది కాదని, ప్రభుత్వ స్థలమని అన్నారు. తమకు ప్రత్యామ్నాయ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి హుబ్లీ: తాలూకాలోని సిరగుప్పి గ్రామం వద్ద హుబ్లీ–గదగ్ హైవే సమీపంలోని డాబా వద్ద టాటా ఏస్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఫలితంగా ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. బుధవారం ఉమచిగి గ్రామానికి చెందిన చంద్రయ్య హుబ్లీమఠ(70) రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతూ మృతి చెందారు. టాటాఏస్ వాహనం డ్రైవర్ సమీర్ ఉదగట్టి తన ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ను కేఎంసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డెక్కిన ఉపాఽధి కూలీలు
సాక్షి,బళ్లారి: రెక్కాడితే కాని డొక్కాడని వ్యవసాయ కూలీలతో పనులు చేయించుకుని నెలల తరబడినా చేసిన పనికి సంబంధించిన కూలి సొమ్ము ఇవ్వకపోవడంతో వ్యవసాయ కూలీలు రోడ్డెక్కారు. బుధవారం ఏఐకేకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రతి రోజు ఉదయం సద్ది మూట కట్టుకుని ఉపాధి హామీ పనులకు వెళ్లి పని చేసి వస్తున్నామన్నారు. కూలీ ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలు ఎలా గడవాలని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. జిల్లా పంచాయతీ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపారు. ఐదు, పది రోజుల్లో డబ్బు జమయ్యేవి అనంతరం జరిగిన సమావేశంలో ఏఐకేకేఎంఎస్ జిల్లాధ్యక్షుడు గోవింద్, కార్యదర్శి గుర్రళ్లి రాజ మాట్లాడుతూ ప్రతి ఏటా ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఐదు లేదా 10 రోజుల్లో వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేవన్నారు. అయితే ఈ ఏడాది అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. కూలీలకు పనులు చేసిన తర్వాత డబ్బులు రాకపోతే వారు ఎలా జీవనం సాఽగించాలని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు వారికి జీతాలు రాకపోతే వెంటనే పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని, అదే కూలీలకు ఎందుకు సకాలంలో చెల్లించడం లేదని ప్రశ్నించారు. కూలీల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని మండిపడ్డారు. ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. తక్షణం కూలి సొమ్ములు విడుదల చేయాలని కోరారు. ఆందోళనలో ఏఐకేకేఎంసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెలల తరబడి అందని సొమ్ము జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా -
జూన్ 6న మాదేవ చిత్రం విడుదల
రాయచూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6న మాదేవ చిత్రం విడుదల కానుందని కన్నడ చలన చిత్ర నటుడు వినోద్ ప్రభాకర్ వెల్లడించారు. ఆయన మంగళవారం రాత్రి మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వాములను దర్శనం చేసుకున్నారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం తనను కలసిన విలేఖర్లతో ఆయన మాట్లాడారు. తండ్రి బాటను అనుసరించి నటన చేయడం లేదన్నారు. మాదేవ చిత్రం విజయ వంతం కావాలని ఆలయాల దర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు. మైసూరు శాండల్ సోప్లకు రాయబారిగా తమన్నా భాటియాను నియమించడంపై మాట మార్చారు. నందిని పాల ఉత్పత్తులకు డాక్టర్ పునీత్ రాజ్కుమార్ను రాయబారిగా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు అవకాశం లభిస్తే తాను కూడా రాయబారిగా పని చేస్తానన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు నాయకులే అడ్డు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి ఆంజనేయ, మంత్రి ప్రియాంక ఖర్గే కారణమని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర ఆరోపించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ జాబితాలో కొరమ, కొరచ, బోవిలను తొలగించాలన్నారు. మల్లికార్జున ఖర్గే, ఆంజనేయ, ప్రియాంక ఖర్గే అంటరానితనం నిర్మూలనకు కృషి చేయకుండా అంబేడ్కర్ ఆశయాలకు తిలోదకాలు వదులుతున్నారన్నారు. మాజీ మంత్రి ఆంజనేయ ఆది కర్ణాటక అని, మాదిగ అని ఎక్కడా ప్రస్తావన చేయలేదన్నారు. నాడు అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. బేడ జంగమలను ఎస్సీ జాబితాలో చేర్చడం తగదని కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి ఆంజనేయ, మంత్రి ప్రియాంక ఖర్గే ప్రకటనలను ఇవ్వడం మాని నిజమైన మాదిగలకు న్యాయం చేకూర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఖర్గే, ఆంజనేయ అంబేడ్కర్ వ్యతిరేక వాదులు ఎస్సీ జాబితా నుంచి కొరమ, కొరచ, బోవి కులాలను తొలగించాలి అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణం అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర -
బడి.. అసౌకర్యాల ఒడి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం ప్రాధాన్యత, అవసరాన్ని గుర్తించి అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు పలు రకాల పథకాలను రూపొందించి అమలు జరుపుతోంది. ప్రత్యేకంగా ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలలను నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని భావించి పాఠశాల స్థాయి నుంచి హైస్కూల్ స్థాయి వరకు విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఈ కమిటీలతో విద్యా రంగంలో మార్పులు వస్తాయని ఆశించారు. కేవలం పదవులకు మాత్రమే కమిటీలని, ఆశించిన మేర ప్రోత్సాహం కనుమరుగు కావడంతో పేరుకు మాత్రమే కమిటీలున్నా ఫలితం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలోని పాతబడిన రాయచూరు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం మరమ్మతులకు రూ.5 కోట్ల నిధులు విడుదల చేసినా పనులు మాత్రం అలాగే మిగిలాయి. పాఠశాలల్లో కనీస వసతులు కరువు కళ్యాణ కర్ణాటకలోని ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూల్ స్థాయిలో పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయి. ప్రతి పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్వహణలో అధికారులు పట్టించుకోవడం లేదు. భవనాలకు తక్కువ మోతాదులో నిధుల విడుదలతో పనులు జరగకుండా పోతున్నాయి. పాఠశాలలో తాగునీటి ఎద్దడి, మూత్రశాలలు, మరుగుదొడ్లు, రక్షణ గోడలు, కిటికీలు, తలుపులు లేకపోవడం విచిత్రంగా ఉంది. ప్రజలు చెత్తాచెదారం వేసి పరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారాయి. పాఠశాల పక్కనే మురుగు గుంటలున్నాయి. దుర్వాసన వెదజల్లుతుంటే విద్యార్థులు విద్యనభ్యశించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలకు సెలవులు ప్రకటిస్తే పందులు, పశువులు స్వైర విహారంతో పాటు మరుగుదొడ్డిగా, రాత్రి వేళ బిచ్చగాళ్లకు నిలయంగా మారుతోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా అంద్రూన్ కిల్లా పాఠశాల భవనం మాత్ర ం శిథిలావస్థకు చేరింది. కల్యాణ కర్ణాటకలో పాఠశాలలు అధ్వానం అరకొర సౌకర్యాలతో చదువులు సాగేదెలా? పట్టించుకోని పాలకులు, విద్యా శాఖ అధికారులు నేటి నుంచి జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడుల ప్రారంభం ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా అభివృద్ధి ప్రభుత్వం డీపీఈపీ, ఓబీబీ, సాక్షరత, బాల కార్మిక, ఇతర పథకాల పేరుతో రూ.కోట్ల మేర నిధులు ఖర్చు పెట్టినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా విద్యా శాఖ నిర్వీర్యమైంది. విద్యార్థులకు చెట్ల కింద, దేవాలయాల్లో పాఠాలు బోధించే స్థితి నెలకొంది. ఈ నెల 29 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో 250, కొప్పళ జిల్లాలో 222, యాదగిరి జిల్లాలో 158, బీదర్ జిల్లాలో 211, విజయ నగర జిల్లాలో 96, కలబుర్గి జిల్లాలో 258 పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి. ఈ విషయంలో శాసన సభ్యులు, మంత్రులు, లోక్సభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు మౌనం వహించారు. 4518 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడానికి సర్కార్ ఆదేశాలు జారీ చేయకుండా అతిథి ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయించాలని చూస్తోంది. -
మత్తు పదార్థాలను అరికడదాం
రాయచూరు రూరల్ : జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లాధికారి నితీష్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని నవోదయ వైద్య కళాశాల ఆవరణలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మాదక వ్యసనాల నుంచి విముక్తిపై ప్రచారాందోళనలో పాల్గొని మాట్లాడారు. నేటి తరం యువకులు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారన్నారు. యువకులు దురలవాట్లకు గురై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మత్తు పదార్థాల సేవనంతో ఆరోగ్యంతో పాటు మానసికంగా కుంగిపోతారన్నారు. యువత గంజాయి, హఫీం వంటి వాటికి బానిసలు కాకుండా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ఒక్కరోజులోనే 9 కేసులను నమోదు చేశామని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. కార్యక్రమంలో డ్రగ్స్ నియంత్రణాధికారి ఉదయ్ కిశోర్, అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ దేవానంద్లున్నారు. -
పేదలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వండి
రాయచూరు రూరల్: నగరంలోని మురికి వాడల్లో నివసించే పేద ప్రజలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వాలని మురికి వాడల క్రియా వేదిక అధ్యక్షుడు జనార్దన్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్ల నుంచి మురికి వాడల్లో నివసిస్తున్న వారికి నగరసభ అధికారులు, నగర ప్రాధికార అధికారులు మౌనం వహించారన్నారు. నగర ప్రాంతంలో నివసించే వారి కోసం ఇళ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. 2024లో 3.36 లక్షల మందిలో కేవలం 1.64 లక్షల మందికి హక్కు పత్రాలను అందించారన్నారు. కానీ వారికి ఇళ్ల స్థలాలను కేటాయించడంలో ఆర్డీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. ప్రభుత్వం మురికి వాడల ప్రజలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వాలన్నారు. -
క్యారం పోటీల్లో ప్రథమ స్థానం
సాక్షి,బళ్లారి: క్యారం బోర్డు ఆట ఎంతో ఉత్కంఠమైన ఆటగా చెప్పవచ్చు. పిల్లలు, పెద్దలు ఇంటి పట్టునే ఉండి చక్కగా క్యారంస్ ఆడతారు. కాగా హైదరాబాద్ ప్రగతి నగర్లో సీనియర్ సిటిజన్స్ సంఘం ఏర్పాటు చేసిన క్యారం పోటీల సీనియర్స్ ఏ బృందంలో సంఘం శాశ్వత సభ్యుడు, జిల్లా సమాచార శాఖ విశ్రాంత డీడీ చంద్రకాంత్ ప్రథమ స్థానంలో నిలిచారు. చంద్రకాంత్ కేవలం 9.35 నిమిషాల్లో బోర్డులోని అన్ని 9 కాయిన్లను ప్యాకెట్లో వేసి విజయాన్ని అందుకున్నారు. సంఘం మరో సభ్యుడు టీవీ సీతారామారావు 10.35 నిమిషాలతో రెండో, కోటేశ్వరరావు 10.51 నిమిషాలతో మొత్తం కాయిన్లను ప్యాకెట్లోకి వేసి మూడో బహుమతి సాధించారు. జూనియర్స్ బీ.బృందంలో కేఎస్ఎల్ శాస్త్రి ప్రథమ, జే.నాగిరెడ్డి ద్వితీయ, సంఘం కార్యదర్శి ఈ.పుల్లయ్య తృతీయ బహుమతులను చేజిక్కించుకున్నారు. ఏ బృందంలో 14 మంది, బీ బృందంలో 15 మంది పాల్గొన్నారు. సంఘం సభ్యులు కామేశ్వరరావు, హరినాథ్ పోటీల నిర్వాహకులుగా వ్యవహరించగా, ఆ సంఘం అధ్యక్షుడు కామయ్య విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
నెహ్రూ సేవలు అనన్యం
రాయచూరు రూరల్ : దేశానికి దివంగత మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు చేసిన సేవలు అనన్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. అత్యంత ప్రభావశాలి ప్రధానమంత్రిగా దేశంలో పంచశీల సూత్రాలను అమలు చేశారని కొనియాడారు. జయంతిరావ్, జాగీర్దార్, మరిస్వామి, మంజుల, సురేఖ, రాణి, మాలా, శశికళ, రంగరాజ్, ఈరణ్ణ, చేతన్, వెంకణ్ణలున్నారు. రాణా ప్రతాప్సింగ్ జయంతి రాయచూరు రూరల్ : నగరంలో రాజపుత్ సమాజం ఆధ్వర్యంలో రాణా ప్రతాప్ సింగ్ 485వ జయంతిని వైభవంగా నిర్వహించారు. నగరంలోని మావినకెరె చెరువు వద్ద నెలకొల్పిన రాణా ప్రతాప్ సింగ్ ప్రతిమకు రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. సమాజం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలన్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో జయంతిరావ్, శాంతప్ప, రమేష్, శ్రీనివాసరెడ్డి, రుద్రప్ప, నరసింహులు, మనోహర్ సింగ్, వెంకటసింగ్, శంకర్సింగ్, మాన్సింగ్లున్నారు. ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించండిరాయచూరు రూరల్: త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నగరసభలో ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్టీ నేతల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఒకరు మాత్రమే సభ్యులుగా కొనసాగుతున్నారన్నారు. భవిష్యత్తులో నాయక్ వర్గానికి 7 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించేలా చూడాలని జిల్లాధికారి, నగరాభివృద్ధి ప్రాధికార మంత్రికి లేఖలు రాశామన్నారు. జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ కోటాను పెంచాలన్నారు. బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్రాయచూరు రూరల్: హస్మియా రక్షణ గోడల తొలగింపుతో వీధిన పడ్డ నివాసులకు పునర్వసతి ఏర్పాటు చేయాలని బీజేపీ ఎస్పీ యువమోర్చా అధ్యక్షుడు సన్నీ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 40 ఏళ్ల నుంచి హస్మియా ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఉన్నఫళంగా ఆక్రమించిన స్థలాల్లో దుకాణాలు, హోటళ్లు నిర్మించుకున్న వారందరూ స్థలాలను ఖాళీ చేయాలని వారం రోజుల క్రితం ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా తొలగించడాన్ని ఖండించారు. వక్ఫ్ బోర్డు అధికారులు తొలగిస్తున్న తరుణంలో కలబుర్గి హైకోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలు వచ్చినా అధికారులు పునర్వసతి కల్పించకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. హస్మియా రక్షణ గోడ వక్ఫ్ బోర్డుది కాదు, ప్రభుత్వ స్థలమని అన్నారు. ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఒత్తిడి చేశారు. రాయచూరు, కలబుర్గిల్లో భారీ వర్షం రాయచూరు రూరల్: రాయచూరు, కలబుర్గి జిల్లాల్లో సోమవారం సాయంత్రం రెండు గంటల పాటు జడి వానతో కూడిన భారీ వర్షం కురిిసింది. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా రహదార్లు బురద గుంటలుగా మారాయి. అరబ్ కాలనీ పక్కనే వంతెన ఉండడంతో ఆ నీరు కాలనీలోకి ప్రవేశించాయి. రంగ మందిరం వెనుక, జహీరాబాద్ కాలనీలో పెద్ద చెట్లు కూలిపోవడంతో విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఐదేళ్ల లోపు పిల్లలకు టీకాలు తప్పనిసరి
హొసపేటె: జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఈ నెల 31 వరకు, జూన్ 23 నుంచి 28 వరకు ప్రత్యేక టీకా అభియాన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆర్సీహెచ్ అధికారి జంబయ్య తెలిపారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో కల్లహళ్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ప్రత్యేక టీకా ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని పిల్లలందరూ టీకాలు వేయించుకోవడం తప్పనిసరి అన్నారు. ముఖ్యంగా టీకాలు వేయని పిల్లలకు ప్రత్యేక టీకా అభియాన్లో టీకాలు వేస్తారన్నారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు తప్పకుండా టీకాలు వేయించాలని అన్నారు. కార్యక్రమంలో తాలూకా ఆరోగ్య అధికారిణి డాక్టర్ వినోద, జిల్లా ఆరోగ్య విద్య అధికారి ఎంపీ.దొడ్డమని, జిల్లా ఆరోగ్య ఇన్స్పెక్టర్ ఎం.ధర్మనగౌడ, ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ అధికారిణి లత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నందిని, ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సమర్థకు రాష్ట్రస్థాయి ద్వితీయ ర్యాంక్
హుబ్లీ: ధార్వాడ కేఈ బోర్డు ఆంగ్ల మాధ్యమ హైస్కూల్ విద్యార్థి సమర్థ ఉమర్జి 10వ తరగతి పరీక్షల రీవాల్యుయేషన్లో 624 మార్కులు సాధించి రాష్ట్రానికి ద్వితీయ, జిల్లాకు ప్రథమ స్థానంలో నిలిచారు. తొలుత వెల్లడైన ఫలితాల్లో సమర్థకు 619 మార్కులు మాత్రమే వచ్చాయి. అనంతరం రీవాల్యుయేషన్ జరపగా గణితంలో 80, ఇంగ్లిష్లో 79 మార్కులు సాధించి తన ప్రతిభను చాటాడు. కాగా తొలుత వెల్లడైన ఫలితాల మేరకు గణిత శాస్త్రంలో 76, ఇంగ్లిష్లో 78 మార్కులు వచ్చాయి అంటే ఇంగ్లిష్లో 1 మార్కు, గణిత శాస్త్రంలో అదనంగా మరో 4 మార్కులు సాధించాడు. కాగా రీవాల్యుయేషన్లో పలు విద్యార్థుల మార్కులు గణనీయంగా పెరగడం గమనార్హం. బురదమయంగా ఏపీఎంసీ మార్కెట్ హొసపేటె: వర్షం కారణంగా ఏపీఎంసీ మార్కెట్ బురదమయంగా మారడంతో అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. గతవారం నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. నగరంలోని ఏపీఎంసీ మార్కెట్ పూర్తిగా చిత్తడిగా మారడంతో వినియోగదారులకు, వ్యాపారులకు నానా ఇబ్బందులు తలెత్తాయి. భారీ వర్షం కారణంగా వ్యాపారులు, వినియోగదారులు వర్షంలోనే వ్యాపారాలు నిర్వహించడం కనిపించింది. ఉదయం కురిసిన భారీ వర్షం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన పడ్డారు. మహిళ కడుపులో 2 కేజీల గడ్డ తొలగింపు ● చిటగుప్పి ఆస్పత్రి వైద్య బృందం ఘనత హుబ్లీ: వాణిజ్య నగరి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్ నిర్వహణలోని చిటగుప్పి ఆస్పత్రి తాజాగా ఓ ఘనత సాధించింది. ఓ మహిళ కడుపులోని సుమారు 2 కేజీల బరువైన గడ్డను ఆపరేషన్ చేసి వైద్యులు తొలగించారు. ఉన్న స్వల్ప సౌకర్యాలతోనే ఈ క్లిష్టకరమైన ఆపరేషన్ చేసి మహిళకు పునర్జన్మ ప్రసాదించారు. మహిళలకు సురక్షితమైన కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఈ ఆస్పత్రి పేరుగాంచింది. ప్రస్తుత ఆస్పత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ దండెప్పనవర్ నేతృత్వంలో ఫైబ్రాయిడ్ చికిత్స కోసం దాఖలైన మహిళకు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. సదరు మహిళ రక్తహీనతతో బాధపడుతుండేది. దీంతో ఆమెకు నిస్సత్తువ, నడవడానికి వీలు కాని పరిస్థితి ఉండేది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోవడంతో చివరికి ఈ ఆస్పత్రిలో చేరారు. ఈమెను పరీక్షించగా కడుపులో గడ్డ ఉండడాన్ని గుర్తించిన వైద్య బృందం ఆమెకు ఒకటిన్నర గంట పాటు ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగా ఉంది. ముందు జాగ్రత్తే డెంగీకి మందు హొసపేటె: ప్రజల సహకారం, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా మాత్రమే డెంగీ కట్టడి సాధ్యమని జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అక్రమ్ అలీ షా తెలిపారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సహకారంతో నిర్వహించిన జాతీయ డెంగీ దినోత్సవ జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ శాఖల ప్రయత్నాలతో మాత్రమే వ్యాధి వ్యాప్తిని, అనారోగ్యాన్ని నివారించడం అసాధ్యమని అన్నారు. డెంగీకి టీకా లేదా యాంటీ వైరల్ చికిత్స ద్వారా నివారణ తమకు ఉన్న ఉత్తమ ఎంపిక అన్నారు. డెంగీ వ్యాధి ఏడిస్ దోమలు పగటి పూట కుట్టడం వల్ల కలిగే వైరల్ వ్యాధి అన్నారు. డెంగీకి సకాలంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే దీనిని నివారించవచ్చన్నారు. జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ శంకర్నాయక్ మాట్లాడుతూ గత సంవత్సరం 314 డెంగీ జ్వరాల కేసులు నమోదయ్యాయన్నారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు. ఈఏడాది ప్రారంభంలో 14 కేసులు గుర్తించామన్నారు. ఈ సందర్భంగా వైద్యులు జంబయ్య, భాస్కర్ పాల్గొన్నారు. ఎల్ఎల్సీపై దారి నిర్మించండి హొసపేటె: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ఎల్ఎల్సీ కాలువ ఎడమ గట్టుకు ఆనుకుని ఉన్న భూమి దగ్గర ఒక పెద్ద గుంట ఏర్పడింది. దీని వల్ల ఎల్ఎల్సీ కాలువ ప్రమాదంలో పడింది. ఈ సంఘటన విజయనగర జిల్లాలోని నాగేనహళ్లి గ్రామ సమీపంలో జరిగింది. భారీ వర్షపు నీటి ప్రవాహం కారణంగా ఎల్ఎల్సీ కాలువ దగ్గర రహదారి పూర్తిగా మూసుకుపోయింది. ఎద్దుల బండ్లు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాలువకు అడ్డుగోడ నిర్మించాలని 2020 నుంచి రైతులు పలుమార్లు ఈ విషయంపై తుంగభద్ర బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఈనేపథ్యంలో అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి త్వరలో సమస్యను పరిష్కరించక పోతే టీబీ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతు సంఘం నేత గాళెప్ప హెచ్చరించారు. -
డిమాండ్ల సాధన కోసం ధర్నా
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో పాటు 19 డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, నీటి సరఫరా మినహా అన్ని సేవలను నిలిపి వేసి మంగళవారం నుంచి నిరవధిక ధర్నాకు దిగినట్లు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘం విజయనగర జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర వర్మ తెలిపారు. ఆయన ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ తమ డిమాండ్లను నెరవేర్చాలని తమ సంఘం ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. తమ అసోసియేషన్ కార్యనిర్వాహక సమావేశంలో నిర్ణయించిన విధంగా, ప్రభుత్వానికి గతంలో తెలియజేసినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకం, ఘన వ్యర్థాల నిర్వహణ వాహనాలకు డ్రైవర్ పోస్టుల కేటాయింపు, శాశ్వత అకౌంటెంట్ పోస్టు ఇంకా 19 ఇతర డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తమ ధర్నాను యథావిధంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. సల్మాన్ శేషన్న, రవికుమార్, భారతి, ఈరన్న, సురేష్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖ రాయబారిగా అనిల్ కుంబ్లే
● మంత్రి ఈశ్వర ఖండ్రె శివాజీనగర: మాజీ క్రికెట్ క్రీడాకారుడు అనిల్ కుంబ్లేను అటవీ, వన్యజీవి రాయబారిగా నియమించినట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. మంగళవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో కర్ణాటక వన్యజీవి మండలి ఉపాధ్యక్షుడిగా అనిల్ కుంబ్లే సేవలు అందించారన్నారు. ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అటవీ సంరక్షణ, అటవీ సంవర్ధక, వన్య సంరక్షణ, వన్యజీవి సంరక్షణపై ప్రజల్లో జాగృతి కల్పించేందుకు రాయబారిగా ఎంపిక చేశామన్నారు. అనిల్ కుంబ్లెకు వన్యజీవులపై అపారమైన ఆసక్తి ఉందన్నారు. ఆయన ఎలాంటి పారితోషకం తీసుకోకుండా రాయబారిగా ఉండేందుకు అంగీకరించారన్నారు. -
కుటుంబ కలహాలతో భార్య హత్య
విజయపుర(బెంగళూరు గ్రామీణ): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను డంబల్స్తో కొట్టి హతమార్చి తాను కూడా ఉరి వేసుకొన్న సంఘటన విజయపుర పట్టణంలోని 5వ వార్డు మారుతి నగరలోని విజయనగర లేఔట్లోని 2వ క్రాస్లో చోటు చేసుకుంది. శిడ్లఘట్ట డీవియేషన్ రోడ్డులో నివాసం ఉన్న వెల్డింగ్ దుకాణం యజమాని బసవాచారి(46) అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి తన భార్య సుమా(38)ను డంబల్స్తో కొట్టి హత్య చేసిన ఆనంతరం తాను కూడా ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హాసన జిల్లాకు చెందిన బసవాచారి విజయపురకు వచ్చి సుమారు 25 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కుమారులు 9వ తరగతి, 7వ తరగతి చదువుతున్నారు. విషయం తెలియగానే బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ సీ.కే.బాబా పరిశీలించారు. విజయపుర టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆపై తనూ ఆత్మహత్య చేసుకున్న భర్త -
నెహ్రూ ఆధునిక భారతదేశ నిర్మాత
శివాజీనగర: స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆధునిక భారత నిర్మాత అని సీఎం సిద్దరామయ్య అన్నారు. నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం విధానసౌధ తూర్పు ద్వారం వద్ద ఆయన విగ్రహానికి, ఫొటోకు సీఎం పుష్పమాల సమర్పించారు. దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు నిబద్ధతతో పనిచేశారన్నారు. మిశ్రమ ఆర్థికత వ్యవవస్థను ప్రవేశపెట్టి అభివృద్ధికి పునాదాలు వేశారన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న 17 సంవత్సరాల కాలావధిలో అనేక ఆనకట్టలు, ప్రభుత్వ రంగాల పరిశ్రమలు, విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయన్నారు. బీజేపీకి తెలిసింది హింస, అబద్ధం బీజేపీకి తెలిసింది కేవలం హింస, అబద్ధం మాత్రమేనని సిద్దరామయ్య ధ్వజమెత్తారు. కేపీసీసీ కార్యాలయంలో జరిగిన జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితులు, శూద్రులపై కేసులు పెట్టటమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని. ఆ తరువాత వారిని జైలు నుంచి పిలుచుకొని వచ్చేది కూడా వారే. ఇదే నాటకం చేస్తూ వారు కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాల సృష్టికర్తలు బీజేపీ, ఆరెస్సెస్ సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉన్న అంబేడ్కర్, నెహ్రూ గురించి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అబద్ధాలను సృష్టించాయన్నారు. అంబేడ్కర్ను ఎన్నికల్లో ఓటమి పాలు చేసింది డాంగే, సావర్కర్ అని స్వయంగా అంబేడ్కర్ తన చేతి రాతలో లేఖ రాశారు. అయినా అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్ కారణమని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని దుయ్యబట్టారు. డీసీఎం డీ.కే.శివకుమార్, కాంగ్రెస్ నాయకులు బీ.కే.హరిప్రసాద్, హెచ్.ఎం.రేవణ్ణ, డాక్టర్ జీ.సీ.చంద్రశేఖర్, మంజునాథ్ భండారి, ఎం.ఉదయ శంకర్, ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ, ఎమ్మెల్సీ నజీర్ అహ్మద్, జిల్లాధ్యక్షుడు నంజయ్యనమఠ పాల్గొన్నారు. సీఎం సిద్దరామయ్య -
మాజీ మంత్రి వీరకుమార్ పాటిల్ కుమారుడు అరెస్ట్
దొడ్డబళ్లాపురం: వరకట్న వేధింపులతోపాటు మహారాష్ట్రలో సంచలనం కలిగించిన వైష్ణవి హత్య కేసులో నిందితులకు ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలపై మాజీ మంత్రి వీరకుమార్ కుమారుడు ప్రీతమ్ను పుణె పోలీసులు అరెస్టు చేశారు. వైష్ణవిని ఆమె మామ రాజేంద్ర, మరిది సుశీల్ హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరిపై కేసు నమోదుకాగా అరెస్టు కాకుండా ప్రీతమ్ ఆశ్రయం కల్పించడంతోపాటు ఆర్థిక సాయం చేశారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. హత్య కేసులో నిందితులు అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ పార్టీలో ముఖ్య నేతలు కావడం వల్ల ఈ కేసు మహారాష్ట్రలో సంచలనంగా మారింది. మైసూరులో చైన్ స్నాచింగ్ మైసూరు: మైసూరులో చైన్ స్నాచింగ్ జరిగింది. విద్యారణ్యపురంలో నివాసముంటున్న శారదమ్మ తన భర్త సుబ్రమణ్యశెట్టితో కలిసి దశరథ గుప్తుడి ఇంటికి వెళ్లింది. తిరిగి వస్తుండగా విద్యారణ్యపుర నాల్గవ ప్రధాన రోడ్డు సమీపంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు శారదమ్మ మెడలోని రూ.3.50లక్షల విలువైన బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. టోయింగ్ వల్ల సమస్యలు వస్తే రద్దు చేస్తాం ● హోంమంత్రి పరమేశ్వర్ దొడ్డబళ్లాపురం: నో పార్కింగ్లో ఉన్న వాహనాలను టోయింగ్ చేసే విధానాన్ని సమస్యగా భావిస్తే రద్దు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం సదాశివనగర్లో తమ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ మండ్యలో జరిగిన సంఘటన బాధాకరమని, ఈ వ్యవహారంలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశామని, ఈ సంఘటనకు సంబంధించి అధికారులతో సమావేశమై చర్చిస్తానన్నారు. ట్రాఫిక్ పోలీసుల వైఖరి క్షమించరానిదన్నారు. ఈ విషయంలో పోలీసులను హెచ్చరించి పలు సూచనలు చేశామన్నారు. మునిరత్నపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ● డీసీఎం డీకే శివకుమార్ శివాజీనగర: ‘ముత్యాలు, రత్నాలను బీజేపీ వారే ఉంచుకోవటంలో తమకు అభ్యంతరం లేదు. అయితే మునిరత్నను ఎందుకు సస్పెండ్ చేయలేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రశ్నించారు. మంగళవారం కేపీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎస్.టీ.సోమశేఖర్, హెబ్బార్ విధానసౌధలో ఎవరినీ రేప్ చేయలేదు. హెచ్ఐవీ ఇంజెక్షన్ పొడిచారా? అని ప్రశ్నించారు. మునిరత్నపై చాలావరకు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులకు ఇంజెక్షన్ ఎక్కించేందుకు వెళ్లారు. యడియూరప్పను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని డీసీఎం డీ.కే.శివకుమార్ ప్రశ్నించారు. -
కరావళి, మలెనాడులో కుంభవృష్టి
బనశంకరి: రాష్ట్రంలో కరావళి, మలెనాడు, కావేరి జలానయన ప్రదేశాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నలుగురు మృత్యవాత పడ్డారు. దక్షిణ కన్నడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రెండు రోజుల పాటు అంగన్వాడీ, పాఠశాలలు, కాలేజీలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, పీయూ కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ దక్షిణ కన్నడ జిల్లా కలెక్టర్ ముల్లై ముగిలన్ ఆదేశాలు జారీ చేశారు. కరావళి, మలెనాడు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో వివిధ తాలూకాల్లో ఎడతెరపి లేని వర్షాలు పడుతున్నాయి. మంగళూరు పంప్వేల్ పై వంతెన పూర్తిగా జలమయమైంది. మంగళూరు కొడియాల్బైల్ భగవతినగర ద్వీపంగా మారింది. భారీ వర్షాల కారణంగా రాజ కాలువలోని నీరు జనవసతి ప్రదేశాల్లోకి చొరబడి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం దక్షిణకన్నడ జిల్లాలో భారీ వృక్షం కారుపై పడటంతో నలుగురు ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఈ ఘటన కడబ తాలూకా రామకుంజలో సంభవించింది. అబ్దుల్ సలీం, రామకుంజ రోడ్డు వీధిలో మారుతీ కారును పార్కింగ్ చేసి వెళ్లారు. ఒక్కసారిగా మామిడి చెట్టు శబ్దం విని కారులో నుంచి కిందికి దిగి బయటకు వెళ్లారు. 30 వరకు వర్షాలు ఈనెల 30వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉడుపి జిల్లాలో వర్షాలు తీవ్రరూపం దాల్చడంతో పడుకెరె సముద్ర తీరంలో భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి. తీరప్రాంతాల్లో నివాసులను జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. చిక్మగళూరు జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు పలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మూడిగెరె తాలూకా బాళూరు గ్రామం ఎస్టేట్లో అర్దరాత్రి కార్మికుడి ఇంటిపై భారీ చెట్టు కూలిపోవడంతో సునంద అనే మహిళ తీవ్రంగా గాయపడింది. 20 మంది కార్మికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. హాసన జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా సకలేశపుర అనేమహల్ వద్ద రహదారిలో మట్టి కుంగిపోవడంతో వాహనదారులు భయం భయంగా సంచరిస్తున్నారు. కూలిపోయిన హోటల్ గోడ సకలేశపురలో మలెనాడు కెఫె హోటల్ గోడ కూలిపోయింది. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. శిరాడీఘాట్ రోడ్డులో రెండు వైపులా భూమి కుంగిపోయింది. వర్షంతో 100 అడుగుల ఎత్తుగల కొండ కూలిపోతుందనే భయం ఏర్పడింది. హసన తాలూకా బాగే సమీపంలోని అరసు నగరలో భారీవర్షంలో కారు డ్రైవింగ్ చేస్తూ డివైడర్కు డీకొట్టడంతో కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. బెంగళూరు దాసరహళ్లికి చెందిన శరత్(28), అభిషేక్(27) మృతులు. కొడగు జిల్లా విరాజపేటె తాలూకా మాల్దారెలో ఇంటి వద్ద పని చేస్తుండగా చెట్టు కొమ్మ విరిగి పడటంతో విష్ణుబెల్లప్ప తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఉడుపి, ఉత్తరకన్నడ, దక్షిణకన్నడ, శివమొగ్గ, చిక్మగళూరు, కొడగు జిల్లాలకు 5 రోజులు రెడ్అలర్ట్ ప్రకటించారు. బీదర్, కలబురిగి, యాదగిరి, విజయపుర, బెళగావి జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేఆర్ఎస్లోకి మూడు అడుగుల మేర నీరు కావేరి జలానయన ప్రదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత 24 గంటల్లో కేఆర్ఎస్లో మూడు అడుగుల మేర నీరు పెరిగింది. పాతమైసూరు ప్రాంతానికి జీవనాడిగా ఉన్న మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా కేఆర్ఎస్ ఆనకట్టలో ఇన్ఫ్లో పెరిగింది. ఒకేరోజు మూడు అడుగుల నీరు చేరింది. రెండు రోజుల క్రితం జలాశయానికి 350 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా కావేరి జలానయన ప్రదేశంలో భారీ వర్షాలతో మంగళవారం 19,129 క్యూసెక్కుల నీరు చేరింది. ముంగారు ప్రారంభంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతుల ముఖాల్లో ఆనందం నెలకొంది. భారీ వర్షాలతో ముగ్గురి మృతి పలు జిల్లాల్లో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు కూలుతున్న ఇళ్లు, వృక్షాలు దక్షిణ కన్నడ జిల్లాలో నలుగురికి తప్పిన ప్రమాదం కేఆర్ఎస్లోకి వరద జలాలు -
ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్.. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరణ
సాక్షి,బెంగళూరు: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ హైకమాండ్ షాకిచ్చింది. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, ఏ శివరామ్ హెబ్బర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.కర్ణాటకలో ఎస్టీ సోమశేఖర్ యశ్వంత్పూర్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎ శివరామ్ హెబ్బార్ యల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సుదీర్ఘ కాలంగా పార్టీ క్రమశిక్షణను పదేపదే ఉల్లంఘిస్తూ వస్తున్నారు.ఈ క్రమంలో పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ హెబ్బార్ ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో పార్టీ క్రమశిక్షణను పదేపదే ఉల్లంఘిస్తున్న కారణంగా ఎమ్మెల్యేలను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.పార్టీ హైకమాండ్ నిర్ణయంతో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నట్లు బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ 2025 మార్చి 25 నాటి షోకాజ్ నోటీసుకు మీ ప్రతి స్పందనను పరిగణనలోకి తీసుకుంది. మీరు పార్టీ క్రమశిక్షణను పదే పదే ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించింది. అందుకు మిమ్మల్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తక్షణమే ఆరేళ్ల పాటు బహిష్కరించాలని నిర్ణయించింది’ అని అందులో పేర్కొన్నారు. -
ఐఏఎస్ అధికారిణికి బీజేపీ ఎమ్మెల్సీ క్షమాపణలు
బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఐఏఎస్ అధికారిణి ఫౌజియా తరణమ్(Fouzia Taranum)కు క్షమాపణలు చెప్పారు. ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అక్కడ. అయితే.. తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్య చేయలేదంటూ మంగళవారం ఆయన క్షమాపణలు తెలియజేశారు. ‘‘ఆ సమయంలో ేనేను భావోద్వేగంలో ఉన్నా. మా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అలాంటి పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అందుకు క్షమాపణలు చెబుతున్నా అని ఎన్డీటీవీతో ఎన్ రవికుమార్(N Ravikumar) అన్నారు.అసలేం జరిగిందంటే..బీజేపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష చలవాడి నారాయణస్వామి(Chalavadi Narayanaswamy) ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే(ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు)ను ఉద్దేశిస్తూ.. ‘కుక్క’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట రాజకీయ దుమారం రేపాయి. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నారాయణస్వామి గెస్ట్ హౌజ్ వద్ద నిరసనలు తెలిపారు. అయితే.. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. నారాయణస్వామికి భద్రతా కల్పించడంలో డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరణమ్ విఫలమయ్యారంటూ ఎమ్మెల్సీ రవికుమార్ పార్టీ అనుచరులతో నిరసనలకు దిగారు.ఈ క్రమంలో.. ఫౌజియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కలబురాగి డిప్యూటీ కమిషనర్ ఇక్కడ ఐఏఎస్ అధికారిణేనా? లేదంటే పాకిస్తాన్ నుంచి వచ్చారా? ఆమె తీరు చూస్తుంటే పాక్ నుంచి వచ్చినట్లే ఉంది’’ అంటూ రవికుమార్ వ్యాఖ్యానించారు.మతపరమైన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్థానికంగా పీఎస్లో ఫిర్యాదు నమోదుకాగా.. రవికుమార్పై కేసు ఫైల్ అయ్యింది. మరోవైపు.. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఐఏఎస్ అధికారుల సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ తరుణంలోనే ఆయన క్షమాపణలు చెప్పారు. ఇంకోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని, రవికుమార్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఆరా తీస్తానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాకు వెల్లడించారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
యశవంతపుర)(కర్ణాటక): ప్రియునితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్పుర తాలూకా కరగుంద వద్ద జరిగింది. ఎన్ఆర్పుర పోలీసుస్టేషన్లో మొదట అనుమానాస్పద కేసు నమోదైయింది. అయితే భార్య, ప్రియుని పనేనని బయట పడింది. ఎన్ఆర్ పుర పట్టణానికి చెందిన సుదర్శన్ మృతదేహం కడుహినబైలు గ్రామం కరుగుండ బస్టాండ్ సమీపంలో శనివారం బయట పడింది. ఆమె భార్య కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనేక అనుమానాలు రావడంతో పోలీసులు విచారణకు రెండు బృందాలను రచించారు. విచారణలో కమల హత్య చేయించిన్నట్లు బయట పడింది. కమల 10 ఏళ్లు క్రితం సుదర్శన్ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కమల, శివరాజ్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకొంది. దీనికి భర్త సుదర్శన్ అడ్డుచెప్పేవాడు, దీంతో భర్తని అడ్డు తొలగించాలని ప్లాన్ వేసుకొన్నారు. మద్యంలో నిద్రమాత్రాలను కలిపి ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయాడు. శివరాజ్ అతని స్నేహితులు కలిసి గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని పారవేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. -
హైవేలో కారు పల్టీ.. యువ వైద్యుదు మృతి
కోలారు: ఆకస్మికంగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ మెడికో ని బలిగొంది. చైన్నె – బెంగుళూరు ఎక్స్ప్రెస్ హైవే కారిడార్లో సోమవారం కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నగరానికి యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు..వైద్యుడు కృష్ణ జగన్ (24), అనంతపురం నగరంలోని ఇందిరానగరవాసి, తండ్రి పేరు వెంకటేశులు. కృష్ణ జగన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పంలోని పిఈస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ని పూర్తిచేసి ఇంటర్న్షిప్లో ఉన్నాడు. పనిమీద అనంతపురానికి వెళ్లిన ఆయన మళ్లీ సోమవారం తెల్లవారుజామున కాలేజీకి ఐటెన్ కారును నడుపుతూ బయల్దేరారు.కారు కోలారు జిల్లా బంగారుపేట తాలూకా సిద్ధనహళ్లి వద్ద చైన్నె – బెంగుళూరు ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తూ వేగం వల్ల అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఓ టైర్ పేలిపోవడమే కారణమని తెలుస్తోంది. కారు నుజ్జునుజ్జుకాగా డాక్టర్ కృష్ణ ఘటనా స్థలంలోనే మరణించారు. ఉదయం 8:30 సమయంలో దుర్ఘటన జరిగింది. బంగారుపేట పోలీసులు చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
బాలింత మృతిపై గొడవ
రాయచూరు రూరల్: ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన సోమవారం జిల్లాలో చోటు చేసుకుంది. మస్కిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో సిద్దమ్మ (23) అనే గర్భిణి కాన్పు కోసం చేరింది. ఆమెకు శిశువు జన్మించింది, గైనకాలజిస్టు డాక్టర్ సౌమ్య గుండళ్లి ఆదివారం రాత్రి బాలింత సిద్దమ్మకు సరైన సమయంలో వైద్యసేవలు అందించక పోవడం వల్లే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అంబులెన్సును ధ్వంసం చేశారు. ఇంతలో మస్కి ఎస్ఐ సిబ్బందితో వచ్చి వారిని అడ్డుకున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రికి వచ్చి పరిశీలించారు. -
కురుస్తోంది కుండపోత
బనశంకరి: రాష్ట్రంలో గడువుకు ముందుగానే నైరుతి రుతుపవనాలు వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కరావళి, మలెనాడుతో పాటు చాలా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో నైరుతి వర్షాలు మరింత చురుకుగా కురుస్తుండటంతో జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఉత్తరకన్నడ జిల్లాలో కుమటా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మూమురు–అరకడ సంబంధాలు తెగిపోయాయి. జిల్లాలో వరద పరిస్థితి తలెత్తింది. ఘాట్ రోడ్లలో కూలిపోయిన బండరాళ్ల ను తొలగించే పనులు జరుగుతున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా రోడ్లు జలమయం కావడంతో వాహనాల సంచారానికి ఇబ్బందులు తలెత్తాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపైకి చేరడంతో వాహనాలకు ఇబ్బంది ఏర్పడింది. కరావళి ప్రదేశంలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం నెలకొంది. దక్షిణ కన్నడకు ఎన్డీఆర్ఎఫ్ రానున్న రెండురోజులు మంగళూరు తో పాటు కరావళి మరింత జోరుగా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కన్నడ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. సహాయక చర్యలకు గ్రామ పంచాయతీల సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న కుండపోతతో ప్రముఖ నాగక్షేత్రమైన కుక్కే సుబ్రమణ్య ఆలయంలో కుమారధార స్నానఘట్టం మునిగిపోయింది. కుమార ధార నది పొంగిపొర్లుతుండటంతో స్నానఘట్టం వద్ద వెళ్లరాదని భక్తులకు సూచించారు. కొన్నిచోట్ల వక్క, కాఫీ తోటల్లోకి నీరు చేరింది. సోమవారం ఉదయం వరకు కొడగు జిల్లాలో విరాజపేటేలో 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భాగమండలలో 23, ముల్కిలో 20 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక్కడ అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కావేరి నదికి ప్రవాహం కావేరి నది ప్రదేశాల్లో వానల వల్ల జీవనాడిగా పేరున్న మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ డ్యాంలో నీటిమట్టం పెరుగుతోంది. వానలు లేక జలాశయం నీటిమట్టం 89 అడుగులకు పడిపోవడంతో దిగులు నెలకొంది. ఇంతలో ముంగారు వర్షాలు జోరందుకోవడంతో ప్రవాహం మొదలైంది. నీటిమట్టం 15 టీఎంసీలను దాటినట్లు తెలిసింది. డ్యాం డెడ్ స్టోరేజీ 7 టీఎంసీలు. రాష్ట్రంలో ఐదురోజులు వర్షాలు ●రానున్న ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను ప్రకటించింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం వల్ల పరిసర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ● 30వ తేదీ వరకు చాలాప్రాంతాల్లో కుంభవృష్టికి ఆస్కారముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణకన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, కొడగు జిల్లాల్లో 5 రోజులు పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ● బీదర్, కలబుర్గి, యాదగిరి, విజయపుర, బెళగావి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వానలు ఘాట్ రోడ్లలో విధ్వంసం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు జలాశయాలకు నీటి చేరిక -
మరో 9 కోవిడ్ కేసుల నమోదు
బోవి మండలి స్కాంలో ఆస్తుల జప్తు బనశంకరి: కర్ణాటక రాష్ట్ర బోవి అభివృద్ధి మండలిలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణంలో నిందితులకు చెందిన రూ.26.27 కోట్ల విలువచేసే స్థిరాస్థిని ఈడీ జప్తు చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ ఆస్తి విలువ రూ.40 కోట్లు ఉంటుంది. ఈ కేసులో బీకే.నాగరాజప్ప, ఆర్.లీలావతి తదితరులకు చెందిన ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. బోవి మండలికి చెందిన నగదు బదిలీ ద్వారా ఆస్తులను పొందారని ఈడీ పేర్కొంది. పులి పంజా.. నవ వివాహితుడు బలిమైసూరు: పులి దాడి చేసిన ప్రమాదంలో ఇటీవలే పెళ్లయిన యువకుడు బలయ్యాడు. మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకా గురుపుర గ్రామంలో జరిగింది. 5వ బ్లాక్లో హరీష్ (24) నివాసం ఉంటున్నాడు, సోమవారం ఊరి శివార్లలో అడవిలో మేకలను మేపుతున్న సమయంలో పులి దాడి చేసింది. యువకుడు గట్టిగ కేకలు వేశాడు. స్థానికలు వచ్చేలోగా పులి అతనిని చంపి పారిపోయింది. తీవ్రగాయాలతో పడి ఉన్న హరీష్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు, వైద్యులు పరిశీలించి చనిపోయినట్లు తెలిపారు. హుణసూరు గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. హరీష్కు 8 నెలల కిందటే పెళ్లి అయ్యిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 28 నుంచి చిత్ర సంతె–2 ● చిత్రకళాపరిషత్లో 5 రోజులు ప్రదర్శన బనశంకరి: చిత్రసంతె తరహాలో మరో చిత్ర ప్రదర్శన జరగనుందని నగరంలోని చిత్రకళా పరిషత్ అద్యక్షుడు బీఎల్.శంకర్ తెలిపారు. సోమవారం పరిషత్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 28వ తేదీ నుంచి 5 రోజుల పాటు నమ్మ ఆర్ట్స్ బెంగళూరు జాతీయ కళా ఉత్సవం – 2025 జరగుతుందన్నారు. ప్రముఖ కళాకారులు గీసిన చిత్రాల ప్రదర్శన, విక్రయాలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవంలో 100 మందికి పైగా చిత్రకారులు పాల్గొంటారని, దుకాణాలు, గ్యాలరీలో ప్రదర్శన కల్పించామని తెలిపారు. కర్ణాటక నుంచి 51 మంది చిత్రకారులు పాల్గొంటున్నారని, మిగతావారు ఇతర రాష్ట్రాల వారని తెలిపారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రదర్శనను నిర్వహిస్తామన్నారు. మలప్రభ, కృష్ణా నదుల జోరు● రోడ్లు, వంతెనలు జలార్పణం దొడ్డబళ్లాపురం: బెళగావిలోని పశ్చిమఘాట్ల ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో మలప్రభ నది పొంగిప్రవహిస్తోంది. దీంతో ప్రధాన రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. ముఖ్యంగా బెళగావి–గోవా ప్రధాన రహదారి తెగిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. బెళగావి, ఖానాపుర, రామనగర మార్గాల్లో చాలాంది గోవాకు వెళ్లేవారు. అయితే ఈసారి వర్షాకాలం ముగిసే వరకూ ఈ మార్గాన్ని మూసివేసే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదిలో నీటి ప్రవాహం రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాగే కొనసాగితే బెళగావి చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లో ముంపు ఏర్పడే ప్రమాదముంది. సైన్యానికి దత్తపీఠం రూ.25 లక్షల విరాళం మైసూరు: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మైసూరు దత్తపీఠం భారత సైన్యానికి రూ. 25 లక్షలు విరాళం ఇచ్చింది. మైసూరులోని దత్తానగర్లోని ఆశ్రమంలోని నాద మంటపంలో గణపతి సచ్చిదానంద స్వామి, చిన్నదత్త విజయానంద తీర్థ స్వామీ వేద పఠనం ద్వారా దత్త వెంకటేశ్వర బ్రహ్మోత్సవ వేద పారాయణాన్ని సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మైసూరు– కొడగు ఎంపీ యదువీర్ క్రిష్ణదత్త ఒడెయార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సచ్చిదానందస్వామి భారత సైన్యానికి రూ. 25 లక్షలు విరాళం చెక్కును ఎంపీ యదువీర్కి అందజేశారు. నారాయణ మూర్తి, మంజుల చెల్లూరు, టీఎస్ శ్రీవత్స ఉన్నారు. ముఖంపై స్ప్రే కొట్టి నగల దోపిడీ దొడ్డబళ్లాపురం: మహిళ మొహానికి స్ప్రే కొట్టిన దుండగులు ఆమె మెడలోని బంగారం మాంగల్యం చైను, కమ్మలు దోచుకుని పరారైన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా నందరామయ్యనపాళ్యలో చోటుచేసుకుంది. అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న లక్ష్మి, ఇంటి ముందు ఉండగా అక్కడకు వచ్చిన ఇద్దరు దుండగులు అడ్రస్ చెప్పాలని ఆమె దగ్గరకు వచ్చారు. వెంటనే ఆమె ముఖంపై ఏదో స్ప్రే కొట్టి బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. సుమారు రూ.1.80లక్షల విలువైన నగలు పోయినట్టు లక్ష్మి మాదనాయకనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైసూరు శాండల్ నకిలీ సోపుల తయారీ శివాజీనగర: కేఎస్డీఎల్ సంస్థ విషయంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర కన్నడ అభిమానం గురించి మాట్లాడుతున్నారు. ఆయనతో కన్నడ అభిమానం గురించి చెప్పించుకోవాల్సిన అవసరం లేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బీ.పాటిల్ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన మైసూరు శాండల్ వ్యాపారం పెంచడం కోసమే హిందీ నటి తమన్నా భాటియాను ప్రచార రాయబారిగా ఎంపిక చేశామన్నారు. హైదరాబాద్లో కొందరు నకిలీ మైసూరు శాండల్ సోప్ తయారు చేస్తున్నారు, దానిని బంద్ చేయించాం. మళ్లీ తయారు చేస్తున్నారని తెలిసింది, దీనిపై చర్యలు తీసుకొంటామని మంత్రి తెలిపారు. నగరసభపై లోకాయుక్త దాడి దొడ్డబళ్లాపురం: దొడ్డ నగరసభలో లోకాయుక్త దాడి జరిగింది. సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా వచ్చిన లోకాయుక్త పోలీసులు నగరసభ కార్యాలయంలోకి వెళ్లి దాఖలాల పరిశీలన చేపట్టారు. లోపల ఉన్న అధికారులను లోపలే ఉంచి తలుపులు వేశారు. ఈ–ఖాతాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపనలు వచ్చాయి. దీనిపై ప్రజాసంఘాలు కూడా ధర్నాలు చేశాయి. దీంతో లోకాయుక్త దాడి చేసినట్టు తెలుస్తోంది. బనశంకరి: రాష్ట్రంలో కోవిడ్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల అవధిలో కేసుల సంఖ్య 47కు చేరుకోగా ఒకరు చనిపోయారు. దీంతో రెండురోజుల్లో రెండు మరణాలు సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ వైద్యసిబ్బందిని ఆదేశించింది. ఎక్కువ మంది ఇంట్లోనే రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 47 కు చేరుకోగా 46 మంది రోగులు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశాఖ గత 24 గంటల్లో 104 మందికి కరోనా పరీక్షలు చేపట్టగా 9 కొత్త కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ శాతం 8.65 కు చేరుకుంది. రాష్ట్రంలో ఎలాంటి కొత్త రూపాంతర వైరస్ కనబడలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. పొరుగున కేరళలోనూ కేసులు గణనీయంగా పెరిగాయి. బెంగళూరు సౌత్లో అధికం ● గత 24 గంటల్లో 96 ఆర్టీ పీసీఆర్తో పాటు మొత్తం 104 మంది శాంపిల్స్ను సేకరించి కొత్త వైరస్ వేరియంట్లు వచ్చాయా అని పరీక్షించారు. ● ఈ ఏడాది రాష్ట్రంలో 98 కోవిడ్ కేసులు రాగా, 50 మంది రోగులు కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. ● బెంగళూరులో 71 కోవిడ్ కేసులు ఉంటే, అందులో మహదేవపుర వలయం కరోనా హాట్ స్పాట్గా నిలిచింది. సిటీ దక్షిణ జోన్లో తీవ్రత బాగా ఉంది. మహదేవపుర వలయంలో 16, దక్షిణ వలయంలో 14, బొమ్మనహళ్లి 7 , బెంగళూరు కేంద్ర 5, యలహంక 4, బెంగళూరు తూర్పు 13, బెంగళూరు పశ్చిమ 10, ఆర్ఆర్.నగర 1 కేసు నమోదయ్యాయి. ● నిమ్హాన్స్, బెంగళూరు మెడికల్ కాలేజీతో పాటు రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల్లో కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. రోజుకు 150–200 టెస్టులు చేయాలని సూచించారు. మాస్కు తప్పనిసరి కాదు! బెంగళూరు పాలికె కమిషనర్ మహేశ్వర్రావ్ 8 వలయాల కమిషనర్లతో కరోనా కట్టడి చర్యల గురించి చర్చించారు. కోవిడ్ ఉధృతం కాకుండా చూడాలి, ఆసుపత్రులకు వచ్చే వృద్ధులు, గర్భిణీలు పిల్లలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. నగర పాలికె ఆసుపత్రులకు వచ్చే రోగులు మాస్కు ధరించాలని ప్రచారం చేశారు. శ్వాసకోశ జబ్బులు ఎక్కువగా ఉండేచోట ప్రత్యేక వైద్యసేవలు అందించాలన్నారు. నమ్మ మెట్రో రైలులో ఇంకా మాస్కు తప్పనిసరి చేయలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాస్కు గురించి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. న్యూస్రీల్ రాష్ట్రంలో మొత్తం 47 మందికి పాజిటివ్ కొత్త వేరియంట్ కనబడలేదు బడుల రీ ఓపెన్ మార్పు? కోవిడ్ పరిస్థితిని మూడు నాలుగు రోజులు గమనించి స్కూళ్లు, కాలేజీల పునః ప్రారంభం గురించి నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. ఇప్పటి కరోనా వైరస్ ప్రమాదకరం కాదని చెప్పారు. నిజానికి 29వ తేదీ నుంచి పాఠశాలు ప్రారంభం కావాల్సి ఉంది. కేసులు పెరిగితే స్కూళ్ల రీఓపెన్ను వాయిదా వేసే అవకాశముంది. -
వరదల్లో చిక్కిన టూరిస్టులు
యశవంతపుర: ప్రకృతి అందాలను వీక్షిద్దామని వెళ్లిన పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. దక్షిణ కన్నడ జిల్లాలో వర్షాల వల్ల రెడ్ అలర్ట్ను ప్రకటించారు. నదీ తీరం, జలపాతాలు, సముద్రం వద్దకు వెళ్లవద్దని జిల్లా అధికారులు తెలిపారు. కానీ కొందరు పర్యటకులు పుత్తిగె వద్దనున్న ఎరగుండి జలపాతాన్ని చూడడానికి వెళ్లి అపాయంలో ఇరుక్కున్నారు. స్థానికుల మాటలను నిర్లక్ష్యం చేసి వెళ్లిన ఐదు మంది.. వరదనీటి ప్రవాహం ఎక్కువ కావడంతో బండరాళ్ల మీద కూర్చుని కాపాడాలని కేకలు వేశారు. స్థానికులు అతికష్టం మీద తాళ్ల ద్వారా రక్షించారు. వర్షాలు తగ్గేవరకు పర్యాటకులు క్లిష్టమైన ప్రాంతాలకు వెళ్లరాదని అధికారులు సూచించారు. బస్సు ప్రమాదం ప్రైవేట్ బస్సు పల్టీ పడిన ఘటన జిల్లాలో బంట్వాళ వద్ద జరిగింది. జాతీయ రహదారి– 75లో కల్లడ్క సమీపంలోని కుద్రెబెట్టులో బస్సు రోడ్డు పక్కన పల్టీ పడగా ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. పుత్తూరు నుంచి మంగళూరుకు వెళ్లతున్న ప్రైవేట్ బస్సు బ్రేక్ ఫెయిల్ వల్ల బోల్తా పడింది. -
రాష్ట్రాభివృద్ధికి సీఎం బద్ధ వ్యతిరేకి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాలకు తోడు రాష్ట్రాభివృద్ధికి బద్ధ వ్యతిరేకి ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని బీదర్ దక్షిణ క్షేత్రం శాసన సభ్యుడు శైలేంద్ర బేల్దాళ్ ఆరోపించారు. సోమవారం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరైనా కర్ణాటక నుంచి ఏ ఒక్క ప్రతినిధీ హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నిధుల మంజూరులో కేంద్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపుతోందని కేంద్రం వైపు వేలెత్తి చూపడాన్ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు పాల్గొన్నా కర్ణాటక నుంచి సమావేశాలకు వెళ్లక పోవడం సరికాదన్నారు. వికసిత భారత్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురించి వివరించారు. అధిక ఫీజుల వసూలు తగదు రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26వ విద్యా సంవత్సరంలో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని ఎస్ఎఫ్ఐ పేర్కొంది. సోమవారం రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అమరేష్ మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యాశాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడాన్ని ఖండించారు. అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి రితీక్ కుమార్, కమిషనర్ కావేరిలకు వినతిపత్రం సమర్పించారు. నకిలీ హెర్బల్ న్యూట్రీషన్లను అరికట్టాలి రాయచూరు రూరల్: జిల్లాలో అధికమవుతున్న నకిలీ హెర్బల్ న్యూట్రీషన్ విక్రయాలను అరికట్టాలని జనసేవా ఫౌండేషన్ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు జావిద్ఖాన్ మాట్లాడారు. మాన్విలో హెర్బల్ న్యూట్రీషప్ అంగడి యజమాని కళ్యాణ్, భార్య అంబికా నకిలీ హెర్బల్ న్యూట్రీషన్లను విక్రయిస్తున్నారని, లైసెన్సులను రద్దు చేసి, నకిలీ హెర్బల్ న్యూట్రీషనలను కొనుగోలు చేయకుండా అడ్డుకట్ట వేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆల్మట్టికి పోటెత్తిన వరద ● 52,650 క్యూసెక్కుల నీరు రాక రాయచూరు రూరల్: రుతుపవనాల ప్రభావంతో ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిపై బాగలకోటె జిల్లాలో నిర్మించిన ఆల్మట్టి డ్యాంలోకి 52,650 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. విజయపుర, బాగలకోటె, యాదగిరి, రాయచూరు జిల్లాల జీవనాడి కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. నారాయణపుర డ్యాంలో 14 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. మే నెలాఖరు నాటికి డ్యాంలోకి నీరు చేరడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. మలప్రభ నదిలో కూడా వరద అధికం అయింది. -
నకిలీ విత్తనాల బెడద అరికట్టండి
● అధికారులకు డివిజనల్ కమిషనర్ సూచన రాయచూరు రూరల్: కలబుర్గి డివిజన్లో అధికమవుతున్న నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ కలబుర్గి డివిజన్ కమిషనర్ వైఎస్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని వ్యవసాయ వర్సిటీ పాలక మండలి భవనంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, యాదగిరి, కలబుర్గి, విజయనగర జిల్లాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి పత్తి, పొద్దు తిరుగుడు, సజ్జ, కంది వంగడాల నకిలీ విత్తనాలను విక్రయించడానికి వచ్చేవారి వద్ద లైసెన్సులను గుర్తించి, నకిలీ విత్తనాలు కొనుగోలు చేయకుండా రైతులను చైతన్యపరచాలన్నారు. 2025–26వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల నియంత్రణకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక కమిటీలను నియమించామన్నారు. ఖరీఫ్లో మంచి వర్షాలు పడ్డాయని, రైతులకు అందుబాటులో ఉండేలా రైతు కేంద్రాలు పని చేయాలన్నారు. సమవేశంలో వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్సలర్ హన్మంతప్ప, బెంగళూరు వాటర్షెడ్ కమిషనర్ మహేష్ శిరూరు, డైరెక్టర్ పుత్ర, వెంకటరామరెడ్డి, పాటిల్, అనూస్, అంథోని, సదాశివ, జయ ప్రకాష్, మల్లికార్జున, దీపా, శ్రీనివాస్, గురునాథ్, నజీర్ అహ్మద్లున్నారు. -
చక్కెర కర్మాగారం కోసం ధర్నా చేస్తాం
హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హొసపేటెలో చక్కెర కర్మాగారం ప్రారంభిస్తామని చెప్పిన వారు ఇంత వరకు కర్మాగార నిర్మాణం పనులు చేపట్టలేదని, ఈ విషయంపై రైతు సంఘం తరఫున నిరవధిక సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తామని రైతు సంఘం నేత కటిగి జంబయ్య తెలిపారు. హొసపేటె ప్రెస్ హౌస్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత రెండేళ్ల నుంచి ఇలాంటి అబద్ధ హామీలు ఇస్తున్నారన్నారు. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ హొసపేటె రైతు సంఘం అధ్యక్షుడికి ఫోన్ చేసి ఈ సాధన సమావేశంలో హొసపేటెలోని చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించే విషయంపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని హామీ ఇచ్చారు. రైతుల దీర్ఘకాల డిమాండ్ అయిన చక్కెర కర్మాగారం స్థాపన తేదీ, ప్రదేశంపై బహిరంగ సమావేశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆ రోజు జరిగిన సాధన సమావేశంలో ఎటువంటి ప్రకటన లేక వాగ్దానం చేయలేదన్నారు. రైతుల చిరకాల డిమాండ్ అయిన చక్కెర కర్మాగారం స్థాపనకు ఎటువంటి చర్య తీసుకోనందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్, ఎమ్మెల్యే హెచ్ఆర్.గవియప్ప తీరును హొసపేటె రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 15 రోజుల లోపు ముఖ్యమంత్రి సిద్దరామయ్య చక్కెర కర్మాగారం ఏర్పాటు, నిర్మాణంపై ప్రకటన చేయాలని లేని పక్షంలో నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతు నేతలు ఉత్తంగి కొట్రేష్, జోగయ్య, యల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్, కారు ఢీ.. ఐదుగురు మృతి
సాక్షి, బళ్లారి: అపార ఇనుప ఖనిజ నిల్వలున్న జిల్లాలోని సండూరు తాలూకాలో అతి వేగంతో వెళ్లే మైన్స్ టిప్పర్లతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు బలవుతుతున్నారు. విపరీతమైన వేగంతో ఇనుప ఖనిజం తరలిస్తున్న టిప్పర్ల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి పలువురు మృతి చెందుతున్నా అక్కడి పోలీసులు పట్టించుకోక మైన్స్ టిప్పర్ల వేగానికి అడ్డుకట్ట వేయకపోవటం వల్ల సోమవారం సండూరు తాలూకాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సండూరు తాలూకా జైసింగాపుర సమీపంలో ఇనుప ఖనిజం తరలిస్తున్న టిప్పర్, కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తాలూకాలోని లక్ష్మీపుర గ్రామానికి చెందిన ఆశా(28), నిండు గర్భిణి జయలక్ష్మి(21)లతో పాటు చిన్నారులు బిందుశ్రీ (4), సాయి (9), కారు డ్రైవర్ నందీశ్ (29) అక్కడికక్కడే మృతి చెందారు. మహాలక్ష్మి(3) అనే చిన్నారితో పాటు మరో వ్యక్తి రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సండూరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సను నిర్వహించిన తరువాత హుబ్లీకి తరలించారు. కారులో చిన్నారులతో పాటు నిండు గర్భిణి వెళుతున్న సందర్భంలో అతి వేగంగా వస్తున్న ఇనుప ఖనిజం తరలిస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను సండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదంలో మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన సమాచారం తెలిసిన తక్షణమే అక్కడికి పోలీసులు హుటాహుటిన చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో నిండు గర్భిణీతో సహా చిన్నారులు అతి వేగానికి అమాయకుల ప్రాణాలు బలి బళ్లారి జిల్లా సండూరు తాలూకాలో విషాదం -
నిధుల స్వాహాపై కేసు నమోదు
● ఐదు మంది నిందితుల్లో మంత్రి అల్లుడి పేరు? రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పఽథకాల కింద కళ్యాణ కర్ణాటక పరిధిలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయనగర జిల్లాల్లో పనులు చేయకుండానే రూ.25 కోట్లు వ్యయం చేసినట్లు నిధుల స్వాహాపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రూ.25 కోట్లతో పనుల పేరుతో మంత్రి బంధువులతో కలిసి కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెండర్ల ద్వారా పనులు కల్పిస్తామని కాంట్రాక్టర్ వద్ద రూ.1.21 కోట్ల లంచం పుచ్చుకున్నట్లు కలబుర్గి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళ్యాణ కర్ణాటకలో కలబుర్గి లక్ష్మికాంత కట్టిమని, రాయచూరు సంతోష్ నాయక్, కిరణ్, బెంగళూరు శ్రీధర్, కొప్పళ జిల్లాలో రవి మాలిపాటిల్లు జల జీవన్ మిషన్(జేజేఎం) పథకంలో సబ్ కాంట్రాక్టులు పొందారు. కలబుర్గి లక్ష్మికాంత కట్టిమని తనకు ఉన్నతాధికారులు, మంత్రులతో పరిచయం ఉందని, పనులు కేటాయిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి వారి వద్ద నుంచి నిధులు కాజేశారని ఆరోపించారు. ప్రతి ఒక్క కాంట్రాక్టర్కు రూ.50 కోట్ల మేర కాంట్రాక్ట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన వారిపై అధికారులు కేసు నమోదు చేయించారు. కాగా అధికారులు మంత్రి అల్లుడి పేరును వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. -
ఘరానా ఇంటి దొంగ అరెస్ట్
హుబ్లీ: ఇళ్లలో చోరీలకు పాల్పడే ఘరానా ఇంటి దొంగను బెండిగేరి పోలీసులు అరెస్ట్ చేయడంలో సఫలీకృతులయ్యారు. అతని నుంచి మొత్తం 62 గ్రాముల బంగారం, 310 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హుబ్లీ దొడ్డమని కాలనీ నివాసి అమన్ బేపారి (24) అరెస్ట్ అయిన నిందితుడు. సదరు స్టేషన్ పరిధితో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈ దొంగ పగలు రాత్రి అనే తేడా లేకుండా తన చేతివాటం చూపాడు. అలా నాలుగు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇతడి నుంచి సుమారు రూ.6.10 లక్షల విలువ చేసే వివిధ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బెండిగేరి సీఐ ఎస్ఆర్ నాయక్, ఎస్ఐ రవి వడ్డర, సిబ్బంది నీలగార, అంబిగేర, కరగాంబి, అరకి, గళగి, మేటి, ఇత్తలమని, వాళికార, వగ్గనవర దాడిలో పాల్గొన్నారు. వేర్వేరు చోట్ల చోరీలు రెండు చోట్ల వేర్వేరుగా చోరీలు జరిగాయి. అమరగోళ ఏపీఎంసీ యార్డ్లో జేకే ట్రేడర్స్ అంగడి షట్టర్ తాళాలను పగలగొట్టి రూ.72 వేల నగదు, రూ.85 వేల విలువైన 6 సీసీ కెమెరాలు, మానిటర్, లెనోవో కంప్యూటర్ను చోరీ చేశారు. కేవల్చంద్ సోలంకికి చెందిన అంగడిలో ఈనెల 23న రాత్రి చోరీ జరిగినట్లు నవనగర ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో విద్యానగర్ అమృత టాకీస్ వెనుక ఉన్న ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి లోనికి వెళ్లి రూ.30 వేల నగదు, రూ.10 వేల విలువ చేసే బంగారు ఆభరణం చోరీ చేసిన కేసులో రేష్మా అనే మహిళ విద్యానగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో అంజాద్ పఠాన్పై కేసు నమోదైంది. రోటవేటర్కు చిక్కి రైతు మృతి హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని మసారి నెల్కుద్రి గ్రామంలో ఓ రైతు ట్రాక్టర్ రోటవేటర్లో చిక్కుకుపోయి మరణించాడు. గ్రామానికి చెందిన రైతు పంపాపతి(40) పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. వర్షాలు కురవడంతో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ రోటవేటర్లో చిక్కుకుని నుజ్జునుజ్జవటం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు ఇటగి పోలీసులు తెలిపారు. పాత కక్షలతో యువకుడి హత్య రాయచూరు రూరల్: పాత కక్షలతో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది. మాణిక్ నగర్లో మహ్మద్ గౌస్ ఆరిఫ్(21), ముజాహిద్(21) అనే యువకుల మధ్య ఆరు నెలల క్రితం కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో చిన్నపాటి గొడవలు జరిగాయి. తాజాగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో పాతకక్షలను మనసులో పెట్టుకున్న మహ్మద్ గౌస్ తన మిత్రులతో కలిసి ఆరిఫ్పై దాడి చేసి చాకుతో పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంద్రప్ప తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని ఆయన వెల్లడించారు. కృష్ణా నదిలో ఒకరు మృత్యువాత హుబ్లీ: గుహేశ్వర ప్రాంతంలో పశువుల కోసం పచ్చగడ్డి తేవడానికి కృష్ణా నదిలోకి వెళ్లిన ఓ వ్యక్తి నీటి ఉధృతికి మృత్యువాత పడిన ఘటన బాగలకోటె జిల్లా జమఖండి తాలూకా కంకనవాడి గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడిని ఆ గ్రామ నివాసి కల్లప్ప దోరప్ప అంబి(65)గా గుర్తించారు. మృతుడు ఈదుతూ కృష్ణా నదిని దాటడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో నది మధ్యలో భారీ వర్షాలతో వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మృతి చెందినట్లు జమఖండి రూరల్ పోలీసులు తెలిపారు. జనౌషధి కేంద్రాల మూసివేత తగదు బళ్లారిఅర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనౌషధి కేంద్రాలను మూసివేయరాదని రైతు సంఘం నేత శివమూర్తి కేణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి రాసిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో జనౌషధి కేంద్రాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మూసివేయాలని నిర్ణయించడం సబబు కాదన్నారు. పేదలకు ఈ ఔషధ కేంద్రాల వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతోందన్నారు. ఎట్టి పరిస్థితిలోను వీటిని తొలగించరాదని ఆయన ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్కు విజ్ఞప్తి చేశారు. -
భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
హొసపేటె: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలందరి జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వర్షం మధ్యాహ్నం వరకు కొనసాగింది. పాఠశాలలు తిరిగి తెరిచిన కొద్దిపాటి ఉపశమనం తప్ప కూరగాయల మార్కెట్లు, దుకాణాలకు వెళ్లే వారికి ఈ పరిస్థితి పెద్ద అడ్డంకిగా మారింది. హొసపేటెలోని కూరగాయల మార్కెట్లో వర్షం కురుస్తున్నా వినియోగదారులు, వ్యాపారులు గొడుగుల కింద వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం వంటి వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు. నిన్న సాయంత్రం, రాత్రి కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. సరైన డ్రైనేజీ లేక పోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. నాలుగు రోజులుగా ప్రతికూలంగా ఉన్న వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రేపటి నుంచి చిన్నచిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, స్తంభాలపై ఉన్న మట్టి ఇళ్లు కూలిపోయే అవకాశం ఉందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఇప్పటికే మండు వేడితో బాధపడుతున్న ప్రజలకు చల్లని వాతావరణం కష్టాలు తెచ్చింది. -
మరమ్మతులకు నోచని క్రస్ట్గేట్లు
● డ్యాంకు మళ్లీ తప్పని ప్రమాదం ముప్పు హొసపేటె: తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్ గేట్ తెగిపోయి నెలలు గడిచాయి. కూలిపోయిన క్రస్ట్గేట్ మరమ్మతు పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వేసవిలోగా 19వ క్రస్ట్గేటు మరమ్మతులు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైనందున ప్రభుత్వం మిన్నకుండి పోతున్నట్లు కనిపిస్తోంది. ఇది స్థానికులను, రైతులను ఆగ్రహానికి గురి చేసింది. గేటును జోడించే ప్రక్రియ టెండర్ దశలోనే ఉంది. స్థానికంగా వ్యతిరేకత ఉంది. వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పుడు మూడు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ చెబుతున్నారు. 19వ గేట్ మాత్రమే కాదు, అన్ని గేట్లను మార్చాలని నిపుణులు అంటున్నారు. కానీ కనీసం 19 గేట్ పనులు కూడా ప్రారంభం కాలేదు. మిగిలిన గేట్ల మరమ్మతులు చేయకపోతే జలాశయం ప్రమాదంలో పడుతుంది. ఫలితంగా నీటిమట్టం 75 శాతం మాత్రం నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. 133 టీఎంసీల సామర్థ్యం గల జలాశయం 30 టీఎంసీల వరకు పూడిక చేరుకోవడంతో కేవలం నీటి నిల్వ 100 టీఎంసీలకు మాత్రం పరిమితం అయింది. ప్రస్తుతం గేట్లు మరమ్మతులు చేయకుండా ఉంటే 60 నుంచి 70 టీఎంసీలకు మాత్రమే నీటి నిల్వ పరిమితం కానున్నది. దీని వల్ల రైతులు తమ రెండో పంటకు సక్రమంగా నీరు పొందలేని పరిస్థితి ఏర్పడటం ఖాయమని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వ్యవసాయంపై లోతైన పరిశోధనలకు పిలుపు
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా ఇతర దేశాలతో పోటీ పడేలా వ్యవసాయంపై పరిశోధనలు జరపాలని రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ ధావర్చంద్ గెహ్లాట్ పిలుపు ఇచ్చారు. సోమవారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవాన్ని జిందాల్లో వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 25 ఏళ్ల నాటికి అమెరికా కంటే భారత్ ఆహార పదార్థాల ఉత్పత్తిలో ముందుండాలన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక రంగాలను అభివృద్ధి పరచుకొని అమెరికాను మించిపోవాలన్నారు. మంచి పేరు తేవాలి నేడు పర్యావరణం, జలసంరక్షణ, వాయు సంరక్షణలపై ఆలోచించాలన్నారు. నేటి విద్యా రంగం కేవలం ఉద్యోగం కోసం కాకుండా స్వయం ఉపాధికి తోడు నలుగురికి ఉపయోగ పడే విధంగా జీవితాన్ని రూపొందించుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ముఖ్య అతిథి, భారతీయ విశ్వ విద్యాలయాల వేదిక మహా కార్యదర్శి పంకజ్ మిత్తల్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వ్యవసాయ పథకాల గురించి మహిళా రైతులకు వివరించాలన్నారు. సిరిధాన్యా(మిల్లెట్)ల సాగు ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి నాబార్డ్ రూ.25 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. రైతులకు డాక్టరేట్ రైతులకు డాక్టరేట్ అవార్డులను ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. 352 మంది డిగ్రీ విద్యార్థులకు,136 మంది పీజీ విద్యార్థులకు, 19 మంది విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు అందించారు. పుట్టరాజ్కు ఆరు బంగారు అవార్డులు, సుశ్మితకు మూడు బంగారు అవార్డులు, రైతు దేవేంద్రప్ప శంకరప్పకు డాక్టరేట్ ప్రదానం చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి, వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, రిజిస్ట్రార్ దురుగేష్, అధికారులున్నారు. గవర్నర్, మంత్రి గైర్హాజరు రాష్ట్రంలో వానలు కురుస్తుండడంతో బెంగళూరు నుంచి రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం 14వ స్నాతకోత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్న హెలికాప్టర్లో బయల్దేరిన గవర్నర్, మంత్రి బళ్లారి జిల్లా జిందాల్లో దిగారు. అక్కడ విశ్రాంతి పొందుతున్న తరుణంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో జిందాల్ విశ్రాంతి గదిలో నుంచే వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. మరో వైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి కూడా వర్సిటీ స్నాతకోత్సవానికి గైర్హాజరయ్యారు. జిందాల్ నుంచి వర్చువల్ పద్ధతిలో శ్రీకారం వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ -
రేవ్ పార్టీ.. 20 మంది అమ్మాయిలు అరెస్టు..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): దేవనహళ్లి ఎయిర్పోర్టు సమీపంలో కన్నమంగల వద్ద ఉన్న ఫాంహౌస్లో రేవ్ పార్టీపై దేవనహళ్లి పోలీసులు ఆదివారంనాడు దాడి చేసి 10 మంది యువతులు, 20 మంది యువకులను అరెస్టు చేశారు. అందరూ శనివారం ఉదయం నుంచే మజా చేస్తున్నట్లు తెలిసి పోలీసులు సోదాలు జరిపారు. అందరినీ నిర్బంధించి సోదాలు చేశారు. నిషేధిత మత్తు పదార్థాలు లభించినట్లు సమాచారం. వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎయిర్పోర్టుకు అతి సమీపంలో ఉన్న ఫాంహౌస్లో రేవ్ పార్టీ జరగడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో పాల్గొన్నవారు బడాబాబులని, అమ్మాయిలను పిలిపించి నృత్యాలు, మద్యం తదితరాలతో జల్సా చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పెద్దసంఖ్యలో కార్లు, బైక్లు, మొబైళ్లు తదితరాలను సీజ్చేశారు. -
ట్రంప్ పేరుతో నకిలీ యాప్
బెంగళూరు: సైబర్ నేగరాళ్లు చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కూడా వదల్లేదు. ఆయన పేరుతో యాప్ను రూపొందించి.. 150 మందిని మోసం రూ.కోటి వసూలు చేశారు. ‘ట్రంప్ హోటల్ రెంటల్’పేరుతో యాప్ క్రియెట్ చేసిన స్కామర్లు.. ఇందులో పెట్టుబడులు పెడితే డబ్బు రెట్టింపవుతుందని నమ్మబలికారు. యాప్ చట్టబద్ధమైనదిగా చూపించడానికి ఏఐ జనరేటెడ్ ట్రంప్ వీడియోను ప్రసారం చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి బహుమతులు కూడా ఆశ చూపారు. అంతేకాదు.. ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో నమ్మిన బెంగళూరు, తమకూరు, మంగళూరు, హవేరి వరకు ప్రజలు యాప్లో ఉన్న నంబర్కు కాల్ చేసి డబ్బు ఇచ్చారు. 150 మంది కోటికి పైగా పెట్టుబడి పెట్టారు. వీరికి నమ్మకం కలిగించేందుకు స్కామర్లు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేవారు. కొన్ని రోజులపాటు చిన్నచిన్న బహుమతులు కూడా అందజేశారు. ఆ తరువాత షేర్లు రోజురోజుకూ పెరుగుతున్నట్టుగా డిజిట్స్ మారుస్తూ వారిని మాయ చేశారు. ఆ తరువాత కొంతకాలానికి యాప్లో ఉన్న నంబర్కు కాల్ చేస్తే స్పందన లేదు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. ఒక్క హవేరీలోనే 15 మందికి పైగా మోసపోయారని పోలీసు అధికారులు వెల్లడించారు. -
పేకాట సిగ్గుమాలిన పని కాదు
న్యూఢిల్లీ: పేకాట ఆడటం సిగ్గుమాలిన పని కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జూదం, గ్యాంబ్లింగ్లో భాగంగా పేకాట ఆడితే మాత్రం నేరమని స్పష్టంచేసింది. ఎలాంటి గ్యాంబ్లింగ్, బెట్టింగ్తో సంబంధం లేకుండా, ఎలాంటి మోసంతో ప్రమేయం లేకుండా కేవలం వ్యక్తిగతంగా, సొంత వాళ్లతో సరదాగా ఆడితే తప్పుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్డు పక్కన ఆటవిడుపుగా పేకాట ఆడాడన్న కారణంతో కర్ణాటకలో ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డ్లో డైరెక్టర్ సభ్యత్వానికి దూరం చేయడం సబబుకాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. కర్ణాటకలో గవర్నమెంట్ పోర్సలిన్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ హౌసింగ్ కో–ఆపరేటివ్ సొసైటీలో వైసీ హనుమంతరాయప్ప ఎన్నికల్లో అత్యధిక ఓట్లు గెలిచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యత్వం సాధించారు. అయితే రోడ్డుపక్కన పేకాట ఆడారన్న కారణంగా ఆయనపై రూ.200 జరిమానా వేసి, సభ్యత్వాన్ని రద్దుచేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టగా మే 14వ తేదీన ఆయనకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హౌసింగ్ సొసైటీలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ తీర్పు వెలువర్చింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ పేకాట అనేది నైతికంగా తప్పు కాదు. బెట్టింగ్, జూదం, గ్యాంబ్లింగ్లో భాగంగా ఆడితేనే నేరం. సరదాకి సొంత వాళ్లతో ఆడితే దానిని నేరంగా భావించొద్దు. ఈ కేసులో నిందితుడు హనుమంతరాయప్ప పేకాటకు బానిస కాదు. గ్యాంబ్లింగ్ చేయలేదు. కేవ లం విరామం, విశ్రాంతి వేళ మానసిక ప్రశాంతత కోసం పేకాట ఆడారు. 2020 ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించి డైరెక్టర్ల మండలిలో స్థానం సంపాదించిన ఈయనను పేకాట ఆడాడన్న ఒకే ఒక్క కారణం చూపి శిక్షించడం సహేతుకం అనిపించుకోదు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
యువతకు మార్గదర్శకులుగా ఉండాలి
బళ్లారిఅర్బన్: ఆధునిక పోకడలు, మానసిక ఒత్తిళ్లు, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం ఫలితంగా యువత దారి తప్పుతోందని, పోషకులు తమ పిల్లలను సరైన మార్గంలో ఉంచాలని శ్రీ వాసవీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు విఠ కృష్ణ కుమార్ అన్నారు. విద్యార్థుల మనోభావన, ఆధునిక సాంకేతిక విజ్ఞాన ప్రభావం, జనాభా నియంత్రణ అనే అంశాలపై యువతను జాగృతి చేసేందుకు వాసవీ స్కూల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలను తీర్చిదిద్దాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాల హెచ్ఎం వీరేష్ మాట్లాడుతూ యువత సోషల్ మీడియాకు బానిస కాకుండా ఉండాలన్నారు. ట్రస్ట్ ఉపాధ్యక్షుడు జితేంద్ర, కార్యదర్శులు సురేష్, జేసీ వఠం ఆధిత్య, అగడి గవిసిద్దేశ్వర ప్రసాద్, ముదగల్ సుభాష్, విజయ్కుమార్, హస్య కళాకారులు ఎర్రిస్వామి, చంద్రశేఖర్ ఆచార్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఆకలి తీర్చడమే ధ్యేయం
హొసపేటె: పేదల ఆకలి తీర్చేందుకే ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే గవియప్ప అన్నారు. విజయనగరం జిల్లా హోస్పేట తాలూకా హంపీ సమీపంలోని కమలాపూర్లో కొత్తగా నిర్మించిన ఇందిరా క్యాంటీన్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ హంపీ, కమలాపురను సందర్శించే పర్యాటకులు, స్థానికంగా ఉన్న పేదల సౌలభ్యం కోసం బస్ స్టేషన్ సమీపంలో క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ హోటళ్లలో టిఫిన్, భోజనం ధరలు పెరిగాయని, ఇందిరా క్యాంటీన్ ద్వారా తక్కువ ధరతో ఆహార పదార్థాలు లభిస్తాయన్నారు.