Karnataka News
-
బోర్డు జారిపడి ఇద్దరు చిన్నారుల మృతి
సాన్విత(ఫైల్) విశ్వనాథ్(ఫైల్) రాయచూరు రూరల్: నాటకాన్ని ప్రదర్శిస్తుండగా సముదాయ భవనం బోర్డు జారి తలలపై పడి ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా, నలుగురు గాయపడిన ఘటన శుక్రవారం రాత్రి రాయచూరు జిల్లా మాన్వి తాలూకా బాయల్ మర్చేడ్లో చోటు చేసుకుంది. రాత్రి గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకాన్ని సముదాయ భవనం వద్ద స్టేజీకి ముందు కూర్చొని చూస్తున్నారు. ఆ సమయంలో సముదాయ భవనానికి కట్టిన బోర్డు జారి కింద పడింది. దీంతో సాన్విత(2), విశ్వనాథ(9) అనే ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. నలుగురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఒపెక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బసమ్మ(28), లక్ష్మి(17), విశాలాక్షమ్మ(20), యల్లమ్మ(4)అనే క్షతగాత్రులను గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ పరామర్శించారు. వైద్యులతో చర్చించి వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాన్వి సీఐ కెంచనరెడ్డి తెలిపారు. బాయల్ మర్చేడ్ గ్రామంలో విషాదఛాయలు క్షతగాత్రులకు ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ పరామర్శ -
ప్రతిభా పురస్కారాల ప్రదానం
బళ్లారిఅర్బన్: ఇటీవల విడుదలైన ద్వితీయ పీయూసీ పరీక్షల ఫలితాల్లో బసవరాజేశ్వరి సమూహ విద్యాసంస్థల బీపీఎస్సీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. కళాశాలలో మొత్తం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 92.42గా నమోదు కాగా, 135 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు. వాణిజ్య శాస్త్ర విభాగంలో పారేఖ్ 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి ఆగ్రస్థానంలో నిలిచారు. విజ్ఞాన శాస్త్ర విభాగంలో యూ. వెంకట్ రాహుల్ 585 మార్కులతో 97.5 శాతం ఉత్తీర్ణతతో కళాశాలకే మొదటి స్థానం సాధించారు. అంతేకాకుండా 70 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్ట్ల్లో 100కు 100 మార్కులు సాధించి కళాశాలకు కీర్తి తెచ్చారు. శనివారం అనంతపురం రోడ్డులోని బీపీఎస్సీ కళాశాల సభాంగణంలో ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. సంస్థ చైర్మన్ డాక్టర్.యశ్వంత్ భూపాల్, ప్రిన్సిపాల్ హెచ్.త్రిపురాంబ, అధ్యాపకులు కలిసి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మొమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
షాహిద్ అహ్మద్(ఫైల్)అల్తాఫ్(ఫైల్) జాబిర్(ఫైల్) హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి పట్టణంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరసీకెరె పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.6.65 లక్షల విలువ చేసే 16 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జాహ్నవి వెల్లడించారు. శనివారం హరపనహళ్లి తాలూకా అరసీకెరె పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు పూర్వాపరాలను వెల్లడించారు. పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ముగ్గురు వ్యక్తులు బైక్పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, ఎస్సై తమ సిబ్బందితో వారిని అదుపులోకి తీసుకుని, విచారించగా దొంగతనాల అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. పోలీసుల విచారణలో నిందితులు అరసీకెరెకు చెందిన ఆఫ్తాబ్, జాబిర్, షాహిద్ అహమ్మద్గా గుర్తించినట్లు తెలిపారు. పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని, 16 బైకులను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ముగ్గురు నిందితుల పట్టివేత 16 ద్విచక్రవాహనాలు స్వాధీనం -
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచండి
కోలారు: ఎస్సీ, ఎస్టీ జన సంఖ్యను ఆధారంగా చేసుకుని విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాలని సీపీఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని లోక్సభ సభ్యుడి కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.ఆర్.సూర్యనారాయణ మాట్లాడుతూ.. భారత సమాజ వాస్తవాల నేపథ్యంలో ఎస్సీ జాతుల రిజర్వేషన్లో వర్గకరణ చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం షెడ్యూల్–9లో చేర్చాలన్నారు. పేదలకు అనుకూలమయ్యేలా దేవిందర్ సింగ్ వర్సస్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి కర్ణాటక ప్రభుత్వం నివృత్త జస్టిన్ నాగమోహన్ దాస్ కమిషన్ ఇచ్చిన నివేదికను అంగీకరించిందన్నారు. వర్గీకరణ విషయంలో కొన్ని న్యూన్యతలను సరి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు స్థానిక ఎంపీ పార్లమెంటులో గట్టిగా ప్రయత్నించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, మండలి సభ్యురాలు వి.గీత, పాతకోట నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాద హేతువుల్లా రోడ్లు
రోడ్డు పక్కన పొలంలోకి బోల్తా పడ్డ రెడీమిక్సర్ ట్యాంకర్ లారీ(ఫైల్) కారు ఢీకొని మంటలు చెలరేగి కాలిపోయిన ప్రైవేట్ బస్సు(ఫైల్) రాయచూరు రూరల్ : మానవుడు తన అవసరాల కోసం వాహనాల్లో వెళ్లడం నేడు సహజంగా మారింది. జాతీయ రహదారుల్లో వాహనాలు స్పీడ్గా వెళ్లడం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. గురు, శుక్రవారం రెండు రోజుల్లో జాతీయ రహదారులపై రక్తపుటేరులు పారాయి. జాతీయ రహదారులు ప్రమాదాలకు హేతువులుగా మారాయి. జాతీయ రహదారి–150ఏ, 167లలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ప్రైవేట్ బస్సులకు మంటలు అంటుకోవడం సర్వసాధారణమైంది. కళ్యాణ కర్ణాటకలో తీవ్రమైన వేసవి ఎండల కారణంగా వాహనాలకు మంటలు అంటుకున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏ సమయంలో ఏ ఆపద వస్తుందో విదితం కావడం లేదు. గత ఏడాది నుంచి దాదాపు 152 మంది ఇలా రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. జాతీయ రహదారిలో ఎదురుగా వస్తున్న వాహనాలను సరిగా చూడకుండా తమ వాహనాలను అతి వేగంగా నడపడం వల్లే ప్రాణ నష్టం సంభవిస్తోందనే ఆరోపణలున్నాయి. ఆదమరిచి నిద్ర మత్తు, నిర్లక్ష్యం వంటి వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టర్నింగ్ పాయింట్లు, ఓవర్టేక్ చేస్తుండడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. అగ్నికి అహుతి అవుతున్న ప్రైవేట్ బస్సులు వేసవి ఎండలతో వాహనాలకు మంటలు అంటుకుంటున్నాయా? రెండు రోజుల్లోనే 14 మంది దుర్మరణం -
బెంగళూరులో కరెంటు చార్జీల షాక్
ఈ మూడింట తగ్గింపు ● మెస్కాం పరిధిలో: కరావళి, మలెనాడు ప్రదేశాలు, దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో యూనిట్పై 9 పైసల తగ్గింపు ● హెస్కాం పరిధిలోని ధార్వాడ, బెళగావి, గదగ్, హావేరి, ఉత్తరకన్నడ, బాగల్కోటే, విజయపుర జిల్లాల్లో యూనిట్ కు 10 పైసలు తగ్గింపు ● జెస్కాం పరిధిలో కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, బీదర్, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాల్లో యూనిట్ కు 10 పైసల కోత.బనశంకరి: కర్ణాటకలో విద్యుత్ చార్జీలను పెంచుతూ కేఈఆర్సీ నివేదిక ప్రకారం సర్కారు ఆదేశాలిచ్చింది. బెస్కాం పరిధిలో ప్రతి యూనిట్పై 56 పైసలు పెరిగింది. ఇందుకు విరుద్ధంగా మెస్కాంలో 9 పైసలు, హెస్కాంలో 10 పైసలు తగ్గించారు. బెంగళూరులోనే అధిక చార్జీల బాదుడు పడింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో బెస్కాంకు ఏర్పడిన రూ.2 వేల కోట్ల నష్టం భర్తీ చేయడానికి 2026–27 సంవత్సరంలో ప్రతి యూనిట్ ధరను పెంచాలని ఆదేశించింది. మే 1 నుంచి కొత్త చార్జీలు అమలులోకి వచ్చి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు కొనసాగుతాయి. ఏయే జిల్లాల్లో పెంపు బెస్కాం పరిధిలోకి బెంగళూరు నగర– రూరల్, కోలారు, తుమకూరు రామనగర, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, దావణగెరె జిల్లాలు వస్తాయి. ఇక్కడ ప్రతి యూనిట్పై రూ.56 పైసలు పెరుగుతుంది. ● సెస్క్ పరిధిలోని మైసూరు, చామరాజనగర, మండ్య, హాసన, కొడగుజిల్లాలు ప్రతి యూనిట్ కు 15 పైసలు పెంపు. యూనిట్పై 56 పైసల పెంపు పలు జిల్లాల్లో తగ్గింపు -
కాంగ్రెస్ సంతోషం.. బీజేపీ ఆక్రోశం
తుమకూరు: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంతో తుమకూరులో పోటాపోటీ ప్రదర్శనలు జరగాయి. శనివారం నగరంలోని టౌన్హాల్ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్.షఫి అహ్మద్, ఇక్బాల్ అహ్మద్ల నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిథ్యం తగ్గించే బీజేపీ కుట్రను ఎంపీలు సమర్థంగా అడ్డుకున్నారని, ఇదొక చారిత్రక విజయమన్నారు. బీజేపీ నిరసన ప్రదర్శన ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ కూటమి నాయకులు అడ్డుకుని మహిళల హక్కులను హరించారని జిల్లా బీజేపీ మహిళా మోర్చా నాయకులు నగరంలోని బీజీఎస్ సర్కిల్లో ఆందోళన చేశారు. మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుమిత్రాదేవి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో దేశంలోని 70 కోట్ల మంది మహిళలు విపక్షాలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు మహిళలపై ఉన్న గౌరవ భావన ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. ఎమ్మెల్యే సురేష్గౌడ, జ్యోతి గణేష్, రవిశంకర్ హెబ్బాక, జ్యోతి, వసంత, రేఖా, ప్రేమా తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సంబరాలుబీజేపీ నిరసన మహిళా బిల్లు వీగిపోవడంపై ఆయా పార్టీల ప్రదర్శనలు -
సీఎం మార్పు తప్పదా?
సాక్షి బెంగళూరు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడుతుండడం తెలిసిందే. సీఎం సిద్ధరామయ్యతో సత్సంబంధాలు కలిగి ఉన్నారన్న నేతలను డీకే శివకుమార్ వర్గీయులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీకే శివకుమార్ బాహాటంగా హెచ్చరించడంతో పాటు ఇటీవల కాలంలో కొందరిపై పడిన వేటును గుర్తు చేసుకుని సీఎం వర్గీయుల్లో భయం అలుముకుంది. సీఎం అనుచరులు వరుసగా పదవులను కోల్పోతున్నారు. దీంతో సిద్దు కుర్చీ కూడా డోలాయమానంలో పడిందని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ విధానసభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక రాజకీయాలపై హైకమాండ్ నాయకులు దృష్టి సారించనున్నారు. మే 20తో సిద్ధరామయ్య సీఎం అయ్యి మూడేళ్లు పూర్తి అవుతుంది. అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా సిద్ధరామయ్య రికార్డు కెక్కారు. సిద్ధరామయ్య పదవిని వదులుకోవాల్సి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హైకమాండ్ నేతలను డీకే శికుమార్ ఒప్పించారని, జూన్ నాటికి కుర్చీ మార్పిడి తప్పనిసరిగా ఉంటుందని తెలుస్తోంది. జూన్ నాటికి డీకే శివ కల సాకారం? పార్టీలో జోరుగా ప్రచారం -
ఓటర్లూ చెక్ చేసుకోండి
ఓటర్లు వార్డుల వారీగా ఓటర్ల జాబితాలో తమ పేరును ఆన్లైన్లో ఎపిక్ నంబరు లేదా పేరుతో చెక్ చేసుకోవచ్చు. త్వరలో పీడీఎఫ్ రూపంలో కూడా అప్లోడ్ చేస్తామని మహేశ్వరరావు తెలిపారు. పాలికెల వారీగా ఓటర్ల సహాయవాణి ఏర్పాటుచేసి ఓటర్ల జాబితా పరిష్కరణ గురించి విస్త్రత ప్రచారానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటరు సహాయవాణి నంబర్లు పాలికె వెబ్సైట్లో ఉంటాయని, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. జాబితాలను రాజకీయ పార్టీలకు అందజేస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి వార్డులో ప్రతి బూత్కు ఒకరిని బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించి పోలింగ్ కేంద్రాల అధికారులకు ఓటర్ల నమోదులో సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం ప్రత్యేక కమిషనర్ సుష్మా గాడ్బోలె పాల్గొన్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
హొసపేటె: విజయనగర జిల్లా హువినహడగలి తాలూకాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. విరిగిన చెట్లు విద్యుత్ తీగల మీద పడటంతో కరెంటు తీగలు తెగి విద్యుత్ స్తంభాలు విరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ఎక్కడా ఎలాంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకోలేదు. ఈదురు గాలుల ధాటికి ఉత్తంగి, హొళగుంద మధ్య ఉన్న రహదారిపై రెండు భారీ వృక్షాలు కూలిపడ్డాయి. ఉత్తంగి గ్రామస్తుల సహకారంతో ఒక జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి ఆ చెట్టును తొలగించారు. తద్వారా ప్రజలు, వాహనదారుల రాకపోకలకు మార్గం సుగమమైంది. చెట్లు విరిగిన ప్రదేశాలను విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. చెట్ల కొమ్మలను తొలగించారు. తెగిపడిన విద్యుత్ లైన్లను, స్తంభాలను పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. గాలులకు విరిగిపడిన చెట్లు కూలిన విద్యుత్ స్తంభాలు -
స్వర్ణ పల్లకీలో యతిరాజు
మండ్య: మండ్య జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం మేలుకోటె దేవస్థానంలో 1009వ తిరునక్షత్ర మహోత్సవం 5వ రోజు కోడై తిరునాల్ వేడుకలలో రామానుజాచార్యులకు ఉదయం అశ్వవాహనోత్సవం, రాత్రి పుష్పాలంకృత బంగారు పల్లకీ సేవ సాగింది. రాజాలంకారంలో మిరుమిట్లు గొలిపిన యతిరాజులను చతుర్వీధుల్లో ఊరేగించారు. చెలువ నారాయణస్వామికి గత 15 రోజులుగా జరుగుతున్న కోడై తిరునాళ్ మహోత్సవం అమావాస్య రాత్రి ముగిసింది. ఆలయ అంతస్తుపై ఆదిశేషునిపై కూర్చొన్న చెలువనారాయణస్వామికి సర్పనడకలో పడియేట్రం మెట్లు ఎక్కే ప్రత్యేక వేడుకతో వైమాళిగె కోడై తిరునాళ్ సమాప్తమైంది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రభను కళ్లారా వీక్షించారు. మేలుకోటెలో కోడై తిరునాళ్ మహోత్సవం సమాప్తం -
అధికారి సాహసం.. దక్కిన పసి ప్రాణం
రాయచూరు రూరల్ : యాదగిరి జిల్లా సురపుర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసులు ఆరుగురు దుర్మరణం పాలు కాగా తొమ్మిది మందికి గాయాలైన ఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం జరిగింది. యాదగిరి జిల్లా సురపుర తాలూకా జాతీయ రహదారి–150పై శాంతాపుర వద్ద బెంగళూరు నుంచి కలబుర్గికి వెళుతున్న ప్రైవేట్ బస్సు, కలబుర్గి వైపు నుంచి లింగసూగూరు వైపు వెళుతున్న కారు ఢీకొనడంతో కారులో ఉన్న రాయచూరు జిల్లా సిరవారకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. కాగా బెంగళూరు నుంచి కలబుర్గికి వెళుతున్న ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న కలబుర్గి ప్రకృతి వైపరీత్యాల విభాగం అధికారి ఉమేష్ బిరాదార్ వెంటనే బస్సులో నుంచి కిందకు దిగి ప్రాణాలకు తెగించి సమయస్ఫూర్తి, చొరవతో వ్యవహరించి ప్రమాదంలో మంటలు అంటుకున్న కారు తలుపు తెరిచి అందులో నుంచి విరాట్ అనే ఏడేళ్ల బాలుడిని ప్రాణాలతో రక్షించినట్లు యాదగిరి జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్ తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలకు తెగించి బాలుడిని రక్షించిన వైనం -
తాగునీటికి పరీక్షలు నిర్వహించాలి
రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, తాగునీటికి పరీక్షలు నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొళాయిల్లో కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు క్రమం తప్పకుండా నీటి పరీక్షలు చేయాలన్నారు. వేసవిలో 40 శాతం మేర ఉష్ణోగ్రతలు ఉండడంతో బాలింతలు, గర్భిణులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. పంచాయతీలో హైడ్రోజన్ క్లోరైడ్, ఫ్లోరైడ్, ఐరన్, నైట్రేట్, అల్కలైనిజ్, హైడ్రోజన్ సల్ఫైడ్తో నీటి పరీక్షలు జరపాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఐసీడీఎస్ అధికారి నవీన్ కుమార్, ఆర్సీహెచ్ అధికారిణి నందిత, వైద్యులు శంకర గౌడ, చంద్ర శేఖరయ్య, శివకుమార్, షాకీర్, గణేష్, కుమార్లున్నారు. పెళ్లి చేసుకుంటానని రూ.5 లక్షలు మస్కాహుబ్లీ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.5 లక్షలను దోచుకున్న యువతి ఘరానా మోసానికి పాల్పడిన ఉదంతం ఇది. పెళ్లిళ్ల ప్రకటనల యాప్లో పరిచయమైన యువతి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.5 లక్షలు తీసుకొంది. పెళ్లి చేసుకొనే ప్రస్తావన తెస్తే ప్రాణాలు తీస్తానంటూ బెదిరించడంతో ఆ యువతితో పాటు ముగ్గురిపై హుబ్లీ టౌన్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఏడాది క్రితం రమన్ అహమ్మద్కు ఫిర్దోస్షేక్ అనే యువతి పరిచయం అయింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడితో కలిసి హోటళ్లు, మాల్స్, పబ్లు, సినిమాలకు షికార్లు చేసింది. ఆ తర్వాత అతడి నుంచి డబ్బులు తీసుకొని, వాటిని తిరిగి ఇవ్వమని అడిగితే చంపుతానని బెదిరించడంతో ఫిర్దోస్షేక్ అనే యువతి, ఆమె తండ్రి అబ్దుల్ షేక్, తల్లి కౌసర్బానులపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు రమన్ అహమ్మద్ పేర్కొన్నారు. సీహెచ్ పౌడర్ విక్రేతల అరెస్ట్రాయచూరు రూరల్ : నగర ప్రాంతాల్లో సీహెచ్ పౌడర్ విక్రయం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగరంలోని రైల్వే ఉద్యానవనం వద్ద మహ్మద్ హాజీ, నాగరాజ్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 35 లీటర్ల కల్తీ కల్లు, 30 లీటర్ల సీహెచ్ పౌడర్ను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. పశ్చిమ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మంజునాథ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించండి కోలారు: ఉత్తర ప్రదేశ్లోని నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగావ్లో ప్రతిఘటన నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం డిప్యూటీ తహసీల్దార్ వినతిపత్రం సమర్పించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రతిఘటనను అణగదొక్కే ప్రయత్నాన్ని చేస్తోందని ఆరోపించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.విజయకృష్ణ మాట్లాడుతూ.. దేశ రాజధాని సమీపంలో ఉన్న ఈ నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికులే అధికంగా పని చేస్తున్నారన్నారు. వీరికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వేతనం ఇస్తూ నిత్యం 10 నుంచి 12 గంటల పాడు పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. -
కనులవిందుగా రథోత్సవం
కోలారు: ముళబాగిలు నగరంలోని పురాణ ప్రసిద్ధ శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం కనులపండువగా జరిగింది. మూలవిరాట్టుకు పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, విశేల పూజలు జరిగాయి. ఆలయ ఆవరణలోని బాల సుబ్రమణ్యస్వామి, బసవణ్ణ, చాముండి దేవికి పూజలు నిర్వహించారు. వేదమంత్ర ఘోష మధ్యన స్వామివారి ఉత్సవ మూర్తిని తేరులో ప్రతిష్టించారు. జై సోమేశ్వర అని నినదిస్తూ తేరును లాగారు. భక్తజనం దవనం, అరటిపండ్లు విసిరారు. ఎమ్మెల్యే సమృధ్ది మంజునాథ్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రైతు ప్రాణం తీసిన అప్పులుపావగడ: తుమకూరు జిల్లాలో అప్పుల బాధ తాళ లేక ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. పావగడ తాలూకా లోని దవడబెట్ట రొప్ప గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైతు నాగరాజు (56) పంటల సాగుకు చేసిన అప్పులు నష్టాల వల్ల తీర్చలేకపోయాడు. అప్పులిచ్చిన వాళ్ళ ఒత్తిళ్ళు భరించలేక చావే శరణ్యమని విరక్తి చెంది నాగరాజు గ్రామ సమీపంలోని ఓ పొలంలోని చింత చెట్టుకు ఉరేసుకున్నాడు. కొమ్మ చాలా ఎత్తుగా అందకపోవడంతో, తన బైక్ను నిలిపి దాని మీద ఎక్కి కొమ్మకు ఉరి బిగించుకోవడం గమనార్హం. ఈ ఘటనతో కుటుంబీకులు, స్థానికులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆఫ్రికన్ చీతాల రాక ● బన్నేరుఘట్ట జూపార్క్లో బస బొమ్మనహళ్లి: భారతదేశంలో లేని క్రూరమృగాల్లో చీతాలు ఒకటి. అవి మనదేశంలో ఎప్పుడో అంతరించిపోయాయి. అక్కడక్కడ జూలలో మాత్రమే కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి నాలుగు ఆఫ్రికన్ చీతాలను బెంగళూరు బన్నేరుఘట్ట జూపార్క్ కు శుక్రవారం అర్ధరాత్రి చేరుకున్నాయి. విమానంలో కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే మంత్రి ఈశ్వర్ ఖండ్రే, అధికారులు స్వాగతం పలికారు. వాటిని జూపార్క్ కు తరలించారు. ఇవి అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి 30 రోజుల పాటు కఠినమైన క్వారంటైన్లో ఉంచుతారు. ఈ కాలంలో నిత్యం పర్యవేక్షిస్తారు. క్వారంటైన్ కాలం ముగిసిన తర్వాత వాటిని కేటాయించిన బసలలో సందర్శకులకు అందుబాటులో ఉంచుతారు. చీతాలను జాగ్రత్తగా చూసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఒకప్పుడు మన కర్ణాటక అడవులలో కనిపించిన చీతాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. కనీసం జూలో అయినా చూసే అవకాశం ప్రజలకు ఉండాలని అన్నారు. -
వీడిన చోరీ కేసుల మిస్టరీ
బళ్లారిఅర్బన్: జిల్లాలోని కురుగోడు, కుడితిని పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన వరుస దొంగతనాల కేసుల మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి పెద్ద మొత్తంలో దొంగసామాను స్వాధీనం చేసుకున్నారు. కురుగోడు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసులో రూ.1.50 లక్షల విలువైన రాగి తీగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో కేసులో రూ.4.50 లక్షల విలువైన ఎద్దులు, రూ.3.80 లక్షల విలువైన నాలుగు మోటార్ సైకిళ్లను పోలీసులు జప్తు చేసుకొన్నారు. ఈ రెండు కేసుల్లో మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కుడితిని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో దొంగతనం కేసులో లారీకి చెందిన 10 టైర్లు, 4 డిస్కులు కలిపి రూ.2.20 లక్షల విలువైన సామాను స్వాధీనం చేసుకుని ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. పలువురు నిందితుల అరెస్ట్ రాగి తీగలు, బైక్లు స్వాధీనం -
మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన సిరవార పట్టణ పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణా నాయక్, భార్య అనంతకళ, శరణప్ప, నిసర్గ, సిద్ధార్థ, శశికళ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు హంపయ్య నాయక్ పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం సిరవారలోని కృష్ణా నాయక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించి ఘటన పూర్వాపరాల గురించి తెలుసుకుని ఓదార్చి ధైర్యం చెప్పారు. పెట్టుబడి పేరుతో రూ.22 లక్షల వంచన హుబ్లీ: డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని నమ్మించిన గుర్తు తెలియని వ్యక్తి ధార్వాడ నివాసిని రూ.22.92 లక్షలు వంచించిన ఘటనపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ధార్వాడ సైదాపుర హొసపేటె నివాసి పునీత్ అంబన్నవర డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి. పునీత్ ఇన్స్టాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ గురించి ప్రకటన చూశారు. ఈ క్రమంలో టెలిగ్రాం లింక్ పంపించిన గుర్తు తెలియని వ్యక్తులు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చని నమ్మించి విడతల వారీగా డబ్బులను తమ ఖాతాలోకి బదలాయించుకొని మోసగించినట్లు బాధితుడు పేర్కొన్నారు. రక్షణ కవచం.. ఎండ దూరంరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు అధికం అవుతుండడంతో ప్రజలకు మిట్టమధ్యాహ్నం రోడ్లపై ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల వద్ద నిలువ నీడ కోసం యాదగిరి శాసన సభ్యుడు చెన్నారెడ్డి పాటిల్ తన్నూరు చొరవ చూపి రక్షణ కవచాలను కల్పించారు. నగరంలోని సుభాష్ సర్కిల్, బసవేశ్వర గంజ్, అంబేడ్కర్, రైల్వే స్టేషన్ల వద్ద నిలువ నీడ కోసం రక్షణ కవచాలను ఏర్పాటు చేసిన కూడళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. నగరంలోని ప్రధాన రహదారులపై దుమ్ము, ధూళి నుంచి రక్షణకు నీటిని చల్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఘనంగా సంస్థాపన దినంరాయచూరు రూరల్: నగరంలో వాల్మీకి నాయక్ సమాజ్ సంస్థాపన దినం వైభవంగా జరిగింది. శనివారం వాల్మీకి సర్కిల్ వద్ద వందలాది మంది సమక్షంలో మహర్షి వాల్మీకి విగ్రహానికి, శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాలకు కళ్యాణ కర్ణాటక డివిజన్ అధ్యక్షుడు రఘువీర్ నాయక్ పూలమాలలు వేసి పూజ చేశారు. తాగునీటి కోసం ధర్నారాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని గ్రామస్తులు తప్పుబడుతూ ఆందోళన చేపట్టారు. శుక్రవారం రాత్రి జిల్లాలోని మాన్వి తాలూకా బాగలవాడలో నీరు వదలాలని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఉన్నఫళంగా అధికారి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి పరారవడంతో కార్యాలయం వద్ద బైఠాయించి తమ ఆందోళన కొనసాగించారు. గంజాయి విక్రేతల అరెస్టు కేజీఎఫ్: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన రాబర్ట్సన్ పేట పోలీసులు వారి నుంచి రూ.23 వేలు విలువ చేసే 410 గ్రాముల గంజాయి, 2 గ్రాముల ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. కెజీఎఫ్ ఇటి బ్లాక్ నివాసి అజయ కుమార్, కెఎన్జెఎస్ బ్లాక్ నివాసి మహమ్మద్ యూసుఫ్, శర్మ అలియాస్ యక్షగోర్ శర్మ అరెస్టు అయిన నిందితులు. వీరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
...............
సాక్షి,బళ్లారి: వారిద్దరిరి జంట చూడముచ్చటైనదని పెళ్లి రోజు రెండు కుటుంబాల వారు సంబరపడ్డారు. పెళ్లయి రెండున్నర సంవత్సరాలకే అక్రమ సంబంధం వ్యామోహంలో పడిన భర్త తన భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించడంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయడం కూడా మొదలు పెట్టారు. అక్రమ సంబంధం మోజు రోజు రోజుకు పెరిగిపోవడంతో అందమైన భార్యను హతమార్చాలని కుట్ర పన్ని ఆ దిశగా పథకం పన్నారు. భర్త వేధింపులు తదితరాలను భార్య రోజు సెల్ఫోన్లో చిత్రీకరించింది. వివరాల్లోకి వెళితే... దావణగెరె తాలూకా మండలూరు గ్రామానికి చెందిన పేదింటి అందమైన అమ్మాయి కావ్యకు చెన్నగిరి తాలూకా హూదగెరె గ్రామానికి చెందిన మను అనే వ్యక్తితో రెండున్నర సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆడబిడ్డ తల్లిదండ్రులు సంబరపడి పెళ్లి చేశారు. పెళ్లిలో అష్టకష్టాలతో రెండున్నర లక్షల నగదు, 70 గ్రాముల బంగారం కూడా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు.భార్యను అంతమొందించాలని వేధింపులుఅయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాల నుంచి భార్యను విపరీతంగా వేధించడం మొదలుపెట్టిన మను తీరును భార్య గమనించింది. పరసీ్త్ర మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని గమనించి తల్లిదండ్రులకు తెలిపిన తర్వాత పంచాయతీ కూడా చేశారు. దావణగెరె నగరంలో కాపురం ఉంటున్న కావ్య, మను మంత్రాలయానికి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్నారు. భార్యను హత్య చేయాలని పథకం వేసుకున్న మను ఆ దిశగా ఆమెను హత్య చేసిన తర్వాత అత్తమామలకు ఫోన్ చేసి కావ్య ఫోన్ పని చేయడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు దావణగెరెకి వచ్చి పరిశీలించగా, కుమార్తె అచేతనంగా పడి ఉండటం గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే కావ్య మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుమార్తె సెల్ఫోన్ పరిశీలించగా భర్త గుట్టురట్టు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య మిస్టరీని సెల్ఫోన్ ద్వారా ఛేదించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.పెళ్ళయిన రెండున్నర సంవత్సరాలకేభర్త అకృత్యంవేధింపులను సెల్ఫోన్లో భద్రపరిచిన భార్యహత్య కేసు మిస్టరీని ఛేదించినసెల్ఫోన్ వీడియోలు -
రాష్ట్రంలో ఎండ ప్రచండం
శివాజీనగర: రాష్ట్రంలో ఎండ వేడిమి రోజు రోజుకు పెరుగుతోంది. ఉత్తర కర్ణాటకలో సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ కేంద్రం (కేఎస్ఎన్డీఎంసీ) ఏప్రిల్ 16న విడుదల చేసిన నివేదిక ప్రకారం బీదర్, కల్బుర్గి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కేఎస్ఎన్డీఎంసీ నివేదిక ప్రకారం గత 24 గంటల్లో బీదర్ జిల్లాలోని ‘చితంకి’ ఫిర్కాలో 44.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికమైన ఉష్ణోగ్రతగా నిలిచింది. రాష్ట్రంలో 7 జిల్లాలకు ఎండవేడిమి ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 42 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు: కల్బుర్గి, రాయచూరు, బీదర్, విజయపుర జిల్లాల్లో అనేక చోట్ల, యాదగిరి, బాగలకోటెలో పలు చోట్ల, బెళగావి, బళ్లారి, గదగ, కొప్పళ, చిత్రదుర్గ, విజయనగరలో ఒకటి రెండు చోట్లలో ఉష్ణోగ్రత 42 నుంచి 44.6 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది. ప్రతిరోజు కంటే ఎండలు అధికం: వాతావరణ పర్యవేక్షణ బృందం సమాచారం ప్రకారంరాష్ట్రంలో పలు స్థలాల్లో వాతావరణం 42 డిగ్రీల సెల్సియస్ దాటింది. ఉత్తర ఒళనాడు, దక్షిణ ఒళనాడులో ఒకటి రెండు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత మునుపటి కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 సెల్సియస్ మేరకు అధికమైనట్లు కనిపించింది. మరో 5 రోజుల పాటు హెచ్చరిక: భారతీయ వాతావరణ శాఖ సూచన ప్రకారం ఏప్రిల్ 16 నుంచి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశముంది. మరో 3 రోజుల పాటు ఉత్తర ఒళనాడులో తీవ్ర వడ గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. కరావళి కర్ణాటకలో ఎండవేడిమి, అతిగా వేడిమి ఉండనుంది. ఎండవేడిమి ఎల్లో అలర్ట్ జిల్లాలు ఇవీ? ఈనెల 20 వరకు బాగలకోటె, విజయపుర, కల్బుర్గి, బీదర్, దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. బెంగళూరులో 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ దాటింది. మూడు రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 35, 36, 36.6 డిగ్రీల సెల్సియస్ కనిపించింది. బుధవారం ఉదయాన్నే నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37, హెచ్ఏఎల్లో 36.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే ఐదు రోజుల్లో ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటకల్లా బెంగళూరులో కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రత కనిపించనుంది. వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచన చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు, 2 నుంచి 3 గంటల సమయంలో గరిష్ట ఎండ వేడిమి కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఏడు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటన -
లవ్ జిహాద్ కేసుకు రాజకీయ రంగు
హుబ్లీ: కొప్పళ జిల్లాలో లవ్ జిహాద్ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. వారం రోజులుగా లవ్ జిహాద్ కేసు చర్చానీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దాదాపు 16 మంది యువతులకు చెందిన ఆశ్లీల వీడియోలు ముస్తాఫా ఖాదరీ మొబైల్ ఫోన్లో కనిపించాయి. బీజేపీ నేతలు ఎమ్మెల్సీ హేమలత నాయక్ నేతృత్వంలో ఎస్పీ డాక్టర్ రామ్ హరసిద్ధికి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుతో పాటు, నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముస్తాఫా ఖాదరీ అమాయక హిందూ యువతులను మభ్యపెట్టి మతమార్పిడులకు ప్రయత్నించారని ఆరోపించారు. అతడి మొబైల్ ఫోన్లో 16 మంది హిందూ యువతులకు సంబంధించి వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. తక్షణం నిందితుడపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్తాఫా ఖాదరీని అరెస్ట్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడానికి ముందే ఆ వీడియోలు వైరల్ అయితే అమాయక యువతులు భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు పోలీసులు ముస్తాఫాను అరెస్ట్ చేయడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా గంజాయి, మట్కా, గుట్కా దందా సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయినట్లు వివరించారు. ముస్తాఫా కేవలం లవ్ జిహాద్ నిందితుడే కాదని.. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి కింగ్పిన్ అని తెలియజేశారు. నిషేదిత ఊక్కా అతడికి ఎక్కడి నుంచి దొరికిందని బీజేపీ నేతలు నిలదీశారు. తక్షణమే అతడిని అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. -
శరీరానికి ఆహారమే అసలైన ఔషధం
హొసపేటె: ‘మనకు ఆహారమే అసలైన ఔషధం. మన ప్రాచీన సంస్కృతి దీనిని ప్రపంచం అంతటికి పరిచయం చేసింది. ఔషధ రహిత ప్రకృతి వైద్యం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’ అని విజయనగర జిల్లా హరపనహళ్లి తెగ్గినమఠం అధ్యక్షుడు వరసద్యోజాత శివాచార్య స్వామి తెలిపారు. శుక్రవారం డోనూరు శ్రీ చానుకోటి మఠం హరపనహళ్లి జనినియోగ, ప్రకృతి వైద్య ఆస్పత్రి, పరిశోధన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ప్రకృతి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైద్యం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత ఆస్పత్రికి వెళ్లే బదులు మన ఆహార అలవాట్లు, క్రమశిక్షణ పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మంచి ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన భారతీయ ఆహారం ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దలింగ శివాచార్య స్వామి తదితరులు పాల్గొన్నారు. -
పథకాలు సామాన్యులకు అందించాలి
కోలారు: జిల్లాలో మైనారిటీ విద్యా, సామాజిక అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు కేవలం రికార్డులకే పరిమితం అయ్యాయి. వీటిని జన సామాన్యుల చెంతకు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి అధికారులకు సూచించారు. శుక్రవారం నగరంలోని కలెక్టర్ కార్యాలయ సభాంగణంలో ప్రధానమంత్రి 15 అంశాల కార్యక్రమం ప్రగతి పరిశీలన సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలోని మైనారిటీ మహిళల ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్తగా వక్ఫ్ మహిళా పీయూ కళాశాల ప్రారంభించేందుకు సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. అయితే కట్టడం లభ్యత లేదనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించలేదన్నారు. కట్టడ నిర్మాణం జరిగే వరకు నగర సభ సముదాయ భవనం లేదా సరైన ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకుని విద్యా కార్యక్రమాలు ప్రారంభించాలని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. గాజుల దిన్న మొరార్జి దేశాయి మొడల్ సీబీఎస్సీ పాఠశాల ఏటా 100 శాతం ఫలితాలు సాధిస్తుండటం సంతోషకరమన్నారు. బంగారుపేట, కెజీఎఫ్లలో నిర్మాణం అవుతున్న మైనారిటీ విద్యార్థి వసతి నిలయాల పనులు నత్తనడకన సాగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభం అయ్యే లోపు భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా సమితి సభ్యులు తఫిక్ అహ్మద్, శబీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. -
శునకాల స్వైర విహారం
సాక్షి, బళ్లారి: నగరంలో రోజు రోజుకు కుక్కల బెడద అధికం అవుతోంది. ఆయా కాలనీల్లో శునకాలు స్వైర విహారం చేస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. గుంపులుగా తిరుగుతూ అకస్మాత్తుగా దాడులకు తెగబడుతున్నాయి. ఇక రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులపై పరుగెత్తుకుంటూ వెళ్తుండటంతో వారు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం నగరంలో మోకా రోడ్డులో వాజ్పాయి లేఅవుట్లో ఓ బాలుడిని కుక్కల గుంపు తరుముకుంటూ వచ్చి దాడి చేసింది. గమనించిన స్థానికులు వెంటనే కుక్కలను తరమడంతో ప్రమాదం తప్పింది. బళ్లారి నగరంలో నిత్యం ఏదో ఒక కాలనీలో కుక్కల దాడిలో ప్రజలు గాయపడటం సర్వసాధారణంగా మారింది. కుక్కల సంచారంతో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రేబిస్, సంతాన హరణ ఇంజక్షన్లు వేసి కుక్కల సంతతిని నియంత్రించాలని సూచించింది. అయితే మహానగర పాలికె పాలకులు, కమిషనర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల మహానగర పాలికె అధికారులు తుతూమంత్రంగా ఏదో ఒక కాలనీలో కొన్ని కుక్కలను ఇలా పట్టుకుని వెళ్లి అలా యథావిధిగా వాటిని వదిలి వెళ్తున్నారు. దీంతో కుక్కల సంతతి మరింతగా పెరిగిపోయింది. ఇలా అయితే కుక్కల నియంత్రణ ఎక్కడ సాధ్యం అవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల సమచారం పచ్రారం ఒక్క బళ్లారి నగరలో సుమారు 40 వేల కుక్కలు ఉన్నాయని సమాచారం. గడిచిన 6 నెలల వ్యవధిలో బళ్లారి జిల్లా వ్యాప్తంగా 4 వేల మంది కుక్కకాటుకు గురైనట్లు సమాచారం. మేజర్ బళ్లారిలో 2 వేల మంది కుక్కకాటు బాధితులు ఉన్నారు. వీరిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కుక్కల నియంత్రణకు చర్యలు ఏవీ? ప్రతి సంవత్సరం కుక్కల నియంత్రణ చేస్తున్నామంటూ అధికారులు ప్రభుత్వం నుంచి బిల్లులు చేసుకుంటున్నారు. అయితే ఏ వార్డులో కుక్కల నియంత్రణ చేశారో పాలికె అధికారులు, పాలకులకే తెలియాలని జనం ఽఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కుక్కకు రేబిస్ వ్యాధికి సంబంధించిన ఇంజక్షన్లు వేయాలి. రేబిస్ టీకా వేస్తే ఒకవేళ ఆ కుక్క కరచిన అంతగా ప్రమాదం ఉండదు. వీధి కుక్కలకు సంతానహరణ చికిత్సలతో పాటు రేబిస్ ఇంజక్షన్లు వేస్తే జనం ప్రాణాలను కాపాడిన వారవుతారు. అభివృద్ధి మాట అటుంచి తొలుత ప్రతి చోట కుక్కల సంతానహరణపై దృష్టి సారించాలని పాలకులకు జనం సూచిస్తున్నారు. బళ్లారిలో దాడులకు తెగబడుతున్న గ్రామ సింహాలు రాత్రి వేళల్లో వెంటాడి కరుస్తున్న వైనం ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్ర వాహనదారులు భయాందోళనతో పరుగులు తీస్తున్న జనంచికిత్స చేయించుకోవాలి కుక్కలు కరిచినప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. వెంటనే జాగ్రత్తలు తీసుకుని వైద్యుడు చెప్పినట్లుగా సూచనలు పాటించలి. కుక్క కరిచిన వెంటనే సబ్బు నీటితో బాగా కడగాలి. దీనివల్ల వైరస్ లోపలికి వెళ్లే తీవ్రత తగ్గుతుంది. కుక్క కరిచిన 24 గంటల లోపు మొదటి డోసు రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. కరచిన కుక్క ఎలాంటిది అయినా వెంటనే ఇంజక్షన్లు వేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్కకాటుకు ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయి. – రాజేష్, చిన్నారులు వైద్య నిపుణుడు, బిమ్స్ -
సౌకర్యాలు కల్పించరా?
రాయచూరు రూరల్: మాన్వి తాలుకా గోర్కకల్ పంచాయతీ పరిధిలోని గవిగట్టులో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘం జిల్లా సంచాలకురాలు అనిత ఆరోపించారు. గురువారం రాత్రి పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామంలో గత 15 రోజులుగా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని మండిపడ్డారు. విద్యుత్ సరఫరా, శౌచాలయాల ఏర్పాటు, రహదారుల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలీని అధికారికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు వీడ్కోలు రాయచూరు రూరల్: తాలుకాలోని కురుబదొడ్డి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఏడవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు, పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజుసాబ్ మాట్లాడుతూ.. సంస్కృతి, సంస్కారం, ఆచారవ్యవహాలు, సంప్రదాయాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు వీరేష్, ఉపాధ్యక్షుడు గోవిందు, ఉపాధ్యాయులు విద్యావతి, యశోధర, రమాబాయి, సురేష్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించాలిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించాలని ఎస్టీ కమిషన్ సభ్యుడు జాహితె హుసేన్ సూచించారు. గురువారం సాయంత్రం రాయచూరులోని సర్కారు వైద్య కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిమ్స్లో రోగులకు సరైన చికిత్సలు, మందులు ఇతర సౌలభ్యాలు కల్పించాలని ఆదేశించారు. తల్లీబిడ్డల అస్పత్రిలో ఏసీ ఏర్పాటు చేయాలని తెలిపారు. రోగులను పలకరించేందుకు వచ్చిన వారి కోసం విశ్రాంతి భవనం నిర్మించాలన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న హస్టళ్లను పరిశీలించారు. విద్యార్థులకు సరైన సమయంలో భోజనం, వసతి, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు శివమానప్ప, వైద్యులు అరవింద్, జయకృష్ణ, సోమశేఖర్, శరణబసవ, నేతలు రవీంద్ర, లాలప్ప నాయక్ తదితరులు పాల్గొన్నారు. సోలార్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలురాయచూరు రూరల్: రాష్ట్రంలో 19 వేల మోగావ్యాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాయచూరులో సోలార్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సోలార్తో పాటు పవన, గాలి మరలతో విద్యుత్ ఉత్పాదనకు ప్రభుత్వం టెండర్లు పిలచినట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని రాయచూరుతో పాటు బెళగావి, గదగ, హవేరి, కొప్పళ, చిత్రదుర్గ, ఉత్తర కర్ణాటకకు విస్తరణకు చర్యలు చేపట్టారు. రైతులతో మాట్లాడి సోలార్ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తిస్తున్నారు. రౌడీషీటర్ నగర బహిష్కరణ కెజీఎఫ్: నగరానికి చెందిన రౌడీషీటర్ అభిషేక్ను నగర బహిష్కరణ చేస్తూ అండర్సప్ పేట పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అభిషేక్ గత కొంతకాలంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. 6 హత్యా ప్రయత్నాలు, 1 దౌర్జన్యం కేసు సహా ఇతడిపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. కోర్టు నుంచి జామీనుపై వచ్చిన అభిషేక్.. మళ్లీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పోలీసులు నగర బహిష్కరణ చేస్తూ ఆదేశించారు. ఇతడిని హావేరి జిల్లా నగర పోలీస్ స్టేషన్ పరిధిలోకి బహిష్కరించారు. -
కేఎస్ ఆర్టీసీ బస్సులో మంటలు
యశవంతపుర: కేఎస్ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా భట్కళ మురుడేశ్వర ఆలయ రోడ్డులో జరిగింది. శుక్రవారం కుమటా నుంచి ప్రయాణికులతో భట్కళ మార్గంలో వెళ్తున్న బస్సు మురుడేశ్వర బస్టాండ్ సమీపంలోని దూరవాణి కేంద్రం వద్దకు రాగానే వాహనంలో మంటలు చెలరేగాయి. తక్షణం డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపేసి ప్రయాణికులను దించేశారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ఫైర్ సిబ్బంది వచ్చి వచ్చి మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. మంటలు ఎలా వ్యాపించాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జబ్బార్ను వెనక్కి పిలిపించుకోవాలి ● మంత్రి సతీశ్ జార్కిహొళి శివాజీనగర: అబ్దుల్ జబ్బార్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయటంపై డీసీఎం డీకే శివకుమార్తో చర్చించాను. ఆయనను వెనక్కి పిలిపించుకోవాల్సిన అవసరముందని మంత్రి సతీశ్ జార్కిహొళి తెలిపారు. డీ.కే.శివకుమార్ను కుమారపార్కు ప్రభుత్వ నివాసంలో శుక్రవారం భేటీ చేసి సమాలోచన చేసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. అబ్దుల్ జబ్బార్ను పార్టీలోకి వెనక్కి పిలిపించుకునే విషయంపై మాట్లాడాను. అధ్యక్షుడి వద్ద కూడా కొన్ని నివేదికలు ఉన్నాయి. దళితులు, మైనార్టీలు తమ ఓటర్లు. అబ్దుల్ జబ్బార్పై ఆచితూచి, హైకమాండ్ అనుమతితో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి తాను వచ్చాను. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు జరుగుతాయి, వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుందన్నారు. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.77 లక్షలు కొల్లగొట్టారు మైసూరు: సైబర్ కేటుగాళ్లు వేర్వేరు ఘటనల్లో ఇద్దరి నుంచి రూ. 77 లక్షలు కొల్లగొట్టారు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తికి మైసూరుకు చెందిన రేష్మా అనే మహిళ పరిచయమైంది. స్టాక్ మార్కెట్ మంచి లాభాలు వస్తున్నాయని చెప్పింది. అనంతరం మైసూరులోని గోకులం సమీపంలో ఉన్న ఒక హోటల్కు పిలిపించి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి స్టాక్ మార్కెట్ గురించి వివరించింది. పెట్టుబడి పెడితే కోట్లు సంపాదించవచ్చని నమ్మించింది. వారి మాటలు నమ్మిన ఆ వ్యక్తి రూ. 65 లక్షలు ఆమె చెప్పిన ఖాతాలకు జమ చేశాడు. లాభాలు రాకపోగా ఆమె ఫోన్ కూడా పనిచేయలేదు. మోసం జరిగిందని గుర్తించిన బాధితుడు వి.వి.పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా మైసూరులోని విద్యారణ్యపురానికి చెందిన ఒక వ్యక్తి ఫేస్బుక్ చూస్తుండగా స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఒక ప్రకటన కనిపించింది. ఆ తర్వాత మోసగాళ్లు అతడిని ఒక గుర్తుతెలియని వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. లాభాలు వస్తాయని ఆశ కల్పించి రూ. 12,02,930 దోచుకున్నారు. అడవి ఏనుగుల విధ్వంసం దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ తాలూకా బీవీ హళ్లి గ్రామంలో అడవి ఏనుగులు విధ్వంసం సృష్టించాయి.గురువారం రాత్రి గ్రామంలోని దొడ్డేగౌడ అన్యేక్తి ఇంటి కాంపౌండ్లోకి జొరబడ్డ ఏనుగులు బొప్పాయ,అరటి ఇతర చెట్లను విరిచేశాయి. తరువాత గ్రామ శివారులోని తోటలు, పంటపొలాలను తొక్కి ధ్వంసం చేశాయి. -
ఢిల్లీకి కర్ణాటక సీఎం, డీసీఎం
సాక్షి బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్లు హస్తిన బాట పట్టారు. ఇద్దరు అధినేతలు చాలా రోజుల తర్వాత అది కూడా కలసికట్టుగా ఢిల్లీకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఢిల్లీలో జరిగిన బ్రిడ్జ్ టు బెంగళూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరు అధినేతలు ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలాతో ఇద్దరు నేతలు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేతలంతా బిజీగా ఉన్నారు. దీంతో అధిష్టానం నేతలతో భేటీ అయ్యే అవకాశాలు కొద్దిగా తక్కువేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ, రాజ్యసభ, విధాన పరిషత్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, పాలక మండళ్లకు నియామకాలు తదితర అంశాలు హైకమాండ్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇద్దరు అధినేతలు ఢిల్లీకి వెళ్లడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం సిద్ధరామయ్య వర్గీయులకు అడుగడుగునా ఎదురవుతున్న ఎదురు దెబ్బల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కాగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని కొన్ని సమస్యలకు శనివారం అధిష్టానం పెద్దలతో చర్చించి పరిష్కారం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎత్తుకుపైఎత్తులు మళ్లీ జోరందుకున్నాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో తమకు అవకాశం కల్పించాలంటూ 15 మందికి పైగా సీనియర్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల ఢిల్లీకి వెళ్లి అధిష్టానం నేతలను కలిశారు. నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి మంతనాలు జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన తరుణంలో మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని వినతులు సమర్పించారు. వీరిలో ఎక్కువ మంది సీఎం సిద్ధరామయ్య వర్గీయులే ఉండడం గమనార్హం. అయితే ఈ సీనియర్ల తరపున ఢిల్లీకి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గం పునర్వ్యస్థీకరణకు అవకాశం కల్పించాలని కోరనున్నారు. బ్రిడ్జి టు బెంగళూరు కార్యక్రమం ముగిసిన వెంటనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు వేర్వేరుగా పార్టీ పెద్దలను కలుసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో డీకే శివకుమార్ కూడా నాయకత్వ మార్పు గురించి తన డిమాండ్ను వినిపించే అవకాశం కూడా ఉంది. తొలుత నాయకత్వ మార్పు చేసి ఆ తర్వాత మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టాలని కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అనేక రాజకీయ గందరగోళాలకు తావిచ్చినట్లు అవుతుంది. ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఊహాగానాలు జోరందుకుంటాయి. ఇదే సమయంలో నాయకత్వ మార్పు లేన్నట్లేనన్న సంకేతాలు పంపినట్లు అవుతుంది. కాబట్టి ఈసారి కూడా హైకమాండ్ వేచి చూసే ధోరణి అవలంభించే అవకాశముంది. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి కూడా సీఎం, డీసీఎంలు ఢిల్లీ నేతలతో చర్చించనున్నారు. పాలకమండళ్లకు నియామకాలకు కూడా అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.మొత్తానికి ఇద్దరు నేతలు పలు డిమాండ్లు, వినతులతో ఢిల్లీకి వెళ్లారు. ఎప్పటిలాగే వట్టి చేతులతో తిరిగి వస్తారో లేక తాము అనుకున్నది సాధించుకుని వస్తారో అన్న విషయం మరో రెండు రోజుల్లో తేలనుంది. అధిష్టానంతో భేటీకి అవకాశం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గందరగోళాలపై చర్చ పలు విజ్ఞప్తులు విన్నవించే అవకాశం -
ఎమ్మెల్యే వినయ్ సహా 16 మందికి యావజ్జీవ శిక్ష
బనశంకరి: ధారవాడ జెడ్పీ బీజేపీ సభ్యుడు యోగేశ్గౌడ హత్య కేసులో ధారవాడ గ్రామీణ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి శుక్రవారం బెంగళూరు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హత్య, కుట్ర ఆరోపణలపై ఎమ్మెల్యే వినయ్కులకర్ణి 15వ ముద్దాయిగా ఉండగా మొత్తం 16 మందికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించారు. అంతేకాకుండా తలా రూ.30 వేలు చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించారు. లాగే ఏ–17గా ఉన్న చెన్నకేశవ టింగరికర్కు ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీబీఐ అధికారులు వినయ్కులకర్ణితో పాటు 17 మందిని అదుపులోకి తీసుకుని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. కాగా యోగేశ్గౌడ హత్య కేసును అప్పటి బీజేపీ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అప్పగించింది. సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు చేపట్టి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి, ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు మొత్తం 21 మంది పేర్లను చార్జిషీట్లో ప్రస్తావించారు. కానీ 17 మందిపై మాత్రమే నేరం రుజువైంది. మిగతా నలుగురికి కేసు నుంచి విముక్తి లభించింది. రూ.16 లక్షలు పరిహారంగా ఇవ్వాలని సూచన హత్యకు గురైన యోగేశ్గౌడ కుటుంబానికి రూ.16 లక్షల పరిహారం అందించాలని కోర్టు సూచించింది. ప్రతి సెక్షన్కు కోర్టు ప్రత్యేకంగా జరిమానా విధించడంతో పాటు ఏ1 ముద్దాయి ముత్తగికి మాఫీ సాక్షి స్థానాన్ని కోర్టు ఖాయం చేసింది. వ్యక్తిగత, రాజకీయ ద్వేషం నేపథ్యంలో 2016 జూన్ 15వ తేదీ యోగేశ్గౌడ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసు హుబ్లీ, ధారవాడలో తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. సుమారు పదేళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడింది. బీజేపీ నేత యోగేశ్గౌడ, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి మధ్య కొన్ని విషయాల్లో అంతర్గత భిన్నాభిప్రాయాలు ఉండేవి. యోగేశ్గౌడ ధారవాడ జెడ్పీ బీజేపీ సభ్యుడిగా ఉన్నారు. జెడ్పీలో తాగునీటి విషయంపై సమావేశంలో యోగేశ్గౌడ, వినయ్ కులకర్ణి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆసుపత్రిలో గొడవకు సంబంధించి వీడియో వైరల్గా మారింది. దీని వెనుక యోగేశ్గౌడ హస్తం ఉందని చర్చ జరిగింది. ఈనేపథ్యంలో అనేక కారణాలతో ఇరువురి మధ్య వైరం ఏర్పడింది. ఎవరెవరికి యావజ్జీవ శిక్ష... ఏ2–విక్రమ్, ఏ3–కీర్తికుమార్, ఏ4–సందీప్, ఏ5–వినాయక, ఏ6–మహాబలేశ్వర, ఏ7–సంతోష్, ఏ8–దినేశ్, ఏ9–అశ్వథ్, ఏ10–సునీల్, ఏ11–నజీర్అహ్మద్, ఏ12–శానవార్, ఏ13–నూతన్, ఏ14–హర్షిత్, ఏ15–వినయ్కులకర్ణి, ఏ16–చంద్రశేఖర్ ఇండి, ఏ18–వికాస్ కలబురిగి బసవరాజ కొరవర్ ఇంటికి భద్రత బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆర్టీఐ కార్యకర్త బసవరాజ కొరవర్ ధారవాడలోని నివాసానికి పటిష్ట పోలీసు భద్రత కల్పించారు. యోగేశ్గౌడ హత్య కేసులో బసవరాజ్ కొరవర్ ప్రముఖ పాత్ర వహించారు. ఈ నేపథ్యంలో ఇతడి ఇంటికి 10 మందికి పైగా పోలీస్ సిబ్బందితో భద్రత కల్పించారు. దుస్తులు మార్చుకోడానికి అవకాశం ఇవ్వండి ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి మూడు రోజుల నుంచి ఒకే డ్రస్లో ఉన్నారని, దుస్తులు మార్చుకోడానికి అనుమతి ఇవ్వాలని వినయ్ కులకర్ణి తరఫు న్యాయవాది న్యాయమూర్తి సంతోష్ గజానన భట్కు మనవి చేశారు. దోషిగా తేలిన మరో ముద్దాయికి ఏడు సంవత్సరాల జైలు యోగేశ్గౌడ హత్యకేసులో తుది తీర్పు ప్రకటించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కేసులో హైలైట్లు..... 2016 జూన్ 15న ధార్వాడ జెడ్పీ సభ్యుడు యోగేశ్గౌడ దారుణ హత్య యోగేశ్గౌడ జిమ్లో ఉండగా కళ్లలో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేసి కడతేర్చారు యోగేశ్గౌడ హత్య కేసులో మొదట ఆరుగురు అరెస్ట్ కేసులో 21 మందిపై కోర్టులో చార్జిషీట్ అందజేత సుదీర్ఘ విచారణలో 17 మంది ముద్దాయిలుగా రుజువు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బుధవారం 17 మందిపై తీర్పు వెల్లడి సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ.రాజు వాదనలు బసవరాజ ముత్తగి, శివానంద శ్రీశైల బిరాదార మాఫీ సాక్షులు వాసుదేవ ఆమనిలేకణి, సోమశేఖర బసప్ప న్యామగౌడకు కేసు నుంచి విముక్తి -
కొడుకుపై తండ్రి దాడి
హుబ్లీ: ఆస్తుల విషయంలో తలెత్తిన గొడవలో కొడుకుపై తండ్రి దాడి చేయడమే కాకుండా హత్యయత్నానికి ప్రయత్నించిన ఘటన హుబ్లీ తాలూకా అదరగుంచి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామ మహంతేష్ సుకందపై అతడి తండ్రి యల్లప్ప దాడి చేశాడు. కుటుంబ విషయంగా గొడవ జరిగిన క్రమంలో కొడుకును కొట్టడంతో చేతులు, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. మహంతేష్ను చికిత్స నిమిత్తం స్థానిక కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్.. కాగా మరో ఘటనలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అవినీషను కేశ్వపుర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1.78 లక్షల విలువ చేసే 2.968 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా సాగిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు కేశ్వపుర పోలీసులు పెట్రోలింగ్ చేసే సందర్బంగా అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. ఆక్రమణల తొలగింపు సరికాదు ● మాజీ మంత్రి శ్రీరాములు సాక్షి, బళ్లారి: ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇళ్లు, గుడిసెలు కట్టుకుని జీవనం సాగిస్తున్న తరణంలో అకస్మాత్తుగా వాటిని తొలగించడం సరికాదని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని భత్రీ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. మహానగర పాలికె ఆధ్వర్యంలో రెండు రోజులుగా కొనసాగుతున్న అక్రమణల తొలగింపుపై పులువురు పేదలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం తాము కూడా సహించేది లేదని.. అయితే వాటిని ఎలా తొలగించాలన్న దానిపై పాలికె ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపును వ్యతిరేకిస్తునట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అనధీకృత నర్సరీలపై చర్యలు తీసుకోవాలి కోలారు: హార్టికల్చర్ పంటలను బాధిస్తున్న రోగాల నియంత్రణకు, విత్తనాల నాణ్యత పరిశీలన చేయడానికి విశేష బృందాన్ని ఏర్పాటు చేయాలి. అనధీకృత నర్సరీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం పదాధికారులు శుక్రవారం హార్టికల్చర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివకుమారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణ గౌడ మాట్లాడుతూ.. ఏటా టమాట సీజన్ ప్రారంభమైన సమయంలో హార్టికల్చర్ శాఖ వేల సంఖ్యలో కంపెనీలు, మందుల దుకాణాలు, నర్సరీల యజమానులతో కుమ్మకై ్క నకిలీ, విత్తనాలు, మందులను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఏ కంపెనీ అయినా తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి ముందు సంబంధిత శాఖ దృష్టికి తీసుకు రావాలన్నారు. కంపెనీ తానే స్వయంగా రెండు ఎకరాల విస్తీర్ణంలో పంట పండించి ఫలితం చూసిన తరువాత మార్కెట్లోకి తీసుకు రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్, మంగసంద్ర తమ్మణ్ణ, మునికృష్ణ, మంజునాథ్ పాల్గొన్నారు. జిల్లా స్థాయి టాపర్కు సన్మానం హోసూరు: ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో హోసూరు అద్వైత్ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని లలిత జిల్లా స్థాయి టాపర్గా నిలిచింది. 500 మార్కులకు గాను 496 మార్కులు సాధించింది. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని కే.లలితను అభినందించారు. పాఠశాల చైర్మన్ అశ్వత్నారాయణ రూ.20 లక్షల ప్రోత్సాహక నిధిని అందజేశారు. విద్యార్థులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో 2012 నుంచి ప్రోత్సాహక నిధిని అందజేస్తున్నామన్నారు. -
సీఎం తీరుపై మాజీ మంత్రి అసంతృప్తి
శివాజీనగర: ముఖ్యమంత్రి సిద్దరామయ్య సన్నిహితులపై హైకమాండ్ క్రమశిక్షణ చర్యలు తీసుకొంటున్నా సిద్దూ అసహాయకుడిలా ఉండటంపై మాజీ మంత్రి కే.ఎన్.రాజణ్ణ అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సన్నిహిత వర్గంగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యేలు, మంత్రులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా సిద్దూ మౌనంగా ఉండటం విచారకరమన్నారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి స్థానం నుంచి నజీర్ అహమ్మద్ను సస్పెండ్ చేయగా, ఎమ్మెల్సీ అబ్దుల్ జబ్బార్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకమాండ్పై ఒత్తిడి ఉంది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం మౌనంగా ఉండటంపై రాజణ్ణ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. హైదరాబాద్కు మరో ఫ్లైట్ సర్వీసు మైసూరు: మైసూరు నుంచి హైదరాబాద్కు మరో విమాన సర్వీసు త్వరలో ప్రారంభం కానుందని మైసూరు–కొడగు ఎంపీ యదువీర్ కష్ణదత్త చామరాజ ఒడయార్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విమాన సర్వీసు మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. జలమండలికి ఐఎస్ఓ గుర్తింపు బనశంకరి: బెంగళూరు నీటి సరఫరా భూగర్భ డ్రైనేజీ మండలి(బీడబ్ల్యూఎస్ఎస్బీ) ఐఎస్ఓ 50001: 2018 ప్రమాణపత్రం పొందిన దేశంలోనే మొదటి జలమండలిగా ఖ్యాతి గడించింది. ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ ఇంధన నిర్వహణ సర్టిఫికెట్ పొందినందుకు మండలి అధ్యక్షుడు రామ్ప్రసాత్ మనోహర్ బృందానికి శుక్రవారం డీసీఎం అభినందనలు తెలిపారు. శుక్రవారం జలమండలి కార్యాలయంలో ఐఎస్ఓ సర్టిఫికెట్ను డీసీఎం ప్రదర్శించారు. -
పోటీ పరీక్షలపై దృష్టి సారించండి
హొసపేటె: మెరుగైన భవిష్యత్తు కోసం విద్యార్థులు పోటీ పరీక్షలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజయనగర జిల్లా కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్.ఎన్టి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కూడ్లిగి పట్టణంలో అంబేడ్కర్ ప్రభుత్వ పోస్టు మెట్రిక్ బాలల వసతి గృహంలో ఏర్పాటు చేసిన నూతన పరీక్ష గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి రోజుల్లో విద్యార్థులకు భవిష్యత్తు కోసం మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. యూపీఎస్సీ, కేపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు, వార్తా పత్రికలు అధ్యాయన సామాగ్రి, ఉచిత శిక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దళితులు, వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ తెగలు, మహిళ అభ్యర్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ నేత్రావతి, సీపీఐ ప్రహ్లాద్ చన్నగిరి, సాంఘిక సంక్షేమ కార్యాలయ అధికారి ఫక్కీరప్ప, వార్డెన్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్, సైబర్క్రైంలపై నియంత్ర ణ
బనశంకరి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్క్రైం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హోం శాఖ మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. శుక్రవారం బెళగావి నగర పోలీస్ కమిషనర్, జిల్లా పోలీస్ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి జిల్లాలో సైబర్ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్రగ్స్ పెడ్లర్లపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 15 లక్షల మంది విద్యార్థులను తమ పోలీసులు కలిసి డ్రగ్స్ గురించి జాగృతపరిచారని తెలిపారు. దేశంలోనే న్యాయం అందించడంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందన్నారు. రాయచూరు జిల్లా కవితాళ పోలీస్ స్టేషన్ దేశంలోనే మూడో అత్యుత్తమ స్టేషన్గా ఖ్యాతి గడించిందన్నారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా పోలీస్స్టేషన్లను జనస్నేహిగా తీర్చిదిద్దామన్నారు. బెళగావిలో రూ.67.79 కోట్లతో పోలీస్ సిబ్బందికి పోలీస్గృహ పథకం కింద క్వార్టర్స్ వ్యవస్థ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 40 శాతం పోలీస్ సిబ్బందికి ఈ పథకం కింద ఇళ్లు నిర్మించామన్నారు. అనంతరం పోలీస్ సిబ్బందికి మంత్రి క్వార్టర్స్ తాళాలు అందజేశారు. హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ -
385 మొబైల్ ఫోన్ల స్వాధీనం
బనశంకరి: దొంగల పాలైన రూ.1 కోటి 15 లక్షల విలువచేసే 385 మొబైల్ఫోన్లను బెంగళూరు తూర్పు విభాగం పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తూర్పు పరిధిలోని 14 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన మొబైల్స్ను గాలించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ చెప్పారు. సీఇఐఆర్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సాధ్యమైందన్నారు. బాణసవాడిలో 87, జీవనబీమా నగరలో 81, గోవిందపురలో 35, కేజీ.హళ్లిలో 30, హలసూరులో 30, డీజే.హళ్లిలో 29, హెణ్ణూరులో 19, కమర్షియల్ స్ట్రీట్లో 16, పులకేశినగరలో 15, ఇందిరానగరలో 12, బైయప్పనహళ్లిలో 8 మొబైల్స్ పోయినట్లు ఫిర్యాదులు రాగా దొంగల నుంచి రికవరీ చేశారు. ఫోన్ పోయినట్లయితే సీఇఐఆర్ వెబ్సైట్లో నమోదు చేయడం లేదా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
మరోసారి గుట్టల కొద్దీ డ్రగ్స్
బనశంకరి: బెంగళూరులో ప్రతి నెలా పెద్ద మొత్తాల్లో మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. ఇక దొరకని డ్రగ్స్ ఎంత మొత్తంలో ఉంటాయో ఊహించుకోవాల్సిందే. ఆ స్థాయిలో మత్తు బాగోతం సాగుతోంది. తాజాగా పోలీసులు 10 మంది డ్రగ్స్పెడ్లర్లను గురువారం అరెస్టు చేసి వారి నుంచి రూ.23.63 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ తెలిపారు. డ్రగ్స్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎక్కడెక్కడ ఎంత? ● యలహంక ఉపనగర, దేవరజీవనహళ్లి, బాణసవాడి, కోరమంగల, బొమ్మనహళ్లి, పులకేశినగర పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ●6 కేజీల ఎండీఎంఏ, 1 కేజీకి పైగా కొకై న్, 21 కిలోల గంజాయి, 19 గ్రాముల ఎక్స్టసీ మాత్రలు, బైక్ తదితరాలు లభించాయి. ● యలహంకలో డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియా కు చెందిన పీస్ గౌడియా (27), బలూకా (29) అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయగా, వారి వద్ద రూ.11.72 కోట్ల విలువచేసే 5.8 కేజీల ఎండీఎంఏ లభించింది. ● బాణసవాడి పోలీసులు నైజీరియావాసి ఒకేవిమ్మర్ (28)ని అరెస్ట్చేసి రూ.23.56 లక్షల విలువచేసే 46 గ్రాముల ఎండీఎంఏ 19 గ్రాముల ఎక్స్టెసీపిల్స్ను సీజ్ చేశారు. ●దేవర జీవనహళ్లిలో సయ్యద్ సజ్జద్ (50) అనే డ్రగ్స్పెడ్లరు వద్ద రూ.11.44 కోట్ల విలువచేసే 1.15 కేజీల కొకై న్, బైక్ ను స్వాదీనం చేసుకున్నారు. ఇలా వివిధ ఠాణాల పరిధిలో డ్రగ్స్ విక్రేతలు భారీగా మత్తు పదార్థాలతో పట్టుబడ్డారు. విలువ రూ. 23 కోట్లు పైనే బెంగళూరులో స్వాధీనం ముగ్గురు నైజీరియన్లు సహా 10 మంది అరెస్టు -
పల్టీ పడి పెట్రోల్ ట్యాంకర్ దగ్ధం
యశవంతపుర: పెట్రోల్ను తరలిస్తున్న ట్యాంకర్ లారీ బోల్తా పడడంతో మంటలు వ్యాపించి కాలిపోయిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా అంకోలా తాలూకా కంచినాబాగిలు సమీపంలో జాతీయ రహదారి– 52లో గురువారం మధ్యాహ్నం జరిగింది. మంగళూరు నుంచి హుబ్లీకి పెట్రోల్ను తీసుకెళ్తున్న ట్యాంకర్ మలుపులో పల్టీ కొట్టింది. దీంతో పెట్రోల్ లీకై ఎండల వేడికి మంటలు లేచాయి. రోడ్డు పక్కనే ఉన్న చెట్లు, పొదలకు కూడా వ్యాపించి కాలిపోయాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఫైర్ సిబ్బంది గంటల కొద్దీ శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో హైవేలో ట్రాఫిక్ స్తంభించింది. ఓటీపీ చెప్పగానే రూ.2.70 లక్షలు కట్ మైసూరు: బ్యాంకు ఉద్యోగినంటూ సైబర్ నేరగాడు ఫోన్ చేసి రిటైర్డ్ అధికారి నుంచి రూ.2.70 లక్షలు కొట్టేశాడు. వివరాలు.. మైసూరులోని సరస్వతీపురం నివాసి అయిన 89 ఏళ్ల వృద్ధుడు భార్యతో కలిసి కారులో వెళుతుండగా, మొబైల్కు కాల్ వచ్చింది. తాను బ్యాంకు ఉద్యోగినని, మీ డెబిట్ కార్డు గడువు ముగిసింది, ఓటీపీ చెబితే కొత్త కార్డును ఇష్యూ చేసి పంపుతామని నమ్మబలికాడు. అతని మాటలను నమ్మిన బాధితుడు తన మొబైల్కు వచ్చిన ఓటీపీ నంబరును చెప్పడంతో, కొంతసేపటికి ఖాతాలో నుంచి రూ.2.70 లక్షలు డ్రా అయ్యాయి. దీంతో సరస్వతీపురం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. మంటల్లో ట్యాంకర్ -
సిద్దరామయ్యకు ఎదురుగాలి!
సాక్షి, బెంగళూరు: కొన్ని నెలలుగా కన్నడ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ గురించి రగడ జరుగుతూనే ఉంది.. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య పోరాటంతో ప్రభుత్వంలో, పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. అంతఃకలహాలు అధికం కావడంతో ఆధిక్యం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్నిరోజులుగా సీఎం సిద్ధరామయ్య శిబిరంపై దాడులు జరుగుతున్నాయి. పలువురు సిద్ధరామయ్య సన్నిహితులు పదవులు కోల్పోయేలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శిబిరం చేయగలిగింది. వరుస ఎదురుదెబ్బలతో సీఎం సిద్ధరామయ్య డైలమాలో పడిపోయారు. రాజణ్ణ నుంచి షురూ సీఎం ఆప్తుడు మంత్రి కేఎన్ రాజణ్ణ.. రాహుల్ గాంధీ మీద నోరు జారడంతో వెంటనే పదవి నుంచి తొలగించారు. దావణగెరె ఉప ఎన్నికలు వచ్చాక సిద్దరామయ్యకు ఎదురుగాలి అధికమైంది. అక్కడ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతిచ్చారని సీఎం రాజకీయ కార్యదర్శి పదవి నుంచి నజీర్ అహ్మద్ సస్పెండ్, మైనారిటీ నేత అబ్దుల్ జబ్బార్ను పదవితో పాటు పార్టీ సభ్యత్వం నుంచి తీసేయడం కలకలానికి కారణమైంది. సిద్ధరామయ్య కూడా సన్నిహితులను కాపాడుకోవడానికి ఎక్కువ పోరాటం చేయడం లేదు. ఈ సమయంలో కేపీసీసీ చీఫ్గా డీకే శివకుమార్ పోరును తీవ్రం చేశారు. వరుసగా సన్నిహితులకు ఉద్వాసన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారని చర్యలు డీకే శివ వర్గంలో హుషారు సీఎం మౌనంపై కుతూహలం మునుముందు తీవ్రతరం? భవిష్యత్తులో మరింత మంది సిద్ధరామయ్య వర్గీయులకు ఎదురు దెబ్బలు తగిలినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. నోటీసులు, క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు కాకుండా నేరుగా పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని తెలుస్తోంది. తాను ముఖ్యమైన పదవిలో ఉండడంతో పాటు పార్టీ పరిమితుల దృష్ట్యా సిద్ధరామయ్య మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తన పదవిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు పలువురు సీనియర్లు పేర్కొన్నారు. త్వరలో బెంగళూరుకు ఓ చెందిన ఓ మంత్రిని కూడా పార్టీ హైకమాండ్ తప్పించవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. మునుముందు ఏం జరుగుతుందనేది సస్పెన్స్గా ఉంది. బెంగళూరు విమానాశ్రయంతో ప్రధాని మోదీ, సిద్దరామయ్య చెవిలో మంతనాలు జరపడం దేనికి సంకేతమని తీవ్ర చర్చనీయాంశమైంది. -
శిక్ష ఖరారు నేటికి వాయిదా
ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి బనశంకరి: బీజేపీ నేత యోగేశ్గౌడ హత్యకేసులో ధార్వాడ గ్రామీణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి తో పాటు 17 మందికి శిక్షను ఖరారు చేయడంపై గురువారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. ధార్వాడ జిల్లా జడ్పీ సభ్యుడు యోగేశ్గౌడ హత్యకేసులో 17 మందిని దోషులుగా బుధవారం జడ్జి సంతోష్ గజానన భట్ తీర్పు ఇచ్చారు. గురువారం శిక్ష ఖరారు చేస్తామని ప్రకటించారు. సీబీఐ వాదన ఇలా.. శిక్షలపై వాదనలు మొదలు కాగా, సీబీఐ న్యాయవాది ఎస్వీ రాజు వాదిస్తూ ఎమ్మెల్యే వినయ్కు జీవిత ఖైదును విధించాలన్నారు. రాజకీయ కారణంతో యోగేశ్గౌడ ను హత్య చేశారని, కేసును తారుమారు చేయాలని చూశారన్నారు. అతనికి ఉరిశిక్ష విధించాలని కోరడం లేదు, యావజ్జీవ శిక్ష విధించాలని అభ్యర్థిస్తున్నట్లు ఎస్వీ.రాజు వాదించారు. పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు.. నిందితుల న్యాయవాది ఎంఎస్.శ్యామ్సుందర్ వాదిస్తూ.. నిందితులకు చిన్నపిల్లలు, వయసైన తల్లిదండ్రులు ఉన్నారని, యావజ్జీవ శిక్ష విధించాలనడం సబబు కాదన్నారు. వినయ్ కులకర్ణి మంచి వ్యక్తి అని, 3 వేలకు పైగా పశువులు, గేదేలను పోషిస్తున్నారని, తక్కువ శిక్ష విధించాలని విన్నవించారు. నేరస్తులకు జీవించే హక్కు న్యాయమూర్తి చేతిలో ఉందని అన్నారు. ఉభయుల వాదనలను ఆలకించిన న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ శిక్షను శుక్రవారం ఖరారు చేస్తామని ప్రకటించి వాయిదా వేశారు. -
ఉప కమిషనర్పై చర్యకు వినతి
రాయచూరు రూరల్: నగరసభ ఉప కమిషనర్ సంతోష్రాణిపై చర్యలు చేపట్టాలని కర్ణాటక రక్షణ వేదిక డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు ఖలీల్ పాషా మాట్లాడారు. నగరసభలో జనన మరణ ప్రమాణ పత్రాలను ఇచ్చే విషయంలో లంచాలు తీసుకుని ప్రమాణ పత్రాలు ఇవ్వాలని అధికారిణి సంతోష్రాణి సిబ్బందికి మౌఖికంగా ఆదేశించారని ఆరోపించారు. అలాంటి అధికారిణి, సిబ్బందిపై చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసిన వినతిపత్రాన్ని స్థానికాధికారికి సమర్పించారు. ఆందోళనలో రాచయ్య, సుదర్శన్రెడ్డి, ఈరణ్ణ, పాండురంగ, గురు, ఆనంద్, మన్నార్, ఫారూక్, మౌలా, బాబు, అబ్దుల్, ఫకృద్దీన్లున్నారు. -
ఉత్తర కర్ణాటకలో భానుడు భగభగ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో వేసవి ఎండల వేడిమి క్రమంగా అధికం అవుతోంది. కళ్యాణ కర్ణాటకలో యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అంగళ్లను బంద్ చేసుకొని కొందరు యజమానులు ఇళ్లలో సేద తీరుతున్నారు. రాయచూరులో మంగళవారం 43.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని జిల్లాధికారి నితీష్ తెలిపారు. కలబుర్గిలో 43.5, బీదర్లో 43.4, విజయపుర, బెళగావి, కొప్పళ, గదగ్లో 43, యాదగిరి, బాగల్కోటెల్లో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తొమ్మిది జిల్లాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో విలవిల్లాడుతున్న ప్రజలు -
అభివృద్ధి పనులకు భూమిపూజ
బళ్లారిఅర్బన్: నగర అభివృద్ధిలో వేగం పెంచే దిశగా పలు అభివృద్ధి పనులకు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి గురువారం భూమిపూజ నిర్వహించారు. నగరంలోని 39వ వార్డు నేతాజీ నగర్లోని గణేష్ ఆలయం సమీపంలో రూ.80.63 లక్షల వ్యయంతో అంతర్గత డ్రైనేజీ మరమ్మతు పనులకు భూమిపూజ చేశారు. మహర్షి వాల్మీకి సర్కిల్ సమీపంలో ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల ద్వారా నిర్మించిన దుకాణాలను వీధి వ్యాపారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారుల పేర్లతో కూడిన చీటీలను లక్కీ డ్రా తీయడం ద్వారా పారదర్శకంగా వాటిని కేటాయించారు. పీ.జగన్, మారెణ్ణ, ఎరుకుల స్వామి, మల్లికార్జున స్వామి, సోమశేఖర్, సిద్దేశ్, సుబ్బరాయుడు, నరేంద్ర హాజరయ్యారు. 36వ వార్డు హవంబావి కాలువ వద్ద సుమారు రూ.2 కోట్ల వ్యయంతో రోడ్డు అభివృద్ధి, వర్షపు నీటి కాలువ, అంతర్గత డ్రైనేజీ పనులకు, అదే ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.16.5 లక్షలతో తరగతి గది నిర్మాణానికి భూమిపూజ చేశారు. టీఎంజీ లోకేష్, గంగప్ప, గంగాధర్, సోము, పాఠశాల హెచ్ఎం పాల్గొన్నారు. గడిగి చెన్నప్ప(రాయల్) సర్కిల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా ఎమ్మెల్యే సందర్శించి అధికారులు, ట్రాఫిక్ పోలీసులకు తగిన సూచనలిచ్చారు. ట్రాఫిక్ రద్దీని అరికట్టాలని ఆదేశించారు. గుగ్గరహట్టి వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్డు వంతెన పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. -
రెండో రోజూ ఆక్రమణల తొలగింపు
సాక్షి బళ్లారి: నగరంలో ప్రభుత్వ స్థలాలు, పుట్పాత్ల్లో మహానగర పాలికె చేపట్టిన ఆక్రమణల తొలగింపు కొనసాగింది. రాయల్ సర్కిల్ నుంచి బెంగళూరు రోడ్డులో ఏపీఎంసీ వరకు పుట్పాత్లో రోడ్డుకు ఇరు వైపుల బుధవారం ప్రారంభమైన ఆయా షాపుల, హోటళ్ల యజమానులు, చిరు వ్యాపారుల ఆక్రమణలను తొలగించే కార్యాచరణ గురువారం రెండో రోజు కూడా జేసీబీలు, ట్రాక్టర్లతో కొనసాగించారు. సిటీ కార్పొరేషన్ కమిషనర్, జోనల్ అధికారులు పోలీసుల సంయుక్త కార్యాచరణలో ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలను తొలగించాలని ఇటీవల పాలికె సమావేశంలో తీర్మానించడంతో మహానగర పాలికె పరిధిలోని పలు ప్రాంతాల్లో కబ్జా చేసిన స్థలాల్లో కార్పొరేషన్ అధికారులు, పోలీసులు పెద్ద సంఖ్యలో చేరి ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ముందుగా హవంబావిలో నకిలీ రికార్డులతో స్వాధీనం చేసుకొన్న స్థలాల్లో ఆక్రమణలను అధికారులు తొలగించారు. పుట్పాత్, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై పాలికె అధికారుల కొరడా -
శరవేగంగా డ్యాం గేట్ల పనులు
హొసపేటె: తుంగభద్ర డ్యాంను గురువారం తుంగభద్ర మండలి రిటైర్డ్ చైర్మన్ రంగారెడ్డి, ఎస్ఈ రమణ సందర్శించారు. డ్యాం వద్ద బిగిస్తున్న కొత్త క్రస్ట్గేట్ల పనులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. వేగంగా, నాణ్యతగా క్రస్ట్గేట్ల బిగింపు పనులను చేపడుతున్న తీరును చూసి అధికారులను అభినందించారు. ఇప్పటికే డ్యాంకు మొత్తం 28 కొత్త క్రస్ట్గేట్లను బిగించడం పూర్తయినట్లు అధికారులు వారి దృష్టికి తెచ్చారు. మిగతా ఐదు గేట్లను కూడా త్వరగా బిగించేందుకు పనులు వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టరుకు సూచించారు. అదే విధంగా డ్యాం వద్ద గేట్ల బిగింపు, నిర్మాణ పనుల ప్రగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలి కార్యదర్శి ఓఆర్కే రెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్, ఎగ్జిక్యూటర్ ఇంజనీర్ చంద్రశేఖర్, డ్యాం సెక్షన్ అధికారి జ్ఞానేశ్వర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తుంగభద్ర డ్యాంను సందర్శించిన బోర్డు రిటైర్డ్ చైర్మన్ రంగారెడ్డి ఇప్పటికే 28 కొత్త క్రస్ట్గేట్ల అమరిక పనులు పూర్తయినట్లు వెల్లడి -
కనీస వేతనం అమలు చేయాలి
కోలారు: కనీస వేతనంతో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం జెడ్పీ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కనీస వేతనాలను అందించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు సెకండరీ గ్రేడ్ గుమాస్తాలను నియమించి, పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ పరిహారాన్ని 90 రోజులకు పెంచాలని కోరారు. ఆదాయానికి అనుగుణంగా పన్ను వసూళ్లకు సిబ్బందిని నియమించాలని సూచించారు. ఐదేళ్ల పాటు వరుసగా సేవలు అందించిన వారికి బిల్ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇవ్వాలన్నారు. అనంతరం జెడ్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు గాంధీనగర నారాయణ స్వామి, అధ్యక్షుడు అమర నారాయణ, కార్యదర్శి శివకుమార్, సమన్వయ కార్యదర్శి విజయకృష్ణ, వివిధ తాలూకాల పదాధికారులు పాల్గొన్నారు. -
నేరాల నివారణకు సహకరించుకుందాం
రాయచూరు రూరల్: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో అక్రమాలు, నేరాల నివారణకు మూడు జిల్లాల పోలీస్ యంత్రాంగం పరస్పరం సహకరించుకోవాలని జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం శక్తినగర్లోని కార్యాలయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, సీహెచ్ పౌడర్, గంజాయి, హఫీం ఇతర మత్తు పదార్థాలు కర్ణాటకకు సరఫరా అవుతున్నాయని, వాటిని కట్టడి చేయడానికి సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నేర పరిశోధనలపై నిఘా ఉంచాలన్నారు. -
భల్లూకం దాడిలో రైతుకు తీవ్ర గాయాలు
హొసపేటె: తన పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన గురువారం కమలాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విజయనగర జిల్లా బుక్కసాగర గ్రామం దాటిన తర్వాత ఆనెగుంది వంతెన సమీపంలో జరిగిన ఈ దాడిలో రైతు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలుగుబంటి దాడికి గురైన రైతును రాజశేఖర్గౌడ (50)గా గుర్తించారు. ఎప్పటిలానే తన పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా పొదల్లో దాగి ఉన్న ఒక ఎలుగుబంటి రైతుపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో అతని కుడి చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రైతును చికిత్స నిమిత్తం హొసపేటె తాలూకా ఆస్పత్రిలో చేర్పించారు. దొంగ పట్టివేత హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని కానాహొసహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మంగాపుర గ్రామంలో గత సంవత్సరం నవంబర్ 13న ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో గురువారం నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మంగాపుర గ్రామానికి చెందిన పీ.నజీర్ షఫీ అని గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.1.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్, డీఎస్పీ మల్లేష్ దొడ్డమని అభినందించారు. అక్రమ రేషన్ బియ్యం పట్టివేత హొసపేటె: హొసపేటె నగర శివార్లలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం నిల్వపై పోలీసులు దాడి చేసి, స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం జరిగింది. నగరంలోని సండూరు రోడ్డులో ఉన్న ఎల్ఎఫ్ఎస్ పాఠశాల పక్కన ఉన్న బహిరంగ స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి, తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హొసపేటె ఆహార తనిఖీ అధికారులు, ఎక్స్టెన్షన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది దాడి చేశారు. అక్కడ నాలుగు చక్రాల సరుకు రవాణా వాహనంలో నిల్వ ఉంచిన 36 బస్తాల నుంచి 1,368 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం విలువ రూ.30,944 ఉంటుందని అంచనా వేశారు. బియ్యం రవాణా కోసం వాడిన వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎక్స్టెన్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సర్కిళ్ల వద్ద నిలువ నీడ కల్పించరూ రాయచూరు రూరల్: రాయచూరులో రోజురోజుకు ఉష్ణోగ్రతలు అధికం అవుతుండడంతో ప్రజలకు నిలువ నీడ కోసం పచ్చని పరదాల రక్షణ కల్పించాలని ఏఐడీవైఓ డిమాండ్ చేసింది. గురువారం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడారు. బసవేశ్వర గంజ్, అంబేడ్కర్ సర్కిల్, రైల్వే స్టేషన్, ఆర్టీఓ సర్కిల్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద 180 సెకండ్ల పాటు వాహనదారులు ఎండలో నిలబడడం కష్టకరమని, ఆ ప్రాంతాల్లో నిలువ నీడకు రక్షణ కవచాలను ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. -
ఎక్మో యంత్రంతో గుండెకు భరోసా
రాయచూరు రూరల్: నేడు ప్రతి ఒక్కరినీ బాధిస్తున్న వ్యాధి గుండెపోటు అని, ఎక్మో యంత్రం మానవుడి గుండెపోటు వ్యాధిని అరికడుతుందని హైదరాబాద్ యశోద ఆస్పత్రి ప్రత్యేక వైద్యుడు భరత్ విజయ్ పురోహిత్ వెల్లడించారు. గురువారం వీజీకే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండె పోటు వచ్చిన వెంటనే వ్యాధి నియంత్రణలోకి తేవడానికి నూతనంగా ఎక్మో యంత్రం సహాయంతో బతికించుకోడానికి వీలుంటుందన్నారు. గత మూడేళ్ల నుంచి వేలాది మందికి ఎక్మో యంత్రం ద్వారా ప్రాణం పోశామన్నారు. ఎక్మో యంత్రం(ఆర్టీఫిషియల్) సహాయంతో ప్రాణాలను రక్షించామనే సంతృప్తి తమకు ఉందన్నారు. యంత్రానికి రూ.3 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. కళ్యాణ కర్ణాటక భాగంలో గుండెపోటు వ్యాధి అధికంగా వస్తుండడంతో ప్రజలకు వివరించడానికి ఎక్మో యంత్రం సహాయ పడుతుందన్నారు. ప్రపంచంలో 20 కేంద్రాల్లో హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి మాత్రమే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లు అజిత్, వెంకటేశ్వరన్ కోల్లాలున్నారు. -
ఇద్దరు డ్రగ్స్ వాడకందారుల అరెస్ట్
బళ్లారిఅర్బన్: మాదవ ద్రవ్యాల వినియోగంపై కట్టడి చర్యల్లో భాగంగా బళ్లారిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సుమన డీ.పన్నేకర్ తెలిపారు. గత నెల 27 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రతి రోజు సాయంత్రం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు డ్రగ్స్ సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక గస్తీ నిర్వహించామన్నారు. ఈ చర్యల్లో భాగంగా మొత్తం 766 మందిని తనిఖీ చేసి వారిలో 63 మందిని వైద్య పరీక్షలకు పంపించామన్నారు. పరీక్షల్లో ఇద్దరు మాదవద్రవ్యాలు సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మిగిలిన 762 మందిపై అనుమానాస్పదంగా సంచరించినందుకు కర్ణాటక పోలీస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నారీ శక్తి వందన్ బిల్లుపై ప్రచార జాతా రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ లోక్సభలో నారీ శక్తి వందన్ బిల్లుకు ఆమోదం తెలపడంపై బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రచార జాతాను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి సుగుణ వెల్లడించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేస్తున్న నారీ శక్తి వందన్ బిల్లును పాస్ చేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా అభియాన్ ర్యాలీ చేపట్టామన్నారు. ఈ సందర్భంగా సుమా, అశ్విని, ఆదిలక్ష్మిలున్నారు. రిటైరైన అటెండర్కు ఘనసన్మానంరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ప్రతి ఒక్కరూ పదవీ విరమణ చేయడం సహజం. అటెండర్ పదవీ విరమణ చేయడంతో ఉన్నత హోదాలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ సన్మానించిన ఘటన గంగావతిలో జరిగింది. బుధవారం సాయంత్రం కనకగిరి తాలూకా పంచాయతీ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న రహీం సాబ్ పదవీ విరమణ చేశారు. వీడ్కోలు కార్యక్రమానికి విచ్చేసిన మైసూరు జిల్లా హుణసూరు అసిస్టెంట్ కమిషనర్ కావ్యరాణి ఆయనను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కుమారునికి సన్మానం హొసపేటె: నగరంలోని 20వ వార్డులో ఆధునిక వసతులలో నిర్మించిన సరికొత్త డూప్లెక్స్ తరహా అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే గవియప్ప కుమారుడు, సామాజిక కార్యకర్త హెచ్జీ విరుపాక్ష గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల సమగ్ర వికాసంలో ఇలాంటి అత్యాధునిక వసతులు కలిగిన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సత్పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. నగరంలో ఏర్పాటైన రెండో డూప్లెక్స్ తరహా అంగన్వాడీ కేంద్రం స్థానికుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. వార్డు కౌన్సిలర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. గురువారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. నేడు అన్ని విధాలైన వస్తువుల ధరలు మార్కెట్లో అధికం కావడంతో వేతనాలను పెంచాలన్నారు. పంచాయతీ వలయంలో విధులు నిర్వహించే కార్మికులకు నెలకు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనాలను సర్కార్ చెల్లించాలని, 20 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న వారికి పదోన్నతి కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. -
మినీ బస్సు, ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి
సాక్షి బళ్లారి: జిల్లాలోని కురుగోడు పట్టణ శివార్లలోని యల్లాపుర క్రాస్ వద్ద మినీ బస్సు, ట్రాక్టర్ ముఖాముఖి ఢీకొనడంతో ఒక వృద్ధురాలు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొప్పళ జిల్లా చళ్లారి గ్రామానికి చెందిన వారు మినీ బస్సులో గురువారం కురుగోడు తాలూకాలో వెలసిన తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుండగా యల్లాపుర క్రాస్ సమీపంలో పేడ ఎరువును పొలానికి తరలిస్తున్న ట్రాక్టర్ను మినీ బస్సు ఢీకొంది. దీంతో ఘటన స్థలంలోనే రత్నమ్మ(70) అనే మహిళ మృతి చెందగా, మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కురుగోడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మినీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కురుగోడు పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. ఐదుగురికి గాయాలు కురుగోడు వద్ద ఘటన -
లవ్ జిహాద్ కేసులో మరో మలుపు
హొసపేటె: ముస్తఫా ఖాద్రిపై ఉన్న లవ్ జిహాద్ కేసుకు సంబంధించి కొప్పళ జిల్లాలో మరో సంచలనాత్మక సమాచారం బయటకు వచ్చింది. ఇది అక్కడ పెను వివాదానికి కారణమైంది. నిందితుడు ముస్తఫాకు గోవా, ముంబైల్లోని మట్కా బుకీలతో సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నాడని అనుమానిస్తున్నారు. ఈ విషయమై విశ్వ హిందూ పరిషత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొప్పళ తాలూకాలోని కంప్లి గ్రామానికి చెందిన ముస్తఫా ఖాద్రికి గోవా, ముంబైల్లోని పలుకుబడి గల మట్కా బుకీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. వారి నుంచి అందిన డబ్బుతో అతను అమాయక అమ్మాయిలను ఆకర్షించి, సరదాగా గడుపుతున్నాడని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కేసు నేపథ్యం ఏంటి? కొప్పళలో ముస్తఫా ఖాద్రి అనే వ్యక్తి తాను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ హిందూ అమ్మాయిలను మోసం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అతని మొబైల్ ఫోన్లో పలువురు అమ్మాయిలతో ఉన్న అశ్లీల వీడియోలు, ఫోటోలు లభ్యమయ్యాయి. ఈ వీడియోలను తన వద్ద ఉంచుకుని అతను అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తెలిసింది. ఈ విషయం వెలుగులోకి రాగానే విశ్వ హిందూ పరిషత్, హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్తఫా తనపై లైంగిక దాడి చేశాడని ఒక యువ బాధితురాలు ధైర్యం చేసి ఫిర్యాదు చేసింది. తన మొబైల్లో అశ్లీల వీడియోలు పంపినట్లు అనుమానిస్తున్న నిందితుడు ఆ వీడియోలను మరెవరికై నా షేర్ చేశాడా? లేదా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మట్కా బుకీల డబ్బు లావాదేవీలకు, అమ్మాయిల వీడియోలకు మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. నిందితుడికి అంతర్రాష్ట్ర మట్కా బుకీలతో సంబంధాలు హవాలా మార్గంలో అందిన డబ్బుతో ముస్తఫా విలాసవంతమైన జీవితం -
జిల్లా ఆస్పత్రిలో ప్రాణులకూ రక్త పరీక్ష
కోలారు: నగరంలోని ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రిలో పశువులకు, ప్రాణులకు రక్త పరీక్షలను నిర్వహిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కుక్కలు, పిల్లులతో పాటు వివిధ జంతువులకు రక్త పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. జిల్లా ఆస్పత్రి ల్యాబొరేటరీ జాతీయ ఆరోగ్య అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగి బీ.రాఘవేంద్రపై ఆస్పత్రి ఇతర సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పెంపుడు జంతువులు, పశువులను పెంచుతున్న వారి ఇళ్లకు వెళుతున్న రాఘవేంద్ర ప్రాణుల రక్త నమూనాలను సేకరించి ఆస్పత్రి ల్యాబొరేటరీలో పరీక్షలను నిర్వహిస్తున్నారని ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జనవరి 22న ఆస్పత్రి సిబ్బంది సర్జన్ డాక్టర్ జగదీష్కు ఫిర్యాదు చేశారు. ప్రాణుల రక్త పరీక్షలను నిర్వహిస్తుండడం వల్ల ల్యాబొరేటరీలో యంత్రోపకరణాల నిర్వహణ కూడా సరిగా లేదని, స్వచ్ఛతను కాపాడడం లేదని యంత్రాల నిర్వహణ బాధ్యతలను చూస్తున్న సంస్థ కూడా నివేదికను అందించింది. దీంతో ఈ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య అధికారి శ్రీనివాస్ జెడ్పీ సీఈఓకు మార్చి 25న సిఫార్సు చేసినట్లు సర్జన్ జగదీష్ తెలిపారు. వేటుకు పైఅధికారులకు సిఫార్సు విధి నిర్వహణలో లోపానికి పాల్పడిన రాఘవేంద్ర ఎన్హెచ్ఎం కాంట్రాక్టు ఉద్యోగి కావడం వల్ల తాను చర్యలు తీసుకోలేనని, అందుకే ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఉద్యోగి రాఘవేంద్ర ప్రాణుల రక్తపరీక్షలను ఇక్కడ ఎందుకు చేస్తున్నారనే విషయం పరిశీలనలో తెలియాల్సి ఉందన్నారు. జిల్లా పశు సంవర్ధక శాఖలో పశువుల కోసం ప్రత్యేక ల్యాబోరేటరీ ఉంది. జిల్లా పాలి క్లినిక్ కూడా ఉంది. అక్కడ ఫీజులు చెల్లించి పరీక్షలను చేయించుకోవాలి. అయితే జిల్లా ఆస్పత్రి ల్యాబొరేటరి ఉద్యోగి రాఘవేంద్ర ఇళ్ల వద్దకే వెళ్లి ప్రాణుల రక్త నమూనాలు సేకరించి తక్కువ ఖర్చుతో పరీక్షలు నిర్వహించేవాడని తెలిసింది. మనుషుల రక్త పరీక్షలను నిర్వహించే ల్యాబొరేటరీలో కొన్ని ప్రాణుల రక్త పరీక్షలను కూడా నిర్వహించవచ్చని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రిలో పలువురు రోగులకు రక్త పరీక్షలు చేయడానికి బయటకు చీటీలు రాసిస్తున్నారు. అయితే ప్రాణులు, పక్షులకు ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది ఆస్పత్రిలోని అవ్యవస్థకు అద్దం పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఘటనపై జిల్లాధికారి మండిపాటు ఎస్ఎన్ఆర్ ఆస్పత్రి ఘటన విషయం తెలియగానే జిల్లాధికారి ఎంఆర్ రవి సీరియస్ అయ్యారు. ల్యాబొరేటరి కాంట్రాక్టు ఉద్యోగి రాఘవేంద్రను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్కు సూచించారు. జిల్లాధికారి ఆదేశాలతో ఆరోగ్య అధికారి కాంట్రాక్టు ఉద్యోగి రాఘవేంద్రను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు చేశారు. ల్యాబ్లో పరీక్షలపై సిబ్బంది ఫిర్యాదు శుభ్రతాలోపంపై సంస్థ నివేదిక సమర్పణ -
సర్ను నిరసిస్తూ లేఖల ఉద్యమం
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నా ఓటు నా హక్కు ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్–సర్)ను తిరస్కరించాలని ఏఐసీసీటీయూ డిమాండ్ చేసింది. బుధవారం రాయచూరులోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సంఘం అధ్యక్షుడు అజీజ్ మాట్లాడారు. ప్రత్యేకంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంలో కర్ణాటకలో జరుగుతున్న జనాభా గణన సర్వేను పారదర్శకంగా చేయాలన్నారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షలాది మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని గుర్తు చేశారు. సర్ ద్వారా బిహార్లో 65 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 91 లక్షలు, తమిళనాడులో 74 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించారని ఆరోపించారు. కర్ణాటకలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మహిళలు, వలస వెళ్లిన వారు, నిరాశ్రితులు, మైనార్టీలు, బుడగ సముదాయాలను ఓటర్ల జాబితా నుంచి దూరంగా ఉంచడానికి సర్ను అమలులో పెట్టిందని, దానిని తిరస్కరించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖల ద్వారా వినతిపత్రాలను పోస్టు చేశారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయరూ.!రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 62,420 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి వేదిక డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో వేదిక సంచాలకురాలు విద్యా పాటిల్ మాట్లాడారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, గ్రంథాలయం, క్రీడా మైదానం, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడో తరగతి చదివే వరకు అక్కడే పాఠశాలలు అందుబాటులో ఉండాలన్నారు. కేపీఎస్, మ్యాగ్నెట్ పాఠశాల గుర్తింపును నిలిపి వేయాలని, ఆర్టీఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసిన వినతిపత్రాన్ని అదనపు జిల్లాధికారి శివానందకు సమర్పించారు. నారీ శక్తి వందన్ బిల్లుకు ఆమోదంపై అభియాన్ రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్సభలో నారీ శక్తి వందన్ బిల్లుకు ఆమోదం తెలపడంపై బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అభియాన్ చేపట్టారు. బుధవారం నందీశ్వర ఆలయం వద్ద నుంచి చేపట్టిన ర్యాలీని జిల్లా సంచాలకురాలు శరణమ్మ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నారీ శక్తి వందన్ బిల్లు పాస్ కావడంతో అభియాన్ ర్యాలీ చేపట్టామన్నారు. ఈ సందర్భంగా సుమ, వాణి, సులోచన, సంగీత, సుమతీ శాస్త్రిలున్నారు. బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత అంబేడ్కర్రాయచూరు రూరల్: బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని వారి అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తి అంబేడ్కర్ అని ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రసాద్ బసవరాజ్ పేర్కొన్నారు. ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బుద్దిస్ట్ సంఘం ఆధ్వర్యంలో 135వ అంబేడ్కర్ జయంతిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధే లక్ష్యంగా పని చేశారన్నారు. దేశ రక్షణ రంగం నుంచి ఆర్థిక రంగం వరకు పురోభివృద్ధి సాధించిందన్నారు. సమావేశంలో చిరంజీవి, తిమ్మప్ప, జిల్లాధ్యక్షుడు నారాయణ, రాఘవేంద్ర ఘంటా, శ్రీనివాస్, నరసింహులు, గోవిందమ్మ, నాగవేణి, గోవిందరాజు, ప్రశాంత్, మహేష్బాబు తదితరులున్నారు. వ్యక్తి ఆత్మహత్య కోలారు: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముళబాగిలు తాలూకా అరహళ్లిలో జరిగింది. అరహళ్లి గ్రామానికి చెందిన మహేష్ (42) కుటుంబ కలహాల వల్ల గ్రామ సమీపంలో ని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముళబాగిలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
భార్యను చంపి, భర్త ఆత్మహత్య
కెలమంగలం: ఉద్దనపల్లి సమీపంలో విషాద సంఘటన జరిగింది. భార్యను హత్య చేసిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. వివరాలు... తిరుపత్తూరుకు చెందిన సురేష్ (31), ఉద్దనపల్లి సమీపంలోని దొడ్డమెట్రెవాసి కావ్య (25)తో ఐదేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఈ దంపతులకు కూతురుంది. భార్యాభర్తలిరువురూ దొడ్డమెట్రిలో అక్కడే వేర్వేరు పరిశ్రమల్లో పనిచేసేవారు. అయితే తరచుగా గొడవలు పడేవారు. మంగళవారం రాత్రి కూడా కొట్లాట జరిగింది, సురేష్ కత్తితో భార్యను హత్య చేసి, ఆపై ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. బుధవారం ఉదయం సురేష్ ఇంటికెళ్లిన బంధువులకు ఇరువురూ శవాలుగా కనిపించడంతో ఉద్దనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. తల్లిదండ్రుల మృతితో పాప అనాథగా మారింది. ఈ దుర్ఘటన గ్రామంలో తీవ్ర విషాదం మిగిల్చింది. భర్త సురేష్ (ఫైల్) భార్య కావ్య (ఫైల్) క్రిష్ణగిరి జిల్లాలో విషాదం -
ఫుట్పాత్ ఆక్రమణలపై కొరడా
సాక్షి బళ్లారి: నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తోడు వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. ముఖ్యంగా బెంగళూరు రోడ్డు అంటేనే ట్రాఫిక్తో రోడ్డు నిండిపోయేది. నిత్యం వేలాది వాహనాలు, జనం తిరిగే రోడ్డులో ఫుట్పాత్ ఆక్రమణలు కూడా పెరిగిపోయాయి. బెంగళూరు రోడ్డులో రాయల్ సర్కిల్ నుంచి నటరాజ్ థియేటర్ ఎదుట అటు వైపు ఇటు మీనాక్షి సర్కిల్, బ్రూస్పేట్ రోడ్డు, ఏపీఎంసీ వరకు ఫుట్పాత్లపై చిరు వ్యాపారుల అంగళ్లు, హోటళ్లు విచ్చలవిడిగా వెలిశాయి. ఈనేపథ్యంలో ట్రాఫిక్ సమస్య నివారణకు, ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపునకు బుధవారం సిటీ కార్పొరేషన్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నడుం బిగించారు. రాయల్ సర్కిల్ నుంచి ఏపీఎంసీ వరకు ఫుట్పాత్పై ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టారు. సిటీ కార్పొరేషన్ జోనల్ అధికారులు గురురాజ్, శ్రీనాథ్, ట్రాఫిక్ సీఐ, ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించి ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలు తొలగించారు. చిన్న చిన్న హోటళ్లు, అంగళ్లు, తోపుడుబండ్లను యంత్రాలతో, జేసీబీలతో, ట్రాక్టర్లతో, మనుషులతో ఖాళీ చేయించారు. రాయల్ సర్కిల్ నుంచి ఏపీఎంసీ వరకు పెద్ద ఎత్తున ఆక్రమణలు చేసుకొన్న నేపథ్యంలో సగానికి పైగా తొలగించామని, పూర్తి స్థాయిలో ఆక్రమణలన్నింటిని తొలగించి పాదచారులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు, పాదచారుల నుంచి పలు మార్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు ఫుట్పాత్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంతో నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆక్రమణల తొలగింపు చర్యలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని సిటీ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. రాయల్ సర్కిల్ నుంచి ఏపీఎంసీ వరకు తొలగింపు నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు పకడ్బందీ చర్యలు కార్పొరేషన్ అధికారులు, పోలీసుల సంయుక్త కార్యాచరణ -
33 శాతం రిజర్వేషన్లతో మహిళా శక్తి వృద్ధి
బళ్లారిటౌన్: రానున్న 2029 లోక్సభ ఎన్నికల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల చట్టసభల్లో మహిళా శక్తి మరింత పెంపొందనుందని ఎమ్మెల్సీ హేమలతా నాయక్ పేర్కొన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘనత అని పేర్కొన్నారు. ఇది మహిళలను ఎంతో ఉత్తేజ పరిచిందన్నారు. నేటి నుంచి పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలను ఇందు కోసమే ఏర్పాటు చేశారని, ఇది అమలు కావడం ఖాయమన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టంపై లోక్సభ, రాజ్యసభ సమావేశాల్లో అనేక సార్లు చర్చలు జరిపినప్పటికీ అమలు కాలేదన్నారు. ప్రస్తుతం పార్లమెంట్, అసెంబ్లీల్లో రిజర్వేషన్ల శాతం పెంచితే ఎంతో మంది రాజకీయాల్లో కష్టపడిన మహిళలకు అవకాశాలు లభిస్తాయన్నారు. ఇంతకు ముందు పార్లమెంట్లో 4 శాతం మాత్రమే మహిళలు ఉండేవారన్నారు. 2019లో 15 శాతానికి పెరిగిందని, ఇక రానున్న 2029లో 33 శాతానికి పెరిగితే మహిళలకు మరింత శక్తి పెరగనుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారావధిలో డ్రోన్ డీబీ, ముద్రా లోన్ వంటి అనేక పథకాల వల్ల ఎంతో మంది మహిళలు అభివృద్ధి చెందారన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. పార్టీ మహిళా నాయకురాలు సుధా విజయలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు హంపీ రమణ, ప్రముఖులు అరుణ కామినేని, విజయ లక్ష్మి, రేణుకా, అలివేలు, సుగుణ, సాధన హిరేమఠ తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక(క–క)లోని రాయచూరు, కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై అధికారులు, ప్రజా ప్రతినిధులు నోరు మెదపడం లేదు. జిల్లాలో తుంగభద్ర, కృష్ణ నదీ తీరాల్లో ఉన్న గ్రామాల్లో రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లాలోని మాన్వి, రాయచూరు, దేవదుర్గ, యాదగిరి జిల్లా సురపురతో పాటు యాదగిరి తాలూకాలో కూడా అక్రమంగా ఇసుక రవాణా నేటికీ సాగుతోంది. జోళదడగి, కరిహళ్లి, పర్వతాపురల్లో కాంట్రాక్టర్లు పీఎల్.కాంబ్లి, పంచాక్షరి, శివప్ప బసప్ప, ఆనంద్ దొడ్డమనిలు స్టాక్ యార్డులకు నది నుంచి ఇసుకను దొంగచాటుగా తరలించి నిల్వ చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని పోరాట సమితి నేతలు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నదిలో గోతులు పడేలా తవ్వకాలు పట్టపగలే నదిలో నుంచి పొక్లెయినర్ల ద్వారా గోతులు పడే విధంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాయల్టీని కొన్ని వాహనాలకు పొంది మిగిలిన వాహనాలకు లేకుండా వందల కొద్ది టన్నుల ఇసుకను రవాణా చేస్తున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు నేరుగా ఇసుకను తరలిస్తుండటంతో రూ.కోట్లాది మేర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కోత పడుతోంది. ఈ విషయంలో జిల్లాధికారి, ఎస్పీ, తహసీల్దార్లు మౌనం వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ సభ్యుల కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంలో కుమ్మక్కు కావడంతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాతో భవిష్యత్తులో నదులు కనుమరుగవుతాయనే భయాందోళన ప్రజల్లో ఉంది. పోలీస్ సిబ్బందిపై మాఫియా దాడి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీస్ కానిస్టేబుల్పై దాడి జరిగిన ఘటన మాన్వి తాలూకాలో జరిగింది. ఇటీవల చీకలపర్వి వద్ద నుంచి తుంగభద్ర నదీ తీరంలో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా అడ్డుకోబోయిన పోలీస్ కానిస్టేబుల్పై ఇసుక మాఫియా దాడి చేసింది. ఈనేపథ్యంలో హైదరాబాద్ కర్ణాటక పోరాట సమితి నేత రాఘవేంద్ర కుష్టిగి సభ్యులతో కలిసి ఇటీవల వివిధ చోట్ల అక్రమ ఇసుక నిల్వలను పరిశీలించారు. ఇసుక నిల్వను పరిశీలిస్తున్న పోరాట సమితి నేతలు ఇసుక రవాణా కోసం నదిలో బారులు తీరిన టిప్పర్లు నోరు మెదపని నేతలు, అధికారులు క.క.లో ఇసుక దందాకు కళ్లెం పడేనా? -
వైభవంగా ద్యావమ్మ దేవి రథోత్సవం
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా జేగరకల్లో కక్కల్ ద్యావమ్మ దేవి రథోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి వందలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. జేగరకల్లో వెలసిన దేవికి ప్రత్యేక పూజలను కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, కృష్ణప్ప నెరవేర్చారు. రథోత్సవంలో మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ్ హవల్దార్, మహదేవ్, రాయచూరు, మాన్వి, సింధనూరు, కొప్పళ, బళ్లారి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నవలగుందలో గడ్డివాముల దగ్ధంహుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుంద పట్టణంలో పొట్టు, గడ్డి నిల్వ చేసిన వాముకు ఆకస్మికంగా మంటలు తగిలి అపార నష్టం సంభవించింది. పట్టణంలోని మహబూబ్నగర్ కల్లిమఠ వీధి ప్రగతిశీల రైతు మల్లప్పకు చెందిన గడ్డివాములు దగ్ధం అయ్యాయి. ముందుగా వాముల్లో పొగ రావడం గమనించిన స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో పురసభ సిబ్బంది అగ్నిమాపక దళానికి తెలపడంతో వారు తక్షణమే వచ్చి మంటలను ఆర్పారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కోనరెడ్డి అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి నష్టపోయిన రైతన్నను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ సుధీర్, పురసభ ముఖ్యాధికారి శరణప్ప పూజార్ పాల్గొన్నారు. ధార్వాడలో రెచ్చిపోయిన ఆకతాయిలుహుబ్లీ: ఇంటిపై రాళ్లు రువ్వడమే కాకుండా ఇంటి ముందు నిలిపిన బైక్లకు నిప్పుపెట్టిన ఘటన ధార్వాడలోని మహబూబ్ నగర్లో చోటు చేసుకుంది. దుండగుల ఈ అకృత్యానికి రెండు బైక్లు పూర్తిగా దగ్ధమై రూ.లక్షలాది మేర నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు ప్రారంభించారు. డీసీఆర్ఈ డీఎస్పీగా బాధ్యతల స్వీకారంహొసపేటె: విజయనగర జిల్లాలోని పౌర హక్కుల అమలు డైరెక్టరేట్ (డీసీఆర్ఈ) పోలీస్ స్టేషన్కు మొదటి డీఎస్పీగా విశ్వనాథ్రావు కులకర్ణి బాధ్యతలు స్వీకరించారు. హొసపేటెలోని కాలేజీ రోడ్డులో పని చేస్తున్న డీసీఆర్ఈ పోలీస్ స్టేషన్లో ఆయన అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. విజయనగర జిల్లాలోని డీసీఆర్ఈ విభాగానికి ఒక అధికారి డీఎస్పీగా నియమితులవడం ఇదే మొదటి సారి. విశ్వనాథ్ రావు కులకర్ణి గతంలో హొసపేటె ఉపవిభాగంలోని హునగుందలో డీఎస్పీగా సేవలందించారు. ఆయనకు ఈ రంగంలో మంచి అనుభవం ఉంది. ఆయన పరిపాలన సామర్థ్యం, శాంతిభద్రతల అమలులో ఉన్న నైపుణ్యం, పౌరహక్కుల పరిరక్షణకు, ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారానికి ఎంతో దోహద పడుతుందని భావిస్తున్నారు. డీసీఆర్ఈ పోలీస్ స్టేషన్ పని తీరును మరింత బలోపేతం చేయడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆయన తగిన చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. పౌష్టికాహార సేవనం తప్పనిసరి రాయచూరు రూరల్: జిల్లాలో గర్భిణులు, బాలింతలు మృతి చెందుతున్న నేపథ్యంలో పౌష్టికాహారం సేవించాలని జిల్లా ఆరోగ్య అధికారిణి నందిత పేర్కొన్నారు. బుధవారం దేవదుర్గ తాలూకా కరిగుడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గర్భిణులు, బాలింతలను పరీక్షించి వారికి సలహాలు ఇచ్చారు. బాలింతల మరణాలు సంభవిస్తున్న తరుణంలో గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని వైద్యులకు, అధికారులకు, ఆశా కార్యకర్తలకు, సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపంపై జీపీ అధికారులకు పలు సూచనలు చేశారు. -
యోగేశ్గౌడ హత్యకేసులో ఎమ్మెల్యే కులకర్ణి దోషి
బనశంకరి: ధార్వాడ జెడ్పీ సభ్యుడు యోగేష్గౌడ హత్య కేసులో సస్పెన్స్ తొలగిపోయింది. 15వ నిందితుడిగా ఉన్న ధార్వాడ గ్రామీణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణితో సహా 17 మందిని దోషులుగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. వీరికి గురువారం శిక్ష ఖరారు కానుంది. అందరినీ కోర్టులో హజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు దోషులందరినీ అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదంతో హత్య యోగేశ్గౌడ, వినయ్కులకర్ణి మధ్య తాలూకా పంచాయతీ పదవిపై గొడవ ఏర్పడింది. భూవివాదం కూడా ఉంది. ఈక్రమంలో 2016 జూన్ 10న యోగేశ్గౌడ హత్యకు గురయ్యాడు. యోగేశ్గౌడ కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ అధికారులు 113 మంది సాక్షులను విచారించి చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల విచారణ పూర్తి చేసి అంతిమ తీర్పు ఈనెల 15 తేదీ ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. ఈమేరకు బుధవారం తీర్పును వెలువరించింది. సీబీఐ ఏం చెప్పింది? యోగేశ్గౌడ హత్యకేసులో ఎమ్మెల్యే వినయ్కులకర్ణికి ప్రధాన పాత్ర ఉందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. 15వ ఆరోపిగా ఉన్న వినయ్ కులకర్ణి ఈ కేసులో 2020, 2025లో జైలుకెళ్లారు. బెయిల్పై విడుదలై 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ధార్వాడలో పోలీసు బందోబస్తు తీర్పు అనంతరం ధార్వాడలో గొడవలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. దార్వాడలోని వినయ్కులకర్ణి నివాసం, ధార్వాడ నగర, గ్రామీణ ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ భద్రత కల్పించారు. ఎమ్మెల్యే పదవికి ముప్పు యోగేశ్గౌడ హత్యకేసులో దోషిగా ఉన్న ఎమ్మెల్యే వినయ్కులకర్ణి ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ఉంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే ప్రజాప్రతినిధుల కోర్టు యాక్ట్ ప్రకారం వినయ్కులకర్ణి తక్షణం ఎమ్మెల్యే పదవి కోల్పోతారు. హైకోర్టుకు వెళ్లి శిక్షపై స్టే తెచ్చుకుంటే మళ్లీ ఎమ్మెల్యే పదవి లభించే అవకాశం ఉంది. ఆయనతో సహా 17 మంది ఖరారు తీర్పు వెలువరించిన బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు నేడు శిక్ష ఖరారు -
తీవ్రమైన దావణగెరె రగడ
● కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అబ్దుల్ తొలగింపు శివాజీనగర: దావణగెరె దక్షిణ అసెంబ్లీ క్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థికి విరుద్ధంగా పని చేశారని ఆరోపణలు వచ్చిన చేసిన ఎమ్మెల్సీ అబ్దుల్ జబ్బార్ను పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్ష పదవి నుంచి తొలగించడం తెలిసిందే. ఇప్పుడే ఏకంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నుంచి తీసేశారు. దీంతో అధికార పార్టీలో దావణగెరె అంశం చాలా సీరియస్గా ఉన్నట్లు తేలింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ ఆదేశాలిచ్చారు. పార్టీలో క్రమశిక్షణ, సమైక్యతను కాపాడడమే ప్రధానమని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? బనశంకరి: ప్రస్తుతం వేరే రేసు గుర్రాలు వచ్చాయి అని ఎమ్మెల్సీ అబ్దుల్ జబ్బార్ అన్నారు. పార్టీ నుంచి తొలగింపు తరువాత బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో తెలియదు, 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నాను, దావణగెరెలో చాలా అసంతృప్తిగా ఉంది అని చెప్పారు. తాము వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆధారాలు ఉంటే చూపాలని, ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం చేస్తున్నారని విమర్శించారు. శామనూరు శివశంకరప్ప తరువాత వారికే ఎందుకు, ఇతరులకూ ఒక అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.మూడేళ్ల తరువాత స్నాచర్ అరెస్టు దొడ్డబళ్లాపురం: మూడేళ్ల క్రితం బంగారు గొలుసును తెంచుకెళ్లిన దొంగ ఎట్టకేలకు కనకపుర పోలీసులకు దొరికాడు. చామరాజనగర తాలూకా గాడిపుర గ్రామం నివాసి ఖలీల్ బాషా చూపా (33) పట్టుబడిన వ్యక్తి. 2023లో నడుచుకుంటూ వెళ్తున్న సరోజమ్మ అనే మహిళ మెడలో నుంచి 60 గ్రాముల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. అప్పటినుంచి నిందితుడు పోలీసులు గాలిస్తున్నా దొరకడం లేదు. చిట్టచివరకు ఆచూకీ తెలుకుని నిందితున్ని అరెస్టు చేసి ఒక కారు, ఒక బైక్, 25 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. -
రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
శివాజీనగర: కేంద్రం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధుల పెండింగ్, మేకెదాటు, మహదాయి ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల మంజూరు, జలజీవన్ మిషన్ పథకంలో పెండింగ్ సొమ్ముల విడుదల, బెంగళూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు, కృష్ణా అప్పర్ ఎగువ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించడం, ఇతరత్రా అత్యవసర నిధుల మంజూరు కోసం ప్రధాని నరేంద్రమోదీకి సీఎం సిద్దరామయ్య విన్నవించారు. బుధవారం ఉదయం ఆదిచుంచనగిరి మఠానికి వెళ్లేందుకు ప్రధాని ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య తదితరులు పూలమాలలు, శాలువాలతో స్వాగతం పలికారు. హైస్పీడ్ రైల్ కారిడార్ ఈ సందర్భంగా ప్రధానికి సీఎం వినతిపత్రాన్ని సమర్పించారు. కోలారు రైల్వే కోచ్ కర్మాగారం పెండింగ్లో ఉందని చెబుతూ, ఆ కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం 123 ఎకరాల భూమిని ఇస్తుందని, వెంటనే పూర్తి చేయాలని కోరారు. బెంగళూరు–మైసూరు మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్ను ఏర్పాటు చేయాలన్నారు. బెంగళూరు సబర్బన్ రైల్వే పథకానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్వాగత వేళలో ప్రధాని మోదీ, సిద్దరామయ్య చెవిలో ఏదో చెప్పడం, సిద్దు అలాగే అన్నట్లు తలాడించడం ఉత్కంఠకు కారణమైంది. ప్రధాని మోదీకి సీఎం సిద్దు వినతిపత్రం విమానాశ్రయంలో ఉభయులూ గుసగుస -
ఉసురు తీసిన యాక్సిడెంట్లు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన ప్రమాదాల్లో పలువురు మరణించారు. రెండు బైక్లను లారీ ఒకేసారి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన సంఘటన కలబుర్గి జిల్లా సేడం పట్టణం సమీపంలో జరిగింది. హలహర్తి గ్రామ నివాసి మహేశ్ (33),సేడం నివాసులు సంజయ్ (28), కాశీనాథ్ (18) రెండు బైక్లమీద కలబుర్గి నుండి సేడం వస్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ వీరి బైక్లను ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడే దుర్మరణం చెందారు. రాజధానిలో ముగ్గురు... యశవంతపుర: బెంగళూరు నగరంలో మూడు వేర్వేరు ప్రమాదాలలో ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. తలఘట్టపుర పోలీసుస్టేషన్ పరిధిలోని నైస్ రోడ్డులో నిలిచి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. యూపీకి చెందిన వలస కూలీ విజయ్ (29) చనిపోగా, మరొకరు గాయపడ్డారు. ● బుధవారం తెల్లవారుజామున చిక్కబాణవార బీఎఐ ఎల్ వంతెన రోడ్డులో కంకర లారీ, మినీ గూడ్స్ను ఢీకొంది. గూడ్స్లోని సాహిల్పాషా (25) మరణించాడు. ● చిక్కజాల మహదేవ కొడిగేహళ్లి రోడ్డులో అనిల్, నేత్ర దంపతులు బైక్లో వెళ్తూ నిర్మాణంలో ఉన్న కాలువలోకి పడిపోయారు. నేత్రా గాయపడగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. చిక్కజాల పోలీసులు కేసు నమోదు చేశారు. 2 బైక్లను లారీ ఢీ, ముగ్గురు మృతిఊరేగింపు మీదకు కారు, బాలిక మృతి యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా బిళేకల్లు గ్రామం వద్ద మంగళవారం రాత్రి అంబేడ్కర్ జయంతి ఊరేగింపులోకి కారు దూసుకెళ్లింది, ఈ ప్రమాదంలో శాన్వి (7) అనే బాలిక చనిపోగా, మరో ఏడుమంది గాయపడ్డారు. నిశ్చిత్, తృప్తి, తిమ్మరాజు, ఉషా, చేతన్, సృష్టి, నాగరాజులు గాయపడ్డారు, మెరుగైన చికిత్స కోసం హాసన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ సుధాకర్ను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
చెట్టును ఢీకొన్న కారు.. సీఐ దుర్మరణం
హొసపేటె: కారు ప్రమాదంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్మరణం చెందారు. విజయనగర, కొప్పళ జిల్లాల్లో డీసీఆర్ఈ యూనిట్ సీఐగా పని చేస్తున్న రఘునాథ్ మృతుడు. బుధవారం విజయనగర, దావణగెరె జిల్లాల సరిహద్దులోని ముస్టూరు– కడబనకట్టె గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆయన ఒక్కరే కారును నడుపుకొంటూ వస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న వేప చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడే మరణించారు. ఆయనను ఇటీవల వెంటనే బెంగళూరులోని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. త్వరలోనే వెళ్లడానికి సిద్ధమవుతుండగా ప్రమాదంలో చనిపోయారు. క్వాంటమ్ రంగంలో కర్ణాటక ముందంజశివాజీనగర: విశ్వ క్వాంటమ్ దినాచరణ నేపథ్యంలో బుధవారం కర్ణాటక రాష్ట్ర సమగ్ర క్వాంటమ్ ఎకో సిస్టమ్ మ్యాప్ను ఆవిష్కరించడం ద్వారా దేశంలో ఇటువంటిది సాధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచిందని చిన్న నీటి పారుదల, సైన్స్, సాంకేతిక పరిజ్ఞాన మంత్రి ఎన్,ఎస్.బోసురాజు తెలిపారు. బెంగళూరు నెహ్రూ ప్లానెటోరియంలో జరిగిన క్వాంటమ్ దినాచరణ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. క్వాంటమ్ సాంకేతిక రంగంలో కర్ణాటక చాలా అభివృద్ధి సాధించింది. దేశంలోను, ప్రపంచంలోనూ క్వాంటమ్ స్థానంగా విలసిల్లుతోందన్నారు. క్వాంటమ్ మార్గదర్శకాల దిశగా క్వాంటమ్ ఎకో సిస్టమ్ మ్యాప్ను ఆవిష్కరించామన్నారు. కార్యక్రమంలో ఐటీ–బీటీ మంత్రి ప్రియాంక ఖర్గే, ఇస్రో మాజీ అధ్యక్షుడు కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. టిప్పర్తో ఢీకొట్టి, తుపాకీతో కాల్చి.. ● విజయపుర జిల్లాలో జీపీ సభ్యుని హత్య రాయచూరు రూరల్: రాష్ట్రంలో రాజకీయ నేతల హత్యలు తరచుగా జరుగుతున్నాయి. స్వతంత్ర జీపీ సభ్యుడు దారుణ హత్యకు గురైన ఘటన విజయపుర జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. నగర పరిధిలోని అలియాబాద్ పరిశ్రమల కేంద్రం వద్ద కొందరు దుండగులు పాంగురినదొడ్డి జీపీ సభ్యుడు రాజు కరె (48)ను కాల్చిచంపారు. రాజు జీపులో వెళుతుండగా టిప్పర్తో ఢీకొట్టించి, తరువాత ఆరుసార్లు తుపాకీ పేల్చి హత్య చేశారని ఎస్పీ లక్ష్మణ నింబర్గి తెలిపారు. హంతకుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రాజు కరె రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు ద్రాక్ష తోటలు పెంచేవాడు. స్థిరాస్తి గొడవల్లో ప్రత్యర్థులే చంపి ఉంటారని అనుమానాలున్నాయి. ఘటనాస్థలిలో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.ముగ్గురికి హైకోర్టు జడ్జిలుగా సిఫారసు శివాజీనగర: రాష్ట్రంలో న్యాయాధికారులుగా పనిచేస్తున్న రాజేశ్వరి నారాయణ హెగ్డే, కదంబాడి గణేశ్ శాంతి, మహాదేవప్ప భృంగేశ్లకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతికి కల్పించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేయనుంది. కర్ణాటక హైకోర్టులో మొత్తం 62 మంది న్యాయమూర్తులు ఉండాలి, కానీ 45 మంది జడ్జిలే ఉన్నారు. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
ఒంటరి ఏనుగు ఎస్కేప్
బనశంకరి: బేలూరు తాలూకా కణగుప్పె గ్రామంలో రైతును బలితీసుకున్న ఒంటరి ఏనుగును 6 పెంపుడు ఏనుగుల సాయంతో అధికారులు బంధించినప్పటికీ అది తప్పించుకుని ఉడాయించింది. ఒంటరి ఏనుగు కోసం పెంపుడు ఏనుగులు సుగ్రీవ, ధనుంజయ, అయ్యప్ప, ఏకలవ్య, శ్రీరామతో కలిసి అటవీ సిబ్బంది బుధవారం బేళూరు తాలూకా కెరగూడు గ్రామంలో కాఫీతోటలో గాలించారు. ఆకతాయి ఏనుగు తారసపడగానే అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అయితే మత్తు వీడిన తర్వాత అడవి ఏనుగు కాలికి కట్టిన తాడును తొలగించుకొని ఉడాయించింది. దీంతో అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతానికి గాలింపు నిలుపుదల చేసి పెంపుడు ఏనుగులను శిబిరానికి తరలించారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చినా ఫలితం శూన్యం -
జయహో అంబేడ్కర్
● రాష్ట్రమంతటా వైభవంగా జయంతి సంబరాలు శివాజీనగర: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ 135వ జయంతిని రాష్ట్రమంతటా వైభవంగా ఆచరించారు. అంబేడ్కర్ నిలువెత్తు రూపాలతో భారీ ఊరేగింపులు జరిగాయి. బెంగళూరులో విధానసౌధ ముందున్న అంబేద్కర్ విగ్రహానికి సీఎం సిద్దరామయ్య నివాళులర్పించారు. పెద్దసంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత మేధావులు పాల్గొన్నారు. కేపీసీసీ, బీజేపీ, జేడీఎస్ ఆఫీసుల్లోనూ జయంతి వేడుకలు జరిగాయి. -
అన్నీ ఆలోచించే.. నజీర్ తొలగింపు
బనశంకరి: సీఎం సిద్దరామయ్య వివిధ మూలాల నుంచి సమాచారం సేకరించి పార్టీ హితం కోసం నజీర్ అహ్మద్ విషయంలో నిర్ణయం తీసుకున్నారని డీసీఎం డీకే.శివకుమార్ అన్నారు. కేపీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రాజకీయ కార్యదర్శి పదవి నుంచి నజీర్ అహ్మద్ను తొలగిస్తూ సీఎం ఆదేశాలిచ్చారని తెలిపారు. ‘నజీర్ అహ్మద్కు దావణగెరె దక్షిణకు వెళ్లి రెబెల్ అభ్యర్థిని తప్పించేలా చూడాలని పార్టీ సూచించింది. కానీ అతను బాధ్యత నిర్వర్తించలేకపోయారు. అక్కడ ఏం జరిగిందనేది నాకు నివేదిక అందాలి’ అని డీకే చెప్పారు. ఏ పార్టీలో అయినా క్రమశిక్షణ ముఖ్యం, అందరితో చర్చించే అక్కడ అభ్యర్థిని ఎంపిక చేసినట్లు తెలిపారు. అందరితో ఎన్నికల గురించి చర్చించడం పార్టీ అధ్యక్షునిగా నా కర్తవ్యమన్నారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి మంత్రి పదవి అడగటం తప్పులేదని, కానీ జాగ్రత్తగాను, క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. డీసీఎం శివకుమార్ -
సొగసుల వర్ణచిత్రాలు
● చిత్రకళా పరిషత్లో ముగ్ధుల్ని చేసే పెయింటింగ్స్ బనశంకరి: బెంగళూరు చిత్రకళా పరిషత్లో బృంద చిత్రలేఖన ప్రదర్శన కళాప్రియులను అబ్బురపరుస్తోంది. పరిషత్లో గ్యాలరీ–2లో ఏ మెసర్ ఆఫ్ మెనీ పేరుతో బ్లిందా ఫెర్నాండేజ్ నేతృత్వంలో 20 మంది వర్ధమాన చిత్రకారుల పెయింటింగ్స్తో ప్రదర్శన ఏర్పాటైంది. కళాకారులు ప్రకృతి, పర్యావరణం, పల్లె జీవనం, పువ్వులు, పక్షులు, మహిళలను ఇతివృత్తంగా చేసుకుని కళాకారులు తమ మనసులోని భావాలను కుంచె ద్వారా నవ్యమైన చిత్రాలకు జీవం పోశారు. పల్లె జీవనంలో మహిళలు, జలాశయాల్లో విదేశీ పక్షులు, తామరపువ్వులు, ఆంగ్ల మహిళల చిత్రలేఖనాలు ఔరా అనిపిస్తాయి. చిత్రకారిణులు దివ్య మురళి, హెన్నా బజాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన 19వ తేదీ వరకు జరుగుతుంది. -
హంతక హిప్పో మృత్యువాత
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని త్యావరెకొప్ప పులి–సింహాల అభయారణ్యంలో యువ పశు వైద్యురాలు సమీక్షారెడ్డి మృతికి కారణమైన హంసిని (12) అనే ఆడ నీటి ఏనుగు (హిప్పో పోటామస్) మంగళవారం అనారోగ్యంతో మరణించింది. గర్భంతో ఉన్న హిప్పో గడువు దాటినా ప్రసవం కాలేదు. దీంతో 10వ తేదీన పశువైద్యులు దానికి వైద్య పరీక్షలు చేశారు. హంసిని గర్భాశయంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. గర్భాశయంలోనే పిండం చనిపోయి ఉందని తేలింది. అప్పటి నుంచి చికిత్స అందిస్తున్నా ఇన్పెక్షన్ ఇతర అవయవాలకు వ్యాపించి మధ్యాహ్నం 3:30 గంటలకు మరణించిందని అటవీ ఉన్నతాధికారులు తెలిపారు. కొన్నివారాల కిందట ఈ హిప్పోకు వైద్యం చేస్తున్న బెంగళూరు పశువైద్యురాలు సమీక్షారెడ్డిపై అది దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలతో మరణించడం తీవ్ర సంచలనం కలిగించింది. బస్సులో రూ.4 లక్షల నగల చోరీ మైసూరు: ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ వ్యానిటీ బ్యాగ్ నుంచి ఇద్దరు గుర్తు తెలియని మహిళలు రూ.4 లక్షల విలువైన బంగారు నగలను దోచేశారు. వివరాలు.. నంజనగూడువాసి గౌరమ్మ మైసూరులో బంధువుల పెళ్లికి వచ్చింది. తరువాత జాకీ క్వార్టర్స్ వద్ద పుట్టేగౌడన హుండికి వెళ్లే ప్రైవేట్ బస్సు ఎక్కింది. ఆ సమయంలో ఆమె పక్కనే ఇద్దరు గుర్తు తెలియని మహిళలు కూర్చొన్నారు. కొంతసేపటికి దిగిపోయారు. మరో స్టాప్ వద్ద దిగిన గౌరమ్మ బ్యాగు చూసుకోగా బంగారం కనిపించలేదు. దీంతో వెంటనే ఓ ఆటోలోనే ఆ బస్సును అనుసరిస్తూ వెళ్లి టీ.నరసీపుర వద్ద బస్సును ఆపి పరిశీలించగా ఆ మహిళలు కనబడలేదు. కండక్టర్ను విచారించగా వారిద్దరూ మేగళాపుర వద్ద బస్సు దిగారని చెప్పాడు. బాధితురాలు వరుణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టూర్కి వెళ్లగా, ఇల్లు గుల్ల తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు వార్డు రోబ్లో ఉన్న రూ.2.76 లక్షల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు. మైసూరులోని హళె కెసరె వద్ద ఉన్న టీచర్ బడావణె నివాసి మహేష్రావ్, కుటుంబంతో కలిసి ధర్మస్థల, ఉడుపి ప్రాంతాల టూర్కి వెళ్లారు. మూడో రోజు మహేష్ సోదరుడు రాకేష్ ఇంటి వద్దకు వెళ్లి చూడగా తలుపులు పగలగొట్టి ఉండడంతో చోరీ బయటపడింది. నరసింహరాజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊయలే ఉరితాడై.. బాలిక మృతి యశవంతపుర: ఇంటిలో సరదాగా ఊయల ఊగుతుండగా గొంతుకు బిగుసుకుని లేఖన (10) అనే చిన్నారి ఊరిపి తీసింది. చిక్కమగళూరు తాలూకా హెబ్బళ్లి గ్రామంలో జరిగింది. బాలిక ఇంటిలో తల్లిదండ్రులు లేని సమయంలో చీరతో ఊయల కట్టుకుని ఊగుతోంది. అయితే చీర కాలుకు చుట్టుకుని గొంతుకు బిగుసుకుంది. దీంతో ఉపిరాడక చిన్నారి మరణించింది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కూతురిని అలా చూసి కన్నీరుమున్నీరయ్యారు. చిక్కమగళూరు గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి రాతి హృదయం ● కుమార్తెను చంపి, ఆపై ఆత్మహత్య ● బెంగళూరు వైట్ఫీల్డ్లో విషాదం బనశంకరి: ఏం కష్టం వచ్చిందో గానీ కూతురిని చంపి, ఆపై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎంత ఆపద వచ్చినా పిల్లలను కాపాడుకోవాల్సిన అమ్మ గుండె రాతిగా మారింది. ఈ దుర్ఘటన సిలికాన్ సిటీలో వైట్ఫీల్డ్ ఠాణా పరిధిలోని ఇమ్మడిహళ్లిలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు.. సువర్ణ (40), ఆమె కుమార్తె కారుణ్య (14) మృతులు. ఓ ఇంటిలో సువర్ణ కుటుంబం నివసిస్తోంది. మొదట కుమార్తెను గొంతుపిసికి చంపింది, ఆపై ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నుంచి ఇంట్లో అలికిడి లేకపోవడంతో ఇరుగు పొరుగుకు అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఏదో జరిగినట్లు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి చూడగా తల్లీ కూతురు శవాలు కనిపించాయి. క్లూస్ టీంతో ఆధారాల కోసం గాలించారు. అక్కడ ఎలాంటి డెత్నోట్ దొరకలేదని సమాచారం. కారణాలపై సందిగ్ధం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారణాలపై బంధుమిత్రులను విచారిస్తున్నారు. కుటుంబ సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా, లేక మరేమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఈ దుర్ఘటనతో ఇమ్మడిహళ్లిలో విషాదం నెలకొంది. -
మే నెలాఖరులోపు అన్ని గేట్లను ఏర్పాటు చేస్తాం
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగునీరు అందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు మే నెలాఖరులోపు అన్ని కొత్త గేట్లను ఏర్పాటు చేస్తామని తుంగభద్ర బోర్డు ఎస్ఈ నారాయణ నాయక్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రధానంగా గేట్లు ఏర్పాటు, మరమ్మతులు చేయడంలో దిట్టగా ఖ్యాతి పొందిన కన్నయ్యనాయుడుతో కలిసి తుంగభద్ర గేట్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. గేట్లు ఏర్పాటుకు సంబంధించి ఆయన సలహాలు, సూచనలను చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్యాంకు ఉన్న 33 గేట్లలో అన్ని గేట్లను మారుస్తున్నామన్నారు. ప్రస్తుతం 23 గేట్లు అమర్చే కార్యక్రమం పూర్తియిందన్నారు. మరో మూడు గేట్ల పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. మొత్తం మీద మే నెలాఖరులోపు కచ్చితంగా అన్ని గేట్లను అమర్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి రోజు గేట్లు అమర్చే ప్రక్రియను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పనులు వేగవంతంగా చేయడంతో 23 గేట్ల పనులు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మరో 10 గేట్లను అమర్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో డ్యాం నుంచి కాలువలకు నీరు విడుదల చేసే లోపు పనులు పూర్తి చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి, డ్యాం ఇంజనీర్లు, ఎస్డీఓలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్లో ఆయకట్టు కాలువలకు నీటి విడుదలకు ఢోకా లేదు తుంగభద్ర బోర్డు ఎస్ఈ నారాయణ నాయక్ వెల్లడి -
అంగన్వాడీ కార్యకర్తలకు నెల రోజులు సెలవులివ్వాలి
రాయచూరు రూరల్: అంగన్వాడీ కార్యకర్తలకు వేసవి కాలంలో అధికంగా ఎండలుండడంతో నెల రోజులు సెలవులివ్వాలని రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న కార్యకర్తలకు సెలవులు కేటాయించి, బీఎల్ఓ విధుల నుంచి తొలగించాలన్నారు. జనాభా లెక్కల గణన నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి రాయచూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జెడ్పీ, టీపీ, జీపీల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్రకుమార్ మిత్ర డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీ, టీపీ సభ్యుల పదవీ కాలం ముగిసి మూడేళ్లు కావస్తున్నా నేటికీ ఎన్నికలు జరుపకుండా వాయిదా వేయడం తగదన్నారు. జెడ్పీ, టీపీ సభ్యుల ఎన్నికలను పార్టీ పరంగా కాకుండా జీపీ ఎన్నికల మాదిరిగా పార్టీలతో నిమిత్తం లేకుండా ఎన్నికలు త్వరగా నిర్వహించాలని లేని తరుణంలో హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తామన్నారు. అసంఘటిత కార్మికులకు వేతనాలు చెల్లించాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం రాయచూరు తాలూకా పంచాయితీ కార్యాలయం వద్ద సంఘం అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారిపై చేస్తున్న దౌర్జన్యాలు నశించాలన్నారు. నేడు అన్ని విధాలైన వస్తువుల ధరలు మార్కెట్లో అధికం కావడంతో వేతనాలను పెంచాలన్నారు. అసంఘటిత వలయాల్లో విధులు నిర్వహించే కార్మికులకు నెలకు రూ.37 వేల నుంచి రూ.42 వేల వరకు వేతనాలు చెల్లించేలా సర్కార్ ఆదేశించాలని కోరుతూ సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. తాగునీటి ఎద్దడి రానీయకండి రాయచూరు రూరల్: వేసవిలో మూడు నెలల పాటు ధార్వాడ జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ధార్వాడ జిల్లాధికారిణి ఆర్.స్నేహల్ అధిరులకు సూచించారు. జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 14 గ్రామాల్లో నీటి సరఫరాలో నెలకొన్న జాప్యాన్ని నివారించాలన్నారు. ధార్వాడ జిల్లాలో 90 గ్రామాలకు తాగునీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించామన్నారు. 185 బోరుబావులను తవ్వించి యజమానుల నుంచి గ్రామాలకు సంబంధిత నీటి సరఫరా చేపట్టాలని, విద్యుత్ కోత, మోటార్ల మరమ్మతు, ఇతరత్ర కారణాలు చెప్పకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నింపాలని పీడీఓలకు ఆదేశాలు జారీ చేయాలని టీపీ అధికారులకు సూచించారు. ధార్వాడ తాలూకాలో 115 గ్రామాలకు గాను 30 గ్రామాలు, హుబ్లీ తాలూకాలో 46కు గాను 19 గ్రామాలు, కలఘటిగి తాలూకాలో 87 గ్రామాల్లో 16 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా పరిగణించామన్నారు. గంజాయి సేవిస్తున్న ఐదుగురి అరెస్ట్ రాయచూరు రూరల్: గంజాయిని సేవిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఘటన బెళగావి జిల్లాలో జరిగింది. బెళగావిలో సోమవారం సాయంత్రం హిరే బాగేవాడి పోలీసులు మెరుపు దాడి చేసి అభిషేక్ దౌలత్ పాటిల్, విలాస్ శంకర్ బాళేకుంద్రి, విజయ్ సంజయ్, హర్శ సునీల్ వర్మ, హుసేన్ ఓబన్సాబ్ అనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ బసవరాజ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో కుంటి మారెమ్మవ్వకు పూజలు
సాక్షి,బళ్లారి: గుగ్గరహట్టిలో వెలసిన కుంటి మారెమ్మవ్వకు మంగళవారం విశేష పూజలతో పాటు సుమారు 8 వేల మంది భక్తులకు అన్నదానం నెరవేర్చారు. స్థానిక ప్రముఖులు కమల్ సూరి కుటుంబ సభ్యుల సారథ్యంలో కుంటి మారెమ్మవ్వకు తెల్లవారు జాము నుంచి ప్రత్యేక పూజ విశేష కార్యక్రమాలు నెరవేర్చారు. ఈ పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పాల్గొన్నారు. మొత్తం మీద ఉదయం నుంచి మంగళవారం అంతా మారెమ్మ అవ్వ గుడి ప్రాంగణం భక్తులతో కోలాహలంగా, సందడిగా కనిపించింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు సుమారు 8 వేల మందికి అన్నదానం -
నిరుద్యోగుల పోరాటానికి పోలీసుల బ్రేక్
హుబ్లీ: గత నెలలో నిరుద్యోగుల పోరాటం యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో మంగళవారం ధార్వాడలో చేపట్టిన నిరుద్యోగుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిరుద్యోగులు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల నియామకాల కోసం గత రెండు నెలల నుంచి ఎడతెగకుండా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కూడా ధార్వాడ జూబ్లీ సర్కిల్ నుంచి డీసీ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి చురుకు ముట్టించాలన్న నేపథ్యంలో చేపట్టిన ఆందోళనలను పోలీసులు శాంతి భద్రతల కారణంగా అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విద్యార్థి సంఘం నేతృత్వంలో 2.84 లక్షల ఖాళీల పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ఆందోళలో ధార్వాడలోని శ్రీనగర, జయనగర, సప్తాపుర తదితర చోట్ల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న వైనం -
నేడు సిటీలో ఐపీఎల్ మ్యాచ్
బనశంకరి: నేడు బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ – లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ వసతుల మార్పు చేశారు. కబ్బన్ పార్కు లోపల కింగ్ రోడ్డు, ప్రెస్క్లబ్ ముందు, బాలభవన్ ముందు, ఫౌంటెన్ రోడ్లలో వాహనాల పార్కింగ్ను నిషేధించారు. అంధ విద్యార్థి నిజాయతీ● సొంతదారుకు క్యాష్ బ్యాగ్ అప్పగింత హొససేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలో ప్రయాణ సమయంలో తన వద్దకు వచ్చిన రూ.లక్ష నగదు కలిగిన ఓ బ్యాగ్ను ఒక అంధ విద్యార్థి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు ఆ బ్యాగ్ను సొంత దారుకు అప్పగించారు. వివరాలు.. దావణగెరె జిల్లా హరపనహళ్లికి వెళుతున్న మార్గంలో లెక్చరర్ ధనుంజయకు చెందిన రూ.లక్షల నగదు కలిగిన ఓ బ్యాగ్ను తెలగి గ్రామానికి చెందిన అంధ విద్యార్థి హాలేష్ బ్యాగ్తో పొరపాటున మారిపోయింది. హాలేష్ రూ.లక్ష ఉన్న నగదున్న ఆ బ్యాగ్ను హరపనహళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు ధనుంజయను గుర్తించి అతడి డబ్బును, బ్యాగ్ను తిరిగి అందజేశారు. హాలేష్ పీయూసీ చదువుతున్నాడు. అతడు చూపించిన నిజాయితీని అందరూ అభినందించారు. -
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
బళ్లారిలో అంబేడ్కర్ ప్రతిమకు మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్రెడ్డి పుష్పాంజలి బళ్లారిలో అంబేడ్కర్ ప్రతిమకు గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర పుష్పాంజలిబళ్లారిలో అంబేడ్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే భరత్రెడ్డి నమస్సుమాంజలి సాక్షి,బళ్లారి: బడుగుల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ జయంతి కేవలం ఒక వేడుక కాదు, సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణకు గుర్తు అని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. హొసపేటె రోడ్డులోని అంబేడ్కర్ భవన్ వద్ద డాక్టర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర, జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, ఎస్పీ సుమన పన్నేకర్, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ మేయర్ వెంకటరమణ, మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజు తదితర ప్రముఖులు, దళిత సమాజ ప్రముఖుడు హనుమంతప్ప, పలువురు కార్పొరేటర్లు, దళిత సమాజ నాయకులు, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అంతకు ముందు బైక్ ర్యాలీతో పాటు అంబేడ్కర్ చిత్రపటాన్ని భారీ ఊరేగింపు చేపట్టి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, జానపద నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగితేలారు. అంబేడ్కర్ అడుగు జాడల్లో నడుద్దాం హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె నగరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి నిర్వహించారు. మంగళవారం అంబేడ్కర్ ప్రతిమకు జిల్లాధికారి కవిత ఎస్.మన్నికేరి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాల్యం నుంచి సమాజంలో వివక్షత కారణంగా ఎన్నో సవాళ్లను అంబేడ్కర్ ఎదుర్కొన్నారన్నారు. అయినా తన కలలను, ఆశయాలను ఎన్నడూ వీడలేదన్నారు. విజయానికి విద్య కీలకం అని బలంగా విశ్వసించారన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ అక్రమ్ నోంగ్జాయ్ షా, ఎస్పీ జాహ్నవి, అసిస్టెంట్ కమిషనర్ వివేక్, అధికారులు మనోహర్, ఎర్రగుడి శివకుమార్, తహసీల్దార్ శృతి, అంబేడ్కర్ సంఘం నేతలు వీరస్వామి, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తుకు అంబేడ్కర్ ఆలోచనలు కీలకం ఆధునిక భారత దేశ పునర్ నిర్మాణానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలు కీలకం అని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ పరమ శివమూర్తి తెలిపారు. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం క్రియాశక్తి భవనంలోని సిండికేట్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు. దేశ ఆర్థిక, సామాజిక, మతపరమైన వ్యవస్థలపై ఆయన సూత్రాలు గణనీయమైన ప్రభావాన్ని చూపాయన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విరుపాక్షి పూజారహళ్లి, ఉపకులపతి గురుబసప్ప, విద్యార్థులు పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని ఘనంగా ఆచరించారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద అంబేడ్కర్ ప్రతిమకు ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, మాన్విలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, దేవదుర్గలో శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ అరుణాంగ్శు గిరి పూలమాలలు వేసి బుద్ధం శరణం గచ్ఛామి పంచాంగాన్ని పఠించారు. పార్టీ కార్యాలయంలో.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పార్టీ నేతలు సరళంగా జరిపారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి, బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడు వీరనగౌడ, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పూలమాలలు వేశారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రతిమకు ఎస్డీపీఐ సభ్యులు సయ్యద్ ఇషాఖ్ హుసేనీ పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు వర్గాల ఆశాకిరణం సమాజంలో బడుగు, దళిత వర్గాల ఆశాకిరణం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డారు. మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో 135వ అంబేడ్కర్ జయంతిని ప్రారంభించి మాట్లాడారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేసిన మహా యోధుడన్నారు. ప్రపంచ మేధావుల్లో ఒకరని, అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామన్నారు. ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఏసీ హంపణ్ణ, తహసీల్దార్ సురేష్ వర్మ, ఏడీసీ శివానంద, కృష్ణలున్నారు. వివక్షతపై గళమెత్తి విజయం సాధించిన మహోన్నతుడు సమానత్వం కోసం పోరాడిన మహానుభావుడు అంబేడ్కర్ 135వ జయంతిలో పలువురు వక్తల ప్రశంసలు -
ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన
సాక్షి,బళ్లారి: ఆర్టీసీ బస్సును బ్రేకులు లేకుండా నడపడంతో ఒక యువకుడు మృతి చెందడంతో పాటు మరొక యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్థానిక ప్రముఖ నాయకులు హాజరై ఆందోళన చేపట్టారు. సోమవారం ఆర్టీసీ బస్సు ఢీకొని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన రవికిరణ్(18) మృతి చెందగా, ఆకాష్ అనే మరొక విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే పాలకులు గాని, అధికారులు గాని మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించక పోగా, తీవ్రంగా గాయపడిన ఆకాష్ వైద్యం గురించి పట్టించుకోకపోవడంతో మాజీ మేయర్ వెంకటరమణ, బీజేపీ నాయకుడు గాదిలింగప్ప తదితరులు పెద్ద ఎత్తున జనంతో చేరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. బ్రేకులు లేకుండా బస్సు నడపడంపై ఆగ్రహం బ్రేకులు లేకుండా బస్సును ఎందుకు నడిపారని మండిపడ్డారు. అమాయకుడైన విద్యార్థి ప్రాణాలు పోయాయని, ఇందుకు ఎవరు బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించిన వారు లేరన్నారు. గాయపడిన విద్యార్థి వైద్యానికి ఖర్చులు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. బస్టాండు వద్ద బస్సుల రాకపోకలను ఆపేశారు. రెండు గంటల పాటు బస్సుల రాకపోకలను నిలిపివేసి ఆందోళన చేశారు. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆందోళనకారులతో చర్చించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తామని, గాయపడిన ఆకాష్కు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రామాంజినేయులు, ఉమెన్ రైట్స్ యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు. రెండు గంటల పాటు ధర్నా బస్సుల రాకపోకలను అడ్డుకొని నిలిపేసిన వైనం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఒత్తిడి ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు -
ఆగి ఉన్న లారీని బస్సు ఢీ
తుమకూరు: జిల్లాలోని శిరా తాలూకాలో ద్వారలు వద్ద 48వ హైవేలో మంగళవారం ఉదయం కేఎస్ ఆర్టీసీ బస్సు నిలిచి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్, మరో ప్రయాణికుడు చనిపోయారు. లారీ ఏదో సమస్య వచ్చి వంతెనపై నిలిచి ఉండగా, బస్సు వేగంగా వచ్చి ఢీకొనింది, దీంతో బస్సు ముందు భాగం తుక్కయింది, బస్సు డ్రైవర్ శ్రీకాంత్ (50), గుర్తుతెలియని ప్రయాణికుడు అక్కడే మరణించారు. బస్సులోని సుమారు 33 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 23 మందికి ఎక్కువ గాయాలు కావడంతో తుమకూరు జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ముగ్గురికి చిత్రదుర్గ ఆసుపత్రిలో, ఒకరు శిర ఆసుపత్రిలో ఉన్నారు. తావరకెరె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదం వల్ల రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. బస్సు డ్రైవర్, మరొకరు మృతి 33 మందికి గాయాలు తుమకూరు జిల్లాలో విషాదం -
రెండు లారీలు ఢీ.. ఇద్దరు దుర్మరణం
సాక్షి,బళ్లారి: చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మంగళవారం చిత్రదుర్గ జిల్లా భరమసాగర సమీపంలోని కల్కుంటి గ్రామ వద్ద జాతీయ రహదారిలో రెండు లారీలు ముఖాముఖీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. చిత్రదుర్గ జిల్లా నుంచి దావణగెరె వైపు వెళుతున్న లారీ డ్రైవర్ అదుపు తప్పి డివైడర్ను దాటి దావణగెరె నుంచి చిత్రదుర్గ వైపునకు వస్తున్న లారీని ఢీకొనడంతో రెండు లారీల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మహాంతేష్(35), ఇనాయత్ సింగ్(30)గా గుర్తించారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స చోసం చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే భరమసాగర పోలీసులు హుటాహుటిన చేరుకుని కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరించారు. పిడుగుపాటుకు ఎద్దు మృతి ●బొప్పాయి పంట ధ్వంసం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగిలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటుకు ఒక ఎద్దుతో పాటు బొప్పాయి తోట దెబ్బ తింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో పాటు కూడ్లిగితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల రైతుల పంటలు దెబ్బతిన్నాయి. అమరదేవరగుడ్డ, గొల్లరహట్టి, బణవికల్లు ఆగ్రహార గ్రామంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన, చేతికొచ్చిన దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. మొరబనహళ్లికి చెందిన ఈరణ్ణ అనే రైతుకు చెందిన ఎద్దుపై పిడుగుపడి స్థలంలోనే ఎద్దు మరణించింది. మంత్రి పదవి కోరడంలో తప్పు లేదుహుబ్లీ: గెలిచిన వారందరూ మంత్రి పదవి పొందడానికి అర్హులే. మంత్రి పదవి ఇవ్వమని కోరడంలో తప్పు లేదని, అయితే పార్టీ ప్రోటోకాల్కు స్వస్తి చెప్పి ఏమీ వా్య్ఖ్యానించరాదని జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్లాడ్ సూచించారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలందరూ మంత్రి గిరీ పొందడానికి అర్హులు. వారు ఒకసారి గెలిచినా, రెండు సార్లు గెలిచినా ఎవరైనా కానీ ఎన్ని సార్లు గెలిచినా వారికి మంత్రి కావాలన్న ఆశ ఉంటుంది. అందుకే వారికి ప్రాధ్యానత ఇవ్వాలని హైకమాండ్ దగ్గరకు వెళ్లారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంతకు ముందు కాంగ్రెస్సే లోక్సభలో పాస్ చేయించింది. రాజ్యసభలో కూడా ప్రయత్నించాం. అయితే రాజ్యసభలో మెజార్టీ లేదు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చి 12 ఏళ్లు గడిచింది. ఈ విషయమై గత 12 ఏళ్ల నుంచి ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయినా బిల్లుకు మా మద్దతు ఉంది. బిల్లు గురించి గందరగోళం ఉంది. కొత్త జనగణను పరిగణిస్తారో లేదో స్పష్టత లేదు. ఈ విషయంలో సమగ్రంగా చర్చలు జరగాలన్నారు. పోలిక లేదని సొంత కొడుకును చంపిన తండ్రి ● నదిలోకి తీసుకెళ్లి నీటిలో ముంచిన వైనం ● విజయపుర జిల్లాలో వెలుగు చూసిన ఘోరం సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో ఘోర దురంతం చోటు చేసుకుంది. తన పోలిక లేదనే అనుమానంతో సొంత కొడుకును నదిలోకి తీసుకెళ్లి ఓ తండ్రి నీటిలో ముంచి దారుణంగా చంపిన ఘటన జిల్లాలోని నాగఠాణ గ్రామంలో చోటు చేసుకుంది. నాగఠాణకు చెందిన సిద్ధార్థ (6) హత్యకు గురైన చిన్నారి. బాలుడు తండ్రి మల్లికార్జున అరకేరిని పలువురు మీ కుమారుడు సిద్ధార్థ చూడటానికి నీలాగా లేడని ఎద్దేవా చేసేవారు. దీన్ని రోజు వింటున్న మల్లికార్జున అక్కసుతో సొంత బిడ్డను నదిలో ముంచి చంపాడు. మహారాష్ట్రలోని కరాడ్ జిల్లా వడోలి వద్ద కృష్ణా నదిలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మార్చి 16న కుమారుడిని సదరు నదిలోకి తీసుకెళ్లి ముంచి చంపి తిరిగి ఊరికి వచ్చిన మల్లికార్జునను కొడుకు గురించి ఆరా తీయగా సింధగి వద్ద స్కూల్లో చేర్పించి హాస్టల్లో పెట్టానని నాటకమాడాడు. ఇక మే 1న సిద్ధార్థ్ పుట్టిన రోజు ఉంది. తీసుకొని రమ్మని తల్లి భాగ్యశ్రీ పట్టుబట్టింది. కొడుకు ఏడి? అని నిలదీయగా నిందితుడు మల్లికార్జున పరారయ్యాడు. దీంతో తల్లి భాగ్యశ్రీ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కుమారుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు తానే హత్య చేసినట్లు అంగీకరించాడని, దీంతో మల్లికార్జునను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కారు–టిప్పర్ ఢీ, తల్లీకూతురు బలి
మైసూరు: టిప్పర్– కారు ఢీకొనడంతో తల్లీకూతుళ్లు మరణించగా, మరో చిన్నారి, కుటుంబ పెద్ద గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం చామరాజనగర జిల్లాలోని గుండ్లపేట పట్టణంలో, కేరళ–మైసూరు హైవేలో మల్లయనపుర గేట్ వద్ద జరిగింది. టిప్పర్ గుండ్లుపేట నుంచి కేరళకు ఇసుకను తీసుకువెళ్తుండగా, కేరళలోని కాలికట్ నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. కారులోని నిషా నూరి (37), ఆమె కుమార్తె నోవా (18) గాయాలతో చనిపోగా, నిషా భర్త మహమ్మద్ అజీర్ (41), కుమారుడు నహ్యాన్ (9) తీవ్రంగా గాయపడటంతో వారిని మైసూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు టిప్పర్ డ్రైవర్ను అరెస్టు చేశారు. -
ప్రియుడి స్వార్థానికి యువతి
హుబ్లీ/రాయచూరు రూరల్: తాను ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లి ఖాయం అయిన విషయం జీర్ణించుకోలేని స్వార్థ ప్రేమికుడు ఆ యువతితో తాను తీసుకున్న ఫోటోలను నిశ్చితార్థం జరిగిన యువకుడి కుటుంబ సభ్యులకు పంపాడు. ఫలితంగా పెళ్లి రద్దు కావడంతో మనోవేదనకు గురై ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన వివరాలు.. విజయపుర జిల్లా సింధగి తాలూకా బంధాల గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి జయశ్రీ బిరాదార్కు పెళ్లి చేయడానికి వరుడిని నిశ్చయించి సంబంధిత కార్యాన్ని నెరవేర్చారు. అయితే జయశ్రీ ఇంతకు ముందు శ్రీశైల బడనూరును ప్రేమించింది. తనను కాదని వేరే వ్యక్తితో వివాహం ఖరారు చేసుకోవడాన్ని శ్రీశైల జీర్ణించుకోలేక పోయాడు. తనతో ఆమె ఉన్న ఫొటోలు షేర్ ఆ యువతి తనతో ఉన్న ఫోటోలను వరుడి కుటుంబ సభ్యులకు షేర్ చేశాడు. వాటిని చూసిన వరుడి కుటుంబ సభ్యులు గత నెల 27న నిశ్చయించుకున్న పెళ్లిని రద్దు చేసుకున్నారు. పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురై జయశ్రీ జీవితంపై విరక్తి చెంది బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ గ్రామంలోని మదీనా మసీదు పక్కన ఉన్న బావిలోకి దూకిన జయశ్రీ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విరిసీ విరియని ప్రేమ త్యాగానికి బదులుగా ప్రాణాలను బలి కోరుకోవడం నేటి విచిత్రం. ముక్కుపచ్చలారని తమ కుమార్తె పిచ్చి ప్రేమికుడు శ్రీశైల స్వార్థానికి బలి కావడంపై యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడిపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇద్దరు దోపిడీ దొంగల అరెస్ట్
బొమ్మనహళ్లి: బెంగళూరు శివారులోని ఆనేకల్ సబ్–డివిజన్ జిగని పోలీసులు ఇద్దరు దోపిడీ దొంగలను అరెస్టు చేయడంలో సఫలమయ్యారు. వీరిద్దరి గతాన్ని తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇందులో ఒకడు దోపిడీలకు పాల్పడే ఒంటి కాలు దొంగ.. మరొకడు ఏకంగా ఎమ్మెల్యే కారుకు నిప్పు పెట్టిన దొంగ. వీళ్లిద్దరూ అవకాశం దొరికిన ప్రతిచోటా దోపిడీలకు పాల్పడ్డారు. కృష్ణనాయక్ అలియాస్ కుంటి కృష్ణ. ఇతడిని హవళి కృష్ణ అని కూడా పిలుస్తారు. మరొకడు నవీన్ అలియాస్ కల్లప్ప. ఇంకో పేరు రాబరీ కాలా. కృష్ణ నాయక్ ఆటో నడిపేవాడు. చిన్న వయసులోనే దొంగతనాలు, దోపిడీలకు అలవాటు పడ్డాడు. ఆటోలో జనాలను కిడ్నాప్ చేసి దోచుకునే వాడు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఒకసారి ఇతడిపై కాల్పులు జరపడంతో ఒక కాలు కోల్పోయాడు. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా ఒకే కాలుతో ఆటో నడుపుతాడు. అనుచరులతో కలిసి అమాయకులను కిడ్నాప్ చేసి, డబ్బు దోచుకుంటాడు. వారిపై దాడి చేసి పారిపోతాడు. ఇప్పటి వరకు అతడిపై 20కి పైగా కేసులు ఉన్నాయి. బన్నేరుఘట్ట, సూర్యనగర్, హెబ్బగోడి, జిగణితో సహా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే కారుకు నిప్పు పెట్టిన ఘనుడు 2021లో బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి కారుకు మరో దొంగ నవీన్ అలియాస్ రాబరీ కాలా నిప్పు పెట్టాడు. ఇంటి దగ్గర పార్క్ చేసిన రెండు కార్లు కాలిపోయాయి. ఆ కేసులో అతను ప్రధాన నిందితుడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. బైక్లతో సహా ప్రజలను దోచుకునే వాడు. హవళీ కృష్ణతో చేరిన కల్లప్ప.. అవకాశం దొరికిన చోటల్లా ప్రజలను దోచుకున్నారు. చిత్రహింసలు పెట్టడంలో దిట్టలు.. ఈ ఇద్దరు పేరు మోసిన దొంగలు ఇటీవల యరందహళ్లి సమీపంలో దోపిడీకి పాల్పడ్డారు. సుందర్ రాజ్ను హవళీ కృష్ణ ఆటోలోకి బలవంతంగా ఎక్కించి డబ్బు, మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత అతడి ఏటీఎం కార్డు ఇవ్వమని డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో చెవి కోసి చిత్రహింసలు పెట్టారు. అనంతరం ఏటీఎం కార్డును లాక్కొని రూ.లక్ష విత్డ్రా చేశారు. అనంతరం సుందర్ రాజ్ను నిర్మానుష్య ప్రదేశంలో వదిలి పారిపోయారు. కేసు నమోదు చేసిన జిగణి పోలీసులు, ఇన్స్పెక్టర్ మంజునాథ్ నేతృత్వంలో ఒక బందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
లంచాల కోసం పోలీసులపై ఎస్ఐ ఒత్తిడి
సాక్షి,బళ్లారి: ఆయనో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్. ఆయన గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున లంచం తీసుకోవడమే కాకుండా, కింది స్థాయి సిబ్బంది, పోలీసులను నగరంలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున లంచాలు తేవాలని ఒత్తిడి చేయడం కలకలం సృష్టించింది. నిత్యం ఎస్ఐ వేధింపులు తాళలేక పోలీసులు ఏకంగా ముఖ్యమంత్రికి, హోంమంత్రికి లేఖలు రాశారు. వివరాల్లోకి వెళితే.. విజయపుర నగరంలోని ఆదర్శ నగర్ పోలీసు స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న లమాణి అనే వ్యక్తి అవినీతి పేట్రేగిపోవడంతో పోలీసులు భరించలేక పోయారు. పోలీసు స్టేషన్కు వచ్చి కేసులు పెట్టే వారి నుంచే కాకుండా ఇతరుల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారీగా లంచాల వసూలుకు సూచన నగరంలో మట్కా, గ్యాంబ్లింగ్, పేకాట, వేశ్యావాటికలు, బార్లు, స్పాలు తదితర అసాంఘీక కార్యకలాపాలు నడిపే వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి తేవాలని సూచించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల నెలా లంచం తేవాలని, లేకపోతే కేసులు పెట్టాలని సూచించడంతో ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక సీఎంకు, హోంమంత్రికి లేఖ రాశారు. ఎస్ఐ ఆదేశాలను తాము పాటించలేమని, పని చేయడం చాలా కష్టంగా ఉందని, తమ గౌరవం, నిజాయితీ కాపాడుకోడానికి వేరే మార్గం లేక సామూహికంగా విధులను సైతం వదిలిపెట్టేందుకు వెనుకాడబోమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన విజయపుర జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తక్షణం ఎస్ఐని సస్పెండ్ చేయాలని లేదా వేరే చోటకు బదిలీ చేయాలని స్థానికులు కోరారు. వేధింపులు తాళలేక సీఎంకు, హోంమంత్రికి లేఖ -
వరుస ప్రమాదాలు.. నెత్తురోడిన రోడు్ల
సాక్షి,బళ్లారి: నగరంలో వేర్వేరు రోడ్లలో ప్రమాదాలు జరిగి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. సోమవారం నగరంలోని జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరం సమీపంలో బ్రేకులు లేని ఎన్ఈకేఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు గ్రామానికి చెందిన వెంకటేశులు, శ్రీదేవి దంపతుల కుమారుడు రవికిరణ్ (18) బళ్లారిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తన స్నేహితుడిని కలిసేందుకు ఉంతకల్లు నుంచి ఏథర్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం(కే.ఎ.34 ఈడబ్ల్యూ– 6076)లో బళ్లారికి వెళ్లాడు. అనంతరం స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై రంగమందిరం నుంచి బస్టాండు వైపునకు వెళుతుండగా మోతీ సర్కిల్ వద్దకు చేరుకోగానే బళ్లారి నుంచి కూరిగనూరుకు వెళుతున్న కేఏ–34 ఎఫ్–1211 నంబరుగల ఆర్టీసీ బస్సు బ్రేక్లు పడకపోవడంతో అదుపు తప్పి ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లి వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో రవికిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన స్నేహితుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదంతో ట్రాఫిక్కు అంతరాయం ప్రధాన కూడలిలో రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి పూర్తిగా స్తంభించింది. యువకుడిని ఆంధ్రప్రదేశ్కు చెందినవాడుగా గుర్తించారు. బస్సుకు బ్రేకులు సరిగా పడటం లేదని బస్సు డ్రైవర్ వీరనగౌడ పేర్కొనడం గమనార్హం. ఇదే విషయంపై అధికారులకు కూడా తెలిపామన్నారు. బ్రేకులు లేకుండా బస్సును పంపడం వల్లే ప్రమాదం జరిగిందనే విషయం కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. మృతుడి కుటుంబానికి ఎన్ఈకేఆర్టీసీ సంస్థ పెద్ద ఎత్తున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సంగం సర్కిల్లో మరో ప్రమాదం కాగా నగరంలో సంగం సర్కిల్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సండూరు తాలూకా కుడితినికి చెందిన పరుశురాం(32) అనే వ్యక్తి బళ్లారికి వచ్చి రోడ్డు మీద పక్కన నడుచుకుంటూ వెళుతుండగా, ఎదురుగా వస్తున్న మినీ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవాడని, ఇద్దరు సంతానం ఉన్నారని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో మృతి చెందాడా? లేక వ్యక్తి అజాగ్రత్తగా నడుచుకుంటూ వస్తూ లారీ కింద పడ్డారా అనే కోణంలో ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందడంపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో వేర్వేరు రోడ్లలో ప్రమాదాలు, ఇద్దరు దుర్మరణం బ్రేకు ఫెయిలై ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు బలి మిని లారీ ఢీకొని కుడితినికి చెందిన వ్యక్తి కూడా మృతి ప్రమాదాలతో రక్తసిక్తంగా మారిన బళ్లారి నగర రోడ్లు -
హొసపేటె రైల్వేస్టేషన్కు రాయల పేరు
హొసపేటె: విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీకి ప్రవేశద్వారంగా ఉన్న హొసపేటె రైల్వేస్టేషన్కు శ్రీకృష్ణదేవరాయ రైల్వే స్టేషన్గా పేరు మార్చాలని నగరసభ నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యక్షులు జీవరత్నం ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయమై 2వ వార్డు సభ్యులు జీవరత్నం ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. హొసపేటె రైల్వే స్టేషన్కు ఇకపై శ్రీకృష్ణదేవరాయల పేరును పెట్టాలని డిమాండ్ చేస్తూ సభ్యులందరి మద్దతుతో ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి తద్వారా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయనున్నారు. దేశవ్యాప్తంగా కేవలం కొన్ని రైల్వే స్టేషన్ల విషయంలో మాత్రమే ఇటువంటి ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ఏడాది ఆ జాబితాలో హొసపేటె చారిత్రక హంపీకి ముఖ్యద్వారం వంటిది. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ స్టేషన్కు తరలివస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్టేషన్ను ఆధునిక హంగులతో, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తోంది. ఇటువంటి కీలక తరుణంలో ఈ పేరు మార్పుకు సంబంధించి చాలా కాలంగా ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ ప్రతిపాదనను సరైన అధికారిక మార్గంలోనే సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా అధికారిక ప్రక్రియను అనుసరించడం ద్వారా ఈ డిమాండ్ ప్రజల గళంగా మారింది. -
డాక్టర్ రాజ్కుమార్ వర్ధంతి
రాయచూరు రూరల్: సినీ నటుడు దివంగత డాక్టర్ రాజ్కుమార్ 19వ వర్ధంతిని సోమవారం నగరంలో నిర్వహించారు. డాక్టర్ పునీత్ రాజ్కుమార్ ట్రస్టు కార్యాలయంలో డాక్టర్ రాజ్కుమార్ చిత్రపటానికి ట్రస్టు అధ్యక్షుడు సాదిక్ ఖాన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. సభ్యులు బసవరాజ్, సంతోష్, చేతన సంస్థ సంచాలకుడు సబ్జలీ, నాసిర్లున్నారు. సహాయవాణిలో 772 కేసులకు పరిష్కారం రాయచూరు రూరల్ : జిల్లాలో ఈ ఏడాది సహాయవాణి ద్వారా 790 కేసులు నమోదు కాగా 772 కేసుల సమస్యలను పరిష్కరించినట్లు జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ వెల్లడించారు. సోమవారం కార్యాలయంలో తనను కలిసిన పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 28 శాఖలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతంలో నీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని పంచాయతీ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 14 రోజుల్లో 20 కేసులు రావడంతో నీటి ఎద్దడి పరిస్థితిపై నిఘా ఉంచి పరిష్కరించామని, ప్రజలు 08532– 230 539 సహాయవాణి ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. రిజర్వేషన్లు అమలు చేయాలి రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అదనపు రిజర్వేషన్లు అమలు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. సోమవారం లోక్సభ సభ్యుడి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. 17 శాతం రిజర్వేషన్లను అమలు చేసే ముందు జనాభాకు అనుగుణంగా కేటాయించిన రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలను గమనించి ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 7 శాతం అదనపు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో పద్మ, నరసన్న నాయక్, శరణ బసవ, వరలక్ష్మి, దేవేంద్ర గౌడ, గిరియప్పలున్నారు. భూ సర్వేకు ఆటంకం.. 12 మంది అరెస్ట్రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా బిచ్చాలి గ్రామంలో వెలసిన మంత్రాలయం జపకట్టి ప్రాంతంలోని భూ సర్వేకు అడ్డు పడిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత మంది రైతులు ఏళ్ల తరబడి భూములను సాగు చేసుకుంటున్న అంశంపై కోర్టు మెట్లెక్కారు. అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ, తహసీల్దార్ సురేష్వర్మ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేస్తుండగా అడ్డుకోవడంతో వారిని యరగేర పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలకు వైదిక ధర్మ సందేశాలు నేర్పాలి రాయచూరు రూరల్: దేశంలో హిందూ వైదిక ధర్మ సందేశాలను పిల్లలకు బోధించడం మనందరి కర్తవ్యమని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందరింలో కర్ణాటక కళా మండలి, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నుపుర సంభ్రమ–22వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సనాతన సంప్రదాయాలు ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి భరతనాట్యంపై ఆసక్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో జయలక్ష్మి మంగళ మూర్తి, ముకుందాచారి జోషి, ప్రదీప్ భట్, రమాదేవి, సంజయ్ కుమార్, సీతాబాయి, రంగనాథ్, కర్ణాటక కళా మండలి సభ్యులు లక్ష్మి, నాగేంద్ర, కన్నడ సంస్కృతి శాఖ అధికారి ఉత్తరాదేవి మఠపతిలున్నారు. -
వ్యక్తిగత ద్వేషంతోనే పఠాన్ హత్య
హుబ్లీ: కాంగ్రెస్ యువనేత ఫైరోజ్ పఠాన్ హత్యకు వ్యక్తిగత ద్వేషాలే కారణమని తేలడంతో ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశామని హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ నిందితులందరినీ జుడీషియల్ కస్టడీకి అప్పగించామని, అదనపు విచారణ కోసం పోలీస్ కస్టడీకి అనుమతి తీసుకున్నామన్నారు. హత్యకు వాడిన రెండు బైకులతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో మహమ్మద్ షా, సయ్యద్ గౌస్, పర్వేజ్, సమీర్, సద్దాం హుస్సేన్, కై ఫ్, అర్బాజ్, సోహిల్ ఖాన్, మక్తుంలను అరెస్ట్ చేశామన్నారు. వీరిలో మహమ్మద్ షా, ఫైరోజ్ పఠాన్ మధ్య వ్యక్తిగత కక్షలు, పగలు రగిలాయన్నారు. హత్యకు గురైన ఫైరోజ్ తనను చాలా వేధించేవాడని, ఎన్నో సార్లు వ్యక్తిగతంగా గొడవ పడి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడన్నారు. ఈ కారణంగానే పఠాన్ను హత్య చేసినట్లు మహమ్మద్ షా విచారణలో తెలిపాడన్నారు. నిందితుల్లో కొందరికి నేర నేపథ్యం ఉందన్నారు. పథకం ప్రకారమే చాలా రోజులుగా కాపు గాసి ఈ హత్యకు పథకం రూపొందించారన్నారు. ముఖ్యంగా ఆరోజు రాత్రి మగవాళ్లు లేని సమయం చూసి హత్య చేశారు. కాగా ఈ నెల 24న పఠాన్కు పెళ్లి జరగాల్సి ఉండిందన్నారు. ఎమ్మెల్సీ రాజీనామా చేయరాదని ధర్నాకేజీఎఫ్ : విధాన పరిషత్ సభ్యుడు నజీర్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేయరాదని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మైనారిటీ నాయకులు సోమవారం నగరంలోని గాంధీ సర్కిల్ వద్ద ధర్నా చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్యం మాట్లాడుతూ ఎమ్మెల్సీ నజీర్ అహ్మద్ విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో సేవలు అందించారన్నారు. ఆయన ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. అయితే దావణగెరె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రాలేదనే నెపంతో పార్టీ హైకమాండ్ రాజీనామా చేయాలని అడుగుతుండడం దురదృష్టకరమన్నారు. నజీర్ అహ్మద్ పార్టీకి ఎనలేని సేవలు అందించారన్నారు. దావణగెరె దక్షిణ కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఆయన ముమ్మరంగా ప్రచారం సాగించారన్నారు. పార్టీ హైకమాండ్ కొంతమంది చెప్పుడు మాటలు విని అకారణంగా ఆయనను రాజీనామా చేయాలని కోరుతుండడం సరికాదని అన్నారు. నజీర్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేస్తే తాము కేజీఎఫ్ను బంద్ చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితిలోను నజీర్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేయకూడదన్నారు. ధర్నాలో నగరసభ స్థాయి సమితి అధ్యక్షుడు అమీర్, నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు జయపాల్, శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. చెరువులో మునిగి ఇద్దరు మహిళల మృతి కోలారు : చెరువులో మునిగి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన నగర సమీపంలోని అరహళ్లి చెరువులో ఆదివారం చోటు చేసుకుంది. నగరంలోని నిసార్ నగర్కు చెందిన మహ్మది(25), బెంగళూరుకు చెందిన సల్మా (26) చెరువులో మునిగి మృతి చెందిన మహిళలు. ఇంట్లో కార్యక్రమం కోసం బెంగళూరు నుంచి వచ్చిన సల్మా, మహ్మది బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు. నీటిలో పడిన తమ దుస్తులను తీసుకోడానికి ప్రయత్నించి తాము చెరువులో మునిగి మరణించారు. ఘటనా స్థలానికి కోలారు రూరల్ పోలీసులు వెళ్లి పరిశీలన జరిపారు. మృతదేహాలను పోస్టుమార్టం చేసిన తర్వాత సంబంధీకులకు అప్పగించారు. మహిళ కన్నుమూత మండ్య: మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని చినకుర్లి ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, నాల్వాడి లయన్స్ క్లబ్ సభ్యులు బి.లింగేగౌడ భార్య త్రిగుణ (48), అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఎమ్మెల్సీ మధు మాదేగౌడ, కె. వివేకానంద, మరితిబ్బెగౌడ, డా. హెచ్.ఎస్.ముద్దేగౌడ, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సి. చెలువయ్య తదితరులు మృతదేహానికి నివాళులర్పించారు. మలవళ్లి తాలూకాలోని దాసనదొడ్డి గ్రామంలో అంత్యక్రియలు జరిపారు. -
చెలువరాయునికి కొడై తిరునాల్ శోభ
మండ్య: మండ్య జిల్లాలోని ప్రఖ్యాత మేలుకోటలోని శ్రీ చెలువ నారాయణస్వామి దేవస్థానంలో కొడై తిరునాల్ ఉత్సవం శోభాయమానంగా సాగుతోంది. అలంకార ప్రియుడైన మహావిష్ణు చెలువనారాయణస్వామి కోసం ప్రతి రాత్రి ప్రత్యేక అలంకరణలతో ఒక వేడుక జరుగుతోంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి మొదలైన కొడై తిరునాల్లో భాగంగా ఏకాదశి సందర్భంగా సోమవారం నాడు ప్రత్యేకంగా అలంకరించారు. కొడై తిరునాల్ ప్రత్యేకత వైరముడి బ్రహ్మోత్సవం ముగియగానే ప్రారంభమయ్యేదే కొడై తిరునాల్ సంబరం. ఏప్రిల్ 17వ తేదీ అంటే శుక్రవారం అమావాస్య రాత్రి వరకు కొనసాగుతుంది. కొడై తిరునాల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ అమ్మవారి సమక్షంలో, అర్చకులుమంత్రాలు, రామాయణం, సంస్కృత పద్యాలతో మంగళ వాయిద్యాల మధ్య చెలువనారాయణ స్వామిని పూజిస్తారు. తరువాత పానక ప్రసాదాన్ని సమర్పిస్తారు. బంగారు ఆభరణాలను ధరించి, పద్మాసనంలో కూర్చున్న స్వామిని చూడడానికి భక్తులు వేచి చూస్తారు. మేలుకోటె పుణ్యక్షేత్రంలో 17 వరకు విశేష ఉత్సవాలు -
బస్సును ఢీకొన్న వ్యాన్.. ఇద్దరు కూలీల మృతి
మండ్య: తాలూకాలోని కాచేనహళ్లి సమీపంలో ఆదివారం రాత్రి చామరాజనగర– జీవర్గి హైవేలో కేఎస్ ఆర్టీసీ బస్సును గూడ్స్ వ్యాన్ ఢీకొట్టింది. గూడ్స్ వ్యాన్లోని పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కూలీలు సుజమ్రామ్ (27), సుజన్ బర్బన్ (32) మరణించగా, డ్రైవర్ రమేష్ గాయపడ్డాడు. చన్నరాయపట్న తాలూకాలోని నుగ్గేహళ్లిలో ఒక శుద్ధ జల ప్లాంటులో మృతులు కూలీలుగా పనిచేసేవారు. నీటి బాటిళ్లను తీసుకుని వ్యాన్లో నాగమంగళ పట్టణానికి వస్తుండగా బస్సును ఢీకొన్నారు. బస్సులోని కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. నాగమంగళ సీఐ శివకుమార్ నేతృత్వంలోని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్పీ వి.జె.శోభరాణి, ఏఎస్పీ తిమ్మయ్య ఘటనాస్థలిని పరిశీలించారు. అబ్బే.. నన్ను వేధించలేదు దొడ్డబళ్లాపురం: బాగలకోటలోని జయమృత్యుంజయ స్వామిపై నమోదైన లైంగిక వేధింపుల కేసు పెట్టిన బాధిత మహిళ మాట మార్చింది. తనపై ఎలాంటి లైంగికదాడి జరగలేదని వీడియో ప్రకటనను విడుదల చేసింది. తాను స్వామిజీపై ఫిర్యాదు చేయలేదని, తనపేరు వాడుకుని కొందరు కేసు పెట్టారని పేర్కొంది. తాను స్వామిజీ వద్ద డబ్బులు డిమాండు చేయలేదంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, కోలుకున్నాక మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెబుతానని తెలిపింది. మూడో పెళ్లికి కేటుగాని యత్నంబొమ్మనహళ్లి: ఒకరు కాదు, ఇద్దరు భార్యలు ఉన్నారు, అయినా మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమైన పోకిరీ ఉదంతమిది. యువతుల జీవితాలతో ఆడుకుంటున్న కేటుగాడు రవిపై జిగణి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రవి పెద్ద ఉద్యోగం చేస్తానని ఆడంబరంగా కనిపించేవాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని అబద్ధాలు చెబుతూ యువతులకు వల వేసేవాడు. మొదటి భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లినప్పుడు, మరో యువతిని కొన్ని నెలల కిందటే పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో మరో యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడు. చివరకు విషయం తెలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తెలిసి నిందితుడు రవి పరారీలో ఉన్నాడు. ఎంతో జీవితం.. క్షణాల్లో అంతం ● యువ టెక్కీ దుర్మరణం యశవంతపుర: రోడ్డు ప్రమాదంలో యువ టెక్కీ దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా సుళ్యకు చెందిన టెక్కీ క్షిప్రా (27) మృతి చెందింది. మంగళూరుకు చెందిన శశి కళాభట్కు ఏకై క కూతురు క్షిప్రా. బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. రాయచూరు జిల్లాలో స్నేహితురాలి పెళ్లి ఉండడంతో సహ ఉద్యోగులతో కలిసి ఆనందంగా కారులో కర్నూలు పర్యటనకు వెళ్లారు. ఆదోని పట్టణం వద్ద కారు డ్రైవర్కు నిద్ర మత్తు వచ్చి చెట్టును ఢీన్నాడు. ఈ ప్రమాదంలో క్షిప్రాకు బలమైన గాయాలై అక్కడే చనిపోయింది. మరో యువకుడు, ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. క్షిప్రా ఎంటెక్ చేసింది, కొన్నేళ్ల కిందట తండ్రి చనిపోగా, ఆమెను తల్లి కంటికి రెప్పలా చూసుకుంటోంది. తల్లీ కూతురు బెంగళూరులోనే నివసిస్తున్నారు. ఇంతలో ఏకై క ఆధారంగా ఉన్న కూతురు కూడా మరణించడంతో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇద్దరు ఆర్టీఓ అధికారుల అరెస్టు దొడ్డబళ్లాపురం: వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు ఆర్టీఓ అధికారులను లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. నెలమంగల ఆర్టీఓ ఇన్స్పెక్టర్లు దినేశ్, కిరణ్ పట్టుబడ్డారు. ఇద్దరూ నిత్యం తనిఖీలు చేసే సాకుతో వాహనాలు నిలిపి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో బెంగళూరు గ్రామీణ జిల్లా లోకాయుక్త ఎస్పీ కోన వంశీకృష్ణ ఆధ్వర్యంలో దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని విచారణకు తరలించారు. -
భారీ వంతెన ప్రారంభం
శివాజీనగర: చిక్కమగళూరు జిల్లా ఎన్.ఆర్.పురం తాలూకాలో నిర్మాణమైన వంతెనను సీఎం సిద్దరామయ్య సోమవారం ప్రారంభించారు. హందూరు, హొన్నకుడిగ గ్రామాల నుంచి నరసింహరాజపురకు భద్రా నది బ్యాక్ వాటర్పై ఈ వంతెన నిర్మాణమైంది. సీఎం, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి వంతెనను వీక్షించారు. భద్రా నది సౌందర్యాన్ని వీక్షించారు. 504 మీటర్ల పొడవు... 504 మీటర్ల పొడవు కలిగిన ఈ వంతెనకు సిద్దరామయ్య వంతెన అని పేరు పెట్టడం గమనార్హం. సుమారు రూ.38 కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తయింది. 2017లో సీఎం సిద్దరామయ్య దీనికి శంకుస్థాపన చేశారు. అనేక గ్రామాల ప్రజలకు రాకపోకలకు అనుకూలమవుతుంది. ఉదయం, సాయంత్రం వేళలో ఇక్కడ సుందరమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. జిల్లాలోనే ఇది పొడవైన సేతువుగా నిలిచింది. చిక్కమగళూరులో సేవలకు అంకితం -
హనీట్రాప్లో చిక్కి.. బాడీబిల్డర్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో జిమ్ ట్రైనర్లు మహిళలను మోసం చేయడమో, లేదా వారి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకోవడమో పెరిగిపోయింది. ఇటీవలే ఓ యువతి ప్రేమించి, చివరకు తిరస్కరించడంతో ఓ జిమ్ శిక్షకుడు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఇంతలోనే హనీట్రాప్లో చిక్కుకున్న బాడీ బిల్డర్ మహిళ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన నెలమంగల తాలూకా వాజరహళ్లిలో వెలుగుచూసింది. జిమ్ ట్రైనర్ దిలీప్ (28)కు, రోజూ జిమ్కు వస్తున్న వివాహిత (42)తో పరిచయమైంది. అతడు బాడీబిల్డర్గా రాష్ట్రంలో ఎన్నో పోటీల్లో రాణించాడు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు, తరువాత ఆమె డబ్బు, అతని ఆస్తులు కావాలని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందని దిలీప్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు దిలీప్ ఆమెకు కాల్ చేసి చెప్పాడు. దీంతో ఆమె అతని తమ్మునికి ఇన్స్టాలో మెసేజ్ చేసింది. కానీ అంతలోనే దిలీప్ ప్రాణాలు పోయాయి. నెలమంగల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మోసగత్తెను కఠినంగా శిక్షించాలని దిలీప్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఐఏఎస్ రోహిణికి సుప్రీంలో ఊరట బనశంకరి: మైసూరు కలెక్టర్గా ఉన్న కాలంలో బట్ట బ్యాగుల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆమైపె నమోదైన కేసులో విచారణకు అనుమతివ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ప్రశ్నిస్తూ రోహిణి సింధూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే జారీ చేసింది. -
వైభవం.. రంగనాథ తేరు సంబరం
నాగేశ్వరస్వామి రథోత్సవంబొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని హెన్నాగరలో సోమవారం శ్రీనాగేశ్వర స్వామి రథోత్సవం, శ్రీయల్లమ్మ దేవి జగద పాలక్కి ఉత్సవం భక్తిశ్రద్ధలతో జరిగాయి. మధ్యాహ్నం శ్రీనాగలింగేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి తేరులో ఆసీనుల్ని చేశారు. పూజలు చేసి తేరును లాగారు. వీరగాసె, డొల్లుకుణిత, పూజా కుణిత తదితర కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. వేలాదిగా భక్తులు, ఆనేకల్ టీఏపీసీఎంఎస్ అధ్యక్షుడు ఎం.బాబురెడ్డి, హెచ్.జే.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. బొమ్మనహళ్లి: చిక్కమగళూరు జిల్లాలోని కడూరు తాలూకాలోని బిరూర్ సమీపంలోని హోగరేహళ్లి గ్రామంలో సోమవారం శ్రీలక్ష్మీ రంగనాథస్వామి బ్రహ్మ రథోత్సవం వైభవంగా సాగింది. శ్రీరంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవిల విగ్రహాలను అలంకరించి రథంలో ప్రతిష్టించారు. రథ పతాకాన్ని వేలం వేయగా ఎమ్మెల్యే కె.ఎస్.ఆనంద్ రూ. 5.05 లక్షలకు గెలుచుకున్నారు. పూజల తరువాత భక్తులు ఆనందోత్సాహాలతో తేరును లాగారు. వివిధ పూజా వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను రంజింపజేశాయి. పలు జిల్లాల నుంచి జనం తరలివచ్చారు. -
భైరవ సన్నిధికి ప్రధాని మోదీ
మండ్య: జిల్లాలోని నాగమంగళ వద్దనున్న ఆది చుంచనగిరి మఠంలో నిర్మించిన శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 15వ తేదీన ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘ఇది ఒక సజీవ ఆధ్యాత్మిక నిలయం. ద్రావిడ వాస్తుశైలిలో నిర్మాణమైంది’ అని మఠాధిపతి నిర్మలానందనాధ స్వామి సోమవారం తెలిపారు. ఒడిశాలోని సూర్య దేవాలయం కళను మేళవించి, రూ.100 కోట్లకు పైగా వ్యయంతో ఈ ఆలయాన్ని సుందరంగా నిర్మించినట్లు తెలిపారు. ఇందులో హొయసళ, చోళ, చాళుక్య, గంగా వాస్తుశైలుల సమ్మేళనం కనిపిస్తుందని చెప్పారు. ద్రావిడ వాస్తుశైలి ఆకాశాన్ని తాకే గోపురాలు, అద్భుతమైన శిల్పాలు, విశ్వ నియమాలకు అనుగుణంగా ఉండే రూపకల్పన అని పేర్కొన్నారు. 3 రకాల శిలలతో నిర్మాణం భైరవైక్య ఆలయ నిర్మాణంలో మూడు రకాల రాళ్లను ఉపయోగించారు. క్లియోరా అనే రాయికి పెద్దపీట వేశారు. ఆలయానికి ఇలకల్ రకం రాయిని, కింది భాగానికి సంతేకల్ రకం రాయిని ఉపయోగించారు. లోపల మొత్తం క్లియోరా శిలలతో తీర్చిదిద్దారు. ప్రధానికి నెమలి ప్రతిమను అందజేస్తామని స్వామీజీ చెప్పారు. తమిళనాడుకు చెందిన శంకర్ స్థపతి ఈ ఆలయాన్ని నిర్మించారు. బెంగళూరులోని వికాససౌధ, ఉద్యోగ సౌధ, బెళగావిలోని సువర్ణ సౌధలను నిర్మించింది కూడా శంకరేనని స్వామీజీ తెలిపారు. ప్రధాని పర్యటన ఇలా.. ప్రధాని మోదీ బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగి, హెలికాప్టర్లో ఆది చుంచనగిరి క్షేత్రానికి చేరుకుంటారు. కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. తరువాత భైరవైక్య ఆలయాన్ని అంకితం చేస్తారు. ఆదిచుంచనగిరి క్షేత్ర స్టేడియంలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రేపు ఆది చుంచనగిరి మఠంలో భైరవైక్య ఆలయం ప్రారంభం కాల భైరవుని ఆలయంలో విశేష పూజలు -
వాడిన నూనె స్వీకరణ
● ఆహార, ఔషధ శాఖల తనిఖీలుమనం నిత్యం ఆరగించే ఆహారం రుచిగా ఉండడమే కాదు శుచిగా కూడా ఉండాలి. అప్పుడే ఆకలి తీరడంతో పాటు ఆరోగ్యానికీ మంచిది. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవనంలో రోడ్ల పక్కన హోటళ్లలో కడుపు నింపుకొనేవారే ఎక్కువ. అలాంటి హోటళ్లలో ఆహారాన్ని ఎంత శుభ్రంగా వండి వారుస్తున్నారనేది పెద్ద ప్రశ్న. నిజంగా శుభ్రతా, నాణ్యత నిబంధనలను పాటిస్తున్నారా? అనేది అడిగినా చెప్పరు. ఈ నేపథ్యంలో హోటళ్లు, క్యాంటీన్లలో ఆహార భద్రతా విభాగం తనిఖీలను ముమ్మరం చేసింది.శివాజీనగర: ఇటీవల రోజుల్లో హోటళ్లలో భోజనం, అల్పాహారం ఆరగించేవారు పెరిగిపోయారు. బెంగళూరులో ఏ హోటల్కు వెళ్లినా కిటకిటలాడుతూ ఉంటుంది. డిమాండ్ ఉండడంతో వేడి వేడి అల్పాహారం, చిరుతిండ్లను వడ్డించే క్యాంటీన్లు, హోటల్లు, కెఫెలు అధికమయ్యాయి, ఆహార ప్రియులు ఇటువంటి హోటల్లకు వెళ్లి తమకు ఇష్టమైన ఆహారాన్ని సేవిస్తారు. అయితే హోటల్ ఆహారం ఎంతవరకు సురక్షితమనేది వారికి తెలియదు. అంత ముఖ్యమైనది కూడా అనుకోరు. కృత్రిమ రంగుల సమస్య నిషేధించిన రంగులను ఆహారం తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కేక్లు, లడ్డూ మిఠాయిల వాడకంలో ఇది సమస్యగా తయారైంది. కృత్రిమమైన రంగుల మిఠాయిలను తినడం వల్ల పిల్లల్లో బుద్ధి మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు గతంలో పలు నివేదికలు హెచ్చరించాయి. పదే పదే అదే నూనె ఇక ఉపయోగించిన వంటనూనెనే పదే పదే వాడడం జరుగుతోందని ఆరోపణలున్నాయి. వంట నూనెల ధరలు పెరగడంతో ఆహార తయారీదారులు ఈ పద్ధతికి అలవాటుపడ్డారు. ఇది ప్రజల ఆరోగ్యానికి వినాశకారిగా మారుతోంది. వాడిన నూనెనే మళ్లీ వాడడం వల్ల క్యాన్సర్లు, కాలేయ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు గతంలోనే హెచ్చరించారు. టేస్టింగ్ సాల్ట్ వినియోగం ఆహారంలో ఎక్కువగా రుచిగా ఉండాలని అధిక మొత్తంలో టేస్టింగ్ సాల్ట్లు, పౌడర్లను వాడుతారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. చాలా రోజులుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి ఇవ్వడం, నాణ్యత లేని పదార్థాలను ఉపయోగించడం ఇలా అనేక ఆరోపణలు ఆహార తయారీదారులపై ముసురుకొన్నాయి. దీంతో ఆరోగ్య శాఖ, ఆహార సురక్షిత, ఔషధ పరిపాలనా శాఖలు హోటళ్లలో తనిఖీలను ముమ్మరం చేశాయి. వ్యాపారులకు అవగాహణ ఆహార భద్రతా అధికారులు రాష్ట్రంలో గత రెండేళ్లలో హోటళ్లలో నాణ్యత తనిఖీలు చేపట్టి 3,505 శాంపిళ్లను సేకరించి విశ్లేషించారు. ఆహార సురక్షిత, నాణ్యత, శుభ్రత గురించి 33,453 హోటళ్లు, క్యాటరింగ్ వ్యాపారులకు శిక్షణనిచ్చారు. ఆహార సురక్షత, నాణ్యత స్థాయి చట్టం– 2006ను ఉల్లంఘించిన 75 ఆహార వ్యాపారులకు భారీమొత్తాల్లో జరిమానాలు విధించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. వంట నూనెను పదే పదే వేడి చేసి ఉపయోగించరాదని 2024 మార్చిలో హోటళ్లకు, ప్రజలకు సూచన చేసినట్లు ఆహార సురక్షత విభాగం తెలిసింది. వాడిన నూనెను మళ్లీ ఉపయోగించకుండా అడ్డుకోవడానికి రాష్ట్రంలో 2022 నుంచి ఇప్పటివరకు హోటళ్ల నుంచి 62 లక్షల లీటర్ల వాడిన వంట నూనెను సేకరించారు. టేస్టింగ్ సాల్ట్ను చాలా తక్కువ మోతాదులోనే వాడాలని నిబంధనలను విధించారు. -
ఉద్యోగ మేళాకు స్పందన
రాయచూరు రూరల్: నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పిలుపునిచ్చారు. ఆదివారం కన్నడ భవనంలో జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఉద్యోగ ఉపాధి కేంద్రం ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు తమకు ఇష్టమైన ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. స్వయం ఉపాధికి ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి ని్తీష్, జిల్లా పంచాయతీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, ఎస్పీ అరుణాంగ్శు గిరి తదితరులు పాల్గొన్నారు. అంబులెన్స్ ప్రారంభం రాయచూరు రూరల్: ప్రజలు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఉప్పార వాడిలో విస్తార పైనాన్ష్ సేవా ట్రస్ట్, బాలంకు ఆస్పత్రి ఆద్వర్యంలో నూతన అంబులెన్సును ప్రారంభించారు. ఆదివారం జరగనున్న మెగా ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు బసనగౌడ, నాగరాజ, బి.వి. నాయక్, బండేష్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్.. మీ స్టూడెంట్నే అంటూ వేధింపులు
దొడ్డబళ్లాపురం: ఇన్స్టాలో పరిచయమైన యువకుడు, మహిళ (40) చేత బలవంతంగా న్యూడ్ కాల్ చేయించి, ఆపై బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఈ సంఘటన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగింది. వివరాలు.. ఎలక్ట్రానిక్ సిటీల టీచర్గా పని చేస్తున్న ఆమెకి, ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తికి చెందిన యువకుడు అర్షద్ (37) ఇన్స్టాలో పరిచయమయ్యాడు. మీ పూర్వ విద్యార్థిని అని చెప్పుకుని కొంతకాలం మంచివాడిగా చాటింగ్ చేశాడు. తరువాత ఫోన్లలో తరచూ మాట్లాడుకునేవారు. తిరుమలలో దర్శనం చేయిస్తానంటూ డబ్బులు తీసుకున్నాడు. ఒకరోజు హఠాత్తుగా తనకు క్యాన్సర్ వచ్చిందని, చివరి కోరికగా నీతో గడపాలని ఆశగా ఉందన్నాడు. ఆమె తిరస్కరించగా, కనీసం న్యూడ్గా వీడియో కాల్ అయినా చేయాలని కోరాడు. వీడియో సేవ్ చేసుకుని.. అతని మాటలు నమ్మిన మహిళ సరేనని కాల్ చేసింది. అయితే కాల్ను రికార్డు చేసుకున్న దుండగుడు.. నీ న్యూడ్ వీడియో నా వద్ద ఉందని, డబ్బులు ఇవ్వాలని, తనతో కలవాలని, లేదంటే వీడియో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధిరాలు తరచుగా అతనికి డబ్బు పంపిస్తూ ఉంది. అయితే కొన్నిరోజులుగా వేధింపులు పతాకస్థాయికి చేరడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచనల మేరకు ఆమె అతన్ని బెంగళూరుకు రప్పించింది, వెంటనే పోలీసులు పట్టుకుని ఠాణాకు తరలించారు. తన అవయవాలను కోసుకుంటానని పోకిరీ కొంతసేపు హల్చల్ చేశాడు. తరచూ డబ్బు వసూళ్లు, బెదిరింపులు నిందితునికి కటకటాలు -
చిక్కలో కరగ కోలాహలం
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరంలో గంగమ్మ ఆలయంలో శనివారం రాత్రి శ్రీ ధర్మరాయస్వామి, ద్రౌపదీదేవి పూల కరగ సంబరం ఆద్యంతం భక్తులను పరవశుల్ని చేసింది. పూజారి ధర్మేంద్ర కరగనెత్తుకుని నాట్యమాడారు. ఆలయం నుంచి ప్రారంభమైన కరగ నగర వీధుల గుండా భారీ సందోహం మధ్య సాగింది. ప్రధాన సర్కిళ్లలో కరగధారి నృత్యం చేయగా భక్తులు హర్షధ్వానాలు చేశారు. జూనియర్ కాలేజీ ఆవరణలో వేదికపై నృత్య ప్రదర్శన సాగింది. ప్రజలు ప్రతి వీధిలో కరగకు పూజలు చేసి ఘన స్వాగతం పలికారు. నగరంలోని 31 వార్డులలో కరగ సంచరించింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఊరేగింపు సాగింది. ఎస్పీ కుశాల్ చౌక్సె కరగ ఉత్సవంలో పాల్గొని పోలీస్ బందోబస్తు నిర్వహించారు. -
తాగునీరు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
హొసపేటె: గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, పరిశుభ్రతను కమిటీ సభ్యులు ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని పీడీఓ నారాయణప్ప తెలిపారు. తాలూకాలోని పూజారహళ్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామీణ తాగునీరు, పారిశుధ్య హొసేపేట విభాగం ఆధ్వర్యంలో గ్రామ నీరు, పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నీటి వనరుల పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, నీటి గంట (నీటి పంపిణీదారు) వివిధ సంఘాల, సంస్థల ప్రతినిధులతో కలిపి 10 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ నీరు, పారిశుధ్య శాఖ జిల్లా స్థాయి అధికారి మహంతేష్ మాట్లాడుతూ.. తుంగభద్ర నది నుంచి నీటిని సరాఫరా చేసే బహుళ– గ్రామ తాగునీరు పథకం కూడా ఇందులో భాగంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ జీవన్ మిషన్ సరఫరా పథకం కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతోందన్నారు. గ్రామ నీరు, పారిశుధ్య కమిటీ తమ గ్రామంలోని తాగునీరు, పరిశుభ్రతపై మరింత దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించని వారితో మాట్లాడాలన్నారు. మరుగుదొడ్లను తప్పక ఉపయోగించుకునేలా సూచించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిల్ కలెక్టర్ పాలయ్య, కంప్యూటర ఆపరేటర్ అర్పిత, భవాని, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సమితి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఉడుపి జిల్లాలో కిడ్నాప్.. తెలంగాణలో పట్టివేత
బనశంకరి: మార్చి 31న ఉడుపి జిల్లా కుందాపురలో కిడ్నాపైన వ్యక్తి తెలంగాణలో దొరికాడు. వివరాలు.. కుందాపుర నివాసులు రాజేష్, రామ మడివాళ, సోదరుడు లక్ష్మణకు అనారోగ్యంగా ఉండటంతో మణిపాల్లోని కేఎంసీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సమయంలో క్యాంటీన్ టీ తాగుతుండగా నంబరు ప్లేట్ లేని నలుపు రంగుకారులో వచ్చిన 8 మంది రాజేష్ను బలవంతంగా లాక్కుని కారులో బంధించి తీసుకెళ్లారు. సోదరుల ఫిర్యాదుమేరకు కుందాపుర పోలీసులు తీవ్రంగా గాలింపు జరిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల, గోవిందపల్లి వద్ద గల సిల్వర్ స్కై లాడ్జ్లో దాచి ఉంచినట్లు తెలుసుకుని దాడి చేశారు. బాధితున్ని కాపాడి 8 మంది కిడ్నాపర్లను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ హరిరాం శంకర్ తెలిపారు. మల్లారెడ్డి, తుళజా, నరసింగ, హుసేన్, శంకర, నాగేశ్, పరమేశ్వర్, విజయ్ అనే 8మంది పట్టుబడ్డారు. ఆర్థిక గొడవలే కిడ్నాప్కు కారణమని సమాచారం. సౌకర్యాల కోసం ఆదివాసీల ధర్నా మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలేమహదేశ్వర గ్రామ పంచాయతీ పరిధిలోని మేదగనాణే హాడిగేలో తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కావాలని జిల్లా ఆదివాసీల హితరక్షణ సమితి, ప్రగతిపర సంఘాల భాగస్వామ్యంలో ఆదివాసీలు ఉపవాస సత్యాగ్రహం చేపట్టారు. ప్రభుత్వం, అటవీ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ గ్రామానికి విద్యుత్ సరఫరాకు ఏడాది క్రితమే అన్ని ఏర్పాట్లు చేసినా అటవీశాఖ అధికారులు అడ్డు చెప్పడం వల్ల తాము చీకట్లో మగ్గుతున్నట్లు చెప్పారు. వెంటనే తమకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాత్రి అంతా ఆందోళన జరగ్గా, మలేమహదేశ్వర బెట్ట పోలీసులు బందోబస్తు సాగించారు. ఏనుగు దాడిలో కాఫీ రైతు మృతి యశవంతపుర: అడవి ఏనుగు దాడిలో రైతు బలైన ఘటన ఆదివారం ఉదయం హాసన్ జిల్లా బేలూరు తాలూకా అరెహళ్లి హొబళి కణగుప్పె గ్రామంలో జరిగింది. రైతు రాజశేఖర్ ఉదయమే ఇంటి నుంచి కాఫీతోటకు వెళ్లాడు. తోటలో పనిలో ఉండగా, ఓ ఏనుగు నుంచి వేగంగా వచ్చి అతనిని కాళ్లతో తొక్కి చంపేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అటవీ సిబ్బంది, పోలీసులు వెళ్లి మృతదేహాన్ని తీసుకువచ్చారు. 6 నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన రైతు ద్యావమ్మ కూడా ఓ ఏనుగు ఇలాగే హతమార్చింది. దీంతో రైతులు పొలాలకు, తోటలకు వెళ్లాలంటే భయపడుతున్నారని రైతు నేత కెజి కుమార్ చెప్పారు. వెంటనే ఏనుగులను బంధించాలని డిమాండ్ చేశారు. కారు– బస్సు మధ్య నలిగి.. దొడ్డబళ్లాపురం: బెంగళూరులో మైసూరు శాటిలైట్ బస్టాండ్లో ఘోరం జరిగింది. కారు– బస్సు మధ్య ఇరుక్కుని వ్యక్తి దుర్మరణం చెందాడు. బెంగళూరు సుంకదకట్టె నివాసి శ్యామ్ దొరె (45) మృతుడు. భార్యతో కలిసి తమిళనాడులో బంధువు చనిపోతే వెళ్లి చూసి వచ్చారు. మైసూరు రోడ్డులోని శాటిలైట్ బస్టాండులో దిగి పార్కింగ్ లాట్లో బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఒక కారు రివర్స్ చేస్తుండగా శ్యామ్ కాస్త వెనక్కు జరిగి అక్కడే నిలిపి ఉన్న బ్లడ్ బ్యాంక్ బస్సుకి ఆనుకుని నిల్చున్నాడు. అయితే కారు అలాగే రావడంతో కారు– బస్సు మధ్య ఇరుక్కుని శ్యామ్ అక్కడే చనిపోయాడు. బ్యాటరాయనపుర పోలీసులు కేసు నమోదు చేశారు. -
పుట్టుకతో వచ్చే వ్యాధి ‘పెదవి చీలిక’
బళ్లారి రూరల్: ప్రతి 2 వేల మంది పిల్లల్లో ఒక్కరికి పెదవి చీలిక వచ్చే అవకాశం ఉందని బళ్లారి లయన్స్ క్లబ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ లయన్ ఎస్.కె.అజయ్ తెలిపారు. బళ్లారి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత పెదవి చీలిక పరీక్షలు, శస్త్రచికిత్సల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెదవి చీలిక వంశపారంపర్యంగా పిల్లలకు పుట్టుకతోనే వచ్చే ఒక వ్యాధి అని పేర్కొన్నారు. ఇందువల్ల చిన్నారులు తల్లిపాలు తాగడానికి ఇబ్బంది పడతారన్నారు. పోతపాలు వల్ల పిల్లలు వివిధ వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. పెదవి చీలిక వల్ల దంత సమస్యలు, ఇన్ఫెక్షన్స్ తరచూ వచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే పెదవి చీలికకు శస్త్రచికిత్స చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు. బళ్లారి లయన్స్క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశలోని గుంతకల్లు ,రాయదుర్గం, నేమకల్లు, బొమ్మనహాళ్, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 35 మంది పెదవి చీలిక పిల్లలను వైద్యం వారి తల్లిదండ్రులు తీసుకొచ్చారన్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 15 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఈనెల 15వ తేదీన బెల్గాంకు పంపుతామని వెల్లడించారు. శస్త్రచికిత్సలు, రవాణా, వసతి సౌకర్యం ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ సభ్యులు డాక్టర్ గడ్డి దివాకర్, బెల్గాంకు చెందిన డాక్టర్ అపూర్వ, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
పుష్ప యాగం
● హలసూరులో నేత్రపర్వంగా పల్లకీ ఉత్సవం బెంగళూరు నడిబొడ్డున హలసూరులో ఆదివారం పూల పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. వైవిధ్య దేవీ దేవతల రూపాలలో మల్లెలు, ఇతర పుష్పాలతో పల్లకీలను అలంకరించి వాహనాలలో పురవీధుల్లో ఊరేగించారు. సోమేశ్వర ఆలయం, కామాక్షమ్మ ఆలయాల నుంచి బయల్దేరిన పదుల సంఖ్యలోని పూల పల్లకీల వైభవాన్ని చూడడానికి ప్రజలు రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. స్థానిక సంఘాలు, భక్తులు వారం రోజుల నుంచి పూల పల్లకీల తయారీలో నిమగ్నమయ్యారు. టన్నుల కొద్దీ పుష్పాలను ఇందుకు ఉపయోగించారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ పల్లకీ జాతర కనువిందు చేసింది. ప్రతి ఏటా ఏప్రిల్లో ఈ వేడుకను జరపడం సంప్రదాయంగా వస్తోంది. – బనశంకరి: -
పోలీసులకు యోగా శిక్షణ ఉపయుక్తం
హొసపేటె: సమాజంతో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులు నిత్యం శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలి. త్వరలో డీఎంఐ యంత్రం ద్వారా స్థూలకాయ పరీక్షను తప్పనిసరి చేయనున్నట్లు ఎస్పీ ఎస్.జాహ్నవి తెలిపారు. ఆదివారం నగరంలో డీఏఆర్ పోలీస్ పరేడ్ మైదానంలో హొసపేటె ఉప విభాగం పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం పతాంజలి యోగా సమితి జిల్లా విభాగం ఆధ్వర్యంలో 15 రోజుల ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యోగా అనేది ఒక జీవన విధానంగా మారాలని సూచించారు. ఈ శిక్షణ కేవలం జిల్లా కేంద్రంలోనే కాకుండా మిగిలిన రెండు ఉప విభాగాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మంజునాథ్ తెలిపారు. -
రైతుల కష్టం.. హోటళ్లకు లాభం
సాక్షి బళ్లారి: మధ్య ప్రాచ్య దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావంతో కొన్ని నెలలుగా కూరగాయల ధరలు పడిపోయాయి. అప్పులు చేసి ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసిన అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. పండించిన కూరగాయలకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. నగరంలోని ఏపీఎంసీకి రోజూ బళ్లారి చుట్టుపక్కలతో పాటు పొరుగున ఆంధ్రప్రదేశ్ నుంచి రైతులు టమాటా, ఉల్లిగడ్డలు, వంకాయ, క్యారెట్, బీరకాయ, తదితర కూరగాయలను వాహనాల్లో తీసుకొచ్చి హోల్సెల్గా విక్రయిస్తుంటారు. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి కూరగాయల ధరలు నేలచూపు చూస్తున్నాయి. టమాటా రూ.5, ఉల్లిగడ్డలు రూ.5, బీట్రూట్ రూ.10 లోపే, క్యారెట్ రూ.10, చిక్కుడు, దోసకాయ, క్యాబేజీ, తదితర కూరగాయలలను రైతుల నుంచి రూ.8 నుంచి రూ.10 లోపే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక కమీషన్, జీఎస్టీ తదితరాలను పట్టుకుంటున్నారు. పెట్టుబడుల మాట అటు ఉంచితే కార్మిక వ్యయం, రవాణా ఖర్చులు కూడా దక్కడం లేదు. గ్యాస్ ధర పెరిగిందని చెబుతూ.. రిటైల్గా బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పడిపోవడంతో వినియోగదారులు కూడా రైతుల కష్టాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు భారీగా పడిపోయినప్పటికీ హోటళ్లలో మాత్రం రోజు రోజుకు ధరలు పెంచేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదనే సాకు చెబుతున్నారు. ఇడ్లీ, దోసె, వడ, పూరీ, భోజనాలు తదితర ఆహార పదార్ధాల ధరలను రెట్టింపు చేసుకుని లాభాలు ఆర్జిస్తున్నారు. కూరగాయల ధరలు చౌకగా లభిస్తున్నప్పటికీ ఇష్టానుసారంగా హోటళ్లలో ధరలు పెంచి దోచుకుంటున్నారు. ఓ వైపు కూరగాయల ధరలు కుప్పకూలి రైతులు నష్టాల్లో కుదేలవుతున్నారు. విత్తనాలు, ఎరువులు, మందులు, కార్మిక ఖర్చులు, రవాణా ఖర్చులు పెరుగుతుండటంతో ఆదుకోవాల్సిన పాలకులు, చోద్యం చూస్తున్నారు. పడిపోయిన కూరగాయల ధరలు కుదేలవుతున్న అన్నదాతలు గ్యాస్ ధర పెరిగిందని చెబుతూ హోటళ్లలో భారీగా ఆహారం ధరల పెంపు దోపిడీకి తెరలేపిన హోటళ్ల యజమానులు -
భక్తిశ్రద్ధలతో కాళికా మాత జయంతి
రాయచూరు రూరల్: నగరంలో కాళికా మాత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం విశ్వకర్మ సమాజం ట్రస్ట్, వందలాది మంది భక్తుల సముక్షంలో అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాళికా దేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి విగ్రహాన్ని పల్లకీలో కొలువుదీర్చి ఊరేగించారు. దేవికి పూలు పండ్లు, దవనం, ధాన్యాలతో పూజలు చేశారు. అంతకుముందు ముత్తయిదువులు కలశాలతో ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో ఈశ్వర్, నారాయణ, జయంతాచారి, నాగరాజ్, రవీంద్ర, లక్ష్మీపతి, హరినాథ్, మల్లేష్, మౌనేష్, ఆనంద శ్రీకాంత్, గిరిబాబు, వినోద, ఆకాష్, హరహరన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యం
సాక్షి బళ్లారి: ప్రతి విద్యార్థికి చదువుకునే రోజులు, విద్యార్థి దశ మరుపురానివి. సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డి సూచించారు. నగరంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, కర్ణాటక జిల్లా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలబుర్గి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ పీజీఆర్ సింధ్యను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింధ్య విద్యా ప్రస్తానం, సమాజ సేవ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లొ పాల్గొనడం హర్షణీయమన్నారు. విద్యా రంగంలో అనేక విజయాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. నేటి విద్యార్థులు, యువత సెల్ఫోన్లు వాడుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తమ లక్ష్యానికి చేరుకోకుండా సమస్యల్లో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికత, సెల్ఫోన్లను సరైనా మార్గంలో ఉపయోగించుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు. సంఘాన్ని బలోపేతం చేయాలి రాయచూరు రూరల్: వ్యాయామ ఉపాధ్యాయలు ఐకమత్యంగా ఉంటూ సంఘాన్ని బలోపేతం చేయాలని తాలుకా విద్యాశాఖ అధికారి ఈరన్న పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్జీఓ కార్యాలయంలో వ్యాయామ ఉపాధ్యాయుల జిల్లా, తాలుకా స్థాయి పదాధికారుల పద గ్రహణం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు యంకప్ప, రంగస్వామి, రాజశ్రీ , బాలప్ప, రవీంద్ర, రాజు, కృష్ణ, రమేష్, సుచిత్, హనుమంతరాయ, ప్రకాష్, జయలక్ష్మి, రవి, కవిత, వెంకటేష్, శకుంతల, పరిమళ, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. మహిళా రచయితలను గుర్తించాలి హొసపేటె: సమాజం మహిళలను మాతృ ప్రేమతో గౌరవిస్తుంది. ఇది కేవలం మాతృత్వానికే పరిమితం అయితే మహిళలు అంతకుమించి ఎంతో కృషి చేశారు. మనం దానిని కూడా గుర్తించాలని కర్ణాటక మహిళ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.సునందమ్మ తెలిపారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ టి.మీనాక్షి రచించిన అభినందన పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనేక సందర్భాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ విజయాలు సాధించారన్నారు. అయినప్పటికీ వారిని ఒక పరిమితం అయిన విధానంలో గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషాదిక్య వ్యవస్థలో మహిళ విజయాలు మరుగున పడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వీరేష్ బడిగేర్, రచయిత ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిహొసపేటె: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అని ఎస్పీ జాహ్నవి తెలిపారు. శనివారం హొసపేటె నగరంలోని వివిధ కూడళ్లలో వాహనాల తనిఖీ చేపట్టారు. హెల్మెట్లు ధరించని వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారితో అక్కడికక్కడే హెల్మెట్ కొనుగోలు చేయించి, రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ విషయంపై పోలీస్ శాఖ అవగాహన కల్పించిన తర్వాత జరిమానా విధించాలి. ఇది తెలియకుండా ఏకంగా వాహనాలను అడ్డుకోవడంపై వాహనదారులు శాపనార్థాలు పెడుతున్నారు. ఈ విషయంపై ఎస్పీ జాహ్నవి స్పందిస్తూ.. రోడ్డు భద్రతకు హెల్మెట్ల వాడకం అత్యవసరమన్నారు. ప్రమాదాల్లో ప్రాణ నష్టం నివారించడానికి ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని పేర్కొన్నారు. -
కనులవిందుగా రథోత్సవం
శ్రీనివాసపురం: తాలూకాలోని రోణూరు వైకుంఠపురంలో అర్జున ప్రతిష్టిత శ్రీనివాస శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. అర్చకులు ఉదయం నుంచి స్వామివారి మూలవిరాట్టుకు, ఉత్సవ విగ్రహాలకు పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయం ముందున్న రథ వీధిలో తేరును లాగారు. భక్తులు తేరు మీదకు దవనం, అరటి పండ్లు విసిరారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు పానకం, పెసర బేడలు, మజ్జిగ పంచారు. హంతక హిప్పో పిల్ల మృత్యువాత శివమొగ్గ: గత మార్చి 19న శివమొగ్గ జిల్లా త్యావరకొప్ప జూ పార్క్లో ట్రైనీ వెటర్నరీ డాక్టర్ సమీక్షా రెడ్డిపై గర్భంతో ఉన్న నీటి ఏనుగు (హిప్పో పోటామస్) దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సమీక్షా రెడ్డి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మరణించారు. తాజాగా ఈ నీటి ఏనుగుకు జన్మించిన పిల్ల నీటి ఏనుగు మరణించింది. హంసిని అనే పేరు ఉన్న తల్లి హిప్పో గతంలో రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అవి కూడా కొన్నిరోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందాయి. మూడో పిల్ల అయినా బతికి బట్టకడుతుందని జూ అధికారులు ఆశపడ్డారు. అయితే అది కూడా చనిపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. యువతి మరణించి.. వెలుగులు పంచి.. యశవంతపుర: ప్రమాదంతో బ్రెయిన్డెడ్ అయిన యువతి అవయవాలను తల్లిదండ్రులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన హాసన్ జిల్లాలో జరిగింది. అరసికెరె తాలూకా కారేహళ్లికి చెందిన మోనిక (18) ద్వితీయ పీయూసీ పరీక్షలు రాసింది. 5న సాయంత్రం బీహెచ్ రోడ్డు ఎపిఎంసి మార్కెట్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఆమెకు తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం బ్రెయిన్డెడ్ అయిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల వినతి మేరకు మోనిక తల్లిదండ్రులు అవయదానానికి అంగీకరించారు. గుండె, కళ్లు, కిడ్నీలు వంటి ముఖ్యమైన అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు పంపించారు. ఆమె వల్ల పలువురికి కొత్త జీవితాలు దక్కాయి. రోడ్డుపై నుంచి కారు పల్టీ ● కుటుంబానికి గాయాలు తుమకూరు: నగరం నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న వంతెన పై నుంచి గుంతలో కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలు, వారి ఇద్దరు కూతుళ్లు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు బాగా ధ్వంసమైంది. నగరంలోని హనుమంతపురలో జాతీయ రహదారి– 48 పై నిర్మాణంలో ఉన్న వంతెన మీద ఆదివారం ఉదయం 11 గంటలప్పుడు వెళ్తుండగా అదుపుతప్పి కింద పడిపోవడంతో జనం వెంటనే పరుగులు తీసి బాధితులను బయటకు తీసి రక్షించారు. క్షతగాత్రులను సిద్ధగంగా ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల నుంచి ఈ వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు కూడా లేవు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ కర్ణాటకకు మేలు దొడ్డబళ్లాపురం: ఆర్టికల్ 371జే సవరణ వల్ల కళ్యాణ కర్ణాటక ఎంతో అభివృద్ధి చెందుతోందని అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. బీదర్లో రాష్ట్ర 40వ పాత్రికేయుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆర్టికల్ 371జే వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక నిధులు, అవకాశాలు, స్థానికులకు ఉద్యోగాలు అన్నీ లభిస్తున్నాయన్నారు. పాత్రికేయులు సమాజంలో అసమానతలు తొలగేలా, అందరికీ న్యాయం జరిగేలా వార్తలు రాయాలని, నిజాన్ని నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. -
పశుగ్రాసం కొరత.. రైతన్న వెత
రాయచూరు రూరల్: కర్ణాటకలో పశుగ్రాసం కొరత వేధిస్తోంది. పాడిపోషణ రైతులు పుశుగ్రాసం సమస్యతో అల్లాడిపోతున్నారు. అధిక ధరలు చెల్లించి ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ ప్రారంభంలోనే ఇలా ఉంటే మూగ జీవాలను ఎలా కాపాడుకోవాలి అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్నాటకలోని ఆరు జిల్లాలో కరువు సంభవించినా కేంద్ర, రాష్ట్ర సర్కార్లు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. సమయానికి వర్షాలు కురవక పోవడంతో చెరువులు, కుంటలు, బావులు, వాగులు నీరు లేక వెలవెలబోతున్నాయి. పంటలు పండక పోవడంతో పశువులకు పశుగ్రాసం అందని దుస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో పఽశువులకు పశుగ్రాసం లభించకపోవడంతో ప్లాస్టిక్ పేపర్లు, సంచులు తింటూ మృత్యువాత పడుతున్నాయి. హైదరాబాద్ కర్ణాటకలోని రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించే దండనాయకులు (తహసీల్దార్) మాయం అవుతున్నారు. రైతన్నల గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. పంటలు నష్టపోయి రైతన్నలు ఇబ్బందులు పడుతున్నా.. పంట నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం కొరతతో రైతులు చేసేది ఏమీ లేక దిక్కుతోచని పరిస్థితిలో పశువులను కబేళాకు తరలిస్తున్నారు. జిల్లాలో 1.55 లక్షలకు పైగా పశువులను విక్రయించినట్లు సమాచారం. జిల్లాలో 4.67 లక్షల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరముందని పశు సంవర్దక శాఖ అధికారులు జిల్లా అధికారికి రెండు నెలల క్రితం ప్రతిపాదనలను పంపినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 12 వేల మంది రైతులకు మినీకిట్లను పంపిణీ చేస్తామన్న అధికారులు.. కేవలం 3,262 మంది రైతులకు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. వర్షాభావంతో పండని పంటలు వేధిస్తున్న పశుగ్రాసం సమస్య కబేళాకు తరలుతున్న పశువులు పట్టణాల్లో పశువులకు మేతగా మారిన ప్లాస్టిక్ -
వైభవం.. గుడికట్ల ఉత్సవం
విడపనకల్లు: విడపనకల్లులో కురుబల ఆరాధ్య దైవమైన విడపనకల్లప్ప గుడికట్ల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిపారు. ఉత్సవానికి ముఖ్య అతిథిగా ఉరవకొండ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కురుబలంతా పాల్గొని విడపనకల్లప్ప, గుడికట్ల పట్టాదేవరలను మేళతాళాలతోను, డప్పులతో ఘనంగా ఊరేగించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని పూజలు చేశారు. పార్టీ నేతలు భరత్రెడ్డి, సీపీ వీరన్న, యోగేంద్రరెడ్డి, హోతూరు సురేష్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. బళ్లారి తదితర ప్రాంతాల నుంచి జాతరకు బంధువులు తరలి రావడంతో ఇంటింటా సందడి నెలకొంది. మునియప్పకు అంబేడ్కర్ అవార్డు కోలారు: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ అందించే డాక్టర్ అంబేడ్కర్ అవార్డుకు జిల్లాకు చెందిన సీనియర్ దళిత నాయకుడు, పాత్రికేయుడు సీఎం మునియప్పను ఎంపిక చేశారు. ఈనెల 14వ తేదీన విధాన సౌధ బాంక్వెట్ హాల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అవార్డుతో పాటు రూ.5 లక్షల నగదు, 20 గ్రాముల బంగారు ప్రశస్తిని అందించనున్నారు. అవార్డుపై స్పందించిన సీఎం మునియప్ప మాట్లాడుతూ.. అవార్డు రావడం సంతోషం కలిగించిందన్నారు. సముదాయం ఎదుగుదల కోసం పోరాటాలు సాగించానని తెలిపారు. చైన్ దొంగిలించిన వ్యక్తి అరెస్ట్ శ్రీనివాసపురం: తాలూకాలోని దొడమలదొడ్డి గ్రామంలో మహిళ మెడలోని మాంగల్యం చైన్ను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 36 గ్రాముల చైను, కాసు, రెండు గుండ్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసపురం తాలూకా మొగిలహళ్లి గ్రామానికి చెందిన ఎం.ప్రేమ కుమార్ (21) పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు. దొడమలదొడ్డి గ్రామానికి చెందిన శ్రావణి సాయంత్రం పొలం నుంచి ఇంటి వెళుతున్న సమయంలో మాటు వేసిన ప్రేమకుమార్.. శ్రావణి మెడలోని మాంగల్యం గొలుసు లాక్కొని పారిపోయాడు. శ్రావణి శ్రీనివాసపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 36 ఏళ్ల తర్వాత పట్టుబడిన హత్య కేసు నిందితుడు కోలారు: హత్య కేసులో నిందితుడిగా ఉన్న శీనప్ప అనే వ్యక్తిని 36 ఏళ్ల తరువాత నంగలి పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ముళబాగిలు తాలూకాలోని హుళికుప్ప గ్రామంలో జనవరి 30, 1990వ తేదీన తన కుమారుడు నారాయణప్ప కనిపించడం లేదని తల్లి వెంకటమ్మ నంగలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఒకరోజు తరువాత వంకలో పూడ్చిన స్థితిలో నారాయణప్ప శవం కనిపించింది. హత్య జరిగినట్లుగా భావించిన నంగలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్య కేసులో నిందితుడు అయిన శీనప్పకు అప్పుడు 29 సంవత్సరాలు. 36 సంవత్సరాలు గడిచినా నిందితుడి ఆచూకీ తెలియలేదు. నూతన ఎస్పీ కన్నికా సిక్రివాల్ పాత కేసులను తిగదోడి మళ్లీ రీ ఓపెన్ చేయించారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని రచించారు. నిందితుడు శీనప్ప కుప్పంలోని ఓ హోటల్లో పని చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేసి తీసుకొచ్చి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. కేజీఎఫ్లో అవినీతి అక్రమాలుకేజీఎఫ్: నియోజకవర్గ ఎమ్మెల్యే రూపా పిల్లల మనసులలో జాతి విషబీజాలను నాటుతున్నారని బీజేపీ నాయకుడు వళ్లల్ మునిస్వామి ఆరోపించారు. ఆదివారం ఇంటర్ పరీక్షలో అత్యున్నత మార్కులు సాధించిన అహింద వర్గం పిల్లలను సన్మానించి మాట్లాడారు. కెజీఎఫ్ తాలూకాలో 80 శాతం మంది అహింద వర్గం వారు ఉన్నారు. ఎంతో మంది ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించారు. అయితే ఎమ్మెల్యే తనకు కావలసిన వారి పిల్లలను మాత్రమే పిలిచి ఇంట్లో సన్మానం చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే అన్ని సముదాయాల వారిని సమానంగా చూడాలన్నారు. కేజీఎఫ్లో అధికారులు ఓ వ్యక్తి సహకారంతో అవినీతి అక్రమాలు నిర్వహిస్తున్నారని ఇందుకు తన వద్ద దాఖలాలు ఉన్నాయన్నారు. తాగునీటి సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
పట్టణ సహకార బ్యాంకులో కుంభకోణం
● రూ.7.50 కోట్ల దోపిడీ ● బ్యాంక్ ఉద్యోగిపై కేసు నమోదు సాక్షి, బళ్లారి: నగరంలోని మాన్వి పట్టణ సహకార బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో పని చేసే ఉద్యోగి రూ.కోట్లాది రూపాయలను తమ బంధువులు, ఇతర వ్యక్తుల ఖాతాల్లోకి బదిలీ చేసుకుని అవినీతికి పాల్పడ్డారు. ఉద్యోగి రమేష్ 2023 సంవత్సరం నుంచి దశల వారీగా గుట్టుచప్పుడు కాకుండా తల్లిదండ్రులు, భార్య పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వారి ఖాతాల్లోకి ఏకంగా రూ.7.50 కోట్లు నగదును బదిలీ చేశాడు. ఆరుగురి ఖాతాల్లోను నగదును ఎవరికి అనుమానం కలగకుండా నకిలీ సంతకాలు చేసి కోట్లాది రూపాయల నగదును బదిలీ చేసుకున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఏపీఎంసీ పోలీసులకు ఫిర్యాదు అందింది. బ్యాంకులో పనిచేసి కోట్లాది రూపాయలను తమ బంధువులు ఖాతాల్లోకి జమ చేసుకున్న రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తల పార్టీ రాయచూరు రూరల్: బీజేపీ కుటుంబ పార్టీ కాదని.. కార్యకర్తల పార్టీ అని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ప్రశిక్షణ శిబిరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి సేవలు చేయలేని, కుటుంబ రాజకీయాలు చేసేవి రాజకీయ పార్టీలు కాదన్నారు. బీజేపీకి అజాత శత్రువుగా పేరు పొందిన అటల్ బిహరీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ తదితరులు పార్టీకి చేసిన సేవలు మరువరానివని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీరన గౌడ, శంకరప్ప, అమర్నాథ్ పాటిల్, సుశీల్ నమోషి, రాజ్ కుమార్, రాఘవేంద్ర, రమానంద యాదవ్, రవీంద్ర, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాహం తీరుస్తున్న చలివేంద్రాలురాయచూరు రూరల్: వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం అమృత నెరళు పేరుతో రాయచూరు నగర సభ అధికారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు దాహార్తి తీరుస్తున్నాయి. ప్రజలు సేద తీరేందుకు వెదురుతో గుడిసెలు నిర్మించి, అందులో నీటి కుండలను పెట్టి నీటి వసతి కల్పించారు. నగరంలోని ఆర్టీఓ సర్కిల్, కేఈబీ పాఠశాల, జహిరాబాద్ సర్కిల్, తీన కందిల్, బస్టాండ్, గంజ్ సర్కిల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు అమృత నెరళును సద్వినియోగం చేసుకోవాలని నగర సభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో సూచించారు. ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించాలిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ అరుణాంగ్శు గిరి సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి పతకం అందుకున్న డీఎస్పీ శాంత వీరకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధ్యతగా విధులు నిర్వహించినప్పుడే జీవితంలో ౖఏదెనా సాధించేందుకు అవకాశాలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కుమార స్వామి, హరీష్, డీఎస్పీ వెంకటేష్, ఏసీ హంపణ్ణ, జిల్లా జైలర్ అనిత, సీపీఐలు నాగారాజ్, ఉమేష్ కాంబ్లే, ఎస్ఐలు మంజునాథ్, బసవరాజ్, పరమానంద, డి.ప్రకాష్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పీయూసీలో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్యహత్యహుబ్లీ: పీయూసీలో తక్కువ మార్కులు వచ్చాయనే బాధతో విద్యార్థిని ఆత్యహత్య చేసుకున్న ఘటన స్థానిక ఉనకల్ సిద్ద కళ్యాణ నగర్లో చోటు చేసుకుంది. విద్యా నగర్ కనకదాస కళాశాల విద్యార్థిని శ్రావణి (18). ఇటీవల విడుదలైన ద్వితీయ పీయూసీ ఫలితాల్లో కామర్స్ విభాగంలో 77 శాతం మార్కులు సాధించింది. శ్రావణి తండ్రి మారుతి ఆటో గ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇంట్లో చదవడానికి అవకాశం లేకపోవడంతో ఉనకల్లోని అవ్వతాత ఇంట్లో పెట్టారు. చురుకై న విద్యార్థిని శ్రావణి పరీక్షల్లో 95 శాతం మార్కులు తెస్తానని చాలా ఆశ పెట్టుకుంది. ఎక్కువ మార్కులు సాధించలేక పోయానన్న మనోవేదనకు గురైన శ్రావణి.. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆశించిన మేర మార్కులు సాధించక పోవడంతో ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మార్కులే జీవితం కాదని తొందర పాటుతో విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదని మానసిక వైద్యులు పేర్కొన్నారు. -
కొప్పళలో మరో లవ్ జిహాద్ కేసు
హుబ్లీ: హుబ్లీ–ధార్వాడ తర్వాత కొప్పళలో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. కొప్పళ తాలూకా కంప్లి గ్రామానికి చెందిన ముస్తఫా.. నర్సింగ్ చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. యువతిని మభ్యపెట్టి పార్కులకు తీసుకెళ్లాడు. అంతేగాక లవ్ జిహాద్కు ప్రేరణ ఇచ్చారని బాధిత యువతి బంధువులు ఆరోపించారు. ఇటీవల వీరిద్దరు జిల్లా ఆస్పత్రి వద్ద ఉండగా హిందూ జాగరణ వేదిక కార్యకర్తలకు చిక్కారు. ఈ క్రమంలో ముస్తఫా మొబైల్ పరిశీలించగా.. హిందూ యువతుల ఫొటోలు, నగ్న వీడియోలు దర్శనమిచ్చాయి. హిందూ యువతులకు బీర్ తాపించి, మాంసం తినిపించినట్లు సమాచారం. అంతేగాక గంజాయి, ఉక్కాతో ఉన్న వీడియోలు కూడా ఉన్నట్లు తేలింది. ముస్తఫా మట్కా బుక్కి అని చెబుతున్నారు. హిందూ జాగరణ వేదిక, విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు కార్యకర్తలు జిల్లా ఎస్పీ డాక్టర్ అరసిద్దిని కలిశారు. హిందూ యువతులను లవ్ జిహాద్కు ముస్తఫా ప్రేరేపిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తక్షణమే కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. -
సాంకేతికతను ఉపయోగించుకోండి
హొసపేటె: మీ మేథస్సుకు తోడ్పడే సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని వైస్ చాన్సలర్ డాక్టర్ డీవీ.పరమ శివమూర్తి అన్నారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలోని భువన విజయ ఆడిటోరియంలో యూజీసీ పీహెచ్డీ 4వ దశ ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీతో సమయం ఆదా అవుతుందని తెలిపారు. పాత, కొత్తలను సమన్వయం చేసుకుంటూ పరిశోధనను ఒక కొత్త కోణంలో రూపొందించాలన్నారు. నేటి కంప్యూటర్ టెక్నాలజీ మానవుల ఉనికినే ప్రశ్నిస్తోందని కొందరు భయపడుతున్నారని తెలిపారు. కానీ అలాంటి భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. మనుషుల ఏ సమస్యకై నా పరిష్కారాలు కనుక్కొంటారన్నారు. వేలాది పుస్తకాలు మన చేతివేళ్ల కొనల్లోనే అందుబాటులో ఉన్న ఈ యుగంలో వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాంస్కృతిక మేధావి డాక్టర్ జి.వి.ఆనందమూర్తి, మైసూరుకు చెందిన సీనియర్ సైన్స్ రచయిత కొల్లేగల్ శర్మ విద్యా వ్యవహారాలు డైరెక్టర్ డాక్టర్ అమరేష్ యటగల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో వంచించాడు
రాయచూరు రూరల్: ఎనిమిది ఏళ్లు ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకుడిపై యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దేవదుర్గ తాలూకా అంజళ గ్రామానికి చెందిన హనుమంతి, మల్లికార్జున బెంగళూరులో చదువుకుంటున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. హనుమంతితో కలసి మల్లికార్జున వివిధ ప్రాంతాలకు తిరిగాడు. వీరిద్దరి మధ్య ఏడు సంవత్సరాల పాటు ప్రేమాయణం నడిచింది. పెళ్లి చేసుకోవాలంటూ హనుమంతి పలుమార్లు కోరినా.. అప్పుడు చేసుకుంటా, ఇప్పుడు చేసుకుంటా అని చెప్పి మల్లికార్జున కాలం వెల్లదీశాడు. ఇటీవల హనుమంతి మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకుని రాగా.. పెళ్లి చేసుకునేందుకు మల్లికార్జున నిరాకరించాడు. ‘నీ కులం వేరు. ఇంట్లో కుటుంబ సభ్యులు వివాహానికి అభ్యంతరాలు చెబుతున్నారు. నీవు మరొకరిని వివాహం చేసుకోవాలని’ చెప్పాడు. దీంతో యువతి హనుమంతి దేవదుర్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దేవదుర్గ పోలీసులు కేసును రాయచూరు సదర్ బజార్ పోలీస్ స్టేషన్కు బదలాయించారు. బాధితురాలు హనుమంతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అతిథి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తుండగా.. దేవదుర్గలో మల్లికార్జున నీటి పారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. సదర్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతితో ఎనిమిది ఏళ్లుగా ప్రేమాయణం కులం వేరు అని చెప్పి పెళ్లికి నిరాకరణ యువకుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు -
ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర గొప్పది
సాక్షి, బళ్లారి: ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకం. సత్యం, న్యాయం వైపు పత్రికలు పనిచేయాలని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. శనివారం బీదర్లో కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, బీదర్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 40వ రాష్ట్ర పత్రికా సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పత్రికలు నిజాయితీగా పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం పరఢవిల్లుతుందని తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఒత్తిడికి గురికాకుండా నిజాయితీగా పనిచేయాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకుని రావాలన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తే ప్రభుత్వం స్పందించేందుకు దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఈశ్వర్ ఖండ్రే, రహీంఖాన్, శరుణు ప్రకాష్ పాటిల్, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన విలేకరులు పాల్గొన్నారు. -
కార్యకలాప–ఆధారిత విద్యను అందించాలి
హొసపేటె: ఉపాధ్యాయులు గణిత కిట్లను వినియోగించుకుని తమ బోధనలో పరిపూర్ణత సాధించాలి. తద్వారా పిల్లలకు కార్యకలాప–ఆధారిత విద్యను అందించాలని విషయ తనిఖీ అధికారి, ఎస్ఎస్ఎల్సీ నోడల్ అధికారి హులిబండి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక చిత్తవాడిగి ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కళాశాలలో పాఠశాల విద్యాశాఖ, అక్షర ఫౌండేషన్ సహకారంతో గణిత అభ్యాస ఉద్యమం కార్యక్రమం కింద జిల్లా స్థాయి గణిత సదస్సు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఉత్తమ విద్యను అందించే లక్ష్యంతో పాఠశాలలో మంచి వాతావరణాన్ని కల్పించేందుకు ఎస్డీఎంసీ అధ్యక్షులు, సభ్యులు ఉపాధ్యాయులతో కలిసి పని చేయాలని సూచించారు. డైట్ అధ్యాపకులు, నోడల్ అధికారి గర్హ్ ప్రభురాజ్ పాటిల్ మాట్లాడుతూ.. గణిత ఉపాధ్యాయుల కోసం రూపొందించిన గణిత అభ్యాస ఉద్యయం 2.0 ఆఫ్లైన్ శిక్షణపై వివరించారు. గణిత కిట్లు అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చేరాయని.. ఉపాధ్యాయులందరూ ఈ శిక్షణ వనరులను వినియోగించుకుని పిల్లలకు కార్యకలాప–ఆధారిత విద్యను అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిత్తవాడిగి పీయూ కాలేజీ ప్రిన్సిపల్ నాగరాజ్, ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు శివానంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫుట్పాత్ పరిశీలన
సాక్షి, బళ్లారి: నగరంలో కనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద పాదచారులు వెళ్లేందుకు నిధులు వెచ్చించి ఫుట్పాత్ పొడవునా ఇనుప రాడ్డు, చైన్లు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పని చేయడంతో ఇనుప రాడ్డు, చైన్లు అప్పుడే ఊడిపోయాయి. వాటికి మరమ్మతులు చేయించేందుకు అధికారులు చొరవ చూపకపోవడంతో శనివారం సాక్షి దినపత్రికలో ‘నాణ్యతకు తిలోదకాలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. శనివారం సంబంధిత అధికారులు స్పందించారు. ఊడిపోయిన ఇనుప రాడ్లు, చైన్లకు మరమ్మతులు చేయించారు. పాదచారుల రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ధర్మ మార్గంలో నడవాలి సాక్షి బళ్లారి: ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ధ్యానం, దైవ నామస్మరణ చేస్తూ జీవితాన్ని కొనసాగించాలని కొప్పళ గవిమఠం అవినవ గవి సిద్దేశ్వర స్వామి పేర్కొన్నారు. శనివారం తాలూకాలోని హంద్యాళ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అహంకారం, గర్వం నేను అనే భావన వీడి పరోపకారం కోసం పరితపించాలన్నారు. దేవుడిని మనసులో ఉంచుకుని పని చేయాలని సూచించారు. అహంకారం విడిచి పెడితేనే జీవితం సాఫీగా సాగుతుందన్నారు. కాలం మారిందని చెప్పే ముందు మనుషులు తమ మనస్సు, భావోద్వేగాలు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. జీవితంలో మనుషులకు బాధలు వస్తాయంటే ఉన్న పరిస్థితులను అంగీకరించే మనోభావం లేకపోవడమే ప్రధాన కారణమని వివరించారు. కార్యక్రమంలో శ్రీధరగడ్డ శాఖ విరక్తిమఠ కొట్టూరు స్వామి, స్థానిక ఎమ్మెల్యే గణేష్ తదితరులు పాల్గొన్నారు. ధర్మచింతనతో ప్రశాంతతసాక్షి, బళ్లారి: ప్రేమ, సహనం, ఐక్యత, ధర్మచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని వక్తలు పేర్కొన్నారు. రాజస్తాన్లో మౌంటు అబూలో విశ్వ ఏకతా దినోత్సవం సందర్భంగా బళ్లారి నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పాల్గొని, ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో జీవిస్తున్నారన్నారు. బ్రహ్మకుమారి ఓం శాంతి సంస్థ సమాజంలో శాంతి నెలకొల్పేందుకు విశేష కృషి చేస్తోందని కొనియాడారు. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం తదితర మంచి అలవాట్లు నేర్చుకుని ఉత్తమ జీవితాన్ని కొనసాగించాలన్నారు. అబార్షన్ చేయడం చట్టరీత్యా నేరంసాక్షి, బళ్లారి: చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరలో 16 సంవత్సరాల బాలికపై ఉపాధ్యాయుడు హెచ్.ఓ.రాజణ్ణ లైంగిక దాడి చేయడంతో గర్భం దాల్చింది. చెళ్లకెరెలోని లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్ హోమ్కు చెందిన డాక్టర్ శంకర లక్ష్మితో మాట్లాడి బాలికకు గర్భస్రావం చేయించిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ చేసిన విషయం వెలుగులోకి రావడంతో శనివారం లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ను వైద్యాధికారులు తనిఖీ చేశారు. అబార్షన్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా డబ్బుకు ఆశపడి బాలికకు అబార్షన్ చేసిన వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రికి అధికారులు చర్యలు తీసుకుంటారో లేదా వేచి చూడాలి మరి. -
అర్హులకే ఉద్యోగ అవకాశాలు
హొసపేటె: ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేటప్పుడు స్థానికులైన అర్హులైన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎటువంటి అవినీతికి తావు లేకుండా అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని నూతన డీహెచ్ఓ డాక్టర్ వినయ్కు స్లమ్ ఆర్గనైజేషన్ సభ్యులు కోరారు. డీహెచ్ఓ డాక్టర్ వినయ్ మాట్లాడుతూ.. తమ శాఖలో అవినీతికి ఎటువంటి అస్కారం లేదన్నారు. కేవలం అర్హులైన, తగిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. స్థానికులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య శాఖ సేవలను సమర్థవంతంగా అందించేందుకు తమవంతు కృషి చేస్తామని వెల్లడించారు. పరిపాలన సంస్కరణల కోసం ప్రజలు, వివిధ సంస్థల నుంచి వచ్చే సూచనలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు జంబయ్య నాయక్, దర్శన్ గౌడ్, రాజీవ్, స్లమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు హెచ్.శేషు, ఉపాధ్యక్షుడు తన్వీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేష్, రామచంద్ర బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుత్తి కై లాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్.హులిగెమ్మ, ఉపాధ్యక్షురాలు నూర్ జహాన్, ప్రధాన కార్యదర్శి బినరూపలత, జాఫ్రీన్, ఫేక్ మెహబూబ్ బాషా, ఎల్.పాండు నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో న్యాయవాది మృతి
రాయచూరు రూరల్: గుండెపోటుతో న్యాయవాది మృతి చెందిన ఘటన కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం కొప్పళ జిల్లా కుష్టగి సివిల్ సీనియర్ కోర్టులో కేసు వాదిస్తున్న సమయంలో న్యాయవాది నింగప్ప (48) గుండెపోటుకు గురై మృతి చెందారు. తావరగెరకు చెందిన నింగప్ప.. కోర్టు కార్యకలాపాల్లో నిమగ్నులు కావడంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు సమాచారం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి కోలారు: జిల్లాలోని బంగారుపేటలో ఉన్న ఎస్డీసీ విద్యార్థులు శనివారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జనజాగృతి జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా కెజీఎఫ్ ఎస్పీ శివాంశు రాజపూత్ మాట్లాడుతూ.. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలను సేవించాలని బలవంతం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాలు విద్యార్థుల అమూల్య జీవితాన్ని నాశనం చేస్తాయని తెలిపారు. జాతాలో 600 మందికి పైగా విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. -
హత్య కేసులో 10 మందికి యావజ్జీవ శిక్ష
రాయచూరు రూరల్: హత్య కేసులో 10 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ రాయచూరు 3వ అదనపు జిల్లా జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు. లింగసూగురు తాలుకా గుడదనాళలో పంచాయతీ కార్యాలయం విషయంలో ఫిబ్రవరి 10, 2021వ తేదీన హన్మంతమ్మ, శరణ బసవ, అమరేష్పై దాడి జరిగింది. శరణ బసవకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్సల నిమిత్తం బాగల్కోట అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శరణ బసవ మృతి చెందాడు. హన్మంతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన జగదీష్, మయనూర్, మహంకాళప్ప, బసవరాజ్ డొడ్డముని, హనుమంతి, దురుగప్ప, కెంచమ్మ, యల్లప్ప, యల్లమ్మ, నింగప్పకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రాయచూరు 3వ అదనపు జిల్లా జడ్జి, లింగసూగురు న్యాయమూర్తి జి.బి.జకాతి తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది మంజునాథ్ వాదనలు వినిపించారు. -
శ్రీనందకు కన్నీటి వీడ్కోలు
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లాలో మాణిక్య ధార జలపాతం వీక్షణకు వచ్చిన కేరళ బాలిక శ్రీనంద (15) అంత్యక్రియలు శుక్రవారం సొంతూరు పాలక్కాడ్ సమీపంలోని కాడంబపుర గ్రామంలో జరిగాయి. నాలుగు రోజుల కిందట మాణిక్యధార ప్రాంతంలో ఆమె అదృశ్యం కావడం, లోయలో శవం దొరకడం తెలిసిందే. అనుకోకుండా జారి పడిందా, కావాలనే దూకిందా అనేదానిపై అనుమానాలున్నాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి ధారలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. 10వ తరగతి చదువుతున్న శ్రీనంద ప్రతిభావంత విద్యార్థిని అని మిత్రులు తెలిపారు. చదువులు, ఆటల్లో చురుగ్గా పాల్గొనేది. కాగా, పోస్టుమార్టం నివేదిక వస్తే ఘటనపై స్పష్టత వస్తుందని పోలీసులు చెప్పారు. ఏఈఈ ఇంట్లో 6 కేజీల బంగారం● రూ.14 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు దొడ్డబళ్లాపురం: బెళగావి నగర అభివృద్ధి విభాగంలో ఏఈఈ గా పని చేస్తున్న అజయ్సింగ్ ఇల్లు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు దాడులు జరిపి రూ.14 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. అతని మీద అవినీతి కేసులు నమోదు కావడంతో 9న బెళగావిలోని ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. బ్యాంక్ ఖాతాలు, లాకర్ల గుట్టు లాగారు. భారీ మొత్తంలో డబ్బు, బంగారు నగలతో పాటు ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి. వివరాలను బెళగావి లోకాయుక్త ఎస్పీ శనివారం వెల్లడించారు. అతని వద్ద 6 కేజీల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు, బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.3.12 కోట్ల నగదు, బెళగావిలో 3 ఇళ్లు, సవదత్తి, హుక్కేరి, హుబ్బళ్లిలో 5 సంపన్న ప్రాంతాల్లో స్థలాలు ఉన్నట్టు తెలిపారు. ఇంట్లో ఉన్న బైక్లు, కార్లు కలిపి మొత్తం రూ.14కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. ఇవి అజయ్సింగ్ ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు అని పేర్కొన్నారు. -
మత్తు చిత్తులో జీవచ్ఛవం
బెంగళూరులో మత్తు భూతంపై మరోసారి చర్చ సంచలనానికి కారణమైన జాంబీ రాజవీర్సింగ్సాక్షి, బెంగళూరు: యువకుడు నిశ్చలంగా సుమారు నిమిషాల పాటు స్తబ్దుగా అలా నిలబడిపోయాడు, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలా జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇది జాంబీ డ్రగ్స్ వల్ల కలిగిన పరిణామమని చాలామంది కామెంట్లు చేశారు. ఇది చాలా ఆందోళనకరం, ఏమిటో తేల్చాలని నటుడు దునియా విజయ్ కూడా కోరారు. హోం మంత్రి జి.పరమేశ్వర్ ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు జాంబీ మత్తు రోగి చర్చకు కారణమయ్యాడు. జాంబీ డ్రగ్స్ ఉన్నాయా? జాంబీ డ్రగ్స్ అనేది మెదడు పనితీరును స్తంభింపజేసే మాదకద్రవ్యం. బతికున్న మనిషి జీవచ్ఛవంగా మారిపోతాడు, అమెరికాలో ఇటువంటి మత్తు పదార్థాలు వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారతదేశంలో కూడా ఈ జాంబీ డ్రగ్స్ ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. అందులోనూ బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇది లభ్యమైనట్లు తెలుస్తోంది. వెర్రెత్తే మూగజీవాలను శాంతపరించేందుకు ఇటువంటి శక్తిమంతమైన మత్తు పదార్థాలను వాడతారని తెలిసింది. అయితే ఇటీవల కాలంలో మనుషులు దీనిని ఎక్కువ మత్తు కోసం సేవిస్తున్నారు. ఈ డ్రగ్ సేవించిన మనుషులు గంటల కొద్దీ రోడ్డుపై, ఎక్కడుంటే అక్కడ జాంబీలా నిశ్చలంగా నిలబడి ఉండిపోతారు. ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి. బెంగళూరులో మత్తు బెడద ఇటీవల కాలంలో బెంగళూరులో డ్రగ్స్ విక్రయాలు, వినియోగాలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యార్థులను, యువకులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. తరచుగా పోలీసులు దాడులు జరిపి కేజీల కొద్దీ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కమిషనర్ ఏమన్నారంటే.. జాంబీ డ్రగ్ వీడియోపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అలాంటి డ్రగ్ అంటూ ఏదీ లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని, వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ చెప్పారు. వీడియోలో ఉన్న వ్యక్తిని గుర్తించినట్లు, అతడు ఇక్కడి వాడు కాడని, మద్యం సేవించిన తర్వాత మెడిసిన్ తీసుకోవడం వల్ల ఈ విధంగా జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్స అవసరమని, ఎలాంటి డ్రగ్స్ అతడు తీసుకోలేదని చెప్పారు. అతనొక లారీ డ్రైవర్ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పంజాబ్కు చెందిన లారీ డ్రైవర్ రాజవీర్ సింగ్.. ఇతడు గతంలో హఫీం అనే మత్తుకు అలవాటు కావడంతో కుటుంబీకులు డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. బెంగళూరుకు వచ్చిన ఇతడు కొందరు డ్రైవర్లతో కలసి షెడ్లోనే నివసిస్తున్నాడు. ఇతనికి కీళ్లనొప్పులు, సైనసైటిస్ అనే వ్యాధులు ఉన్నాయి. మద్యం కూడా తాగుతాడు. అలా మద్యం తాగిన తరువాత రెండు మాత్రలు తీసుకున్నాడు. దీనివల్ల రియాక్షన్ జరిగి నడవలేక అలాగే నిలబడిపోయాడు. జాంబీ డ్రగ్స్ వాడాడని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలుస్తోంది. బెంగళూరు జాంబీ మ్యాన్ వ్యవహారం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం డ్రగ్స్ వల్లే అని ప్రచారం అదేం లేదన్న పోలీసులు వైరల్ చేశాడు.. అరెస్టయ్యాడు బనశంకరి: జాంబీ డ్రగ్స్ అంటూ వీడియో షేర్ చేసిన ప్రైవేటు కంపెనీ ఉద్యోగి, విద్యారణ్యపుర నివాసి హేమంత్ కుమార్కు నోటీసులు ఇచ్చిన బాగలూరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇటువంటి తప్పుడు సమాచారం వైరల్చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సీమంత్ కుమార్సింగ్ అన్నారు. -
హస్తినకు హస్తం సీనియర్ల యాత్ర
శివాజీనగర: మంత్రిమండలిలో మార్పులు చేయాలని కాంగ్రెస్కు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో హస్తిన వైపు దృష్టి సారించారు. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు ముగిసింది, 3, 4సార్లు గెలుపొందిన తమకు మంత్రి పదవులు ఇవ్వాలని సీనియర్ ఎమ్మెల్యేలు ఆదివారం లేదా సోమవారం ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను కలిసే అవకాశముంది. సుమారు 35 మందికి పైగా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏఐసీసీ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, కే.సీ.వేణుగోపాల్, రణదీప్సింగ్ సుర్జేవాలా తదితరులను కలిసి తమ డిమాండ్లు తెలుపుతామని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. రెండు అసెంబ్లీ క్షేత్రాల ఉప ఎన్నికలు కూడా అయిపోవడంతో తమ గొంతును గట్టిగా వినిపించాలని తీర్మానించారు. ఎమ్మెల్యే టీ.బీ.జయచంద్ర ఈ బందంలో ఉన్నారు, తాము ఢిల్లీకి వెళ్లి నేతలను కోరడం తథ్యమని చెప్పారు. ఎంతమందికి మంత్రిమండలిలో అవకాశం లభిస్తుందో తెలియదు, అనుభవజ్ఞులకు ఇవ్వాలని కోరుతామని, ఎవరినీ కేబినెట్ నుంచి తొలగించాలని చెప్పమని, హైకమాండే తీర్మానిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చించబోమన్నారు. ఒకవేళ చర్చల్లో ప్రస్తావనకే వస్తే అది కూడా మాట్లాడతామని తెలిపారు. దావణగెరె చిచ్చు రేగింది అధికార కాంగ్రెస్లో దావణగెర దక్షిణ అసెంబ్లీ క్షేత్రం ఉప ఎన్నికల చిచ్చు రేగింది. ఇక్కడ జరిగిన గొడవలపై ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శి అభిషేక్ దత్ హైకమాండ్కు నివేదిక ఇవ్వగా, కేపీసీసీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అబ్దుల్ జబ్బార్ శనివారమే పార్టీ పదవికి రాజీనామా చేశారు. మైనారిటీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ ఒత్తిడి చేయడంతో దావణగెరెలో పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో అభిషేక్ దత్ విచారణ జరిపారు. పార్టీ గెలుపుపై ప్రభావం ఉండొచ్చని ప్రచారమూ ఉంది. పార్టీ సస్పెండ్ చేస్తుందని తెలిసి జబ్బార్ ముందే తప్పుకున్నారు. సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నజీర్ అహమ్మద్ను కూడా సాగనంపే అవకాశముంది. వివాదానికి మూలబిందువైన మంత్రి జమీర్ అహమ్మద్ మీద వేటు పడవచ్చని ప్రచారం మొదలైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ పరిణాలేవీ తెలియదని దాటవేత ధోరణిని ప్రదర్శించారు. మంత్రి పదవుల కోసం పట్టు పార్టీలో దావణగెరె ఉప ఎన్నికల రచ్చ.. ఓ సీనియర్ నేత రాజీనామా -
మహిళా రిజర్వేషన్లకు మద్దతివ్వాలి
బనశంకరి: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందించే మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్టీలకు అతీతంగా పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కోరారు. శనివారం బెంగళూరులో బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15, 16 తేదీల్లో పార్లమెంటు ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రత్యేక సమావేశం జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు లాభనష్టాలు ఆలోచించకుండా మద్దతు పలకాన్నారు. తద్వారా మహిళల దశాబ్దాల కల నెరవేరుతుందన్నారు. 15 ఏళ్ల క్రితం పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కొందరు ఎంపీలు రభస చేశారన్నారు, ఈసారి అలాంటివాటికి అవకాశం ఉండదన్నారు. కాంగ్రెస్ నాయకులకు మహిళ అంటే ప్రియాంకాగాంధీ మాత్రమేనా, వేరే మహిళలు ఎన్నిక కాకూడదా? అని విమర్శించారు. పార్టీ నాయకురాళ్లు మాళవిక అవినాశ్, రూపాలి నాయక్, సురభి హొదిగెరె తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శోభ -
రంజుగా కురుక్షేత్రం
తుమకూరు: ప్రస్తుత ఆధునిక మాధ్యమాల జోరులో రంగభూమి నాటకాల ప్రదర్శన కనుమరుగవుతోందని, అక్కడక్కడన్నా నాటకాలు సజీవంగా ఉన్నాయంటే గ్రామీణ కళాకారుల వల్లేనని ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అన్నారు. తురువేకెరె తాలూకా దబ్బేఘట్ట హోబళి గోణి తుమకూరులో గద్దెకెంపమ్మ దేవీ , శ్రీ ఆదిశక్తి అరసమ్మదేవీ గ్రామ దేవత పండుగలో కురుక్షేత్ర నాటక ప్రదర్శన జరిగింది. ఆద్యంతం కళాకారులు నటనతో రక్తి కట్టించారు. ఎమ్మెల్యే వీక్షించి మాట్లాడుతూ నేటి యువతకు, చిన్నారులకు మన పురాణాలను పరిచయం చేయాలన్నారు. నాటకాల సారాంశాన్ని యువకులు అర్థం చేసుకుని మంచి సమాజ నిర్మాణానికి సహకరించాలని తెలిపారు. ఐపీఎల్లో బెట్టింగులు.. ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: ఐపీఎల్లో పెద్దమొత్తంలో బెట్టింగులు ఆడి పోగొట్టుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలబుర్గి జిల్లా కాళగి తాలూకా రుమ్మనగోడ్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామవాసి చంద్రకాంత్ దేశాయి (40) స్థానిక బెణ్ణెతూరా డ్యాంలోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం సాగుతున్న ఐపీఎల్ టోర్నీలో ఫలానా టీం గెలుస్తుందని, ఫలానా బౌలర్ వికెట్ తీస్తాడని అప్పులు చేసి మరీ ఆన్లైన్లో పందేలు ఆడాడు. అయితే పందేలన్నీ ఓడిపోయి డబ్బులు పోయాయి. దీంతో అప్పులు తీర్చలేక, విరక్తితో డ్యాంలోకి దూకాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జేడీఎస్ బృహత్ సమావేశం శివాజీనగర: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ)లో ఐదు నగర పాలికెల ఎన్నికలకు జేడీఎస్ సిద్ధమవుతోంది. కొమ్మఘట్టలో కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, జేడీఎస్ యువ విభాగం రాష్ట్రాధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతి వెలిగించటం ద్వారా మాజీ ప్రధాని హెచ్.డీ.దేవేగౌడ సమావేశాన్ని ప్రారంభించారు. నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతూ బెంగళూరు అభివృద్ధికి మాజీ ప్రధాని హెచ్.డీ.దేవేగౌడ, కుమారస్వామి ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. దేవేగౌడ ప్రసంగిస్తూ దేశంలోనే ప్రప్రథమంగా హెచ్.డీ.కుమారస్వామి గ్రామాలలో బస చేశారు, రైతుల సమస్యలు ఆలకించి, రైతులకు ఆర్థిక సహాయం అందించారని అన్నారు. కాఫీ తోటలో పసిగుడ్డు బనశంకరి: కిరాతక తల్లిదండ్రులు ఎవరో గానీ.. అప్పుడే పుట్టిన పసిగుడ్డును కాఫీ తోటలో వదిలివెళ్లారు. ఈ ఘటన కొడగు జిల్లా విరాజపేటే తాలూకా బేత్రి గ్రామంలో జరిగింది. ఆకులు పరిచి వాటి మీద పసికందును పెట్టి వెళ్లిపోయారు. శిశువు ఏడుపును విన్న స్థానికులు బిడ్డను చేరదీసి, శిశు సంక్షేమ అధికారులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. మడికెరి రూరల్ పోలీసులు తల్లిదండ్రులు ఎవరనేదానిపై విచారణ చేపట్టారు. చిరుతను చంపిన ముళ్లపందిమైసూరు: ముళ్లపందిని వేటాడేందుకు వెళ్లిన చిరుత దాని ముళ్లకు చిక్కుకుని మరణించింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మనహళ్లిలో జరిగింది. ఆకలితో ఉన్న చిరుత ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండగా ముళ్ల పంది ఎదురైంది. దానిని భక్షించాలని చిరుత దాడి చేసింది. అయితే ముళ్ల పంది ప్రతిఘటించి పోరాడింది, దాని ముళ్లు చిరుత ఎదలో కుచ్చుకున్నాయి. దీంతో రక్తస్రావమైన చిరుత అక్కడే మరణించింది. అటవీ సిబ్బంది గస్తీ కాస్తుండగా చిరుత కళేబరం, దాని దేహంపైన ముళ్లు కనిపించాయి. పోస్టుమార్టం జరిపి పూడ్చివేశారు. -
బెంగళూరు– ముంబై మధ్య వందేభారత్ స్లీపర్ రైలు?
శివాజీనగర: చాలాకాలంగా ఎదురు చూస్తున్న బెంగళూరు– ముంబై నగరాల మధ్య సూపర్ఫాస్ట్ వందే భారత్ స్లీపర్ రైలు సంచారానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ముంబైకి వందే భారత్ స్లీపర్ రైలు కావాలని బెంగళూరు ఎంపీలు కోరుతున్నారు. రెండు నగరాల మధ్య సుమారు 976 కిలోమీటర్ల దూరం ఉంది. రైలు ప్రయాణం 24 నుంచి 30 గంటలు పడుతుంది. బస్సులో అయితే 16 నుంచి 18 గంటల్లో అయిపోతుంది. వందే భారత్ స్లీపర్ రైలు ఎప్పటినుంచి మొదలయ్యేది త్వరలో ప్రకటిస్తారు. రాష్ట్రంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు కానుంది. కర్ణాటకలో సుమారు 22 వందే భారత్ రైళ్లు సంచరిస్తున్నాయి. బెంగళూరు నుంచి చైన్నె, హైదరాబాద్, మంగళూరుకు వెళ్తున్నాయి. తల్లీ, కూతురి అదృశ్యం మండ్య: బంధువుల ఇంటికి వెళుతున్నా అని చెప్పి వెళ్లిన తల్లీకూతురు తిరిగి రాలేదు. వివరాలు.. శ్రీరంగ పట్టణ వద్ద హెబ్బాడిహుండికి చెందిన ముజాహిద్ భార్య రూహిల (25), ఆమె కుమార్తె మన్నత్ (4)ను తీసుకుని 7న ఉదయం మైసూరులోని బంధువుల ఇంటికి వెళుతున్నట్లు చెప్పి వెళ్లింది. అయితే బంధువుల ఇంటికి చేరుకోలేదు, మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. భర్త పలుచోట్ల గాలించినా జాడ లేరు. ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోంది, దీంతో శ్రీరంగపట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. చెరువులో నంది విగ్రహం లభ్యం దొడ్డబళ్లాపురం: చెరువులో పూడికతీత తవ్వకాలు జరుపుతుండగా పురాతన కాలం నాటి నంది విగ్రహం బయటడింది. హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా దూదిహళ్లిలో ఈ సంఘటన జరిగింది. కూలీలు మట్టిని తవ్వుతుండగా 3 అడుగుల ఎత్తుగల బసవన్న రాతి విగ్రహం బయటపడడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. నందిని చూడాలని చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తరలివచ్చారు. విగ్రహాన్ని గ్రామంలోని దేవాలయం వద్ద ప్రతిష్టించాలని గ్రామస్తులు తీర్మానించారు. -
27ఏళ్ల యువకుడితో 57ఏళ్ల టీచర్ వివాహేతర సంబంధం
కర్ణాటక: ప్రభుత్వ టీచర్ని నమ్మించి హత్య చేసిన దుండగుని బాగోతమిది. వివరాలు.. బీదర్ జిల్లా బాల్కి తాలూకా వంజార్ ఖేడ్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి కపాళె ’(57) అనే మహిళను అమర్ (27)అనే యువకుడు హత్య చేశాడు. బీదర్లో నివసిస్తున్న జ్యోతి వారానికి ఒకసారి కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కల్మూడ గ్రామంలోని పుట్టింటికి వస్తుండేది. ఈ క్రమంలో నిందితుడు అమర్తో పరిచయమై సన్నిహితంగా మెలిగేవారు. అతనికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.రూ.20 లక్షలు తీసుకుని..6 రోజుల క్రితం కల్మూడ గ్రామం శివారులో నిర్జన ప్రదేశంలో జ్యోతి శవం కాలిన స్థితిలో లభించింది. జ్యోతి వివాహం చేసుకోలేదు. ఒంటరిగా జీవిస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేసేది. అమర్ ఆమె వద్ద సుమారు రూ.20 లక్షల వరకూ అప్పు తీసుకున్నాడు. డబ్బులు వెనక్కు ఇవ్వాలని జ్యోతి ఒత్తిడి చేయడంతో మాట్లాడదామని నమ్మించి 3వ తేదీన ఆమెను ఊరి బయటకు తీసుకెళ్లి హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు కాల్ డిటైల్స్, ఇతర సాక్ష్యాధాల ఆధారంగా అమర్ ఈ హత్య చేశాడని గుర్తించి అరెస్టు చేశారు. -
విదేశీ ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్న నిరుద్యోగులు సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు
బనశంకరి: ఉద్యోగ అవకాశాల పేరిట సోషల్ మీడియాలో వెలువడిన ప్రకటనలను గమనించి విదేశాలకు వెళుతున్న భారతీయ యువకులు సైబర్ ముఠాల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకు పెరగడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 2025 డిసెంబరు వరకు అంటే ఏడాదిలో విదేశాల్లో సైబర్ ముఠాల చేతుల్లో చిక్కుకున్న 4,300 మందికి పైగా యువకులను కాపాడి భారత్కు తీసుకువచ్చారు. ఇదే సమయంలో సైబర్ ముఠా చేతుల్లో చిక్కుకునేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం మయన్మార్, కాంబోడియా, లావోస్ తదితర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లి అక్కడ సైబర్ నేరగాళ్ల ముఠాల చేతుల్లో చిక్కుకున్న యువకుల సంఖ్య 2022లో 456 మంది, 2023లో ఈ సంఖ్య 540 మంది, 2024లో 1,687 మందికి చేరుకుంది. ఏడాదిలో 4,300 మంది యువకుల రక్షణ 2025 డిసెంబరు నాటికి 4,300 మందికి చేరుకోగా సైబర్ ముఠా వలలో పడిన చాలా మంది యువకులను రక్షించి సురక్షితంగా భారత్కు తరలించారు. కానీ భారత్ నుంచి వెళ్లిన వేలాది మంది యువత అక్కడ జీతగాళ్లుగా పని చేస్తున్నట్లు సమాచారం అందింది. నకిలీ నియామక సంస్థలు లేదా ఏజెంట్లు ప్రలోభాలకు గురైన యువత అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. అక్కడికి వెళ్లిన అనంతరం వంచకులు పాస్పోర్ట్సుతో పాటు అన్ని రికార్డులను లాక్కుని సైబర్ నేరాల్లోకి మళ్లిస్తున్నారు. ఎలా వంచనకు పాల్పడాలి అనే దాని గురించి శిక్షణ అందించి సైబర్ నేరాలకు పాల్పడటానికి వినియోగిస్తున్నారని సైబర్ క్రైం అధికారులు తెలిపారు. నకిలీ కాల్సెంటర్ను కనుగొన్న పోలీసులు బెంగళూరు నగరంలోనే కాల్సెంటర్ను తెరిచి పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ వంచకుల ముఠాను సైబర్ కమాండ్ కేంద్రం అధికారులు ఇటీవల కనిపెట్టారు. జయనగర 9వ బ్లాక్లో నకిలీ కాల్ సెంటర్ను తెరిచిన ఇద్దరు సైబర్ వంచకులను అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్లను విధులకు నియమించి కాల్ సెంటర్ ముసుగులో ప్రజలకు, సాఫ్ట్వేర్, విశ్రాంత ఉద్యోగులకు, పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేసి ఆన్లైన్ పెట్టుబడి, స్టాక్ మార్కెట్ పేరుతో డబ్బు పెట్టుబడి పెట్టించుకుని వంచనకు పాల్పడుతున్నారు. తలా ఒక ఎగ్జిక్యూటివ్కు రూ.25 వేల వేతనం అందిస్తున్నట్లు సైబర్క్రైం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. నకిలీ దందా నియంత్రణకు చర్యలు ● నకిలీ ఉద్యోగాల దందాపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరిక ● సోషల్ మీడియాలో ప్రకటనలు అసలైనవా? కాదా? అనేది పరిశీలించాలి ● ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉద్యోగ ఆఫర్ల స్వీకరణకు ముందు జాగ్రత్త పడాలి ● నియామక ఏజెంట్లు, కంపెనీల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. కాంబోడియా, మయన్మార్, ఆగ్నేయ ఆసియాలో ఉద్యోగాల పేరుతో ఆశ చూపించడం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాలో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం భారీ మొత్తంలో వేతనం అందిస్తామని ఆశ పెట్టడం ప్రయాణ ఖర్చు మేమే భరిస్తామని యువకులకు హామీ విదేశాలకు వెళ్లిన అనంతరం పాస్పోర్ట్స్, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకోవడం సైబర్ నేరాల గురించి శిక్షణ ఇచ్చిన అనంతరం విధుల్లో నియమించడం ఆయా రాష్ట్రాల వారిని వంచనకు ఆయా భాషల యువకుల నియామకం విదేశీ ఉద్యోగాల మోజుతో చిక్కుల్లో యువత కేటుగాళ్ల కబంధ హస్తాల్లో చిక్కుకుని నరకయాతన బాధితుల సంఖ్య ఏటేటా పెరుగుతుండడం ఆందోళనకరంసైబర్ వంచకులు ఎలా గాలం వేస్తారంటే..? -
చాముండి కొండపై పనులు వెంటనే ఆపేయండి
● రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు శివాజీనగర: న్యాయస్థానానికి చేసిన వాగ్దానాన్ని ధిక్కరించి మైసూరులోని చాముండి కొండపై దేవాలయ ఆవరణలో పనులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన హైకోర్టు, వివాదిత స్థలంలో జరుగుతున్న అన్ని రకాల నిర్మాణ పనులను వెంటనే నిలిపేయాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. చాముండి కొండ మూల స్వరూపానికి భంగం కలిగించేలా పనులు జరుగుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ మైసూరు రాజవంశీకురాలు ప్రమోదా దేవి ఒడెయర్ సమర్పించిన పిటిషన్ను విచారణ జరిపిన న్యాయమూర్తి మంత్రి శంకర్ మగ్దూంతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర అఫిడవిట్ సమర్పించండి: దేవాలయ ఆవరణలో జరుగుతున్న పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.47 కోట్లను ఏయే పనులకు ఎంత సొమ్ము ఖర్చు చేశారు? అనే విషయాలపై రెండు వారాల్లో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. న్యాయస్థానం ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి శాశ్వత పనులు చేపట్టబోమని గతంలో రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది. అయితే న్యాయస్థానానికి సమర్పించిన ఫోటోలను గమనిస్తే ఆలయ ఆవరణలో భారీ స్థాయిలో శాశ్వత నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోందని ధర్మాసనం వెల్లడించింది. పీయూసీ విద్యార్థిని ఆత్మహత్య యశవంతపుర: ద్వితీయ పీయూసీ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు హెబ్బాళ పోలీసుస్టేషన్ పరిధిలోని మనోరాయనపాళ్యలో జరిగింది. ఇక్కడ నివాసం ఉంటున్న ఆంథోని కుమార్తె తనూశ్రీ అదే ప్రాంతంలోని కళాశాలలో పీయూసీ చదివింది. గురువారం ఫలితాలు విడుదల కాగానే తనూశ్రీ తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా లెక్కలు, రసాయనశాస్త్రంలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బయట పడింది. తన మొబైల్ స్టేటస్లో 3 గంటలకు చనిపోతున్నట్లు పెట్టింది. దీనిని గమనించిన స్నేహితురాలు మా ఇంటికి రావాలని మేసేజ్ పెట్టింది. తనూశ్రీ కూడా సరే అంది. మరో స్నేహితురాలు ఆమె సందేశాన్ని చూసి తక్షణం ఆమె ఇంటి వద్దకు వెళ్లగా అప్పటికే ఉరికి వేలాడుతూ కనిపించింది. ప్రముఖ సాహితీవేత్త కన్నుమూతదొడ్డబళ్లాపురం: ప్రముఖ సాహితీవేత్త, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రామస్వామి(89) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన సేవలకుగాను నాడోజతో సహా ఎన్నో అవార్డులు వరించాయి. ఆయన రచనలు సాహిత్యాభిమానులను అలరించాయి. పర్యావరణ సంరక్షకుడిగా, సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవలందించారు. -
మట్టి చరియలు కూలి ముగ్గురు కార్మికుల మృతి
శివమొగ్గ: మట్టిగోడ కూలి ముగ్గురు కార్మికులు మరణించిన ఘటన హులికల్ ఘాట్ చండికాంబ ఆలయ మలుపు వద్ద చోటు చేసుకుంది. ఇక్కడ నిరంతరంగా మట్టి కూలుతుండడం వల్ల మరమ్మతు చర్యలు చేపట్టారు. గురువారం పనులు జరుగుతున్న సమయంలో మట్టి కూలడంతో రాఘవేంద్ర, రాజు, శబ్బీర్ అనే కార్మికులు శిథిలాల కింద కూరుకుపోయి మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, తాలూకా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం యశవంతపుర: హుళికల్ ఘాట్లో మట్టిచరియలు విరిగి పడి అసువులుబాసిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈమేరకు ఎక్స్లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు దుఃఖాన్ని భరించే శక్తి భగవంతుడు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిపై చర్యకు వినతి ● హైకమాండ్కి లేఖ రాసిన రాష్ట్ర ఇన్చార్జ్ సుర్జేవాలా దొడ్డబళ్లాపురం: ఇటీవల దావణగెరెలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయని మంత్రి జమీర్ అహ్మద్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్సింగ్ సుర్జేవాలా హైకమాండ్కి లేఖ రాశారు. మంత్రి జమీర్, ఎమ్మెల్సీలు అబ్దుల్ జబ్బార్, నజీర్ అహ్మద్లపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్ శామనూరుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయాలని పార్టీ ఆదేశాలు ఇవ్వగా మైనార్టీలకు టికెట్ ఇవ్వలేదనే అక్కసుతో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని లేఖలో వివరించారు. చివరి క్షణంలో మాత్రం అభ్యర్థి ఇంటికి వచ్చి మద్దతు ఇస్తున్నానని చెప్పి తాను కేరళ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఉన్నందున ఎన్నికల ప్రచారానికి రాలేదని మీడియా సమావేశంలో చెప్పి వెళ్లిపోయారని తెలిపారు.ఒత్తిడితోనే రాయ్ ఆత్మహత్య యశవంతపుర: కాన్పిడెంట్ గ్రూప్ సంస్థ ముఖ్యుడు సీజే రాయ్ మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు తేల్చింది. ఈ ఏడాది జనవరి 30న బెంగళూరులోని రిచమండ్ రోడ్డులోని ఆయనకు చెందిన కార్యాలయంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేయగా అక్కడే ఉన్న రాయ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆదాయ పన్ను శాఖ అధికారుల ఒత్తిడి కారణంగా రాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణల కారణంగా ప్రభుత్వం ఈ కేసును సిట్తో విచారణ చేయించింది. మానసిక ఒత్తిడి కారణంగా రాయ్ అందుకు మందులను వాడేవారు. అయితే ఆత్మహత్యకు నెల రోజుల ముందు నుంచి మందులను వాడటాన్ని పూర్తిగా నిలిపేశారు. మానసిక ఒత్తిడికి నికరమైన కారణాలు తెలియటం లేదని సిట్ విచారణలో బయట పడింది. తల్లీ కూతురు పీయూసీ పాస్ యశవంతపుర: ద్వితీయ పీయూసీ ఫలితాలు గురువారం వెలువడ్డాయి. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళకు చెందిన తల్లీ, కూతురు ఉత్తీర్ణత సాధించారు. బీసీ రోడ్డు కై కంబకు చెందిన గృహిణి వీఆర్ నేత్రావతి, ఆమె కుమార్తె ఆర్.హేమశ్రీ పీయూసీ పాసై ఆనంద పడుతున్నారు. హేమశ్రీ బి మూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆర్ట్స్ విభాగంలో 562 మార్కులను సాధించి టాపర్గా నిలిచారు. నందావర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ముఖ్యోపాధ్యాయుడు రవికుమార్ భార్య నేత్రావతి పీయూసీ ఫెయిల్ కావటంతో పలు సార్లు పరీక్ష రాశారు. ఈసారి కుమార్తె బీ మూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతుండగానే తను కుమార్తెతో కలిసి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన పీయూసీ పరీక్షలను రాసి ఉత్తమ మార్కులతో పాసయ్యారు. -
శ్రీనందా ఉదంతం విషాదాంతం
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా చంద్రద్రోణ పర్వత శ్రేణిలో మాణిక్యధార జలపాతం వద్ద మూడు రోజుల క్రితం అదృశ్యమైన కేరళకు చెందిన విద్యార్థిని శ్రీనందా(14) శుక్రవారం మధ్యాహ్నం శవమై తేలింది. 2 వేల అడుగుల లోతులోని లోయలో శ్రీనందా మృతదేహాన్ని పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. కేరళ నుంచి 40 మందితో కలిసి తల్లి రోహిణితో కలిసి శ్రీనందా మాణిక్యధార జలపాతం వద్దకు వెళ్లి వీక్షిస్తుండగా పొరపాటున కాలుజారి లోయలో పడినట్లు అనుమానిస్తున్నారు. ఇనాము దత్తాత్రేయ పీఠం, మాణిక్యధారలను వీక్షిస్తున్న సమయంలో బాలిక ఆకస్మికంగా అదృశ్యమైంది. ఘటన తరువాత పోలీసులు బాలిక ఆచూకీ కోసం వెతకటం ప్రారంభించారు. బాలిక ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళం, పోలీసులు, ఏఎన్ఎఫ్ బృందాలు గాలించాయి. అటవీ ప్రాంతంతో పాటు దట్టమైన కొండల మధ్య డ్రోన్ల సాయంతో పరిశీలించారు. మూడు రోజుల పాటు తీవ్రమైన గాలింపు మధ్య శుక్రవారం అత్యంత లోయ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. అరిశినగుప్పె ప్రాంతంలో మృతదేహం మాణిక్యధార మార్గంలోని అరిశినగుప్పె వద్ద శ్రీనందా మృతదేహం ఒక బృందానికి కనిపించింది. తక్షణం మృతదేహాన్ని అటవీశాఖ సిబ్బంది అతికష్టం మీద లోయలో నుంచి పైకి తెచ్చారు. అనంతరం చిక్కమగళూరు జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని పోలీసులు తరలించారు. ఆమె అదృశ్యం కావటానికి ముందు తండ్రి వద్దనున్న మొబైల్లో అనేక రీల్స్, ఫోటోలు తీసుకున్నారు. వెంట వచ్చిన పర్యాటకులందరూ కిందకు దిగినా శ్రీనందా మాత్రం మాణిక్యధార కొండ పైభాగంలోనే ఉన్నారు. 10 నిమిషాల్లో అందరూ కిందకు దిగిన తర్వాత శ్రీనందా అదృశ్యమయ్యారు. పర్యాటకులు చుట్టు పక్కల తిరిగి వెదికినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు బాలిక కాలు జారి పడిందా? లేక ప్రమాదం ఎలా జరిగిందా? అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం లభించగానే కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనందా మృతిపై స్థానికంగాను అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జారి పడిందా? లేక ఎవరైనా కిడ్నాప్ చేసి పైనుంచి తోసేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జారి పడిన ఆమె ఒంటిపై గాయాలైన గుర్తులున్నాయి. అదృశ్యమైన రోజు ఆమె ఏ దుస్తులను ధరించిందో అవే దుస్తులు మృతదేహంపై ఉన్నాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఆమె ఎలా మరణించిందో తెలియనున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అనుమానం ఉన్న అన్ని కోణాల నుంచి శ్రీనందా మృతి కేసును విచారించనున్నట్లు శాంతిభద్రతల విభాగం అడిషనల్ పోలీసు డైరెక్టర్ జనరల్ హితేంద్ర తెలిపారు. ఆమె మృతిపై ఇప్పటికే తల్లిదండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేయటంతో అన్ని కోణాల్లో విచారణ చేస్తామని అయన హామీనిచ్చారు.బాలిక మృతదేహాన్ని వెలికి తీసుకొస్తున్న రెస్క్యూ టీంజలపాతం వద్దలోయలో బాలిక మృతదేహాన్ని కనుగొన్న రెస్క్యూ టీం మూడు రోజుల తర్వాత దొరికిన మృతదేహం -
ఇంకా చాలా మందే అక్కడ ఉన్నారు.!
కాంబోడియా, వియత్నాంలో చైనీస్ హ్యాకింగ్ ముఠాల చేతుల్లో చిక్కుకుని రాష్ట్రంలోని కొప్ప, బాళెహొన్నూరు, చిక్మగళూరు, కోలారుకు చెందిన 10–15 మంది యువకులను కాపాడి రాష్ట్రానికి తరలించామని, ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులు ఇంకా చాలా మంది అక్కడ ఉన్నట్లు సమాచారం అందిందని ఎమ్మెల్సీ డాక్టర్ ఆరతి కృష్ణ తెలిపారు. విదేశాల్లో సులభంగా ఉద్యోగం లభిస్తుందనే ఆశతో యువకులు అక్కడికి వెళ్లి చీకటి గదుల్లో మగ్గిపోయే పరిస్దితి తెచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు. ఉద్యోగాల ఆశ చూపించి విదేశాలకు తీసుకెళ్లి వంచనకు పాల్పడే నకిలీ ఏజెంట్లు, సంస్థల ఆచూకీ కనిపెట్టే కేంద్రప్రభుత్వం, ఈ–మైగ్రేట్ పోర్టల్లో అప్డేట్ చేసింది. 2025 డిసెంబరు వరకు 3,505 నమోదు కానీ నకిలీ సంస్థల జాబితాను పోర్టల్లో ప్రకటించింది. ఆ జాబితాను పరిశీలించుకుని నకిలీ ఏజెన్సీల పట్ల జాగ్రత్త వహించాలని ఎమ్మెల్సీ నిరుద్యోగ అభ్యర్థులకు సలహా ఇచ్చారు. -
లోకాయుక్తకు చిక్కిన అవినీతి అధికారి
రాయచూరు రూరల్: పట్టణ ప్రాంతంలో నివాసానికి పేరు (మ్యుటేషన్) మార్చేందుకు లంచం తీసుకుంటూ సిరవార పట్టణ పంచాయతీ ముఖ్య అధికారి సురేష్ శెట్టి లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డారు. వివరాలు.. సిరవార పట్టణానికి చెందిన రాఘవేంద్ర రెడ్డి తన ఇంటి పేరు మార్చాలని పంచాయతీ ముఖ్య అధికారి సురేష్ శెట్టిని కలిశారు. పేరు మార్చాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని సురేష్ శెట్టి డిమాండ్ చేయడంతో రాఘవేంద్ర రెడ్డి రూ.లక్ష ఇచ్చాడు. అయితే పని పూర్తి చేయకుండా కాలయాపన చేశాడు. మిగతా రూ.లక్ష ఇస్తేనే పని పూర్తి చేస్తానని సురేష్ శెట్టి తెలిపారు. అంత డబ్బు తన వద్ద లేదని రాఘవేంద్ర రెడ్డి చెప్పినా వినిపించుకోలేదు. మనస్తాపానికి గురైన రాఘవేంద్ర రెడ్డి.. ఈ విషయాన్ని లోకాయుక్త అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. శుక్రవారం సురేష్ శెట్టి డబ్బు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు దాడి చేశారు. లోకాయుక్త అధికారులను గమనించిన ముఖ్య అధికారి సురేష్ శెట్టి కారులో కవితాళ వైపు పరారీ అయ్యారు. మైబెల్ లొకేషన్ ఆధారంగా సురేష్ శెట్టి జాడను పోలీసులు గుర్తించారు. కవితాళ ప్రభుత్వ అతిథి భవనంలో తల దాచుకున్నట్లు తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన సిరవార పట్టణ పంచాయతీ ముఖ్య అధికారి -
కామాంధుడిగా మారిన ఉపాధ్యాయుడు
సాక్షి, బళ్లారి: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. 16 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి చేయడంతో.. గర్భం దాల్చింది. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరెలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. చెళ్లకెరెలోని ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాలలో హెచ్.ఓ.రాజణ్ణ గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పాఠశాల గది లోపలే ఆ విద్యార్థినిపై నిరంతరం లైంగిక వేధింపులకు పాల్పడటం వల్ల బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే సమస్య అవుతుందని భావించిన ఉపాధ్యాయుడు రాజణ్ణ.. బాలికకు అబార్షన్ (గర్భస్రావం) చేయించాలని ప్లాన్ వేశాడు. వెంటనే చెళ్లకెరెలోని లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్ హోంకు చెందిన డాక్టర్ శంకర లక్ష్మితో మాట్లాడారు. బాలికను అక్కడికి తీసుకెళ్లి మాత్రలు ఇచ్చి గర్భస్రావం చేయించాడు. ఇటీవల బాలిక శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అబార్షన్ విషయం బయటపడింది. పోక్సో కేసు నమోదు ఈ విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారిణి రేఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చెళ్లకెరె తాలూకా పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా కామ ఉపాధ్యాయుడు రాజణ్ణ, అతడికి సహకరించిన డాక్టర్ శంకర లక్ష్మిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక దాడి చేయడంతో బాలికకు గర్భం పోక్సో కేసు నమోదు -
బతికుండగానే చనిపోయినట్లు నమోదు
రాయచూరు రూరల్: బతికున్న మహిళను మరణించిందంటూ రికార్డుల్లో నమోదు చేసిన ఘటన రాయచూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయచూరులోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్లో నివసిస్తున్న ఖాజాబీ చౌకధరల దుకాణం నుంచి ఆహార పదార్థాలు తీసుకుంటోంది. ఏడాది క్రితం జీవనోపాధి కోసం ముంబాయి వెళ్లింది. అప్పటి నుంచి చౌక ధరల దుకాణంలో వేలిముద్రలు వేయలేదు. రేషన్ సరుకులు తీసుకోక పోవడంతో ఆమె మరణించినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఖాజాబీకి సర్కార్ నుంచి రావాల్సిన గృహలక్ష్మి, పింఛన్ అందకుండా పోయాయి. ఫలితంగా రేషన్కార్డు కూడా రద్దు అయ్యింది. పౌరసరఫరా శాఖ అధికారులు స్పందించి రేషన్కార్డు మంజూరు చేయాలని బాధితురాలు కోరుతోంది. పేదలకు సేవ చేయడం హర్షణీయంరాయచూరు రూరల్: పేదలకు ఉచిత సేవలందించడం హర్షణీయమని నవోదయ వైద్య కళాశాల అధికారి రామమోహన గుప్తా అన్నారు. నగరంలోని నవోదయ వైద్య కళాశాలలో ఔషధ విధానం, ఉత్పాదన, విశ్లేషణ, క్లినికల్ ఫార్మసీ, రీసెర్చ్, ఫార్మోకోమో అంశాలపై మూడు రోజల పాటు జరగనున్న సెమినార్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రామమోహన గుప్తా మాట్లాడుతూ.. కళ్యాణ కర్నాటకలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య పరీక్షలు చేయడానికి వీలు కల్పించినట్లు అవుతుందన్నారు. నవోదయ వైద్యకీయ కళాశాల చేస్తున్న వైద్య సేవలు అనన్యమన్నారు. కార్యక్రమంలో నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ దొడ్డయ్య, అమృత రెడ్డి, పునీత్, శివరాజ్ గౌడ, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఐడీపీఎస్ ఇండిపెండెంట్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ సాక్షి, బళ్లారి: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ద్వితీయ పీయూసీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. నగర శివారులోని కప్పగల్ రోడ్డులో ఉన్న ఐడీపీఎస్ ఇండిపెండెంట్ పీయూ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎం.సుప్రియ 591, ఏ.ఆదిశేష్ 579, హర్షిల్ జైన్ 579, హరిణి 578, భూమిక 576, కిరణ్ 576, మేఘన 576, దీపిక 575, మనోజ్ 575, ప్రకృతి 574, త్రిష 571, అక్షయ 571, మధుబాయి 571, యువరాణి 570 మార్కులు సాధించారు. కళాశాలలో 98 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ఎండీ జయ చంద్రారెడ్డి తెలిపారు. మురిక వాడల్లో సౌకర్యాలు శూన్యం రాయచూరు రూరల్: పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో నివాసం ఉంటున్న ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని స్లం క్రియా వేదిక రాష్ట్ర సంచాలకుడు నరిసింహమూర్తి పేర్కొన్నారు. శఽుక్రవారం స్లం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మురికివాడల్లో నివసిస్తున్న వారికి ఆరోగ్యం, విద్య, ఆహరం, భూమి, ఇల్లు, ఉద్యోగాలను సర్కార్ అందించాలన్నారు. రాష్ట్రంలో వసతి పథకం నీరుగారి పోయిందని తెలిపారు. పేదలు అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు. మురికి వాడల అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైందని మండిపడ్డారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, జనార్దన, బసవరాజ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. తాగునీరు సరఫరా చేయాలని ఆందోళన రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తాగునీరు సరఫరా చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. శుక్రవారం లింగసూగురు తాలుకా గురుగుంట గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి అధికారి పరారీ కావడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా స్పందించి తాగునీరు సరఫరా చేయాలని కోరారు. -
నేత్రపర్వంగా కారంజి కట్ట కరగ ఉత్సవం
కోలారు: నగరంలోని కారంజి కట్టలో ద్రౌపతమ్మ దేవి, ధర్మరాయస్వామి కరగ ఉత్సవాన్ని గురువారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయం ముందు భాగంలో వేసిన వేదికపై కరగ పూజారి బేతమంగల మునిరాజు నిర్వహించిన కరగ నృత్యం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. గోవింద నామ స్మరణతో వేదిక ప్రాంగణం మార్మోగింది. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ ఎం ఎల్ అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ తదితర ప్రముఖులు కరగ ఉత్సవంలో పాల్గొన్నారు. వీధి కుక్కలకు ఫీడింగ్ జోన్కోలారు: వీధి కుక్కల ఆకలితీర్చడం కోసం తాలూకాలోని వేమగల్ – కురుగల్ పట్టణ పంచాయతీలో బస్టాండు, కోలారు రోడ్డు, సీతి రోడ్డు, కల్వమంజలి రోడ్డు, లలో ఫీడింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. జోన్లలో ఎవరైనా ఆహారం వేయవచ్చు. స్థానిక హోటల్ యజమానులు మిగిలిన రుచికరమైన ఆహారాన్ని తెచ్చి ఫీడింగ్ జోన్లలో వేయవచ్చునని పట్టణ పంచాయతీ అధికారులు తెలిపారు. పట్టణ పంచాయతీలో 1726 కుక్కలను గుర్తించగా వాటిలో 976 కుక్కలకు సంతానహరణ చికిత్సలు చేయించినట్లు తెలిపారు. రేబిస్ వ్యాప్తి చెందకుండా టీకాలు వేయించినట్లు అధికారులు తెలిపారు. -
మహిళలతో అసభ్యకరంగా ప్రవరిస్తే చర్యలు
హుబ్లీ: జంట నగరాల్లోని జిమ్ కేంద్రాలు, లవ్ జిహాద్ కేసులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకునేందుకు నగరంలోని బీవీబీ కళాశాల క్యాంపస్ మీటింగ్ హాల్లో శుక్రవారం జిమ్ యజమానులు, ట్రైనర్లతో సమావేశం నిర్వహించారు. జంట నగరాల పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ.. కోచ్ల పూర్వపరాల నేపథ్యం పరిశీలన, సభ్యుల మొబైల్ కనెక్షన్ నిషేధం, తదితర కట్టుదిట్టమైన నియమాలను తప్పని సరిగా పాటించాలని ఆదేశించారు. ఒక వేళ ఆ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిమ్ సురక్షతపై ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిమ్లకు వచ్చే యువతులు, మహిళలపౌ అసభ్యకరంగా ప్రవర్తించే కోచ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జంట నగరాల్లోని కొన్ని జిమ్లు లవ్ జిహాద్కు అడ్డాలుగా మారుతున్నాయని హిందు సంఘాల నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. సమావేశంలో 200 మందికి పైగా జిమ్ ట్రైనర్లు, జిమ్ యజమానులు పాల్గొన్నారు. పీయూసీ ఫలితాల్లో రాయచూరుకు 31వ స్థానం రాయచూరు రూరల్: ద్వితీయ పీయూసీ ఫలితాల్లో రాయచూరు జిల్లా 31వ స్థానంలో నిలిచిందని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరప్ప వెల్లడించారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో 21,383 మంది ద్వితీయ పరీక్షలు రాయడం జరిగిందన్నారు. వీరిలో 13,881 మంది విద్యార్థులు ఉతీర్ణులైనట్లు తెలిపారు. 74.72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు. పీయూసీ ఫలితాల్లో రాయచూరు జిల్లా గత ఏడాది 30వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 31వ స్థానానికి పడిపోయినట్లు చెప్పారు. దేవదుర్గ రేఖ 591, అనుషా పాటిల్ 583, సంతు 562, భాగ్య 558, కవిత 588 మార్కులతో సత్తా చాటారు. టిప్పర్ ఢీకొని బైక్ చోదకుడికి గాయాలు హొసపేటె: బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఒక యువకుడిని వేగంగా వచ్చిన ఓ టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. నగరంలోని పడుగుత్తి కళ్యాణ మండపం సమీపంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ రైడర్ను కొప్పళలోని సర్దార్ గల్లీకి చెందిన కాసిం అలీ రాజా సభాగా గుర్తించారు. తీవ్ర గాయపడిన ఇతడికి ఉప విభాగ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం కొప్పళ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టిప్పర్, బైక్ రెండూ సీబీఎస్ సర్కిల్ నుంచి కొప్పళ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇంటర్ ప్రతిభావంతులకు సత్కారం చిక్కబళ్లాపురం: ద్వితీయ పీయూ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన నగరంలోని బెస్ట్ కళాశాల విద్యార్థులు పదిమందిని యాజమాన్యం ఘనంగా సత్కరించింది. 401 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 391 మంది ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ రఘునాథ్ తెలిపారు. వృద్ధులకు అన్నదానం శివాజీనగర: కాగినెల కనక గురుపీఠం డాక్టర్ నిరంజనానందపురి స్వామీజీ 50వ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం కొట్టూరు ఆనాథాశ్రమంలో వృద్ధులకు బొబ్బట్లతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు. హగరిబొమ్మనహళ్లి పురసభ మాజీ అధ్యక్షుడు ఎం.మరి రామప్ప మాట్లాడుతూ నిరంజనానందపురి స్వామీజీ సమాజానికి అందిస్తున్న సేవలు అనన్యమన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోరి గోణిబసప్ప, పురసభ నామినేటెడ్ సభ్యుడు యు.బాళప్ప తదితర నాయకులు పాల్గొన్నారు. యంత్రంలో చిక్కుకుని బాలుడు మృతి హోసూరు: లేత్ యంత్రంలో చిక్కుకుని బాలుడు మృతి చెందిన ఘటన సిఫ్కాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. తిరుపత్తూరు జిల్లాకు చెందిన రమేష్ కొడుకు మోహన్ రాజ్ (16). పాఠశాలకు సెలవులు వదలడంతో హోసూరులో నివాసముంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. పారిశ్రామిక వాడలో అతడి మామ నిర్వహిస్తున్న పరిశ్రమలో లేత్ యంత్రాన్ని ఆపరేట్ చేస్తుండగా అకస్మాత్తుగా యంత్రంలో చిక్కుకుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిఫ్కాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.3 కోట్ల విలువైన మొబైల్స్ స్వాధీనం
సాక్షి, బళ్లారి: ఇటీవల మొబైల్స్ దొంగతనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొబైల్స్ దొంగలించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. నూటికి 90 శాతం దొంగిలించిన మొబైల్స్ను తిరిగి స్వాధీనం చేసుకోవడం పోలీసులకు సవాల్గా మారుతోంది. అయితే గడిచిన ఆరు నెలల్లో విజయపుర పోలీసులు ఘనమైన విజయం సాధించారు. విజయపుర జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో దొంగలించిన మొబైల్స్ను సీఈఐఆర్ సాఫ్ట్వేర్ సాయంతో కనుక్కున్నారు. 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు నెలల్లో దాదాపు రూ.3 కోట్ల విలువైన మొబైల్స్ను జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబరిగి ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లను సంబంధిత యజమానులకు అప్పగించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లు ఎక్కడైనా ఎవరైనా దొంగలిస్తే తక్షణం ఫిర్యాదు చేయాలని సూచించారు. పూర్తి వివరాలు కూడా అందజేయాలన్నారు. -
నాణ్యతకు తిలోదకాలు
సాక్షి, బళ్లారి: బళ్లారి నగర నడిబొడ్డున నిత్యం వేలాది మంది జనం, వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. కనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద వేసిన రోడ్డుకు ఇరువైపులా పాదచారులు వెళ్లేందుకు ఐరన్ పైపులు, చైనులు వేసి కట్టుదిట్టం చేశారు. ఈ పనులు చేపట్టేందుకు ఏడాదికి పైగా సమయం తీసుకున్నారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నప్పటికి, ఆ పనుల్లో నాణ్యత లోపిస్తోంది. పని పూర్తి చేసిన తర్వాత కనీసం రెండు, మూడు సంవత్సరాలు గడవక ముందే అధ్వానంగా మారుతున్నాయి. ఇనుప కడ్డీలు, చైనులు రోడ్డుపై పడిపోవడంతో పాదచారులతో పాటు, వాహనాల్లో వెళ్లే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు నాణ్యతగా పనులు చేయకపోవడంతో పనులు ప్రారంభించిన ఆరు నెలలకే ఊడిపోతున్నట్లు సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి మండిపడ్డారు. సంబంధిత అధికారులు, పాలకులు చొరవ తీసుకుని పడిపోయిన పైపులను, చైనుకు మరమ్మతులు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. అండర్ బ్రిడ్జి కింద వేసిన రోడ్డులో పాదచారులు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీలు, చైన్ ఊడిపోయిన దృశ్యం -
బస్సు సర్వీస్ ప్రారంభం
కోలారు: ముళబాగిలు నుంచి తాలూకాలోని ఆవణి గ్రామానికి ఏర్పాటు చేసిన నూతన బస్సు సర్వీస్ను ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ మార్గంలో కొత్త సర్వీసును ప్రారంభించాలని ప్రజలు కోరారన్నారు. దీంతో అధికారులతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. తాలూకాలో గంజాయి, క్రికెట్ బెట్టింగ్ను పూర్తిగా అరికట్టాలని పోలీసులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆవణి గ్రామస్తులు రఘుపతి రెడ్డి, సత్యణ్ణ, గొల్లహళ్లి జగదీష్, అన్వర్ పాషా పాల్గొన్నారు. కమనీయం.. సీతారామ కల్యాణం శ్రీనివాసపురం: తాలూకాలోని రాయల్పాడు ఫిర్కా పెద్దూరు గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామ కల్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత స్వామి వారికి అభిషేకాలు, అలంకరణలు, విశేష పూజలు, హోమ, హవనాలనునిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదమంత్రోచ్ఛరణ మధ్య సీతారాముల ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను గ్రామంలో ఘనంగా ఊరేగించారు. హాజరైన భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. -
ప్రాజెక్టుల అమలులో జాప్యం వద్దు
హొసపేటె: జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, నీటి సరఫరా ప్రాజెక్టులను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేసి ప్రజలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా ఇన్చార్జి కార్యదర్శి డాక్టర్.కేజీ.జగదీష్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నగరంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వివిధ శాఖల పురోగతి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హోస్పేట్తో సహా జిల్లాలోని వివిధ తాలూకాల్లో అమలులో ఉన్న నీటి సరఫరా ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తూ, ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు లాభాపేక్షతో పని చేస్తాయని తెలిపారు. పనుల్లో జాప్యం జరిగినా లేదా నాణ్యత విషయంలో రాజీపడినా అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు పరస్పర సమన్వయంతో జాగ్రత్తగా పని చేయాలన్నారు. వేసవి కాలం సమీపిస్తున్నందున, ప్రజలు నీటి కొరతను ఎదుర్కొకుండా చూడటమే మన ప్రథమ ప్రాధాన్యత అన్నారు. అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం వివిధ శాఖలు విడుదల చేసిన నిధులను దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా పంచాయతీ సీఈఓ అక్రమ్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని హరపనహళ్లి తాలూకాలో తీవ్ర నీటి సమస్య ఉందని, ప్రైవేట్ ట్యూబ్వెల్స్, ట్యాంకర్ల ద్వారా తగినంతగా నీటిని సరఫరా చేస్తున్నారని తెలియజేశారు. నమూనా అంగన్వాడీ భవనం నిర్మించండి జిల్లా ఇన్చార్జి కార్యదర్శి, జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు ప్రదేశాలలో పిల్లల ఆటలకు మద్దతుగా క్రీడా పరికరాలను ఏర్పాటు చేసి, ఒక మంచి నమూనా అంగన్వాడి భవనాన్ని నిర్మించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు. దీనికి సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, జిల్లా పంచాయతీ డిప్యూటి సెక్రటరీ కే.తిమ్మప్ప, ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నదాన స్వామి, గ్రామీణ తాగునీటి, పారిశుధ్య శాఖ ఇంజనీర్ ఎస్.దీప, డీడీపీఐ వెంకటేష్ రామచంద్రప్ప, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
20 రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
హుబ్లీ: బాడుగ కోసం వరసగా ఆటోలను నిలిపే క్రమంలో జరిగిన గొడవ పర్యవసానం ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన బెళగావి జిల్లా కాగవాడ తాలూకా మంగసూలి గ్రామంలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ అశోక్ వడ్డర్ హత్యకు గురైన వ్యక్తి. రెండు రోజుల క్రితం ఊరిలో జాతర నేపథ్యంలో భక్తుల సందడి ఎక్కువగా ఉంది. రోజూ మాదిరిగా వరుసలో నిలబెడుతున్న ఆటోలు ఆ రోజు మాత్రం ఈ నియమాన్ని ఉల్లంఘించి ఇష్ట వచ్చినట్లు ప్రయాణికులను బస్టాండ్ నుంచి ఆలయానికి తీసుకెళ్లడం తిరిగి తీసుకుని రావడం చేశారు. అశోక్ తన ఆటో వెనుక ఉన్నప్పటికీ ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లాడు. దీన్ని గమనించిన మరో ఆటో డ్రైవర్ శివ.. అశోక్ బాడుగ దింపి వచ్చిన వెంటనే గొడవకు దిగాడు. అంతేగాక మరో ఇద్దరు స్నేహితులతో కలసి అశోక్పై దాడి చేసి హతమార్చారు. అతడి వద్ద ఉన్న నగదు తీసుకుని, ఆటో వెనుక సీట్లో అశోక్ను పడుకోబెట్టి అక్కడి నుంచి పరారీ అయ్యారు. కాగవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలించారు. నిందితులు శివ, సాగర్, వినోద్ను అరెస్ట్ చేశారు. 20 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అశోక్ దారుణ హత్యకు గురి కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్ దారుణ హత్య -
బీజేపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభం
కెలమంగలం: తళి నియోజకవర్గంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పార్టీ శుక్రవారం తాలూకా కేంద్రం డెంకణీకోటలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించింది. బీజేపీ క్రిష్ణగిరి పశ్చిమ జిల్లా అధ్యక్షుడు నారాయణన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అన్నాడీఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేపనపల్లి సిటింగ్ ఎమ్మెల్యే కే.పి.మునిస్వామి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. నాగేష్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంిపీ నరసింహన్, బీజేపీ క్రిష్ణగిరి పశ్చిమ జిల్లా మాజీ అధ్యక్షులు నాగరాజ్, మండల అధ్యక్షులు బాలక్రిష్ణన్, నరేంద్రన్, రవీంధ్రన్, అన్నాడీఎంకే నాయకులు జేపి జయప్రకాష్, రాము, యూనియన్ కార్యదర్శి రమేష్ రెడ్డి, వెంకటా చలపతిశెట్టి పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
మల్లికార్జున ఖర్గేను అరెస్ట్ చేయాలి
హొసపేటె: రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తక్షణమే అరెస్టు చేయాలని బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొట్రేష్ మాట్లాడుతూ.. అస్సాం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. ‘నమాజ్ చేసేటప్పుడు విష సర్పం కనిపిస్తే దానిని చంపాలని ఖురాన్లో రాసి ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ కూడా అలాంటి విష సర్పాలే. మీరు దానిని చంపక పోతే అది బ్రతకదు. ఆర్ఎస్ఎస్ సభ్యులను చంపాలని ముస్లింలను రెచ్చగొట్టారు’ అని ఆరోపించారు. మల్లికార్జున ఖర్గే ఎల్లప్పుడూ మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారని మండిపడ్డారు. అటువంటి వ్యక్తి చేసిన బాధ్యతారహితమైన రెచ్చగొట్టే ప్రసంగం దేశంలోని లక్షలాది బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్మేటి, మండల ప్రధాన కార్యదర్శి మధురచెన్న శాస్త్రి హిరేమఠ్్, యువ మోర్చా మండల అఽధ్యక్షుడు హెచ్.రాఘవేంద్ర, కే.మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
జై వీరభద్రేశ్వర
తుమకూరు: చారిత్రక హరళూరు శ్రీ వీరభద్ర స్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. చోళుల కాలపు ఈ ఆలయానికి వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి ఏటా ఉగాది పండుగ తరువాత వీరభద్ర స్వామి జాతర జరపడం సంప్రదాయంగా వస్తోంది. గురువారం మధ్యాహ్నం 1 గంటలకు హరళూరు గ్రామస్తులు, భక్తుల సమక్షంలో తేరు ఊరేగింపు సాగింది. స్వామి ఉత్సవమూర్తిని తేరులో కూర్చోబెట్టి జయజయధ్వానాల రథాన్ని లాగారు. రాత్రి భక్తి గాన కచేరీ, కురుక్షేత్ర నాటకం ఆకట్టుకున్నాయి. కుమార– ఐపీఎస్ కేసులో మధ్యవర్తిత్వం! శివాజీనగర: రాష్ట్ర లోకాయుక్త ఏడీజీపీ ఎం.చంద్రశేఖర్, కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి మధ్య గొడవల కేసులో మధ్యవర్తిత్వానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా పేరును హైకోర్టు సూచించింది. ఓ కేసులో విచారణ జరుపుతున్న తనను బెదిరించారంటూ చంద్రశేఖర్ బెంగళూరు సంజయ్నగర ఠాణాలో కేసు పెట్టగా, ఆ కేసును కొట్టివేయాలని కుమారస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. కొంతకాలంగా దీనిపై విచారణ జరుగుతోంది. న్యాయమూర్తి ఎస్.సునీల్దత్ యాదవ్ విచారిస్తూ, జస్టిస్ ఓకా మధ్యవర్తిత్వానికి సిఫార్సు చేసి వాయిదా వేశారు. గర్భిణిపై దాడి.. కవలల మృత్యువాత దొడ్డబళ్లాపురం: గర్భిణిపై కొందరు దాడి చేయడంతో ఆమె కడుపులో ఉన్న కవల పిల్లలు ప్రాణాలు వదిలిన విషాద సంఘటన హావేరి జిల్లా సవణూరు తాలూకా అల్లిపురలో ఆలస్యంగా వెలుగు చూసింది. మార్చి 28న పవిత్ర లమాణి అనే గర్భిణి అప్పు చెల్లించలేదని ఇంటికి వచ్చిన కొందరు ఆమెను కొట్టారు. కడుపు మీద తన్నడంతో అస్వస్థతకు గురైంది. పవిత్రకు ఈ నెల 7న కాన్పు కాగా కవల పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన కాసేపటికే కన్నుమూశారు. దుండగుల దాడి వల్ల శిశువులు దక్కకుండా పోయారని పవిత్ర కుటుంబ సభ్యులు విలపించారు. వారి ఫిర్యాదు మేరకు సురేశ్ హాలప్ప లమాణి, పరశురామ్ హాలప్ప లమాణి, మహేశ్ లమాణి, సక్కుబాయి అనేవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోడౌన్లో మంటలు.. భారీగా ఆస్తినష్టం దొడ్డబళ్లాపుర: ఆహార పదార్థాలు నిల్వ చేసే ఓ మాల్ కంపెనీ గోడౌన్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్లో వంట నూనె, ఇతర ఆహార పదార్థాల నిల్వలు కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది రాత్రి 12 గంటల నుంచి గురువారం ఉదయం వరకూ 10 ఫైరింజన్లతో శ్రమించి మంటలను అదుపు చేశారు. గోడౌన్లో కరెంటు తీగల షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వెలువడినట్లు తెలుస్తోంది. 18ఏళ్ల క్రితం పద్మరాజ్ అనే వ్యకి ఈ గోడౌన్ రూ.20 కోట్ల ఖర్చుతో నిర్మించి ఓ మాల్కు బాడుగకు ఇచ్చాడు. కోట్ల రూపాయల సరుకులు బూడిదైనట్లు సమాచారం. మైసూరులో బస్సు ఢీకొని మహిళ మృతి మైసూరు: ప్రైవేట్ బస్సు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైన ఘటన మైసూరులోని కేఆర్ సర్కిల్లో జరిగింది. మైసూరులోని ఇలవాల సమీపంలోని బాలగంగాధరనాథ స్వామి లేఔట్ నివాసి ఎం.మహాలక్ష్మి (38) మృతురాలు. ఆమె తల్లి గీతతో కలిసి పని మీద సిటీ బస్సులో నగర బస్టాండ్కు వచ్చారు. హోటల్లో టిఫిన్ తినాలని బస్టాండ్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో కేఆర్ సర్కిల్ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకు వచ్చిన ప్రైవేట్ బస్సు మహాలక్ష్మిని ఢీకొంది. డ్రైవర్ బస్సును వదిలేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని స్థానికులు కేఆర్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ప్రమాదంలో తల్లి గీత క్షేమంగా బయటపడింది. దేవరాజ ట్రాఫిక్ స్టేషన్ పోలీసులు బస్సును ఠాణాకు తరలించారు. -
ఇంటర్ ఫలితాల్లో కొత్త చరిత్ర
బనశంకరి: కర్ణాటక ద్వితీయ పీయూసీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 5,46,698 మంది విద్యార్థులు పాస్ కాగా, రాష్ట్ర చరిత్రలో తొలిసారి 86.48 శాతం ఉత్తీర్ణత నమోదైంది, ఇది చారిత్రక రోజు అని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది పీయూసీ ఫలితాలు గతేడాది కంటే 13 శాతం పెరిగాయని చెప్పారు. గురువారం బెంగళూరులో ఆయన మీడియా సమావేశంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించారు. 6.32 లక్షల మందిలో 5.46 లక్షలు పాస్ ● 6,32,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,46,698 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,32,928 మంది బాలురు, 3,13,770 మంది బాలికలు. ఈసారి అమ్మాయిలే పైచేయి సాధించారు. ● ఆర్ట్స్ విభాగంలో 98,310 (72.86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. కామర్స్ విభాగంలో 1,82,317 (88.04శాతం), సైన్స్లో 2,66,071 (86.48 శాతం) మంది పాసయ్యారు. ● నగర ప్రాంతంలో 3,71,853 (85.95 శాతం), గ్రామీణ ప్రాంతంలో 1,74,845(87.62 శాతం) మంది పాసయ్యారు. ● డిస్టింక్షన్లో 1,70,529 మంది, ప్రథమ శ్రేణిలో 2,95,385 మంది, ద్వితీయశ్రేణిలో 63,957 మంది ఉత్తీర్ణత సాధించారు. 16,827 మంది జస్ట్ పాస్ అనిపించుకున్నారు. ఫలితాల్లో పురోగతి: మంత్రి వెబ్సైట్లో ఫలితాలు, మార్కులు కూడా అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. గత ఏడాది కళ్యాణ కర్ణాటకలో 61 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈసారి 79 శాతానికి పెరిగారని తెలిపారు. ప్రభుత్వ కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు ఏటేటా ప్రగతి సాధిస్తున్నారని చెప్పారు. ఫలితాల్లో గతేడాది మాదిరిగానే ఈసారీ 96.39 శాతంతో ఉడుపి ప్రథమ స్థానం పొందితే, యాదగిరి జిల్లాది చివరి స్థానం. బెంగళూరు 5 ప్లేసులో నిలిచింది. ఇక సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 30న మొదలై మే 13 వరకు జరుగుతాయి. ఫీజు వివరాలకు పీయూసీ బోర్డు వెబ్సైట్ లేదా కాలేజీలో సంప్రదించాలని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారి 86 శాతం ఉత్తీర్ణత 5.46 లక్షల మంది పాస్ బాలికలదే పైచేయి ఉడుపి జిల్లా ప్రథమం, యాదగిరికి చివరి స్థానం ఏ జిల్లా.. ఎంత ఉత్తీర్ణత ఉడుపి 96.39 శాతం ఉత్తర కన్నడ 96.35 కొడగు 92.34 విజయపుర 92 బెంగళూరు గ్రామాంతర 91 చిక్కమగళూరు 90.80 బెంగళూరుదక్షిణ 90.55 చిక్కబళ్లాపుర 90.24 బెంగళూరు ఉత్తర 90.05 హాసన్ 89.71 మండ్య 88.85 రామనగర 87.90 కోలారు 87.38 శివమొగ్గ 87.62 తుమకూరు 86.89 కొప్పళ 86.80 చామరాజనగర 84.68 మైసూరు 84.80 బీదర్ 84.61 బాగల్కోటే 84.12 హావేరి 84.11 ధారవాడ 83.31 చిక్కోడి 83.10 దావణగెరె 81.99 బెళగావి 80.32 చిత్రదుర్గ 79.12 బళ్లారి 78.69 కలబుర్గి 76.97 గదగ్ 76.65 రాయచూరు 74.09 యాదగిరి 71.21 -
వివాహిత అదృశ్యం కేసులో మలుపు
హుబ్లీ: కొప్పళకు చెందిన నవ వివాహిత అదృశ్యమైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే మెట్టింటి నుంచి కనిపించకుండా పోయిన ఆ యువతి ముస్లిం యువకుడితో హుబ్లీలో కనిపించింది. ఆ మేరకు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యుల ఎదుటే ఆ యువతి ప్రేమికుడితోనే కలిసి ఉంటానని మొండికేసింది. అయితే సదరు భర్త ఇప్పటికే అవమానం తట్టుకోలేక మా నాన్న గుండెపోటుతో చనిపోయాడు. అందుకే తమకు పరిహారం చెల్లించాలని భర్తతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కొప్పళలోని గౌరి అంగళ నివాసి నాగరాజ్ను పెళ్లి చేసుకున్న రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన సంజన అనే యువతి పెళ్లైన రెండు నెలలకే భర్తను విడిచి కనిపించకుండా పోయింది. మనోవేదనతో కుటుంబ పెద్ద మృతి విషయం తెలిసిన మామ అనగా భర్త తండ్రి అవమాన భారంతో మనోదేవనకు గురై అనారోగ్యం కృశించి గుండెపోటుతో మృతి చెందడంతో సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. ఈ కేసులో ప్రస్తుతం కీలక మలుపు చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి సంజన బుధవారం రాజాబక్షి అనే ముస్లిం యువకుడితో హుబ్లీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి ఇద్దరిని కొప్పళ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. సొంత ఊరు గదగ్ జిల్లాకు చెందిన రాజబక్షి ఆటో డ్రైవర్. అతడికి పెళ్లి కూడా అయింది. అయినా అతడు యువతిని తీసుకొని వెళ్లిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇద్దరిని పోలీస్ స్టేషన్కు పిలిపించిన తక్షణమే సంజన భర్త, ఆయన బంధువులు స్టేషన్కు హుటాహుటిన వచ్చారు. అయినా ఆ నవవివాహిత తనకు రాజాబక్షినే కావాలని పట్టుబట్టింది. నష్ట పరిహారం చెల్లించాలని భర్త డిమాండ్ ఆమె ఈ పిచ్చితనానికి, మొండిపట్టుకు కుటుంబ పెద్ద ప్రాణనష్టం జరిగిందని, అందుకు గాను తమను నష్ట పరిహారం చెల్లించాలని ఆమె భర్త నాగరాజ్ డిమాండ్ చేశారు. కాగా వీరిద్దరి వివాహం పరస్పర ఆమోదం మేరకు ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో కొప్పళలోని పార్థ కళ్యాణ మంటపంలో గత ఫిబ్రవరి 8న జరిగి నాగరాజ్, సంజన ఒకింటివారయ్యారు. ఆ తర్వాత ఈ కొత్త దంపతులు నాగరాజ్ ఇంటి తొలి అంతస్తులో ఉండేవారు. ఈ క్రమంలో గత మార్చి 21న రాత్రి 8.30 ప్రాంతంలో సంజన తనకు ఆరోగ్యం బాగోలేదని ఔషధాలు తేవాలని భర్త నాగరాజ్ను పురమాయించింది. నాగరాజ్ ఔషధాలను తేవడానికి వెళ్లి తిరిగి 15 నిమిషాల్లో రాగా ఆ సమయంలో భార్య సంజన ఇంట్లో కనిపించలేదు. అక్కడ, ఇక్కడ అన్ని చోట్ల వెతికినా ఆమె ఇక్కడికి రాలేదని అందరూ సమాధానం చెప్పారు. ఆమె బంధువుల ఇంట్లో కూడా ఆమె గురించి సమాచారం తెలియక పోవడంతో భర్త నాగరాజ్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన ఇంటి కొత్త కోడలు కనిపించకుండా పోవడంతో ఆ ఇంటి పెద్ద, ఆమె మామ కండప్ప గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. హుబ్లీలో ముస్లిం యువకుడితో యువతి కొప్పళ పోలీస్ స్టేషన్లో హైడ్రామా -
ఉప పోరు ప్రశాంతం
బాగలకోటెలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరుకార్డులతో వేచి ఉన్న పురుష ఓటర్లుదావణగెరెలో ఓ పోలింగ్ కేంద్ర ం వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిలబడిన మహిళా ఓటర్లు సాక్షి,బళ్లారి: దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప, బాగల్కోటె అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే హెచ్.వై.మేటి మృతితో జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. మండుటెండలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని పోలీంగ్ కేంద్రాల వద్ద ఉదయం కాస్త మందకొడిగా పోలింగ్ సాగినా సాయంత్రం కల్లా పోలింగ్ సరళి బాగా పుంజుకుంది. పోలింగ్ ముగిసే సమయానికి దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ 68.43 శాతం, బాగల్కోటె అసెంబ్లీ నియోజకవర్గంలో 68.74 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసింది. ఉత్సాహంగా ఓటెత్తారు కాగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువకులు, వృద్ధులు, మహిళలు ఉత్సాహంగా బారులు తీరారు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గుడికూడిన ఓటర్లతో సందడి వాతావరణం నెలకొంది. దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్యామనూరు శివశంకరప్ప మనవడు శ్యామనూరు సమర్ధ్ పోటీ చేయగా, బీజేపీ తరుపున శ్రీనివాస దాస కరియప్ప, బాగల్కోటె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమేష్ మేటి, బీజేపీ తరఫున వీరణ్ణ చరంతిమఠ బరిలో నిలిచారు. ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్న నేపథ్యంలో అప్పటి వరకు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొంది. ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు 25 రోజుల గడువు ఉండటంతో అప్పటి వరకు స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును కొనసాగించనున్నారు. బాగలకోటెలో ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థి దావణగెరెలో ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఈవీఎంల్లో ఓటరు దేవుళ్ల తీర్పు నిక్షిప్తం మే 4వ తేదీన వెలువడనున్న ఫలితాలు -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
● మృతుడు బళ్లారి జిల్లా వాసి కళ్యాణదుర్గం రూరల్: విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు... బళ్లారి జిల్లా మోకా సమీపంలోని సింధవాళ గ్రామానికి చెందిన బసవరాజు (32)కు భార్య ఛైత్ర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను కొన్ని రోజుల క్రితం కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో మొక్కజొన్న పంట కోతకు మిషన్ కూలీగా వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కోత మిషన్ పైకి ఎక్కి యంత్రాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై కింద పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వంతెనకు బైక్ ఢీ.. ముగ్గురు దుర్మరణంరాయచూరు రూరల్: వంతెనకు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతులను హుమ్నాబాద్ తాలూకా హళ్లిఖేడకు చెందిన వెంకట్(40), అతని భార్య శిల్ప(35), కుమార్తె రక్షిత(12)గా పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకుచ్చిన ద్విచక్ర వాహనం అదుపు తప్పి వంతెనకు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ వారిని బీదర్లోని బిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సర్కారు బడిలోనే విద్యార్థులను చేర్పించాలిరాయచూరు రూరల్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థులను చేర్పించాలంటూ ర్యాలీ చేపట్టారు. కొప్పళ జిల్లా గంగావతిలోని 22వ వార్డు గుండమ్మ క్యాంప్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి వీధుల్లో సంచరిస్తూ 2025–26వ విద్యా సంవత్సరానికి పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడానికి ముందుకు రావాలంటూ జాతాను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక పబ్లిక్ పాఠశాలల పేరుతో కన్నడ బడులను మూసి వేయడానికి కుట్ర పన్నుతున్న నేపథ్యంలో నూతన ఒరవడికి క్యాంప్ వాసులు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఇంటింటా ప్రచారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్య పుస్తకాలు, బోధన, పాలు, భోజనం, దుస్తులు, గుడ్డు, బూట్లు, అరటి పండు, ఆరోగ్య చికిత్సలు వంటివి అందుబాటులో ఉంటాయని, వాటి ప్రాధాన్యతను గురించి వివరించారు. ఉపాధ్యాయినికి సన్మానం రాయచూరు రూరల్: నేటి యుగంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని మడ్డిపేట ప్రాథమికోన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని రూపా పేర్కొన్నారు. నగరంలో గురువందన కార్యక్రమంలో అవార్డును అందుకుని ఆమె మాట్లాడారు. జ్ఞాన సముపార్జనకు విద్య, సాహిత్యం చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర విషయాలపై ఆసక్తి కనబరచాలని అన్నారు. ఆరోగ్యంపై ఆసక్తి పెంచుకోవాలి రాయచూరు రూరల్: నేటి కాలంలో ప్రజలు ఆరోగ్యంపై ఆసక్తిని పెంచుకోవాలని జిల్లా ఆరోగ్య శాఖాధికారి సురేంద్రబాబు పిలుపునిచ్చారు. జిల్లా ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకోవాలన్నారు. మానవుడి జీవన శైలి, ఆహార పద్ధతిలో వచ్చిన మార్పుల వల్ల అనారోగ్యం పాలవుతున్నారన్నారు. సమావేశంలో వైద్యులు గణేష్, శివకుమార్, నాగరాజ్, సరోజ, లేపాక్షి, తాయప్ప, సురేష్, అడివప్పలున్నారు. -
ఇసుక అక్రమ తవ్వకం.. ఇద్దరిపై కేసు నమోదు
హొసపేటె: కొప్పళ తాలూకాలోని కోళూరు సమీపంలో ఉన్న హిరేహళ్ల వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ఇద్దరిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారిక ఇసుక కాంట్రాక్టర్లకు కేటాయించిన ప్రాంతానికి ఆవల నుంచి అక్రమంగా ఇసుకను వెలికి తీస్తున్నారన్న సమాచారం మేరకు తహసీల్దార్, భూగర్భ గనుల శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడి సమయంలో హిటాచీ యంత్రాల ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు తేలడంతో మురుగుప్ప వనకేరి, నీలేష్ మదరఖండి అనే ఇద్దరిపై కొప్పళ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తల్లిదండ్రులు మందలించారని ఉద్యోగి ఆత్మహత్య హోసూరు: తాగుడుకు బానిసై విధులకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో జీవితంపై విరక్తి చెందిన ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హోసూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. హోసూరు సమీపంలోని వన్నలవాడి గ్రామానికి చెందిన అగస్టిన్ (27) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా విధులకు వెళ్లకుండా మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతున్నాడు. విధులకు వెళ్లకుండా ఇంట్లో ఉంటే ఎలా అని తలిదండ్రులు మందలించారు. జీవితంపై విరక్తి చెందిన అగస్టిన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ద్వితీయ పీయూసీలో ర్యాంకుల పంట
● కొట్టూరు విద్యార్థినులకు రాష్ట్రానికే ద్వితీయ స్థానం హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరుకు చెందిన హిందూ పీయూ కళాశాల విద్యార్థినులు సంగీత, అర్చన అనే ఇద్దరు 600 మార్కులకు గాను 598 మార్కులను సాధించడం ద్వారా రాష్ట్రానికే ద్వితీయ స్థానం పొందారు. రాష్ట్రంలో మూడబిదిరె నివాసి దిశ కామర్స్లో 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి రాష్ట్రానికి ప్రథమ స్థానంలో నిలిచింది. విషరహితంగా పంటలు పండించాలి కోలారు: నేటి రోజుల్లో విషంతో కూడిన ఆహార పదార్థాలను పండిస్తున్నారు, ఇది మానవ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తోంది, రైతులు విషరహిత ఆహార ఉత్పాదనకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ రవి తెలిపారు. గురువారం జిల్లా పంచాయతీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన విషరహిత ఆహార ఉత్పాదన వైపు కోలారు జిల్లా ఒక అడుగు అనే సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయం కేవలం శ్రమ మాత్రమే కాదని అదొక విజ్ఞానమని అన్నారు. రైతులు పంటలకు రోగాలు వస్తే రసాయనిక దుకాణాల వద్దకు వెళ్లకుండా, నిపుణుల సలహాల కోసం రైతులు సంప్రదించేందుకు వీలుగా అగ్రి క్లినిక్లను స్థాపించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కార్యక్రమంలో ఉప వ్యవసాయ డైరెక్టర్ ఎస్ నాగరాజ్, ఐిసీఏఆర్ ఢిల్లీ నివృత్త అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టుకు సాగునీరు ఏదీ?
రాయచూరు రూరల్: నారాయణపుర కాలువ చివరి ఆయకట్టు భూములకు నీరందించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాలువకు మార్చి 31 వరకు నీరు అందించడంతో చేతికొచ్చిన పంట నోటికి రాకుండా పోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు కాలువలకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాలకు నీరు అందించే దిశలో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదు. డ్యాంలో ప్రస్తుతం 56.132 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఔట్ ఫ్లో 11,396 క్యూసెక్కుల నీటికి బదులు కాలువలకు రోజు 3,800 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతున్నాయి. జనవరి మొదటి వారంలో రెండవ పంటను సాగు చేశారు. ఏప్రిల్ నెలలో లక్ష హెక్టార్లలో వరి కోతకు వస్తోంది. వరి పంటకు ఏప్రిల్ 15 వరకు నీటిని విడుదల చేస్తే పంట చేతికి దక్కుతుందని రైతులు పేర్కొంటున్నారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టని వైనం సర్కార్ ఆదేశాలు ఉల్లంఘిస్తున్న అధికారులు -
తోక జాడించారో జాగ్రత్త.!
● రౌడీలకు పోలీసు కమిషనర్ వార్నింగ్ హుబ్లీ: హుబ్లీలో గురువారం రౌడీలకు నిర్వహించిన పరేడ్లో పోకిరీలు, ఆకతాయిలకు నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తోక జాడిస్తే ఖబడ్దార్.. జిల్లా సరిహద్దుల నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించారు. అంతేగాక మంచి నడవడిక చూపిన 816 మంది రౌడీలను రౌడీ జాబితా నుంచి విముక్తిని కల్గిస్తూ పాత అలవాట్లకు కొనసాగించే రౌడీలపై కొరడా ఝళిపించారు. స్థానిక సీఏఆర్ మైదానంలో జరిగిన రౌడీ పరేడ్లో 450 మందికి పైగా రౌడీలు పాల్గొన్నారు. అతి వెకిలి చేష్టలు, అతి వేషాలు వేస్తే పాత చరిత్ర వెలికితీసి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. కాగా ఇప్పటికే 30 మందికి పైగా రౌడీలను సరిహద్దుల నుంచి బహిష్కరించే ప్రక్రియ మొదలైందన్నారు. అలాగే మంచి నడవడిక అలవాటు చేసుకొని బతుకుతున్న మాజీ రౌడీలకు శుభవార్త చెప్పారు. 2026 ప్రారంభంలో జంట నగరాల్లో 1320 మంది రౌడీషీటర్లు ఉండేవారు. వీరిలో మంచి మార్గంలో నడుస్తున్న 816 మందిని రౌడీ షీటర్ జాబితా నుంచి తొలగించారు. ప్రస్తుతం నగరంలో 510 మంది యాక్టివ్ రౌడీ షీటర్లు ఉండగా, ఈ ఏడాది కొత్తగా 100 మందిపై నిఘా పెట్టి వారిని రౌడీషీట్ జాబితాలో చేర్చే ప్రక్రియ జరుగుతోంది. మొత్తానికి నగర పోలీసులు జంట నగరాల్లో శాంతి భద్రతలను కాపాడటానికి కఠిన చర్యలు తీసుకుంటుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం హొసపేటె: కమలాపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్పీసీ ఫోర్ బే కాలువలో సుమారు 40– 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు సుమారు 5.6 అడుగుల ఎత్తు, తెల్లని ఛాయ కలిగి తెల్లని, సగం చేతుల, చారల చొక్కా, నలుపు తెలుపు చారల లుంగీ, ఎరుపు, పసుపు రంగు తలపాగా ధరించాడు. మృతుని వారసులు ఎవరైనా ఉంటే కమలాపుర పోలీస్ స్టేషన్ ఎస్ఐని లేదా 9480805762 నంబరును సంప్రదించాలని ఓ ప్రకటనలో తెలిపారు. ద్వితీయ పీయూసీలో సత్తా సాక్షి బళ్లారి: 2025–26వ విద్యాసంవత్సరపు ద్వితీయ పీయూసీ పరీక్షల్లో శ్రీచైతన్య పీయూ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాల విద్యార్థులు ఇషాంత్ రాయ్ 593, కె.త్రిషా 592, శ్రీహిత 591, ఐశ్వర్య 589, హెచ్.లిఖిత్ 588, కే.మల్లేశ్వరి 588, జే.వైష్ణవి 586, పీ.నందుశ్రీ 586, సుజాత 585, ఎం.రేఖారెడ్డి 585, సాత్విక 585, వీ.లక్ష్మీభవాని 584 మార్కులతో ఉత్తమ ఫలితాలను సాధించారు. వీరిలో డిస్టింక్షన్లో 440, ఫస్ట్క్లాస్లో 525, సెకండ్ క్లాస్లో 51 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు కళాశాల కరస్పాండెంట్ తెలిపారు. ద్వితీయ పీయూసీలో మెరుగైన ఫలితాలు● జిల్లాలో 78.69 శాతం ఉత్తీర్ణత సాక్షి,బళ్లారి: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ద్వితీయ పీయూసీలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. గురువారం సాయంత్రం ద్వితీయ పీయూసీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 78.69 శాతం ఫలితాలు సాధించినట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది మెరుగైన ఫలితాలు రాకపోవడంతో రాష్ట్రంలో బళ్లారి జిల్లా 24వ స్థానానికి పడిపోయిన సంగతి విదితమే. ఈ ఏడాది విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాలు, చర్యలకు తోడు విద్యార్థులు కూడా కష్టపడి చదవడంతో ఫలితాలు కాస్త మెరుగుపడినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రజా సేవకు పదవులు ముఖ్యం కాదు రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రజా సేవ చేయడానికి పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు. దేవదుర్గ భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆశయ సాధనకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. తనను ఎన్నుకున్న వారికి రుణపడి ఉంటానన్నారు. ఉద్యోగులు కట్టబెట్టిన పదవికి న్యాయం చేస్తానన్నారు. విద్యారత్న, సేవా భూషణ్ అవార్డులను అందించారు. నాగేష్ గౌడ, ప్రేమలతా రెడ్డి, చంద్రశేఖర్ పాటిల్, సురేష్, బోరేగౌడ, చరణ్రాజ్, విశ్వనాథ్, బసవరాజ్లున్నారు. శాంతరస సాహిత్య సేవలు అనన్యం రాయచూరు రూరల్: కన్నడ సాహిత్య రంగానికి ప్రముఖ రచయిత శాంతరస అందించిన సేవలు అనన్యమని రాయచూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద అభిప్రాయ పడ్డారు. ఆదివారం ఎస్ఆర్కే విద్యాలయంలో శాంతరస సంస్మరణ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. శాంతరస త్రిభాషా సాహిత్యంతో ప్రపంచానికి చాటిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కసాప అధ్యక్షుడు విజయ రాజేంద్ర, లక్ష్మీదేవి, బసవప్రభు, వెంకటేష్, రెహమాన్, వీరహనుమాన్, బసవరాజ్ కళస, రంగణ్ణ పాటిల్, విరుపాక్షి, భీమనగౌడ, రావుత్రావ్లున్నారు. ఇంటర్ పరీక్షల్లో జిల్లాకు 14వ స్థానం కోలారు: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో కోలారు జిల్లా 14వ స్థానంలో నిలిచింది. వాణిజ్య విభాగంలో నగరంలోని మహిళా సమాజ కళాశాల విద్యార్థిని చిరంతన, విజ్ఞాన విభాగంలో బేతమంగల మదన్ బంగారుపేట ఎస్డీసీ కళాశాల అర్చన, కళా విభాగంలో నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని నయన ప్రథమ స్థానంలో నిలిచారు. విజ్ఞాన విభాగంలో నగరంలోని సహ్యాద్రి కళాశాల విద్యార్థిని లయ సత్తా చాటింది. -
2వ అంతస్తు నుంచి కిందపడ్డ చిన్నారి
కృష్ణరాజపురం: బెంగళూరులో దారుణం జరిగింది. ఆటలాడుకుంటూ రెండేళ్ల చిన్నారి పాప భవనం 2వ అంతస్తు నుంచి కిందపడిన ఘటన నాయండహళ్లిలో జరిగింది. వివరాలు నవీన్, జయశ్రీ దంపతుల కుమార్తె చిన్నారి సహన. నవీన్ ఆటోడ్రైవర్గా పనిచేస్తుంటాడు. వీరికి ఈ పాప ఒక్కరే సంతానం. ఈ నెల 6వ తేదీ ఉదయం 7 గంటలకు భర్త పనికి వెళ్లగా, భార్య వంటింట్లో పాప కోసం పాలు వేడి చేస్తోంది. చిన్నారి పాక్కుంటూ బాల్కనీలోకి వచ్చింది. అక్కడ ఉన్న చెయిర్ను ఎక్కి, పట్టు తప్పి కిందకు పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. బయట జనం కేకలు వేయడంతో తల్లి పరుగు పరుగున కిందకు వచ్చి, గాయపడిన కూతురిని చూసి అక్కడే మూర్ఛపోయింది. వెంటనే బాలికను, తల్లిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో బాలికకు చికిత్స అందిస్తున్నారు. పై నుంచి శిశువు కిందపడడం, రోడ్డు మీద అచేతనంగా ఉన్న దృశ్యం అక్కడి సీసీ టీవీ కెమెరాలలో రికార్డయింది. చంద్ర లేఔట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురువారం బాలిక తండ్రి మాట్లాడుతూ బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారన్నారు. తలకు 3 కుట్లు పడ్డాయని, ఎక్కడా గాయాలు లేవని, ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పాడు. ఐసీయూలో చికిత్స బెంగళూరులో సంఘటన -
తాగునీరు అందించాలని ఆందోళన
రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని తప్పుబడుతూ ప్రజలు ఆందోళన చేపట్టిన ఉదంతం రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. 15 రోజులైనా కొళాయిలకు తాగునీటిని వదలక పోవడంతో లింగసూగూరు తాలూకా సర్జాపురలో రైతులు, గ్రామస్తులు గ్రామ పంచాయతీ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తాగునీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ఖండిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. -
మాణిక్యధారలో మిస్సింగ్ మిస్టరీ
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా బాబా బుడన్గిరి సమీపంలోని మాణిక్యధార అనే పర్యాటక ప్రాంతంలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన కేరళ బాలిక శ్రీనంద (16) కోసం పోలీసులు, అటవీ సిబ్బంది, స్థానికులు గాలింపు చేపట్టారు. కేరళ నుంచి టూరిస్టులు బస్సులో వచ్చారు, ఆ సమయంలో బాలిక మిస్సయింది. ఆమె అనుకోకుండా లోయలోకి పడి ఉండవచ్చుని అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో బాలిక తల్లి రోహిణి మాట్లాడుతూ ఆమెకు ఏ ప్రమాదం జరగలేదు, ఎవరో ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపించారు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో మత్తు మందు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారని విలపించారు. గత 10 ఏళ్ల నుంచి తమ కుటుంబం ఎక్కడా టూర్కు వెళ్లలేదు, దీంతో ఎక్కడైనా విహారయాత్రకు వెళ్లాలని ఇక్కడకు వచ్చామని, ఇలా అయ్యిందని తెలిపారు. పోలీసులకే సవాల్ పోలీసులు డ్రోన్ కెమెరాలతో అడవిలో గాలింపు చేపట్టారు. మాణిక్యధారకు వచ్చిన వాహనాల వివరాలతో పాటు అనుమానం ఉన్న వ్యక్తుల సమాచారంను నేకరిస్తున్నారు. నా కూతురిని వెతికి ఇవ్వండి, ఆమె లేకపోతే నేను బతకలేని అని తల్లి రోదిస్తున్నారు. ఏం జరిగిందో తెలియక పోలీసులకే సవాల్గా మారింది. మాణిక్యధారలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. బాలిక జాడ లేక తల్లిదండ్రుల రోదనలు డ్రోన్ కెమెరాలతో పోలీసుల గాలింపు -
రూ.15 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లకు సంకెళ్లు
దొడ్డబళ్లాపురం: డిజిటల్ అరెస్టు పేరుతో బెళగావికి చెందిన వ్యాపారవేత్తను బెదిరించి రూ.15.45 కోట్లు కొల్లగొట్టిన కేసులో పోలీసులు ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన వంకదోత్ శరత్ నాయక్, దేగావత శ్రీపాద నాయక్ నిందితులు. వీరు ఓ కంపెనీ పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతూ వచ్చే డబ్బును హైదరాబాద్, గోవా, హరియాణ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో 10 బ్యాంక్ ఖతాలకు బదిలీ చేసేవారు. వీరి ఖాతాలలో ఉన్న రూ.1 కోటి డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు. పదే పదే బెదిరించి.. బెళగావిలోని తిళకవాడికి చెందిన అజిత్ సరాఫ్ అనే వ్యాపారవేత్తకు ఇటీవల కాల్ చేసిన నిందితులు.. తాము సీఐబీ అధికారులమని చెప్పుకున్నారు. మీ పేరుతో రెండు సిమ్ కార్డులు ఉన్నాయి. మీ ఖాతా నుంచి రూ.25 లక్షల మనీ లాండరింగ్ చేసి రూ.5 లక్షలు కమీషన్ తీసుకున్నారు, మీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది.. అని పదే పదే బెదిరించారు. ఇలా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 9 వరకూ పలు విడతలుగా బాధితుని నుంచి రూ.15.45 కోట్లను ఆన్లైన్లో తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు హైదరాబాద్లో నిందితులను అరెస్టు చేశారు. బెళగావివాసి డిజిటల్ అరెస్టు కేసు.. హైదరాబాద్లో నిందితుల అరెస్టు


