breaking news
Karnataka News
-
కర్ణాటకలో 'సబ్బు' పాలిటిక్స్.. తమన్నా తప్పితే ఇంకెవరు లేరా?
మైసూర్ శాండల్ సబ్బు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 100 ఏళ్లకు పైగానే చరిత్ర కలిగిన ఈ సబ్బు.. కర్ణాటకలో తయారవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ తమన్నాని ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడీ విషయం కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ గట్టిగానే వస్తున్నాయి.కర్ణాటకకు చెందిన సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వచ్చే రెండేళ్ల పాటు మైసూర్ శాండల్ సబ్బు, ఇతర ఉత్పత్తులకు ఈమె ప్రచారం చేయనున్నారు. ఈ విషయం గురించి మాట్లాడిన కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్.. మైసూర్ శాండల్ సబ్బుని మార్కెట్లోకి రీలాంచ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న తమన్నాని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం ద్వారా ఉత్తర భారత మార్కెట్లో తమ కంపెనీ ఉత్పత్తులు డిమాండ్ పెంచడమే లక్ష్యమని అన్నారు.కన్నడ భామలైన రష్మిక, రుక్మిణి వసంత్, దీపికా పదుకొణె లాంటి వాళ్లని కాదని తమన్నాని బ్రాండ్ అంబాసిడర్ చేయడం ఏంటని పలువురు నెటిజన్లు, పలు కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ కె.సుధాకర్.. కాంగ్రెస్, కన్నడ వ్యతిరేక మనస్తత్వం కలిగిన ప్రభుత్వమని విమర్శించారు. కన్నడలో చాలామంది తారలున్నప్పటికీ.. వేరే రాష్ట్రం, వేరే భాషకు చెందిన సినీ నటిని నియమించింది. అంతేకాక ఆమెకు కోట్లాది రూపాయలు చెల్లించింది. ఇదే కాంగ్రెస్ పార్టీ.. కన్నడ వ్యతిరేక మనస్తత్వానికి మరో నిదర్శనం అని ట్వీట్ చేశారు. ఇప్పుడీ విషయం కన్నడ నాట హాట్ టాపిక్ అయిపోయింది.As a Government of Karnataka PSU competing successfully with leading corporate FMCG players, KSDL stands as a strong example of public sector excellence.In 2024–25, KSDL recorded a turnover of ₹1,787 Cr with a net profit of ₹451 Cr, delivering over 43,000 metric tonnes of… pic.twitter.com/cYuN59CkZm— M B Patil (@MBPatil) February 10, 2026ನಾಡದ್ರೋಹಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರಕ್ಕೆ ಕನ್ನಡದ ಸಿನಿತಾರೆಗಳು ಕಣ್ಣಿಗೆ ಕಣ್ಣುತ್ತಿಲ್ಲವೇ?ಕರ್ನಾಟಕದ ಸುಪ್ರಸಿದ್ಧ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಬ್ರ್ಯಾಂಡ್ ಮೈಸೂರು ಸ್ಯಾಂಡಲ್ ಸೋಪ್ ಗೆ ಬ್ರಾಂಡ್ ಅಂಬಾಸಿಡರ್ ನೇಮಿಸಲು ನಮ್ಮದೇ ಕನ್ನಡ ನಾಡಿನ ಅನೇಕ ತಾರೆಗಳು ಇದ್ದರೂ ಪರರಾಜ್ಯದ, ಅನ್ಯಭಾಷೆಯ ಸಿನಿಮಾ ನಟಿಯೊಬ್ಬರನ್ನು ಕೋಟ್ಯಂತರ ರೂಪಾಯಿ ಪೇಮೆಂಟ್ ಕೊಟ್ಟು… pic.twitter.com/bJqmXaPVo9— Dr Sudhakar K (@DrSudhakar_) February 10, 2026 -
మెట్రో చార్జీల పెంపును అడ్డుకున్నా
బనశంకరి: కర్ణాటక ప్రభుత్వమే మెట్రో చార్జీల పెంపును అడ్డుకునే నిర్ణయం తీసుకుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ జోక్యం లేదని డీసీఎం డీకే.శివకుమార్ అన్నారు. సోమవారం విధానసౌధలో ఆయన మాట్లాడుతూ మెట్రో సంస్థలో ఇంధన వ్యయం, నిర్వహణ, పాలనా వ్యయం తెలపాలని అధికారులను కోరానని, అంతవరకు టికెట్ రేట్ల పెంపును నిలిపివేయాలని సూచించానని తెలిపారు. మెట్రో టికెట్ రేట్లపై రాజకీయం అధికమైందన్నారు. సోమవారం జరగాల్సిన బీఎంఆర్సీఎల్ (మెట్రో) బోర్డు సమావేశం వాయిదాపడిందన్నారు. మెట్రో 50:50 నిధులతో కొనసాగే పథకమని, నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చార్జీల నిర్ణయ కమిటీ ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. గతంలోని కమిటీ రద్దయిందని, కొత్త కమిటీ ఏర్పాయ్యేవరకు చార్జీల్లో జోక్యం చేసుకోరాదని తనకు తెలిసిందని అన్నారు. బోర్డు సమావేశం రద్దు యశవంతపుర: మెట్రో చార్జీల పెంపు గురించి చర్చించడానికి బీఎంఆర్సీఎల్ బోర్డు భేటీ సోమవారం ఉండగా, ఆకస్మాత్తుగా రద్దయింది. శాంతినగరలోని హెడ్డాఫీసులో జరగాల్సి ఉంది. రద్దు కావడంపై అనేక ఊహాగానాలు వ్యాపించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఇటు నిలబడడంతో మెట్రో పెద్దలకు ఏమీ పాలుపోవడం లేదని సమాచారం. మెట్రో చార్జీలతో సంబంధం లేదు: సీఎం సాక్షి, బళ్లారి: మెట్రో రైలు చార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేదని, ఇది కేంద్రం నియమించిన మెట్రో అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయమని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఆయన దావణగెరెలో మాట్లాడుతూ మెట్రో చార్జీల గురించి చర్చించేందుకు డీసీఎం శివకుమార్ ఢిల్లీకి వెళుతున్నారనేది ఆయన్నే అడగాలన్నారు. వాల్మీకి సముదాయానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. దావణగెరె జిల్లా మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున రాజీనామా చేశారనడంలో నిజం లేదన్నారు. డీకేశి, మీరు కుర్చీని కాపాడుకునేందుకు పైరవీలు చేస్తున్నారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా, సీఎం మండిపడ్డారు. మెట్రో రైలు చార్జీల రగడ కేంద్ర, రాష్ట్రాల మధ్య యుద్ధంగా మారింది. పెంపునకు కారణం వారని, తగ్గించింది మాత్రం తామేనని అందరూ ప్రచారం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మెట్రో వార్ మరింత తీవ్రతరమైనా ఆశ్చర్యం లేదు. డీసీఎం డీకే శివకుమార్ -
రన్వే మీద ప్రచార బెలూన్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో రన్వే పైకి ఓ ప్రైవేటు సంస్థ ప్రచార బెలూన్ ఎగురుకుంటూ రావడంతో కాసేపు కలకలం రేగింది. ఆ భారీ సైజు బెలూన్ రన్వే పైన పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో విమానాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది బెలూన్ను తొలగించారు. ఓ రియాల్టీ సంస్థ బెలూన్గా తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరికి రూ.15 లక్షల సైబర్ మోసం మైసూరు: ప్యాలెస్ సిటీలో సైబర్ మోసగాళ్లు అమాయకులకు ఇట్టే బురిడి వేస్తున్నారు. వివరాలు.. యరగనహళ్లి నివాసికి వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్ గురించి ఓ మెసేజ్ వచ్చింది. దీంతో అతడు ఆ నంబరుకు కాల్చేసి మాట్లాడాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలంటూ అతన్ని మోసగాడు నమ్మించాడు. అలా రూ.3.50 లక్షలు బదిలీ చేసి మోసపోయాడు. సరస్వతిపురంలో ఓ రిటైర్డ్ అధికారిని ముంబై పోలీసులమని కాల్ చేసి బెదిరించారు. నీకు పలు నేరాలతో సంబంధం ఉందని భయపెట్టారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు తీసుకుని రూ. 12 లక్షలను బదిలీ చేసుకున్నారు. రెండు కార్లు ఢీ, ఇద్దరు మృతి తుమకూరు: తాలూకాలోని బనవర గేట్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. మృతులను తుమకూరు నగరవాసులు సురేష్ (55), మురళి (60)గా గుర్తించారు. ఎదురెదురుగా వస్తున్న కారు, క్వాలిస్ వాహనం ఢీకొన్నాయి. కారులో పై ఇద్దరూ తీవ్ర గాయాలతో చనిపోయారు. క్వాలిస్లోని సైబర్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణప్ప, జేడీఎస్ నేత జయన్న, మంజునాథ్ తదితరులు గాయపడ్డారు. చైన్ స్నాచర్ల దాడి.. మహిళ దుర్మరణం దొడ్డబళ్లాపురం: కళ్లల్లో స్ప్రే కొట్టిన చైన్ స్నాచర్లు మహిళ మెడలోని బంగారు గొలుసు లాగడంతో కిందపడి గాయపడిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. చైన్స్నాచర్ల దుష్కృత్యానికి ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వివరాలు.. నెలమంగల తాలూకా హుస్కూరు గ్రామంలో జరిగింది. గ్రామ నివాసి జ్యోతి (45) సోమవారం ఉదయం ఇంటిముందు చెత్త ఊడుస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె కళ్లల్లో ఏదో స్ప్రే కొట్టారు. తరువాత మెడలోని గొలుసు తెంచుకుని పరారయ్యారు. గొలుసు లాగడంతో ఆమె కిందపడినప్పుడు తలకు గాయం తగిలి స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా కొంతసేపటికే చనిపోయింది. మాదనాయకనహళ్లి పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. భార్య తెలివికి.. భర్త జైలుకు ● అతనితో హత్య చేయించిన వైనం ● ఆపై ప్రియునితో జీవనం బొమ్మనహళ్లి: అక్రమ సంబంధాల మోజులో పడిన భార్య.. భర్తను వదిలించుకోవాలని షాకింగ్ పథకం వేసింది. అతన్ని హంతకున్ని చేయాలని కుట్ర చేసింది. ఈ సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో జరిగింది. భార్య కుట్ర ఫలితంగా భర్త జైలు పాలయ్యాడు. వివరాలు.. ఆనేకల్ తాలూకాలో ఆంథోనీ, రోజి భార్యాభర్తలు. రోజికి రాజేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇది తెలిసి భర్త ఆమెను మందలించేవాడు. తమ సంతోషానికి భర్త అడ్డంకిగా ఉన్నాడు, తరచూ తాగి వచ్చి వేధిస్తున్నాడనే నెపంతో భార్య తన భర్తను పునరావాస కేంద్రంలో చేర్పించింది. 18 నెలల తర్వాత, భర్త ఆంథోనీ తిరిగి వచ్చాడు. భర్త లేని సమయంలో ఆమె ప్రియునితో సహజీవనం సాగించింది. భర్త రాగానే పథకాన్ని అమలు చేసింది. తమ బావ బాలరాజు మీద లేనిపోని మాటలు చెప్పి చంపేయాలని ప్రేరేపించింది. భార్య మాట విని ఆంథోనీ, తన అన్నయ్య బాలరాజ్ను కత్తితోపొడిచి హత్య చేశాడు. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో ఆంథోనీపై కేసు నమోదైంది. అరెస్టు చేసి చెరసాలకు తరలించారు. రోజి మళ్లీ ప్రియునికి దగ్గరైంది. అయితే రోజినే అసలు నిందితురాలని తెలిసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
ఎన్నో ప్రఖ్యాత క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఓ ఘోరం తరువాత అపఖ్యాతి పాలైంది. అక్కడ మ్యాచ్లను చూడాలనే క్రికెట్ అభిమానులు, నగర వాసుల ఆకాంక్ష ఎప్పుడు తీరేనా? అని ఎదురు చూస్తున్నారు. బుధవారం ఏదో ఒకటి నిర్ధారణ కానుంది.
సాక్షి బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో ఐపీఎల్ క్రికెట్ పోటీల నిర్వహణపై అనుమతి గురించి బుధవారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో ఆర్సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి క్రికెట్ మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడడంతో అప్పటినుంచి ఐపీఎల్ సహా అన్నిరకాల మ్యాచ్లను నిర్వహించడం లేదు. ఆ ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మైకేల్ కున్హా నేతృత్వంలో ఒక కమిటీతో విచారణ జరిపించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి క్రికెట్ పోటీలు నిర్వహించాలంటే ఏమేమి భద్రతా చర్యలు తీసుకోవాలో పలు సిఫారసులు చేసింది. ఇందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) కూడా ఆమోదించింది. రేపు సీఎంతో భేటీలో తీర్మానం: హోంమంత్రి ఈ నేపథ్యంలో బుధవారం జరిగే ముఖ్య సమావేశంలో ఐపీఎల్ పోటీల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తామని రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం అధ్యక్షుడు వెంకటేశ్ప్రసాద్, అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ, ఆర్సీబీ ప్రతినిధి రాజేశ్ మీనన్ తనను కలసి మ్యాచ్ల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. బెంగళూరులో ఐపీఎల్ నిర్వహణకు అనుమతివ్వాలని కోరినట్లు, ఇదే సమయంలో ఈ ఏడాది ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నామో వివరించారన్నారు. తాను సీఎం సిద్ధరామయ్యతో ఈ విషయంపై చర్చించాల్సి ఉందని, అందుకే బుధవారం ఐపీఎల్ నిర్వహణపై తుది దఫా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల భద్రత ప్రభుత్వం బాధ్యత అని, తొక్కిసలాటలు వంటివి పునరావృతం కాకూడదని, జీబీఏ కమిషనర్, నగర పోలీసు కమిషనర్, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు. గతంలో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చిన్నస్వామిలో మళ్లీ మ్యాచ్ల కోసం నగరవాసుల నిరీక్షణ ఉంటాయా... ఉండవా? బుధవారం సీఎం, హోంమంత్రి భేటీలో నిర్ణయం హోంమంత్రితో కేఎస్సీఏ చీఫ్ వెంకటేశ్ ప్రసాద్ భేటీ పోటీల నిర్వహణకు వినతితీయని వార్త రావచ్చు: వెంకటేశ్ అభిమానులకు త్వరలోనే తీయని వార్త వస్తుందని ఆశిస్తున్నట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు. హోంమంత్రిని కలసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. వీలయినంత త్వరగా పోటీల నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం సూచించిన సిఫార్సులన్నింటినీ తమ అసోసియేషన్ పూర్తిగా పాటిస్తుందని చెప్పారు. -
సిద్ధారూఢ సన్నిధిలో సోనూ నిగం
హుబ్లీ: పహల్గాం దాడి జరిగింది కన్నడ వల్లే అని అర్థం వచ్చే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనునిగంపై కన్నడ సినీ రంగం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సోనూ నిగం హుబ్లీలోని ప్రముఖ సిద్ధారూఢ మఠం సన్నిధికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధారూఢ, గురునాథరూఢ స్వాముల సన్నిధిలను దర్శనం చేసుకున్న సోనూ నిగం అక్కడ కూర్చొని 10 నిమిషాల పాటు ధ్యానం కూడా చేశారు. అనంతరం మఠం ట్రస్ట్ ప్రముఖులు సిద్ధారూఢ విగ్రహాన్ని ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనూ నిగం ఆదివారం హుబ్లీకి రాగా సోమవారం ఉదయమే సిద్ధారూఢ మఠాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో అపవిత్రత.. దోషులను శిక్షించండిసాక్షి,బళ్లారి: ఇటీవల నగరంలోని నాగలకెరె ప్రాంతంలోని పురాతనమైన ఆంజనేయస్వామి దేవస్థానంలో కొందరు దుండగులు మాంసం ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఆలయ ప్రాంగంలోకి విసిరిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. సోమవారం వీహెచ్వీ, భజరంగదళ్ ఆధ్వర్యంలో నిరసన, ర్యాలీ చేపట్టారు. అనంతరం సంఘాల నేతలు మాట్లాడుతూ పురాతన చరిత్ర కలిగిన దేవస్థానంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు చేస్తూ హిందువుల ధార్మిక భావనలను దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. వీహెచ్వీ జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, ప్రముఖులు గోవర్ధన్, వినోద్, శంకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సేవకు పదవి ముఖ్యం కాదు రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయడానికి పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర పాఠశాలల విద్యా శాఖ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు. దేవదుర్గ భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆశయ సాధనకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. తనను ఎన్నుకున్న వారికి రుణపడి ఉంటామన్నారు. ఉద్యోగులకు కట్టబెట్టిన పదవికి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో విద్యారత్న, సేవా భూషణ్ అవార్డులను అందించారు. కార్యక్రమంలో నాగేష్ గౌడ, ప్రేమలత రెడ్డి, చంద్రశేఖర్ పాటిల్, సురేష్, బోరేగౌడ, చరణ్రాజ్, విశ్వనాథ, బసవరాజ్లున్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలని మడ్డిపేటె ప్రాథమికోన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని రూపా పేర్కొన్నారు. నగరంలో గురువందన కార్యక్రమంలో అవార్డును అందుకొని ఆమె మాట్లాడారు. వి ద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర విషయాలను మననం చేసుకోవాలని కోరారు. జ్ఞాన సముపార్జనకు విద్య, సాహిత్యం చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. -
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో అక్రమ కట్టడాలు పెరిగి పోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా అక్రమ మసీదులకు అంతే లేదు. అధికారులు అనుమతి ఇవ్వకున్నా రాత్రికి రాత్రే చాందసులు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మసీదుల నిర్మాణం చేపడుతున్నారు. బాగల్కోటె నవనగర్లో ఆల్మట్టి డ్యాం నిర్వాసితుల పునరావాసం కోసం కేటాయించిన స్థలంలో అక్రమంగా మసీదు నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజు రోజుకు ఈ అక్రమణలు అధికమవుతున్న నేపథ్యంలో హిందువుల ఆలయాల నిర్మాణానికి కూడా తగిన న్యాయం చేయాలని నిరసన ప్రారంభించారు. ఆల్మట్టి డ్యాం కోసం సర్వం కోల్పోయిన వారి స్థలాలు అధిక ధరలకు విక్రయించి అక్కడ టిన్షెడ్లు వేసి మసీదులు కడుతున్నారు. ఈ విషయంలో బాగలకోటె నగరసభ అధికారులు విచారణ చేపట్టారు. హిందూ ఆలయాల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరుతూ నగరసభ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. -
లఘు విమాన పతనంపై అనుమానాలెన్నో?
హుబ్లీ: పరిశీలన, ధ్రువీకరణ తర్వాత శిక్షణ విమానంలో ఇంధనం ఖాళీ ఎలా అయిందన్న ప్రశ్న తలెత్తింది. విజయపుర జిల్లా బబలేశ్వర తాలూకా మంగళూరు గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం పైలెట్ శిక్షణ కోసం తీసుకెళ్లిన లఘు విమానం పతనం అయింది. ఆ జిల్లా ఎస్పీ లక్ష్మన్ నింబరిగితో కూడిన పోలీస్ బృందం ఘటన స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే ఆ సంస్థ ముఖ్యస్థులు ఘటన స్థలానికి విచ్చేసి పతనం గురించి వివరాలను సేకరించారు. పైలెట్ కునాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంధనం ఖాళీ అయినందు వల్లే విమానం పతనం అయిందన్నారు. ఏ విమానం అయినా ఎగరడానికి ముందు ఇంధన స్థితి పరిమాణాన్ని పరిశీలిస్తారు. విమానం ఎగిరే స్థలం నుంచి ల్యాడింగ్ అయ్యే స్థలం ఎంత దూరంలో ఉంది. ఆ స్థలానికి చేరుకోవడానికి ఇంధనం ఎంత ప్రమాణంలో కావాలన్న దాన్ని పరిశీలించి విమానం టేకాఫ్కు అనుమతి ఇస్తారు. అయితే ఈ విమానం కలబుర్గి నుంచి బెళగావికి వెళ్లే దారిలో కూలిపోయింది. ఈ నేపథ్యంలో విమానం టేకాఫ్ కావడానికి ముందే పరిశీలించలేదా? అన్న ప్రశ్న తలెత్తింది. ఒక వేళ పరిశీలించిన తర్వాత నిర్ధిష్ట ప్రమాణంలో ఇంధనం ఉంటే విమానం కూలిపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. విమానం రైతుల పొలంలో పెను ప్రమాదం తప్పింది. ఒక వేళ జనవసతి ప్రాంతంపై కూలి పోయి ఉంటే మరణాలు సంభవించే అవకాశం ఉండేది. దీంతో ఇంధనం తక్కువైందన్న అనుమానాలు కనిపిస్తుండగా ఈ విషయంలో దర్యాప్తు తర్వాతే అసలు విషయం వెల్లడి కానుంది. -
ఎంపీ చేతిలో ఖాళీ ట్రంకు పెట్టె.. లాక్కున్న పోలీసులు
సాక్షి, బెంగళూరు: మెట్రో చార్జీల వివాదంలో.. బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, జయనగర ఎమ్మెల్యే రామమూర్తి నగరంలోని ఆర్వీ రోడ్డు మెట్రో స్టేషన్లో ఖాళీ ట్రంక్ పెట్టెను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ ప్రభుత్వం అని ఆ ట్రంక్ పెట్టైపె రాశారు. దానిపై సీఎం, డీసీఎంల చిత్రాలను అంటించారు. ముందే సమాచారం అందుకున్న పోలీసులు ఆర్వీ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఖాళీ ట్రంక్ పెట్టె పట్టుకుని తేజస్వీ సూర్య వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రతీక ఈ పెట్టె అంటూ, ప్రభుత్వం దివాళా తీసిందని ఆరోపణలు చేశారు. తాను ఎలాంటి ఆందోళన చేయడం లేదని, ఖాళీ ట్రంక్ పెట్టెను మాత్రం పట్టుకున్నానని, అడ్డుకోవద్దని ఆయన చెబుతున్నా, పోలీసులు అడ్డుకున్నారు. ట్రంకును పోలీసులు లాక్కుని, దానిపై బొమ్మలను తీసేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు ప్రతిరూపంగా ఖాళీ ట్రంక్ పెట్టె పట్టుకుని తాను ఢిల్లీకి వెళతానని చెప్పారు. తమ దగ్గర డబ్బులు లేవని, ప్రయాణికుల నుంచి వసూలు చేసుకోవాలని మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆరోపించారు. మరోవైపు విధానసౌధ వద్ద కన్నడ నాయకుడు వాటాళ్ నాగరాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మెట్రో చార్జీలను పెంచరాదని నినాదాలు చేశారు. బెంగళూరులో మెట్రో స్టేషన్ వద్ద రభస రాష్ట్ర సర్కారు ఖజానా ఇదేనన్న ఎంపీ -
చురుగ్గా రోడ్డు మరమ్మతు పనులు
హొసపేటె: ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరగనున్న హంపీ ఉత్సవానికి ముందు జిల్లా యంత్రాంగం రోడ్డు మరమ్మతులను ప్రారంభించింది. చాలా రోజులుగా దెబ్బతిన్న శివశక్తి నగర్ అంతర్గత రోడ్ల మరమ్మతు పనులను జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు ప్రారంభించింది. అంతర్గత రోడ్ల మరమ్మతుల నేపథ్యంలో హంపీ నుంచి హొసపేటె నగరానికి వచ్చే వాహనాల రాకపోకలను కొండనాయకనహళ్లి గ్రామంలోని సాయిబాబా ఆలయం మీదుగా హెచ్ఎల్సీ కెనాల్ రోడ్డుపైకి మళ్లించారు. హంపీ రోడ్డులోని అనంతశయనగుడి సమీపంలో జరుగుతున్న రైల్వే ఓవర్ పాస్ పనుల కారణంగా హొసపేటె నుంచి హంపీకి వెళ్లే వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలోని రోడ్లు అధ్వానంగా మారాయి. ఈ ప్రాంత నివాసితులు ప్రతి రోజు వ్యాపించే దుమ్ము ధూళితో విసుగు చెంది మున్సిపల్ కౌన్సిల్, జిల్లా యంత్రాంగం రోడ్డును మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక సార్లు నిరసన తెలిపారు. చివరకు హంపీ ఉత్సవ్ పేరుతో రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. ఈ ప్రాంత నివాసితులు ఉపశమనంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. -
వెట్టి పద్ధతిని నిర్మూలిద్దాం
చెళ్లకెరె రూరల్: ఇప్పటికీ అక్కడక్కడా కొనసాగుతోన్న వెట్టి(జీత) పద్ధతిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని సివిల్ న్యాయమూర్తి బీఆర్ పునీత్ పేర్కొన్నారు. ఆయన స్థానిక సీనియర్ కళాశాలలో న్యాయ సేవా సమితి, న్యాయవాదుల సంఘం, ధార్మిక శాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జీత పద్ధతి నిర్మూలన దినాచరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జీత పద్ధతి నిర్మూలనకు విద్యార్థులకు జాగృతి అవసరం. ఈ పద్ధతి సామాజికంగానే కాకుండా చట్టపరంగా అపరాధం అన్నారు. జీత పద్ధతి కొనసాగిస్తున్న వారిపై న్యాయపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ విషయంపై జాగృతి కల్పించి జీత పద్ధతికి విముక్తి పలకాలన్నారు. న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలు శ్యామల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జీత పద్ధతి విభిన్న రూపాల్లో వెలుగులోకి వచ్చిందని, దాన్ని అరికట్టడానికి చట్టపరంగా జాగృతి కార్యక్రమాలు నిరంతరంగా జరపాలన్నారు. తహసీల్దార్ రెహన్బాషా, తాలూకా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జీఆర్ అశ్వత్ నాయక్, తాలూకా విద్యాశాఖ అధికారి కేఎస్ సురేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
24న దుర్గమ్మ సిడిబండి రథోత్సవం
సాక్షి,బళ్లారి: నగర ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని మైసూరు దసరా తరహాలో గత ఏడాది కంటే ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించే దిశగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి సూచించారు. ఈ నెల 24న జరగనున్న కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని పురస్కరించుకుని, సంబంధిత ఏర్పాట్లు చేయడానికి నిర్వహించిన ముందస్తు సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన సోమవారం కనక దుర్గమ్మ ఆలయ యాత్రి నివాస్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సిడిబండిలో పాల్గొనే కార్యకర్తలకు పాస్లు మంజూరు చేయాలన్నారు. సిడిబండిని సంప్రదాయబద్ధంగా ఆలయం వద్దకు తీసుకొచ్చే ప్రక్రియ, ఆలయం వద్ద సిడిబండిని లాగడం తదితర దైవిక కార్యక్రమాలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు సదుపాయాలు కల్పిస్తాం మేయర్ గాదెప్ప మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ, అధికారులు, పోలీసులు చూసేలా ప్రయత్నిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా, జనం రాకపోకలను మళ్లించాలన్నారు. ఆలయం వద్ద అన్నదానం, పానీయాలు సరఫరా చేసేవారికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో మంచినీటి వ్యవస్థ, ప్రసాదాలు పంపిణీలు చేయడంలో కూడా ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తుల తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు, కార్యకర్తలను నియమించి ఆ దిశగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి, సిడిబండిని విజయవంతంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. సిటీ కమిషనర్ మంజునాథ్, డీఎస్పీ నందారెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మైసూరు దసరా తరహాలో ఆచరిద్దాం ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి దిశానిర్దేశం -
ముల్లంగి రైతు పొలానికి దారి
● సర్వే చేసి పరిష్కరించిన అధికారులు ● ఇటీవల ఆఫీసులో నిరసన తుమకూరు: పొలానికి దారి చూపాలని అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోకుండా, లంచం ఇవ్వాలని సతాయించడంతో రైతు ముల్లంగి పంటే లంచంగా ఇస్తానని తహసీల్దారు ఆఫీసులో ధర్నా చేయడం తెలిసిందే. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మధుగిరి తాలూకా దొడ్డేరి వద్ద జక్కెనల్లికి చెందిన రైతు ప్రసన్న కుమార్ దుస్థితి తీరింది. ఫిబ్రవరి 4న సాక్షి వార్తాపత్రికలోనూ ప్రముఖంగా అతని ఆవేదన ముద్రితమైంది. ఈ నేపథ్యంలో మేలుకున్న రెవెన్యూ అధికారులు జయప్రకాష్, గ్రామ అకౌంటెంట్, శరణు, సర్వే అధికారులు ఒక్క రోజులోనే రైతు పొలాన్ని పరిశీలించారు. సర్వే నిర్వహించి దారిని ఏర్పాటు చేశారు. దీంతో రైతు అధికారులకు, విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. తన నిరసనకు న్యాయం జరిగిందని అన్నాడు. వారంరోజుల్లో దారి చూపకుంటే తహసీల్దారు ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపాడు. జేసీబీతో పొలానికి దారి వేస్తున్న అధికారులు -
మాంసం విక్రయాల నిషేధానికి వినతి
హొసపేటె: నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల పవిత్ర పండుగ అయిన మహాశివరాత్రి సందర్భంగా మాంసాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కరునాడ కలిగళ క్రియాశీల సమితి ఆధ్వర్యంలో సోమవారం వివిధ సంస్థల ప్రతినిధులు జిల్లాధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం నేత వెంకటేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి అన్ని మతాలకు పవిత్రమైన పండుగ అన్నారు. దక్షిణ కాశీ హంపీలోని విరుపాక్షేశ్వరునికి ప్రత్యేక పూజలతో సహా నగరంలోని అన్ని శివాలయాల్లో పూజలు జరుగుతాయన్నారు. హిందువులందరి మనోభావాలను గౌరవిస్తూ ఆరోజురోజున మాంసం విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పతంజలి యోగా సమితి, కర్ణాటక రాజ్య మడివాళ క్షేమాభివృద్ధి సంఘం, గుండి రమేష్ కళా వేదిక, జనతా మహాసభ, వీరశైవ లింగాయత్ మహాసభ, వీరశైవ లింగాయత్ సమాజ్, కస్తూరి కర్ణాటక జనపర వేదిక, విజయనగర సాహిత్య పరిషత్, కర్ణాటక రక్షణ వేదిక, కర్ణాటక నాగరిక హిత రక్షణసేవా ట్రస్ట్, రాష్ట్ర కార్మిక అసంఘటిత సంఘం, గౌళిగర సంఘం, జయ కర్ణాటక జనపర వేదిక, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఉద్యోగులకు ఆరోగ్యం
హొసపేటె: పని భారం నుంచి ఉపశమనం కల్గించి ఒత్తిళ్లను తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఉద్యోగుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో క్రీడా, సాంస్కృతిక పోటీలు సహాయపడతాయని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఎంతో అవసరమన్నారు. రెండు రోజుల క్రీడా పోటీల్లో ఉద్యోగులు చురుగ్గా పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయాలన్నారు. విజయనగర జిల్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, యువజన సర్వీసులు, క్రీడా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేసీ, జిల్లా వ్యాయామ విద్యాధికారి శ్రీకాంత్, జిల్లా కోశాధికారి కే.మల్లేశప్ప తదితరులు పాల్గొన్నారు. -
వంతెనకు బైక్ ఢీ.. ముగ్గురు మృతి
రాయచూరు రూరల్: వంతెనకు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన బీదర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతులను హుమ్నాబాద్ తాలూకా హళ్లిఖేడాకు చెందిన వెంకట్(40), అతని భార్య శిల్ప(35), కుమార్తె రక్షిత(12)గా పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం వంతెనకు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని బిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ సారా తాగి ఇద్దరు దుర్మరణం రాయచూరు రూరల్: కల్తీ సారా తాగి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన కొప్పళ తాలూకా కూకనపల్లిలో ఆదివారం సాయంత్రం వెలుగు చూసింది. ఈనెల 4న నలుగురు మిత్రులతో కలసి సారా తాగడానికి వెళ్లగా మద్యం(స్పిరిట్) వికటించి అమరయ్య హిరేమఠ(35), రమేష్(25) మరణించారు. హెచ్.శరణప్ప(33), గురికార్ శరణప్ప(40) హుబ్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురు కలసి ట్యాంకర్ నుంచి స్పిరిట్ కలసిన మద్యం తాగారని పోలీసులు తెలిపారు. స్పిరిట్ కలసిన మద్యం అందించిన మారుతి, శరణప్పలపై చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్లు ఢీకొని ఇద్దరు మహిళల మృతి రాయచూరు రూరల్: బెళగావి జిల్లాలో చెరకు ట్రాక్టర్లు ఢీకొన్న ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆదివారం రాయబాగ తాలూకా హారోగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాను మీరా(29) అనే మహిళ ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. భర్త అల్లావుద్దీన్, కుమారుడు శోయబ్లకు గాయాలయ్యాయి. మరో ఘటనలో ఘటప్రభ పోలీస్ స్టేషన్ పరిధిలో లొళసూరు బస్టాండ్ వద్ద చెరకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొని వడ్డరహట్టి అనిత(26) మరణించింది. అనిత భర్త ఎలక్ట్రిక్ వాహనంలో ఓవర్టేక్ చేయబోగా వెనుక నుంచి తగలడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై హోరోగేరి, ఘటప్రభ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు కార్లు ముఖాముఖీ ఢీ● మంటల్లో కాలిబూడిదైన కార్లు సాక్షి,బళ్లారి: రెండు కార్లు ముఖాముఖీ ఢీకొనడంతో పూర్తిగా కాలిపోయాయి. సోమవారం బీదర్ జిల్లా బసవ కళ్యాణ తాలూకా నారాయణపుర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కార్లు అదుపు తప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో తప్పించుకోగా, కొన్ని నిమిషాల్లో రెండు కార్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బసవ కళ్యాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొలెరో వాహనానికి మంటలు కాగా సోమవారం బళ్లారి నగరంలో మోతీ సర్కిల్ వద్ద బొలెరో వాహనంలో మంటలు వ్యాపించాయి. ఉన్నఫళంగా మంటలు రావడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. రోడ్డు పక్కనే నిలిపిన వాహనంలో మంటలు రావడంతో ఎందుకు వ్యాపించాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నాలెడ్జ్ కారిడార్ ఏర్పాటుపై 13న అభిప్రాయ సేకరణ హోసూరు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న క్రిష్ణగిరి జిల్లాలో నాలెజ్డ్ కారిడార్ ఏర్పాటుపై ఈనెల 13న జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని దేవరాజ్ మహాల్లో అభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో గత ఐదేళ్ల పాలనలో క్రిష్ణగిరి జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఏదో ఒక పథకం ప్రతి కుటుంబానికి చేరుతోందన్నారు. జిల్లా వాసులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని అధికారులు కోరారు. -
ట్రావెల్స్ యజమాని.. దొంగావతారం
బనశంకరి: రాత్రి వేళల్లో ఇళ్లలోకి దూరి చోరీల చేసే ఘరానా దొంగలను బెంగళూరు బైయప్పనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని నుంచి రూ.1.84 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దావణగెరె జిల్లా హరిహర తాలూకా నివాసి రాజు (43) పట్టుబడిన దొంగ. దావణగెరెలో ట్రావెల్స్ నిర్వహించే రాజు కరోనా సమయంలో తీవ్ర నష్టాలు రావడంతో దొంగగా మారాడు. మాస్కు ధరించి ఇంట్లోకి చొరబడి నగదు, నగలు కొట్టేసేవాడు. ఇప్పటివరకు 10 చోరీ కేసులు ఇతనిపై ఉన్నాయి. గత నెల 18వ తేదీన ఓ కుటుంబం ఊరికి వెళ్లగా రాజు తలుపు బద్దలుకొట్టి బీరువాలో ఉన్న 783 గ్రాముల బంగారం, రూ.8 లక్షల నగదు దోచుకుని ఉడాయించాడు. ఈ కేసులో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి అబ్బిగెరెలో పట్టుకున్నారు. నగలను కమ్మగొండనహళ్లి, అబ్బిగెరె, హెచ్ఎంటీ లేఔట్లో జువెలరీ దుకాణాల్లో అమ్మినట్లు చెప్పాడు. జాలహళ్లి, గోవాలోనూ విక్రయించానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆయా వ్యక్తుల నుంచి 1.2 కేజీల బంగారం నగలు, వెండి సొత్తు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 24 మంది విక్రేతల అరెస్టు, రూ.2 కోట్ల డ్రగ్స్ జప్తు యశవంతపుర: సిలికాన్ సిటీలో పోలీసులు దాడులు చేసి 24 మంది డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేసి 2.08 కోట్ల విలువగల హైడ్రో గంజాయి, చరస్, ఎండిఎంఎ అనే మత్తు పదార్థాలను జప్తు చేశారు. ఐదుమంది అంతరాష్ట్ర నిందితులు కాగా, మిగిలిన 19 మంది బెంగళూరువాసులు. 1.23 కేజీల హైడ్రో గంజాయి, 36 కేజీల మామూలు గంజాయి, 11.6 కేజీల చరస్, 121 గ్రాముల ఎండిఎంఎ దొరికిందని పోలీసు కమిషనర్ సీమంతకుమార్ సింగ్ తెలిపారు. కుమారస్వామిలేఔట్, హెబ్బాళ, జేసీ నగర, బసవనగుడి, గోవిందరాజనగర, చామరాజపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఈ దాడులు జరిపారు. డ్రగ్స్ వ్యాపారులపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఇళ్లలో చోరీలపర్వం 1.2 కేజీల నగలు స్వాధీనం -
యూజీసీ నిబంధనలు అమలు చేయాలి
బళ్లారిఅర్బన్: విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థుల హక్కుల రక్షణకు యూజీసీ నిబంధనలను వెంటనే అమలు చేయాలని కర్ణాటక రాష్ట్ర దళిత సమితి డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఆధారిత వేధింపులు కొనసాగుతున్నాయని, దీని వల్ల అనేక మంది దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని సమితి పేర్కొంది. రోహిత్ వేముల, పాయల్, దర్శన్ సోలంకి వంటి ఘటనలు సంస్థాగత వివక్షకు ఉదాహరణలని పేర్కొంది. యూజీసీ రూపొందించిన 2025–28 నిబంధనలపై సుప్రీంకోర్టు విధించిన స్టేను తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని సమితి కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోహిత్ వేముల చట్టంను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టి, జిల్లాధికారి ద్వారా ప్రధాని, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. -
‘మీల్స్ ఆన్ వీల్స్’ ద్వారా ఉచిత భోజనం
రాయచూరు రూరల్: నగరంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా అభాగ్యుల వద్దకే భోజనం సరఫరా చేస్తున్నారు. రాయచూరు ప్రభుత్వ వైద్య కళాశాల బోధన ఆస్పత్రిలో రోగులు, వారి బంధువులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోజూ 500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన మీల్స్ ఆన్ వీల్స్ 900 రోజలు పూర్తి చేసుకుందని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మీల్స్ ఆన్ వీల్స్ సభ్యులు గోవింద రాజ్, నాగరాజ్, రాజేంద్ర కుమార, పురుషోత్తమ, తిప్పణ్ణ, వీరణ్ణ, రాము, హేమణ్ణ, బసవరాజ్, దినేష్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 11, 12 తేదీల్లో కంప్లి ఉత్సవాలు హొసపేటె: కంప్లి పట్టణంలోని మున్సిపల్ హాలులో ఉత్సవా లోగో విడుదల కార్యక్రమం జరిగింది. వివిధ వర్గాల ప్రజలు, కళాకారులు, నాయకులు సమావేశంలో పాల్గొని పండుగను ప్రజా పండుగా మార్చడంపై ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేఎన్.గణేష్ మాట్లాడుతూ.. ఈనెల 11, 12 తేదీల్లో (రెండు రోజులు) ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరాల కంటే భిన్నంగా, వైవిధ్యంగా కంప్లి ఉత్సవాలు నిర్వహించాలని తీర్మానించడం జరిగిందన్నారు. కంప్లి ఉత్సవ్–మన ఊరి పండుగను అన్ని వర్గాలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఈ పండుగకు శాశ్వత రూపం ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతాయన్నారు. కన్నడ భూమి, నీరు, సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఉత్సవంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇస్తూ.. గ్రామీణ, జానపద కళలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మంజునాథ్, కన్నడ, సాంస్కృతిక శాఖ అధికారి నాగరాజ్, పురసభ అధికారి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. డి.కే.శివకుమార్ సీఎం కావడం ఖాయం రాయచూరు రూరల్: భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని నోణవిన కెర కాడ సిద్ధేశ్వర స్వామి జోస్యం చెప్పారు. శనివారం రాత్రి నగరంలోని కిల్లే బ్రహన్మఠంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కల్మషం లేని రాజకీయ దురందరుడు అయిన డీకే శివకుమార్కు కొన్ని దుష్టశక్తులు అడ్డు పడుతున్నాయన్నారు. త్వరలో సమస్యలన్నీ తీరిపోయి డి.కే.శివకుమార్కు మంచి కాలం రానుందన్నారు. పోలీస్ కుటుంబానికి చెక్కు వితరణ హుబ్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఏఆర్ పోలీస్ యల్లప్ప మడివాళప్ప కుంబార కుటుంబానికి పోలీస్ శాలరీ ప్యాకేజ్ యోజన ద్వారా రూ.70 లక్షల చెక్కు అందజేశారు. జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య, హైర్ కామాండర్ రిటైర్డ్ చరణ్కుమార్ తినహా, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించాలి రాయచూరు రూరల్: రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉత్తమ వైద్య సేవలందించాలని జిల్లా ఆర్యోగ కుటుంబ అధికారి సురేంద్రబాబు సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం తాలుకాలోని మటమారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయుష్మాన్ భారత్, ముఖ్యమంత్రి ఆరోగ్య కార్డుల ద్వారా ప్రభుత్వాస్పత్రి, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
కనకపుర వద్ద భారీ గజ మంద
గజదాడిలో అన్నదాత మృతిదొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో కనకపురలో అడవి ఏనుగులు భయాందోళన కలిగిస్తున్నాయి. తాలూకాలోని కాడుశివనహళ్లి గ్రామం చుట్టుపక్కల సంచరిస్తూ పంటలు తొక్కేస్తూ, చెట్లు విరిచేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. తమిళనాడు అడవుల నుంచి బన్నేరుఘట్ట అరణ్యంలోకి వచ్చిన ఏనుగులు శనివారం సాయంత్రం నుంచి కాడుశివనహళ్లి పరిసరాల్లో మకాం వేశాయి. ఆదివారం అటవీ సిబ్బంది ఏనుగులను కాస్త దూరంగా తరిమేశారు. పరిసరాల గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.మైసూరు: చామరాజనగర జిల్లాలో తమిళనాడును ఆనుకుని ఉండే కరల్వాడి గ్రామ శివార్లలో పొలంలో ఉన్న రైతుపై 9 అడవి ఏనుగులు దాడిచేసి చంపేశాయి. రైతు మహేష్ (26) పొలాన్ని కాపలా కాస్తున్నాడు. ఈ సమయంలో ఏనుగులు అతనిని చుట్టుముట్టి తొండంతో కొట్టి కాళ్లతో తొక్కాయి. గ్రామస్తులు ఎంత అరిచినా, ఏనుగుల గుంపు వదల్లేదు. ఏనుగులు వెళ్లిపోయాక చూస్తే రైతు చనిపోయి ఉన్నాడు. గత మూడు, నాలుగు నెలలుగా అడవి ఏనుగులు ఇక్కడ ఎక్కువగా తిరుగుతున్నట్లు జనం తెలిపారు. ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి ధర్నా చేశారు. ఏనుగుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. సత్యమంగళ అభయారణ్యం అధికారులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
వైద్యనాథేశ్వర రథోత్సవం
భక్తజనం మధ్య తేరు ఉత్సవంమండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని వైద్యనాథపురలోని పురాణ ప్రసిద్ధ శ్రీ వైద్యనాథ స్వామి బ్రహ్మరథోత్సవాన్ని ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, వైద్యనాథస్వామి, ప్రసన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు జరిపి శుభ మీన లగ్నంలో తేరులో ప్రతిష్టించారు. తహశీల్దార్ పరశురామ్ సత్తిగేరి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో వందలాది భక్తులు శివనామ స్మరణతో తేరును లాగారు. -
మెట్రో హైడ్రామా
బనశంకరి/ శివాజీనగర: బెంగళూరు నమ్మ మెట్రో రైలు టికెట్ చార్జీల గందరగోళం ఆదివారం కూడా కొనసాగింది. బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ చార్జీల పెంపును నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఉత్తర్వులు రాలేదని, కాబట్టి చార్జీల పెంపు సోమవారం నుంచి కొనసాగుతుందని చెప్పారు. ఒకవేళ అత్యవసర ఆదేశాలు వస్తే పాటిస్తామన్నారు. ధరల పెంపు వల్ల ధర్నాలు జరగవచ్చనే ఆలోచనలతో 9వ తేదీ నుంచి మెట్రో స్టేషన్లలో భద్రత కల్పించాలని అధికారులు నగర పోలీసులకు లేఖ రాశారు. మునుముందైనా బాదుడే ఆదివారం రాత్రి మళ్లీ చార్జీల పెంపును నిలిపివేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు. సోమవారం పాత చార్జీలే కొనసాగుతాయని పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పుడు చార్జీలను పెంచకపోయినా, మార్చిలో గాని ఏప్రిల్లో మాత్రం బాదుడు తప్పదని తెలుస్తోంది. ఆ పెంపు 100 శాతం ఉన్నా ఆశ్చర్యం వద్దని మెట్రో వర్గాలు చెప్పడం విశేషం. ఎంపీ తేజస్వి హల్చల్ ముఖ్యమంత్రి గారూ, నాటకాలు ఆపండి (మెట్రో టికెట్ రేట్లు పెంచకండి) అని రాసిన టీషర్ట్ ధరించి బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్విసూర్య ఆదివారం నగరంలోని ఆర్వీ రోడ్డు మెట్రోస్టేషన్లో హల్చల్ చేశారు. ప్రయాణికులతో చర్చ జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే చార్జీలు పెరుగుతున్నాయన్నారు. 5 శాతం టికెట్ రేట్ల పెంపుతో ఒక్కో ప్రయాణికునిపై రూ.250 భారం పడుతుందన్నారు. తాము కేంద్ర మంత్రి మనోహర్లాల్ఖట్టర్కు వివరించగా, తాత్కాలికంగా నిలిపివేయాలని బీఎంఆర్సీఎల్ను ఆదేశించారని తెలిపారు. చార్జీల పెంపు కచ్చితమన్న ఎండీ నిలిపేసినట్లు మళ్లీ ప్రకటన నేడు పాత టికెట్ రేట్లే -
తెక్కలకోట కొండల్లో ప్రాచీన అిస్థి పంజరాలు
సాక్షి బళ్లారి: జిల్లాలోని బత్తదనాడు నియోజకవర్గ పరిధిలోని తెక్కలకోట కొండల్లో పురావస్తు శాఖ అధికారులు చేపట్టిన పరిశోధనల్లో దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటి అిస్థి పంజరాలు లభ్యం కావడం సంచలనం రేకెత్తిస్తోంది. అమెరికాకు చెందిన హార్ట్విక్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.నమితా ఎస్.సుగంది ఆధ్వర్యంలో తెక్కలకోటలో ముందుకు సాగుతున్న పరిశోధన బృందానికి అలనాటి మట్టి పాత్రలు, మట్టి ముక్కలు, శిలాయుగం నాటి అవశేషాలు కనిపించడంతో అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. సూక్ష్మ శిలాయుగానికి చెందిన రాతి ఆయుధాలు, అవశేషాలు బయపడటంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 5.5 అడుగుల పొడవు కలిగిన రెండు మానవ అిస్థి పంజరాలను ఒకదాని పక్కన ఒకటి సమాధి చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇవి సాధారణమైన అిస్థి పంజరాలు కావని పరిశోధకులు భావిస్తున్నారు. మృతదేహాలపై మట్టి కాకుండా రాళ్లు ఉంచి, పాతి పెట్టారంటే అప్పట్లో గొప్ప వ్యక్తులు లేదా ఇతరత్రా చరిత్ర సాధకులకు సంబంధించినవి ఉండొచ్చనే కోణాల్లో పరిశీలన చేస్తున్నారు. తొలుత 1964లో పురావస్తు నిపుణుడు నాగరాజ రావు చేపట్టిన తవ్వకాల్లో తెక్కలకోట చరిత్రను పరిచయం చేశారు. ప్రొఫెసర్ డా.నమితా ఎస్.సుగంది 2019లో తెక్కల కోటకు విచ్చేసి ఈ ప్రాంత చరిత్రపై ఆసక్తి పెంచుకుని పరిశోధనలు చేస్తున్నారు. గ్రీస్ విశ్వవిద్యాలయానికి చెందిన జీవ సాంకేతిక నిపుణురాలు సుసేన్క్రిక్ ప్యాట్రిక్ స్మిత్ తదితరులు అవశేషాల సంరక్షణ, కాలనిర్ధారణపై సలహాలు అందిస్తున్నారు.లభ్యమైన అస్థి పంజరాలు -
కుర్చీ మార్పిడి లేనట్టే
రాయచూరు జిల్లాలో హట్టి స్వర్ణ గనుల్లో డీసీఎం శివాజీనగర: ముఖ్యమంత్రి పదవి కోసం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎంతగా ప్రయత్నాలు సాగిస్తుంటే, ఆయన సహచరులు అంతగా నిరుత్సాహపరుస్తున్నారు. ఆయనను నీరుగార్చేలా మాటల తూటాలను వదులుతున్నారు. సీఎం మార్పిడి గురించి పార్టీ హైకమాండ్ ఏ తీర్మానం తీసుకోకుండా మౌనంగా ఉందంటే, ఎలాంటి మార్పు లేదని అర్థమని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సీఎం స్థానం కోసం డీకే చెమటోడుస్తుండగా హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పరమేశ్వర్ ఆదివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లో ఇటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు దానిని హైకమాండ్ సమర్థవంతంగా పరిష్కరించిందని అన్నారు. ఎప్పుడు, ఎలా వ్యవహరించాలనేది వారికి బాగా తెలుసునని అన్నారు. సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర.. సీఎం కుర్చీ సంగతి ముగిసిపోయిన విషయమని చెప్పడం ఆయన వ్యక్తిగతమన్నారు. రెండున్నరేళ్ల తరువాత సీఎంను మార్చాలనే ఒప్పందం జరిగిందని డీకే శివకుమార్ చెబుతున్న విషయం తనకు తెలియదని పరమేశ్వర్ చెప్పడం గమనార్హం. దీని గురించి ఢిల్లీలో చర్చలు జరిగినప్పుడు తాము బయటే ఉన్నాము, సిద్దు, శివకుమార్లకు మాత్రమే కచ్చితంగా ఏమిటనేది తెలుసన్నారు. ఒప్పందం ఉందని హైకమాండ్ నాయకులు ఇప్పటి వరకు చెప్పలేదు. మాకు ఏమీ తెలియదు కాబట్టే హైకమాండ్ వైపు చూపిస్తామన్నారు. కాగా, మెట్రో రైలు చార్జీల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని చెప్పారు. మరోవైపు సీఎం సిద్దు, డీసీఎం శివ ఆదివారం ఉత్తర కర్ణాటక జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. హైకమాండ్ మౌనమే సాక్ష్యం హోంమంత్రి పరమేశ్వర్ ఘాటు వ్యాఖ్యలు దేవెగౌడ కుటుంబంపై సీఎం సిద్దరామయ్య కక్ష కేంద్రమంత్రి కుమారస్వామి మైసూరు: సీఎం సిద్ధరామయ్య తమ పార్టీని లక్ష్యం చేసుకున్నారని, ఎలాగైనా ముగించాలని చూస్తున్నారని జేడీఎస్ అగ్రనేత, కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. ఆదివారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. మా కుటుంబం మీద ఓ కేసు ద్వారా జేడీఎస్ అధినేత హెచ్.డి. దేవెగౌడను మానసికంగా కుంగదీసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేవెగౌడ సంరక్షణలో పెరిగిన సిద్ధరామయ్య ఇప్పుడు దేవెగౌడ కుటుంబాన్నే తుదముట్టించాలని చూస్తున్నారన్నారు. తాను కేంద్రమంత్రి కావడం వారికి అసూయ కలిగించిందన్నారు. ఎక్కువ బడ్జెట్లు సమర్పించానంటూ సిద్దరామయ్య గర్వంగా మాట్లాడుతున్నారన్నారు, కానీ పరిపాలన ఏమీ బాగాలేదన్నారు. మద్యం ముడుపులు అందుకున్న అబ్కారీ మంత్రి రాజీనామా చేయలేదన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే జి.టి.దేవెగౌడకు ఎక్కడా నిజాయతీ లేదని కుమార ఆరోపించారు. ఆయన ఇప్పుడు మనతో లేరని, ఇతర పార్టీలకు చెందిన గొప్ప నాయకులతో ఉన్నారని విమర్శించారు. జీటీ తనను చాలా చాలా బాధపెట్టారని పలు సంఘటనలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జేడీఎస్ నేతలు పాల్గొన్నారు. -
ప్రేమికుల రోజున నందిహిల్స్ బంద్
దొడ్డబళ్లాపురం: రాబోయే ప్రేమికుల రోజున ప్రఖ్యాత నంది హిల్స్కు వెళ్లాలి అనుకునే ప్రేమజంటలు, యాత్రికులకు నిరాశే. సాధారణంగా నందికొండకు అత్యధికంగా వచ్చేది ప్రేమికులే. అయితే ఈ వాలెంటైన్స్డే కి నంది కొండపైకి టూరిస్టులను నిషేధిస్తూ జిల్లాధికారి ఆదేశాలిచ్చారు. వాలెంటైన్స్ డేకి నందికొండని మూసివేయడం చరిత్రలో ఇదే తొలిసారి. ప్రేమికుల రోజున నంది కొండపై నుంచి భగ్న ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. దీంతో పాటు గొడవలు జరుగుతాయనే అనుమానంతో ఆ రోజున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఎవరినీ కొండపైకి అనుమతించరని తెలిపారు. -
కొన్ని క్షణాల్లో పెళ్లి.. ఆపిన మొదటి భార్య
తుమకూరు: తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని యడియూరులో ఆలయం సమీపంలోని ఎస్ఎల్ఎన్ కళ్యాణ మండపంలో పెద్ద రచ్చ జరిగింది. నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా? అని పెళ్లికొడుకును మొదటి భార్య నిలదీయడంతో సినిమాలో మాదిరిగా కోలాహలం నెలకొంది. వివరాలు.. ఆదివారం ఈ మండపంలో బెంగళూరులోని ఆర్ఆర్ నగర నివాసి హరీష్ ప్రసాద్కు, మండ్యకు చెందిన పుణ్యశ్రీ అనే యువతితో పెళ్లి జరుగుతోంది. సరిగ్గా తాళి కట్టే సమయంలో మొదటి భార్య లేపాక్షి, పోలీసులు, కుటుంబ సభ్యులతో వచ్చింది. తామిద్దరూ ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నామని, శృంగేరిలో కాపురం ఉంన్నామని లేపాక్షి తెలిపింది. తాను ప్రైవేటు టీచరునని, తరచూ వేధింపులకు పాల్పడడంతో పాటు గర్భస్రావం చేయించేవాడని ఆమె ఆరోపించింది. రూ.2 వేలు పంపి... మూడు రోజుల క్రితం భర్త నాకు ఫోన్ చేసి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్పేలో రూ.2 వేలు పంపాడని, పెళ్లి జరుగుతోందని తెలిసి అడ్డుకోవడానికి వచ్చానని లేపాక్షి వివరించింది. లేపాక్షి మాటలతో వధూవరులు షాక్కు గురయ్యారు. వధువు తల్లిదండ్రులు ఈ పెళ్లిని రద్దు చేసుకుని, వరున్ని దండించారు. వారు కూడా పోలీసుస్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఇదేం గొడవ అని అతిథులందరూ వెళ్లిపోయారు. పెళ్ళి విందు కోసం వండిన వంటకాలు అలాగే మిగిలిపోయాయి. ఫంక్షన్ హాల్లో రచ్చ రచ్చ నిలిచిపోయిన మూడుముళ్లు తుమకూరు జిల్లాలో విడ్డూరం -
పొంచి ఉన్న పక్షి జ్వరం
శివాజీనగర: పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడులో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా టెన్షన్ మొదలైంది. పక్షి జ్వరం వ్యాపించి తమిళనాడులో 1,500లకు పైగా కాకులు చనిపోయినట్లు తెలిసింది. సరిహద్దు జిల్లాల్లో జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సూచించింది. ఏమిటీ లక్షణాలు? బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ పక్షుల్లో వచ్చే అంటువ్యాఽధి కాగా, ఆ పక్షులు వ్యర్థాల వల్ల ఇతర పక్షులకు, మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన 4 నుంచి 6 రోజుల తరువాత లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు, తల, ఒళ్లునొప్పులు, కళ్లు ఎర్రగా కావడం, న్యమోనియా వంటికి కనిపిస్తాయి. ఈ జబ్బు సోకిన పక్షులు హఠాత్తుగా చనిపోతాయి. ఎవరికి ప్రమాదం? బెంగళూరు కేసీ జనరల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సురేశ్ దీనిపై మాట్లాడుతూ కోళ్లఫారాలు, పశుపోషణ రంగాల్లో పని చేసేవారికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువని తెలిపారు. చికిత్స తీసుకోకపోతే చనిపోయే ప్రమాదం 50 శాతం ఉంటుందన్నారు. ఆ జబ్బు సోకిన కోడి మాంసం ద్వారా ఈ వైరస్ వచ్చే అవకాశముందన్నారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, రోగ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. తమిళనాడులో కాకుల హఠాన్మరణం అప్రమత్తంగా ఉండాలని సర్కారు ఆదేశాలు -
పంచ గ్యారంటీలతో పేదలకు లబ్ధి
రాయచూరు రూరల్: కర్ణాటక రాష్ట్రం ప్రవేశపెట్టిన పంచ గ్యారంటీలతో పేదలకు లబ్ధి చేకూరుతోందని రాష్ట్ర పంచ గ్యారంటీల పథకం సమితి అధ్యక్షుడు హెచ్.యం.రేవణ్ణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాయచూరు జిల్లా ఏడెదొరె నాడు హబ్బను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కార్ నుంచి లభించే పథకాలను ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పంచ గ్యారంటీ పథకాల్లో శక్తి పథకం, యువ నిధి, గృహ జ్యోతి, గృహలక్ష్మి, అన్నభాగ్య పథకాలను సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు బసన గౌడ, హంపన గౌడ, బసన గౌడ, వసంత్ కుమార్, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున, ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్, పామయ్య, పవన్, డీసీ నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ తదితరులు పాల్గొన్నారు. -
నెరవేరిన నవళగుంద రైతుల కల
హుబ్లీ: నవళగుంద తాలూకా, ఇతర రైతులు వరద సమస్యలతో ఇబ్బందులు పడకుండా రూ.200 కోట్ల నిధులతో శాశ్వత వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఆదివారం నవళగుంద బెన్నిహళ్ల వాగుపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. నవళగుంద ఎమ్మెల్యే కోనరెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రూ.200 కోట్ల నిధులతో శాశ్వత వంతెన నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇకపై రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకోవచ్చన్నారు. చాలా ఏళ్లుగా వరద ప్రవాహంతో అన్నదాతలు తాము పండించిన పంటలు చేతికి అందకుండా నీటి పాలయ్యేవి. ఇక బెన్నిహళ్ల వంతెన నిర్మాణ పనులకు శంఖుస్థాపన, నవళగుంద అసెంబ్లీ నియోజక వర్గంలో వివిధ అభివృద్ధి పనులను సీఎం సిద్దరామయ్య ప్రారంభించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతోష్లాడ్, విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి, రెవెన్యూ మంత్రి కృష్ణబైరే గౌడ, మాజీ సీఎం, హావేరి ఎంపీ బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర మురికివాడల అభివృద్ధి మండలి అధ్యక్షుడు అబ్బయ్య ప్రసాద్, న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దారి తప్పిన హెలికాప్టర్ రాయచూరు రూరల్: ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. ఆదివారం లింగసూగురులో విధాన పరిషత్ సభ్యుడు శరణే గౌడ బయ్యాపూర్ కుమారుడి పెళ్లికి సీఎం సిద్దరామయ్య హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే అధికారులు సిద్ధం చేసిన మైదానం వదలి మరో చోటికి వెళ్లడంతో అయోమయెంలో పడ్డారు. పోలీసుల భద్రత వైఫల్యం వల్ల ఇలా జరిగిందని సమాచారం. అనంతరం మళ్లీ హెలికాప్టర్లో నిర్దేశించిన మైదానానికి చేరుకున్న సీఎం సిద్దరామయ్య.. వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్, మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, కొప్పళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అమరే గౌడ బయ్యపూర్ పాల్గొన్నారు. రూ.200 కోట్ల నిధులతో బెన్నిహళ్ల వాగుపై శాశ్వత వంతెన నిర్మాణం సీఎం సిద్దరామయ్య వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన -
రూ.110 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణం
హొసపేటె: బళ్లారి, కొప్పళ జిల్లాలోని గంగావతి–కంప్లిని కలుపుతూ తుంగభద్ర నదిపై నిర్మించునున్న కొత్త వంతెన ప్రాజెక్టు కోసం మట్టి పరీక్ష ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న వంతెన దాదాపు 60 సంవత్సరాల పురాతనమైనది. తుంగభద్ర జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు విడుదల చేసినప్పుడల్లా వంతెన మునిగి పోతుంది. ఫలితంగా గంగావతి–కంప్లి మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సుమారు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో కొత్త వంతెన నిర్మాణం కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు ప్రతిపాదన సమర్పించబడింది. వంతెన నిర్మాణం కోసం డీపీర్ (వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక) తయారీ ప్రక్రియలో భాగంగా నేల పరీక్ష, సర్వే పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో వంతెన మునిగిపోకుండా నిరంతర ట్రాఫిక్ను నిర్ధారించే పాత వంతెన కంటే దాదాపు 42 అడుగుల ఎత్తులో కొత్త వంతెన నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే జేఎన్.గణేష్ ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావడంతో నియోజకవర్గ ప్రజల చిరకాల కల సాకారమైంది. -
రథోత్సవం.. తరించిన భక్తజనం
వైభవంగా బసవలింగ జాతర సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మోకా మల్లేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు రావడంతో బళ్లారి తాలూకా మోకా గ్రామం భక్తజన సంద్రంగా మారింది. స్థానిక గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మల్లేశ్వర స్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు, అర్చనల అనంతరం కల్యాణం జరిపించారు. మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ లోక్సభ సభ్యుడు సన్న పక్కీరప్ప తదితరులు మోకా మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రథానికి పూజలు చేసి భక్తులతో కలసి లాగారు. అలాగే గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర, పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు రథోత్సవాన్ని తిలకించి, ఆలయంలో పూజలు చేయించారు. మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి ఎదురు బసవణ్ణ ఆలయం వరకూ రథాన్ని లాగారు. మోకా గ్రామం ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉండటంతో ఇటు కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మోకా గ్రామం భక్తులతో కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.మోకా మల్లేశ్వర స్వామి రథోత్సవానికి వచ్చిన అశేష జనవాహినిబసవలింగ జాతరలో పాల్గొన్న భక్తులు ఘనంగా మోకా మల్లేశ్వర స్వామి జాతర హాజరైన వేలాది మంది భక్తులు రాయచూరు రూరల్: లింగసూగురు తాలూకా పికళిహళ్లో ఉటకనూరు మరి బసవలింగ శివయోగి దేశికేంద్ర మహస్వాముల 32వ జాతర వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం వేలాది మంది భక్తుల సముక్షంలో రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని వీక్షిచేందుకు రాయచూరు, లింగసూగురు, సింధనూరు, మాన్వి, బళ్లారి నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
గజ దండయాత్రలు
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో గజరాజులు దండయాత్ర చేపట్టాయి. పలు ప్రాంతాలలో తిరుగుతూ దాడులకు తెగబడడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆనేకల్ తాలూకాలోని ఆనేకల్, తమిళనాడు సరిహద్దు గ్రామమైన బైలకెరెలో శనివారం సాయంత్రం అడవి ఏనుగు దాడి చేయడంతో పుట్టస్వామి అనే రైతు మరణించాడు. బైలకెరె నుంచి గుమ్మలాపురానికి నడుచుకుంటూ వెళ్తున్న పుట్టస్వామిని అడవి ఏనుగు తొక్కి చంపింది. ఆనేకల్ తాలూకాలోని సోలూర్లో ఒక గున్న, నాలుగు పెద్ద ఏనుగులు అరణ్యం వదిలి ఊళ్ల మీద పడ్డాయి. అటవీ సిబ్బంది పటాకులు కాల్చి తమిళనాడు వైపు తరిమికొట్టారు. కొన్ని వారాలుగా చుట్టుపక్కల గ్రామాలలో ఏనుగుల మందలు తిరుగుతున్నాయి. అటవీ అధికారులు శివరాజు, సిబ్బంది చిన్నస్వామి, నింగయ్య, బసవలింగప్ప తదితరులు కార్యాచరణలో పాల్గొన్నారు. వీడియోల కోసం పరుగులు ఏనుగులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని వ్యూస్, లైక్లు కొట్టేయాలని యువకులు నానాపాట్లు పడుతున్నారు. ఏనుగుల దగ్గరకు వెళ్తున్న యువకులను అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. గుంపులు గుంపులుగా ఏనుగుల వైపు వెళ్తూ ఉండడంతో అదుపు చేయడం కష్టమైంది. ప్రజల అరుపులకు భయపడి అడవి ఏనుగులు విపరీతంగా పరిగెత్తుతున్నాయి. ఈ సమయంలో ఓ గున్న గుంతలో పడిపోయింది. అయితే తల్లి ఏనుగు చాలాసేపు శ్రమించి దానికి బయటకు తీసుకొచ్చింది. బెంగళూరు పరిసరాల్లో కల్లోలం ఆనేకల్ వద్ద దాడిలో రైతు మృత్యువాత జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ ప్రచారం -
వీబీ–జీ రామ్జీ పథకంతో కూలీలకు ప్రయోజనం
హొసపేటె: ఉపాధి హామీ చట్టం కంటే మెరుగైన ఉపాధి, గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని వికసిత్ భారత్–2047 విజన్లో భాగంగా వీబీ–జీ రామ్జీ పథకం రూపొందించబడిందని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బంగారు హనుమంతు అన్నారు. ఆదివారం సండూర్ మండలంలో వీబీ–జీ రామ్జీ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వీబీ–జీ రామ్జీ పథకం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ పథకం యొక్క ఉపయోగాలను గ్రామాల్లోని ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ నాయకులు, కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నకిలీ గాంధేయవాదులు ఈ పథకంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నరేగా పథకం కింద కార్మికుల వేతనాలు నిర్ణీత సమయానికి అందడం లేదని మండిపడ్డారు. నరేగా పథకంలో నకిలీ జాబ్ కార్డుల సమస్య పెరిగిందని ఆరోపించారు. కొత్త పథకంలో అవినీతికి చోటు లేదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అనిల్ నాయుడు, మోకా, నాయకులు రామకృష్ణ, బప్పకన్ కుమార స్వామి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
హుండీ చోరీ
హొసపేటె: మునిరాబాద్ సమీపంలోని హోసలింగపుర గ్రామంలోని కరుమారియమ్మ దేవి ఆలయం, కాళికా దేవి ఆలయంలోని హుండీని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి చోరీ చేశారు. కాళికా దేవి దేవస్థానం ముందు ఉన్న గ్రిల్ తాళాన్ని దొంగలు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. అలాగే గ్రామంలోని 3వ వార్డులోని తుంగభద్ర ఎడమ ఒడ్డున ఉన్న ఆలయంలోని దేవత మెడలోని 6 గ్రాముల బంగారు తాళి గొలుసు, హుండీలోని ఉన్న నగదు, పూజా సామగ్రిని దొంగిలించి పరారయ్యారు. దొంగలు కిటికీ పగలగొట్టి ఆలయంలో ప్రవేశించారు. ఈ ఘటనపై మునీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జేడీఎస్ జిల్లా అధ్యక్షుడిగా తాయన్న బళ్లారి అర్బన్: జనతాదళ్ (సెక్యులర్) పార్టీ బళ్లారి జిల్లా అధ్యక్షుడిగా మీనళ్లి తాయన్నను మూడోసారి నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్డి. కుమార స్వామి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్ కుమార్ స్వామి తదితరులు నూతన జిల్లా అధ్యక్షుడు మీనళ్లి తాయన్నకు నియామక పత్రాన్ని అందజేశారు. బళ్లారి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు బండెప్ప కాశంపూర్, నాడగౌడ, మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ పాల్గొన్నారు. ‘నిన్న నెనపలి’ పుస్తకావిష్కరణ బళ్లారి అర్బన్: యువ జీవితంలోని ఉత్సాహం నిరంతరం కొనసాగాలని హ్యాలిస్ బ్లూస్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షుడు కేఎం.శివమూర్తి అన్నారు. అఖండ బళ్లారి జిల్లా కన్నడ సాహిత్య పరిషత్, వివేక పుస్తక ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కన్నడ భవన్లో కవి ఎస్.ఆర్.శరణ్కుమార్ తొలి హనిగవన సంకలనం నిన్న నెనపలి పుస్తకావిష్కరణ జరిగింది. శాసన మండలి సభ్యుడు వై.ఎం.సతీష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బళ్లారి జిల్లా కసాప అధ్యక్షుడు డాక్టర్.నిష్టి రుద్రప్ప కృతిని పరిచయం చేస్తు నిన్ననెనపలి ద్వారా శరణ్ కుమార్ కన్నడ కవిత్వ ప్రపంచానికి తొలి కృతిని అందించడం ప్రశంసనీయమన్నారు. కృతిలోని హనిగవనాలు పాఠకుల మనోభావాలకు అనుగుణంగా యువ వయస్సు జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసి ఆనందం కలిగిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వివేక పుస్తక ప్రచురణ సంస్థ ప్రతినిధులు ఎస్.ఆర్.రాజేశ్వరి, ఎస్.ఆర్.సిద్ధరామన గౌడ, ఎస్.ఆర్. చంద్రశేఖర్ పాటిల్, మాజీ మేయర్ ఇబ్రహీం బాబు, బసవరాజ్ గడగిన్, కసాప గౌరవ కార్యదర్శి డాక్టర్.కే.శివలింగప్ప, ఎరేగౌడ, డాక్టర్ భ్రమరాంభ యాటి తదితరులు పాల్గొన్నారు. ఆలయంలోకి దూసుకెళ్లిన బస్సు రాయచూరు రూరల్: మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శనివారం రాత్రి దేవదుర్గ తాలుకా తింథిణ మౌనేశ్వర ఆలయం వద్ద చోటుచేసుకుంది. దేవదుర్గ డిపోకు చెందిన డ్రైవర్ అంబరేష్ పూటుగా మద్యం సేవించి డ్యూటీకి వచ్చాడు. మద్యం మత్తులో స్టీరింగ్ను పక్కకు తిప్పడంతో బస్సు తింథిణ మౌనేశ్వర ఆలయంలోకి దూసుకెళ్లిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంలో శనగ పంట దగ్ధం హొసపేటె: కొప్పళ తాలూకా బాలగేరి గ్రామంలో రైతు రామప్ప హోంబలేకు చెందిన శనగ పంట, పొట్టు ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నష్ట పరిహారం చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. -
దేశంలోనే ఎక్కువ చార్జీలు
బనశంకరి: మెట్రో ప్రయాణికులకు కొంచెం ఉపశమనం. సోమవారం నుంచి అమల్లోకి రానున్న బెంగళూరు నమ్మమెట్రో రైలు టికెట్ రేట్ల పెంపును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతల ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఊరట దక్కింది. దీంతో ప్రయాణికులకు కాస్త సొమ్ము ఆదా అవుతుంది. తెరవెనుక ఏం జరిగిందీ? ఇటీవల 5 శాతం మెట్రో టికెట్ చార్జీలను పెంచడంపై అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇందుకు కారణం మీరంటే మీరని ఆరోపణలు చేసుకుంటున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణం చేయాలా, వద్దా?, ఇదేమి బాదుడు అని సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెంపును కేంద్రం నిలుపుదల చేసినట్లు బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్విసూర్య తెలిపారు. టికెట్ చార్జీల పెంపుపై ఎంపీ తేజస్వి కొందరు కేంద్ర మంత్రులకు పరిస్థితిని వివరించారు. కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో మాట్లాడారు. దీంతో 9వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్న మెట్రో కొత్త టికెట్ రేట్లను నిలిపివేయాలని కేంద్రమంత్రి ఆదేశించారని ఎంపీ చెప్పారు. ఇప్పటికే అధిక రేట్లని కేంద్రానికి విజ్ఞప్తులు పెండింగ్లో పెట్టిన కేంద్రం దేశంలోని మెట్రో రైలు వ్యవస్థల్లో బెంగళూరు మెట్రో అత్యధిక చార్జీలను కలిగి ఉంది, చార్జీల పెంపు అసంబద్ధంగా ఉందని కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని, మెట్రో టికెట్ ధరల పెంపుతో లక్షలాది మంది ప్రజలకు భారమవుతుంది, ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించడం కష్టతరమౌతుంది అని వినతిపత్రాలు ఇచ్చినట్లు ఎంపీ తేజస్వి చెప్పారు. దీంతో కేంద్రమంత్రి ఖట్టర్ చార్జీల పెంపును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బెంగళూరు మెట్రో ఉన్నతాధికారులు మాట్లాడుతూ మాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సమాచారం అందలేదని అన్నారు. బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ.మోహన్ మాట్లాడుతూ నగర ఎంపీలు కేంద్ర మంత్రితో మాట్లాడామని, దీంతో పెంపు నిర్ణయం నిలిపివేతకు ఆదేశించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచాలని ఎక్కడా చెప్పలేదన్నారు. శనివారం రాత్రికి చార్జీల పెంపును పెండింగ్లో పెట్టినట్లు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. -
అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
రాయచూరు రూరల్: అటవీ శాఖ ఉద్యోగి ఒకరు తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన బీదర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. మృతుడిని బీదర్ జిల్లా భాల్కి తాలూకా బోళగావ్కు చెందిన అంకుశ్ సుధామ(57)గా పోలీసులు గుర్తించారు. అటవీశాఖ అధికారుల వేధింపులతో విసిగి ఆత్మహత్య చేసుకున్నట్లు దళిత సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుతో భాల్కి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలానికి అటవీ శాఖ మంత్రి ఈఽశ్వర్ ఖండ్రె చేరుకుని మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వ పరంగా లభించే సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎకై ్సజ్ మంత్రి రాజీనామా చేయాలి రాయచూరు రూరల్: అవినీతి, అక్రమాల్లో భాగస్వాముడైన రాష్ట్ర ఎకై ్సజ్ శాఖా మంత్రి ఆర్.బీ.తిమ్మాపూర్ రాజీనామా చేయాలని బీదర్ జిల్లా బీజేపీ డిమాండ్ చేసింది. శనివారం బీదర్ జిల్లాధికారి కార్యాలయం వద్ద వినితిపత్రం సమర్పించిన అనంతరం అధ్యక్షుడు సోమనాథ్ పాటిల్ మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రి ఆర్.బి.తిమ్మాపూర్ పుత్రులు మద్యం దుకాణాల లైసెన్సులకు రూ.6 వేలు లంచం తీసుకున ఆరోపణలు రుజువు కావడంతో మంత్రి తిమ్మాపూర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతూ ఎకై ్సజ్ శాఖ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదన వద్దు రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలు విరమించుకోవాలని ఆందోళనకారులు విన్నవించుకున్నారు. శనివారం కొప్పళ నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన ప్రాంతానికి రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌధరి విచ్చేసి మ హిళా ఆందోళనకారులతో చర్చించారు. ఈ ప్రాంతంలో విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు స్థాపించి మనిషి జీవితాలను అనారోగ్యం పాలు చేయడం తగదని ఆందోళనకారులు వివరించారు. బల్డోటా, కిర్లోస్కర్, కళ్యాణి స్టీల్, ముక్కుంద సుమి, ఏక్రోస్ ఇండియా కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలాలు కలుషితమై మనిషి ఆయుష్షు క్షీణించడం, 18 గ్రామాలు వాటి బారిన పడి వినాశనానికి దారి తీసే పరిశ్రమల ఏర్పాటుకు అంగీకరించకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందించారు. జ్యోతి మంజునాథ్, కావ్య ప్రసన్న శ్వేత, శశిరేఖ, పుష్పలతలున్నారు. పగిలిన మంచినీటి పైప్లైన్ ● పెద్ద ఎత్తున రోడ్డులో నీటి ప్రవాహం ● ఇళ్లలోకి నీరు, లోతట్టు జలమయం సాక్షి,బళ్లారి: నగరంలో రోడ్లలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు ప్రవహించి, ఇళ్లలోకి చేరింది. భారీ వర్షం వల్ల నీరు చేరిందని అనుకుంటే పొరపాటు. బళ్లారి నగరానికి మంచినీటిని సరఫరా చేసే పైప్లైన్ పగిలింది. శుక్రవారం రాత్రి అల్లీపుర రిజర్వాయర్ నుంచి నగరానికి మంచినీరు సరఫరా చేసే పెద్ద పైప్లైన్ పగిలిపోవడంతో పార్వతీ నగర్లోని రోడ్లలో పెద్ద ఎత్తున నీరు ప్రవహించడంతో ఆ కాలనీ వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్లైన్ పగిలినట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు. వెంటనే నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. నీటి సరఫరాను నిలిపివేయడంతో రోడ్లులో నీరు రావడం ఆగిపోయింది. -
చేనేతలకు చేయూత ఏదీ?
రాయచూరు రూరల్: చేనేతలకు బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించాలని చేనేత సహకార సంఘం సంచాలకుడు సంగప్ప డిమాండ్ చేశారు. శనివారం బాగల్కోటె జిల్లాధికారి కార్యాలయం వద్ద వినితిపత్రం సమర్పించి మాట్లాడారు. రాష్ట్రంలో కట్టడ కార్మికుల మాదిరిగా గుర్తింపు కార్డులు, సహకార, జాతీయ బ్యాంకుల్లో రుణాలు మంజూరు చేసేలా చూడాలన్నారు. 55 ఏళ్లు పైబడిన చేనేతకారులకు నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ చెల్లించాలన్నారు. 55 మంది చేనేత కారులు రుణ బాధలతో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సమ్మాన్ పథకం కింద ఉన్న నిధిని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని కోరారు. చేనేత చట్టాన్ని జారీ చేయాలన్నారు. రైల్వే, విమానాశ్రయాల్లో చేనేత వస్త్రాల విక్రయాలకు అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
మిరప మేళా.. స్పందన భళా
హుబ్లీ: రైతులకు మంచి మార్కెట్, అలాగే వినియోగదారులకు కల్తీ లేని, నాణ్యతతో కూడిన ఎండుమిర్చి అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఎండుమిర్చి మేళా ఏర్పాటు చేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రాష్ట్ర సాంబారు పదార్థాల అభివృద్ధి మండలి శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ 14వ మిర్చి మేళాను స్థానిక మూరు సావిరమఠం మైదానంలో ఏర్పాటు చేశారు. ధార్వాడ జిల్లాతో పాటు గదగ, బళ్లారికి చెందిన రైతన్నలు తమ మిర్చి పంటతో పాల్గొన్నారు. మొత్తం మీద పొలం నుంచి నేరుగా వినియోగదారుడి ముంగిటకు చేర్చే మేళా కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 100 దుకాణాల్లో బ్యాడగి డబ్బి, గుంటూరు, కడ్డిరకం, మిర్చి ఆకర్షిస్తున్నాయి. ధరల హెచ్చుతగ్గులతో ఆసక్తికరం 100 స్టాళ్లలో మిరప ప్రదర్శనలు -
బెళగావి విభజనపై సీఎం నిర్ణయమే అంతిమం
హుబ్లీ: సువిశాలమైన బెళగావి జిల్లాను విభజించాలని కోరుతూ జిల్లా నేతలు ఎన్నో సార్లు సీఎంకు విజ్ఞప్తి చేశారని మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. బెళగావిలోని జిల్లా బాలభవనలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ఇండోర్ బాక్స్ క్రికెట్ సదుపాయాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన ఈ విషయమై తనను కలిసిన నేతలతో చర్చించారు. జిల్లా విభజనకు సంబంధించి సీఎం సిద్దరామయ్య తీసుకొనే నిర్ణయమే అంతిమం అన్నారు. బెళగావి అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు కోసం వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే వివిధ శాఖల నుంచి అందుబాటులో ఉన్న నిధులను ప్రాధాన్యతాను సారంగా వినియోగించుకొని ప్రగతి పథంలో సాగవచ్చన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అశోక్ సర్కిల్, చెన్నమ్మ సర్కిల్, కొల్హాపూర్ సర్కిల్ తదితరాలను త్వరలోనే అభివృద్ధి పరుస్తామన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వాడాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు. ఇది ఎంతో కీలకమైన నిర్ణయం అన్నారు. నవిలుతీర్థ జలాశయం నుంచి తాగునీటి సరఫరాపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఎట్టి పరిస్థితిలోను తాగునీటి అవసరాలను నిరాకరించబోమన్నారు. హిప్పరిగి జలాశయంలో ప్రస్తుతం అవసరానికి తగినట్లుగా నీరు ఉందని అన్నారు. మహారాష్ట్ర నుంచి నీటిని తీసుకునే అవసరం ఏర్పడితే ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పార్టీలకు అతీతంగా కృషి చేస్తామన్నారు. మంత్రి సతీష్ జార్కిహోళి -
గోదాముల్లో అక్రమంగా యూరియా
సాక్షి,బళ్లారి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సబ్సిడీతో అందించే వేలాది బస్తాల యూరియాను అధికారులు పట్టుకున్నారు. ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతులు రోడ్లెక్కి ఆందోళన చేశారు. యూరియా లేక రైతులు ఎంతో ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే నగర శివార్లలోని గోదాముల్లో సుమారు నాలుగు వేల బస్తాల యూరియా అక్రమంగా నిల్వ ఉంచడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వేలాది బస్తాలు గోదాముల్లో నిల్వ ఉంచి, రైతులకు యూరియా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో అమ్ముతుండటంతో అక్రమంగా నిల్వ ఉంచిన యూరియా పట్టుబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్ మార్కెట్లో బస్తా రూ.800 పోలీసులు చేసిన మెరుపుదాడిలో అక్రమంగా యూరియా నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులకు యూరియా లేక ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. బ్లాక్ మార్కెట్లో బస్తా రూ.800 వరకు పెట్టి కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వం సబ్సిడీలో రూ.266లకు బస్తా చొప్పున అమ్మాల్సిన యూరియాను ఎంతకు పడితే అంతకు అమ్మారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా, స్టాక్ లేదని చూపించి, అక్రమంగా అమ్మారని మండిపడ్డారు. వేలాది బస్తాల యూరియా లభ్యం నిల్వలపై అధికారుల మెరుపుదాడి -
ముండ్రిగి నాగరాజ్కు మంత్రి హోదా
సాక్షి,బళ్లారి: రాష్ట్ర ప్రభుత్వం పలు నిగమ, మండళ్ల అధ్యక్ష స్థానాలకు మార్పులు, చేర్పులు చేయడంతో పాటు పలువురికి నిగమ మండలి అధ్యక్షులుగా కూడా అవకాశం కల్పించింది. బళ్లారి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, లిడ్కర్ అధ్యక్షుడుగా ఉన్న ముండ్రిగి నాగరాజుకు మంత్రి పదవి హోదా కల్పిస్తూ, అదే స్థానానికి అధ్యక్షుడుగా నియమించారు. దీంతో ముండ్రిగి నాగరాజు అభిమానులు, కార్యకర్తల్లో సంతోషం వెల్లివిరిసింది. తాను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి మళ్లీ తనను లిడ్కర్ అధ్యక్షుడుగా కొనసాగేలా అవకాశం కల్పించడంపై నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. అలాగే కంప్లి ఎమ్మెల్యే గణేష్ను కావేరి నిగమ మండలి అధ్యక్షుడుగా నియమించారు. లిడ్కర్ అధ్యక్షుడుగా కొనసాగింపు కావేరి నిగమ మండలి అధ్యక్షుడుగా గణేష్ -
కన్నవారి కాసుల కక్కుర్తి
● రూ.5 లక్షలకు మగశిశువు విక్రయం కోలారు: కన్నప్రేమ, మానవత్వం అనేవి లేకుండా పసిబిడ్డతోనే వ్యాపారం చేశారు. కోలారు జిల్లాలో శ్రీనివాసపురం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న నీతు, రాఘవేంద్ర అనే జంట తమకు జన్మించిన 7 రోజుల మగ బిడ్డను రూ.5 లక్షలకు అమ్మేశారు. వివరాలు.. నీతు, రాఘవేంద్రలకు గతంలో వేర్వేరుగా పెళ్లయి విడిపోయి సహజీవనం చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. నీతు మళ్లీ గర్భం దాల్చి ఓ ప్రైవేటు నర్శింగ్ హోంలో మగబిఢ్డకు జన్మనిచ్చింది. పేదరికం వల్ల సాకలేమంటూ తెలిసినవారికి చెప్పుకున్నారు. దీంతో బ్రోకర్ కొట్రగుళి నారాయణస్వామి.. చింతామణి తాలూకాలోని కృష్ణ– మంజుళ అనే దంపతులకు రూ. 5 లక్షలకు అమ్మేయించాడు. ఇది తెలిసి పోలీసులు అటు, ఇటు జంటలు, బ్రోకర్ను అరెస్టు చేసి చేశారు. శిశువును మళ్లీ తల్లిదండ్రుల వద్దే ఉంచారు. అపార్టుమెంటులో పిల్లి కేసు యశవంతపుర: బంగారు, డబ్బు, విలువైన వస్తువులు చోరీకీ గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయటం సహజం. అయితే బెంగళూరులో కడుపుతో ఉన్న పిల్లిని కిడ్నాప్ చేశారంటూ యజమాని ఫిర్యాదు చేయటంతో 9 మందిపై కేసు నమోదు చేశారు. హెచ్ఎఎల్ పోలీసుస్టేషన్ పరిధిలోని వ్యాన్సి సాలెటర్ అపార్ట్మెంట్లో ఈ విడ్డూరం జరిగింది. యజమాని సాకుతున్న పిల్లి గర్భం దాల్చింది. దీనిని గమనించి కొందరు పిల్లిని తీసుకెళ్లారు. కనిపించక పోవటంతో కంగారు పడి యజమాని హరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల చిత్రాల 9 మందిని పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిందితుల్లో అపార్ట్మెంట్ అధ్యక్షుడు శ్రీరామ్, సెక్యూరిటీ మేనేజర్ కూడా ఉండడం విశేషం. -
మృత్యురూపమైన లారీ
● ఇద్దరు దుర్మరణం మైసూరు: లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ ఢీకొనడంతో స్కూటర్పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. నంజనగూడు తాలూకా హనుమనపుర గేట్ వద్ద శనివారం ఉదయం జరిగింది. మైసూరులోని జేపీ నగర నివాసి చంద్రు (38), మహిళ శీలా (35) మృతులు. చంద్రు, శీలా బైక్లో సంతేమరహళ్లి వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఎరువు లోడ్ లారీ ఢీకొంది. దీంతో అదుపు తప్పి కింద పడటంతో అదే వేగంలో లారీ వారిద్దరి తలలపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడే మరణించారు. విషయం తెలియగానే స్థలానికి డీఎస్పీ రఘు, సీఐ చంద్రశేఖర్, కవలందె పోలీసు స్టేషన్ ఎస్ఐ బసవరాజు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను నంజనగూడులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. అనుమానిత ఉగ్రవాది మృతి బనశంకరి: బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న అనుమానిత ఉగ్రవాది ఆస్పత్రిలో చనిపోయాడు. వివరాలు... నిందితుడు సాదిక్ పాషా (47)ని నగరంలో సుద్దగుంటెపాళ్యలో పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన కేసులో 2020లో పోలీసులు అరెస్టు చేసి సెంట్రల్ జైలులో ఉంచారు. అతనితో పాటు మరో 6 మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు, ఎన్ఐఏ అధికారులు విచారించి రిమాండుకు తరలించారు. అప్పటినుంచి చెరసాలలోనే ఉంటున్నాడు. ఆరునెలలుగా లో బీపి, హై సుగర్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు జైలు సిబ్బంది తెలిపారు. దీంతో ఇటీవల విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి అతడు మరణించాడని చెప్పారు. బీఎంటీసీ బస్సు ఢీకొని మణిపూర్ యువతి బలి బనశంకరి: ఉపాధి కోసం మరో రాష్ట్రం నుంచి వలస వచ్చి జీవిస్తుంటే, కిల్లర్ బీఎంటీసీ బస్ డీకొని మణిపూర్ యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటన నగరంలో కృష్ణరాజపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. హెన్నా ఇనకా (20) అనే యువతి నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ మారతహళ్లిలో నివాసం ఉండేది. శుక్రవారం ఉదయం 9:30 సమయంలో ఆమె మరొకరితో కలిసి బైక్లో వెనుక కూర్చుని వెళ్తోంది. సిల్క్బోర్డు నుంచి టిన్ ఫ్యాక్టరీకి వెళుతున్న బీఎంటీసీ బ్యాటరీ బస్సు , కృష్ణరాజపురం రైల్వేస్టేషన్ రోడ్డులో వారికి తగిలింది, దీంతో బైక్ కిందపడగా, హెన్నాఇనకా తల మీద నుంచి ఆ బస్సు ముందు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొంతసేపటికి చనిపోయింది. కృష్ణరాజపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుబాయ్కి తీసుకెళ్లి.. రూ.1.80 కోట్ల వసూలు మైసూరు: కేరళకు చెందిన ఇద్దరు దుండగులు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మైసూరుకు చెందిన ఓ విద్యార్థి నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి మోసగించారు. వివరాలు.. మైసూరులోని కువెంపునగర నివాసి ప్రశాంత్ బాధితుడు. ఇతడు పీయూసీ చదువుతున్నప్పుడు కేరళకు చెందిన విశ్వనాథన్, స్నేహ మరియా అనే ఇద్దరితో పరిచయమైంది. వారు తాము చదువు ముగించి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నట్లు ప్రశాంత్ను నమ్మించారు. నీకూ విదేశంలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. తర్వాత అతనిని బెంగళూరు మీదుగా హాంకాంగ్, దుబాయ్కు తీసుకెళ్లారు. ఇక్కడ మంచి ఉద్యోగం చేస్తున్నాడని అతని తల్లిదండ్రులకు చెప్పి నమ్మకం కలిగించారు. అతనిని దుబాయ్లో ఉంచి దశల వారీగా రూ.1.80 కోట్లను తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. డబ్బులు రాగానే దుబాయ్లో ప్రశాంత్ ను వదిలేసి ఎక్కడికో ఉడాయించారు. తర్వాత స్నేహితులు, బంధువుల సాయంతో ప్రశాంత్ దుబాయ్ నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. కువెంపునగర పోలీసు స్టేషన్లో మోసగాళ్లపై ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. -
ప్రాణం మీదకొచ్చిన పంతుళ్ల దండన
గౌరిబిదనూరు: నగర శివారులో ఉన్న విద్యానిధి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సుశాంత్ అనే విద్యార్థిని ఉపాధ్యాయులు తీవ్రంగా దండించడంతో భయపడిపోయి సొమ్మసిల్లాడు. ఉపాధ్యాయుల నిర్వాకం వల్ల బాలుని తల్లిదండ్రులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. వివరాలు.. వివరాలు.. పక్క విద్యార్థి పుస్తకంలోని పేజీని చించాడని నాలుగైదు మంది ఉపాధ్యాయులు సుశాంత్ను ఓ గదిలోకి తీసుకెళ్లి నిలదీశారు. సుశాంత్ నేను పేజీ చించలేదని ఎంత చెప్పినా ఉపాధ్యాయులు వినలేదు. వారి అరుపులకు బాలుడు మూర్ఛపోయాడు. దీంతో హడావుడిగా పాఠశాల వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొంత తేరుకున్న తరువాత బాలుని తల్లిదండ్రులు అంబులెన్స్లో వారి గ్రామం కొడిగేనహళ్ళికు పిలుచుకొని వెళ్లినట్లు తెలిసింది. చర్యలు తీసుకుంటాం తాలూకా విద్యాశాఖ అధికారి గంగరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటన దురదృష్టకరం, ఉపాధ్యాయులు విద్యార్థులకు సున్నితంగా చెప్పాలే తప్ప దండించరాదు అని అన్నారు. తప్పు చేసిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలునికి తీవ్ర అస్వస్థత -
వామపక్షాల చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మ
మండ్య: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించడం చేతకాదు. అది వామపక్షాల కబంధ హస్తాల్లో కొట్టుమిట్టాడుతోందని బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బి.ఎల్.సంతోష్ ఆరోపించారు. శనివారం మండ్య నగరంలోని అంబేడ్కర్ భవన్లో రచయిత డాక్టర్ సుధాకర్ హోసల్లి రాసిన నానూ కాఫిరా? పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ.. వామపక్షాలు మహాత్మా గాంధీజీని వక్రీకరించడమే కాకుండా సుభాష్ చంద్రబోస్, బుద్ధుడు, బసవన్న, అంబేడ్కర్ను అవమానిస్తున్నారని అన్నారు. కువెంపు, స్వామి వివేకానందను హిందూ సంస్కృతితో సంబంధం లేని వారిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. టిప్పు సుల్తాన్ లక్ష మందికి పైగా హిందువులు, 70 వేల మంది క్రైస్తవులను దారుణంగా ఊచకోత కోశాడన్నారు. అలాంటి మతోన్మాదిని స్వాతంత్య్ర సమరయోధుడు అని పిలవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. -
ఆర్టీసి.. మొండికేసి..
రాయచూరు రూరల్: ప్రయాణికులను వేళకు సరిగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ మొరాయిస్తున్న ఘటనలు నిత్యకృత్యాలయ్యాయి. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి సర్కార్ భారీగా నిధులు విడుదల చేస్తున్నా కేకేఆర్డీబీ నుంచి బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడం తప్ప ఎక్కడా కొత్త బస్సులు రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవు. కొత్తగా వచ్చిన బస్సులను లాంగ్ సర్వీసులకు వాడుతుండగా పాత బస్సులను గ్రామీణ ప్రాంతాలకు వాడుతుండగా అవి మధ్యలోనే చెడిపోయి నిలబడుతుండటంతో ప్రయాణికులు పడుతున్న బాధలు అంతింత కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏళ్ల తరబడి చెడిపోయిన బస్సులు ఆయా డిపోల్లోనే మగ్గుతున్నాయి. గుజరీకి వేయాల్సిన బస్సులకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. వేరే బస్సుల్లో తరలింపు ఆ బస్సులను రోడ్లపైకి వదిలితే రెండు మూడు రోజులు నడవక ముందే రోడ్లపై మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులను మధ్యలోనే దింపేసి మరో బస్సులో పంపుతున్నారు. డిపోలో టైర్లు లేక నిలిచిన బస్సులు, బ్యాటరీలు చెడిపోయి తుక్కు పట్టిపోతున్నాయి. 4 లక్షల కి.మీ.దూరం సంచరించి దశాబ్దం పాటు సేవలందించిన బస్సులు ఎక్కువగా మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రతి డిపోలో 20కి పైగా బస్సులు గత ఐదేళ్ల నుంచి డిపోల్లోనే నిలిచి ఉన్నాయి. ఇలా కలబుర్గిలో 200, యాదగిరిలో 58, రాయచూరులో 75, కొప్పళలో 60, బళ్లారిలో 78, విజయ నగరలో 28, బీదర్లో 185 బస్సులు నిలిచి పోయాయి. పాత బడిన బస్సులు బ్రేక్లు ఫెయిల్ కావడంతో బోల్తా పడ్డ ఘటనలు కూడా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయినా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుండటం శోచనీయం. మార్గంమధ్యలోనే నిలిచిన ఆర్టీసీ బస్సు టైర్ల కొరతతో డిపోలో నిలిచిన ఆర్టీసీ బస్సులు క–కలో మొరాయిస్తున్న బస్సులతో ప్రయాణికులకు వెతలు నిత్యకృత్యం ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతున్న వైనం -
సంస్థకు, సొంతూరికి మంచి పేరు తేవాలి
బళ్లారిఅర్బన్: సంస్థకు, సొంత ఊరికి మంచి పేరు తేవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక లాడ్స్ ఇండో అమెరికన్ పీయూ కళాశాల ఆధ్వర్యంలో ద్వితీయ పీయూ విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నెరవేర్చారు. ముఖ్య అతిథిగా సెయింట్జాన్స్ జూనియర్ కళాశాల అధ్యక్షుడు, ప్రిన్సిపాల్ శివరామ పాల్గొని మాట్లాడారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఇండో అమెరికన్ విద్యా సంస్థలో చదవడం గొప్ప వరం అన్నారు. విద్యార్థులు తమ భావి జీవితానికి పునాది అయిన పీయూసీకి వీడ్కోలు చెప్పడం, ఉన్నత విద్యాభ్యాసం వైపు అడుగులు వేయడంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలన్నారు. కీలకమైన డిగ్రీ, పీజీ దశలను చేరుకుని కన్న తల్లిదండ్రులకు, సొంత ఊరితో పాటు విద్యా సంస్థకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ సందర్భంగా వక్తలు కృత్రిమ మేధతో పాటు సైబర్ క్రైం, ఇతర సమాజంలోని సాధక బాధకాలు, తదితర చైతన్య పరిచే అంశాల గురించి వివరించారు. ప్రముఖులు డ్యానియల్, ఎం.శ్రీశైల, పీహెచ్.నాయుడు, ప్రిన్సిపాల్ రాజేష్, షేక్ సలీం బాషా, సుధీర్కుమార్, ఉదయ్ భాస్కర్లతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, సంరక్షకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణులకు పౌష్టికాహారం మేలు
రాయచూరు రూరల్: జిల్లాలో బాలింతలు మృతి చెందుతున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం సేవించాలని జాతీయ జిల్లా ఆరోగ్య అధికారిణి నందిత పేర్కొన్నారు. సింధనూరు తుర్విహాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుండాలో గర్భిణి బాలింతను పరీక్షించి వారికి సలహాలు ఇచ్చారు, బాలింతల మరణాలు సంభవిస్తున్న తరుణంలో గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. వైద్యులకు, అధికారులకు, ఆశా కార్యకర్తలకు, సిబ్బందికి వివరించారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందని గ్రామ పంచాయతీ అధికారులకు సూచనలు జారీ చేశారు. మద్దతు ధర ప్రకటించాలి రాయచూరు రూరల్: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. శనివారం యాదగిరి ఏపీఎంసీ కార్యాలయం వద్ద కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ మాట్లాడారు. పత్తి, మిరప, వరి, వేరుశనగ, సజ్జ, జొన్న, కందులు, మినుము, పెసర పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ రాస్తారోకో చేపట్టారు. అధ్యయనంతో ఆత్మసంతృప్తి హొసపేటె: బహుత్వ దృక్పథం నుంచి అధ్యయనం చేయకుండా భారతదేశ ఆత్మను అర్థం చేసుకోవడం అసాధ్యం అని గదగ్ జిల్లా హులకోటి కేహెచ్.పాటిల్ ప్రభుత్వ ఫస్ట్గ్రేడ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ అప్పన్న హంజే అన్నారు. కన్నడ విశ్వవిద్యాలయంలోని త్రిపది ఆడిటోరియంలో శుక్రవారం అభయరాజ్ బల్డోటా జైన్ సంస్కృతి అధ్యయన చైర్మన్ నిర్వహించిన జైన బసది, శిల్పాల భావనలు అనే ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బౌద్ధమతం, జైన మతం, శైవమతం, వైష్ణవ మతం వంటి వివిధ మతాలు భారతదేశం వారసత్వం, సంస్కృతికి పునాదులు అని ఆయన అన్నారు. జైన, బసదిలు, శిల్పాలు కేవలం మతపరమైన భావనలు మాత్రమే కాదు. అవి మతం మేధో, భౌతిక సంస్కృతిని ప్రతిబింబించే ముఖ్యమైన చారిత్రక పత్రాలు. వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా సమాజ విలువలు, ఆలోచనలు, జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. జైన మతం అనేక అంశాలతో కూడిందన్నారు. అన్ని జీవులపై గౌరవం, సహనం సందేశాన్ని తెలియజేస్తాయని ఆయన వివరించారు. కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్. డీవీ.పరమశివమూర్తి, అభయరాజ్ బల్డోటా జైన్ సంస్కృతి అధ్యయన చైర్ కన్వీనర్ డాక్టర్ రమేష్ నాయక్, పురావస్తు శాఖ ప్రొఫెసర్లు డాక్టర్ వాసుదేవ బడిగేర, డాక్టర్ ఎస్వై.సోమశేఖర్, డాక్టర్ మోహన్రావు బి.పంచల్, డాక్టర్.యర్రిస్వామి, పరిశోధకుడు నాగరాజ తదితరులు పాల్గొన్నారు. -
డ్యాం గేట్ల పనులు జాప్యం చేస్తే ధర్నా
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల పరిధిలో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయానికి కొత్త క్రస్ట్గేట్లు అమర్చే పనులు వేగవంతంగా పూర్తి చేయకపోతే మార్చి 1 నుంచి ధర్నా చేస్తామని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన శనివారం తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. పాతబడిన తుంగభద్ర డ్యాంలోని 33 గేట్లు మార్చాలని నిపుణుల సూచన మేరకు గేట్లు మారుస్తుండటం శుభపరిణామమన్నారు. అయితే రబీ సీజన్కు క్రాప్ హాలీడే ప్రకటించి గేట్లు అమర్చుతున్న తరుణంలో వచ్చే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోపు అయినా గేట్లు మార్చడం సాధ్యం అవుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. డ్యాంకు ఉన్న 33 క్రస్ట్గేట్ల స్థానంలో కొత్త గేట్లు అన్నీ ఎప్పటిలోగా అమరుస్తారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మార్చి 1వ తేదీ లోపు కనీసం 20 శాతం పనులు పూర్తి కాకపోతే ధర్నా చేస్తామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందన్నారు. ఈవీఎంలు లేదా బ్యాలెట్ పద్ధతిలో ఎలా ఎన్నికలు నిర్వహించినా బీజేపీ గెలవడం ఖాయమన్నారు. కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రం ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకు సీఎం సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి సీటు కోసం డీకేశి ఇద్దరూ తీవ్రంగా రాజకీయంగా పావులు, ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నందున ఈ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికీ అంతుపట్టడం లేదన్నారు. మొన్న కేంద్రంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశానికి ఎంతో మేలు చేకూరే బడ్జెట్ అని కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తమ బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రానికి కూడా అన్ని విధాలుగా సహకారం అందించే విధంగా బడ్జెట్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర బడ్జెట్పై విమర్శలు చేస్తోందన్నారు. నగర శివార్లలోని గోదాముల్లో 4 వేల బస్తాల యూరియా పట్టుబడటంపై సమగ్రంగా తనిఖీ చేయాలన్నారు. అసలే రైతులు యూరియా లేక ఎంతో ఇబ్బందులు పడ్డారని, వేలాదిగా యూరియా బస్తాలు ఎలా లభ్యం అయ్యాయో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో తనిఖీ చేయాలన్నారు. మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, బీజేపీ నాయకులు వీరశేఖర్రెడ్డి, కోనంకి తిలక్, హనుమంతప్ప, తిమ్మప్ప, కే.ఎస్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. గోదాముల్లో యూరియా నిల్వలపై తనిఖీకి డిమాండ్ విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీరాములు -
రాష్ట్రాన్ని ఉడ్తా పంజాబ్ కానివ్వం
మైసూరు: కర్ణాటకను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉడ్తా పంజాబ్గా మాదిరిగా మత్తు పదార్థాల నిలయంగా మార్చనివ్వమని హోం మంత్రి జి.పరమేశ్వర్ అన్నారు. శనివారం మైసూరులో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు శాఖలో చాలా సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. మాదకద్రవ్యాల సమస్యపై మేము చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాం, బెంగళూరులో ప్రతిరోజూ వందలాది కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. పంజాబ్లో ప్రతి ఇంట్లో డ్రగ్స్ దొరికాయని వార్తలు వస్తున్నాయని, అలా కర్ణాటకను కానివ్వబోమన్నారు. మైసూరులో డ్రగ్స్ ఫ్యాక్టరీలు లేవు మైసూరులో ఎటువంటి మాదకద్రవ్యాలు కనుగొనలేదని ఇటీవలి డ్రగ్స్ ఫ్యాక్టరీలు గుట్టురట్టయిన సంఘటనను హోంమంత్రి ప్రస్తావించారు. నార్కోటిక్స్ బ్యూరో దాడిలో ఫినాయిల్ కెమికల్ లభించిందని, అయితే బ్యూరోవారు రూ.10 కోట్ల మాదకద్రవ్యాలు దొరికాయని అబద్ధం చెప్పారని హోంమంత్రి ఆరోపించడం గమనార్హం. మైసూరులో మొదటిసారి సోదాల్లో డ్రగ్స్ లేవన్నారు, అంతలోనే మరో మీడియా ప్రకటనలో డ్రగ్స్ దొరికాయని చెప్పారని దుయ్యబట్టారు. తాను మైసూరు పోలీసు కమిషనర్ను ప్రశ్నించినప్పుడు, ఇక్కడ ఏమీ దొరకలేదని తెలిపారన్నారు. ఇలా పత్రికా ప్రకటన జారీ చేయాల్సిన అవసరం ఏమిటి? అని నార్కోటిక్స్ బ్యూరో మీద మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని రసాయన కర్మాగారాలను తనిఖీ చేయాలని నేను ఇప్పటికే పోలీసు అధికారులను ఆదేశించానని చెప్పారు. ఏ రసాయన కర్మాగారం కూడా పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోరాదన్నారు. 15 రోజులకు ఒకసారి తనిఖీలు చేయాలని, ముడి పదార్థాలను పరిశీలించాలని తెలిపారు. పోలీసులు ప్రజాస్నేహిగా ఉండాలి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలను నేరస్థులుగా చూడకూడదు. పోలీస్ స్టేషన్లు ప్రజలకు అనుకూలంగా ఉండాలని హోం మంత్రి తెలిపారు. సిద్ధార్థనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. పోలీసులు చురుగ్గా పనిచేయాలని, హుబ్లీలో ప్రేమోన్మాది చేతిలో యువతి హత్యకు గురైంది, పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే అలా జరిగి ఉండేది కాదన్నారు. మైసూరుకు మరింత బాగా పర్యాటకులు రావాలని, పోలీసులు, ప్రజలు టూరిస్టులకు అన్ని రకాల ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. మైసూరులోని చారిత్రక భవనాలను కాపాడుకుంటే మరింత కీర్తి వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీవత్స, ఐజిపి ఎం.బి. బోరలింగయ్య, పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలను అరికడతాం హోంమంత్రి పరమేశ్వర్ -
వీడియోతో మహిళకు బెదిరింపులు
హుబ్లీ/రాయచూరు రూరల్: విలేకరుల ముసుగులో మహిళా అధికారిణి బెడ్రూం వీడియో దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి వాటిని చూపి బ్లాక్మెయిల్ చేస్తున్న ముగ్గురిని బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సదరు మహిళ ప్రైవేట్ దృశ్యాలు ఉన్న వీడియో చిత్రీకరించుకొని ఆ మహిళను విలేకరుల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన సమాచార హక్కు చట్టం కార్యకర్తతో పాటు ముగ్గురు నిందితులను బెళగావి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. గోకాక్ జలాల్ గల్లి నివాసి సమీర్ నిస్సార్ అహ్మద్ షేక్ (32), గోకాక్ తాలూకా యోగికొళ్ల నివాసి అబ్దుల్ రఫీక్ నజీర్ అహ్మద్ మకాందార్(51), గోకాక్ తాలూకా ఘటప్రభ నివాసి మహమ్మద్ దిలావర్ బాళెకుంద్రి(43) అరెస్ట్ అయిన నిందితులు. ఆ మహిళ ఇంట్లో లేని సమయంలో ఇంటి తలుపునకు వేసిన తాళం చెవిని ఆ పక్కన పెట్టే విషయాన్ని పొరుగింటి వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు. డబ్బు కోసం బ్లాక్మెయిల్ ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ నిందితులు గోకాక్వాసులుబల్బు హోల్డర్లో సీసీ కెమెరా అమర్చి.. దుండగులు రహస్యంగా బల్బు హోల్డర్లో సీసీ కెమెరా అమర్చి ఆ మేరకు ఆమె ప్రైవేట్ దృశ్యాలను చిత్రీకరించుకొని బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాతో పాటు న్యూ చానల్లో వైరల్ చేస్తామంటూ బెదిరించారు. అలా వైరల్ చేయకూడదంటే రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళకు బ్లాక్ మెయిల్ చేసిన వారిపై బెళగావిలోని మాళమారుతి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 3 మొబైల్స్, 64 జీబీ పెన్డ్రైవ్, 6 హిడెన్ కెమెరా హోల్డర్లు, ఐక్యూ జెడ్ఎక్స్, రెండు ఓటీజీ, రెండు మెమరి కార్డులు, రీడర్లు, 128 జీబీ 8 మెమరి కార్డులు, ఒక టోయోటా ఇన్నోవా క్రిస్టా కారును పోలీసులు జప్తు చేసి సమగ్రంగా దర్యాప్తు చేపట్టారని బెళగావి నగర పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే మీడియాకు తెలిపారు. -
అలరించిన క్రీడా మేళా
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వ్యవసాయ విశ్వ విద్యాలయం క్రీడా మైదానంలో క్రీడా మేళాకు శ్రీకారం చుట్టారు. కుస్తీ, శ్వాన ప్రదర్శనలను చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ ప్రారంభించారు. 30 జాతులకు చెందిన వందకు పైగా శునకాలను ప్రదర్శించారు. మహిళల కుస్తీ పోటీలను జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కూమార్ కాందూ పారంభించారు. అనంతరం నిర్వహించిన యక్షగాన ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళల దాస సాహిత్య వేదికలో దాసుల, మాద్యమ, ఇతర అంశాలపై చర్చ గోష్టులు నిర్వహించారు. రాక్షస సంహరం పాత్రలో యువకుడు ప్రేక్షకులను అలరించాడు. అనంతరం ఇసుక బస్తాల పోటీలు నిర్వహించారు. కసభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, డీసీ నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, నగర నభ కమిషనర్ జుబీన్మెహ పాత్రో, బడిగేర, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కొప్పళలో భారీ పరిశ్రమల ఏర్పాటు వద్దు
రాయచూరు రూరల్: కొప్పళలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దని కోరుతూ గురువారం కొప్పళ నగర సభ కార్యాలయం వద్ద పలువురు ఆందోళన చేపట్టారు. ఈ ప్రాంతంలో విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు స్థాపించి మానవుల జీవితాలను నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు. బల్దోట, కిర్లోస్కర్, కళ్యాణ స్టీల్, ముక్కుంది సుమి తదితర కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలాలు కలుషితం అవుతాయని తెలిపారు. 18 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా కేంద్రంపై బత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రికి లేఖలను రాయాలని అధికారులను కోరారు. కొప్పళలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరుగుతుందని జిల్లా అధికారి రాజశేఖర్, ఎస్పీ రామ్ అరసిద్ది ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంజునాథ్, మదరి, హన్మంతప్ప, మల్లికార్జున, గురునాథ్ గౌడ, విరుపణ్ణ, వీరభద్రప్ప, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. -
గురురాఘవునికి ప్రత్యేక పూజలు
బనశంకరి: జయనగర ఐదో బ్లాక్లోని గురు రాఘవేంద్రస్వామి మఠంలో పరమపూజ్య 1008 సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆదేశాల ప్రకారం మఠం సీనియర్ వ్యవస్థాపకుడు ఆర్కే.వాదీంద్రాచార్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు రాఘవేంద్ర స్వామి మఠంలో పంచామృత అభిషేకం, కనకాభిషేకం, ప్రత్యేక అలంకరణ, మహామంగళ హారతి చేపట్టి భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం రథోత్సవం, గజవాహనోత్సవం, అష్టావధానం, ఊయలపూజ, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బావనూపుర నృత్యశాల గురువిదుషీ మీనాక్షీ ప్రసాద్ విద్యార్థుల బృందంచే నృత్యప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుందని నందకిశోర్ ఆచార్ తెలిపారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు
● మంటల్లో వాహనం దగ్ధం ● ప్రయాణికులు, కండక్టర్, డ్రైవర్ క్షేమం యశవంతపుర: విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీకొని మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన బెంగళూరు–తుమకూరు జాతీయ రహదారి –48లో శుక్రవారం జరిగింది. 40 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్తో కలిసి బెంగళూరు నుంచి కలబుర్గికి బయల్దేరిన బస్సు నెలమంగల తాలూకా హనుమంతపుర గేట్ వద్దకు రాగానే రోడ్డు మరమ్మతుల వల్ల వాహనం స్లో అయ్యింది. అదే సమయంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ కిందకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. అనంతరం మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. ప్రయాణికుల లగేజీ సైతం మంటల్లో కాలి బూడిదైంది. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
హంపీ ఉత్సవాలకు ఆహ్వానం
హొసపేటె: ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు జరగనున్న హంపీ ఉత్సవాలకు రావాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను విజయనగర జిల్లా అధికారి కవితా ఎస్.మన్నికేరి కోరారు. బెంగళూరులో డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు క్యాబినేట్ మంత్రులు హెచ్కే పాటిల్, శివరాజ్ తంగడిగి, జమీర్ అహమ్మద్తో పాటు తదితర మంత్రులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. మూడు రోజుల పాటు జరగనున్న హంపీ ఉత్సవాలకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. అభివృద్ధి పనులు ప్రారంభం బళ్లారి అర్బన్: బళ్లారి మహానగర పాలక సంస్థ పరిధిలోని 8వ వార్డులో ఉన్న శ్రీరామ ఆలయ అభివృద్ధి పనులు, అంగనవాడీ కేంద్రాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రామాంజనేయులు, కాంగ్రెస్ నాయకులు డి.సూరి పరశురాముడు, థియేటర్ శివు, స్థానిక నాయకులు, వెంకటేశులు, ఆంజనేయులు, ఫకీరప్ప, జికే.స్వామి, కేశవులు సనత కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ విఫలం: యువతి ఆత్మహత్యరాయచూరు రూరల్: ప్రేమ విఫలమైందనే కారణంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాన్వి తాలుకా నీరమాన్వి మండలం సీకల్ తండాకు చెందిన సుమంగళ (21) సింధనూరులో డిగ్రీ చదువుతోంది. సింధనూరులో హాస్టల్ ఉంటూ ఇంటికి రాకపోకలు సాగించేంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు సింధనూరు–బెంగళూరు రైలు మార్గంలో పట్టాలపై సుమంగళ మృతదేహం లభించింది. ప్రేమ విఫలం కావడంతో సుమంగళ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రేమికుడు మోసం చేయడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుమంగళ ఒక ఆడియో మెసేజ్ను సోదరుడికి పంపినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. ఘనంగా ఆంజనేయ స్వామి వార్షికోత్సవం బళ్లారి టౌన్: నగరంలోని విద్యానగర్లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తొలుత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మహిళలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సేవ ట్రస్ట్ అధ్యక్షుడు వై.భాస్కర్, ఉపాధ్యక్షుడు బోయపాటి విష్ణువర్దన్, పదాధికారులు కొండయ్య, ముత్యాల రాజు, కరణం గాలయ్య, రవిచంద్ర, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీదేవి, మల్లికార్జున, మోహన్దాస్, బసవరాజ్ స్వామి, సీతారామాంజనేయలు, సాయి బాబు తదితరులు పాల్గొన్నారు. శరవేగంగా కొత్త గేట్ల ఏర్పాటు హొసపేటె: తుంగభద్ర జలాశయానికి సంబంధించి కొత్త గేట్ల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఈ 10 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 18వ గేటుఏర్పాటు చేసి 20 రోజులు అయ్యింది. ప్రస్తుతం 1, 4, 11, 17, 19, 20, 24, 27, 28, 33 గేట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. గదగ్, టీబీ డ్యాం తుంగభద్ర ఎస్టేట్ కార్యాలయ ఆవరణంలో గేట్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 21 గేట్ల నిర్మాణం పూర్తయింది. రెండు గేట్ల నిర్మాణం పురోగతిలో ఉంది. మరో నాలుగు గేట్ల నిర్మాణానికి సంబంధించిన సామగ్రి గదగ్కు చేరుకుందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. -
రెండు కార్ల ఢీ: ఒకరు మృతి
● నలుగురికి తీవ్ర గాయాలు సాక్షి బళ్లారి: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దావణగెర జిల్లా చెన్నగిరి తాలూకా ఉన్నేభాగి సమీపంలో చోటు చేసుకుంది. చెన్నగిరి తాలూకా నల్లూరు నుంచి వక్కల వ్యాపారం కోసం వెళ్తున్న వారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు దూరంగా పడిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడి వారిని చికిత్స నిమిత్తం దావణగెర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిరి ధాన్యాలతో ఆరోగ్యంరాయచూరు రూరల్: దేశంలో మిల్లెట్స్ (సిరి ధాన్యాల) వినియోగంతో అరోగ్యంగా ఉండవచ్చని వైద్యశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ తెలిపారు. గురువారం రాత్రి వ్యవసాయ విశ్వ విద్యాలయంలో వ్యవసాయ మేళా–2026 నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కళ్యాణ కర్నాటకలోని ఏడు జిల్లాల్లో జొన్న, కొర్ర, సజ్జ, మినుములు, నువ్యులు, రాగి, గోధుమ పంటలు పండించేందుకు వ్యవసాయ విశ్వ విద్యాలయానికి రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని తెలిపారు. శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ హనుమంతప్ప, సిండికేట్ సభ్యులు బసన గౌడ, మల్లేష, మధుసూదన రెడ్డి, డీసీ నీతిష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి మాదయ్య, దేశాయి, నాయక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 11, 12 తేదీల్లో ప్రార్థన కూడికలు సాక్షి బళ్లారి: సమాజంలో అనేక మందిని సన్మార్గంలో నడిపించిన పీ.సీ.పరమానంద జ్ఞాపకార్థం ఈనెల 11, 12 తేదీల్లో బళ్లారి పట్ణణంలో ప్రార్థన కూడికలు ఏర్పాట్లు చేస్తున్నట్లు విక్టర్ ఇమ్మానియేల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశ విదేశాల్లో దైవ వర్తమానాన్ని వినిపిస్తున్న ఇవాంజలిస్ట్ డాక్టర్ పీ.ఎస్.రాంబాబు పాల్గొని ‘డూనామిస్–దేవుని రాజ్యపు శక్తి’ కూటమి ఏర్పాటు చేస్తారన్నారు. బళ్లారి సీఎస్ఐ తెలుగు చర్చీ ఆవరణలో రెండు రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక సభల్లో అన్నిక రాంబాబు పాల్గొని దైవ వర్తమానాన్ని వినిపిస్తారని వెల్లడించారు. ఈ రెండు రోజుల్లో అద్భుతమైన ఆరాధన జరిపేందుకు బెంగళూరు నుంచి ప్రార్థన బృందం వస్తుందన్నారు. యువత కోసం 12న ప్రత్యేక దైవ వాక్య సందేశం, ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు. ఆలయంలో మాంసపు సంచులు బళ్లారి అర్బన్: బళ్లారి నగరంలోని నాగలకెరె ప్రాంతంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో మాంసంతో కూడిన ప్లాస్టిక్ సంచులు లభ్యం కావడం కలకలం రేపింది. ఇటీవల ప్రారంభమైన పిస్తా హౌస్ రెస్టారెంట్ వెనుక భాగంలో ఉన్న ఆలయ పరిసరాల్లో సంచులు లభించాయి. ఉదయం పూజల కోసం వచ్చిన అర్చకుడు మహేష్.. దీనిని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మాంసపు సంచులను తొలగించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన వెనుక కిడిగాళ్ల చర్య ఉందా? లేదా కుక్కలు తీసుకొచ్చాయా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. బళ్లారి వలయ ఐజీ డాక్టర్ హర్ష, ఏఎస్పీ రవికుమార్ ఆలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందన్నారు. వాస్తవాలు తేలిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా ఆలయాన్ని సందర్శించారు. -
మంగళకిరణ్కు కృషి పండిత్ అవార్డు
హుబ్లీ: అత్యాధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తోటి మహిళ రైతులు, అన్నదాతలకు స్ఫూర్తినిస్తూ ఆదర్శంగా నిలిచిన గదగ్ జిల్లా ముళగుంద మహిళ ప్రగతి రైతు మంగళకిరణ నీలగుందకు రాష్ట్ర ప్రభుత్వం కృషి పండిత్ అవార్డు ప్రదానం చేసింది. గురువారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య మేళా–2026 ఉత్పాదానోత్తర వ్యవసాయ–రైతుల సాధికారత కార్యక్రమం జరిగింది. మంగళకిరణ్తో పాటు పలువురు రైతులకు సీఎం సిద్దరామయ్య డీసీఎం డీకే.శివకుమార్ తదితర ప్రముఖులు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంగళకిరణ్ మాట్లాడుతూ.. తనకు అండగా నిలుస్తున్న భర్త కిరణ్ నీలగుంద సహకరాలు మరవలేనివని తెలిపారు. రైతులు స్ఫూర్తి పొంది మేలైన సాగు పద్ధతులు పాటించి తగిన దిగుబడులు సాగిస్తే సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. -
రూ.130 కోట్ల విలువైన స్థలం స్వాధీనం
బనశంకరి: కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని బీడీఏ స్వాధీనం చేసుకుంది. బెంగళూరు దక్షిణతాలూకా, ఉత్తరహళ్లి హోబళి జేపీ.నగర 9వ ఫేజ్ లేఔట్ ఆలహళ్లి గ్రామం సర్వేనంబర్ 20లోని మూడు ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొంతమంది అక్రమంగా నిర్మాణాలను చేపట్టారు. దీంతో బెంగళూరు అభివృద్ధి ప్రాధికార(బీడీఏ) అధికారులు శుక్రవారం పోలీస్ భద్రత మధ్య జేసీబీ యంత్రాలతో వెళ్లి ఆక్రమణలు తొలగించి రూ.130 కోట్ల విలువచేసే భూమిని స్వాధీనం చేసుకున్నారు. బోనులో చిక్కిన చిరుత మైసూరు: మైసూరు జిల్లా సరగూరు తాలూకా ఎన్. బెల్తూర్ ఓల్డ్ గేట్ సమీపంలో గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో పడింది. కొన్ని నెలలుగా చిరుతపులి ఎన్. బెల్తూర్ ఓల్డ్ గేట్ సమీపంలోని పొలాల్లో సంచరిస్తూ 37 ఆవులను హతమార్చింది. దీంతో అటవీశాఖ అధికారులు 20 రోజుల క్రితం గ్రామానికి చెందిన యోగేష్ అనే రైతు పొలం సమీపంలో బోను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఆహారం కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కుకుంది. శుక్రవారం ఉదయం అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలించి మగచిరుతగా గుర్తించారు. మత్తుమందు ఇచ్చి బంధించి రేడియో కాలర్ అమర్చి అడవిలోకి వదిలేశారు. ఏసీఎఫ్ మధు, ఆర్ఎఫ్ఓ సిద్ధరాజు, చిరుత టాస్క్ఫోర్స్ సిబ్బంది, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. బంగ్లాదేశీయుల టెంట్లలో మంటలు యశవంతపుర: బంగ్లాదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్న షెడ్లలో మంటలు వ్యాపించిన ఘటన బెంగళూరు పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. కూడ్లు చెరువుకు సమీపంలో బంగ్లాదేశీయులు షెడ్లు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో షెడ్లలో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న బంగ్లాదేశీయులు మేల్కొని బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. సమీపంలోని విద్యుత్ తీగ తెగి పడటంతో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. పరప్పన అగ్రహరం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మ్యూల్ అకౌంట్లతో వంచన: 13 మంది అరెస్ట్ బనశంకరి: రాష్ట్రంలో సైబర్ నేరాలు పెచ్చుమీరడాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐడీ అధికారులు మ్యూల్ అకౌంట్ల ద్వారా భారీ ప్రమాణంలో సైబర్వంచన దందాకు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. ఒకేసారి పలు చోట్ల దాడులు నిర్వహించిన సీఐడీ అధికారుల బృందాలు అక్రమంగా వాడుతున్న 40 వేలకు పైగా మ్యూల్ అకౌంట్ల ఆచూకీని కనిపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్లకుపైగా ఒకేసారి దాడులు నిర్వహించిన సీఐడీ బృందం దందాలో నిమగ్నమైన 13 మందిని అరెస్ట్ చేశారు. అమాయక ప్రజలు బ్యాంక్ అకౌంట్లు, ఏటీఎం కార్డులు, అకౌంట్ వివరాలను డబ్బుల కోసం సేకరించి సైబర్ వంచకులకు అందిస్తున్నట్లు సీఐడీ దర్యాప్తులో వెలుగు చూసింది. మ్యూల్ అకౌంట్ల ద్వారా ఆన్లైన్ వంచనకు పాల్పడి నగదు బదిలీ, ఏటీఎం ద్వారా నగదు విత్డ్రా చేశారు. అకౌంట్ వివరాలు ఇచ్చిన అమాయకులకు ఈ వంచన గురించి ఎలాంటి సమాచారం తెలియదు. దర్యాప్తు సమయంలో సుమారు 40 వేలకు పైగా మ్యూల్ అకౌంట్లు వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలి రోజుల్లో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో మ్యూల్ అకౌంట్లపై సీఐడీ బృందం తీవ్ర నిఘా పెట్టి దర్యాప్తు తీవ్రతరం చేశారు. -
పొంచి ఉన్న విద్యుత్ షాక్
● నియంత్రణ కమిషన్కు ఎస్కాంల ప్రతిపాదన ● త్వరలో విద్యుచ్ఛక్తి చార్జీలు పెరిగే అవకాశం శివాజీనగర: నిత్యవసర వస్తువుల ధర పెరుగుదల రోజురోజుకు అధికమవుతున్న తరుణంలో ఆందోళన చెందుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాక్ ఎదురు కానుంది. త్వరలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేసే అనేక కంపెనీలు నష్టాల్లో కొనసాగుతుండగా, ఆదాయాన్ని సరిచేయటానికి విద్యుత్ చార్జీలు పెంచాలని విద్యుచ్చక్తి నియంత్రణ కమిషన్కు బెస్కాం ప్రతిపాదన సమర్పించింది. ప్రతి యూనిట్కు రూ.1 చొప్పున విద్యుత్ చార్జీ పెంచాలని బెస్కాం విన్నవించింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమలు, వాణిజ్య, గృహోపయోగ కనెక్షన్లపై ప్రభావం చూపవచ్చు. కర్ణాటకలో విద్యుత్ సరఫరా కంపెనీ(ఎస్కాం)లు రూ.4,900 కోట్లకు పైగా ఆదాయ కొరతను సరిచేసేందుకు 2026 ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలను మళ్లీ పెంచే అవకాశం అధికంగా ఉంది. కర్ణాటక విద్యుత్ నియంత్రణ కమిషన్కు ఎస్కాంలు ప్రతిపాదనలు సమర్పించగా, ప్రజల విచారణ తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పెంపుదల ప్రతి యూనిట్కు 8–10 పైసల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. ఎస్కాంలు ఆదాయ కొరతను సరిచేసేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థకు విన్నవించారు. 2025 మార్చిలో కర్ణాటక విద్యుత్ నియంత్రణ కమిషన్ ప్రతి యూనిట్కు 36 పైసల వరకు విద్యుత్ ధరను పెంచింది. వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులపై విద్యుత్ చార్జీలను పెంచటం ద్వారా తమ రూ.4,620 కోట్ల ఆదాయ తారతమ్యాన్ని సరిచేయాలని విద్యుత్ సరఫరా మండలి కర్ణాటక విద్యుత్ నియంత్రణ కమిషన్ను కోరిందని తెలిసింది. గత సంవత్సరం మార్చిలో ధర పెంచినపుడు కేఈఆర్సీ వేసిన అంచనాల్లో ఖర్చు అధికం కాగా ఆదాయంలో కోత పడింది. మెట్రో ధరల పెంపుపై నిరసన బనశంకరి: నమ్మమెట్రో టికెట్ ధరల పెంపును ఖండిస్తూ ఉప్పు, పప్పు, బెల్లం, టూత్పేస్ట్ తదితర వాటితో కర్ణాటక రక్షణావేదిక కార్యకర్తలు, కన్నడపర సంఘాల కార్యకర్తలు శుక్రవారం వినూత్నరీతిలో ధర్నా చేపట్టారు. సోపు, టూత్పేస్ట్, టూత్బ్రష్, బియ్యం, కందిపప్పుతో శాంతినగర బీఎంఆర్సీఎల్ కార్యాలయానికి చేరుకున్నారు. మెట్రో టికెట్ కొనడానికి తమ వద్ద డబ్బు లేదని, అందుకే ఈ వస్తువులను తీసుకొని టికెట్ ఇవ్వాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. మెట్రో టికెట్ల ధర పెంపుతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రయాణికులపై పెను భారం పడుతుందన్నారు. తక్షణం మెట్రో టికెట్ ధర తగ్గించాలని, లేనిపక్షంలో పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విమానాశ్రయంలో బంగారం చోరీ యశవంతపుర: బెంగళూరు దేవనహళ్లిలోని కెంపేగౌడ విమానాశ్రయంలో కొద్ది రోజుల క్రితం బంగారం, వజ్రాల చోరీకి గురైన విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా ప్రయాణికురాలు ఒకరి బ్యాగ్ నుంచి లక్షల విలువగల ఆభరణాలు మాయమయ్యాయి. బెంగళూరు దేవనహళ్లి విమానాశ్రయం నుంచి దుబైకి వెళుతున్న హుబ్లీకి చెందిన మహిళకు చెందిన 790 గ్రాముల బంగారం, రూ.8 లక్షల విలువగల వజ్రాలు మాయమైనట్లు తెలిసింది. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో ఆభరణాలున్నట్లు గుర్తించి సిబ్బంది తనిఖీ చేసి బ్యాగ్కు ట్యాగ్ వేశారు. దుబైకి వెళ్లి మహిళ చూసుకోగా బంగారం, వజ్రాలు మాయం అయ్యాయి. చోరీలో విమానాశ్రయం సిబ్బంది చేతివాటం ఉన్నట్లు మహిళ అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలు బెంగళూరు దేవనహళ్లి విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సినీ ఫక్కీలో హైటెక్ దోపిడీ
హుబ్లీ: హావేరి సమీపంలోని జాతీయ రహదారి–48లో గూడ్స్ లారీలో తరలిస్తున్న రూ.లక్షలు విలువ చేసే వస్తువులను సినీ ఫక్కీలో దోపిడీ చేసిన ఘటన వెలుగు చూసింది. బెంగళూరు నుంచి ధార్వాడ జిల్లా కోలూరా గ్రామంలోని ఫ్లిప్కార్ట్ వేర్హౌస్కు లారీ వెళ్తుండగా ఈ దోపిడీ జరిగింది. సుమారు 6 పెద్ద బాక్సుల్లోని రూ.25 లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్నారు. హవేరి జిల్లా రాణిబెన్నురు తాలూకా కాకోళ గ్రామం నుంచి మోటెబెన్నురు చేరుకునే లోపే దొంగతనం పూర్తి చేశారు. సుమారు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘరానా దోపిడీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి రాణెబెన్నురు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రహదారి–48 పొడవునా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గూడ్స్ లారీలో రూ.25 లక్షల విలువైన వస్తువులు చోరీ -
ఉద్యోగాల కల్పనకు చర్యలు
రాయచూరు రూరల్: యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ వెల్లడించారు. శుక్రవారం వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జరిగిన ఉద్యోగ మేళాను జ్యోతి వెలిగించి మాట్లాడారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. లోక్సభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, డీసీ నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కూమార్ కాందూ, నగరనభ కమిషనర్ జుబీన్మెహ పాత్రో పాల్గొన్నారు. నిధుల విడుదలలో జాప్యం వద్దుబళ్లారి అర్బన్: రాష్ట్రంలోని సుమారు 6 వేల గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,175 కోట్ల నిధులు ఇంకా విడుదల కావాల్సి ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యసభలో జీరో అవర్లో ఆయన మాట్లాడారు. నిధులను నిరంతరం నిలిపి వేయడం న్యాయ సమ్మతం కాదని.. ఇది గ్రామీణ పాలనకు తీవ్ర నష్టం కలిగిస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితి వల్ల స్వచ్ఛత కార్మికులు సహా అవసరమైన సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద రూ.1,066 కోట్లు, జలజీవన్ మిషన్ కింద రూ.6,976 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొనానరు. 15వ ఆర్థిక సంఘం సహా వివిధ పథకాల కింద కర్ణాటక గ్రామ పంచాయతీలకు బకాయిలుగా ఉన్న రూ.10,175 కోట్లు నిధులను తక్షణమే విడుదల చేయాలని సూచించారు. రూ.కోట్ల ఆస్తి వదిలేసి సన్యాసి దీక్ష స్వీకరణ సాక్షి బళ్లారి: దావణగెర నగరానికి చెందిన సివిల్ ఇంజినీరింగ్లో టాపర్గా నిలిచిన అంచల్ కుమారి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసింది. సంసార బంధనాలు వీడి సంప్రదాయబద్ధంగా సన్యాసి దీక్షను స్వీకరించారు. దావణగెర నగరంలోని చౌకి పేటకు చెందిన బంగారం వ్యాపారి ముఖేష్, సునీతకు ముగ్గురు కుమార్తెలు. ఇందులో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి జరిగింది. చివరి కుమార్తె అంచెల్ను ఇంజి నీరింగ్ చదివించారు. అయితే తనకు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి, డబ్బు అవసరం లేదని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిన అంచల్ కుమారి.. సన్యాసి దీక్షను స్వీకరించారు. గుజరాత్ రాష్ట్రం సూరత్లో సాంప్రదాయబద్ధంగా దీక్షను స్వీకరించి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. -
గ్రామీణ క్రీడలకు జేఎస్డబ్ల్యూ ప్రోత్సాహం
సాక్షి బళ్లారి: గాదిగనూరులో శ్రీగురు రేవణ్ణ సిద్ధేశ్వర జాతరను పురస్కరించుకుని గాదిగనూరు యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ మద్దతుతో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్ల నుంచి సుమారు 120 మంది గ్రామీణ యువకులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఫైనల్ మ్యాచ్లో కేజీఎఫ్ బాయ్స్ గాదిగనూరు, జీఆర్సీసీ బాయ్స్ గాదిగనూరు జట్లు పోటీపడ్డాయి. కేజీఎఫ్ బాయ్స్ గాదిగనూరు జట్టు అత్యత్తమ ఆటతీరుతో ప్రథమ బహుమతి దక్కించుకుంది. జీఆర్సీసీ బాయ్స్ గాదిగనూరు జట్టు ద్వితీయ బహుమతి దక్కించుకుంది. జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ సమకూర్చిన ట్రోఫీలు, కప్లు, పతకాలను క్రీడాకారులకు అందజేశారు. గ్రామీణ ప్రాంత యువతకు క్రీడల్లో ఆసక్తిని పెంపొందించేందుకు క్రికెట్ టోర్నమెంట్లు దోహదపడుతాయని పలువురు తెలిపారు. కార్యక్రమంలో గాదిగనూరు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు శంకరప్ప నింగమ్మ, జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ క్రీడా అధికారి మహమ్మద్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. -
శెనగ కొనుగోళ్ల ప్రారంభమెన్నడో?
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో కీలకమైన పంట పప్పుశెనగ. ధార్వాడ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రబీ సీజన్లో వర్షాధారిత పొలాల్లో లక్ష హెక్టార్లలో శెనగ సాగు చేస్తారు. ఈ ఏడాది జిల్లాలో 2.05 లక్షల హెక్టార్లలో శెనగ సాగు చేశారు. కేంద్రం ఈసారి రూ.5765 మద్దతు ధర ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. కొనుగోళ్లు ఎప్పుడో తెలియక రైతులు దిగులు చెందుతున్నారు. ఇంతకు ముందు క్వింటాల్ శెనగ ధర రూ.5800 ఉండేది. ప్రస్తుతం రోజురోజుకు ధరలు తగ్గు ముఖం పడుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కోతల ప్రక్రియ షురూ ఇప్పటికే కోతల ప్రక్రియ కొనసాగుతోంది. కొందరు రైతులు శెనగ రాసులు పోసి విక్రయించేందుకు ఎదురు చూస్తున్నారు. మరి కొందరు రైతన్నలు సాగు కోసం అప్పోసప్పో చేసిన రైతులు డబ్బులు కట్టేందుకు ప్రైవేట్ ఏజెంట్లు, వ్యాపారులకు శెనగలు అమ్ముకుంటున్నారు. మొత్తానికి ఈ ప్రాంత అన్నదాతలను ప్రకృతి కరుణించి శెనగ దిగుబడి బాగానే వచ్చినా మార్కెట్లో ధర తగ్గిన నేపథ్యంలో రైతులు దిగులు చెందుతున్నారు. కేంద్రం క్వింటాల్ ధర రూ.5785 ప్రకటించినందున వేగంగా కొనుగోలు ప్రక్రియ కూడా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. దిగుబడి ఘనం.. పడిపోయిన ధరలు ప్రారంభం కాని కొనుగోళ్లు దిక్కుతోచని స్థితిలో రైతులుపడిపోయిన దిగుబడి ఈ సారి దిగుబడి తగ్గింది. అతివృష్టి వల్ల త్వరగా సాగు చేసి పంట దెబ్బతింది. ఖరీఫ్లో అతిగా కురిసిన వానల వల్ల పెసర పంట పాడైంది. అయితే శెనగ ఎలాగైనా తమను రక్షిస్తుందని అనుకుని ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టాం. ఆ మేరకు ఎకరాకు 2–3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దళారులు సిండికేట్గా ఏర్పడి మోసం చేస్తారనే భయం వేస్తోంది. – అప్పణ్ణ నదాఫ్, రైతు ఏప్రిల్ 18 వరకూ నమోదు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర యోజన ద్వారా నాణ్యత కలిగిన శెనగ ఉత్పత్తిని ప్రతి క్వింటాల్ రూ.5875 ధరతో కొనుగోలు చేయడానికి కేంద్రం తెరిచాం. రైతులు పేర్లు నమోదు చేసుకునేందుకు 80 రోజుల గడువు ఇచ్చాం. గత నెల 29 నుంచి ఏప్రిల్ 18 వరకు నమోదుకు అవకాశం కల్పించాం. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. నమోదు ప్రక్రియ ముగిశాక కొనుగోళ్లు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచిస్తాం. – భువనేష్ పాటిల్, ఇన్చార్జి జిల్లాధికారి గిట్టుబాటు ధర కల్పించాలి తక్షణమే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తే రైతులకు అనుకూలంగా ఉంటుంది. వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ మద్దతు ధర ప్రకటించాలి. కోతలు కోసి ధర వచ్చే దాకా పెట్టుకునేందుకు రైతులకు గోడౌన్లు కరువయ్యాయి. ఈ విషయంలో రైతన్నలను ప్రభుత్వమే ఆదుకోవాలి. – బసవరాజ్, రైతు, గుడేనకట్టి -
హంపీ ఉత్సవాలకు ముస్తాబు
హొసపేటె: ఈనెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు హంపీ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన సన్నాహక పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. హంపీ రోడ్డుతో సహా అన్ని ప్రధాన అనుసంవిధాన రహదారులు, జిల్లా ప్రధాన కార్యాలయం హొసపేటె నగరానికి అనుసంధానించే రహదారుల మరమ్మతులు చేపడుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న మొక్కలు, గుంటలను తొలగించే పనులు చేపట్టారు. హోస్పేట్ నగరాన్ని హంపీకి అనుసంధానించే రహదారి, నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. నగర శివారులోని జాతీయ రహదారి–50 సొరంగం దగ్గర ఆకర్షణీయమైన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. కర్ణాటక మ్యాప్, రాతి రథ నమూనాను తయారు చేసి విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక జిల్లా అధికారి కార్యాలయ ఆవరణలో పాటు ఇతర ప్రముఖ ప్రదేశాల్లో ఉత్సవాల బెలూన్లను ఏర్పాటు చేశారు. -
సంబరంగా రాయచూరు హబ్బ
ఊరేగింపులో నరసింహ స్వామి వేషధారణలో కళాకారులు తలపాగాలతో ఊరేగింపులో పాల్గొన్న మహిళలు ఊరేగింపులో పాల్గొన్న పగటివేషధారణ కళాకారులు రాయచూరు రూరల్: నగరంలో మూడు రోజుల పాటు జరుగనున్న రాయచూరు జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పిలుపునిచ్చారు. గురువారం కర్ణాటక సంఘం కార్యాలయం వద్ద ఉత్సవాలకు శ్రీకారం చుట్టి ఆయన మాట్లాడారు. ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాలను ఇంటింటి పండుగలా జరపాలన్నారు. రెండు దశాబ్దాల అనంతరం ఉత్సవాలు నిర్వహిస్తుండడం విశేషమన్నారు. రాయచూరు జిల్లాలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార విచారాలు, విభిన్న సంస్కృతి, కళలకు నిలయంగా మారిన జిల్లా తుంగభద్ర, కృష్ణా నదుల సంగమమని అన్నారు. మహిళా సమాజ్లో కవిగోష్టులు నిర్వహించారు. ఉత్సవాల్లో శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, నగరసభ కమిషనర్ జుబిన్ మహపాత్రో, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణలున్నారు. వ్యవసాయ మేళా అదుర్స్ గురువారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మేళా– 2026 చూపరులను ఆకట్టుకుంది. జిల్లా ఇన్చార్జి, రాష్ట్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ ప్రారంభించారు. వ్యవసాయ మేళా తోరణం, జొన్నలు, కొర్రలు, సజ్జలు, మినుములు, నువ్వులు, రాగులు, గోధుమ గింజలతో దేశ పటం, వాటర్ షెడ్ నమూనా, మత్స్య మేళా, ఇంటి గార్డెన్ మొక్కలు, ఆవులు, ఇతర ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ దద్దల్, ఆర్డీఏ అధ్యక్షుడు రామస్వామి, పామయ్య మురారి, పవన్ తదితరులున్నారు. జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలి జిల్లా ఇన్చార్జి మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ -
నా ముల్లంగి పంటే మీకు లంచం
తుమకూరు: పొలానికి దారి చూపాలని దరఖాస్తు చేసుకున్న రైతు, లంచం ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో తాను పండించిన ముల్లంగి పంటను ఇవ్వడానికి వచ్చాడు. రైతుల దురవస్థకు అద్దం పట్టే ఈ సంఘటన తుమకూరు జిల్లా మధుగిరి తాలూకాఫీసులో జరిగింది. జక్కెనహళ్లి కి చెందిన రైతు ప్రసన్నకుమార్ గురువారం ముల్లంగిలను తీసుకువచ్చి మైక్ పట్టుకుని హల్చల్ చేశాడు. ‘లంచం ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు, బదులుగా, నేను పండించిన ముల్లంగిని ఇస్తాను, రండి, రండి‘ అని గొంతెత్తడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటీ కేసు... రైతు పొలానికి దారి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. లోకాయుక్త కోర్టును ఆశ్రయించగా, నెలలోపు దారి చూపాలని కోర్టు ఆదేశించింది. ఈ పనులు చేయాలంటే తమకు లంచం ఇవ్వాలని కొందరు అధికారులు ఆ రైతును ఒత్తిడి చేశారు. తన వద్ద డబ్బు లేదని, తాను పండించిన ముల్లంగిని నాకు ఇస్తానని హంగామా చేశాడు. వారంలోపు సమస్య పరిష్కారం కాకపోతే, తహశీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటాను అని కేకలు వేశాడు. దారి చూపుతాం దీనిపై రెవెన్యూ అధికారి గోలూరు శివప్ప మాట్లాడుతూ మా అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాము. అన్నీ సరిగా ఉంటే వారంలోపు దారి చూపుతాం, రైతు ఈ దేశానికి ఆస్తి, అతను చనిపోవడం గురించి మాట్లాడకూడదు అని అన్నారు. మధుగిరి తాలూకాఫీసులో రైతు ఆవేదన పొలానికి దారి చూపాలని వేడుకోలు -
చెరసాలల్లో బదిలీల ప్రయోగం
బనశంకరి: రాష్ట్ర జైళ్లలో ఖైదీలకు అక్రమంగా అందిస్తున్న సౌలభ్యాలు, అవకతవకలను అరికట్టడానికి సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన సిబ్బందిని బదిలీ చేయాలని ఆ శాఖ చీఫ్ అలోక్కుమార్ నిర్ణయించారు. రాష్ట్రంలోని సెంట్రల్, జిల్లా జైళ్లలో, ప్రత్యేకించి పరప్పన అగ్రహార జైలులో కొన్నేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న సిబ్బందిని స్థానభ్రంశం చేయాలని సిద్ధమయ్యారు. అక్కడి జైళ్లు సిబ్బంది డబ్బు తీసుకుని ఖైదీలకు రాచ మర్యాదలు చేస్తున్నారని, మొబైల్ఫోన్లు, మద్యం, గంజాయి వంటివి సరఫరా అవుతున్నాయని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. వీడియోలతో తలనొప్పి ఈ నెల 9 నుంచి కేంద్ర జైళ్ల శాఖ కార్యాలయంలో సిబ్బందికి కౌన్సిలింగ్ చేపట్టి బదిలీలు చేయాలని ముహూర్తం కుదిరింది. పరప్పన జైలులో ఖైదీలు కేక్ కటింగ్లు, మద్యంతో విందులు చేసుకునే వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హత్య కేసు నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ కూడా ఆరుబయట కాఫీ తాగుతూ ఖుషీ చేయడం మీద విమర్శలు వచ్చాయి. ఇతర జైళ్ల నుంచి ఇక్కడకు తాత్కాలికంగా వచ్చిన సిబ్బందితో పాటు స్థానికంగా ఏళ్ల తరబడి ఉండి ఖైదీ ముఠాలకు సహకరిస్తున్న ఉద్యోగులను దూరప్రాంత జైళ్లకు తరలించాలని నిశ్చయమైంది. తద్వారా కారాగారంలో క్రమశిక్షణ కాపాడవచ్చునని అలోక్కుమార్ భావిస్తున్నారు. అవకతవకల కట్టడికి ఆ శాఖ చీఫ్ అలోక్కుమార్ వ్యూహం త్వరలో సిబ్బందికి ట్రాన్స్ఫర్లు -
మెట్రో రైలులో చార్జీల బాదుడు
బనశంకరి: బెంగళూరు మెట్రో రైళ్ల టికెట్ రేట్లను 5 శాతం పెంచుతూ బీఎంఆర్సీఎల్ గురువారం ఆదేశాలు జారీచేసింది. 9వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి. గత ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన 101.5 శాతం చార్జీలను పెంచడంతో అన్నివర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో వెంటనే 71.5 శాతానికి తగ్గించింది. మెట్రో ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు మళ్లీ 5 శాతం చార్జీలను బాదుతూ అధికారిక ఉత్తర్వులు ఇవ్వడంతో రోజువారీ ప్రయాణికులు, నగరవాసులు హడలిపోయారు. మెట్రో చార్జీలు కనీసం రూ.1 నుంచి గరిష్టంగా రూ.5 వరకు పెరిగాయి. 2023–24తో పోలిస్తే 2024–25లో మెట్రో సంస్థ నిర్వహణ వ్యయం 10.20 శాతం పెరిగిట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇది చాలా ఎక్కువేనని, కానీ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా టికెట్ ధర పెంపును 5 శాతానికి పరిమితం చేసినట్లు బీఎంఆర్సీఎల్ చెప్పడం గమనార్హం. 2017లో పెంపు తరువాత గత ఏడాది మెట్రో టికెట్ ధరలను భారీగా విస్తరించారు. అది ఒకేసారి 100 శాతం కావడంతో ప్రజలతో పాటు అన్ని పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెంపునకు మీరంటే మీరు కారణమని కాంగ్రెస్, బీజేపీ నాయకులు మెట్రో స్టేషన్ల వద్ద ధర్నాలు చేయడం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఆందోళనలకు సిద్ధమైనట్లు తెలిసింది. చార్జీలను సవరిస్తే మెట్రో స్టేషన్ వద్ద బైఠాయిస్తానని ఇటీవల నగర బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రకటించడం తెలిసిందే. చార్జీల పెంపుతో మాకు సంబంధం లేదని రాష్ట్ర సీఎం, డీసీఎంలు గతంలో ప్రకటించారు. చివరకు ప్రజల నెత్తిన మాత్రం భారం పడుతోంది. సోషల్ మీడియాలో చార్జీల బాదుడుపై తీవ్ర ఆక్రోశం వ్యక్తమౌతోంది. అనుకున్నట్లే 5 శాతం పెంపు ఈ నెల 9 నుంచి అమల్లోకి నిర్వహణా వ్యయం నెపం ప్రయాణికులపై మరింత భారం పెంచాక ఇలా... 2 కిలోమీటర్ల కంటే తక్కువ దూరమైతే రూ.10 ఉన్న చార్జీ రూ.11 అవుతుంది. 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరమైతే రూ.90 ఉన్న టికెట్ ధర రూ.95 కానుంది. చార్జీల పెంపు వన్ డే, త్రీ డే, ఐదు రోజుల పాస్లతో పాటు ప్రవాసీ కార్డులు, గ్రూప్ టికెట్లకు వర్తిస్తుందని బీఎంఆర్సీఎల్ తెలిపింది. కొన్ని కార్డులకు ఉన్న రాయితీలు కొనసాగుతాయని పేర్కొంది. తక్కువే పెంచారట.. గతంలో 100 శాతం బాది.. -
యాక్సిడెంట్లతో పెను ముప్పు
బనశంకరి: బెంగళూరుతో పాటు రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాల సంచారం పెరిగిపోవడంతో, కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో డ్రగ్స్పై జాగృతం చేయనున్నట్లు హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. గురువారం రవాణా, పోలీస్శాఖలు ప్యాలెస్ మైదానంలో నిర్వహించిన జాతీయ రోడ్డు సురక్షతా మాసం ముగింపు కార్యక్రమంలో రవాణా మంత్రి రామలింగారెడ్డి, పరమేశ్వర్ పాల్గొన్నారు. దేశంలో 4.70 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, కర్ణాటకలో 43 వేల ప్రమాదాలు జరిగాయని, వేలాది మంది చనితున్నారని చెప్పారు. మైసూరు–బెంగళూరు ఎక్స్ప్రెస్వేని ప్రారంభించిన రెండు నెలలకే అక్కడ 120 మంది మృత్యువాతపడటం విచారకరమన్నారు. అధికారులు చాలా బ్లాక్స్పాట్లను సరిదిద్దారన్నారు. బెంగళూరులోనూ యాక్సిడెంట్లకు వేలాది మంది బలవుతున్నారు, కుటుంబ పోషకుడు మరణిస్తే వారి గతి ఏం కావాలని ప్రశ్నించారు. బెంగళూరు నగరంలో 500 జంక్షన్లలో 10 వేలకు పైగా ఏఐతో పనిచేసే కెమెరాలను అమర్చామని, కమాండ్ సెంటర్ నుంచి ఏ జంక్షన్లో ఏమి జరుగుతుంది అనేది తనిఖీ చేయవచ్చని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడేవారికి జరిమానా వేయడంతో ఉల్లంఘనలు తగ్గాయన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ బస్సుల్లో మత్తు పదార్థాల ముప్పుపై జాగృతం చేయాలని పరమేశ్వర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దినేశ్గుండూరావ్, డీజీపీ ఎంఏ. సలీం, కమిషనర్ సీమంత్కుమార్సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాక్సిడెంట్లకు గురైన వాహనాలను పరిశీలించారు. హోంమంత్రి పరమేశ్వర్ ఆర్టీసీ బస్సుల్లో డ్రగ్స్పై జాగృతి -
అన్నదాత ఆత్మహత్య
● ఫైనాన్స్ వేధింపులే కారణం యశవంతపుర: ఫైనాన్స్లో తీసుకున్న అప్పు కట్టనందుకు ఇంటిని సీజ్ చేస్తామని బెదిరించడంతో రైతన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన హాసన్ జిల్లా శ్రవణ బెళగోళ తాలూకా కొత్తనఘట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. రైతు యోగేశ్ (50) చన్నరాయపట్టణలోని ఫైనాన్స్ సంస్థలో రూ.7 లక్షల రుణం తీసుకున్నాడు. నెల నెలా తప్పక కంతు కడుతుండేవాడు, అయితే ఇబ్బందులు రావడంతో 2 నెలలుగా చెల్లించలేకపోయాడు. 4న యోగేశ్ ఇంటికి వెళ్లిన ఇద్దరు ఫైనాన్స్ ఉద్యోగులు.. అప్పు కట్టలేదని కాబట్టి నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. అవమాన భారం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్స్ల ఆగడాలపై కుటుంబీకులు, గ్రామస్థులు అక్రోశం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
వేమగల్–బెంగళూరు బస్సు సర్వీస్ ప్రారంభం
కోలారు: తాలూకాలోని వేమగల్ ఫిర్కా కేంద్రం నుంచి బెంగళూరుకు బస్సు సర్వీసును గురువారం మాజీ విధాన పరిషత్ సభాపతి వి.ఆర్.సుదర్శన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా కేఎస్ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. మార్చి నెల అనంతరం ఆవశ్యకత ఉన్న ప్రాంతాలకు బస్సులు నడపాలని సూచించారు. రాబోయే రోజుల్లో వేమగల్ నుంచి విజయపుర, యలహంక అంతర్జాతీయ విమానాశ్రయం, విధానసౌధ మార్గంగా బెంగళూరుకు కొత్త బస్సు సర్వీసును ప్రారంభించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తాలూకా గ్యారెంటీ సమితి అధ్యక్షుడు వీ.ఎం.మునియప్ప, వేమగల్ నరసాపుర ప్రాధికార అధ్యక్షుడు ఉరటి అగ్రహార చౌడరెడ్డి, వేమగల్ కురుగల్ పట్టణ పంచాయతీ సభ్యురాలు దీపా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి హోసూరు: సరుకు తరలిస్తున్న వాహనాన్ని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాయకోట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా ఉళ్లుగురికి గ్రామానికి చెందిన అశోక్ (25) తన మిత్రుడు నల్లరాళ్లపల్లికి చెందిన దిలీప్తో కలిసి బుధవారం ద్విచక్ర వాహనంలో రాయకోట వైపు వెళ్తున్నారు. తిమ్మనహళ్లి వద్ద ముందు వెళ్తున్న సరుకు వాహనాన్ని వీరు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దిలీప్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అశోక్ను స్థానికులు చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాయకోట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గంజాయి స్వాధీనం మాలూరు: గంజాయిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న కేసులో రాష్ట్ర ధ్వని యూట్యూబ్ చానల్ విలేకరి నారాయణ స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.50 వేలు విలువ చేసే 520 గ్రాముల గంజాయి, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాలూకా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు గస్తీ చేపట్టారు. ఆ సమయంలో హొసకోటె నుంచి బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేశారు. వాహనం నడుపుతున్న నిందితుడు వేణుగోపాల్, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో గంజాయిని మడివాళ గ్రామానికి చెందిన యూట్యూబ్ చానల్ విలేకరి నారాయణస్వామి తీసుకుని బొలెరో వాహనంలో తరలిస్తున్నట్లు తెలిసింది. దీంతో యూట్యూబ్ చానల్ విలేకరి నారాయణ స్వామిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీధి కుక్కల దాడిలో పలువురికి గాయాలు మాలూరు: నగరంతో పాటు తాలూకాలోని వివిధ గ్రామాల్లో ఒకే రోజు కుక్కల దాడిలో ఆరుగురు గాయపడ్డారు. ఒకే కుక్క నాలుగు గ్రామాల్లో 5 మందిని కరిచింది. గ్రామస్తులు కుక్కను వెంటాడి చంపేశారు. మాస్తి ఫిర్కా దొడ్డకల్లహళ్లి గ్రామంలో పిచ్చికుక్క కెంపమ్మ, ప్రభాస్లను కరిచి తీవ్రంగా గాయపరిచింది. వీరికి మాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కోలారు ఆర్.ఎల్.జాలప్ప ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా దొడ్డ ఇగ్గలూరు గ్రామంలో కదిరప్ప అనే వ్యక్తిపై కుక్క దాడి చేసి గాయపరిచింది. నెల్లహళ్లి గ్రామంలో ఇంద్రమ్మ, మణిశెట్టిహళ్లి గ్రామంలో దయానంద్ కుక్క దాడిలో గాయపడ్డారు. వీరికి మాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అలానే నగరంలో కూడా ఓ వ్యక్తిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. విరగబూసిన మామిడి పూత హోసూరు: ఈ ఏడాది మామిడి పూత విరగబూసింది. మామిడి సాగులో క్రిష్ణగిరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి రైతులు పండించే మామిడి ఉత్పత్తులను దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. క్రిష్ణగిరి జిల్లాలో వేలాది హెక్టార్లలో పెద్ద ఎత్తున రైతులు మామిడి సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకపోతే కాపు బాగుంటుందని రైతులు చెబుతున్నారు. గత ఏడాదిగా నష్టపోయిన మామిడి రైతులకు రెండు రోజుల క్రితం క్రిష్ణగిరి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఇన్చార్జ్ మంత్రి పరిహారం అందజేశారు. -
స్ట్రాబెర్రీ సాగు.. లాభాలు బాగు
సాక్షి,బళ్లారి: ఒకప్పుడు మనదేశంలో మామిడి, జామ, బొప్పాయి, సపోటా, చీని తదితర పండ్లను సాగు చేసే రైతన్నలు ఇటీవల విదేశీ పండ్ల సాగుపై కూడా ఆసక్తి పెంచుకుని, ఆ దిశగా అడుగులు వేస్తూ సఫలీకృతం అవుతున్నారు. మారుతున్న కాలానుగుణంగా, ఆహారపు అలవాట్లు మారిపోవడంతో పాటు శారీరక శ్రమ లేకపోవడంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇటీవల ఆరోగ్యాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తుండటంతో పాటు మళ్లీ ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. మంచి ఆహారంతో పాటు వివిధ రకాల పండ్లను తినాలని వైద్యులు సూచిస్తున్న తరుణంలో పండ్లను తినేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా తర్వాత మన దేశంలో పండించే పండ్లే కాకుండా విదేశాల్లో పండించే పండ్లకు బాగా డిమాండ్ పెరిగింది. మన దేశంలో పండించే ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ పొరుగింటి పుల్లకూర భలే రుచి అన్నట్లుగా మన దేశంలో విదేశీ పండ్లకు భలే డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు మాల్స్, సూపర్ మార్కెట్లలో మాత్రమే దొరికే విదేశీ పండ్లు ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో రోడ్ల పక్కన కూడా అమ్ముతున్నారంటే వాటికి ఏమేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. టమాటా పంట తరహాలో స్ట్రాబెర్రీ సాగు టమాటా పంట తరహాలో స్ట్రాబెర్రీ నారు నాటిన రెండు నెలలకే పండ్ల దిగుబడి ప్రారంభం అవుతుంది. ఈసందర్భంగా రైతు వైజనాథ్ సాక్షితో మాట్లాడుతూ విదేశాల్లో పండించే స్ట్రాబెర్రీ తమ ప్రాంతంలో ఎందుకు పండించకూడదనే ఉద్దేశ్యంతో ప్రయత్నం చేశానన్నారు. తన రెండు ఎకరాల పొలంలో స్ట్రాబెర్రీ సాగుపై దృష్టి సారించానన్నారు. మహారాష్ట్రలోని మహాబళేశ్వర ప్రాంతంలో పండిస్తున్న స్ట్రాబెర్రీని మన ప్రాంతంలో పండించాలని ఆలోచన చేసి, అక్కడికి వెళ్లి పరిశీలించి పండ్ల తోటల పెంపకంలో మెళకువలు నేర్చుకున్నట్లు తెలిపారు. మహాబళేశ్వర నుంచే స్ట్రాబెర్రీ నారు మొక్కలు తీసుకుని వచ్చి నాటానన్నారు. అక్టోబర్ నెలలో స్ట్రాబెర్రీ మొక్కలను ఒక్కో నారు ధర రూ.10 నుంచి రూ.13 వరకు పలికిందన్నారు. ఒక ఎకరంలో వేలాది మొక్కలు అవసరం అవుతాయన్నారు. నారుతో పాటు మొత్తం పెట్టుబడి ఖర్చు ఒక ఎకరాకు రూ.5 లక్షలు అవుతుందన్నారు. టమాటా పంటను ఏవిధంగా పండిస్తామో అదే తరహాలో చేనులో ముందుగా దుక్కి దున్ని అన్ని విధాలుగా సిద్ధం చేసుకున్న తర్వాత, బోదెలు తీసి, భూమిపై మల్చింగ్ షీటు పరచాలన్నారు. 45 రోజుల నుంచి పండ్ల దిగుబడి షురూ అనంతరం డ్రిప్ సిస్టంతో స్ట్రాబెర్రీ మొక్కలు నాటిన తర్వాత 45 రోజుల నుంచి పండ్ల దిగుబడి రావడం ప్రారంభం అవుతుందన్నారు. రెండో నెల నుంచి పండ్లు కోసి, అమ్మడానికి వీలవుతుందన్నారు. పొలాల్లోనే ప్యాకింగ్ చేసి అమ్ముతామన్నారు. తమ వద్దే ఒక్కో ప్యాకెట్ ధర రూ.20ల వరకు తీసుకెళతారన్నారు. ఈ పంట 8 నెలలు పాటు ఉంటుందన్నారు. పెట్టుబడి పోను ఒక్కో ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. వర్షాకాలంలో ఈ పండ్ల తోటలు సాగు చేస్తే కొంత నష్టం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వర్షాలు వచ్చినప్పుడు పండ్లు దెబ్బ తింటాయన్నారు. దీంతో స్ట్రాబెర్రీ సాగు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ప్రారంభిస్తే మంచి లాభాలు పొందవచ్చన్నారు. ఈ పంటకు ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉండాలన్నారు. అయితే పంట నష్టపోతే ఎలాంటి బీమా సౌకర్యం లేదన్నారు. ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించి స్ట్రాబెర్రీ పండ్ల తోటల యజమానులకు సహకారం అందిస్తే, ఈ ప్రాంత రైతులు కూడా మరింతగా స్ట్రాబెర్రీ పండించేందుకు వీలవుతుందన్నారు. బీదర్ జిల్లాలో రైతు వైజనాథ్ సాగు చేసిన స్ట్రాబెర్రీ పంట ప్యాకెట్లలో నింపి విక్రయానికి సిద్ధం చేసిన స్ట్రాబెర్రీ పండ్లు విదేశీ పండ్ల పెంపకంపై భారతీయ రైతుల ఆసక్తి బీదర్లో స్ట్రాబెర్రీ సాగుతో లాభాలు గడిస్తున్న రైతు ఉత్తర కర్ణాటకలో ప్రయోగాత్మకంగా పంట సాగు విదేశీ పండ్లలో పోషకాలు మెండు విదేశీ పండ్లలో మంచి పోషకాలు ఉన్నాయని ప్రచారం కూడా ఉండటంతో వాటికి ఎంత ధర అయినా చెల్లించి కొనుగోలు చేస్తుండటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మన దేశంలో విదేశీ పండ్లకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు కూడా వాటిని పండించేందుకు సిద్ధం అవుతూ విజయం సాధిస్తున్నారు. విదేశాల నుంచి పండ్ల దిగుమతి కూడా ఏటేటా పెరుగుతోందని లెక్కలు ఉన్నాయి. దీంతో అనువైన భూముల్లో స్థానికంగా రైతులే పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. న్యూజీలాండ్, ఇటలీ తదితర దేశాల్లో పండించే కివీ పండ్లకు భలే డిమాండ్ ఉండగా, ఽథాయిలాండ్, వియత్నాం దేశాల్లో పండించే డ్రాగన్ ఫ్రూట్ను మనదేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం స్ట్రాబెర్రీ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తర కర్ణాటక పరిధిలో మొట్టమొదటిసారిగా స్ట్రాబెర్రీ సాగు చేసి ఓ రైతు సక్సెస్ అయ్యారు. బీదర్ జిల్లా కమఠాణ గ్రామానికి చెందిన వైజనాథ్ అనే రైతు రెండు ఎకరాల పొలంలో స్ట్రాబెర్రీ సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. -
బడ్జెట్ కూర్పుపై సీఎం చర్చలు
బనశంకరి: శాసనసభ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య రాష్ట్ర బడ్జెట్ తయారీపై కసరత్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి మార్పు గందరగోళం కొంచెం సద్దుమణగగా, సీఎం గురువారం నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. రేస్కోర్సు రోడ్డులోని శక్తిభవన్లో వివిధ శాఖల అధికారులతో సిద్దరామయ్య చర్చించారు. పర్యాటక, ఉద్యానవనశాఖ, గనులు భూవిజ్ఙాన, కార్మికశాఖ, కన్నడ సంస్కృతి, బీసీ సంక్షేమశాఖ, ఉన్నతవిద్యా శాఖ మంత్రులు, అధికారులతో ఆయా శాఖలకు అవసరమైన నిధులు, గతేడాది కేటాయించిన నిధుల వ్యయం తదితరాల గురించి చర్చించారు. నూతన పథకాల గురించి మాట్లాడారు. మార్చి మొదటివారంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. చిరుద్యోగికి రూ.52 లక్షలకు పైగా టోపీ శివమొగ్గ: పూజా గౌడ పేరుతో సోషల్ మీడియా ద్వారా నగర సేల్స్మ్యాన్ను వలలో వేసుకున్న ఆన్లైన్ మోసగాళ్లు రూ.52,93,646 ను వసూలు చేశారు. వివరాలు.. ఓ షాపులో పనిచేసే వ్యక్తికి పూజా గౌడ పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఓ లింక్ను పంపించారు. మోసగాళ్ల మాటలను నమ్మిన వ్యక్తి లింక్ నొక్కి ఆన్లైన్ స్టోర్లో సభ్యుడు అయ్యాడు. వస్తువులను ఆర్డర్ చేసేకొద్దీ అధిక లాభాలు ఇస్తామని అతనికి చెప్పారు. మొదట్లో కొన్ని ఆర్డర్లు చేయించి లాభం వచ్చినట్లు చూపించారు. తరువాత నువ్వే పెట్టుబడి పెడితే దండిగా సంపాదించవచ్చని నమ్మించారు. అలా పలు వారాలలో రూ.52.93 లక్షలను దుండగుల ఖాతాలకు బదిలీ చేశాడు. కొన్నాళ్లకు డబ్బును విత్డ్రా చేసుకోవాలని యత్నించగా, ఏవో కారణాలను చూపుతూ దానిని బ్లాక్ చేశారు. పన్ను, జరిమానా పేరుతో మరింత డబ్బును డిమాండ్ చేశారు. కానీ రూపాయి కూడా తిరిగి రాకపోవడంతో ముంచేశారని ఆలస్యంగా గ్రహించాడు. ఆ సేల్స్మ్యాన్ శివమొగ్గలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మద్యం స్కాంలో మంత్రి దిగిపోవాలి శివమొగ్గ: ఎకై ్సజ్ శాఖలో లంచం, బదిలీల కుంభకోణం, భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జేడీఎస్, బీజేపీ కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఎకై ్సజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపుర రాజీనామా చేయాలని గురువారం శివమొగ్గలోని శివప్ప నాయక సర్కిల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఎస్ఎన్ చన్నబసప్ప పాల్గొన్నారు. అవినీతిని నిరూపించడానికి డాక్యుమెంట్లు కావాలా?, గతంలో మంత్రి ఈశ్వరప్పపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేశారు, అప్పుడు ఆయన ఆధారాలు అడిగారా? ఇప్పుడు మా వంతు వచ్చింది అని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు గుణపాఠం నేర్పుతారని అన్నారు. కాన్సులేట్లకు బాంబు బెదిరింపుయశవంతపుర: బెంగళూరులో పలు విదేశీ కార్యాలయాలకు బాంబు బెదిరింపు వచ్చింది. హలసూరులోని ఇటలీ, జపాన్ కాన్సులేట్లకు బాంబులు పెట్టామని ఈ మెయిళ్లు వచ్చాయి. దీంతో హడావుడిగా తనిఖీలు చేయగా ఏమీ దొరకలేదు. ఆఫీసుల సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శం
కోలారు: సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు నిబద్ధతతో విధులు నిర్వహించి విద్యాశాఖకు మంచి పేరు తీసుకు రావాలని జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు జీ.సురేష్ బాబు సూచించారు. గురువారం నగరంలోని కేఈబీ సముదాయ భవనంలో 70 మంది ఉపాధ్యాయులకు సావిత్రిబాయి పూలే అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అన్ని స్థానాల కంటే ఉపాధ్యాయ వృత్తికి ప్రాధాన్యత ఉందన్నారు. ఉపాధ్యాయ గెళెయర బళగ అధ్యక్షుడు నారాయణస్వామి మాట్లాడుతూ.. ఈ మధ్య బాల్య వివాహాలు అధికంగా జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. చదువుకునే వయస్సులో పిల్లలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. చదివే పిల్లలను బడికి పంపి వారిని ప్రోత్సహించాలని సూచించారు. బాల్య వివాహాల విషయంలో పోషకులు, ఉపాధ్యాయులు జాగృతులై ఉండాలన్నారు. -
సమాజాభివృద్ధికి విద్య ప్రధానం
రాయచూరు రూరల్ : గురువుల మార్గదర్శనంలో సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధానమని బోవి సమాజం అభివృద్ధి మండలి అధ్యక్షుడు, మాజీ మంత్రి బాబురావు చించనసూరు పేర్కొన్నారు. గురువారం యాదగిరి జిల్లా గురుమఠకల్లో అంబిగర చౌడయ్య విగ్రహావిష్కరణ, అంబిగర చౌడయ్య జయంతి ఉత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజం ఐకమత్యంగా ఉంటే సమస్యలను పరిష్కరించేందుకు సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో యాదగిరి నగరసభ అధ్యక్షురాలు లలిత అనపూరే, అధికారులు, సమాజం నేతలున్నారు. అనుచిత వ్యాఖ్యలు తగదు రాయచూరు రూరల్: విధాన పరిషత్లో సభ్యురాలు ఉమాశ్రీని అవమానించే విధంగా స్పీకర్ బసవరాజ్ హొరట్టి వ్యాఖ్యలు చేయడం ఖండనీయమని చేనేత సహకార సంఘం సంచాలకుడు విజయ్ కుమార్ బాప్రీ ఖండించారు. గురువారం సభా సమయంలో ప్రశ్న అడిగినందుకు లేచి నిలబడి మాట్లాడితే మీరు చలన చిత్రాల్లో మాదిరిగా మాట్లాడడం మానాలని, ఇది వేదిక కాదు, సభా గౌరవాన్ని కాపాడాలని అసభ్యంగా, అవమాన పరిచే విధంగా వ్యాఖ్యానిస్తూ మహిళా సభ్యురాలిని అవమానించిన స్పీకర్ బసవరాజ్ హొరట్టి వెంటనే ఉమాశ్రీకి క్షమాపణ చెప్పాలన్నారు. వ్యక్తిపై పోక్సో కేసు నమోదుహుబ్లీ: మైనర్ బాలిక వ్యక్తిగత చిత్రాన్ని ఇన్స్టాలో వైరల్ చేయడమే కాకుండా లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిపై నవనగర ఏపీఎంసీ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు.. బాలిక కుటుంబ సభ్యులు ఉపాధి కోసం గోవాకు వెళ్లారు. అక్కడే ఉన్న పొరుగింటి వ్యక్తి గోవాకు చెందిన సద్దాం హుస్సేన్ బాలిక ప్రైవేటు వీడియో తీసుకుని బ్లాక్ మెయిల్ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మైనర్ బాలికను పదేపదే లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. బాలిక ఫోటోను ఇన్స్టాలో అప్లోడ్ చేయడం కూడా వెలుగు చూసింది. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. వైభవంగా బసవేశ్వర రథోత్సవంరాయచూరు రూరల్: కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకాలోని పట్టిలజంతిలో బసవేశ్వర జాతర వైభవంగా జరిగింది. బుధవారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిగింది. దేవాలయం వద్ద బసవేశ్వరుడికి కలశారోహణం చేశారు. దేవాలయం వద్ద కలశ కుంభాలతో దేవుడిని పల్లకీలో ఊరేగించారు. లోకాయుక్త వలలో అంగన్వాడీ ఉద్యోగినులురాయచూరు రూరల్: లోకాయుక్త వలలో అంగన్వాడీ ఉద్యోగినులు చిక్కుకున్న ఘటన జరిగింది. కలబుర్గిలోని స్టేషన్ బజార్ అంగన్వాడీ కార్యకర్త హీనా, సూపర్వైజర్ పింకు బాయి గాయక్వాడ్ గత మూడు నెలల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల నిధుల చెల్లింపులో రూ.14,490 డిపాజిట్ చేశారు. అయితే రెండు నెలలకు రూ.6 వేల చొప్పున ఇద్దరికి రూ.12 వేలు లంచం ఇవ్వాలని కోడిగుడ్ల సరఫరాదారును డిమాండ్ చేశారు. దీంతో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త ఎస్పీ సిద్దరాజు దాడి చేసి లంచం తీసుకుంటుండగా వారిద్దరినీ పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లారీకి బైక్ ఢీ.. ఇద్దరి మృతి కెలమంగలం: నిలిపి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. డెంకణీకోట సమీపంలోని తోగేరి గ్రామానికి చెందిన రామాచారి (36) మిత్రుడు బేళగొండపల్లికి చెందిన మునిరజ్ (37) ఒకే పరిశ్రమలో పని చేస్తున్నారు. బుధవారం రాత్రి సొంత పనిపై ద్విచక్ర వాహనంలో డెంకణీకోటకు వెళ్లారు పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. డెంకణీకోట–తళి రోడ్డులోని హోజూర్ అగ్రహారం వద్ద రోడ్డుపై నిలిపిన లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు.కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
టూరిస్టు బస్సు బోల్తా
హొసపేటె: పొరుగున ఉన్న కేరళ రాష్ట్రం విద్యార్థులు బస్సులో హంపీ వీక్షణకు వస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన బుధవారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో జాతీయ రహదారిపై జరిగింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లా గురువాయూర్లోని శ్రీకృష్ణ కళాశాలకు చెందిన ఒక ప్రొఫెసర్, 10 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, విద్యార్థినులతో కలిసి హంపీ, దాండేలి, గోకర్ణకు విహారయాత్రకు వెళ్లారు. వారు మంగళవారం ఉదయం 10 గంటలకు గురువాయూర్ నుంచి రైలులో బయలుదేరి మంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు బస్సులో హంపీకి బయలుదేరారు. డ్రైవర్ అదుపు తప్పి బస్సు ఉదయం 5 గంటల ప్రాంతంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో ప్రొఫెసర్ లక్ష్మి కాలుకు తీవ్ర గాయమైంది. అతుల్య, అవని, అతుల్, అజయ్రాజ్, అనుగ్రహ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారికి కూడ్లిగి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని బీఎంసీఆర్సీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఐదుగురికి తీవ్ర గాయాలు త్రుటిలో తప్పిన ప్రమాదం -
వీడిన వాసవీ స్వగృహ హోంనీడ్స్ మిస్టరీ
బళ్లారి అర్బన్: బళ్లారి నగరంలోని బ్రూస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భారీ మోసం కేసు మిస్టరీని పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం రూ.162 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 2025 ఏప్రిల్ 2న బ్రూస్పేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా 2025 ఏప్రిల్ 3న నిందితుల నుంచి రూ.19.38 లక్షల నగదును, అనంతరం 2025 ఏప్రిల్ 11న మరోసారి రూ.95 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాల పరిశీలనలో రూ.5 లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన డీ పన్నేకర్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీలు రవికుమార్, ఎస్.నవీన్ కుమార్, నగర ఉపవిభాగ డీఎస్పీ చంద్రకాంత్ నందారెడ్డి నేతృత్వంలో బ్రూస్పేట పోలీసు స్టేషన్ పీఐ మహంతేష్ సహా పోలీసు సిబ్బంది గాలింపు చేపట్టారు. ఒంగోలులో నిందితుల పట్టివేత పరారీలో ఉన్న టి.విశ్వనాథ్, అతని భార్య విశాలాక్షి, కుమారుడు విష్ణువర్ధన్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నట్లు సమాచారం అందడంతో గత నెల 26న మధ్యాహ్నం ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం జనవరి 27న కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని జుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి విచారణలో ప్రధాన నిందితుడు టి. విశ్వనాథ్ నుంచి గతనెల 29న రూ.37.39 లక్షల నగదు, 531.15 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం రూ.162 కోట్లకు పైగా నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని సంబంధిత కోర్టుకు నివేదిక సమర్పించినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ప్రధాన నిందితుడిని తదుపరి చర్యల కోసం మళ్లీ జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులతో సహా ప్రధాన నిందితుడు విశ్వనాథ్ అరెస్టు రూ.162 కోట్లకు పైగా నగదు, బంగారం స్వాధీనం -
నేటి నుంచి జిల్లా ఉత్సవాలు
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శ్రీకారం చుడతారని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాల జ్యోతియాత్ర, రథయాత్రలు సాయంత్రం కర్ణాటక సంఘం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. వ్యవసాయ వర్సిటీలో వేదికలపై ఉత్సవాలకు శ్రీకారం చుడతారన్నారు. జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, మాన్వి, సింధనూరు, ముదగల్, మస్కి, సిరవార, కవితాళ, హట్టి ప్రాంతాల నుంచి లక్ష మంది పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, బోసురాజ్, శాసన సభ్యులు పాల్గొంటారని తెలిపారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణలున్నారు. జిల్లా ఉత్సవాలకు గట్టి పోలీస్ బందోబస్తు గురువారం నుంచి మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అరుణాంగ్షు గిరి తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాలు వ్యవసాయ విశ్వ విద్యాలయంలో వేదిక వద్ద ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. 150సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు. 8 మంది సీఐలు, 16 మంది ఎస్ఐలు, మూడు కేఆర్పీఎస్ బెటాలియన్, 500 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డులను నియమించారు. మూడు రోజుల పాటు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శ్రీకారం చుట్టనున్న డీసీఎం -
వికటించిన మధ్యాహ్న భోజనం
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా జమలాపూర్లో చోటు చేసుకుంది. సమాచారం అందగానే బీదర్ జిల్లాధికారి శిల్పాశర్మ హుటా హుటిన ఆస్పత్రిలో చేరిన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులు వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో అధికారులపై మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు అధికంగా తాలూకాలో జరిగాయని ఔరాద్ శాసన సభ్యుడు ప్రభు చౌహాన్ ఆరోపించారు. జిల్లా, తాలూకా విద్యాశాఖాధికారులు, అక్షర దాసోహ అధికారులు విధి నిర్వహణలో చేస్తున్న అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల క్షేమ సమాచారాన్ని విచారించారు. వారి వెంట జెడ్పీ అధికారి గిరీష్ బదోలె, తహసీల్దార్ మహేష్ పాటిల్, ఆరోగ్య అధికారిణి గాయత్రిలున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత -
రోడ్డుపై చెత్త పారేస్తే ఖబడ్దార్.!
సాక్షి,బళ్లారి: నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తోడు నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో డబ్బులు గుంజడంపై పలు ఆస్పత్రి యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నారే కాని స్వచ్ఛత గురించి పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి ముందే చెత్తా చెదారం వేస్తూ నగర స్వచ్ఛతకు తీవ్ర అడ్డంకి కలిగిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై పాలికె తగిన బుద్ధి చెప్పింది. ప్రతి రోజు ఆస్పత్రి ముందు చెత్త వేస్తూ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో పాలికె సిబ్బంది వాహనాల్లో చెత్త తీసుకొచ్చి వారి ఆస్పత్రుల ముందు మరింత చెత్త వేసి ఆస్పత్రి తీరును ఎండగట్టారు. నగరంలోని పార్వతీ నగర్లోని పద్మావతి కిడ్నీ కేర్ ఆస్పత్రి, బసవేశ్వరనగర్ రోడ్డులోని శాంతాసీతారాం ద్వారకా ఆస్పత్రి సిబ్బంది ప్రతి రోజు వారి ఆస్పత్రుల ఎదుట రోడ్డులో ఎక్కడబడితే అక్కడ చెత్తను పారవేసి చేతులు దులుపుకుంటుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అపరిశుభ్రతపై నగరవాసుల బేజారు ఇది స్టీల్ సిటీనా లేక చెత్త సిటీనా అన్న విధంగా నగర వాసులు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. పాలికె సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో బుధవారం మహానగర పాలికె మేయర్ గాదెప్ప, పాలికె కమిషనర్ మంజునాథ్ దిశానిర్దేశంతో పాలికె సిబ్బంది ఆయా ఆస్పత్రులు ముందు చెత్తాచెదారం వేసి ఆస్పత్రి యాజమాన్యానికి కళ్లు తెరిపించారు. నగరంలో ఏ ఆస్పత్రి అయినా, ఇళ్ల ముందు అయినా పదే పదే రోడ్డులో చెత్తా చెదారం వేస్తే పాలికె నుంచి పెద్ద పెద్ద వాహనాల్లో వారి ఇళ్లు, ఆస్పత్రులు ముందు తామే చెత్తాచెదారం వేస్తామని, అప్పుడు వారికి ఆ బాధ తెలిసి వస్తుందన్నారు. నగర స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే స్వచ్ఛత కాపాడుకునేందుకు వీలవుతుందన్నారు. ఎవరికి వారు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తే స్వచ్ఛత కాపాడేందుకు వీలుకాదన్నారు. పరిశుభ్రతను పట్టించుకోని ఆస్పత్రుల ముందు చెత్త పారేసిన వైనం నగర స్వచ్ఛతకు సహకరించాలని పాలికె యంత్రాంగం మనవి -
నేత్రపర్వంగా కార్ణికోత్సవం
సాక్షి,బళ్లారి: సాక్షాత్తు శివుడు స్వయంభువుగా వెలసిన ప్రతీతి కలిగిన ఏళుకోటి మైలార లింగేశ్వర జాతర, కార్ణిక మహోత్సవం కన్నుల పండువగా జరిగాయి. గత నెల 26వ తేదీన మాఘ సప్తమి రోజున ప్రారంభమైన మైలార లింగేశ్వర జాతర బుధవారం డెంకనమరడిలో మైలార లింగేశ్వర కార్ణికోత్సవంతో ముగిసింది. 11 రోజుల పాటు కఠిన ఉపవాసాలతో దీక్షను ఆచరించిన మైలార లింగేశ్వర స్వామి భక్తుడు, గొరవయ్య ‘సంపాయితలె పరాక్’ అని దైవ వాక్కు వినిపించారు. ఈ దైవ వాక్కును వినడానికి లక్షలాది మంది భక్తులు విచ్చేశారు. ప్రతి ఏటా మాదిరిగా మాఘ పౌర్ణమి అనంతరం రెండు రోజులకు ఆనవాయితీగా ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హూవినహడగలి తాలూకా మైలారలో వెలసిన ఏళుకోటి మైలార లింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ప్రతి ఏటా మాదిరిగా కార్ణిక మహోత్సవం నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా ప్రముఖ ఘట్టమైన కార్ణికోత్సవానికి గొరవయ్య ఉపవాసం ఉండి దైవ వాక్కు వినిపించారు. కార్ణికం అంటే భవిష్య వాణి కార్ణికం అంటే భవిష్యత్తులో జరిగే సంఘటనలు సాక్షాత్తు శివుడే తెలుపుతారని భక్తుల్లో నమ్మకం ఉంది. కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మైలార లింగేశ్వర స్వామి భక్తుడు గొరవయ్య ఎంతో నిష్టతో దాదాపు వారం రోజులకు పైగా ఉపవాసం ఉండి ఓ విల్లుపైకి ఎక్కి దైవవాణి వినిపించారు. ఈ కార్ణిక మహోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు తిలకించారు. ఎటు చూసినా జనసంద్రమే గొరవయ్య భవిష్యవాణిని వినడానికి ప్రజాప్రతినిధులు, జిల్లాధికారి, ఎస్పీతో పాటు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలతో ఎటుచూసినా మైలారలోని డెంకణమరడి జనసంద్రంగా కనిపించింది. సాక్షాత్తు పరమేశ్వరుడు మైలారలో మైలార లింగేశ్వర స్వామిగా అవతరించి భక్తులకు దర్శనం ఇస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు మైలారకు తరలివచ్చారు. మైలారలో భక్తులందరూ ఏళుకోటి మైలార లింగేశ్వర అంటూ నామస్మరణ చేశారు. డెంకనమరడిలో కార్ణికం వినడానికి ముందు పక్కనే మైలారలో ఏళుకోటి మైలారలింగేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోకి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని గట్టి బందోబస్తు నిర్వహించారు. గొరవయ్య దైవవాణి సంపాయితలె పరాక్ డెంకనమరడిలో కిక్కిరిసిన భక్తజన సందోహం ఏళుకోటి మైలార లింగేశ్వర అని నినదించిన భక్తులు -
27 నుంచి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు
కదిరి టౌన్: కోరి కొలిచిన భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలు మార్చి 13వ తేదీ మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి బ్రహ్మోత్సవాల వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఈనెల 27వ తేదీ (శుక్రవారం) రాత్రి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 28వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి శ్రీవారి కల్యాణోత్సవం ఉంటుంది. మార్చి 1వ తేదీ హంస వాహనం, 2న సింహ వాహన సేవలు, 3న హనుమంతవాహనం, 4న బ్రహ్మగరుడసేవ, 5న శేష వాహనం, 6వ తేదీ ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ. 7న మోహినీఉత్సవం. 8న ప్రజాగరుడసేవ, 9న గజవాహనం, 10వ తేదీన కీలకమైన బ్రహ్మరథోత్సవం, 11న అలుకోత్సవం, అశ్వవాహన సేవ, 12వ తేదీన తీర్థవాది. 13వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. భక్తులు అందరూ పాల్గొని శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. -
పోస్టర్ విడుదల
హుబ్లీ: నిరాశ్రయులకు ముఖ్యంగా నానా రోగాలు, ఎన్నో సమస్యలతో వీధి పాలైన నిర్భాగ్యులకు పట్టెడన్నం పెట్టి సేద తీర్చే కరియప్ప శిరహట్టి, సునంద దంపతులు నగరంలో మరింతగా తమ సేవలను విస్తరించడానికి కృషి చేస్తున్నారు. తాజాగా గదగ్ జిల్లా లక్ష్మేశ్వరలో కూడా శివాజీ అన్న జోళిగె పేరుతో నిర్భాగ్యులకు, ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టడానికి ఓ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ప్రముఖులు, దాతలు తదితరుల సహాయాన్ని ఈ దంపతులు అర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని చంద్రనాథ్నగర్లో స్థానిక ప్రముఖులు రాఘవేంద్ర బోగి పరివార్ నుంచి పోస్టర్ను ఆవిష్కరింపచేశారు. కరియప్ప మాట్లాడుతూ తమ స్వగ్రామం లక్ష్మేశ్వరలో నిరంతరంగా పేదలకు క్షుద్బాధ తీర్చాలన్న సత్సంకల్పంతో శ్రీశివాజీ అన్నజోళిగె అనే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడతామన్నారు. కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య రాయచూరు రూరల్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని సింధనూరులో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడిని తాలూకాలోని ఏళురాగి క్యాంప్ నివాసి దూద్ పాషా (25)గా గుర్తించారు. దూద్ పాషా సింధనూరులోని మహబూబియా కాలనీలో అద్దె ఇంట్లో ఉండేవాడని, అతని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. ఘటనపై సింధనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగానికి పెద్దపీటరాయచూరు రూరల్: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించి, ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీర సంగమేశ్వర శివాచార్య, ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత అభిప్రాయపడ్డారు. బుధవారం మహాత్మగాంధీ క్రీడా మైదానంలో హెలికాప్టర్ రైడ్ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ అరుణాంగ్షుగిరి, ఏడీసీ శివానంద, ఏసీ హంపన్న, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, డీడీపీఐ బడిగేర్, ఈరణ్ణ, తహ సీల్దార్ సురేష్ వర్మ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, చంద్ర శేఖర్రెడ్డి, రవిలున్నారు. అవి రాజకీయ ఉత్సవాలా?రాయచూరు రూరల్: జిల్లాలో మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలను రాజకీయ ఉత్సవాలుగా చిత్రీకరించడం తగదని కాంగ్రెస్ పార్టీ వెనుక బడిన వర్గాల ప్రధాన కార్యదర్శి టీ.మారెప్ప అభిప్రాయపడ్డారు. బుధవారం రాయచూరులో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాల జ్యోతియాత్ర, రథయాత్ర, పిల్లల పండుగ, మావినకెరె చెరువు వద్ద విజ్ఞాన ప్రదర్శనలకు కొడగు జిల్లా ఇంచార్జి మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్ పుత్రుడు రవి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అధికారులు మద్ద తు పలకడం చూస్తే రాజకీయ ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లుగా ఉందని ఆరోపించారు. ప్లాస్టిక్ రహిత జీపీకి సహకరించండిమాలూరు: సొసగెరె జీపీ సమీపంలోని ఆర్ కార్గో ముందు నిర్మించిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్, నూతన స్వచ్ఛ సంకీర్ణాన్ని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. నగరసభ వ్యాప్తికి సుమారు రూ.5.50 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో కూడిన వ్యర్థాల నిర్వహణ విభాగం, నూతన స్వచ్ఛ సంకీర్ణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షురాలు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రధ్ధలతో పెద్దపల్లి గంగమ్మ జాతర కేజీఎఫ్ : పురాతన ప్రసిద్ధ పెద్దపల్లి గంగమ్మ జాతర మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి రథోత్సవాన్ని జరిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. రథోత్సవం ప్రారంభం కాగానే భక్తులు రథంపైకి పూలు, పండ్లు విసిరి తమ మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మ రథోత్సవం సందర్భంగా అమ్మవారికి గొర్రెలు, మేకలను బలి ఇచ్చారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. -
బెంగళూరులో కుంగిన రోడ్డు
సాక్షి బెంగళూరు: బెంగళూరు ప్రధాన రహదారుల్లో ఒకటైన బెంగళూరు–హోసూరు జాతీయ రహదారిలో నేల కుంగిపోయింది. ఆ ప్రదేశంలో వాహనాలు లేకపోవడంతో ప్రాణహాని తప్పింది, అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బుధవారం రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా పాత చందాపుర వద్ద సుమారు 20 అడుగుల లోతుకు భూమి కుంగిపోయింది. దీంతో వాహనదారులు భయపడిపోయారు. చందాపుర నుంచి తమిళనాడు సరిహద్దు అత్తిబెలె వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పాత చందాపుర వద్ద హైవే అథారిటీ ద్వారా అండర్ పాస్ పనులు జరుగుతున్నాయి. సమీప కాలనీల నుంచి వస్తున్న మురుగునీరు అడుగు భాగంలోకి వచ్చి చేరడంతో మట్టి మెత్తబడి ఇలా జరిగిందని చెబుతున్నారు. నాసిరకంగా పనులు చేయడమే కారణమని వాహనదారులు ఆరోపించారు. భారీగా ట్రాఫిక్ జాం -
విద్యార్థులకు కిట్ల పంపిణీ
రాయచూరు రూరల్ : తాలూకాలోని ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు బుధవారం నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగ్, షూ, సాక్సులు, డైరీ కిట్లను పంపిణీ చేశారు. మార్చి నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యా శాఖాధికారి దండెప్ప బిరాదార్ సూచించారు. విజన్– 625ను లక్ష్యంగా పెట్టుకొని విద్యార్థులు మనోబలాన్ని పెంచుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఉపాధ్యాయులు జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాండు రంగ దేశాయి, సావిత్రి, వీణ, సరస్వతి, అనిత, నీలకంఠ, సునీతలున్నారు. మడివాళ మాచిదేవకు పుష్పాంజలిహొసపేటె: 12వ శతాబ్దపు శివశరణ మడివాళ మాచిదేవ కేవలం మురికి బట్టలు ఉతకలేదు, తన ప్రతిజ్ఞల ద్వారా ప్రజల మనస్సులోని మురికిని కడిగిన గొప్ప వ్యక్తి అని కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్టీ.శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం కూడ్లిగి తాలూకా గుడేకోటె గ్రామంలో మడివాళ మాచిదేవ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. మాచిదేవ బసవన్న అనుచరుడు. ఆయన తన జీవితంలో కాయకవే కై లాస సూత్రాన్ని స్వీకరించారు. డజన్ల కొద్ది వచనాలు రాయడం ద్వారా శరణ సాహిత్యానికి ఆయన దోహదపడ్డారు అని అన్నారు. సీనియర్ నాయకుడు శివప్రసాద్ గౌడ్రు, మాజీ జీపీ అధ్యక్షుడు ఎన్.కృష్ణ, ప్రిన్సిపాల్ గిరీష్, మడివాళర నాగరాజ్, శేఖరప్ప, తిప్పేస్వామి, రవి, అనేక మంది నాయకులు పాల్గొన్నారు. ఇస్పేట్ అడ్డాపై పోలీసు దాడులు రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ విధినిర్వహణలో రక్షణ కల్పించాల్సిన రక్షక భటులు భక్షక భటులుగా మారిన ఉదంతం యాదగిరిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. యాదగిరి తాలూకా హొసళ్లిలో ప్రైవేట్ స్థలంలో 11 మంది ఇస్పేట్ ఆడుతూ కూర్చున్నారు. ఈ విషయం పసిగట్టిన యాదగిరి గ్రామీణ సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతు దాడి జరపడంతో ఆడుకుంటున్న పేకాటరాయుళ్లు పరారయ్యారు. పేకాటలో రూ.లక్షల్లో ఆటలు ఆడుతుండగా పోలీసులు మెరుపు దాడి చేశారు.ఆ ప్రాంతంలో రూ.లక్షల్లో డబ్బులు దొరికినా ఎస్ఐ కేవలం రూ.35 వేలు దొరికినట్లు కేసు నమోదు చేయడం విడ్డూరమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ పృథ్వీశంకర్ను అభ్యర్థించారు. ద్విచక్ర వాహనాలను విడిపించడానికి రూ.10 వేలు చొప్పున వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. టిప్పర్ ఢీకొని బైకిస్టు దుర్మరణం రాయచూరు రూరల్: టిప్పర్, ద్విచక్ర వాహనాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం సాయంత్రం జిల్లాలోని సిరవార తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కవితాళ నగరానికి సమీపంలో చడకల్ నివాసి బసవరాజ్(32)గా కవితాళ పోలీసులు గుర్తించారు. బసవరాజ కవితాళ నుంచి పామన కల్లూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. లింగసూగూరు నుంచి రాయచూరు వైపు వస్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో బసవరాజ్ అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. కవితాళ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ తెలిపారు. 6 నుంచి మిర్చి మేళాహుబ్లీ: నగరంలో ఈ నెల 6 నుంచి 8 వరకు 14వ మిర్చి మేళాను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 14వ సారి ఘనంగా నిర్వహిస్తున్న ఈ మేళాను విజయవంతం చేయాలని కోరారు. హావేరి జిల్లాలో బ్యాడిగి మిర్చి చాలా ప్రముఖమైందని, వీటితో పాటు వివిధ రకాల మిర్చిని మేళాలో ప్రదర్శిస్తారని తెలిపారు. ఏపీలోని గుంటూరు, పంజాబ్, హరియాణ, ఢిల్లీ తదితర రైతులు కూడా ఈ మేళాలో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. -
వైభవంగా హిందూ సమాజోత్సవం
కేజీఎఫ్ : ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తాలూకాలోని క్యాసంబళ్లిలో హిందూ సమాజోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు గ్రామంలో శోభాయాత్రను జరిపారు. వేదికపై కార్యక్రమాన్ని ప్రారంభించి శివాచార్య మహాస్వామి మాట్లాడుతూ దేశంపై అనేక దాడులు జరిగినా ఇంతవరకు హిందూ ధర్మం చెక్కు చెదరకుండా, దేశం ఇంకా సదృఢంగా ఉందన్నారు. దేశంలో అధికమైన చొరబాట్లను అడ్డుకోవడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కుల వ్యవస్థ వల్ల ధర్మానికి భంగం వాటిల్లక ముందే అందరం జాగృతమై సంఘటితం కావాలన్నారు. స్వదేశీ జాగరణ మంచ్ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ క్షత్రియ సంఘటకుడు కె జగదీష్ మాట్లాడుతూ భారతీయులు దేశ అభివృద్ధి, పంచ పరివర్తన అంశాలైన సంరక్షణ, సామాజిక సామరస్యం, పరిసర నాగరిక క్రమశిక్షణ, స్వదేశీ చింతనలు అలవర్చుకోవాలన్నారు. మాజీ ఎంపీ ఎస్ మునిస్వామి, మాజీ ఎమ్మెల్యే వై సంపంగి తదితరులు పాల్గొన్నారు. -
రథంలో ఊరేగిన మల్లికార్జునుడు
మైసూరు: జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా బెట్టదపురలో చరిత్ర ప్రసిద్ధ భ్రమరాంబ సమేత సిడిలు మల్లికార్జునస్వామి, బెళ్లి బసప్ప, విఘ్నేశ్వరుల బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. భక్తులు ఉఘే మల్లయ్య, ఉఘే గిరిజమ్మ, ఉఘే బెళ్లి బసప్ప అంటూ నినాదాలు చేస్తూ తేరును లాగారు. నవదంపతులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు రథంపైకి పండ్లు, పసుపు విసిరి మొక్కుకున్నారు. భక్తులు తెల్లవారుజాము నుంచే కొండపైకి 3300 మెట్లను ఎక్కి దైవదర్శనం చేసుకున్నారు. త్వరలో మెట్రో రైలు చార్జీల పెంపు? శివాజీనగర: నగర మెట్రో ప్రయాణికులకు మళ్లీ చార్జీల షాక్ తగిలే అవకాశముంది. ఈ నెలలోనే కనీసం 5 శాతం పెంచాలని బెంగళూరు మెట్రో అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. మెట్రో నిబంధనల ప్రకారం ప్రతి ఏటా చార్జీలను పెంచుకోవచ్చు. గతేడాది చార్జీలను భారీగా పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కొన్ని మార్గాల్లో 70 శాతం పెంచడంతో అన్ని పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పటికే సామాన్య ప్రజలు మెట్రో చార్జీలంటే భయపడుతున్నారు. మళ్లీ బాదితే తట్టుకోలేరనే ఆందోళన వ్యక్తమవుతోంది. బీఎండబ్ల్యూ కారు బీభత్సం ● నిలిపి ఉన్న కారును ఢీ ● భార్య మృతి, భర్తకు గాయాలు శివమొగ్గ: జిల్లాలోని తీర్థహళ్లి తాలూకా మేగరవళ్లి సమీపంలో జాతీయ రహదారి–169ఏలో విలాసవంత బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించగా ఒక మహిళ మరణించగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారును అతి వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టడమే ప్రమాదానికి కారణం. వివరాలు.. మేగరవళ్లిలోని శ్రీదుర్గా పరమేశ్వరి దేవస్థానం అర్చకుడు అశోక్ జోగి తన భార్య మల్లిక (42)తో కలిసి కారులో వెళుతూ రోడ్డు పక్కన నిలిపాడు. ఆ సమయంలో తీర్థహళ్లి వైపు నుంచి వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి నిలిచి ఉన్న కారును ఢీకొంది. ఈ తీవ్రతకు నిలిపి ఉన్న కారులో ఉన్న దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు మణిపాల్ ఆస్పత్రికి తరలిస్తుండగా, దారిలో మల్లిక చనిపోయింది. భర్త చికిత్స పొందుతున్నారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవరు కూడా గాయపడ్డాడు, అతనిపై ఆగుంబె పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ బంగారమిచ్చారు మైసూరు: చామరాజనగర జిల్లా కొళ్లెగాలలోని ప్రైవేటు గోల్డ్ ఫైనాన్స్లో ఓ వ్యక్తి బంగారాన్ని కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడు, అప్పు తీర్చాక నకిలీ బంగారాన్ని అంటగట్టారని లబోదిబోమన్నాడు. వివరాలు.. కొళ్లెగాల తాలూకా సిద్దయ్యనపుర గ్రామానికి చెందిన ఆనంద్ శంకర్ లమాణి ఇచ్చిన ఫిర్యాదులో.. 2023 మార్చి 11న తన బంగారు ఉంగరాన్ని రూ.15 వేల నగదుకు తాకట్టు పెట్టినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2న రూ.30 వేలను చెల్లించి ఉంగరాన్ని పొందానని తెలిపారు. అయితే ఉంగరాన్ని చూసిన తర్వాత అనుమానం రావడంతో నగల షాపులో పరీక్షించగా నకిలీ బంగారం అని తెలిసింది. దీంతో న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.60 లక్షల లంచం.. అబ్కారీ డీసీపై వేటు మండ్య: లంచం డిమాండ్ చేయడంతో అబ్కారీ అధికారి సస్పెండ్ అయ్యారు. మండ్య జిల్లాలో సుందర్ అనే వ్యక్తికి మద్యం షాపు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని మంజూరు చేసేందుకు జిల్లా అబ్కారీ ఉప కమిషనర్ (డీసీ) ఆర్.నాగశయన ఏకంగా రూ. 60 లక్షలను డిమాండ్ చేశారు. ఈ ఆడియోలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. ఆర్.నాగశయనకు అబ్కారీ కమిషనర్ కార్యాలయం వివరణ కోరింది. చివరికి లంచం డిమాండ్ చేసినట్లు నిరూపితం కావడంతో సస్పెండ్ చేస్తూ అబ్కారీ ముఖ్య కార్యదర్శి అజయ్ ఎస్.కోరడ ఆదేశాలిచ్చారు. సస్పెన్షన్ కాలంలో బెళగావిలో ఉండాలని సూచించారు. -
పెట్టుబడులంటూ రూ.61 లక్షల మస్కా
శివమొగ్గ: నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో వచ్చిన ప్రకటనను నమ్మి రూ.61 లక్షలను పోగొట్టుకున్నాడు. వివరాలు.. బాధితుడు ఫేస్బుక్ను చూస్తుండగా ఎల్ఎఫ్ వర్క్ కంపెనీ అనే ప్రకటన వచ్చింది. అందులో బంగారు, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మబలికారు. ఆ ప్రలోభానికి లొంగిన బాధితుడు వంచకులు ఇచ్చిన లింక్ ద్వారా ఓ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాడు. వెంటనే అతడు ఎల్జీ (ఎల్ఎఫ్– వర్క్) 4988 అఫిషియల్ గ్రూప్ అనే వాట్సప్ గ్రూప్లోకి జతయ్యాడు. యాప్లో అడిగిన పేరు, చిరునామా, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలను భర్తీ చేసిన తర్వాత వంచకులు అతనికి పలు యూపీఐ ఐడీలను ఇచ్చి నగదు బదిలీ చేయాలని కోరారు. అలా దశల వారీగా రూ.61 లక్షలను బాధితుడి వద్ద నుంచి బదిలీ చేయించుకుని బ్లాక్ చేయడంతో మోసపోయానని శివమొగ్గ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. మహిళలకు రూ.12.80 లక్షల వంచన మైసూరు: దుస్తుల డిజైనింగ్లో శిక్షణ ఇస్తామని ప్రలోభపెట్టి 8 మంది మహిళలకు రూ.12.80 లక్షలు టోపీ వేశారు. కువెంపునగర పరిధిలోని దేవాంశ్ బోటిక్, రెంటల్ సంస్థ యజమాని సునందమాల, బాలబొమ్మలపై కేసు నమోదైంది. వీరిద్దరూ కలిసి నవ్య, జ్యోతి, రక్షిత, శ్యామల, శృతి, మల్లేశ్వరి, ఉషా అనేవారిని మోసగించారు. డిజైనింగ్ బోటిక్ శిక్షణ ఇస్తామని రూ.12.80 లక్షలను వసూలు చేసి ముఖం చాటేశారు. ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని, డబ్బు ఇప్పించాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివమొగ్గలో సైబర్ నేరం -
కుంగిపోయా.. క్షమించండి
● డెత్నోట్లో రాసిన సీజే రాయ్? బనశంకరి: కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత, రియల్టర్ సీజే.రాయ్ ఆత్మహత్యకు ముందు 12 పేజీల డెత్నోట్ రాసినట్లు తెలిసింది. కంపెనీ ఉద్యోగులను తొలగించరాదని అందులో కుటుంబసభ్యులను కోరడం విశేషం. వ్యక్తిగతంగా, మానసికంగా కుంగిపోయానని, దీంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నానని, క్షమించాలని లేఖలో ప్రస్తావించారు. తమ కంపెనీల్లో ఎవరెవరు ఏ బాధ్యతల్లో ఉండాలనేది రాశారు. ఎవరి నుంచి ఎంత డబ్బు రావాలి అనేది కూడా తెలిపారు. సుదీర్ఘమైన లేఖను బట్టి ఆయన ఐటీ అధికారుల విచారణ విరామంలో కాకుండా, కొన్నిరోజుల ముందే రాసిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఐటీ అధికారుల వాంగ్మూలం నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎలాంటి డెత్నోట్ లభించలేదని చెప్పారు. సిట్ దర్యాప్తు చేస్తుందని, నివేదిక వచ్చాక సీజే.రాయ్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు. ఐటీ అధికారులను సిట్ విచారించి వాంగ్మూలం నమోదు చేసుకుందని తెలిపారు. పెంపుడు కుక్కలను కట్టడి చేయలేరా?: హైకోర్టు దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో కుక్కలను పెంచుకుంటున్న వారు తమ కుక్కలను కట్టడి చేయలేకపోవడం వల్ల జనంపై దాడులు ఎక్కువయ్యాయని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బెంగళూరులో ఒక వ్యక్తి పెంపుడు కుక్కను తీసుకువచ్చి మరో ఇంటి ముందు మలమూత్ర విసర్జన చేయించడంతో ఆ ఇంటివారు గొడవ చేశారు. ఇరువర్గాలూ అమృతహళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నాయి. దీనిపై కుక్క యజమాని హైకోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు.. యజమానిపై కేసు వద్దని స్టే విధించింది. ఇలాంటి రభస ఎక్కువ అవుతోందని జడ్జి నాగప్రసన్న అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరు – పూణె హైస్పీడ్ రైలు యోచన యశవంతపుర: కేంద్రం నుంచి కర్ణాటకకు మరి కొన్ని హైస్పీడ్ రైలు కారిడార్ను తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి చెప్పారు. బెంగళూరు– పూణె నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా సమ్మతించారన్నారు. -
పోలీసు ఉద్యోగం దండగ.. ఎగ్రైస్ అమ్ముకోవడం మేలు
రాయచూరు రూరల్: ఒక్కరోజు కూడా సెలవు దొరకదు, ఈ ఉద్యోగం చేయడం కంటే ఎక్కడైనా ఎగ్రైస్ బండి పెట్టుకొని బతకడం మంచిది.. అని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడో పోలీసు. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా రచ్చకు కారణమైంది. కొప్పళ జిల్లా కుష్టిగి తాలుకా హనుమ సాగర్ పోలీస్స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ బ్రహ్మానంద వ్యవహారం చర్చ రేకెత్తిస్తోంది. పోలీసుగా సంవత్సరంలో 365 రోజూ పనిచేయాలి. సెలవు అనేదే ఉండదు, తీవ్రమైన పని ఒత్తిడి.. అని స్టేటస్లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ స్టేటస్ను చూసిన కొందరు స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మంగళవారం నుంచి వైరల్ అయ్యింది. దీంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బ్రహ్మానందపై గరం అయ్యారు. డీజీపీ ప్రకటనను ప్రస్తావిస్తూ.. బ్రహ్మానంద అంతటితో ఊరుకోలేదు. త్వరలో రాష్ట్రంలో 8,300 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేస్తామని డీజీపీ ఎంఏ సలీం చేసిన ప్రకటనను కూడా ప్రస్తావించాడు. యువతీ యువకుల్లారా.. పోలీసైతే మీ బతుకూ ఇంతేనన్నట్లు స్పందించాడు. వీలైతే మరో ఉద్యోగం చూసుకోండి అని సలహా ఇచ్చాడు. అతనితో మాట్లాడా: జిల్లా ఎస్పీ ఈ నేపథ్యంలో బ్రహ్మానందపై జిల్లా ఎస్పీ ఎల్.రాం అరసిద్ది విచారణకు ఆదేశించారు. నేను అతనితో మాట్లాడాను, ఉద్యోగంలో ఉంటూ ఇటువంటి పోస్టులు పెట్టరాదని తెలిపాను, అతనిని వేధించారా?, ఒత్తిళ్లకు గురిచేశారా? అని అక్కడి ఎస్ఐను కూడా ప్రశ్నించానని ఎస్పీ తెలిపారు. 365 రోజులూ చాకిరీ చేయాలి కొప్పళ జిల్లాలో ఓ కానిస్టేబుల్ పోస్టులు -
అమ్మవారి నెక్లెస్ ఈఓ జేబులోకి
బనశంకరి: బెంగళూరు నగరంలోని ప్రఖ్యాత ధర్మరాయస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు సమయంలో 120 గ్రాముల బంగారు కంఠాభరణాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) నాగరాజ్ కాజేశారని ఆలయ మాజీ అధ్యక్షుడు సతీశ్ ఆరోపించారు. మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. హుండీ లెక్కింపులో 120 గ్రాముల నెక్లెస్ లభ్యమైంది. ఈఓ నాగరాజ్ జేబులో వేసుకుని వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నాగరాజ్ కూడా తప్పు ఒప్పుకున్నారని, నెక్లెస్ని వెనక్కి ఇచ్చారని తెలిపారు. కానీ అది 63 గ్రాములే ఉందని, సగం బంగారం మాయం చేశాడని ఆరోపించారు. ఈవోతో పాటు ముఖ్యమైన అధికారులు ఈ దందాకు పాల్పడ్డారని, వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయంలో పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. ఎయిర్పోర్టులో కుక్కల గోల దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టును కూడా వీధికుక్కల సమస్య వదలడం లేదు. గతంలో ప్రయాణికులు కూర్చునే కుర్చీలలో వీధికుక్కలు దర్జాగా సేదతీరుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. రన్వేపై కూడా కుక్కలు షికార్లు చేసిన ఉదంతాలు ఉన్నాయి. మరోసారి రన్వేపై వీధికుక్కలు తిరుగుతూ కనిపించడం ఆందోళన కలిగించింది. వాటిని పారద్రోలడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు. ఆ సమయంలో విమానాలు ల్యాండ్ కాకపోవడంతో పెద్ద సమస్య తప్పింది.చీటీలంటూ చీటింగ్ కోలారు: చిట్ఫండ్ లేదా చీటీ.. ఏదైనా గానీ పేరులోనే ఉంది చీటింగ్ అని. అయినా జనం అమాయకంగా చీటీలు కట్టి ఆపై మోసపోయి లబోదిబోమనడం పరిపాటిగా మారింది. కోలారులో ఇలాంటి ఉదంతమే నడుస్తోంది. దీపావళి, వరమహాలక్ష్మీ , ఉగాది పండుగలకు కానుకలు ఇస్తామని జనంతో చీటీలు కట్టించుకుని పరారైన మోసగాన్ని అరెస్టు చేసి తమ సొమ్ము ఇప్పించాలని భాదిత మహిళలు మంగళవారం నగర పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. శాంతి నగర్కు చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి మోసం చేశాడని తెలిపారు. తానే చాలా మంది మహిళల నుంచి దాదాపుగా 52 లక్షల రూపాయల వరకు కట్టించానని, వారంతా తన ఇంటి వద్దకు తనను నిలదీస్తున్నారని లక్ష్మమ్మ అనే మహిళ వాపోయారు. పోలీసులు వెంకటస్వామిని స్టేషన్కు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. -
ఉచితాలతో ఆర్థిక సంక్షోభంలో సర్కారు
హొసపేటె: ఉచిత, హామీ పథకాల కారణంగా ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, డిపాజిట్లను మెరుగుపరచడానికి నియంత్రణ లేకుండా మద్యం అమ్మకాల్లో పాల్గొంటోందని నీలగుంద విరక్తిమఠానికి చెందిన చెన్నబసవ శివయోగి స్వామీజీ తెలిపారు. మంగళవారం విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా హిరేమేగళగెరె గ్రామంలోని నాగలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో శివ పంచాక్షరి జపం, సహస్ర బిల్వార్చన, మతపరమైన సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. మద్యపాన వ్యసనం కారణంగా చాలా మంది మరణించారు. అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. నియంత్రణ విధించాల్సిన ప్రభుత్వం, గ్రామాలకు విస్తరించడం ద్వారా సమాజాన్ని మరింత దిగజార్చడానికి ప్రయత్నిస్తోందన్నారు. అయితే ధర్మస్థల సంక్షేమ అభివృద్ధి సంఘం తమ మద్యవర్జన శిబిరాల ద్వారా, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది సంఘంలో చేరి స్వయం ఉపాధి పొంది వారి కుటుంబాలకు ఆసరాగా మారారని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు ప్రతిభా పరశు రామప్ప, అంగడి ప్రకాష్, కే.పరశురామప్ప, సహకార సంఘం అధ్యక్షుడు హరీష్గౌడ, నాగలింగేశ్వర ఆలయ ట్రస్ట్ వెంకటరావు, సుజాతమ్మ, రాజప్ప ఇట్టగుడి, అశోక్, అంజినప్ప, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
జ్యోతిష్యుడు, ప్రియురాలికి కటకటాలు
యశవంతపుర: జ్యోతిషునితో మహిళ ఆక్రమ సంబంధం ఒకరి హత్యకు దారి తీసింది. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపురలో ఈ సంఘటన జరిగింది. శివమొగ్గకు చెందిన జోతిష్యుడు కమలాకర భట్ గురూజీ, అతని ప్రియురాలు, మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. గురూజీ వద్ద సుచిత్ర అనే మహిళ పనిచేస్తూ ఇద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడింది. సిద్ధాపుర తాలూకా అవరగుప్పవాసి మహేశ్ నాయక్ భార్య ఈమె. సుచిత్ర ఇద్దరు కూతుళ్లతో కలిసి శివమొగ్గలోనే గురూజీ వద్ద ఉంటోంది. తల్లి తీరు నచ్చక ఓ కూతురు సిద్ధాపురలోని తమ గ్రామానికి వెళ్లి తండ్రి మహేశ్ నాయక, చిన్నాన్న వసంత నాయక (41)కు విషయం చెప్పింది. సోమవారం మధ్యాహ్నం కూతురిని వెతుక్కుంటూ సుచిత్ర కారులో కొందరు యువకులను తీసుకుని వచ్చింది. ఈ సమయంలో సుచిత్రా, భర్త మహేశ్ల మధ్య వాదులాట జరిగింది. ఇరువర్గాల దాడులు చేసుకున్నాయి. మహేశ్, వసంత్ నాయక, కుమార్ని సుచిత్ర అనుచరులు కత్తితో పొడిచారు. గాయాలైన వసంత్ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. మిగతా ఇద్దరూ శివమొగ్గ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హతుని భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదుతో గురూజీ, సుచిత్ర, ఐదుమంది యువకులపై సిద్ధాపుర పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటనా స్థలిని ఎస్పీ దీపన్ పరిశీలించారు. వీరి ముఠా చేతిలో ఒకరి హత్య ఉత్తర కన్నడ జిల్లాలో ఘటన -
వసంత వల్లభుని రథ సంభ్రమం
బనశంకరి: తిరుమల వెంకటేశ్వరస్వామితో సమానమైన సిలికాన్ సిటీలోని వసంతపుర వసంతవల్లభరాయస్వామి దేవస్థానం బ్రహ్మ రథోత్సవం భక్తజనవాహిని మధ్య గోవింద నామస్మరణతో ఆనందోత్సాహాలతో జరిగింది. వల్లభరాయస్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అర్చకులు వీఆర్.రఘురామబట్టర్ బృందం మూలవిరాట్ ప్రత్యేక అభిషేకం, అర్చనలు, విశేష అలంకరణ చేపట్టి పూజలు నిర్వహించారు. మేళతాళాలతో స్వామివారి కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి తేరులో ప్రతిష్టించారు. వసంత వల్లభుని ఉత్సవమూర్తులను పల్లకీలో మంగళవాయిద్యాలతో ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప , ఆలయ ఈవో లక్ష్మీ, ఆలయ ప్రముఖులు కే.కుమార్, ఎన్.శ్యామణ్ణ, ఎం.నాగరత్న, బీ.సుజాత,ఎం.చేతన్, శ్రీనివాస్, కేసీ.సోమశేఖర్ తదితరులు తేరులో ఆసీనుల్ని చేశారు. రథోత్సవం రథ చక్రాలకు టెంకాయలు, గుమ్మడికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. గోవిందా, వేంకటరమణా అంటూ భక్తజనం తేరును లాగగానే రథం మీదకు అరటిపండ్లు, దవనం విసిరారు. బెంగళూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, ఏపీ, తమిళనాడు నుంచి భక్తజనం రావడంతో కిక్కిరిసింది. జానపద కళాబృందాల ప్రదర్శనలు అలరించాయి. స్థానికులు శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం, పానీయాలను పంపిణీ చేశారు. వైభవంగా తేరు ఉత్సవం తరలివచ్చిన భక్త సాగరం -
మాతృభాష వృద్ధిలో తల్లుల పాత్ర కీలకం
బళ్లారిఅర్బన్: మాతృభాష అభివృద్ధిలో ప్రతి తల్లి పాత్ర కీలకమని డాక్టర్ మైమూదా బేగం అన్నారు. అఖండ బళ్లారి జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో బాలికల ప్రభుత్వ పీయూ కళాశాలలో నిర్వహించిన వ్యాకరణ తీర్థ చంద్రశేఖర శాస్త్రి దత్తి కార్యక్రమాన్ని ఆమె మొక్కకు నీరు పోసి ప్రారంభించి మాట్లాడారు. ఇల్లు తొలి పాఠశాల, తల్లి తొలి గురువు అని కువెంపు చెప్పినట్లుగా మాతృభాష పరిరక్షణలో మహిళలు ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మేధా డిగ్రీ కళాశాల ఉపన్యాసకురాలు డాక్టర్ వై.సుమ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. తల్లి ఒడిలో వినిపించే తొలి మాటే పిల్లల మాతృభాషగా మారుతుందన్నారు. బాలికల ప్రభుత్వ పీయూ కళాశాల ప్రిన్సిపాల్ బీ.సులేఖ మాట్లాడుతూ విద్యార్థినులకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమ కళాశాల ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఇస్తుందన్నారు. కసాప దత్తి కార్యక్రమాలు సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ భాషను జాగృతం చేస్తున్నాయని దత్తి దాత డాక్టర్ వీఎస్.ప్రభయ్య అన్నారు. వీరశైవ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ భ్రమరాంభను సన్మానించారు. కోశాధ్యక్షుడు బసవరాజ్ గదగిన్ ప్రాస్తావిక జ్యోతి స్వాగతం, చాంద్ పాషా నిర్వహణ, డాక్టర్ ఏఎన్.సిద్దేశ్వరి వందన సమర్పణ చేశారు. కసాప జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నిష్టి రుద్రప్ప, హెచ్.సురేష్, కాత్యాయిని, చంద్రశేఖర్ ఆచార్, మెహతాబ్, కాశీనాథ్, మంజునాథ్ రెడ్డి, రాఘవేంద్ర, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నైరుతీ రైల్వేకు రూ.7,748 కోట్లు
సాక్షి,బళ్లారి: ప్రస్తుత బడ్జెట్లో నైరుతి రైల్వేకు రూ.7,748 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం వర్చువల్ విధానం ద్వారా విలేకరులతో మాట్లాడారు. 2009–2014 మధ్య కాలంతో పోలిస్తే నైరుతీ రైల్వేకు తొమ్మిది రెట్లు నిధులు పెంచామని అన్నారు. అప్పట్లో నైరుతీ రైల్వేకు కేవలం రూ.835 కోట్ల నిధులు కేటాయిస్తే, 2025–26 బడ్జెట్లో రూ.7,564 కోట్లు కేటాయించామన్నారు. బడ్జెట్లో కేటాయించిన విధంగా బెంగళూరు–చైన్నె, బెంగళూరు–హైదరాబాద్ బుల్లెట్ రైల్ కారిడార్లతో బెంగళూరు ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయన్నారు. నైరుతీ రైల్వే ఏజీఎం పీ.అనంత్ మాట్లాడుతూ 2026–27కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి రైల్వేలో మౌలిక సదుపాయాలు, రాకపోకలు సంబంధించి పలు మార్పులు, చేర్పులు జరిగాయన్నారు. గతంలో పోల్చితే కర్ణాటకకు ఎంతో మేలు గతంతో పోలిస్తే బడ్జెట్లో కర్ణాటకకు ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రస్తుతం రూ.7,748 కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో రైళ్ల రాకపోకలకు, అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు. అమృత్ పథకం కింద ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం, ఆధునికత తదితరాల కోసం దాదాపు రూ.2,110 కోట్లతో 61 స్టేషన్లను పూర్తిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బాగల్కోటె, ధార్వాడ, గదగ్, గోకాక్, మునిరాబాద్ తదితర రైల్వే స్టేషన్ల పనులు పూర్తి చేశారన్నారు. బాదామి, కొప్పళ, అళ్నావర తదితర స్టేషన్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 12 వందేమాతరం ఎక్స్ప్రెస్ రైళ్లు, మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. నైరుతీ రైల్వే పరిధిలో కర్ణాటక ప్రాంత ప్రజలకే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎంతో మేలు చేకూరనుందన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ -
హంపీ ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
హొసపేటె: విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని ప్రదర్శించే ప్రపంచ ప్రసిద్ధ హంపీ ఉత్సవాలను వైభవంగా జరపడానికి జిల్లా యంత్రాంగం విస్తృతమైన సన్నాహాలు చేస్తోంది. ఈ సారి జిల్లా కేంద్రం హొసపేటె పట్టణం నుంచి హంపీ వరకు గ్రాండ్ విద్యుత్ దీపాల అలంకరణ ప్రధాన ఆకర్షణగా మారింది. పర్యాటకులను అబ్బురపరిచేందుకు జిల్లా యంత్రాంగం 50 కిలో మీటర్ల పొడవున విద్యుత్ దీపాలను ప్రారంభించింది. ఈ సారి హొసపేటె ప్రధాన రహదారులు కూడా విద్యుత్ దీపాలు వెలుగుల్లో, జిల్లాధికారి కార్యాలయం నుంచి హంపీలోని విరుపాక్షేశ్వర ఆలయం వరకు ఉన్న రహదారి వెంట దీపాలను ఏర్పాటు చేశారు. బెంగళూరు రోడ్డు నుంచి సాయిబాబా సర్కిల్ వరకు ఉన్న రహదారిపై రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. రైల్వేస్టేషన్ రోడ్డు, సెంట్రల్ బస్టాండ్ రోడ్డు, బళ్లారి రోడ్డు వరకు లైట్లను ఏర్పరిచారు. అంబేడ్కర్ సర్కిల్, వాల్మీకి సర్కిల్, కనక సర్కిల్తో సహా కంప్లి రోడ్డు, కమలాపుర చెరువు పరిసరాల్ల విద్యుత్ దీపాలు ఎంతో ఆకర్షణగా ఉన్నాయి. ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ దీపాల అమరిక -
నిండా ముంచిన మిరప
రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెతకు భిన్నంగా ప్రకృతి వైపరీత్యాలు వెంటాడటంతో గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతుల ముఖాల్లో కళ కరువైంది. ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, కొప్పళ, యాదగిరి, కలబుర్గి, బీదర్, బాగలకోటె, విజయపుర జిల్లాల్లో కృష్ణా, తుంగభద్రా నదులున్నా నారాయణపుర కుడి కాలువ, తుంగభద్ర ఎడమ కాలువల ఆయకట్టులో నీరు అందక రైతులు తమ పొలాల్లో వేసుకున్న మిరప పంట అనుకున్న మేర దిగుబడి రాలేదు. పొలంలో బోరుబావుల కింద పంటలు పండించాలన్నా భూగర్భ జలాలు అడుగంటాయి. మరో వైపు విద్యుత్ కోతలు కూడా అధికమయ్యాయి. రాయచూరు జిల్లాలో రైతులు 50 వేల ఎకరాలు, బాగల్కోటె జిల్లాలో 11 వేల ఎకరాలు, యాదగిరి జిల్లాలో 8 వేల ఎకరాలు, కలబుర్గి జిలా్ోల్ల 5 వేల ఎకరాల్లో మిరప పంటను సాగు చేశారు. దిక్కు తోచని స్థితిలో రైతన్నలు కాలువల చివరి ఆయకట్టుకు నీరందక, వానలు కురవక భూములు బీళ్లుగా మారాయి. తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణ పుర కుడి కాలువల కింద ఆయకట్టు చివరి భూముల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మిరప పంట చేతికందదనే ఆందోళనతో చివరకు అక్కడక్కడా బిందెలతో నీటిని మోసి పంటకు పోశారు. గుంటూరు మిర్చి గతంలో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రాగా నేడు కేవలం 3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు వాపోతున్నారు. గత ఏడాది బ్యాడగి మిరపకాయలు క్వింటాల్ ధర రూ.65 వేలు ఉండగా, నేడు రూ.40 వేలు, గుంటూరు మిర్చి క్వింటాల్ ధర రూ.22 వేలు ఉండేది, నేడు రూ.15 వేలు మాత్రమే ధర పలుకుతోంది. నారాయణ పుర కుడి, ఎడమ కాలువల కింద యాదగిరి, రాయచూరు జిల్లాల్లో సుమారు రూ.400 కోట్ల విలువ చేసే మిరప పంటకు నీరు లేక ఎండిపోయే దశలో ఉంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు 6 టీఎంసీల నీరు వదిలేందుకు మంత్రులు శరణ బసప్ప దర్శనాపుర, శరణ ప్రకాష్ పాటిల్ చొరవ చూపాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. ఆయకట్టు పరిధిలో నీరు లేక పొలంలోనే ఎండుతున్న మిరప పంట రైతులు ఆరబోసిన ఎండు మిరపను గ్రేడింగ్ చేస్తున్న మహిళా కూలీలు రైతులకు శాపంగా ప్రకృతి వైపరీత్యాలు తగ్గిన పంట దిగుబడి, ధర కూడా పతనం -
అబ్కారీశాఖలో అవినీతి పొంగు
● మంత్రి తిమ్మాపుర తప్పుకోవాలి ● విధానసభలో ప్రతిపక్షాల పట్టు శివాజీనగర: ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ పేరుతో సిద్దరామయ్య సర్కారు ఈ అసెంబ్లీ సమావేశాలను జరుపుతుండగా చివరకు ఆ అంశం మీద తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వ వీబీ జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, గతంలో అమల్లో ఉన్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని ప్రకటించింది. మంగళవారం విధానసభలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ నిర్ణయాన్ని ప్రవేశపెట్టి, గ్రామీణ పేదల పాలిట సంజీవనిగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని ఈ సభ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వీబీ జీ రామ్జీ చట్టం సమాఖ్య వ్యవస్థ ఆశయాలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఇంత ఖర్చును ఎలా భరించాలి జీ రామ్జీలో రాష్ట్రాలు ఏకాఎకి 40 శాతం నిధులను భరించాలని నియమం ఉంది, దీంతో 125 రోజుల పని కల్పిస్తామని కొత్త చట్టంలో చెప్పినా కూడా, వాస్తవంగా 50 రోజుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇది సమాఖ్య నియమాలకు విరుద్ధం అని సిద్దరామయ్య ఆరోపించారు. దేశంలో కర్ణాటక అత్యధికంగా పన్ను చెల్లించే రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంది. గ్రామ పంచాయతీలు అత్యధిక పన్నుల సేకరణలో దేశంలో తొలి స్థానంలో ఉన్నాయని తెలిపారు. కర్ణాటకకు ఆర్థిక సంఘాల నిధుల్లో ఏటేటా అతి తక్కువగా కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త చట్టం ద్వారా రాష్ట్రంపై భారం వేస్తోంది, రాష్ట్ర ఆర్థిక భద్రతను, అభివృద్దిని ప్రమాదానికి గురిచేసే కుట్ర అని ఆరోపించారు. బీజేపీ సభ్యులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇది కాంగ్రెస్ తీర్మానమని, అసెంబ్లీ నిర్ణయం కాదని నినాదాలు చేశారు. మంగళవారం విధానసభలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవేశంగా మాట్లాడుతున్న సీఎం సిద్దరామయ్యప్రధానినే అలా అంటారా? పరిషత్లో ప్రతిపక్షాల రభస మెట్టు దిగిన ఎమ్మెల్సీ నజీర్ శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి దేశద్రోహి అని నిందించడం గురించి విధానపరిషత్లో రభస కొనసాగింది. ఈ మాటలు అన్న కాంగ్రెస్ సభ్యుడు నజీర్ అహమ్మద్ క్షమాపణ చెప్పాలని బీజేపీ, జేడీఎస్ పట్టుబట్టాయి. దీంతో నజీర్ అహమ్మద్ తన వ్యాఖ్యల మీద విచారం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల గురించి సోమవారం రాత్రి నుంచి ఎగువసభలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. మంగళవారం పోడియం వద్దకు వచ్చి ధర్నా కొనసాగించారు. నజీర్ అహమ్మద్తో క్షమాపణ చెప్పించండి, లేకపోతే బయటికి పంపాలని డిమాండ్ చేశారు. సభాపతి బసవరాజ్ హొరట్టి స్పందిస్తూ రాజ్యాంగ వ్యతిరేకమైన పదాలను ఉపయోగించడం అపరాధమని, అందరిదీ ఇదే అభిప్రాయమని చెప్పారు. దేశ ప్రధాని గురించి ఇలాంటి మాటలను మాట్లాడడం సరైంది కాదన్నారు. ప్రతిపక్ష సభ్యులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు, ముందు వారు క్షమాపణ చెప్పాలి, ఆ తరువాత ఆలోచిస్తానని నజీర్ అహమ్మద్ తెలిపారు. దీనికి ఒప్పుకోని ప్రతిపక్ష సభ్యులు ఒకే వాక్యంలో క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. నజీర్కు పాకిస్తాన్ నాలుక ఉండాలి, అందుకే ఇలా మాట్లాడారు అని విమర్శించిన సీటీ రవి క్షమాపణ చెప్పాలని నజీర్ కోరారు. ఇందుకు రవి విచారం వ్యక్తంచేయగా, ఆ తరువాత నజీర్ కూడా తన వ్యాఖ్యలపై విచారం వెలిబుచ్చారు. అయినా కొంతసేపు రచ్చ కొనసాగింది. సమాఖ్య స్ఫూర్తికి జీ రామ్జీ విరుద్ధం రాష్ట్రాలపై భారం వేయడం సరికాదు అసెంబ్లీలో సిద్దు సర్కారు తీర్మానం శివాజీనగర: ఎకై ్సజ్ శాఖలో అవినీతి పొంగిపొర్లుతోందని మంగళవారం విధానసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం, ఆరోప–ప్రత్యారోపణలు జరిగాయి. ఎకై ్సజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపుర రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేశాయి. ఎక్సైజ్ శాఖలో భారీ అవినీతి జరిగింది, అందులో మంత్రి ప్రమేయముంది. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని కోరాయి. మొదట సభ ఆరంభం కాగానే ఆర్.అశోక్ ఎకై ్సజ్ శాఖలో అధికారులు, మంత్రి కలసి అవినీతికి పాల్పడుతున్నారని పలు ఆధారాలను ప్రదర్శించి, లంచానికి డిమాండ్ పెట్టిన అధికారుల ఆడియోను వినిపించారు. దీనికంటే సాక్ష్యం ఇంక అవసరం లేదు. తక్షణమే ఎకై ్సజ్ మంత్రి రాజీనామా చేయాలని కోరారు. లోకాయుక్తకు చిక్కిన ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగరాజు మంత్రి పేరును ప్రస్తావించారని చెప్పారు. అంతేకాకుండా ఆ శాఖ అధికారులు కులాల పేరుతో పనులు చక్కబెట్టేందుకు దిగారు, కుల సంఘం నాయకులతో కలిసి సీఎం సిద్దరామయ్యను కలిస్తే పనైపోతుందని ఓ కాంట్రాక్టర్కు అధికారి చెప్పిన ఆడియోను వినిపించారు. సీఎం సిద్దరామయ్య తనయుడు యతీంద్రను భేటీ చేసి, అక్కడి నుంచి ఫోన్ చేయించాలని కూడా సలహా ఇచ్చారన్నారు. ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. ముందే చర్చ వీబీ జీ రామ్జీ చట్టంపై ముందుగా చర్చ జరగాల్సింది, అయినా కూడా ప్రతిపక్షాల డిమాండ్ మేరకు స్పీకర్ ఖాదర్ ఎకై ్సజ్ శాఖ ఆరోపణలపై చర్చకు అవకాశం కల్పించారు. ఈ గొడవ వల్ల సుమారు గంటన్నర సభ ఆలస్యంగా మొదలైంది. -
భక్తులకు రుద్రాక్షలు, విభూతి పంపిణీ
బళ్లారిఅర్బన్: బళ్లారిలోని చారిత్రక కోటె మల్లేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నగరంలో రథోత్సవానికి తరలి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులకు ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆధ్వర్యంలో రుద్రాక్షలు, విభూతిని పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం సాధారణంగా మహాశివరాత్రి సందర్భంగా రుద్రాక్షలు, విభూతి పంపిణీ జరుగుతుండగా, గత రెండేళ్లుగా కోటె మల్లేశ్వర స్వామి రథోత్సవంలో లడ్డు ప్రసాదం, నీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ ఏడాది రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు రుద్రాక్షలు, విభూతి పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. చిన్నారిపై వీధి కుక్క దాడిహుబ్లీ: ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల మగబిడ్డను కుక్క కరిచి గాయపరిచిన ఘటన ధార్వాడ తాలూకా లకమాపుర గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పృథ్విక్ మూలెమని బాధిత బాలుడు. ఉదయం ఇంటి ముందు ఆటలాడుతుండగా వీధి కుక్క దాడి చేయడంతో బిడ్డ అరుపులు విన్న తల్లిదండ్రులు తక్షణమే బయటకు వచ్చి కుక్కను తరిమి కొట్టారు. అయితే ఆలోపే కుక్క బాలుడి చెవి, తలపై కరిచి గాయపరిచింది. చెవిలో ఓ భాగం బాగా కొరకడంతో జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా గత వారంలో ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న లేఅవుట్లో ఓ పిచ్చికుక్క 9 మందిని కరిచిన సంగతి తెలిసిందే. వైభవంగా యల్లమ్మ పల్లకీ రథోత్సవంరాయచూరు రూరల్: నగరంలోని జ్యోతి కాలనీలో వెలసిన ఉత్తిన యల్లమ్మ దేవి జాతర, రథోత్సవం వైభవంగా జరిగాయి. దేవి విగ్రహానికి కిల్లె బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్య, సోమవారపేట అభినవ రాచోటి శివాచార్య, ఉడుంగల్ మఠాధిపతి వీర సంగమేశ్వర శివాచార్య ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సోమవారం రాత్రి ఆలయం వద్ద అధ్యక్షురాలు రాజేశ్వరి వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నెరవేర్చారు. అనంతరం పల్లకీలో దేవి విగ్రహాలను ఊరేగించారు. అంగన్వాడీ కార్యకర్తల నిరసన రాయచూరు రూరల్: అంగన్వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం నగరంలోని టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తూ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్మినెంట్ చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ దిిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆందోళనలో శరణ బసవ, గోకారమ్మ, వరలక్ష్మి, శ్యామల, ఇందిర, శరణమ్మ, శాంతమ్మ, మల్లికలున్నారు. ఏపీఎంసీ ముట్టడిరాయచూరు రూరల్: ఏపీఎంసీలో రైతులు పండించిన పంటలను, తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ రైతులు ఏపీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు. మంగళవారం రైతు సంఘం అధ్యక్షుడు సురేష్ మాట్లాడారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు తెచ్చిన ఉల్లిగడ్డలను ఏపీఎంసీ అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు చేయక పోవడంతో రైతులు సొమ్మసిల్లారు. ఏపీఎంసీ అధికారులు ఉల్లిగడ్డల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
చిక్కబళ్లాపురంలో బంగారం అన్వేషణ
● హెలికాప్టర్తో ముమ్మర సర్వే చిక్కబళ్లాపురం: బెంగళూరుకు అతి సమీపంలో ఉన్న చిక్కబళ్లాపురం జిల్లాలో బంగారం, ఇతర విలువైన ఖనిజాలు ఏమైనా భూగర్భంలో ఉన్నాయా? అని పరిశోధన జరుగుతోంది. భారతీయ భూవైజ్ఞానిక సర్వేక్షణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గుడిబండ తాలూకా బీచగానహళ్లి క్రాస్ పరిసరాల్లో హెలికాప్టర్ ద్వారా సర్వే సాగుతోంది. భూగర్భంలో బంగారు నిక్షేపాలు, ఇతర అరుదైన ఖనిజ సంపదను గుర్తించడమే ఈ సర్వే లక్ష్యం. బాగేపల్లి తాలూకా, గుడిబండ తాలూకా పరిధిలో బంగారం ఉండొచ్చని గతంలో ప్రచారం సాగింది. భూవైజ్ఞానిక నిపుణుల సూచనలతో సమీక్ష సాగుతోంది. ఓ హెలికాప్టర్కు తీగ కట్టి దానికి రాడార్ ఉపకరణాన్ని అమర్చి రౌండ్లు కొడుతున్నారు. హెలికాప్టర్ పదే పదే ఆ ప్రాంతంలో తిరుగుతూ ప్రకంపనల సహాయంతో కనుగొనే పని జరుగుతోంది. హెలికాప్టర్ను చూసి జనం సంభ్రమానికి గురవుతున్నారు. పొరుగున ఉన్న కదిరి ప్రాంతంలోనూ సర్వే నిర్వహిస్తున్నారు. స్వర్ణం ఉండొచ్చా.. కోలారు జిల్లాలోని కేజీఎఫ్ ప్రాంతం మాదిరి మట్టి ఇక్కడ ఉందని, బంగారం దొరికే చాన్సు 80 శాతం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఈ ప్రాంతం చిత్రం సంపూర్ణంగా మారిపోతుందనే ఆశాభావం నెలకొంది. ఇక్కడ భూమిలో 50 మీటర్ల లోపు నుంచి బంగారం ఖనిజం ఉండవచ్చని, వెయ్యి హెక్టార్ల భూమిని బంగారు గనుల కోసం కేటాయించవచ్చని సమాచారం. మే 31వ తేదీ వరకు సర్వే జరుగుతుంది, హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది, ప్రజలు ఎవరూ భయపడవద్దు అని జిల్లా కలెక్టర్ జి ప్రభు తెలిపారు. -
స్థలం తిరిగి ఇవ్వాలని యజమాని హుకుం
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చిన స్థలం తిరిగి తనకు అప్పగించాలంటూ విద్యాశాఖ అధికారులకు యజమాని హుకుం జారీ చేసిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వడగేర తాలూకా హలగేరిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సౌకర్యాల నుంచి వంచనకు గురయ్యారు. 30 ఏళ్ల క్రితం విద్యార్థుల విద్యాభ్యాసానికి పాఠశాల నిర్మాణానికి మల్లమ్మ 23 సెంట్ల భూమిని దానం చేసింది. దీంతో సువ్యవస్థతో కూడిన పాఠశాలను నిర్మించారు. అయితే పట్టాదారు పుస్తకంలో రాష్ట్ర గవర్నర్ పేరు మీద చేయించుకోలేక పోయారు. విద్యా శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల స్థల వివాదం చెలరేగింది. మల్లమ్మ మరణించడంతో సమీప బంధువు తమ్మణ్ణ తన పేరు మీద మార్చుకున్నారు. భూమిఽ ధరలు పెరగడంతో పాఠశాల స్థలం తన పేరు మీద ఉందని, పాఠశాలను అభివృద్ధి పరచకుండా ఖాళీ చేయాలని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం 23 సెంట్ల స్థల దానం ప్రస్తుతం ధరలు పెరగడంతో భూమి వాపసు కోసం పట్టు -
కార్మిక చట్టాలు విరమించుకోవాలి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట సంచాలకుడు మీనాక్షి సుందరం డిమాండ్ చేిశారు. మంగళవారం లింగసూగూరు తాలూకా హట్టి సీఐటీయూ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్ కార్మిక చట్టాలను జారీ చేయడం వల్ల రైతు, కార్మిక, వ్యవసాయ కూలీలకు అన్ని విధాలుగా నష్ట పోతారని ఆరోపించారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు మద్దతు పలుకుతూ ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పుబట్టారు. మనరేగలో తొలగించి వికసిత భారత మిషన్ రోజ్గార్ పేరును నమోదు చేయడం తగదని ఆరోపించారు. మనరేగ పథకం నేడు వలసలు వెళుతున్న కూలీలు, కార్మికులకు భవిష్యత్ అంధకారమైందన్నారు. సమావేశంలో రాఘవేంద్ర కుష్టిగి, మహ్మద్ అమీర్, సంగయ్య స్వామి, షఫీ, మహంతేష్, నరసణ్ణ, జమదగ్ని, గిరియప్ప, గుండప్ప, సోమన్న, వెంకటేష్, బసవరాజ్లున్నారు. పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోలారు: తాలూకాలోని వక్కలేరి ఫిర్కా ముదువత్తి గ్రామంలో మంగళవారం జరిగిన అశ్వర్థ కట్ట ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ ఎంఎల్ అనిల్కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం తనకెంతో మానసిక సంతృప్తిని కలుగజేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుండడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ఒక్కలిగుల సంఘం మాజీ డైరెక్టర్ రాము పాల్గొన్నారు. నగరసభ అధికారిపై దాడి కోలారు: నగరసభ అధికారిపై దుకాణ యజమాని దాడి చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి నగరసభ అధికారులు మంగళవారం కేఎస్ ఆర్టీసీ బస్టాండులోని శ్రీనివాస బేకరీలో తనిఖీలు చేయగా ప్లాస్టిక్ కవర్లు వెలుగు చూశాయి. వాటిని స్వాధీనం చేసుకుంటున్న సమయంలో యజమాని గోవింద నగరసభ హెల్త్ ఇన్స్పెక్టర్ మంజునాథ్పై దాడి చేశాడు. ప్లాస్టిక్ కవర్లను లాక్కున్నాడు. ఘటనపై హెల్త్ ఇన్స్పెక్టర్ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాఠశాలకు డెస్కుల వితరణకోలారు : ఎయిర్బ్యాక్ కంపెనీ దాతృత్వం చాటింది. అరాభికొత్తనూరు పాఠశాలకు రూ.1.80 లక్షల విలువ చేసే డెస్కులను మంగళవారం విరాళంగా అందజేసింది. సంస్థ ప్రతినిధి మోనిష్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పశు ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ నితిన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తాహేరా నుస్రత్ పాల్గొన్నారు. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న పోలీసు జీపు శ్రీనివాసపురం: పోలీస్ వాహనం ఢీకొని విద్యుత్ స్తంభం కూలి మహిళ గాయపడింది. కోలారు నుంచి శ్రీనివాసపురం వస్తున్న పోలీసు జీపు ఎంజీ రోడ్డులో అదుపు తప్పి డివైడర్ పైకెక్కి స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం కూలి అదే రోడ్డులో బైక్పై వెళ్తున్న మహిళపై పడింది. తలకు గాయాలు కావడంతో ఆమెను కోలారు ఆస్పత్రికి తరలించారు. ఆస్తి వివాదం.. వ్యక్తిపై దాయాదుల దాడి దొడ్డబళ్లాపురం: ఆస్తి వివాదం నేపథ్యంలో వ్యక్తిపై దాయాదులు దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటన దేవనహళ్లి తాలూకా రామనాథపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మదన్(35)అనే వ్యక్తికి బంధువులతో భూ వివాదం ఉంది. కోర్టు విచారణలో ఆ భూమి మదన్కు చెందినది అంటూ తీర్పు వచ్చింది. కోట్ల విలువ చేసే భూమి చేజారిపోవడంతో మదన్ చిన్నాన్న కెంపన్న, పిన్ని అక్కయ్యమ్మ, వారి పిల్లలు బాబు, పునీత్లు సోమవారం రాత్రి మదన్ ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. మదన్ తప్పించుకుని పారిపోయి విశ్వనాథపుర పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా వెనక్కు పంపించారని మదన్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం మదన్ దొడ్డబళ్లాపుర తాలూకా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
పిల్లలకు విజ్ఞానంపై ఆసక్తి అవసరం
రాయచూరు రూరల్: జిల్లాలో పిల్లల పండుగల్లో భాగంగా పిల్లల్లో దాగి ఉన్న విజ్ఞానంపై దృష్టి సారించి, ఎడెదొరె రాయచూరు జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీర సంగమేశ్వర శివాచార్య అభిప్రాయపడ్డారు. సోమవారం మావిన చెరువు వద్ద జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయితీ, నగర పాలక సంయుక్త ఆధ్వర్యంలో పిల్లల పండుగ వేడుకను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. పిల్లలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను ఎడెదొరె నాడు రాయచూరు జిల్లా ఉత్సవాల్లో ప్రదర్శించాలన్నారు. వేదికల్లో పిల్లలు తమ సామర్థ్యాన్ని నిరూపించాలన్నారు. ఆకాశంలో చంద్రుడిని బయోస్కోప్ ద్వారా చూడడం, పిల్లల్లో శాసీ్త్రయ మనోభావాలను పెంపొందించడం వంటి వాటికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. కోడిపుంజుల ప్రదర్శనలు, గణేష్ కుద్రోళి ఇంద్రజాల ప్రదర్శన, శ్రీరాముడి వేషధారణ ఆకట్టుకుంది. గాలి పటాలను ఎగుర వేసే కార్యక్రమాన్ని నెరవేర్చారు. జిల్లాధికారి నితీష్, జడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, అదనపు జిల్లాధికారి శివానంద, ఏసీ హంపణ్ణ, నగరసభ కమిషనర్ జుబీన్ మహాపాత్రో, డీడీపీఐ బడిగేర్, ఈరణ్ణ, తహసీల్దార్ సురేష్ వర్మ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, రవిలున్నారు. -
అడ్డగోలు నియామకాల రద్దుకు డిమాండ్
రాయచూరు రూరల్: రాయచూరు ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి అడ్డగోలుగా నియామకాలు చేశారని, అలాంటి నియామకాలను రద్దు చేయాలని కర్ణాటక నాయక్ వేదిక పోరాట నేత రవి కుమార్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్లో ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు చేయరాదని ఆదేశాలు జారీ చేసిన రాయచూరు ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, ఇతర సిబ్బందిని నియమించుకొని ఉత్తర్వులను గాలికొదిలారని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్– 371(జె) ప్రకారం కాకుండా, రిజర్వేషన్ కోటాను పాటించకుండా నియామకాలు చేశారని, అలాంటి వాటిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు లేఖ రాశామని తెలిపారు. అనుమతి లేనిదే నియామకాలు చేసుకున్న పోస్టులను రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకో వాలన్నారు. -
తండ్రి దెబ్బలకు కుమార్తె బలి
యశవంతపుర: కుటుంబ, ఆస్తి కలహాలతో కూతురిని తండ్రి హతమార్చిన హృదయ విదారక ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లో కాసరగోడు జిల్లా మంజేశ్వర తుమినాడిలో జరిగింది. జుమైలా (18)ని ఆమె తండ్రి ఫారూక్ హత్య చేశాడు. ఫారూక్ గతంలో దుబాయ్లో పనిచేసి ఇంటికి తిరిగివచ్చాడు. భార్య తాహెరా మధ్య ఆస్తి గొడవలున్నాయి, మంగళవారం ఉదయం కూడా రగడ పడ్డారు. ఫారూక్ భార్యను చితకబాదగా కుమార్తె జుమైలా గొడవను విడిపించడానికి వెళ్లింది. ఫారూక్ చేతిలోని కట్టెతో జుమైలా తల మీద బాదడంతో ఆమె గాయాలతో కుప్పకూలి చనిపోయింది. పోలీసులు ఫారూక్ను అరెస్ట్ చేశారు. -
అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్
రాయచూరు రూరల్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దోపీడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ ఇరానీ ముఠాను కలబుర్గి పోలీసులు అరెస్ట్ చేశా రు. సోమవారం కలబుర్గి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు అధికారి శరణప్ప పాత్రికేయులకు వివరాలు వెల్లడించారు. నిందితులను మహారాష్ట్రలోని బీడ్ జిల్లా శివాజీ నగర్కు చెందిన అలీమీర్జా, జహీర్ అబ్బాస్ అలీ, రజాక్ బేగ్, థానే జిల్లా జాఫర్ అలీ అంబొవిలి, ఇందిరా నగర్ నివాసులు జాఫర్ ఆజమ్ సయ్యద్, లాల్ సమీర్ షేక్, మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఖాసీం జోజో జాఫ్రీలుగా గుర్తించారన్నారు. జనవరి 23న తావరగేర క్రాస్ వద్ద ముఖానికి ముసుగులు ధరించి అనుమానాస్పదంగా కలియ తిరుగుతూ వాహనదారులను భయపెట్టి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు దోచుకున్న సమయంలో వారిని బంధించినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.27.30 లక్షల విలువ చేసే 90 గ్రాముల బంగారం, టాటా ఫార్చునర్ కారు, హోండా మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకల్లో పోలీసులుగా విధులు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ దోపిడీలకు పాల్పడినట్లు ఆయన వివరించారు. ఏడుగురు నిందితుల పట్టివేత రూ.27.30 లక్షల సొత్తు స్వాధీనం -
త్రిభాషా కవి మృతికి సంతాపం
రాయచూరు రూరల్: త్రిభాషా కవి వీఎస్ కాంతనవర్ మృతికి ఆదివారం సాయంత్రం కన్నడ భవనంలో కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన చిత్రపటానికి కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు విజయ రాజేంద్ర పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కవితలు రాసి మంచి పేరు సంపాందించారన్నారు. కలబుర్గి విశ్వ విద్యాలయం నుంచి అవార్డు, ప్రథమ తాలూకా కన్నడ సాహిత్య సమ్మేళనం అధ్యక్షుడిగా పని చేశారన్నారు. ఆయన మృతిపై సాహితీ వేత్తలు, కవులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాప సభలో వీర హనుమాన్, వెంకట్రావ్, హక్కి, రావుత్రావ్, లక్ష్మిదేవి, నాగప్ప, నాగరాజ్, తిమ్మయ్య, వెంకటేష్, అమరేష్, ఈరణ్ణలున్నారు. నర్సింగ్ సేవల్లో కన్నడిగులు ముందంజ రాయచూరు రూరల్: దేశ, విదేశాల్లో ఆరోగ్య రంగంలో కర్ణాటక నుంచే అత్యధిక స్థాయిలో నర్సుల సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్యవిద్య, నర్సింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం యాదగిరి ప్రభుత్వ వైద్య కళాశాలలో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించి ద్వితీయ సంవత్సరం నర్సింగ్ విద్యార్థుల ప్రతిజ్ఞా విధిని బోధించి మాట్లాడారు.నర్సింగ్ కోర్సులో కేరళ తరువాత కర్ణాటక విద్యార్థులు వైద్య, ఆరోగ్య రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. జపాన్, ఇటలీ, దుబై వంటి దేశాల్లో సేవలు అందిస్తున్న వారికి భాషా పరిజ్ఞానం ప్రధానమన్నారు. రాష్ట్రంలో 32 నర్సింగ్ కళాశాలలుండగా, 80 వేల మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యాదగిరి ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ సందీప్, రిజ్వాన్, పంపాపతి రెడ్డి, కాశీనాథ్, సిద్దరామప్ప తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ సంకల్పం.. యువత శ్రమదానం
రాయచూరు రూరల్: పురాతన కాలం నాటి బావులను సంరక్షించాలనే సదాశయంతో యువకులు కళ్యాణిని శుభ్రం చేసిన ఘటన చోటు చేసుకుంది. యాదగిరి జిల్లా హుణిసిగిలో పాడుబడిన బావిలో పెరిగిన ముళ్ల కంపచెట్లు, ఆకు పచ్చని మొక్కలు ఇతరత్ర పేరుకున్న చెత్తాచెదారాన్ని యాదగిరి యువ బ్రిగేడ్ ఆధ్వర్యంలో హుణిసిగిలోని దేవర దాసిమయ్య తీర్థ క్షేత్రం స్వచ్ఛతకు మంజునాథ్ ముందుకు వచ్చారు. ఆదివారం 15 మందితో కూడిన యువ బ్రిగేడ్ సభ్యులు కలసి కళ్యాణిలో ఉన్న వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. పురాతన కాలం నాటి దేవర దాసిమయ్య తీర్థ కళ్యాణి పుష్కరిణిని చూడచక్కగా తీర్చిదిద్దారు. హుణిసిగిలో పాడుబడిన బావిని శుభ్రపరిచిన వైనం -
చిట్టి బుర్రలు.. గట్టి చేతలు
రాయచూరు రూరల్: ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లాధికారి నితీష్ పిలుపునిచ్చారు. సోమవారం మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో పిల్లల పండుగ వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను ఇలాంటి వేదికల్లో ప్రదర్శించవచ్చన్నారు. జిల్లా ఉత్సవాలను ఇంటింటా పండుగలా జరపాలన్నారు. ప్రచార వేదికల్లో పిల్లలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్నారు. వన్య ప్రాణులు, కీటకాలు, జీవరాశుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తుమ్మెద, సీతాకోకచిలుక, తేలు, ఈగలు, దోమలు, తేనె టీగలు, బాతు, నాట్యం చేస్తున్న రోబో మహిళ, రైతు, స్వామీజీ, శ్రీరాముడి చిత్రాలు అలరించాయి. జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఏడీసీ శివానంద, ఏసీ హంపన్న, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, డీడీపీఐ బడిగేర్, తహసీల్దార్ సురేష్ వర్మ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, చంద్రశేఖర్రెడ్డిలున్నారు. ఉత్సవాలు విజయవంతం చేయండి అధికారులకు జిల్లాధికారి నితీష్ పిలుపు -
పాఠశాలకు మంత్రి తల్లి భూ దానం
రాయచూరు రూరల్: విద్యనభ్యసిస్తేనే జీవించడం కష్టంగా మారుతున్న నేటి రోజుల్లో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలకు మంత్రి తల్లి భూదానం చేసిన ఘటన చోటు చేసుకుంది. కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ తంగడిగి తల్లి హులిగమ్మ మౌలిక సౌకర్యాలు లేని కనకగిరి తాలూకా ఆదాపురలోని ప్రభుత్వ పాఠశాలకు తన పేరు మీద ఉన్న ఎకరా భూమిని దానం చేసింది. ఆ మేరకు కారటిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారికంగా గవర్నర్ పేరు మీద రిజిస్టర్ చేసిన కాగితాలను బీఈఓ నటేష్కు అందించారు. మంత్రి తంగడిగి ఆమె వెంట ఉన్నారు. -
పండుటాకుల పడిగాపులు
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రం రాయచూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పెన్షన్ కోసం వృద్ధులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. సోమవారం వితంతు, వృద్ధాప్య, సంధ్యా సురక్ష, మాతృవందన వంటి పెన్షన్ల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పెన్షనర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద బైటాయించారు. గత రెండు రోజుల నుంచి కార్యాలయాల చుట్టూ తాము తిరిగినా ఎవరూ తమను పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని వారు వాపోయారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు హుబ్లీ: హుబ్లీ తాలూకా తారిహాళ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం సాంబారులో పురుగులు కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వేడి అన్నంలో సాంబారు పోశారు. ఆ సాంబారులో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వచ్చారు. కాగా భోజనం సరఫరా చేసే సంస్థ కాంట్రాక్టర్పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 20న సామూహిక వివాహాలు హుబ్లీ: ధార్వాడ జిల్లా నాగరికర హితరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్డే దంపతుల వివాహ వార్షికోత్సవ శుభవేళ ఏప్రిల్ 20న మధ్యాహ్నం 12.15 గంటలకు స్థానిక నెహ్రు మైదానంలో 101 జంటలకు సామూహిక వివాహాలు ఏర్పాటు చేసినట్లు ఆ కమిటీ అధ్యక్షుడు సుభాష్ తెగ్గి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. వరుడికి దుస్తులు, వధువుకు మాంగల్య సరం, కాళ్లకు మెట్టెలు, దుస్తులు ఇస్తామన్నారు. హిందూ మతానికి చెందిన అన్ని కులాల వారు ఈ సామూహిక వివాహాల లబ్ధిని పొందవచ్చన్నారు. ప్రతి జంటకు రూ.10 లక్షల విలువ చేసే ఎల్ఐసీ పాలసీ చేయిస్తామన్నారు. ఈ వేడుకల్లో బాల్య వివాహాలకు గాని, రెండవ వివాహానికి కాని అవకాశం లేదని తెలిపారు. పేర్ల నమోదుకు మార్చి 21 ఆఖరు తేదీ. పూర్తి వివరాలకు తమను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. పరశురామ తెగ్గి, పరశురామ పూజారి, ఈశ్వరి తెగ్గి, మహంతేష్ కట్టిమని, మోహన్ తెగ్గి పాల్గొన్నారు. నేత్రపర్వంగా రథోత్సవం రాయచూరు రూరల్: జిల్లాలోని మస్కిలో వెలసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల జాతర, రథోత్సవం వైభవంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవాన్ని వర రుద్రమని, సోమనాథ, చెన్న బసవ, అమరగుండ శివాచార్య మహాస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించారు. శాసన సభ్యుడు బసన గౌడ, ప్రతాప్ గౌడ పాటిల్, మంజునాథ్, అమరేష్, సురేష్, వీరనగౌడలున్నారు. లింగసూగూరు, సింధనూరు, మాన్వి, బళ్లారిల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్థికసాయం బళ్లారిఅర్బన్: తలస్సేమియా బాధిత చిన్నారి కుటుంబానికి ఎంజీ కనక ఆర్థిక సహాయం అందించారు. స్థానిక తాళూరు రోడ్డు గుడార నగరకు చెందిన పుష్ప అనే 5 ఏళ్ల చిన్నారి గత కొంత కాలంగా తలస్సేమియా వ్యాధితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ధృవ ఆసరె ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంజీ.కనక బాధిత చిన్నారి తండ్రి కుమార బాదగి, తల్లి అంబికలకు రూ.10 వేల సహాయం అందించారు. ఇది దూరదృష్టి బడ్జెట్ హుబ్లీ: మౌలిక సదుపాయాల వృద్ధి, యువత ఎదుగుదలతో కూడిన దూరదృష్టి బడ్జెట్ అని ప్రవాసాంధ్ర ప్రముఖుడు, పారిశ్రామికవేత్త డాక్టర్ వీఎస్వీ ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. కేంద్ర తాజా ఆర్థిక బడ్జెట్పై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2025–26 బడ్జెట్తో పోలిస్తే తాజా బడ్జెట్ పెట్టుబడుల్లో 10 శాతం పెరిగింది. దీని వల్ల దేశ వ్యాప్తంగా కనీస సౌకర్యాల వృద్ధికి దోహదపడనుంది. ఫలితంగా యువతకు ఉపాధి లభిస్తుంది. ప్రధాని మోదీ దూరదృష్టితో తక్కువ సమయంలో మూడవ స్థానం చేరడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. క్యాన్సర్ రోగులకు, ఇతర తీవ్ర సంబంధిత 17 ఔషధాలపై సుంకాలలో రాయితీ ప్రకటించడం ప్రశంసనీయం అన్నారు. 7 హైస్పీడ్ రైళ్ల కారిడార్లతో పర్యావరణం, ఆర్థిక, ప్రాంతీయ ఎదుగుదలకు ఉత్తేజం లభిస్తుందన్నారు. ప్రకటించని ముంబై–బెంగళూరు కారిడార్ వచ్చే బడ్జెట్లోనైనా సాకారం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
6న దంతపురాణ బాలల చిత్రం విడుదల
హొసపేటె: ఇప్పటికే మూడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న దంతపురాణ బాలల చిత్రం ఫిబ్రవరి 6న హొసపేటెలోని మీర్ ఆలం టాకీస్లో విడుదల కానుందని దర్శకుడు విశాల్ రాజ్ తెలిపారు. సోమవారం ఈ సినిమా పోస్టర్ను విడుదల చేసిన తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడారు. బహిరంగ మలవిసర్జన ఉచితం, పిల్లలు ఆరోగ్యకరమైన రీతిలో మొబైల్ ఫోన్లను ఉపయోగించాలి అనే సందేశంతో ఈ సినిమా గ్రామం, నగర జీవితాన్ని చిత్రీకరిస్తుందన్నారు. మీర్ ఆలం టాకీస్లో మూడు రోజుల హౌస్టూల్ స్క్రీనింగ్కు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈ సినిమా విజయం చూసిన తర్వాత భవిష్యత్తులో ఇతర జిల్లాల్లో కూడా విడుదల చేస్తామని ఆయన అన్నారు. బెంగళూరుకు చెందిన 82 ఏళ్ల వృద్ధురాలు ఈ సినిమా అద్భుతంగా నటించింది. బెంగళూరుకు చెందిన బాలనటుడు అహిల్ అన్సారీ, హొసపేటె, మరియమ్మనహళ్లి ఇలకల్ నుంచి బాలనటులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కళాకారిణి మంజమ్మ జోగతి కూడా ఒక ప్రముఖ పాత్రలో నటించారు. ఇది పిల్లలు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని చూడదగిన సినిమా అని అన్నారు. -
వరిగడ్డే బంగారమాయెగా.!
హొసపేటె: తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్గేట్ల అమరిక పనులతో ఈసారి ఆయకట్టు కింద రెండో పంటకు నీరు లేక క్రాప్ హాలిడే ప్రకటించిన కారణంగా రైతులు వర్షాకాలంలో పండించిన వరిగడ్డిని తాలూకా అంతటా కుప్పలుగా పేర్చి జాగ్రత్తగా నిల్వ చేస్తున్నారు. అంతటా సీజన్లో పంటలు పండించే వరకు, ఎండిన వరి మేత, మొక్కజొన్న కాండాలు, కందులు, వేరుశెనగ పొట్టును రైతుల జీవనోపాధికి, పశువులకు అత్యవసర ఆహారంగా ఉపయోగిస్తారు. తాలూకాలో చాలా మంది రైతులు తుంగభద్ర కుడి దిగువ, ఎగువ కాలువలు, తుంగభద్ర నది, విజయనగర కాలువ, చెరువులు, మాగాణి భూములు, బోరుబావుల కింద 23,000 హెక్టార్లలో వివిధ రకాల వాణిజ్య పంటలు సాగు చేశారు. ఇప్పుడు ఆ రైతులు తమ పొలాలు, పట్టణ శివార్లలోని ఖాళీ ప్రదేశాల్లో తమ పశువుల రక్షణకు దీర్ఘచతురస్రాకార, త్రిభుజాకార, చతురస్రాకార, పిరమిడ్ ఆకారాలలో మేతల కుప్పలను నిర్మించారు. మరి కొందరు టార్పాలిన్లతో కప్పుకున్నారు. ఇంకొందరు షెడ్లలో మేతను నిల్వ చేసుకున్నారు. -
కేకేఆర్డీబీని అభివృద్ధి పరచండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వాలు ప్రాంతీయ అసమానతల నివారణకు ఏర్పాటు చేసిన నిగమ మండలి, బోర్డులను రద్దు చేయాలని అర్థ శాస్త్రవేత్త, ప్రాంతీయ అసమానతల నివారణ పరిష్కార కమిటీ అధ్యక్షుడు గోవిందరావు ఆదివారం బెంగళూరులోని కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు నివేదికను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంజుండప్ప నివేదిక ఆధారంగా వెనుక బడిన తాలూకాల అభివృద్ధి విషయంలో అలసత్వం చేయడం తగదన్నారు. రాష్ట్రంలో 2024లో ఏర్పాటు చేసిన సమితి రెండేళ్ల తర్వాత నివేదికల ఆధారంగా మలెనాడు, బయలు సీమ, కరావళి, గడి అభివృద్ధి ప్రాధికార మండలి, బోర్డులను రద్దు చేయాలని సూచించారు. కేవలం కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బళ్లారి, బీదర్, విజయ నగర జిల్లాల అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుక బడి ఉందని, అందువల్ల కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి(కేకేఆర్డీబీ)ని కొనసాగిస్తూ అందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్లో రూ.44 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించాలన్నారు. కలబుర్గి, బెళగావిలకు నిధులు కేటాయించాలి. 1,160 పబ్లిక్ పాఠశాలలుగా మాదిరిగా బడులు, నీటిపారుదల రంగానికి రూ.10 వేల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.11,770 కోట్లు, వ్యవసాయ, పరిశ్రమల అభివృద్ధికి రూ.2 వేల కోట్ల చొప్పున నిధులు, కేకేఆర్డీబీకి ఏడాదికి రూ.6,380 కోట్లు పెంచాలని సిఫార్సు చేసింది. -
కొత్త రోడ్డు వంతెనకు మోక్షం
బళ్లారిఅర్బన్: గత 25 ఏళ్ల నుంచి స్థానికులకు తీరని సమస్యగా పరిణమించిన ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కంప్లి, కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని జంతకల్ మధ్య ప్రవహించే తుంగభద్ర నదిపై కొత్త రోడ్డు వంతెన నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రస్తుతం కంప్లి కోట వద్ద నుంచి కొప్పళ జిల్లా గంగావతి వైపునకు ఉన్న వంతెనను 1961లో ప్రజాపనుల శాఖ నిర్మించింది. అప్పుడప్పుడు నదిలో వరద పోటెత్తి వంతెనపై నుంచి ప్రవహించడంతో వాహనాలతో పాటు జనసంచారం స్తంభించి పోయేది. దీంతో జిందాల్, బీటీపీఎస్, మైనింగ్ కంపెనీల భారీ వాహనాల సంచారానికి గత 25 ఏళ్ల నుంచి వర్షాకాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వంతెన అక్కడక్కడ శిథిలం అయింది. మరమ్మతులు చేసినా కూడా ప్రయోజనం కలగలేదు. వర్షాకాలంలో తుంగభద్ర డ్యాం నుంచి నదికి లక్ష క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేస్తే వంతెనపై ప్రజలతో పాటు వాహనాల సంచారం నిలిచిపోతుంది. దీంతో ఇక్కడ కొత్త వంతెనను చాలా ఎత్తులో నిర్మించాలని చాలా ఏళ్ల నుంచి స్థానికులు కోరుతున్నారు. రూ.100 కోట్లతో నిర్మాణానికి సర్కారు అనుమతి ఈ విషయంలో అనేక సార్లు ప్రభుత్వ పాలకులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తే ఎప్పటికప్పుడు కొత్త వంతెన నిర్మిస్తామని హామీలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఆచరణ రూపం దాల్చలేదు. తాజాగా ప్రస్తుతం ఉన్న వంతెన కింది భాగం అంటే సిరుగుప్ప వైపు అర కిలోమీటర్ అంతరంలో కొత్త వంతెన నిర్మాణం చేయడానికి మట్టి పరీక్ష ప్రక్రియ ప్రారంభం అయింది. అటు వైపు జంతకల్ శివారు నుంచి ఇటు కంప్లి, ఇటిగి మార్గం మీదుగా సిరుగుప్ప రోడ్డుకు అనుసంధానం చేస్తూ వంతెన నిర్మాణం చేపడతారు. కాగా గతంలో కన్నా అర్థ కిలోమీటర్కు పైగా దూరం కానుంది. మొత్తం రూ.100 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం మట్టి పరీక్ష చేశాక డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని బళ్లారిలోని ప్రజా పనుల శాఖ ఏఈఈ గంజి బసవరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కంప్లి వద్ద తుంగభద్ర నదిపై త్వరలో నిర్మాణం కార్యరూపం దాల్చనున్న ప్రజల చిరకాల వాంఛ -
సౌండ్ప్రూఫ్ గదిలో కాల్పులు..
బనశంకరి: కాన్పిడెంట్ సంస్థ చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్యపై బెంగళూరులో సిట్ అధికారులు, అశోక్నగర పోలీసులు విచారణ చేపట్టారు. ఆఫీసులోని ఆయన చాంబర్లో పూర్తిగా సౌండ్ప్రూఫ్ కావడంతో పిస్టల్ కాల్పుల శబ్ధం ఎవరికీ వినబడలేదు, అందుకే ఘటన జరిగిన 20 నిమిషాలైనా అప్రమత్తం కాలేదని బెంగళూరు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. పూర్తిగా సౌండ్ప్రూఫ్తో ఉన్నందున లోపల అసాధారణ ఘటన జరిగినప్పటికీ బయటకు చప్పుడు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం రాలేదు. ఐటీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తుండగా మద్యాహ్నం 3 గంటల సమయంలో తన తల్లితో మాట్లాడాలని గదిలోకి వెళ్లిన రాయ్ ఎవరినీ లోపలకు వదలరాదని తన సిబ్బందికి ఆదేశించి డోర్ వేసుకున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ జోసెఫ్ కొంతసేపటికి చాంబర్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా సిబ్బంది రాయ్ చెప్పిన మాటలనే చెప్పారు. దీంతో కంగారుపడిన జోసెఫ్ కొన్ని నిమిషాలు వేచి ఉంచి డోర్ గట్టిగా తట్టారు. లోపల నుంచి స్పందన రాకపోవడంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా రాయ్ కుర్చీలో రక్తపుమడుగులో కూర్చునట్లు ఉన్నాడు. ఆ పిస్టల్ విదేశాలకు చెందినది, చాలా ఖరీదైనదని తెలిసింది. పోలీసులు ఆ పిస్టల్ను సీజ్ చేశారు. అందుకే వినబడలేదా? సీజే రాయ్ ఆత్మహత్య కేసులో విచారణ కేరళ సీఎం ఆందోళన ఐటీ అధికారుల సోదాల సమయంలో వ్యాపారవేత్త సీజే.రాయ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం మీద న్యాయ విచారణ జరిపించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు. కేరళకు చెందిన రాయ్ కేరళ, బెంగళూరు, దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు, గత శుక్రవారం బెంగళూరులో ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోవడం తెలిసిందే. ఈ ఘటనపై కేరళ సీఎం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు సోమవారం లేఖ రాశారు. సీజే.రాయ్ ఆత్మహత్య ఘటన దేశంలో ఐటీ పాలనపై బ్లాక్డే అని విజయన్ దుయ్యబట్టారు. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రాయ్ ఆత్మహత్యకు పాల్పడటం అశ్చర్యం కలిగిస్తోందని, రాయ్ను ఐటీ వేధింపులకు గురిచేసి బలిపశువుగా చేశారని దుయ్యబట్టారు. వ్యక్తిగత హక్కులను కాపాడాలన్నారు. -
ఎమ్మెల్యేలకు ల్యాప్టాప్ ఇస్తా కానీ...
శివాజీనగర: ఎమ్మెల్యేలందరికీ సర్కారు నుంచి ల్యాప్టాప్ కానీ, ఐఫోన్ కానీ ఇచ్చే ఆలోచన తమకుంది, దీనిని ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకోవాలి అని విధానసభ స్పీకర్ యూటీ ఖాదర్ అన్నారు. విధానసభలో బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు ల్యాప్టాప్ ఇవ్వాలని కోరారు. దీనికి సభాపతి స్పందిస్తూ, ల్యాప్టాప్ ఇచ్చే ఆలోచన ఉంది, దానిని ఎమ్మెల్యేలు ఉపయోగించకుండా, బంధుమిత్రులకు ఇచ్చేస్తే ప్రయోజనం ఉండదు. మీరే వాడుకుంటామంటే ఇస్తాను అని షరతు విధించారు. ల్యాప్టాప్ వాడకంపై ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తామని, ఇందులో పాల్గొన్నవారికి ఐఫోన్ కూడా ఇస్తానని తెలిపారు. తక్కువ హాజరుపై రగడ శాసనసభ ఆరంభంలో మంత్రులు, ఎమ్మెల్యే లు చాలా తక్కువమందే వచ్చారు, ఇది చూసి బీజేపీ నాయకుడు ఆర్.అశోక్.. మంత్రుల వరుసలో ఎవరూ లేరు. అధికార పార్టీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉంది. అధికారపక్షం పూర్తిగా ఖాళీగా ఉంది. గవర్నర్ ప్రసంగంపై మేము చర్చించినా కూడా దానిని రాసుకోవడానికి ఎవరూ లేరని చెప్పారు. మాట్లాడేందుకు స్ఫూర్తి రావాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండాలి, ఇక్కడ ఎవరూ లేరే అని హేళన చేశారు. వారు వస్తారు, మీరు మాట్లాడాలని స్పీకర్ సూచించారు. ఇంతలో హోం మంత్రి జీ.పరమేశ్వర్ రాగా, వేరొకరు హోంమంత్రిగా ఉండి ఉంటే ఈపాటికి రాజీనామా చేయించేవారమని అశోక్ అన్నారు. ఆరుమంది మంత్రులు వచ్చాక చర్చ మొదలుపెట్టారు. వారే వాడుకోవాలి స్పీకర్ ఖాదర్ షరతు -
యాక్సిడెంట్లో కారు దగ్ధం
యశవంతపుర: కారు డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో పల్టీ పడి మంటల్లో చిక్కుకుని ఒకరు చనిపోయారు, ఈ ఘటన హాసన్ జిల్లా అరసికెరె తాలూకాలో జరిగింది. హరనహళ్లికి చెందిన మంజునాథ్ (30), నవీన్, పవన్ కారులో వెళ్తూ ముందు వెళ్లే కారును ఓవర్టేక్ చేయబోయి వేగంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టారు. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. మంజునాథ్ మరణించగా, మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాణావర పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ దుర్మరణం, జనం ఆగ్రహం గూడ్స్ వ్యాన్ ఢీకొని స్కూటర్పై వెళ్తున్న మహిళ మరణించిన ఘటన చిక్కమగళూరు జిల్లా అరిశినగుప్పె గ్రామం వద్ద జరిగింది. సోమవారం రాత్రి స్థానికురాలు చంద్రిక (40) స్కూటీపై వెళుతుండగా వ్యాన్ ఢీకొనడంతో ఆమె అక్కడే చనిపోయారు. ఘటనాస్థలిని ఎమ్మెల్సీ సీటీ రవితో పాటు చిక్కమగళూరు గ్రామాంతర పోలీసులు పరిశీలించారు. వ్యాన్ డ్రైవర్ను జనం పట్టుకుని చితకబాదారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో చంద్రిక మృతి చెందినట్లు స్థానికులు ఆరోపించారు. తమ గ్రామానికి కనీస సౌకర్యాలు లేవంటూ ఎమ్మెల్సీ సీటీ రవితో యువకులు గొడవకు దిగారు. ఓ యువకుడు మృతి -
మైసూరుపై మత్తు మచ్చ
మత్తు పదార్థాల దందా సోమవారం మైసూరులోని ఓ కర్మాగారంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు మైసూరు: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక, సాంస్కతిక నగరంగా ఖ్యాతి చెందిన మైసూరు మహానగరంపై మత్తు మరక ఏర్పడుతోంది. నగరంలోని కర్మాగారాల్లో రహస్యంగా డ్రగ్స్ను తయారుచేస్తున్న దుండగులు దేశమంతటికీ సరఫరా చేస్తున్నారు. గతేడాది మహారాష్ట్ర పోలీసులు మైసూరులో ఓ డ్రగ్స్ ఫ్యాక్టరీపై దాడి చేసి గుట్టురట్టు చేశారు. ఐదురోజుల కిందట జాతీయ నార్కోటిక్స్ బ్యూరో మరో కర్మాగారం పనిపట్టారు. గుర్తించడం లేదా? గతేడాది జూలైలో ముంబై పోలీసులు మైసూరు సిద్ధిక్ నగర రింగ్రోడ్ సమీపంలో ఒక డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని కనుగొని భారీగా డ్రగ్స్, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఫినాయిల్ తయారీ పేరుతో హెబ్బాల్ ఇండస్ట్రియల్ ఏరియాలో మత్తు పదార్థాలను తయారుచేస్తున్న రాజస్థానీ ముఠాని పట్టుకున్నారు. ఈ రెండు కేసులు మైసూరు పోలీసులను ప్రశ్నించేలా చేశాయి. దీంతో పోలీసులతో పాటు అబ్కారీ అధికారులు కూడా సోదాలు చేపట్టారు. ఎండీఎంఏ ఉత్పత్తి.. మైసూరు పరిసరాల్లోని కర్మాగారాల్లో కొందరు ఇతర రాష్ట్రాలవారు చేరి ఎండీఎంఎ మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నారు. నెలల వ్యవధిలో రెండు ఎండిఎంఎ తయారీ యూనిట్ల పైన జరిగిన దాడులు మైసూర్ పోలీసుల నిద్రను మేల్కొలిపాయి. జాతీయ స్థాయిలో, మైసూర్ పోలీసుల సామర్థ్యంపై ఇప్పుడు సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ సీమా లాట్కర్, డీసీపీ సుందర్రాజ్ 14 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, పారిశ్రామిక ప్రాంతాల తనిఖీకి నాంది పలికారు. కెమికల్ ఫ్యాక్టరీలపై కన్ను ముఖ్యంగా రసాయన ఆధారిత కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు సోదాలు చేస్తున్నారు. హెబ్బాళ, హూటగల్లీ, కురుగల్లీ, మెటగల్లీ, బన్నిమంటప, హింకల్ లోని పారిశ్రామికవాడలలో ముమ్మరం చేశారు. గత మూడు రోజుల్లో, మైసూరులోనే కాకుండా మండ్య జిల్లాలో కూడా 250 కి పైగా కర్మాగారాలను శోధించారు. గోడౌన్లు, పారిశ్రామిక షెడ్లను కూడా గాలించారు, అయితే అనుమానిత ఉత్పత్తులు దొరకలేదని చెబుతున్నారు. తరచూ డ్రగ్స్ ఫ్యాక్టరీల గుట్టురట్టు నగర పోలీసులకు సవాల్ ముమ్మరంగా కర్మాగారాల తనిఖీలు -
మామిడి పూతతో కళకళ
చింతామణి: కోలారు, చిక్కబళ్లాపుర జిల్లాలు మామిడి తోటల నిలయంగా పేరుపొందాయి. ఇక్కడ పండే మేలిరకం మామిడి పండ్లు దేశ విదేశాలకు ఎగుమతి అవుతాయి. వేసవి వస్తుండడంతో మామిడి తోటలు పూతతో కళకళలాడుతున్నాయి. దీంతో పంట బాగా వస్తుందని మాలపల్లికి చెందిన మామిడి రైతు శివారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాలూకాలోని మామిడి తోటలు నిండుగా పూతతో దర్శనమిస్తున్నాయి. గాలిపటం దారానికి నరం కట్ యశవంతపుర: గాలిపటం దారం తగిలి జనం తీవ్రంగా గాయపడిన సంఘటనలు హైదరాబాద్లోనే కాదు.. బెంగళూరులోనూ జరుగుతున్నాయి. బెంగళూరు ఆర్టీనగరలో జనవరి 31న బైకుపై వెళుతున్న వ్యక్తికి గాలిపటం దారం తగిలింది, అతడు దానిని విడిపించుకొన్నాడు. వెనుక నడిచి వెళుతున్న నాగరాజు అనే వ్యక్తి కాలికి చుట్టుకొని నరం కట్ అయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతనిని ఆస్పత్రిలో చేర్పించారు. అది నైలాన్ దారమని, అందుకే తీవ్ర గాయమైందని తెలిసింది. నగరంలో వంతెనలపై వెళ్లే బైకిస్టులు గాలిపటాల దారం నుంచి జాగ్రత్తగా ఉండాలని, వీలైతే రక్షణ కవచం ధరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై పడిన దారాలను ఎప్పటికప్పుడు తొలగించాలని చెప్పారు. గ్యాస్ ప్రమాదంలో కుటుంబం బలిదొడ్డబళ్లాపురం: ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన సంఘటన కనకపురలో జరిగింది. దంపతులు సిద్ధరాజు (55), చంద్రమ్మ (50), కుమారుడు ప్రశాంత్ (22) మృతులు. అమర నారాయణ కాలనీలో రెండు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగి ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు, వారిని బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పలించక సోమవారంనాడు మరణించారు. మహిళాధికారుల రౌద్రరూపం ● దావణగెరె, బెళగావిలో వైరల్ దొడ్డబళ్లాపురం: దావణగెరె జిల్లా చిగటేరి జిల్లా ఆస్పత్రి ఆవరణలో కొందరు ఆకతాయిల మధ్య గొడవలు జరిగాయి, దీంతో పోకిరీలను అరెస్టు చేయడానికి మహిళా సీఐ మొండిపట్టుతో ప్రయత్నించడం జిల్లాలోనే చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నాయకుల కుమారులు హసేన్, హుసేన్ అనుచరులతో కలిసి కానిస్టేబుళ్లు హరీష్, కెంచప్పపై దాడి చేశారు. ఇది తెలిసి నిందితులను అరెస్టు చేయడానికి సీఐ గాయత్రి వెళ్లారు. కానీ అధికార పార్టీ వారమని ఎదురుతిరిగారు. వారిని అరెస్టు చేసి గానీ ఇక్కడి నుంచి కదలను అని ఆమె భీష్మించారు. చివరకు నలుగురు ఆకతాయిలను అరెస్టు చేసి తరలించారు. మైనింగ్కు చెక్ అక్రమంగా గని తవ్వుతున్న వారి మీద మహిళా అధికారి ఉగ్రరూపం దాల్చారు. బెళగావి వద్ద అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు తెలిసి గనులశాఖ జిల్లా అధికారి బిందన్ పాటిల్ అక్కడకు చేరుకుని ఏయ్.. అపండి అని గట్టిగా ఆదేశించారు. ఎంత ధైర్యం ఉంటే ఇంత దర్జాగా అక్రమ మైనింగ్ చేస్తారు అంటూ మండిపడ్డారు. ఆగ్రహం పట్టలేక రాళ్లు తీసుకుని జేసీబీ డ్రైవర్ మీదకు విసిరారు. జేసీబీలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మహిళా అధికారులు సత్తా చూపిన ఈ వీడియోలు బాగా వ్యాప్తి చెందాయి. -
వెంకన్న రథోత్సవం
కోలారు: బంగారుపేట తాలూకా బంగారు తిరుపతిలో వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయ రథోత్సవం సోమవారం సంబరంగా జరిగింది. దేవాలయంలో స్వామి వారికి విశేష పూజలు జరిపారు. ఉత్సవ విగ్రహాలను తేరులో ప్రతిష్టించి ఊరేగించారు. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జనం ముందే రూ.31 లక్షల దోపిడీ బనశంకరి: బన్నేరుఘట్టలో పట్టపగలే బైకిస్టును అడ్డుకున్న దోపిడీదారులు రూ.31.88 లక్షల్ని దోచేశారు. సోమవారం సకలవార రోడ్డులో బైకులో వెళుతున్న వ్యక్తిని అడ్డగించిన దుండగులు కత్తులతో అతనిని బెదిరించారు. బ్యాగులో తీసుకెళ్తున్న రూ.31.38 లక్షల నగదుతో పాటు అతని బైక్ని లాక్కుని ఉడాయించారు. ఆ సమయంలో అక్కడ జనం ఉన్నా అడ్డుకోలేకపోయారు. భయాందోళనకు గురైన బాధితుడు బన్నేరుఘట్ట ఠాణాలో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ బాగుంది: విజయేంద్ర శివమొగ్గ: కేంద్ర బడ్జెట్ స్వావలంబ భారతదేశం దిశగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర అన్నారు. సోమవారం శివమొగ్గలో మాట్లాడుతూ, ప్రజాదరణ కోసం కాకుండా, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ను రూపొందించామని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక అస్థిరత ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రగతి భారతం లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టారని ఆయన అన్నారు. చైన్నె–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు పెద్దపీట వేశారన్నారు. సీఎం సిద్దరామయ్య రాష్ట్ర వైఫల్యాలను కప్పిపుచ్చడానికి కేంద్రం వైపు వేలు చూపడం దినచర్య అని ఆరోపించారు. పార్టీ నేతలు జగదీష్ ఎన్.కె., రఘు కౌటిల్య, ఎస్.రుద్రేగౌడ్రు, అశోక్ నాయక్, మాలతేష్, సుధాకర్ పాల్గొన్నారు. -
రమణీయంగా దుర్గాంబ రథోత్సవం
● జనసంద్రమైన అంతరఘట్ట క్షేత్రం బొమ్మనహళ్లి: దేవాదాయ శాఖ పరిధిలోని చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకాలోని అంతరఘట్టలో వెలసిన శ్రీదుర్గాంబ అమ్మవారి రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆనందోత్సాహాలతో జరిగింది. శనివారం నుంచి అమ్మవారి మూల విగ్రహానికి, ఉత్సవ విగ్రహానికి విశేష పూజలు చేపట్టారు. ఆదివారం ఉదయం ఆలయంలో ప్రాకారోత్సవం జరిపారు. తర్వాత అమ్మవారి విగ్రహాన్ని సంగీత వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి పూలతో అలంకరించిన రథంలో ప్రతిష్టించారు. ఆలయ అధికారులు, భక్తులు రథ చక్రాలపై కొబ్బరికాయలు పగలగొట్టి, ‘అంతర్ఘట్ట మాతకి జై’ ‘దుర్గా మాతకు జై’ అని ఘోషిస్తూ తేరును లాగారు. భక్తులు తేరు మీదకు అరటి, నారింజ పండ్లు, కోళ్లను విసిరి, తమ కోరికలు నెరవేరాలని మొక్కుకున్నారు. ప్రత్యేక దర్శనాలు రథోత్సవం తర్వాత, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీ సీ్త్రలు మొదలైనవారి కోసం అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులు, చుట్టుపక్కల వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 8 రోజుల పాటు జరిగే ఈ జాతరలో వివిధ రకాల దుకాణాలు, వినోద కేంద్రాలు వెలిశాయి. -
చెత్త పేరుతో గోవా మద్యం రవాణా
దొడ్డబళ్లాపురం: కర్ణాటక– మహారాష్ట్ర సరిహద్దుల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. బెళగావి జిల్లా మాళమారుతి పోలీసులు దాడి చేసి రూ.25లక్షల విలువైన 900 బాక్సుల లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ఓ క్యాంటర్ వాహనంలో గుజరీ పేరుతో దాని కింద మద్యం దాచి గోవా నుంచి బెళగావి మీదుగా మహారాష్ట్రకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం దీనిని తీసుకెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు. డ్రైవర్ను అరెస్టు చేసి, మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.పేలుడు బాధితులకు మంత్రుల పరామర్శదొడ్డబళ్లాపురం: బీదర్ జిల్లా మోళకేర గ్రామంలో రోడ్డుపక్కన చెత్తదిబ్బలో పేలుడు సంభవించి పిల్లలు సహా 6మంది గాయపడడం తెలిసిందే. ఆదివారంనాడు మంత్రి ఈశ్వర్ ఖండ్రె, మంత్రి రహీంఖాన్ బీదర్లోని బిమ్స్ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. పేలుడు వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తలా రూ.25వేలు ఆర్థికసాయం అందించారు. మీడియాతో మాట్లాడుతూ ఈ విస్ఫోటంలో నలుగురు విద్యార్థులతో కలిపి మొత్తం ఆరుమంది గాయపడ్డారని, వారికి మెరుగైన చికిత్స అందించేలా వైద్యులకు సూచించామన్నారు. పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారని తెలిపారు.బంగారం లోన్ల పేరుతో బురిడీమైసూరు: తక్కువ వడ్డీకి ఆభరణాలపై రుణం ఇస్తానని చెప్పి జనం నుంచి నగలతో పరారైన బంగారు షాపు యజమానిని విజయనగర పోలీసులు అరెస్టు చేశారు. త్రినేత్ర సర్కిల్ సమీపంలో స్టార్ గోల్డ్ కంపెనీ అనే బంగారు దుకాణం యజమాని యోగేష్ నిందితుడు. చాలా తక్కువ వడ్డీకి బంగారంపై ఎక్కువ మొత్తంలో అప్పులు ఇస్తానని ప్రచారం చేసుకున్నాడు. దీంతో చాలామంది బంగారు నగలు కుదువ పెట్టి డబ్బులు తీసుకున్నారు. యోగేష్ ఆ బంగారాన్ని అక్రమంగా కరిగించి అమ్ముకున్నాడు. ఇలా 15 మంది నుంచి సుమారు రూ. 1.5 కోట్ల విలువైన 850 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. కొందరు అప్పు చెల్లిస్తామన్నా నగలు తిరిగి ఇవ్వలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించి అరెస్టు చేశారు.హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలుశిక్షశివమొగ్గ: ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ముగ్గురు యువకులకు కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శివమొగ్గలోని మంజునాథ బరంగే నివాసితులు సంతోష్ (27), శరత్ (24), ఎం.ప్రశాంత్ (24). 2022 మార్చిలో బాబు కిరణ్ అనే వ్యక్తి ఇంటికి వెళుతుండగా నిందితులు అడ్డుకున్నారు. అతనిని దుర్భాషలాడి, వీపుపై పొడిచి హత్యాయత్నం చేశారు. దీంతో బాధితుడు దొడ్డపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి నగర కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి అభయ్ ధనపాల్ చౌగలే శనివారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.రూ.100 కోట్ల భూమికి ఎసరు● పరారీలో నిందితులుదొడ్డబళ్లాపురం: రామనగరలో రూ.100 కోట్ల విలువైన 50 ఎకరాల భూమికి బోగస్ పత్రాలను తయారుచేసి కొట్టేసేందుకు కుట్ర చేసిన నలుగురి బండారం బట్టబయలైంది. వివరాలు.. రామనగరలోని మజీద్ మొహల్లా నివాసులు రసూల్ఖాన్ కుమారులు అజ్మత్, అమ్జాద్, ఆసిఫ్, ఫారూకుల్లాఖాన్లు నిందితులు. ఈ నలుగురు కలిసి స్థానికంగా వక్ఫ్ బోర్డుకు చెందిన 50 ఎకరాల భూమి మీద నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి యలహంకకు చెందిన మహ్మద్ నయీం అనే వ్యక్తికి విక్రయించడానికి కుట్ర చేశారు. ఇది బయటకు పొక్కడంతో వక్ఫ్ బోర్డు పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. -
మంచి మనతోనే మొదలవ్వాలి
● మైసూరు సమాజోత్సవంలో యుక్తేశానందస్వామి మైసూరు: ధర్మాన్ని ప్రబోధించడం కంటే జీవితంలో దానిని ఆచరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ రామకృష్ణ ఆశ్రమ అధిపతి స్వామి యుక్తేశానంద అన్నారు. ఆదివారం మైసూసులోని గాయత్రీపురంలో హిందూ సమాజోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆయన పాల్గొని మాట్లాడుతూ, వ్యక్తి– సమాజం అనేవి విడదీయరానివని, నేను మంచి వ్యక్తిని అయితే, సమాజం కూడా బాగుంటుందని చెప్పారు. నేను సరిగ్గా ప్రవర్తిస్తే, సమాజం కూడా సరిగ్గా ప్రవర్తిస్తుంది అనేది తెలుసుకోవాలన్నారు. సంస్కరణ అనేది నా నుంచి, నా కుటుంబం నుంచి మొదలై సమాజాన్ని, దేశాన్ని చేసుకోవాలన్నారు. జీవితంలో పరివర్తన అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. కులం పేరుతో సాగే సామాజిక వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని స్వామీజీ పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి సంస్కృతీ, నీతి, నైతిక విలువలను పెంపొందించాలన్నారు. పర్యావరణం కోసం మొక్కలను, చెట్లను పరిరక్షిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. వలసవాద మనస్తత్వం నుంచి బయటపడి భారతీయ స్వభావాన్ని స్వీకరించి, జీవితంలోని అన్ని రంగాలలో స్వావలంబనకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల గుండా సమాజోత్సవ ర్యాలీ జరిగింది. జనంపై వీధికుక్క దాడులు తుమకూరు: జిల్లాలో కుక్కల దాడులు భయం పుట్టిస్తున్నాయి. కుణిగల్ తాలూకా కొత్తగెరె గ్రామంలో పొలం నుంచి ఇంటికి వస్తుండగా రంగప్ప (70), నారాయణప్ప (65), గుండప్ప (55), గంగాధర్ (44) అనేవారిని కలాసిపాల్య గ్రామ సమీపంలో ఓ కుక్క కరిచింది. దీంతో చికిత్స కోసం బెల్లూర్ క్రాస్లోని ఆది చుంచనగిరి ఆసుపత్రిలో చేరారు. కనిపించినవారినల్లా కరుస్తున్న వీధి కుక్కను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తులు గ్రామ పంచాయతీ పిడిఓకి ఫోన్ చేయగా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. దొడ్డలో బాలునిపై దొడ్డబళ్లాపురం: బాలునిపై వీధికుక్కలు దాడి చేసిన సంఘటన దొడ్డ పట్టణంలో జరిగింది. పాలన్జోగళ్లి పాండురంగ దేవాలయం వద్ద మంజునాథ్ కుమారుడు నిఖిత్ రాజ్ (6) ఇంటి ముందు ఆడుకుంటుండగా హఠాత్తుగా వచ్చిన సుమారు 15 వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో నిఖిత్ శరీరం మొత్తం గాయాలయ్యాయి. బాలుడిని తక్షణం దొడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉసురు తీసిన కట్న వేధింపులుయశవంతపుర: కట్నం వేధింపులు తాళలేక వివాహిత యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హాసన్ జిల్లాలోని హెచ్ మైలళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. బేలూరు తాలూకా ఐ హుణసెకెరె కు చెందిన హెచ్.ఎల్.ఇంద్ర (24)కు నాలుగేళ్ల క్రితం హెచ్ మైలళ్లివాసి ఎంహెచ్ స్వామితో కట్న కానుకలిచ్చి వైభవంగా వివాహం జరిపించారు. వీరికి ఇంకా సంతానం లేదు. స్వామి బేకరీని నడిపేవాడు. నష్టాలు వచ్చాయని, పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని, పిల్లలు పుట్టలేదని భార్యను సతాయించేవాడు. శనివారం రాత్రి కూడా పెద్ద రగడ జరిగింది, దీంతో ఇంద్ర పురుగుల మందు తాగింది, దీంతో హాసన్ హిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయింది. భర్త, అత్తమామలపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కాళ్లు నరికి ఇంట్లో పూడ్చేశాడు
సాక్షి బళ్లారి: బతుకుతెరువు కోసం చిత్రదుర్గ జిల్లా నుంచి విజయనగర జిల్లాకు వచ్చి కొట్టూరులో స్థిరపడిన భీమరాజ్ కుటుంబాన్ని కన్న కొడుకే కాలయముడై హత్య చేశాడు. కొట్టూరు పట్టణంలో తల్లిదండ్రులు భీమరాజ్ (50), జయలక్ష్మి (45) సోదరి అమృత (17) కాళ్లు నరికేసి, ఇంట్లో పాతిపెట్టినట్లు అక్షయ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఆదివారం ఇంట్లో పాతిపెట్టిన మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. కర్కోటక తనయుడు అక్షయ్ కుమార్ పోలీసుల విచారణలో పలు విషయాలు చెప్పినట్లు సమాచారం. ఈ హత్యలు పరువు కోసమా లేదా డబ్బు కోసం చేశాడా అనేది తెలియాల్సి ఉంది. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకాకు చెందిన భీమరాజ్, జయలక్ష్మి, కుమారుడు అక్షయ్ కుమార్, కుమార్తె అమృతతో కలిసి కొట్టూరులో నివసిస్తున్నారు. అమృత ఓ యువకుడితో ప్రేమలో పడి గర్భవతి అయినట్లు తెలిసింది. ఈ విషయమై కుమారుడు అక్షయ్.. తల్లిదండ్రులు, చెల్లి అమృతతో గొడవ పడ్డాడు. అమృతకు అబార్షన్ చేయించాలని ఒత్తిడి చేశాడు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో కక్ష పెంచుకుని ఈ హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో అక్షయ్ నోరు విప్పినట్లు తెలుస్తోంది. డబ్బు కోసమేనా? అయితే ఇది పరువు హత్య కాదని.. డబ్బు కోసమే తల్లిదండ్రులు, సోదరిని అక్షయ్ కుమార్ హత్య చేసి ఉంటాడనే మరో కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఇటీవల భీమరాజ్ పొలం విక్రయించగా వచ్చిన డబ్బు తనకు ఇవ్వాలని అక్షయ్ పట్టుబట్టాడు. అయితే చెల్లి పెళ్లికి డబ్బు అవసరం అవుతుందని కొడుకుకు నచ్చజెప్పాడు. డబ్బు ఇవ్వలేదని కక్ష పెంచుకున్న అక్షయ్.. జనవరి 26వ తేదీన ముందుగా తల్లి, సోదరిని హత్య చేశాడు. ఆ తర్వాత తండ్రిని హతమార్చాడు. బాడుగ ఇంట్లో గుంత తవ్వి ముగ్గురిని ఒకే గుంతలో పాతిపెట్టే క్రమంలో తండ్రి కాళ్లు పొడవు ఉండటంతో రెండు కాళ్ల నరికి పక్కన పడేశాడు. మృతదేహాలను గుంతలో ఒకటిపై ఒకటి వేసి పూడ్చాడు. ఎవరికి అనుమానం రాకుండా టైల్స్తో కప్పేశాడు. అనంతరం బెంగళూరుకు వెళ్లిపోయాడు. తల్లీదండ్రులు, సోదరి కనబడటం లేదని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్షయ్ కుమార్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కొట్టూరు పట్టణంలో కలకలం రేపిన హత్య ఒకే గుంతలో మగ్గురి మృతదేహాలు మృతదేహాలను వెలికితీసిన పోలీసులు పరువు కోసమా? డబ్బు కోసం చేశాడా అనే కోణంలో దర్యాప్తు -
మేలుకోటెలో పునర్వసు వైభవం
మండ్య: ఆదివారం మాఘపౌర్ణమి సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేలుకోటెలో రామానుజ పునర్వసు ఉత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని రామానుజ, చెలువనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నారు. ఏటా మకర శుక్ల పునర్వసు నక్షత్రం నాడు తాయి పునర్వసు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ పవిత్ర దినాన రామానుజాచార్యులు యదుగిరిలోని కగ్గత్తల అడవిలో శయనించిన చెలువ నారాయణున్ని దర్శనం చేసుకుని ప్రపంచానికి జ్ఞానోదయం కలిగించారని పురాణేతిహాసం ఉంది. రామానుజాచార్యులకు పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. -
ఆనందపురి మహాస్వామి ఆశయ సాధనకు కృషి
రాయచూరు రూరల్: సిద్దరామ ఆనందపురి మహాస్వామి ఆశయ సాధనకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన దేవదుర్గ తాలుకా తింథిణి వద్ద కాగినెల పీఠాధిపతి, హలు మతం గురువు సిద్దరామ ఆనందపురి మహాస్వామి పుణ్యాస్మరణ కార్యక్రమం నిర్వహించారు. గురు పీఠానికి హస్టల్, ఇతర సౌలభ్యాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, బోస్రాజ్, శివరాజ్ తంగడిగి, శరణ బసప్ప దర్శనాపూర్, మాజీ మంత్రులు బండెప్ప కాశంపూర్, వెంకట్రావ్ నాడగౌడ, మాజీ ఎంపీ విరుపాక్షప్ప పాల్గొన్నారు. నెల రోజుల్లో కులగణన జాబితా విడుదల రాష్ట్రంలో జరిపిన కులగణన జాబితాను నెల రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి సిద్ద రామయ్య వెల్లడించారు. ఆదివారం కలబుర్గిలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనకు అధికార వ్యామోహం లేదన్నారు. పోరాటాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. -
అమ్మ కిరాతకం
● ముగ్గురు పిల్లలను చంపి.. ఆత్మహత్యాయత్నం దొడ్డబళ్లాపురం: ఎంత కష్టం వచ్చినా పిల్లలను కాపాడుకోవాల్సిన తల్లి.. కుటుంబ కలహాలతో కిరాతకురాలిగా మారింది. ముగ్గురు కన్నబిడ్డలను చంపి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన బాగలకోట జిల్లా బాదామి తాలూకా హీరేముచ్చలగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. రూప (30) అనే తల్లి, సమృద్ధి (5), ప్రీతమ్ (4) సుక్షిత్ (2) అనే తన ముగ్గురు చిన్నారి కొడుకులకు ఉరివేసి చంపింది, తరువాత డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు 2018లో హనుమంత అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్త, అత్త రేణవ్వల వేధింపులు భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. రూప బాగలకోటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
సమస్యల పరిష్కారానికి పోరాడతాం
బళ్లారి అర్బన్: సమస్యల పరిష్కారానికి న్యాయ సమ్మతమైన పోరాటం చేస్తామని బళ్లారి అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (బుస్మా) గౌరవ అధ్యక్షుడు ఎంఏ ఆనంద్, ప్రధాన కార్యదర్శులు డీ.శశికుమార్, ఎన్.ప్రతాప్రెడ్డి తెలిపారు. ఆదివారం నగరంలోని బసవ భవన్లో బళ్లారి అన్ఎయిడెడ్ పాఠశాల నిర్వహణ సంఘం రజతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బళ్లారి సంఘం 25 ఏళ్ల ప్రస్తానాన్ని గురించి మరిస్వామి రెడ్డి మాట్లాడారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ తదితర పాఠశాలల సంక్షేమం కోసం సంఘం యొక్క కృషిని కొనసాగిస్తామన్నారు. పాఠశాలల నిర్వహణ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి ప్రభుత్వ సారథులతో పాటు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. రజతోత్సవ వేడుకల్లో కీలక అంశాలపై పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం బళ్లారి శాఖ అధ్యక్షుడు మరిస్వామి రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కోశాధికారి రంజాన్, కార్యదర్శి రియాజ్, అలాగే వివిధ జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు ముఖ్యంగా చైతన్య పీయూ కళాశాల అధ్యక్షుడు విష్ణు ఆ సంఘం కార్యవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
భక్తవత్సలా.. గోవిందా
మాలూరు: మాఘ పౌర్ణమి శుభదినం కావడంతో తాలూకాలో మరో తిరుమలగా పేరుపొందిన చిక్కతిరుపతి ప్రసన్న వెంకటశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బెంగుళూరు, పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళునాడు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఏడుకొండలవాడిని, అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. 10 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. అర్చకులు గోపాలకృష్ణ భరద్వాజ్, ఎన్ శ్రీధర్ నేతృత్వంలో స్వామికి అభిషేకం, పంచామృత అభిషేకం, పూజలను నిర్వహించారు. చిక్క తిరుపతిలో పూర్ణమి పూజలు -
సీజే రాయ్కు కన్నీటి వీడ్కోలు
బనశంకరి: బెంగళూరులో కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత, పారిశ్రామికవేత్త సీజే.రాయ్ భౌతిక కాయానికి ఆదివారం బన్నేరుఘట్టలోని కాసాగ్రాండ్లో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. శుక్రవారంనాడు ఆయన ఐటీ అధికారులు విచారిస్తుండగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. బౌరింగ్ ఆసుపత్రిలో సీజే.రాయ్ పార్థివదేహాన్ని భార్య, పిల్లలకు అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్లో ఊరేగింపుగా అంత్యక్రియలకు బయలుదేరారు. రాయ్ కాన్ఫిడెంట్ కార్యాలయం ముందు కొద్దిసేపు నిలిపారు. ఈ సమయంలో ఎమ్మెల్యే ఎన్ఏ.హ్యారీస్ నివాళులు అర్పించారు. సెయింట్ జోసెఫ్ చర్చిలో ప్రార్థనలు జరిపారు. సీజే.రాయ్ కార్ల ప్రేమికుడు కావడంతో ఆయన సొంతమైన రోల్స్రాయిస్, బెంజ్, రేంజ్రోవర్, బుగాటి, ఆడి తదితర లగ్జరీ కార్లు ర్యాలీగా వచ్చాయి. దారి పొడవునా కుటుంబసభ్యులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యారు. బన్నేరుఘట్టలోని కాసాగ్రాండ్ కు తీసుకువచ్చి క్రైస్తవ సంప్రదాయంతో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. మంత్రి రామలింగారెడ్డి సంతాపం తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఐటీపై మోహన్దాస్ ఆక్రోశం యశవంతపుర: ఐటీ దాడులు, సీజే రాయ్ ఆత్మహత్యపై ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్దాస్ పాయ్ ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇప్పటికే ట్యాక్స్ వేధింపుల వల్ల కాఫీ డే సిద్ధార్థను పోగొట్టుకున్నాం, ఐటీ అధికారుల సతాయింపులతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని దాస్ ఆవేదన చెందారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐటీ అధికారులకు పూర్తి అధికారాలిస్తే ఇక సామాన్య ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. లగ్జరీ కార్లతో అంతిమయాత్ర -
జిల్లా ఉత్సవాలకు తరలిరండి
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు భారీగా తరలివచ్చి, విజయవంతం చేయాలని జిల్లా అధికారి నితీష్ పిలుపునిచ్చారు. ఆదివారం కర్ణాటక సంఘం కార్యాలయం నుంచి జాథాను ప్రారంభించారు. ఏడెదొరె రాయచూరు జిల్లా ఉత్సవాల జ్యోతి యాత్ర, రథయాత్ర ద్వారా ప్రచారం చేయడంతో పాటు ఇంటింటా పండుగలా ఉత్సవాలు జరపాలన్నారు. ఉత్సవాలపై ప్రచారం చేపట్టేందుకు జాథాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని లింగసూగురు, దేవ దుర్గ, మాన్వి, సింధనూరు, ముదుగల్, మస్కి, సిరవార, కవితాళ, హట్టి ప్రాంతాల్లో వార్త శాఖ సమాచారం తెలిపే కేంద్రాలు, ప్రదర్శన, మేళాలను ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార కాందూ, నగర సభ కమిషనర్ జుబీ మహపాత్రో, ఉప కమిషనర్ సంతోష్ రాణి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు క్రిష్ణ, శాంతప్ప పాల్గొన్నారు. కవి కాంతనవర్ మృతిరాయచూరు రూరల్: నగరానికి చెందిన ప్రముఖ త్రిభాషా కవి వీఎస్ కాంతనవర్ (92) ఇకలేరు. వయోభారం, అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఆదివారం బెంగళూరులోని ముక్తిదామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వీఎస్ కాంతనవర్.. కన్నడ, తెలుగు, హిందీ బాషల్లో రచనలు చేశారు. కలబుర్గి విశ్వ విద్యాలయం నుంచి అవార్డు అందుకున్నారు. ప్రథమ తాలుకా కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన మృతిపై సాహితీవేత్తులు, కవులు, ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. గంజాయి ఇవ్వలేదని కత్తితో దాడి హుబ్లీ: గంజాయి తెచ్చి ఇవ్వలేదన్న అక్కసుతో యువకుడిపై తోటి స్నేహితులు కత్తితో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటన కేఎంసీ ఆస్పత్రి ఆవరణలో చోటుచేసుకుంది. సయ్యద్ అలీ అనే యువకుడు గతంలో గంజాయి దందా చేసేవాడు. ప్రస్తుతం గంజాయి సరఫరా మానేసి, వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఇబ్రహీంపురంలో సయ్యద్ అలీపై దాడి జరగడంతో చికిత్స కోసం తండ్రితో కలసి కేఎంసీ ఆస్పత్రికి వచ్చాడు. గంజాయి ఇవ్వడం లేదని కోపం పెంచుకున్న 15 మందితో కూడిన గుంపు ఆ యువకుడిపై కక్షగట్టి దాడి చేశారు. కత్తితో పొడిచి పరారయ్యారు. విద్యా నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చేపట్టారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం హుబ్లీ: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానిక హోసూరులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గదగ నీలకుంద నివాసి అయిన నీలప్ప మల్లిగే వాడ కుటుంబ సభ్యులతో కలిసి హుబ్లీలో ఉండేవాడు. నీలప్ప, అతడి భార్యకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. విరక్తి చెందిన భార్య విజయలక్ష్మి పుట్టినింటికి వెళ్లిపోయింది. మనస్తాపం చెందిన నీలప్ప మద్యం తాగి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో 70 శాతం శరీరం కాలిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొడవలితో వ్యక్తిపై దాడి హుబ్లీ: కొడవలితో వ్యక్తిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానిక ఉనకల్ బారకేర వీధిలో చోటు చేసుకుంది. సిద్దు బారకేరపై ఆయన బంధువు శేఖర్ ఈ దాడికి పాల్పడ్డాడు. పాత పగల నేపథ్యంలో సిద్దుపై ఆయన చినాన్న శేఖర కొడవలితో దాడి చేశాడు. గాయపడిన సిద్దును కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విద్యా నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జ్యోతి కాలనీలో భవిష్య వాణి రాయచూరు రూరల్: ఈ ఏడాది రాష్ట్రంలో రాజకీయ పదవుల కీచులాట ప్రారంభం అవుతుంది. రైతులు తీవ్రంగా నష్టపోతారు. మానవులు, పశువులకు వింత రోగాలు సోకుతాయి’ అని పుట్ట ఉద్బవ సౌదత్తి, యల్లమ్మ అర్చకురాలు రాజేశ్వరి భవిష్య వాణి వినిపించారు. శనివారం రాత్రి నగరంలోని జ్యోతి కాలనీలో వేలాది మంది భక్తుల సమక్షంలో భవిష్య వాణి పలికింది. తొలుత యల్లమ్మ దేవిని పల్లకీలో ఊరేగించారు. కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్య, వీర సంగమేశ్వర శివాచార్యలు, అభినవ రాచోటి శివాచార్య, కపిల సిద్ధరామ చార్య పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా గాలెమ్మ దేవి రథోత్సవం
హొసపేటె: తాలూకాలోని హంపీ రహదారిలో ఆదివారం గాలెమ్మ దేవి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువుదీర్చి పూజలు చేశారు. దేవాలయం నుంచి తేరువీధి వరకు రథాన్ని లాగారు. తేరు లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి జలాభిషేకం, కుంకుమార్చన, పలు ధార్మిక పూజలు చేశారు. అంతకుముందు అమ్మవారిని వెండి ఆభరణాలతో అలంకరించారు. కమలాపురం, హంపీ, కడ్డిరాంపురం, మలపనగుడి, కొత్త మలపనగుడి, కొండ నాయకనహళ్లి, అనంతశయనగుడి, నాగేనాహళ్లి, బసవణదుర్గ, హొసపేటె వివిధ వార్డుల నుంచి భక్తులు క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. రథోత్సవం సందర్భంగా గుత్తేదారుడు పి.బాబు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. -
కమనీయం.. రథోత్సవం
సాక్షి, బళ్లారి: నగరంలోని కోట వీధిలో ప్రసిద్ధి చెందిన కోట మల్లేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మోతీ సర్కిల్ నుంచి తేరు వీధి, కణేకల్లు బస్టాండ్ వరకూ జనసందోహంగా మారింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని తొలుత ఆలయంలో విశేష పూజలు చేపట్టారు. ఉదయం తేరువీధిలో సంప్రదాయబద్ధంగా రథానికి పూజలు చేసి, మడితేరును లాగారు. ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, నగర మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు, తేరు వీధిలోని ప్రముఖులు, కోట మల్వేశ్వర ఆలయ నిర్వాహకులు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తేరును ముందుకు లాగారు. మడితేరును నగర వాసులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం మహారథోత్సవం నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు సమక్షంలో రథాన్ని ముందుకు లాగారు. బ్రూసుపేట పోలీసు స్టేషన్, పెద్ద మార్కెట్, కణేకల్లు బస్టాండు వరకూ రథోత్సవం కొనసాగింది. రథాన్ని లాగే సమయంలో ఓం నమఃశివాయ.. కోట మల్లేశ్వర స్వామి నమోనమః, హరహర మహాదేవ శంభోశంకర నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులు రథంపైకి అరటి పండ్లు, పూలు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కోలాహలం.. కోట ప్రాంతంలో స్వయంభువుగా వెలసిన పరమశివుడు కోట మల్లేశ్వర స్వామిగా అవతరించారని భక్తులు విశ్వాసం. మాఘపౌర్ణమి రోజున శివలింగాన్ని దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోట ప్రాంతం నుంచి, మోతీ సర్కిల్, తేరు వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జనం భారీ ఎత్తున తరలి రావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రథంపై ఊరేగిన కోట మల్లేశ్వర స్వామి భక్తజన సంద్రంగా మారిన బళ్లారి మార్మోగిన ఓ నమః శివాయ నామస్మరణ ఆలయానికి పోటెత్తిన భక్తులు -
ఘనంగా మడివాళ మాచిదేవ జయంతి
రాయచూరు రూరల్: నగరంలోని ఆర్టీఓ సర్కిల్లో ఆదివారం మడివాళ మాచిదేవ జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా పంచాయతీ, జిల్లా అధికార యంత్రాంగం, నగర సభ, కన్నడ సాంస్కృతిక శాఖ, మడివాళ సమాజం ఆధ్వర్యంలో మడివాళ మాచిదేవ విగ్రహానికి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య మహస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పండిత సిద్ధరామ జంబలదిన్ని రంగ మందింరంలో అదనపు జిల్లా అధికారి శివానంద జ్యోతి వెలిగించి మడివాళ మాచిదేవ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధానం అన్నారు. కార్యక్రమంలో సమాజం అధ్యక్షుడు జంబన్న, ఆంజనేయ, చంద్రశేఖర్, శివమూర్తి, వెంకటేష్, రవి, నరసప్ప, రఘు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శివశరణులను ఆదర్శంగా తీసుకోవాలి బళ్లారి అర్బన్: శివశరణుల సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకోవాలని బళ్లారి మహానగర పాలక సంస్థ మేయర్ పి.గాదెప్ప సూచించారు. జిల్లా పరిపాలన, జిల్లా పరిషత్, కన్నడ, సంస్కృతి శాఖ, మహానగర పాలక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని డాక్టర్ రాజ్కుమార్ రోడ్డులోని సాంస్కృతిక సముదాయం హోంగిరణ సభాగణంలో మడివాళ మాచిదేవ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచన సాహిత్య కాలంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం శరణులు తమ జీవితాలను అంకితం చేశారని తెలిపారు. వారి భావజాలాన్ని నేటి తరానికి చేరవేయడానికి ప్రభుత్వం జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. జిల్లా గ్యారంటీ పథకాల అమలు ప్రాధికార సంస్థ అధ్యక్షుడు కేఈ చిదానందప్ప మాట్లాడుతూ.. భారత పౌర్ణమి రోజున మడివాళ మాచిదేవ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బళ్లారి పెద్దయ్య వి.కళ్లూరు బృందం నిర్వహించిన వచన సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది. కార్యక్రమంలో జిల్లా మడివాళ సంఘం అధ్యక్షుడు ఎన్.ధనుంజయ హమాల్, కన్నడ, సంస్కృతి శాఖ సహాయ దర్శకుడు బి.నాగరాజ్, నాయకులు ప్రతాప్రెడ్డి, అనూప్ కుమార్, అల్లం ప్రశాంత్ పాల్గొన్నారు. -
వైభవంగా నాగర యల్లమ్మ జాతర
రాయచూరు రూరల్: రాయచూరు తాలుకా శక్తి నగర్లో వెలసిన మాతా నాగర యల్లమ్మ జాతర ఘనంగా జరిగింది.ఽ శనివారం సాయంత్రం వేలాది మంది భక్తుల సముక్షంలో రథోత్సవం నిర్వహించారు. ఆదివారం దేవ సూగురు దేవాలయం వద్ద సూగురేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవాలయం నుంచి యల్లమ్మ ఆలయం వరకు కలశాలతో అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. నాగర యల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో శశికళ, వీరేష్, సుదీప్, మరళయ్య, సిద్దరామయ్య, అశోక్, బసవరాజ్, ప్రకాశయ్య, శివయ్య, హంపన గౌడ, శకుంతల, సురేష్ తదతరులు పాల్గొన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు రాయచూరు రూరల్: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు ప్రధాన న్యాయమూర్తి స్వాతిక్ తెలిపారు. నగరంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో జిల్లా ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార ఆద్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుని ఉజ్వల భవిష్యత్తులకు బాటలు వేసుకోవాలని తెలిపారు. చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంటే భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. తల్లీ, బిడ్డ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. మీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరిగితే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి నవీన్ కుమార్, జిల్లా కార్మిక అధికారి హారతి, బీఈఓ ఈరణ్ణ, సుదర్శన్, కుంటప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఉల్లి ధర పతనం రాయచూరు రూరల్: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టాలపాలవుతున్నారు. లాభాలు వస్తాయనే ఆశతో రాయచూరు జిల్లాలో 753 హెక్టార్లు, యాదగిరిలో 658 హెక్టార్లు, కొప్పళ జిల్లాలో 569 హెక్టార్లు, బళ్లారిలో 489 హెక్టార్లో ఉల్లి సాగు చేశారు. అయితే ధరల పతనంతో ఉల్లి సాగు చేసిన రైతులకు నిరాశ మిగిలింది. రాయచూరు ఏపీఎంసీ మార్కెట్లో క్వింటా రూ.205 నుంచి రూ.709 వరకూ ధరలు పలుకుతున్నాయి. వ్యాపారులు ఉల్లిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మద్దతు ధర లేకపోవడంతో శనివారం సాయంత్రం ఓ రైతు 62 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను మార్కెట్లో వదిలేసి పోయాడు. రాయచూరు ఏసీఎంసీ మైదానంలో ఉల్లి గడ్డలను పశువులకు వదిలేసిన దృశ్యం కనిపించింది. రైల్వే ప్రయాణికులకు తప్పని తిప్పలు రాయచూరు రూరల్: ఉత్తర, కల్యాణ కర్ణాటకలోని ప్రజలు రైలు ప్రయాణం అంటే భయాందోళన చెందుతున్నారు. రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తక్కువగా ఉండటంతో అవస్థలు పడుతున్నారు. అదనపు బోగీలను అమర్చకుంగా కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులతో చెలగాటమాడుతోంది. శనివారం రాత్రి యాదగిరి, రాయచూరు రైల్వే స్టేషన్లో వివిధ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. జనరల్ బోగీల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో కిక్కిరిసిపోయాయి. గంగమ్మా కాపాడమ్మా కేజీఎఫ్: తాలూకాలోని నాచపల్లి గ్రామంలో గంగమ్మ దేవాలయ 138వ సంవత్సరం జాత్రా మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయాన్ని విద్యుత్ దీపాలతోను, వివిధ రకాల పూలతోను అలంకరించారు. మహిళలు 201 బిందెలను తలపై మోసుకుని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. ప్రధాన అర్చకులు గురుదీక్షిత్ నేతృత్వంలో పూజలు జరిగాయి. -
కరెంటు షాక్తో ఇద్దరు మృత్యువాత
రాయచూరు రూరల్: రాయచూరు, బెళగావి జిల్లాల్లో కరెంటు తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాలు.. శుక్రవారం రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా కురుకుందకు చెందిన తనుశ్రీ (10) పాఠశాలలో తాగునీటి కోసం వెళ్లిన సమయంలో కరెంటు తీగలు తగిలాయి. దీంతో షాక్ కొట్టి కిందపడిపోయింది, వెంటనే ఆమెను ప్రభుత్వ అస్పత్రిలో చేర్పించగా, రాత్రి మరణించిందని తుర్విహాళ్ యస్ఐ సుజాత నాయక్ తెలిపారు. పంప్సెట్టు ఆన్ చేస్తూ బెళగావి జిల్లా అథణి తాలూకా ఖేతనహట్టిలో విద్యుత్ షాక్ తగిలి వైష్ణవి మోహన మోరో (25) అనే యువతి మరణించింది. ఇంటి పంప్సెట్ మోటారును ఆన్ చేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే మృత్యువాత పడిందని కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. లోకాయుక్త వలలో ఎస్ఐ ● కారును విడుదల చేయడానికి రూ.లక్ష లంచం ● తుమకూరులో కలకలం తుమకూరు: స్వాధీనం చేసుకున్న కారును విడిపించేందుకు లంచం తీసుకుంటున్న తుమకూరు రూరల్ ఠాణా ఎస్ఐ చేతన్ లోకాయుక్తకు దొరికాడు. బాధితుడు, లోకాయుక్త సిబ్బంది తెలిపిన మేరకు వివరాలు... 3 రోజుల క్రితం నగేష్ అనే వ్యక్తి తన కారును కేసరుమడు గ్రామం సమీపంలో వదిలేసి వెళ్లాడు. తరువాత అనుమానాస్పద కారుగా భావించి రూరల్ ఠాణా పోలీసులు దానిని తీసుకెళ్లారు. ఇది తెలిసి నగేష్ వచ్చి తన కారును విడిచిపెట్టాలని ఎస్ఐ చేతన్ను కోరాడు. అందుకుగాను రూ. లక్ష లంచం ఇవ్వాలని చేతన్ డిమాండ్ పెట్టాడు. గంజాయి కేసు పెడతానని తాను డబ్బులు ఇవ్వలేనని నగేష్ మొరపెట్టుకోగా, డబ్బు ఇస్తేనే కారు వదులుతా, లేదంటే నిన్ను కూడా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపుతానని ఎస్ఐ బెదిరించాడు. ఈ వేధింపులను తట్టుకోలేక బాధితుడు లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ సూచన మేరకు బాధితుడు మొదటి విడతగా రూ.40 వేలను కాత్సంద్ర సమీపంలోని ఒక హోటల్ సిబ్బందికి శుక్రవారం రాత్రి ఇస్తూ ఉండగా లోకాయుక్త అధికారులు దాడి చేసి సిబ్బందిని పట్టుకున్నారు. వారిని విచారించగా, ఎస్ఐ చేతన్ సూచనల మేరకు డబ్బు అందుకున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం పోలీస్స్టేషన్లోనే చేతన్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారణకు తరలించారు. -
దంపతులు కలసిమెలసి జీవించాలి
హొసపేటె: కొత్తగా పెళ్లైన జంట ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిమెలసి జీవించాలి. తల్లిదండ్రులు, పెద్దలను కూడా గౌరవించాలని ప్రఖ్యాత కన్నడ సినీ నటి భారతి విష్ణువర్దన్ సూచించారు. తాలూకాలోని నందిపుర క్షేత్రానికి చెందిన గురుదొడ్డ బసవేశ్వర స్వామి రథోత్సవం, చరణంతేశ్వర స్వామి వర్ధంతిలో భాగంగా డాక్టర్ మహేశ్వర స్వామి నేతృత్వంలో శనివారం 16వ వార్షిక సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏదైనా పనికి బయలుదేరే ముందు తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదం కోరుకునే వారు కచ్చితంగా విజయం సాధిస్తారని తెలిపారు. కొత్తగా వివాహం చేసుకున్న వారందరికీ గురువు కృప ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నా భర్త డాక్టర్ విష్ణువర్దన్ జ్ఞాపకార్థం శ్రీ చరణంత రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని వెల్లడించారు. అనంతరం మరియమ్మనహళ్లి మల్లికార్జున స్వామి మాట్లాడుతూ.. నందిపుర మఠం చాలా సంవత్సరాలుగా సామరస్య వివాహాలు, ఉచిత ఆరోగ్య పరీక్ష సామరస్య వివాహాలు, ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాలు, అనేక ఇతర సామాజిక సేవలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కొట్టూరు సోమశంకర్ స్వామి, మల్లికార్జున స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
నిద్రలోనే అనంత లోకాలకు..
● నలుగురు వలస కూలీల మృత్యువాత ● హొసకోటె వద్ద విషాదం కృష్ణరాజపురం: గదిలో నిద్రించిన నలుగురు వలస కార్మికులు ఊపిరాడక తెల్లవారేసరికి మృత్యువాత పడ్డారు. బెంగళూరు సమీపంలోని హొసకోటె తాలూకాలోని ముత్సంద్ర గ్రామంలో జరిగింది. వివరాలు.. ఓ అద్దె ఇంట్లో నలుగురు అంతర్రాష్ట్ర కా ర్మికులు ఉన్నారు. జయంత్ షిండే (25), నీరేంద్రనాథ్ టైడ్ (24), డాక్టర్ టైడ్ (25) ధనంజయ్ టైడ్ (20) శుక్రవారం రాత్రి మామూలుగానే భోజనం చేసి నిద్రపోయారు. చలి ఎక్కువగా ఉందని కిటికీలు అన్నీ మూసేసుకున్నారు. శనివారం ఉదయం ఎంతసేపయినా గదిలో నుంచి ఎవరూ బయటకు రాలేదు. గ్యాసా.. మత్తు ప్రభావమా? దీంతో స్థానికులు కిటికీలు తెరిచి చూడగా విగతజీవులుగా పడి ఉన్నారు. ఇద్దరు నిద్రపోతున్నట్లు ఉండగా, మిగతా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. బెంగళూరు రూరల్ ఎస్పీ చంద్రకాంత్, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వంట గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఉంటుందని, దానిని పీల్చడం వల్ల మరణించి ఉంటారని అనుమానాలున్నాయి. లేదా మత్తు పదార్థాలను అధికంగా సేవించడం వల్ల చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మత్తు విక్రేతలకు 5 ఏళ్ల జైలు మైసూరు: ఇద్దరు మత్తు పదార్థాల విక్రేతలకు మైసూరు కోర్టు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 50 వేల చొప్పున జరిమానా విధించింది. మైసూరు ఉదయగిరి నివాసి ముదాసీర్ అహ్మద్ (37), రాజీవ్ నగర నివాసి మహ్మద్ ఇమ్రాన్ (38) దోషులు. గతంలో మత్తు పదార్థాలను అమ్ముతూ ఉదయగిరి పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో కేసు నమోదు చేసి 7వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది కారాగారవాసం అనుభవించాలని ఆదేశించారు. ప్రభుత్వ న్యాయవాది ఎన్బీ విజయలక్ష్మి వాదనలు వినిపించారు. మృగాడికి 20 ఏళ్ల జైలుభాగ్యనగర్ (బాగేపల్లి): బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకొని లైంగికంగా వేధించిన కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ ఇక్కడి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. బాగేపల్లి తాలూకా గొండిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ క్లీనర్గా పనిచేసేవాడు. 2022 మే 30న ఓ బాలికను కిడ్నాప్ చేసి తాళి కట్టి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి చేలూరు సీఐ రవికుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. అదే ఏడాది జూన్ 3న నిందితుడు లక్ష్మణ్ను అరెస్ట్ చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈకేసు కోర్టులో విచారణ సాగుతోంది. ముద్దాయి లక్ష్మణ్ నేరం నిరూపితం కావడంతో 20 ఏళ్ల జైలు, రూ.50వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి లతాకుమారి తీర్పు వెలువరించారు. ప్రభుత్వ న్యాయవాది లక్ష్మీనరసింహప్ప ప్రభుత్వం తరఫున వాదించారు. -
వైఎస్సార్సీపీ బెంగళూరు ఐటీ వింగ్కు కొత్త సారథి
సాక్షి బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ తలపల మండల కేంద్రం బి.కొత్తపల్లి చెందిన విజయ రాఘవరెడ్డిని వైఎస్సార్సీపీ బెంగళూరు ఐటీ వింగ్ అధ్యక్షుడిగా పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు పోశంరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయభాస్కర్ రెడ్డి నియమించారు. విజయరాఘవ రెడ్డి గత 15 ఏళ్లు నుంచి ఆంధ్రప్రదేశ్ నలుమూలల క్షేత్ర స్థాయిలో పార్టీ విధివిధానాలకు కట్టుబడి, క్రమశిక్షణ కలిగిన ఐటీ వింగ్ సభ్యుడిగా సేవలు అందించారు. నేతలకు ధన్యవాదాలు ఈ నియామక ఉత్తర్వులు రావడానికి కృషి చేసిన జోనల్ ఇన్చార్జ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విజయరాఘవ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉషాశ్రీ చరణ్, కదిరి సమన్వయకర్త మక్బూల్, పీఏసీ కోర్డినేటర్ వజ్రభాస్కర్ రెడ్డి, ఐటీ వింగ్ అధ్యక్షుడు పోశంరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి, మండల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, బెంగళూరు ఐటీ వింగ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు శక్తివంతంగా కృషి చేస్తూ 2029 ఎన్నికల్లో జన నాయకుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి చేయడానికి ఐటీ వింగ్ ద్వారా ఒక శక్తివంతమైన సైన్యంగా పని చేస్తామని విజయ రాఘవరెడ్డి తెలిపారు. ఏపీ ఐటీ వింగ్ ఉపాధ్యక్షుడిగా కుమార్ సాక్షి బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ఉపాధ్యక్షుడిగా ఎ.కుమారస్వామి రెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కుమార్ నియామకం జరిగింది. ఎన్నో ఏళ్లుగా వైఎస్సార్సీపీ పార్టీ గెలుపు కోసం ఎంతో తీవ్రంగా శ్రమిస్తూ తన సేవలను అందించారు. తనపై నమ్మకం ఉంచి ఐటీ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్ష హోదా కల్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎంపీ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, రాష్ట్ర ఐటీ వింగ్ అధ్యక్షుడు పోశంరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు, బెంగళూరు ఐటీ వింగ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. విజయ రాఘవరెడ్డి నియామకం -
ఆ గ్రామంలో పేలుళ్ల బెడద
దొడ్డబళ్లాపురం: బీదర్ జిల్లాలో హుమనాబాద్ తాలూకా మోళకేర గ్రామంలో పేలుడు జరిగి 6మంది గాయపడ్డారు. గ్రామంలోని మారయ్య దేవాలయం వీధిలో రోడ్డు పక్కన ఈ పేలుడు సంభవించింది. ఎలాంటి పేలుడు పదార్థం అనేది తెలియాల్సి ఉంది. ఆ సమయంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులతో కలిసి ఆరుమంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. హుమనాబాద్ పోలీసులు పరిశీలించి పేలుడు పదార్థాల అవశేషాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. దర్యాప్తు ప్రారంభించారు. 6 నెలల్లో 5 సార్లు గత 6 నెలల వ్యవధిలో 5 సార్లు గ్రామంలో చిన్నపాటి పేలుళ్లు జరగడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎవరు ఈ పేలుళ్లకు పాల్పడుతున్నారో గుర్తించి పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పాఠశాలలో విస్ఫోటం దొడ్డబళ్లాపురం: ప్రభుత్వ పాఠశాలలో పేలుడు సంభవించి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డ సంఘటన బెంగళూరు రూరల్ దేవనహళ్లి తాలూకా విజయపుర పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో జరిగింది. 7వ తరగతి బాలుడు బయటి నుంచి కార్బన్ కెమికల్ డబ్బాను తీసుకువచ్చాడు. పాఠశాలలోని బాత్రూంలో జగ్గులో నీరు తీసుకుని కెమికల్తో ప్రయోగం చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పెద్దగా పేలుడు జరిగి అతడు గాయపడ్డాడు. అతన్ని దేవనహళ్లి ఆస్పత్రికి తరలించారు. విజయపుర పట్టణ పోలీసులు పాఠశాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. విద్యార్థులు ఏం చేస్తున్నారనేది ఉపాధ్యాయులు పట్టించుకోకవడంతో ఇలాంటివి జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. 6 మందికి గాయాలు -
రహదారి ప్రమాదాల నియంత్రణపై జాతా
రాయచూరు రూరల్: రహదారి నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని జిల్లా అదనపు ప్రధాన న్యాయమూర్తి స్వాతిక్ తెలిపారు. శనివారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో జిల్లా పాలన యంత్రాంగం, జాతీయ రహదారి అభివృద్ధి మండళి, రాయచూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలను నడిపే సమయంలో అప్రమత్తగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. సైబర్ నేరాలపై యువకులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని పేర్కొన్నారు. అనంతరం సుమారు 500 మంది విద్యార్థులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారి నితీష్, నగర సభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో, భావనేష్ కుమార్ గుప్తా, డీఎస్పీ శాంతవీర్, ఎస్ఐలు ఈరేష్ నాయక్, బసవరాజ్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధం
హొసపేటె: తాలూకాలోని మలపనగుడి తండాలో శనివారం ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లక్ష్మణ్ నాయక్కు చెందిన గుడిసె పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే గుడిసెలో ఉన్న టీవీ, సోఫా, వార్డ్రోబ్లోని బట్టలు, పిల్లల వెండి బ్రాస్లెట్లు, గొలుసులు, 20 గ్రాముల బంగారం, పిల్లల పుస్తకాలు, ఒక ద్విచక్ర వాహనంతో సహా ఇంట్లోని వస్తువులన్నీ మంటల్లో కాలిపోయాయి. లక్ష్మణ్ నాయక్, తులసీ బాయి దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. స్థానికులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని విజయనగరం జిల్లా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి తగిన సహాయం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
రైతు కుటుంబంపై చిరుత దాడి
మైసూరు: బైక్ పై పొలానికి వెళ్తున్న రైతు దంపతులు, చిన్నారిపై చిరుతపులి దాడి చేయడంతో గాయపడ్డారు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని చుంచనహళ్ళి గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. రైతు నంజువాడస్వామి, భార్య, చిన్నారి కొడుకుతో కలిసి కోననూర్ రోడ్డులో బైక్ పై వెళ్తుండగా ఓ చిరుతపులి ఆకస్మికంగా వారి మీదకు లంఘించడంతో అందరూ కిందపడిపోయారు. వారిని పంజాలతో రక్కి కరిచింది, బాధితులు గట్టిగా కేకలు వేయడంతో పరారైంది. వారికి తల, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు చూసి తగదూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి , అక్కడి నుంచి మైసూరులోని పెద్దాసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో తరచూ చిరుతలు సంచరిస్తూ ఉన్నాయని, పట్టుకోవాలని కోరినా అటవీ సిబ్బంది పట్టించుకోవడం లేదని పరిసర గ్రామాల ప్రజలు తెలిపారు. చిరుత బందీ చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని బరగి గ్రామంలో చాలా రోజులుగా గ్రామస్తులను సతాయిస్తున్న చిరుతను అటవీ సిబ్బంది బంధించారు. ఊరిబయట మేతకు వెళ్లే పశువులపై దాడులు చేస్తూ చంపి భక్షిస్తోంది. ఓంకార్ అటవీ రేంజ్ సిబ్బంది గాలింపు జరిపి చిరుతను గుర్తించారు. షూటర్ వసీం మీర్జా ద్వారా మత్తు మందును కొట్టి చిరుతను పట్టుకున్నారు. చిరుత వీపు మీద చిన్న గాయం ఉండడంతో చికిత్స కోసం బన్నేరుఘట్ట జూపార్క్ కి తరలించారు. దంపతులు, పిల్లాడికి గాయాలు మైసూరు జిల్లాలో ఘటన -
భక్తుల ఇలవేల్పు కోట మల్లేశ్వరుడు
సాక్షి బళ్లారి: నగరంలోని కోట ప్రాంతంలో వెలసిన కోట మల్లేశ్వర స్వామి కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రతీతి. మహిమాన్విత ఆలయంగా పేరొందిన కోట మల్లేశ్వర స్వామి జాతర, రథోత్సవం అంటే బళ్లారి జిల్లాలోనే కాకుండా చట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకుని ఆరాధిస్తారు. కోట మల్లేశ్వర స్వామి ఆలయం, శివుడి విగ్రహం స్వయంభూవుగా వెలసినట్లు పురాణాలు చెబుతాయి. అలాంటి శివలింగం దర్శనం చేసుకుంటే సాక్షాత్తు పరమశివుడి దర్శనం లభించినంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయ చరిత్ర ఘనమైనదినే చెప్పుకోవచ్చు. ఏటా మాఘమాసం పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కోట మల్లేశ్వర స్వామి రథోత్సవాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రథోత్సవం నేపథ్యంలో ఆలయంలో రెండు రోజుల నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు, కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయం కోటలో ఉండగా.. రథోత్సవం తేరువీధిలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తేరు వీధిలో రథోత్సవానికి ప్రత్యేక పూజల అనంతరం పూలతో అలంకరించారు. ఆదివారం ఉదయం మడితేరు, సాయంత్రం మహారథోత్సవం నిర్వహిస్తారు. దాదాపు లక్ష మందికి పైగా జనం పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదీ ఆలయ చరిత్ర.. కోట మల్లేశ్వర స్వామి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. బళ్లారి తాలూకా హొన్నకోళూరు గ్రామంలోని మల్లయ్య అనే శివ భక్తుడు రోజూ శివపూజ చేయకుండా ఎలాంటి ఆహారం, నీరు సేవించే వాడు కాదు. ఒక రోజు మల్లయ్య తన భావ భరమణ్ణతో కలసి బళ్లారికి వ్యాపారానికి వచ్చాడు. అయితే ఆ రోజు బళ్లారిలోనే ఉండాల్సి వచ్చింది. శివలింగం లేకపోవడంతో దైనందిన కార్యక్రమాలు చేసుకునేందుకు ఇబ్బందులు తలెత్తాయి. వ్యాపారం చేసుకునే మల్లయ్య సేరును శివుడిగా భావించి పూజలు చేశాడు. దీన్ని చూసిన భరమణ్ణ ఇది శివలింగం కాదు.. సేరుకు పూజలు చేయడం ఏమిటని అపహాస్యం చేశాడు. అయితే మల్లయ్య సేరు కాదు.. ఇది సాక్షత్తు శివుడు అని చెప్పాడు. అనుమానం ఉంటే పరీక్షించు అన్నాడు. సేరును తీయడానికి భరమణ్ణ ప్రయత్నించగా అక్కడ శివలింగం ఏర్పడింది. ప్రకాశవంతమైన శివలింగం, నందీశ్వరుడు ఉద్భవించాయి. సేరు ఆకారంలో ఉండే శివుడు శివలింగ రూపంలో అవతరించడంతో మల్లయ్య పూజించాడు. అక్కడ ఉద్భవించిన శివలింగం కాలక్రమేణ కోట మల్లేశ్వర స్వామిగా రూపాంతారం చెందాడు. పురాతన కాలం నుంచి కోట మల్లేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవం, రథోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయంలో నిర్మించిన గోపురంకోట మల్లేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం కోట ప్రాంతంలో స్వయంభూవుగా వెలసిన శివుడి విగ్రహం నేడు రథోత్సవం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ నిర్వాహకులు లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం -
మద్యానికి బదులు మంచి నీరు ఇవ్వండి
రాయచూరు రూరల్: జిల్లాలో మద్యానికి బదులు మంచి నీరు ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ సంచాలకుడు నిరుపాది డిమాండ్ చేశారు. శనివారం సింధనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. పోలీస్ యంత్రాంగం పట్టించుకోకుండా మౌనం వహించడం తగదన్నారు. గ్రామీణ భాగంలో యువకులు, విద్యార్థులు, రైతులు, కూలీలు, కార్మికులు మద్యానికి బానిసలుగా మారుతున్నారని తెలిపారు. మద్యం కోసం అప్పుల పాలవుతున్నారని ఆరోపించారు. అక్రమ మద్యం అరికట్టాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విరుపమ్మ, లక్ష్మి, బసవరాజ్, విశ్వనాథ్, కనకప్ప, మౌనేష, అయ్యప్ప, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లాలో సీఎం సిద్దు పర్యటనరాయచూరు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం రాయచూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల దేవదుర్గ తాలుకా తింథిణి వద్ద కాగినెల పీఠాధిపతి, హలు మతం గురువు సిద్దరామ ఆనందపురి మహస్వామి గుండెపోటుతో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. పుణ్యాస్మరణ కార్యక్రమంలో భాగంగా మంత్రివర్గ సహచరులతో పాల్గొంటారని అధికారులు తెలిపారు. చిరుత దాడిలో గొర్రె పిల్లల మృతిహొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా నాగలాపుర తండా సమీపంలో చిరుత పులి దాడిలో 36 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. గొల్లరహట్టికి చెందిన గరగ మల్లప్ప అన్నోరి సమీపంలోని బయలకుండి పొలంలో గొర్రెలను మేపుతున్నప్పుడు చిరుత దాడి చేసింది. 36 గొర్రెలు మృతి చెందడంతో రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు చెబుతున్నాడు. చిరుత సంచరించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దేవలాపూర్ గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో సంచరిస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు బంధించాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి పథకం పేరుమార్పు సరికాదురాయచూరు రూరల్: దేశానికి అహింసా మార్గంలో మహాత్మా గాంధీ స్వాతంత్య్రం తెచ్చి పెట్టారు. అలాంటి మహానేత పేరును మనరేగలో తొలగించి వికసిత భారత మిషన్ రోజ్గార్గా మార్చడం సరికాదని సీపీఎం (ఎం) నాయకులు ఆరోపించారు. శనివారం టిప్పు సుల్తాన ఉద్యానవనంలో ఆందోళన చేపట్టారు. సంచాలకుడు వీరేష్ మాట్లాడుతూ.. పేరు మార్పులో ఆర్ఎస్ఎస్ చేతివాటం ఉందని తెలిపారు. మనరేగ పథకంలో గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో అధికారం ఉండేదన్నారు. నేడు కేంద్రం చెప్పిన చోట పనులు చేపట్టాల్సి వస్తుందన్నారు. కూలీలు, కార్మికులకు జీవనోపాధి కరువైందన్నారు. వెంటనే ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పద్మ, శ్రీధర్, శరణ బసవ, హన్మంతు, సత్యప్ప, వరలక్ష్మి, రంగమ్మ, సరోజమ్మ, మహాదేవి, సూజాత పాల్గొన్నారు. మృతదేహాల వెలికితీత సాక్షి బళ్లారి: ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కొట్టూరు పట్టణంలో తల్లిదండ్రులు భీమరాజ్ (50), జయలక్ష్మి (45) సోదరిని అమృత (17)ను దారుణంగా అక్షయ్ కుమార్ హత్య చేసిన విషయం తెలిసిందే. మృతదేహాలను ఇంట్లోనే పాతిపెట్టి.. ఏమీ తెలియని వాడిలా కుటుంబ సభ్యులు కనిపించడం లేదంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్షయ్ కుమార్ ప్రవర్తనలో అనుమానం రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. తల్లిదండ్రులు, సోదరిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. బెంగళూరు పోలీసులు నిందితుడు అక్షయ్కుమార్ను కొట్టూరుకు తీసుకొచ్చారు. హత్య చేసిన ప్రాంతం, మృతదేహాలను పూడ్చిన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక కొట్టూరు పోలీసులు, జిల్లా ఎస్పీ సమక్షంలో ఇంట్లో పాతిపెట్టిన మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. -
రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు
సాక్షి, బళ్లారి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ముందు నుంచి పేర్లు మారుస్తున్నారు. బీజేపీ హయాంలోనే మార్చలేదని బీజేపీ రైతు మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఏ.ఎస్.పాటిల్ నడిహళ్లి పేర్కొన్నారు. శనివారం ఆయన నగరంలోని మోకా రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై విమర్శలు చేస్తోందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని వికసిత్ భారత రోజ్గార్ అజివిక మిషన్గా (వీబీ జీ రామ్జీ) పేరు మార్చడంపై రాద్దాంతం చేయడంలో అర్థం లేదన్నారు. ఈ పథకాన్ని పారదర్శంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి సమూల మార్పులు, చేర్పులు చేశారన్నారు. మహాత్మా గాంధీజీ పేరును మార్చి, రామ్ పేరు చేర్చితే గాంధీజీని కించపరిచనట్లు కాదన్నారు.మహాత్మా గాంధీ, అంబేడ్కర్ పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసేందుకు బీజేపీ ఎన్నో పథకాలు అమలు చేసిందన్నారు. స్వచ్ఛ భారత్కు గాంధీజీ పేరు పెట్టినట్లు గుర్తు చేశారు. గతంలో పథకంలో ఎన్నో అవినీతి, అక్రమాలు జరిగేవన్నారు. పెద్ద పెద్ద బడా బాబులు జాబ్కార్డులు తీసుకుని సొమ్ము చేసుకునే వారన్నారు. ప్రస్తుతం అన్ని డిజిటల్ చేయడంతో పనులు పారదర్శంగా సోదాలు, పరిశీలనలు జరుగుతున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అనిల్ మోకాలు మాట్లాడుతూ.. రిపబ్లిక్ దినోత్సవం రోజున అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాతనే కార్యక్రమం జరుపుకున్నామన్నారు. అయితే సోషల్ మీడియాలో అనవసరంగా కొందరు లేనిపోని విధంగా చిత్రీకరించారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కే.ఎస్ దివాకర్, ఐనాథరెడ్డి, విరుపాక్షిగౌడ, హెచ్.హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. సిడి జాతర ఉత్సవం
మండ్య: మండ్య జిల్లా మలవళ్లి పట్టణంలో పట్టాలదమ్మ– దండిన మారెమ్మ శక్తి దేవతల సిడి జాతర మహోత్సవం శనివారం నేత్రపర్వంగా ముగిసింది. జాతర మహోత్సవం శుక్రవారం రాత్రి సంప్రదాయబద్ధ పూజలతో ప్రారంభమైంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షుడు, ఎమ్మెల్యే పి.ఎం. నరేంద్రస్వామి హాజరై పూజలు చేశారు. వర్షాలు సకాలంలో కురవాలని, దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించాలని ఈ ఉత్సవం వందేళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు అమ్మవార్ల ఉత్సవమూర్తుల సిడి రాణా ఊరేగింపు ప్రారంభమైంది. వేల సంఖ్యలో భక్తుల సమక్షంలో ఉదయం 9గంటలకు సుల్తాన్ రోడ్డు గుండా తిరిగి ఆలయం వద్దకు చేరుకుంది. నూతన వధూవరులు పండ్లు, కూరగాయలు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం ముందు అగ్ని గుండం వెలిగించి భక్తులు నిప్పుల్లో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. ఐజీపీ నంజుడస్వామి, జిల్లా ఎస్పీ శోభారాణి ఘాట్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
విద్యార్థులకు సంస్కారం ప్రధానం
రాయచూరు రూరల్: విద్యార్థులకు సంస్కారం ప్రధానం. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి నుంచే సంస్కారం నేర్పించాలని రిటైర్డ్ జిల్లా విద్యాశాఖ అధికారిణి ఇందిర పేర్కొన్నారు. శనివారం నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కన్నడ పాఠశాలల్లో అ నుంచి ఔ వరకు, ఆంగ్లంలో ఏ నుంచి జెడ్ వరకు ఉన్న విద్యార్థుల మనోబలాన్ని పెంచి ఉన్నత ఫలితాలు సాధించాలన్నారు. జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. సంస్కృతి సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హిమబిందు, శీతల్, అనిత, రాజేష్, ఇందిర తదితరులు పాల్గొన్నారు.


