breaking news
Karnataka
-
పెళ్లికి వెళ్తున్నానని చెప్పి… ప్రియుడితో బిహార్కు పరార్!
శివాజీనగర(కర్ణాటక): హాసన్ జిల్లాలో బేలూరు వద్ద పెళ్లికి వెళ్లి అదృశ్యమైన వివాహిత కేసులో అనూహ్య మలుపు ఇది. ప్రియునితో వెళ్లిపోయినట్లు తేలింది. వివరాలు.. బేలూరుకు చెందిన ఓ మహిళను కుణిగల్ తాలూకా యలియూరువాసి పెళ్లి చేసుకున్నాడు. అతనికి బిహార్కు చెందిన వలస కార్మికుడు దేవిడ్ పరిచయం. అతడు అప్పుడప్పుడు ఇంటికి వస్తుండగా ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరూ బిహార్కు పారిపోవాలని పథకం వేశారు. ఆ మేరకు ఫిబ్రవరి 12న చిక్కమగళూరు జిల్లాలో బంధువుల వివాహానికి వెళుతున్నానని సుమారు రూ.20 లక్షలు విలువచేసే బంగారు నగలతో వెళ్లింది. ఆరోజు రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్లో చెప్పి స్విచాఫ్ చేసింది. ఆమె బట్టలు, బ్యాగు రోడ్డుపై పడేసి ప్రియునితో ఉడాయించింది. దీంతో శనివారం పోలీసులు అక్కడ చెరువులు, వాగుల్లో వెతికినా జాడ లేదు. చివరకు మొబైళ్ల లొకేషన్ని తనిఖీ చేయగా, తుమకూరు జిల్లా కుణిగల్లో ఉన్నట్లు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.మహిళ ఆత్మహత్య కోలారు: ఫినాయిల్ తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముళబాగిలు తాలూకా భైరకూరు గ్రామానికి చెందిన చైత్ర (27) అనే వివాహిత ఆదివారం మృతి చెందింది. బెంగుళూరు రూరల్ జిల్లా ఆనేకల్కు చెందిన చైత్రను ముళబాగిలు తాలూకా భైరకూరుకు చెందిన బాలకృష్ణ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే భర్త మొదటి భార్య, అత్త వేధిస్తున్నారనే ఆవేదనతో ఈ నెల 10న పినాయిల్ తాగింది. ఆమెను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. చైత్ర తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బాలకృష్ణ, అతని తల్లి, మొదటి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. -
నృత్యార్పణం
బొమ్మనహళ్లి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆనేకల్ తాలూకా సర్జాపురలోని క్లాసికల్ డ్యాన్స్ విద్యార్థినుల నృత్య ప్రదర్శన ముగ్ధుల్ని చేసింది. సోమేశ్వర స్వామి ఆలయంలో శివార్పణం అనే నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. 50 మందికి పైగా బాల కళాకారులు పాల్గొన్నారు. సుమారు 30 శాసీ్త్రయ నృత్య రూపాలను రమణీయంగా ప్రదర్శించారు. గురుదీప సంగీత, సీనియర్ నృత్యకారిణులు నేతృత్వం వహించారు. చిలుక జ్యోతిష్యుల అరెస్టు మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలోని మలే మహదేశ్వర కొండ మీద చిలుకలను నిర్బంధించారనే ఆరోపణలతో నలుగురు చిలుక జ్యోతిష్యులను అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళ్యం తాలూకాకు చెందిన గణేష్ నటరాజ్ (46), విక్రమ్ గణేష్ (23)లు పట్టుబడ్డారు. అలాగే మహాదేశ్వర కొండలోని లడ్డూ తయారీ కేంద్రం వద్ద సరియాజీ (28), గురుస్వామి (30) లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారు శాస్త్రం చెబుతామంటూ చిలుకలను పట్టుకుని తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. 8 చిలుకలను, శాస్త్రం చెప్పే కార్డులను స్వాధీనం చేసుకున్నారు. చేపల వలలో చిక్కి పులి మృతి మైసూరు: చామరాజనగర జిల్లా కొల్లేగాళ తాలూకాలోని గుండాల్ జలాశయంలో ఆదివారం పులి కళేబరం లభ్యమైంది. బిఆర్టి టైగర్ రిజర్వ్ అధికారులు పరిశీలించి, ఇది 5–6 సంవత్సరాల మగ పులి అని, జలాశయంలో చేపల కోసం వేసిన వలలో చిక్కుకుని చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అటవీ సిబ్బంది గస్తీ కాస్తుండగా పులి కళేబరం కనిపించింది. పోస్టుమార్టం జరిపించి దహనం చేస్తామని తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చికెన్ తినడంలో గొడవ.. బాలుని హత్య మైసూరు: కోడి కూర తినడంలో గొడవ జరిగి ఒక బాలున్ని మరో బాలుడు హత్య చేశాడు. మైసూరు జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా హళికెరె హాడిలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాలు.. ఇద్దరు బాలలు కలిసి అడవిలోకి వెళ్లి కోడిని పట్టుకుని వచ్చారు. దానిని వండుకుని ఆరగించారు. అయితే బాధిత బాలుడు ఎక్కువ మాంసం తిన్నాడని మరొక బాలుడు గొడవకు దిగాడు. అతడు కోపం పట్టలేక కొడవలి తీసుకొచ్చి తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాలునికి ప్రాథమిక చికిత్స చేయించి మైసూరుకు తరలించారు. అయితే, చికిత్స ఫలించక మరణించాడు. పిరియాపట్టణ పోలీసులు నిందితుని కోసం వెతుకుతున్నారు. సుస్తీ చేస్తే.. మోసుకునే వెళ్లాలి ● మహదేశ్వర బెట్ట గ్రామాల్లో దుర్భరం మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మలే మహదేశ్వర బెట్టలో అంబులెన్స్ అందుబాటు లేదు. బెట్ట పరిధిలోని కడుహోళ గ్రామంలో దుండమ్మ (55) అనే మహిళ ఇంట్లో ఉండగా స్పృహ కోల్పోయింది. బంధువులు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు, కానీ అందుబాటులో లేదని తెలిపారు. గుంజకు చీర కట్టి అందులో ఆమెను పడుకోబెట్టి మోసుకుని మహదేశ్వర బెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. చివరకు ఓ ప్రైవేట్ అంబులెన్స్లో తమిళనాడులోని మెట్టూర్ ఆసుపత్రికి తరలించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇక్కడి గ్రామాలకు రోడ్లు, మంచినీరు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి కనీస వసతులు లేవని స్థానికులు ఆవేదన చెందారు. మహదేశ్వర బెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ గ్రామాలకు రోడ్లు, విద్యుత్ కనెక్షన్తో సహా ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి గత సంవత్సరం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయడం తెలిసిందే. అయితే, అటవీ శాఖ అధికారులు ఏవో సాకులు చెప్పి పనులు నిలిపివేయించారు. -
కోరిన రూపంలో శివుని దర్శనం
మైసూరు: అమెరికా నాసా శాస్త్రవేత్తలు, ఆధునిక శాస్త్రం ప్రకారం, ఆకాశం క్షీరగతి లింగ రూపంలో ఉందని మైసూరు అవదూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. శివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆదివారం ఆశ్రమంలో విశ్వ ప్రార్థన మందిరంలో సచ్చిదానందేశ్వర శివలింగానికి ప్రత్యేక అభిషేకం, మంగళ హారతి పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వేలాది భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘శివుడు ఒక నిరాకార రూపం. భక్తులు కోరుకునే రూపంలో కనిపించే విశ్వం యొక్క రూపం ఆయనే. మొత్తం ప్రపంచం మూడు భాగాలను కలిగి ఉంటుంది. బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు’ అని పేర్కొన్నారు. హరి, హరుల మధ్య తేడా లేదని, శంకర నారాయణ తత్వమే అత్యుత్తమమని వర్ణించారు. హనుమాన్ చాలీసా చారిత్రాత్మకం శనివారం జరిగిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణోత్సవం చారిత్రాత్మకమని స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొనడం మైసూరు భక్తివేడుకల చరిత్రలో ఒక రికార్డు. అందరూ ఈ అపూర్వ విజయానికి కారణం అని తెలిపారు. గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో శివరాత్రి వేడుకలు -
మిస్సింగ్ కాదు.. ప్రియునితో పరారీ
శివాజీనగర: హాసన్ జిల్లాలో బేలూరు వద్ద పెళ్లికి వెళ్లి అదృశ్యమైన వివాహిత కేసులో అనూహ్య మలుపు ఇది. ప్రియునితో వెళ్లిపోయినట్లు తేలింది. వివరాలు.. బేలూరుకు చెందిన ప్రియాంక (29)ను కుణిగల్ తాలూకా యలియూరువాసి పెళ్లి చేసుకున్నాడు. అతనికి బిహార్కు చెందిన వలస కార్మికుడు దేవిడ్ పరిచయం. అతడు అప్పుడప్పుడు ఇంటికి వస్తుండగా ప్రియాంకతో అనైతిక సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరూ బిహార్కు పారిపోవాలని పథకం వేశారు. ఆ మేరకు ఫిబ్రవరి 12న చిక్కమగళూరు జిల్లాలో బంధువుల వివాహానికి వెళుతున్నానని సుమారు రూ.20 లక్షలు విలువచేసే బంగారు నగలతో వెళ్లింది. ఆరోజు రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్లో చెప్పి స్విచాఫ్ చేసింది. ఆమె బట్టలు, బ్యాగు రోడ్డుపై పడేసి ప్రియునితో ఉడాయించింది. దీంతో శనివారం పోలీసులు అక్కడ చెరువులు, వాగుల్లో వెతికినా జాడ లేదు. చివరకు ప్రియాంక, డేవిడ్ మొబైళ్ల లొకేషన్ని తనిఖీ చేయగా, తుమకూరు జిల్లా కుణిగల్లో ఉన్నట్లు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మహిళ ఆత్మహత్య కోలారు: ఫినాయిల్ తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముళబాగిలు తాలూకా భైరకూరు గ్రామానికి చెందిన చైత్ర (27) అనే వివాహిత ఆదివారం మృతి చెందింది. బెంగుళూరు రూరల్ జిల్లా ఆనేకల్కు చెందిన చైత్రను ముళబాగిలు తాలూకా భైరకూరుకు చెందిన బాలకృష్ణ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే భర్త మొదటి భార్య, అత్త వేధిస్తున్నారనే ఆవేదనతో ఈ నెల 10న పినాయిల్ తాగింది. ఆమెను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. చైత్ర తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బాలకృష్ణ, అతని తల్లి, మొదటి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మలుపు తిరిగిన వ్యవహారం -
మరో జాలీ రైడ్లో రక్తపుటేరులు
బనశంకరి: అతివేగంతో వెళుతున్న ఇండికా కారు రోడ్డు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుమంది యువకులు విగతజీవులయ్యారు. శనివారం అర్ధరాత్రి తుమకూరు–బెంగళూరు హైవేలో మాదనాయకనహళ్లి ఠాణా పరిధిలో నెలమంగల వద్ద ఈ విషాదం సంభవించింది. ఇంట్లో కారును తీసుకెళ్లి.. వివరాలు.. దొడ్డబళ్లాపుర నివాసులైన దుర్గాప్రసాద్(20), కేశవ్ (19), లలిత్కుమార్ (22), హర్షిత్ (20), ధనుశ్(17) అనే ఐదుమంది యువకులు తుమకూరుకు రైడ్కు వెళ్లారు. దొడ్డవాసి హర్షిత్ (20) బీకాం విద్యార్థి కాగా, శనివారం రాత్రి 8.30 వరకు ఇంట్లో ఉన్నాడు. స్నేహితులను కలిసి వస్తానని ఇండికా కారు తీసుకుని ఇంటినుంచి బయటికి వచ్చాడు. మిగతా నలుగురితో కలిసి జాలీ రైడ్కు వెళ్లినట్లు తెలిసింది. తిరిగి వస్తుండగా చిక్కబిదరకల్లు జిందాల్ కెనరాబ్యాంక్ ఎదురుగా ఫ్లై ఓవర్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను దాటుకుని అవతలి రోడ్డులో ఎదురుగా వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. కారు గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైంది. ఐదుమంది క్షణాల్లో మృత్యువాత పడ్డారు.ప్రమాదంలో మరణించినవారు (ఫైల్)కుటుంబాల రోదనలు లలిత్కుమార్ సీసీ కెమెరాలు అమర్చే పని చేస్తాడు, ధనుశ్ మగ్గం కార్మికుడు, మరో ఇద్దరి గురించి సమాచారం తెలియరాలేదు. కళ్లముందే కారు వచ్చి ఢీకొట్టిందని బస్సు డ్రైవర్ కెంపరాజు తెలిపాడు. బస్సు అద్దాలు ధ్వంసం కాగా ముందుభాగంలో కూర్చున్న కొందరు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. మాదనాయకనహళ్లి పోలీసులు చేరుకుని స్థానికుల సహాయంతో కారులో నుంచి మృతదేహాలను వెలికితీసి నెలమంగల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు, బంధువులు పరుగు పరుగున వచ్చి బోరున విలపించారు. అదుపుతప్పి బస్సును ఢీకొన్న కారు ఐదుగురు యువకుల బలి నెలమంగల వద్ద ఘోరం మృతులు దొడ్డబళ్లాపురంవాసులుజాలీ రైడ్ ఉత్సాహం, వచ్చీ రాని డ్రైవింగ్.. కలిసి బాలలు, యువకుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఇంట్లో తెలియకుండా కారు తీసుకుని, స్నేహితులతో కలిసి షికారుకు వెళ్లినవారు క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది. శుక్రవారం తెల్లవారుజాము హోసకోట వద్ద కారులో విహారానికి వెళ్లిన ఆరుగురు మైనర్లు దుర్మరణం చెందడం తెలిసిందే. ఆ విషాదం మరువకముందే బెంగళూరు సమీపంలో బస్సును కారు ఢీకొని ఐదుగురు యువకులు మరణించారు. కారు షికార్లు రక్తపాతంతో ముగుస్తున్నాయి. -
ఆటో బోల్తా – ఒకరి మృతి
రాయదుర్గం టౌన్: మండల పరిధిలోని భూపసముద్రం వద్ద అనంతపురం ప్రధాన రహదారిపై ఆదివారం ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు చనిపోయాగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని నాయకనహట్టి పంచాయితీ పరిధిలోని మల్లూరహళ్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 14 మంది డీజల్ ఆటోలో రాయదుర్గం మండలం జుంజుంరాపల్లి గ్రామంలోని చిత్రకొండపై వెలసిన అరుడ మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయల్దేరారు. భూపసముద్రం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్కు సైడ్ ఇచ్చే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఉచ్చప్ప (50) మృతి చెందగా రమేష్ (6)కు తీవ్ర రక్తగాయాలు, సంగీత (22)కు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో చిత్రదుర్గంకు తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు. -
హంపీలో జనసందోహం
● ముగిసిన హంపీ ఉత్సవాలు ● ఉర్రూతలూగించిన మంగ్లీ పాటలు, నృత్యాలు ● ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనసాక్షి బళ్లారి/హొసపేటె: గత రెండు రోజులుగా పర్యాటకులను కనువిందు చేసిన హంపీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. మొదటి రోజు కంటే శని, ఆదివారాల్లో ప్రజలు భారీగా విచ్చేయంతో హంపీ వీధులు కిక్కిరిపోయాయి. హంపీలోకి ప్రవేశించే దారిలో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. ఎంపీ ప్రకాష్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు లక్షలాది మందిని మంత్రముగ్ధుల్ని చేశాయి. ప్రధానంగా ప్రముఖ గాయినీ మంగ్లీ అలియాస్ సత్యవతి హంపీ ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో తన పాటలతో ఉర్రూతలూగించారు. కన్నడ, తెలుగు పాటలు పాడుతూ వాటికి నృత్యాలు చేయడంతో ఎంపీ ప్రకాష్ వేదిక ఈలలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. విజయనగర కాలంలో శ్రీ కృష్ణదేవరాయ గత వైభవాన్ని గుర్తు చేసేలా అధికారులు కార్యక్రమాలు నిర్వహించారు. -
హరహర శంభోశంకరా
సాక్షి, బళ్లారి: నగరంలో ఆదివారం మహాశివరాత్రి సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు రాత్రంతా ఆలయాల్లో జాగరణ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తిగీతాలు ఆలపిస్తూ శివుడికి పూజలు చేశారు. నగరంలోని కోట మల్లేశ్వర ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, నగరేశ్వర ఆలయం, సంగమేశ్వర ఆలయం తదితర శివాలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభోశంకర నామస్మరణ మార్మోగింది. హంపీలోని విరుపాక్షేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివలింగాలకు అభిషేకం.. రాయచూరు రూరల్: జిల్లాలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని మహాబలేశ్వర చౌక్లో చంద్ర మౌళేశ్వర దేవాలయం వద్ద రాత్రి 12 గంటల నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు. నగరేశ్వర, వీరభద్ర దేవస్థానం, ఐబీ రోడ్డులోని నందీశ్వరాలయం, రామలింగేశ్వర దేవాలయల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శివస్తోత్రం, కుంభాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. రామ మందిర్, హనుమాన్ మందిర్, రాజమాత గుడి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. మంత్రాలయంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థశ్రీపాదంగల్, కిల్లే మఠంలో శాంతమల్ల శివాచార్యులు శివలింగాలకు అభిషేకం చేశారు. అళంద దర్గాలో.. రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాలో శివరాత్రి పర్వదినం సందర్భంగా అళందలో లాడ్లే మశాక్ దర్గాలో రాత్రి 12 గంటల నుంచే భక్తులు పూజలు చేశారు. శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. రాఘవ చైతన్య శివలింగ పూజ వివాదంగా మారడంలో హైకోర్టు నుంచి అనుమతి పొంది పూజలు చేశారు. హంపీలోని విరుపాక్షేశ్వర స్వామికి పూజలు శ్రీశైల బ్రమరాంభిక మల్లికార్జునుడికి అభిషేకంపూజలందుకున్న భువనేశ్వరి దేవి అలంకరణలో హంపీలోని పంపాదేవి ఘనంగా మహాశివరాత్రి వేడుకలు భక్తులతో శివాలయాలు కిటకిట మార్మోగిన శివనామస్మరణ ఉపవాస దీక్షలతో జాగరణ ఆకట్టుకున్న ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర హంపీకి పోటెత్తిన భక్తులు హొసపేటె: మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం దక్షిణ కాశీగా వెలుగొందిన హంపీలో భక్తుల కోలాహలం నెలకొంది. విజయనగరం జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శివుడి దర్శనం చేసుకునేందుకు ఉదయం ఐదు గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హోస్పేట్లోని నీలకంఠేశ్వర ఆలయం వద్ద భక్తులు క్యూలో నిలబడి స్వామిని దర్శించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం రాయచూరు రూరల్: ఆధ్యాత్మిక, సంస్కృతి, ఆచార, సాంప్రదాయాలకు భారతదేశం నిలయమని సోమవారి పేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతి, మత, కుల, వర్గ, సంఘర్షణల మధ్య భారతీయులు నలిగిపోతున్నారన్నారు. నైతిక విలువలకు గౌరవం లేకుండా పోయిందని పేర్కొన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం సంచాలకురాలు స్మిత మాట్లాడుతూ.. పరంజ్యోతి స్వరూపం సత్య శివరాత్రి అని తెలిపారు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేందుకు సత్య జ్ఞానాన్ని అందించేందుకు శివుడు ప్రత్యక్షమవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం కార్లపై ద్వాదశ జ్యోతిర్లింగాలను ఊరేగించారు. -
మహనీయుల బాటలో నడవాలి
బళ్లారి టౌన్: మహనీయులను జయంతులను ఆచరించడం వల్ల సమాజం ఐక్యత, శక్తి ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుందని పాలికె మేయర్ పీ.గాదెప్ప పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో జిల్లా పాలన, జిల్లా పంచాయతీ తదితర శాఖల ఆధ్వర్యంలో సంత సేవలాల్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో పెద్దలు వేసిన బాటలో మనమందరం నడవాలన్నారు. మహనీయుల సందేశాలను రానున్న యువతకు తెలియజేయాలని సూచించారు. ఈసారి మహనగర పాలికె నిధులలో సుమారు 28 మంది మహనీయుల జయంతులను ఆచరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమాజ అభివృద్ధికి ఇలాంటి జయంతి సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. వీటి కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు. జిల్లా గ్యారంటీ పథకాల ప్రాధికార అధ్యక్షుడు కేఈ చిదానందప్ప మాట్లాడుతూ.. సంత సేవలాల్ సత్యం, అహింస, త్యాగ మనోభావంతో సమాజ సేవకు తోడ్పడ్డారన్నారు. కార్యక్రమంలో నేతలు ప్రొఫెసర్ హెచ్.శాంత నాయక్, కన్నడ సాంస్కృతిక శాఖ ఏడీ నాగరాజు, సంద్యా రావు, సమాజ నేతలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం
రాయచూరు రూరల్: మహాశివరాత్రి సందర్భంగా సంగమేశ్వరుడి దర్శనం కోసం వెళ్లిన వృద్ధ దంపతులను ఆర్టీసీ సిబ్బంది మార్గంమధ్యలో వదిలి వెళ్లిపోయారు. ఈ యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం యాదగిరి నుంచి సంగమేశ్వర దేవాలయానికి వెళ్లేందుకు అన్నపూర్ణ, సంగమేశ్వర్లు దంపతరులు ఆర్టీసీ బస్సు ఎక్కారు. అయితే స్టేజీ కిలోమీటర్ దూరం ఉండగానే మార్గంమధ్యలో గూండ్లూరు వద్ద దింపేసి వెళ్లారు. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వృద్ధ దంపతులు కిలోమీటర్ నడుచుకుని వెళ్లాల్సి వచ్చింది. -
రేపు కళ్యాణ కర్ణాటకలో చిత్రసంతె
హుబ్లీ: కళ్యాణ కర్ణాటకలో చిత్రలేఖనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కలబుర్గిలోని టౌన్ హాల్ ఎదురుగా సార్వజనిక ఉద్యానవనంలో మంగళవారం ఉదయం 11 గంటలకు చిత్రసంతే కార్యక్రమం నిర్వహించనున్నారు. కలబుర్గిలో చిత్రలేఖనంపై ప్రత్యేకంగా కృషి చేస్తున్న మేటి కళాకారుడు షాహిద్ పాషా విలేకరులతో మాట్లాడారు. విజయనగర పరంపరలో భాగంగా కిన్నాళ, గరుడాద్రి, తదితర శైలి సాంకేతిక సురపుర, సంస్థాన గరుడాద్రి కళా జాతీయ స్థాయిని ఆకర్షించిందన్నారు. తొలిసారిగా కలబుర్గి నీలహార్డ్స్ శ్రీ మార్కెటింగ్ అసోసియేట్ బీదర్ సంయుక్త సౌజన్యం, కళాకారుల సహాయ సహకారాలతో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కళ్యాణ కర్ణాటక చిత్రసంతె ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి ప్రముఖులు అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ చిత్రసంతెలో కళాకారులు తమ కళాకృతులను అందుబాటులో ఉంచి కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరారు. సామాజిక బహిష్కరణ నుంచి విముక్తి కల్పించండి రాయచూరు రూరల్: సాంఘిక దురాచారంతో 12 కుటుంబాలు సామాజిక బహిష్కరణకు గురైన ఘటన యాదగిరి జిల్లాలో చోటుచేసుకుంది. యాదగిరి జిల్లా శహపుర తాలుకాలో ఎనిమిదేళ్లుగా సమాజం నుంచి వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శహపురలోని జిహేశ్వర కళ్యాణ మంటపం, వ్యాపార దుకాణాల నుంచి ఏడాదికి రూ.25 లక్షలు ఆదాయం వస్తుంది. ఇందుకు సంబంధించిన సంబంధించిన లెక్కలు చెప్పాలని ప్రశ్నించినందుకు 12 కుటుంబాలను అధ్యక్షులు, పదాధికారులు సామాజిక బహిష్కరణ చేశారు. 20 కుటుంబాలకు గాను 8 కుటుంబాలు సంఘానికి జరిమానా కట్టడంతో తిరిగి గ్రామంలోకి చేర్చుకున్నారు. సామాజిక బహిష్కరణ నుంచి విముక్తి కల్పించాలని మరో 12 కుటుంబాలు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. కనీసం ఇప్పటికై నా స్పందించి సామాజిక బహిష్కరణ నుంచి విముక్తి కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తెలుగు భాషాభిమాని గోపాల కృష్ణయ్య మృతి హోసూరు: ప్రముఖ సాహితీ వేత్త, నివృత్త ఉపాధ్యాయుడు కోదండ రామయ్య రెండవ కుమారుడు గోపాలకృష్ణయ్య (86) ఆదివారం ఉదయం మరణించాడు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన తన నివాసంలో కన్ను మూశారు. గోపాల కృష్ణయ్య తన తండ్రి అడుగు జాడల్లో నడిచి భాషా సాహిత్యానికి సేవలందించారు. గోపాల కృష్ణయ్య మృతికి ఆంధ్ర సాంస్కృతిక సమితి నిర్వాహకులు చంద్రశేఖర మాస్టారు, విశ్వనాథ్, అన్నయ్యప్పతో పాటు పలువురు సంతాపం తెలిపారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
రాయచూరు రూరల్: ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ధార్వాడా జిల్లా అధికారి ఆర్.స్నేహల్ సూచించారు. ఆదివారం జిల్లా అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అలసత్వం తగదన్నారు. సమయపాలన పాటిస్తూ సేవలు అందించాలని సూచించారు. ధార్వాడా జిల్లా కళలు, సాహిత్యం, సంగీతం, విద్య, చిత్రకళల్లో ప్రసిద్ధి చెందిందన్నారు. జిల్లా అభివృద్ధికి తోడు జిల్లా గౌరవాన్ని పెంపొందించాలని సూచించారు. వ్యక్తిగత కారణాలతో ప్రజలను నిరక్ష్యం చేయడం తగదన్నారు. ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జానపద వాహిని ఊరేగింపు హొసపేటె: హంపీ ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం సాయంత్రం ఉద్దాన వీరభద్రేశ్వర ఆలయం వరకు జానపద వాహిని ఊరేగింపు జరిగింది. శోభాయాత్రలో ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప జిల్లా కలెక్టర్ కవితా ఎస్ మన్నికేరితో పాటు ప్రముఖులు పాల్గొని నాదదేవి భువనేశ్వరి దేవిని దర్శించుకుని పూజలు చేశారు. జానపద వాహిని కళా బృందాల ఊరేగింపు దేశంలోని గ్రామీణ ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పింది. మా భువనేశ్వరి దేవిని జానపద కళా రూపాల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపులో వుడ్విండ్స్, వీరోచిత నృత్యం, పగటిపూట వేషధారణ, సింథోల్ నృత్యం, నంది జెండా, ట్రంపెట్ వాయించడం, హక్కిపిక్కి నృత్యం, ఎలుగుబంటి పండుగ, పురవంటికే, పూజ నృత్యం, నగరి లంబానీ సర్కిల్, కంసాలే, చందేవాద్య, సోమన నృత్యం, గొరవర నృత్యం, కళా బృందాలు ఉన్నాయి. కార్యక్రమంలో సబ్ డివిజనల్ ఆఫీసర్ వివేక్, తహసీల్దార్ శృతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సరళంగా కవిత్వ రచనహొసపేటె: ‘ఆధునిక యుగపు యువ కవులు సామాన్యుల సమస్యలను వినిపించే గొంతుకగా మారాలి. సాహిత్య వారసత్వంలో నమోదు కాని వీధి కార్మికుల జీవితాలను కవితల్లో వ్యక్తీకరించాలి. వారి కథలను చెప్పాలి’ అని సీనియర్ రచయిత ఏఎం మదారి సూచించారు. హంపీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విరుపాక్షేశ్వర వేదికలో యువకవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిత్వ రచనకు అర్థవంతమైన భాష, శైలి, అలంకారిక భాష ముఖ్యమని తెలిపారు. యువ కవులు వీటిని విస్మరించకూడదని సూచించారు. కవిత్వం మనస్సు భారాన్ని తగ్గించుకోవడానికి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక మార్గమని అభిప్రాయపడ్డారు. కవులు, కళాకారులు, రచయితలు ఆత్మగౌరవంతో జీవించాలని తెలిపారు. అధికారంలో ఉన్నవారి తప్పులను ప్రశ్నించే నైతికతను కలిగి ఉండాలన్నారు. పూజకు యత్నించిన పలువురు అరెస్ట్ హుబ్లీ: కలబుర్గి బహుమని కోట ఆవరణలోని ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పూజకు అనుమతి తీసుకోకుండా సదరు కోటలో ప్రవేశించి పూజ చేయడానికి ప్రయత్నించారు. ఎస్ఐ నియామకాల అక్రమ సూత్రాధారి దివ్య ఆగరిగితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పూచీకత్తు తీసుకున్న అనంతరం విడుదల చేశారు. -
ఆరోగ్యంపై అవగాహనకే మారథాన్
బళ్లారి అర్బన్: తొలి కురుగోడు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ శివారులోని వడ్డట్టి క్రాస్ నుంచి పెద్ద బసవేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించిన మారథాన్ను కంప్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జేఎన్.గణేష్ ప్రారంభించారు. యువకులు, యువతులు, 40 ఏళ్లు పైబడిన పురుషుల విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యంపై అవగాహనకు మారథాన్ పరుగు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం నిర్వహించిన ఎడ్లబండ్ల ప్రదర్శన ఆకట్టుకుంది. పెద్ద బసవేశ్వర ఆలయం నుంచి కంప్లి రోడ్డులోని పెట్రోల్ బంక్ వరకు మహిళలు రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. ఆలయ గోపురం, నంది విగ్రహం, సామాజిక సందేశాలు, కురుగోడు ఉత్సవానికి స్వాగతం, వంటి ఆకృతులు అందరినీ ఆకట్టుకున్నాయి. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కేసరి గడ్డపై పరుగుపందెం పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ మోడల్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలు ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో హాబీ కళాకారుల ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో కురుగోడు పురసభ అధ్యక్షుడు టి.శేకన్న, తాలూకా గ్యారంటీ పథకాల అమలు కమిటీ అధ్యక్షుడు బసవన గౌడ, తహసీల్దార్ నరసప్ప తదితర అధికారులు పాల్గొన్నారు. -
అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో అదృశ్యమైన కర్నాటకకు చెందిన విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందారు. 22 ఏళ్ల సాకేత్ మృతదేహం శనివారం పోలీసులకు లభించినట్లు శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తరలించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని, కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. సాకేత్ బర్కిలీ యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చదువుతున్నారు. ఆయన ఫిబ్రవరి 9 నుంచి కనిపించకుండా పోయారు. మంగళవారం టిల్టెన్ రీజనల్ పార్క్లోని లేక్ అంజా దగ్గర కనిపించినట్టు పోలీసులు తెలిపారు. పార్క్ హిల్స్ పరిసరాల్లోని ఒక ఇంటి సమీపంలో ఆయన పాస్పోర్ట్, ల్యాప్టాప్తో కూడిన బ్యాక్పాక్ పోలీసులకు లభించింది. -
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది. -
నింగి నుంచి నేల గురించి..
బెంగళూరు: భారత్, అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థలు ఇస్రో, నాసాల మానసపుత్రికగా తయారై గగనతలంలో చక్కర్లు కొడుతున్న నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్(నైసర్) ఉపగ్రహం నుంచి ప్రతి 12 రోజులకు ఒకసారి యావత్ భారతదేశ పర్యావరణ, జీవావరణ, హిమానీ నదాలు, జలరాశులకు సంబంధించిన సమస్త తాజా సమాచారం అందనుంది. ఈ వివరాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ఎస్–బ్యాండ్, ఎల్–బ్యాండ్ల మేలు కలయికగా జంట ఫ్రీక్వెన్సీల సింథటిక్ అపర్చర్ రాడార్లను నైసర్ ఉపగ్రహంలో అమర్చారు. వీటి సాయంతో నేలలో తేమ వంటి అత్యంత కీలక వివరాలు సైతం 100 గీ 100 మీటర్ల అత్యధిక రెజల్యూషన్తో ఛాయాచిత్రాల రూపంలో అందనుంది. 100 మీటర్ల రెజల్యూషన్ చిత్రపటం అంటే అందులోని ఒక్కో పిక్సెల్ లేదా డేటా అనేది భూమిపై 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని నేల సమాచారాన్ని పట్టిచూపుతుంది. నేలలో తేమ అనేది నీటిపారుదల, కరువుల సమస్యకు పరిష్కారాలు చూపిస్తూ భారత సాగు, నీటి నిర్వహణ విధానంలో కీలకభూమిక పోషిస్తోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్షం, పొగమంచు, మేఘాల వంటి పరిస్థితుల్లోనూ నేల ఫొటోలను అత్యంత స్పష్టంగా తీసి పంపుతుంది. దీంతో నీటిపారుదల సదుపాయం ఉన్న ప్రాంతాలతోపాటు వర్షాధార నేలలు, వర్షాభావ ప్రాంతాలు, అత్యధిక వర్షపాతమున్న ప్రాంతాల్లో ప్రతి రోజూ నేలలో తేమ ఎంతశాతముందనే వివరాలు తెలుస్తాయి. దీంతో సాగునేలకు ఎంత మేర నీరు అవసరం, ఏస్థాయిలో నీటిని సరఫరా చేయాలి? అనే వివరాలపై రైతలకు ఒక స్పష్టత వస్తుంది’’అని ఇస్రో తన ప్రకటనలో పేర్కొంది. నేల సమస్త సమాచారం అందుబాటులోకి.. ‘‘నేలపై సెంటీమీటర్ పరిధిలో కూడా నిశితమైన ఫొటోలను తీసి పంపుతాయి. నైసార్కు ఉన్న రెండు రాడార్లలో ఒకటి ఎల్–బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో, మరోటి ఎస్–బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తాయి. నేలతేమను పట్టిచూసే భౌతికశాస్త ఆధారిత అల్గారిథమ్ను స్పేస్ అప్లికేషన్ సెంటర్(ఎస్ఏసీ–ఇస్రో)లో అభివృద్ధిచేశారు. ఇది శాస్త్రీయంగా నేల ఆరోగ్యాన్ని కనిపెడుతూ అత్యంత ఖచ్చిత్వంతో నిర్ణయాలు తీసుకోవడానికి సాయపడుతుంది. రెండు బ్యాండ్ల కారణంగా 12 రోజులకు ఒకసారి రాడార్లు భూమిని చుట్టేస్తూ నేల స్వభావ, స్వరూపాల సమస్త సమాచారాన్ని మనకు అందిస్తాయి. ఈ సమాచారాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఐఎంజీఈఓఎస్/ఎన్ఆర్ఎస్సీ) సేకరిస్తుంది. ఈ డేటాను భూనిధి పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెస్తుంది. ప్రతి 12 రోజులకు ఒకసారి మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమాచారం అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ సమాచారంతో రైతులు, విధాన రూపకర్తలు, పరిశోధకులు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వేతర కంపనీలు తమ పరిధి మేర నిర్ణయాలు తీసుకునే సువర్ణావకాశం దక్కుతుంది’’అని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. మధ్య భారతదేశం మొదలు సింధూ–గంగా మైదాన ప్రాంతాల్లోని పంటభూముల దాకా ప్రతిచోటా నేలలో తేమ శాతం ఎంత ఉంది? ఎంత ఉండాలి? ఏంత మేర అదనంగా నీటి సరఫరా అవసరం? అనే వివరాలు అందటంతో ఆ మేరకు విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం చిక్కుతుంది. ఎల్–బ్యాండ్ రాడార్ అనేది అడవీప్రాంతాలు, ఎడారులు, మంచుమయ ప్రాంతాల్లోని నేల స్వభావాన్ని విశ్లేíÙస్తుంది. భూగర్భంలో మార్పులనూ పసిగట్టగలదు. ఎస్–బ్యాండ్ రాడార్ అనేది పంట పొలాలు, నీటి వనరుల తాజా స్థితిని తెలియజెప్తుంది. సమిష్టిగా ఈ రెండు బ్యాండ్లు కలిసి భారతీయ నేలల ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ నీటి వనరుల లభ్యతపై పరిశోధకులకూ స్పష్టమైన అవగాహన పెంపొందిస్తాయి. భారతదేశం అంతటా ఒకేలా వర్షాలు పడవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వాతావరణం ఉంది. ఒక్కోసారి జిల్లా జిల్లాకు మధ్య వాతావరణ వ్యత్యాసం ఉంది. దీంతో చిన్న చిన్న క్లస్టర్లుగా విభజిస్తూ వేర్వేరుగా డేటాను సమీకరించాల్సి వస్తోంది. అందుకోసమే నైసర్ను నింగిలోకి పంపారు. నీటి నిర్వహణతోపాటు వాతావరణ మార్పుల వంటి అంశాలూ స్పష్టంగా తెలియనున్నాయి. గత ఏడాది జీఎస్ఎల్వీ 16 ప్రయోగం ద్వారా నైసర్ను నింగిలోకి పంపిన విషయం విదితమే. -
రామ భక్త జయ హనుమా..
హాజరైన దేశ, విదేశీ భక్తులు, కాషాయ జెండాలతో ఉత్సాహం మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్న గణపతి సచ్చిదానంద స్వామి మైసూరులో ఓ శివాలయంలో శివరాత్రికి సన్నాహాలు మైసూరు: నగరంలోని మహారాజ కాలేజీ మైదానంలో అవదూత దత్తపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృహత్ సామూహిక శ్రీహనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం భక్తిశ్రద్ధలతో జరిగింది. గణపతి సచ్చిదానంద స్వామీజీ నేతృత్వంలో జరిగిన ఆధ్యాత్మిక వేడుకలో 50 వేల మందికిపైగా హనుమ భక్తులు పాల్గొన్నారు. మొదట పవమాన హోమానికి పూర్ణాహుతి అర్పించారు. ఎమ్మెల్యేలు శ్రీవత్స, కే.హరీష్గౌడ, జీటీ దేవెగౌడ, నగర ప్రముఖులు పాల్గొన్నారు. రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కీ అనే నినాదంతో గణపతి సచ్చిదానంద స్వామి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుందరకాండ పారాయణం 2 గంటల పాటు నిరంతరంగా సాగింది. ఈ అవధిలో మొత్తం 18 సార్లు హనుమాన్ చాలీసాను పఠించారు. కేసరిమయం భక్తుల చేతుల్లో కేసరి ధ్వజాలు రెపరెపలాడాయి. మైదానం నిండా కేసరి రంగులో జెండాలు కనిపించాయి. ఎటు చూసినా హనుమ భక్తుల దండు కనిపించింది. హనుమ భక్తులు తరలి వచ్చారు. భక్తులనుద్దేశించి దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశీర్వచనం చేశారు. మైసూరు దత్తపీఠంలో హనుమాన్ చాలీసా పారాయణం వేలాదిగా పాల్గొన్న భక్తులు -
ఘనంగా విశ్వేశ్వరస్వామి రథోత్సవం
చింతామణి: చింతామణి తాలూకాలోని పెద్దూరు గ్రామ వ్యాప్తిలోని మజరా దిగువకోటలో వెలసిన పురాతన పుణ్యక్షేత్రమయిన శ్రీ విశ్వేశ్వరస్వామి ఆలయ రథోత్సవం ఘనంగా జరిగింది. శనివారం ఉదయం నుంచి స్వామివారిని వేలాదిమంది భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. పండితులు అభిషేకం, హోమాలు నిర్వహించారు. స్వామి ఉత్సవ విగ్రహాలను తేరులో ప్రతిష్టించి ఊరేగించారు. చిన్నస్వామిలో ద్రవిడ్, కుంబ్లే స్టాండ్లు బనశంకరి: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం మైదానంలో ప్రేక్షకుల స్టాండ్లకు ప్రముఖ మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్కుంబ్లే, శాంత రంగస్వామి పేర్లను పెట్టారు. వీరు కన్నడిగులే కాకుండా ఇదే స్టేడియంలో ఆడి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ఈ మేరకు కేఎస్సీఏ వారికి ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి రాహుల్ ద్రవిడ్ హాజరై ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తనకు, తన తండ్రికి గర్వంగా ఉంటుందని పేర్కొన్నారు. సుప్రీంలో యత్నాళ్కు ఊరట ● ప్రత్యర్థి పిటిషన్ కొట్టివేత హుబ్లీ: గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయపుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్కు సుప్రీంకోర్టులోను ఊరట దక్కింది. ఆయన ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని పరాజిత కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ హమీద్ దాఖలు చేసిన రిట్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. యత్నాళ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలురకాల అక్రమాలకు పాల్పడి గెలిచారని అబ్దుల్ హమీద్ ఆరోపణలు చేశారు. ఈ రిట్ను కలబుర్గి హైకోర్టు పీఠం గతంలో డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో మరో రిట్ దాఖలు చేసినా ఫలితం దక్కలేదు. సుప్రీం కోర్టు రిట్ను తిరస్కరిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే యత్నాళ్ తమ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. -
వెయ్యి దినాలు.. వెయ్యి అబద్ధాలు
శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పరిపాలన, వెయ్యి సమస్యలు అని బీజేపీ ఆరోపించింది. శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి విజయాలు లేకుండా ఈ ప్రభుత్వం విజయోత్సవ సభలు జరుపుకొంటోంది. వెయ్యి దినాల్లో వెయ్యి సమస్యలు వచ్చాయి అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పనిలో నిమగ్నం కాగా, రాష్ట్ర ప్రభుత్వం నిరీక్షణలతోనే గడుపుతోందన్నారు. పంచ గ్యారెంటీలు పంక్చర్లై చాలా రోజులైంది. రోడ్ల గుంతల మూసివేయలేదు. అభివృద్ధి లేదు. అవినీతి మాత్రమే ఉంది. అవినీతిలో దేశానికే ఆదర్శంగా ఉన్నారు అని దుయ్యబట్టారు. వెయ్యి అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్కు ప్రభుత్వాన్ని కుదువ పెట్టారు, ఇక్కడ దోచుకొని హైకమాండ్కు అందిస్తున్నారని ఆరోపించారు. వాల్మీకి మండలి స్కాం, ముడా అక్రమాలు, స్మార్ట్ మీటర్లు, ఎకై ్సజ్ శాఖలో కుంభకోణాలు, గృహలక్ష్మీ పథకంలో అక్రమాలు జరిగాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం 25 సంవత్సరాల వెనక్కి వెళ్లింది. ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని ఆరోపించారు. రైల్వే పథకాలకు తన వాటా సొమ్ము ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది బీజేపీ నేత విజయేంద్ర -
వినూత్నంగా ప్రేమికుల రోజు
శివాజీనగర: కన్నడ చళవళి వాటాళ్ నాగరాజ్ పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజు ప్రేమికుల రోజును వినూత్నంగా ఆచరించారు. బెంగళూరు నగర సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద గాడిదలకు సంప్రదాయరీతిలో పెళ్లి చేశారు. పూలమాల వేసి మంగళసూత్రం సమర్పించి మంత్రాలు చదివించారు. ఆ సమయంలో మగ గాడిద హఠాత్తుగా పరిగెత్తి పోయింది. దీనిని వీక్షిస్తున్న జనం నవ్వులలో మునిగిపోయారు. నాగరాజు అనుచరులు మగ గాడిదను పట్టుకొచ్చి వివాహ ప్రక్రియను పూర్తి చేయించారు. వాటాళ్ మాట్లాడుతూ ప్రేమ అనేది మనుషులకు మాత్రమే పరిమితం కాదు, అది ప్రాణి–పక్షులకు కూడా ఉందన్నారు. గాడిద చాలా పవిత్రమైన ప్రాణి, పురాణాల్లో కూడా గాడిద ప్రస్తావనలు ఉన్నాయని తెలిపారు. ప్రేమ వివాహం చేసుకునే జంటలకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసి, భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, బెంగళూరులోని పార్కులు, హోటళ్లు ప్రేమజంటలతో కిటకిటలాడాయి. వీకెండ్ కూడా కావడంతో లవర్స్ డే సందడి ఉట్టిపడింది. నందికొండ మూసివేత యశవంతపుర: ప్రేమికుల దినోత్సవం నాడు నందికొండపై విహరించాలని వెళ్లిన ప్రేమజంటలకు, భార్యాభర్తలకు నిరాశే మిగిలింది. జిల్లా అధికారులు శనివారం నంది హిల్స్ను పూర్తిగా మూసివేశారు. ప్రేమికుల రోజున కొండపై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ చర్య తీసుకున్నారు. ఉదయం నుంచే అనేక ప్రేమజంటలు బైక్లు, కార్లలో వచ్చాయి, కొండమీదకు వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అలాంటి వారిని పోలీసులు అడ్డుకుని వాపస్ పంపడంతో తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. జిల్లా కలెక్టర్ ప్రభు బంద్ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. కొండపైన గొడవలు, ప్రేమ విఫలమైనవారు ఆత్మహత్య చేసుకొనే ప్రమాదం ఉందని అన్ని మార్గాలను బంద్ చేశారు. గాడిద జంటకు వివాహోత్సవం -
జ్యోతిర్లింగ రథయాత్ర
తుమకూరు: బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని వివిధ రోడ్లలో 21 జ్యోతిర్లింగాలతో రథయాత్ర నిర్వహించారు. సదాశివనగర రింగ్ రోడ్డులోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రథయాత్రకు శ్రీకారం చుట్టారు. భక్తిగీతాలతో నగరవీధుల్లో సాగింది. గ్రామ పంచాయతీలో రూ.54 లక్షల స్కాం ● అధికారులపై లోకాయుక్త కేసు మండ్య: తాగునీటి సరఫరా, వీధి దీపాల వస్తు సామగ్రిని కొనకపోయినా, రూ.54 లక్షలను చెల్లించిన కేసులో పీడీఓతో సహా ఆరుగురిపై లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. మండ్య తాలూకాలోని తగ్గహళ్లి గ్రామ పంచాయతీ ప్రబార గ్రామం పీడీఓ శ్రీనివాసయ్య, పీడీఓ హెచ్.ఎస్. లక్ష్మి, కార్యదర్శి శివరుద్ర, సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఇంజనీర్లు ఇందులో ఉన్నారు. వివరాలు.. తగహళ్లి పీడీఓ లక్ష్మి 16 రోజులు సెలవులో ఉన్నారు. ఈ సమయంలో, అలకెరె గ్రామ పంచాయతీ పీడీఓ శ్రీనివాసయ్యకు అదనపు బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న మూడు రోజుల్లోనే, శ్రీనివాసయ్య తాగునీరు, వీధి దీపాల సామగ్రి కొనుగోలు పేరుతో ఓ ఏజెన్సీకి రూ. 54 లక్షలు చెల్లించారు. ఇది తెలిసి గ్రామస్తులు జెడ్పీ సీఈఓ నందినికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరపగా అక్రమాలు నిజమేనని తేలింది. ఈ స్కాంని తీవ్రంగా పరిగణించిన డిప్యూటీ లోకాయుక్త జస్టిస్ బి. వీరప్ప సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో చర్యలు తీసుకునే అవకాశముంది. మామూలు ఇంటికి రూ.16 వేల కరెంటు బిల్లు యశవంతపుర: బెంగళూరు నగరంలో సాధారణ ఇంటికి వచ్చిన కరెంటు బిల్లును చూసి యజమాని షాక్ తిన్నట్లు చెబుతున్నాడు. 3 బీహెచ్కె ఇంటికి రూ.16,883 బిల్లు వచ్చిందని యజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒక ఏసీ, గేమింగ్ పీసీ, కరెంటు స్టవ్, ఫ్యాన్ వంటివి ఉన్నాయి. దీనికి కరెంట్ బిల్ రూ.16,883 రావడం ఎలా సాధ్యమని ప్రశ్నించాడు. బెంగళూరులో ఇంతమొత్తంలో బిల్లులు వేయడం సహజమేనని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఈ నెల 18లోపు కరెంట్ బిల్ను చెల్లించాలని బెస్కాం అధికారులు బిల్లులో పేర్కొన్నారు. గగనం నుంచి ఖనిజాన్వేషణ యశవంతపుర: కాఫీనాడు చిక్కమగళూరు, మలెనాడు ప్రాంతాలలో గత కొన్ని రోజుల నుంచి చిన్న విమానం నిరంతరం తిరుగుతోంది. దీంతో ప్రజల్లో ఉత్సుకతతో పాటు కలవరం కూడా నెలకొంది. దీనిపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ నాగరాజు వివరణ ఇచ్చారు. ఇది భద్రతకు సంబంధించిన సర్వే కాదని, వైజ్ఞానిక సమీక్ష అని తెలిపారు. భారతీయ భూ వైజ్ణానిక సర్వే శాఖ భూగర్భంలోని ఉన్న ఖనిజ నిక్షేపాలను కనుగొనడానికి, భూగర్భ జలాలు తదితరాల అధ్యయనం కోసం విమానం ద్వారా పరిశీలన చేస్తోంది. చిన్న సెస్నా విమానం తరచూ తక్కువ ఎత్తులో ఎగురుతోంది. ఎన్ఆర్పుర, బాళెహొన్నూరుతో పాటు అనేక ప్రాంతాలలో సర్వే సాగుతోంది. పెళ్లికి వెళ్లి అదృశ్యం యశవంతపుర: పెళ్లికి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన హాసన్ తాలూకా కల్కెరె గ్రామంలో జరిగింది. వివరాలు.. తుమకూరు జిల్లా కుణిగల్కు చెందిన ప్రియాంక (29) కనిపించడం లేదు. బంధువుల పెళ్లి కోసమని ప్రియాంక చిక్కమగళూరుకు గురువారం వెళ్లింది. బేలూరు పరిధిలో జాతీయ రహదారి– 373 దగ్గర ఆమె బట్టలు, చెప్పులు, హ్యాండ్బ్యాగ్ను ధర్మస్థలకు వెళ్తున్న పాదయాత్రికులు కనుగొన్నారు. బ్యాగులోని ఆధార్ కార్డుపై ఉన్న మొబైల్ నంబర్కు వారు కాల్ చేయగా భర్తకు వెళ్లింది, మీ భార్య ఆధార్కార్డ్ మాకు దొరికిందని భక్తులు తెలిపారు. దీంతో భర్త, బంధువులు కంగారుపడి వెళ్లగా కొన్ని వస్తువులను ఇచ్చారు. ఆమె అనుమానాస్పదంగా అదృశ్యం కావడంపై భర్త, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆమె ఒంటిపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు వరకు బంగారు నగలు ధరించి వెళ్లిందని తెలిపారు. బంగారం కోసం ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనాస్థలిని ఫైర్ సిబ్బంది, పోలీసులు పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. -
బ్యాంకులో రూ.4 కోట్ల బంగారం మాయం
యశవంతపుర: బెంగళూరు గిరినగర పోలీసుస్టేషన్ పరిధిలోని ఇండియన్ బ్యాంక్ శాఖలో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయమైంది. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చోరీ చేశాడని తెలిసింది. వివరాలు... కిరణ్కుమార్ ఈ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు. అతడు ఆన్లైన్ బెట్టింగ్లలో మునిగితేలేవాడు. జీతం మొత్తం కాకుండా, ఖాతాదారులు కుదువపెట్టిన నగలను తీసుకెళ్లి అమ్మేసి ఆ డబ్బుతో బెట్టింగ్ ఆడేవాడు. బంగారం పెట్టిన లాకర్ కీ అసిస్టెంట్ మేనేజర్, మేజనేర్ వద్ద ఉన్నాయి. మేనేజర్ నమ్మకం కొద్దీ రెండు తాళాలను నిందితుని వద్దే ఉంచాడు. ఇంకేముందీ.. అప్పుడప్పుడు కొద్దికొద్దిగా నగలను తరలించాడు. ఇలా బయటపడింది జనవరి 2న కొందరు ఖాతాదారులు తాము తాకట్టు పెట్టిన నగలను విడిపించుకోవడానికి వెళ్లగా వారి బంగారం కనిపించలేదు. మేనేజర్ పరిశీలించగా 21 ప్యాకెట్లలో కొద్దికొద్దిగా నగలు లేవు. మూడు ప్యాకెట్లు పూర్తిగా ఖాళీగాఉన్నాయి. ఇలా రూ.4 కోట్ల విలువగల 2,783 గ్రాముల బంగారాన్ని కిరణ్కుమార్ మాయం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. నగలను నగల అంగళ్లలో తాకట్టు పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఆ డబ్బులను అన్లైన్ బెట్టింగ్, గుర్రపు రేసులాడి పోగొట్టినట్లు తెలిపాడు. గిరినగర పోలీసులు అతనిని అరెస్టు చేసి 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ మేనేజర్ చోరీల బాట బెట్టింగ్లలో పోగొట్టిన వైనం -
నేడు బంగారు పరమేశ్వర దర్శనం
మహాశివరాత్రి రోజున మైసూరు ప్యాలెస్ ఆవరణలోని త్రినేశ్వర స్వామి ఆలయంలోని మూల విరాట్టు శివలింగానికి బంగారు పరమేశ్వరుని ముఖం ధారణ చేసి విశేష పూజలు జరపడం ఆనవాయితీ. జిల్లా అధికారులు ఆలయ అర్చకులకు బంగారు ముఖాన్ని అప్పగించారు. అప్పటి రాజు జయచామరాజ ఒడెయర్ పుత్ర సంతానం ప్రాప్తమైనందుకు 11 కేజీల శుద్ధ బంగారంతో తయారు చేయించారు. ఏడాదంతా ప్రభుత్వ ట్రెజరీలో భద్రపరిచి, శివరాత్రి రోజున మాత్రమే త్రినేశ్వర స్వామి మూల శివలింగానికి తొడిగి పూజలు చేస్తారు. కళ్లారా చూసేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. -
కనువిందుగా సాంస్కృతిక కార్యక్రమాలు
హొసపేటె: హంపీ ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి ఎంపీ ప్రకాష్ వేదికపై సహన బృందం సంగీత కార్యక్రమం, సవిత అమరేష్ ఆధ్వర్యంలో దసరా మంగళవాయిద్యం మ్యూజిక్ ఫ్యూజన్ తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. న్యూఢిల్లీకి చెందిన ప్రతిభా ప్రహ్లాద్ బృందం భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. సుమారు గంట పాటు సాగిన భరత నాట్యానికి సందర్శకులు తన్మయత్వం చెందారు. సుమధురంగా సంగీత ప్రదర్శనలు తొలి రోజు శుక్రవారం రాత్రి కృష్ణదేవరాయ(ఎదురు బసవణ్ణ) వేదికలో వివిధ సాంస్కృతిక బృందాల నుంచి వెలువడిన సంగీత ధ్వనులు శ్రోతలను మైమరిపించాయి. యలబుర్గాకు చెందిన హనుమప్ప దసరా బృందం గీతాన్ని ఆలపించి జానపద లోకాన్ని సృష్టించారు. శివ తాండవ గీతానికి ఉత్కంఠభరితమైన భరతనాట్య ప్రదర్శన చేశారు. హావేరికి చెందిన గడగయ్య హిరేమఠ బృందం ఉదో ఎల్లమ్మ అనే పాటను ఆలపించి జోగతి నృత్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో హిందుస్తానీ సంగీతం, శాసీ్త్రయ సంగీత ప్రదర్శనలు అలరించాయి. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
రాయచూరు రూరల్: వంతెన రక్షణ గోడను క్రూసర్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం సాయంత్రం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వద్ద చోటు చేసుకుంది. యాదగిరి జిల్లా శహాపుర తాలూకా గోగికి చెందిన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున స్వామి దర్శనం కోసం క్రూసర్ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో రామరెడ్డి(52), భార్య మేఘన(50), మహదేవప్ప(65) అక్కడికక్కడే మరణించారు. వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జడ్చర్ల వద్ద రక్షణ గోడకు క్రూసర్ ఢీ మృతులు యాదగిరి జిల్లా వాసులు -
ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం కుస్తీ పోటీలు హొసపేటె మలపనగుడి విద్యారణ్య పాఠశాల మైదానంలో పోటాపోటీగా జరిగాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో కుస్తీ పోటీలకు విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. నాటి కుస్తీ పోటీల జ్ఞాపకాలు తిరిగి తెచ్చేలా ప్రతి ఏటా హంపీ ఉత్సవాల్లో కుస్తీ పోటీలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది. కుస్తీ పోటీల్లో గెలుపొందిన విజేతకు మొదటి బహుమతిగా రూ.10 వేల నగదు, రెండో బహుమతి విజేతకు రూ.5 వేల నగదు, మూడో బహుమతి విజేతకు రూ.3 వేల నగదు చొప్పున జిల్లా యంత్రాంగం అందజేస్తుంది. అదే విధంగా గుండు ఎత్తే పోటీలు, ఎద్దుల బండి చక్రాలు తొలగించి తిరిగి చక్రాలను అమర్చే పోటీలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. -
పద.. పదవె.. గాలిపటమా.!
హొసపేటె: చారిత్రక విజయనగర వైభవాన్ని చాటే హంపీ ఉత్సవం–2026లో భాగంగా ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప శనివారం హొసపేటె నగరంలోని విజయనగర కళాశాల మైదానంలో గాలిపటాల ఎగరవేత ఉత్సవాన్ని ప్రారంభించారు. కన్నడ, సంస్కృతి శాఖ, విజయనగర జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఉదయం నుంచి వందలాది మంది గాలిపటాల ప్రేమికులు మైదానంలో గుమిగూడారు. వివిధ డిజైన్లు, రంగురంగుల గాలి పటాలను ఎగరవేశారు. మైదానంలో గుమిగూడిన సందర్శకులు, స్థానికులు ఆకాశంలో ఎగురుతున్న భారీ గాలిపటాలను చూసి ఆనందించారు. ఒక భారీ గుర్రపు ఆకారపు గాలిపటం నీలి ఆకాశంలో గాలిలో ఎగిరింది. విజయనగర అశ్వికదళం ఆకాశంలో కదులుతున్నట్లు అనిపించింది. త్రివర్ణ పతాకం తేజస్సు వసుదైక కుటుంబం అనే సందేశంతో కూడిన త్రివర్ణ పతంగులు, సముద్ర అక్టోపస్ ఆకారపు పతంగులు పిల్లలను విశేషంగా అలరించాయి. ఫ్రేమ్ లేని ఈ పారాఫాయిల్ ఆకారపు పతంగులు గాలి తీవ్రతకు అనుగుణంగా ఆకారాన్ని మార్చుకుని, ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించాయి. కిక్కిరిసిన జససమూహం సెలవు రోజు కావడంతో కళాశాల మైదానం ప్రజలతో నిండి పోయింది. యువకులు ఈలలు వేస్తూ గాలిపటాలు ఎగురుతున్న దృశ్యాలను చూస్తుండగా, పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో ఈ అద్భుతమైన దృశ్యాలను బంధించడానికి పోటీ పడ్డారు. ఆకాశంలో రంగురంగుల పతంగులు సందడి చేశాయి. బెంగళూరు కై ట్ క్లబ్, పంజాబ్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి గాలిపటాలు ఎగురవేసిన భారీ బొమ్మలు ఈ సంవత్సరం గాలిపటాల ఉత్సవంలో హైలైట్గా నిలిచాయి. పదుల అడుగుల పొడవున్న ఎర్రని ఆక్టోపస్, ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపించే చిరుతపులి పతంగులు, కోతి పతంగులు పిల్లలను ప్రత్యేకంగా ఆకర్షించాయి. గాలి పటాల ఉత్సవ ప్రారంభోత్సవంలో జిల్లాధికారిణి కవిత ఎస్ మన్నికేరి, సబ్ డివిజనల్ ఆఫీసర్ వివేక్, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు రూపేష్ కుమార్, అర్బన్ డెవలప్మెంట్ సెల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ శివకుమార్, బెంగళూరు కై ట్ క్లబ్ వీకే.రావు తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా గ్రామీణ క్రీడలు
సాక్షి బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీలో శనివారం ఉత్సాహంగా, ఉల్లాసంగా, కన్నుల పండువగా రెండో రోజు సాగిన ఉత్సవ కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకొన్నాయి. మొదటి రోజు హంపీ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ సినీ నటుడు శివరాజ్కుమార్ సంగీతం, నృత్యాలతో అదరగొట్టారు. తొలిసారిగా హంపీ ఉత్సవాల్లో డ్రోన్ల ప్రదర్శనతో హంపీ ఉత్సవ ప్రధాన వేదిక వద్ద స్మారకాలు, ప్రముఖుల చిత్రాలను విద్యుత్ కాంతులతో కళ్లకు కట్టినట్లు చూపించడం ఉత్సవాలకే హైలైట్గా నిలిచింది. ఉత్సవాల్లో ఉదయం నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడోత్సవాలు సందర్శకులను కట్టిపడేశాయి. ఉదయం శ్రీవిరుపాక్షేశ్వర వేదికపై కవిగోష్టి, హొస మలపనగుడి విద్యారణ్యపీఠ హైస్కూల్ మైదానంలో కుస్తీ, గుండు ఎత్తే పోటీలతో గ్రామీణ క్రీడలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుస్తీ క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. మంత్రముగ్ధులను చేస్తున్న సంగీత ప్రదర్శనలు జిల్లా క్రీడా మైదానంలో గాలిపటాల ప్రదర్శన, శ్రీకృష్ణదేవరాయ వేదికపై స్థానిక కళాకారుల సంగీత నృత్య కార్యక్రమాలు, ప్రముఖ గాయని ఎండీ పల్లవి గానం మంత్రముగ్ధులను చేశాయి. సాసివెకాళు గణపతి వేదికపై టీవీ కళాకారుల సాంస్కృతిక వైవిధ్య కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. హక్కబుక్క వేదికపై విజయనగర వైభవం ధ్వనివెలుగు ప్రదర్శన అలరించింది. విద్యారణ్య వేదికలో బయలాటలు, జానపద నాటకాలతో ఆయా వేదికల వద్ద ప్రజలను ఎంతో ఆకట్టుకున్నారు. ప్రధానంగా ఎంపీ ప్రకాష్ వేదికపై సినీ ప్రముఖులు గోల్డెన్స్టార్ గణేష్, రాజ్బీశెట్టి, రిషబ్మ్యాన్ తదితరులు పాల్గొని సంగీత నృత్య కార్యక్రమాలను ప్రదర్శించారు. ప్రధాన వేదిక వద్ద ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన లైటింగ్లు, నృత్యాలు హంపీ ఉత్సవాల్లో రెండో రోజు జోరు పెంచాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు హంపీ ఉత్సవాలకు విచ్చేసిన పర్యాటకులు హంపీలోని చారిత్రాత్మకమైన, మహిమాన్వితమైన కట్టడాలు, ఆలయాలను దర్శించి పునీతులయ్యారు. ఉత్సవాలు అదుర్స్ అంటున్న సందర్శకులు హంపీలోని విరుపాక్షేశ్వర, కోదండరామ, యంత్రోద్ధారక ఆంజనేయస్వామి ఆలయాలను భక్తులు దర్శించుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని గుర్తు చేసేలా హంపీ ఉత్సవాలను అదరహో అన్నట్లుగా నిర్వహిస్తున్నారు. స్మారకాలకు విద్యుత్ దీపాలు, దారిపొడవునా లైట్లు ఏర్పాటు చేయడంతో ఉత్సవాలు రాత్రి, పగలు అనే తేడా లేకుండా విద్యుత్ కాంతులను వెదజల్లుతూ మైమరిపిస్తున్నాయి. దేశ, విదేశీ పర్యాటకులు హంపీ ఉత్సవాలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయని, ఇక్కడ స్మారకాలు, చారిత్రాత్మక, మహిమాన్విత ఆలయాలను ఎంత చూసినా తనివితీరడం లేదని సంతోషం వ్యక్తం చేశారు. ఉత్సవాల్లో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మాఘమాసం శివరాత్రి పర్వదినం నేపథ్యంలో హంపీ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత సంతరించుకొంది. పవిత్ర నదీస్నానాలు చేయడంతో పాటు విరుపాక్షేశ్వర స్వామిని దర్శించుకొని హరహర మహాదేవ.. శంభోశంకరా అని నామస్మరణ చేస్తూ శివరాత్రి వేడుకలను కూడా భక్తిభావంతో ఆచరిస్తున్నారు. రాతిగుండు ఎత్తుతున్న యోధుడు ఎద్దుల బండి చక్రాలను తొలగిస్తున్న దృశ్యం రెండో రోజు ఉట్టిపడిన పల్లె సంస్కృతి రాయల రాజధాని వీధులు జనమయం ఆలయాల దర్శనంతో భక్తులు పునీతం ఉత్సవాలతో పాటు స్మారకాల సందర్శన -
రైతులకు 12 గంటల విద్యుత్ అందించరూ..
రాయచూరు రూరల్: వేసవిలో రైతులకు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. శనివారం జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ మాట్లాడారు. 2023లో కేటాయించిన ఆర్ఆర్ నంబర్లను కొనసాగించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను 48 గంటల్లో పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా సీఎంకు వినతిపత్రం సమర్పించారు. పరీక్ష పుస్తకాల పంపిణీ రాయచూరు రూరల్ : మార్చి నెలలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని కన్నడ సాహిత్య పరిషత్ కార్యదర్శి దండెప్ప బిరాదార్ సూచించారు. తాలూకాలోని ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ హైస్కూలులో ఎంపీ ప్రకాష్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. విజన్–625ను లక్ష్యంగా పెట్టుకొని విద్యార్థుల మనోబలాన్ని పెంచి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో వీరేష్, మౌనేశ్వరి, అక్షయ్ కుమార్లున్నారు. బాల్య వివాహాలను అరికట్టాలిరాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు ముందుండాలని బాలల హక్కుల రక్షణ మండలి సభ్యుడు వెంకటేష్ పేర్కొన్నారు. శనివారం జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కార్మిక శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలు, బాల కార్మిక పద్ధతి నియంత్రణ, పోక్సో చట్టాలపై సమాచారం తెలిసిన వెంటనే మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు స్పందించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ కుమారస్వామి, సుదర్శన్, సునీత, మంజుల హెగ్డేలున్నారు. అమర యోధుల సంస్మరణ ర్యాలీ రాయచూరు రూరల్: పుల్వామా దాడి బాధితుల సంస్మరణ ర్యాలీని నగరంలో మాజీ సైనికులు చేపట్టారు. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన పారా మిలిటరీ వీర యోధుల సంస్మరణ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ సర్కిల్ నుంచి బసవేశ్వర సర్కిల్ వరకు ర్యాలీ జరిపారు. హెళవ సమాజాన్ని ఎస్టీ జాబితాలో చేర్చండి రాయచూరు రూరల్: రాష్ట్రంలో కులగణన సందర్భంలో హెళవ సమాజాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సమాజం డిమాండ్ చేసింది. శనివారం బెంగళూరులోని విధానసౌధ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడారు. హెళవ సమాజం సాంఘీకంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా పరంగా వెనుకబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఉత్సవాలకు పోటెత్తిన జనం ● ట్రాఫిక్లో చిక్కుకొన్న బిగ్బాస్ గిల్లి, కావ్య హొసపేటె: హంపీ ఉత్సవాల నేపథ్యంలో శనివారం రెండో రోజు అంచనాలకు మించి ప్రజలు, వాహనాలు తరలి రావడంతో సాయంత్రం కార్యక్రమానికి వస్తున్న బిగ్బాస్ విజేత గిల్లి, కావ్య ట్రాఫిక్లో చిక్కుకున్నారు. కడ్డిరాంపుర నుంచి ప్రధాన వేదిక వరకు ట్రాఫిక్ పెరగడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడానికి నానాయాతన పడ్డారు. సుమారు 5 కి.మీ. మేర వాహనాలు గంటల తరబడి రోడ్డులో నిలిచి పోయాయి. -
మహాశివరాత్రికి ఆలయాలు సిద్ధం
రాయచూరు రూరల్: జిల్లాలో ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. శివ నామస్మరణతో మారు మోగడానికి ఆలయ అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని మహాబళేశ్వర చౌక్లో చంద్రమౌళేశ్వర దేవాలయం, నగరేశ్వర, వీరభద్ర దేవస్థానం, ఐబీ రోడ్డులోని నందీశ్వరాలయం, రామలింగేశ్వర దేవాలయాల్లో భక్తులు పూజలకు సన్నద్ధంగా ఉన్నారు. శివాలయాల్లో శివస్తోత్రం, కుంభాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహిస్తారు. యక్లాసపుర బసవేశ్వర ఆలయంలో బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాలను ఊరేగిస్తారు. కాగా నగరంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని పండ్ల ధరలు ఆకాశాన్నంటాయి. మూడు రోజుల క్రితం ఉన్న ధరలు నేడు అమాంతం పెరిగాయి. రూ.30 ఉన్న కళింగర పండు ధర రూ.70 నుంచి రూ.100, కర్బూజ పండు ధర రూ.25 నుంచి రూ.50కి పెంచారు. ద్రాక్ష కిలో ధర రూ.120 ఉండగా నేడు రూ.250 గా నిర్ణయించారు. శివాలయాలకు ప్రత్యేక అలంకరణలు భారీగా పెరిగిన పూజ సామగ్రి ధరలు -
పిల్లలకు చరిత్రపై అవగాహన అవసరం
హొసపేటె: హంపీ చారిత్రక వారసత్వం గురించి పిల్లల్లో అవగాహనకు కన్నడ వర్సిటీ ద్వారా నెలకు ఒకసారి ప్రత్యేక ఉపన్యాసం నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తెలిపారు. హంపీ ఉత్సవ్– 2026 సందర్భంగా కమల మహల్ వేదికలో పురావస్తు శాఖ, విజయనగర జిల్లా యంత్రాంగం సహకారంతో నిర్వహించిన విజయనగర అధ్యయనంపై 28వ వార్షిక సింపోజియంను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హంపీ అభివృద్ధి కోసం భారత పురావస్తు సర్వే సంస్థకు కొత్త ప్రతిపాదన సమర్పించామన్నారు. పర్యాటకులు హంపీలోని అన్ని ఆలయాలు, స్మారకాలను సులభంగా వీక్షించేలా స్మారక చిహ్నాలను అనుసంధానించే రోడ్లను నిర్మించడానికి ఒక ట్రావెల్ రోడ్ ప్రాజెక్ట్ను రూపొందించారన్నారు. దీని వల్ల పర్యాటకులు వందలాది స్మారకాలను సులభంగా చూడటానికి వీలు కలుగుతుందన్నారు. కూడ్లిగి ఎమ్మెల్యే శ్రీనివాస్, జిల్లాధికారి కవిత ఎస్. మన్నికేరి తదితరులు పాల్గొన్నారు. -
మొసలికి వ్యక్తి బలి?
రాయచూరు రూరల్ : రాయచూరు తాలూకాలో కృష్ణా నదిలో మొసలికి సణ్ణనాగప్ప (66) అనే వ్యక్తి బలైనట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. శనివారం గ్రామీణ పోలీస్ స్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాయచూరు తాలూకా అరిషిణిగికి చెందిన సణ్ణ నాగప్ప గత ఏడాది మే నెలలో కృష్ణా నదిలోకి స్నానం కోసం దిగాడన్నారు. ఆ సమయంలో ఆకస్మికంగా మొసలి అతనిని బలి తీసుకున్నట్లు అనుమానం ఉందని, గ్రామీణ పోలీసులు ఈ విషయపై కేసు నమోదు చేసుకుని, అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ రాయచూరు రూరల్: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. శనివారం సింధనూరు తాలూకా తుర్విహాళ్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. తుర్విహాళ్కు చెందిన జిలాని, శివరాజ్ల నుంచి 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదం రాయచూరు రూరల్: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ మహేష్ పేర్కొన్నారు. ఆయన యాదగిరి జిల్లా శహాపుర బాలికల కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు మనస్సు పెట్టి చదివేలా ఉపాధ్యాయులు విద్యాభోదన చేయించాలన్నారు. పాఠాలకు తోడు పాఠ్యేతర అంశాలపై విద్యార్థులు శ్రద్ధ కనబరచాలన్నారు. సమావేశంలో సిద్దణ్ణ, శేఖరప్ప, అనిత, ధర్మనగౌడలున్నారు. గెలిచిరా ఇండియా.! ● హాస్టల్ విద్యార్థుల ఆశాభావం హుబ్లీ: టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబోలో భారత్–పాకిస్తాన్ల మధ్య జరుగనున్న క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిచి రావాలని భారతీయులు ఎంతో ఆశగా ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో దావణగెరె జిల్లాలో కూడా ప్రార్థనలు, శుభాకాంక్షలు మిన్నంటాయి. ఈ మ్యాచ్ టీ20 ఇండియా జట్టును అభినందించిన ఆ జిల్లా హొన్నాళిలోని డాక్టర్ అంబేడ్కర్ హాస్టల్లోని విద్యార్థులు పాకిస్థాన్పై ఇండియా జట్టు గెలిచి స్వదేశానికి రావాలని భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయ బృందంతో నినాదాలు చేస్తూ అభినందనలు తెలియజేశారు. భారత్, పాకిస్తాన్ జట్లు 2026 టీ20 ప్రపంచ కప్లో ఇప్పటికే ఒక్కొక్క జట్టు రెండేసి మ్యాచ్లు ఆడాయి. రెండింటిలోను గెలిచారు. భారత్ తొలి మ్యాచ్ యూఎస్ఏపైన, రెండో మ్యాచ్ నమీబియాపైన ఆడి గెలుపు సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఆత్మహత్య వెనుక చేదు నిజాలెన్నో.! హుబ్లీ: ధార్వాడలో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చావు వెనుక కొరియన్ గేమ్ల అతి వ్యసనం ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు తన చావుకు తానే కారణం అని మృతుడు సెల్లో మెసేజ్ పంపాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ధార్వాడ ఉప నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా సర్వత్రా బహిరంగ చర్చకు ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమైంది. ఈ నెల 6న ధార్వాడ నగర మంగళగట్టి ప్లాట్ నివాసి వికాస్ నాయక్(20) తన ఇంట్లో ఉరి వేసుకొన్నాడు. దీనిని అసహజ మరణంగా అప్పట్లో అనుమానించారు. కాగా మృతుడు పీయూసీ సైన్స్ పూర్తి చేసి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంట్లోనే సన్నద్ధత చేసుకొనేవాడు. అయితే తన మొబైల్ గేముల్లో ప్రత్యేకించి కొరియన్ గేమ్లపై అతిగా ఆసక్తి పెంచుకున్నట్లు తెలిసింది. ఇంట్లో వారికి తెలియకుండా చాలా సమయాన్ని గేమ్లు ఆడటంలోనే గడిపేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు రాయచూరు రూరల్ : కాగితాలతో కూడిన చిత్రాలను, పటాలను తయారు చేయడం ద్వారా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని మైసూరు సంచాలకుడు హుసేన్ పిలుపునిచ్చారు. శనివారం స్టేషన్ బజార్ హైస్కూలులో భారత జ్ఞాన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలను ప్రారంభించి మాట్లాడారు. చిత్రలేఖన కళ ద్వారా విద్యార్థుల మనోబలాన్ని పెంచవచ్చన్నారు. రాఘవేంద్ర, హఫీజుల్లా, సూగూరయ్య, ముత్తణ్ణ, జ్యోతి పాల్గొన్నారు. -
సౌండ్ అండ్ లైట్.. ఉత్సవాలకే హైలైట్
హొసపేటె: హంపీ ఉత్సవంలో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హక్కబుక్క వేదికపై ప్రదర్శించిన సౌండ్ అండ్ లైట్ కార్యక్రమం శ్రోతలను, ప్రేక్షకులను ఉత్తేజ పరిచింది. కనువిందు చేసే దృశ్యాలు, శ్రావ్యమైన సంగీతం, రంగురంగుల దుస్తులు, ఆకర్షణీయమైన లైటింగ్తో రూపొందించిన ధ్వని, వెలుతురు కార్యక్రమం ప్రేక్షకులను అబ్బురపరిచింది. కార్యక్రమంలో బెంగళూరు, ఢిల్లీ, పూనె తదితర చోట్ల నుంచి 110 మంది కళాకారులు, అనేక బృందాలు విజయనగర వైభవాన్ని పునఃసృష్టించాయి. ఈ కార్యక్రమం ఈనెల 19 వరకు హంపీలోని గజశాల ప్రాంగణంలో ప్రదర్శిస్తారు. మైసూరు కొరియోగ్రాఫర్ డాక్టర్ షీలా శ్రీధర్, న్యూఢిల్లీ సీబీసీ డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్ సంతోష్ ఆశిష్, కొప్పళ డైట్ సీనియర్ లెక్చరర్ డి.జోషి, బెంగళూరు సీబీసీ డైరెక్టర్ జీ.విజయ్కుమార్, అసిస్టెంట్ వి.గంగాధర్ పాల్గొన్నారు. -
చనిపోతూ నలుగురికి పునర్జన్మ
హుబ్లీ: బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి నలుగురికి పునర్జన్మ ప్రసాదించారు. వివరాలు.. విజయపుర జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దు మృతి చెందగా.. అతడి స్నేహితుడు బలరామ తీవ్రంగా గాయపడటంతో విజయపుర నగరంలోని బీఎల్డీఈ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు యువకుడి మొదడు దెబ్బతినడంతో బతకడం కష్టమని చెప్పారు. సదరు కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి అవయవ దానానికి అనుమతి తీసుకున్నారు. న్యాయపరమైన ప్రక్రియ ముగిశాక అవయవ దానాన్ని ప్రారంభించిన ఆస్పత్రి వైద్యులు ఓ మూత్రపిండాన్ని కలబుర్గి ఆస్పత్రికి జీరో ట్రాఫిక్ ద్వారా తరలించారు. మరో మూత్రపిండాన్ని బీఎల్డీఈ ఆస్పత్రి రోగికి అమర్చారు. ఇతర అవయవాలు సరిపోని కారణంగా తీసుకోలేదు. అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను స్థానికులు అభినందించారు. -
ఆకట్టుకున్న ఎద్దుల ప్రదర్శన పోటీలు
హొసపేటె: కమలాపూర్లోని హంపీ వరల్డ్ హెరిటేజ్ సైట్ మేనేజ్మెంట్ అథారిటీ (హవామా) కార్యాలయం వెనుక జిల్లా యంత్రాంగం, పశుసంవర్ధక, పశువైద్య సేవల విభాగం నిర్వహించిన ఎద్దుల ప్రదర్శన పోటీలు ఆకట్టుకున్నాయి. గృహ నిర్మాణం, వక్ఫ్, మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి బీజెడ్ అహ్మద్ ఖాన్ ఎద్దులకు పూజలు చేసి ప్రదర్శనను ప్రారంభించారు. హొస్పేట్ రైతు మంజునాథ్.ఆర్ హాలికర్ జాతి ఎద్దులు పోటీలో మొదటి స్థానంలో నిలవడంతో రూ.10,000, సర్టిఫికెట్ అందజేశారు. గడినగనూర్ గ్రామానికి చెందిన బి.బసవ ఎద్దులు రెండవ స్థానంలో నిలిచి రూ.7500, సర్టిఫికేట్ అందుకున్నాయి. బాలాపూర్కు చెందిన శంకరప్ప ఎద్దులు మూడవ స్థానంలో నిలవడంతో రూ.5,500, సర్టిఫికెట్ అందజేశారు. హోస్పేట్ మహమ్మద్ హుస్సేన్ ఎద్దులు రూ.2,500 అందుకుని నాలుగో స్థానం దక్కించుకున్నాయి. అవార్డు గెలుచుకున్న నాలుగు జతల గుర్రాలకు మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సొంతంగా రూ.2 లక్షల నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో బళ్లారి లోక్సభ ఎంపీ తుకారాం, హోస్పేట్ ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప, డిప్యూటీ కమిషనర్ కవితా మన్నికేరి, సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, నందిపుర మఠం మహేశ్వర స్వామిజీ, పశుసంవర్ధక, పశువైద్య సేవల విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఇమ్రాన్, డాక్టర్ యుగంధర్ మాన్వి, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ సురేష్, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ చంద్రనాయక్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ లోహిత్, డాక్టర్.సతీష్, డాక్టర్ నేమినాయక్ పాల్గొన్నారు. -
హంపీ ఉత్సవాలకు ఆహ్వానం
హొసపేటె: హంపీ ఉత్సవాలకు రావాలని హొసపేటె ఎమ్మెల్యే గవియప్పను జిల్లా ఇన్చార్జ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ శుక్రవారం ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఇటీవల హంపీ ఉత్సవాల ఏర్పాటు పనుల్లో ఎక్కడ కూడా ఎమ్మెల్యే గవియప్ప కనిపించలేదు. ఈ నేపథ్యంలో మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ స్వయంగా ఎమ్మెల్యే గవియప్ప ఇంటికి వెళ్లి హంపీ ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య హోసూరు: భార్య కోపంతో కూతురు ఇంటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. హోసూరు పారిశ్రామికవాడ మూకొండపల్లి సమీపంలోని మత్తంఅగ్రహారం ప్రాంతానికి చెందిన కార్మికుడు శ్రీనివాసన్, కవిత దంపతులు నివసిస్తున్నారు. శ్రీనివాస్కు తాగుడు అలవాటు ఉండటంతో రోజూ మద్యం సేవించి ఇంటికెళ్లి భార్యతో గొడవపడేవాడు. నెల రోజుల క్రితం భర్త చిత్రహింసలు తాళలేక కవిత కూతురి ఇంటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెందిన శ్రీనివాసన్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల పట్టివేత
●రూ.6 లక్షల విలువైన సొత్తు స్వాధీనం కోలారు: వివిధ ప్రాంతాల్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలు పట్టుబడ్డారు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా వాణియంబాడికి చెందిన మహమ్మద్ యాసిన్ (25), జీలన్ (24)అనే దొంగలను కోలారు నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్దనుంచి 6.25 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 21న నగరంలోని కరుబర పేటలో ఓ మహిళ కాలినడకన వెళ్తుండగా నిందితులు చైన్స్నాచింగ్కు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నగర పోలీసులు సుమారు 200కుపైగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల జాడ కనుగొని అరెస్టు చేశారు. తులపై ఆంధ్రలోని వి కోట అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
పారిశుధ్య కార్మికుడిపై దాడి: ఇద్దరు అరెస్ట్
హుబ్లీ: పారిశుధ్య కార్మికుడిపై దాడి చేసిన ఇద్దరిని దావణగెరె అజాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్జు, నూర్ అరెస్ట్ అయిన నిందితులు. కరిబసప్ప దాడికి గురైన వ్యతి. వివరాలు.. దావణగెరె 4వ వార్డు మెహబూబ్ నగర్లో శుక్రవారం ఉదయం కార్మికుడు కరిబసప్ప చెత్త సేకరణకు వచ్చాడు. పొడి, తడి చెత్త రెండు కలిపి ఓ మహిళ చెత్త వాహనానికి ఇచ్చింది. ఈ రెండింటికి కలిపి ఇవ్వరాదు.. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వమని కోరాడు. దీనిపై మాట మాట పెరగడంతో అజ్జు, నూర్ కలసి కరిబసప్పపై దాడి చేశారు. కరిబసప్ప ఫిర్యాదు మేరకు అజ్జు, నూర్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ వసంత్ తెలిపారు. కార్మికుడిపై దాడిని ఖండిస్తూ సదరు కార్మికులు ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగి చెత్త వాహనాన్ని తెచ్చి నిరసన తెలిపారు. -
సొంతదారులకు చోరీ సొత్తు అప్పగింత
యశవంతపుర: మల్లేశ్వరం, రాజాజీనగర, సుబ్రమణ్యనగర, మహాలక్ష్మి, యశవంతపుర, ఆర్ఎంసీ యార్డ్ పోలీసుస్టేష్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి బెంగళూరు ఉత్తర విభాగం పోలీసులు కార్యచరణ చేసి 75 కేసుల్లో 83 మంది నించితులను అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.1.76 కోట్ల విలువైన 67 ముబైల్ఫోన్లు, మూడు లక్షల నగదు, బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మల్లేశ్వరం పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న జీబీఏ అట మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చోరీ సొత్తును సొంతదారులకు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంతకుమార్ సింగ్ అప్పగించారు. -
పనుల్లో వేగం పెంచాలి
రాయచూరు రూరల్: రాయచూరు ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పరిశ్రమల మౌలిక సౌకర్యాల అభివృద్ధి మండలి అధ్యక్షుడు నంజయ్యన మఠ్ ఆదేశించారు. శుక్రవారం విమానాశ్రయం వద్ద జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 321 ఎకరాల్లో జరగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. త్వరిగతిన రక్షణ గోడల నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు. రన్వే 1.7 కి.మీ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం 800 మీటర్ల పనులు జరిగాయని పేర్కొన్నారు. విద్యుత్ ఉప కేంద్రం, భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాలు, ఆరు టవర్ల నిర్మాణం ఇతర పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు మహేష్, ప్రవీణ్, తహసీల్దార్ సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలురాయచూరు రూరల్: మహా శివరాత్రిని పురస్కరించుకుని నగరంలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. శుక్రవారం ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వాల్కట్ మైదానంలో 12 జ్యోతిర్లింగాల దర్శనం, శివ లింగాల యాత్ర చేపడుతామన్నారు. 14న శాంతియాత్ర, 15న సాంస్కృతిక మహోత్సవం, 16న గౌరవ సమర్పణ, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. 14వ తేదీన 12 కార్లపై శివలింగాలను కొలువుదీర్చి యాత్ర జరుపుతామన్నారు. భక్తులు సందర్శించుకునేందుకు వీలుగా వాల్కట్ మైదానంలో 40 అడుగుల శివలింగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో శారద, దానమ్మ, రేఖ, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ హుబ్లీ: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించి వాటిని సైట్లుగా మార్చి అందజేస్తామని మంత్రి సతీష్ జారకిహొళి తెలిపారు. శుక్రవారం ఆయన దావణగెరెలో మీడియాతో మాట్లాడారు. మార్చి 6న సీఎం సిద్దరామయ్య బడ్జెట్ ప్రతిపాదిస్తారన్నారు. ఈసారి బడ్జెట్పై చాలా ఆశలు పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగేలా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయన్నారు. -
హంపీ ఖ్యాతి అజరామరం
సాక్షి బళ్లారి/హొసపేటె: ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరై మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఎం.పీ.ప్రకాష్ వేదిక వద్ద సీఎం సిద్దరామయ్య ఉత్సవాలను ప్రారంభించే ముందు తాయి భువనేశ్వరి విగ్రహానికి పూజలు చేశారు. విరుపాక్షేశ్వర ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఉదయం నుంచే హంపీకి పర్యాటకులు పోటెత్తారు. శ్రీకృష్ణదేవరాయల పాలనను మైమరిపించేలా మన సంస్కృతి, వారసత్వాన్ని కాపాడే దిశగా హంపీ ఉత్సవాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి రోజు మాతాంగ పర్వత మైదానంలో మత్య్స మేళా, ఫల, పుష్ప ప్రదర్శన, కమలాపురం చెరువులో బోటింగ్, విరుపాక్షేశ్వర హంపీ చరిత్రపై చర్చా గోష్టి, మాతాంగ పర్వతం సమీపంలో ఆహార మేళా, ఎద్దుల ప్రదర్శన, రంగోలి పోటీలు నిర్వహించారు. ఈసారి ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఆరు వేదికలను సుందరంగా ముస్తాబు చేశారు. హంపీలో కట్టడాలను విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. ఎంపీ ప్రకాష్ వేదిక, శ్రీకృష్ణదేవరాయ వేదిక, శ్రీ విరుపాక్షేశ్వర వేదిక, సాసువేకాళు గణపతి వేదిక, విద్యారణ్య వేదికలపై నిర్వహించిన వివిధ సాంస్కృతిక, మనోరంజన కార్యక్రమాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేశాయి. ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు కర్ణాటకలో వివిధ జిల్లాల నుంచి కాకుండే దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో హంపీ ఉత్సవాలకు తరలివస్తున్నారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు చేపట్టారు. రంగోలి పోటీలు జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ, సాంస్కృతిక శాఖ, వివిధ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో విరుపాక్ష ఆలయం ముందు నిర్వహించిన రంగోలి పోటీల్లో 41 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేవ్ ది ఫిమేల్ ఫెమి చిత్రం, వరాహ చిహ్నం, శ్రీకృష్ణ దేవరాయలు, శివలింగం, సింహం తదితర చిత్రాలు సహా విరుపాక్ష ఆలయం ముందు వేసిన రంగోలి చిత్రాలు ఆకట్టున్నాయి. ఎగ్జిబిషన్.. హంపీ ఉత్సవాల్లో మన సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా పురాతన కాలం నాటి మానవులు వాడిన పరికరాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. రోకలితో దంచడం, మహిళలు ఇసరాయితో తిప్పి పిండి తయారు చేయడం, చేదుబావి నుంచి నీటిని తోడటం తదితర దృశ్యాలను పర్యాటకులు తిలకించారు. చిరు ధాన్యాలు, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు, వివిధ రకాల పూలతో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన, పంటకోత వేడుక, వ్యవసాయ ప్రదర్శనలు అలరించాయి. గణేశుడు, కేఎస్డీఏ లోగో, ధాన్యాల రూపంలో నంది ప్రతిమ, వ్యవసాయంలో డ్రోన్ల వాడకం, ట్రాక్టర్లు, పశుపోషణ, పట్టుపురుగుల పెంపకం, ధాన్యాల అమ్మకం చిత్రాలు ఏర్పాటు చేశారు. మస్త్య ప్రదర్శన మాతాంగ పర్వత మైదానంలో మత్స్యశాఖ నిర్వహిస్తున్న చేపల ప్రదర్శనను జిల్లా అధికారి కవితా ఎస్ మన్నికేరి ప్రారంభించారు. సముద్రంలోని మత్స్యసంపద వైవిధ్యాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో దేశీయ మూలాలకు చెందిన 50కి పైగా అలంకార చేపలను అక్వేరియంలో ఉంచారు. జలాశయంలో కనిపించే చేపల వైవిధ్యం, మత్స్యకారుల జీవనోపాధిలో దాని పాత్రను వివరిస్తున్నారు. కుటుంబాలతో వచ్చిన పెద్ద సంఖ్యలో ప్రజలు చేపల జాతరను వీక్షిస్తున్నారు. ఎద్దులను అలంకరించి పోటీలకు తీసుకొచ్చిన యువకులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం సిద్దరామయ్య పర్యాటకులతో కిటకిటలాడిన హంపీ వీధులు అలరించిన సాంస్కృతిక, మనోరంజన కార్యక్రమాలుసాలువేకలు గణపతి వేదికలో సాంస్కృతిక వైభవం విజయనగర జిల్లా యంత్రాంగం, కన్నడ, సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాలువేకలు గణపతి వేదికలో వచనగానం, రంగస్థల గీతాల గానం, జానపద గీతాలు, హిందుస్తానీ గానం, భరతనాట్యం, సుగమ సంగీతం, తబలా వాయిద్యం, శాసీ్త్రయ నృత్యం, నృత్య రూపక, బయలత పదాలు, తత్వపద గానం విషు కళా ప్రదర్శన, మిమిక్రీ, దసరా పదాల గానం, సముహా నృత్య రూపకం, వచన సంగీతం, చౌదకి పదాల గానం, అనేక ఇతర కార్యక్రమాలు వివిధ బృందాలచే ప్రదర్శించబడ్డాయి. -
ఏనుగు పట్టివేత
మైసూరు: జిల్లాలోని సరగూరు తాలూకా ఎన్.బేగూరు, మోళేయూరు అటవీ జోన్ పరిధిలోని 25కు పైగా గ్రామాల ప్రజలను, రైతులను వేధిస్తున్న అటవీ ఏనుగు పట్టుబడింది. ఏనుగు కోసం అటవీశాఖ అధికారులు పెంపుడు ఏనుగుల సహాయంతో కూంబింగ్ నిర్వహించారు. శుక్రవారం సరగూరు తాలూకా మఠదకట్టె సమీపంలో ఒంటరిగా తిరుగుతుండగా బంధించారు. క్రేన్ద్వారా లారీలోకి ఎక్కించి అటవీ ప్రాంతానికి తరలించారు. ఏనుగును బంధించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థిని బ్యాగులో పాము మైసూరు: పాఠశాల విద్యార్థిని బ్యాగులో నాగుపాము ఒకటి ప్రత్యక్షమైంది. ఈ ఘటన మైసూరు ఇలవాల మధురానగరలో జరిగింది. ఆడుకునే సమయంలో బాలిక మైదానంలో బ్యాగును పెట్టింది. ఈ సమయంలో బ్యాగు లోపలకు పాము ఒకటి వచ్చి చేరింది. బ్యాగులో పామును చూసిన బాలిక కంగారుతో భయపడి కేకలు వేసింది. విషయం తెలిసిన వెంటనే స్నేక్శ్యామ్ అక్కడికి వచ్చి ఆ పామును క్షేమంగా పట్టుకున్నారు. తల్లిని చంపిన కుమార్తె ● ఆస్తి గొడవలే కారణమని అనుమానం తుమకూరు: కన్న తల్లిని హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. తుమకూరు తాలూకా అనుపనహళ్లిలో పుష్పావతి (55) హత్యకు గురైన మహిళ కాగా, ఆమెను సుచిత్ర(33) అనే కుమార్తె హత్య చేసింది. పుష్పావతి తన కుమార్తెతో కలిసి నగరంలోని శ్రీనగరలో నివాసం ఉంటోంది. రాత్రి పుష్పావతి నిద్రిస్తుండగా సుచిత్ర ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఆమెను అంత్యక్రియలకు తీసుకెళ్లిన సమయంలో ఈ హత్య విషయం బయటపడింది. ముఖంపై గాయం గుర్తులు కనిపించాయి. అంత్యక్రియల సమయంలో పుష్పావతి సోదరుడు అనిల్ కుమార్ దీన్ని గమనించి అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్యాత్సంద్ర పోలీసులు సుచిత్రను అరెస్టు చేశారు. చేతబడి చేయడం వల్ల తండ్రి చనిపోయాడని సుచిత్రకు కోపం ఉన్నట్లు, ఈ కారణంతోనే తల్లిని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. తండ్రి మరణం అనంతరం సుచిత్ర మానసికంగా కుంగిపోయింది. సుచిత్ర, పుష్పావతికి మధ్య తరచూ ఆస్తి గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే కన్నతల్లిని సుచిత్ర హత్య చేసినట్లు తెలుస్తోంది. సీఎంపై సిఫార్సు లేఖ బాంబు యశవంతపుర: సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ సిఫార్సు లేఖ బాంబు పేల్చారు. ఆరోగ్య శాఖ నుంచి ఎకై ్సజ్ శాఖకు ఓ అధికారిని బదిలీ చేయాలని కోరుతూ సీఎం సిఫార్సు చేసిన లేఖను ఆయన బట్టబయలు చేశారు. ఈ విషయంపై ఆయన ఎక్స్లో ఆ లేఖను పోస్టు చేశారు. సీఎం సిద్ధరామయ్య పాలన గాడి తప్పిందనడానికి ఈ లేఖ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. మండ్య జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారిని మైసూరు గ్రామీణ జిల్లా ఎకై ్సజ్ డీసీగా బదిలీ చేయాలని సీఎం స్వయంగా ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. యోగేష్గౌడ కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు హుబ్లీ: ధార్వాడలో బీజేపీ నేత యోగేష్ గౌడ హత్య కేసుకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఓ వారంలోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐకు సూచించింది. ఇటీవల ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధార్వాడ గ్రామీణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ఈ ఆదేశాలను ప్రశ్నిస్తూ వినయ్ కులకర్ణి సుప్రీంకోర్టులో రిట్ వేశారు. ఆ రిట్పై విచారణ సందర్భంగా స్పందించిన సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. నోటీసులపై వారంలోగా ప్రతిస్పందించాలని సూచించింది. -
బైరతి బసవరాజుకు ఆస్పత్రిలో చికిత్స చేయించండి
బనశంకరి: రౌడీషీటర్ బిక్లు శివ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ గురువారం అరైస్టెన మాజీమంత్రి, కేఆర్పుర బీజేపీ ఎమ్మెల్యే బైరతిబసవరాజ్ను సీఐడీ పోలీసులు విచారణ చేపడుతున్నారు. విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన ఆయన్ను తొలుత బౌరింగ్ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి సీఐడీ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం నగరంలోని 42వ జేసీఎంఎం కోర్టులో హాజరుపరిచి కస్టడీకి ఇవ్వాలని కోరారు. బైరతి బవసరాజ్కు గుండె సంబంధిత వ్యాధి ఉందని, ఆయనకు చికిత్స అవసరమని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స అందించి శనివారం కోర్టులో హాజరు పరచాలని సీఐడీ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. బిక్లు శివ హత్యకేసులో ఏ 20 ఆరోపిగా ఉన్న మలయాళిఅజిత్ బెయిల్ను గురువారం కోర్టు రద్దుచేయడంతో అతన్ని సీఐడీ అరెస్ట్ చేసింది. చిరుతపులి దాడిలో జూపార్కు ఉద్యోగికి గాయాలు బొమ్మనహళ్లి: చిరుతపులిదాడిలో జూ కీపర్ గాయపడిన ఘటన బన్నేరుఘట్ట బన్నేరుఘట్ట్ట పార్క్ పునరావాస కేంద్రంలో జరిగింది. శాంతప్ప అనే వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టు విధానంలో జూ కీపర్గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం చిరుతపులి ఉన్న బోనును శుభ్రం చేస్తుండగా చిరుతపులి ఇనుప మెష్ ద్వారా ముందు కాళ్లను బయటకు పెట్టి దాడి చేసింది. దీంతో చెంప, మెడపై కాలిగోళ్లు గుచ్చుకొని శాంతప్పకు బలమైన గాయాలయ్యాయి. సిబ్బంది గమనించి శాంతప్పను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ పాఠశాలలను మూసేయొద్దు చిక్కబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం కేపీఎస్ మ్యాగ్నట్ విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో 40 వేల ప్రభుత్వ పాఠశాలలు, చిక్కబళ్లాపురం జిల్లాలో 1300 ప్రభుత్వ పాఠశాలలను మూసేయడానికి సిద్ధమవుతోందని ఏఐడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారి సుభాష్ బెట్టదకొప్ప అన్నారు. ఆయన మరళుకుంటె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామ పెద్దల సమక్షంలో చేపట్టిన ధర్నాలో మాట్లాడారు. ప్రతి జీపీలో ఒక పాఠశాల ఏర్పాటుకు సర్కార్ సిద్ధమవుతోంది. 1, 2వ తరగతి పిల్లలు 5 నుంచి 6 కిమీ దూరం నడుచుకొని వెళ్లి రావడం కష్టతరం. సరైన బస్ వ్యవస్థ లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం కొద్ది మంది మన ఊరిలోనే మన పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో పాఠశాలకు స్థలాన్ని అందించారు. ఇలా పాఠశాలను మూసేయడం ద్వారా అనేక మంది పిల్లలు బడి మానేస్తారని అన్నారు. అందువల్ల ప్రభుత్వం కేపీఎస్ మ్యాగ్నట్ పథకాన్ని వదులుకోవాలి లేదా ఉన్న పాఠశాలలను అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. -
ఇకపై హంపీ ఉత్సవాలు నవంబర్లోనే
ఇకపై కూడా అదే మాదిరిగా ప్రతి ఏటా నవంబర్ నెలలోనే హంపీ ఉత్సవాలు జరుపుతామన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందించేందుకు గ్యారెంటీ పథకాలను అమలు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. విజయనగర చరిత్ర, గత పాలనా వైభవం అందరికీ తెలియజేసేందుకు హంపీ ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. మంత్రులు శివరాజ్ తంగడిగి, జమీర్ అహ్మద్ ఖాన్, హెచ్కే.పాటిల్ మాట్లాడుతూ హంపీ గొప్పతనాన్ని, విజయనగర పాలన వైభవాన్ని వివరించారు. వేదికపై ప్రముఖ కన్నడ సినీ నటుడు శివరాజ్కుమార్, విద్యారణ్య భారతీ స్వామీజీ, ఎమ్మెల్యేలు నాగేంద్ర, గవియప్ప, నారా భరత్రెడ్డి, నాగరాజు, లోక్సభ సభ్యుడు తుకారాం, జిల్లా అధికారి, ఎస్పీ పాల్గొన్నారు. -
ఆనకట్టలు.. అభివృద్ధికి జీవనాడులు
బనశంకరి: ఆనకట్టలు వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి, సామాజిక అభివృద్ధికి జీవనాడులు అని సీఎం సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. శుక్రవారం బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ(ఐఐఎస్సీ)లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆనకట్టల సురక్షత సమ్మేళనం–2026ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆనకట్టల సురక్షత కేవలం సాంకేతిక విషయమే కాదు, జాతీయ భద్రత అంశమని అన్నారు. కర్ణాటక దేశంలోనే అత్యధిక ఆనకట్టలు కలిగిన రాష్ట్రాల్లో ఒకటన్నారు. సురక్షత విషయంలో అనుభవం, జవాబుదారీ రెండూ కలిగి ఉందన్నారు. దేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రు ఆనకట్టలను ఆధునిక భారత దేవాలయాలు అని పిలిచారని గుర్తు చేశారు. దేశంలో ప్రస్తుతం 6,628 నిర్ధిష్ట ఆనకట్టలు ఉండగా, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆనకట్టలు కలిగిన దేశం భారత్ అన్నారు. కర్ణాటకలో 231 ఆనకట్టలు ఉండగా, దేశంలో 6వ స్థానంలో ఉందన్నారు. మైసూరు మహారాజులు ప్రత్యేకంగా నాల్వడి కృష్ణరాజ ఒడెయర్ నీటిపారుదల అభివృద్ధికి అధిక ప్రోత్సాహాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి స్మరించారు. అనంతరం దేవరాజ అరసు పాలనలో సమాన ప్రాంతీయ అభివృద్ధికి నీటిపారుదల విస్తరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో స్థాపించిన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్ద్యం సుమారు 4,800 మెగావాట్లు కాగా వందలాది టీఎంసీల నీటిని సేకరించే సామర్థ్యం కలిగిన జలాశయాలు వ్యవసాయం, తాగు నీటి అవసరాలను తీరుస్తున్నాయన్నారు. సమ్మేళనంలో వివిధ దేశాల నిపుణులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాల్గొన్నారు. కేంద్రం అనుమతిస్తే మేకెదాటు, యూకేపీ అమలు కేంద్రప్రభుత్వం అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం మేకెదాటు, అప్పర్ కృష్ణా పథకా(యూకేపీ)లను అమలు చేస్తామని, కేంద్రం తమకు సహకారం అందిస్తుందన్న నమ్మకం ఉందని డిప్యూటీ సీఎం, జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం భారతీయ విజ్ఞాన సంస్థ జేజే టాటా సభాంగణంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆనకట్టల సురక్షత సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు మేకెదాటు, అప్పర్ కృష్ణా పథకాలపై తీర్పు ఇచ్చిందన్నారు. కేంద్రప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నామని అన్నారు. మేకెదాటు పథకంతో బెంగళూరుతో పాటు ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించడానికి, 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సహాయపడుతుందన్నారు. -
కేఎస్ఆర్పీ బెటాలియన్ ఏర్పాటు చేయాలి
రాయచూరు రూరల్: జిల్లాలో కేఎస్ఆర్పీ బెటాలియన్ ఏర్పాటు చేయాలని అఖిల మహర్షి వాల్మీకి నాయక్ సంఘటన సంచాలకుడు వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హట్టి బంగారు గనుల కంపెనీ, రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పలు రకాలైన జాతరలు, రథోత్సవాల సమయంలో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కేఎస్ఆర్పీ 13వ పోలీస్ బెటాలియన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని శాసన సభ్యులు అభివృద్ధి విషయంలో ఏకం కావాలన్నారు. బెంగళూరు, తుమకూరు ప్రతినిధుల మాదిరిగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. -
గ్రామాల్లో సమస్యలు పరిష్కరించండి
రాయచూరు రూరల్: గ్రామీణ విధాన సభ పరిధిలో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి జరిగిన టా్స్క్ పోర్స్ సభలో గ్రామీణ శాసనసభ సభ్యుడు బసన గౌడ దద్దల్ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారం తాలుకా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జెస్కాం, సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీ అభివృద్ధి అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, పంచ గ్యారంటీల అధ్యక్షుడు పవన్ పాటిల్, టీపీఈఓ చంద్ర శేఖర్, తహసీల్దార్ సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్పై అప్రమత్తత అవసరం రాయచూరు రూరల్: నేటి సమాజంలో క్యాన్సర్ వ్యాధికి గురవుతున్న వారి సంఖ్య అధికమైంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు ఇంటింటా ప్రచారం చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు యలహంక మణిపాల్ క్యాన్సర్ అస్పత్రి వైద్యులు విక్రమయ్య, అరన్ ఫెర్నాండజ్ పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇమ్యూనోథెరపీ, ట్రోమో సెంటర్ ద్వారా క్యాన్సర్ రోగులకు చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. తాగునీటి సమస్య తలెత్తనీయొద్దురాయచూరు రూరల్: రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి నితీష్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా అధికారి సభా భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఇతర శాఖల ఉద్యోగులు కలసి కట్టుగా పని చేయాలని సూచించారు. తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణ పుర కుడి కాలువల కింది భాగంలో మూడు నెలల పాటు నీటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, బావుల్లో నీటిని నింపాలని సూచించారు. నీటిని సంరక్షించి పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. బాల్య వివాహాలతో అనర్థాలురాయచూరు రూరల్: బాల్య వివాహాలతో అనర్థాలు చోటుచేసుకుంటాయి. నేటి ఆధునిక సమాజంలో బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు ముందుండాలని జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కార్మిక శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే మహిళా శిశు సంక్షేమ అధికారులు స్పందించాలని సూచించారు. డ్రగ్ పెడ్లర్ దౌలా అరెస్ట్ బళ్లారి అర్బన్: డ్రగ్ పెడ్లర్ డి.దౌలా అలియాస్ ఎస్.దౌలాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 2010 నుంచి 2025 వరకు వివిధ పోలీస్స్టేషన్ల రికార్డులను పరిశీలించగా దౌలాపై మొత్తం 21 కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన కేసులే ఎక్కవగా ఉన్నట్లు సమాచారం. దౌలా పలుమార్లు అరెస్ట్ అయినప్పటికీ బెయిల్పై విడుదలై తిరిగి అదే నేరాలు చేసేవాడు. అతడిపై వరుస కేసులు నమోదు కావడంతో గతంలో జిల్లా నుంచి బహిష్కరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మళ్లీ నగరంలోకి వచ్చి యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసిన కొద్ది రోజుల్లోనే బెయిల్పై బయటకు వచ్చి తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగించడం పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
యమస్పీడు.. తీసింది ప్రాణం
మృతుల వివరాలు ● అశ్విన్ నాయర్ (17), ఫస్ట్ పీయూసీ, ఆర్వీ పీయూ కాలేజీ, యలహంక, చిరునామా: కొత్తనూరు ● ఇథన్ (17), ఫస్ట్ పీయూసీ, ఆర్వీ పీయూ కాలేజీ, యలహంక, చిరునామా: హుళిమావు, హెణ్ణూరు రోడ్డు ● అహ్రామ్ షరీఫ్ (16), 10వ తరగతి, ఏఓకేహెచ్ పాఠశాల, చిరునామా: ఉగిఖా లేఅవుట్ ● అయాన్ అలీ (17), 10వ తరగతి, ఆర్ఓఏ పాఠశాల, చిరునామా: కొత్తనూరు ● భరత్ (17), 10వ తరగతి, శోభన మెమోరియల్ స్కూల్, ఫ్రేజర్ టౌన్, చిరునామా: ఫ్రేజర్ టౌన్ ● ఫర్హాన్ (18), చిరునామా: కమ్మనహళ్లి ● గగన్ (26), సఫూల్ మార్కెట్ సూపర్వైజర్, చిరునామా: దేవనాయకనహళ్లి, చెన్నరాయపట్న, (ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి)కృష్ణరాజపురం: తెలిసీ తెలియని తనంతో బాలురు చేతిలోకి కారు స్టీరింగ్ తీసుకొని యమస్పీడుగా వెళ్లి మృత్యువాత పడ్డారు. జాలీ రైడ్ అంటూ వెళ్లి మృత్యువుకు చిక్కి తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమయ్యారు. ఎంతో భవిష్యత్ ఉన్న బాలురు అర్ధంతరంగా తనువు చాలించడంతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హొసకోటె శివార్లలో హొసకోటె, డాబస్పేటె మధ్య శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై కారు, బైక్, క్యాంటర్ మధ్య జరిగిన వరుస ప్రమాదాల్లో బెంగళూరు నగరానికి చెందిన కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు బాలురు, బైక్పై వెళుతున్న వ్యక్తితో కలిసి మొత్తం ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో క్యాంటర్ వాహనానికి చెందిన మాలూరు తాలూకా సంతెహళ్లి గ్రామ నివాసి బాలసుబ్రమణ్యం (32) కూడా ఉన్నారు. మృతులందరూ హెచ్బీఆర్ లేఅవుట్, ఫ్రేజర్ టౌన్, హెణ్ణూరు, కొత్తనూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు. ఎస్ఎస్ఎల్సీ, పీయూసీ చదువుతున్నారు. తెల్లవారు జామున 1 గంట ప్రాంతంలో వారందరూ జాలీ రైడ్ కోసం తమ ఇళ్ల నుంచి కార్లలో బయలుదేరి వెళ్లారు. హొసకోటె, డాబస్పేటె జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో హొసకోటె నుంచి వచ్చిన క్యాంటర్ వాహనం, సూలిబెలె పోలీస్ స్టేషన్ పరిధిలోని. సత్యావర గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టి, ఆపై నియంత్రణ కోల్పోయి క్యాంటర్ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ వార్త అందిన వెంటనే సూలిబెలె స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏడుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం హొసకోటె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు క్యాంటర్ యాక్సిల్ పూర్తిగా కట్ అయి చక్రాలు విడిపోయి బోల్తా పడ్డాయి. కారు, బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.వరుస ప్రమాదాల కారణంగా ఈ మార్గంలో ప్రయాణించాల్సిన వాహనాలను జాతీయ రహదారిపై కొన్ని గంటలపాటు నిలిపివేశారు. ఆ తర్వాత పోలీసులు క్రేన్ను ఉపయోగించి దెబ్బతిన్న వాహనాలను రోడ్డు నుంచి పక్కకు తరలించి వాహన రాకపోకలు పునరుద్ధరించారు.ప్రమాదంలో చనిపోయిన బాలురు (ఫైల్) హొసకోటె సమీపంలో జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు ఆరుగురు బాలురు, వ్యక్తితో సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి -
ఇంజనీరు ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు
బనశంకరి: అవినీతికి పాల్పడుతూ రూ.కోట్లు కూడట్టిన అధికారులపై లోకాయుక్త దాడులు జరిపింది. బెంగళూరు, శివమొగ్గ, ధారవాడ, దావణగెరెలో గురువారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. ఎవరెవరు? బెంగళూరు గ్రామాంతర కర్ణాటక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ హెచ్ఎం జనార్దన్, ప్రజాపనుల శాఖ చీఫ్ ఇంజనీర్ పురుషోత్తమదాస్ హెగ్డే, దావణగెరె బెస్కాం అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్హెచ్ అర్జున్, ధార్వాడ సర్వేయర్ సోమలింగప్పల ఇళ్లు, ఆఫీసులు, సన్నిహితుల ఇళ్లలో గాలింపు జరుగుతోంది. భారీగా నగదు, ఫాంహౌస్లు ●ఇంజనీరు హెచ్ఎం.జనార్దన్ ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు దొరికింది. పెద్దమొత్తంలో అక్రమ ఆస్తుల పత్రాలు లభించాయి. ఈయనకు సంబంధించి మైసూరులో 5 చోట్ల, బెంగళూరులో 6 చోట్ల తనిఖీ జరుగుతోంది. ● దావణగెరెలో బెస్కాం ఇంజనీర్ ఆర్హెచ్.అర్జున్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు వచ్చాయి. ఇళ్లో భారీగా ఆస్తుల పత్రాలు, బంగారం లభించాయి. సాగర ఆనందపుర సమీపంలో తళలు గ్రామంలో అర్జున్ కు చెందిన 2.5 ఎకరాలు, 4.5 ఎకరాల విస్తీర్ణంలోని విలాసవంత ఫాంహౌస్లను గుర్తించి దాడులు చేశారు. ●సర్వేయరు సోమలింగప్ప సిద్దనగౌడర్ ధార్వాడలోని మురగోడ్ నివాసం, భారతినగర నివాసం, ఏడీఎల్ఆర్ ఆఫీసులో గాలింపు జరిపారు. నలుగురు అధికారులపై లోకాయుక్త దాడులు -
నేటి నుంచి హంపీ ఉత్సవాలు
సాక్షి,బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన హంపీలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు హంపీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాల కోసం హంపీని నవవధువులా ముస్తాబు చేశారు. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా పరమ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి రోజున హంపీ ఉత్సవాలు ముగియనున్నాయి. హంపీలో సాక్షాత్తు విరుపాక్షేశ్వరుడు లింగరూపంలో కొలువు దీరిన నేపథ్యంలో అదే రోజు హంపీ ఉత్సవాలతో పాటు శివుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. విజయనగర జిల్లా యంత్రాంగం హంపీలో ప్రతి చారిత్రక కట్టడానికి విద్యుత్ దీపాలంకరణ చేయడంతో హంపీ సౌందర్యం మరింత ఆకట్టుకునేలా ఉంది. ఉత్సవాలు నేపథ్యంలో కర్ణాటక నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి పర్యాటకుల సందడి పెరగనుంది. ఆరు ప్రధాన వేదికలు ఏర్పాటు చేసి, మన సంస్కృతి వారసత్వాలను కాపాడే దిశగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గత వైభవాన్ని చాటేలా .. హొసపేటె: ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపీలో ఈనెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు హంపీ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, 1000 డ్రోన్లతో ప్రత్యేక హైటెక్ షో, హంపీ బైస్కై హెలిరైడ్, జానపద కళారూపాలతో ఊరేగింపు అంగరంగ వైభవంగా జరగనుంది. హంపీ ఉత్సవాలకు ఈసారి సుమారు 8 నుంచి 10 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా. హంపీ ఉత్సవాలను శుక్రవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభించనున్నారు. 50 కిలో మీటర్ల మేర ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆరు ప్రధాన వేదికల్లో కృష్ణదేవరాయ వేదిక, విరుపాక్ష వేదిక వద్ద ప్రముఖ నటీనటులు, గాయకుల ప్రదర్శనలు, డోలు కుణిత, పులి వేషధారణలు వంటివి రాష్ట్ర వ్యాప్త కళాకారుల ప్రదర్శనలు అలరించనున్నాయి. సుమారు రూ.14–15 కోట్ల బడ్జెట్తో, 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. పర్యాటకులకు ప్రభుత్వం తరఫున ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. విద్యుద్దీప కాంతుల్లో మిరుమిట్లుగొలుపుతున్న ప్రధాన వేదికఉత్సవాల సందర్భంగా స్మారకాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ నవవధువులా రాయల రాజధాని ముస్తాబు దేదీప్యమానంగా స్మారకాలకు దీపాలంకరణ -
అగ్రనేతల ముందుకు సీటు పాట్లు
శివాజీనగర/ బనశంకరి: రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న ముఖ్యమంత్రి పదవి మార్పిడి వివాదంలో ఇదో మైలురాయి. ఎట్టకేలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని కలిశారు. సీటు గొడవలో అనేకసార్లు భేటీకి డీకే యత్నించినా అపాయింట్మెంట్ లభించలేదు. ఇటీవల మైసూరులో ఎయిర్పోర్టులోనే రాహుల్ కొంతసేపు చర్చించారు. రెండురోజుల కిందట ఢిల్లీకి వచ్చిన డీకే శివకుమార్ ఈదఫా రాహుల్గాంధీతో సమావేశమై సీఎం పీఠం మార్పిడి అంశం, రాష్ట్ర రాజకీయ పరిణామాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సోనియాగాంధీ నివాసంలో ప్రియాంకగాంధీ, తరువాత సోనియాగాంధీని కూడా కలిశారు. వారిముందే రాహుల్గాంధీతో చర్చలు జరిపారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, తమ శ్రమకు ప్రతిఫలం ఇవ్వాలని విన్నవించారని తెలిసింది. అధికార పంపిణీ ఒప్పందాన్ని గుర్తుచేశారు. దీనికి స్పందించిన రాహుల్, ప్రియాంకగాంధీ.. త్వరగా తీర్మానం చేస్తాం, కొంతవరకు సహనంతో ఉండాలని చెప్పారని తెలిసింది. తక్షణం ఓ నిర్ణయానికి రాలేం, సీఎం సిద్దరామయ్యను ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతాం. ఆ తరువాత ఒక నిర్ణయానికి వస్తామని హామీ ఇచ్చినట్లు డీకే సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయం చేయడానికే వచ్చా: డీకే నేను రాజకీయాల్లో ఉన్నా, రాజకీయం చేయాలి, హైకమాండ్కు అన్నీ వివరించాను అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. గురువారం ఢిల్లీలో కర్ణాటక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పదవిపై హైకమాండ్ నుంచి స్పష్టత లభించిందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, నేను దీని గురించి చర్చించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ నేత రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. సహనం కూడా ప్రతిఫలం ఇస్తుందన్నారు. నేను ఢిల్లీకి వస్తే రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ.వేణుగోపాల్, సుర్జేవాలా ఇలా అందరినీ కలుస్తానని తెలిపారు. రాజకీయాలు చర్చించకుండా ఉంటామా?, కానీ వాటిని మీడియా ముందు వెల్లడించడం సబబు కాదన్నారు. సీఎం తనయుడు యతీంద్ర మా హైకమాండ్ కదా, ఆయన మాటలను స్వీకరించాలని చమత్కరించారు. ఎమ్మెల్యేల విదేశీ పర్యటన గురించి నేను ఏమీ మాట్లాడను, వారికి సీఎం ఏ మార్గదర్శకం చేస్తున్నారో తెలియదన్నారు. టూర్ గురించి తనతో చర్చించలేదన్నారు. తమ మధ్య సంఘర్షణ లేదని, తాను, సీఎం పార్టీ తీర్మానానికి కట్టుబడి నడుచుకుంటున్నామని చెప్పారు. తమ సర్కారుకు 1000 రోజులు పూర్తి కావడం సంతోషంగా ఉంది, ఈ సందర్భంగా భూమి గ్యారంటీ పథకాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తామన్నారు. భూమి హక్కుపత్రం లేని వారికి హక్కుపత్రాలు, పట్టా పుస్తకాలను అందిస్తామని తెలిపారు. సోనియాగాంధీ, ప్రియాంక, రాహుల్తో డీసీఎం శివ భేటీ సీఎం పదవి కోసం విజ్ఞప్తి సహనంతో ఉండాలని హైకమాండ్ హితబోధ సీఎం సిద్దును పిలిచి చర్చించి, ఆపై నిర్ణయానికి భరోసా -
హంపీ బై స్కైకి శ్రీకారం
హొసపేటె: హంపీ ఉత్సవాల సందర్భంగా గురువారం కమలాపుర భువనేశ్వరి హోటల్ మైదానంలో హంపీ బై స్కై కార్యక్రమాన్ని జెడ్పీ సీఈఓ మహ్మద్ అక్రమ్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన హంపీలో వెలసిన రాయల కాలం నాటి సుందరమైన స్మారకాలను, కట్టడాలను, ఆలయాలను ఆకాశంలో నుంచి వీక్షించడం ఎంతో అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ఒక్కరికి రూ.3800 టిక్కెట్ ధర కల్పించామని, 5, 6 నిమిషాల పాటు హెలికాప్టర్ ద్వారా హంపీ అందాలను వీక్షించవచ్చని తెలిపారు. ఈనెల 12 నుంచి 16 వరకు హంపీ బై స్కై కార్యక్రమం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. భక్తిశ్రద్ధలతో తుంగా హారతి హొసపేటె: హంపీ ఉత్సవంలో భాగంగా విరుపాక్షేశ్వర ఆలయం సమీపంలోని తుంగభద్ర నది స్నానఘాట్ వద్ద తుంగా హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంత్రోచ్ఛారణల మధ్య, జిల్లా ఇన్చార్జి మంత్రి, డిప్యూటీ కమిషనర్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు కాంస్య దీపాలను వెలిగించారు. నది నీటిలో ప్రతిబింబించే దీపాల కాంతి, మంత్రాల జపం, పెద్ద పెట్టున శంఖం ఊదడంతో భక్తులు, పర్యాటకుల్లో భక్తిభావం ఉట్టిపడింది. కొప్పళ సీఐ జయప్రకాష్ బదిలీ రాయచూరు రూరల్: కొప్పళ టౌన్ సీఐ జయప్రకాష్ను కొప్పళ గ్రామీణ పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ ఉత్తర వలయం ఐజీపీ చేతన్సింగ్ రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న డి.సురేష్ను లోకాయుక్తకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానిపై హేళన తగదు రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్లో దేశం పురోగమనం చెందుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ సమావేశంలో అవమాన పరిచే విధంగా మహిళా సభ్యురాలిని ప్రశ్నించడం సబబు కాదని బీజేపీ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు సుమతి శాస్త్రి మాట్లాడారు. అసభ్య పద జాలాన్ని వాడకుండా కట్టడి చేయాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట్ర గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సుమా గీస్తీ, శారద, సావిత్రి, రూప, లక్ష్మి, అశ్విని, గోవిందులున్నారు. ఘనంగా వసంత వైభవం హొసపేటె: హంపీ ఉత్సవాల సందర్భంగా గురువారం నగరంలో వసంత వైభవాన్ని ఘనంగా నెరవేర్చారు. వివిధ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. వసంత వైభవం ఊరేగింపును నగరంలోని వడకరాయ దేవస్థానం వద్ద నుంచి ప్రారంభించారు. నగరంలోని ప్రముఖ వీధుల గుండా చేపట్టి పునీత్ సర్కిల్ వరకు నిర్వహించారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన
హొసపేటె: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె నేపథ్యంలో నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు భాగంలో గురువారం సీఐటీయూ కార్యకర్తలు నిరసన తెలిపారు. సీఐటీయు, ప్రాంత రైతు సంఘ నాయకులు, అంగన్వాడీ, బీసీఎస్ ఉద్యోగులు, నిర్మాణ కార్మికులు, ఎల్ఐసీ తదితరులతో సహా వందలాది మంది కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ కేంద్రాల ప్రైవేటీకరణ తగదు రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రైవేటీకరణ చేయడం తగదని జెస్కాం ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు గోపి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విద్యుత్ బిల్లు–2026ను ప్రవేశ పెడితే ఉద్యోగులు, కార్మికులు వీధిన పడతారన్నారు. అలాంటి చట్టాలను వ్యతిరేకిస్తూ సమష్టిగా ఆందోళన చేపట్టాలన్నారు. అనంతరం విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. వేడుకగా సవారమ్మ జాతర రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా మమదాపురలో వెలసిన సవారమ్మ జాతర వేడుకగా జరిగింది. బుధవారం కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యుల ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. ఆలయం వద్ద కలశారోహణం చేశారు. కలశ కుంభాలతో అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. మహేష్, రమేష్, శివు యాదవ్, అప్పనగౌడ, సవారప్ప, శేఖర్రెడ్డి, లక్ష్మిపతిలున్నారు. ఆల్మట్టికి విశిష్ట అతిథుల రాక ● ఆహారం కోసం విదేశాల నుంచి తరలి వచ్చిన వలస పక్షులు రాయచూరు రూరల్: ఆల్మట్టి డ్యాం పోటు జలాల్లో విదేశీ వలస పక్షుల సందడి నెలకొంది. ఆహారం కోసం విదేశాల నుంచి ఈ వలస పక్షులు తరలి వచ్చాయి. రంగు రంగుల పక్షుల సందడి చూపరుల మది దోస్తోంది. పొడవైన కాళ్లు, గొంతు, వెడల్పైన రెక్కలతో నడిచే పక్షులను గ్రేటర్ ఫ్లెమింగోలుగా పిలుస్తారు. వందలాది పక్షులు వరుసగా నిలబడి ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. దేశ, విదేశాల నుంచి 34 రకాల పక్షులు ఇక్కడకు చేరాయి. మే నెలాఖరు వరకు అవి ఇక్కడే మకాం వేస్తాయి. ఆళంద దర్గాలో శివపూజలకు సూచనరాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా ఆళంద దర్గాలో శివరాత్రికి పూజలు నిర్వహిం చాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆళందలోని వివాదిత లాడ్లే మశాక్ దర్గాలో వెలసిన రాఘవ చైతన్య శివలింగానికి శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరపాలని తీర్పు చెప్పింది. ఫిబ్రవరి 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు పూజారి సిద్దరామయ్యకు అవకాశం కల్పిస్తూ కలబుర్గి హైకోర్టు పీఠం ఆదేశించింది. ప్రత్యేకంగా పూజలు జరపడానికి హిందూ పర సంఘాలు 15 మందికి అవకాశం కల్పించాలని కోరినా హైకోర్టు కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించింది. -
చాక్లెట్లలో గంజాయి.. ఎయిర్పోర్టులో సీజ్
దొడ్డబళ్లాపురం: క్యాండీలు, చాక్లెట్ల రూపంలో గంజాయి, డ్రగ్స్ని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుని లగేజీలో 9.7 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.3.39 కోట్లుగా తెలిసింది. క్యాండీలు, చాక్లెట్ల రూపంలో గంజాయిని తరలిస్తున్నారు. మరో ప్రయాణికుడు 1.7 కేజీల చరస్, హషిష్ తరలిస్తూ పట్టుబడ్డాడు. విలువ రూ.4.7 కోట్లుగా అధికారులు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేశారు. కారు దూసుకెళ్లి చిన్నారి మృతి దొడ్డబళ్లాపురం: ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని కారు ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి అక్కడే చనిపోయిన సంఘటన బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా వాటరె గ్రామంలో జరిగింది. త్రిష (17 నెలలు) అనే పాప ఇంటి ముందు ఆడుకుంటుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. చక్రాల కింద నలిగిన బాలిక క్షణాల్లోనే మృత్యువాత పడింది. కారు డ్రైవరుపై ఖానాపుర పోలీసులు కేసు నమోదు చేశారు. భూ స్కాం కేసులో సబ్ రిజిస్ట్రార్ అరెస్టు దొడ్డబళ్లాపురం: కోట్ల రూపాయల విలువ చేసే భూమికి నకిలీ పత్రాలు తయారుచేసి విక్రయించిన కేసులో బెళగావి జిల్లా హుక్కేరి పోలీసులు సబ్ రిజిస్ట్రార్తో పాటు 9 మందిని అరెస్టు చేశారు. సబ్ రిజిస్ట్రార్ మడివాళయ్య, పత్రాలను తయారుచేసిన అశోక్, రైటర్ ఆనంద నిందితుల్లో ఉన్నారు. కురణి గ్రామంలోని 2.1 ఎకరాల భూమి యజమాని శివానంద. ఆయనకు తెలియకుండా నిందితులు ఫోటోషాప్ ద్వారా ఆధార్ కార్డ్, ఇతర పత్రాలను రూపొందించి, తమదేనంటూ ఒక బిల్డర్కి విక్రయించారు. ఇందుకు సబ్ రిజిస్ట్రార్ కూడా సహకరించాడు. ఇది తెలుసుకున్న భూ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రైలులో మొబైల్ చోరీ శివమొగ్గ: మంగళవారం రాత్రి శివమొగ్గలోని విద్యానగర రైల్వే స్టేషన్ సమీపంలో ఒక దుండగుడు రైలు బోగీలోకి ప్రవేశించి, ప్రయాణికులను బెదిరించి, మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు. ఈ సంఘటన యశ్వంతపుర– తలగుప్ప రైలులో జరిగింది. రైలు శివమొగ్గలోని విద్యానగర రైల్వే స్టేషన్కు చేరుకున్నప్పుడు ఓ దొంగ బోగీలోకి ప్రవేశించాడు. కత్తితో భయపెట్టి ఒక ప్రయాణికుని మొబైల్ ఫోన్ను లాక్కొని పారిపోయాడు. బాధితుడు రైల్వే శాఖ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేశాడు. రాహుల్పై పోస్టు.. అరెస్టు శివమొగ్గ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గురించి అవమానకరమైన పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అభియోగంపై తీర్థహళ్లి బీజేపీ ఎమ్మెల్యే అరగ జ్ఞానేంద్ర సన్నిహితుడు రాజేష్ హిరిమానైపె కేసు నమోదైంది. రాహుల్గాంధీని పాకిస్తాన్ సైనికాధికారి ముఖంతో కలిపిన ఫోటోని రాజేష్ పోస్ట్ చేశాడు. వీరిద్దరిదీ ఒకే అజెండా అనే వ్యాఖ్య కూడా చేశాడు. దీంతో స్థానిక పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరచగా ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించారు. -
మా కూతుర్ని కాపాడండి
● లవ్ జిహాద్ కేసులో తండ్రి ఫిర్యాదు యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా సురత్కల్లో హిందూ యువతి వైశాలి, ముస్లిం యువకుడు మహమ్మద్ మిద్లాజ్ పరారైన ఘటన లవ్ జిహాదేనని యువతి తండ్రి విశ్వనాథ్ గురువారం మంగళూరులో ఆరోపించారు. తమ కూతురు లవ్ జిహాద్లో పడి మోసపోయిందని విలపించారు. దీని వెనుక ఎస్డిపిఐ సంస్థ హస్తం ఉన్నట్లు చెప్పారు. మిద్లాజ్ ఎస్డిపిఐ కార్యకర్త అన్నారు. ఎస్డిపిఐ నాయకులు మిద్లాజ్ తరఫున వయనాడు పోలీసుస్టేషన్కు వెళ్లడమే నిదర్శనమన్నారు. తమ కూతురికి మత్తుమందులు ఇచ్చి, బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్లాడన్నారు. విచారణ చేసి న్యాయం చేయాలని మనవి చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విజ్ఞానంతో జ్ఞాన వికాసం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో మానవుడి మెదడులో ఉన్న జ్ఞానం విజ్ఞానంతో వికాసం చెందుతుందని రాయచూరు విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద పేర్కొన్నారు. గురువారం మాత్రుశ్రీ తపోవనంలో కసాప, బసవ సేవా ప్రతిష్టాన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మానవుడిలో ఉన్న విషయాలు నేటి సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందడంతో జ్ఞాన భండాగారం తరించి పోతుందన్నారు. మనపై విచారించకుండా మరొకరి గురించి మాట్లాడుకోవటం మానుకోవాలన్నారు. 1970లో కూడు, గూడు, దుస్తుల పట్ల ఆలోచించే వారన్నారు. నేడు బంధుత్వాలకు, పండుగలు, జాతరలకు విలువ లేదన్నారు. సమావేశంలో బసవరాజ్ స్వామి, అశోక్ కుమార్ జైన్, వాేసుదేవ్ మూర్తి, విజయ రాజేంద్ర, హులి, ఆంజనేయ, వెంకటరావ్, నాగప్ప, రేఖ, విరుపాక్షి, ప్రతిభ, రావుత్ రావ్, వెంకటేష్లున్నారు. -
ఎమ్మెల్యేల టూర్ వెనుక సీఎం సిద్దు
● సీఎంఓ ద్వారా త్వరగా వీసాల కోసం లేఖ ● విహారయాత్రపై హైకమాండ్ ఆరా శివాజీనగర: రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విదేశీ పర్యటన ప్రతిపాదన తీవ్ర చర్చకు కారణమైంది. దీనిపై పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతోంది. 30 మంది ఎమ్మెల్యేలు ఈ నెల 15 లేదా 16న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విహారయాత్రకు బయల్దేరతారని ప్రచారం కావడం తెలిసిందే. సీఎం సీటు కోసం జరుగుతున్న యుద్ధంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు కొత్త వ్యూహాలతో కదులుతున్నారు. ఎమ్మెల్యేలకు ఓ వర్గం విదేశీ యాత్రను ఏర్పాటు చేసినట్లు, అది సీఎం సిద్దరామయ్యేనని గురువారం తేటతెల్లమైంది. టూర్పై డీకే అసంతృప్తితో ఉన్నారు. నివేదిక ఇవ్వండి ఈ నేపథ్యంలో ఏమిటీ యాత్ర అని ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆరా తీశారని తెలిసింది. పశు సంవర్ధక శాఖ అధ్యయన పర్యటన పేరుతో కొందరు ఎమ్మెల్యేలు విదేశీ టూర్కు సిద్ధమయ్యారు. ఆ తరువాత ప్రైవేట్ పర్యటనగా మారిందని సమాచారం. ఈ టూర్ గురించి నివేదిక సమర్పించాలని కేపీసీసీ నేతలకు హైకమాండ్ ఆదేశించినట్లు తెలిసింది. అధ్యయన పర్యటన అయితే ప్రభుత్వ అనుమతి ఉందా? అని అడిగినట్లు తెలిసింది. సీఎంఓ హడావుడి టూర్కి సాక్షాత్తు సీఎం ఆఫీసే ఎన్ఓసీ ఇచ్చేసిందని, అంతేకాకుండా ఆ రెండు దేశాల వీసాలను త్వరగా మంజూరు చేయాలని లేఖ కూడా పంపినట్లు తెలిసింది. మొత్తం మీద ఎమ్మెల్యేల విహారయాత్ర కొత్త చర్చకు దారిచ్చింది. యాత్ర జరిగేనా, లేదా బ్రేక్ పడేనా అనేది ఉత్కంఠగా మారింది. నాకు సంబంధం లేదన్న మంత్రి బనశంకరి: కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల విదేశీ పర్యటనతో తనకు సంబంధం లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి కే.వెంకటేశ్ అన్నారు. తమ శాఖ నుంచి ఎలాంటి విహారయాత్ర ఏర్పాటు చేయలేదని అన్నారు. నగరంలో మాట్లాడుతూ ఈ మేరకు చెప్పారు. పశుసంవర్ధక శాఖ ప్రాయోజకత్వంతో కొందరు ఎమ్మెల్యేలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ యాత్రకు వెళ్తున్నారని వార్తలు రావడంతో మంత్రి వివరణ ఇచ్చారు. -
కార్మిక సంఘాల సమ్మె
బళ్లారి రూరల్: దేశ వ్యాప్తంగా గురువారం జేసీటీయూ(జాయింట్ కమిటీ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా నగరంలో కార్మిక సంఘాల కార్యకర్తలు నగరంలో సమ్మె నిర్వహించారు. నారాయణరావు పార్క్ వద్ద నుంచి ర్యాలీగా పాత జిల్లాధికారి కార్యాలయం వరకు వెళ్లి అక్కడ భైటాయించి నిరసన చేపట్టారు. కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కష్టించి పని చేసే కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ను తెస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రజా సేవా రంగాలైన రైల్వే, గనులు, బ్యాంకులు, బీమా, విమానయాన, ఆయిల్, పోస్టల్, రోడ్డు రవాణా, టెలికాం సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. నరేగ పథకాన్ని వీబీ జీ రామ్ జీ అని పేరు మార్చడాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు. సమ్మెలో భాగంగా గురువారం ఎల్ఐసీ, బ్యాంకులు మూతపడ్డాయి. ఎల్ఐసీ ఉద్యోగ సంఘ ప్రముఖులు సూర్యనారాయణ, దత్తాత్రేయ, కార్మిక సంఘ ప్రముఖులు సత్యబాబు, ఆదిమూర్తి, దేవదాస్ తదితరులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించాలని సీఐటీయూ రాష్ట సంచాలకులు వీరేష్ డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్ కార్మిక చట్టాలను జారీ చేయడం వల్ల రై తు, కార్మిక, వ్యవసాయ కూలీలకు అన్ని విధాలుగా నష్టపోతారని ఆరోపించారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు మద్దతు పలుకుతూ ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పుబట్టారు. మనరేగలో తొలగించి వికసిత భారత్ మిషన్ రోజ్గార్ పేరును నమోదు చేయడం తగదని ఆరోపించారు. మనరేగ పథకం రద్దు వల్ల నేడు వలస వెళుతున్న కూలీలు, కార్మికులకు భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడంతో యరగేరలో రాయచూరు, కర్నూలు, మంత్రాలయం రహదారులను బంద్ చేసి రాస్తారోకో చేపట్టారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆందోళనలో పద్మ, వరలక్ష్మి, శరణ బసవ, రేణుకమ్మ, రంగమ్మ, అజీజ్, జిలాని, భీమణ్ణ, జగదీష్, ఆంజనేయ, తిమ్మప్ప తదితరులున్నారు. -
అక్రమార్కుల గుండెల్లో లోకాయుక్త దడ
హుబ్లీ: లోకాయుక్త అధికారులు గురువారం రాష్ట్రంలోని ఇద్దరు ప్రభుత్వ అధికారులకు సంబంధించి పలు చోట్ల ఉన్న ఆస్తులపై ఏక కాలంలో దాడి చేశారు. లోకాయుక్త వర్గాల ప్రకారం ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించిన ఆరోపణల నేపథ్యంలో ధార్వాడ, దావణగెరెల్లో ఈ దాడులు చేశారు. ధార్వాడ సర్వే శాఖ సూపర్వైజర్ సోమలింగప్ప సిద్దనగౌడర్ నివాసం, ఆయన కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు దాడి చేశారు. లోకాయుక్త ఎస్పీ సిద్దలింగప్ప నేతృత్వంలో ధార్వాడ భారతీ నగర్ లే అవుట్లోని ఆయన నివాసంతో పాటు ఐస్గేట్ వద్ద ఉన్న సదరు కార్యాలయంలో అధికారులు క్షుణ్ణంగా సోదాలు చేసి రికార్డులను పరిశీలించారు. అంతేగాక బెళగావి జిల్లా మురగోడలోని సోమలింగప్ప నివాసంతో పాటు నాలుగు చోట్ల దాడులు చేయగా సోదాల తతంగం నడుస్తోంది. దావణగెరెలోనూ.. ఇక దావణగెరెలో జెస్కాం ఇంజనీర్ ఆర్ఎస్ అర్జున్ నివాసం, కార్యాలయాల్లో దాడి చేసి ఆస్తి పత్రాలను పరిశీలించారు. కాగా అర్జున్ సదరు జెస్కాం సివిల్ విభాగంలో సేవలు అందిస్తున్నారు. దావణగెరె లోకాయుక్త ఎస్పీ ఎంహెచ్ కౌలపురే నేతృత్వంలో అర్జున్ నివాసం ఉన్న దావణగెరెలోని నిట్టువళ్లిలోని అద్దె గది, కార్యాలయం, శివమొగ్గలోని విజయనగర ప్రాంతంలోను గోపాలగౌడ లే అవుట్లోని రెండు నివాసాలపై ఏకకాలంలో దాడి చేశారు. ఇటీవల విజయనగర ప్రజాపనుల శాఖ ఈఈ దేవదాస్, అలాగే ఆయన కార్యాలయం అకౌంటెంట్ మారుతీ అనే వ్యక్తి తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి ఓ లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారుల వలలో చిక్కిన సంగతి తెలిసిందే. -
ఎర్రజెండాల కన్నెర్ర
గౌరిబిదనూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, రైతు విరోధి చట్టాలను రద్దు చేయాలని కార్మికులకు, రైతులకు న్యాయం చేయాలని సీఐటియూ ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎర్రజెండాలు చేబూని నిరసనలకు దిగారు. గౌరిబిదనూరులో వేలాదిమంది ర్యాలీ జరిపారు. రైతుల భూములను లాక్కుని పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారని, కార్మికుల కడుపు కొట్టేలా 4 చట్టాలను తెచ్చారని, ఉపాధి హామీ పథకం పేరును మార్చేశారని, ప్రజలలో మతమౌఢ్యం నింపుతూ ఉన్నారని కార్మిక నేతలు ఆరోపించారు. మనదేశంలో కార్మికుల పరిస్థితి చింతాజనకంగా ఉందన్నారు. జపాన్ దేశంలో కార్మికులకు గంటకు రూ.600 వేతనం ఇస్తుంటే, మనదేశంలో రూ.5 మాత్రమే లభిస్తోందన్నారు. కార్మికులకు నెలకు రూ.15 వేల వేతనం ఇవ్వడానికి పారిశ్రామిక యాజమాన్యాలు, ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందే తప్ప తగ్గింది లేదని, ప్రధాని మోదీ మాత్రం ముస్తాబై విదేశాల పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మిక నేతలు, వేలాదిగా కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. బెంగళూరులో ధర్నాలు శివాజీనగర: కేంద్రం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు రాష్ట్రంలో ఆందోళనలు నిర్వహించాయి. బంద్ పిలుపునకు పెద్ద స్పందన లభించలేదు. మైసూరు, హుబ్లీ, మంగళూరు సహా అన్ని నగరాలు, పట్టణాలలో ర్యాలీలు జరిపారు. అన్ని సేవలు యథాతథంగా నడిచాయి. బెంగళూరులో టౌన్హాల్ ముందు కార్మికులు, కమ్యూనిస్టు కార్యకర్తలు ధర్నా చేయగా, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ మార్గాలలో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు -
నేత్రపర్వంగా కొట్టూరేశ్వర రథోత్సవం
సాక్షి,బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, దైవాంశ సంభూతుడుగా పేరుగాంచిన శ్రీగురు కొట్టూరేశ్వర జాతర, రథోత్సవం కన్నుల పండువగా ఆచరించారు. ప్రతి ఏటా మాఘమాసంలో జరుపుకునే కొట్టూరేశ్వర రథోత్సవం ఈ ఏడాది కూడా ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరిపారు. గురువారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కొట్టూరు పట్టణంలో గురు కొట్టూరేశ్వర రథోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక, సామాజిక ఐక్యతను చాటే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు బళ్లారి జిల్లా నుంచే కాకుండా గదగ్, దావణగెరె, చిత్రదుర్గ, రాయచూరు తదితర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పట్టణంలో పండుగ వాతావరణం హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం సందర్భంగా పట్టణంలో జాతర, పండుగ వాతావరణం నెలకొంది. ఇంటింటా రంగవల్లులు వేసుకుని భక్తిశ్రద్ధలతో ఆచరించి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను సాదరంగా స్వాగతం పలికి, రథోత్సవాన్ని విజయవంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం విశేషం. వివిధ సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. కొట్టూరేశ్వర రథోత్సవానికి ఘనమైన చరిత్ర దాగి ఉండటంతో భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ఆలయంలో ప్రత్యేక పూజలు కొట్టూరేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, పూజలు, అర్చనలు కూడా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో కొట్టూరులో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా భక్త జనసందోహంతో రథోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా, మూఢ నమ్మకాలను పారదోలేందుకు కూడా ఈ రథోత్సవం ఎంతో దోహదం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అందరూ అశుభంగా భావించే మూలా నక్షత్ర ఆగమ సమయంలోనే రథం లాగుతూ సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలను పారదోలేందుకు కృషి చేస్తుండటం విశేషం. వేలాదిగా తరలివచ్చిన భక్తులు -
పేదలకు ఏడాదిలో లక్ష ప్లాట్లు అందిస్తాం
హొసపేటె: రాష్ట్రంలో భూమి లేని వారికి వచ్చే ఏడాదిలోపు లే అవుట్లు నిర్మించి ప్లాట్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జిల్లా ఇన్చార్జి, గృహ నిర్మాణ, వక్ఫ్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా పంచాయతీ హాలులో ప్రస్తుత సంవత్సరం జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. 2021 సర్వే ప్రకారం రాష్ట్రంలో 36 లక్షల మంది భూమి లేనివారు ఉన్నారు. అటువంటి అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ యాజమాన్యంలోని భూమిని లేదా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా ప్లాట్లు అందిస్తారన్నారు. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ పేరిట ఉన్న 24,000 ఎకరాల్లో ప్లాట్లు నిర్మించి దశల వారీగా భూమి లేని వారికి పంపిణీ చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు డాక్టర్ ఎన్టీ.శ్రీనివాస్, ఎంపీ లత మల్లికార్జున, కృష్ణనాయక్, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఎన్.రూపేష్కుమార్, జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అనుపమ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ -
‘గగన్యాన్’పై మున్ముందుకే..
బెంగళూరు: మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’లో ఎన్ని అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే భారత్ మున్ముందుకే దూసుకెళ్లాలని గ్రూప్ కెప్టెన్, భారత వ్యోమగా మి, అశోక చక్ర అవార్డు గ్రహీత శుభాంశు శుక్లా అన్నారు. చిరకాల ఆకాంక్ష నెరవేర్చుకోవాలని చెప్పారు. సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ ఉత్సాహంతో పనిచేస్తే అనుకున్నది సాధించడం తథ్యమని పేర్కొన్నారు. ఆయన బుధవారం బెంగళూరులో మీడియా సమావేశంలో మాట్లా డారు. మిషన్ గగన్యాన్ విజయవంతం అయి తే ఇలాంటి ఘనత సాధించిన దేశాల జాబితా లో భారత్ చేరుతుందని తెలిపారు. మనదేశ కీర్తిప్రతిష్టలు మరింత పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం మూడు దేశాలు మాత్రమే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో విజయవంతం అయ్యాయని గుర్తుచేశారు. గగనయాన్ యాత్ర ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇదే మనదేశంలో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, మూడు రోజుల్లో క్షేమంగా వెనక్కి తీసుకురావాలన్నది గగన్యాన్ లక్ష్యం. 2027లో ఈ యాత్రను చేపట్టాలని నిర్ణయించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ అదే ఉత్సాహం శుభాంశు శుక్లా ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లొచ్చారు. గగన్యాన్ కోసం శుక్లాతోపాటు మరో ము గ్గురు వ్యోమగాములను ఇస్రో ఎంపిక చేసింది. గగన్యాన్ సాధారణమైన మిషన్ కాదని శుక్లా పేర్కొన్నారు. ఇది అత్యంత సంక్లిష్ట మైన, సవాళ్లతో కూడుకున్న కార్యక్రమమని వివరించారు. అయినప్పటికీ అధైర్యపడే ప్ర సక్తే లేదన్నారు. మొదటి రోజు ఎంత ఉత్సా హంతో ఉన్నామో ఇప్పటికీ అదే ఉత్సాహంతో పని చేస్తున్నామని స్పష్టంచేశారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, మళ్లీ భూమిపైకి తీసుకురావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ష్టాత్మకంగా భావిస్తున్నామని తెలిపారు. పెద్ద కార్యక్రమంలో కొన్ని అవరోధాలు, ఆలస్యా లు సహజమేనని వ్యాఖ్యానించారు. వాటిని ప్రతికూలతలుగా చూడొద్దని పేర్కొన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. అంతరిక్ష ప్రయోగాల్లో వేర్వేరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని శుక్లా తెలిపారు. ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం కలిసి పనిచేయడంలో తప్పులేద న్నారు. తాను ఐఎస్ఎస్కు వెళ్లిరావడానికి అమెరికా కూడా సహకరించిందని గుర్తుచేశా రు. మన దేశంలో అంతరిక్ష కేంద్ర ప్రభుత్వం చక్కటి సహకారం అందిస్తోందని వివరించారు. సైన్స్, అంతరిక్ష ప్రయోగాల్లో పెట్టుబ డులు నానాటికీ పెరుగుతుండడం శుభ పరిణామం అని చెప్పారు. గగన్యాన్ కోసం అందరూ ఓపిగ్గా ఎదురు చూడాలని యా త్రకు ఎంపికైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ పేర్కొన్నారు. ఏది జరగాలో అది కచ్చితంగా జరుగుతుందన్నారు. గగన్యాన్ యాత్ర విజయవంతమైతే ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ రికార్డు కెక్కుతుందని స్పష్టంచేశారు. -
బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతా..!
యశవంతపుర(బెంగుళూరు): ఉత్తర కన్నడ జిల్లా కారవార సిద్ధాపురలో వసంత నాయక్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు కమలాకర భట్ను నిందితురాలు సుచిత్ర హనీట్రాప్ చేసి బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది. హనీట్రాప్ చేసిన విషయాన్ని భర్త మహేశ్ నాయక్ వెల్లడించారు. జ్యోతిష్యుడు కమలాకర భట్ను సుచిత్ర హనీట్రాప్ చేయటంతో పాటు ప్రైవేట్ వీడియో రికార్డ్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించారు. కమలాకర్ భట్ సుచిత్రకు దగ్గర అయిన తరువాత ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకుంది. పిల్లలు, తాను నీ జతలోనే ఉంటామని కమలాకర భట్తో చెప్పి, తమను బాగా చూసుకోవాలని డిమాండ్ చేసింది. బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతానంటూ కమలాకర భట్ను బెదిరించినట్లు సమాచారం. మర్యాద పోతుందనే భయంతో సుచిత్ర, ఆమె పిల్లలను కమలాకర భట్ తన వద్దనే ఉంచుకున్నాడు. ఈ విషయాన్ని తన కుమార్తెలు చెప్పినట్లు మహేశ్ నాయక్ విలేకరులకు వెల్లడించారు. ఫస్ట్లుక్కు రూ.10 వేలు.. సుచిత్ర బుట్టలో పడిన కమలాకర్ భట్.. ఫస్ట్ లుక్లో రూ.36 వేలు చెల్లించాడు. ఫస్ట్లుక్లో రూ.10 వేలు వస్తే చాలు అనుకున్న సుచిత్రకు ఒక్కసారిగా 36 వేలు రావడంతో సంతోష పడింది. ఇందులో ఆమె వేతనం కింద రూ.25 వేలు, షాపింగ్కు రూ.10 వేలు తీసుకున్నట్లు సుచిత్రా భర్త మహేశ్ నాయక్ చెబుతున్నారు. -
ముస్లిం దంపతుల ఔదార్యం
రాయచూరు(కర్ణాటక): ముస్లిం తల్లిదండ్రులు, తమ హిందూ దత్తపుత్రుని పెళ్లిని హిందూ సంప్రదాయ రీతిలో ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. ఈ అపురూపమైన సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా బస్తవాడిలో జరిగింది. వివరాలు.. మెహబూబ్ హసన్ నాయికోడి, నూర్జహాన్ దంపతులు ఈ ఔదార్యాన్ని చాటుకున్నారు. లింగాయత్ వర్గానికి చెందిన శివానంద కాడయ్య దంపతులు అర్ధాంతరంగా చనిపోయారు. వారి కుమారులు సోమశేఖర్ (4), వసంత్ (2)లను మెహబూబ్ దంపతులు చిన్నప్పుడే దత్తత తీసుకుని పోషిస్తున్నారు. మెహబూబ్ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి రిటైరయ్యారు. అప్పటికే వారికి ఇద్దరు చొప్పున మగపిల్లలు, ఆడపిల్లలు ఉన్నా భారంగా భావించకుండా చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేశారు. సోమశేఖర్ డిగ్రీ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తు పూనం అనే యువతిని ప్రేమించాడు. దీంతో కాడ సిద్ధేశ్వర మండపంలో ముస్లిం తల్లిదండ్రులు హిందూ సంప్రదాయ రీతిలో దత్త కుమారుని పెళ్లి వేడుకలను జరిపించారు. మత సమైక్యతకు ఈ సన్నివేశం అద్దం పట్టగా, మెహబూబ్, నూర్జహాన్లను గ్రామస్తులు అభినందించారు. -
సోషల్ మీడియా సెలబ్రిటీ రేష్మా ఆత్మహత్య!
బెంగుళూరు: అనుమానాస్పదంగా సోషల్ మీడియా కార్యకర్త ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన ఘటన కేరళ– కర్ణాటక సరిహద్దుల్లోని కాసరగోడులో జరిగింది. చిన్న పాప అనే పేరుతో రేష్మా (24) సోషల్ మీడియా కార్యకర్తగా ప్రజాదరణ పొందింది. ఉళియత్తడ్కలో బాడుగ ఇంటిలో నివాసం ఉంటోంది. అదే ఇంటిలో మంగళవారం మధ్యాహ్నం ఆమె ఉరి వేసుకొన్న స్థితిలో ఉండగా, స్థానికులు చూసి కిందికి దించి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించింది. ప్రజుల్లా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేష్మాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవలే విడాకులు అయితే తీవ్రమైన గొడవలు కావడంతో నెల కిందటే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఒక్కరే జీవిస్తోంది. కొడుకును కాసరగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంచింది. రేష్మా ఇంటికి ఆమె ప్రేమికుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని తెలిసింది. రేష్మా ముబైల్ ఫోన్ను పోలీసులు స్వా«దీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. రేష్మా తల్లిదండ్రులు గంగాధరన్, శైలజ కాగా, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆమె తండ్రి జీపు డ్రైవరు. ఇన్స్టాలో రేష్మాకు 2 లక్షలకు పైగా ఫోలోయర్లు ఉన్నారు. డ్యాన్సులు, స్కిట్లు వంటి కార్యక్రమాలతో ఆదరణ పొందుతోంది. గ్రామీణ జీవితం, వంటకాల పోస్టులు చేసేది. చిన్నపాప మరణంతో సోషల్ మీడియాలో ఆవేదన, సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కుటుంబ గొడవలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానాలున్నాయి. View this post on Instagram A post shared by Real Time Malayali (@realtime_malayali) -
8 కేజీలకు పైగా బంగారమిచ్చినా కట్న వేధింపులే
రాయచూరు( కర్ణాటక ): కేజీల కొద్దీ బంగారం, లక్షల రూపాయల డబ్బు తీసుకుని పెళ్లి చేసుకున్న తరువాత కూడా మరింత కట్నం తేవాలని వేధిస్తున్న ధనదాహపు భర్త, అత్తమామల ఉదంతమిది. నవ వివాహితను వేధిస్తున్న కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఈ విషయంపై సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరారెడ్డి వివరాలను వెల్లడించారు. కళ్లుచెదిరే కట్న కానుకలు.. జిల్లాలోని సింధనూరులోని రామ్ కిశోర్ కాలనీలో నివాసముంటున్న సూర్యబాబు కుమార్తెకు బళ్లారి జిల్లా కృష్ణా నగర క్యాంప్ నివాసి ఆలపాటి కృష్ణ చైతన్యతో గత ఏడాది జూన్ 7న వివాహమైంది. కృష్ణచైతన్య బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. పెళ్లి సమయంలో కృష్ణ చైతన్యకు అక్షరాలా 8.5 కేజీల బంగారం, 4.5 కేజీల వెండి, రూ.6 లక్షల నగదు, రూ.8 లక్షలు దుస్తులకు, రూ.15 లక్షలు విలువ చేసే కారు, వంట సామగ్రి కోసం రూ.3 లక్షలు, కుటుంబ సభ్యుల ఖర్చులకు రూ.15 లక్షలు ఇచ్చి అత్యంత ఆర్భాటంగా పెళ్లివేడుకను జరిపించారు. నవంబరు నుంచి నరకం అయితే నవంబర్ నెలలో మరింత కట్నం తేవాలని భర్త, అత్తమామలు, అతని అక్క, బావ, మరిది తదితరులు నవ వధువును చిత్రహింసలు పెట్టసాగారు. ఇది తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసి ఉంటోంది. పుట్టింటి నుంచి ఆస్తిలో సగ భాగం తెచ్చేవరకు ఇంటికి రావద్దంటూ భర్త హుకుం జారీ చేశాడని సీఐ తెలిపారు. వారి సతాయింపులను తట్టుకోలేక సూర్యబాబు, కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై గృహ హింస కేసు నమోదు చేశామన్నారు. భర్త కృష్ణచైతన్య, అత్త అనంతలక్ష్మి, మామ ఆలపాటి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు గీతాశ్రీ, వెంకటకృష్ణ, శ్రీకాంత్, కృష్ణవంశీలను అరెస్ట్ చేశామని తెలిపారు. -
మహానుభావుల సేవలు మరువలేనివి
సాక్షి బళ్లారి: మూఢ నమ్మకాలు, కుల వివక్ష, అసమాతలకు వ్యతిరేకంగా వచనాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి సమ సమాజ స్థాపన కోసం ఎందరో మహానుభావులు(శరణులు) పాటు పడ్డారని జిల్లా గ్యారంటీ పథకాల అమలు ప్రాధికార సంస్థ అధ్యక్షుడు కేఈ.చిదానందప్ప తెలిపారు. మంగళవారం జెడ్పీ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కాయక శరణుల జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 12వ శతాబ్దంలో కుల వివక్ష, అసమానతలు, పక్షపాత భావనలు విస్తృతంగా ఉన్న సమయంలో ఎందరో మహానుభావులు సమ సమాజ అభివృద్ధికి కృషి చేశారన్నారు. మాదార చెన్నయ్య, సమగార అరళయ్య, మాదార గూళయ్య, డోహర కక్కయ్య తదితర మహానుభావులు, కాయక నిబద్ధతను, సమానత్వ సిద్ధాంతాలను చాటి చెప్పారన్నారు. బసవాది శరణులు ఎందరో పాటు పడ్డారని గుర్తు చేశారు. కన్నడ సంస్కృతి శాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్యారంటీల అమలు సమితి జిల్లా అధ్యక్షుడు చిదానందప్ప -
కాళ్లు పట్టుకున్నా.. కనికరించని కూతురు
బనశంకరి: బెంగళూరుతో సహా పలు జిల్లాలో మతాంతర ప్రేమ గొడవలు వెలుగులోకి వచ్చాయి. సయ్యద్ ఇంతియాజ్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. బెంగళూరు బీటీఎంలే ఔట్ నివాసి ఇంతియాజ్.. సోషల్ మీడియలో కోల్కతాకు చెందిన హిందూ యువతిని పరిచయం చేసుకున్నాడు. ప్రేమపేరుతో మభ్యపెట్టాడు, ఆమెను మతం మార్చి జైనద్ అని పేరుపెట్టాడు. 2025 జూలై 18న బెంగళూరులో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. తరువాత ఆమెకు ఆడపిల్ల పుట్టింది. తల్లీ బిడ్డను కోల్కతాలో వదిలేసిన ఇంతియాజ్ పరారయ్యాడు. బాధితురాలు ఇక్కడకు వచ్చి మైకో లేఔట్ ఠాణాలో భర్త మోసంపై ఫిర్యాదు చేసింది.యువతి పరారీయశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా సురత్కల్లో మొహమ్మద్ విద్లాజ్ అనే యువకునితో కలిసి వైశాలి (23) అనే యువతి పరారు అయ్యింది. కాసరగోడుకు చెందిన వైశాలి సురత్కల్లో ఓ కాలేజీలో చదువుతోంది. ఇద్దరూ ప్రేమలో పడి జనవరి 31న కేరళలోని వైనాడులో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఇది తెలిసి యువతి తల్లిదండ్రులు బీజేపీ నాయకులను సాయం కోరారు. వైశాలి తన పీజీ హాస్టల్ నుంచి ఫిబ్రవరి 9న వెళ్లిపోయింది. కూతురి కోసం కన్నవారు సురత్కల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.కాళ్లు పట్టుకున్నా.. కనికరించని కూతురుసాక్షి, బళ్లారి: కన్నవారు ప్రాధేయపడినా కూతురు మాత్రం ప్రేమికునితో వెళ్లిపోయింది. విజయపుర నగరంలో ఓ యువతి, మహ్మద్ సలీమ్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఈ నెల 2వ తేదీన తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి, సలీమ్ కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకొన్నామని పోలీసులతో చెప్పారు. తల్లిదండ్రులు కుమార్తెను బుజ్జగించారు, తమ వెంట రావాలని ఆమె కాళ్లమీద పడి ప్రాధేయపడినా ఆమె అవేమీ పట్టించుకోకుండా వెళ్లిపోవడం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. ఇది లవ్ జిహాదేనని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపించారు. -
అరణ్యంపై విమానం సర్వే!
దొడ్డబళ్లాపురం: చిక్కమగళూరు జిల్లాలోని కళస, ఎన్ఆర్ పుర తాలూకా పరిధిలో దట్టమైన అరణ్య ప్రదేశంపై తేలికపాటి విమానం చాలాసేపు తిరగడం స్థానికులను విస్మయపరిచింది. భద్రానది తీరం మొత్తం ఈ ఎయిర్ క్రాఫ్ట్ పలు రౌండ్లు కొట్టింది. ఇది చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్లింది. కళస ప్రాంతం నుంచి వచ్చిన విమానం బాళెహొన్నూరు పరిసరాల్లో పలు రౌండ్లు కొట్టి శివమొగ్గ వైపు వెళ్లిపోయింది. తమకేమీ తెలియదని అటవీ, పోలీసు అధికారులు చెప్పారు. భూగర్భ గనుల సర్వే కోసం వచ్చి ఉంటాదని భావిస్తున్నారు. ఎయిర్పోర్టు, వాయుసేన స్థావరంపై డ్రోన్ బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టుపై డ్రోన్ ఎగరేసిన యూట్యూబర్ నిర్వాకమిది. బెంగళూరుకు చెందిన వాంటర్లస్ట్ అనే యూట్యూబర్ 1వ టెర్మినల్ నుంచి యలహంక మీదుగా వాయుసేన స్థావరం వరకూ డ్రోన్ ఎగురవేసి వీడియో షూట్ చేశాడు. సుమారు 8 నిమిషాల వీడియోను తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసాడు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగరేసినందుకు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. ఎగురుతున్న విమానం చిక్కమగళూరు జిల్లాలో కలవరం -
ప్రజల సహకారంతో స్వచ్ఛ భారత్
బళ్లారిటౌన్: స్వచ్ఛ భారత్కు నగర ప్రజల సహకారం అవసరమని మేయర్ పీ.గాదెప్ప పేర్కొన్నారు. నగరాభివృద్ధి శాఖ, మహానగర పాలికె ఆధ్వర్యంలో వాల్మీకి భవనంలో మంగళవారం చేపట్టిన స్వచ్ఛభారత్ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ యావత్ నగరాన్ని పాలికె నుంచి శుభ్రపరచడం సాధ్యం కాదన్నారు. నగరంలోని 39వ వార్డుల్లో ప్రజలు సహకరిస్తేనే పూర్తి స్థాయిలో స్వచ్ఛతను కాపాడవచ్చన్నారు. ఇంటిలోని చెత్తను సక్రమంగా వేరు చేసి చెత్త వాహనాలకు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పాలికె కమిషనర్ మంజునాథ్ మాట్లాడుతూ పిల్లలు బాల్య దశ నుంచే పరిశుభత్రపై అవగాహన పొందాలన్నారు. అందుకు తల్లిదండ్రులు కూడా వారికి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం స్వచ్ఛభారత్పై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. పోటీల్లో దాదాపు 76 పాఠశాలల నుంచి 300 మంది విద్యార్థులు, పాలికె సభ్యులు కుబేర, రాజేశ్వరి, జానకి, ఏఈఈ ముస్తఫా పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ కేటుగాళ్లకు అకౌంట్ల దళారీ
శివమొగ్గ: డబ్బు ఆశ చూపి ప్రజల బ్యాంకు ఖాతాలను సైబర్ వంచకులకు అందిస్తున్న శివమొగ్గకు చెందిన శరత్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గుండ శరత్ కుమార్ శివమొగ్గ నగరంలోని తుంగానగర నివాసి. డ్రైవర్గా పనిచేస్తాడు. సైబర్ నేరగాళ్లకు దళారీగా ఉన్నాడు, టీ అంగడి పెట్టుకున్న స్నేహితుడు అమిత్ బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నాడు. బదులుగా 15 రోజులకు ఒకసారి కమీషన్ ఇస్తానని ఆశపెట్టాడు. కొన్నాళ్లకు నీ బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయిందని చెప్పాడు. అమిత్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి తన ఖాతా గురించి విచారణ చేశాడు. నీ ఖాతాపై 51 సైబర్ నేరాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఆందోళనకు గురైన అమిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.55 కోట్ల మోసాలు? దీంతో శివమొగ్గలోని సీఈఎన్ పోలీసులు శరత్కుమార్ను బంధించి అతని నుంచి వివిధ బ్యాంకుల 18 పాసు పుస్తకాలు, 25 ఏటీఎం కార్డులు, 7 చెక్బుక్కులు, 2 మొబైల్ఫోన్లను, 2 క్యూఆర్ కోడ్లను స్వాధీనపరచుకున్నారు. అతని వద్ద ఉన్న 19 అద్దె బ్యాంకు ఖాతాలపై దేశ వ్యాప్తంగా 96కు పైగా వంచన కేసులు నమోదయ్యాయి. ఈ ఖాతాల ద్వారా సుమారు రూ.55.43 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ 19 ఖాతాల నుంచి రూ.11.48 కోట్లు బదిలీ అయ్యింది. జిల్లా ఎస్పీ బీ.నిఖిల్ మార్గదర్శనంలో ఏఎస్పీలు కార్యప్ప, రమేష్, శివమొగ్గ సైబర్ క్రైం డీఎస్పీ కృష్ణమూర్తి, ఇన్స్పెక్టర్ మంజునాథ్ దర్యాప్తు చేపట్టారు. రూ.లక్షకు 5 వేలు ఖాతాలో పడే ప్రతి లక్ష రూపాయలకు రూ.5 వేల వరకు ఖాతాదారుకు కమీషన్ ఇస్తారని తెలిసింది. దీనినే ఒక లాభదాయక వృత్తిగా చేసుకుని సైబర్ నేరాల్లో పాల్పంచుకుంటున్నట్లు బట్టబయలైంది. అమాయకుల ఖాతాల్లోకి మోసాల డబ్బు శివమొగ్గలో బడా కేటుగాడు అరెస్టు -
సీఎం సిద్దు.. హైకమాండ్ జపం
బనశంకరి: పార్టీ నాయకత్వం చెప్పినట్లు నడుచుకుంటానని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధ ఆవరణలో మాజీ సీఎం, దివంగత కెంగల్ హనుమంతయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించి సీఎం మాట్లాడారు. కెంగల్ హనుమంతయ్య రాష్ట్రంలో ప్రామాణిక ధీమంత రాజకీయనేత, అద్భుతమైన విధానసౌధను నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. కర్ణాటక ఏకీకరణకు పోరాడిన నేతగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా సేవలందించారని చెప్పారు. రాజ్యాంగ రచనా కమిటీలో విలువైన సలహాలు అందించారన్నారు. ఆయన ఆదర్శాలు, సిద్ధాంతాలు అందరికీ మార్గదర్శనం చేస్తాయన్నారు. తనను పిలవలేదు కాబట్టి ఢిల్లీకి వెళ్లడం లేదని తెలిపారు. -
ముస్లిం దంపతుల ఔదార్యం
రాయచూరు రూరల్: ముస్లిం తల్లిదండ్రులు, తమ హిందూ దత్తపుత్రుని పెళ్లిని హిందూ సంప్రదాయ రీతిలో ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. ఈ అపురూపమైన సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా బస్తవాడిలో జరిగింది. వివరాలు.. మెహబూబ్ హసన్ నాయికోడి, నూర్జహాన్ దంపతులు ఈ ఔదార్యాన్ని చాటుకున్నారు. లింగాయత్ వర్గానికి చెందిన శివానంద కాడయ్య దంపతులు అర్ధాంతరంగా చనిపోయారు. వారి కుమారులు సోమశేఖర్ (4), వసంత్ (2)లను మెహబూబ్ దంపతులు చిన్నప్పుడే దత్తత తీసుకుని పోషిస్తున్నారు. మెహబూబ్ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి రిటైరయ్యారు. అప్పటికే వారికి ఇద్దరు చొప్పున మగపిల్లలు, ఆడపిల్లలు ఉన్నా భారంగా భావించకుండా చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేశారు. సోమశేఖర్ డిగ్రీ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తు పూనం అనే యువతిని ప్రేమించాడు. దీంతో కాడ సిద్ధేశ్వర మండపంలో ముస్లిం తల్లిదండ్రులు హిందూ సంప్రదాయ రీతిలో దత్త కుమారుని పెళ్లి వేడుకలను జరిపించారు. మత సమైక్యతకు ఈ సన్నివేశం అద్దం పట్టగా, మెహబూబ్, నూర్జహాన్లను గ్రామస్తులు అభినందించారు. హిందూ దత్తపుత్రునికి సంప్రదాయ రీతిలో పెళ్లి -
ఉత్సాహంగా ఉద్యోగుల క్రీడా పోటీలు
హొసపేటె: ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో క్రీడలు సహాయకారి అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గౌడ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు పరుగు పందెం, కబడ్డీ, యోగాసనాలు, వాలీబాల్, త్రోబాల్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. యువజన సేవా, క్రీడా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేసీ, జిల్లా వ్యాయామ విద్యాధికారి శ్రీకాంత్, జిల్లా కోశాధికారి కే.మల్లేశప్ప తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఈ ఏడాది విద్యుత్ కోతల్లేవు.!
రాయచూరు రూరల్: రాష్ట్రంలో 2025–26లో విద్యుత్ కోతలకు అవకాశం లేకుండా అధికంగా 1100 మె.వా.విదు్య్త్ ఉత్పత్తి కొనసాగుతుంది. గత ఏడాది అధిక భాగం వర్షాలు కురవడంతో ప్రధాన జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉష్ణ, సోలార్, గాలిమరల విద్యుత్ ఉత్పత్తి అధికంగా కొనసాగుతోంది. ప్రతి నిత్యం 33 దశలక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. 2024లో తీవ్ర విద్యుత్ క్షామం నెలకొంది. 2024–25లో 29,634 మె.వా. విద్యుత్ ఉత్పత్తి, 2025–26లో 30,733 మె.వా.విద్యుత్ ఉత్పత్తి కాగా ప్రతి రోజు 15,715 మె.వా.విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ ఉంది. 2026 జూలై వరకు విద్యుత్ కోత సమస్య ఉండదని కేపీసీఎల్ అధికారులు తెలిపారు. రాయచూరు, యరమరస్, బళ్లారి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నుంచి ఉత్పత్తి కొనసాగుతోంది. 1100 మె.వా. విద్యుదుత్పత్తి అధికం -
మహనీయుల ఆదర్శాలు అనుసరణీయం
చెళ్లకెరె రూరల్: మహనీయుల మానవతా సందేశాలు, విలువలను యువత అలవరుచుకోవాలని తహసీల్దార్ రెహన్ పాషా తెలిపారు. ఆయన తాలూకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళిత వచనకారుల జయంతిలో పాల్గొని మాట్లాడారు. వచనకారులు తమ కాలఘట్టంలో అసమానత, అంటరానితనంపై ఆనాడే ప్రజలను చైతన్య పరిచారన్నారు. ప్రస్తుతం వచనకారుల వచనాల్లో వ్యక్తమైన శ్రమ, సంస్కృతి, సమానత, మానవీయత సందేశాలను యువత అర్థం చేసుకోవాలన్నారు. దళిత వచనకారులు మాదార చెన్నయ్య, డోహర కక్కయ్య, మాదార జూళయ్య వంటి మహనీయులు సమానత, మానవతా విలువల గురించి తమ వచనాల ద్వారా ప్రజలను చైతన్య పరిచారన్నారు. నగరసభ ముఖ్యాధికారి నాగవేణి, సీడీపీఓ రాజనాయక్, డీసీఎం అధికారి రమేష్కుమార్, వ్యవసాయ అధికారి రమేష్, దళిత నాయకులు విజయ్కుమార్, సమర్థరాయ్, వీరభద్రప్ప, తిప్పేస్వామి పాల్గొన్నారు. చిత్రలేఖన శిబిరం ప్రారంభం హొసపేటె: హంపీ ఉత్సవంలో భాగంగా ఎదురు బసవన్న వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన చిత్రలేఖన శిబిరాన్ని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి ఒక చిత్రాన్ని గీయడం ద్వారా ప్రారంభించారు. ఏడీసీ ఈ.బాలకృష్ణ, సబ్ డివిజనల్ ఆఫీసర్ పీ.వివేకానంద, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అనుపమ, కన్నడ సంస్కృతి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దలింగేష్ రంగన్నవర్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు. కాయక శరణులకు పుష్పాంజలిరాయచూరు రూరల్: నగరంలో కాయక శరణుల జయంతిని వేడుకగా ఆచరించారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్లో కాయక శరణులు మాదర చెన్నయ్య, డోహర కక్కయ్య, ఉరిలింగ పెద్ది, సర్వజ్ఞల చిత్రపటాలకు తహసీల్దార్ సురేష్వర్మ పుష్పాంజలి ఘటించారు. అనంతరం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జయంతిని ప్రారంభించారు. సమాజంలో అట్టడుగున ఉన్న కుమ్మర సమాజం ఆర్థికంగా, సాంఘీకంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. -
రేపు శ్రీగురు కొట్టూరేశ్వర రథోత్సవం
సాక్షి బళ్లారి: సమాజంలో మూఢ నమ్మకాలు, అసమానతలు, తారతమ్యాలు పేట్రేగిపోతున్న నాటి రోజుల్లో ఎందరో మహానుభావులు సమసమాజ స్థాపన కోసం కృషి చేసి సమాజాన్ని ఉద్ధరించేందుకు కృషి చేశారు. 12వ శతాబ్ధంలో విశ్వగురు బసవణ్ణ సమసమాజ స్థాపన కోసం కృషి చేసి సమాజంలో మార్పుకోసం తన చివరి శ్వాస వరకు అహర్నిశలు కృషి చేసి ఖ్యాతిని గడించారు. అదే తరహాలో ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కొట్టూరులో సమాజ అభివృద్ధికి, అసమానతలను తొలగించేందుకు 16వ శతాబ్ధంలో మధ్య కర్ణాటక ప్రాంతంలోని హరపనహళ్లి, నాయకనహట్టి, అరసీకెరె, కూలహళ్లి, కొట్టూరులో ఐదుగురు మహానుభావులు జన్మించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి, ఆధ్యాత్మికతను పెంపొందించి భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తూ దైవాంశ సంభూతులుగా ఖ్యాతికెక్కారు. విజయనగర జిల్లా కొట్టూరులో వెలసిన శ్రీగురు కొట్టూరు బసవేశ్వర రథోత్సవం కర్ణాటకలోనే ఖ్యాతిని గడించింది. మూలా నక్షత్రంలో రథోత్సవం దేశ వ్యాప్తంగా ఆకట్టుకుంటున్న శ్రీగురు కొట్టూరేశ్వర రథోత్సవం ఫిబ్రవరి 12వ తేదీ గురువారం అంగరంగ వైభవంగా జరగనుంది. అన్ని కులాలు, మతాలకు చెందిన వారు ఆరాధ్యదైవంగా భావించే కొట్టూరేశ్వరస్వామిని ఆరాధించి భక్తులు పునీతులవుతుంటారు. పాదయాత్రతో భక్తులు తరలి రావడం విశేషం. మూఢ నమ్మకాలను తొలగించే కార్యక్రమంలో భాగంగా కొట్టూరేశ్వర రథోత్సవాన్ని అందరూ అశుభంగా భావించే మూల నక్షత్ర సమయంలో రథోత్సవాన్ని నిర్వహిస్తుండడం విశేషం. మాదిగ సముదాయానికి చెందిన అరళయ్య వంశస్తులు హారతి ఇచ్చిన తర్వాతే రథం లాగడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా రావడం గమనార్హం. బళ్లారి జిల్లా నుంచే కాకుండా గదగ్, ముండరగి, హరిహర, దావణగెరె, చిత్రదుర్గ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు. మూఢనమ్మకాలను పారదోలిన మహనీయుడు కొట్టూరుకు తరలి వస్తున్న భక్తజన సందోహం భక్తులకు సోదరభావంతో ఆతిథ్యం రథోత్సవానికి వచ్చే భక్తులకు సోదరభావంతో ఆతిథ్యం ఇస్తుంటారు. పరిచయం లేని వ్యక్తులనైనా కొట్టూరులో జాతర సమయంలో అందరూ మనవాళ్లుగా భావించి వారికి వసతులు కల్పించి సేవలు చేయడం భక్తి పరాకాష్టకు నిదర్శనంగా చెప్పవచ్చు. కొట్టూరేశ్వర స్వామి మహిమలు మెచ్చి మొగల్ చక్రవర్తి ఇచ్చిన మణిమంచం ఇప్పటికీ మఠంలో దర్శనమిస్తోంది. కొట్టూరేశ్వరస్వామిని హిందూ, ముస్లిం ఇలా కుల మతాలకు అతీతంగా సేవించి తరిస్తుంటారు. వీరశైవ మత పురాణం, చెన్నబసవ పురాణం, గురురాజ చరిత్ర, శ్రీగురు కొట్టూరేశ్వర స్వామి తదితర కావ్యాలు, గ్రంథాలు, మహిమలను, జానపద గేయాల్లో కూడా పౌరాణిక విశేషాలు, మహిమలు ప్రస్తావించారు. ఎంతో మహిమాన్వితమైన శ్రీగురు కొట్టూరేశ్వరస్వామి జాతర, రథోత్సవాన్ని తిలకించడానికి కొట్టూరుకు జనజాతర తరలి వస్తోంది. ఈసందర్భంగా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. -
ద్వేషపూరిత రాజకీయాలు తగదు
హొసపేటె: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ద్వేషపూరిత రాజకీయాలు చేయడానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవడం సరికాదని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలో ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు అసెంబ్లీలో గవర్నర్ పట్ల అధికార పార్టీ చూపిన అగౌరవం ఖండనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థను బెదిరించే మార్గంలో పయనిస్తోందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ చట్టం(ఎన్ఆర్ఈజీఏ)లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి వీబీజీ రామ్ జీ పేరును జోడించడం ద్వారా మార్పులు చేశారన్నారు. కానీ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీని గురించి అపప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే, సంకీర్ణ వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటే, ఆ పార్టీని గద్దె దించే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు. నగరసభ అధ్యక్షులు రూపేష్ కుమార్, ఉపాధ్యక్షులు జీవరత్నం, బీజేపీ నేతలు బంగారు లక్ష్మణ్, అశోక్ జీర్, శంకర్ మేటి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి -
బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు దుర్మరణం
● 12 మందికి గాయాలు ● దేవదుర్గ తాలూకాలో ఘటన రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా 12 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని దేవదుర్గ తాలూకా తింథిణి బ్రిడ్జి నుంచి దేవదుర్గకు వస్తుండగా మార్గమధ్యంలో కరేగుడ్డ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. ఆటోను అతి వేగంగా ఓవర్టేక్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించగా, బస్సు ఆటోను ఢీకొట్టడంతో మల్లప్ప(60) అక్కడికక్కడే మృతి చెందారు. మోనమ్మ (65) విమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.ఆటోలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలు కాగా వారిని దేవదుర్గ తాలూకా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హొసకెరప్ప వెల్లడించారు. టిప్పర్ దూసుకెళ్లి వ్యక్తి మృతిరాయచూరు రూరల్: టిప్పర్ దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాయచూరు జిల్లాలో మాన్వి ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది. మాన్వి తాలుకా మాడగిరికి చెందిన శరణప్ప గౌడ(55) మరణించారు. బ్యాంక్లో పని ముగించుకుని ద్వి చక్ర వాహనంపై వెళుతుండగా జారి పడడంతో టిప్పర్ వెనుక చక్రం కింద పడడంతో దేహం ఛిద్రంగా మారిందని పోలీసులు తెలిపారు. మాన్వి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్ కెంచరెడ్డి తెలిపారు. కర్తవ్య లోపంపై సీఐ సస్పెండ్రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ విధి నిర్వహణలో లోపానికి పాల్పడిన సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర వలయం ఐజీపీ చేతన్ సింగ్ రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. బాగల్కోటె జిల్లా బనహట్టి పోలీస్ స్టేషన్ సీఐ హెచ్.ఆర్.పాటిల్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా సస్పెన్షన్కు గల కారణాలను గోప్యంగా ఉంచారు. కాగా తనను సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం తెలియదని సీఐ పాటిల్ తెలిపారు. ఎస్పీ, టీఎస్పీ నిధులు పెంచాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో ఎస్పీ, టీఎస్పీ నిధులను 24 శాతం పెంచాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. మంగళవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు హనుమంతప్ప మాట్లాడారు. గతంలో నిధులను పంచ గ్యారంటీలకు వినియోగించడాన్ని తప్పుబట్టారు. భూమి లేని వారికి మిగులు భూములు, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు వేతనాలు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసిన వినతిపత్రాన్ని స్థానికాధికారికి సమర్పించారు. గ్రామీణ విలేకరులకు బస్సుపాస్ల పంపిణీరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో గ్రామీణ ప్రాంతంలో సంచరించే పాత్రికేయులకు బస్సుపాస్లు పంపిణీ చేశారు. సోమవారం కలబుర్గి డివిజన్ వార్త శాఖాధికారి కార్యాలయంలో వార్త శాఖాధికారి జడియప్ప వీటిని పంపిణీ చేసి మాట్లాడారు. వార్తలు సేకరించడానికి బస్ పాస్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బస్సు పాస్లను దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో వారి పాస్లను రద్దు చేస్తామన్నారు. అధికారులు ఉమా శంకర్, రాజరత్నం, మహాదేవి, పాషాలున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులదే దర్బార్రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో గ్రామీణ ప్రాంతంలోని రైతులు భూములను రిజిస్టర్ చేసుకోవాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తే అవినీతి కూపంలో మునిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో అడుగు పెట్టగానే ప్రైవేట్ వ్యక్తుల దర్బార్ నడుస్తోంది. నగరంలోని కార్యాలయంలో అధికారుల కంటే మధ్యవర్తులు పెత్తందారీతనం చూపుతున్నారని తెలిపారు. కార్యాలయం ముందు భాగంలో టేబుళ్లు, బెంచీలు వేసుకొని రాజఠీవి ప్రదర్శిస్తూ ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బు లాగుతున్నారని, అధికారులకు వాటా ఉందని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
హంపీ ఉత్సవాలకు వేళాయె
హొసపేటె: హంపీ ఉత్సవాలు ఈనెల 13న ప్రారంభం కానుండటంతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. హంపీ ఉత్సవానికి ఐదు వేదికలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉత్సవం ప్రధాన వేదిక గాయత్రి పీఠం మైదానంలో ఏర్పాటు చేస్తున్న ఎంపీ ప్రకాష్ వేదికను రాయల కాలం నాటి స్మారకాలు, నమూనా పద్ధతిలో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా ఈ వేదికపై శ్రీకృష్ణ దేవరాయల వైభవం దర్బార్ చిత్రాన్ని రూపొందించి వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ సారి వేదిక ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే శిల్పకళా శిబిరాన్ని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి ప్రారంభించారు. శిల్ప సురేష్ ఆచార్ నాయకత్వంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి శిల్పులు రాతితో కళను సృష్టించడానికి ముందుకు వచ్చారు. నేటి నుంచి శిల్పకళా శిబిరం ఈ శిబిరం ఫిబ్రవరి 11న ప్రారంభమవుతుంది. హంపీ ఉత్సవం సందర్భంగా సృష్టించిన రాతి విగ్రహాలను ప్రదర్శనలో ఉంచుతారు. హంపీలో ఉత్సవంలో ఆకర్షణగా ఉండటానికి మాతంగ పర్వతం వద్ద, రాత్రిపూట లైటింగ్లో చూసినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. హంపీ చుట్టూ ఉన్న రోడ్ల మరమ్మతులు చేపట్టారు. కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. పండుగకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. హొసపేటె– హంపీని కలిపే ప్రధాన రహదారులను శుభ్రపరుస్తున్నారు. రోడ్డు వెంట ఉన్న ముళ్లచెట్లను తొలగిస్తున్నారు. హంపీ వైపు వెళ్లే రహదారుల్లో స్వాగత తోరణాలు నిర్మిస్తున్నారు. హంపీ ఉత్సవాలపై అవగాహనకు బైక్ ర్యాలీ హంపీ ఉత్సవాలపై అవగాహన కల్పించడానికి వివిధ శాఖల సహకారంతో 150కి పైగా బైక్లతో మంగళవారం భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని విజయనగర జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నగరంలోని ప్రధాన వీధులా గుండా సాగి అనంతశయనగుడి, కొండనాయకనహళ్లి, మలపనగుడి, గాళెమ్మనగుడి, కడ్డిరాంపుర మీదుగా హంపీలోని విరుపాక్షేశ్వర ఆలయానికి చేరుకుంది. జిల్లా ఎస్పీ జాహ్నవి, జెడ్పీ సీఈఓ అక్రమ్ షా, అనేక మంది సీనియర్ అధికారులు పాల్గొని ర్యాలీకి మద్దతు ఇచ్చారు. నగరంలోని వివిధ సర్కిళ్లలో జరిగిన బైక్ ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించడమేగాక చారిత్రక హంపీ గత వైభవాన్ని మరింతగా ప్రచారం చేయడానికి దోహదపడింది. చురుగ్గా ప్రధాన వేదికల నిర్మాణ పనులు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం -
8 కేజీలకు పైగా బంగారమిచ్చినా కట్న వేధింపులే
రాయచూరు రూరల్: కేజీల కొద్దీ బంగారం, లక్షల రూపాయల డబ్బు తీసుకుని పెళ్లి చేసుకున్న తరువాత కూడా మరింత కట్నం తేవాలని వేధిస్తున్న ధనదాహపు భర్త, అత్తమామల ఉదంతమిది. నవ వివాహితను వేధిస్తున్న కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఈ విషయంపై సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరారెడ్డి వివరాలను వెల్లడించారు. కళ్లుచెదిరే కట్న కానుకలు.. జిల్లాలోని సింధనూరులోని రామ్ కిశోర్ కాలనీలో నివాసముంటున్న సూర్యబాబు కుమార్తెకు బళ్లారి జిల్లా కృష్ణా నగర క్యాంప్ నివాసి ఆలపాటి కృష్ణ చైతన్యతో గత ఏడాది జూన్ 7న వివాహమైంది. కృష్ణచైతన్య బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. పెళ్లి సమయంలో కృష్ణ చైతన్యకు అక్షరాలా 8.5 కేజీల బంగారం, 4.5 కేజీల వెండి, రూ.6 లక్షల నగదు, రూ.8 లక్షలు దుస్తులకు, రూ.15 లక్షలు విలువ చేసే కారు, వంట సామగ్రి కోసం రూ.3 లక్షలు, కుటుంబ సభ్యుల ఖర్చులకు రూ.15 లక్షలు ఇచ్చి అత్యంత ఆర్భాటంగా పెళ్లివేడుకను జరిపించారు. నవంబరు నుంచి నరకం అయితే నవంబర్ నెలలో మరింత కట్నం తేవాలని భర్త, అత్తమామలు, అతని అక్క, బావ, మరిది తదితరులు నవ వధువును చిత్రహింసలు పెట్టసాగారు. ఇది తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసి ఉంటోంది. పుట్టింటి నుంచి ఆస్తిలో సగ భాగం తెచ్చేవరకు ఇంటికి రావద్దంటూ భర్త హుకుం జారీ చేశాడని సీఐ తెలిపారు. వారి సతాయింపులను తట్టుకోలేక సూర్యబాబు, కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై గృహ హింస కేసు నమోదు చేశామన్నారు. భర్త కృష్ణచైతన్య, అత్త అనంతలక్ష్మి, మామ ఆలపాటి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు గీతాశ్రీ, వెంకటకృష్ణ, శ్రీకాంత్, కృష్ణవంశీలను అరెస్ట్ చేశామని తెలిపారు. భర్త, అత్తమామలపై నవ వివాహిత ఫిర్యాదు నిందితులకు కటకటాలు సింధనూరులో సంచలనం -
చిన్నపాప ఇక లేదు
● సోషల్ మీడియా సెలబ్రిటీ రేష్మా ఆత్మహత్య! యశవంతపుర: అనుమానాస్పదంగా సోషల్ మీడియా కార్యకర్త ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన ఘటన కేరళ– కర్ణాటక సరిహద్దుల్లోని కాసరగోడులో జరిగింది. చిన్న పాప అనే పేరుతో రేష్మా (24) సోషల్ మీడియా కార్యకర్తగా ప్రజాదరణ పొందింది. ఉళియత్తడ్కలో బాడుగ ఇంటిలో నివాసం ఉంటోంది. అదే ఇంటిలో మంగళవారం మధ్యాహ్నం ఆమె ఉరి వేసుకొన్న స్థితిలో ఉండగా, స్థానికులు చూసి కిందికి దించి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించింది. ప్రజుల్లా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేష్మాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవలే విడాకులు అయితే తీవ్రమైన గొడవలు కావడంతో నెల కిందటే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఒక్కరే జీవిస్తోంది. కొడుకును కాసరగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంచింది. రేష్మా ఇంటికి ఆమె ప్రేమికుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని తెలిసింది. రేష్మా ముబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. రేష్మా తల్లిదండ్రులు గంగాధరన్, శైలజ కాగా, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆమె తండ్రి జీపు డ్రైవరు. ఇన్స్టాలో రేష్మాకు 2 లక్షలకు పైగా ఫోలోయర్లు ఉన్నారు. డ్యాన్సులు, స్కిట్లు వంటి కార్యక్రమాలతో ఆదరణ పొందుతోంది. గ్రామీణ జీవితం, వంటకాల పోస్టులు చేసేది. చిన్నపాప మరణంతో సోషల్ మీడియాలో ఆవేదన, సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కుటుంబ గొడవలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానాలున్నాయి. కారు దగ్ధం, ఐదుమంది క్షేమం యశవంతపుర: ఉడుపి జిల్లా కాపు తాలూకా శిర్వలో సోమవారం అర్ధరాత్రి కారులో మంటలు వ్యాపించాయి. ఐదుమంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంగళూరు నుంచి శిర్వకు వెళుతున్న కారు ఇంజిన్లో నుంచి దట్టమైన పొగ వచ్చింది. డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపాడు. ప్రయాణికులు దిగుతుండగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించి కారును చుట్టుముట్టాయి. కొంతసేపటికే కారు కాలిపోయింది. స్థానికులు నీళ్లు చల్లినా ఉపయోగం లేదు. పోలీసులు పరిశీలించారు. ముడా కేసులో తీవ్ర విచారణ మైసూరు: రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ఇళ్ల స్థలాల కుంభకోణం కేసులో సీఎం సిద్దరామయ్య కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతున్నదీ తెలిసిందే. ఇక సామాన్యలు పరిస్థితి కూడా మామూలుగా లేదు. అక్కడ స్థలాలను అమ్మిన, కొన్నవారు అవస్థల్లో ఉన్నారు. 50:50 నిష్పత్తి వ్యవహారంలో 134 కేసులు వచ్చాయి. సైట్లను పొందిన 40 మందికి పైగా లబ్ధిదారులకు లోకాయుక్త అధికారులు నోటీసులు జారీ చేశారు. 1055 సైట్లలో రూ.వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో లోకాయుక్త దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పుడు ముడా మాజీ కమిషనర్లు దినేష్, నటేష్తో సహా అధికారులు, స్థలాల యజమానులు విచారణకు వచ్చి సమాధానాలు ఇవ్వాలని లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ నోటీసులిచ్చారు. -
ఘనంగా మస్తకాభిషేకాలు
బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన హళేబీడులోని జైనరగుత్తి ప్రాంతంలో జైన తీర్థంకరులకు మస్తకాభిషేకాలు జరుగుతున్నాయి. గర్భగుడిలోని 24 మంది తీర్థంకరులు, పార్శ్వనాథ తీర్థంకర విగ్రహానికి పవిత్ర ద్రవ్యాలతో మస్తకాభిషేకం నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జైన ఆలయం మంత్రోచ్ఛారణలతో, మంగళవాయిద్యాలతో మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి జైన మునులు పాల్గొన్నారు. గంధం, పాలు, అశ్వగంధం, కొబ్బరి నీళ్లు, పూలు తదితరాలతో విగ్రహాలను అభిషేకం చేశారు. తీర్థోద్ధారక వీర సాగర్ ముని మహారాజ్ జైన సమాజాన్ని ఏకం చేసి జైనరగుత్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని నిర్వాహకులు తెలిపారు. అనేక ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.వాలెంటైన్స్ డేకు హోసూరు గులాబీలు ● రోజూ 10 లక్షల ఎగుమతి హోసూరు: 14వ తేదీన ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమజంటలు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. పూలు, కానుకలతో శుభాకాంక్షలు చెప్పుకుంటారు. దీంతో హోసూరు గులాకీగా గిరాకీ పెరిగింది. పెద్దమొత్తంలో రోజా పుష్పాలను ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. హోసూరు ప్రాంతంలో రైతులు పండించే గులాబీలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. క్రిష్ణగిరి జిల్లాలో పూల సాగుకు అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండడంతో హోసూరు, బాగలూరు, బేరికె, డెంకణీకోట, తళి, అంచెట్టి, కెలమంగలం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు గ్రీన్ షెడ్లలో గులాబీ తోటలను సాగు చేస్తున్నారు. నాణ్యత బాగా ఉండడంతో ప్రపంచ మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలకే కాక ప్రేమికుల రోజుకు లక్షలాది పూలను ఎగుమతి అవుతాయి. వాలెంటైన్స్ డే కోసం గత కొన్నిరోజులుగా నిత్యం 10 లక్షల పూలను ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో గులాబీ రూ. 20 నుంచి 30 దాకా ధర పలుకుతోంది. మంచి రేటు వచ్చిందని పలువురు రైతులు, వ్యాపారులు తెలిపారు. మంత్రి చాంబర్లో నగలు, డబ్బు చోరీ, ఉద్యోగి అరెస్టు శివాజీనగర: రాష్ట్ర నగరాభివృద్ధి మంత్రి భైరతి సురేశ్ విధానసౌధలోని కార్యాలయంలో 300 గ్రాముల బంగారు నగలు, రూ.1.50 లక్షల డబ్బులున్న బ్యాగ్ దొంగతనం కావడం కలకలం రేపుతోంది. ఈ కేసులో డీ గ్రూప్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. నవీన్ అనే వ్యక్తి పని మీద మంత్రి సురేశ్ ఛాంబర్కు వస్తూ నగలు, డబ్బు బ్యాగుతో వచ్చారు. వెళ్లేటపుడు దానిని ఆ చాంబర్లోనే మరిచిపోయారు. మరుసటి రోజు వచ్చి చూస్తే బ్యాగు లేదు. విధానసౌధ ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీసులు తనిఖీ ఆరంభించారు. కార్యాలయం సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, డీపీఏఆర్ శాఖలో డీ గ్రూపు ఉద్యోగి అయిన ఒకరు బ్యాగ్ను తీసుకొని వెళ్లినట్లు తెలిసింది. ఆ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. భక్తులపై చిరుత దాడి, బాలునికి గాయాలు మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలె మహదేశ్వర బెట్ట ఆలయానికి నడిచి వెళ్తున్న భక్తులపై చిరుతపులి దాడి చేసింది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. చెన్నపట్టణ తాలూకా భువళ్లి గ్రామానికి చెందిన శ్రేయస్ (8) అనే బాలుడు ఈ దాడిలో గాయపడ్డాడు. మహాశివరాత్రి రాబోతుండగా, వేలాదిమంది భక్తులు మహదేశ్వర బెట్టకు పాదయాత్రగా వెళుతున్నారు. పొన్నాచి క్రాస్ నుంచి పాదయాత్రికుల మీద చిరుత పంజా విసిరింది. బాలుని చెవులకు గాయాలయ్యాయి. మహదేశ్వర బెట్ట ఠాణా సీఐ జగదీష్, అటవీ శాఖ సిబ్బంది చేరుకుని పరిశీలించారు. బాలున్ని బెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. భక్తులు అటవీ మార్గంలో కాకుండా ప్రధాన రహదారిలో పాదయాత్రగా రావాలని అటవీ అధికారులు కోరారు. -
కర్ణాటకలో 'సబ్బు' పాలిటిక్స్.. తమన్నా తప్పితే ఇంకెవరు లేరా?
మైసూర్ శాండల్ సబ్బు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 100 ఏళ్లకు పైగానే చరిత్ర కలిగిన ఈ సబ్బు.. కర్ణాటకలో తయారవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ తమన్నాని ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడీ విషయం కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ గట్టిగానే వస్తున్నాయి.కర్ణాటకకు చెందిన సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వచ్చే రెండేళ్ల పాటు మైసూర్ శాండల్ సబ్బు, ఇతర ఉత్పత్తులకు ఈమె ప్రచారం చేయనున్నారు. ఈ విషయం గురించి మాట్లాడిన కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్.. మైసూర్ శాండల్ సబ్బుని మార్కెట్లోకి రీలాంచ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న తమన్నాని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం ద్వారా ఉత్తర భారత మార్కెట్లో తమ కంపెనీ ఉత్పత్తులు డిమాండ్ పెంచడమే లక్ష్యమని అన్నారు.కన్నడ భామలైన రష్మిక, రుక్మిణి వసంత్, దీపికా పదుకొణె లాంటి వాళ్లని కాదని తమన్నాని బ్రాండ్ అంబాసిడర్ చేయడం ఏంటని పలువురు నెటిజన్లు, పలు కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ కె.సుధాకర్.. కాంగ్రెస్, కన్నడ వ్యతిరేక మనస్తత్వం కలిగిన ప్రభుత్వమని విమర్శించారు. కన్నడలో చాలామంది తారలున్నప్పటికీ.. వేరే రాష్ట్రం, వేరే భాషకు చెందిన సినీ నటిని నియమించింది. అంతేకాక ఆమెకు కోట్లాది రూపాయలు చెల్లించింది. ఇదే కాంగ్రెస్ పార్టీ.. కన్నడ వ్యతిరేక మనస్తత్వానికి మరో నిదర్శనం అని ట్వీట్ చేశారు. ఇప్పుడీ విషయం కన్నడ నాట హాట్ టాపిక్ అయిపోయింది.As a Government of Karnataka PSU competing successfully with leading corporate FMCG players, KSDL stands as a strong example of public sector excellence.In 2024–25, KSDL recorded a turnover of ₹1,787 Cr with a net profit of ₹451 Cr, delivering over 43,000 metric tonnes of… pic.twitter.com/cYuN59CkZm— M B Patil (@MBPatil) February 10, 2026ನಾಡದ್ರೋಹಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರಕ್ಕೆ ಕನ್ನಡದ ಸಿನಿತಾರೆಗಳು ಕಣ್ಣಿಗೆ ಕಣ್ಣುತ್ತಿಲ್ಲವೇ?ಕರ್ನಾಟಕದ ಸುಪ್ರಸಿದ್ಧ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಬ್ರ್ಯಾಂಡ್ ಮೈಸೂರು ಸ್ಯಾಂಡಲ್ ಸೋಪ್ ಗೆ ಬ್ರಾಂಡ್ ಅಂಬಾಸಿಡರ್ ನೇಮಿಸಲು ನಮ್ಮದೇ ಕನ್ನಡ ನಾಡಿನ ಅನೇಕ ತಾರೆಗಳು ಇದ್ದರೂ ಪರರಾಜ್ಯದ, ಅನ್ಯಭಾಷೆಯ ಸಿನಿಮಾ ನಟಿಯೊಬ್ಬರನ್ನು ಕೋಟ್ಯಂತರ ರೂಪಾಯಿ ಪೇಮೆಂಟ್ ಕೊಟ್ಟು… pic.twitter.com/bJqmXaPVo9— Dr Sudhakar K (@DrSudhakar_) February 10, 2026 -
వ్యభిచారం కేసులో చంద్రకళకు 10సంవత్సరాల జైలు
శివమొగ్గ( కర్ణాటక): వ్యభిచారం కేసులో ముగ్గురు మహిళలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1.61 లక్షల జరిమానా విధిస్తూ భద్రావతి 4వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇందిరా మైలస్వామి చెట్టియార్ తీర్పు వెలువరించారు. వివరాలు.. 2021, డిసెంబర్ 24వ తేదీన భద్రావతిలోని ఉజ్జయిన్పూర్లోని మరియమ్మ ఆలయం వెనుక ఉన్న 3వ క్రాస్లోని ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతుందనే ఫిర్యాదుపై ఐపీఎస్ అధికారి జితేంద్ర కుమార్ దయామా నేతృత్వంలోని పోలీసు బృందం దాడి చేసింది. భద్రావతిలోని హోసూరులోని జెడికట్టే నివాసి చంద్రకళ అలియాస్ శ్వేత, ఉజ్జయినిపూర్ నివాసి శిల్ప, హోసా సిద్ధాపూర్ నివాసి కవితను అరెస్ట్ చేశారు. ఈ విషయమై పేపర్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ సమయంలో ఇన్స్పెక్టర్గా ఉన్న మంజునాథ్ ఈఓ కేసును దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున పి.రత్నమ్మ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితులకు జైలు శిక్షతో పాటు రూ.1.61 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఇందిరా మైలస్వామి చెట్టియార్ తీర్పు ఇచ్చారు. -
‘నీవు నాకు తెలుసు.. నీతో వీడియో కాల్లో మాట్లాడాలి’
శివమొగ్గ(కర్ణాటక ): గుర్తు తెలియని వ్యక్తి తనకు వీడియో కాల్ చేసి ప్రైవేట్ భాగాలు చూపించాడని ఓ మహిళ శివమొగ్గలోని ఈఎన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. శివమొగ్గకు చెందిన ఒక మహిళ మొబైల్ చూస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్లో çవీడియో కాల్ చేశాడు. ‘నీవు నాకు తెలుసు.. నీతో వీడియో కాల్లో మాట్లాడాలి’ అని చెప్పాడు. మహిళ కాల్ లిఫ్ట్ చేయగా.. ఆ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రైవేట్ భాగాలు చూపిస్తూ వేధించాడు. మహిళ వెంటనే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా వీడియోను రికార్డు చేసుకుంది. అనంతరం శివమొగ్గలోని ఈఎన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వీడియోలను చూపించి ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోడ్రైవర్ బ్యాంక్ అకౌంట్లో వందల కోట్లు..!
బెంగళూరు: ఆటోడ్రైవరు బ్యాంకు ఖాతాలో కోట్లాది రూపాయల బ్యాలెన్సు ఉంది. భారీగా డబ్బులు వచ్చిపడుతున్నాయి. చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథకు బ్రేక్ పడింది. ఈ సంఘటన హుబ్లీ నగరంలో జరిగింది. కేశ్వాపురలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఒక ఖాతాదారు అకౌంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది రూపాయల అక్రమ నగదు బదిలీ అయినట్లుగా వెలుగు చూసింది. ఈ ఖాతా ఓ ఆటో డ్రైవర్ ఇర్ఫాన్ది. సమాచారం అందుకున్న హుబ్లీ– ధార్వాడ పోలీసులు, సైబర్ క్రైం పోలీసులు అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. అతని ఖాతాకు దేశంలోని వివిధ బ్యాంక్ల ఖాతాల నుంచి డబ్బులు వరదలా వచ్చి పడ్డాయి. గత రెండేళ్ల నుంచి ఈ ఖాతా చురుగ్గా ఉండగా, స్కాం వెలుగు చూడగానే ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతా సంఖ్య– 54910200000346 గా తెలిపారు.ఖాతాదారుల ఫిర్యాదుతో కదిలిన డొంక సైబర్ నేరాల్లో డబ్బులు పొగొట్టుకున్న పలువురు బాధితులు 1930 సైబర్క్రైం హెల్ప్లైన్కు కాల్ చేసి ఫలానా ఖాతాకు తమ డబ్బులు అక్రమంగా జమ అయినట్లు ఫిర్యాదులు చేయసాగారు. దీంతో ఆరా తీయగా ఇర్ఫాన్ డొంక కదిలింది. కుక్కింగ్ విత్ కేటరింగ్ అనే పేరుతో ఈ ఖాతా ఉంది. సుమారు 50 సార్లకు పైగా వివిధ ఖాతాల నుంచి డబ్బు జమ అయింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఒడిశా తదితర రాష్ట్రాల్లో సైబర్ మోసాల బాధితుల డబ్బు ఈ ఖాతాకే చేరింది. తనిఖీలో 16 పాస్ పుస్తకాలు దొరికాయి ఏసీపీ శివరాజ్ కటకబావి మీడియాతో మాట్లాడుతూ గోపనకొప్ప ఇర్ఫాన్ కాగినెలె అనే వ్యక్తి ఖాతాకు ఎక్కడెక్కడి నుంచో డబ్బు వస్తోందన్నారు. అతని ఇంట్లో తనిఖీ చేయగా 16 బ్యాంక్ పాస్ పుస్తకాలు దొరికాయని చెప్పారు. ఎంత మేర డబ్బులు బదిలీ అయ్యాయి. ఏయే మార్గాల్లో వచ్చాయి? అని బ్యాంక్ అధికారులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. -
ట్రాక్టర్లు ఢీకొని మహిళ మృతి
రాయచూరు రూరల్: బెళగావి జిల్లాలో చెరకు ట్రాక్టర్లు ఢీకొన్న ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆదివారం రాయబాగ తాలూకా హారోగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాను మీరా(29) అనే మహిళ ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. భర్త అల్లావుద్దీన్, కుమారుడు శోయబ్లకు గాయాలయ్యాయి. మరో ఘటనలో ఘటప్రభ పోలీస్ స్టేషన్ పరిధిలో లొళసూరు బస్టాండ్ వద్ద చెరకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొని వడ్డరహట్టి అనిత(26) మరణించింది. అనిత భర్త ఎలక్ట్రిక్ వాహనంలో ఓవర్టేక్ చేయబోగా వెనుక నుంచి తగలడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై హోరోగేరి, ఘటప్రభ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రెండు కార్లు ముఖాముఖీ ఢీసాక్షి,బళ్లారి: రెండు కార్లు ముఖాముఖీ ఢీకొనడంతో పూర్తిగా కాలిపోయాయి. సోమవారం బీదర్ జిల్లా బసవ కళ్యాణ తాలూకా నారాయణపుర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కార్లు అదుపు తప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో తప్పించుకోగా, కొన్ని నిమిషాల్లో రెండు కార్లు కాలిపోయాయి. అగి్నమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బసవ కళ్యాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొలెరో వాహనానికి మంటలు కాగా సోమవారం బళ్లారి నగరంలో మోతీ సర్కిల్ వద్ద బొలెరో వాహనంలో మంటలు వ్యాపించాయి. ఉన్నఫళంగా మంటలు రావడంతో స్థానికులు వెంటనే అగి్నమాపక సిబ్బందికి తెలిపారు. రోడ్డు పక్కనే నిలిపిన వాహనంలో మంటలు రావడంతో ఎందుకు వ్యాపించాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను బలి చేసి ప్రియుడితో జీవితం.. రోజీ దుర్మార్గపు కుట్ర
బెంగళూరు: అక్రమ సంబంధాల మోజులో పడిన భార్య.. భర్తను వదిలించుకోవాలని షాకింగ్ పథకం వేసింది. అతన్ని హంతకున్ని చేయాలని కుట్ర చేసింది. ఈ సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో జరిగింది. భార్య కుట్ర ఫలితంగా భర్త జైలు పాలయ్యాడు. వివరాలు.. ఆనేకల్ తాలూకాలో ఆంథోనీ, రోజి భార్యాభర్తలు. రోజికి రాజేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇది తెలిసి భర్త ఆమెను మందలించేవాడు. తమ సంతోషానికి భర్త అడ్డంకిగా ఉన్నాడు, తరచూ తాగి వచ్చి వేధిస్తున్నాడనే నెపంతో భార్య తన భర్తను పునరావాస కేంద్రంలో చేర్పించింది. 18 నెలల తర్వాత, భర్త ఆంథోనీ తిరిగి వచ్చాడు. భర్త లేని సమయంలో ఆమె ప్రియునితో సహజీవనం సాగించింది. భర్త రాగానే పథకాన్ని అమలు చేసింది. తమ బావ బాలరాజు మీద లేనిపోని మాటలు చెప్పి చంపేయాలని ప్రేరేపించింది. భార్య మాట విని ఆంథోనీ, తన అన్నయ్య బాలరాజ్ను కత్తితోపొడిచి హత్య చేశాడు. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో ఆంథోనీపై కేసు నమోదైంది. అరెస్టు చేసి చెరసాలకు తరలించారు. రోజి మళ్లీ ప్రియునికి దగ్గరైంది. అయితే రోజినే అసలు నిందితురాలని తెలిసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
10 ఏళ్లుగా అన్నం ముట్టుకోని ‘టార్జాన్’ యువకుడు!
దొడ్డబళ్లాపురం( కర్ణాటక): మనిషి జీవించాలంటే ఆహారం తినాలి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలోని బెళగావికి చెందిన బుడన్ఖాన్ అలియాస్ బుడన్ మాలిక్ హొసమణి (25) ఆకులు, చిన్న చిన్న మొక్కలు తింటూ బతుకుతున్నాడు. సవదత్తి తాలూకా ఉగరగోళ గ్రామానికి చెందిన ఇతడు 10 ఏళ్లుగా అన్నం ముట్టుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే గ్రామ శివారులోని హెగ్గొళ్ల గుట్ట మీద ఉంటున్నాడు. ఆకలైతే చుట్టుపక్కల చెట్ల ఆకులు, మొక్కలు తింటాడు. దాహం వేస్తే కుంటల్లో నీటిని తాగుతాడు. తరచూ ధ్యానం చేస్తాడు. మనుషులు తినే ఎటువంటి ఆహార పదార్థాలనూ ఇతడు తినడు. కోతులు ఆకులు, కాయలు తిని బతకడం చూసి తానూ నేర్చుకున్నానని, ఇప్పటి వరకూ ఎటువంటి రోగాలు రాలేదని చెబుతున్నాడు. ఇతడి ఆహార పద్ధతి వైద్యులకు సవాలుగా మారింది. ఖాన్ను అందరూ టార్జాన్ అని ముద్దుగా పిలుస్తున్నారు. -
మెట్రో చార్జీల పెంపును అడ్డుకున్నా
బనశంకరి: కర్ణాటక ప్రభుత్వమే మెట్రో చార్జీల పెంపును అడ్డుకునే నిర్ణయం తీసుకుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ జోక్యం లేదని డీసీఎం డీకే.శివకుమార్ అన్నారు. సోమవారం విధానసౌధలో ఆయన మాట్లాడుతూ మెట్రో సంస్థలో ఇంధన వ్యయం, నిర్వహణ, పాలనా వ్యయం తెలపాలని అధికారులను కోరానని, అంతవరకు టికెట్ రేట్ల పెంపును నిలిపివేయాలని సూచించానని తెలిపారు. మెట్రో టికెట్ రేట్లపై రాజకీయం అధికమైందన్నారు. సోమవారం జరగాల్సిన బీఎంఆర్సీఎల్ (మెట్రో) బోర్డు సమావేశం వాయిదాపడిందన్నారు. మెట్రో 50:50 నిధులతో కొనసాగే పథకమని, నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చార్జీల నిర్ణయ కమిటీ ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. గతంలోని కమిటీ రద్దయిందని, కొత్త కమిటీ ఏర్పాయ్యేవరకు చార్జీల్లో జోక్యం చేసుకోరాదని తనకు తెలిసిందని అన్నారు. బోర్డు సమావేశం రద్దు యశవంతపుర: మెట్రో చార్జీల పెంపు గురించి చర్చించడానికి బీఎంఆర్సీఎల్ బోర్డు భేటీ సోమవారం ఉండగా, ఆకస్మాత్తుగా రద్దయింది. శాంతినగరలోని హెడ్డాఫీసులో జరగాల్సి ఉంది. రద్దు కావడంపై అనేక ఊహాగానాలు వ్యాపించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఇటు నిలబడడంతో మెట్రో పెద్దలకు ఏమీ పాలుపోవడం లేదని సమాచారం. మెట్రో చార్జీలతో సంబంధం లేదు: సీఎం సాక్షి, బళ్లారి: మెట్రో రైలు చార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేదని, ఇది కేంద్రం నియమించిన మెట్రో అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయమని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఆయన దావణగెరెలో మాట్లాడుతూ మెట్రో చార్జీల గురించి చర్చించేందుకు డీసీఎం శివకుమార్ ఢిల్లీకి వెళుతున్నారనేది ఆయన్నే అడగాలన్నారు. వాల్మీకి సముదాయానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. దావణగెరె జిల్లా మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున రాజీనామా చేశారనడంలో నిజం లేదన్నారు. డీకేశి, మీరు కుర్చీని కాపాడుకునేందుకు పైరవీలు చేస్తున్నారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా, సీఎం మండిపడ్డారు. మెట్రో రైలు చార్జీల రగడ కేంద్ర, రాష్ట్రాల మధ్య యుద్ధంగా మారింది. పెంపునకు కారణం వారని, తగ్గించింది మాత్రం తామేనని అందరూ ప్రచారం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మెట్రో వార్ మరింత తీవ్రతరమైనా ఆశ్చర్యం లేదు. డీసీఎం డీకే శివకుమార్ -
రన్వే మీద ప్రచార బెలూన్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో రన్వే పైకి ఓ ప్రైవేటు సంస్థ ప్రచార బెలూన్ ఎగురుకుంటూ రావడంతో కాసేపు కలకలం రేగింది. ఆ భారీ సైజు బెలూన్ రన్వే పైన పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో విమానాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది బెలూన్ను తొలగించారు. ఓ రియాల్టీ సంస్థ బెలూన్గా తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరికి రూ.15 లక్షల సైబర్ మోసం మైసూరు: ప్యాలెస్ సిటీలో సైబర్ మోసగాళ్లు అమాయకులకు ఇట్టే బురిడి వేస్తున్నారు. వివరాలు.. యరగనహళ్లి నివాసికి వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్ గురించి ఓ మెసేజ్ వచ్చింది. దీంతో అతడు ఆ నంబరుకు కాల్చేసి మాట్లాడాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలంటూ అతన్ని మోసగాడు నమ్మించాడు. అలా రూ.3.50 లక్షలు బదిలీ చేసి మోసపోయాడు. సరస్వతిపురంలో ఓ రిటైర్డ్ అధికారిని ముంబై పోలీసులమని కాల్ చేసి బెదిరించారు. నీకు పలు నేరాలతో సంబంధం ఉందని భయపెట్టారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు తీసుకుని రూ. 12 లక్షలను బదిలీ చేసుకున్నారు. రెండు కార్లు ఢీ, ఇద్దరు మృతి తుమకూరు: తాలూకాలోని బనవర గేట్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. మృతులను తుమకూరు నగరవాసులు సురేష్ (55), మురళి (60)గా గుర్తించారు. ఎదురెదురుగా వస్తున్న కారు, క్వాలిస్ వాహనం ఢీకొన్నాయి. కారులో పై ఇద్దరూ తీవ్ర గాయాలతో చనిపోయారు. క్వాలిస్లోని సైబర్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణప్ప, జేడీఎస్ నేత జయన్న, మంజునాథ్ తదితరులు గాయపడ్డారు. చైన్ స్నాచర్ల దాడి.. మహిళ దుర్మరణం దొడ్డబళ్లాపురం: కళ్లల్లో స్ప్రే కొట్టిన చైన్ స్నాచర్లు మహిళ మెడలోని బంగారు గొలుసు లాగడంతో కిందపడి గాయపడిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. చైన్స్నాచర్ల దుష్కృత్యానికి ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వివరాలు.. నెలమంగల తాలూకా హుస్కూరు గ్రామంలో జరిగింది. గ్రామ నివాసి జ్యోతి (45) సోమవారం ఉదయం ఇంటిముందు చెత్త ఊడుస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె కళ్లల్లో ఏదో స్ప్రే కొట్టారు. తరువాత మెడలోని గొలుసు తెంచుకుని పరారయ్యారు. గొలుసు లాగడంతో ఆమె కిందపడినప్పుడు తలకు గాయం తగిలి స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా కొంతసేపటికే చనిపోయింది. మాదనాయకనహళ్లి పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. భార్య తెలివికి.. భర్త జైలుకు ● అతనితో హత్య చేయించిన వైనం ● ఆపై ప్రియునితో జీవనం బొమ్మనహళ్లి: అక్రమ సంబంధాల మోజులో పడిన భార్య.. భర్తను వదిలించుకోవాలని షాకింగ్ పథకం వేసింది. అతన్ని హంతకున్ని చేయాలని కుట్ర చేసింది. ఈ సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో జరిగింది. భార్య కుట్ర ఫలితంగా భర్త జైలు పాలయ్యాడు. వివరాలు.. ఆనేకల్ తాలూకాలో ఆంథోనీ, రోజి భార్యాభర్తలు. రోజికి రాజేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇది తెలిసి భర్త ఆమెను మందలించేవాడు. తమ సంతోషానికి భర్త అడ్డంకిగా ఉన్నాడు, తరచూ తాగి వచ్చి వేధిస్తున్నాడనే నెపంతో భార్య తన భర్తను పునరావాస కేంద్రంలో చేర్పించింది. 18 నెలల తర్వాత, భర్త ఆంథోనీ తిరిగి వచ్చాడు. భర్త లేని సమయంలో ఆమె ప్రియునితో సహజీవనం సాగించింది. భర్త రాగానే పథకాన్ని అమలు చేసింది. తమ బావ బాలరాజు మీద లేనిపోని మాటలు చెప్పి చంపేయాలని ప్రేరేపించింది. భార్య మాట విని ఆంథోనీ, తన అన్నయ్య బాలరాజ్ను కత్తితోపొడిచి హత్య చేశాడు. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో ఆంథోనీపై కేసు నమోదైంది. అరెస్టు చేసి చెరసాలకు తరలించారు. రోజి మళ్లీ ప్రియునికి దగ్గరైంది. అయితే రోజినే అసలు నిందితురాలని తెలిసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
ముల్లంగి రైతు పొలానికి దారి
● సర్వే చేసి పరిష్కరించిన అధికారులు ● ఇటీవల ఆఫీసులో నిరసన తుమకూరు: పొలానికి దారి చూపాలని అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోకుండా, లంచం ఇవ్వాలని సతాయించడంతో రైతు ముల్లంగి పంటే లంచంగా ఇస్తానని తహసీల్దారు ఆఫీసులో ధర్నా చేయడం తెలిసిందే. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మధుగిరి తాలూకా దొడ్డేరి వద్ద జక్కెనల్లికి చెందిన రైతు ప్రసన్న కుమార్ దుస్థితి తీరింది. ఫిబ్రవరి 4న సాక్షి వార్తాపత్రికలోనూ ప్రముఖంగా అతని ఆవేదన ముద్రితమైంది. ఈ నేపథ్యంలో మేలుకున్న రెవెన్యూ అధికారులు జయప్రకాష్, గ్రామ అకౌంటెంట్, శరణు, సర్వే అధికారులు ఒక్క రోజులోనే రైతు పొలాన్ని పరిశీలించారు. సర్వే నిర్వహించి దారిని ఏర్పాటు చేశారు. దీంతో రైతు అధికారులకు, విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. తన నిరసనకు న్యాయం జరిగిందని అన్నాడు. వారంరోజుల్లో దారి చూపకుంటే తహసీల్దారు ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపాడు. జేసీబీతో పొలానికి దారి వేస్తున్న అధికారులు -
చురుగ్గా రోడ్డు మరమ్మతు పనులు
హొసపేటె: ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరగనున్న హంపీ ఉత్సవానికి ముందు జిల్లా యంత్రాంగం రోడ్డు మరమ్మతులను ప్రారంభించింది. చాలా రోజులుగా దెబ్బతిన్న శివశక్తి నగర్ అంతర్గత రోడ్ల మరమ్మతు పనులను జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు ప్రారంభించింది. అంతర్గత రోడ్ల మరమ్మతుల నేపథ్యంలో హంపీ నుంచి హొసపేటె నగరానికి వచ్చే వాహనాల రాకపోకలను కొండనాయకనహళ్లి గ్రామంలోని సాయిబాబా ఆలయం మీదుగా హెచ్ఎల్సీ కెనాల్ రోడ్డుపైకి మళ్లించారు. హంపీ రోడ్డులోని అనంతశయనగుడి సమీపంలో జరుగుతున్న రైల్వే ఓవర్ పాస్ పనుల కారణంగా హొసపేటె నుంచి హంపీకి వెళ్లే వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలోని రోడ్లు అధ్వానంగా మారాయి. ఈ ప్రాంత నివాసితులు ప్రతి రోజు వ్యాపించే దుమ్ము ధూళితో విసుగు చెంది మున్సిపల్ కౌన్సిల్, జిల్లా యంత్రాంగం రోడ్డును మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక సార్లు నిరసన తెలిపారు. చివరకు హంపీ ఉత్సవ్ పేరుతో రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. ఈ ప్రాంత నివాసితులు ఉపశమనంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. -
వెట్టి పద్ధతిని నిర్మూలిద్దాం
చెళ్లకెరె రూరల్: ఇప్పటికీ అక్కడక్కడా కొనసాగుతోన్న వెట్టి(జీత) పద్ధతిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని సివిల్ న్యాయమూర్తి బీఆర్ పునీత్ పేర్కొన్నారు. ఆయన స్థానిక సీనియర్ కళాశాలలో న్యాయ సేవా సమితి, న్యాయవాదుల సంఘం, ధార్మిక శాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జీత పద్ధతి నిర్మూలన దినాచరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జీత పద్ధతి నిర్మూలనకు విద్యార్థులకు జాగృతి అవసరం. ఈ పద్ధతి సామాజికంగానే కాకుండా చట్టపరంగా అపరాధం అన్నారు. జీత పద్ధతి కొనసాగిస్తున్న వారిపై న్యాయపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ విషయంపై జాగృతి కల్పించి జీత పద్ధతికి విముక్తి పలకాలన్నారు. న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలు శ్యామల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జీత పద్ధతి విభిన్న రూపాల్లో వెలుగులోకి వచ్చిందని, దాన్ని అరికట్టడానికి చట్టపరంగా జాగృతి కార్యక్రమాలు నిరంతరంగా జరపాలన్నారు. తహసీల్దార్ రెహన్బాషా, తాలూకా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జీఆర్ అశ్వత్ నాయక్, తాలూకా విద్యాశాఖ అధికారి కేఎస్ సురేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యూజీసీ నిబంధనలు అమలు చేయాలి
బళ్లారిఅర్బన్: విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థుల హక్కుల రక్షణకు యూజీసీ నిబంధనలను వెంటనే అమలు చేయాలని కర్ణాటక రాష్ట్ర దళిత సమితి డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఆధారిత వేధింపులు కొనసాగుతున్నాయని, దీని వల్ల అనేక మంది దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని సమితి పేర్కొంది. రోహిత్ వేముల, పాయల్, దర్శన్ సోలంకి వంటి ఘటనలు సంస్థాగత వివక్షకు ఉదాహరణలని పేర్కొంది. యూజీసీ రూపొందించిన 2025–28 నిబంధనలపై సుప్రీంకోర్టు విధించిన స్టేను తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని సమితి కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోహిత్ వేముల చట్టంను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టి, జిల్లాధికారి ద్వారా ప్రధాని, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. -
మాంసం విక్రయాల నిషేధానికి వినతి
హొసపేటె: నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల పవిత్ర పండుగ అయిన మహాశివరాత్రి సందర్భంగా మాంసాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కరునాడ కలిగళ క్రియాశీల సమితి ఆధ్వర్యంలో సోమవారం వివిధ సంస్థల ప్రతినిధులు జిల్లాధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం నేత వెంకటేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి అన్ని మతాలకు పవిత్రమైన పండుగ అన్నారు. దక్షిణ కాశీ హంపీలోని విరుపాక్షేశ్వరునికి ప్రత్యేక పూజలతో సహా నగరంలోని అన్ని శివాలయాల్లో పూజలు జరుగుతాయన్నారు. హిందువులందరి మనోభావాలను గౌరవిస్తూ ఆరోజురోజున మాంసం విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పతంజలి యోగా సమితి, కర్ణాటక రాజ్య మడివాళ క్షేమాభివృద్ధి సంఘం, గుండి రమేష్ కళా వేదిక, జనతా మహాసభ, వీరశైవ లింగాయత్ మహాసభ, వీరశైవ లింగాయత్ సమాజ్, కస్తూరి కర్ణాటక జనపర వేదిక, విజయనగర సాహిత్య పరిషత్, కర్ణాటక రక్షణ వేదిక, కర్ణాటక నాగరిక హిత రక్షణసేవా ట్రస్ట్, రాష్ట్ర కార్మిక అసంఘటిత సంఘం, గౌళిగర సంఘం, జయ కర్ణాటక జనపర వేదిక, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
24న దుర్గమ్మ సిడిబండి రథోత్సవం
సాక్షి,బళ్లారి: నగర ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని మైసూరు దసరా తరహాలో గత ఏడాది కంటే ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించే దిశగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి సూచించారు. ఈ నెల 24న జరగనున్న కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని పురస్కరించుకుని, సంబంధిత ఏర్పాట్లు చేయడానికి నిర్వహించిన ముందస్తు సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన సోమవారం కనక దుర్గమ్మ ఆలయ యాత్రి నివాస్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సిడిబండిలో పాల్గొనే కార్యకర్తలకు పాస్లు మంజూరు చేయాలన్నారు. సిడిబండిని సంప్రదాయబద్ధంగా ఆలయం వద్దకు తీసుకొచ్చే ప్రక్రియ, ఆలయం వద్ద సిడిబండిని లాగడం తదితర దైవిక కార్యక్రమాలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు సదుపాయాలు కల్పిస్తాం మేయర్ గాదెప్ప మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ, అధికారులు, పోలీసులు చూసేలా ప్రయత్నిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా, జనం రాకపోకలను మళ్లించాలన్నారు. ఆలయం వద్ద అన్నదానం, పానీయాలు సరఫరా చేసేవారికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో మంచినీటి వ్యవస్థ, ప్రసాదాలు పంపిణీలు చేయడంలో కూడా ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తుల తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు, కార్యకర్తలను నియమించి ఆ దిశగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి, సిడిబండిని విజయవంతంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. సిటీ కమిషనర్ మంజునాథ్, డీఎస్పీ నందారెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మైసూరు దసరా తరహాలో ఆచరిద్దాం ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి దిశానిర్దేశం -
వంతెనకు బైక్ ఢీ.. ముగ్గురు మృతి
రాయచూరు రూరల్: వంతెనకు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన బీదర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతులను హుమ్నాబాద్ తాలూకా హళ్లిఖేడాకు చెందిన వెంకట్(40), అతని భార్య శిల్ప(35), కుమార్తె రక్షిత(12)గా పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం వంతెనకు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని బిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ సారా తాగి ఇద్దరు దుర్మరణం రాయచూరు రూరల్: కల్తీ సారా తాగి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన కొప్పళ తాలూకా కూకనపల్లిలో ఆదివారం సాయంత్రం వెలుగు చూసింది. ఈనెల 4న నలుగురు మిత్రులతో కలసి సారా తాగడానికి వెళ్లగా మద్యం(స్పిరిట్) వికటించి అమరయ్య హిరేమఠ(35), రమేష్(25) మరణించారు. హెచ్.శరణప్ప(33), గురికార్ శరణప్ప(40) హుబ్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురు కలసి ట్యాంకర్ నుంచి స్పిరిట్ కలసిన మద్యం తాగారని పోలీసులు తెలిపారు. స్పిరిట్ కలసిన మద్యం అందించిన మారుతి, శరణప్పలపై చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్లు ఢీకొని ఇద్దరు మహిళల మృతి రాయచూరు రూరల్: బెళగావి జిల్లాలో చెరకు ట్రాక్టర్లు ఢీకొన్న ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆదివారం రాయబాగ తాలూకా హారోగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాను మీరా(29) అనే మహిళ ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. భర్త అల్లావుద్దీన్, కుమారుడు శోయబ్లకు గాయాలయ్యాయి. మరో ఘటనలో ఘటప్రభ పోలీస్ స్టేషన్ పరిధిలో లొళసూరు బస్టాండ్ వద్ద చెరకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొని వడ్డరహట్టి అనిత(26) మరణించింది. అనిత భర్త ఎలక్ట్రిక్ వాహనంలో ఓవర్టేక్ చేయబోగా వెనుక నుంచి తగలడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై హోరోగేరి, ఘటప్రభ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు కార్లు ముఖాముఖీ ఢీ● మంటల్లో కాలిబూడిదైన కార్లు సాక్షి,బళ్లారి: రెండు కార్లు ముఖాముఖీ ఢీకొనడంతో పూర్తిగా కాలిపోయాయి. సోమవారం బీదర్ జిల్లా బసవ కళ్యాణ తాలూకా నారాయణపుర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కార్లు అదుపు తప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో తప్పించుకోగా, కొన్ని నిమిషాల్లో రెండు కార్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బసవ కళ్యాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొలెరో వాహనానికి మంటలు కాగా సోమవారం బళ్లారి నగరంలో మోతీ సర్కిల్ వద్ద బొలెరో వాహనంలో మంటలు వ్యాపించాయి. ఉన్నఫళంగా మంటలు రావడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. రోడ్డు పక్కనే నిలిపిన వాహనంలో మంటలు రావడంతో ఎందుకు వ్యాపించాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నాలెడ్జ్ కారిడార్ ఏర్పాటుపై 13న అభిప్రాయ సేకరణ హోసూరు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న క్రిష్ణగిరి జిల్లాలో నాలెజ్డ్ కారిడార్ ఏర్పాటుపై ఈనెల 13న జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని దేవరాజ్ మహాల్లో అభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో గత ఐదేళ్ల పాలనలో క్రిష్ణగిరి జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఏదో ఒక పథకం ప్రతి కుటుంబానికి చేరుతోందన్నారు. జిల్లా వాసులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని అధికారులు కోరారు. -
ఎన్నో ప్రఖ్యాత క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఓ ఘోరం తరువాత అపఖ్యాతి పాలైంది. అక్కడ మ్యాచ్లను చూడాలనే క్రికెట్ అభిమానులు, నగర వాసుల ఆకాంక్ష ఎప్పుడు తీరేనా? అని ఎదురు చూస్తున్నారు. బుధవారం ఏదో ఒకటి నిర్ధారణ కానుంది.
సాక్షి బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో ఐపీఎల్ క్రికెట్ పోటీల నిర్వహణపై అనుమతి గురించి బుధవారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో ఆర్సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి క్రికెట్ మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడడంతో అప్పటినుంచి ఐపీఎల్ సహా అన్నిరకాల మ్యాచ్లను నిర్వహించడం లేదు. ఆ ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మైకేల్ కున్హా నేతృత్వంలో ఒక కమిటీతో విచారణ జరిపించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి క్రికెట్ పోటీలు నిర్వహించాలంటే ఏమేమి భద్రతా చర్యలు తీసుకోవాలో పలు సిఫారసులు చేసింది. ఇందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) కూడా ఆమోదించింది. రేపు సీఎంతో భేటీలో తీర్మానం: హోంమంత్రి ఈ నేపథ్యంలో బుధవారం జరిగే ముఖ్య సమావేశంలో ఐపీఎల్ పోటీల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తామని రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం అధ్యక్షుడు వెంకటేశ్ప్రసాద్, అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ, ఆర్సీబీ ప్రతినిధి రాజేశ్ మీనన్ తనను కలసి మ్యాచ్ల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. బెంగళూరులో ఐపీఎల్ నిర్వహణకు అనుమతివ్వాలని కోరినట్లు, ఇదే సమయంలో ఈ ఏడాది ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నామో వివరించారన్నారు. తాను సీఎం సిద్ధరామయ్యతో ఈ విషయంపై చర్చించాల్సి ఉందని, అందుకే బుధవారం ఐపీఎల్ నిర్వహణపై తుది దఫా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల భద్రత ప్రభుత్వం బాధ్యత అని, తొక్కిసలాటలు వంటివి పునరావృతం కాకూడదని, జీబీఏ కమిషనర్, నగర పోలీసు కమిషనర్, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు. గతంలో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చిన్నస్వామిలో మళ్లీ మ్యాచ్ల కోసం నగరవాసుల నిరీక్షణ ఉంటాయా... ఉండవా? బుధవారం సీఎం, హోంమంత్రి భేటీలో నిర్ణయం హోంమంత్రితో కేఎస్సీఏ చీఫ్ వెంకటేశ్ ప్రసాద్ భేటీ పోటీల నిర్వహణకు వినతితీయని వార్త రావచ్చు: వెంకటేశ్ అభిమానులకు త్వరలోనే తీయని వార్త వస్తుందని ఆశిస్తున్నట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు. హోంమంత్రిని కలసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. వీలయినంత త్వరగా పోటీల నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం సూచించిన సిఫార్సులన్నింటినీ తమ అసోసియేషన్ పూర్తిగా పాటిస్తుందని చెప్పారు. -
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో అక్రమ కట్టడాలు పెరిగి పోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా అక్రమ మసీదులకు అంతే లేదు. అధికారులు అనుమతి ఇవ్వకున్నా రాత్రికి రాత్రే చాందసులు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మసీదుల నిర్మాణం చేపడుతున్నారు. బాగల్కోటె నవనగర్లో ఆల్మట్టి డ్యాం నిర్వాసితుల పునరావాసం కోసం కేటాయించిన స్థలంలో అక్రమంగా మసీదు నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజు రోజుకు ఈ అక్రమణలు అధికమవుతున్న నేపథ్యంలో హిందువుల ఆలయాల నిర్మాణానికి కూడా తగిన న్యాయం చేయాలని నిరసన ప్రారంభించారు. ఆల్మట్టి డ్యాం కోసం సర్వం కోల్పోయిన వారి స్థలాలు అధిక ధరలకు విక్రయించి అక్కడ టిన్షెడ్లు వేసి మసీదులు కడుతున్నారు. ఈ విషయంలో బాగలకోటె నగరసభ అధికారులు విచారణ చేపట్టారు. హిందూ ఆలయాల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరుతూ నగరసభ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. -
ఎంపీ చేతిలో ఖాళీ ట్రంకు పెట్టె.. లాక్కున్న పోలీసులు
సాక్షి, బెంగళూరు: మెట్రో చార్జీల వివాదంలో.. బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, జయనగర ఎమ్మెల్యే రామమూర్తి నగరంలోని ఆర్వీ రోడ్డు మెట్రో స్టేషన్లో ఖాళీ ట్రంక్ పెట్టెను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ ప్రభుత్వం అని ఆ ట్రంక్ పెట్టైపె రాశారు. దానిపై సీఎం, డీసీఎంల చిత్రాలను అంటించారు. ముందే సమాచారం అందుకున్న పోలీసులు ఆర్వీ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఖాళీ ట్రంక్ పెట్టె పట్టుకుని తేజస్వీ సూర్య వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రతీక ఈ పెట్టె అంటూ, ప్రభుత్వం దివాళా తీసిందని ఆరోపణలు చేశారు. తాను ఎలాంటి ఆందోళన చేయడం లేదని, ఖాళీ ట్రంక్ పెట్టెను మాత్రం పట్టుకున్నానని, అడ్డుకోవద్దని ఆయన చెబుతున్నా, పోలీసులు అడ్డుకున్నారు. ట్రంకును పోలీసులు లాక్కుని, దానిపై బొమ్మలను తీసేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు ప్రతిరూపంగా ఖాళీ ట్రంక్ పెట్టె పట్టుకుని తాను ఢిల్లీకి వెళతానని చెప్పారు. తమ దగ్గర డబ్బులు లేవని, ప్రయాణికుల నుంచి వసూలు చేసుకోవాలని మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆరోపించారు. మరోవైపు విధానసౌధ వద్ద కన్నడ నాయకుడు వాటాళ్ నాగరాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మెట్రో చార్జీలను పెంచరాదని నినాదాలు చేశారు. బెంగళూరులో మెట్రో స్టేషన్ వద్ద రభస రాష్ట్ర సర్కారు ఖజానా ఇదేనన్న ఎంపీ -
సిద్ధారూఢ సన్నిధిలో సోనూ నిగం
హుబ్లీ: పహల్గాం దాడి జరిగింది కన్నడ వల్లే అని అర్థం వచ్చే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనునిగంపై కన్నడ సినీ రంగం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సోనూ నిగం హుబ్లీలోని ప్రముఖ సిద్ధారూఢ మఠం సన్నిధికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధారూఢ, గురునాథరూఢ స్వాముల సన్నిధిలను దర్శనం చేసుకున్న సోనూ నిగం అక్కడ కూర్చొని 10 నిమిషాల పాటు ధ్యానం కూడా చేశారు. అనంతరం మఠం ట్రస్ట్ ప్రముఖులు సిద్ధారూఢ విగ్రహాన్ని ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనూ నిగం ఆదివారం హుబ్లీకి రాగా సోమవారం ఉదయమే సిద్ధారూఢ మఠాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో అపవిత్రత.. దోషులను శిక్షించండిసాక్షి,బళ్లారి: ఇటీవల నగరంలోని నాగలకెరె ప్రాంతంలోని పురాతనమైన ఆంజనేయస్వామి దేవస్థానంలో కొందరు దుండగులు మాంసం ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఆలయ ప్రాంగంలోకి విసిరిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. సోమవారం వీహెచ్వీ, భజరంగదళ్ ఆధ్వర్యంలో నిరసన, ర్యాలీ చేపట్టారు. అనంతరం సంఘాల నేతలు మాట్లాడుతూ పురాతన చరిత్ర కలిగిన దేవస్థానంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు చేస్తూ హిందువుల ధార్మిక భావనలను దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. వీహెచ్వీ జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, ప్రముఖులు గోవర్ధన్, వినోద్, శంకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సేవకు పదవి ముఖ్యం కాదు రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయడానికి పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర పాఠశాలల విద్యా శాఖ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు. దేవదుర్గ భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆశయ సాధనకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. తనను ఎన్నుకున్న వారికి రుణపడి ఉంటామన్నారు. ఉద్యోగులకు కట్టబెట్టిన పదవికి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో విద్యారత్న, సేవా భూషణ్ అవార్డులను అందించారు. కార్యక్రమంలో నాగేష్ గౌడ, ప్రేమలత రెడ్డి, చంద్రశేఖర్ పాటిల్, సురేష్, బోరేగౌడ, చరణ్రాజ్, విశ్వనాథ, బసవరాజ్లున్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలని మడ్డిపేటె ప్రాథమికోన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని రూపా పేర్కొన్నారు. నగరంలో గురువందన కార్యక్రమంలో అవార్డును అందుకొని ఆమె మాట్లాడారు. వి ద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర విషయాలను మననం చేసుకోవాలని కోరారు. జ్ఞాన సముపార్జనకు విద్య, సాహిత్యం చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. -
క్రీడలతో ఉద్యోగులకు ఆరోగ్యం
హొసపేటె: పని భారం నుంచి ఉపశమనం కల్గించి ఒత్తిళ్లను తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఉద్యోగుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో క్రీడా, సాంస్కృతిక పోటీలు సహాయపడతాయని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఎంతో అవసరమన్నారు. రెండు రోజుల క్రీడా పోటీల్లో ఉద్యోగులు చురుగ్గా పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయాలన్నారు. విజయనగర జిల్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, యువజన సర్వీసులు, క్రీడా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేసీ, జిల్లా వ్యాయామ విద్యాధికారి శ్రీకాంత్, జిల్లా కోశాధికారి కే.మల్లేశప్ప తదితరులు పాల్గొన్నారు. -
లఘు విమాన పతనంపై అనుమానాలెన్నో?
హుబ్లీ: పరిశీలన, ధ్రువీకరణ తర్వాత శిక్షణ విమానంలో ఇంధనం ఖాళీ ఎలా అయిందన్న ప్రశ్న తలెత్తింది. విజయపుర జిల్లా బబలేశ్వర తాలూకా మంగళూరు గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం పైలెట్ శిక్షణ కోసం తీసుకెళ్లిన లఘు విమానం పతనం అయింది. ఆ జిల్లా ఎస్పీ లక్ష్మన్ నింబరిగితో కూడిన పోలీస్ బృందం ఘటన స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే ఆ సంస్థ ముఖ్యస్థులు ఘటన స్థలానికి విచ్చేసి పతనం గురించి వివరాలను సేకరించారు. పైలెట్ కునాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంధనం ఖాళీ అయినందు వల్లే విమానం పతనం అయిందన్నారు. ఏ విమానం అయినా ఎగరడానికి ముందు ఇంధన స్థితి పరిమాణాన్ని పరిశీలిస్తారు. విమానం ఎగిరే స్థలం నుంచి ల్యాడింగ్ అయ్యే స్థలం ఎంత దూరంలో ఉంది. ఆ స్థలానికి చేరుకోవడానికి ఇంధనం ఎంత ప్రమాణంలో కావాలన్న దాన్ని పరిశీలించి విమానం టేకాఫ్కు అనుమతి ఇస్తారు. అయితే ఈ విమానం కలబుర్గి నుంచి బెళగావికి వెళ్లే దారిలో కూలిపోయింది. ఈ నేపథ్యంలో విమానం టేకాఫ్ కావడానికి ముందే పరిశీలించలేదా? అన్న ప్రశ్న తలెత్తింది. ఒక వేళ పరిశీలించిన తర్వాత నిర్ధిష్ట ప్రమాణంలో ఇంధనం ఉంటే విమానం కూలిపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. విమానం రైతుల పొలంలో పెను ప్రమాదం తప్పింది. ఒక వేళ జనవసతి ప్రాంతంపై కూలి పోయి ఉంటే మరణాలు సంభవించే అవకాశం ఉండేది. దీంతో ఇంధనం తక్కువైందన్న అనుమానాలు కనిపిస్తుండగా ఈ విషయంలో దర్యాప్తు తర్వాతే అసలు విషయం వెల్లడి కానుంది. -
ట్రావెల్స్ యజమాని.. దొంగావతారం
బనశంకరి: రాత్రి వేళల్లో ఇళ్లలోకి దూరి చోరీల చేసే ఘరానా దొంగలను బెంగళూరు బైయప్పనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని నుంచి రూ.1.84 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దావణగెరె జిల్లా హరిహర తాలూకా నివాసి రాజు (43) పట్టుబడిన దొంగ. దావణగెరెలో ట్రావెల్స్ నిర్వహించే రాజు కరోనా సమయంలో తీవ్ర నష్టాలు రావడంతో దొంగగా మారాడు. మాస్కు ధరించి ఇంట్లోకి చొరబడి నగదు, నగలు కొట్టేసేవాడు. ఇప్పటివరకు 10 చోరీ కేసులు ఇతనిపై ఉన్నాయి. గత నెల 18వ తేదీన ఓ కుటుంబం ఊరికి వెళ్లగా రాజు తలుపు బద్దలుకొట్టి బీరువాలో ఉన్న 783 గ్రాముల బంగారం, రూ.8 లక్షల నగదు దోచుకుని ఉడాయించాడు. ఈ కేసులో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి అబ్బిగెరెలో పట్టుకున్నారు. నగలను కమ్మగొండనహళ్లి, అబ్బిగెరె, హెచ్ఎంటీ లేఔట్లో జువెలరీ దుకాణాల్లో అమ్మినట్లు చెప్పాడు. జాలహళ్లి, గోవాలోనూ విక్రయించానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆయా వ్యక్తుల నుంచి 1.2 కేజీల బంగారం నగలు, వెండి సొత్తు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 24 మంది విక్రేతల అరెస్టు, రూ.2 కోట్ల డ్రగ్స్ జప్తు యశవంతపుర: సిలికాన్ సిటీలో పోలీసులు దాడులు చేసి 24 మంది డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేసి 2.08 కోట్ల విలువగల హైడ్రో గంజాయి, చరస్, ఎండిఎంఎ అనే మత్తు పదార్థాలను జప్తు చేశారు. ఐదుమంది అంతరాష్ట్ర నిందితులు కాగా, మిగిలిన 19 మంది బెంగళూరువాసులు. 1.23 కేజీల హైడ్రో గంజాయి, 36 కేజీల మామూలు గంజాయి, 11.6 కేజీల చరస్, 121 గ్రాముల ఎండిఎంఎ దొరికిందని పోలీసు కమిషనర్ సీమంతకుమార్ సింగ్ తెలిపారు. కుమారస్వామిలేఔట్, హెబ్బాళ, జేసీ నగర, బసవనగుడి, గోవిందరాజనగర, చామరాజపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఈ దాడులు జరిపారు. డ్రగ్స్ వ్యాపారులపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఇళ్లలో చోరీలపర్వం 1.2 కేజీల నగలు స్వాధీనం -
కెనడాలో కర్నాటక వాసి కాల్చివేత
ఒట్టావా/బెంగళూరు: కెనడాలోని టొరంటో నగరంలో ఉన్న షాపింగ్ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కర్నాటక వాసి (37) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని బ్రాంప్టన్లో ఉండే చందన్ కుమార్ రాజా నందకుమార్గా కెనడా పోలీసులు గుర్తించారు. వుడ్బైన్ షాపింగ్ సెంటర్ వాహన పార్కింగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొందుతూ అతడు చనిపోయాడన్నారు. చందన్కుమార్ వాహనం కిటికీల అద్దాలకు బుల్లెట్ రంధ్రాలు పడగా, డ్రైవర్ వైపు ఉన్న కిటికీ అద్దం పూర్తిగా ధ్వంసమైంది. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తుల వివరాలు తెలియనప్పటికీ, దీనిని లక్షిత ఘటనగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంటికి రావాలని చెబుతున్నా...వినలేదు:తల్లిదండ్రులు చందన్ మరణవార్త విని కర్నాటక రాజధాని బెంగళూరులో శివారు నెలమంగళలో ఉంటున్న అతడి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. ఇలాంటిది జరుగుతుందని తాము కలలో సైతం ఊహించలేదన్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి కెనడాలో ఉంటున్న చందన్ను ఇంటికి రావాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని, కానీ వినిపించుకోలేదని తండ్రి నందన్ కుమార్ వాపోయారు. అంతిమ సంస్కారం జరిపేందుకు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని ఆయన కోరారు. చందన్ టొరంటోలో ఇటీవలే కన్నడ అసోసియేషన్ను స్థాపించారని, బహుశా ఇదే కక్షతో అతడిని బలి తీసుకుని ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేశారు. -
బిడ్డను ఇచ్చి పెళ్లి చేస్తావా.. చస్తావా
మండ్య(కర్ణాటక_): పిల్లను ఇచ్చి పెళ్లి చేయకపోతే చంపేస్తానని ఓ వివాహితుడు బెదిరింపులకు పాల్పడటంతో భయపడిన తల్లీకుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఈఘటన మండ్య జిల్లా మలవళ్లి తాలూకా హలగురు సమీపంలోని దళవాయి కోడిహళ్లి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామంలో ఎం. మహేష్ శకుంతల (37), కుమార్తె ప్రియ (18) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి పక్కింటిలో ఉంటున్న ముత్తురాజు అనే వివాహితుడు మహేష్ కుమార్తె ప్రియపై కన్నేశాడు.కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లిచేయాలని శకుంతలపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె అంగీకరించలేదు. ప్రియను వేరే యువకుడికి ఇచ్చి వివాహం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముత్తురాజ్ శకుంతలకు ఫోన్ చేసి ప్రియకు వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో తల్లీబిడ్డ తమ ఇంట్లోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ప్రియ తండ్రి మహేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హలగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
లక్కుండిలో సర్పబంధం?
బెంగళూరు: చారిత్రక లక్కుండిలో తవ్వకాలు కొనసాగుతుండగా, అక్కడ నిధులకు పెద్ద సర్పం రక్షణగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల తవ్వకాల సమయంలో ఓ నాగుపాము రావడంతో అందరూ భయపడ్డారు. ఇప్పుడు చారిత్రక కోడి బసవణ్ణ దేవాలయం గర్భగుడిలో నాగుపాము కుబుసం బయటపడింది. గర్భగుడి కుడి భాగంలో గుండ్రని ఆకారపు రాతి బండ ఉంది. బండ పక్కలో నాగుపాము పొర కనిపించింది. దీంతో సర్ప బంధం ఉందని ప్రచారం సాగుతోంది. లక్కుండి తవ్వకాల్లో పాము ప్రత్యక్షం -
చూడడానికి అందంగా ఉంటే చాలదు..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కోడలిని అత్తమామలు వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీదర్ జిల్లా బసవ కళ్యాణ పట్టణంలోని ఓం కాలనీలో జరిగింది. అంజనాబాయి (22)కి నాలుగేళ్ల కిందట బసవ కళ్యాణలోని శేఖర్ పాటిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. 11 నెలల పాప ఉంది. శేఖర్ పానీపూరి వ్యాపారం చేస్తుండగా ఉదయం వెళ్తే అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో కోడలిని అత్త మామలు సూటిపోటి మాటలతో వేధించేవారు.చూడడానికి అందంగా ఉంటే చాలదు, పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని, ఎలాగైనా డబ్బు సంపాదించి తేవాలని పీడించేవారు. దీంతో అంజనాబాయి పలుమార్లు తన తల్లిదండ్రులకు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో విరక్తి చెంది, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్తమామలను అరెస్టు చేశారు. -
బెంగళూరులో నాటకీయ పరిణామం.. తేజస్వీ సూర్య అరెస్ట్!
బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలో మెట్రో చార్జీల పెంపు వ్యవహారంపై బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి తర్వాత తేజస్వీని వదలిలేశారు. దీంతో, కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.బీజేపీ మెట్రో చార్జీల పెంపుపై ప్రతిపక్ష బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. ఆర్వీ రోడ్ మెట్రో స్టేషన్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, బీజేపీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజస్వీ సూర్య ఖాళీ ట్రంక్ పెట్టెలు పట్టుకుని నిరసనలకు దిగారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. తేజస్వీ సూర్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, తేజస్వీ సూర్యను వదిలిపెట్టారు. ఈ క్రమంలో తేజస్వీ మాట్లాడుతూ.. అరెస్ట్ చేయడం వల్ల నా నోరు మూయించలేరు. కర్ణాటక ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియాలి. బడ్జెట్ సమావేశంలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం ఒత్తిడి వల్లే రెండోసారి మెట్రో చార్జీల పెంపు ఆగిపోయింది అని చెప్పుకొచ్చారు. అయితే, నిరసనల్లో పాల్గొనవద్దని ప్రభుత్వం తేజస్వీ సూర్యకు నిన్ననే నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ నిరసనల్లో పాల్గొనడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. VIDEO | BJYM president Tejasvi Surya (@Tejasvi_Surya), amid protests against the Bengaluru Metro fare hike says, "Metro fare hike has been put on hold for the second time due pressure from Union government. The state government should release a white paper on the economic… pic.twitter.com/WNn1yIrVdq— Press Trust of India (@PTI_News) February 9, 2026అంతకుముందు, సిద్దరామయ్య ప్రభుత్వం బెంగళూరులో నమ్మ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు ఐదు శాతం పెంచేందుకు పచ్చజెండా ఊపింది. బీఎంఆర్సీఎల్ చేసిన ఈ ప్రతిపాదనను అంగీకరించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కొత్త ఛార్జీలు నేటి నుంచి(ఫిబ్రవరి 9) అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10, గరిష్ఠ ఛార్జీ రూ.90 అమలులో ఉన్న విషయం తెలిసిందే. పెంచిన ఛార్జీల ప్రకారం కనీస ఛార్జీ రూపాయి నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నిరసనలకు దిగింది. అనంతరం, కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు స్థానిక బీజేపీ నేతలు లేఖలు రాశారు. దీంతో, చార్జీల పెంపు తాత్కాలికంగా నిలిపివేయాలని బీఎంఆర్సీఎల్ను ఆదేశించారని తెలిపారు. దీంతో, చార్జీల పెంపు ప్రక్రియ ఆగిపోయింది. అయితే, ఇప్పుడు చార్జీలను పెంచకపోయినా, మార్చిలో గాని ఏప్రిల్లో మాత్రం బాదుడు తప్పదని అధికారులు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఆ పెంపు 100 శాతం ఉన్నా ఆశ్చర్యం వద్దని మెట్రో వర్గాలు చెప్పడం విశేషం.#WATCH | Karnataka: BJP MP Tejasvi Surya was detained (now released) by the police today near Jayanagar Metro station in Bengaluru when he again tried to stage a protest in front of the metro station. He was served a notice yesterday for staging a protest at the Metro station… pic.twitter.com/LYtAjDKpPH— ANI (@ANI) February 9, 2026 -
కారును ఢీకొని.. హెల్మెట్తో దాడి..
బెంగళూరు: మద్యం మత్తులో కారు డ్రైవరుపై యువతులు హెల్మెట్తో దాడికి పాల్పడి వీరంగం సృష్టించిన ఘటన హుళిమావు పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి 10 గంటలప్పుడు జరిగింది. స్నేహితులతో కలిసి హోటల్కు భోజనానికి వెళ్లిన ఉత్తర భారతదేశానికి చెందిన లీసా, మ్యాథ్యూ అనే ఇద్దరు యువతులు వీవీ రోడ్డు దోసె క్యాంప్ వద్ద స్కూటర్లో వెళ్తూ ముందున్న కారును ఢీకొట్టారు. ఈ సమయంలో కారు డ్రైవరు అహ్మద్ కారు దెబ్బతినిందని, రిపేరు చేయించాలని వారిని నిలదీశాడు. మత్తులో ఉన్న యువతులు తప్పు నీదే అని అతనితో వాదించి నోటికొచ్చినట్లు దూషించి హెల్మెట్తో కొట్టారు. స్థానికులు యువతులను సముదాయించినా రభస సృష్టించారు. జనం హుళిమావు పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకుని యువతులను, స్కూటర్ను ఠాణాకు తరలించారు. అక్కడ విచారించి మందలించి నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. -
ప్రియురాలి మోసం.. బాడీబిల్డర్ ఆత్మహత్య
బెంగళూరు: ప్రేమించి పెళ్లికి సిద్ధమైన సమయంలో ప్రియురాలు మోసం చేసిందని బాడీ బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరు మహాలక్ష్మీ లేఔట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. కిరణ్ (26) జిమ్ట్రైనర్గా పనిచేయడంతో పాటు బాడీ బిల్డర్గా రాష్ట్రస్థాయిలో పేరుగాంచాడు. మూడేళ్ల నుంచి ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు, ఆమె కిరణ్ ఇంటికి వచ్చి తమకు పెళ్లి చేయాలని కోరగా కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. తన అన్న వివాహమైన వెంటనే మన పెళ్లి అని కిరణ్ మాట ఇచ్చాడు. కానీ 15 రోజుల క్రితం యువతి ఓ యువకునితో పెళ్లి నిశ్చయమైందని కిరణ్కు పెళ్లిపత్రిక ఇవ్వడంతో ఆవేదన చెందాడు. శనివారం సాయంత్రం కిరణ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆమే కారణమని డెత్నోటు తన చావుకు ప్రియురాలు, ఆమె తల్లి కారణమని డెత్నోట్ పేరురాసి పెట్టాడని పోలీసులు తెలిపారు. కిరణ్ మృతితో తల్లిదండ్రులు ఆక్రందనలు మిన్నంటాయి. కిరణ్ తన ప్రేయసికి రూ.40 లక్షల వరకూ ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. కాగా, కిరణ్ది పేద కుటుంబం, తండ్రి మార్కెట్లో మూటలు మోసే పనిచేసేవాడు, ప్రమాదంలో ఓ చేతి తెగిపోయి దివ్యాంగునిగా ఉన్నాడు. తల్లిదండ్రులు, సోదరి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా?
కర్ణాటక: తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని యడియూరులో ఆలయం సమీపంలోని ఎస్ఎల్ఎన్ కళ్యాణ మండపంలో పెద్ద రచ్చ జరిగింది. నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా? అని పెళ్లికొడుకును మొదటి భార్య నిలదీయడంతో సినిమాలో మాదిరిగా కోలాహలం నెలకొంది. వివరాలు.. ఆదివారం ఈ మండపంలో బెంగళూరులోని ఆర్ఆర్ నగర నివాసి హరీష్ ప్రసాద్కు, మండ్యకు చెందిన పుణ్యశ్రీ అనే యువతితో పెళ్లి జరుగుతోంది. సరిగ్గా తాళి కట్టే సమయంలో మొదటి భార్య లేపాక్షి, పోలీసులు, కుటుంబ సభ్యులతో వచ్చింది. తామిద్దరూ ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నామని, శృంగేరిలో కాపురం ఉంన్నామని లేపాక్షి తెలిపింది. తాను ప్రైవేటు టీచరునని, తరచూ వేధింపులకు పాల్పడడంతో పాటు గర్భస్రావం చేయించేవాడని ఆమె ఆరోపించింది. రూ.2 వేలు పంపి... మూడు రోజుల క్రితం భర్త నాకు ఫోన్ చేసి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్పేలో రూ.2 వేలు పంపాడని, పెళ్లి జరుగుతోందని తెలిసి అడ్డుకోవడానికి వచ్చానని లేపాక్షి వివరించింది. లేపాక్షి మాటలతో వధూవరులు షాక్కు గురయ్యారు. వధువు తల్లిదండ్రులు ఈ పెళ్లిని రద్దు చేసుకుని, వరున్ని దండించారు. వారు కూడా పోలీసుస్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఇదేం గొడవ అని అతిథులందరూ వెళ్లిపోయారు. పెళ్ళి విందు కోసం వండిన వంటకాలు అలాగే మిగిలిపోయాయి. -
కుర్చీ మార్పిడి లేనట్టే
రాయచూరు జిల్లాలో హట్టి స్వర్ణ గనుల్లో డీసీఎం శివాజీనగర: ముఖ్యమంత్రి పదవి కోసం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎంతగా ప్రయత్నాలు సాగిస్తుంటే, ఆయన సహచరులు అంతగా నిరుత్సాహపరుస్తున్నారు. ఆయనను నీరుగార్చేలా మాటల తూటాలను వదులుతున్నారు. సీఎం మార్పిడి గురించి పార్టీ హైకమాండ్ ఏ తీర్మానం తీసుకోకుండా మౌనంగా ఉందంటే, ఎలాంటి మార్పు లేదని అర్థమని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సీఎం స్థానం కోసం డీకే చెమటోడుస్తుండగా హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పరమేశ్వర్ ఆదివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లో ఇటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు దానిని హైకమాండ్ సమర్థవంతంగా పరిష్కరించిందని అన్నారు. ఎప్పుడు, ఎలా వ్యవహరించాలనేది వారికి బాగా తెలుసునని అన్నారు. సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర.. సీఎం కుర్చీ సంగతి ముగిసిపోయిన విషయమని చెప్పడం ఆయన వ్యక్తిగతమన్నారు. రెండున్నరేళ్ల తరువాత సీఎంను మార్చాలనే ఒప్పందం జరిగిందని డీకే శివకుమార్ చెబుతున్న విషయం తనకు తెలియదని పరమేశ్వర్ చెప్పడం గమనార్హం. దీని గురించి ఢిల్లీలో చర్చలు జరిగినప్పుడు తాము బయటే ఉన్నాము, సిద్దు, శివకుమార్లకు మాత్రమే కచ్చితంగా ఏమిటనేది తెలుసన్నారు. ఒప్పందం ఉందని హైకమాండ్ నాయకులు ఇప్పటి వరకు చెప్పలేదు. మాకు ఏమీ తెలియదు కాబట్టే హైకమాండ్ వైపు చూపిస్తామన్నారు. కాగా, మెట్రో రైలు చార్జీల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని చెప్పారు. మరోవైపు సీఎం సిద్దు, డీసీఎం శివ ఆదివారం ఉత్తర కర్ణాటక జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. హైకమాండ్ మౌనమే సాక్ష్యం హోంమంత్రి పరమేశ్వర్ ఘాటు వ్యాఖ్యలు దేవెగౌడ కుటుంబంపై సీఎం సిద్దరామయ్య కక్ష కేంద్రమంత్రి కుమారస్వామి మైసూరు: సీఎం సిద్ధరామయ్య తమ పార్టీని లక్ష్యం చేసుకున్నారని, ఎలాగైనా ముగించాలని చూస్తున్నారని జేడీఎస్ అగ్రనేత, కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. ఆదివారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. మా కుటుంబం మీద ఓ కేసు ద్వారా జేడీఎస్ అధినేత హెచ్.డి. దేవెగౌడను మానసికంగా కుంగదీసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేవెగౌడ సంరక్షణలో పెరిగిన సిద్ధరామయ్య ఇప్పుడు దేవెగౌడ కుటుంబాన్నే తుదముట్టించాలని చూస్తున్నారన్నారు. తాను కేంద్రమంత్రి కావడం వారికి అసూయ కలిగించిందన్నారు. ఎక్కువ బడ్జెట్లు సమర్పించానంటూ సిద్దరామయ్య గర్వంగా మాట్లాడుతున్నారన్నారు, కానీ పరిపాలన ఏమీ బాగాలేదన్నారు. మద్యం ముడుపులు అందుకున్న అబ్కారీ మంత్రి రాజీనామా చేయలేదన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే జి.టి.దేవెగౌడకు ఎక్కడా నిజాయతీ లేదని కుమార ఆరోపించారు. ఆయన ఇప్పుడు మనతో లేరని, ఇతర పార్టీలకు చెందిన గొప్ప నాయకులతో ఉన్నారని విమర్శించారు. జీటీ తనను చాలా చాలా బాధపెట్టారని పలు సంఘటనలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జేడీఎస్ నేతలు పాల్గొన్నారు. -
వైద్యనాథేశ్వర రథోత్సవం
భక్తజనం మధ్య తేరు ఉత్సవంమండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని వైద్యనాథపురలోని పురాణ ప్రసిద్ధ శ్రీ వైద్యనాథ స్వామి బ్రహ్మరథోత్సవాన్ని ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, వైద్యనాథస్వామి, ప్రసన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు జరిపి శుభ మీన లగ్నంలో తేరులో ప్రతిష్టించారు. తహశీల్దార్ పరశురామ్ సత్తిగేరి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో వందలాది భక్తులు శివనామ స్మరణతో తేరును లాగారు. -
రథోత్సవం.. తరించిన భక్తజనం
వైభవంగా బసవలింగ జాతర సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మోకా మల్లేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు రావడంతో బళ్లారి తాలూకా మోకా గ్రామం భక్తజన సంద్రంగా మారింది. స్థానిక గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మల్లేశ్వర స్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు, అర్చనల అనంతరం కల్యాణం జరిపించారు. మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ లోక్సభ సభ్యుడు సన్న పక్కీరప్ప తదితరులు మోకా మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రథానికి పూజలు చేసి భక్తులతో కలసి లాగారు. అలాగే గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర, పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు రథోత్సవాన్ని తిలకించి, ఆలయంలో పూజలు చేయించారు. మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి ఎదురు బసవణ్ణ ఆలయం వరకూ రథాన్ని లాగారు. మోకా గ్రామం ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉండటంతో ఇటు కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మోకా గ్రామం భక్తులతో కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.మోకా మల్లేశ్వర స్వామి రథోత్సవానికి వచ్చిన అశేష జనవాహినిబసవలింగ జాతరలో పాల్గొన్న భక్తులు ఘనంగా మోకా మల్లేశ్వర స్వామి జాతర హాజరైన వేలాది మంది భక్తులు రాయచూరు రూరల్: లింగసూగురు తాలూకా పికళిహళ్లో ఉటకనూరు మరి బసవలింగ శివయోగి దేశికేంద్ర మహస్వాముల 32వ జాతర వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం వేలాది మంది భక్తుల సముక్షంలో రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని వీక్షిచేందుకు రాయచూరు, లింగసూగురు, సింధనూరు, మాన్వి, బళ్లారి నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
‘మీల్స్ ఆన్ వీల్స్’ ద్వారా ఉచిత భోజనం
రాయచూరు రూరల్: నగరంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా అభాగ్యుల వద్దకే భోజనం సరఫరా చేస్తున్నారు. రాయచూరు ప్రభుత్వ వైద్య కళాశాల బోధన ఆస్పత్రిలో రోగులు, వారి బంధువులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోజూ 500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన మీల్స్ ఆన్ వీల్స్ 900 రోజలు పూర్తి చేసుకుందని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మీల్స్ ఆన్ వీల్స్ సభ్యులు గోవింద రాజ్, నాగరాజ్, రాజేంద్ర కుమార, పురుషోత్తమ, తిప్పణ్ణ, వీరణ్ణ, రాము, హేమణ్ణ, బసవరాజ్, దినేష్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 11, 12 తేదీల్లో కంప్లి ఉత్సవాలు హొసపేటె: కంప్లి పట్టణంలోని మున్సిపల్ హాలులో ఉత్సవా లోగో విడుదల కార్యక్రమం జరిగింది. వివిధ వర్గాల ప్రజలు, కళాకారులు, నాయకులు సమావేశంలో పాల్గొని పండుగను ప్రజా పండుగా మార్చడంపై ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేఎన్.గణేష్ మాట్లాడుతూ.. ఈనెల 11, 12 తేదీల్లో (రెండు రోజులు) ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరాల కంటే భిన్నంగా, వైవిధ్యంగా కంప్లి ఉత్సవాలు నిర్వహించాలని తీర్మానించడం జరిగిందన్నారు. కంప్లి ఉత్సవ్–మన ఊరి పండుగను అన్ని వర్గాలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఈ పండుగకు శాశ్వత రూపం ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతాయన్నారు. కన్నడ భూమి, నీరు, సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఉత్సవంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇస్తూ.. గ్రామీణ, జానపద కళలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మంజునాథ్, కన్నడ, సాంస్కృతిక శాఖ అధికారి నాగరాజ్, పురసభ అధికారి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. డి.కే.శివకుమార్ సీఎం కావడం ఖాయం రాయచూరు రూరల్: భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని నోణవిన కెర కాడ సిద్ధేశ్వర స్వామి జోస్యం చెప్పారు. శనివారం రాత్రి నగరంలోని కిల్లే బ్రహన్మఠంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కల్మషం లేని రాజకీయ దురందరుడు అయిన డీకే శివకుమార్కు కొన్ని దుష్టశక్తులు అడ్డు పడుతున్నాయన్నారు. త్వరలో సమస్యలన్నీ తీరిపోయి డి.కే.శివకుమార్కు మంచి కాలం రానుందన్నారు. పోలీస్ కుటుంబానికి చెక్కు వితరణ హుబ్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఏఆర్ పోలీస్ యల్లప్ప మడివాళప్ప కుంబార కుటుంబానికి పోలీస్ శాలరీ ప్యాకేజ్ యోజన ద్వారా రూ.70 లక్షల చెక్కు అందజేశారు. జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య, హైర్ కామాండర్ రిటైర్డ్ చరణ్కుమార్ తినహా, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించాలి రాయచూరు రూరల్: రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉత్తమ వైద్య సేవలందించాలని జిల్లా ఆర్యోగ కుటుంబ అధికారి సురేంద్రబాబు సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం తాలుకాలోని మటమారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయుష్మాన్ భారత్, ముఖ్యమంత్రి ఆరోగ్య కార్డుల ద్వారా ప్రభుత్వాస్పత్రి, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
గజ దండయాత్రలు
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో గజరాజులు దండయాత్ర చేపట్టాయి. పలు ప్రాంతాలలో తిరుగుతూ దాడులకు తెగబడడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆనేకల్ తాలూకాలోని ఆనేకల్, తమిళనాడు సరిహద్దు గ్రామమైన బైలకెరెలో శనివారం సాయంత్రం అడవి ఏనుగు దాడి చేయడంతో పుట్టస్వామి అనే రైతు మరణించాడు. బైలకెరె నుంచి గుమ్మలాపురానికి నడుచుకుంటూ వెళ్తున్న పుట్టస్వామిని అడవి ఏనుగు తొక్కి చంపింది. ఆనేకల్ తాలూకాలోని సోలూర్లో ఒక గున్న, నాలుగు పెద్ద ఏనుగులు అరణ్యం వదిలి ఊళ్ల మీద పడ్డాయి. అటవీ సిబ్బంది పటాకులు కాల్చి తమిళనాడు వైపు తరిమికొట్టారు. కొన్ని వారాలుగా చుట్టుపక్కల గ్రామాలలో ఏనుగుల మందలు తిరుగుతున్నాయి. అటవీ అధికారులు శివరాజు, సిబ్బంది చిన్నస్వామి, నింగయ్య, బసవలింగప్ప తదితరులు కార్యాచరణలో పాల్గొన్నారు. వీడియోల కోసం పరుగులు ఏనుగులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని వ్యూస్, లైక్లు కొట్టేయాలని యువకులు నానాపాట్లు పడుతున్నారు. ఏనుగుల దగ్గరకు వెళ్తున్న యువకులను అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. గుంపులు గుంపులుగా ఏనుగుల వైపు వెళ్తూ ఉండడంతో అదుపు చేయడం కష్టమైంది. ప్రజల అరుపులకు భయపడి అడవి ఏనుగులు విపరీతంగా పరిగెత్తుతున్నాయి. ఈ సమయంలో ఓ గున్న గుంతలో పడిపోయింది. అయితే తల్లి ఏనుగు చాలాసేపు శ్రమించి దానికి బయటకు తీసుకొచ్చింది. బెంగళూరు పరిసరాల్లో కల్లోలం ఆనేకల్ వద్ద దాడిలో రైతు మృత్యువాత జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ ప్రచారం -
కనకపుర వద్ద భారీ గజ మంద
గజదాడిలో అన్నదాత మృతిదొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో కనకపురలో అడవి ఏనుగులు భయాందోళన కలిగిస్తున్నాయి. తాలూకాలోని కాడుశివనహళ్లి గ్రామం చుట్టుపక్కల సంచరిస్తూ పంటలు తొక్కేస్తూ, చెట్లు విరిచేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. తమిళనాడు అడవుల నుంచి బన్నేరుఘట్ట అరణ్యంలోకి వచ్చిన ఏనుగులు శనివారం సాయంత్రం నుంచి కాడుశివనహళ్లి పరిసరాల్లో మకాం వేశాయి. ఆదివారం అటవీ సిబ్బంది ఏనుగులను కాస్త దూరంగా తరిమేశారు. పరిసరాల గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.మైసూరు: చామరాజనగర జిల్లాలో తమిళనాడును ఆనుకుని ఉండే కరల్వాడి గ్రామ శివార్లలో పొలంలో ఉన్న రైతుపై 9 అడవి ఏనుగులు దాడిచేసి చంపేశాయి. రైతు మహేష్ (26) పొలాన్ని కాపలా కాస్తున్నాడు. ఈ సమయంలో ఏనుగులు అతనిని చుట్టుముట్టి తొండంతో కొట్టి కాళ్లతో తొక్కాయి. గ్రామస్తులు ఎంత అరిచినా, ఏనుగుల గుంపు వదల్లేదు. ఏనుగులు వెళ్లిపోయాక చూస్తే రైతు చనిపోయి ఉన్నాడు. గత మూడు, నాలుగు నెలలుగా అడవి ఏనుగులు ఇక్కడ ఎక్కువగా తిరుగుతున్నట్లు జనం తెలిపారు. ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి ధర్నా చేశారు. ఏనుగుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. సత్యమంగళ అభయారణ్యం అధికారులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
తెక్కలకోట కొండల్లో ప్రాచీన అిస్థి పంజరాలు
సాక్షి బళ్లారి: జిల్లాలోని బత్తదనాడు నియోజకవర్గ పరిధిలోని తెక్కలకోట కొండల్లో పురావస్తు శాఖ అధికారులు చేపట్టిన పరిశోధనల్లో దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటి అిస్థి పంజరాలు లభ్యం కావడం సంచలనం రేకెత్తిస్తోంది. అమెరికాకు చెందిన హార్ట్విక్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.నమితా ఎస్.సుగంది ఆధ్వర్యంలో తెక్కలకోటలో ముందుకు సాగుతున్న పరిశోధన బృందానికి అలనాటి మట్టి పాత్రలు, మట్టి ముక్కలు, శిలాయుగం నాటి అవశేషాలు కనిపించడంతో అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. సూక్ష్మ శిలాయుగానికి చెందిన రాతి ఆయుధాలు, అవశేషాలు బయపడటంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 5.5 అడుగుల పొడవు కలిగిన రెండు మానవ అిస్థి పంజరాలను ఒకదాని పక్కన ఒకటి సమాధి చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇవి సాధారణమైన అిస్థి పంజరాలు కావని పరిశోధకులు భావిస్తున్నారు. మృతదేహాలపై మట్టి కాకుండా రాళ్లు ఉంచి, పాతి పెట్టారంటే అప్పట్లో గొప్ప వ్యక్తులు లేదా ఇతరత్రా చరిత్ర సాధకులకు సంబంధించినవి ఉండొచ్చనే కోణాల్లో పరిశీలన చేస్తున్నారు. తొలుత 1964లో పురావస్తు నిపుణుడు నాగరాజ రావు చేపట్టిన తవ్వకాల్లో తెక్కలకోట చరిత్రను పరిచయం చేశారు. ప్రొఫెసర్ డా.నమితా ఎస్.సుగంది 2019లో తెక్కల కోటకు విచ్చేసి ఈ ప్రాంత చరిత్రపై ఆసక్తి పెంచుకుని పరిశోధనలు చేస్తున్నారు. గ్రీస్ విశ్వవిద్యాలయానికి చెందిన జీవ సాంకేతిక నిపుణురాలు సుసేన్క్రిక్ ప్యాట్రిక్ స్మిత్ తదితరులు అవశేషాల సంరక్షణ, కాలనిర్ధారణపై సలహాలు అందిస్తున్నారు.లభ్యమైన అస్థి పంజరాలు -
కొన్ని క్షణాల్లో పెళ్లి.. ఆపిన మొదటి భార్య
తుమకూరు: తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని యడియూరులో ఆలయం సమీపంలోని ఎస్ఎల్ఎన్ కళ్యాణ మండపంలో పెద్ద రచ్చ జరిగింది. నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా? అని పెళ్లికొడుకును మొదటి భార్య నిలదీయడంతో సినిమాలో మాదిరిగా కోలాహలం నెలకొంది. వివరాలు.. ఆదివారం ఈ మండపంలో బెంగళూరులోని ఆర్ఆర్ నగర నివాసి హరీష్ ప్రసాద్కు, మండ్యకు చెందిన పుణ్యశ్రీ అనే యువతితో పెళ్లి జరుగుతోంది. సరిగ్గా తాళి కట్టే సమయంలో మొదటి భార్య లేపాక్షి, పోలీసులు, కుటుంబ సభ్యులతో వచ్చింది. తామిద్దరూ ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నామని, శృంగేరిలో కాపురం ఉంన్నామని లేపాక్షి తెలిపింది. తాను ప్రైవేటు టీచరునని, తరచూ వేధింపులకు పాల్పడడంతో పాటు గర్భస్రావం చేయించేవాడని ఆమె ఆరోపించింది. రూ.2 వేలు పంపి... మూడు రోజుల క్రితం భర్త నాకు ఫోన్ చేసి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్పేలో రూ.2 వేలు పంపాడని, పెళ్లి జరుగుతోందని తెలిసి అడ్డుకోవడానికి వచ్చానని లేపాక్షి వివరించింది. లేపాక్షి మాటలతో వధూవరులు షాక్కు గురయ్యారు. వధువు తల్లిదండ్రులు ఈ పెళ్లిని రద్దు చేసుకుని, వరున్ని దండించారు. వారు కూడా పోలీసుస్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఇదేం గొడవ అని అతిథులందరూ వెళ్లిపోయారు. పెళ్ళి విందు కోసం వండిన వంటకాలు అలాగే మిగిలిపోయాయి. ఫంక్షన్ హాల్లో రచ్చ రచ్చ నిలిచిపోయిన మూడుముళ్లు తుమకూరు జిల్లాలో విడ్డూరం -
పంచ గ్యారంటీలతో పేదలకు లబ్ధి
రాయచూరు రూరల్: కర్ణాటక రాష్ట్రం ప్రవేశపెట్టిన పంచ గ్యారంటీలతో పేదలకు లబ్ధి చేకూరుతోందని రాష్ట్ర పంచ గ్యారంటీల పథకం సమితి అధ్యక్షుడు హెచ్.యం.రేవణ్ణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాయచూరు జిల్లా ఏడెదొరె నాడు హబ్బను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కార్ నుంచి లభించే పథకాలను ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పంచ గ్యారంటీ పథకాల్లో శక్తి పథకం, యువ నిధి, గృహ జ్యోతి, గృహలక్ష్మి, అన్నభాగ్య పథకాలను సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు బసన గౌడ, హంపన గౌడ, బసన గౌడ, వసంత్ కుమార్, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున, ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్, పామయ్య, పవన్, డీసీ నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ తదితరులు పాల్గొన్నారు. -
నెరవేరిన నవళగుంద రైతుల కల
హుబ్లీ: నవళగుంద తాలూకా, ఇతర రైతులు వరద సమస్యలతో ఇబ్బందులు పడకుండా రూ.200 కోట్ల నిధులతో శాశ్వత వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఆదివారం నవళగుంద బెన్నిహళ్ల వాగుపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. నవళగుంద ఎమ్మెల్యే కోనరెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రూ.200 కోట్ల నిధులతో శాశ్వత వంతెన నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇకపై రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకోవచ్చన్నారు. చాలా ఏళ్లుగా వరద ప్రవాహంతో అన్నదాతలు తాము పండించిన పంటలు చేతికి అందకుండా నీటి పాలయ్యేవి. ఇక బెన్నిహళ్ల వంతెన నిర్మాణ పనులకు శంఖుస్థాపన, నవళగుంద అసెంబ్లీ నియోజక వర్గంలో వివిధ అభివృద్ధి పనులను సీఎం సిద్దరామయ్య ప్రారంభించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతోష్లాడ్, విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి, రెవెన్యూ మంత్రి కృష్ణబైరే గౌడ, మాజీ సీఎం, హావేరి ఎంపీ బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర మురికివాడల అభివృద్ధి మండలి అధ్యక్షుడు అబ్బయ్య ప్రసాద్, న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దారి తప్పిన హెలికాప్టర్ రాయచూరు రూరల్: ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. ఆదివారం లింగసూగురులో విధాన పరిషత్ సభ్యుడు శరణే గౌడ బయ్యాపూర్ కుమారుడి పెళ్లికి సీఎం సిద్దరామయ్య హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే అధికారులు సిద్ధం చేసిన మైదానం వదలి మరో చోటికి వెళ్లడంతో అయోమయెంలో పడ్డారు. పోలీసుల భద్రత వైఫల్యం వల్ల ఇలా జరిగిందని సమాచారం. అనంతరం మళ్లీ హెలికాప్టర్లో నిర్దేశించిన మైదానానికి చేరుకున్న సీఎం సిద్దరామయ్య.. వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్, మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, కొప్పళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అమరే గౌడ బయ్యపూర్ పాల్గొన్నారు. రూ.200 కోట్ల నిధులతో బెన్నిహళ్ల వాగుపై శాశ్వత వంతెన నిర్మాణం సీఎం సిద్దరామయ్య వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన -
ప్రేమికుల రోజున నందిహిల్స్ బంద్
దొడ్డబళ్లాపురం: రాబోయే ప్రేమికుల రోజున ప్రఖ్యాత నంది హిల్స్కు వెళ్లాలి అనుకునే ప్రేమజంటలు, యాత్రికులకు నిరాశే. సాధారణంగా నందికొండకు అత్యధికంగా వచ్చేది ప్రేమికులే. అయితే ఈ వాలెంటైన్స్డే కి నంది కొండపైకి టూరిస్టులను నిషేధిస్తూ జిల్లాధికారి ఆదేశాలిచ్చారు. వాలెంటైన్స్ డేకి నందికొండని మూసివేయడం చరిత్రలో ఇదే తొలిసారి. ప్రేమికుల రోజున నంది కొండపై నుంచి భగ్న ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. దీంతో పాటు గొడవలు జరుగుతాయనే అనుమానంతో ఆ రోజున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఎవరినీ కొండపైకి అనుమతించరని తెలిపారు. -
పొంచి ఉన్న పక్షి జ్వరం
శివాజీనగర: పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడులో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా టెన్షన్ మొదలైంది. పక్షి జ్వరం వ్యాపించి తమిళనాడులో 1,500లకు పైగా కాకులు చనిపోయినట్లు తెలిసింది. సరిహద్దు జిల్లాల్లో జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సూచించింది. ఏమిటీ లక్షణాలు? బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ పక్షుల్లో వచ్చే అంటువ్యాఽధి కాగా, ఆ పక్షులు వ్యర్థాల వల్ల ఇతర పక్షులకు, మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన 4 నుంచి 6 రోజుల తరువాత లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు, తల, ఒళ్లునొప్పులు, కళ్లు ఎర్రగా కావడం, న్యమోనియా వంటికి కనిపిస్తాయి. ఈ జబ్బు సోకిన పక్షులు హఠాత్తుగా చనిపోతాయి. ఎవరికి ప్రమాదం? బెంగళూరు కేసీ జనరల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సురేశ్ దీనిపై మాట్లాడుతూ కోళ్లఫారాలు, పశుపోషణ రంగాల్లో పని చేసేవారికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువని తెలిపారు. చికిత్స తీసుకోకపోతే చనిపోయే ప్రమాదం 50 శాతం ఉంటుందన్నారు. ఆ జబ్బు సోకిన కోడి మాంసం ద్వారా ఈ వైరస్ వచ్చే అవకాశముందన్నారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, రోగ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. తమిళనాడులో కాకుల హఠాన్మరణం అప్రమత్తంగా ఉండాలని సర్కారు ఆదేశాలు -
రూ.110 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణం
హొసపేటె: బళ్లారి, కొప్పళ జిల్లాలోని గంగావతి–కంప్లిని కలుపుతూ తుంగభద్ర నదిపై నిర్మించునున్న కొత్త వంతెన ప్రాజెక్టు కోసం మట్టి పరీక్ష ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న వంతెన దాదాపు 60 సంవత్సరాల పురాతనమైనది. తుంగభద్ర జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు విడుదల చేసినప్పుడల్లా వంతెన మునిగి పోతుంది. ఫలితంగా గంగావతి–కంప్లి మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సుమారు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో కొత్త వంతెన నిర్మాణం కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు ప్రతిపాదన సమర్పించబడింది. వంతెన నిర్మాణం కోసం డీపీర్ (వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక) తయారీ ప్రక్రియలో భాగంగా నేల పరీక్ష, సర్వే పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో వంతెన మునిగిపోకుండా నిరంతర ట్రాఫిక్ను నిర్ధారించే పాత వంతెన కంటే దాదాపు 42 అడుగుల ఎత్తులో కొత్త వంతెన నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే జేఎన్.గణేష్ ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావడంతో నియోజకవర్గ ప్రజల చిరకాల కల సాకారమైంది. -
మెట్రో హైడ్రామా
బనశంకరి/ శివాజీనగర: బెంగళూరు నమ్మ మెట్రో రైలు టికెట్ చార్జీల గందరగోళం ఆదివారం కూడా కొనసాగింది. బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ చార్జీల పెంపును నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఉత్తర్వులు రాలేదని, కాబట్టి చార్జీల పెంపు సోమవారం నుంచి కొనసాగుతుందని చెప్పారు. ఒకవేళ అత్యవసర ఆదేశాలు వస్తే పాటిస్తామన్నారు. ధరల పెంపు వల్ల ధర్నాలు జరగవచ్చనే ఆలోచనలతో 9వ తేదీ నుంచి మెట్రో స్టేషన్లలో భద్రత కల్పించాలని అధికారులు నగర పోలీసులకు లేఖ రాశారు. మునుముందైనా బాదుడే ఆదివారం రాత్రి మళ్లీ చార్జీల పెంపును నిలిపివేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు. సోమవారం పాత చార్జీలే కొనసాగుతాయని పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పుడు చార్జీలను పెంచకపోయినా, మార్చిలో గాని ఏప్రిల్లో మాత్రం బాదుడు తప్పదని తెలుస్తోంది. ఆ పెంపు 100 శాతం ఉన్నా ఆశ్చర్యం వద్దని మెట్రో వర్గాలు చెప్పడం విశేషం. ఎంపీ తేజస్వి హల్చల్ ముఖ్యమంత్రి గారూ, నాటకాలు ఆపండి (మెట్రో టికెట్ రేట్లు పెంచకండి) అని రాసిన టీషర్ట్ ధరించి బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్విసూర్య ఆదివారం నగరంలోని ఆర్వీ రోడ్డు మెట్రోస్టేషన్లో హల్చల్ చేశారు. ప్రయాణికులతో చర్చ జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే చార్జీలు పెరుగుతున్నాయన్నారు. 5 శాతం టికెట్ రేట్ల పెంపుతో ఒక్కో ప్రయాణికునిపై రూ.250 భారం పడుతుందన్నారు. తాము కేంద్ర మంత్రి మనోహర్లాల్ఖట్టర్కు వివరించగా, తాత్కాలికంగా నిలిపివేయాలని బీఎంఆర్సీఎల్ను ఆదేశించారని తెలిపారు. చార్జీల పెంపు కచ్చితమన్న ఎండీ నిలిపేసినట్లు మళ్లీ ప్రకటన నేడు పాత టికెట్ రేట్లే -
వీబీ–జీ రామ్జీ పథకంతో కూలీలకు ప్రయోజనం
హొసపేటె: ఉపాధి హామీ చట్టం కంటే మెరుగైన ఉపాధి, గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని వికసిత్ భారత్–2047 విజన్లో భాగంగా వీబీ–జీ రామ్జీ పథకం రూపొందించబడిందని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బంగారు హనుమంతు అన్నారు. ఆదివారం సండూర్ మండలంలో వీబీ–జీ రామ్జీ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వీబీ–జీ రామ్జీ పథకం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ పథకం యొక్క ఉపయోగాలను గ్రామాల్లోని ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ నాయకులు, కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నకిలీ గాంధేయవాదులు ఈ పథకంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నరేగా పథకం కింద కార్మికుల వేతనాలు నిర్ణీత సమయానికి అందడం లేదని మండిపడ్డారు. నరేగా పథకంలో నకిలీ జాబ్ కార్డుల సమస్య పెరిగిందని ఆరోపించారు. కొత్త పథకంలో అవినీతికి చోటు లేదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అనిల్ నాయుడు, మోకా, నాయకులు రామకృష్ణ, బప్పకన్ కుమార స్వామి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
హుండీ చోరీ
హొసపేటె: మునిరాబాద్ సమీపంలోని హోసలింగపుర గ్రామంలోని కరుమారియమ్మ దేవి ఆలయం, కాళికా దేవి ఆలయంలోని హుండీని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి చోరీ చేశారు. కాళికా దేవి దేవస్థానం ముందు ఉన్న గ్రిల్ తాళాన్ని దొంగలు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. అలాగే గ్రామంలోని 3వ వార్డులోని తుంగభద్ర ఎడమ ఒడ్డున ఉన్న ఆలయంలోని దేవత మెడలోని 6 గ్రాముల బంగారు తాళి గొలుసు, హుండీలోని ఉన్న నగదు, పూజా సామగ్రిని దొంగిలించి పరారయ్యారు. దొంగలు కిటికీ పగలగొట్టి ఆలయంలో ప్రవేశించారు. ఈ ఘటనపై మునీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జేడీఎస్ జిల్లా అధ్యక్షుడిగా తాయన్న బళ్లారి అర్బన్: జనతాదళ్ (సెక్యులర్) పార్టీ బళ్లారి జిల్లా అధ్యక్షుడిగా మీనళ్లి తాయన్నను మూడోసారి నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్డి. కుమార స్వామి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్ కుమార్ స్వామి తదితరులు నూతన జిల్లా అధ్యక్షుడు మీనళ్లి తాయన్నకు నియామక పత్రాన్ని అందజేశారు. బళ్లారి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు బండెప్ప కాశంపూర్, నాడగౌడ, మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ పాల్గొన్నారు. ‘నిన్న నెనపలి’ పుస్తకావిష్కరణ బళ్లారి అర్బన్: యువ జీవితంలోని ఉత్సాహం నిరంతరం కొనసాగాలని హ్యాలిస్ బ్లూస్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షుడు కేఎం.శివమూర్తి అన్నారు. అఖండ బళ్లారి జిల్లా కన్నడ సాహిత్య పరిషత్, వివేక పుస్తక ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కన్నడ భవన్లో కవి ఎస్.ఆర్.శరణ్కుమార్ తొలి హనిగవన సంకలనం నిన్న నెనపలి పుస్తకావిష్కరణ జరిగింది. శాసన మండలి సభ్యుడు వై.ఎం.సతీష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బళ్లారి జిల్లా కసాప అధ్యక్షుడు డాక్టర్.నిష్టి రుద్రప్ప కృతిని పరిచయం చేస్తు నిన్ననెనపలి ద్వారా శరణ్ కుమార్ కన్నడ కవిత్వ ప్రపంచానికి తొలి కృతిని అందించడం ప్రశంసనీయమన్నారు. కృతిలోని హనిగవనాలు పాఠకుల మనోభావాలకు అనుగుణంగా యువ వయస్సు జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసి ఆనందం కలిగిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వివేక పుస్తక ప్రచురణ సంస్థ ప్రతినిధులు ఎస్.ఆర్.రాజేశ్వరి, ఎస్.ఆర్.సిద్ధరామన గౌడ, ఎస్.ఆర్. చంద్రశేఖర్ పాటిల్, మాజీ మేయర్ ఇబ్రహీం బాబు, బసవరాజ్ గడగిన్, కసాప గౌరవ కార్యదర్శి డాక్టర్.కే.శివలింగప్ప, ఎరేగౌడ, డాక్టర్ భ్రమరాంభ యాటి తదితరులు పాల్గొన్నారు. ఆలయంలోకి దూసుకెళ్లిన బస్సు రాయచూరు రూరల్: మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శనివారం రాత్రి దేవదుర్గ తాలుకా తింథిణ మౌనేశ్వర ఆలయం వద్ద చోటుచేసుకుంది. దేవదుర్గ డిపోకు చెందిన డ్రైవర్ అంబరేష్ పూటుగా మద్యం సేవించి డ్యూటీకి వచ్చాడు. మద్యం మత్తులో స్టీరింగ్ను పక్కకు తిప్పడంతో బస్సు తింథిణ మౌనేశ్వర ఆలయంలోకి దూసుకెళ్లిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంలో శనగ పంట దగ్ధం హొసపేటె: కొప్పళ తాలూకా బాలగేరి గ్రామంలో రైతు రామప్ప హోంబలేకు చెందిన శనగ పంట, పొట్టు ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నష్ట పరిహారం చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. -
కర్ణాటకలో కూలిన విమానం
సాక్షి, బళ్లారి/బనశంకరి: కర్ణాటకలో చిన్నపాటి విమానం కూలిపోయింది. విజయపుర (బిజాపుర) జిల్లా బబళేశ్వర తాలూకా మంగళూరు వద్ద పొలాల్లో రెండు సీట్లు ఉన్న ఈ శిక్షణ విమానం కూలింది. ఇది రెడ్బర్డ్ పైలట్ ట్రైనింగ్ ఏవియేషన్కు చెందినదని తెలిసింది. ఈ సంస్థ విమాన పైలట్లకు శిక్షణ ఇస్తుంది. ఆదివారం శిక్షణలో భాగంగా ఓ పైలట్, ట్రైనీతో కలిసి కలబుర్గి నుంచి బెళగావికి బయలుదేరింది. అయితే మార్గంమధ్యలో విమానంలో యాంత్రిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసరంగా దించేందుకు యతి్నంచాడు.పంట కోసిన ఓ మొక్కజొన్న పొలంలో విమానం దిగుతూ పల్టీ కొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ కెప్టెన్ కునాల్ మల్హోత్రా, ట్రైనీ పీఆర్ గౌతం శంకర్కి గాయాలయ్యాయి. కొంతసేపటికి స్థానికులు, పోలీసులు చేరుకుని వారిని విజయపురలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. విమానం ఆకాశం నుంచి గిరగిరా తిరుగుతూ పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ ధాటికి విమానం మూడు ముక్కలుగా దెబ్బతింది. గాయపడిన వారు నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
కర్ణాటక రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కర్ణాటకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. ఏపీకి చెందిన నలుగురు కూలీలు మరణించడం విషాదకరమని వైయస్ జగన్ అన్నారు. మృతులంతా అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందినవారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు కూడా. మృతుల కుటుంబాలకు జగన్.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
చీర చూపించి పెళ్లి ఆహ్వానించిన ప్రియురాలు.. తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య
బెంగళూరు: వాళ్లిద్దరూ ప్రేమికులు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో ప్రేమికుల రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం అబ్బాయి.. తన ప్రియురాలి కోసం ఖరీదైన గిఫ్ట్లు సైతం కొనుగోలు చేశాడు. కానీ అనూహ్యంగా అమ్మాయి వేరే యువకుడితో పెళ్లి సంబంధం కుదుర్చుకుంది. ‘త్వరలోనే నా పెళ్లి. నా పెళ్లికి నువ్వు రావాలి. ఇదిగో చూడు నా పెళ్లి నగలు, పెళ్లి చీర చూపించింది. ఆ పెళ్లి చీర చూసి తట్టుకోలేని ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో కిరణ్ అనే యువకుడు బిల్డర్,జిమ్ ట్రైనర్గా విధులు నిర్వహిస్తున్నారు. కిరణ్..ఓ యువతిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. ఆ యువతి మరో యువకుడితో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. ఆ విషయం తెలిసిన కిరణ్కు గుండె పగిలింది. తానెంతో గాఢంగా ప్రేమిస్తున్న యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుందని తెలిసి తట్టుకోలేకపోయాడు. గత రెండు వారాలుగా మనిషి మనిషిలా లేడు. ఉల్లాసంగా,ఉత్సాహం ఉండే కిరణ్లో డిప్రెషన్ పెరిగింది.ఈ క్రమంలో శనివారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మహత్యకు ముందు పేపర్,పెన్ను కావాలని తల్లిని అడగ్గా.. ఎందుకు అని అనుమానంగా అడిగింది. ఆర్ధిక వివరాలు రాయాలని,పెన్ను,పేపర్ అడిగి తీసుకున్నాడు. అనంతరం ఇంటి గదిలోకి వెళ్లి సూసైడ్ లెటర్ రాశాడు. ప్రాణం తీసుకున్నాడు. గదిలోకి వెళ్లిన కిరణ్ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.డోర్లు బలవంతంగా ఓపెన్ చేసి చూడగా.. తాడుకు వేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సూసైడ్ నోటీను స్వాధీనం చేసుకున్నారు.అందులో తన చావుకు తాను ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా యువతిని గాఢంగా ప్రేమిస్తున్నానని, ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తనని సైతం పెళ్లికి రావాలని, ఇందుకోసం కొనుగోలు చేసిన నగదు,దుస్తులు కిరణ్కి చూపించడంతో తట్టుకోలేని ప్రాణం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. -
పంట పొలాల్లో కూలిన శిక్షణా విమానం
బెంగళూరు:కర్ణాటకలో శిక్షణా విమానం కుప్పకూలింది. కర్ణాటక బాబలేశ్వర్ జిల్లా మంగళూరులో ఓ శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు.. రెడ్ బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన రెండు సీట్ల విమానం ట్రైనింగ్లో భాగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా ఇంజిన్లో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విమానం పంట పొలాల్లో కూలింది. ఈ ఘటనలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, పైలట్, ట్రైనీ పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు.ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారి పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విమానం శిక్షణ ప్రయాణంలో ఉందని, సాంకేతిక లోపమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానం మూడు ముక్కలుగా విరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అయితే, పైలట్, ట్రైనీ పైలట్ సకాలంలో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
దేశంలోనే ఎక్కువ చార్జీలు
బనశంకరి: మెట్రో ప్రయాణికులకు కొంచెం ఉపశమనం. సోమవారం నుంచి అమల్లోకి రానున్న బెంగళూరు నమ్మమెట్రో రైలు టికెట్ రేట్ల పెంపును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతల ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఊరట దక్కింది. దీంతో ప్రయాణికులకు కాస్త సొమ్ము ఆదా అవుతుంది. తెరవెనుక ఏం జరిగిందీ? ఇటీవల 5 శాతం మెట్రో టికెట్ చార్జీలను పెంచడంపై అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇందుకు కారణం మీరంటే మీరని ఆరోపణలు చేసుకుంటున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణం చేయాలా, వద్దా?, ఇదేమి బాదుడు అని సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెంపును కేంద్రం నిలుపుదల చేసినట్లు బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్విసూర్య తెలిపారు. టికెట్ చార్జీల పెంపుపై ఎంపీ తేజస్వి కొందరు కేంద్ర మంత్రులకు పరిస్థితిని వివరించారు. కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో మాట్లాడారు. దీంతో 9వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్న మెట్రో కొత్త టికెట్ రేట్లను నిలిపివేయాలని కేంద్రమంత్రి ఆదేశించారని ఎంపీ చెప్పారు. ఇప్పటికే అధిక రేట్లని కేంద్రానికి విజ్ఞప్తులు పెండింగ్లో పెట్టిన కేంద్రం దేశంలోని మెట్రో రైలు వ్యవస్థల్లో బెంగళూరు మెట్రో అత్యధిక చార్జీలను కలిగి ఉంది, చార్జీల పెంపు అసంబద్ధంగా ఉందని కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని, మెట్రో టికెట్ ధరల పెంపుతో లక్షలాది మంది ప్రజలకు భారమవుతుంది, ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించడం కష్టతరమౌతుంది అని వినతిపత్రాలు ఇచ్చినట్లు ఎంపీ తేజస్వి చెప్పారు. దీంతో కేంద్రమంత్రి ఖట్టర్ చార్జీల పెంపును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బెంగళూరు మెట్రో ఉన్నతాధికారులు మాట్లాడుతూ మాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సమాచారం అందలేదని అన్నారు. బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ.మోహన్ మాట్లాడుతూ నగర ఎంపీలు కేంద్ర మంత్రితో మాట్లాడామని, దీంతో పెంపు నిర్ణయం నిలిపివేతకు ఆదేశించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచాలని ఎక్కడా చెప్పలేదన్నారు. శనివారం రాత్రికి చార్జీల పెంపును పెండింగ్లో పెట్టినట్లు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. -
గోదాముల్లో అక్రమంగా యూరియా
సాక్షి,బళ్లారి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సబ్సిడీతో అందించే వేలాది బస్తాల యూరియాను అధికారులు పట్టుకున్నారు. ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతులు రోడ్లెక్కి ఆందోళన చేశారు. యూరియా లేక రైతులు ఎంతో ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే నగర శివార్లలోని గోదాముల్లో సుమారు నాలుగు వేల బస్తాల యూరియా అక్రమంగా నిల్వ ఉంచడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వేలాది బస్తాలు గోదాముల్లో నిల్వ ఉంచి, రైతులకు యూరియా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో అమ్ముతుండటంతో అక్రమంగా నిల్వ ఉంచిన యూరియా పట్టుబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్ మార్కెట్లో బస్తా రూ.800 పోలీసులు చేసిన మెరుపుదాడిలో అక్రమంగా యూరియా నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులకు యూరియా లేక ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. బ్లాక్ మార్కెట్లో బస్తా రూ.800 వరకు పెట్టి కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వం సబ్సిడీలో రూ.266లకు బస్తా చొప్పున అమ్మాల్సిన యూరియాను ఎంతకు పడితే అంతకు అమ్మారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా, స్టాక్ లేదని చూపించి, అక్రమంగా అమ్మారని మండిపడ్డారు. వేలాది బస్తాల యూరియా లభ్యం నిల్వలపై అధికారుల మెరుపుదాడి -
ఆర్టీసి.. మొండికేసి..
రాయచూరు రూరల్: ప్రయాణికులను వేళకు సరిగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ మొరాయిస్తున్న ఘటనలు నిత్యకృత్యాలయ్యాయి. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి సర్కార్ భారీగా నిధులు విడుదల చేస్తున్నా కేకేఆర్డీబీ నుంచి బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడం తప్ప ఎక్కడా కొత్త బస్సులు రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవు. కొత్తగా వచ్చిన బస్సులను లాంగ్ సర్వీసులకు వాడుతుండగా పాత బస్సులను గ్రామీణ ప్రాంతాలకు వాడుతుండగా అవి మధ్యలోనే చెడిపోయి నిలబడుతుండటంతో ప్రయాణికులు పడుతున్న బాధలు అంతింత కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏళ్ల తరబడి చెడిపోయిన బస్సులు ఆయా డిపోల్లోనే మగ్గుతున్నాయి. గుజరీకి వేయాల్సిన బస్సులకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. వేరే బస్సుల్లో తరలింపు ఆ బస్సులను రోడ్లపైకి వదిలితే రెండు మూడు రోజులు నడవక ముందే రోడ్లపై మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులను మధ్యలోనే దింపేసి మరో బస్సులో పంపుతున్నారు. డిపోలో టైర్లు లేక నిలిచిన బస్సులు, బ్యాటరీలు చెడిపోయి తుక్కు పట్టిపోతున్నాయి. 4 లక్షల కి.మీ.దూరం సంచరించి దశాబ్దం పాటు సేవలందించిన బస్సులు ఎక్కువగా మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రతి డిపోలో 20కి పైగా బస్సులు గత ఐదేళ్ల నుంచి డిపోల్లోనే నిలిచి ఉన్నాయి. ఇలా కలబుర్గిలో 200, యాదగిరిలో 58, రాయచూరులో 75, కొప్పళలో 60, బళ్లారిలో 78, విజయ నగరలో 28, బీదర్లో 185 బస్సులు నిలిచి పోయాయి. పాత బడిన బస్సులు బ్రేక్లు ఫెయిల్ కావడంతో బోల్తా పడ్డ ఘటనలు కూడా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయినా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుండటం శోచనీయం. మార్గంమధ్యలోనే నిలిచిన ఆర్టీసీ బస్సు టైర్ల కొరతతో డిపోలో నిలిచిన ఆర్టీసీ బస్సులు క–కలో మొరాయిస్తున్న బస్సులతో ప్రయాణికులకు వెతలు నిత్యకృత్యం ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతున్న వైనం -
బెళగావి విభజనపై సీఎం నిర్ణయమే అంతిమం
హుబ్లీ: సువిశాలమైన బెళగావి జిల్లాను విభజించాలని కోరుతూ జిల్లా నేతలు ఎన్నో సార్లు సీఎంకు విజ్ఞప్తి చేశారని మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. బెళగావిలోని జిల్లా బాలభవనలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ఇండోర్ బాక్స్ క్రికెట్ సదుపాయాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన ఈ విషయమై తనను కలిసిన నేతలతో చర్చించారు. జిల్లా విభజనకు సంబంధించి సీఎం సిద్దరామయ్య తీసుకొనే నిర్ణయమే అంతిమం అన్నారు. బెళగావి అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు కోసం వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే వివిధ శాఖల నుంచి అందుబాటులో ఉన్న నిధులను ప్రాధాన్యతాను సారంగా వినియోగించుకొని ప్రగతి పథంలో సాగవచ్చన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అశోక్ సర్కిల్, చెన్నమ్మ సర్కిల్, కొల్హాపూర్ సర్కిల్ తదితరాలను త్వరలోనే అభివృద్ధి పరుస్తామన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వాడాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు. ఇది ఎంతో కీలకమైన నిర్ణయం అన్నారు. నవిలుతీర్థ జలాశయం నుంచి తాగునీటి సరఫరాపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఎట్టి పరిస్థితిలోను తాగునీటి అవసరాలను నిరాకరించబోమన్నారు. హిప్పరిగి జలాశయంలో ప్రస్తుతం అవసరానికి తగినట్లుగా నీరు ఉందని అన్నారు. మహారాష్ట్ర నుంచి నీటిని తీసుకునే అవసరం ఏర్పడితే ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పార్టీలకు అతీతంగా కృషి చేస్తామన్నారు. మంత్రి సతీష్ జార్కిహోళి -
ప్రాణం మీదకొచ్చిన పంతుళ్ల దండన
గౌరిబిదనూరు: నగర శివారులో ఉన్న విద్యానిధి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సుశాంత్ అనే విద్యార్థిని ఉపాధ్యాయులు తీవ్రంగా దండించడంతో భయపడిపోయి సొమ్మసిల్లాడు. ఉపాధ్యాయుల నిర్వాకం వల్ల బాలుని తల్లిదండ్రులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. వివరాలు.. వివరాలు.. పక్క విద్యార్థి పుస్తకంలోని పేజీని చించాడని నాలుగైదు మంది ఉపాధ్యాయులు సుశాంత్ను ఓ గదిలోకి తీసుకెళ్లి నిలదీశారు. సుశాంత్ నేను పేజీ చించలేదని ఎంత చెప్పినా ఉపాధ్యాయులు వినలేదు. వారి అరుపులకు బాలుడు మూర్ఛపోయాడు. దీంతో హడావుడిగా పాఠశాల వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొంత తేరుకున్న తరువాత బాలుని తల్లిదండ్రులు అంబులెన్స్లో వారి గ్రామం కొడిగేనహళ్ళికు పిలుచుకొని వెళ్లినట్లు తెలిసింది. చర్యలు తీసుకుంటాం తాలూకా విద్యాశాఖ అధికారి గంగరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటన దురదృష్టకరం, ఉపాధ్యాయులు విద్యార్థులకు సున్నితంగా చెప్పాలే తప్ప దండించరాదు అని అన్నారు. తప్పు చేసిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలునికి తీవ్ర అస్వస్థత -
అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
రాయచూరు రూరల్: అటవీ శాఖ ఉద్యోగి ఒకరు తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన బీదర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. మృతుడిని బీదర్ జిల్లా భాల్కి తాలూకా బోళగావ్కు చెందిన అంకుశ్ సుధామ(57)గా పోలీసులు గుర్తించారు. అటవీశాఖ అధికారుల వేధింపులతో విసిగి ఆత్మహత్య చేసుకున్నట్లు దళిత సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుతో భాల్కి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలానికి అటవీ శాఖ మంత్రి ఈఽశ్వర్ ఖండ్రె చేరుకుని మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వ పరంగా లభించే సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎకై ్సజ్ మంత్రి రాజీనామా చేయాలి రాయచూరు రూరల్: అవినీతి, అక్రమాల్లో భాగస్వాముడైన రాష్ట్ర ఎకై ్సజ్ శాఖా మంత్రి ఆర్.బీ.తిమ్మాపూర్ రాజీనామా చేయాలని బీదర్ జిల్లా బీజేపీ డిమాండ్ చేసింది. శనివారం బీదర్ జిల్లాధికారి కార్యాలయం వద్ద వినితిపత్రం సమర్పించిన అనంతరం అధ్యక్షుడు సోమనాథ్ పాటిల్ మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రి ఆర్.బి.తిమ్మాపూర్ పుత్రులు మద్యం దుకాణాల లైసెన్సులకు రూ.6 వేలు లంచం తీసుకున ఆరోపణలు రుజువు కావడంతో మంత్రి తిమ్మాపూర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతూ ఎకై ్సజ్ శాఖ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదన వద్దు రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలు విరమించుకోవాలని ఆందోళనకారులు విన్నవించుకున్నారు. శనివారం కొప్పళ నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన ప్రాంతానికి రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌధరి విచ్చేసి మ హిళా ఆందోళనకారులతో చర్చించారు. ఈ ప్రాంతంలో విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు స్థాపించి మనిషి జీవితాలను అనారోగ్యం పాలు చేయడం తగదని ఆందోళనకారులు వివరించారు. బల్డోటా, కిర్లోస్కర్, కళ్యాణి స్టీల్, ముక్కుంద సుమి, ఏక్రోస్ ఇండియా కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలాలు కలుషితమై మనిషి ఆయుష్షు క్షీణించడం, 18 గ్రామాలు వాటి బారిన పడి వినాశనానికి దారి తీసే పరిశ్రమల ఏర్పాటుకు అంగీకరించకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందించారు. జ్యోతి మంజునాథ్, కావ్య ప్రసన్న శ్వేత, శశిరేఖ, పుష్పలతలున్నారు. పగిలిన మంచినీటి పైప్లైన్ ● పెద్ద ఎత్తున రోడ్డులో నీటి ప్రవాహం ● ఇళ్లలోకి నీరు, లోతట్టు జలమయం సాక్షి,బళ్లారి: నగరంలో రోడ్లలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు ప్రవహించి, ఇళ్లలోకి చేరింది. భారీ వర్షం వల్ల నీరు చేరిందని అనుకుంటే పొరపాటు. బళ్లారి నగరానికి మంచినీటిని సరఫరా చేసే పైప్లైన్ పగిలింది. శుక్రవారం రాత్రి అల్లీపుర రిజర్వాయర్ నుంచి నగరానికి మంచినీరు సరఫరా చేసే పెద్ద పైప్లైన్ పగిలిపోవడంతో పార్వతీ నగర్లోని రోడ్లలో పెద్ద ఎత్తున నీరు ప్రవహించడంతో ఆ కాలనీ వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్లైన్ పగిలినట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు. వెంటనే నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. నీటి సరఫరాను నిలిపివేయడంతో రోడ్లులో నీరు రావడం ఆగిపోయింది. -
వామపక్షాల చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మ
మండ్య: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించడం చేతకాదు. అది వామపక్షాల కబంధ హస్తాల్లో కొట్టుమిట్టాడుతోందని బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బి.ఎల్.సంతోష్ ఆరోపించారు. శనివారం మండ్య నగరంలోని అంబేడ్కర్ భవన్లో రచయిత డాక్టర్ సుధాకర్ హోసల్లి రాసిన నానూ కాఫిరా? పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ.. వామపక్షాలు మహాత్మా గాంధీజీని వక్రీకరించడమే కాకుండా సుభాష్ చంద్రబోస్, బుద్ధుడు, బసవన్న, అంబేడ్కర్ను అవమానిస్తున్నారని అన్నారు. కువెంపు, స్వామి వివేకానందను హిందూ సంస్కృతితో సంబంధం లేని వారిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. టిప్పు సుల్తాన్ లక్ష మందికి పైగా హిందువులు, 70 వేల మంది క్రైస్తవులను దారుణంగా ఊచకోత కోశాడన్నారు. అలాంటి మతోన్మాదిని స్వాతంత్య్ర సమరయోధుడు అని పిలవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. -
మిరప మేళా.. స్పందన భళా
హుబ్లీ: రైతులకు మంచి మార్కెట్, అలాగే వినియోగదారులకు కల్తీ లేని, నాణ్యతతో కూడిన ఎండుమిర్చి అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఎండుమిర్చి మేళా ఏర్పాటు చేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రాష్ట్ర సాంబారు పదార్థాల అభివృద్ధి మండలి శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ 14వ మిర్చి మేళాను స్థానిక మూరు సావిరమఠం మైదానంలో ఏర్పాటు చేశారు. ధార్వాడ జిల్లాతో పాటు గదగ, బళ్లారికి చెందిన రైతన్నలు తమ మిర్చి పంటతో పాల్గొన్నారు. మొత్తం మీద పొలం నుంచి నేరుగా వినియోగదారుడి ముంగిటకు చేర్చే మేళా కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 100 దుకాణాల్లో బ్యాడగి డబ్బి, గుంటూరు, కడ్డిరకం, మిర్చి ఆకర్షిస్తున్నాయి. ధరల హెచ్చుతగ్గులతో ఆసక్తికరం 100 స్టాళ్లలో మిరప ప్రదర్శనలు -
సంస్థకు, సొంతూరికి మంచి పేరు తేవాలి
బళ్లారిఅర్బన్: సంస్థకు, సొంత ఊరికి మంచి పేరు తేవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక లాడ్స్ ఇండో అమెరికన్ పీయూ కళాశాల ఆధ్వర్యంలో ద్వితీయ పీయూ విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నెరవేర్చారు. ముఖ్య అతిథిగా సెయింట్జాన్స్ జూనియర్ కళాశాల అధ్యక్షుడు, ప్రిన్సిపాల్ శివరామ పాల్గొని మాట్లాడారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఇండో అమెరికన్ విద్యా సంస్థలో చదవడం గొప్ప వరం అన్నారు. విద్యార్థులు తమ భావి జీవితానికి పునాది అయిన పీయూసీకి వీడ్కోలు చెప్పడం, ఉన్నత విద్యాభ్యాసం వైపు అడుగులు వేయడంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలన్నారు. కీలకమైన డిగ్రీ, పీజీ దశలను చేరుకుని కన్న తల్లిదండ్రులకు, సొంత ఊరితో పాటు విద్యా సంస్థకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ సందర్భంగా వక్తలు కృత్రిమ మేధతో పాటు సైబర్ క్రైం, ఇతర సమాజంలోని సాధక బాధకాలు, తదితర చైతన్య పరిచే అంశాల గురించి వివరించారు. ప్రముఖులు డ్యానియల్, ఎం.శ్రీశైల, పీహెచ్.నాయుడు, ప్రిన్సిపాల్ రాజేష్, షేక్ సలీం బాషా, సుధీర్కుమార్, ఉదయ్ భాస్కర్లతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, సంరక్షకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణులకు పౌష్టికాహారం మేలు
రాయచూరు రూరల్: జిల్లాలో బాలింతలు మృతి చెందుతున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం సేవించాలని జాతీయ జిల్లా ఆరోగ్య అధికారిణి నందిత పేర్కొన్నారు. సింధనూరు తుర్విహాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుండాలో గర్భిణి బాలింతను పరీక్షించి వారికి సలహాలు ఇచ్చారు, బాలింతల మరణాలు సంభవిస్తున్న తరుణంలో గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. వైద్యులకు, అధికారులకు, ఆశా కార్యకర్తలకు, సిబ్బందికి వివరించారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందని గ్రామ పంచాయతీ అధికారులకు సూచనలు జారీ చేశారు. మద్దతు ధర ప్రకటించాలి రాయచూరు రూరల్: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. శనివారం యాదగిరి ఏపీఎంసీ కార్యాలయం వద్ద కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ మాట్లాడారు. పత్తి, మిరప, వరి, వేరుశనగ, సజ్జ, జొన్న, కందులు, మినుము, పెసర పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ రాస్తారోకో చేపట్టారు. అధ్యయనంతో ఆత్మసంతృప్తి హొసపేటె: బహుత్వ దృక్పథం నుంచి అధ్యయనం చేయకుండా భారతదేశ ఆత్మను అర్థం చేసుకోవడం అసాధ్యం అని గదగ్ జిల్లా హులకోటి కేహెచ్.పాటిల్ ప్రభుత్వ ఫస్ట్గ్రేడ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ అప్పన్న హంజే అన్నారు. కన్నడ విశ్వవిద్యాలయంలోని త్రిపది ఆడిటోరియంలో శుక్రవారం అభయరాజ్ బల్డోటా జైన్ సంస్కృతి అధ్యయన చైర్మన్ నిర్వహించిన జైన బసది, శిల్పాల భావనలు అనే ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బౌద్ధమతం, జైన మతం, శైవమతం, వైష్ణవ మతం వంటి వివిధ మతాలు భారతదేశం వారసత్వం, సంస్కృతికి పునాదులు అని ఆయన అన్నారు. జైన, బసదిలు, శిల్పాలు కేవలం మతపరమైన భావనలు మాత్రమే కాదు. అవి మతం మేధో, భౌతిక సంస్కృతిని ప్రతిబింబించే ముఖ్యమైన చారిత్రక పత్రాలు. వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా సమాజ విలువలు, ఆలోచనలు, జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. జైన మతం అనేక అంశాలతో కూడిందన్నారు. అన్ని జీవులపై గౌరవం, సహనం సందేశాన్ని తెలియజేస్తాయని ఆయన వివరించారు. కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్. డీవీ.పరమశివమూర్తి, అభయరాజ్ బల్డోటా జైన్ సంస్కృతి అధ్యయన చైర్ కన్వీనర్ డాక్టర్ రమేష్ నాయక్, పురావస్తు శాఖ ప్రొఫెసర్లు డాక్టర్ వాసుదేవ బడిగేర, డాక్టర్ ఎస్వై.సోమశేఖర్, డాక్టర్ మోహన్రావు బి.పంచల్, డాక్టర్.యర్రిస్వామి, పరిశోధకుడు నాగరాజ తదితరులు పాల్గొన్నారు. -
డ్యాం గేట్ల పనులు జాప్యం చేస్తే ధర్నా
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల పరిధిలో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయానికి కొత్త క్రస్ట్గేట్లు అమర్చే పనులు వేగవంతంగా పూర్తి చేయకపోతే మార్చి 1 నుంచి ధర్నా చేస్తామని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన శనివారం తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. పాతబడిన తుంగభద్ర డ్యాంలోని 33 గేట్లు మార్చాలని నిపుణుల సూచన మేరకు గేట్లు మారుస్తుండటం శుభపరిణామమన్నారు. అయితే రబీ సీజన్కు క్రాప్ హాలీడే ప్రకటించి గేట్లు అమర్చుతున్న తరుణంలో వచ్చే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోపు అయినా గేట్లు మార్చడం సాధ్యం అవుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. డ్యాంకు ఉన్న 33 క్రస్ట్గేట్ల స్థానంలో కొత్త గేట్లు అన్నీ ఎప్పటిలోగా అమరుస్తారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మార్చి 1వ తేదీ లోపు కనీసం 20 శాతం పనులు పూర్తి కాకపోతే ధర్నా చేస్తామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందన్నారు. ఈవీఎంలు లేదా బ్యాలెట్ పద్ధతిలో ఎలా ఎన్నికలు నిర్వహించినా బీజేపీ గెలవడం ఖాయమన్నారు. కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రం ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకు సీఎం సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి సీటు కోసం డీకేశి ఇద్దరూ తీవ్రంగా రాజకీయంగా పావులు, ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నందున ఈ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికీ అంతుపట్టడం లేదన్నారు. మొన్న కేంద్రంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశానికి ఎంతో మేలు చేకూరే బడ్జెట్ అని కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తమ బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రానికి కూడా అన్ని విధాలుగా సహకారం అందించే విధంగా బడ్జెట్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర బడ్జెట్పై విమర్శలు చేస్తోందన్నారు. నగర శివార్లలోని గోదాముల్లో 4 వేల బస్తాల యూరియా పట్టుబడటంపై సమగ్రంగా తనిఖీ చేయాలన్నారు. అసలే రైతులు యూరియా లేక ఎంతో ఇబ్బందులు పడ్డారని, వేలాదిగా యూరియా బస్తాలు ఎలా లభ్యం అయ్యాయో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో తనిఖీ చేయాలన్నారు. మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, బీజేపీ నాయకులు వీరశేఖర్రెడ్డి, కోనంకి తిలక్, హనుమంతప్ప, తిమ్మప్ప, కే.ఎస్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. గోదాముల్లో యూరియా నిల్వలపై తనిఖీకి డిమాండ్ విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీరాములు -
కన్నవారి కాసుల కక్కుర్తి
● రూ.5 లక్షలకు మగశిశువు విక్రయం కోలారు: కన్నప్రేమ, మానవత్వం అనేవి లేకుండా పసిబిడ్డతోనే వ్యాపారం చేశారు. కోలారు జిల్లాలో శ్రీనివాసపురం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న నీతు, రాఘవేంద్ర అనే జంట తమకు జన్మించిన 7 రోజుల మగ బిడ్డను రూ.5 లక్షలకు అమ్మేశారు. వివరాలు.. నీతు, రాఘవేంద్రలకు గతంలో వేర్వేరుగా పెళ్లయి విడిపోయి సహజీవనం చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. నీతు మళ్లీ గర్భం దాల్చి ఓ ప్రైవేటు నర్శింగ్ హోంలో మగబిఢ్డకు జన్మనిచ్చింది. పేదరికం వల్ల సాకలేమంటూ తెలిసినవారికి చెప్పుకున్నారు. దీంతో బ్రోకర్ కొట్రగుళి నారాయణస్వామి.. చింతామణి తాలూకాలోని కృష్ణ– మంజుళ అనే దంపతులకు రూ. 5 లక్షలకు అమ్మేయించాడు. ఇది తెలిసి పోలీసులు అటు, ఇటు జంటలు, బ్రోకర్ను అరెస్టు చేసి చేశారు. శిశువును మళ్లీ తల్లిదండ్రుల వద్దే ఉంచారు. అపార్టుమెంటులో పిల్లి కేసు యశవంతపుర: బంగారు, డబ్బు, విలువైన వస్తువులు చోరీకీ గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయటం సహజం. అయితే బెంగళూరులో కడుపుతో ఉన్న పిల్లిని కిడ్నాప్ చేశారంటూ యజమాని ఫిర్యాదు చేయటంతో 9 మందిపై కేసు నమోదు చేశారు. హెచ్ఎఎల్ పోలీసుస్టేషన్ పరిధిలోని వ్యాన్సి సాలెటర్ అపార్ట్మెంట్లో ఈ విడ్డూరం జరిగింది. యజమాని సాకుతున్న పిల్లి గర్భం దాల్చింది. దీనిని గమనించి కొందరు పిల్లిని తీసుకెళ్లారు. కనిపించక పోవటంతో కంగారు పడి యజమాని హరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల చిత్రాల 9 మందిని పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిందితుల్లో అపార్ట్మెంట్ అధ్యక్షుడు శ్రీరామ్, సెక్యూరిటీ మేనేజర్ కూడా ఉండడం విశేషం. -
మృత్యురూపమైన లారీ
● ఇద్దరు దుర్మరణం మైసూరు: లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ ఢీకొనడంతో స్కూటర్పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. నంజనగూడు తాలూకా హనుమనపుర గేట్ వద్ద శనివారం ఉదయం జరిగింది. మైసూరులోని జేపీ నగర నివాసి చంద్రు (38), మహిళ శీలా (35) మృతులు. చంద్రు, శీలా బైక్లో సంతేమరహళ్లి వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఎరువు లోడ్ లారీ ఢీకొంది. దీంతో అదుపు తప్పి కింద పడటంతో అదే వేగంలో లారీ వారిద్దరి తలలపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడే మరణించారు. విషయం తెలియగానే స్థలానికి డీఎస్పీ రఘు, సీఐ చంద్రశేఖర్, కవలందె పోలీసు స్టేషన్ ఎస్ఐ బసవరాజు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను నంజనగూడులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. అనుమానిత ఉగ్రవాది మృతి బనశంకరి: బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న అనుమానిత ఉగ్రవాది ఆస్పత్రిలో చనిపోయాడు. వివరాలు... నిందితుడు సాదిక్ పాషా (47)ని నగరంలో సుద్దగుంటెపాళ్యలో పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన కేసులో 2020లో పోలీసులు అరెస్టు చేసి సెంట్రల్ జైలులో ఉంచారు. అతనితో పాటు మరో 6 మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు, ఎన్ఐఏ అధికారులు విచారించి రిమాండుకు తరలించారు. అప్పటినుంచి చెరసాలలోనే ఉంటున్నాడు. ఆరునెలలుగా లో బీపి, హై సుగర్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు జైలు సిబ్బంది తెలిపారు. దీంతో ఇటీవల విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి అతడు మరణించాడని చెప్పారు. బీఎంటీసీ బస్సు ఢీకొని మణిపూర్ యువతి బలి బనశంకరి: ఉపాధి కోసం మరో రాష్ట్రం నుంచి వలస వచ్చి జీవిస్తుంటే, కిల్లర్ బీఎంటీసీ బస్ డీకొని మణిపూర్ యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటన నగరంలో కృష్ణరాజపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. హెన్నా ఇనకా (20) అనే యువతి నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ మారతహళ్లిలో నివాసం ఉండేది. శుక్రవారం ఉదయం 9:30 సమయంలో ఆమె మరొకరితో కలిసి బైక్లో వెనుక కూర్చుని వెళ్తోంది. సిల్క్బోర్డు నుంచి టిన్ ఫ్యాక్టరీకి వెళుతున్న బీఎంటీసీ బ్యాటరీ బస్సు , కృష్ణరాజపురం రైల్వేస్టేషన్ రోడ్డులో వారికి తగిలింది, దీంతో బైక్ కిందపడగా, హెన్నాఇనకా తల మీద నుంచి ఆ బస్సు ముందు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొంతసేపటికి చనిపోయింది. కృష్ణరాజపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుబాయ్కి తీసుకెళ్లి.. రూ.1.80 కోట్ల వసూలు మైసూరు: కేరళకు చెందిన ఇద్దరు దుండగులు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మైసూరుకు చెందిన ఓ విద్యార్థి నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి మోసగించారు. వివరాలు.. మైసూరులోని కువెంపునగర నివాసి ప్రశాంత్ బాధితుడు. ఇతడు పీయూసీ చదువుతున్నప్పుడు కేరళకు చెందిన విశ్వనాథన్, స్నేహ మరియా అనే ఇద్దరితో పరిచయమైంది. వారు తాము చదువు ముగించి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నట్లు ప్రశాంత్ను నమ్మించారు. నీకూ విదేశంలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. తర్వాత అతనిని బెంగళూరు మీదుగా హాంకాంగ్, దుబాయ్కు తీసుకెళ్లారు. ఇక్కడ మంచి ఉద్యోగం చేస్తున్నాడని అతని తల్లిదండ్రులకు చెప్పి నమ్మకం కలిగించారు. అతనిని దుబాయ్లో ఉంచి దశల వారీగా రూ.1.80 కోట్లను తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. డబ్బులు రాగానే దుబాయ్లో ప్రశాంత్ ను వదిలేసి ఎక్కడికో ఉడాయించారు. తర్వాత స్నేహితులు, బంధువుల సాయంతో ప్రశాంత్ దుబాయ్ నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. కువెంపునగర పోలీసు స్టేషన్లో మోసగాళ్లపై ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. -
రాష్ట్రాన్ని ఉడ్తా పంజాబ్ కానివ్వం
మైసూరు: కర్ణాటకను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉడ్తా పంజాబ్గా మాదిరిగా మత్తు పదార్థాల నిలయంగా మార్చనివ్వమని హోం మంత్రి జి.పరమేశ్వర్ అన్నారు. శనివారం మైసూరులో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు శాఖలో చాలా సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. మాదకద్రవ్యాల సమస్యపై మేము చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాం, బెంగళూరులో ప్రతిరోజూ వందలాది కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. పంజాబ్లో ప్రతి ఇంట్లో డ్రగ్స్ దొరికాయని వార్తలు వస్తున్నాయని, అలా కర్ణాటకను కానివ్వబోమన్నారు. మైసూరులో డ్రగ్స్ ఫ్యాక్టరీలు లేవు మైసూరులో ఎటువంటి మాదకద్రవ్యాలు కనుగొనలేదని ఇటీవలి డ్రగ్స్ ఫ్యాక్టరీలు గుట్టురట్టయిన సంఘటనను హోంమంత్రి ప్రస్తావించారు. నార్కోటిక్స్ బ్యూరో దాడిలో ఫినాయిల్ కెమికల్ లభించిందని, అయితే బ్యూరోవారు రూ.10 కోట్ల మాదకద్రవ్యాలు దొరికాయని అబద్ధం చెప్పారని హోంమంత్రి ఆరోపించడం గమనార్హం. మైసూరులో మొదటిసారి సోదాల్లో డ్రగ్స్ లేవన్నారు, అంతలోనే మరో మీడియా ప్రకటనలో డ్రగ్స్ దొరికాయని చెప్పారని దుయ్యబట్టారు. తాను మైసూరు పోలీసు కమిషనర్ను ప్రశ్నించినప్పుడు, ఇక్కడ ఏమీ దొరకలేదని తెలిపారన్నారు. ఇలా పత్రికా ప్రకటన జారీ చేయాల్సిన అవసరం ఏమిటి? అని నార్కోటిక్స్ బ్యూరో మీద మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని రసాయన కర్మాగారాలను తనిఖీ చేయాలని నేను ఇప్పటికే పోలీసు అధికారులను ఆదేశించానని చెప్పారు. ఏ రసాయన కర్మాగారం కూడా పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోరాదన్నారు. 15 రోజులకు ఒకసారి తనిఖీలు చేయాలని, ముడి పదార్థాలను పరిశీలించాలని తెలిపారు. పోలీసులు ప్రజాస్నేహిగా ఉండాలి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలను నేరస్థులుగా చూడకూడదు. పోలీస్ స్టేషన్లు ప్రజలకు అనుకూలంగా ఉండాలని హోం మంత్రి తెలిపారు. సిద్ధార్థనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. పోలీసులు చురుగ్గా పనిచేయాలని, హుబ్లీలో ప్రేమోన్మాది చేతిలో యువతి హత్యకు గురైంది, పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే అలా జరిగి ఉండేది కాదన్నారు. మైసూరుకు మరింత బాగా పర్యాటకులు రావాలని, పోలీసులు, ప్రజలు టూరిస్టులకు అన్ని రకాల ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. మైసూరులోని చారిత్రక భవనాలను కాపాడుకుంటే మరింత కీర్తి వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీవత్స, ఐజిపి ఎం.బి. బోరలింగయ్య, పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలను అరికడతాం హోంమంత్రి పరమేశ్వర్ -
చేనేతలకు చేయూత ఏదీ?
రాయచూరు రూరల్: చేనేతలకు బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించాలని చేనేత సహకార సంఘం సంచాలకుడు సంగప్ప డిమాండ్ చేశారు. శనివారం బాగల్కోటె జిల్లాధికారి కార్యాలయం వద్ద వినితిపత్రం సమర్పించి మాట్లాడారు. రాష్ట్రంలో కట్టడ కార్మికుల మాదిరిగా గుర్తింపు కార్డులు, సహకార, జాతీయ బ్యాంకుల్లో రుణాలు మంజూరు చేసేలా చూడాలన్నారు. 55 ఏళ్లు పైబడిన చేనేతకారులకు నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ చెల్లించాలన్నారు. 55 మంది చేనేత కారులు రుణ బాధలతో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సమ్మాన్ పథకం కింద ఉన్న నిధిని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని కోరారు. చేనేత చట్టాన్ని జారీ చేయాలన్నారు. రైల్వే, విమానాశ్రయాల్లో చేనేత వస్త్రాల విక్రయాలకు అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.


