తుది శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటా | - | Sakshi
Sakshi News home page

తుది శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటా

Mar 14 2026 7:35 AM | Updated on Mar 14 2026 7:35 AM

మైసూరు: నా 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి, విజయం రెండింటినీ చూశాను. నేను ఓడిపోయినా, నా సామర్థ్యం మేరకు ప్రజలకు నిజాయితీగా సేవ చేశాను. నా తుది శ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మైసూరు తాలూకాలో ఆయన శుక్రవారం మాట్లాడారు. నా రాజకీయ జీవితంలో ఏడు విజయాలు, నాలుగు ఓటములు చూశానన్నారు. అయితే తాను ఎప్పుడూ ప్రజాసేవను మర్చిపోలేదన్నారు. నా చివరి శ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానన్నారు. నాకు వీలైనంత వరకు ప్రజా సేవ చేస్తున్నాను. నేను ఇలానే చేస్తూనే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. చాముండేశ్వరి, వరుణ నియోజకవర్గాల ప్రజలు తనకు నిరంతరం అండగా నిలిచారన్నారు. నియోజకవర్గ ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోను. రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయడమే కాకుండా, 17 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టానని ఆయన అన్నారు. మైసూరు తాలూకా వరుణ నియోజకవర్గ ప్రజలే తనకు ఇలాంటి అవకాశం రావడానికి కారణం అన్నారు. 1980లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 46 ఏళ్లు మంత్రిగా పని చేశానని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలను ఎదుర్కొన్నానని, నాలుగు సార్లు ఓడిపోయానని అన్నారు. ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గ ప్రజలను వీడలేదని అన్నారు. రాజకీయాల్లో తన ఎదుగుదలకు, సీఎం అయ్యేందుకు మీరందరూ కారణమని అక్కడ గుమిగూడిన ప్రజల వైపు చేయి చూపారు. బడగలహుండి, హొసహుడి, మొదలహుడి, వరకోడు గ్రామాల నాయకులు, యజమానులు, భక్తులు నిర్మించిన ఆలయానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన అన్నారు. కాగినెలె శాఖ శివానందపురి స్వామీజీ, మాజీ ఎమ్మెల్యే ఎం.కె.సోమశేఖర్‌, మైసూరు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ బి.జె. విజయకుమార్‌ పాల్గొన్నారు.

నా కుమారుడు యతీంద్రను ఆదరించండి

వరుణ నియోజకవర్గ ప్రజలకు సీఎం విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement