breaking news
Karnataka News
-
అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చని కాంగ్రెస్
కేజీఎఫ్ : దేశంలో 75 సంవత్సరాల పాటు పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చలేదని, అలాంటి పార్టీకి అంబేడ్కర్ పేరును ప్రస్తావించే నైతిక హక్కు లేదని కేంద్ర మాజీ మంత్రి ఏ.నారాయణస్వామి అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని మున్సిపల్ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన భీమనడె కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దళితుల సమస్యలను విస్మరించిందన్నారు. రాష్ట్రంలో ఎస్టీ సముదాయానికి చెందిన రూ.198 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని, దీనిని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారన్నారు. మైసూరు మాజీ ఎంపీ ప్రతాప్ సింహ మాట్లాడుతూ అంబేడ్కర్ ముంబై నుంచి పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓడించిందన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే అందరికీ రక్షణ కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మునిస్వామి, కేజీఎఫ్ మాజీ ఎమ్మెల్యే వై.సంపంగి, మాలూరు మాజీ ఎమ్మెల్యే మంజునాథ్గౌడ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఓం శక్తి చలపతి పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి -
చెన్నబసవ స్వామీజీ మృతి
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లా బసవనబాగేవాడి తాలూకా ఇంగళేశ్వర గ్రామానికి చెందిన వచన శిలామంటపను స్థాపించిన చెన్నబసవ స్వామీజీ (94) మృతి చెందారు. గురువారం స్వామీజీ మృతి చెందారని, శుక్రవారం స్వామీజీ అంత్యక్రియలు నిర్వహిస్తారని, ఇంగళేశ్వర గ్రామంలో పార్థివదేహాన్ని ఊరేగించిన అనంతరం క్రియా సమాధిని చేస్తారని స్థానికులు వెల్లడించారు. స్వామీజీ మృతి చెందడంపై విజయపుర జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు ఆయన ఆధ్యాత్మిక మార్గంలో నడిచిన తీరును కొనియాడుతూ సంతాపం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థి ఆత్మహత్య సాక్షి,బళ్లారి: గదగ్ జిల్లా ముండరగి పట్టణంలోని మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉంటూ బీఏఎంఎస్ విద్యనభస్యసిస్తున్న ఈశ్వర్ (21) అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హాస్టల్లో ఉరి వేసుకుని మృతి చెందారని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ హాస్టల్ సిబ్బంది, యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో సంవత్సరంలో బీఏఎంఎస్ కోర్సు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తమ కుమారుడు మృతి చెందడంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నీటికుంటలో ఇద్దరు యువకుల జలసమాధిసాక్షి,బళ్లారి: ప్రమాదశాత్తు నీటికుంట(ఫారంపాండ్)లో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లా బీ.ఆర్. గ్రామ సమీపంలో గొర్రెలను మేపడానికి వెళ్లిన మారుతీ(19), విశ్వనాథ్(23) అనే ఇద్దరు యువకులు నీటికుంటలో గొర్రెలను శుభ్రం చేయాలని వాటిని పట్టుకుని దిగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై చిత్రదుర్గ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేంద్రమంత్రిని నిందిస్తారా?రాయచూరు రూరల్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏకవచనంతో నిందించడం సరికాదని రాయచూరు జిల్లా మహిళా బీజేపీ అధ్యక్షురాలు, నగరసభ మాజీ అధ్యక్షురాలు కుడుగోలు లలిత ఆరోపించారు. టిప్పుసుల్తాన్ ఉద్యాన వనం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. సిద్దరామయ్యకు భారతీయ సంప్రదాయాలు, మహిళలపై గౌరవం లేదన్నారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన సిద్దు మహిళలను అగౌరవ పరిచే విధంగా వ్యాఖ్యానించడం తగదన్నారు. గ్రామీణ భాషలో సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలను విమర్శించే హక్కు సిద్దరామయ్యకు ఉందా? అని ప్రశ్నించారు. సిద్దరామయ్యపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. మానవహక్కులతో శాంతియుత జీవనంశ్రీనివాసపురం: శాంతియుత జీవనంలో మానవ హక్కుల పాత్ర కీలకమని డీఎస్పీ మనీషా అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన విశ్వ మానవహక్కుల దినోత్సవంలో డీఎస్పీ పాల్గొని మాట్లాడారు. మానవ హక్కులకు భంగం కలగకుండా జాగ్రత్త వహించాలన్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. జాతీయ మానవ హక్కుల జాగృతి, అవినీతి నిర్మూలన సంస్థ జనసేవా ఫౌండేషన్ సంస్థాపక అధ్యక్షుడు శివకుమారగౌడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు హక్కులు ఉంటాయన్నారు. తహసీల్దార్ సుధీంద్ర, జిల్లా న్యాయ సేవల ప్రాధికార ఉప ప్రధాన అధికారి సతీష్ పాల్గొన్నారు. కంటి ఆస్పత్రి ప్రారంభంకృష్ణరాజపురం: కృష్ణరాజపురంలోని గృహ నిర్మాణ సహకార సంఘం నూతన భవనంలో ఏర్పాటు చేసిన నారాయణ కంటి ఆస్పత్రిని ఎమ్మెల్యే బీఏ బసవరాజు ప్రారంభించి లోకార్పణం చేశారు. ఆరోగ్య బీమా, యశస్విని కార్డు, వివిధ బీమాల ప్రాయోజకత్వంలో రోగులకు ఈ ఆస్పత్రి ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్టు హోసూరు: గంజాయి విక్రయిస్తూ ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి పోలీసులకు పట్టుబడ్డారు. కడలూరు జిల్లాకు చెందిన రోహిత్(19) స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. హోసూరు పారిశ్రామిక వాడ జూజువాడి చెక్పోస్టు వద్ద మద్య నిషేధ శాఖ పోలీసులు గస్తీ నిర్వహించగా.. రోహిత్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పోలీసులు అతడిని అదుపు లోకి తీసుకొని విచారించగా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసింది. అతడి వద్ద 510 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.మారుతీ(ఫైల్) విశ్వనాథ్(ఫైల్) -
వికటించిన రాత్రి భోజనం
రాయచూరు రూరల్: కలుషిత ఆహారం తిని 33 మంది విద్యార్థుఽలు అస్వస్థతకు గురైన ఘటన బుధవారం రాత్రి యాదగిరి జిల్లా గురుమఠకల్లో చోటు చేసుకుంది. గురుమఠకల్లోని వెనుక బడిన వర్గాల బాలికల సంక్షేమ హాస్టల్లో రాత్రి విద్యార్థులు చికెన్, చపాతి, అన్నం తిన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి భోజనం చేసిన విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వీరిలో ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో యాదగిరి జిల్లాస్పత్రిలో చేర్పించారు. హాస్టల్లో మొత్తం 150 మంది విద్యార్థినులున్నారు. ఘటన విషయం తెలుసుకున్న యాదగిరి జిల్లాధికారి హర్షల్ బోయర్, జెడ్పీ సీఈఓ లవీశ్ ఒడెయర్, ఎస్పీ పృథ్వీశంకర్, ఇతర అధికారులు చేరుకుని పరిశీలించారు. హాస్టల్లో కలుషితమైన ఆహారం 33 మంది విద్యార్థుఽలకు అస్వస్థత యాదగిరి జిల్లా గురుమఠకల్లో ఘటన -
మహిళలపై దౌర్జన్యాలు అరికట్టాలి
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. గురువారం లింగసూగూరు తాలూకా హట్టి పైభవనం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు రమేష్ మాట్లాడారు. నేడు మహిళలు, పిల్లలపై వేధింపులు, చిత్రహింసలు అధికమయ్యాయన్నారు. అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, లైంగిక దౌర్జన్యాలు, వరకట్నం, కుటుంబ కలహాలు, భ్రూణ హత్యలు, లింగ తారతమ్యాలు, కుల, మత, వర్గ వైష్యమాలు పెరిగాయన్నారు. మహిళల హక్కుల ఉల్లంఘన, బేటీ పడావో, బేటీ బచావో పద్ధతి ప్రకటనలకే పరిమితమైందన్నారు. వీటన్నింటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. సమాజాభివృద్ధికి సహకరించాలి రాయచూరు రూరల్: మాదార సమాజం అభివృద్ధికి అందరూ సహకరించాలని మాదార చెన్నయ్య సమాజం కార్యాధ్యక్షుడు రవీంద్ర జాలదార్ పేర్కొన్నారు. ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మాదార చెన్నయ్య సేవా సమితి నూతన పదాధికారుల ప్రమాణ వచన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి ఆయన మాట్లాడారు. సమాజంలో కింది స్థాయిలో నివాసముంటూ కష్టపడి పని చేసే మనస్తత్వం కలవారన్నారు. నేటి పోటీ తత్వయుగంలో మన పిల్లలను సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా వారిని అభివృద్ధిలో ముందుకు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వీరేష్, భీమరాయ, మంచాల భీమన్న, భీమరాజ్, మౌనేష్, పరశప్ప, రమేష్లున్నారు. గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణంరాయచూరు రూరల్: గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన రాయచూరు తాలూకాలో చోటు చేసుకుంది. బిచ్చాలి గ్రామ పంచాయతీ పరిధిలోని బీ.యడ్లాపూర్కు చెందిన సంజీవ్(35) అనే వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ప్రతి రోజు పొలానికి రైలు పట్టాలు దాటి వెళుతుంటాడు. రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా పట్టాలు దాటుతున్న సంజీవ్ను గూడ్స్ రైలు ఢీకొంది. వారిస్తున్నా వినకుండా సంజీవ్ అలాగే పట్టాలు దాటాడని సమాచారం. పంచనామా కోసం మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత తగదురాయచూరు రూరల్ : రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ పాఠశాలలోకి విలీనం చేయడానికి ముందుకొచ్చిన సర్కార్ తీరుపై ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయబోమని ఆదేశాలు జారీ చేయాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలలను మూసేయడం లేదని చెప్పిన సమాధానానికి లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేయాలని ఒత్తిడి చేశారు. గంగమ్మకు మండల పూజ మాలూరు: తాలూకాలోని మాస్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ దేవి దేవాలయంలో గురువారం విమానగోపుర, కుంభాభిషేకం కార్యక్రమాలు, 48వ రోజు మండల పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూల అలంకరణ, ఆభరణాల అలంకరణ చేసి పూజలు నిర్వహించి మహామంగళారతి ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాద పంపిణీ, అన్న సంతర్పణ జరిగింది. -
పడకలు జాస్తి.. వసతులు నాస్తి
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వాస్పత్రుల్లో ఒకటిగా పేరుగాంచిన, ఉత్తర కర్ణాటకలో ప్రముఖంగా రోగులకు వరంగా మారిన బీఎంసీఆర్సీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత రోగులకు శాపంగా మారింది. దాదాపు 50 సంవత్సరాల క్రితం విమ్స్ ఆస్పత్రిగా, ప్రారంభంలో 100 పడకల ఆస్పత్రిగా అవతరించిన ఈ విమ్స్ ఆస్పత్రిని క్రమేణా 1500 పడకల ఆస్పత్రిగా ఆప్గ్రేడ్ చేయడంతో పాటు ఆస్పత్రి పేరును కూడా బళ్లారి మెడికల్ కాలేజీ అండ్ రిసెర్చ్ సెంటర్(బీఎంసీఆర్సీ)గా రూపాంతరం చేస్తూ, ఇక్కడ పని చేసే వైద్యులు, సిబ్బందిని పక్కనే నూతనంగా నిర్మించిన ట్రామా కేర్ ఆస్పత్రికి కూడా ఇక్కడ వైద్యులు, సిబ్బందిని నియమించి వైద్య సేవలు అందిస్తున్నారు. ట్రామా కేర్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఎముకలకు సంబంధించిన చికిత్సలు, కాళ్లు విరిగినా, మోకాళ్లకు సంబంధించిన వ్యాధులతో పాటు అన్ని రకాల చికిత్సలకు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఇటీవల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించారు. తగినంత మంది వైద్య సిబ్బంది లేరు బెంగళూరు తరహాలో బళ్లారిలో కూడా వైద్య సేవలు అందించేందుకు వీలుగా రోగులకు అన్ని రకాల చికిత్సలు, పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించారు కాని అక్కడ తగినంత మందిని వైద్యులను నియమించలేదు. బీఎంసీఆర్సీ, ట్రామా కేర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అనే మూడు ప్రధానమైన ఆస్పత్రుల్లో వసతుల మాట అటుంచితే కనీసం వైద్యులు, సిబ్బంది కొరత కూడా పెద్ద సమస్యగా మారింది. బీఎంసీఆర్సీలో వైద్య సేవల కోసం ఒక్క బళ్లారి జిల్లాకు చెందిన రోగులు మాత్రమే వస్తున్నారనుకుంటే పొరపాటు. ఇక్కడికి బళ్లారి జిల్లాతో పాటు చిత్రదుర్గ, విజయనగర, కొప్పళ, రాయచూరు తదితర జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని సరిహద్దు తాలూకాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చికిత్స చేయించుకుని వెళుతుంటారు. ప్రతి రోజు సుమారు 500 మందికి పైగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చికిత్సలు చేయించుకుని వెళుతుండటం సర్వసాధారణంగా మారింది. బీఎంసీఆర్సీలో వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత అందని మెరుగైన వైద్యం.. ఫలితంగా రోగులకు శాపం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిన వైనం కొరత ఉందని అమాత్యులే సెలవిచ్చారు ఆస్పత్రిలో 288 వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, 858 వివిధ విభాగాలకు చెందిన సిబ్బందితో పాటు 23 మంది దంత వైద్యుల కొరత ఉందని స్వయంగా అసెంబ్లీలో విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్ అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ చెప్పడం గమనార్హం. ఇంత పెద్ద సంఖ్యలో వైద్యుల కొరత వేధిస్తున్నప్పటికీ మాటల వరకే పరిమితం అవుతున్నారు కాని ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించడంలో తగిన చొరవ తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఉత్తర కర్ణాటకు చెందిన వ్యక్తే సంబంధిత వైద్య, ఆరోగ్య శాఖకు మంత్రిగా ఉన్నప్పటికీ తూతూమంత్రంగా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండడంతో పాటు సమస్యలపై చర్చిస్తారే కాని వాటిని ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపై దృష్టి పెట్టకపోవడంతో బీఎంసీఆర్సీ ఆస్పత్రిలో ఇతర సమస్యలు కుప్పలు, తెప్పలుగా ఉన్నప్పటికీ కనీసం వైద్యులు, సిబ్బంది కొరతను కూడా తీర్చకపోతే రోగులకు ఎలా వైద్యం అందిస్తారు? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. సర్కార్కు చీమ కుట్టినట్లయినా లేదు ఇంతటి ఘనమైన ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నా పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడంతో పాటు అసెంబ్లీలో పలుమార్లు పాలక, ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రశ్నల వర్షం కురిపించి, సమస్యలపై గళం విప్పినప్పటికీ సంబంధింత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తగిన విధంగా స్పందించకపోవడంతో రోగులకు సరైన విధంగా వైద్యం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. బీఎంసీఆర్సీ ఆస్పత్రిలో ఏటేటా పడకల సంఖ్య పెంచుతుండగా వైద్యులు తగినంత మంది పని చేస్తున్నారా? లేదా? అన్న విషయంపై కూడా ఇక్కడ పని చేసే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీఎంసీఆర్సీలో ఆర్థో, న్యూరో, హార్ట్, జనరల్ సర్జన్, చిన్న పిల్లల వైద్యులు, కంటి డాక్టర్లు, గైనకాలజిస్టులు తదితర విభాగాల్లో హెచ్ఓడీలతో పాటు దాదాపు 450 మంది వైద్యులను నియమించాల్సి ఉండగా, ప్రస్తుతం 162 మంది వైద్యులే పని చేస్తున్నారు. 1072 మంది ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉండగా, కేవలం 213 మందిని మాత్రమే నియమించుకుని వారితోనే సేవలు చేస్తున్నారు. -
కబ్జాదారుల భరతం పట్టాలని ధర్నా
కోలారు: కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ సమతా సైనిక దళ కార్యకర్తలు గురువారం నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కేజీఎఫ్ తాలూకా బేతమంగల పబ్లిక్ శౌచాలయం స్థలాన్ని కొంతమంది ఆక్రమించి గదిని నిర్మించి బాడుగకు ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. క్యాసంబళ్లి ఫిర్కా కాజిమిట్టహళ్లి ప్రభుత్వ గోమాళం భూమి 15 ఎకరాలలో అక్రమంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. దీనిపై దాఖలాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ భరత్కు వినతి పత్రం సమర్పించారు. ప్రతిఘటనలో సమతా సైనికదళ పదాధికారులు భారతమ్మ, ముని వెంకటస్వామి, బాల సుబ్రమణి తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రాయచూరు రూరల్: రాయచూరు, కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు మౌనం దాల్చారు. ఈ జిల్లాల్లో తుంగభద్ర, కృష్ణా, భీమా నదులున్నాయి. జిల్లాలోని మాన్వి, రాయచూరు, దేవదుర్గ, యాదగిరి జిల్లా సురపుర, యాదగిరి తాలూకాలో ఆయా నదీ తీరంలోని ప్రాంతాల్లో రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జోళదడగి, కర్కిహళ్లి, పర్వతాపూర్లలో కాంట్రాక్టర్లు పీ.ఎల్.కాంబ్లె, పంచాక్షరి, శివప్ప బసప్ప, ఆనంద్ దొడ్డమని స్టాక్ యార్డులకు నది నుంచి ఇసుకను దొంగతనంగా తరలించి నిల్వ చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్త హనుమంతు ఆరోపించారు. పట్టపగలే నదిలో జేసీబీలు, పొక్లెయిన్ల ద్వారా గుంతలు పడేలా ఇసుకను తవ్వుతున్నారు. రాయల్టీని రెండు వాహనాలకు పొంది మిగిలిన వాహనాలకు లేకుండా వందల కొద్దీ టన్నుల మేర సరఫరా చేస్తున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు నేరుగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో రూ.కోట్లాది మేర కోత పడుతోంది. ఈ విషయంలో జిల్లాధికారి, ఎస్పీ, తహసీల్దార్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. శాసనసభ, లోక్సభ, జిల్లా పంచాయతీ సభ్యుల కుటుంబాలు ఇందులో కుమ్మక్కు కావడం వల్ల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణా సరఫరా వల్ల నదులు కనుమరుగు అవుతాయనే భయం ప్రజల్లో ఉంది. ఇటీవల దేవదుర్గ తాలూకా చప్పలికి గ్రామంలో ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులపై కాంట్రాక్టర్ దాడి చేశారు. ప్రభుత్వ రాబడికి భారీ ఎత్తున కోత నోరు మెదపని అధికారులు, పాలకులు -
మేకెదాటు ప్రాజెక్టును చేపట్టండి
చెరసాలల్లో రాచమర్యాదలా? శివాజీనగర: కావేరి నదిపై మేకెదాటు నీటి ప్రాజెక్టును నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీలు, పాదయాత్రలు చేసి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఆ పథకాన్ని చేపట్టాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. గురువారం బెళగావి సువర్ణసౌధ అసెంబ్లీలో మేకెదాటుపై చర్చ సాగింది. బీజేపీ ఎమ్మెల్యే అరవింద బెల్లద్ విధానసభలో మాట్లాడుతూ మేకెదాటు ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ ఓట్లు పొందింది. సుప్రీంకోర్టు తమిళనాడు రిట్ పిటిషన్ను కొట్టివేసింది, ఇకనైనా మేకెదాటు ప్రాజెక్ట్ను ప్రారంభించాలని కోరాఉ. డిప్యూటీసీఎం డీకే శివకుమార్ జవాబిస్తూ బెల్లద్ సీనియర్ నాయకుడు, నేను ఆయన తండ్రితో కలసి ఎమ్మెల్యేగా పనిచేశాను. మేకెదాటు ప్రాజెక్ట్ పై ఆరునెలల లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. మీ అందరినీ అత్యంత వినయంతో చేతులు జోడించి కోరుకొంటున్నా, మీరంతా కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పిస్తే మిమ్మల్ని పిలుచుకొని వెళ్లి ప్రాజెక్ట్కు భూమి పూజ చేస్తానని చేతులెత్తి మొక్కుతున్నాను అని చెప్పారు. ఇంత వినయమా? బీజేపీ సభ్యుడు వీ.సునీల్ కుమార్ స్పందిస్తూ ఇంత వినయ, విధేయతలతో అడుగుతున్నారు. ఇది నిజమైన డీ.కే.శివకుమార్ వారేనా? లేదా కొత్త రూపమా అని ప్రశ్నించారు. ఇంత వినయ, విధేయత ఎలా వచ్చిందని సునీల్కుమార్ అడిగారు. ఇమేజ్ కోసం కొన్ని సంస్థల సాయం తీసుకుంటారు, శివకుమార్ మెడలో టవల్ వేసుకోవటం కూడా ఇందులో భాగమేనా అని మరో ఎమ్మెల్యే సురేష్కుమార్ అడిగారు. సీఎం కావడం కోసమే ఈ వినయం అని ఎమ్మెల్యేలు చమత్కరించారు. కావేరి, మహదాయి, కృష్ణా, మేకెదాటు ప్రాజెక్టుల పనులు జరగాలంటే రూ. 1.5 లక్షల కోట్లు అవసరం, ఎక్కడి నుంచి తీసుకొస్తారని బెల్లద్ ప్రశ్నించారు. సీఎం గగనయాన ఖర్చు రూ.47 కోట్లు రెండున్నర ఏళ్లలో సీఎం సిద్దరామయ్య గగన విహారాలకు కోట్లాది రూపాయలు ఖర్చు అయ్యింది. 2023 నుంచి సీఎం సిద్దరామయ్య అధికారిక పర్యటనలకు హెలికాప్టర్, ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం రూ.47.38 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. విమాన ప్రయాణాలకు ఖర్చు అధికమైంది. విధానపరిషత్లో సభ్యుడు ఎన్.రవికుమార్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. సీఎం జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు హెలికాప్టర్, విమానాలనే ఉపయోగిస్తున్నారు. విధానసభలో బీజేపీ డిమాండ్ డీసీఎం శివ వినయ, విధేయుడని వ్యాఖ్యలు సర్కారు మొద్దునిద్ర పోతోంది పరిషత్లో బీజేపీ ఎమ్మెల్సీ సర్జి శివాజీనగర: బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో కొందరు ఖైదీలకు రాజాతిథ్య సదుపాయాలు లభించడంపై విధానపరిషత్లో రగడ జరిగింది. జీరో అవర్లో సభ్యుడు ధనంజయ్ సర్జి ప్రస్తావించారు. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న దర్శన్కు కూడా రాచమర్యాదలు లభించాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో సామాజిక మాధ్యమాల్లో నవ్వులపాలైంది. జైలు సమస్యల పరిష్కార కమిటీ నివేదిక ఇచ్చి ఏళ్లు గడిచినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. 2017లో అదే సెంట్రల్ జైలులో తమిళునాడుకు చెందిన రాజకీయ నాయకులకు వీఐపీ వసతులు సమకూర్చారు. 2022లో అనుమానిత ఉగ్రవాదులు, ఖైదీలు మొబైల్ఫోన్లు వినియోగించారు. ఈ స్కాముల్లో అధికారుల బదిలీ మినహాయిస్తే ఎలాంటి మార్పులు జరగలేదు అని ఎమ్మెల్సీ దుయ్యబట్టారు. ఐజీపీ డాక్టర్ చంద్రగుప్త నేతృత్వంలో కమిటీ సుదీర్ఘ అధ్యయనంతో 4 నెలల క్రితం ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు, కానీ సిఫార్సుల అమలు చేయలేదు అని సర్కారును విమర్శించారు. కమిటీలపై కమిటీలను నియమించటం మాని ఇప్పటికే ఇచ్చిన నివేదికలను అమలుపరచాలని సర్జి డిమాండ్ చేశారు. -
వధువుల కోసం మలబార్ కలెక్షన్
సాక్షి, బెంగళూరు: పెళ్లిలో వధువుకు అత్యంత ఇష్టమైన ఆభరణాలను వినూత్న డిజైన్లలో అందించేందుకు ప్రతిష్టాత్మక బంగారు, వజ్రాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిద్ధమైంది. 15వ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా సిరీస్ను మలబార్ ప్రారంభించింది. ప్రతి ఏడాది తరహాలోనే పెళ్లిళ్ల సీజన్కు కొత్త హంగులు అద్దడంతో పాటు కుటుంబాల్లో జరిగే వేడుకలకు సరికొత్త మెరుపులతో మెలుగు జిలుగులకు దోహదపడతాయని తెలిపింది. ఈ ప్రత్యేక 15వ సీజన్ సందర్భంగా తయారీ చార్జీలపై 30 శాతం రాయితీ, వజ్రాలపై 30 శాతం వరకు రాయితీని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు జనవరి 16 వరకు అందుబాటులో ఉంటాయి. సైబర్ నేరగాళ్ల వల.. విద్యార్థి ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: నగ్న ఫోటోలు వైరల్ చేస్తామని బెదిరించడంతో భయపడ్డ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలోని శాంతినగరలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన మోహన్ (25) మృతుడు. వివరాలు.. స్థానిక ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ రెండో ఏడాది చదువుతూ ఉండేవాడు. అయితే సైబర్ నేరగాళ్లు ఓ యువతి ద్వారా అతనికి వీడియో కాల్స్ చేస్తూ హనీ ట్రాప్లోకి లాగినట్లు సమాచారం. ఆమె తరచూ కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసేది. రూ.25 వేలు పంపినట్లు తెలిసింది. మరింత డబ్బు పంపాలని, లేదంటే న్యూడ్ కాల్స్ను వైరల్ చేస్తామని బెదిరించడంతో భయపడిపోయాడు. బుధవారం సాయంత్రం డెత్నోట్ రాసి ఉరివేసుకున్నాడు. డెత్నోట్లో మూడు మొబైల్ నంబర్లు ఉన్నాయి. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరో 60 ఇండిగో విమానాల క్యాన్సిల్ దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో గురువారంనాడు కూడా 60 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. కేఐఏ నుంచి బయలుదేరాల్సిన 28 విమానాలు, ఇక్కడకు రావాల్సిన 32 విమానాలు క్యాన్సిల్ కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బుధవారం 58 విమానాలు రద్దయ్యాయి. మాదప్పకు రూ.2.53 కోట్ల ఆర్జన మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలె మహదేశ్వర బెట్టలోని స్వామివారికి కనకవర్షం కొనసాగుతోంది. దేవస్థాన హుండీలను లెక్కించారు. ఈసారి 28 రోజుల్లో రూ.2.53 కోట్లు భక్తుల నుంచి కానుకల రూపంలో జమ అయ్యాయి. రూ.2.53 కోట్ల నగదు, 25 గ్రాముల బంగారం, 1,253 గ్రాముల వెండి సొత్తు హుండీలలో ఉన్నాయి. చలామణిలో లేని రూ.2 వేల నోట్లు 3, 16 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. ఆన్లైన్ హుండీ ద్వారా రూ.7 లక్షలు జమైంది. శాంత మల్లికార్జున స్వామి, అధికారులు రఘు, చంద్రశేఖర్, మరిస్వామి, గురుమల్లయ్య, పోలీసులు పాల్గొన్నారు. మాల్ నిర్మాణానికి రాజమాత బ్రేక్ మైసూరు: నగరంలోని వస్తు ప్రదర్శన ప్రాధికార ఆవరణలో యూనిటీ మాల్ నిర్మాణానికి వ్యతిరేకంగా మైసూరు రాజమాత ప్రమోదాదేవి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. 6.5 ఎకరాల్లో స్వదేశీ హస్త కళాకృతుల ఉత్పత్తుల విక్రయాల కోసం యూనిటీ మాల్ నిర్మాణానికి ఎంపీ యదువీర్ భూమిపూజ చేశారు. పీపీపీ నమూనాలో రూ.193 కోట్ల వ్యయంతో 36 స్టాళ్లతో ఏర్పాటవుతుంది. 2027 నాటికి పూర్తి కావాల్సింది. అయితే ఆ స్థలం మైసూరు ప్యాలెస్కు చెందినదని ఎంపీ యదువీర్ తల్లి, రాజమాత ప్రమోదాదేవి ఒడెయర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారణ చేపట్టిన హైకోర్టు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని, యథాతథ స్థితిని కాపాడాలని స్టే జారీచేసింది. దీంతో అన్ని పనులు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్ లక్ష్మికాంత్రెడ్డి మాట్లాడుతూ త్వరలో హైకోర్టుకు వెళ్లి ఆ స్టేను తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
అతి వేగం.. ముగ్గురి ప్రాణాలు బలి
దొడ్డబళ్లాపురం: అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొని ఎగిరిపడి పక్క రోడ్డులో వెళ్తున్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. బెంగళూరు రూరల్లో దేవనహళ్లి శివారులోని బెంగళూరు– హైదరాబాద్ హైవే లో బుధవారం రాత్రి 11:40 సమయంలో జరిగింది. సాదళ్లికి చెందిన మోహన్ కుమార్ (33), సుమన్ (28), సాగర్ (23) చనిపోయారు. కియా కారులో చిక్కబళ్లాపురం నుంచి దేవనహళ్లి వైపు అతివేగంగా వస్తున్నారు. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఎగిరి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఢీకొన్న రభసకు కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచారు. బస్సులో ఉన్న సుమారు 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డులోని ఆర్టీసీ బస్సుకు కారు ఢీ దేవనహళ్లి వద్ద విషాదం -
ప్రియుడు వద్దని.. భర్తే సర్వస్వమని..
బొమ్మనహళ్లి: ఇటీవలి కాలంలో ఫేస్బుక్, ఇన్స్టా తదితర యాప్లతో పరిచయాలు పెరగడం, జీవిత భాగస్వాములు వదిలేసి వెళ్లడం మామూలు విషయమైంది. దీనివల్ల గొడవలు జరిగి కుటుంబాలు రోడ్ల పాలవుతుంటే అభం శుభం తెలియని పిల్లల జీవితం ఛిద్రమవుతోంది. బెంగళూరు బన్నేరుఘట్ట పరిధిలో ఇదే మాదిరిగా భర్తను వదిలేసి ప్రియునితో వెళ్లిపోయిన మహిళ.. కొన్ని నెలల తరువాత మళ్లీ భర్త వద్దకు వచ్చేసింది. దీంతో కథ సుఖాంతమైందని స్థానికులు నిట్టూర్చారు. ఏం జరిగింది.. సెప్టెంబరు ఆఖర్లో లీల అనే మహిళ భర్త, క్యాబ్డ్రైవర్ మంజునాథ్, ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడు సంతుతో వెళ్లిపోయింది. మంజు కన్నీరు కారుస్తూ తన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తిరిగి రావాలని విలపిస్తూ చేసిన వీడియో ప్రచారమైంది. తాను మాత్రం సంతుతోనే ఉంటానని లీల చెప్పింది. సంతు, లీల సరదా ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ బాగోతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. లీలాలో పరివర్తన.. నెలన్నర కిందట మంజు కోపం పట్టలేక సంతును వెతికిపట్టుకుని చితకబాదాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ కేసులో మంజును అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే విడుదలై కొత్త ఆటోను కొనుక్కుని పిల్లలను పోషిస్తున్నాడు. ఇంతలో లీల మనసులో ఏం పరివర్తన వచ్చిందో గానీ ప్రియున్ని వదిలేసి భర్త చెంతకు చేరింది. మంజు ఆమెను ఆత్మీయంగా స్వాగతించాడు. బన్నేరుఘట్టలోని అద్దె ఇంట్లో కులాసాగా కాపురం ప్రారంభించారు. త్వరలో ధర్మస్థలలో మళ్లీ పెళ్లి చేసుకుంటామని, అన్నీ మరచిపోయి సంతోషంగా జీవిస్తామని ఈ జంట చెబుతోంది. ఇది చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు అని కొందరు నెటిజన్లు వాపోతే, మరికొందరు దీవించారు. కొన్ని నెలల తరువాత భర్త చెంతకు భార్య లీల త్వరలో మళ్లీ పెళ్లి వేడుక -
తీయని కళాఖండాలు
శివాజీనగర: అక్కడికి వెళ్లగానే వివిధ ఫ్లేవర్లతో కూడిన కళాఖండాలు నోరూరిస్తాయి. బెంగళూరులో ప్రతి ఏడాది క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా కనువిందుగా కేక్ షో నిర్వహించడం తెలిసిందే. ఈసారి కూడా కేక్ల జాతర ఆరంభమైంది. ఓ బేకరీ సంస్థ దీనిని నిర్వహిస్తోంది. ప్యాలెస్ గ్రౌండ్స్ త్రిపురవాసినిలో గురువారం ఆరంభం కాగా, జనవరి 4వ తేదీ వరకు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది. 90 రోజులు శ్రమించి నిర్మాణం ఈసారి లేజర్ కట్ పరిజ్ఞానంతో కేక్ల ఆకృతులను నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ కొలువైన 28 కేక్ కళాకృతులను 50 మంది కళాకారులు, చెఫ్లు గత 90 రోజుల పాటు శ్రమించి తయారు చేశారని తెలిపారు. 18 అడుగుల ఎత్తైన రాయల్ డ్రీమ్ కోట, 10 అడుగుల వేళాంగిణి మాత చర్చి, బోన్సాయ్ గార్డెన్, టర్బో రేసింగ్ కార్స్, చాకో వెడ్డింగ్ కేక్ తదితరాలు అలరిస్తున్నాయి. బెంగళూరు ప్యాలెస్ మైదానంలో కేక్ షో షురూ జనవరి 4 వరకు ప్రదర్శన -
ముఖ్యమంత్రి మార్పు ఉండదు
శివాజీనగర: వాన నిలిచినా చినుకులు నిలవలేదన్నట్లుగా సీఎం కుర్చీ మార్పు గురించి ఎవరూ మాట్లాడరాదని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినా కూడా నాయకులు ఊరికే ఉండడం లేదు. సీఎం సిద్దరామయ్య తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర ఇటీవల సీఎంగా మా తండ్రి పూర్తికాలం ఉంటారని ప్రకటించడం, దీంతో రభస రేగడం తెలిసిందే. సీఎం సిద్దు కుమారునికి బెళగావిలో గంటకు పైగా కూర్చోబెట్టుకుని ఇది తగదని సూచించారు. ఇది జరిగి రెండురోజులు కాకముందే యతీంద్ర గురువారం మళ్లీ పాత పాటే పాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు లేదని ఆయన అన్నారు. బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్పునకు హైకమాండ్ అంగీకరించలేదని చెప్పుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు లేదు. అలాగే అధికారం కోసం కీచులాటలు జరగడం లేదు అని అన్నారు. నేను ఇదివరకే మీకు చెప్పాను, అంతా స్పష్టంగా ఉంది, హైకమాండ్ సీఎంను మార్చడం లేదు అని ప్రకటించారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. డీసీఎం డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు, నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. ఆగని భోజన విందులు భోజన విందులు బెళగావికి కూడా విస్తరించాయి. బుధవారం ఎమ్మెల్యే ఫిరోజ్ సేఠ్ ఇంటిలో సీఎం అనుకూల వర్గం విందు జరిగింది. ఇందులో సీఎం సిద్దరామయ్య, మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, భైరతి సురేశ్, విధానసభ స్పీకర్ యూ.టీ.ఖాదర్, ఎమ్మెల్సీ సలీం అహ్మద్ పాల్గొన్నారు. ఇది రాజకీయం విందు భోజనం కాదు, ఫిరోజ్ ఆహ్వానంతో విందుకు పిలిస్తే వెళ్లారు అని మంత్రులు చెప్పారు. హైకమాండ్ బలహీనత: ఎమ్మెల్యే హుస్సేన్ యతీంద్ర మాటలపై రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మండిపడ్డారు. మేము మాట్లాడితే నోటీస్ ఇస్తారు, ఆయన మాట్లాడవచ్చా.., మా హైకమాండ్ బలహీనంగా ఉంది అని అన్నారు. అన్నింటినీ హైకమాండ్ తీర్మానం చేస్తుంది. యతీంద్ర వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో తెలియడం లేదు. పదే పదే అవే మాటలు చెబుతున్న ఆయననే అడగండి అని విలేకరులతో చెప్పారు. మేము నోరెత్తితే బలాత్కారం, ఆయన మాట్లాడితే చమత్కారమని దుయ్యబట్టారు. సీఎం తనయుడు యతీంద్ర మళ్లీ మాటల జోరు కాంగ్రెస్లో ప్రకంపనలు -
పోలీసుల తీరును ఖండిస్తూ నిరసన
హొసపేటె: ధార్వాడలో యువ ఉద్యమ నాయకులపై కొనసాగుతున్న పోలీసుల తీరును ఖండిస్తూ, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థి సంస్థ నిరసన ప్రదర్శన నిర్వహించింది. విజయనగర జిల్లా సమన్వయకర్త రవికిరణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ విభాగాల్లో లక్షలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధార్వాడలో యువత నిరసన ప్రదర్శన నిర్వహించింది. పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన పోరాట కమిటీ నాయకులు, యువజన, రైతు విభాగాల నాయకులను అరెస్టు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అణచివేత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు చాలా సార్లు సమాచారం కోరినా, ఉద్యోగార్ధుల పోరాటానికి అనుమతి నిరాకరించారన్నారు. ఇప్పుడు యువత న్యాయమైన పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. జిల్లా సభ్యులు యూ.ఉమాదేవి విద్యార్థులు కే.చంద్ర, ఆకాష్, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై బెళగావికి కదం
సాక్షి,బళ్లారి: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక పోవడంతో పాటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని బీజేపీ రైతు మోర్చా పదాధికారులు, రైతులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో బళ్లారి జిల్లా నుంచి జిల్లా బీజేపీ రైతు మోర్చా అధ్యక్షుడు గణపాల ఐనాధరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. క్వింటాల్కు రూ.2400ల ధర నిర్ణయించి రైతులను ఆదుకోవాలన్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తుంగభద్ర ఆయకట్టు కింద రెండో పంటకు నీరు ఇవ్వాలని లేకుంటే ప్రతి ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కారు. రైతుల సమస్యలపై తాము ఎన్నిసార్లు ఆందోళన చేసినా పట్టించుకోకపోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తుంగభద్ర ఆయకట్టులో రెండో పంటకు నీరివ్వాలి లేదా ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి అసెంబ్లీని ముట్టడించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు, రైతుల యత్నం కాంగ్రెస్ సర్కార్పై విపక్ష నేత బీ.వై.విజయేంద్ర మండిపాటు జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు గణపాల ఐనాధరెడ్డి వెల్లడి -
కొట్టూరేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
హొసపేటె: కలియుగ కామధేనువు, కల్పవృక్షంగా భక్తుల విశ్వాసాన్ని పొందిన కొట్టూరు శ్రీ గురు బసవేశ్వర స్వామి ఆలయాన్ని జిల్లాధికారిణి కవిత మన్నికేరి సందర్శించి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. ఆలయం చుట్టూ ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించిన తర్వాత ఆమె మాట్లాడుతూ రథోత్సవ సమయంలో వేలాది మంది భక్తులు కాలినడకన కొట్టూరుకు చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి, పరిశుభ్రత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. పాత పట్టణ పంచాయతీ పరిధిలోని ప్రాంతంలో మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రెండవ దశ పనులకు త్వరలో నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యనిర్వహక అధికారి మల్లప్ప, తహసీల్దార్ అమరేష్, పట్టణ పంచాయతీ ముఖ్య అధికారి ఏ.నసురుల్లా, ప్రధాన ధర్మకర్త శేఖరయ్య, బీడీసీసీ బ్యాంక్ జిల్లా గ్రామ ఉపాధ్యక్షుడు అడకి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్
హొసపేటె: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై సీఎం సిద్దరామయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరికి వినతిపత్రాన్ని అందజేశారు. బీజేపీ మహిళా నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలు యావత్ మహిళా లోకాన్ని అవమానించాయన్నారు. అందువల్ల సీఎం సిద్దరామయ్య వెంటనే నిర్మలా సీతారామన్తో సహా మొత్తం మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. బీజేపీ మహిళ విభాగం అధ్యక్షురాలు డాక్టర్. అరుంది సువర్ణ, రాష్ట్ర మహిళా మోర్ఛా కార్యదర్శి సుగుణ, కార్యనిర్వాహక సభ్యురాలు వాణిశ్రీ, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మీరా బాయి, వివిధ మహిళా విభాగాల నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవ వివాహిత ఆత్మహత్యబొమ్మనహాళ్: కడుపునొప్పి తాళలేక ఇటీవలే పెళ్లయిన ఓ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన సరోజమ్మ, పెద్ద లింగన్న కుమారై జయలక్ష్మి (23) ని గత 3 నెలల క్రితం బొమ్మనహాళ్ మండలంలోని కురువల్లి కి చెందిన గోవిందప్ప కుమారుడు బోయ గురుస్వామికి ఇచ్చి పెళ్లి చేశారు. జయలక్ష్మి కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో వారం కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బళ్లారి విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మృతురాలి తల్లి సరోజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అభివృద్ధికి మనమే విరోధులం రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల అభివృద్ధికి మనమే వ్యతిరేకులమని, అదే ఈ ప్రాంత వెనుకబాటుకు ప్రధాన కారణమని అంతర్జాతీయ బుకర్ అవార్డు విజేత దీపా బస్తీ అభిప్రాయ పడ్డారు. మంగళవారం సాయంత్రం కలబుర్గి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విప్లవ సాహిత్యం, హెచ్టీ పోతే రాసిన అంబేడ్కర్ జీవిత కథా పుస్తకాలను విడుదల చేసి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలు కవులు, సాహితీ వేత్తలు, మూడు భాషల సాంగత్యం ఉందన్నారు. నైసర్గికంగా బలంగా ఉన్న సాహిత్యబలాన్ని ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులు కళ్యాణ కర్ణాటక జిల్లాల అభివృద్ధికి ముందడుగు వేయాలన్నారు. భాష ద్వారా కూడా అభివృద్ధి అంశాలను ప్రస్తావించాలన్నారు. కన్నడ భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ప్రామాణికంగా పని చేయాలన్నారు. సమావేశంలో విజయ శంకర్, శశికాంత్, రమేష్, సాగర్లున్నారు. పథకం లబ్ధి పొందండిరాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్వామిత్య పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ బీదర్ శాసన సభ్యుడు శ్రీశైలేంద్ర బిరాదార్ పేర్కొన్నారు. దక్షిణ బీదర్ తాలూకా రేకుళిగిలో జరిగిన సభలో మాట్లాడారు. గ్రామీణ భాగంలోని రైతులు ఇంటి, ఆస్తి పన్ను వివరాల రికార్డులను పొందడానికి హక్కు పత్రాలను డ్రోన్ యంత్రాల ద్వారా అందిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 లో జాతీయ పంచాయత్రాజ్ దినోత్సవాన్ని ప్రారంభించి రికార్డులను భద్రపరుచుకోవడానికి అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో అధికారి మాణిక్ రావ్, మల్లికార్జున, సుదేశ్, నాగరాజ్, వీరణ్ణ, విద్యావతి, శిల్పా, రాజ్ కుమార్, నాగేశ్, మహేష్, ప్రకాష్లున్నారు. హెల్మెట్ ధారణ.. ప్రాణ రక్షణ రాయచూరు రూరల్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని పశ్చిమ పోలీస్ స్టేషన్ సీఐ మేకా నాగరాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ద్విచక్రవాహనదారులకు చైతన్యపరిచి ఆయన మాట్లాడారు. నానాటికీ ద్విచక్రవాహన ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. మరో వైపు మద్యం తాగి మొబైల్లో మాట్లాడుతూ నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. -
ప్రైవేటుకు దీటుగా.. ఆధునికత తోడుగా
అన్ని రకాల ప్రయోగాలతో ఏర్పాటు చేసిన ప్రయోగశాల పచ్చదనం పరిఢవిల్లుతున్న పాఠశాల ఆవరణ ఆధునిక వసతులతో విద్యార్థులకు పాఠాల బోధన హొసపేటె: ప్రైవేట్ పాఠశాలల జోరు మధ్య కూడా ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించడం కష్టతరమైన నేటి పోటీ యుగంలో విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని 76 వెంకటాపుర గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా దూసుకుపోతోంది. 1995లో ప్రారంభమైన తాలూకాలోని 76 వెంకటాపుర క్యాంప్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల కృషి, ఎస్డీఎంసీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాలో అగ్రగామి పాఠశాలగా రూపుదిద్దుకుంది. గత 17 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, గత 12 సంవత్సరాలుగా ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న పీజే నిరంజన్ ఈ పాఠశాల అభివృద్ధిలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రయోగశాల ఎయిర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శాశ్వత సంస్థ సహకారంతో ఈ పాఠశాలలో మొత్తం రూ.16 లక్షల ఖర్చుతో ల్యాప్ లెర్నింగ్ లాబొరేటరీ, యాక్టివిటీ రూం నిర్మించారు. ఇలాంటి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు కావడం రాష్ట్రంలోనే ఇదే మొదటిది అని సమాచారం. ఈ ప్రయోగశాలలో కన్నడ, ఇంగ్లిష్, హిందీ, సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్తో సహా ప్రతి సబ్టెక్టుకు ప్రత్యేక విభాగం సృష్టించారు. ఇక్కడ అక్షరాస్యతతో పాటు సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ను ప్రదర్శనల ద్వారా బోధిస్తారు. 1వ తరగతి నుంచి కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్నారు. 76 వెంకటాపుర క్యాంప్లో అత్యాధునిక వసతులతో సర్కారు బడి అన్ని సబ్జెక్టులను మేళవించేలా ప్రయోగశాల ఏర్పాటు ఇలాంటి పాఠశాల ప్రారంభించడం రాష్ట్రంలోనే ప్రథమం -
ప్రభుత్వ స్కూళ్ల మూసివేత నిరసిస్తూ ధర్నా
రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ స్కూళ్లలోకి విలీనం చేయడానికి సర్కార్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలను బంద్ చేయబోమని ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బెళగావి సువర్ణ విధాన సౌధ ముందు చేపట్టిన ఆందోళనలో సంచాలకులు బసవరాజ్ మాట్లాడారు. బెళగావి సువర్ణ విధాన సౌధలో శాసన సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప బదులిచ్చారు. రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలలను మూసేయడం లేదని ప్రకటించారు. అలా లిఖితరూపంలో ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సువర్ణసౌధను ముట్టడించడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. -
కన్నడను ప్రోత్సహించాలి
రాయచూరు రూరల్: గడినాడు ప్రాంతంలో కన్నడ భాషను ప్రోత్సహిచాలని బెంగళూరు ఆకాశవాణి కళాకారుడు యోగ రవీశ బారత పిలుపు ఇచ్చారు. నగరంలోని క్రైస్ట్ అకాడమీ, ఐసీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన 70వ కన్నడ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇతర భాషల నుంచి కన్నడ భాషకు గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. అన్య భాషలను గౌరవిస్తూ కన్నడకు పెద్ద పీట వేయాలన్నారు. 1980లో కన్నడ భాషకు బదులుగా అన్య భాషల ప్రభావం అధికంగా ఉందన్నారు. కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆందోళన చేశారని గుర్తు చేశారు. థామస్, సెబాిస్టియన్లున్నారు. -
సమగ్ర సమాచారంతో హాజరు కండి
హొసపేటె: అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరై పక్కా సమాచారాన్ని అందించాలని తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి మార్కండేయ తెలిపారు. మంగళవారం కూడ్లిగి పట్ణణంలోని తాలూకా పంచాయతీ హాలులో జరిగిన కేడీపీ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. సంబంధిత శాఖ అధికారులు మాత్రమే సమావేశానికి హాజరు కావాలన్నారు. మీ దిగువ స్థాయి అధికారులను పంపవద్దు, వారి వద్ద శాఖ గురించి సమగ్ర సమాచారం ఉండదు. మీరు కూడా ముందుగా తమకు పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. సగం సగం సమాచారం ఇవ్వవద్దని ఆయన ఆదేశించారు. ప్రస్తుత నెలలో మీరు ఎన్ని బాల్య వివాహాలను నివారించారో, ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి అని సీడీపీఓని ప్రశ్నించారు. ఈ విషయంపై ఆయన బదులిస్తూ ఈ నెలలో 5 బాల్య వివాహాలను నివారించామని బదులిచ్చారు. ఒక బాలికకు 13 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్నందున ఆమెను హొసహళ్లి బీసీఎం హాస్టల్కు తరలించామన్నారు. కానీ అధికారులు ఆమెను హాస్టల్లో చేర్చుకోవడానికి వెనుకాడుతున్నారని అధికారి మాలంబీ బదులిచ్చారు. తాలూకాలో ఎక్కువ మంది కూలీ కార్మికులు ఉన్నారు. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు ఎంత మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోందా? అనే మార్కండేయ ప్రశ్నకు సీడీపీఓ సమాధానమిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇతర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. -
గోవధ నిషేధ చట్టానికి గండి కొట్టొద్దు
తుమకూరు: గోవులు, పశువుల వధను అడ్డుకునే చట్టానికి సవరణలు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వం నిర్ణయించడంపై విశ్వ హిందూ పరిషత్ గోరక్షా విభాగం కార్యకర్తలు , బీజేపీ నాయకులు బుధవారం నగరంలో ఆందోళన జరిపారు. జీజీఎస్ సర్కిల్లో గోవులతో నిరసన తెలిపారు. గోవధను అరికట్టేందుకు గత బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన చట్టాన్ని సవరించి గోవధకు సహకారం, ప్రోత్సాహం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనార్టీల ఓట్ల కోసం వారిని బుజ్జగించేందుకు గోవధ నిషేధ చట్టాన్ని నీరుగార్చడం సరికాదన్నారు. ఈ చట్టాన్ని యథాప్రకారం అమలు చేయాలన్నారు. గోవులకు కార్యకర్తలు పూజలు చేశారు. ఆన్లైన్ గేమ్తో రూ.40.71 లక్షల టోపీ మైసూరు: ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న స్నేహితుల మాటలను నమ్మిన ఓ వ్యక్తి డబ్బు పెట్టుబడి పెట్టి రూ.40.71 లక్షలను కోల్పోయిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. నగరంలోని అశోక రోడ్డు నివాసి రాజస్థాన్కు వెళ్లాడు. అక్కడ వారి స్నేహితులు ఆన్లైన్ గేమ్లో డబ్బు పెట్టుబడి పెడితే కోట్లాది రూపాయలను సంపాదించవచ్చని ఆశ పుట్టించారు. మైసూరుకు తిరిగివచ్చాక అతడు గూగుల్లో వెతికి ఫన్ ఇన్ మ్యాచ్ అనే యాప్ ద్వారా అక్కడి వ్యక్తిని సంప్రదించి డబ్బు పెట్టుబడి పెట్టారు. మొదట్లో కొద్దిగా లాభం వచ్చింది. దీంతో సంతోషపడిన ఆ వ్యక్తి సైబర్ మోసగాళ్లు చెప్పినట్లుగా దశల వారీగా రూ.40.71 లక్షలను పెట్టుబడి పెట్టగా రూపాయి కూడా తిరిగి రాలేదు. సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దావణగెరెలో చోరీ.. మధ్యప్రదేశ్లో సొత్తు రికవరీ దొడ్డబళ్లాపురం: దావణగెరెలో పెళ్లిలో చోరీకి గురైన బంగారు ఆభరణాలను దావణగెరె గ్రామీణ పోలీసులు మధ్యప్రదేశ్లో సీజ్ చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన కరుడుగట్టిన దోపిడీ ముఠా అయిన బ్యాండ్ బాజా గ్యాంగ్ సభ్యులు ఈ చోరీకి పాల్పడ్డారు. వివరాలు.. గత నెల 14న అపూర్వ రెస్టారెంట్లో జరిగిన ఓ వివాహ వేడుకలోకి కరణ్ వర్మ, వినీత్ సిసోడి అనే దొంగలు చొరబడ్డారు. పెళ్లివారు ఓ బ్యాగులో ఉంచిన 535 గ్రాముల బంగారు నగలను దోచుకుని మధ్యప్రదేశ్కి పరారయ్యారు. పోలీసులు మధ్యప్రదేశ్లోని రాజగడ్ జిల్లా నరసింగలో కార్యాచరణ జరిపి దొంగలను గుర్తించారు. వారి ఇళ్లలో నుంచి రూ.51.49 లక్షల విలువైన బంగారు సొత్తును సీజ్ చేశారు. అయితే దొంగలు పట్టుబడలేదు. వారి కోసం శోధిస్తున్నారు. చనిపోయినా వదలడం లేదు ● రేణుకాస్వామి సమాధి ధ్వంసం దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పెద్ద సంచలనం సృష్టించిన కేసు చిత్రదుర్గంవాసి రేణుకాస్వామి హత్య. గతేడాది జూన్ 8న రాత్రి బెంగళూరులో కామాక్షిపాళ్య పీఎస్ పరిధిలో పట్టణగెరెలో ఓ షెడ్డులో అతనిని తీవ్రంగా చితకబాది హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా నటి పవిత్రగౌడ, నటుడు దర్శన్, మరికొందరు నిందితులు అప్పటి నుంచి పరప్పన జైలులో ఉండడం తెలిసిందే. అయితే రేణుకాస్వామి మరణించినా కూడా దాష్టీకాలు ఆగడం లేదు. రేణుకాస్వామి సమాధి ఫలకాన్ని ఎవరో దుండగులు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. చిత్రదుర్గలో అతని సమాధి ఉండగా, పక్కనే లేఔట్ నిర్మిస్తున్న వారు ఈ పనికి పాల్పడ్డారా? లేక మరెవరైనా ధ్వంసం చేశారా? అనేది తెలియడం లేదు. రేణుకాస్వామి భార్య, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇక దర్శన్ నటించిన డెవిల్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. -
ధర్మస్థలపై కుట్ర అని ఆరోజే చెప్పా
● డిప్యూటీ సీఎం డీకే బనశంకరి: ధర్మస్థల మీద వ్యతిరేకంగా కుట్ర జరిగిందని నేను ఆ రోజే ధైర్యంగా చెప్పానని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. అంతేకాక ఈ కుట్రకు కారణం ఏమిటి అనేది కూడా చెప్పానన్నారు. బుధవారం బెళగావిలో సర్క్యూట్ హౌస్లో డీకే శివకుమార్ను కేఎస్సీఏ నూతన అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడారు. సిట్ చార్జీషీట్లో ఫిర్యాదుదారులే కుట్రదారులు అని తెలిసిందని విలేకరులు ప్రస్తావించారు. నాకు ధర్మస్థల చరిత్ర గురించి తెలుసు, ఎవరూ ఇలాంటివి చేయరు అనేది తెలుసు. అందుకే ధైర్యంగా ఈ విషయం తెలిపానన్నారు. చార్జిషీట్లో ఏముంది అనేది చదవలేదు, ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి, అదే జరుగుతుంది. అంతిమంగా నిజం బయటపడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య అనేక విభేదాలు ఉండడంతో ఈ కుట్ర జరిగిందని డీకే చెప్పారు. -
డ్రగ్స్ విక్రేతల అరెస్టు, రూ.4.20 కోట్ల సరుకు సీజ్
బనశంకరి: బెంగళూరులో డ్రగ్స్ పెడ్లింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులు, కేరళవాసిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.4 కోట్ల 20 లక్షల విలువచేసే 1.12 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్స్, హైడ్రో గంజాయి, మొబైల్ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. నైజీరియా కు చెందిన ఒబైయ సిచిగోజీదవి, సనిసాదిక్, కేరళవాసి మహమ్మద్ ముస్తఫా అనే ముగ్గురు డ్రగ్స్పెడ్లర్లను బుధవారం బాగలూరు, అశోకనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4.20 కోట్లు విలువచేసే డ్రగ్స్ ను వశపరచుకున్నట్లు తెలిపారు. ముస్తఫా హైడ్రోగంజాయిని తీసుకువచ్చి బెంగళూరులో అమ్ముతున్నాడు. ఇతని వద్ద నుంచి రూ.2 కోట్ల విలువచేసే సరుకును సీజ్ చేశారు. ఇటీవల ప్రముఖ డ్రగ్స్ వ్యాపారి, నైజీరియన్ ఎజికేనైగో ఓకాపార్ ను అరెస్ట్ చేసి రూ.23 కోట్ల విలువైన వివిధ రకాల డ్రగ్స్ను పట్టుకున్నారు. -
ధర్మస్థలలో ఏ అకృత్యాలూ జరగలేదు
బనశంకరి: ప్రపంచమంతటా పేరుపొందిన పుణ్య యాత్రాస్థలి ధర్మస్థలం మీద బురదజల్లాలని కొందరు కుట్రదారులు చేసిన ప్రయత్నం నిష్ఫలమైంది. అక్కడ ఎంతోమంది మహిళలు, యువతులపై అత్యాచారాలు, హత్యలు చేశారు, శవాలను నదిలో విసిరేయడంతో పాటు అనేకచోట్ల పూడ్చిపెట్టారని ఓ అపరిచితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి, చివరికి వట్టి కట్టుకథ అని నిర్ధారించారు. 3,923 పేజీల నివేదిక ఇదంతా డబ్బు, దుష్ప్రచారం కోసం కొందరు చేసిన కుట్ర అని, అక్కడ ఏమీ జరగలేదని నివేదికలో స్పష్టంచేశారు. ఈ మేరకు 3,923 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను బెళ్తంగడి కోర్టుకు సిట్ అధికారులు దాఖలు చేశారు. చిన్నయ్య అబద్ధపు ఫిర్యాదు చేశాడని తమ దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. చిన్నయ్య వాంగ్మూలంతో జూన్ ఆఖరు నుంచి 2 నెలలకు పైగా అనేక ప్రదేశాలలో జేసీబీలు, వందలాది మంది కూలీలు, క్లూస్ టీంలతో ముమ్మర గాలింపు సాగడం తెలిసిందే. కొన్నిచోట్ల ఏవో ఎముకలు తప్ప మృతదేహాల జాడలు లభించలేదు. క్రమంగా చిన్నయ్య, మిగతావారి పన్నాగం అని బయటపడింది. నివేదికలో ఏముందంటే... ధర్మస్థల కేసులో మాస్క్ మ్యాన్, మాజీ పారిశుధ్య కార్మికుడు చిన్నయ్య, స్థానిక సామాజిక కార్యకర్తలు మహేశ్శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్, విఠల్గౌడ, జయంత్, సుజాత భట్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నివేదికలో పేర్కొన్నారు. డబ్బుకు ఆశపడి చిన్నయ్య ఎక్కడి నుంచో ఓ పుర్రెను తీసుకొచ్చి ధర్మస్థల మారణకాండకు సాక్ష్యమని ప్రచారం చేశాడని తెలిపారు. చిన్నయ్యను ముందు పెట్టుకుని మిగతావారు కుట్రను అమలుచేశారన్నారు. వందలాది శవాలను పూడ్చి పెట్టినట్లు చిన్నయ్యతో జిల్లా ఎస్పీ, న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చేలా ప్రేరేపించారని చెప్పారు. లైంగిక దాడులు, హత్యలు అనేది అబద్ధమని స్పష్టంచేశారు. కుట్ర కేసులో ఇదివరకే చిన్నయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బెళ్తంగడి కోర్టులో సిట్ ప్రాథమిక నివేదిక చిన్నయ్య, ముఠా తప్పుడు ఫిర్యాదు ద్వారా కుట్ర నివేదికలో వెల్లడి కోర్టులో విచారణ సిట్ అధికారులు నవంబరు 21న దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి కోర్టులో నివేదిక అందజేశారు. బుధవారం ఈ కేసును కోర్టు విచారించింది. ధర్మస్థల మీద కుట్రకు పాల్పడిన వారిపై సాక్ష్యాధారాలు ఉన్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ కోరింది. చిన్నయ్యతో కుట్రలో భాగస్వాములైన మిగిలిన ఐదుగురి పేర్లను ప్రస్తావిస్తూ సిట్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నెల 26న ఆదేశాలిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. నివేదికతో ధర్మస్థల భక్తులు, హిందూసంఘాలలో సంతోషం నెలకొంది. -
చురుగ్గా డ్యాం పాత గేట్ల తొలగింపు పనులు
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 18వ గేట్కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి 18వ నంబరు పాత గేట్ను తొలగించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ గేట్ ఒక భాగం నీటి మట్టానికి 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. గేట్ ఒక భాగాన్ని కత్తిరించి తొలగించారు. డిసెంబర్ మూడో వారం నాటికి కొన్ని గేట్లను తొలగిస్తున్నట్లు తుంగభద్ర బోర్డు వర్గాలు తెలిపాయి. పాత గేట్ల తొలగింపు పనులు పూర్తి కాగానే కొత్త గేట్లను అమర్చే పనులు ప్రారంభిస్తామన్నారు. 33 గేట్ల నిర్మాణ పనుల టెండర్ను గుజరాత్కు చెందిన కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. సుమారు రూ.52 కోట్ల ఖర్చుతో గేట్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 17 నూతన గేట్ల నిర్మాణ పనులు పూర్తయినట్లు మండలి అధికార వర్గాలు తెలిపారు. మిగతా గేట్ల నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని, దశల వారీగా గేట్ల నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. -
పేదల భోజ్యం.. దళారుల రాజ్యం
సాక్షి బళ్లారి: పేదల కడుపు నింపాలని ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా ఉత్తర కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, కలబుర్గి, బీదర్, యాదగిరి, విజయపుర తదితర జిల్లాల్లో రేషన్ షాపులకు ప్రతినెల సరఫరా చేస్తున్న ఉచితం బియ్యం కార్డు దారుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వైనం పరిపాటిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ప్రతి బీపీఎల్ రేషన్ కార్డుదారుకు ఉచితంగా బియ్యంను అందిస్తున్న నేపథ్యంలో ఆ బియ్యాన్ని డీలర్లు, దళారులు రంగప్రవేశం చేసి కార్డు దారుల నుంచి రూ.10లకే బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేసి సోనామసూరి సన్న బియ్యం తరహాలో మార్చి కంపెనీ పేర్లు పెట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు ఎక్కడో ఒక చోట దర్శనమిస్తుండటంతో పోలీసులు సంబంధిత అధికారులతో కలిసి వల పన్ని పట్టుకొంటున్నారు. 400 క్వింటాళ్ల బియ్యం పట్టివేత మంగళవారం ఉదయం బళ్లారి తాలూకాలోని బైపాస్ మార్గంలో ఎంహెచ్–26–బీ–9758 అనే నంబరుగల లారీలో కొప్పళ– హొసపేటె మార్గంలో బళ్లారి బైపాస్ వైపునకు తీసుకొస్తున్న దాదాపు 400 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు, పౌరసరఫరాల శాఖాధికారులు పట్టుకుని లారీతో సహా స్వాధీనం చేసుకొన్నారు. కొప్పళ– హొసపేటె మార్గం గుండా ఆంధ్రాకు తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకొని లారీ డ్రైవర్ను, బియ్యం తరలిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇలా ఈ ప్రాంతంలో ఏదో ఒక చోట రేషన్ బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తక్కువ ధరకే బియ్యాన్ని తీసుకొని మెరుగులు దిద్ది ఎగుమతులు చేస్తున్న సంఘటనలు యాదగిరి జిల్లాలో పెద్ద ఎత్తున వెలుగులోకి రావడంతో అసెంబ్లీ కూడా పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. రేషన్ డీలర్ల కుమ్మక్కుతోనే.. పేదల కడుపు నింపే బియ్యాన్ని కార్డుదారులతో పాటు రేషన్ డీలర్లు వ్యాపారులకు అమ్మడానికి తోడ్పాటును అందిస్తుండటంతో ఈ అక్రమ రవాణా బియ్యం యథేచ్ఛగా కొనసాగుతుండటంతో ప్రభుత్వ లక్ష్యం పేదలకు చేరాలన్న సంకల్పం గాల్లో కలిసిపోతోంది. కార్డు దారులు కూడా నూటికి 50 శాతం పైగా వ్యాపారులకు అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. లక్షలాది కేజీల మేర బియ్యాన్ని పేదలకు ఉచితంగా అందజేస్తే వాటిలో సగం కూడా పేదల వద్దకు చేరకపోగా అక్రమంగా తరలించేందుకు రేషన్ బియ్యం వ్యాపారులకు, చేతినిండా పని కల్గిస్తూ అక్రమ సంపాదనకు రేషన్ బియ్యం వ్యాపారం దోహదం చేస్తోందని చెప్పవచ్చు. అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యంను పట్టుకొన్న పోలీసులు చౌక బియ్యంను తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిన లారీ భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా, అమ్మకాలు కార్డు దారుల నుంచి తక్కువ ధరకే బియ్యం కొనుగోలు బియ్యాన్ని పాలిష్ చేసి అధిక ధరకు అమ్ముతున్న వైనం నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పట్టుబడుతున్న చౌక బియ్యం -
ప్రజలను మభ్య పెట్టడానికే టిప్పు జయంతి
హుబ్లీ: బెళగావి సువర్ణ సౌధ అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చకు మేం సిద్ధం అయితే మంత్రి కాశప్పకు రైతుల సమస్యలు పట్టడం లేదని, దీంతో ఆయన టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలను సాకుగా చూపుతూ వెనుకబడిన ఈ ప్రాంత ప్రజల చిత్తశుద్ధిని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే హెచ్ఆర్.విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఓ మతాంధుడు, మత మారణహోమానికి పాల్పడిన ఓ వ్యక్తి జయంతి ఆచరణకు ప్రభుత్వం నిలబడటం సిగ్గు చేటు అన్నారు. తీవ్ర సమస్యల గురించి మాట్లాడమని అంటే ఈ విషయాన్ని సాకుగా చెప్పి రైతన్న సమస్యలపై ఉదాసీనత చూపడం తగదన్నారు. బీజేపీ ఏనాటికీ మత సామరస్యానికి భంగం కలిగించదన్నారు. ఇలాంటి విషయాలలో చిచ్చు పెట్టేది కాంగ్రెస్ నేతలే అన్నారు. బెంగళూరులో మత్తు పదార్థాఽల విషయంపై మాట్లాడుతూ యథేచ్చగా సాగుతున్న వీటి విక్రయాలను అరికట్టడంలో సిద్దు సర్కారు పోలీస్ శాఖ వైఫల్యంపై ఆయన కఠిన పదజాలంతో దూషించారు. ఈ దేశ ప్రజలను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చితే ఈ దేశాన్ని పాడు చేసినట్లే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పదార్థాలు ఆఫ్రికా, పాకిస్తాన్ నుంచి ఎక్కువగాను అందులోను జీపీఎస్ ద్వారా పంపిస్తున్నారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన హోం శాఖ అడ్డుకోవాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో వీటి విక్రయాలతో పాటు సైబర్ క్రైం నివారణకు సుమారు 3 లక్షల మంది కళాశాల విద్యార్థులకు చైతన్య కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు. -
కొప్పళ జాతరకు గవర్నర్కు ఆహ్వానం
రాయచూరు రూరల్: కొప్పళ గవి సిద్దేశ్వర స్వామి జాతరకు మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయ శంకర్కు ఆహ్వానం పలికారు. ఇటీవల కొప్పళ గవి సిద్దేశ్వర మఠాధిపతి అభినవ గవి సిద్దేశ్వర స్వామీజీ మేఘాలయలో రాష్ట్ర గవర్నర్ను ఆయన కార్యాలయంలో కలసి 2025 జనవరి 5న జరిగే కొప్పళ గవి సిద్దేశ్వర స్వామి మహారథోత్సవాన్ని ప్రారంభించడానికి రావాలని ఆహ్వానించారు. మేఘాలయ రాష్ట్ర గవర్నర్ సీ.హెచ్.విజయ శంకర్ కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా బిన్నాళకు చెందిన వారు కావడంతో స్వామీజీ రథోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. మానవతా విలువలు పెంచుకోవాలిరాయచూరు రూరల్: సమాజంలో ఉపాధ్యాయులు మానవతా విలువలను పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బడిగేర్ పిలుపునిచ్చారు. ప్రైవేట్ కళాశాలలో జిల్లా, తాలూకా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు బోధనతో పాటు బోధనేతర విషయాలు, సంస్కృ,తి సంప్రదాయాల గురించి వివరించాలన్నారు. ఉపాధ్యాయుల్లో ఉన్న కౌశల్యతను కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలు మరిచి సామరస్యంతో జీవించాలన్నారు. తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, మొయిన్ ఉల్ హక్, మల్లేష్ నాయక్, యూనుస్ సాబ్, రామక్రిష్ణ, వీరేష్, రావుత్ రావ్, శివ కుమార్లున్నారు. బెళగావిని మూడు జిల్లాలుగా విభజించండిరాయచూరు రూరల్: 18 తాలూకాలతో కూడిన బెళగావి జిల్లాను మూడు భాగాలుగా విభజించాలని బెళగావి జిల్లా శాసన సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బెళగావి సువర్ణసౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రం సమర్పించిన శాసన సభ్యుడు బాలచంద్ర జార్కిహోళి, ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. ప్రస్తుతం గోకాక్ లోక్సభ నియోజక వర్గంగా ఉందని, దానిని గోకాక్ జిల్లాగా, చిక్కోడి జిల్లాగా విభజించాలన్నారు. బెళగావి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించాలని స్వామీజీల నేతృత్వంలో కమిటీ తరఫున వినతిపత్రం అందించారు. వ్యవసాయ శాఖ కార్యాలయం బదిలీ తగదు రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సింధనూరుకు బదిలీ చేయడం తగదని లింగసూగూరు తాలూకా అభివృద్ధి పోరాట సమితి డిమాండ్ చేసింది. మంగళవారం తాలూకా వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో పదాధికారి రమేష్ మాట్లాడారు. తాలూకా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఎలాంటి అనుమతి లేకుండా లింగసూగూరు నుంచి సింధనూరుకు తరలించడాన్ని తప్పు బట్టారు. నాటకరంగాన్ని పరిరక్షించాలికోలారు: నాటక రంగాన్ని పరిరక్షిస్తూ కళాకారులను ఆదరించాలని జిల్లా జాగృతి సమితి సభ్యుడు బెళమారనహళ్లి ఆనంద్ సూచించారు. నగరంలోని టీ చెన్నయ్య రంగమందిరంలో రాష్ట్ర స్థాయి కర్ణాటక నాటక అకాడమి అవార్డు గ్రహీత బ్యాడబెలె కె మురళి దర్శకత్వంలో సోమవారం రాత్రి నిర్వహించిన ముదుకన మదువె నాటకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత మొబైల్, టీవీ, సినిమాలకు పరిమితమై నాటక, జానపదచ, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి కనపర్చడం లేదన్నారు.కళలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. కసాప మాజీ అధ్యక్షుడు నాగానంద కెంపరాజ్ మాట్లాడుతూ సంగీత, నాటక, జానపద తదితర కళల పరిరక్షణకు మురళి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కన్నడ సంస్కృతిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, నాటక వ్యవస్థాపకుడు మురళి, మునిరాజు, రోటరీ అధ్యక్షుడు రామచంద్రప్ప, అంతరగంగ బుద్దిమాంద్య సంస్థ సంస్థాపకుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులను ప్రారంభించిన స్వామీజీ
కోలారు : తాలూకాలోని సూలూరు గ్రామ పంచాయతీ నుగ్గలాపుర నుంచి వీరభద్ర స్వామి ఆలయం వరకు రూ.80 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, దేవుడి జాతర జరిగే స్థలంలో ఫ్లాట్ నిర్మాణం పనులను నాగలాపుర మఠం తేజేశలింగశివమూర్తి స్వామీజీ మంగళవారం ప్రారంభించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ గత ఏడాది జాతర సందర్భంగా ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ ఇచ్చిన మాట ప్రకారం రూ. 80 లక్షల నిధులు విడుదల చేయించారన్నారు. సూలూరు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పెమ్మశెట్టిహళ్లి సురేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మైలాండహళ్లి మురళి, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. -
వాడీవేడిగా బడ్జెట్ ముందస్తు సమావేశం
సాక్షి బళ్లారి: నగరంలో సమస్యలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయని, ఓ వైపు మంచి నీటి సమస్య, మరో వైపు అస్థవ్యస్థమైన రోడ్లు, యూజీడీతో జనం సతమతం అవుతున్నారని ఆక్రమణలు చేసుకొని యథేచ్ఛగా భవనాల నిర్మాణం కొనసాగుతున్నా పాలికె చోద్యం చూస్తోందని పలువురు నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మహానగర పాలికె కార్యాలయంలో నూతన మేయర్ గాదెప్ప అధ్యక్షతన జరిగిన తొలి బడ్జెట్ ముందస్తు సమావేశంలో సమస్యలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. బడ్జెట్ కన్నా ముందు పలువురి సలహా సూచనలు తీసుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకొన్న నేపథ్యంలో నగరంలోని పలు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగరంలోని సమస్యలపై అవగాహాన ఉన్న ప్రముఖులు హాజరై నగరంలోని సమస్యలను పాలికె ముందు ఉంచారు. పాలికె ఆదాయాన్ని పెంచండి ఆంధ్రాళ సేవా సమితి అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త ఆర్.వెంకటరెడ్డి మాట్లాడుతూ నగరంలో పేరుకుపోయిన, రాజకీయ పలుకుబడి కలిగిన పెద్దల నుంచి ముందుగా పన్నులను ఎలాంటి మొహమాటం లేకుండా వసూలు చేయాలన్నారు. మరో సామాజిక కార్యకర్త మేకల ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ కొళగల్లులో మంచినీటి చెరువుకు 297 ఎకరాలను సేకరించిందన్నారు. అయితే పాలికె డంపు యార్డ్గా మార్చుకుందని మండిపడ్డారు. నగరంలోని పార్కులు అధ్వానంగా ఉన్నాయని, వాటిని సరిచేయాలన్నారు. అలాగే వేణుగోపాల్, సిద్ధేశ్ మాట్లాడుతూ నగర పాలికె పరిధిలో పలు సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేసి పరిష్కరించాలన్నారు. కర్ణాటక వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లాధ్యక్షుడు వీరభద్రగౌడ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇతర మహానగర పాలికెల పరిధిలో అమల్లో ఉన్న విలేకర్ల క్షేమాభివృద్ధి నిధులను బళ్లారిలో కూడా అమలు చేయాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లపై పన్ను వేయండి నవ కర్ణాటక యువశక్తి సంఘం సీ.మంజునాథ్ మాట్లాడుతూ నగరంలో ఇళ్లల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలల నుంచి పన్నులు వసూలు చేయాలన్నారు. కర్ణాటక యువక సంఘం అధ్యక్షుడు బసవరాజు మాట్లాడుతూ పెద్ద మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్న ప్రతి ఒక్కరితో డబ్బులు వసూలు చేసి నగరాభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. సమస్యలను ఆలకించిన తర్వాత నూతన మేయర్ గాదెప్ప మాట్లాడుతూ నగరంలోని వివిధ సంఘ సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఇచ్చిన సలహాలను తూచ తప్పకుండా పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించేందుకు ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తం మీద సమావేశంలో నగర సమస్యలపై పెద్ద ఎత్తున చర్చించడంతో అధికారులు, పాలక వర్గం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. సమస్యలపై గళం విప్పిన జనం పలు డిమాండ్లు వినిపించిన వైనం -
భక్తిభావాలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: మానవులు జీవితంలో భక్తిభావాలు పెంపొందించుకునేందుకు కృషి చేయాలని శ్రీశైల పీఠాధిపతి జగద్గురు ప్రసన్న చంద్రశేఖర శివాచార్య పిలుపు ఇచ్చారు. మంగళవారం సింధనూరు తాలూకా బంగారి క్యాంప్లో రౌడకుంద సిద్దాశ్రమలో ఆధ్యాత్మిక వేడుకలో ఆయన మాట్లాడారు. మానవుడు పని ఒత్తిళ్లతో ప్రతి నిత్యం ఎంతో మథనపడుతున్నాడన్నారు. రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. దేశంలో ధర్మం, దేవాలయ రక్షణకు సమాజంలో భక్తులు చేస్తున్న సేవలు దోహదపడతాయన్నారు. సమావేశంలో స్వామీజీలు శాంత మల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీరసంగమేశ్వర స్వామీజీలున్నారు. -
బస్సు బోల్తా పడి కండక్టర్ దుర్మరణం
●35 మంది ప్రయాణికులకు గాయాలు ●రాయచూరు జిల్లా దేవదుర్గలో ఘటన రాయచూరు రూరల్: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటనలో కండక్టర్ దుర్మరణం చెందగా 35 మంది ప్రయాణికులకు గాయాలైన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం దేవదుర్గ తాలూకా అంజళ నుంచి దేవదుర్గకు వాపస్ వస్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ తప్పడంతో అంచెసూగూరు వద్ద కాలువ గట్టు వద్ద బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన కండక్టర్ బసవరాజ్(35) రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 40 మందిలో 38 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో దేవదుర్గ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు ఘటన స్థలానికి చేరుకొని కిటికీ అద్దాలను పగులగొట్టి క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. దేవదుర్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల విలీనం వద్దు రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ పాఠశాల(కేపీఎస్)ల్లోకి విలీనం చేయడానికి ముందుకొచ్చిన సర్కార్ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయబోమని ఆదేశాలు జారీ చేయాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. మంగళవారం రాయచూరు తాలూకా అన్వరిలో చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నందగోపాల్ మాట్లాడారు. సోమవారం బెళగావి విధానసభలో శాసన సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప మాట్లాడారు. రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలను మూసేయడం లేదని చెప్పిన సమాధానానికి లిఖిత రూపంలో ఆదేశాలు జారీ చేయాలన్నారు. కేంద్ర మంత్రిని నిందించడం తగదురాయచూరు రూరల్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏకవచనంతో నిందించడం తగదని రాయచూరు జిల్లా మహిళా బీజేపీ అధ్యక్షురాలు, నగరసభ మాజీ అధ్యక్షురాలు లలిత కడుగోలు మంగళవారం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సీఎంకు భారతీయ సంప్రదాయం, మహిళలపై గౌరవం లేదన్నారు. -
4 ఏళ్లలో 52 వేల సైబర్ నేరాలు
బనశంకరి: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్ నేరగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. లక్షల రూపాయలను జనం నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్శాఖ చేపట్టిన కఠినచర్యలతో రాష్ట్రంలో సైబర్నేరాలు తగ్గుముఖం పట్టాయని హోంశాఖమంత్రి జీ.పరమేశ్వర్ చెప్పారు. బెళగావి సువర్ణసౌధ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుల ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత నాలుగేళ్లలో కర్ణాటకలో 52 వేల సైబర్ నేరాలు నమోదయ్యాయి. సైబర్ నేరాల నియంత్రణకు చట్టం మార్చాము, కానీ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఈ చట్టం మీద స్టే తీసుకువచ్చింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉంది అని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే సిమెంట్ మంజు మాట్లాడుతూ ఆన్లైన్ గేమ్లకు, జూదాలకు యువకులు బలి అవుతున్నారని, దీనికి అడ్డుకట్ట పడడం లేదన్నారు. నిందితులను అరెస్ట్ చేయడం లేదని, కర్ణాటకలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. సైబర్ మోసాల బాధితులు కేంద్ర ప్రభుత్వ సహాయవాణి కి ఫిర్యాదు చేసేలోగా నగదు కోల్పోతున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరారు. గతేడాది 28 వేల కేసులు 2023లో 22,250 సైబర్ వంచన కేసులు నమోదు కాగా, 6,159 కేసుల ఆచూకీని పోలీసులు కనిపెట్టారని హోంమంత్రి తెలిపారు. సుమారు రూ.880 కోట్లు దోచేయగా ఇందులో రూ.177 కోట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 2024లో 28,478 కేసులు నమోదుకాగా, ఇందులో రూ. 2,562 కోట్లు వంచనకు గురికాగా, ఇందులో రూ.323 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 2025లో 13 వేల కేసులు రాగా, రూ.2,038 కోట్లు సైబర్కేటుగాళ్లు దోచేశారు. ఇందులో రూ.127 కోట్లు రికవరీ చేసుకున్నారని తెలిపారు. సైబర్ నేరాల సంఖ్య తగ్గిందని, నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 13 వేల కేసులు, రూ. 2వేల కోట్లకు పైగా లూటీ అసెంబ్లీలో హోంమంత్రి పరమేశ్వర్ -
భూబాధిత రైతులను ఆదుకోండి
సాక్షి బళ్లారి: కుడితినిలో ఎన్నో నెలలుగా ఆందోళన చేస్తున్న భూమి ఇచ్చిన రైతులను మానవతా దృక్పథంతో త్వరలో పరిష్కరించాలని విధాన పరిషత్ సభ్యుడు వైఎం.సతీష్ డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల రెండో రోజు బెళగావిలో జరిగిన విధాన పరిషత్తులో ఆయన గళం విప్పారు. కుడితిని పరిసరాల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు కుడితిని, వేణివీరాపురం, సిద్ధమ్మనహళ్లి, హరగినడోణి తదితర చుట్టు పక్కల గ్రామాల్లో రైతుల నుంచి కేఐఏడీబీ స్వాధీనం చేసుకొన్న భూమిలో పరిశ్రమలు నెలకొల్పకపోవడంతో భూమి ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తక్కువ ధరతో భూమిని కొనుగోలు చేసి, భూమి ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొందన్నారు. అయితే అటు పరిశ్రమలను నెలకొల్పక, ఇటు ఉద్యోగాలు రాకపోవడంతో రైతుల కుటుంబాలు వీధినపడ్డాయన్నారు. 12 వేల ఎకరాలకు పైగా స్వాధీనం ఆర్సెలార్ మిట్టల్ ఇండియా లిమిటెడ్, ఉత్తమ్ గాల్వా ఫెరోస్ లిమిటెడ్, కర్ణాటక విజయనగర స్టీల్ తదితర కంపెనీలు ఈ ప్రాంతంలో సుమారు 12 వేల ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకొన్నాయన్నారు. అయితే పరిశ్రమలను నెలకొల్పకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు కోర్టును ఆశ్రయించడంతో ఎకరాకు రూ.1.30 కోట్లు ఇవ్వాలని సూచించిందన్నారు. అయితే రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో కుడితినిలో ఎన్నో నెలలుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఆ రైతులను మానవత దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 15 సంవత్సరాలుగా భూమి ఇచ్చిన రైతులు చేస్తున్న ఆందోళనపై మనవిని ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయన్నారు. పరిషత్లో ఎమ్మెల్సీ సతీష్ డిమాండ్ -
పెండింగ్ పనుల సత్వర పూర్తికి సూచన
హొసపేటె: జిల్లాలోని 8 స్థానిక సంస్థల పరిధిలోని వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లాధికారిణి కవితా ఎస్. మన్నికేరి అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన పట్టణ, స్థానిక సంస్థల వివిధ ప్రాజెక్టుల ప్రగతి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి, ప్రభుత్వ వివిధ పథకాల కింద చేపట్టిన రోడ్లు, మురుగు నీటి పారుదల, విద్యుత్ దీపాలు, వ్యర్థాల తొలగింపు, ఇతర అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. స్థానిక సంస్థల్లో మిగిలిన నిధులను ప్రాథమిక సౌకర్యాలు, అభివృద్ధి పనుల కోసం నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వ సహాయం, అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్లు వంటి వివిధ పథకాలను లబ్ధిదారులకు సమన్వయంతో పంపిణీ చేయాలన్నారు. జిల్లా పట్టణాభివృద్ధి సెల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, పట్టణ స్థానిక సంస్థల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. -
మీటర్ రీడర్పై పాశవిక దాడి
మండ్య: మండ్య నగరంలోని గాంధీనగర్లోని ఏడవ క్రాస్లో సెస్కాం విద్యుత్ సంస్థ మీటర్ రీడర్ మీద ఓ కుటుంబం హత్యాయత్నానికి పాల్పడింది. మీటర్ పాతబడింది, కొత్త మీటర్ను అమర్చుకోవాలని చెప్పడమే అతను చేసిన పాపం. వివరాలు.. మండ్య సబ్–డివిజన్ సెస్కాంలో మీటర్ రీడర్ పి.సి.చన్నకేశవ (45) బాధితుడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ప్రకాష్, అతని కుమారుడు అర్జున, భార్య, తల్లి, మనవరాళ్ళు అతనిపై దాడి చేశారు. డిసెంబర్ 8న, చన్నకేశవ గాంధీనగర్లోని ఏడవ క్రాస్లోని ప్రకాష్ ఇంటికి మీటర్ రీడింగ్ కోసం వెళ్ళినప్పుడు, మీటర్ పాడైపోయిందని గమనించాడు. కొత్త మీటర్ను అమర్చుకోవాలని చెప్పడంతో మాకే చెప్పేంతవాడినా అని కోపం పట్టలేక దూషించి రంపం, కట్టెలు, రాళ్లు, ఇటుకలతో చావబాదారు. చన్నకేశవ వదిలేయాలని వారిని వేడుకున్నా వినకుండా కండలు ఊడి రక్తం పారేలా కొట్టసాగారు. బాధితుడు ఎలాగో తప్పించుకుని ఆస్పత్రిలో చేరాడు. దాడికి పాల్పడిన నిందితులపై వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హోటల్లో నగల మాయం మైసూరు: హోటల్ గదిలో ఓ మహిళ ఆభరణాల బ్యాగ్ మాయమైన ఘటన మైసూరు నగరంలో జరిగింది. వివరాలు.. బెంగళూరులోని టీ.దాసరహళ్లి నివాసి పల్లవి.. సోదరి వివాహ వేడుక కోసం కుటుంబ సభ్యులతో కలిసి మైసూరుకు వచ్చి ఓ హోటల్లో బస చేశారు. హెబ్బాళలోని లక్ష్మీకాంత దేవస్థానంలో జరిగిన వివాహంలో పాల్గొని హోటల్కు తిరిగి వచ్చారు. వేరొక హోటల్లో జరిగే రిసెప్షన్కు వెళ్లే ముందు రెండు గదులను ఖాళీ చేసి లగేజీని చూసుకోగా రూ.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ కనిపించలేదు. నజరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గీజర్ లీకై తల్లీ బిడ్డ మృతి దొడ్డబళ్లాపురం: వేడినీళ్ల గ్యాస్ గీజర్ లీక్ కావడంతో అస్వస్థతకు గురైన తల్లీ బిడ్డ చనిపోయిన సంఘటన బెంగళూరు గోవిందరాజనగరలోని పంచశీల నగరలో జరిగింది. తల్లి చాందిని (26), కుమార్తె యువి (4) మృతులు. చాందిని సోమవారం సాయంత్రం కుమార్తెకు స్నానం చేయించడానికి బాత్రూంలోకి వెళ్లగా అప్పటికే గ్యాస్ గీజర్లో నుంచి గ్యాస్ లీకై ఉంది. ఆ వాయువుని పీల్చిన ఇద్దరూ స్పృహ తప్పిపడిపోయారు. కొంతసేపటికి ఇరుగుపొరుగు ఇద్దరినీ విక్టోరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అన్నదాతల ఇబ్బందులు పట్టవా?● ఎప్పుడూ కుర్చీ గొడవలేనా? ● బెళగావిలో రైతులు, బీజేపీ నేతలచే అసెంబ్లీ ముట్టడి బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందంటూ రైతు సంఘాలతో కలిసి బీజేపీ నాయకులు బెళగావిలో అసెంబ్లీ ముట్టడిని నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై.విజయేంద్ర, ఆర్.అశోక్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతులు పాల్గొన్నారు. బెళగావి మాలిని మైదానంలో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. తరువాత హైవే–4 గుండా అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. రైతులు మొక్కజొన్న , కందిని ప్రదర్శిస్తూ తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని, మద్దతు ధరలను ప్రకటించాలని పలు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీ లేకుండా కేంద్ర ప్రభుత్వం పై అనవసర ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. బీవై.విజయేంద్ర మాట్లాడుతూ దేశంలో అత్యధికమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నది కర్ణాటకలోనే అన్నారు. రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి బదులుగా సీఎం, డిప్యూటీ సీఎం కుర్చీ కోసం పోరాటంలో నిమగ్నమయ్యారనిమారోపించారు. వెంటనే మొక్కజొన్న, కందిపంటల కొనుగోలు కేంద్రాలను తెరవాలని సర్కారును డిమాండ్ చేశారు. తుంగభద్ర ఆనకట్ట గేట్లు పాడై ఏడాదిన్నర గడించింది, ఇప్పటికీ బాగు చేయలేదని అన్నారు. -
యూటర్న్లో వరుస యాక్సిడెంట్లు
భాగ్యనగర్, (బాగేపల్లి): మలుపులో ఆగి ఉన్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టగా ఆటోలో నుంచి వృద్ధుడు కిందపడిపోయాడు, అతని మీద నుంచి ఏపీఎస్ ఆర్టీసీ దూసుకెళ్లడంతో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదాల్లో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాగేపల్లి పట్టణ శివార్లలోని జాతీయ రహదారి–44 లో సాయిబాబా ఆలయం మలుపు వద్ద మంగళవారం ఈ సంఘటన జరిగింది. పొరుగున హిందూపురం తాలూకా లేపాక్షి మండలం చిలువెందుల వాసి ఆదిమూర్తి (80) మృతుడు. ఎలా జరిగింది బాగేపల్లి తాలూకాలోని సుంకులమ్మ దేవి ఆలయానికి కొందరు ఆటోలో వచ్చారు. హైవేలో మలుపు వద్ద యూ టర్న్ తీసుకోవడానికి ఆటోని ఆపారు. ఈ సందర్భంలో బైకిస్టును తప్పించే యత్నంలో ఓ లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొనింది. ఈ ధాటికి ఆటోలో నుంచి ఆదిమూర్తి పడిపోవడం, అతని మీద నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెళ్లిపోవడం క్షణాల్లో జరిగాయి. ఆటోలో ఉన్న మిగిలిన ప్రయాణికులకు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిని బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి చిక్కబళ్లాపుర జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసు అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఎస్పీకుశాల్ చౌక్సే మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ నెల 12 నుంచి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని తెలిపారు. లారీ, బస్సు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగి ఉన్న ఆటోను లారీ ఢీ.. కిందపడిన వృద్ధునిపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు ఒకరు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు బాగేపల్లి వద్ద దుర్ఘటన -
దశాబ్దాలు గడిచినా శుభ్రత మిథ్య
రాయచూరు రూరల్: నగరవాసులకు కలుషిత నీటిని విడుదల చేయడంతో వాటిని తాగి వాంతులు, విరేచనాలతో ిపిల్లలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. నిరంతర నీటి సరఫరాకు రూ.135 కోట్లు వ్యయం చేసి ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా చేయడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు విఫలం అయ్యారు. తుంగభద్ర ఎడమ కాలువ నుంచి రాంపుర జలాశయం ద్వారా నీటిని ట్యాంకులకు సరఫరా చేస్తారు. 25 ఏళ్ల క్రితం నిర్మించిన 35 ఓవర్ హెడ్ ట్యాంక్లు, 7 భూగర్భ ట్యాంకులలో ఒండు మట్టి మిశ్రితం కావడంతో ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంలో నగరసభ పాలక, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మరమ్మతుకు నోచుకోని ట్యాంకులు కొళాయిల్లో మంచినీరు రాని వైనం -
మది నిండా.. బృహత్ జాతీయ జెండా
పతాకం ముందు సీఎం, డీసీఎం బనశంకరి: బెళగావిలో సువర్ణసౌధ పశ్చిమ ద్వారం వద్ద మంగళవారం అతి పెద్ద జాతీయ పతాకాన్ని సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ప్రారంభించారు. స్వరాజ్య ఉద్యమంలో జాతిపిత మహాత్మా గాంధీ బెళగావిలో కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన జ్ఞాపకార్థం దీనిని ఆవిష్కరించారు. 75 అడుగుల పొడవు, 55 అడుగుల వెడల్పుతో ఉంది. జెండా నిర్మాణానికి శ్రమించిన కలబుర్గివాసి వినోద్కుమార్ రేవప్ప బొమ్మణ్ణను సీఎం సన్మానించారు. ఇది ఖాదీ వస్త్రం కాదని, దేశానికి గర్వకారణమన్నారు. జాతీయ జెండా మనందరికీ గర్వకారణం, స్వాభిమానానికి సంకేతమన్నారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ స్పీకర్ యుటీ.ఖాదర్ చొరవతో వందేళ్ల చరిత్ర ను కాపాడేందుకు ఈ జాతీయ పతాకాన్ని రూపొందించారని తెలిపారు. దేశంలోని అందరి ఇళ్లుపై జాతీయ పతాకం ఎగరాలి, గుండెల్లో దేశభక్తి భావన ఉండాలని పిలుపునిచ్చారు. కిత్తూరు ఖాదీ కేంద్రం గరగలో మహిళా కార్మికులు ఈ జెండాను తీర్చిదిద్దారని తెలిపారు. ఇక్కడ శాసనసభ సమావేశాలు నిర్వహించే ప్రతిసారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించాలని నిర్ణయించారు. ప్రపంచంలో అతి పెద్ద జాతీయ పతాకాల్లో ఇది రెండవదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు జెండాను ఇలాగే ప్రదర్శిస్తారని తెలిసింది. బెళగావి అసెంబ్లీ ముందు ఆవిష్కారం -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
హుబ్లీ: దివ్యాంగ బాలలు దేవుడి బిడ్డలుగా సమాజంలో అంతంత మాత్రమే ఆదరణకు నోచుకుంటున్నారు. అలాంటి ఈ పిల్లలకు మంగళూరులో వాట్సప్ గ్రూప్ ద్వారా సామాజిక స్పృహ కలిగిన ఓ బృందం పిక్నిక్ విహార యాత్ర ఏర్పాటు చేసి ఆ పిల్లల్లో కాసింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని నింపింది. మంగళూరుకు చెందిన పోస్టల్ ఫ్రెండ్స్ అనే బృందం ఈ మానవత కార్యక్రమాన్ని చేపట్టి అందరిలో వమాయమవుతున్న మానవత్వం పట్ల ప్రేరణ కలిగించింది. 2017లో ముగ్గురుతో ప్రారంభం అయిన ఈ వ్యాట్సప్ గ్రూప్ నమోదిత ట్రస్ట్గా సేవలు అందిస్తున్న ఈ సంస్థలో ప్రస్తుతం 80 మంది సభ్యులు ఉన్నారు. అబుదాబిలో నివసిస్తున్న పుత్తూరు పార్లడ్క నివాసి సిరాజ్ ఉద్దీన్ మదిలో చిగురించిన ఈ సంస్థకు షరీఫ్ అబ్బాస్ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా తెలివిగా మెలగాలని శిక్షణ కూడా ఇచ్చారు. ఈ వ్యాట్సప్ గ్రూప్లో ఉన్న వారు నియమాల ప్రకారం విసుగుతో మెసేజ్ డిలీట్ చేస్తే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా సొమ్ము రూ.10 వేలు దాటితే సమాజానికి దానంగా అందిస్తారు. ఈ సంస్థ సామాజిక, విద్య, ఆరోగ్య రంగాలపై అధిక ప్రాధాన్యతను ఇస్తూ రక్తదానం, మెడికల్ బెడ్, వీల్ చెయిర్ల పంపిణీ కార్యక్రమాన్ని విరివిగా చేపడుతోంది. మొత్తం మీద గ్రూప్ సమాజానికి భారంగా భావించే కొందరి వైఖరిని మేల్కొలిపేలా చేస్తున్న కృషి అభినందనీయం. దివ్యాంగ బాలలకు పిక్నిక్ -
ప్రభుత్వంతో విపక్షం తాడోపేడో
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ మంగళవారం బెళగావి సువర్ణ విధానసౌధ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనుంది. కష్టాల్లో ఉన్న చెరకు, మొక్కజొన్న పండించిన రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదు. అతివృష్టితో పంట నష్టం జరిగింది. పంట నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందించలేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించిన బీజేపీ మంగళవారం బెళగావిలో మాలిని మైదానంలో రైతులతో భారీ సమావేశం నిర్వహించి, ఆ తరువాత సువర్ణసౌధను ముట్టడించనుంది. మంగళవారం రైతుల సమావేశం, సువర్ణ విధానసౌధ ముట్టడి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నాయకులు ఆర్.అశోక్, ఛలవాది నారాయణస్వామి నేతృత్వంలో జరుగనుంది. బీజేపీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు, రైతులు పాల్గొననున్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్–విజయేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగం, నీటిపారుదల, చేనేతకారుల, రైతుల సమస్యలతో పాటు వేటినీ నెరవేర్చలేదు. అంతేకాకుండా ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయటంలోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిమగ్నమయ్యారని విజయేంద్ర విమర్శించారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మరిచిపోయారు. వీటన్నిటిని ఖండిస్తూ మంగళవారం సువర్ణ విధానసౌధ ముట్టడించటం ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని సువర్ణ విధానసౌధ వద్ద విలేకరులకు తెలియజేశారు. ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చకు పెద్దపీట విధాన పరిషత్ కార్యకలాపాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలు, విషయాలపై చర్చకు పెద్దపీట వేస్తామని పరిషత్ సభాపతి బసవరాజ్ హొరట్టి తెలిపారు. సోమవారం బెళగావిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిషత్ సమావేశాల్లో గత సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలు, విషయాలపై ఎక్కువగా చర్చ జరగలేదు. అయితే ఈసారి సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలు, విషయాలపై చర్చకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. దక్షిణ కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు, ఉత్తర కర్ణాటక ప్రజల సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పిస్తాం. ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత ఉత్తర కర్ణాటక సమస్యల గురించి చర్చిస్తామన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలపై ఉత్తర కర్ణాటక ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. ఫోన్ చేసి అందరు ఎమ్మెల్యేలకు కూడా చెబుతున్నానన్నారు. సమావేశాల్లో పాల్గొనాలని ఇప్పటికే 38 మందితో మాట్లాడాను. మిగతావారితో కూడా మాట్లాడుతున్నాను. అందరూ కూడా సమావేశాల్లో పాల్గొని సభా గౌరవాన్ని కాపాడాలని హొరట్టి విన్నవించారు. పరిహారం చెల్లింపునకు సిద్ధం పరిహారం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం బాధ్యతా ఉంది కదా? ఇప్పటి వరకు కూడా బొమ్మై ఎందుకు పార్లమెంట్లో ఈ విషయం గురించి మాట్లాడలేదు? ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి ఎందుకు చర్చించలేదు? అని ప్రశ్నించారు. నీటిపారుదల సమస్య, పథకాలు అమలు కాకపోవటం గురించి అడిగినపుడు తమ హయాంలో నీటిపారుదల రంగానికి చేసినంత చరిత్రలో ఎవ్వరూ చేయలేదని చెబుతున్నారు. అయితే తాను కోరేది ఒక్కటే రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై బొమ్మై మాట్లాడాలి అని అన్నారు. సర్కారు రైతు వ్యతిరేక విధానంపై నిరసన నేడు సువర్ణ విధానసౌధ ముట్టడికి బీజేపీ సన్నద్ధం నియమావళి ప్రకారం నడుచుకుంటా: హొరట్టి సభాపతి స్థానం నుంచి తనను తొలగించే విషయంపై ఆయన మాట్లాడుతూ తాను గతంలో పరిషత్ సభాపతిని అయ్యాను. ఎన్ని సంవత్సరాలైనా కూడా మాజీ కానే కావాలి. విధాన పరిషత్ సభాపతి స్థానం గురించి తాను అంతగా విచారానికి గురికాను. ప్రభుత్వం, ఎమ్మెల్యేలు తీసుకునే తీర్మానానికి తాను కట్టుబడి ఉన్నానన్నారు. సభలో తనపై అవిశ్వాస నిర్ణయం ప్రవేశపెట్టే సమయం వస్తే నియమాల ప్రకారం నడచుకొంటానన్నారు. విధాన పరిషత్లో ఖాళీ ఉద్యోగాల నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరుగలేదు. 30 ఉద్యోగాలకు కర్ణాటక పరీక్ష ప్రాధికార (కేఈఏ) పరీక్ష జరిపి అధిక మార్కులు పొందినవారి జాబితా ఇచ్చింది. దానిని పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఉ–క సమస్యలకు కేంద్రమే బదులివ్వాలి– డీకే శివకుమార్ ఉత్తర కర్ణాటక సమస్యలకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. చెరకు, మొక్కజొన్న రైతుల విషయమై తాను, సీఎం సిద్దరామయ్యతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణమైన తీర్మానాన్ని తీసుకున్నట్లు డీసీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. సదాశివనగర నివాసం వద్ద మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ చెరకు, మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు నోరు మెదపలేదన్నారు. బీజేపీకి చెందిన ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యల గురించీ నోరు విప్పటం లేదన్నారు. బసవరాజ్ బొమ్మై రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెబుతున్నారు. అలాగైతే కేంద్ర ప్రభుత్వం వాటా ఏమిటి? దీనిని తీర్మానం చేసేవారు ఎవరు? ప్రతి ఒక్కదానికి ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. అయినా కూడా ఈ విషయంలో తీర్మానం చేయటం లేదు. -
మైసూరులో వైద్యుని డిజిటల్ అరెస్టు
మైసూరు: ప్యాలెస్ సిటీ మైసూరులో తరచూ సైబర్ నేరగాళ్ల చేతిలో జనం మోసపోతూనే ఉన్నారు. తాజాగా ముంబై పోలీస్ అధికారి పేరుతో ఒక మోసగాడు మైసూరులోని ఒక వైద్యున్ని డిజిటల్ అరెస్టు చేసి రూ.82.10 లక్షలు వసూలు చేశాడు. మైసూరు విజయనగర నివాసి అయిన రాజీవ్ బాధితుడు. ఎలా జరిగిందంటే.. వివరాలు.. రాజీవ్కు కాల్ చేసిన వ్యక్తి తాను టెలికాం సంస్థ అధికారినని, మీ పేరుతో ఉన్న సిమ్ ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగాయని, మనీలాండరింగ్ కోసం ఉపయోగించారని, అశ్లీల వీడియోలు రవాణా చేశారని పలు ఆరోపణలు చేశాడు. మీ ఖాతా నుంచి అక్రమంగా రూ. 2 కోట్లు బదిలీ చేయబడ్డాయి అని బెదిరించాడు. తరువాత మరో వ్యక్తి వాట్సాప్లో వీడియో కాల్ చేసి తాను ముంబై బాంద్రా ఠాణా పోలీసు అధికారినని చెప్పాడు. మోసగాడు, మిగతావారు పోలీసు దుస్తుల్లో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో మిమ్మల్ని, మీ భార్యను అరెస్టు చేస్తామని భయపెట్టారు. మీ ఆస్తుల వివరాలను చెప్పాలని, బ్యాంక్ ఖాతాల వివరాలను ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అలా వైద్యుని నుంచి రూ 82.10 లక్షలు బదిలీ చేయించుకుని ఫోన్లు స్విచాఫ్ చేశారు. బాధితుడు సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అక్రమాలకు పాల్పడ్డారంటూ రూ.82 లక్షల వసూలు -
చెరువులోకి కారు జంప్
శివమొగ్గ: జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం రిప్పన్పేట సమీపంలో మారుతి ఆల్టో కారు తావరెకెరె చెరువులోకి దూసుకెళ్లింది. హాసన్ జిల్లా నుంచి కొల్లూరు మూకాంబిక దేవాలయానికి వెళ్తున్న కుటుంబం ఈ ప్రమాదంలో చిక్కుకుంది. కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు చూసి వెంటనే చెరువులోకి దిగి ప్రయాణికులను రక్షించారు. రిప్పన్పేట పోలీసులు, ఫైర్ సిబ్బంది కారును నుంచి బయటకు తీశారు. కనువిందుగా తెప్పోత్సవం తుమకూరు: శిరా తాలూకాలోని మదలూరు చెరువుకు ఎమ్మెల్యే టి.బి. జయచంద్ర వాయనం సమర్పించారు, ఆపై నేత్రపర్వంగా చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు. శిరా తాలూకాకు పెద్ద కంపెనీలు వస్తున్నాయి, వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. మదలూరు చెరువు కళకళలాడడానికి దివంగత ముఖ్యమంత్రి దేవరాజ్ అరసు ప్రధాన కారణమని, ఆయన పుణ్యం వల్లనే తుమకూరుకు హేమావతి నీరు లభిస్తోందని చెప్పారు. వలలో చిక్కి చిరుత మృతి శివమొగ్గ: శిరాలకొప్పలోని అడవికి అంచున జంతువులను పట్టుకోవడానికి వేటగాళ్లు ఏర్పాటు చేసిన వలలో చిక్కుకుని చిరుతపులి చనిపోయింది. చిరుత కళేబరం కుళ్ళిపోయి ఉంది, స్థానికులు చూసి వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. అటవీ అధికారి జావేద్, సిబ్బంది చేరుకుని చిరుత కళేబరాన్ని తరలించారు. ప్రియుని మోసానికి బలి దొడ్డబళ్లాపురం: ప్రేమ పేరుతో మోసపోయిన యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామనగర తాలూకా విభూతికెరె గ్రామంలో జరిగింది. వర్షిణి (22) మృతురాలు. ఈమె, అభి అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ మోసం చేశాడని డెత్నోట్లో రాసింది. రెండేళ్లు ప్రేమించినట్టు నటించి శారీరకంగా వాడుకుని గర్భవతిని చేశాడు. తరువాత బలవంతంగా అబార్షన్ చేయించాడు. నా నుంచి డబ్బు, బంగారం తీసుకుని బ్లాక్మెయిల్ కూడా చేశాడు. మోసపోయాననే బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు డెత్నోట్లో తెలిపింది. అభిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. రామనగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫొటోషూట్ విషాదమయం ● టిప్పర్ ఢీకొని కాబోయే దంపతుల మృతి సాక్షి, బళ్లారి: కాబోయే వధూవరులపై విధి కన్నెర్రజేసింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కొప్పళ తాలూకా గంగావతి సమీపంలో కొత్త జంట వెళ్తున్న బైక్ను లారీ ఢీకొంది. కొప్పళ తాలూకా హనుమనహట్టి కి చెందిన కరియప్ప మడివాళ (26), కారటిగి తాలూకావాసి కవిత మడివాళ (19) ఇద్దరూ దుర్మరణం చెందారు. ఇటీవల వీరి నిశ్చితార్థం ఘనంగా సాగింది. 21వ తేదీన పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జంట గంగావతి, హంపీ పరిసరాల్లో పెళ్లి కి ముందు ఫోటో వేడుక చేసుకుని బయల్దేరారు. బెనకల్– గాళెమ్మన గుడి క్రాస్ సమీపంలో వేగంగా వస్తున్న టిప్పర్ బైక్ని ఢీకొని మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఫొటోషూట్లో తీసుకున్న చిత్రాలే జ్ఞాపకాలుగా మిగిలాయి. -
జాతీయ కరాటే పోటీల్లో సత్తా
కేజీఎఫ్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో నిర్వహించిన జాతీయ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో నగరానికి చెందిన ఒకినావా కరాటే విద్యా సంస్థ విద్యార్థులు వరుసగా మూడో సారి చాంపియన్లుగా నిలిచారు. సోమవారం చాంపియన్లుగా తిరిగి వచ్చిన సంస్థ విద్యార్థులను అభినందించి కరాటే మాస్టర్ ఉలగనాథన్ మాట్లాడారు. తమ సంస్థ వరుసగా మూడోసారి కరాటే చాంపియన్షిప్ సాధించడం హర్షణీయమన్నారు. విద్యార్థుల సాధనను తాను అభినందిస్తున్నానన్నారు. ఆత్మరక్షణలో కరాటే ఒక భాగం అని, తల్లిదండ్రులు కరాటేను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. తమ పిల్లలకు కరాటే నేర్పించాలన్నారు. తమను తాము రక్షించుకోవడానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరూ కరాటే తప్పకుండా నేర్చుకోవాలన్నారు. ప్రతి నిత్యం ఒక గంట పాటు కరాటే అభ్యాసం చేయడం ద్వారా ఎంతో ఉపయోగం ఉందన్నారు. కరాటే ద్వారా శారీరక దారుఢ్యం కలిగి ఆరోగ్యం సుస్థితిలో ఉంటుందన్నారు. కరాటే నేర్చుకున్న విద్యార్థులు చదువులో ముందంజలో ఉండడాన్ని చూస్తున్నామన్నారు. తమ విద్యార్థులు చాంపియన్న్లుగా తిరిగి రావడం కేజీఎఫ్ నగరానికి గర్వకారణమన్నారు. -
ప్రతిభాన్విత విద్యార్థులకు సన్మానం
హొసపేటె: కర్ణాటక ప్రతిభా అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. విజయనగర జిల్లాలో టెన్త్, పీయూసీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. జిల్లాలోని హొసపేటె, హగరిబొమ్మనహళ్లి, హువిన హడగలి, హరపనహళ్లి, కొట్టూరు, కూడ్లిగి తాలూకాల నుంచి ఒక్కొక్కరికి కలిపి 10 మంది చొప్పున ఆరు తాలూకాలకు చెందిన మొత్తం 60 మంది అర్హులైన, ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి సత్కరించారు. హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, బీఈఓ శేఖర్ హొరపేటె, సోమశేఖర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్ను లారీ ఢీకొని డ్రైవర్ మృతి బళ్లారి రూరల్: ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన హగరి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. సంబంధీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అసుండికి చెందిన బసవరాజు (30) ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం సాగిస్తుండేవాడు. ఆదివారం రాత్రి హగరి వద్ద ట్రాక్టర్ నడుపుకొంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బసవరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పీడీహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని బీఎంసీఆర్సీ మార్చురీకి తరలించారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అప్పుల బాధకు మరో రైతు బలి
బళ్లారిఅర్బన్: అప్పుల బాధకు మరో రైతు బలైన ఘటన జిల్లాలోని కురుగోడు తాలూకా సోమసముద్రం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కోమారి(35) ఆత్మహత్య చేసుకున్న రైతు. కాగా ఈ యువ రైతన్నకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సాగు పనుల కోసం సహకార రైత బ్యాంక్, ఇతర వ్యాపార వర్గాల నుంచి చేసిన అప్పులు తీర్చలేక పోయారు. పొలానికి పెట్టుబడి పెట్టి పండించిన పంటంతా నేలపాలైంది. దీంతో మనోవేదనకు గురై కోమారి పంటలకు కొట్టే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కురుగోడు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 13న విద్యుత్ ఉద్యోగుల సమ్మేళనంబళ్లారి రూరల్ : దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 13న కోల్కతాలో అఖిల భారత విద్యుత్ ఉద్యోగుల సమ్మేళనం జరుగనున్నట్లు ఏఐపీఎఫ్ అఖిల భారత అధ్యక్షుడు కే.సోమశేఖర్ తెలిపారు. సోమవారం పత్రికా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులపై దాడులు పెరగడం, ప్రైవేటీకరణ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా సమ్మేళనం జరుగుతోందన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్స్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పాత పింఛను పద్ధతిలో కనీసం రూ.10 వేల పింఛను ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఈ దిశగా కోల్కతాలో జరుగనున్న సమ్మేళనానికి కర్ణాటక రాష్ట్రం నుంచి విద్యుత్ ఉద్యోగులు తరలి వెళ్లనున్నట్లు తెలిపారు. ఏఐపీఎఫ్ ప్రముఖుడు డాక్టర్ ప్రమోద్, ఏఐయూటీసీ జిల్లాధ్యక్షుడు కామ్రేడ్ ఏ.దేవదాస్, ప్రముఖులు సురేశ్, జి.కిరణ్కుమార్ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లకు శిక్షణబళ్లారి రూరల్ : జిందాల్ ఓపీజే సెంటర్లోని తమన్నా దివ్యాంగుల పాఠశాలలో సోమవారం అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు శిక్షణ శిబిరం జరిగింది. కార్యక్రమాన్ని జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ దక్షిణ వలయ ప్రముఖుడు పెద్దన్న జ్యోతి వెలిగించి ప్రారంభించారు. దివ్యాంగ బాలలను ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి? అనే విషయంపై అంగన్వాడీ టీచర్లకు, కార్యకర్తలకు తమన్నా పాఠశాల సిబ్బంది నాటకాల ద్వారా అవగాహన కల్గించారు. సండూరు, కృష్ణానగర్, తారానగర్, నాగలాపుర, బనహట్టి, తాళూరు, జోగ, బసాపుర, ఒడ్డు, కురేకుప్ప, దరోజీ, భుజంగనగర్, తోరణగల్లుకు చెందిన 130 మంది అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, తమన్నా పాఠశాల ప్రధానోపాధ్యాయిని సవిత, అంగన్వాడీ అధికారి చైతన్య పాల్గొన్నారు. అంబేడ్కర్కు ఘనంగా నివాళిరాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరులో అంబేడ్కర్ ప్రతిమ వద్ద అంజుం ఏ ముస్లిం నేతలు కొవ్వొత్తులతో ఘనంగా నివాళి అర్పించారు. ఆదివారం రాత్రి భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 68వ పరినిర్వాణ దినోత్సవంలో భాగంగా అంబేడ్కర్ ప్రతిమకు పూలమాల వేశారు. కమిటీ అధ్యక్షుడు హుసేన్ బాషా మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, బాధ్యతల గురించి ప్రజలకు ప్రచారం చేస్తామన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రామాణికంగా పని చేస్తామన్నారు. అన్సరుద్దీన్, ముస్తాఫా, అమీన్, ఖయ్యూం, హసన్, అబ్దుల్, సలీం, ఆరీఫ్లున్నారు. జీపీ సభ్యుడిపై కుక్కల దాడి హుబ్లీ: గ్రామ పంచాయతీ(జీపీ) సభ్యుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన జరిగింది. ఫలితంగా ఆయన రెండు వేళ్లు తెగిపోయాయి. విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా ఉచ్చంగిదుర్గ వద్ద హాలమ్మన తోపులో కుక్కలు గ్రామ పంచాయతీ సభ్యుడు మంజునాథ్పై తీవ్రంగా దాడి చేశాయి. ఆయన వాకింగ్కు వెళ్లిన వేళ ఈ దారుణ దురంతం చోటు చేసుకుంది. రెండు వేళ్లు కట్ అయిన స్థితిలో ఆయన్ను దావణగెరె జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. -
రైతులకు పరిహారం కోసం ధర్నా
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రైతులకు పరిహారం అందించాలని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి సర్కార్ను డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రైతులకు మద్దతు ధరలు ప్రకటించాలన్నారు. ఈ విషయంలో కళ్యాణ కర్ణాటకలోని శాసన సభ్యులు బెళగావిలో జరుగుతున్న అసెంబ్లీలో నోరు మెదపాలన్నారు. వరి, పత్తి, కంది, ఇతర పంటలు ఖరీఫ్లో కురిసిన వానలకు పూర్తిగా నష్టం సంభవించినట్లు ఆరోపించారు. రాయచూరులో మిరప మార్కెట్ను ప్రారంభించాలన్నారు. మద్దతు ధరతో మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శివశంకర్, నరసింహ నాయక్, లక్ష్మిపతి, రామకృష్ణ, జంబునాథ్, నాగరాజ గౌడ, అమరేష్ పాటిల్, నరసప్పలున్నారు. -
అడవుల్లో రిసార్టులు, సఫారీలను మూసేయాలి
మైసూరు: మైసూరు జిల్లా సహా పరిసర ప్రాంతాల్లోని నాగరహోళె, బండీపుర అడవుల్లో ఉన్న రిసార్ట్లు, హోమ్ స్టేలను వెంటనే ఖాళీ చేయాలి. సఫారీని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ప్రారంభించకూడదని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని జిల్లా విలేకరుల భవనంలో రైతు సంఘాల నేతలు మాట్లాడారు. ఇటీవలి కాలంలో ఏనుగులు, పులులు, అడవి పందులు వంటి జంతువులు రైతులు, ప్రజలపై దాడులు చేస్తున్నాయన్నారు. మైసూరు, చామరాజనగర జిల్లాల్లో పులుల దాడుల వల్ల ముగ్గురు రైతులు మరణించారు. అంతేకాకుండా, పులులు, చిరుతలు, ఏనుగుల సంచారం అధికమైంది, ఫలితంగా అటవీ ప్రాంతంలోని రైతులు భయానక వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు. దీనికంతటికీ ప్రధాన కారణం అడవుల్లో పుట్టుకొచ్చిన అక్రమ రిసార్ట్లు, సఫారీలేనన్నారు. ఇటీవల ఆందోళనల తరువాత అటవీ శాఖ కొన్ని చర్యలు తీసుకుందన్నారు. ఎమ్మెల్యే నిర్వహిస్తున్న రిసార్ట్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. పర్యాటక రంగానికి దెబ్బ అనే సాకుతో సఫారీలను తిరిగి ప్రారంభించాలని హోటల్ వ్యాపారులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం సరికాదని తెలిపారు. అమూల్యమైన ప్రజల ప్రాణాలను రక్షించే లక్ష్యంతో సఫారీలను పూర్తిగా నిలిపివేయాలని కోరారు. మైసూరు జిల్లా రైతు నేతల డిమాండ్ వీటి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు -
రోడ్లలో గుంతలు పూడ్చండి
రాయచూరు రూరల్: జిల్లాలో గుంతలు పడ్డ రహదారి పనులను చేపట్టి సత్వరం గుంతలను పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని జిల్లాధికారి నితీష్ అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. గ్రామీణ, నగర ప్రాంతాల్లో రహదారుల్లోని గుంతలను పూడ్చాడాలన్నారు. ప్రజా పనుల శాఖ, పంచాయత్రాజ్, ఆర్అండ్బీ, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభల పరిధిలో పడ్డ గుంతలను మూసి వేయాలన్నారు. గుంతలు పడ్డ ప్రాంతాల్లో పలువురు గాయపడ్డారని గుర్తు చేశారు. రహదారి పక్కనే ఉన్న అంగళ్లు, దుకాణాలను తొలగించాలని సూచించారు. ద్వి చక్రవాహనంలో సంచరించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సమావేశంలో ఇంజినీర్ వెంకటేష్, ఆర్టీఓ, పోలీస్, ఇతర శాఖల అధికారులున్నారు. -
యాదగిరిలో బాలింత మృతి
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో బాలింత మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదగిరి తాలూకా బలిచక్ర తాండాకు చెందిన నీలాబాయి(21) అనే గర్భిణి ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు కాన్పు అయింది. అధికంగా రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కడుపులో శిశువు మరణించడంతో జిల్లాస్పత్రిలో లోబీపీతో మరణించినట్లు డైరెక్టర్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 20 మంది బాలింతలు మరణించినట్లు సమాచారం. వడగేర, హుణసగి, సురపుర, శహాపుర, భీమరాయనగుడి తాలూకా ఆస్పత్రిలో సక్రమంగా వైద్య సౌకర్యాలు, చికిత్స లభించక మరణించారు. కాగా బాలింత, శిశువు మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. -
ఉసురు తీసిన అప్పులు
● తల్లీ, కూతురు, బాలుడు ఆత్మహత్య బనశంకరి: తీవ్ర రుణబాధల్లో చిక్కుకుని వృద్ధురాలు, ఆమె కూతురు, మనవడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన బెంగళూరు సుద్దగుంటెపాళ్య ఠాణా పరిధిలో సోమవారం జరిగింది. వివరాలు.. తావరకెరె రెండోక్రాస్లో మాదమ్మ (68), కుమార్తె సుధ (38), సుధ కొడుకు మోనీశ్ (14) నివాసం ఉంటున్నారు. మాదమ్మ, సుధ గతంలో జీవనోపాధి కోసం బిరియాని సెంటర్, చిప్స్ సెంటర్ నడిపారు. కానీ నష్టాలు రావడంతో చాలా అప్పులు చేశారు. చివరకు పాలు అమ్ముతూ, ఇళ్లలోనూ పనులు చేస్తున్నారు. విరక్తి చెంది ఉదయం 9 గంటల సమయంలో మోనీశ్ కు పురుగుల మందును తాగించారు, ఆపై వారు తాగడంతో ప్రాణాలు పోయాయి. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను సెయింట్జాన్స్ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి డెత్నోట్ లభించలేదు. డీసీఎంపై రాజణ్ణ విసుర్లు దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరో ఒకరి వల్ల అధికారంలోకి రాలేదని, అందులోనూ సీఎం కావాలనుకుంటున్న కొందరి వల్ల అసలు కాదని హస్తం ఎమ్మెల్యే కేఎన్ రాజన్న అన్నారు. బెళగావిలోని సువర్ణసౌధలో మీడియాతో మాట్లాడిన ఆయన పరోక్షంగా డీసీఎం డీకే శివకుమార్పై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సీఎం మార్పిడి లాంటివి ఏవీ ఉండవన్నారు. కాగా, సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామన్నారు. పాలికే ఖజానాపై భారం వద్దు బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార పరిధిలోని ఐదు పాలికేలకు చట్టానికి వ్యతిరేకంగా సీనియర్ అధికారులను నియమించారని, ఈ చర్యతో పాలికె ఖజానాకు భారం కానుందని, ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ డిమాండ్ చేశారు. దీనిపై సీఎం సిద్దరామయ్య, నగరాభివృద్ధి శాఖ కార్యదర్శి కి సోమవారం ఆయన లేఖ రాశారు. ఐదు నగర పాలికేల్లో అనవసరంగా 10 మంది అధికారులను నియమించారని, మున్సిపల్ చట్టాలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ఏటా కోట్లాది భారం పడుతుందని చెప్పారు. -
గోవధ నిషేధ చట్టం రద్దు తగదు
సాక్షి, బళ్లారి: ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి పశువులను, గోవులను యథేచ్ఛగా వధించేందుకు అనుమతి ఇస్తున్న నేపథ్యంలో ఇది ఎంత మాత్రం సరైన చర్య కాదని విశ్వహిందూ పరిషత్, బీజేపీ, పలువురు స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని నారాయణరావ్ పార్కు నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి జిల్లాధికారి కార్యాలయం ద్వారా గవర్నర్కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం పంపించారు. గోవుల్లో సకల దేవతలు కొలువుదీరి ఉంటారని పురాణాలు, ఇతిహాసాలు ఘోషిస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో 2020వ సంవత్సరంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు. పాలనలో ఈ సర్కారు విఫలం మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పాలనలో ఘోరంగా విఫలం అయ్యారని ఆరోపించారు. చివరికి గోవుల రక్షణకు చేసిన చట్టాన్ని కూడా రద్దు చేయాలని తలచడం హేయం అన్నారు. బెళగావిలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయాన్ని ప్రతిపాదించి అమలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయంతో హిందూ సమాజానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే అక్రమంగా గోవులను తరలించి వధిస్తున్నారన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తే మరింతగా గోవధ జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయకుంటే భారీ ఆందోళన తప్పదన్నారు. కమ్మరచేడు కళ్యాణ స్వామీజీ, నాయకులు రామలింగప్ప, వెంకటరమణ, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. గోవధ నిషేధ చట్టంలో మార్పులు చేయొద్దు రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోవధ నిషేధ చట్టంలో మార్పులు చేయడం తగదని హిందూ జన జాగరణ వేదిక డిమాండ్ చేసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళనకారులనుద్దేశించి కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య మాట్లాడారు. గతంలో బీజేపీ సర్కార్ అమలు పరిచిన గోవధ నిషేధ చట్టాన్ని రద్దు చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గో సంరక్షణ చట్టంలో ఎలాంటి మార్పులు, చేర్పులకు పూనుకోరాదని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగరాజ్ భాల్కి, మునిరెడ్డి, విజయ కుమార్, బాళప్ప, శరణు తదితరులున్నారు. 2020 నాటి చట్టాన్ని కొనసాగించాలి విశ్వహిందూ పరిషత్ నేతల డిమాండ్ -
విపరీతంగా సిజేరియన్ కాన్పులు
బనశంకరి: ఇటీవల కన్నుమూసిన వృక్షమాత సాలుమరద తిమ్మక్క పేరుతో వచ్చే ఏడాది నుంచి పర్యావరణ పురస్కారం అందిస్తామని, సాహితీవేత్త ఎస్ఎల్.బైరప్ప గౌరవార్థం మైసూరులో స్మారకం నిర్మిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య బెళగావి సువర్ణసౌధలో ప్రకటించారు. సోమవారం నుంచి సువర్ణసౌధలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇటీవలి కాలంలో దివంగతులైన ప్రజాప్రతినిధులు, మాజీలు, ప్రముఖులకు సంతాపం ప్రకటించారు. సిద్దరామయ్య మాట్లాడుతూ ఇటీవల మరణించిన ఎమ్మెల్యే హెచ్వై మేటి తనకు అన్నివేళలా మంచి మిత్రుడని తెలిపారు. సాహితీవేత్త ఎస్ఎల్.బైరప్పతో తనకు సైద్ధాంతికపరమైన విభేదాలున్నా, ఆయన ప్రజాదరణపొందిన సాహితీవేత్త అన్నారు. బైరప్ప నిరాడంబరుడు, ఉత్తమ రచనలు చేశారని కొనియాడారు. వృక్షమాత సాలుమరద తిమ్మక్క పేరుతో బేలూరులో మ్యూజియం ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది నుంచి తిమ్మక్క పురస్కారం అందిస్తామని తెలిపారు. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ మాట్లాడుతూ సాలుమరద తిమ్మక్క మన మధ్య లేకపోయినా, ఆమె పోషించిన వృక్షాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. సాహితీవేత్త ఎస్ఎల్.బైరప్ప కట్టె విరిచినట్లు సూటిగా మాట్లాడే వ్యక్తి, ఆయన సాహిత్యం సృజనశీలతకు పేరుపొందిందన్నారు. సమాజ ఆత్మ విమర్శకు స్ఫూర్తిగా ఉన్నారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దివంగత ప్రముఖులతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. పరీక్షల ఫీజు తక్కువే: మంత్రి దొడ్డబళ్లాపురం: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి కేపీఎస్సీ ఆధ్వర్యంలో జరుపుతున్న పోటీ పరీక్షల రుసుము పక్క రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ అని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ అన్నారు. పరీక్షల రుసుమును తగ్గించాలని విధాన పరిషత్లో ఎమ్మెల్సీ నిరాణి హనుమంత్ రుద్రప్ప డిమాండు చేశారు. ఇందుకు మంత్రి సమాధానమిచ్చారు. తమిళనాడులో రూ.1000, ఆంధ్రప్రదేశ్లో రూ.1500 పరీక్షల రుసుము ఉంటే, మనరాష్ట్రంలో రూ.750 మాత్రమే వసూలు చేస్తున్నామన్నారు. విచ్చలవిడిగా రేషన్ బియ్యం మాఫియా● బీజేపీ ఎమ్మెల్సీ రవి దొడ్డబళ్లాపురం: వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో ఇందిరా రేషన్ కిట్లను పంపిణీ చేస్తామని మంత్రి కేహెచ్ మునియప్ప తెలిపారు. పరిషత్లో బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి మాట్లాడుతూ బీపీఎల్ రేషన్ బియ్యం పక్క రాష్ట్రాలకు, విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని, రాష్ట్రమంతటా ఈ దందా నడుస్తోందని ఆరోపించారు. దుబాయ్,సింగపూర్లలో ఇదే బియ్యాన్ని పాలిష్ చేసి విక్రయిస్తున్నారని, ఈ అక్రమాలకు అధికారులు కొమ్ముకాస్తున్నారని, సర్కారు బియ్యం లబ్ధిదారులకు అందడం లేదని విమర్శించారు. సిట్ను ఏర్పాటు చేసి విచారించాలని కోరారు. ఇందుకు సమాధానమిస్తూ మాట్లాడిన మంత్రి మునియప్ప రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టి కేసులు నమోదు చేశామన్నారు. ఈ సంవత్సరంలోనే 485 కేసులు నమోదు చేశామన్నారు. దాడుల్లో 29,603 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. జనవరి నుంచి 5 కేజీల బియ్యం బదులు ఇందిరా కిట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరా కిట్ ద్వారా అక్రమ బియ్యం రవాణా అరికట్టవచ్చని, సిట్ అవసరం లేదన్నారు.నాటుకోడి హాస్యరసం● సీఎం సిద్దు, అశోక్ మాటామంతీ శివాజీనగర: సీఎం సిద్దరామయ్య, బీజేపీ నేత ఆర్.అశోక్ మధ్య సువర్ణసౌధ లాంజ్లో నాటుకోడి విందు గురించి హాస్య చర్చలు జరిగాయి. అశోక్ను చూడగానే సీఎం పలకరించారు. ఏమయ్యా బాగున్నారా అశోక్? అని ప్రశ్నించారు. అందుకు అశోక్, లేదు సార్, మీలాగా నాటుకోడి తినటం లేదు, విడిచిపెట్టాను అని చెప్పారు. తిను ఏమీ కాదు. రా తిందామని సీఎం నవ్వుతో చమత్కారంగా మాట్లాడారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నాటుకోడి విందు జరపడం తెలిసిందే. అవిశ్వాసం పెడతారా? అంతకు ముందుగా స్పీకర్ గదితో సీఎం సిద్దరామయ్య, ఆర్.అశోక్, బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం ఏమైనా ప్రవేశపెడతారా అని సీఎం నవ్వుతూనే అడిగితే, జవాబు దాటవేశారు. ప్రజల సమస్యలు పట్టవా: విజయేంద్ర బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర మాట్లాడుతూ, కుర్చీని కాపాడుకునేందుకు సిద్దరామయ్య, కుర్చీ కోసం డీకే శివకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షంవారు ఏ ప్రశ్నలు అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు వేలెత్తి చూపుతున్నారు. అన్నింటినీ కేంద్రమే చేస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు? అని ప్రశ్నించారు.యశవంతపుర: ఒక్క విద్యార్థి ఉన్నా, ఆ పాఠశాలను కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. విధానపరిషత్లో సభ్యుడు చిదానంద గౌడ, ఉమాశ్రీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ఆ బడులను మూసివేస్తుందా, విద్యార్థులను వేరే పాఠశాలకు బదిలీ చేస్తుందా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి పై విధంగా స్పందించారు. ఎక్కడా పాఠశాలలను మూయలేదు. కావాలంటే కొత్త పాఠశాలలను తెరవడానికి ప్రభుత్వం సిద్ధమని అన్నారు. కేబుల్ ఫీజులు పెంచేశారు రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో పరిష్కారిస్తామని ఇంధనశాఖ మంత్రి కేజీ జార్జ్ తెలిపారు. రాష్ట్రంలో 2,880 మంది కేబుల్ ఆపరేటర్లున్నారు. గతంలో కేబుళ్లను కరెంట్ స్తంభానికి కడితే మున్సిపాలిటీ అధికారులు రూ.40 చొప్పున ఫీజు వసూలు చేసేవారు, ఇప్పుడు రూ.150 కి పెంచారని కొందరు సభ్యులు తెలిపారు. ఫీజును 50 శాతం తగ్గిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జింకలకు అంటురోగం బెళగావి కిత్తూరు చెన్నమ్మ జూ లో 30 కృష్ణ జింకల మరణానికి అంటువ్యాధి కారణమని అటవీ మంత్రి ఈశ్వరఖండ్రె తెలిపారు. జింకలకు హెమరాజిక్ సెప్టిసెమియా అనే జబ్బు సోకి చనిపోయాయి, జూ సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదు అని చెప్పారు.పాఠశాలలను మూసివేయం సీఎం సిద్దరామయ్య ప్రకటన బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు షురూ గతించిన ప్రముఖులకు ఘన నివాళులు హాజరు అంతంతే ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చించడానికి ఈ సమావేశాలు సువర్ణావకాశమని భావిస్తే, ఎమ్మెల్యేలు ఎవరూ కన్నెత్తి చూడలేదు. విధానసభలో హాజరు నాసిరకంగా ఉంది. 30 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు కనిపించలేదు. ఎక్కడ చూసినా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వేళ్లమీద లెక్కబెట్టగలిగినంత మంది సభ్యులు మాత్రమే వచ్చారు. వారిలోనూ మంత్రులే ఎక్కువగా ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ శాసనసభ్యుల సంఖ్య కూడా తక్కువే కనిపించింది. -
తెరపైకి ఉ–క ప్రత్యేక రాష్ట్ర చిచ్చు
రాయచూరు రూరల్ : అఖండ కర్ణాటకను విభజించడంతో పాటు ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం తెరపైకి రానుంది. సోమవారం నుంచి బెళగావిలో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై గళం విప్పడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గతనెల 4న ఎమ్మెల్యే లేఖ రాసిన విషయం ప్రస్తావించడానికి ప్రజా ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఉత్తర, కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, కలబుర్గి, కొప్పళ, బళ్లారి, విజయనగర, బీదర్, రాయచూరు, బాగల్కోటె, బెళగావి, ధార్వాడ, గదగ్, ఉత్తర కన్నడ, హావేరి, దావణగెరె జిల్లాల సమగ్ర అభివృద్ధిలో నిర్లక్ష్యం జరుగుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నెల రోజుల క్రితం కాగవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరమగౌడ లేఖ రాశారు. ప్రజల నుంచి ఎన్నికై న ప్రజా ప్రతినిధి ప్రజల సమస్యలపై ప్రస్తావించినా పనులు కావడం లేదని తమను ఎన్నుకున్న ప్రజలు నిలదీస్తున్న అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. దేశంలో ప్రత్యేక తెలంగాణ ఉద్భవించిన నేపథ్యంలో ఇప్పుడు ఉత్తర కళ్యాణ కర్ణాటక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకపై సవతి ప్రేమ దక్షిణ కర్ణాటక ప్రాంతాలపై ప్రభుత్వం ప్రేమ ఒలకబోస్తూ ఉత్తర కర్ణాటకపై సవతి తల్లి ప్రేమను ఒలక బోస్తోందని ఉత్తర, కర్ణాటక పోరాట సమితి, ఉత్తర కర్ణాటక వికాస్ వేదిక సంచాలకుడు భరమగౌడ లేఖ రాసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉత్తర, కళ్యాణ కర్ణాటకలో 15 జిల్లాల సమగ్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు. గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి ఉమేష్ కత్తి ఆందోళన జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. జనాభా పెరిగే కొద్దీ రాష్ట్రాలను విభజించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కర్ణాటకలో రెండు, ఉత్తర్ ప్రదేశ్లో ఐదు, మహారాష్ట్రలో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. దేశంలో కొత్తగా 50 రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్రం ముందడుగు వేయాల్సి ఉంది. బెళగావిలో జరుగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చ జరగకపోతే బెళగావి సువర్ణసౌధపై ప్రత్యేక రాష్ట్ర జెండాను ఎగురవేస్తామని ఎమ్మెల్యే భరమగౌడ వెల్లడించారు. బుధవారం నుంచి ఉత్తర, కళ్యాణ కర్ణాటకపై విధాన పరిషత్లో చర్చలు జరగడానికి అవకాశం కల్పిస్తున్నట్లు విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి వెల్లడించారు. సోమవారం బెళగావి సువర్ణసౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నుంచి బెళగావి సమావేశాల్లో చర్చకు చాన్స్ కర్ణాటకలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాసిన ఎమ్మెల్యే రాజుకాగె -
హోంగార్డులకు బహుమతులు అందజేత
రాయచూరురూరల్: సమాజంలో శాంతి భద్రతలకు సహకరించడంతోపాటు హోంగార్డులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. స్థానిక పోలీస్ మైదానంలో జరిగిన క్రీడలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 24 గంటలపాటు విధులు నిర్వహిహిస్తూ మానసికంగా, శారీరకంగా, ధైర్యంగా ఉండేందుకు క్రీడలు సహకరిస్తాయని తెలిపారు. అనంతరం మొక్క నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్పీ పాటిల్, క్రీడాధికారి ఈరేష్ నాయక్, రాణోజి, మంజునాథ్ దేశాయ్, నింబనగౌడ, వరదరాజ్, చెన్నప్పగౌడ, చంద్రశేఖర్, శాంతప్ప, శివప్ప, బస్వంత్ సింహా, వీరభద్ర, సుభాష్ చంద్ర, జావెద్ పాల్గొన్నారు. మూఢ నమ్మకాలపై అవగాహన బళ్లారిటౌన్: సమాజంలో మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 11న ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆర్హెచ్ఎం.చెన్నబసయ్యస్వామి తెలిపారు. స్థానిక పత్రికా భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ వైజ్ఞానిక మనోభావాన్ని పెంపొందించే దిశగా కర్ణాటక రాష్ట్ర విజ్ఞాన తంతర్ జ్ఞానపరిషత్ ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని తెలిపారు. యాదగిరిలో ఈ నెల 28వతేదీ నుంచి మూడు రోజులపాటు ఐదో రాష్ట్ర స్థాయి విజ్ఞాన సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మూఢ నమ్మకాలను నియంత్రించేలా చట్టం తెచ్చినా.. ఇంకా సామాజిక మాధ్యమాలలో జోతిష్యం, చేతబడులపై ప్రకటనలు వస్తున్నాయన్నారు. పిల్లల్లో అవగాహన కల్పించేందుకు జ్ఞానామృత పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. గర్భంలోనే శిశువు మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్న కుటుంబ సభ్యులు హుబ్లీ: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని గర్భిణి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరి తాలూకా బలిచక్ర తండా నివాసి నీలాబాయి ప్రసవ నొప్పులతో యాదగిరి ప్రభుత్వ మాతృ శిశు ఆస్పత్రికి వచ్చారు. నిండు గర్భిణికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆపరేషన్ చేసి వైద్యులు శిశువును బయటకు తీశారు. చికిత్స చేసిన వైద్యులు బిడ్డ మరణించిందని తెలుపడంతో నీలాబాయి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవ వేదనతో వచ్చిన మహిళకు సరైన చికిత్స అందించకపోవడం, బెడ్డు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతోనే శిశువు మరణించిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక శిశువు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హంపీలో ఫల పూజ హొసపేటె: దక్షణ కాశీగా పేరొందిన హంపీలో రాత్రి ఫలపూజ ఘనంగా నిర్వహించారు. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ, దేశం నల మూలల నుంచి భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం హంపీ విరుపాక్షవర విద్యారణ్య పీఠానికి చెందిన విద్యారణ్య భారతిశ్రీ సమక్షంలో వేలాది భక్తులు ఉత్సవ విగ్రహంతో విరుపాక్షేశ్వర ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. కోదండ రామస్వామి ఆలయంలో వేద మంత్రోచ్ఛరణ మధ్య విరూపాక్ష, పంపాంబికాదేవి నిశ్చితార్థం సంప్రదాయం ప్రకారం జరిపించారు. విజయనగర, బళ్లారి, బళ్లారి, కోప్పళ, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల భక్తులు తరలివచ్చారు. ఎస్పీ ఎస్.జాహ్నవి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న బైక్ ● ఇద్దరు దుర్మరణం చెళ్లకెరె రూరల్: తాలూకాలోని కాలువె హళ్లి గ్రామంలో విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వివరాల మేరకు.. శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రకాష్ (30), మధు (35) బైక్పై చెళ్లికెరె నగరానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో కాలువెహళ్లి వద్ద బైక్ అదుపు తప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో కిందపడ్డారు. ప్రకాష్, మధు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు. -
కారు బోల్తా, ముగ్గురు మృతి
● మండ్య జిల్లాలో విషాదం మండ్య: వేగంగా వెళుతున్న కారు చిన్న వంతెనను ఢీకొని పల్టీలు కొట్టిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలో బెంగళూరు– మంగళూరు హైవేలో తిట్టనహొసహళ్లి–నాగతిహళ్ళి మధ్య జరిగింది. చిక్కమగళూరుకు చెందిన చంద్రేగౌడ (45), భార్య సరోజమ్మ (38), బంధువు సావిత్రమ్మ ఘటనాస్థలంలోనే మరణించారు. చిక్కమగళూరుకు కారులో వెళుతున్న సమయంలో అదుపుతప్పి చిన్నపాటి వంతెనను ఢీకొని ప్రమాదం జరిగింది. బిండిగనవిలె పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద దృశ్యం -
కులాంతర పెళ్లిళ్లు పెరగాలి
హుబ్లీ: ప్రతి జంట ఇద్దరు పిల్లలను తప్పకుండా కనాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. జిల్లాలోని నవళగుంద మోడల్ హైస్కూల్ ఆవరణలో ఆదివారం జరిగిన సామూహిక వివాహ వేడుకలో సీఎం సిద్దు, డీసీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ దేశ జనాభా పెరిగి పోయిందని, చైనాను భారత్ దాటిపోయిందని చెప్పారు. కులాంతర వివాహాలు పెరగాలి. కులం, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు నిర్మూలించబడాలన్నారు. డీకే మాట్లాడుతూ కొత్త వధూవరులు ఆదర్శ దంపతులుగా సమాజంలో జీవించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపకుండా మీరే ఉద్యోగదాతలుగా ఎదిగేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 75 జంటలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలోనే నవళగుంద ఎమ్మెల్యే ఎన్హెచ్.కోనరెడ్డి కుమారుడు నవీన్కుమార్– సహన రిసెప్షన్ జరిగింది. పలువురు మంత్రులు పాల్గొన్నారు. సీఎం సిద్దరామయ్య -
ప్రమాదంలో... ప్రజారోగ్యం
సాక్షి, బళ్లారి: ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని, వాతావరణంలో ప్రభావం చూపుతుందని తెలిసినా ప్రజలు వినియోగిస్తూనే ఉన్నారు. 50 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. దీనిని పక్కాగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పట్టణ వీధులు, మురుగు కాల్వలు ప్లాస్టిక్ కూపాలుగా మారుతున్నాయి. రోగాలు పెంచుతున్నాయి. జీవ మనుగడపై దుష్ప్రభావం కలిగించే ప్లాస్టిక్ నిషేధంతో నగర, పురపాలక సంస్థలు వైఫల్యం చెందుతున్నాయి. బళ్లారి జిల్లాతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలలోనూ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉంది. బళ్లారి పట్టణ జనాభా పెరుగుతుండడంతో టన్నుల కొద్దీ చెత్త సేకరించాల్సి వస్తోంది. ఇందులో ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగిస్తే పురపాలక శాఖ అధికారులు దాడులు చేసి జరిమానా వేయవచ్చు. రూ.500 నుంచి రూ.5 వేల వరకు అపరాధ రుసుము విధించవచ్చని అధికారులే చెబుతున్నారు. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. మురుగు కాల్వల్లో వేయడంతో నాలాలకు అడ్డంపడి మురుగు రోడ్లపైకి చేరుతోంది. కల్వర్టులకు అడ్డంగా చేరి వర్షం వస్తే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. దుకాణదారులు డ్రైనేజీలపై బండలు వేయడంతో వాటి కింద ప్లాస్టిక్ ఇరుక్కుపోయి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బళ్లారిలోని ప్రతి అంగడి, హోటళ్లు, కూరగాయాల దుకాణాల్లో ఎటుచూసినా ప్లాస్టిక్ వాడకం పెరిగింది. హోటల్లో ఇడ్లీలు తయారు చేసే స్టాండ్లలనూ ప్లాస్టిక్ కవర్లు వేసి, అందులో ఇడ్లీ పిండి వేసి తయారుచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వేడి వేడి సాంబారు, అన్నం, పప్పు, దోసెలు, ఇతర వంటకాలన్నీ పార్శిళ్లలో తీసుకెళ్తున్నారు. పల్లె, పట్టణాల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం నిషేధం అమలులో ఉన్నా చోద్యం చూస్తున్న యంత్రాంగం హోటల్, బేకరీల్లో వేడి పదార్థాలన్నీ ప్లాస్టిక్ లోనే.. ప్లాస్టిక్ బ్యాగుల్లో ఆహారంతో ప్రమాదంప్టాస్టిక్ క్యారీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలు తినడంతో ప్రమాదకరమైన ‘కార్సినోజన్లు’ శరీరంలో చేరి క్యాన్సర్కు దారితీస్తుందని, చర్య వ్యాధుల సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో మిగిలిన ఆహారం, కూరగాయల వ్యర్థాలు ఈ ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి చెత్త కుండీల్లో వేస్తున్నారు. మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ భూమి పొరలో చేరి భూగర్భ కాలుష్యం ఏర్పడుతోంది. ప్లాస్టిక్ కాల్చివేయడం వల్ల అందులోని రసాయనాలు వాతావరణంలో కలిసి మానవ, జీవ రాశుల మనుగడపై ప్రభావం చూపుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
మత్తు భూతంపై కఠిన చర్యలు
ర్యాలీలో దూసుకుపోతున్న కారుఇప్పటికీ చెక్కు చెదరని అలనాటి కార్లు బనశంకరి: కర్ణాటకను డ్రగ్స్ వ్యసన రహితంగా తీర్చిదిద్దే దృష్టితో మాదకద్రవ్యాల విక్రేతలు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుని తమ లక్ష్యం సాధించే వరకు విశ్రమించేదిలేదని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరు సిటీపోలీస్, చారిత్రక వాహనాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విధానసౌధ ముందు డ్రగ్స్ వ్యతిరేక వింటేజ్ కారు ర్యాలీని ప్రారంభించారు. డ్రగ్స్తో కర్ణాటక మాత్రమే కాదు ప్రపంచం సతమతమవుతోంది. మత్తు భూతం భవిష్యత్తును, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని చెప్పారు. బడి పిల్లలకూ డ్రగ్స్ చాక్లెట్లు కర్ణాటక ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ఆశయమన్నారు. గత ఏడాదినుంచి రూ.300 కోట్ల విలువచేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, వందలాదిమందిని అరెస్ట్ చేశారని మంత్రి చెప్పారు. పాఠశాలల బాలలకు కూడా డ్రగ్స్ చాక్లెట్లను అమ్ముతున్నారు, పిల్లలు వీటికి దాసోహం అవుతున్నారని వాపోయారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు, టెక్కీలు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి కోరారు. ఈ సందర్భంగా కార్లు, పాతకాలం బైక్ల ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. డీజీపీ ఎంఏ.సలీం, పోలీస్కమిషనర్ సీమంత్కుమార్సింగ్ పాల్గొన్నారు. హోంమంత్రి పరమేశ్వర్ ఉత్సాహంగా వింటేజ్ కార్ల జాగృతి ర్యాలీ -
లారీని ఢీకొని కారు దగ్ధం
దొడ్డబళ్లాపురం: పాల ట్యాంకర్ లారీని ఢీకొని నడి రోడ్డుపై కారు కాలి బూడిదైన సంఘటన ఆదివారం ఉదయం బెంగళూరు–మైసూరు ఎక్స్ప్రెస్ వేలో జరిగింది. మైసూరు నుంచి బెంగళూరు వైపు వస్తున్న డస్టర్ కారు ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ను ఢీకొంది. దీంతో ఇంజిన్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారంతా వ్యాపించి పూర్తిగా కాలిబూడిదైంది. కారులో ఉన్న వారు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇద్దరు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. రామనగరలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రామనగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. తగలబడిపోతున్న కారు -
నేరాల నియంత్రణపై ప్రచారం
రాయచూరురూరల్: నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం నడుంబిగించిందని ఎస్పీ పుట్టమాదయ్య అన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించేలా గోడలపై వివరాలు రాసే కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఅర్ఎస్ 112, 1930 సహాయవాణి అంశాలపై ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. సాంకేతిక రంగంలో మార్పులు వచ్చినా, నేరాలు తగ్గకపోవడంపై ప్రతి ఒక్కరూ అలోచించాలన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ను వినియోగించే వారంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బెటాలియక్ కోసం సీఎంకు లేఖ రాయచూరురూరల్: కెఎస్ఆర్పీ బెటాలియన్ కేంద్రం రాయచూరులో ఏర్పాటు చేయాలని స్థానికులు సీఎం సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి పరమేశ్వర్లకు లేఖ రాశారు. కళ్యాణ కర్నాటక ప్రాంతంలోని కలబుర్గిలో ఉన్న కర్నాటక రాష్ట్ర రిజర్వ్డ్ పోలీస్ బెటాలియన్ను మహిళ రిజర్వుడ్ పోలీస్ బెటాలియన్ కేంద్రంగా మార్చారు. మరోవైపు మునిరాబాద్లో ఉన్న బెటాలియన్ను కలబుర్గికి రావాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో రాయచూరు ప్రాంతంలో బందోబస్తు కఠినం అవుతుందని, 13వ కేఎస్ఆర్పీ బెటాలియన్ను రాయచూరులో కొనసాగించాలని స్థానికులు లేఖరాశారు. కార్మికులకు కిట్లు పంపిణీ రాయచూరురూరల్: ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మాన్వి విధాన సభ సభ్యుడు హంపయ్యనాయక్ కోరారు. తాలుకాలోని బల్లటిగిలో పలువురు కార్మికులకు ఆయన కిట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు దైనందిన పనులతోపాటు.. తమ పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, వారిని విద్యారంగం వైపు మరల్చాలని సూచించారు. కార్మికుల పిల్లలకు వసతిగృహ సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లప్ప, శరణబసవ, పరశురామ్, పంపణ్ణ, సుదానంద, రమేష్, జాఫర్, అబ్రహాం, మారేష్, మౌనేష్ పాల్గొన్నారు. తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం రాయచూరురూరల్: నగరంలోని యాదవ సమాజం పాఠశాలలో రూ.80 లక్షలతో చేపట్టిన రెండు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మారెప్ప, హనుమంతప్ప, తమ్మప్ప, దానప్ప యాదవ్, మురళీ యాదవ్, లక్ష్మణ్, రాఘవేంద్ర, విష్ణు, అస్లాం పాషా, దరూరు బసవరాజ్, రజాక్ ఉస్తాద్, అబ్దుల్కరీం, తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ పాత్రికేయ అవార్డుకు విరాళం రాయచూరురూరల్: ఉత్తమ పాత్రికేయ పురస్కారాలు అందించేందుకు రూ.3 లక్షల చెక్కును అటవీశాఖ మంత్రి ఈశ్వర్ఖండ్రే అందజేశారు. బీదర్ భవనంలో జరిగిన రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, 2025–28 పదాధికారుల పద గ్రహణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీమణ్ణ ఖండ్రే పేరిట రూ.3 లక్షలతో దత్తనిధి ఏర్పాటు చేసి అవార్డులందించాలని రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శివానంద ప్రతిపాదించగా మంత్రి అంగీకరిస్తూ చెక్ అందజేశారు. అనంద దేవప్ప, అప్పారావ్, శివకుమార్ పాల్గొన్నారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య కోసిగి: కర్నూలు జిల్లా కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి బీదర్ వెళ్లే రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని వద్ద ఆధార్ కార్డు ఆధారంగా రాయచూరు జిల్లా ఆరోలి గ్రామానికి చెందిన తిమ్మప్ప (45) అనే వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. అనారోగ్యంతో రాయచూరు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా, జబ్బు నయం కాక ఇక్కడకు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. -
హనుమ రథోత్సవం
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరం బిబి రోడ్డులోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆదిచుంచనగిరి పీఠాద్యక్షుడు నిర్మలానందనాథస్వామీజి ఆధ్వర్యంలో రథోత్సవం, శనక్కాయల పరుసను నిర్వహించారు. పరిసర గ్రామాల రైతులు తాము పండించిన జొన్నలు, శనక్కాయలు తదితర పంటలను ఎద్దుల బండిలో నింపుకొని వచ్చి స్వామివారికి సమర్పించారు. ఉదయం నుంచి ఆంజనేయస్వామికి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. సాయంత్రం మేళాతాళాల మధ్య ఉత్సవమూర్తిని తేరులో ఉంచి ఊరేగించారు. ఇంటి నుంచే ఆదాయమంటూ.. రూ.34 లక్షల మస్కా మైసూరు: ఇంటిలో కూర్చొని లక్షల రూపాయలను సంపాదించాలని అనుకున్న వ్యాపారి భారీగా లాసయ్యాడు. వివరాలు.. మైసూరు సిటీలోని విజయనగర 3వ స్టేజ్కు చెందిన వ్యాపారికి టెలిగ్రామ్ యాప్లో ఓ మెసేజ్ వచ్చింది. ఇంటిలో నుంచే దండిగా సంపాదించాలని ఉంటే తమను సంప్రదించాలని అందులో ఉంది. లింక్ను నొక్కి అందులోని నంబరుకు కాల్ చేశాడు. తాము చెప్పినట్లు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆగంతకులు తెలిపారు. వ్యాపారి పలుమార్లు 34.62 లక్షలను వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు. లాభం, అసలు వెనక్కు తీసుకుందామని ప్రయత్నించగా, మరింత పెట్టుబడి పెట్టాలని మోసగాళ్లు ఒత్తిడి చేశారు. చివరకు వారి ఫోన్లు స్విచాఫ్ చేసుకోవడంతో బాధితునికి మోసం అర్థమైంది. సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆకర్షణీయం.. క్రిస్మస్ ట్రీ కృష్ణరాజపురం: బెంగళూరులో క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. స్థానిక మాల్లో రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. నగరవాసులు ట్రీని సందర్శించి ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. నగరమంతటా పండుగ సంబరం కనిపిస్తోంది. బాధితురాలిపైనే పోలీసుల కేసు దొడ్డబళ్లాపురం: ఆనేకల్లో డయాగ్నసిస్ సెంటర్లో పరీక్షలకు వెళ్లిన ఓ మహిళను రేడియాలజిస్టు అసభ్యంగా తాకి వేధించిన కేసు గత నెలరోజులుగా చర్చనీయాంశమైంది. బాధితురాలు పదే పదే ఫిర్యాదు చేయడానికి పోలీస్స్టేషన్కు వెళ్లగా పోలీసులు తిరిగి ఆమైపెనే న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. రేడియాలజిస్టు జయకుమార్ అనే వ్యక్తి తనను వేధించినట్టు బాధితురాలు వీడియోలతో సహా పోలీసులకు నెల కిందటే ఫిర్యాదు చేసింది, కానీ నిందితున్ని పిలిపించి ఉత్తుత్తిగా మందలించి పంపించారు. సీఐ తిప్పేస్వామి.. జయకుమార్కు అండగా ఉన్నాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఆమె ఆరోపణలు అవాస్తవమని పోలీసులు చెబుతున్నారు. -
టీబీ డ్యాం పనులు వేగవంతం
రాయచూరురూరల్: తుంగభద్ర జలాశయం వద్ద 33 క్రష్ గేట్ల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి ఆదేశించారు. మునీరాబాద్లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు బృందాలను ఏర్పాటు చేసి రాబోయే ఖరీఫ్ నాటికి గేట్లు అమర్చే పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. వేసవిలో ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. జలాశయంలో 23 టీఎంసీల నీటిని వినియోగించారని వివరించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ హార్డ్వేర్ టూల్స్, మిషనరీ ప్రాజెక్టు కంపెనీ ప్రతినిధుల సలహా మేరకు పశ్చిమబెంగాల్లోని పరాక్ బ్యారెజీకి 124 గేట్లను అమర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ లక్ష్మణ్ నాయక్, ఎస్ఈ సత్యనారాయణ, గిరీష్, విజయలక్ష్మి, శాంతారాజ్, గోడేకర్ పాల్గొన్నారు. మంత్రి శివరాజ్ తంగడిగి -
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం
హొసపేటె: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని మాజీ మంత్రి బి.శ్రీరాములు పేర్కొన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం, బూత్ స్థాయి కార్యకర్తల వర్క్షాప్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు రైతుల కష్టాలను వినడం లేదన్నారు. కుర్చీల కోసం పోరాడుతున్న పాలకులపై ప్రజలు కోపంగా ఉన్నారని, బీజేపీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను సామాన్యులకు తెలియజేసేలా కార్యకర్తలు పనిచేయాలని ఆయన వివరించారు. రాబోయే జీపీఎం, టీపీఎం, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను తెరపైకి తీసుకురావాలని కోరారు. విజయనగర నియోజకవర్గంలో బీజేపీ బలం, ప్రస్తుత ఎమ్మెల్యేల నిష్క్రియాత్మకత గుర్తించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత బూత్స్థాయి కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, చెన్నబాషా, వనగౌడపాటిల్, అయ్యాలి తిమ్మప్ప, సందీప్సింగ్, శంకర్మేటి, ఎన్.రూపేష్కుమార్, అశోక్ జీరే, తదితరులు పాల్గొన్నారు. -
హామీలు ఏమయ్యాయి?
ప్లాస్టిక్ రహిత బళ్లారి జిల్లాగా మారుస్తామని ఏళ్ల తరబడి అధికారులు, పాలకులు చెబుతున్నా ఆచరణ పెట్టడంలేదు. ఆ దిశగా ఒక్క అడుగు పడకపోవడంతో సామాన్య, మధ్య తరగతి జనం ఆరోగ్యాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించే మాట అటుంచితే.. కనీసం హోటళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంలోనూ మహా నగర పాలికె, పుడ్ సేఫ్టీ అధికారులు విఫలమవుతున్నారు. అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండడంతో తుతూమంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారు. పలుమార్లు సమావేశాల్లో మేయర్ హామీలు గుప్పిస్తున్నారే గానీ ఆచరణ పెట్టడంలేదు. పాలికె అధికారులు వచ్చినపుడు మాముళ్లు ఇచ్చి అనంతరం వ్యాపారులు తమ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు
కెజీఎఫ్: విద్యార్థులు చదవుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే రూపా శశిధర్ పేర్కొన్నారు. నగరంలోని టి.తిమ్మయ్య ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన అండర్–14, అండర్–17 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో ఏకాగ్రత పెరిగి విద్యార్థులు పట్టుదలతో ఉన్నత చదువులు అభ్యసించే అవకాశం కలుగుతుందని తెలిపారు. క్రీడలలో గెలుపు, ఓటములు సమానంగా తీసుకుని ప్రతి క్రీడాకారుడు క్రీడా స్పూర్తితో ఆడాలన్నారు. అనంతరం పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆయన అభినందించారు. -
చెత్త ఊడ్చే యంత్రాలకు అంత ఖర్చా?
గతంలో పాలికె ప్రారంభించిన చెత్త ఊడ్చే వాహనాలు (ఫైల్) బెంగళూరు నగరంలో చెత్త ఊడుస్తున్న యంత్రంబనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని ప్రధాన రోడ్లు, అనుబంధ రహదారుల్లో చెత్త ఊడ్చే యంత్రాలను అధికారులు అద్దెకు తీసుకోనున్నారు. అందుకుగాను రూ.613 కోట్లు చెల్లించనున్నారు. ఇంత ఖర్చు అవసరమా అని అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. నగరవాసులు చెల్లించే పన్నుల డబ్బును ఇష్టానుసారం ఖర్చుచేయడం సమంజసమా? అనే ప్రశ్న వినిపిస్తోంది. బెంగళూరులో ఎన్నికై న పాలకవర్గం లేకపోవడం అధికారులు చెప్పినట్లు ప్రభుత్వం తలూపుతోందనే ఆరోపణలున్నాయి. 45 యంత్రాలను తీసుకునే అవకాశముంది. ఏడేళ్లు చెత్త ఊడ్చడానికి పై మొత్తం చెల్లిస్తారు. చెత్త యంత్రాలకే ఇంత డబ్బు పోతే మిగతా అభివృద్ధి పనులు, ముఖ్యంగా గుంతల రోడ్ల మరమ్మతులకు నిధులు ఎలా అని మాజీ కార్పొరేటర్లు, నగరవాసులు సందేహం వ్యక్తంచేశారు. అంత అవసరం లేదు గ్రేటర్ బెంగళూరు పరిధిలో 12.87 లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన రోడ్ల పొడవు 1,682 కిలోమీటర్లు. ఇలాంటి రోడ్లలో మాత్రమే యంత్రాలను వినియోగించాలి. ఇందుకు పెద్దగా ఖర్చు కాదు, కానీ సందుల్లో కూడా యంత్రాలను వాడాలనుకోవడం అర్థం కావడం లేదని మాజీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో ఏడాదిలో 6 నెలలు వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో చెత్త ఊడ్చే అవసరం ఉండదు. 45 వాహనాలు.. 7 ఏళ్ల అద్దెకు రూ.613 కోట్లు గ్రేటర్ బెంగళూరు నిర్ణయంపై విస్మయంపూణె, పాట్నా కంటే తక్కువే ఇప్పటికే వేలాదిమంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ ఉంటే వారికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో ఊడ్చే యంత్రాలున్న వాహనాలతో పని సులభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాత్రి వేళ కూడా శుభ్రం చేయవచ్చునని చెప్పారు. పూణె, పాట్నా వంటి నగరాలలోనూ ఈ పథకం ఉందని, అక్కడ కిలోమీటరుకు రూ.1290 వరకు ఖర్చు అవుతోందని, బెంగళూరులో కి.మీ.కు రూ.894 మాత్రమేనని చెప్పారు. -
అసత్య ప్రచారం చేయవద్దు
కోలారు: కోలారు జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులివ్వడం లేదనే అసత్య ప్రచారం చేయవద్దని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ పేర్కొన్నారు. తాలూకాలోని దొడ్డహసాళ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోలారు నియోజవర్గంలో రూ.1041 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దొడ్డహసాళ, చిక్కహసాళ గ్రామాలలో రహదారుల అభివృద్ధికి రాబోయే బడ్జెట్ నుంచి రూ.60 లక్షలు ఇస్తామన్నారు. దొడ్డహసాళ పంచాయతీ భవిష్యత్తులో కోలారు నగరంలోకి చేరుతుందని, బంగారుపేటకు వెళుతున్న రహదారిని చతుష్పథ రహదారిగా మార్పు చేస్తామని ఆయన వెల్లడించారు. త్వరలో రింగ్ రోడ్డు పనులు ప్రారంభమవుతాయని వివరించారు. విధాన పరిషత్ సభ్యుడు ఇంచర గోవిందరాజులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టడం సంతోషించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంఎల్.అనిల్కుమార్, కోముల్ డైరెక్టర్ చంజిమలై రమేష్, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు అంజమ్మ, చౌడప్ప, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ -
ఏఐలో భాగస్వాములు అవుదాం
కెజీఎఫ్: ఆధునిక సాంకేతిక యుగంలో మార్పులకు అనుగుణంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్లో అందరూ భాగస్వాములు కావాలని ధారవాడ ఐఐటీ ప్రముఖుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని టి.తిమ్మయ్య ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుపాటు నిర్వహించిన ఏఐ సాంకేతికత మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ సంస్థలు సమాచార, సాంకేతికత వ్యవహార క్షేత్రంలో ఇప్పటికే బలపడ్డాయని అన్నారు. సమాచారం, పాలనా వ్యవస్థ, ప్రమాదాల నిర్వహణను బలపర్చడానికి ఏఐ సాంకేతికత అత్యంత అవశ్యమన్నారు. ఈ మేళాలో 30 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. తిమ్మయ్య ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి 12 బృందాలు పాల్గొని 116 మంది విద్యార్థులు తమ కౌశల్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సయ్యద్ ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లిలో తుపాకీతో చిందులు
సాక్షి, బళ్లారి: పెళ్లి ఊరేగింపులో ఓ రౌడీషీటర్ తుపాకీ పట్టుకుని గాల్లోకి కాల్పులు జరుపుతూ చిందులేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. యాదగిరి జిల్లా గురుమిఠకల్ తాలూకా సిద్దాపుర గ్రామంలో పెళ్లి మెరవణి జరిగింది. ముండరిగి గ్రామ పంచాయతీ సభ్యుడు, రౌడీషీటర్ చంద్రశేఖర్ గన్ పట్టుకుని గాల్లోకి కాల్పులు జరుపుతూ నృత్యం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్థానిక పోలీసలు అతనిని అరెస్టు చేసి తుపాకీని సీజ్ చేశారు. అది నాటు తుపాకీ అని సమాచారం. ఆర్సీబీ మ్యాచ్లన్నీ బెంగళూరులోనే: డీసీఎం శివాజీనగర: వచ్చే ఏడాదిలో ఐపీఎల్లో ఆర్సీబీకి చెందిన అన్ని పోటీలు బెంగళూరులోనే జరుగుతాయని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. నగరంలోని కేఎస్సీఏ ఎన్నికలలో ఓటు వేసిన తరువాత ఆయన మాట్లాడారు. ఆర్సీబీ మనకు గర్వకారణం, ఐపీఎల్ మ్యాచ్లను ఇక్కడి నుంచి తరలించేది లేదు. ఆర్సీబీ టీం అన్ని మ్యాచ్లూ బెంగళూరులోనే జరుగుతాయి. దీనిపై నేను వారితో మాట్లాడతాను అని చెప్పారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడు, పదాధికారుల ఎన్నికలు జరగ్గా, మాజీ క్రికెటర్లు అనిల్కుంబ్లే, రోజర్ బిన్ని, బ్రిజేశ్ పటేల్ తదితర ప్రముఖులు ఓటు వేశారు. వెంకటేశ్ ప్రసాద్ కూడా పోటీలో ఉన్నారు. డీకే ఆప్తునికి నోటీసులు యశవంతపుర: నేషనల్ హెరాల్డ్ నిధుల కేసులో డీసీఎం డీకే శివకుమార్ ఆప్తుడు, కాంగ్రెస్ నాయకుడు ఇనాయత్ అలీకి ఢిల్లీ పోలీసులు (ఆర్థిక వ్యవహారాల విభాగం) నోటీసులిచ్చారు. ఈడీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఇనాయత్ అలీపై కేసు నమోదు చేసి త్వరలో విచారణకు రావాలని ఇంటికి వచ్చి నోటీసులిచ్చారు. ఇప్పటికే డీసీఎం సోదరులకు కూడా నోటీసులు రావడం తెలిసిందే. గత ఏడాది కాలం నుంచి ఈడీ అధికారులు అలీని విచారణ చేస్తున్నారు. -
అడుగు తడబడితే.. జారి పడాలంతే
కోలారు: ఎటు చూసినా మురుగు నీరు పేరుకుపోయి బురదమయం కావడంతో అడుగు తడబడినా జారి పడాల్సి వస్తోంది. నగర సమీపంలోని విజయనగర కాలనీలో కాల్వలు శుభ్రం చేయకపోవడంతో మురుగు పొంగి ప్రవహిస్తూ రహదారి పైకి చేరుతోంది. చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారంతా దుర్గంధం భరించలేకపోతున్నారు. దోమలు తీవ్రమై అనారోగ్యం పాలవుతున్నామని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని చెబుతున్నారు. కల్వర్టు నిర్మాణం నిలిపివేయడంతో ఈ పరిస్థితి కలిగిందని, ఆ దారిన వెళ్లాలంటే ముక్కు మూసుకుని నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మురుగు నీరు రహదారిపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
గస్తీ పోలీసులకు దొంగల ముఠా బెదిరింపులు
సాక్షి,బళ్లారి: చేతిలో పిస్తోలు పట్టుకుని గస్తీ తిరుగుతున్న పోలీసులను బెదిరించి పారిపోయిన దొంగల ముఠా నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. బెళగావి జిల్లా నిప్పాణి పట్టణంలో శుక్రవారం రాత్రి పలు వీధుల్లో గస్తీ తిరుగుతున్న పోలీసులపై దొంగల ముఠా చొరబడి భయభ్రాంతులకు గురి చేసింది. చేతిలో పిస్తోలు పట్టుకుని తిరుగుతున్న పోలీసులను బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కూడా నిక్షిప్తమయ్యాయి. గుర్తు పట్టలేని విధంగా మారువేషాల్లో వచ్చిన దొంగల ముఠా ఆయా కాలనీల్లో దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు గస్తీ తిరుగుతూ కనిపించడంతో బెదిరించారు. పోలీసులు కూడా ప్రతిఘటించడంతో దొంగల ముఠా పరారయ్యారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పంచమసాలిలపై లాఠీఛార్జి ఖండనీయం●అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ ఆందోళన చేస్తాం ● బసవజయ మృత్యుంజయ స్వామి వెల్లడి సాక్షి,బళ్లారి: పంచమసాలి సముదాయానికి 2ఏ రిజర్వేషన్ కల్పించాలని ఒత్తిడి చేస్తూ మళ్లీ పోరాటానికి సిద్ధం అవుతామని బసవజయ మృత్యుంజయ స్వామి పేర్కొన్నారు. బెళగావిలో ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మళ్లీ పెద్ద ఎత్తున జనంతో చేరి ఆందోళన చేస్తామన్నారు. డిసెంబర్ 10న మౌన ప్రతిఘటన చేస్తామన్నారు. పంచమసాలి సముదాయానికి 2ఏ రిజర్వేషన్ కల్పించాలని గత ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నామని గుర్తు చేశారు. పోరాటం చేసే వారిపై లాఠీఛార్జి, అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని తీవ్రంగా ఖండించారు. అక్రమంగా తరలిస్తున్న చౌక డిపో బియ్యం పట్టివేతరాయచూరు రూరల్: చౌకడిపోల ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం అక్రమంగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న సమయంలో వాటిని అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి యాదగిరి జిల్లా గురుమఠకల్లో అక్రమంగా లారీలో తరలిస్తున్న రూ.7 లక్షల విలువ చేసే 220 క్వింటాళ్ల బియ్యాన్ని ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి అన్వర్ హుసేన్ ఆధ్వర్యంలో దాడి చేసి లారీతో సహా స్వాధీనం చేసుకున్నారు. వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య ● నిందితుని అరెస్టు సాక్షి,బళ్లారి: అన్యమతస్తుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళను తన మతంలోకి మారాలని ఒత్తిడికి గురి చేసి వేధించడంతో సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా గొణ్ణిగనూరు గ్రామంలో నాగవ్వ ఆనే మహిళ ఇతర మతానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగించడంతో ఆమెను తన మతంలోకి చేరాలని ఒత్తిడి చేసిన నేపథ్యంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు, స్థానికులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు కారకుడైన ముక్తుంసాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ పరివర్తకాలు ఏర్పాటు చేయండిరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో రైతుల డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ పరివర్తకాల(ట్రాన్స్ఫార్మర్ల)ను ఏర్పాటు చేయాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేడీపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. తోటల పెంపకానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ముందుండాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలపై స్పందించాలని సూచించారు. సమావేశంలో జిల్లాధికారి నితీష్, ఏసీ గజానన బళి, అధికారులున్నారు. లేబర్ కార్డుల పంపిణీ కోలారు: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సౌకర్యాలను అందిస్తోంది, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ షఫీ తెలిపారు. శనివారం నగరంలోని 22వ వార్డు కువెంపు నగర్లో ఆర్థిక సాక్షరతా కేంద్రం, జిల్లా మార్గదర్శి బ్యాంకు సహకారంతో లబ్ధిదారులకు లేబర్ కార్డులను అందజేశారు. కాంగ్రెస్ నేతలు రఫీ, ఖయ్యూం, పాషా, అలమీర్ జాన్, నదీం, ప్యారూ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. -
దేవుని ఫ్లెక్సీకి నిప్పు
సాక్షి,బళ్లారి: కార్తీక మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పరమశివుని ఫ్లెక్సీకి కొందరు దుండగులు నిప్పు పెట్టడంతో దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకాలో కలకలం రేగింది. శుక్రవారం రాత్రి హొన్నాళి తాలూకా సాసివెహళ్లి గ్రామంలో కల్లేశ్వర కార్తీక మహోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. కొందరు దుండగులు ఫ్లెక్సీకి నిప్పు పెట్టడంతో గ్రామంలో పెద్ద ఎత్తున జనం చేరి ఆందోళన చేశారు. మాజీ మంత్రి రేణుకాచార్య ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు నాయకత్వం వహించారు. సాక్షాత్తు సృష్టి లయకర్త శివుడి కార్తీక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటే దుండగులు ఇలాంటి నీచకృత్యానికి పాల్పడ్డారని, దుండగులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న దుర్మార్గులపై పోలీసులు దృష్టి సారించి వెంటనే అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. నిరసన వ్యక్తం చేసిన సాసివెహళ్లి గ్రామస్తులు దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకాలో కలకలం -
సీఐకి కన్నీటి వీడ్కోలు
హుబ్లీ: రోడ్డు ప్రమాదంలో ఓ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. హావేరిలో లోకాయుక్త సీఐగా పని చేస్తున్న పంచాక్షరి సాలిమఠ(54) స్వస్థలం బెళగావి జిల్లా మురగోడ కాగా తాను ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఫలితంగా కారు ఇంజిన్లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని కాలిబూడిదయ్యారు. ఎముకలు కూడా దొరకని స్థితిలో సీఐ మృతదేహం కనిపించింది. తన విధులను ముగించుకుని భార్య, పిల్లలను చూడటానికి గదగ్ వైపు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. కాగా కాలిబూడిదైన ఆయన దేహం, కారు నంబరు, ధరించిన ఉంగరం ద్వారా సీఐ మృతదేహంగా గుర్తించారు. హుబ్లీ కిమ్స్లో ఆయన సహోద్యోగులు, సిబ్బంది చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. బంధువులు, స్నేహితులు, భార్య, పిల్లల రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు. హుబ్లీ–ధార్వాడ పోలీసు కమిషనర్ శశికుమార్ విలేకరులతో మాట్లాడుతూ సాలిమఠ తన విధులను ఎంతో చక్కగా నిర్వహించేవారని ప్రశంసించారు. ప్రజలతో పాటు పోలీసుల్లో కూడా మంచిపేరు తెచ్చుకున్నారన్నారు. ఆయన 2003వ బ్యాచ్కు చెందిన వారని, ప్రస్తుతం లోకాయుక్త సీఐగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి సమర్థ అధికారి ఇలా కారు ప్రమాదంలో ఘోరంగా మరణించడం తమను ఎంతో బాధిస్తోందన్నారు. అగ్నిప్రమాదంలో లోకాయుక్త సీఐ దుర్మరణంరాయచూరు రూరల్: కారులో వెళుతుండగా జరిగిన అగ్నిప్రమాదంలో లోకాయుక్త సీఐ పంచాక్షరి సాలిమఠ దుర్మరణం పాలైన ఘటన ధార్వాడ జిల్లా అణ్ణిగేరి వద్ద జరిగింది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని కారులో బయలుదేరారు. అయితే కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో గుంతలో పడ్డ కారు ఇంజిన్లో నుంచి మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. పంచాక్షరి సాలిమఠ గతంలో బైలహొంగల, గదగ్, హుబ్లీలలో విధులు నిర్వహించారు. -
ఉపాధి హామీ పనుల తనిఖీ
శ్రీనివాసపురం: శ్రీనివాసపురం తాలూకాను అవినీతి రహితంగా చేయడమే లక్ష్యమని ఉప లోకాయుక్త బి.వీరప్ప అన్నారు. తాలూకాలోని జి.తిమ్మసంద్ర, అరికుంటె, దళసనూరు, మాస్తేనహళ్లి తదితర గ్రామ పంచాయతీలను ఆయన సందర్శించి ఉపాధి హామీ, తాగు నీటి పథకాల పనులను పరిశీలించారు. నైర్మల్య నిర్వహణ, పన్నుల వసూళ్లకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. పనుల అమలులో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బి.వీరప్ప మాట్లాడుతూ ప్రజలలో మార్పు రావాలని, అప్పుడే సమాజం మారుతుందని తెలిపారు. నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లోకాయుక్త న్యాయమూర్తి అరవింద్, జిల్లా లోకాయుక్త ఎస్పీ అంటనిజాన్, డీఎస్పీ మోనిషా, తహసీల్దార్ జీఎన్.సుధీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నవ వరుడు ఆత్మహత్య
యాడికి: ఏడడుగుల బంధంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాల్సిన యువకుడికి ఏం కష్టమొచ్చిందో ఏమో పైళ్లెన 33 రోజులకే జీవితంపై విరక్తి చెంది శెనగ పంటకు వాడే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు గ్రామానికి చెందిన జయరాం నాయుడుకు శరత్ కుమార్ నాయుడు(23), లోకేష్ కుమార్ నాయుడు అనే ఇద్దరు కుమారులు. శరత్ కుమార్ నాయుడు మరో వ్యక్తితో కలిసి కొంత కాలంగా బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు లోకేష్ కుమార్ నాయుడు నగరూరులో తమ వ్యవసాయ తోటల్లో తండ్రికి చోదోడు వాదోడుగా ఉంటున్నాడు. గత నెల 2, 3వ తేదీల్లో బళ్లారి జిల్లాలోని సుగ్గేనహళ్లి కొట్టాల గ్రామానికి చెందిన సుస్మితతో శరత్ కుమార్ నాయుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. 10 రోజుల క్రితం తన భార్య సుస్మితను నగరూరు గ్రామంలో తమ ఇంటి వద్ద ఉంచి శరత్కుమార్ బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 3వ తేదీన సుస్మిత తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఏం కష్టం వచ్చిందో కానీ.. శుక్రవారం బెంగళూరు నుంచి వచ్చిన శరత్కుమార్ తాడిపత్రి మీదుగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న తన స్నేహితుడు హరీష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీకి హరీష్ వెళ్లిన తర్వాత ఇంటిలో ఉన్న శరత్ కుమార్ నాయుడు తన సెల్ఫోన్లో భార్యతో సుమారు గంటసేపు మాట్లాడాడు. 9 గంటల తర్వాత తాను శెనగ గింజలకు వేసే క్రిమిసంహారక మాత్రలు మింగానని శరత్కుమార్ హరీష్కు ఫోన్ చేశాడు. వెంటనే గదికి వచ్చిన హరీష్ విలవిలలాడుతున్న శరత్కుమార్ నాయుడును ఓ వాహనంలో తాడిపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. శరత్కుమార్ నాయుడిని పరీక్షించిన డాక్టర్లు ఇక లేడని తెలిపారు. అనంతపురానికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు మృతి చెందిన శరత్కుమార్ నాయుడిని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మృతుడి భార్య సుస్మిత తన తల్లిదండ్రులతో అనంతపురానికి వచ్చి ఆసుపత్రిలో విగత జీవిగా ఉన్న భర్తను చూసి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పైళ్లెన 33 రోజులకే మృత్యువాత శోకసంద్రంలో నగరూరు గ్రామం -
కరాటేలో డేవిడ్కు స్వర్ణ పతకం
రాయచూరు రూరల్: కరాటే పోటీల్లో రాయచూరుకు చెందిన డేవిడ్ స్వర్ణ పతకం సాధించాడు. గతనెల 30వ తేదీన హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నగరానికి చెందిన డేవిడ్్ పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా ఎంఎస్.జావిద్ శాటోకన్ జాతీయ కరాటే అవార్డును గ్రాండ్మాస్టర్ షాహిద్, ప్రధాన కార్యదర్శి సుభాన్ చేతుల మీదుగా అందుకున్నాడు. తుంగభద్ర నదీ తీరంలో మొసలి ప్రత్యక్షం● భయాందోళనలో గ్రామ ప్రజలు రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా మద్లాపుర వద్ద శనివారం తుంగభద్ర నదీ తీరంలో మొసలి ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న తుంగభద్ర నదీ తీర ప్రాంతంలో మొసలి ప్రత్యక్షం కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు వన్య జీవులు, జలచరాల నుంచి ప్రజలను రక్షించడానికి అటవీ శాఖాధికారులకు వెంటనే సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో విద్యార్థులపై దాడిరాయచూరు రూరల్: ప్రభుత్వ సాంఘీక సంక్షేమ శాఖ హాస్టల్లోని విద్యార్థులపై అధికారులు దాడి చేశారు. శుక్రవారం రాత్రి తాలూకాలోని ఉడుంగల్ ఖానాపూర్లోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ హాస్టల్లో వార్డెన్, సిబ్బంది కలిసి విద్యార్థులపై దాడి చేయడంతో భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. చిన్న పిల్లలను ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో హింసకు గురి చేస్తున్నారు. 125 మంది విద్యార్థులకు గాను 80 మంది విద్యార్థులున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. విద్యార్థులు అధికారులను పెన్సిల్, పెన్నులు, పుస్తకాలు అడిగితే వారిని చితకబాదినట్లు సమాచారం. విద్యార్థులకు యూనిఫాం, షూ, పుస్తకాలు, కిట్లు ఇవ్వకుండా, హాస్టల్లో సీసీ టీవీలు, మంచినీటి ప్లాంట్ చెడిపోయినా మరమ్మతు చేయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముక్తి రథం వాహనం పంపిణీరాయచూరు రూరల్: దళితుల శవ సంస్కారానికి వీలుగా ముక్తి రథం వాహనాన్ని శనివారం విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ పంపిణీ చేశారు. నగరంలోని హరిజనవాడల్లో మృతదేహాలను శ్మశాన వాటికకు తరలించడానికి వీలుగా రూ.20 లక్షలతో రెండు శవపేటికలు, ముక్తి రథం వాహనాన్ని ఆయన అందించారు. ఈ సందర్భంగా మాదార చెన్నయ్య గురు పీఠం అధ్యక్షుడు యమనూరప్ప, బసవరాజ, రామణ్ణ, సత్యనాథ్, వెంకటేష్, బాబు, తిమ్మప్ప, మాజీ నగరసభ సభ్యుడు యల్లప్ప, అస్లాంపాషా, మురళీ యాదవ్, మహ్మద్ హుసేన్, రజాక్ ఉస్తాద్లున్నారు. వాలంటీర్ల దినోత్సవంరాయచూరు రూరల్: మాదార చెన్నయ్య ఆడిటోరియంలో మ్యాజిక్ ఇండియా ఫౌండేషన్, నెస్లే ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత వాలంటీర్ల దినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో రాయచూరు గ్రీన్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, సమాజ అభివృద్ధి, నాయకత్వంపై యువతీ యువకులు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఈరణ్ణ, చంద్రశేఖర్, గూళప్ప, కాశీనాథ్, నరసప్ప, సురేష్లున్నారు. -
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
సాక్షి, బళ్లారి: పేద కుటుంబంలో జన్మించి, కష్టపడి ఉన్నత విద్యనభ్యసించి, భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ అణగారిన, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం అంబేడ్కర్ పరినిర్వాణ దినోత్సవం(వర్ధంతి) సందర్భంగా నగరంలోని హొసపేటె రోడ్డులోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కాంస్య ప్రతిమకు కొప్పళ ఎమ్మెల్యే, రాబకొ చైర్మన్ రాఘవేంద్ర హిట్నాల్, బళ్లారి జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ శోభారాణి, ప్రముఖులు ముండ్రిగి నాగరాజ్, చిదానందప్ప తదితరులు పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అంబేడ్కర్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగానికి యావత్ ప్రపంచ దేశాలు కితాబునిచ్చాయన్నారు. భారత దేశంలో పేదరిక నిర్మూలన, కులవివక్షతను రూపుమాపేందుకు పునాదులు వేయడంతో దేశంలో అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో రాణించేందుకు వీలైందన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుస్తూ దేశాభివృద్ధికి బాటలు వేయాలన్నారు. అన్ని పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఖ్యాతి.. దశదిశలా వ్యాప్తి మహామానవతావాది డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ను బీజేపీ ఎంతో గౌరవించి ప్రపంచంలోనే ఆయన పేరును మరింత ఇనుమడింపజేసేలా కృషి చేసిందని నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, సీనియర్ న్యాయవాది దాసరి గోవిందు పేర్కొన్నారు. శనివారం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ మహా పరినిర్వాణ దినోత్సవం సందర్భంగా నగరంలోని మోకా రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేడ్కర్కు ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. దేశంలో పంచతీర్థాలను బీజేపీ రూపొందించిందని, వాటిలో ఆయన పుట్టిన స్థలం మధ్యప్రదేశ్లోని మావ్, లండన్లో ఉన్నత విద్యాభాస్యం చేసిన ప్రాంతాన్ని విద్యాభూమిగా, నాగ్పూర్లో బుద్ధదీక్ష తీసుకున్నందుకు దీక్షాభూమిగా, అంబేడ్కర్ శరీరం వదిలిన ప్రాంతాన్ని మహాపరినిర్వాణ స్థలంగా, ఆయన సమాధి అయిన ప్రాంతాన్ని చైతన్యభూమిగా ఈ ఐదు పవిత్ర స్థలాలను గుర్తించి పంచతీర్థాలుగా మార్చి, మ్యూజియంలు ఏర్పాటు చేసి దేశశ ప్రజలకే కాకుండా, యావత్ ప్రపంచానికి ఆయన ఖ్యాతిని మోదీ ఇనుమడింపజేశారన్నారు. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా గుర్తించారన్నారు. ఈ మహత్తరమైన రోజు మోదీ ప్రభుత్వం వచ్చాక 2015లో అమల్లోకి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా అమలు చేసిందన్నారు. భారత దేశంలో అరుదైన, ఆణిముత్యంగా కీర్తి పొందిన అంబేడ్కర్ను ఎంతో గౌరవిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నట్లు తెలిపారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: నగరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ పార్టీలకు చెందిన నేతలు, అధికారులు పూలమాలలు వేశారు. శనివారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 69వ పరినిర్వాణ దినంలో భాగంగా అంబేడ్కర్ ప్రతిమకు జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, డీఎస్ఎస్ నేతలు రవీంద్రనాథ పట్టి, తిమ్మారెడ్డి, గురురాజ్, వెంకటేష్, జేడీఎస్ నేతలు విరుపాక్షి, మహంతేష్ పాటిల్, విశ్వనాథ్ పట్టి పాల్గొని పూలమాలలు వేశారు. రాయచూరులో అంబేడ్కర్ ప్రతిమకు నాయకుల పుష్పాంజలి బళ్లారిలో అంబేడ్కర్ ప్రతిమకు నేతల పుష్పాంజలి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి అంబేడ్కర్ పరినిర్వాణ దినోత్సవంలో వక్తలు -
అంబేడ్కర్కు నివాళి
కోలారు: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని బంగారుపేట సర్కిల్లో అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదర్గాలకు అంబేడ్కర్ అందించిన సేవలు అపారమని, అన్ని సముదాయాల వారికి అనుకూలమయ్యే రాజ్యాంగాన్ని అందించిన ఘనత ఆయనదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంఎల్.అనిల్కుమార్, జిల్లా పంచాయతీ సీఈఓ డాక్టర్ ప్రవీణ్ పిబాగేవాడి, జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నిఖిల్, తదితరులు పాల్గొన్నారు. దుకాణాల తనిఖీ శ్రీనివాసపురం: ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలనే సంకల్పంతో పుర సభ అధికారులు పట్టణంలోని బేకరి, పండ్లు, హోటల్, కూరగాయల దుకాణాలను దుకాణాలను శనివారం తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు వాడరాదని యజమానులను హెచ్చరించారు. ఎంజీ రోడ్డులోని ఫుట్పాత్ను తొలగించి, ముళబాగిలు సర్కిల్లో చెత్త వేసే స్థలంలో ముగ్గులు వేయించారు. అనంతరం 25 కిలోల ప్లాస్టిక్ స్వాధీనం చేసుకుని దుకాణదారులకు రూ.3 వేల జరిమానా విధించారు. పురసభ పరిసర సూపరింటెండెంట్ లక్ష్మీశ, హెల్త్ సూపర్వైజర్ టీవీ.సురేష్, సిబ్బంది సంతోష్, నాగేష్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
పశువుల ఆస్పత్రి మార్పు వద్దు
కేజీఎఫ్: బంగారు గనుల ప్రాంతంలో బ్రిటీష్ హయాంలో నిర్మించిన మైసూర్ మైన్స్ ప్రాథమిక పశువుల ఆస్పత్రిని మరో ప్రాంతానికి తరలించవద్దని గ్రామీణ ప్రాంతాల రైతులు హెచ్చరిస్తున్నారు. బంగారు గనుల ప్రాంతంలోని ఐదు వార్డులకు చెందిన మారికుప్పం, బళిగానహళ్లి, గిడ్డగౌడనహళ్లి, కేజీఎఫ్ ఎ బ్లాక్, సౌత్ బ్లాక్, హళ్లి కుడ్య, చిన్నకల్లు, నగర కమీషన్ లైన్, పర్పెంటర్ కాలనీ, ఛాంపియన్ రైల్వే స్టేషన్ కాలనీలలోని పలు కుటుంబాలు జెర్సీ ఆవులు, గొర్రెలు, మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వీరంతా తమ పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఈ ఆస్పత్రిలోనే టీకాలు వేయిస్తారు. ఈ ఆస్పత్రిలో సుమారు నెలకు 9 నుంచి 10 వేల మూగ ప్రాణులకు చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే సిఫారసు మేరకు ఇపుడు అకస్మాత్తుగా ఆస్పత్రిని బడమాకనహళ్లికి తరలించడం తగదని, అలాచేస్తే తాము చూస్తూ ఊరుకోమని ఆ గ్రామాల పాడి రైతులు హెచ్చరిస్తున్నారు. స్థలాంతరం చేయడం వల్ల పశువుల చికిత్సకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిని అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రిని ఇక్కడి నుంచి తరలించవద్దని కోరుతున్నారు. -
తేడా భర్త.. పరీక్షలకు వెళ్తే పరారీ
దొడ్డబళ్లాపురం: సంసారం చేయడం లేదు, అలాగే పురుషత్వ పరీక్షకు ఒప్పుకోకుండా పరారైన భర్త ఉదంతం నెలమంగలలో జరిగింది. బెంగళూరు హెసరఘట్ట నివాసి అయిన యువతి (26)కి, నెలమంగలకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అయిన వరునితో (30) గత జూన్ 9న వివాహం జరిగింది. మొటి రాత్రే భర్త అంటీముట్టనట్టుగా ప్రవర్తించినా, గొడవ కాకూడదని ఆమె అలాగే సంసారం నెట్టుకొస్తోంది. ఆరు నెలలు గడిచినా నెల తప్పలేదని అత్తమామలు ఆమెను వేధించడంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంది. అన్ని రిపోర్టులు మామూలుగా వచ్చాయి, అయితే భర్త మాత్రం పురుషత్వ పరీక్ష అనగానే ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. భర్త చేత పురుషత్వ పరీక్ష చేయించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంసారం చేయడం లేదని అడిగినందుకు అదనపు కట్నం పేరుతో భర్త, అత్తమామలు వేధిస్తున్నారని కూడా ఫిర్యాదులో తెలిపింది. పోలీసులకు భార్య ఫిర్యాదు -
కుర్చీ కలహం మరచి..
బనశంకరి: మహిళా రిజర్వేషన్ ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం ఎందుకు వాయిదా వేస్తోందని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. శనివారం హాసన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సమావేశం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కలిసి సిద్దరామయ్య పాల్గొన్నారు. ఇద్దరూ ఐక్యతను చాటుకునేలా అభివాదం చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య ప్రసంగిస్తూ హాసన్కు తామేం చేశామో చెప్పాలని కేంద్రమంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. అసలు మండ్య జిల్లాకు కుమారస్వామి ఏమి చేశారో స్పష్టం చేయాలన్నారు. మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు తమ సర్కారు గ్యారంటీలతో పాటు అనేక పథకాలు అండగా మారాయని చెప్పారు. ప్రధాని మోదీ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ వసూళ్లలో నష్టం వస్తోంది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు తగ్గాయని విమర్శించారు. ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో 492 హామీలు ఇచ్చామని, ఇప్పటివరకు 242 హామీలను నెరవేర్చామని చెప్పారు. ఇప్పటివరకు 600 కోట్ల సార్లు మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. జిల్లాలో హేమావతి జలాశయం కింద 700 ఎకరాల స్థలం ఉంది, అక్కడ ఉద్యానవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బేలూరు– హళేబీడు, శ్రావణ బెళగొళలో ఉద్యానవనాల స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు. అంబేడ్కర్తోనే సామాజిక న్యాయం డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ మహోన్నత వ్యక్తి. దేశం గర్వించదగ్గ ఒక అపురూప నేత. దళితులకు మాత్రమే కాకుండా అన్నివర్గాలకు గౌరవం తీసుకురావడంతో పాటు పీడనకు గురైనవారి కోసం పోరాడారని సీఎం సిద్దరామయ్య తెలిపారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం విధానసౌధ ఆవరణలోని ఆయన విగ్రహానికి సీఎం సిద్దు, ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. కుర్చీ కలహాలు అన్నీ మరిచిపోయినట్లు కనిపించారు. మనువాది కుమారస్వామి కేంద్రమంత్రి హెచ్డీ.కుమారస్వామిపై సీఎం సిద్దరామయ్య ధ్వజమెత్తారు. భగవద్గీత ను పాఠ్యాంశంలోకి చేర్చాలని కుమారస్వామి కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖ రాశారు, బీజేపీతో పొత్తు తరువాత ఆయన మనువాదిగా మారారు అని మండిపడ్డారు. వాచీ ధరిస్తే గొడవెందుకు? ● బీజేపీపై డిప్యూటీ సీఎం విసుర్లు రాష్ట్ర రాజకీయాల్లో గడియారాల గొడవ జోరందుకుంది. ఖరీదైన తన కార్టియర్ వాచ్ మీద బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడంపై డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మరోసారి మండిపడ్డారు. నగరంలో స్పందిస్తూ నాకు ఎన్ని వాచీలైనా ధరించే శక్తి ఉంది. నేను వెయ్యి రూపాయల వాచీ కడతా, రూ.10 లక్షల వాచీ ధరిస్తా, నా జీవితం ఏమిటనేది బీజేపీ నేతలకు తెలుసు అన్నారు. ఎవరు ప్యాంట్ వేసుకుంటారు, వాచీ ఎవరు కడతారు, ఎవరు కళ్లద్దాలు పెట్టుకుంటారు అనేది అవసరమా? అది వారి వ్యక్తిగత విషయం. కొందరు రూ.వెయ్యి షూ ధరిస్తారు. మరికొందరు రూ.లక్ష విలువైన షూ వేస్తారు అని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టు అమలైతే ప్రజలకు తాగునీరు అందుతుంది. మండ్య, మైసూరు ప్రాంత ప్రజలకు కష్టకాలంలో నీరు లభిస్తుందని చెప్పారు. దేవుడు వరమో, శాపమో ఇవ్వడు, కేవలం అవకాశం ఇస్తాడు, దానిని మనం ఎలా ఉపయోగించుకున్నాం అనేది ముఖ్యమని అన్నారు. కాగా, ఆయన కార్టియర్ వాచ్తోనే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హాసన్లో జరిగిన బహిరంగ సభలో సీఎం సిద్దు, డీసీఎం శివ అభివాదం బెంగళూరులో అంబేడ్కర్ వర్ధంతి సందర్శంగా ఖర్గేతో కలిసి నివాళులు సభలు, సమావేశాల్లో సీఎం సిద్దు, డీసీఎం శివ ఉమ్మడిగా హాజరు హాసన్లో భారీ సభ మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్రానికి సీఎం డిమాండ్ -
రెండు మూడు నెలల కిందటే టికెట్ను బుక్ చేసుకున్నారు. చాలామందికి అత్యవసర పనులే. తీరా విమానాశ్రయానికి వచ్చాక ఫ్లైట్ క్యాన్సిల్ అనే జవాబు వినిపించింది. ఇక ప్రయాణికుల పాట్లు చెప్పనలవి కాదు.
నిలిచిపోయిన ఇండిగో విమానాలుఇతర విమానాలు, ప్రైవేటు బస్సుల్లో మోత దొడ్డబళ్లాపురం: సిలికాన్ సిటీలోని కెంపేగౌడ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. నిత్యం రచ్చ రచ్చ అవుతోంది. ఇండిగో విమానాల సంక్షోభమే దానికి కారణం. తాజాగా శనివారం కూడా 32కు పైగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు లబోదిబోమన్నారు. ఇళ్లకు తిరిగి వెళ్లలేక, అక్కడే ఉండలేక నరకయాతన పడ్డారు. బస్టాండు కంటే అధ్వానం ● ప్రయాణికులు భారీగా చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ విమానాశ్రయం సాధారణ బస్టాండును తలపించింది. ప్రయాణికులు అలసిపోయి ఎక్కడబడితే అక్కడ పడుకుని సేదతీరుతున్న దృశ్యాలు కనిపించాయి. ● ఇండిగో కౌంటర్లలో సిబ్బంది ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తున్నారని ప్రయాణికులు ఆరోపించారు. కొందరు కోపం పట్టలేక కొట్లాటకు దిగారు. ఎటుచూసినా కోలాహలం కనిపిస్తోంది. ● వృద్ధ మహిళలు, పిల్లల తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, మంచినీటి వసతి లేదు, కొందామంటే వాటి ధరలు వేల రూపాయల్లో ఉంటున్నాయని చెప్పారు. ● పగవారికి కూడా ఇలాంటి బాధలు వద్దనేలా పరిస్థితి ఉంటోంది. అనేకమంది ప్రయాణికులు తమ గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకున్నారు. ● నా జీవితంలో ఇలాంటి దుస్థితిని చూడలేదని ఓ ప్రయాణికుడు చెప్పారు. పరీక్షలకు, ఇంటర్వ్యూలకు, అత్యవసర కుటుంబ పనుల మీద వెళ్లేవారు తీవ్ర ఆవేదన చెందారు. ● ఘర్షణలు జరగకుండా ఎయిర్పోర్టులో భద్రతను పెంచారు. ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ఇతర ఎయిర్లైన్స్ విమానాల టికెట్ల ధరలతో పాటు ప్రైవేటు బస్సుల చార్జీలు కూడా అమాంతం పెరిగాయి. బాధిత ప్రయాణికులు అనేకమంది బస్సుల్లో ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో బెంగళూరు నుంచి వెళ్లే ప్రైవేటు బస్సుల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉదాహరణకు బెంగళూరు నుంచి ముంబైకి బస్ టికెట్ ధర రూ.1500 నుంచి రూ.2,500 ఉండగా ఇప్పుడు రూ.4,500 నుంచి రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇతర నగరాలకు కూడా ధరలు భగ్గుమంటున్నాయి. రెండు విధాలా దోపిడీకి గురవుతున్నట్లుప్రయాణికులు వాపోయారు. బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో తగ్గని గందరగోళం ఇష్టానుసారం ఇండిగో విమానాల క్యాన్సిల్ ప్రయాణికులకు తీవ్ర అవస్థలు -
ప్రాణం తీసిన పొగ మంచు
కనగానపల్లి: యువతిని పొగమంచు బలితీసుకుంది. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో 44వ జాతీయ రహదారిలో జరిగింది. వివరాలు.. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్కు చెందిన రాళ్లపలి ధర్మరావు, కుష్మా దంపతుల కుమార్తె రాళ్లపల్లి వినీల (35) సైకాలజీలో పీహెచ్డీ పూర్తి చేసింది. బెంగళూరులో ఉద్యోగ అన్వేషణలో ఉంది. శనివారం తెల్లవారుజామున బెంగళూరులో బంధువుల ఇంటిలో ఉన్న స్కూటర్ను తీసుకొని హైదరాబాద్ కు బయల్దేరింది. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామ సమీపంలో పది మీటర్ల దూరంలో ఏముందనేది కూడా తెలియని విధంగా మంచు కప్పేసింది. ఈక్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఇనుప కమ్మీలను ఆమె ఢీకొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో వినీల తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మరణించింది. కనగానపల్లి పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు స్కూటర్లో పయనం హైవే పక్కన ఇనుప కమ్మీలను ఢీకొని యువతి దుర్మరణం -
మహిళా దొంగ అరెస్టు
కోలారు: దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.10.7 లక్షల విలువ చేసే 88 గ్రాముల బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తాలూకాలోని భీమగానహళ్లి గ్రామానికి చెందిన మహిళ (35) నిందితురాలు. అక్టోబర్లో స్థానికుడు శ్రీనివాస్ ఇంటిలో బంగారు నగలు పోయినట్లు కామసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె ను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. డబ్బు మీద ఆశతో చోరీలు చేస్తున్నట్లు నిందితురాలు తెలిపింది. కాంగ్రెస్ నేత హత్య ● చిక్కమగళూరు జిల్లాలో ఘటన బనశంకరి: చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవలో గ్రామపంచాయతీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు గణేశ్గౌడ (38) హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి కల్కురుడేశ్వర వద్ద కారులో వెళ్తుండగా సంజయ్, మిథున్ అనే ఇద్దరు బైక్తో అడ్డుకుని కొడవలితో దాడిచేసి చంపారు. నిందితులు భజరంగదళ్ కార్యకర్తలని తెలిసింది. సఖరాయపట్టణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ విక్రమ్ ఆమ్టె తెలిపారు. ఇద్దరు నిందితులు కూడా ఆసుపత్రిలో చేరారని తెలిపారు. సంజయ్, భూషణ్, మిథున్తో పాటు ఐదుమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం: ఎమ్మెల్యే మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆనంద్ సందర్శించారు. ఎమ్మెల్యే ఆనంద్ బ్యానర్ తొలగింపు గురించి గొడవ జరిగి హత్యకు దారితీసిందని సమాచారం. కొద్దిరోజులుగా గణేశ్, మరో వర్గం మధ్య విభేదాలున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని ఎమ్మెల్యే ఆనంద్ ఆరోపించారు.అలరిస్తున్న గ్రామీణ మేళా బనశంకరి: రాజధానిలో రాజస్థాన్ గ్రామీణ మేళా నగరవాసులకు కనువిందు చేస్తోంది. బనశంకరి రెండో స్టేజ్ బనశంకరి మహిళా సమాజ భవనంలో మేళా సాగుతోంది. దేశంలో పేరుమోసిన చేనేత వస్త్రాలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, గృహాలంకరణ సామగ్రి, ఆభరణాల వంటి అలంకరణ వస్తువులు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ ప్రదర్శన 14వ తేదీ వరకు నిర్వహిస్తారు. పిల్ల పులి లభ్యంమైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా నాగరహొళె అభయారణ్యానికి ఆనుకుని ఉన్న గురుపుర టిబెటన్ కాలనీకి చెందిన జే.విలేజ్ వద్ద సుమారు 2– 3 ఏళ్ల వయస్సుగల ఆడ పులిపిల్లను అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని కాపాడారు. పులి పిల్ల తిరుగుతోందని స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో వారు వచ్చి డ్రోన్ ద్వారా గాలించి పులిపిల్ల ఉన్న స్థలాన్ని కనుగొన్నారు. అటవీ శాఖ ఏసీఎఫ్ లక్ష్మీకాంత్, ఆర్ఎఫ్ఓ వినోద్గౌడ, డీఆర్ఎఫ్ఓ, అశోక్ శివకుమార్, వెంకటేష్ తదితరులు పులిపిల్లను క్షేమంగా పట్టుకున్నారు. దానిని అటవీ కార్యాలయానికి తరలించి పాలు, ఆహారం అందించారు. ఆ పిల్ల ఆరోగ్యంగా ఉంది. డ్రోన్ సహాయంతో తల్లి పులి కోసం గాలిస్తున్నట్లు ప్రాంత ఉప అటవీ సంరక్షణాధికారి తెలిపారు. -
గోవుల సంరక్షణ మన ధర్మం
రాయచూరురూరల్: గోవుల సంరక్షణ ప్రజల ధర్మమని పేజావర్ అధోక్ష మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థశ్రీ పాదంగల్, సోమవారిపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు అన్నారు. సన్నతి సేవా సంస్థ అధ్వర్యంలో నగరంలోని ఇస్కాన్ మందిరంలో గురువారం నవజాత గోవులకు వారు పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ నామకరణాలకు నివాసాలకు వెళ్లడం పరిపాటి అని, కానీ దూడల నామకరణానికి భక్తులు రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజ్, చంద్రశేఖర్, దేవిశెట్టి పాల్గొన్నారు. భవన నిర్మాణానికి భూమి పూజ రాయచూరురూరల్: నగరంలో గాయత్రీ భవన నిర్మాణ పనులను విధాన పరిషత్ సభ్యుడు వసంత్కుమార్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నగరంలోని సిద్ధనాథ కాలనీలో రూ.25 లక్షలతో భవన నిర్మాణం చేపట్టామన్నారు. పాత జిల్లా కావడంతో అన్ని వర్గాల ప్రజలకు తగిన విధంగా మౌలిక వసతులు కల్పించడానికి వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ కులకర్ణి, నరసింగరావు, మురళీధర్, మోహన్, ఆనంద్ పడ్నవీస్, శ్రీనివాస్, సుధీంద్ర, సుధీర్ పాల్గొన్నారు. మట్కా, జూదాలను నియంత్రించాలిరాయచూరురూరల్: లింగసూగురులో మట్కా, జూదాలను వెంటనే నియంత్రించాలని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ నాగలక్ష్మీ చౌదరి ఆదేశించారు. హట్టిలో వివిధ కార్యాలయాలను ఆమె సందర్శించి వివరాలు అందజేయాలని కోరారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రమేష్తో ఆమె మాట్లాడారు. మట్కా, గంజాయి, క్రికెట్బెట్టింగ్, హఫీమ్, లిక్కర్ మాఫియా కొనసాగుతున్నా.. పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు అధికమైనట్లు వివరించారు. 21 నుంచి పల్స్ పోలియోరాయచూరురూరల్: జిల్లాలో ఈ నెల 21వ తేదీ నుంచి జరిగే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని జిల్లా అధికారి నితీష్ వైద్యాధికారులకు సూచించారు. స్థానిక జిల్లా అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నితీష్ మాట్లాడుతూ నాలుగురోజుల పాటు 0–5 వయస్సు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ప్రతి ఒక్కరికీ పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి సురేంద్రబాబు, అర్సీహెచ్ అధికారి నందిత, విజయ్శంకర్, ప్రవీణ్కుమార్, ఆరతి, శివమానప్ప, అనిల్, గణేష్, శివ కుమార్, షాకీర్, ఈశ్వర్, బసయ్య పాల్గొన్నారు. భూసారాన్ని రక్షించుకోవాలి బళ్లారి అర్బన్: భూ సారాన్ని రైతులు పరిరక్షించుకోవాలని బీజేపీ రైతు మోర్చా జిల్లా అధ్యక్షుడు గణపల్ ఐనాథ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. విలేకరులతో అత్యాధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భావితరాలకు ఉపయోగపడేలా భూసారాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రసాయన ఎరువులు వాడడంతో పంటలు నాశనం అవుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు మొక్కజొన్న పంట సాగు తీరును ఆయన చక్కగా వివరించారు. భోగనంజుండేశ్వరుడికి పూజలు మాలూరు: మాస్తి గ్రామంలోని ప్రసిద్ధ భోగనంజుండేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం స్వామికి విశేష పూజలు, లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామిని ప్రత్యేక పూలతో అలంకరించారు. మాస్తి గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రమిదలను, నంది ఆలయం వద్ద దీపాలను వెలిగించారు. -
విద్యార్థులు సహకరించాలి
రాయచూరురూరల్: నేటి ఆధునిక యుగంలో నేరాల నియంత్రణకు విద్యార్థులు సహకరించాలని జిల్లా పంచాయితీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్ కుమార కాందూ పిలుపునిచ్చారు. జన జాగృతి కార్యక్రమంలో భాగంగా నగరంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ప్రిన్సిపల్కు అవగాహన కల్పించారు. ఈశ్వర్కుమార్ కాందూ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఅర్ఎస్ 112, 1930 సహాయవాణిపై వివరించారు. సాంకేతిక రంగంలో మార్పులు వచ్చినా.. నేరాలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గజానన, ఎస్పీ పుట్టమాదయ్య, రిమ్స్ డైరెక్టర్ రమేష్, వ్యవసాయ కళాశాల అధికారి కురుబర్, పరమవీర్, మహదేవప్ప పాల్గొన్నారు. -
పల్స్ పోలియో అభియాన్ను విజయవంతం చేయండి
కోలారు : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో అభియాన్ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ టీకా వేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, ఆర్టీసీ, రైల్వే స్టేషన్లు, జనరద్దీ ఉన్న ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నారులకు టీకా వేయాలన్నారు. 22 నుంచి 24 వరకు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలన్నారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, నగరాభివృద్ధి, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసి టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ సీఈఓ ప్రవీణ్ బాగేవాడి, డిప్యూటీ కలెక్టర్ మంగళ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ప్రతిభను వెలికితీసేందుకే పోటీలు
కోలారు: పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రతిభా కారంజీ పోటీలు చక్కటి వేదికలని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కుమార్ అన్నారు. తాలూకాలోని నరసాపురం గ్రామంలో కేపీఎన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన క్లస్టర్ స్థాయి ప్రతిభా కారంజీ పోటీల్లో విజేత విద్యార్థులకు ఆయన బహుమతులను అందించి మాట్లాడారు. బహుమతులు రానివారు నిరుత్సాహ పడరాదని, పోటీలలో పాల్గొనడమే ముఖ్యమన్నారు. పాఠశాల అభివృధ్ది సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మంజుల, హెచ్ఎం గోపినాథ్, మల్లికార్జున, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వైభవంగా సిద్ధలింగేశ్వర జాతర
రాయచూరురూరల్: రాయచూరు తాలుకా మన్సలాపూర్లో సిద్ధలింగేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది. వందలాది భక్తుల సమక్షంలో సిద్ధలింగేశ్వర స్వామిని రథంపై కొలువుంచారు. కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సుల్తాన్ పురశంభు సోమనాథ శివాచార్యుల పూజల అనంతరం రథం లాగారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వీరభద్రేశ్వర స్వామి జాతర రాయచూరురూరల్: నగరంలోని నేతాజీ నగర్లో వీరభద్రేశ్వర స్వామి జాతర, రథోత్సవం వైభవంగా జరిగాయి. వందలాది భక్తుల సమక్షంలో అభినవ రాచోటి శివాచార్యులు దేవాలయాల్లో విశేష పూజలు చేశారు. అనంతరం రథంపై స్వామిని కొలువుంచి లాగారు. కార్యక్రమంలో నగర సభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, రాచయ్యస్వామి, రవికుమార్, సావిత్రి పురుషోత్తం పాల్గొన్నారు. -
వైకల్యం వారికి బలహీనత కాదు
హొసపేటె: దివ్యాంగులకు వైకల్యం బలహీనత కాదు.. వారికి శారీరక వైకల్యంతోపాటు ప్రత్యేక సామర్థ్యం ఉంటుందని డిప్యూటీ కమిషనర్ కవితా ఎస్ మన్నికేరి అన్నారు. నగరంలోని వేంకటేశ్వర కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులు శారీరకంగా బలహీనంగా ఉన్నా.. నాగరిక సమాజంలో అభివృద్ధి పథంలో సాగుతున్నారన్నారు. దివ్యాంగులను చేర్చే సమాజాలను సృష్టించడం... సమాజంలోని సవాళ్లకు ప్రతిస్పందించే మేధో సామర్థ్యం కల్పించడమే ఐక్యరాజ్య సమితి– 2025 నినాదం అన్నారు. ఏదో ఒక రంగంలో దివ్యాంగుల నైపుణ్యం గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ .రూపేష్కుమార్, కె.తిమ్మప్ప, రామాంజనేయ, విద్యార్థులు పాల్గొన్నారు. -
కుక్క కాటుకు యువతి బలి
సాక్షి, బళ్లారి: ర్యాట్ విలార్ కుక్క కాటుతో యువతి మృతి చెందిన సంఘటన దావణగెరె శివారు హొన్నూరు గొల్లరహట్టిలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. గురువారం రాత్రి కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ర్యాట్ విలార్ జాతికి చెందిన రెండు కుక్కలను హొన్నూరు గొల్లరహట్టి వద్ద విడిచి వెళ్లారు. అదే సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన చిత్తూరు జిల్లా వివి.పాలెంకు చరెందిన అనిత(38)పై ఆ కుక్కలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. రక్తగాయాలతో పడిన ఆమెను స్థానికులు బంధువులు గుర్తించి బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. తుమకూరు జిల్లా శిరా తాలూకా ఆస్పత్రి శవాగారానికి మహిళ మృత దేహాన్ని శవ పరీక్ష జరిపారు. ఆమెకు సుమారు 50 చోట్ల కుక్కకాట్లు పడ్డాయి. ఆ కుక్కలు ఆ గ్రామ పొలంలోనే మకాం వేయడంతో గ్రామస్థులు వాటిని పట్టుకొని కాళ్లకు తాళ్లు బిగించి బంధించారు. నిర్లక్ష్యంగా కుక్కలను తెచ్చి గ్రామంలో వదలేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. -
రూ.64 లక్షలతో రహదారి పనులు
హొసపేటె: తిమ్మలపూర్ గ్రామంలో రూ.64.33 లక్షలతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను విజయనగర జిల్లా హగరి బొమ్మనహళ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కె.నేమరాజ్ నాయక్ భూమి పూజ చేసి ప్రారంభించారు. మరియమ్మనహళ్లి సమీపంలోని తిమ్మలపూర్లో ఈ సందర్భంగా చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిమ్మలపూర్ చారిత్రాత్మక ప్రదేశం అని, భక్తులు, పర్యాటకుల ప్రయాణం సజావుగా సాగడానికి వేణుగోపాలస్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. జిల్లా ఖనిజ నిధి డీఎంఎఫ్ ప్రాజెక్టు కింద కేటాయంచిన నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రైతులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పి.ఓబప్ప, బీఎస్.రాజప్ప, పోతలకట్టె నాగరాజ, కృష్ణప్ప, మల్లికార్జున, గోనెప్ప, మంజునాథ్, వెంకటేశప్ప, పరుశరామ, తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా టెట్ పరీక్ష
హొసపేటె: ఉపాధ్యాయ అర్హత పరీక్ష పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు జిల్లా కలెక్టర్ ఇ.బాలకృష్ణ ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ సన్నాహక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 7న తొలి సెషన్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదు పరీక్ష కేంద్రాలలో 2,128 మంది అభ్యర్థులు, రెండో సెషన్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు 19 పరీక్షా కేంద్రాలలో 6,570 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది సమయానికి హాజరుకావాలన్నారు. పర్యవేక్షకులు స్వయంగా కేంద్రాలను సందర్శించి లోపాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మూడు, నాలుగు కేంద్రాలకు రూట్ అధికారి ఉండాలని, ప్రతి కేంద్రంలో పోలీసులను మోహరించి అన్ని విధాలా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ జి.మంజునాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రామచంద్రప్ప, సిబ్బంది పాల్గొన్నారు. -
బళ్లారి రైల్వే స్టేషన్కు 150 ఏళ్లు
సాక్షి, బళ్లారి: జాతిపిత, స్వాతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీ సేద తీరిన బళ్లారి రైల్వే స్టేషన్కు 150 ఏళ్లు నిండాయి. బ్రిటీష్ హయాంలో నిర్మించిన ఈ బళ్లారి రైల్వే స్టేషన్ నేటికీ ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోంది. 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్ణాటక రాష్ట్ర రైల్వే క్రియా సమితి అధ్యక్షుడు కేఎం.మహేశ్వరస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బళ్లారి రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టి 150 ఏళ్లు గడచినా నేటికీ కొనసాగుతోందని గుర్తుచేశారు. ఘనమైన చరిత్ర కలిగిన స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 1921 అక్టోబర్, 1న జాతిపిత మహాత్మాగాంధీ ఈ రైల్వే స్టేషన్లోనే రాత్రంతా నిద్రించారన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రైల్వే స్టేషన్ చరిత్ర తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మరిదేదయ్య, బండేగౌడ, చంద్రశేఖర్గౌడ, గోపాల కృష్ణ, సొంత గిరిధర్, కేఎం కొట్రేష్, తదితరులు పాల్గొన్నారు. -
భవానీ విగ్రహం ఊరేగింపు
సాక్షి, బళ్లారి: భక్తుల ఆరాధ్యదైవం విజయవాడ కనకదుర్గమ్మ దీక్ష స్వీకరించిన భక్తులు గురువారం రాత్రి పట్టణంలో భవానీ విగ్రహాన్ని అలంకరించి వైభవంగా ఊరేగించారు. నగరంలోని బంటిమోట్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు నగరంలోని ఏపీఎంసీ, బెంగళూరు రోడ్డు, రాయల్ సర్కిల్, కనక దుర్గమ్మ ఆలయం వరకూ సాగింది. ఎరుపురంగు దుస్తులు ధరించి అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులు డప్పులు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ జై భవానీ నినాదాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. గురుస్వామి, మహిళా భక్తులు కళశాలు పట్టి ముందు నడిచారు. అలాగే కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అన్నదానం నిర్వహించారు. శ్రీరాంపురం కాలనీ నివాసి భవానీ ప్రసాద్ కనకదుర్గమ్మ అమ్మవారికి విశేష పూజలు జరిపారు. గురుస్వామి లోకేష్ స్వామి, బీఆర్ఎల్ శీన మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా నగరంలో భవానీ దీక్ష స్వీకరించి అమ్మవారిపై తమ భక్తిని చాటుతున్నారన్నారు. -
కుటుంబ కలహాలతో వైద్యురాలు, కుమారుడు ఆత్మహత్య
శివమొగ్గ : కుటుంబ కలహాలతో వైద్యురాలు, ఆమె కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన శివమొగ్గ నగరంలోని ఆశ్వత్ నగర 5వ క్రాస్లో శుక్రవారం చోటు చేసుకుంది. శివమొగ్గ నగరంలోని హేమరెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ జయశ్రీ(55) గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు ఆకాశ్(35) భార్య ఇదే ఇంటిలో ఏడాది క్రితంఆత్మహత్య చేసుకుంది. ఈ యేడాది మే నెలలో ఆకాశ్ మరో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి తల్లీకుమారుడి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి కూడా ఇద్దరు గొడవ పడ్డారు. కుమారుడు పై అంతస్తులోని గదిలో పడుకోగా, తల్లి కింద గదిలో పడుకుంది. ఆకాశ్ భార్య మరో గదిలో పడుకుంది. శుక్రవారం ఉదయం ఆకాశ్ భార్య నిద్ర లేచి చూడగా ఇద్దరూ బయటికి రాలేదు. వెళ్లి చూడగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలుగు చూసింది. వినోభనగర పోలీసులు వచ్చి పరిశీలించగా జయశ్రీ గదిలో డెత్నోట్ లభించినట్లు తెలిసింది. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
సీఎం, విపక్షనేత ‘సోషల్ వార్’
బనశంకరి: కర్ణాటకలో అవినీతి విషయంపై డిప్యూటీ లోకాయుక్త వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్పై విపక్ష బీజేపీ విరుచుకుపడుతోంది. 40 శాతం కమీషన్ అని బీజేపీ ప్రభుత్వంపై అర్థం లేని ఆరోపణలు, అసత్యప్రచారం చేసి కన్నడిగులను తప్పుదారి పట్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పూర్తిగా కమీషన్ దందాలో మునిగిపోయిందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనికి సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇవ్వగా.. విపక్ష నేత ఆర్.అశోక్ కూడా ప్రతికౌంటర్ ఇచ్చారు. ‘ట్రాన్స్పరెన్సీ ఇండియా ఇంటర్నేషనల్ 2019 నవంబరులో ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలో 63 శాతం అవినీతి ఉంది. అదే నివేదిక ఆధారంగా డిప్యూటీ లోకాయుక్త బీ.వీరప్ప మాట్లాడారు. ఈ నివేదిక బయటికి వచ్చిన సమయంలో రాష్ట్రంలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆర్.అశోక్ ఉపలోకాయుక్త వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోకుండా బీజేపీ పాపం మా తలపై రుద్దడానికి ప్రయత్నించి వారే బోల్తా పడ్డార’ని సీఎం సిద్ధరామయ్య తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సీఎం వ్యాఖ్యలపై విపక్షనేత ఆర్.అశోక్ కౌంటర్ ఇచ్చారు. ‘ముందుగా లోకాయుక్త నివేదిక అబద్ధమని చెప్పి ప్రస్తుతం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక అని చెప్పడం సంతోషదాయకం. డిప్యూటీ లోకాయుక్త బీ.వీరప్ప ప్రస్తావించిన నివేదిక 2019 నవంబరులో విడుదలైంది. అంటే 2018 అవినీతి గురించి జరిపిన సమీక్ష. ఆ సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నది మీరే. దీంతో ఈ నివేదికను బీజేపీకి ముడిపెట్టే బదులు మీ హయాంలో 63 శాతం ప్రజలు ఎందుకు లంచం ఇచ్చారనేది మీరు వివరించాలి. మీ అధినేత రాహుల్గాంధీ మూర్ఖత్వాన్ని దేశం క్షమించవచ్చు. కానీ కర్ణాటక ప్రజలు రాష్ట్ర చరిత్రలో అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని క్షమించరు. ఏటేటా కర్ణాటక అవినీతి జాబితాలో అగ్రస్థానంలో ఉండడానికి కారణం ఏమిటనే దానిపై సమాధానం ఇవ్వాల’ని ఆర్.అశోక్ డిమాండ్ చేశారు. నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారు–వీరప్ప అవినీతి విషయంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఉపలోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప బెంగళూరులో తెలిపారు. హైకోర్టు సభాభవనంలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉండే అవినీతి గురించి తాను మాట్లాడానన్నారు. తన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. దేశంలో గతంలో నుంచి ఉన్న అవినీతి గురించే తాను తెలిపానన్నారు. ఏ ప్రభుత్వం, పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అన్ని ప్రభుత్వాలు అవినీతికి కారణమయ్యాయన్నారు. స్వార్థం కోసం తన వ్యాఖ్యలను వాడుకోవడం సరికాదని హితవు పలికారు. -
వైభవంగా దత్త జయంతి
యశవంతపుర: దత్త జయంతి కార్యక్రమం వైభవంగా ముగిసింది. వేల సంఖ్యలో భక్తులు దత్తమాలను ధరించి దత్తపీఠాన్ని దర్శించుకున్నారు. చివరి రోజు కావడంతో శ్రీగురు దత్తాత్రేయ బాబాబుడన్స్వామి దర్గాకు ఉదయం నుంచి మాలధారులు బారులు తీరారు. గుహ ముందుభాగంలో దత్తజయంతి హోమాన్ని నిర్వహించారు. రుద్రహోమం, దత్తధారక హోమం, గుహ లోపల దత్తపాదుకలకు రుద్రాభిషేక పూజలు చేశారు. దక్షిణకన్నడ, ఉడుపి, పుత్తూరు, హాసన, శివమొగ్గ, బెంగళూరు, తుమకూరుతో పాటు రాష్ట్రం నలుమూల నుంచి వేల సంఖ్యలో భక్తులు దత్తపీఠానికి చేరుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్లు, మినీ బస్సులు, జీపులతో దత్తపీఠం నిండిపోయింది. కడూరు అసెంబ్లీ క్షేత్రం నుంచి అధిక సంఖ్యలో వాహనాల్లో భక్తులు వెళ్లి దత్తాపాదుకలను దర్శించుకున్నారు. హొన్నమ్మన గుంతలో భక్తులు స్థానం చేసి కాలినడకన దత్తపీఠం చేరుకున్నారు. విశ్వేంద్రభట్ నేతృత్వంలో సచిన్, కృష్ణభట్, ఉదయ్ శంకర్ భట్, సుమంత్ నెమ్మార్ బృందం కళా హోమం, దత్తహోమాలను నిర్వహించారు. శంకరదేవుడి మఠం చంద్రశేఖర్స్వామి, సర్వధర్మ పీఠం జయబసవానందస్వామి, కడూరు తాలూకా యళనాడు మహా సంస్థానం జ్ఞానప్రభ సిద్ధరామ దేశికేంద్రం స్వామి, రంభాపురి బీరూరు శాఖమఠం రుద్రముని శివాచార్య స్వామి, ఎమ్మెల్సీ సీటీ రవి, దీపక్ దొడ్డయ్య, శ్రీరామసేన సంస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్, జిల్లా కలెక్టర్ మీనా నాగరాజు, సీఈఓ హెచ్ఎస్ కిత్తనా, దత్తపీఠం వ్యవస్థాపక సమితి పాలనాధికారి నారాయణ కనకరెడ్డిలు పాల్గొన్నారు. -
వ్యవసాయంపై రైతుల నిరాసక్తి
మండ్య: భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం అని, అయినా కూడా ఇటీవల కాలంలో సుమారు 20 శాతం మందికి పైగా వ్యవసాయంపై ఆసక్తిని చూపడం లేదని, గతంలో సుమారు 80 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంలో రాణించేవారని, కాని నేడు సుమారు 60 శాతం మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండ్య తాలూకాలోని వీసీ ఫారంలో మూడు రోజుల పాటు జరిగే వ్యవసాయ మేళాను ప్రారంభించిన ఆయన ఆక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించిన అనంతరం కార్యక్రమంలో మాట్లాడారు. వ్యవసాయంలో లాభాలు రావడం లేదనే భావన చాలా ఉందన్నారు. దానిని అర్థం చేసుకున్న వారు అనేక మంది వ్యవసాయరంగంలో రాణిస్తున్నారన్నారు. అందువల్ల యువకులు సైతం వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలన్నారు. 60వ దశకంలో తాను ఊరికి వెళ్లినప్పుడు అక్కడ ఊళ్లో తాను కూడా వ్యవసాయం చేశానని గుర్తు చేసుకున్నారు. కాని అప్పుడు ఎలాంటి టెక్నాలజీ ఆందుబాటులో లేదని అన్నారు. కాని ప్రస్తుతం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ అందుబాటులో ఉందని అన్నారు. రైతులు, వ్యవసాయ నిఫుణులు కూడా ఏకకాలంలో ఒకే పంటను సాగు చేయకుండా ఇతర రకాల పంటలను సాగు చేయడం ద్వారా లాభాలు సాధించాలని అన్నారు. ఫిలిప్ఫైౖన్స్ లాంటి పరిశోధన చాలా అవసరం ఫిలిప్పైన్స్ లాంటి చిన్న దేశంలో వ్యవసాయ రంగంలో ఆక్కడి రైతులు మంచి లాభాలు సాధిస్తున్నారన్నారు. ఒకే మొక్కలో ఆరు వివిధ రకాల పంటలను సాగు చేసే పద్ధతిపై పరిశోధన సాగుతోందన్నారు. వీసీ ఫారం వ్యవసాయ వర్సిటీలో కూడా టమాటా, వంకాయ పంటలను సాగు చేస్తున్నారన్నారు. ఇది చాలా మంది అభివృద్ధి ఆని అన్నారు. ఇలాంటి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం అని అన్నారు. వివిధ రకాల జాతులకు చెందిన వంగడాలపై పరిశోధన అవసరమని అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యఅంతర్జాతీయ స్యాండ్విచ్ పీజీ ప్రారంభానికి చర్యలు మైసూరులో వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి ఆంతర్జాతీయ స్యాండ్విచ్ స్నాతకోత్సవ డిగ్రీ కోర్సుని ప్రారంభించడానికి చాలా తీవ్రంగా సమాలోచనలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మండ్య జిల్లాలో రైతు పోరాటదారుడుగా పేరొందిన రైతు నాయకుడు కే.ఎస్.పుట్టణ్ణయ్య చేసిన సేవలకు వెలకట్టలేమన్నారు. వ్యవసాయంపై అంతటి ఆసక్తిని పెంచుకున్న పుట్టణ్ణయ్య పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ దిశలో తగిన చర్యలకు ప్రత్యేక అధికారికి కూడా సూచించినట్లు తెలిపారు. -
నారాయణస్వామీ.. ఇక్కడ చూడండి!
శివాజీనగర: సీఎం కుర్చీ విషయంలో ఇన్నాళ్లూ కలహించుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సఖ్యత పెరిగినట్లు కన్పిస్తోంది. అల్పాహార విందు సమావేశాల తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది! రెండు వర్గాలకు చెందిన నాయకులు కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయడం దాదాపు తగ్గించేశారు. అందరూ కలసికట్టుగా సాగాలని హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలిచ్చిన నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం కూడా సఖ్యతతో సాగుతున్నట్లు కన్పిస్తోంది. శుక్రవారం బెంగళూరులో కర్ణాటక పరిశ్రమల ప్రాంతీయ అభివృద్ధి మండలి (కేఐఏడీబీ) నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి వేర్వేరుగా విచ్చేశారు. అయితే.. అక్కడ ఒకరి గురించి మరొకరు ఆరా తీయడం ఆసక్తి కల్గించింది. ఈ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండ్య జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన నిర్ణీత సమయానికి కార్యక్రమ వేదికకు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సమయంలో సిద్ధరామయ్య డీసీఎం రావటం లేదా అని అడిగారు. ఆయన కాస్త ఆలస్యంగా వస్తారని, వచ్చేవరకు వేచిచూడాలని పాటిల్ సూచించారు. ఇందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి మండలి కార్యాలయంలో కూర్చొనేందుకు ముందడుగు వేస్తుండగా..సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశపాండె కల్పించుకుని డీసీఎం వస్తారు, మీరు ప్రారంభించాలని సలహానిచ్చారు. ఆయన వచ్చారా? వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మండ్య జిల్లాకు హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉండడంతో డీసీఎం కోసం వేచి ఉంటే సమయం వృథా అవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది చెప్పారు. సమయాభావం కారణంగా ఉప ముఖ్యమంత్రి శివకుమార్ రాకముందే ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడి నుంచి వెళ్లారు. ఆయన వెళ్లిన తర్వాత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చారు. ఆయన వచ్చీ రాగానే ముఖ్యమంత్రి వచ్చి వెళ్లారా అని ఆరా తీశారు. అక్కడున్న వారిని పలకరించిన తరువాత డీకే శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కేఐఏడీబీకి నిర్మించిన నూతన కార్యాలయ భవనం పక్కనే ఉన్న ఇంట్లో గతంలో తాను నివసించినట్లు తెలిపారు. తాను అదే ఇంట్లో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నట్లు కూడా తెలియజేశారు. కాగా.. కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వచ్చినా ఒకరి గురించి మరొకరు ఆరా తీయటం ద్వారా ఆత్మీయతను కొనసాగించారు. ఇంతకు ముందు అధికార మార్పిడి కోసం రగడ జరుగుతున్నపుడు ఇటువంటి అన్యోన్యత కనిపించేది కాదు. అల్పాహార సమావేశాల తరువాత ఇద్దరి మధ్య సంబంధాలు బలోపేతమైనట్లు కనిపిస్తోంది. బెంగళూరులోని కొడిగేహళ్లిలో నమ్మమెట్రో పనులను శుక్రవారం పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కర్ణాటక పరిశ్రమల ప్రాంతీయ అభివృద్ధి మండలి భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం సిద్దరామయ్య, చిత్ర ంలో మంత్రులు ఎంబీ పాటిల్, చెలువరాయస్వామి ఒకరి రాక గురించి మరొకరు ఆరా కేఐఏడీబీ భవన ప్రారంభోత్సవంలో ఆసక్తికర సన్నివేశాలు చలవాదికి డీకే కౌంటర్ బనశంకరి: కార్టియర్ వాచ్ను అఫిడవిట్లో డీకే శివకుమార్ పొందుపరచలేదని ఆరోపించిన విధాన పరిషత్ విపక్ష నేత చలవాది నారాయణస్వామికి డీసీఎం డీకే శివకుమార్ శుక్రవారం ఎక్స్ ఖాతాలో గట్టిగా బదులిచ్చారు. లోకాయుక్తకు తాను అందించిన అఫిడవిట్ కాపీని డీసీఎం పోస్ట్ చేశారు. ‘మిస్టర్ నారాయణస్వామీ.. ఇక్కడ చూడండి. లోకాయుక్తకు నేను అందజేసిన అఫిడవిట్ ఇది. జవాబుదారీ స్థానంలో ఉన్న మీరు నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పరాదు. ఇది తగదు. నేను పారదర్శకమైన వ్యక్తిని. ఏమీ దాచిపెట్టరాదని నిజం చెప్పాను. నాకు ఇష్టమైన వాచీ ధరించడానికి యోగ్యత లేదా? హక్కు లేదా?’ అని ప్రశ్నించారు. ‘మీకు ఉన్న రాజ్యాంగ అధికారం, జవాబుదారీతనం సక్రమంగా నిర్వహించండి. అవివేకంగా వ్యవహరించవద్దు. అవసరమైతే లోకాయుక్త కార్యాలయానికి వెళ్లి తన అఫిడవిట్ చూసుకోవాల’ని డీకే శివకుమార్ దీటుగా బదులిచ్చారు. ఢిల్లీలోనే మకాం వేసిన యడ్డి శివాజీనగర: కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి బీజేపీలో అసమ్మతి నేతలు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ను కలసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప హస్తినకు వెళ్లడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలో మూడు రోజులుగా మకాం వేసిన అసమ్మతి నాయకులు బీజేపీ హైకమాండ్ను భేటీ అయ్యి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వారిని నియమించాలని ఒత్తిడి చేశారు. దీంతో తన కుమారుడు, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రను కొనసాగించేలా యడియూరప్ప ప్రయత్నాలు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు. హైకమాండ్ను కలసి వాస్తవ పరిస్థితులను వారి దృష్టికి తీసుకెళతారని తెలిసింది. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా విజయేంద్ర రెండేళ్లుగా సమర్థవంతంగా పని చేస్తూ పార్టీని సంఘటితం చేసేందుకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టారో యడియూరప్ప వివరించి.. విజయేంద్రనే రాష్ట్రాధ్యక్షుడిగా కొనసాగించేలా డిమాండ్ చేయనున్నారని సమాచారం. -
రట్టయిన గంజాయి గుట్టలు
బనశంకరి: రాజధానిలో భారీ మొత్తాల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న మహిళ, మరొకరిని మహాలక్ష్మీ లేఔట్ పోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ.18 కోట్ల 60 లక్షల విలువచేసే 18.50 కేజీల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ తెలిపారు. గురువారం డ్రగ్స్ను పరిశీలించి కేసు వివరాలను వెల్లడించారు. సారా సిమ్రాన్ అనే మహిళ, సైఫుద్దీన్ షేక్ అనే ఇద్దరు గంజాయి వ్యాపారం చేస్తున్నారు. రాణి అబ్బక్క మైదానం వద్ద కారులో హైడ్రో గంజాయి పెట్టుకుని అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. విదేశాల నుంచి గంజాయిని తెప్పించినట్లు చెప్పారు. ఆర్ఎంసీ యార్డులో 8 కిలోలు గంజా స్వాధీనం ● ఆర్ఎంసీ యార్డు పోలీసులు ఓ గంజాయి విక్రేత ను అరెస్ట్ చేసి రూ.8.35 లక్షల విలువచేసే 8 కిలోలు 350 గ్రాముల గంజా స్వాధీనం చేసుకున్నారు. ● ఆర్టీ.నగర పోలీసులు ఓ వ్యక్తి సుల్తాన్పాళ్య పానీపురి మైదానంలో గంజాయిని అమ్ముతుండగా పట్టుకుని 5.4 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. ● జేసీ నగరలో ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని అమ్ముతున్న విదేశీ పౌరున్ని పట్టుకున్నారు. 21 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేశారు. ● మల్లేశ్వరం పోలీసులు రూ.77 వేల విలువ చేసే 772 గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఒకరిని అరెస్టు చేశారు. బెంగళూరులో రూ.18 కోట్లకు పైగా విలువైన సరుకు సీజ్ జంట సహా పలువురు అరెస్టు బెంగళూరులో ఎర్రచందనం రూ.1కోటి 75 లక్షల దుంగలు స్వాధీనం ముగ్గురు అరెస్టు బనశంకరి: ఉద్యాననగరిలో ఎర్ర చందనం దొరికింది. రూ.1 కోటి 75 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను, నాలుగు వాహనాలసు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్కమిషనర్ సీమంత్కుమార్సింగ్ గురువారం తెలిపారు. బన్నేరుఘట్ట రోడ్డు గొట్టిగెరె చెరువు వద్ద కారులో ఎర్రచందనం దుంగలు దాచిపెట్టారని తెలిసి హుళిమావు పోలీసులు దాడి చేసి, డ్రైవరు అహమ్మద్పాషాను అరెస్ట్ చేశారు. 95 కిలోలు ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో కడప జిల్లాలో ఓ వ్యక్తి నుంచి తక్కువ ధరతో కొనుగోలుచేసి తమిళనాడు, కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ఇతడు ఇచ్చిన సమాచారంతో తమిళనాడులో 1,143 కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉల్లిగడ్డల లోడులో.. ఆర్టీ.నగర కేహెచ్ఎం బ్లాక్లో ఉల్లిగడ్డల బొలెరోలో 754 కేజీల ఎర్ర చందనం మొద్దులను పట్టుకున్నారు. ఏపీకి చెందిన రాజశేఖర్, వరప్రసాద్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరు ఏపీ వాసులు కాగా, డబ్బు సంపాదన కోసం మదనపల్లి, సంబేపల్లి ప్రాంతాల నుంచి ఎర్రచందనం తీసుకొచ్చి బెంగళూరులో విక్రయాలని ప్రయత్నిస్తూ దొరికారు. -
రూ.12 వేల కోట్ల భూముల కబ్జా
● బీజేపీ నేత ఆరోపణ బనశంకరి: బెంగళూరు దక్షిణలోని తావరెకెరె సమీపంలో వందలాదికోట్లు విలువచేసే 500 ఎకరాల ప్రభుత్వభూమి కబ్జాకు గురైందని బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ ఈడీ, లోకాయుక్త, బెంగళూరునగర జిల్లా కలెక్టర్ కు 1,67,751 పేజీల సుదీర్ఘమైన ఆధారాలతో గురువారం ఫిర్యాదు చేశారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. బీబీఎంపీ మాజీ డిప్యూటీ మేయర్ పుట్టరాజు, భార్య మాలా తదితరులతో పాటు కొందరు అధికారులు కుమ్మకై ్క కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. కేఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు ఓ ఎమ్మెల్యే కుటుంబంపై ఈడీ కి ఫిర్యాదు చేశానన్నారు. కబ్జాదారుల పాలైన ప్రభుత్వ భూమిని సర్కారు చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ కుంభకోణంలో 2006 నుంచి ఇప్పటివరకు అన్ని రికార్డులు నకిలీవని, మాగడి నియోజకవర్గం వారి పేర్లతో భూ లావాదేవీలు జరిపారని చెప్పారు. తావరెకెరె హొబళి పరిధిలోని గ్రామాల్లో ఈ కబ్జాలు జరిగాయని, నేటి మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 12 వేల కోట్లకు పైగా విలువ చేస్తుందని చెప్పారు. కొందరు నాయకులు, అధికారులు నకిలీ రికార్డులు సృష్టించి కబ్జాలకు పాల్పడడం పెరిగిపోయిందని చెప్పారు. ఎయిర్పోర్టులో ప్రయాణికులకు చుక్కలు● ఇండిగో విమానాల రద్దుతో నరకయాతన దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో గందరగోళం కొనసాగింది. గురువారం కూడా ప్రయాణికులు ఇండిగో విమానాల దెబ్బకు రభస చేశారు. రెండు రోజుల్లో ఏకంగా 200 విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఇండిగో కౌంటర్లో సిబ్బందితో గొడవపడి ఆ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1వ టెర్మినల్లో కొందరు ధర్నాకు దిగారు. ఇండిగో సిబ్బంది కారణాలు చెప్పకుండా మౌనం వహించడంతో మండిపడ్డారు. తమకు ఇండిగో సంస్థ వసతి, భోజనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు పట్టుబట్టారు. అన్నీ కోల్పోయాం దేశ, విదేశాల నుంచి ఇక్కడికి రావాల్సిన, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 200పైగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు దిక్కుతోచడం లేదు. అత్యవసర పనులన్నీ వృథా అయినట్లు వాపోయారు. తమ జీవితాలను ఇండిగో సంస్థ అంధకారంలో పడేసిందని పలువురు ఆవేదన చెందారు. హోటల్ బుకింగ్లు, అధికారిక సమావేశాలు, విదేశీ టూర్లు, పరీక్షలు, వీసా ఇంటర్వూలు, శుభ కార్యాలు ఇలా అనేకం మిస్సయినట్లు తెలిపారు. -
దత్త కుటీరంలో వేడుకలు
మండ్య: దత్త జయంతి వేడుకల సందర్భంగా మండ్య నగరానికి సమీపంలోని నిరంజనదత్త కుటీరంలో గురువారం భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. గత నెల 28వ తేదీన ప్రారంభమైన వేడుకలు సమాప్తమయ్యాయి. వేకువ నుంచి పూజలు, భజనలు నిర్వహించారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. దత్త జయంతి పూజలు మైసూరు: మైసూరులోని దేవరాజ అరసు రోడ్డులోని బిసిలు మారెమ్మ దేవస్థానంలో దత్తాత్రేయ బళగ ఆధ్వర్యంలో దత్తాత్రేయ జయంతిని జరిపారు. ఉదయం నుంచే దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు, భజనలు, హోమాలు, ప్రత్యేక హారతి వేడుకలు సాగాయి. స్థానిక ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
సిద్దు సన్నిహితుల్లో అలజడి
శివాజీనగర: ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కుర్చీ కోసం కత్తులు నూరుతూ అల్పాహార భేటీలతో చల్లబడినట్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య సన్నిహితులు అలర్ట్ అయ్యారు. దానికి కారణాలు లేకపోలేదు. సిద్దరామయ్యను తప్పిస్తే తమ పని అంతేనని అనుకుంటున్నారు. విరుగుడు సూత్రాల అన్వేషణలో పడ్డారు. ఆప్తుల డిన్నర్ మీటింగ్లు ఇద్దరి బ్రేక్ఫాస్ట్ భేటీల తరువాత సీఎం సన్నిహిత వర్గానికి చెందిన మంత్రులు వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. రాత్రి వేళ డిన్నర్ భేటీలు సైతం సాగుతున్నాయి. ఇటీవల మంత్రులు పరమేశ్వర్, సతీశ్ జార్కిహొళి మీటింగ్ జరిపారు. వీరితో పాటు ఎమ్మెల్సీ బీ.కే.హరిప్రసాద్ కూడా పాల్గొన్నారు. సిద్దరామయ్య మంగళూరు నుంచి బెంగళూరుకు వచ్చాక జార్కిహొళి ఇంట్లో ఆయన, కొందరు మంత్రులు మంతనాలు జరిపారు. మునుముందు ఏమిటనే పరిణామాలపై చర్చ జరిగింది. సీఎం సిద్దరామయ్యను పదవి నుంచి తప్పిస్తే దళిత సీఎం కోటాలో తాము ముందుండాలని పరమేశ్వర్, జార్కిహొళి వంటి నాయకులు పట్టుదలతో ఉన్నారు. వీరికి సీఎం సిద్దరామయ్య ప్రోత్సాహం కూడా ఉంది. అలా డీకే శివకుమార్కు చెక్ పెట్టాలని నిర్ణయించారు. మహిళా ఉద్యోగులు కోరితే కాదనగలనా? విధానసౌధ బ్యాంక్వెట్ హాల్లో గురువారం జరిగిన రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల సంఘం సమావేశంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. సిద్దరామయ్య ప్రసంగంలో జోక్లకు ఉద్యోగినులు నవ్వుల్లో తేలిపోయారు. మీకు గృహలక్ష్మీ సొమ్ము వస్తుందా అని సిద్దరామయ్య ప్రశ్నించినపుడు తాము ప్రభుత్వ ఉద్యోగులమని, రాదని అన్నారు. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారా అని అడగ్గా.. నవ్వుతూనే అవునని అన్నారు. మీకు జీతం అధికంగా వస్తుంది కదా? ఎంత వస్తుంది?, ఆరవ, ఏడవ వేతన కమిషన్ను అమలు చేసింది తామేనన్నారు. సెప్టెంబర్ 13న మహిళా దినోత్సవంగా ప్రకటించాలని ఉద్యోగినులు కోరగా, మీరు కోరితే కాదనేవారుంటారా? అని సీఎం చమత్కరించారు. ఈ సందర్భంగా సీఎం, డీసీఎంలను వారు సన్మానించారు. సీఎం కుర్చీ మారితే ఎలా అని గుబులు ముమ్మరంగా రహస్య భేటీలు సిద్దరామయ్య సైతం హాజరు బీజేపీలో సెగలు, ఢిల్లీకి యడ్డి శివాజీనగర: కాంగ్రెస్ మాత్రమే కాకుండా రాష్ట్ర బీజేపీలో కూడా వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రను ఆ పదవి నుంచి తొలగించాలని తిరుగుబాటు నాయకులు ఢిల్లీలో పలువురు అగ్రనేతలను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి యడియూరప్ప దిగారు. తనయుడు విజయేంద్రకు బాసటగా ఆయన ఢిల్లీకి వెళ్లారు. అధిష్టానం పిలిచిందా, లేదా ఆయనే వెళ్లారా అనేది మిస్టరీగా ఉంది. రెబల్స్ నాయకులు వరుసగా ఫిర్యాదులు చేస్తూ విజయేంద్రపై అపనమ్మకం పెంచే పనిలో ఉన్నారు. రెబల్ నేతలు బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి రాధామోహన్ దాస్ను కలిసి మాట్లాడారు. 63 శాతం కమీషన్ల సర్కారిది బీజేపీ పక్ష నేత అశోక్ యశవంతపుర: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నిండా అవినీతిలోకి కూరుకుపోయిందని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆరోపించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు ధైర్యం ఉంటే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో 63 శాతం కమీషన్ల దందా జరుగుతోందని ఉపలోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి, మా ప్రభుత్వం ఉన్నప్పడు ఇదే కాంగ్రెస్ నాయకులు 40 శాతం కమీషన్ అని లేనిపోని ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 63 శాతానికి పెరిగాయని ఎద్దేవా చేశారు. అవినీతికి సాక్ష్యాలు ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య అడుగుతున్నారు. ఉప లోకాయుక్త కంటే పెద్ద సాక్ష్యం ఏమి కావాలని అశోక్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇంటి దేవుడే అవినీతి. ఇప్పుడు మీ ముఖాలపై పేటీఎం పోస్టర్ను అంటించుకుని తిరగండి అని విమర్శించారు. -
ఇల్లు కట్టుకోబోతే.. ప్రాణమే తీశారు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు నగరంలో విషాద సంఘటన జరిగింది. పాలికె అధికారులు, దంపతుల బ్లాక్మెయిల్ను తట్టుకోలేని టెక్కీ డెత్నోట్ రాసి ఉరివేసుకున్న ఘటన వైట్ఫీల్డ్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బ్రూక్ బాంగ్ లేఔట్ నివాసి మురళి గోవిందరాజు (45) ఆత్మహత్య చేసుకున్నాడు. మురళి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు కారణమైన శశి నంబియార్ (64), ఉషా నంబియార్ (57) దంపతులను అరెస్టు చేశారు. మరో నిందితుడు వరుణ్ నంబియార్ పరారీలో ఉన్నాడు. వివాదం సృష్టించి.. డబ్బు డిమాండ్ ఐటీపీఎల్లోని ప్రైవేటు కంపెనీలో పని చేసే మురళి బుధవారంనాడు నల్లూరహళ్లి వద్ద నిర్మాణ దశలో ఉన్న సొంత భవనంలో ఆత్మహత్య చేసుకున్నాడు. డెత్నోట్లో వివరాలు రాశాడు. మురళి... నంబియార్ దంపతుల బంధువు వద్ద స్థలాన్ని కొని ఈ భవంతిని నిర్మిస్తున్నాడు. అయితే శశి, ఉష తరచూ వచ్చి ఈ స్థలం మాది అని, రూ.20 లక్షలు ఇస్తే సరి, లేదంటే నీ సంగతి తేలుస్తామని వేధించేవారు. వారు ఫిర్యాదు చేశారని స్థానిక పాలికె అధికారులు కూడా తరచూ మురళికి నోటీసులు ఇచ్చి సతాయించేవారు. నా కల తీరలేదని డెత్నోట్ తనను శశి, ఉష, వరుణ్ ముగ్గురూ చాలా వేధించారని, జీవితంలో ఎన్నడూ పోలీస్స్టేషన్, కోర్టు మొహం చూడని తనను స్టేషన్, కోర్టు చుట్టూ తిరిగేలా చేశారని, జీవితాంతం సంపాదించిన సొమ్మంతా పెట్టి ఇల్లు కట్టుకోవాలని కలలు కన్నానని, అయితే తన కలలు నెరవేరకుండానే వెళ్లిపోతున్నానని డెత్నోట్లో పేర్కొన్నాడు. శశి నంబియార్, ఉష నంబియార్, వరుణ్ ముగ్గురూ ఈ ప్రాంతంలో ఎక్కడ లేఔట్లు వేసినా, ఇళ్లు నిర్మిస్తున్నా అక్కడకు వెళ్లి గొడవ చేసి డబ్బులు వసూలు చేసేవారని పోలీసుల విచారణలో తెలిసింది. దంపతుల బెదిరింపులు, పాలికె నోటీసులు బాధతో అదే భవనంలో ఉరివేసుకున్న టెక్కీ రాజధానిలో ఘోరం -
అక్రమ కాల్స్ ముఠా గుట్టురట్టు
యశవంతపుర: బెంగళూరులో కాల్ సెంటర్పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని నాయుడు లేఔట్లో ఉంటున్న కాల్ సెంటర్లో అంతర్జాతీయ ఫోన్ కాల్స్ను అక్రమంగా లోకల్ కాల్స్గా మార్చి డబ్బు గడిస్తున్నట్లు సమాచారం రావడంతో సోదాలు చేశారు. రూ.40 లక్షల విలువగల 28 సిమ్ బాక్స్లతో పాటు వివిధ సంస్థలకు చెందిన 1,093 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. షారూక్ పుత్రుని వేలి గొడవ యశవంతపుర: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ఖాన్ పుత్రుడు ఆర్యన్ఖాన్ వివాదంలో చిక్కకున్నారు. అసభ్యంగా మధ్యవేలును చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. బెంగళూరులో గత నెల 28న రాత్రి ఈ ఘటన జరిగినట్లు వీడియో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. జైదుఖాన్, మొహమ్మద్ నలపాడ్తో కలిసి ఆర్యన్ బెంగళూరులో ఒక పబ్కు వెళ్లారు. పబ్లో అభిమానులకు అభివాదం చేస్తూ మిడిల్ ఫింగర్ను చూపి పోజులిచ్చాడని సమాచారం. ఈ సందర్భంగా షారూక్ సినిమాల హిట్ పాటలతో చిందులేశారు. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య ● బెంగళూరులో ఘోరం బనశంకరి: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు తోడుగా ఉండాల్సిన భర్త.. కిరాతకునిగా మారాడు. ఆమెను హత్యచేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలో సుబ్రమణ్యపుర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిక్కగౌడనపాళ్యలో బీఎంటీసీ విశ్రాంత డ్రైవరు వెంకటేశన్ (65), భార్య బేబీ (65) ఉంటున్నారు. బేబీ కొద్దినెలల నుంచి మూర్ఛ వ్యాధితో వీల్చైర్ కు పరిమితమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా వీరు ఉద్యోగాలకు బయటకు వెళ్లారు. బుధవారం రాత్రి వృద్ధ దంపతులు మధ్య గొడవ జరిగింది. వెంకటేశన్ బట్టలు ఆరవేసే వైరుతో భార్యకు గొంతు బిగించి హత్యచేశాడు. తరువాత అదే వైరుతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇరుగుపొరుగు చూడగా ఇంట్లో మృతదేహలు కనిపించాయి. సుబ్రమణ్యపుర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. పాహిమాం దుర్గాదేవి మాలూరు: తాలూకాలోని ప్రాచీన దుర్గా దేవి దేవాలయంలో అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశేష అ భిషేకాలు, పూజలను నిర్వహించారు. అర్చకులు వేణుగోపాల రావ్ ఆధ్వర్యంలో అభిషేకం, పంచామృత అభిషేకం, వేదమంత్ర పారాయణం తదితరాలు జరిగాయి. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అఖండ భజన సాగింది. -
ఉద్రిక్తంగా శ్రీరంగపట్టణం
భక్తులను అదుపుచేస్తున్న పోలీసులు హనుమాన్ శోభాయాత్రమండ్య: ఆంజనేయస్వామి మాలధారులు, భక్తులు చేపట్టిన సంకీర్తన యాత్ర ఉద్రిక్తంగా మారింది. ఊరేగింపు సందర్భంగా శ్రీరంగపట్టణం పురసభ సర్కిల్ వద్ద ప్రార్థనాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు మాలధారులు యత్నించారు. ఈ సమయంలో వారిని పోలీసులు అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం శ్రీరంగపట్టణంలోని వేలాది మంది హనుమ మాలధారులు సంకీర్తన యాత్రను చేపట్టారు. పట్టణ శివార్లలోని గంజాం కావేరి నది సరిహద్దులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హిందూ నాయకుడు లోహిత్ రాజ్ అరస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మూడల బాగిలు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఊరేగింపుగా సాగారు. ఊరేగింపు పొడవునా జైశ్రీరామ్, భజరంగ భజరంగ’ నినాదాలు చేస్తూ సాగారు. అక్కడ అలజడి ఊరేగింపు యాత్ర పట్టణ పురసభ సర్కిల్ వద్దకు చేరుకోగా అలజడి చెలరేగింది. అక్కడ ప్రార్థనాలయం ఉంది. ముందు రోడ్డుపై టెంకాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చి నిమ్మకాయలు ఉంచారు. రోడ్డుపై కూర్చొని రామ, ఆంజనేయ స్వామి భజనలు చేశారు. కొందరు భక్తులు ఆవేశం పట్టలేక ప్రార్థనాలయం తమదని చెబుతూ అక్కడ మందిరం కట్టి తీరుతామని వీరంగం చేశారు. లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని రోడ్డు పక్క నుంచి వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో తోపులాట, వాగ్వాదంతో ఉద్రిక్తత రాజ్యమేలింది. వేలాది మంది పోలీసులను మసీదు వద్ద భద్రతగా ఉంచినా కూడా హనుమ భక్తులు ఆగలేదు. ఎస్పీ మల్లికార్జున బాలదండి భక్తులకు సర్దిజెప్పారు. గొడవలు జరగకుండా ముందుగానే 1800 మంది పోలీసులను మోహరించారు. పలువురు హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ శ్రీరంగపట్టణ హిందువుల పవిత్రస్థలమని, గతంలో ఇక్కడ ఒక దేవస్థానాలు ఉండేవన్నారు. దండయాత్రలకు గురై ధ్వంసమయ్యాయని ఆరోపించారు. ఇందులో మూడల బాగిలు ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటని చెప్పారు. భారీఎత్తున హనుమాన్ భక్తుల ర్యాలీ ప్రార్థనాలయం ముందు రభస -
డీకే ఆకస్మిక ఢిల్లీ టూర్
శివాజీనగర: రాజకీయ వేడి మధ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ 14న ఓట్ చోరీపై ఆందోళన ఉంది, ప్రతి జిల్లా నుంచి 300 మందిని తీసుకొని వెళ్లాలి. ఢిల్లీ పర్యటన పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమన్నారు. మంగళూరులో కేసీ వేణుగోపాల్, సిద్దరామయ్య భేటీ జరిగితే తప్పేముందన్నారు. అభిమానులు నినాదాలు చేసి ఉండవచ్చు, కొందరు మోదీ అంటారు, కొందరు డీకే అంటారు, కొందరు రాహుల్ అంటారు, కొందరు సిద్దు అంటారు, అందులో తప్పేమిటని ప్రశ్నించారు. ఆ వాచ్ నాదే విలువైన వాచ్ ఆరోపణల మీద స్పందిస్తూ అల్పాహార విందులో నేను కట్టిన వాచ్ ధర రూ.43 లక్షలుగా వార్తలు వచ్చాయి. అది రూ.24 లక్షలే, నేనే క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన వాచ్ అని అన్నారు. నేను, సిద్దరామయ్య గడియారాలను కొనుగోలు చేయరాదా?, మాకా శక్తి లేదా? అని ప్రశ్నించారు. శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలవవచ్చని తెలుస్తోంది. అల్పాహార విందు, సీఎం కుర్చీ, మంత్రిమండలి మార్పులు, ఇతర రాజకీయ పరిణామాలను వారికి వివరించే వీలుంది. -
అర్ధరాత్రి మృత్యుఘంటిక
సాక్షి బళ్లారి/ దొడ్డబళ్లాపురం: బాగల్కోట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు యువకులు విగతజీవులయ్యారు. చెరకు ట్రాక్టర్ను వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. వివరాలు.. మంగళవారం అర్ధరాత్రి జిల్లాలోని జమఖండి తాలూకా సిద్దాపురం గ్రామానికి చెందిన విశ్వనాథ్ కంబార (17), ప్రవీణ్ (22), గణేష్ (20), ప్రజ్వల్ (18)లు కారులో షికారుకు బయల్దేరారు. కొంతదూరం వెళ్లారో లేదో.. బాగల్కోటె – విజయపుర రహదారిలో ఓ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో ముందు వెళ్తున్న చెరకు ట్రాక్టర్ను కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురూ తీవ్ర గాయాలతో చనిపోయారు. మద్యం మత్తులో డ్రైవింగే కారణమని అనుమానాలున్నాయి. విషయం తెలియగానే తల్లిదండ్రులు పరుగున వచ్చి బోరున విలపించారు. స్థానికులు, పోలీసులు అతి కష్టమ్మీద కారును బయటకు తీసి మృతదేహాలను వెలికితీశారు. జమఖండి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చెరకు ట్రాక్టర్కు వెనుక నుంచి కారు ఢీ నలుగురు యువకుల మృతి బాగల్కోట జిల్లాలో ఘోరం -
గాంధీబజార్లో ఫుట్పాత్ ఆక్రమణల నేలమట్టం
బెంగళూరు గాంధీబజార్లో ఫుట్పాత్ మార్గంలోని అంగళ్లను తొలగిస్తున్న పాలికె అధికారులు బనశంకరి: బెంగళూరు నగరంలో చిక్కపేటే పరిధిలోని గాంధీబజార్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు చేపట్టారు. కేంద్రనగరపాలికె కమిషనర్ రాజేంద్ర చోళన్ ఆదేశాలతో బుధవారం కార్యాచరణను నిర్వహించారు. అన్ని ఆక్రమణలు నేలమట్టం చేయాలని సూచించారు. గాంధీబజార్లో వీధివ్యాపారుల కోసం 120 దుకాణాలకు స్థలాలను గుర్తించి అక్కడే వ్యాపారం చేపట్టాలని సూచించారు. కానీ ఫుట్పాత్లను ఆక్రమించడంతో ప్రజలకు సమస్యలు వస్తున్నాయని తెలిపారు. దీంతో రెండు జేసీబీ యంత్రాలు, 7 ట్రాక్టర్లు, 3 లారీలు, 40 మంది సిబ్బందితో అంగళ్లను కూల్చివేసి పక్కకు తీసివేశారు. 5 షాపులను కూడా తొలగించారు. ఇక పై వీధి వ్యాపారులకు కేటాయించినచోటే వ్యాపారం చేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణలు తొలగింపు సమయంలో ఇంజనీర్లు ప్రదీప్, డీజీఎం లోహిత్, అసిస్టెంట్ ఇంజనీర్లు, పాలికె మార్షల్స్ పాల్గొన్నారు. -
దివ్యాంగుల సత్తా ఆదర్శం
మైసూరు: దివ్యాంగులు ఇతరుల కంటే జీవితంలో ఎక్కువగా సాధిస్తూ చాలా మంది స్ఫూర్తిగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టరు డాక్టర్ పి.శివరాజు అన్నారు. బుధవారం నగరంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. అవయవలోపాల కారణంగా ఏమి సాధించలేరన్నది అవాస్తవమని, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వారికంటే కూడా ఎక్కువ విజయాలు సాధించిన ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయని తెలిపారు. దివ్యాంగులు సామర్థ్యాన్ని చాటుకుంటూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది దివ్యాంగులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తేరుపై హనుమంతుడు
బొమ్మనహళ్లి: బొమ్మనహళ్ళి నియోజకవర్గంలోని బన్నేరుఘట్ట రోడ్డులో ఉన్న అరికెరెలో ప్రసిద్ధ వీరాంజనేయ స్వామివారి బ్రహ్మరథోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకున్న వీరాంజనేయ స్వామివారికి మరుసటి రోజు తేరు వేడుక జరపడం సంప్రదాయం. ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి రథానికి పూజలు నిర్వహించారు. వేలాది భక్తులు జై హనుమాన్, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ తేరును లాగారు. కానిస్టేబుల్ వంచన మైసూరు: పేపర్ గ్లాస్, జ్యూస్ తయారీ విభాగం ప్రారంభిస్తానని నమ్మించి పోలీసు కానిస్టేబుల్ ఒకరు దంపతుల నుంచి రూ. 35 లక్షలను దండుకున్నాడు. మైసూరు మేటగళ్లి ఠాణా కానిస్టేబుల్ రాజుపై కువెంపు నగర నివాసి మంజుళా జైన్, సిద్ధేశ్, మహాలక్ష్మి కృష్ణరాజ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మంజుళకు పేపర్ గ్లాస్, జ్యూస్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయిస్తానని రాజు నమ్మించాడు. ఆమె ద్వారా సిద్ధేశ్ దంపతులను పరిచయం చేసుకున్నాడు. వారి నుంచి రూ. 35 లక్షలను తీసుకుని ముఖం చాటేశాడు. అడిగితే చేతనైంది చేసుకోండి అని ఎదురుదాడికి దిగతున్నాడని బాధితులు వాపోయారు. 42 ఇండిగో విమానాల రద్దు ● ప్రయాణికుల అవస్థలు దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్పోర్టులో ఏకంగా 42 ఇండిగో విమానాలు హఠాత్తుగా రద్దు చేయడంతో ప్రయాణికులు నానా పాట్లు పడ్డారు. అత్యవసర పనుల మీద దూరప్రాంతాలకు వెళ్లవలసినవారు బిక్కమొహం వేశారు. బుధవారం ఎయిర్పోర్టుకు రావాల్సిన 22, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 20 విమానాలు రద్దు చేస్తున్నట్టు ఇండిగో సిబ్బంది ప్రకటించారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై,గోవా, కోల్కతా, లక్నో తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇవే ప్రాంతాల నుండి రావాల్సినవి రాలేదు. అనేకమంది కౌంటర్లోని సిబ్బందిని నిలదీసినా జవాబు రాలేదు. సోషల్ మీడియాలో ఆక్రోశం వ్యక్తం చేశారు. లాకప్డెత్.. సీఐ సస్పెండ్ బనశంకరి: రాజధానిలో వివేకనగర పోలీస్ స్టేషన్లో జరిగిన ఓ యువకుని లాకప్డెత్ ఘటనలో సిఐ తో పాటు నలుగురు పోలీస్సిబ్బందిని కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ సస్పెండ్ చేశారు. ఇటీవల ఓ గొడవలో దర్శన్ అనే యువకున్ని పోలీస్స్టేషన్ కు పిలిపించి సీఐ శివకుమార్, ముగ్గురు సిబ్బంది తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రాణాపాయ స్థితిలోఉన్న దర్శన్ ను అడకమారనహళ్లి పునర్వసతి కేంద్రంలో ఉంచారు. అతను ఓ రోజు తరువాత చనిపోయాడు. దీంతో లాకప్డెత్ చేశారని అతని కుటుంబీకులు మాదనాయకనహళ్లి పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. స్నేహితుని ఇంటికే కన్నం ● బట్టల వ్యాపారి, మరొకరి అరెస్టు ● రూ.1.14 కోట్ల నగదు స్వాదీనం బనశంకరి: స్నేహితుని ఇంటినే దోచుకున్న ఇద్దరిని బుధవారం హెబ్బగోడి పోలీసులు అరెస్ట్చేశారు. పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ వివరాలను వెల్లడించారు. వివరాలు.. జిగణి హొబళి హులిమంగలలో అపార్టుమెంట్ నివాసి సునీల్కుమార్ బాధితుడు. గతనెల 8వ తేదీన కుటుంబంతో సొంతూరు కోలారు కు వెళ్లారు. అతని స్నేహితుడు, వస్త్రవ్యాపారి అయిన సుంకదకట్టె విఘ్నేశ్వరనగర శ్రీనివాసమూర్తి కి ఈ విషయం తెలిసింది. దీంతో ఎలక్ట్రీషియన్ చిక్కగొల్లరహట్టి అరుణ్కుమార్ను తీసుకుని ఇంటిలోకి చొరబడి భారీగా డబ్బు, బంగారాన్ని దోచుకున్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించి ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.93 లక్షలు నగదు, 16 గ్రాముల బంగారుచైన్, మారుతిసుజుకి 800 కారు, బట్టల షాపులో మరో రూ.7 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో రూ.7 లక్షల నగదు, స్నేహితుడికి ఇచ్చిన రూ.7 లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మొత్తం రూ.1 కోటి 14 లక్షల నగదు సీజ్ చేశారు. అప్పుల పాలై, యూట్యూబ్లో చూసి మొదటిసారిగా చోరీ చేసినట్లు నిందితులు తెలిపారు. -
ఆంజనేయా.. పాహిమాం
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలో ఉన్న హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిలో వేలాది మంది హనుమ మాలధారులు రాముని వద్ద బారులు తీరి నిలబడి శ్రీ జయరాం, పవనసుత ఆంజనేయ జయ జయ ఘోషలతో హనుమ నామాన్ని జపిస్తూ ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్నారు. గత అనేక సంవత్సరాలుగా అంజనాద్రికి హనుమమాల ధరించి వచ్చే హనుమ భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఆలయానికి వచ్చే భక్తులకు తాత్కాలిక స్నాన గదులు, మరుగుదొడ్లు, వసతి, వాహనాల పార్కింగ్ వంటి అవసరమైన సౌకర్యాలను జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ భద్రతా వ్యవస్థను కల్పించింది. మాలధారులకు దర్శనం తర్వాత వేద పాఠశాలలో గోధుమ హుగ్గి, అన్న ప్రసాదం ఏర్పాట్లు చేశారు. హనుమ మాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఎక్కువ భోజన కౌంటర్లను ఏర్పాటు చేశారు. కొండ మెట్ల వద్ద భక్తులకు ముందు జాగ్రత్తగా ఆరోగ్య శాఖ అధికారుల బృందాలను నియమించారు. వివిధ వైపుల నుంచి అంజనాద్రికి వచ్చే వాహనాలకు సుగమ సంచార వ్యవస్థ ఏర్పాటుకు పోలీస్ శాఖ తగిన బందోబస్తును కల్పించారు. అంజనాద్రికి పోటెత్తిన భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమ మాల దీక్ష -
ఎయిడ్స్పై జాగృతి జాతా
రాయచూరు రూరల్: సమాజంలో ఎయిడ్స్ మహమ్మారిపై ముమ్మర ప్రచారం చేపట్టాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్య శాఖ, రెడ్ రిబ్బన్, రిమ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తులతో జాగృతి జాతాను ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఈ వ్యాధికి గురైన వారిని చిన్న చూపు చూడటం తగదన్నారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలన్నారు. జాతాలో జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సురేంద్రబాబు, ఎయిడ్స్ నోడల్ అధికారి గణేష్, నందిత, మనోహర్ పత్తార్లున్నారు. గ్యాంగ్స్టర్ చిత్రంతో అంజనాద్రికి భక్తుడు సాక్షి బళ్లారి: మహారాష్ట్రలోని ముంబైలో గ్యాంగ్స్టర్గా పేరు గాంచిన లారెన్స్ బిష్ణోయి చిత్రం పట్టుకొని అంజనాద్రి కొండకు ఓ భక్తుడు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా కోళివాడ గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు తొమ్మిది రోజుల పాటు హనుమ మాలను ధరించి భక్తిశ్రద్ధలతో హనుమంతుడిని పూజించారు. అనంతరం అంజనాద్రికి రావడంతో సదరు భక్తుడు హనుమ మాలపై లారెన్స్ బిష్ణోయి చిత్రం పట్టుకొని రావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. వైకుంఠ రథం పంపిణీ రాయచూరు రూరల్: మైనార్టీ సోదరుల అంత్యక్రియలకు జనాజా వాహనా(వైకుంఠ రథా)న్ని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పంపిణీ చేశారు. బుధవారం నగరంలోని బందేనవాజ్ కాలనీలో మైనార్టీ సోదర సోదరీమణుల మృతదేహాలను సాగనంపడానికి రూ.20 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రెండు రిఫ్రిజిరేటర్లు, జనాజా వాహనం అందించారు. ఈ సందర్భంగా మాజీ నగరసభ సభ్యుడు బాబర్, అబ్దుల్ కరీం, మహ్మద్ సుల్తాన్, సయ్యద్, ఖాజా మోయినుద్దీన్, మహ్మద్ అహ్మద్ హుసేన్, రహీం ఖురేషీ, అహ్మద్ రాజ్, ఖలీం, అల్లా భక్షి, అస్లాం, జాఫర్ ఖాన్, ఖాజాహుసేన్లున్నారు. గ్రోత్ సెంటర్లో సమస్యలు తీర్చరూ రాయచూరు రూరల్: రాయచూరు గ్రోత్ సెంటర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కరవే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జావిద్ ఖాన్ మాట్లాడారు. రాయచూరు గ్రోత్ సెంటర్ పరిధిలో వడ్లూరు, చిక్కసూగూరు, హెగ్గసనహళ్లిలో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. టెక్సాటాన్ స్టీల్ పరిశ్రమలు ఉండడంతో ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గ్రామాల ప్రజలు పలు వ్యాధుల బారిన పడుతున్నారని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ సురేష్వర్మకు వినతిపత్రం సమర్పించారు. నేడు సిద్దలింగేశ్వర స్వామి జాతర, రథోత్సవం రాయచూరు రూరల్: రాయచూరు తాలూకాలోని మన్సలాపూర్లో గురువారం సిద్దలింగేశ్వర జాతర, రథోత్సవాలు జరగనున్నాయి. కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్య, సుల్తాన్పుర శంభు సోమనాథ శివాచార్యుల ఆధ్వర్యంలో వేలాది మంది భక్తుల సమక్షంలో జాతర రథోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. -
కాళ్ల పారాణి ఆరక ముందే..
సాక్షి బళ్లారి: పెళ్లయిన మరునాడే నవవరుడు గుండెపోటుతో మరణించిన ఘటన విజయనగర జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు..శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హనుమంతపుర గ్రామానికి చెందిన రమేష్(30) అనే యువకుడికి విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా బండ్రి గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం నిశ్చితార్థం జరగగా నవంబర్ 30వ తేదీన పెళ్లి జరిగింది. అనంతరం మంగళవారం పెళ్లి కుమార్తె ఇంటికి వధువు, వరుడు తిరిగింపులకు రావడంతో పెద్ద ఎత్తున గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపును కూడా నిర్వహించారు. వధువు ఇంటికి చేరిన తర్వాత పెళ్లి కుమార్తె ఇంట్లో కాలు పెట్టగానే వరుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. అతనిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడు. ఈ ఘటనతో పెళ్లి కుమార్తె ఇంట ఆక్రందనలు మిన్నంటాయి. కాగా పెళ్లి కుమారుడు రమేష్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో తల్లి సొంత ఊరు హొసకుప్పె గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి చేసుకొన్న మరుసటి రోజే మృతి చెందడంతో అటు అతని అమ్మమ్మ ఇంట్లో కూడా విషాదం నెలకొంది. ఈ ఘటనతో పెళ్లి సందడి ఆవిరై కన్నీటి పర్యంతంగా మారింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. పెళ్లి కుమార్తె రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు. గుండెపోటుతో వరుడు మృతి రెండు కుటుంబాల్లో విషాదం విజయనగర జిల్లాలో ఘోరంజీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ మధురానుభూతిని కల్గించే మహత్తర ఘట్టం. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు తమ కుమార్తె పెళ్లిని ఘనంగా జరిపించారు. పెళ్లయిన మరుసటి రోజున వరుడు అత్తవారింటికి తిరిగింపులకు రాగా బాజాభజంత్రీలతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. అయితే పెళ్లి కుమార్తె కాళ్ల పారాణి ఆరకముందే వరుడు అత్తింట్లో గుండెపోటుతో మరణించడంతో అటు పెళ్లి కుమార్తె, ఇటు పెళ్లి కుమారుడి ఇళ్లలో తీవ్ర విషాదం, బాధ, కన్నీరు మిగిలాయి. -
స్కౌట్స్ గైడ్స్తో క్రమశిక్షణ వృద్ధి
హొసపేటె: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో పాల్గొనే విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ పెంపొందుతుందని పాఠశాల విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్, భారత్ స్కౌట్స్ గైడ్స్ జిల్లా చీఫ్ కమిషనర్ వెంకటేష్ రామచంద్రప్ప అన్నారు. హోసూరు నగరంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కర్ణాటక, విజయనగర జిల్లా సంస్థ, సురభి విద్యానికేతన్ స్కూల్, కాలేజీలు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవార్డు పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అత్యున్నత రాష్ట్ర అవార్డు పరీక్ష రాసే విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. నేటి పిల్లలే రేపటి పౌరులు, పిల్లలు దేశానికి దోహదపడే మంచి పౌరులుగా ఎదగాలని అన్నారు. స్కౌట్స్ గైడ్స్ సంస్థ బాల్యం నుంచే కార్యకలాపాలు, శిబిరాల ద్వారా పిల్లలకు సమగ్ర జీవితాన్ని నిర్మించుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి.శేఖరప్ప మాట్లాడుతూ పాఠ్యాంశ విద్యతో పాటు పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా పిల్లలు మానసికంగా, శారీరకంగా బలంగా ఎదగవచ్చన్నారు. స్కౌట్స్గైడ్స్ ద్వారా కొన్ని సాహసోపేత కార్యకలాపాలు, శిబిరాలు పిల్లలను ధైర్యవంతులుగా చేస్తాయన్నారు. పాఠశాల అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, సంస్థ ఉపాధ్యక్షురాలు కమలా దీక్షిత్, స్కౌట్స్ జిల్లా కమిషనర్ ఎల్.బసవరాజ్, గైడ్స్ జిల్లా కమిషనర్ పీ.సునంద, జిల్లా కార్యదర్శి కే.రాజశేఖర్, జిల్లా సంయుక్త కార్యదర్శి అక్కమహాదేవి, క్యాంపు నాయకులు నాగరాజ్, జిల్లా శిక్షణ కమిషనర్ ఏ.రేణుక, స్థానిక సంస్థల జిల్లా కార్యదర్శి తిప్పేష్ తదితరులు పాల్గొన్నారు. -
రక్షిత మంచినీరు అందించండి
రాయచూరు రూరల్: రాయచూరు నగరవాసులకు రక్షిత మంచినీటిని అందించాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచూరు జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. నగర పరిధిలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలన్నారు. రూ.40 లక్షలతో లీకేజీ మరమ్మతు పనులు చేపట్టారన్నారు. తాగునీటిని పరీక్ష కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పంపాలన్నారు. వాణిజ్య పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను వసూళ్లకు చొరవ చూపాలన్నారు. నగరసభలో అదనంగా 75 మంది పౌర కార్మికుల నియామకాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నగరంలో ఆక్రమించిన కట్టడాలు, స్థలాల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నగరంలోని 36 మురికివాడల ప్రాంతాలు, 35 వార్డుల్లో ఈ–ఖాతాలను అందించాలన్నారు. సమావేశంలో శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్, ఆర్డీఏ అధ్యక్షుడు రామస్వామి, జిల్లాధికారి నితీష్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఎస్పీ పుట్టమాదయ్యలున్నారు. పేదలకు గూడు కల్పనే లక్ష్యం రాష్ట్రంలో పేదలకు ఇళ్లు లేని వారికి గూడు కల్పించడమే సర్కార్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ పేర్కొన్నారు. బుధవారం రాయచూరు నగర పరిధిలో నిర్మాణాలు చేపట్టిన రాజీవ్గాంధీ వసతి పథకంలో 2419 ఇళ్లను పరిశీలించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. ఎస్సీలకు 952, ఎస్టీలకు 1053, జనరల్కు 228, ఇతరులకు 187 ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు. రాజీవ్ గాంధీ వసతి పథకంలో 2023లో ప్రారంభమైన పనులు 2028 నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేస్తారన్నారు. నాణ్యతతో కూడిన విధంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. తాగునీరు, మురుగు కాలువలు, రహదారులు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. లబ్ధిదారులకు రూ.9 లక్షలకే నివాసాలను అందచేస్తారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి అసమ్మతి కుంపటి లేదన్నారు. పార్టీలో అందరూ సమానులేనని అన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఎవరికీ అధికారం శాశ్వతం కాదని అన్నారు. అందరూ డిన్నర్లు ఇస్తారు, వాటిలో పాల్గొనడం తప్పా? అని ప్రశ్నించారు. మంత్రి వెంట మస్కి శాసన సభ్యుడు బసనగౌడ, ఆర్డీఏ అధ్యక్షుడు రామస్వామి, జిల్లాధికారి నితీష్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఎస్పీ పుట్టమాదయ్య, శాలం, నరసింహులు, ఈరణ్ణలున్నారు. అధికారులకు మంత్రి సురేష్ సూచన -
నిమ్న వర్గాల అభివృద్ధే ధ్యేయం
బళ్లారి రూరల్: నిమ్న వర్గాల అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయమని కార్మిక శాఖ మంత్రి సంతోష్లాడ్ తెలిపారు. సండూరు తాలూకా యంత్రాంగం, తాలూకా పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సండూరు తాలూకా విఠలాపురలో జరిగిన సంకల్పన సమర్పణ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తన రాజకీయ జీవితం విఠలాపుర గ్రామం నుంచి ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. 2004లో ఈ గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరించి అంచెలంచెలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తుంగభద్ర ఆనకట్ట నుంచి 80 గ్రామాల్లో 80 వేల ఇళ్లకు మంచినీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. రూ.60 కోట్ల నిధులను అణగారిన వర్గాల అభివృద్ధికి ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ తుకారాం మాట్లాడుతూ 2004 నుంచి సండూరు నియోజకవర్గానికి రూ.4,700 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. నంజుండప్ప నివేదిక ప్రకారం అత్యంత వెనుకబడిన తాలూకా సండూరును అభివృద్ధి చెందిన తాలూకాగా మార్చినట్లు తెలిపారు. 132 గ్రామాలకు రూ.425 కోట్లతో నీటి సరఫరాను అందించినట్లు తెలిపారు. సండూరు ఎమ్మెల్యే ఈ.అన్నపూర్ణ సండూరు తాలూకా అభివృద్ధి గురించి మాట్లాడారు. కర్ణాటక రాష్ట్ర ఖనిజ నిగమ నియమిత ఉపాధ్యక్షుడు హెచ్.లక్ష్మణ్, జగ్జీవన్రాం చర్మ పరిశ్రమల అభివృద్ధి నిగమ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజు, జిల్లా గ్యారంటీ యోజన అమలు ప్రాధికార అధ్యక్షుడు కె.ఈ.చిదానందప్ప, సండూరు తాలూకా గ్యారంటీ యోజన ప్రాధికార అధ్యక్షుడు నూరుద్దీన్, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ఎల్.స్వామి, తోరణగల్లు వాడా అధ్యక్షుడు అక్షయ్ అశోక్లాడ్, అంతాపుర గ్రామపంచాయితీ అధ్యక్షుడు ఎన్.హొన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు. విఠలాపుర నుంచే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది కార్మిక శాఖ మంత్రి సంతోష్లాడ్ వెల్లడి -
దివ్యాంగులపై చిన్నచూపు తగదు
బళ్లారిటౌన్: సమాజంలో దివ్యాంగులపై చిన్నచూపు చూడకుండా వారి అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా శ్రమించాలని జిల్లా న్యాయసేవా ప్రాధికార కార్యదర్శి న్యాయమూర్తి రాజేష్ ఎస్.హొసమని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా న్యాయసేవ ప్రాధికార, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సబలీకరణ తదితర శాఖల ఆధ్వర్యంలో జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారే కొన్ని సందర్భాల్లో వారి జీవితంపై విరక్తి చెందుతారన్నారు. అయితే దివ్యాంగులు తమ అసహాయకత సందర్భంలో కూడా ధైర్యంగా జీవిస్తున్నారన్నారు. దివ్యాంగులను ప్రోత్సహించాలి దివ్యాంగులను తల్లిదండ్రులు వారికి ఇష్టమైన రంగంలో ఎక్కువగా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో స్వయం సేవా సంస్థలు దివ్యాంగుల పిల్లలను పాలన పోషణ చేస్తూ ఆసక్తి చూపడం శ్లాఘనీయం అన్నారు. దివ్యాంగులు కూడా పలు రంగాల్లో సాధన చేశారన్నారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు అయ్యారని గుర్తు చేశారు. అంతేగాక కళ, నృత్యం, క్రీడల్లో కూడా సాధన చేశారన్నారు. పాలికె మేయర్ పీ.గాదెప్ప మాట్లాడుతూ పాలికెలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జెడ్పీ ఉపకార్యదర్శి శశికాంత్ శివపురె, బ్రూస్పేట్ ఎస్ఐ మహంతేష్, ఏపీఎంసీ ఎస్ఐ మహమ్మద్ రఫిక్, అధికారులు రామకృష్ణ నాయక్, వీరేంద్రకుమార్, సవిత, వైఎం.సతీష్, కార్తీక్, జాఫర్ పాల్గొన్నారు. న్యాయమూర్తి రాజేష్ ఎస్.హొసమని -
అండర్పాస్లో రెండు బస్సుల ఢీ
● 12 మందికి గాయాలు ● ఊత్తంగేరి వద్ద ప్రమాదంక్రిష్ణగిరి: బెంగళూరు నుంచి తిరువణ్ణామలై, తిరువణ్ణామలై నుంచి బెంగళూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 12 మందికి గాయాలు తగిలాయి. మంగళవారం సాయంత్రం క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగేరి సమీపంలోని సామలపట్టి రైల్వే బ్రిడ్జ్ అండర్పాస్ మార్గంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ధర్మపురి జిల్లా పాలక్కోడు ప్రాంతానికి చెందిన ఓ బస్సు డ్రైవర్ శ్రీనివాసన్ (48), ప్రయాణికులు సప్పానిపట్టివాసి మహాలింగం (29), తిరువణ్ణామలైవాసి పార్థిభన్ (35), చైన్నె కోయంబేడు ప్రాంతానికి చెందిన దివ్య (28), అరుళగిరిమంగలంకు చెందిన దేవి (24), సెంగంవాసి సోనా (30) సహా మరికొందరు గాయాల పాలయ్యారు. స్థానికులు గాయపడిన వారిని చికిత్స కోసం ఊత్తంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సామలపట్టి పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తరలించి ట్రాఫిక్ను సరిచేశారు. ఇరుకై న దారిలో రెండు బస్సుల డ్రైవర్లు నిర్లక్ష్యంగా బస్సులను నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. -
నేటి నుంచి హంపీలో ఫలపూజ మహోత్సవం
హొసపేటె: ప్రపంచ ప్రఖ్యాత హంపీలో వెలసిన విరుపాక్షేశ్వర స్వామి ఆలయ ఫలపూజ మహోత్సవం ఈనెల 4 నుంచి 6 వరకు జరుగుతుందని విరుపాక్షేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి హనుమంతప్ప తెలిపారు. హంపీ విరుపాక్ష విద్యారణ్య సంస్థాన్ అధిపతి విద్యారణ్య భారతీ స్వామీజీ దివ్య సమక్షంలో ఈనెల 4వ తేదీ గురువారం రాత్రి 8 గంటలకు మున్ముఖ తీర్థంలో విరుపాక్షేశ్వర స్వామి తెప్పోత్సవం జరుగుతుంది. డిసెంబర్ 6న రాత్రి 9 గంటలకు చక్రతీర్థ కోదండరామ స్వామి ఆలయం వద్ద ఫలపూజ మహోత్సవం జరుగుతుంది. ఈనెల 4 నుంచి 7 వరకు విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు విరుపాక్షేశ్వర స్వామికి అంకితం చేసిన నవరత్న ఖచితమైన సువర్ణముఖ కమలంతో అలంకరిస్తారు. పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి విరుపాక్షేశ్వర స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొని పంపా విరుపాక్షేశ్వర స్వామితో పాటు భువనేశ్వరి మాతను దర్శించుకుంటారని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ కవిత ఎస్.మన్నికేరి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హెచ్.సవిత పాల్గొంటారని తెలిపారు. -
త్వరితగతిన డ్యాం గేట్లను అమర్చండి
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్లను త్వరితగతిన అమర్చాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి మునిరాబాద్లో జరిగిన తుంగభద్ర బోర్డు అధికారుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వచ్చే ఖరీఫ్ నాటికి క్రస్ట్గేట్లు అమర్చే పనులను పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే రూ.20 కోట్ల వ్యయంతో రూపొందించిన క్రస్ట్గేట్ల అమరికకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కర్ణాటక ప్రభుత్వానికి రూ.10 కోట్ల నిధుల విడుదలకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. మరో 18 క్రస్ట్గేట్లు తయారవుతున్నాయన్నారు. ఈనెల 5న క్రస్ట్గేట్లపై ఉన్న క్యాప్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్కు నది ద్వారా 7 టీఎంసీలు, తెలంగాణకు 5 టీఎంసీలు కలిపి మొత్తం 12 టీఎంసీల నీటిని విడుదల చేస్తారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి మల్లికార్జున నాగప్ప, చీఫ్ ఇంజినీర్ లక్ష్మణ్ నాయక్, ఎస్ఈ సత్యనారాయణ, గిరీష్, విజయలక్ష్మి, శాంతరాజ్, గోడేకర్, కాంగ్రెస్ నేతలు శాంతప్ప, దొడ్డబసప్పగౌడ, అమరేగౌడలున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేయాలి అధికారులకు మంత్రి బోసురాజు సూచన -
వైభవంగా అంజన్న ఉత్సవాలు
రథోత్సవంలో పాల్గొన్న భక్తులుపల్లకీ సేవ నిర్వహిస్తున్న దృశ్యం రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా మోతకపల్లిలో వెలసిన బల భీమసేన ఆంజనేయ ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. ఆలయంలో విగ్రహానికి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు స్వామి వారిని సేవించి రథోత్సవం జరిపారు. బీజేపీ నేత శివకుమార్ పాటిల్ తేల్కూరు తదితరులు బలభీమసేన ఆంజనేయ స్వామి దర్శనం పొందారు. కర్ణాటక, ఆంధ్రపదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
మద్దతు ధర కోసం భారీ నిరసన
హొసపేటె: విజయనగర జిల్లా బీజేపీ రైతు మోర్ఛా ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని మెయిన్ బజార్ పాదగట్ట ఆంజనేయ దేవస్థానం వద్ద గుమిగూడిన బీజేపీ కార్యకర్తలు ప్రముఖ రహదార్ల ద్వారా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి రేణుకాచార్య మాట్లాడుతూ భారీ వర్షాలతో వరి, వేరుశెనగ, ఉల్లి, మొక్కజొన్నతో సహా అనేక పంటలన్నీ నష్టపోయినందుకు రైతులు విలపిస్తున్నారన్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని భర్తీ చేయలేక పోయిందన్నారు. హడగలి ఎమ్మెల్యే కృష్ణనాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు కన్నీళ్లు పెడుతున్నారన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానానికి రైతులే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రైతులకు మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని, తుంగభద్ర ఆయకట్టు రైతులకు రెండవ పంటకు నీరు అందించాలని, నగరంలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయానికి అందజేశారు. మాజీ మంత్రి కరుణాకర్ రెడ్డి, నగరసభ అధ్యక్షులు రూపేష్ కుమార్, జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరుణించు కురువపుర వల్లభ
కృష్ణా నదీ తీరంలోని కురువపుర రాయచూరు రూరల్: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతి రూపమే దత్తాత్రేయుడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గురుదేవ దత్త మొదటి అవతార పురుషుడు శ్రీవల్లభ స్వామి. కర్మభూమి ద్వీపకల్పంలో నివసించిన నాథుడిగా కురువపుర వల్లభ నాథుడు ప్రసిద్ధి చెందాడు. రాయచూరు తాలూకాలో తెలంగాణ సరిహద్దుల్లో కురవపుర కృష్ణా నది పాయల మధ్యలో వెలసింది. రాయచూరు నుంచి 25 కి.మీ.ల దూరం బస్సులో వెళ్లిన తర్వాత 20 నిమిషాల పాటు నదిలో నాటుపడవల్లో ప్రయాణించి కి.మీ. దూరం నడిచి భక్తులు దేవాలయానికి చేరుకుంటారు. మరి కొంత మంది తెలంగాణలోని మక్తల్ నుంచి కురువపుర చేరుకుంటారు. తాలూకాలోని నారదగడ్డలో వెలసిన శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం భక్తులు బూడిదపాడు, ఆత్కూరు, దొంగరాంపూర్ల నుంచి కృష్ణా నదిలో నాటుపడవల్లో వెళతారు. నేటి నుంచి దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు దర్శించుకోనున్న నాలుగు రాష్ట్రాల భక్తులు -
విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
హొసపేటె: విజయపుర జిల్లా కూడ్లిగి తాలూకాలోని శివపుర గొల్లరహట్టి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా బ్యాగులు పంపిణీ చేశారు. ట్రస్ట్ నిరంతరం సామాజిక సేవల్లో పాల్గొంటోంది. అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు కీర్తిని తీసుకు వచ్చినందున విద్యార్థులకు ఉచిత బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కోగళి కొట్రేష్, ట్రస్ట్ అధికారి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం రాయచూరు రూరల్: ద్విచక్రవాహనంతో వంతెనను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకాలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి సింధనూరు–మస్కి రహదారిలో భూతలదిన్ని వద్ద నిర్మాణ దశలో ఉన్న వంతెనను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతులను యల్లప్ప(24), లింగప్ప(27)లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనపరచుకుని శవ పరీక్ష నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. హీరోహోండా ద్విచక్రవాహనం అదుపు తప్పి వంతెన వద్ద ఇనుపరాడ్డుకు ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు. హనుమాన్ జయంతి వేడుకలు చెళ్లకెరె రూరల్: చెళ్లకెరె నగర సమీపంలోని కరేకల్ శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వైభవంగా జరిగింది. విద్వాన్ నాగశయన గౌతమ్ నేతృత్వంలో ఉదయం స్వామి వారికి వేద మంత్రాలతో పంచామృతాభిషేక అలంకరణ, మహామంగళ హారతి జరిగింది. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు దివంగత పద్మనాభ శెట్టి కుమారులు అన్నసంతర్పణ జరిపారు. సాయంత్రం సమయంలో చైత్ర ఆధ్వర్యంలో భక్తిగీతాలాపన చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రకాష్ శర్మ, ఎల్ఐసీ శ్రీనాథ్, రామకృష్ణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు కిట్ల పంపిణీ రాయచూరు రూరల్: బీదర్ జిల్లాలో దివ్యాంగులకు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె సోమవారం కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం పన్నుల నుంచి దివ్యాంగులకు సెల్కో సంస్థ నుంచి కిట్లను అందించినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ, నగర ప్రాంతాల్లో సెల్కో సంస్థ అందించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సౌర ఆధారిత యంత్రాల ద్వారా జీవనోపాధి యంత్రాలను అందించిన సంస్థలను అభినందించారు. కార్యక్రమంలో సెల్కో సంస్థ పదాధికారులు ఆనంద్, శివరాజ్, రఘునాథ్లున్నారు. సమాజాభివృద్ధికి సహకరించాలి రాయచూరు రూరల్: బంజార సమాజం అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆ సమాజం అధ్యక్షుడు విజయ్ జాధవ్ పేర్కొన్నారు. సోమవారం జేసీ భవనంలో నూతన పదాధికారుల ప్రమాణ వచన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. బంజార సమాజం తాండాల్లో నివాసముంటూ కష్టపడి పని చేసే మనస్తత్వం కలిగి ఉందన్నారు. నేడు మన పిల్లలను సామాజికంగా, విద్యా, ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. గోవిందరాజ్, అమరేష్, కృష్ణప్ప, సీతారామ నాయక్, వెంకప్ప, లాలప్ప, శివణ్ణ పవార్, హన్మంతు, వెంకటేష్, జ్యోతిలున్నారు. -
ప్రతిపక్షంగా ప్రభుత్వం చెవులు పిండి పని చేయిస్తా
హుబ్లీ: రాష్ట్రంలో ఓటర్లు కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని, బీజేపీని విపక్షంలో కూర్చోబెట్టారని, ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం చెవులు పిండి ప్రజల బాగు కోసం పాటు పడతానని, ఇదే పరంపర కొనసాగిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర హామీ ఇచ్చారు. కార్వార దగ్గర శిరసిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం గద్దె కోసం కొట్లాడుతున్న బీజేపీకి మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆసక్తి లేదని విపక్ష స్థానం కూర్చొని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజు సీఎం కుర్చీ కోసం పోటాపోటీ తంతు గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రజలు చూసి చూసి విసిగి పోయారన్నారు. ప్రతి ఎమ్మెల్యే, సీనియర్ మంత్రులు, సీఎం గద్దైపె కన్నేశారన్నారు. దీంతో పాలన గాడి తప్పిందన్నారు. అన్నదాతల మేలు మరచి పోయారన్నారు. కేంద్రం రైతు సమ్మాన్, గత సీఎం బసవరాజ్ బొమ్మై అమలు చేసిన రైతు విద్యాసిరి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి రైతన్నలను కష్టాల పాలు చేసిందన్నారు. అతివృష్టి భారంతో కన్నీటిమయమైన రైతన్నను ఓదార్చలేదని సీఎం గద్దె వీరికి ముఖ్యమైందని మండిపడ్డారు. ఉత్తర కర్ణాటక అభివృద్ధి గురించి అందరితో చర్చిస్తాం. చలికాలం అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ, జేడీఎస్ మొదటి మూడు, నాలుగు రోజులు ఉత్తర కర్ణాటక సమస్యల గురించే చర్చిస్తామన్నారు. జలవనరులు సమర్థవంతంగా వినియోగించాలి. కేవలం కేంద్రాన్ని సాకుగా చూపి విమర్శించడం తగదన్నారు. బీజేపీ బహిష్కృత నేత బసవనగౌడ పాటిల్ యత్నాళ్ సమావేశం నిర్వహణకు సర్వస్వతంత్రులన్నారు. ఆయన గురించి ఎక్కువ ఏమీ మాట్లాడబోనన్నారు. అయితే జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నిర్ణయం హైకమాండ్దేనన్నారు. యత్నాళ్ పార్టీలో తిరిగి వస్తారా? అన్న ప్రశ్నకు నో కామెంట్ అని బదులిచ్చారు. -
కుక్కల బెడదకు మోక్షమెన్నడో?
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రం రాయచూరులో కుక్కల గోల తప్పేదెన్నడు? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏ వీధిలో చూసినా కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలను కరుస్తున్నాయి. మరో వైపు చర్మ వ్యాధులు సోకినట్లు ప్రచారం పెల్లు బుకడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురై ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో నిద్ర పోకుండా మొరుగుతూనే ఉంటాయి. వీధి కుక్కల గొడవ ఒక ఎత్తయితే, కుక్కలు కరుస్తాయని పరుగెత్తి వాటి నుంచి రక్షణ పొందాలనుకుంటే రహదారి మధ్యలో కుక్కలు పెంచుకున్న యజమానులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో దాదాపు 900కు పైగా కుక్కలున్నట్లు అంచనా. రాత్రి వేళ రహదారిలో యథేచ్చగా రహదారిపై పడుకొని ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత వారం రోజుల్లో 100 మందికి కుక్కలు కాటు వేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మడ్డిపేటకు చెందిన ఓ యువతి కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నగరసభ అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపి తగిన చర్యలు తీసుకొని కుక్కలను సుదూరంలో విడిచి పెట్టాలని కోరుతున్నారు. వారం రోజుల్లో 100 మందికి కుక్క కాట్లు చికిత్స పొందుతూ ఓ యువతి కోమాలోకి -
ఇంటి వద్దకే ఈ–ఖాతాలు
రాయచూరు రూరల్: నగరంలో రెవెన్యూ వసూళ్లలో ముందుండాలని, ఇంటి వద్దకే ఈ–ఖాతాల పంపిణీకి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అధికారులను ఆదేశించారు. నగరసభ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు, బిల్ కలెక్టర్లకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. నగరంలో 8 జట్లను ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలో ఇంటి పన్ను, నీటి పన్ను వసూలును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ నగరసభ పేరుతో ఈ–ఖాతాలను త్వరగా ఇస్తారన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, నగరసభ సభ్యులు జయన్న, శాంతప్పలున్నారు. -
భీమసేన ఆలయ ఉత్సవాలు ప్రారంభం
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా సేడం తాలూకా మోతకపల్లిలో వెలసిన బల భీమ సేన ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఆలయంలో భక్తులు జ్యోతులు వెలిగించారు. మంగళవారం తెల్లవారు జామున స్వామి విగ్రహానికి పల్లకీలో సేవలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి బల భీమ సేన ఆంజనేయ స్వామి దర్శనం పొందారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మోతకపల్లిలోని ఆలయంలో మూడు రోజుల పాటు విశేష పూజలు -
డాక్టరేట్ ప్రదానం
బళ్లారిటౌన్: నగరానికి చెందిన కన్నడ సంఘాల పోరాట నాయకుడు హెచ్.సురేష్కు ఆసియా ఇంటర్ నేషనల్ కల్చరల్ రిసెర్చ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అవార్డు లభించింది. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 30న హోసూరు వద్ద గల అత్తిబెలెలో యూనివర్సిటీ వారు ఈ అవార్డును తనకు అందించినట్లు తెలిపారు. భరతనాట్య కళాకారిణికి అవార్డు హొసపేటె: 2024–25వ సంవత్సరానికి బాలల దినోత్సవం సందర్భంగా 6 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా రంగ పోటీలలో భరత నాట్య ప్రదర్శన చేసిన వేదశ్రీ అనే విద్యార్థినికి జిల్లా స్థాయి పోటీల్లో కేళది చెన్నమ్మ అవార్డు లభించింది. విజయనగర జెడ్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఈఓ అక్రమ్ షా, జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అధ్యక్షురాలు, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ డీడీ శ్వేత, విజయనగర జిల్లా స్థాయి ఎంపిక కమిటీ సభ్యులు, కార్యదర్శులు, సభ్యులు విద్యార్థికి అవార్డు సర్టిఫికెట్, జ్ఞాపికతో సత్కరించారు. వేతనాలు చెల్లించరూ రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్వర్క్స్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం తుంగభద్ర నీటిపారుదల శాఖ యరమరస్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు అజీజ్ మాట్లాడారు. యరమరస్, కల్లూరు, ఆర్డీఎస్, కవితాళ, కొట్నేకల్, మస్కి, సింధనూరు, జవళగేర, తుర్విహాళ్లోని టాస్క్ వర్క్స్ కార్మికులు ఐదునెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ శాఖాధికారి వినతిపత్రం సమర్పించారు. మానవతా విలువలు పెంచుకోవాలి రాయచూరు రూరల్: సమాజంలో విద్యార్థులు మానవతా విలువలను పెంచుకోవాలని మాజీ శాసన సభ్యుడు తిప్పరాజు పేర్కొన్నారు. మంగళవారం వేదాంత డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలు మరిచి సామరస్యంతో జీవితం గడపాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు, గురువు, దైవం అనుభవాలతో మెలగాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రాకేష్ రాజలబండి, భీమేష్లున్నారు. -
నిధులున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదు?
సమావేశంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బైరతి బసవరాజ్ బళ్లారిటౌన్: ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నా అభివృద్ధి పనులకు ఎందుకు ఖర్చు చేసి చిత్తశుద్ధితో అభివృద్ధి చేయడం లేదు? అని అధికారుల తీరుపై నగరాభివృద్ధి శాఖ మంత్రి బైరతి బసవరాజ్ మండిపడ్డారు. నగరంలోని నూతన జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన ఆ శాఖ ప్రగతి పరిశీలన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.124 కోట్ల కార్యాచరణ యోజన పథకాన్ని తయారు చేయడానికి రెండు ఏళ్లు అవసరమా? అని ప్రశ్నించారు. ఆగస్టులో 134 వివిధ అభివృద్ధి పనులకు టెండర్ పిలువగా ఇంత వరకు వర్క్ ఆర్డర్ను ఎందుకు ఇవ్వలేక పోతున్నారని సూపరింటెండెంట్ ఇంజినీర్ను ప్రశ్నించారు. సరిగా పని చేయకుంటే చర్యలు సక్రమంగా పనులు చేయక పోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. 10 రోజుల్లోగా ఈ పని పూర్తి కావాలని పేర్కొన్నారు. రూ.30 లక్షల బోర్వెల్లకు సంబంధించిన నిధులను ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. అకౌంట్లోనే పెట్టుకొని ఎందుకు కాలయాపన చేస్తున్నారన్నారు. నగరంలో పార్కులు, 5 చెరువుల అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులు ఉండగా ఎందుకు ఖర్చు చేయలేక పోయారని ధ్వజమెత్తారు. గత ఏడాది రూ.55 కోట్ల డిమాండ్ ఉండగా ఈ ఏడాది రూ.63 కోట్ల డిమాండ్ ఉందని అధికారులు పేర్కొనగా మంత్రి మీకు సరైన లెక్కలు రావడం లేదా? అని అధికారులపై కోపగించుకున్నారు. పన్నులతో నగరాభివృద్ధికి ఊతం బళ్లారి మహానగర పాలికెలో ప్రతి ఏడాది పన్నులను పెంచి వాణిజ్య భవనాలు పన్నులు, బకాయిలను వసూలు చేసి నగరాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. నగర పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న లేఅవుట్లపై డెవలపర్స్ పరంగా పనులు చేయకుండా సరైన నియమాల ప్రకారం అనుమతి ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ తుకారాం, ఎమ్మెల్యేలు నాగేంద్ర, భరత్రెడ్డి, మేయర్ గాదెప్ప, బుడా చైర్మన్ జేఎస్.ఆంజనేయులు, జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అధికారుల తీరుపై నగరాభివృద్ధి శాఖ మంత్రి బసవరాజ్ మండిపాటు -
మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం
శ్రీనివాసపురం: నిత్యం ఏదో ఒకచోట ప్రైవేటు బస్సులు ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికులకు దడ పుట్టిస్తున్నాయి. ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదంలో మహిళ చనిపోయిన ఘటన కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకాలోని మంచినీళ్లకోట గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరు కు చెందిన అనిత (58) మృతురాలు. ఏపీలోని బద్వేల్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన హరిత ట్రావెల్స్ బస్సు ఘటనాస్థలిలో రోడ్డు డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. అనిత అనే ప్రయాణికురాలు అక్కడే మరణించగా, 10 మందికిపైగా ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారి ఆర్తనాదాలతో అక్కడ బీభత్స వాతావరణం నెలకొంది. బాధితులను శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. బాధితులు ఏపీ, బెంగళూరువాసులుగా తెలిసింది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులున్నారు. బస్సు ముందు భాగం బాగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. అదుపులో డ్రైవరు రాయల్పాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బస్సును జేసీబీతో తొలగించారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిద్రమత్తు, నిర్లక్ష్యంగా నడపడమే కారణమని అనుమానాలున్నాయి. డివైడర్ను ఢీకొని పల్టీలు మహిళ మృతి, 10 మందికి గాయాలు బద్వేలు నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు కోలారు జిల్లాలో ఘటన -
టెంటు మోసగాడు అరెస్టు
శివాజీనగర: లైంగిక సమస్య పరిష్కరించే నెపంతో ఐటీ ఇంజనీరును నమ్మించి రూ.48 లక్షలు వసూలు చేసిన నకిలీ ఆయుర్వేద వైద్యున్ని బెంగళూరు జ్ఞానభారతి పోలీసులు చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని పూణె కు చెందిన విజయ్ గురూజీ అని తెలిపారు. నగరంలో రోడ్డు పక్కన టెంటు వేసుకుని నకిలీ ఆయుర్వేద ఉత్పత్తులను అమ్మేవాడు. ఓ టెక్కీ లైంగిక పటుత్వం కోసం ఇతనిని కలవగా నమ్మించి, ఆపై బెదిరించి నకిలీ మందులను అంటగట్టి రూ. 48 లక్షలు తీసుకున్నాడు. ఆ మందుల వల్ల టెక్కీకి కిడ్నీలు పాడై ఆస్పత్రిలో చేరాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించి పట్టుకున్నారు. రోడ్ల పక్కన టెంట్లలో అమ్మే ఔషధాలను ఉపయోగించరాదని, అటువంటివారిని సంప్రదించరాదని పోలీసులు సూచించారు. లోకాయుక్త వలలో సర్వే అధికారి మైసూరు: ఓ వ్యక్తికి పని ఇప్పించేందుకు లంచం తీసుకుంటూ జిల్లాలోని పిరియాపట్టణకు చెందిన ఏడీఎల్ఆర్ కార్యాలయ సర్వే అధికారి కేఆర్ రవీంద్ర లోకాయుక్తకు దొరికాడు. ఆయన పిరియాపట్టణలోని సర్వే శాఖలో ఈ–సర్వే స్కెచ్ తయారీ పని చేస్తున్నారు. స్కెచ్ తయారీలో తమకు పనులు ఇవ్వాలని ఎస్పీ రాఘవేంద్ర అనే వ్యక్తి ఈయనను కలిశారు. అందుకు రూ.90 వేల ముడుపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. హుణసూరులోని బార్లో అడ్వాన్స్గా రూ.30 వేల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు రవీంద్రను అరెస్టు చేశారు. సత్యసాయి జీవితం స్ఫూర్తిదాయకం మాలూరు: సనాతన ధర్మరక్షణకు భగవాన్ సత్యసాయి బాబా అపారమైన కృషి చేశారని రత్నకుమార స్వామీజీ అన్నారు. తాలూకాలోని లక్కూరు గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో స్వామీజీ పాల్గొని మాట్లాడారు. సత్యసాయి బాబా జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. సత్యసాయి బాబా విద్య, అన్నదాసోహానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలను అందించారన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సత్యసాయి నేటికీ అందరి హృదయాల్లో నిలిచి ఉన్నారన్నారు. సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కగ్గనూరు బాలకృష్ణ, మంజునాథ్రెడ్డి, సుబ్రహ్మణి తదితరులు పాల్గొన్నారు. బాలికపై ఇద్దరి అఘాయిత్యం దొడ్డబళ్లాపురం, హుబ్లీ: రాష్ట్రంలో నిత్యం ఏదో ఓ మూల కామాంధులు లైంగిక దాడులకు తెగబడుతున్నారు. 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన దారుణ సంఘటన బెళగావి జిల్లా మురగోడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గత నెల 23న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. బాలిక పిండిమిషన్కి వెళ్తున్న సమయంలో స్థానికులు మణికంఠ, ఈరణ్ణ అనే యువకులు బలవంతంగా చెరకుతోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిందితులను నిలదీశారు. నోరెత్తితే చంపేస్తామని దుండగులు బెదిరించారు. ఇప్పుడు గ్రామస్తులకు తెలియడంతో వారు ధైర్యం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నిందితులను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. -
రాష్ట్రానికి వర్షసూచన
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో చలి తీవ్రత నడుమ రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒళనాడు, కరావళి ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదు కావచ్చు, ఉత్తర ఒళనాడు ప్రాంతంలో పొడి గాలులు వీస్తాయని తెలిపారు. బెంగళూరు మబ్బులు కమ్మేసి ఉంటాయని, అలాగే కొద్దిపాటి చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కరావళి జిల్లాలు దక్షిణ కన్నడ, ఉడుపిలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలు ఉండవచ్చు. గంటకు 6–13 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. -
రామబంటూ.. నీ వెంట మేమయ్యా
యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం హనుమత్ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆంజనేయస్వామి ఆలయాలలో స్వామికి అలంకారం, పూజలు, హోమాలు జరిపించారు. ఉదయం నుంచి దేవస్థానాలు భక్తులతో నిండిపోయాయి. రామబంటు అంజన్నకు ఇష్టమైన తులసి, తమలపాకు, వెన్న, ఉద్ది వడలతో విశేష అలంకరణ చేశారు. బెంగళూరు ఉత్తరహళ్లిలోని వీరాంజనేయస్వామి గుడిలో గణపతి హోమం జరిగింది. దాసనపుర కార్యసిద్ధి ప్రసన్న ఆంజనేయస్వామి మందిరంలో పంచామృత అభిషేకాలు జరిగాయి. దేవనహళ్లి తాలూకా బన్నిమంగల ఆంజనేయస్వామి గుడి, రాజఘట్ట, దిన్నే ఆంజనేయస్వామి మందిరాలలో తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూలో ఉండి దర్శించుకున్నారు. నగరవ్యాప్తంగా ఆంజనేయస్వామి మందిరాలలో భక్తుల కోలాహలం నెలకొంది. హనుమ వేషధారుల సందడి ఆకట్టుకుంది. రాష్ట్రమంతటా ఇదే రీతిలో హనుమజ్జయంతి పూజలు సాగాయి. తుమకూరులో తుమకూరు: తుమకూరు నగరంలో చరిత్ర ప్రసిద్ధ కోటె ఆంజనేయస్వామి దేవాలయం, శెట్టిహళ్ళి ఆంజనేయ స్వామి గుడి, అభయాంజనేయ స్వామి మందిరం, బీహెచ్ రోడ్డులో వరప్రసాద వీరాంజనేయ స్వామి తదితరాల్లో జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు చేపట్టారు. ఘనంగా హనుమత్ జయంతి ఉత్సవాలు ఆంజనేయ ఆలయాలలో భక్తుల రద్దీ వాడవాడలా ఉత్సవాలు -
దట్టంగా పొగమంచు
గౌరిబిదనూరు: స్థానికంగా గత నాలుగు రోజులుగా తుపాను వల్ల అప్పుడప్పుడు జడివాన కురిసింది. తుపాను వెళ్లిపోవడంతో వానలు పడలేదు. అయితే నగరం వెలుపల ఉదయం 9 గంటలదాకా దట్టమైన పొగమంచు కప్పేసింది. వాహనదారులు దారి కనిపించక అవస్థలు పడ్డారు. చలి తీవ్రంగా ఉంది. చల్లని ఈదురు గాలులు వీస్తూ పగటి ఉష్ణోగ్రత 14 డిగ్రీలకు పడిపోయింది. వృద్దులు, పిల్లలకు చలిని భరించడం కష్టంగా వుంది. రూ.5 లక్షల వాచ్ చోరీహోసూరు: హోసూరు పారిశ్రామికవాడలో టైటాన్ జ్యూవెలరీ పరిశ్రమ ఆవరణలోనే చేతిగడియారాల విక్రయ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి షోరూంకు వెళ్లాడు. ఒక ఖరీదైన చేతి గడియారాన్ని చాలాసేపు పరిశీలించాడు. మధ్యాహ్నం సమయం కావడంతో ఉద్యోగులు భోజనం కోసం వెళ్లారు. కొంతమంది ఉద్యోగులు మాత్రమే షోరూంలో ఉన్నట్లు గ్రహించిన ఆ దొంగ చేతిగడియారాన్ని జేబులో వేసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం గడియారాలను లెక్కించిన ఉద్యోగులకు ఓ గడియారం కనిపించలేదని తెలిసి సిఫ్కాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గడియారం విలువ రూ.5 లక్షలని తెలిపారు. సీసీ కెమెరా చిత్రాల ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు. చిట్టి పొట్టి బాలలం బొమ్మనహళ్లి: స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు కనులపండువగా జరిగాయి. పలువురు ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. చిన్నారి బాలల నృత్యాలు అలరించాయి. ఘరానా బ్యాంకు ఉద్యోగి.. రూ.47.72 లక్షల స్వాహా మైసూరు: ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి ఉద్యోగం మానేసిన తర్వాత కూడా బ్యాంకు ఖాతాదారుల నుంచి సొమ్ము సేకరించి రూ.47.72 లక్షలను స్వాహా చేశాడు. ఈ ఘటన మైసూరులో జరిగింది. నిందితుడు మహదేవస్వామి గతంలో ఇండస్ బ్యాంకు వాణిజ్య విభాగంలో మేనేజర్గా పని చేస్తుండేవాడు. గత మే నెల నుంచి పత్తా లేడు, మొబైల్ కూడా స్విచాఫ్ అయింది. దీంతో అనుమానపడిన బ్యాంకు అధికారులు మహదేవస్వామి గతంలో వాహన యజమానుల నుంచి రుణాల ఖాతాలను తనిఖీ చేయగా కంతులు కట్టలేదని తేలింది. నిందితుడు వసూలు చేసుకుని జేబులో వేసుకున్నాడు. లెక్కపత్రాలను పరిశీలించగా మహదేవస్వామి రూ.47,72,810 లను సేకరించి బ్యాంకుకు చెల్లించలేదని తెలిసింది. సరస్వతీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడతేరిన సహజీవన జంట దొడ్డబళ్లాపురం: అక్రమ సంబంధాలు, సహజీవనం వంటివి చివరకు ప్రాణాలు తీస్తున్నాయి. గొడవలు చెలరేగి హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. వీటి వల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నామవుతున్నాయి. తాజాగా ప్రియురాలిని హత్య చేసి తరువాత ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఇందిరాప్రియదర్శిని నగరలో చోటుచేసుకుంది. లలిత (49), లక్ష్మినారాయణ (51) మృతులు. లలితకు భర్త లేడు, అతనికి భార్య లేదు, దీంతో ఇద్దరూ కలిసి సహజీవనం సాగిస్తున్నారు. అయితే తరచూ లలితను లక్ష్మినారాయణ అనుమానిస్తూ రగడ పడేవాడు. ఆదివారం రాత్రి కూడా పోట్లాటకు దిగారు. ఆమెను గొంతు పిసికి చంపి ఆపై ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. రాజగోపాలనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఏమైనా జరగనీ.. – సీఎం వేదాంత ధోరణి
శివాజీనగర: ముఖ్యమంత్రి మార్పు గురించిన పద్మవ్యూహంలో మరో రోజు గడిచింది. హైకమాండ్ ఆదేశాల మేరకు తామిద్దరం నడుచుకొంటామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. తన చేతిలో ఏమీ లేదని, అంతా అధిష్టానం దయ అని డీసీఎం డీకే శివకుమార్కు ఈ రీతిలో స్పష్టం చేశారు. గత నెల 29వ తేదీన సీఎం సిద్దరామయ్య తన నివాసంలో శివకుమార్కు అల్పాహార విందు ఇవ్వడం తెలిసిందే. మళ్లీ హైకమాండ్ ఆదేశాలతో మంగళవారం శివకుమార్ తన ఇంట్లో సీఎంతో బ్రేక్ఫాస్ట్ విందు భేటీ జరిపారు. ఇద్దరూ సాదరంగా ఉంటూ ఐక్యతను ప్రదర్శించారు. అవిశ్వాసం పెడతారట సదాశివనగరలో ఉన్న శివకుమార్ ఇంటిలో అల్పాహారం సేవనం తరువాత సిద్దరామయ్య విలేకరులతో మాట్లాడారు, తాము ఎప్పటికీ కలసికట్టుగా ఉన్నామన్నారు. 8 నుంచి బెళగావిలో జరగబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 2 వారాల పాటు ఉంటాయి, అందులో వ్యవహరించడం గురించి చర్చించామని తెలిపారు. బీజేపీ,జేడీఎస్లు ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రవేశపెట్టవచ్చని తెలిసిందన్నారు. వారిని ఎదుర్కొవటానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు. మా ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట అని శివకుమార్ కూడా చెప్పారు. ప్రతిపక్షాలు ఏమి చేసినా సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. రాష్ట్రం సమస్యలు, రైతుల ఇబ్బందులపై చర్చించేందుకు డిసెంబర్ 8న ఢిల్లీకి వెళ్లి వస్తామని తెలిపారు. తదుపరి ఏమిటి? అల్పాహార భేటీలో ఉభయులు ఒక గంటకు పైగా మాట్లాడుకున్నారు. నాటు కోడి చారు, ఇడ్లీ రుచి చూశారు. డీకే సోదరుడు డీ.కే.సురేశ్, ఎమ్మెల్యే కుణిగల్ రంగనాథ్ ఉన్నారు. ఇద్దరికీ రెండు విందులు ముగిశాయి, ఇక హైకమాండ్ ఇచ్చే తదుపరి టాస్క్ ఏమిటనేది ఉత్కంఠగా మారింది. అసలైన సినిమా ముందుంది: బొమ్మై యశవంతపుర: సీఎం, డీసీఎం అల్పాహార విందులు టీజర్ మాత్రమే. అసలైన సినిమా మునుముందు విడుదల అవుతుంది.. అని బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హాస్యమాడారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కొన్నిరోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవుతుందన్నారు. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్లతో కాలం గడుపుతున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకొనేవారు కరువయ్యారు. ఒకరు సీఎం సీటును దక్కించుకోవడానికి, మరొకరు దానిని కాపాడుకోవడానికి య త్నిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఈ నాటకాలను బంద్ చేయాలని ప్రజలు కోరుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఎవరు, ఎక్కడ ఉంది?, రాష్ట్ర కాంగ్రెస్కు బాస్ ఎవరు? అని అన్నారు. నేనూ బ్రేక్ఫాస్ట్ విందు ఇస్తా: హోంమంత్రి సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్లు అల్పాహార విందుకు నన్ను పిలిచి ఉంటే వెళ్లేవాడినని హోంమంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. అవసరమైతే తాను వారిద్దరికీ బ్రేక్ఫాస్ట్ను ఇవ్వాలని నిర్ణయించిన్నట్లు చెప్పారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ అల్పాహారం ఆరగిస్తూ ఇద్దరితో మాట్లాడుతూ సలహాలను తీసుకుంటానని చమత్కరించారు. సిద్ధరామయ్య, శివకుమార్లు ఉల్లాసంగా ఉన్నారు. సీఎం పదవి గురించి ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. అనవసరమైన వదంతులను నమ్మవద్దన్నారు. కాగా, ప్రభుత్వం రాజకీయాలలో పడి రైతులను గాలికి వదిలేసిందని ధార్వాడలో బీజేపీ ర్యాలీ జరిపింది. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదంటూ ధార్వాడలో బీజేపీ ర్యాలీ మంగళవారం అల్పాహార విందు తరువాత సీఎం సిద్దు, డీసీఎం శివ శక్తికేంద్రం విధానసౌధ మీద అందరి కన్ను డిప్యూటీ సీఎం ఇంట సీఎం సిద్దుకు అల్పాహార విందు నాటుకోడి చారు, ఇడ్లీ ఆరగింపు ఆత్మీయంగా ఇద్దరు నేతలు ఇది కాంగ్రెస్ బిగ్బాస్ ఆట: అశోక్ శివాజీనగర: కాంగ్రెస్ నాయకుల కుర్చీ పంచాయితీ బిగ్ బాస్ షో మాదిరిగా ఉందని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ అన్నారు. బెంగళూరులో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ నాయకులు బిగ్ బాస్లో మాదిరిగా గొడవ గొడవ చేస్తున్నారు. కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడకపోతే ఆ భగవంతుడు మెచ్చుకోడని డీసీఎం డైలాగ్ కొడుతున్నారు. సీఎం సిద్దరామయ్య, తాను ఎవరికీ మాట ఇవ్వలేదని అంటున్నారు అని ఎద్దేవా చేశారు. మధ్యలో ట్వీట్ల యుద్ధం కూడా జరుగుతోందన్నారు. ఇది కాంగ్రెస్లో బిగ్బాస్ రియల్ షో, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, వేణుగోపాల్ దీని ప్రాయోజకులు. మంత్రులు సతీశ్ జార్కిహొళి, పరమేశ్వర్ వైల్డ్ కార్డు ఎంట్రీకి వేచి ఉన్నారు అని విమర్శించారు.సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల నడుమ రెండో అల్పాహార విందు భేటీ విజయవంతంగా జరిగింది. డీకే తనదైన ఆతిథ్యాన్ని సిద్దరామయ్యకు రుచి చూపించారు. ఇకనైనా సిద్దరామయ్య మెత్తబడి మాట నిలబెట్టుకుంటారని శివకుమార్ ఆశాభావంతో ఉండవచ్చు.శివాజీనగర: డీసీఎం ఇంట్లో ఆరగింపు చేసిన తరువాత సీఎం సిద్దరామయ్య వేదాంత ధోరణిలో మాట్లాడినట్లు తెలిసింది. విధానసౌధ కెంగల్ గేట్ వద్ద ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ, సీఎంను కలిసి ముచ్చటించారు. రాజకీయాలు ఎవరికీ శాశ్వతం కాదు, దేనినీ అంతగా పట్టించుకోను. ఇదేమీ మా తండ్రి ఆస్తి కాదు. దీని గురించి ఎక్కువగా ఆలోచించను. ఏమి జరుగుతుందో జరగనీ అని సిద్దరామయ్య చెప్పినట్లు తెలిసింది. దీనిని బట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా పాటించాలని సిద్దు తీర్మానానికి వచ్చినట్లు సమాచారం. -
ఎద్దుల బండిని ఢీకొన్న బస్సు
విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మండల పరిధిలోని పెద్ద కొట్టాలపల్లి సమీపంలో 42వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ప్రైవేట్ బస్సు ఎద్దుల బండిని ఢీకొట్టడంతో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందగా, అదే బండిపై ప్రయాణిస్తున్న రైతుకు తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. పెద్ద కొట్టాలపల్లి గ్రామానికి చెందిన ఎర్రిస్వామిరెడ్డి అనే రైతు తన ఎద్దుల బండిని తోలుకొని వ్యవసాయ పనుల నిమిత్తం మాళాపురం వైపు వెళ్తున్నాడు. అదే మార్గంలో వస్తున్న పీఎస్ఆర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అతివేగంగా దూసుకొచ్చి ఎద్దుల బండి ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు బండి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ పొలంలోకి ఎగిరి పడిపోయి ముక్కలై పోయింది. రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతు ఎర్రిస్వామి రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిని వ్యక్తిని స్థానికులు వెంటనే అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. రెండు ఎద్దులు, బండి కలిపి దాదాపు ఖరీదు రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని బంధువులు వాపోయారు. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సును సీజ్ చేశారు. ప్రమాదంలో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి తునాతునకలైన బండి, రైతుకు తీవ్ర గాయాలు -
హనుమజ్జయంతి వేడుకలు
మైసూరు: మైసూరు నగరంలోని ఇర్విన్ రోడ్డులోని ప్రఖ్యాత శ్రీపంచముఖి ఆంజనేయస్వామివారి ఆలయంలో సోమవారం హనుమజ్జయంతి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు విద్వాన్ ఎస్.కృష్ణమూర్తి, బృందం లోక కళ్యాణం కోసం హోమాలు, పూజలు జరిపించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.బంధువు వంచన.. తల్లయిన బాలిక తుమకూరు: జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని హులియారు దుర్గలో సుమారు 16 సంవత్సరాల బాలిక గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు కారణమైన బాలిక బంధువు మల్లేష్ (45)పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి మల్లేష్ తరచూ అత్యాచారానికి పాల్పడేవారు. దీంతో బాలిక గర్భవతైంది. ఆగస్టులో బాలిక అనారోగ్యానికి గురికాగా తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. బాలిక గర్భవతి అని వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి ఎవరికీ చెప్పకుండా ఉంచారు. నవంబర్ 18వ తేదీన బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో అందరికీ తెలిసింది. తల్లిదండ్రులు హులియారు దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుని కోసం గాలించి ఇప్పటికి అరెస్టు చేసి జైలుకు తరలించారు. దత్త జయంతికి పటిష్ట భద్రత సాక్షి బెంగళూరు: నవంబర్ 26న ప్రారంభమైన చిక్కమగళూరు తాలూకా దత్త గిరులలో దత్త జయంతి, దత్త మాలా అభియాన్ వేడుకలు చివరి దశకు చేరుకున్నాయి. మంగళవారం సుమారు 2–3 వేల మంది మహిళలతో నగరంలో శోభాయాత్ర జరగనుంది. దత్త పీఠానికి ర్యాలీగా వెళ్లి అనుసూయ దేవిని పూజించి, జయంతిని నిర్వహించనున్నారు. బుధవారం చిక్కమగళూరు నగరంలో దత్త భక్తులు, వేలాది మంది ప్రజలు భారీ శోభాయాత్రలో పాల్గొంటారు. గురువారం చివరి రోజు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులు దత్తపాదుక దర్శనం చేసుకోనున్నారు. అల్లర్లు వంటివి జరగకుండా జిల్లావ్యాప్తంగా సుమారు 6 వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. 500కు పైగా సీసీటీవీ కెమెరాలు, 25కు పైగా డ్రోన్లలను సిద్దం చేశారు. ఎస్పీ విక్రమ్ అమట నేతృత్వంలో సోమవారం చిక్కమగళూరులో కవాతు జరిపారు. రూ.8 కోట్ల చలానాల వసూలు శివాజీనగర: ట్రాఫిక్ ఉల్లంఘన చలానాల చెల్లింపులో సగం రాయితీ ఇవ్వడంతో రాష్ట్రంలో మంచి స్పందన వ్యక్తమైంది. గత 10 రోజులలో రూ.8 కోట్లకు పైగా జరిమానాలు వసూలయ్యాయి. 2,82,793 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు పరిష్కారమయ్యాయి. డిసెంబర్ 12 వరకు రాయితీ సౌలభ్యం ఉంది. బెంగళూరుతో సహా అన్ని నగరాలు, పట్టణాలలో వాహనదారులు చెల్లింపులు చేశారు. వరుసగా క్యాబ్లు ఢీ దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టు ఆవరణలో క్యాబ్లు వరుసగా ఢీకొన్నాయి. సెక్యూరిటీ పాయింట్ వద్ద ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులు హడలిపోయారు. ముందు వెళ్తున్న క్యాబ్ సడన్గా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న క్యాబ్లు దానిని ఢీకొన్నాయి. పలు కార్ల ముందు, వెనుక భాగాలు ధ్వంసమయ్యాయి. ఎవరికీ హాని కలగలేదు. సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని నిలిచిపోయిన కార్లను దూరంగా తరలించారు. ఈ సంఘటనతో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.దత్తపీఠంలో గీతా జయంతి మైసూరు: భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ప్రతి మాటను అనుసరిస్తూ ముందుకు సాగాలని మైసూరు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు సూచించారు. సోమవారం గీతా జయంతి వేడుకలను నిర్వహించారు. భగవద్గీత పారాయణం, బంగారు పతకం ప్రదానోత్సవం నిర్వహించారు. మన పూర్వీకులు భగవద్గీతను జీవితంలో భాగంగా చేసుకున్నారని, సంపన్నులు, మహాత్ములు భగవద్గీతను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేవారని చెప్పారు. -
దంపతులను బలిగొన్న పొగమంచు
తుమకూరు: పొగమంచులో దారి కనిపించక కారు డివైడర్ను ఢీకొని అదుపు తప్పి పల్టీలు కొట్టింది, ఈ దుర్ఘటనలో కారులోని భార్యాభర్తలు అక్కడే మరణించారు. జిల్లాలోని మధుగిరి తాలూకాలోని జడగొండనహళ్ళి వద్ద బెంగళూరు హైవేలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పొరుగునే ఏపీలో ఉన్న మడకశిర తాలూకాలోని గుండంపల్ళివాసులు కృష్ణారెడ్డి (45), జ్యోతి (42) చనిపోగా, కుమారుడు మధుసూదన్రెడ్డి (17), బంధువు చిదంబరెడ్డి (45) తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నగరంలోని డాన్బాస్కో పాఠశాలలో జ్యోతి ఉద్యోగి. భర్త కూడా బెంగళూరులోనే ఉండేవారు. ఓ జాతరకు సొంతూరికి వెళ్లి కుటుంబంతో కలిసి తిరిగి బెంగళూరుకు వెళ్తుండగా దట్టంగా కమ్ముకున్న పొగమంచులో ముందు దారి కనిపించక ప్రమాదం జరిగింది. కృష్ణారెడ్డి స్వగ్రామంలో వైఎస్సార్సీపీ వార్డుమెంబరు కావడంతో మృతదేహాలకు పెద్దసంఖ్యలో నేతలు, జనం నివాళులు అర్పించారు. దారి కానరాక కారు బోల్తా తుమకూరు జిల్లాలో ప్రమాదం -
వేధిస్తున్న నకిలీ విత్తనాల బెడద
రాయచూరు రూరల్: ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతుల ముఖాల్లో కళ లేదు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాలు కరువు ప్రాంతాలుగా మారాయి. రాయచూరు, కొప్పళ జిల్లాల్లో నదుల్లో నీరు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో కృష్ణా, భీమా నదులున్నా నీరందక రైతుల భూముల్లో వేసుకున్న జొన్న పంట వాడుముఖం పట్టింది. పొలంలో బోరుబావుల ద్వారా పంటలు పండించాలంటే భూగర్భ జలాల నీటిమట్టం కుదించుకుపోయింది. మరో వైపు విద్యుత్ కోతలు అధికమయ్యాయి. రాయచూరు జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదులున్నా వ్యవసాయ పనులు లభించక దేశాటన తప్పడం లేదు. మరో వైపు నకిలీ విత్తనాలను పొలంలో వేసిన రైతులు జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో జొన్న, లక్షా 50 వేల ఎకరాల్లో పత్తి, 1.86 లక్షల ఎకరాల్లో మిరప పంటలు వేశారు. ఈ ప్రాంతాల నుంచి ఎన్నికై న ప్రజా ప్రతినిధులు మౌనం వహించారు. అధికారం కోసం తహతహలాడే నేతలు రైతన్నలు పడుతున్న బాధలను తీర్చడంలో మౌనం వహిస్తున్నారు. ఏడు జిల్లాల నుంచి 1963 విత్తన నమూనాలను పరీక్షలకు పంపారు. వాటిలో 63 కంపెనీల విత్తనాలు నాసిరకమని బయట పడ్డాయి. విజయ నగర జిల్లాలో 30 కంపెనీల విత్తనాలు నాసిరకంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. కొప్పళ జిల్లాలో 287 రకాల విత్తనాల్లో 13 కంపెనీలు నాసిరకం, బళ్లారి జిల్లాలో 359 రకాల విత్తనాల్లో 30 కంపెనీలు నాసిరకం, రాయచూరు జిల్లాలో 242 రకాల విత్తనాల్లో 4 కంపెనీలు నాసిరకం, కలబుర్గి జిల్లాలో 251 రకాల విత్తనాల్లో 1 కంపెనీ నాసిరకం, యాదగిరి జిల్లాలో 146 రకాల విత్తనాల్లో 3 కంపెనీలు నాసిరకం, బీదర్ జిల్లాలో 288 రకాల విత్తనాల్లో 6 కంపెనీలు నాసిరకమైనవని తేలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 లక్షల ఎకరాల్లో జొన్న పంటకు నష్టం దిక్కుతోచని స్థితిలో కళ్యాణ కర్ణాటక ప్రాంత రైతులు -
గాలితో మంచినీటి ఉత్పత్తి
యంత్రానికి విద్యుత్ సరఫరా కోసం అమర్చిన సోలార్ ప్యానల్ దావణగెరెలోని బీఐఈటీ కళాశాల ప్రధాన ద్వారం గాలిని బిగబట్టి నీటి ఉత్పత్తి చేసే స్మార్ట్ అట్మాస్పియర్ సిస్టం హుబ్లీ: గాలిని బిగబట్టడం ద్వారా నీటిని సేకరించే వినూత్న ప్రత్యేక యంత్ర పరికరాన్ని దావణగెరెలోని బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(బీఐఈటీ) సంస్థ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైనింగ్ విభాగం విద్యార్థులు కనుగొన్నారు. ఇది రాష్ట్రంలో అరుదైన ప్రాజెక్ట్గా గుర్తింపు పొందింది. ఈ నీరు తాగడానికి చాలా బాగుండటంతో ఈ ఆవిష్కరఫ విజయవంతమైందని చెబుతున్నారు. నీటిని సేకరించే యంత్రాన్ని ఆ కళాశాల తొలి అంతస్తులో సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ను తీర్చిదిద్దడంలో విద్యార్థులు, సంబంధిత సిబ్బంది, ఆధ్యాపక బృందంతో పాటు ప్రొఫెసర్ల పాత్ర కీలకం అని చెబుతన్నారు. గాలి నుంచి సేకరించిన ఈ నీటిని శుద్ధీకరించకుండా సేవించవచ్చు. ఈ యంత్ర పరికరం తయారీకి మూడు నెలలు పట్టింది. ఏడారి, అటవీ ప్రాంతంలో ఈ పరికరం ఎంతో ప్రయోజనకారి కానుంది. ఉత్పత్తి చేసే నీటిలో మినరల్స్ ఉండటంతో సేవించడానికి యోగ్యమైనవని ప్రొఫెసర్లు, విద్యార్థులు తెలిపారు. యంత్రం పేరు స్మార్ట్ అట్మాస్పియర్ సిస్టం ఈ యంత్రం పేరు స్మార్ట్ అట్మాస్పియర్ సిస్టం. ఇందులో మూడు ఫ్యాన్లు తిరుగుతుంటాయి. ఎత్తైన కట్టడం పైనుంచి వచ్చే తీవ్ర గాలులను ఈ సిస్టంలో సేకరిస్తారు. విద్యుత్ సరఫరా కోసం సోలార్ను అమర్చారు. ఈ నీటిని రక్షిత మంచి నీటిగా గుర్తించినట్లు నివేదిక తేటతెల్లం చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైనింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ గురించి ఇలా వివరించారు. ప్రస్తుతం స్వల్ప ప్రమాణంలో ప్రయోగాత్మకంగా వస్తువులను వాడాం. దీంతో నీరు తక్కువ ప్రమాణంలో సేకరణ అవుతోంది. దీన్ని పెద్ద ప్రమాణంలో చేయవచ్చు. ఈ నీటిని పరీక్షకు పంపాం. దీని ద్వారా నీరు పరిశుద్ధమైనదని నివేదిక వచ్చింది. ఈ విషయంలో పరిశ్రమల యజమానుల మద్దతు కావాలి. తీవ్రంగా గాలి వీచే ప్రాంతంలో అధిక నీటిని సేకరించవచ్చన్నారు. గాలి నుంచి నీటి సేకరణకు వాడే వస్తువులు తక్కువ ధరకే లభిస్తే ఇక ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇకపై నీటి సమస్య పరిష్కారం విద్యార్థుల పరిశోధనలకు ఫలితం దక్కాలంటే విరివిగా పరిశ్రమలు తరలి రావాలని ఇక్కడి ప్రొఫెసర్లు అభిప్రాయ పడ్డారు. రోజుకు 8–10 లీటర్ల నీరు ఉత్పత్తి అవుతుందని ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు. గాలిలో తేమశాతం ఉండే ఉంటుంది. అటవీ ప్రాంతాలు, ఎడారుల్లో నీరు లభించక పశుపక్షాదులు, జంతువులు చనిపోతాయి. దీంతో గాలిలో నీటిని ఎందుకు ఉపయోగించరాదన్న జిజ్ఞాసతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టాం. ఇంతకు ముందు హైడ్రో ప్యానల్స్ ద్వారా తయారు చేయాలనుకున్నాం. అయితే ఖర్చు ఎక్కువగా అవుతుండటం వల్ల అందుకు బదులుగా సోలార్ ప్యానల్, కండెన్సర్, బ్లోవర్, హీటర్లను వాడి గాలిలో నీటిని బిగబట్టి ఈ క్రమంలో నీటిని పరివర్తన చేశామని ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థి ఽశశాంక్ మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారం కోసం ఈ ప్రాజెక్ట్ చేపట్టాలన్న సంకల్పంతో ఇలాంటి ఆలోచన(ఐడియా) తట్టింది. దీన్ని సిద్ధం చేయడానికి 2, 3 నెలలు కష్టపడ్డామన్నారు. ప్రస్తుతం తగిన ఫలితం దక్కడంతో సంతోషంగా ఉందన్నారు. హీట్వేవ్ గాలుల ద్వారా నీటిని ఉత్పత్తి చేస్తున్నాం. దీనికి 2, 3 వ్యాట్ల విద్యుత్ అవసరం అవుతుందన్నారు. అయితే మేం సోలార్ విద్యుత్ను వినియోగిస్తున్నట్లు మరో విద్యార్థి ప్రాజెక్ట్ గురించి తెలిపారు. వినూత్నంగా రోజుకు 8 నుంచి 10 లీటర్ల నీరు తయారీ దావణగెరె బీఐఈటీ సంస్థ విద్యార్థుల సరికొత్త ఆవిష్కరణ -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
కేజీఎఫ్: చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని బీఈఎంఎల్ కేజీఎఫ్ కాంప్లెక్స్ ప్రముఖుడు జి.యోగానంద అన్నారు. నగరంలోని బెమెల్ కేజీఎఫ్ కాంప్లెక్స్లో స్వచ్ఛతాపక్వాడా కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్వచ్ఛత అనేది కేవలం పని కాదని.. అది వ్యక్తిగత బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్నేహితులు, ఇంటి పరిసరాల్లో ఉన్నవారికి శుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ సంపన్మూల విభాగం ప్రముఖుడు నీనాసింగ్, బీఈఎంఓజీ అధ్యక్షుడు సుబ్రమణి, రామచంద్రారెడ్డి, తిరుముగం, పదాధికారులు, కార్య నిర్వాహకులు పాల్గొన్నారు. -
పేదలు వైద్య శిబిరాల లబ్ధి పొందాలి
రాయచూరు రూరల్ : పేదలు ఉచిత వైద్య పరీక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విధాన పరిషత్ సభ్యుడు శరణేగౌడ బయ్యాపుర పిలుపునిచ్చారు. సోమవారం లింగసూగూరులోని గడియారం సర్కిల్లో అంజుమ్ ఏ ముస్లిం సంస్థ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్, టిప్పుసుల్తాన్ జయంతి, పైగంబర్ జయంతుల సందర్భంగా సప్తగిరి ఆస్పత్రి జట్టు నుంచి ఏర్పాటు చేసిన శిబిరం ద్వారా పేదలకు ఆర్థిక భారం తగ్గించినట్లు అవుతుందన్నారు. గుండెపోటు, క్యాన్సర్, మూల వ్యాధి, మూత్ర పిండాలు, కీళ్లు, మోకాళ్ల నొప్పులు, ముక్కు, గొంతు, చెవిలకు ఆరోగ్య పరీక్షలు, రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పంచ గ్యారెంటీల అమలు సమితి జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి, నగర యోజన ప్రాధికార అధ్యక్షుడు భూసన గౌడ, కమిటీ సభ్యులున్నారు. ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలి రాయచూరు రూరల్: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు విద్యా రంగం పునాది కావాలని శివ కుమారస్వామి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని రామలింగేశ్వర ఆలయంలో జనని కళా సాంస్కృతిక బళగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా చిగురు కార్యక్రమాన్ని తబలా వాయించి మాట్లాడారు. పిల్లల సంక్షేమ కోసం పాటు పడాలన్నారు. ప్రతిభకు తగ్గట్టుగా భవిష్యత్తును రూపొందించుకోవాలన్నారు. పిల్లలకు సంప్రదాయం, ఆచార విచారాల గురించి నేర్పాలన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి, విరుపాక్షయ్య స్వామి, వీరేష్, నాగరాజ్లున్నారు. వేడుకగా లక్ష దీపోత్సవం రాయచూరు రూరల్: తాలూకాలోని దేవసూగూరులో సూగూరేశ్వర లక్ష దీపోత్సవం వేడుకగా జరిగింది. ఆదివారం రాత్రి దేవసూగూరు ఆలయంలో రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎస్ఎన్ఆర్ ఆస్పత్రి తనిఖీ కోలారు: నగరంలోని ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులకు అందించే సేవలు, మందుల పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఉదయం రక్త పరీక్షకు ఇస్తే మధ్యాహ్నం మూడు గంటలకు రిపోర్టు ఇస్తారని రోగులు ఫిర్యాదు చేయగా.. రిపోర్టులు త్వరగా అందేలా చూడాలని డాక్టర్ జగదీష్కు ఎమ్మెల్యే సూచించారు. తనకు పింఛను రావడంలేదని వృద్ధురాలు ఫిర్యాదు చేయగా. అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫించన్ అందేలా చూడాలని సూచించారు. ప్రాంగణంలో అనధికార దుకాణాలు తెరచి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చక్కటి పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటుచేయాలని సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని సూచించారు. పాలనావేత్త కెంగల్: సీఎం శివాజీనగర: విధానసౌధ ఆవరణలో సోమవారంమాజీ ముఖ్యమంత్రి కెంగల్ హనుమంతయ్య విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా సీఎం సిద్దరామయ్య నివాళులు అర్పించారు. హనుమంతయ్య ఉత్తమ పరిపాలనావేత్త. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తీవ్ర సమస్యలకు పరిష్కారం కనిపెట్టారన్నారు. విధానసౌధ నిర్మాణానికి హనుమంతయ్య పునాది వేశారన్నారు. ప్రభుత్వ పని దేవుని పని అంటూ విధానసౌధపై రాయించిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్గాంధీపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయుల గైర్హాజరుపై ధర్నా రాయచూరు రూరల్ : ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయుల గైర్హాజరు, ఆలస్యంగా విధులకు వస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు పూనుకున్నారు. సోమవారం యాదగిరి జిల్లా వడగేర తాలూకా కొంకల్లో విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి గేట్ ముందు భాగంలో నిరవధిక ధర్నా చేపట్టారు. పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా పాఠ్యాంశాలు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. 258 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నలుగురు అతిథి ఉపాధ్యాయులున్నా ఫలితం లేదని, అలాంటి వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
స్థాయి సమితి అధ్యక్ష స్థానం బీజేపీ కై వసం
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె నగరసభ స్థాయి సమితి నూతన అధ్యక్షుడుగా 14వ వార్డు బీజేపీ సభ్యుడు శరవణన్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ఉన్న 35 వార్డుల్లో నెలకొన్న సమస్యలను అరికట్టేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా నగరంలో అనేక వార్డుల్లో వర్షం వస్తే డ్రైనేజీలో నీరు చేరడంతో నిండిపోయి కాలనీలోకి ప్రవహిస్తోందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతానన్నారు. అనంతరం నగరసభ అధ్యక్షులు రూపేష్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే గవియప్ప రూ.10 వేల కోట్ల పనులను ప్రజాపనుల శాఖకు అందించి నగరసభ అభివృద్ధికి మొండిచేయి చూపించారని ఆరోపించారు. నగరసభ ఉపాధ్యక్షులు జీవరత్నం, బీజేపీ నేత సందీప్ సింగ్, నగరసభ సభ్యులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి సాక్షి,బళ్లారి: కంప్లి– సిరుగుప్ప రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. సోమవారం కెంచనగుడ్డకు చెందిన శివకుమార్(17), శ్రీకాంత్(18) అనే యువకులు కెంచనగుడ్డ గ్రామం నుంచి మణ్ణూరుకు బయల్దేరారు. మార్గమధ్యంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందకు పడి పోవడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. మరొకరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనతో మృతుల కుటుంబాలతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై తెక్కలకోటె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామాలకు మరిన్ని బస్సులు నడుపుతాం రాయచూరు రూరల్: రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని బస్సు సర్వీసులను నడుపుతామని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ పేర్కొన్నారు. సోమవారం దేవదుర్గ బస్టాండ్లో ఆమె దేవదుర్గ–పుణె బస్సు సర్వీసును ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి దేవదుర్గ డిపోకు మరిన్ని బస్సులను సమకూర్చాలని ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రిని కోరగా దేవదుర్గకు కొత్తగా 20 బస్సులను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారన్నారు. ధర్మస్థల, ధార్వాడలకు కొత్త స్లీపర్ బస్సులను నడుపనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా శరణప్ప బళి, రంగణ్ణ పాటిల్, శిఖ రేషి, అయ్యణ్ణ, కృష్ణప్ప, నాగరాజ్ పాటిల్, మహదేవప్ప గౌడ, గౌరిలున్నారు. త్వరలో 600 ఆర్టీసీ బస్సుల కొనుగోలు రాయచూరు రూరల్ : కళ్యాణ కర్ణాటక భాగంలో 600 ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు శ్రీకారం చుట్టామని కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ మండలి అధ్యక్షుడు అరుణ్ కుమార్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం లింగసూగూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి బస్సుల కొనుగోలుకు అనుమతి లభించిందన్నారు. లింగసూగూరు పరిధిలో 133 రూట్లు ఉన్నాయన్నారు. బస్టాండ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. బస్ చార్జీల పెంపు విషయంలో ఇతర మండళ్లతో పోల్చితే తక్కువ ఉన్న విషయంపై అధికారులతో చర్చిస్తామన్నారు. లారీ ఢీకొని తండ్రీకొడుకు దుర్మరణంరాయచూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన నగర పరిధిలోని యరమరస్ బైపాస్ రోడ్డులో సోమవారం చోటు చేసుకుంది. మృతులను యరమరస్కు చెందిన నరసప్ప(65), రమేష్(35)లుగా పోలీసులు గుర్తించారు. హీరోహోండా ద్విచక్రవాహనం వద్ద మొబైల్ ఫోన్లో మాట్లాడుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీ అదుపు తప్పి ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు. -
ఎయిడ్స్ మహమ్మారిపై జాగృతి
సోమవారం బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఎయిడ్స్ జాగృతి ర్యాలీ ఎయిడ్స్ చిహ్నంలో ఏర్పడిన విదార్థులు బొమ్మనహళ్లి: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో ఎయిడ్స్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు ముఖానికి వినూత్నంగా అలంకరించుకుని ర్యాలీలో పాల్గొన్నారు. పలు సర్కిళ్ల గుండా ర్యాలీ సాగింది. అవగాహన ముఖ్యం చింతామణి: నేటి యువత ఎయిడ్స్ పట్ల జాగృతి కలిగి ఉండాలని లాయర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట లాయర్ల సంఘం, ఆరోగ్యశాఖ ద్వారా ఎయిడ్స్ వ్యతిరేక ర్యాలీ సాగింది. హెచ్ఐవీ, ఎయిడ్స్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తాలూకా ఆరోగ్యాధికారి రామచంద్రారెడ్డి, వకీళ్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలా ఆ ఇద్దరి తీరు
సాక్షి,బళ్లారి: రష్యా, ఉక్రెయిక్ మధ్య జరిగిన యుద్ధానికి విరామం ఏ విధంగా జరిగిందో, మళ్లీ మూడు నెలల తర్వాత బాంబులు వేసుకున్నారని, అదే తరహాలో సీఎం కుర్చీ కోసం ఈ ఇద్దరి మధ్య మళ్లీ రాజకీయ సమరం జరిగే అవకాశం ఉందని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. రెండున్నరేళ్ల సీఎం పదవి కోసం సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మధ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్తో కదన విరామం జరిగిందని, అయితే వారిద్దరి మధ్య మళ్లీ ఏ సందర్భంలోనైనా అసమ్మతి నెలకొనే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఓ వైపు సీఎం, డీసీఎంలు పాలనను గాడిలో పెట్టకుండా కుర్చీ కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర కర్ణాటక పరిధిలో రైతులు అతివృష్టి, అనావృష్టితో సతమతవుతున్నా ఇదేమీ వారికి పట్టడం లేదన్నారు. అభివృద్ధి పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నాయకత్వ మార్పిడి గురించే ఆలోచన చేస్తున్నారన్నారు. కొందరు సీఎంకు మద్దతుగా, మరికొందరు డీసీఎంకు మద్దతుగా ఎవరికి వారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసమ్మతితో రాజకీయం మళ్లీ ఎప్పుడైనా పూర్తిగా విజృంభిస్తుందన్నారు.


