Karnataka News
-
నేత్రపర్వం.. మహా రథోత్సవం
బళ్లారిఅర్బన్: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో చేళ్లగుర్కిలో వెలసిన శ్రీఎర్రితాత మహా రథోత్సవం ఆదివారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. ప్రతి ఏటా ఆనవాయితీ మాదిరిగా మహా రథోత్సవం ఈ ఏడాది కూడా సప్త భజనలతో ప్రారంభమై ఎర్రితాతకు వెండి ఆభరణాలు, పూలతో అలంకరణ పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం మహా రథోత్సవం సందర్భంగా ఆలయంలో అగ్ని దీపాలతో భక్తులు 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. మహా రథోత్సవంలో వివిధ సాంస్కృతిక కళా బృందాలు పాల్గొని అందరినీ ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పైళ్లెన కొత్త జంటలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి వేలాది మంది భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. చేళ్లగుర్కి ఎర్రితాతకు ఆభరణాల అలంకరణ వేలాదిగా పాల్గొన్న చుట్టుపక్కల భక్తులు -
జొన్నల కొనుగోలు కోసం రాస్తారోకో
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో పండించిన జొన్నలను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం సింధనూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది రైతులతో కలిసి చేపట్టిన రాస్తారోకోను ఉద్దేశించి సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు. అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు కేంద్రాలను బంద్ చేసి జొన్నల కొనుగోళ్లను నిలిపివేయడాన్ని తప్పుబట్టారు. రైతులు మార్కెట్కు తెచ్చిన జొన్నలు కొనుగోలు చేయాలని విన్నవించినా అధికారులు బేఖాతరు చేశారన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు లేకపోవడం, ఆ కేంద్రాలను మూసివేయడాన్ని ఖండించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఓపీఎస్ కల్పించాలి రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ వ్యవస్థ(ఓపీఎస్)ను కల్పించాలని అఖిల కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల వేదిక అధ్యక్షుడు జై కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు వ్యతిరేకంగా ఉందన్నారు. పాత పింఛన్ పద్ధతికి బదులుగా నూతన పింఛన్ పద్ధతి అమలుతో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 లక్షల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయాలని కోరారు. అనుచిత వ్యాఖ్యలపై నిరసన బళ్లారిఅర్బన్: కన్నడ భాషను అవమానిస్తూ మాట్లాడిన తమిళ నటుడు కమల హాసన్ సినిమా థగ్లైఫ్ను రాష్ట్రంలో విడుదల చేయరాదని కన్నడ రక్షణ వేదిక నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం రాయల్ సర్కిల్లో వేదిక శివరామగౌడ బణ జిల్లాధ్యక్షుడు కురిహట్టి రాజశేఖర్ ఆధ్వర్యంలో డాక్టర్ మహేశ్వర స్వామి, కరవే పదాధికారులు పాల్గొని నిరసన తెలిపారు. కన్నడ భాషను అవమానించిన కమల హాసన్ తక్షణమే కన్నడిగులకు క్షమాపణ చెప్పాలన్నారు. కరవే పదాధికారులు కట్టిగె సూరి, సుంకన్న పాల్గొన్నారు. రాయచూరు రూరల్: తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని సినీ నటుడు కమల హాసన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరవే ఆందోళన చేపట్టింది. ఆదివారం రంగమందిరం వద్ద చేపట్టిన ఆందోళనలో కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడారు. నటుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. కాగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నటుడి చిత్రపటంపైకి కరవే కార్యకర్తలు గుట్కాను ఉమ్మి తమ నిరసన తెలిపారు. ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలి రాయచూరు రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలకు కమిషనరేట్తో పాటు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లాధ్యక్షుడు శ్రీశైల నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నవోదయ, మొరార్జి దేశాయి, రాణి కిత్తూరు చెన్నమ్మ, మైనార్టీ పాఠశాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. జీఎఫ్, పీఎఫ్లను కూడా మంజూరు చేయాలని కోరారు. కన్నడ భాషను ప్రోత్సహించాలిరాయచూరు రూరల్ : నగర, పట్టణ ప్రాంతాల్లో కన్నడ భాషను ప్రోత్సహించాలని కరవే అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ పిలుపునిచ్చారు. ఆదివారం కన్నడ భవనంలో కన్నడ భాష కార్యకర్తల శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భాషలో నేటికీ తెలుగు, కన్నడలు కలిపి వ్యాఖ్యానించడం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తహసీల్దార్ సురేష్ వర్మ, జైలర్ అనిత, వీర హనుమాన్, మ్యాదర్, బషీరుద్దీన్ హొసమని, కృష్ణ, నిజాముద్దీన్, రామలింగప్పలున్నారు. -
ఇకపై చెత్త నిర్వహణ బాధ్యత ప్రైవేట్కు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ జంట నగరాలు పెరుగుతున్న చందంగానే సిటీ కార్పొరేషన్లో చెత్త సేకరణ, నిర్వహణ పెను సవాల్గా మారింది. జంట నగరాల్లో నిత్యం వందలాది టన్నుల చెత్త సేకరిస్తారు. దీని నిర్వహణకు పాలికె కొత్త మార్గానికి శ్రీకారం చుట్టింది. ఆ రోజు చెత్తను ఆరోజే నిర్వహణ చేసేలా బాధ్యతలను ప్రైవేట్ వారికి అప్పగిస్తూ పాలికె నిర్ణయం తీసుకుంది. ఇది తొలి ప్రయత్నంగా చెబుతున్నారు. జంట నగరాల్లో చెత్త నిర్వహణ సమర్థవంతంగా లేదు. దీంతో ఎక్కడ చూసినా పర్వతాల్లా చెత్త కుప్పలే కనిపిస్తుంటాయి. ఎన్నో దశాబ్దాల నుంచి చెత్త గుట్టలను కరిగించడానికి సాధ్యం కాక వాటిని బయో మైనింగ్ చేస్తున్నా అటు ధార్వాడ, హొసయల్లాపుర, అలాగే హుబ్లీ కార్వార రోడ్డులో చెత్త రాశులు పేరుకు పోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రాశులు తరగడం లేదు. ప్రస్తుతం దీన్ని బయో మైనింగ్ ద్వారా కరిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కొద్ది మేర సత్ఫలితాన్ని సాధించారు. రోజూ 500 టన్నుల చెత్త సేకరణ ఈ నేపథ్యంలో ప్రతి రోజు హుబ్లీలో 300 టన్నులు, ధార్వాడలో 150 టన్నులు మొత్తం కలిపి 450 నుంచి 500 టన్నుల చెత్త సేకరణ అవుతోంది. దీని నిర్వహణ పాలికెకు క్లిష్టంగా మారింది. బయో మైనింగ్ ద్వారా ఇంతకు ముందు సేకరించిన చెత్తను కరిగించినా కూడా ప్రతి రోజు 450 టన్నుల చెత్త సేకరణ అవుతూనే ఉంది. దీంతో చెత్త కరిగిన చందంగానే పెరుగుతోంది కూడా. రోజు సేకరించే చెత్తను శాసీ్త్రయంగా నిర్వహణ చేయాలని పాలికె సంకల్పించింది. ఇదే విషయాన్ని తమ సలహా, సూచనగా గ్రీనరీ ట్రిబ్యునల్ మండలి కూడా పేర్కొంది. కాగా రోజు పేరుకు పోయే 450 టన్నుల చెత్తను డంపింగ్ యార్డ్కు తరలిస్తారు. దీన్ని ఆ రోజే యార్డ్లో చెత్త పడగానే ఉన్న చెత్త సంస్కరణ పూర్తి కావాలన్న షరతుతో ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించారు. తడి, పొడి చెత్తను ప్రత్యేకించి డంపింగ్ యార్డ్లో వేస్తారు. ఇందులో పొడిచెత్తను సేంద్రీయ ఎరువుగా సంస్కరిస్తారు. అలాగే పొడి చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపడానికి అనువుగా సంస్కరించి సేకరించి పెడతారు. ఏడాదిపాటు ప్రైవేట్ వారికి కాంట్రాక్ట్ ఈ మేరకు ఓ ఏడాది పాటు ఈ చెత్త నిర్వహణ యూనిట్ను ప్రైవేట్ వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సంబంధిత యూనిట్ పాలికె ఇంజినీర్ సంతోష్ యర్రంగళి మీడియాకు తెలిపారు. హుబ్లీలో 300 టన్నుల సామర్థ్యం గల యూనిట్, ధార్వాడలో 150 టన్నుల సామర్థ్యం గల యూనిట్లు ఉన్నాయి. ఆ రోజు చెత్త ఆ రోజే సంస్కరణ చేస్తే ఎటువంటి చెత్త సమస్య తలెత్తదు. దీంతో రోజు ఉత్పత్తి అయ్యే రెండు ప్లాంట్లలో నిర్వహణకు నిర్ణయించారు. ఆ మేరకు హుబ్లీలోని 300 టన్నుల సామర్థ్యం గల యూనిట్ నిర్వహణను రూ.9 కోట్లకు, అలాగే ధార్వాడ చెత్తను రూ.6 కోట్ల టెండర్కు ఇవ్వడానికి ప్రతిపాదించారు. ఈ విషయమై పాలికె సాధారణ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపుతాం. అక్కడి నుంచి అనుమతి లభించిన తర్వాత టెండర్లు పిలుస్తామన్నారు. మొత్తం మీద 30–40 ఏళ్లుగా వేధిస్తున్న ఈ చెత్త నిర్వహణ పెను సమస్యకు ఇప్పటికై నా పరిష్కారం లభిస్తే అదే పది వేలు అని జంట నగరాల వాసులు అభిప్రాయపడ్డారు. ఏ రోజు చెత్త ఆరోజే సేకరణ, నిర్వహణ హుబ్లీ–ధార్వాడ మహానగర పాలికె నిర్ణయం -
ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులకు ఉత్తేజం
బళ్లారిటౌన్: విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు ఇవ్వడం వల్ల వారిని ఉత్తేజ పరిచినట్లు అవుతుందని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎస్ఎన్ రుద్రేష్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని పత్రికా భవనంలో కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేపట్టిన ఎస్ఎస్ఎల్సీ, ద్వితీయ పీయూసీల్లో ప్రతిభ కనబరిచిన విలేకరుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలను అందజేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్కు పేష్వా చేసిన సహాయంతో దేశ రాజ్యాంగాన్ని రచించేలా ఎదిగారని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్న విద్యార్థులకు కొంత ప్రోత్సాహ ధనం ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేకే ట్రస్ట్ నేత జోళదరాశి తిమ్మప్ప మాట్లాడుతూ డబ్బును దొంగలు దోచుకుపోవచ్చు కానీ విద్యను ఎవరూ దోచుకోలేరని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్.వీరభద్రగౌడ, అడహక్ కమిటీ సభ్యులు కే.మల్లయ్య పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు దివ్యశ్రీ, కాంచన, నాగాంబిక, అశ్విత చౌదరి, కార్తీక్, సంజన, హేమంత్కుమార్, యశ్వంత్కుమార్లకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. -
హావేరి జిల్లాలో అధికం
వ్యవసాయం చేయాలని అందరికీ మక్కువ. కొందరికి హాబీ అయితే చాలామంది అదే జీవనాధారమైన అన్నదాతలు. కానీ రైతుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కలిసిరాని రుతుపవనాలు, అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి. విత్తనాలు, ఎరువులు, కూలీలకు విపరీతమైన ఖర్చులు. పంట పండినా దక్కని లాభం ఇలాంటివి కర్షకులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. కుటుంబం మొత్తం కష్టించినా ప్రతిఫలానికి గ్యారెంటీ లేదు.. కొప్పళ వద్ద పొలం పనులు సాక్షి, బెంగళూరు: గత ఏడాది మంచి వర్షాలు పడినా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గలేదు. ప్రభుత్వ ఐదు గ్యారెంటీలు అమలవుతున్నా రైతుల బలవన్మరణాలు ఆగడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ రెండేళ్ల అధికారాన్ని పూర్తి చేసుకుంది. అయితే ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది 2024–2025 ఆర్థిక ఏడాదిలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వ్యవసాయంలో వచ్చిన నష్టాలు, అప్పుల ఊబిలో చిక్కుకుని రైతులు మరో మార్గం లేక ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే వరకు మొత్తం 983 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లాధికారులతో సీఎం సిద్దరామయ్య గత రెండురోజులు నిర్వహించిన ప్రగతి పరిశీలన సమావేశంలో తేల్చారు. పరిహారంలోనూ కోత నిబంధనల ప్రకారం రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. కానీ అధికారులు ఏదో సాకుతో తగ్గించేందుకే చూస్తారు. ఈ 983 మంది రైతుల ఆత్మహత్యల్లో 139 కేసులను ప్రభుత్వం రైతు మరణాలు కాదని తిరస్కరించింది. 828 రైతుల ఆత్మహత్యలు పరిహారానికి అర్హమైనవిగా తేల్చారు. జిల్లా స్థాయిలో మరో 16 కేసులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అప్పుల బాధనే అని తేలింది. పంట నష్టం , సాగు కోసం ఇతర కారణాల వల్ల అప్పులు చేసి వాటిని తీర్చే మార్గం కనిపించక మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబాలు మరింత దారుణంగా మారుతున్నాయి. ఏటా సుమారు వెయ్యి మంది కన్నడనాట గడిచిన మూడేళ్లలో వేలాదిమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2022– 23లో సుమారు 922 మంది రైతులు తనువు చాలించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో సుమారు 1,061 మంది, 2024–25లో సుమారు 983 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏటికేడాది ఈ విష వలయం విస్తరిస్తోందే తప్ప తగ్గడం లేదు. ప్రతి ఏటా వెయ్యికి అటుఇటుగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ సగటున ఇద్దరి నుంచి ముగ్గురు రైతులు పురుగుల మందునో, ఉరినో ఆశ్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పలు పథకాలు, కార్యక్రమాలు రైతు అనుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఈ సమస్యను నియంత్రించడం సాధ్యపడడం లేదని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర తగ్గిపోవడం, అతివృష్టి లేదా అనావృష్టి వల్ల పంటలు ధ్వంసం కావడం వల్ల, అప్పులు పెరిగిపోవడం వల్ల రైతులు జీవితం మీద విరక్తి చెందుతున్నారు. ఆత్మహత్యల గ్రాఫ్ ఏటా ౖపైపెకి గత ఆర్థిక ఏడాదిలో 983 మంది ఆత్మహత్య ఏటేటా ఇదే విషాదం పకృతి విపత్తులు, సర్కార్ల నిర్లక్ష్యం రైతుల ఆత్మహత్యల్లో హావేరి జిల్లా మొదటి స్థానంలో ఉంది. హావేరి జిల్లాలో సుమారు 128 మంది రైతులు బతుకు చాలించారు. ఆ తర్వాత స్థానంలో కలబురిగి – 82, సీఎం సొంత జిల్లా మైసూరు – 73 ఉన్నాయి. ధారవాడ జిల్లాలో 72 మంది, బెళగావిలో 71, హాసన్ జిల్లాలో 47, బీదర్లో 45, శివమొగ్గ జిల్లాలో 45, గదగ జిల్లాలో 44, యాదగిరి జిల్లాలో 43 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక దక్షిణ కన్నడ జిల్లాలో 5 మంది, కొడగు జిల్లాలో 5 మంది, బళ్లారిలో నలుగురు, చామరాజనగరలో నలుగురు, రామనగరలో ముగ్గురు, చిక్కబళ్లాపురలో ముగ్గురు చొప్పున అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు నమోదు అయ్యాయి. అలాగే కొన్ని జిల్లాల్లో ఒక్క రైతు ఆత్మహత్య కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఉడుపి, కోలారు, బెంగళూరు, బెంగళూరు గ్రామీణం జిల్లాల్లో ఒక్క రైతు బవవన్మరణం కూడా నమోదు కాలేదు. -
10 నుంచి ముంగారు ఉత్సవాలు
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అఖిల భారత ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఏ.పాపారెడ్డి వెల్లడించారు. ఆదివారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 25 ఏళ్ల నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఎద్దుల పోటీల్లో భాగంగా ఈనెల 10న కర్ణాటక ఎద్దుల ఒకటిన్నర టన్నుల రాతి దూలం లాగే పోటీలను జిల్లా ఇన్చార్జి, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ ప్రారంభిస్తారన్నారు. 11న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎద్దుల రెండు టన్నుల బరువుగల రాతిదూలం లాగే పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాశీ జగద్గురువులు, 12న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఎద్దుల రెండున్నర టన్నుల బరువైన రాతి దూలం లాగే పోటీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారన్నారు. 11న లక్ష్మీదేవి జాతర, ఎద్దుల ఊరేగింపు, కళా బృందాలతో ఉత్సవం జరుగుతుందన్నారు. 8 నుంచి ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 5న సద్భావన యాత్ర, కవిగోష్టులు, 6న రంగుల పోటీలు, 7న సేవకులకు సన్మానం, 8న వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో బసవరాజరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 11న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య 12న హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి 25వ ఏడాది పోటీలకు ముఖ్యమంత్రుల రాక -
వరుణ జోరుకు విరామం
బనశంకరి: రాష్ట్రంలో నైరుతి ముందస్తు వర్షాలు తగ్గుముఖం పట్టగా కరావళి, మలెనాడు ప్రదేశాల్లోనూ వానలు అదుపులోకి వచ్చాయి. గత 10 రోజులుగా కరావళి, మలెనాడు ప్రాంతాల్లో నిరంతరం భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మంగళూరు శుక్రవారంనాడు అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరుచేరింది. అనూహ్యంగా శనివారం నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. ఉత్తర, దక్షిణ ఒళనాడులో వరుణుడు విరామం ఇచ్చాడు. ఇప్పటివరకు ఉత్తర కన్నడ జిల్లాలో క్యాజల్రాక్, బంట్వాళలో తలా 4 సెంటీమీటర్లు, కోటాలో 3, సె.మీ, కద్రి, మంగళూరులో తలా 2 సెంటీమీటర్లు, కుమటా, సిద్దాపుర, ఉడుపి, కారవార, కార్కళ, మూడుబిదిరె, పణంబూరు, కుందాపుర, ముల్కి, ఉప్పినంగడి, పుత్తూరు, హొన్నావరలో తలా ఒక సెంటీమీటరు వర్షం కురిసింది. భారీ వర్షాలతో ప్రముఖ నదులు, జలాశయాల్లో నీటిమట్టం పెరిగింది. మేలో గణనీయంగా వానలు మే నెలలో సాధారణం కంటే రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. కర్ణాటక వాతావరణశాఖ సమాచారం ప్రకారం గత ఒకవారంలో 298 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మే లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 73.6 మిల్లీమీటర్లు కాగా, 218.7 మిల్లీమీటర్లు వర్షం కురిసింది, అలా మామూలు కంటే 197 శాతం అధిక వర్షం పడింది. రాష్ట్రమంతటా తగ్గిన వర్షాలు -
రియల్టర్ ఇంట్లో బడా దోపిడీ
బనశంకరి: సెక్యూరిటీకి పెట్టుకున్న నేపాలీ దంపతులు ఆ ఇంటిని ఊడ్చిపెట్టేశారు. భారీగా నగదు, రెండు కేజీల బంగారు ఆభరణాలు, పిస్టల్ను దోచుకెళ్లారు. ఈ సంఘటన బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. హెచ్ఏఎల్ శాస్త్రి నగరలో రియల్టర్, రాజకీయనేత రమేశ్ నివాసం ఉంటున్నారు. మూడునెలల క్రితం నేపాల్ కు చెందిన రాజ్, దీపా దంపతులు ఆయన ఇంట్లో కాపలాదారు పనిలో చేరారు. బాగా పనిచేస్తూ ఇంటి యజమానికి నమ్మకంగా ఉండేవారు. తిరుమలకు వెళ్లగానే గత నెల 27వ తేదీన రమేశ్ కుటుంబం తిరుమల తిమ్మప్ప దర్శనానికి వెళ్లారు. ఇదే అవకాశం కోసం వేచిచూస్తున్న నేపాలీ దంపతులు మరో ముగ్గురు నేపాలీలను పిలిపించుకున్నారు. సీసీ కెమెరాల సిస్టమ్ని ఆఫ్ చేశారు. రమేశ్ బెడ్రూమ్ తలుపులు బద్ధలుకొట్టి అందులో ఉన్న రూ.10 లక్షల నగదు, 2 కిలోలు బంగారు ఆభరణాలు, లైసెన్సుడ్ పిస్టల్ను మూటగట్టారు. అద్దె కారు బుక్ చేసుకున్న దుండగులు దర్జాగా ఉడాయించారు. కారు డ్రైవరుకు చోరీ విషయం తెలియదు. యజమానికి అనుమానం 28వ తేదీ వేకువజామున రమేశ్ మొబైల్ఫోన్ సీసీ కెమెరా చిత్రాలను పరిశీలించగా కనెక్ట్ కాలేదు. కరెంట్ లేనందున సీసీ కెమెరా ఆఫ్ అయి ఉంటుందని అనుకున్నాడు. పక్కింటి వారికి ఫోన్ చేసి విచారించగా ఇంట్లో ఎవరూ లేరని తెలిపారు. అనుమానం వచ్చి స్నేహితులకు ఫోన్ చేసి ఇంటి వద్దకు వెళ్లాలని సూచించాడు. స్నేహితులు వెళ్లి చూడగా దోపిడీ వెలుగులోకి వచ్చింది. హెచ్ఏఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నేపాలీ ముఠా తీవ్రంగా గాలిస్తున్నారు. గతంలోనూ నేపాలీ పనివారు ఓ నగల వ్యాపారి ఇంట్లో నుంచి రూ.14 కోట్ల డబ్బు, బంగారాన్ని దోచుకెళ్లారు. సిటీలో నేపాలీ ముఠా ఘాతుకం రూ.10 లక్షలు, 2 కేజీల బంగారం, పిస్టల్తో ఉడాయింపు -
భారీ వర్షంతో టమాటా పంటకు దెబ్బ
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హరపనహళ్లి, హడగలి, కొట్టూరు తాలూకాల్లోని అనేక గ్రామాలకు చెందిన రైతుల పొలంలో వర్షంతో టమాటా పంట దెబ్బతింది. ఇటీవల కురిసిన భారీ వర్షంతో తాలూకాలోని అనేక రైతుల పొలంలో టమాటా పంట దెబ్బతినడంతో కోయకుండా వదిలేశారు. టమాటా ధర పడిపోవడంతో కోత మరింత ఆర్థిక భారం అవుతుందని రైతులు నాగరాజు, హనుమంతప్ప పంటను పొలంలోనే వదిలేశారు. దీంతో ఏపుగా పెరిగిన టమాటా పొలంలో కుళ్లిపోతోంది. ఎకరానికి దాదాపు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేశారు. అయితే పంట దిగుబడి వచ్చినా మార్కెట్లో ధర మాత్రం లేదు. కిలోకు కేవలం రూ.3 నుంచి రూ.4 ల ధరకు అడుగుతున్నారు. దీని వల్ల కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో టమాటాలను పొలంలోనే వదిలేశామని రైతు హనుమంతు విచారం వ్యక్తం చేశారు. వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు తగిన పరిహారం అందించడంపై జిల్లా యంత్రాంగం, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు దృష్టి సారించాలని కోరారు. -
విత్తనాలు, ఎరువుల కోసం రైతుల క్యూ
హొసపేటె: రుతుపవననాల ప్రభావంతో వర్షాలు ప్రారంభం కావడంతో జిల్లాలో వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రైతులు విత్తనాల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. ఈసారి రుతుపవనాలు ముందుగానే రావడంతో వర్షాలు బాగా కురిశాయి. ఇది రైతులకు ప్రయోజనకరంగా ఉంది. అదనంగా రుతుపవనాలు ముందుగానే వస్తాయనే సూచన ఉంది. అందువల్ల వర్షాభావ ప్రాంతాల్లో కొన్ని చోట్ల విత్తనాలు విత్తడం ప్రారంభమైంది. జూన్ 10వ తేదీ తర్వాత చాలా చోట్ల విత్తన ప్రక్రియ ప్రారంభమవుతుంది. వివిధ పంటల విత్తనాలను కొనుగోలు చేయడానికి రైతులు నగరంలోని ప్రైవేట్ దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. అవసరమైన విత్తనాలను సరఫరా చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని ఐదు తాలూకాలకు అవసరమైన వివిధ పంటల మొత్తం 11,766 క్వింటాళ్ల విత్తనాలు నిల్వ చేశారు. వర్షాకాలం కోసం మొత్తం 1,08,102 మెట్రిక్ టన్నుల ఎరువుల డిమాండ్ ఉంది. ఇందులో మే నెలాఖరు వరకు 3,031 మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా, వ్యవసాయ శాఖ 40,228 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేసింది. స్టాక్ అందుబాటులో ఉంది. ఈసారి వరి, మొక్కజొన్న, వేరుశెనగ, కంది, జొన్న విత్తనాలను సేకరించారు. వీటిని రైతు కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయినప్పటికీ విత్తనాల కోసం రైతులు ప్రైవేట్ దుకాణాల వద్ద క్యూ కట్టారు. -
మొబైల్ జామర్తో ప్రజలకు పాట్లు
బళ్లారి అర్బన్: నగరంలోని కనకదుర్గమ్మ గుడి సమీపంలో ఉన్న సెంట్రల్ జైల్లో ఇటీవల కొత్తగా మొబైల్ జామర్ను ఏర్పాటు చేయడంతో జైల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జామర్ సామర్థ్యాన్ని వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్రెడ్డి పోలీస్ సూపరింటెండెంట్కు విన్నవించారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో జైల్ సూపరింటెండెంట్కు ఆయన వినతిపత్రాన్ని అందించారు. జామర్ ఏర్పాటుతో సమీపంలోని వ్యాపార దుకాణాలు, ఫోన్ పే, ఆర్టీజీఎస్తో సహా డబ్బు బదిలీలు నెట్వర్క్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యాపారాలు కూడా తగ్గిపోయాయన్నారు. ప్రజలు తమ మొబైల్ సంభాషణలను చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత రెండు మూడు నెలల నుంచి ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జామర్ సామర్థ్యాన్ని తగ్గించి స్థానికుల సమస్యలకు పరిష్కారం కల్పించాలన్నారు. జైల్లో ఉన్న ఖైదీల భద్రత కోసం జామర్ ఏర్పాటు చేయడం మంచిదే అయినా జైలు నగర శివార్లలో ఉండి ఉంటే ఇలా జామర్ను ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరం అన్నారు. నగర నడిబొడ్డున జైలు ఉన్నప్పటికీ జామర్ సామర్థ్యాన్ని ప్రజలకు అనుకూలం అయ్యేలా తగ్గించాలని కోరినట్లు తెలిపారు. బీజేపీ జిల్లాధ్యక్షుడు అనిల్నాయుడు, కార్పొరేటర్ గుడిగంటి హనుమంతు, కార్పొరేటర్ కే.హనుమంతు, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు. సామర్థ్యం తగ్గించాలని జైలు సూపరింటెండెంట్కు వినతి -
4న శ్రీగురు చిరంతప్ప స్వాముల వర్ధంతి
బళ్లారిటౌన్: నగరంలోని బసవభవన్లో ఈ నెల 4న శ్రీగురు చిరంతప్ప స్వాముల 21వ స్మరణోత్సవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమ్మరచేడు మఠం కళ్యాణ స్వామీజీ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపేందుకు వివిధ సమితులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు రేణుకాచార్య, బసవణ్ణ, స్వాముల చిత్రపటాలను శ్రీకనకదుర్గమ్మ దేవస్థానం నుంచి బసవభవన్ వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 వివిధ మఠాల స్వాములు పాల్గొంటారని తెలిపారు. ఇందులో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరం, పుస్తక ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా నగరంలో వివిధ రంగాల్లో సమాజ సేవ చేసిన 11 మంది సాధకులను అవార్డులు ఇచ్చి సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు 30 మందికి పైగా వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో శంభులింగ స్వామి, జంగమ హొసళ్లి స్వామి, నేతలు పంచాక్షరప్ప, జయప్రకాశ, మెట్రి మృత్యుంజయ, బీఎం స్వామి, గంగావతి వీరేష్, రాజన్న, నందీష్, దుర్గేష్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు. హెచ్జీఎంలో ఎయిర్ బ్లాస్ట్తో కార్మికుడి దుర్మరణం రాయచూరు రూరల్: జిల్లాలోని హట్టి బంగారు గనుల(హెచ్జీఎం) కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు ఎయిర్ బ్లాస్ట్ కావడంతో దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం విధులు నిర్వహిస్తున్న సమయంలో ఽశరణ బసవ(35) అనే కార్మికుడిపైకి 28 అడుగుల్లో ఎయిర్ బ్లాస్ట్ కావడంతో రాళ్లు ఎగిరి ఆయనపై పడ్డాయి. దీంతో తీవ్ర గాయాలతో శరణ బసవ మరణించగా, మరొక కార్మికుడు గాయాల పాలు కావడంతో లింగసూగూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఉచిత కంప్యూటర్ శిక్షణకు అర్జీల ఆహ్వానం హొసపేటె: 2025–26వ సంవత్సరంలో ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ, డిప్లొమాతో సహా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన లేదా అనుత్తీర్ణులైన పురుష, మహిళా విద్యార్థులకు మరియమ్మనహళ్లిలోని ప్రభుత్వ పరికరాల శిక్షణా కేంద్రం(జీటీటీసీ)లో రెండు నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ టూల్స్ ట్రైనింగ్ సెంటర్, హొసపేటె అనే చిరునామాలో లేదా 9845416198, 8722999929 నంబరులో సంప్రదించాలని జీటీటీసీ కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సైక్లింగ్ జాతాకు శ్రీకారంరాయచూరు రూరల్: నగరంలో సైకిలింగ్ జాతాకు జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య శ్రీకారం చుట్టారు. ఆదివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కి పచ్చజెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. నాడు పూర్వీకులు నడిచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారన్నారు. నేటి ఆధునిక యుగంలో నడకను విస్మరించి అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతాలో బసవరాజ్, రవి, చెన్నబసవనగౌడ, విశ్వనాథ్, జయప్రకాష్, శరణే గౌడ, నాగరాజ్, సందీప్, పవన్, సకలేష్, విజయ, రాఘవేంద్ర, గురురాజ్, వెంకటేష్లున్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం హొసపేటె: ఎస్సీఎస్పీ, టీఎస్పీ పథకాల కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థుల నుంచి పర్యాటక, ఆతిథ్య రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం పర్యాటక శాఖ దరఖాస్తులను ఆహ్వానించిందని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రభులింగ ఎస్.తళకేరి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 2వ తేదీ నుంచి విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని కమలాపుర లోటస్ మహల్ సమీపంలోని పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం నుంచి దరఖాస్తు ఫాంను పొంది, భర్తీ చేసి ఈనెల 9వ తేదీలోగా అదే కార్యాలయంలో సమర్పించాలి. శిక్షణ పొందుతున్న అభ్యర్థి వయస్సు కనీసం 20– 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ స్టీవార్డ్ శిక్షణ కాలం 4 నెలలు ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మల్టీ క్యుసిన్ కుక్ శిక్షణ కాలం 5 నెలలు ఉంటుంది. అభ్యర్థి 8వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. రూమ్ అటెండెంట్ శిక్షణ కాలం 4 నెలలు ఉంటుంది. అభ్యర్థులు ఐదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరిన్ని వివరాలకు విజయనగర జిల్లా హొసపేటె తాలూకా కమలాపురలోని లోటస్ మహల్ సమీపంలోని పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో లేదా 08394–295640 నెంబర్లో సంప్రదించవచ్చని ప్రకటనలో తెలిపారు. -
కన్నడ వైపునే నిలబడతా: శివు
యశవంతపుర: కన్నడ భాష గురించి ప్రముఖ నటుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడ నటుడు శివరాజ్కుమార్ స్పందిస్తూ తాను కన్నడ బాషకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానన్నారు. కమల్ మాట్లాడిన వేదికపై నేనున్నాను, ఎలా మాట్లాడాలో కమల్ తెలుసుకొని మాట్లాడి ఉండాలి. కన్నడ భాషకు ఎలాంటి సమస్య వచ్చినా నేను కన్నడకు మద్దతుగా నిలబడతానన్నారు. కన్నడ కోసం తాను ఏమి చేశానో ప్రజలందరికీ తెలుసన్నారు. కమల్ ఇష్ట ప్రకారమే మాట్లాడి ఉండవచ్చు. క్షమాపణ చెప్పడం అనేది ఆయనకే వదిలేస్తున్నట్లు తెలిపారు.బ్యాంకు లాకర్లో నగలు మాయం యశవంతపుర: ఇంట్లో ఉంటే దొంగలు పడి దోచుకుంటారనే భయంతో కొందరు నగలను బ్యాంక్ లాకర్లో భద్రపరుస్తారు. కానీ అక్కడ కూడా మాయమైతే ఏం చేయాలి? బంగారు ఆభరణాలు అదృశ్యమైన ఘటనలో బెంగళూరు చిక్కమారనహళ్లి డాలర్స్ కాలనీ బ్రాంచ్ మేనేజర్ కేఎస్ భారతీశ్, డిప్యూటీ మేనేజర్ ఫిల్జిత్ జాన్, సిబ్బందిపై కేసు నమోదైంది. చిక్కమారనహళ్లికి చెందిన మహిళా ఖాతాదారు ఫిర్యాదు చేసింది. వివరాలు.. 2022లో ఆమె ఆ బ్రాంచిలో ఖాతాను తెరిచారు. లాకర్ను తీసుకొని 145 గ్రాముల బంగారం ఉంచారు. గత మార్చి 29న బ్యాంక్కు వెళ్లి పరిశీలించగా ఖాళీ లాకర్ కనిపించింది. పై నిందితులకు చెప్పగా, మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. పైగా బంగారం బిల్లు ఉంటే ఆన్లైన్ ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. ఈ అన్యాయంపై బ్యాంక్ వినియోగదారుల సేవా కేంద్రంతో పాటు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా ఆమె గోడును ఎవరూ పట్టించుకోలేదు. దీంతో స్థానిక డీసీపీ కి ఫిర్యాదు చేయగా, ఆ మేరకు సదాశివనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికపై మూకుమ్మడి అత్యాచారం దొడ్డబళ్లాపురం: మైనర్ బాలికపై దారుణం జరిగింది. ఆరుమంది కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బెళగావి శివారులోని చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై నిందితులు రెండుసార్లు గ్యాంగ్ రేప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 6 నెలల క్రితం బాలిక స్నేహితుడు ఆమెను నిర్జనప్రదేశానికి తీసికెళ్లి అత్యాచారం చేసి వీడియో తీశాడు. తరువాత ఆ వీడియోను చూసి ఆమెను బెదిరించి ఆరుమంది యువకులు మరోసారి ఘోరానికి ఒడిగట్టారు. మళ్లీ వీడియో తీసి బెదిరిస్తుండడంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఏపీఎంసీ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. -
శిథిలావస్థలో బీఈఓ కార్యాలయం
రాయచూరు రూరల్ : విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే పాఠశాలలకు తోడు తాలూకా విద్యాశాఖాధికారి (బీఈఓ) కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. బీఈఓ కార్యాలయానికి 50 ఏళ్లు దాటినా భవనానికి మరమ్మతులు మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. తాలూకా కార్యాలయం పైకప్పు పెచ్చులూడుతున్నాయి. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు ఏ రోజునా కూడా కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ, జిల్లా విద్యాశాఖాధికారి కూడా కార్యాలయం స్థితిగతుల గురించి ఏనాడూ పరిశీలించిన సందర్భాలు లేవు. ఇటీవల కురిసిన వానలకు భవనంపై నీరు నిలబడి కారడంతో పెచ్చులూడి కిందకు పడగా సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బిక్కుబిక్కుమంటూ విధులు.. అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏ సమయంలో పెచ్చులూడి తమపై పడతాయోననే భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. తాలూకా విద్యా శాఖాధికారి కార్యాలయం ముందు భాగంలో పెచ్చులూడి పడ్డాయి. నూతన జిల్లాధికారి కార్యాలయం మినీ విధానసౌధకు తరలి పోవడం నగరసభ కార్యాలయం పాత జిల్లాధికారి కార్యాలయానికి తరలించారు. అందులోకి బీఈఓ కార్యాలయాన్ని తరలించడానికి అవకాశం కల్పిం చాలని బీఈఓ ఈరణ్ణ కోస్గి జిల్లాధికారి నితీష్కు లేఖ రాసి 45 రోజులు గడుస్తున్నా నేటికీ జిల్లాధికారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు, సిబ్బంది వాపోయారు. త్రుటిలో సిబ్బందికి తప్పిన ప్రమాదం 50 ఏళ్లు దాటినా మరమ్మతులు శూన్యం -
పౌర కార్మికుల నిరసన.. పేరుకున్న చెత్త
హొసపేటె: గత ఐదు రోజులుగా పౌర కార్మికులు తమ వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం విధులు బహిష్కరించి నిరసన తెలపడంతో నగరంలో అనేక రహదార్లు చెత్తకుప్పల్లా దర్శనం ఇస్తున్నాయి. దీంతో హొసపేటె నగరం మురికివాడగా మారుతోంది. హొసపేటె నగరం నుంచి హంపీకి ప్రతి రోజూ వేలాది మంది పర్యాటకులు వచ్చిపోతుంటారు. అయితే పౌర కార్మికులు నిరసన కారణంగా చెత్త సేకరించడం నిలిపి వేశారు. నగర ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తున్నారు. దీంతో చెత్త దుర్వాసన వెదజల్లుతోంది. ప్రజలు వీధుల్లో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. పైగా ప్రజలు ఎక్కడ పడితే అక్కడ పడేసే చెత్త కుప్పలను పశువులు, కుక్కలు, పందులు చెల్లాచెదురు చేస్తున్నాయి. చెత్త కుళ్లిపోయి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నగరసభ యంత్రాంగం వెంటనే రహదార్లలో ఉన్న చెత్తను తొలగించే దిశగా దృష్టి పెట్టాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేశారు. -
యువతి పైకి బస్సును ఎక్కించేయత్నం
● సిటీ బస్ డ్రైవర్ సస్పెండ్ బనశంకరి: సిలికాన్సిటీలో కొందరు బీఎంటీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్ల దుష్ప్రవర్తన వల్ల ఆ సంస్థకే చెడ్డపేరు వస్తోంది. బస్ను అడ్డగించిన యువతిపై బస్ ఎక్కించడానికి ప్రయత్నించిన బీఎంటీసీ బస్డ్రైవరు ఉదంతమిది. గతనెల 23 తేదీ సాయంత్రం 5.30 సమయంలో నగరంలోని ఓ కూడలిలో చోటుచేసుకుంది. బీఎంటీసీ బస్ పక్కన కారులో వెళ్తున్న యువతి దిగి, బీఎంటీసీ డ్రైవరు ప్రశాంత్ని ఏదో విషయమై ప్రశ్నించింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా బస్ ముందుకు కదిలింది, సిగ్నల్లో బస్ను యువతి అడ్డుకుంది. కానీ డ్రైవరు ఆమైపె బస్ను ఎక్కించడానికి ప్రయత్నించగా యువతి తప్పించుకుంది. డ్రైవరు చర్యతో ప్రజలు హడలిపోయారు. డిపో నెంబరు 17, చంద్రాలేఔట్ డిపో కు చెందిన బీఎంటీసీ బస్ అని తెలిసింది. ఈ ఘటన మీడియాలో ప్రసారం కావడంతో రవాణా మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలతో డ్రైవరును సస్పెండ్ చేశారు. 14 కేజీల గంజాయి సీజ్ బనశంకరి: ఒడిశా నుంచి బెంగళూరు నగరానికి గంజాయిని తరలించి విక్రయిస్తున్న పశ్చిమ బెంగాల్వాసిని ఆదివారం జిగణి పోలీసులు అరెస్ట్చేశారు. ఇతని వద్ద నుంచి రూ.20 లక్షల విలుచేసే 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రేమ్ శర్ప (25), ఇతను ఒడిశా నుంచి బెంగళూరు కు గంజాయిని తీసుకొచ్చి అమ్మేవాడు. గంజాయిని సీజ్ చేసి విచారణ చేపట్టారు. ప్యాలెస్ సిటీలో యోగా సాధన మైసూరు: యోగా నిలయంగా పేరు గాంచిన ప్యాలెస్ నగరంలో ఆదివారం యోగా ధనుష్ నిర్వహించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ఆయుష్ శాఖ, జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో లలిత్ మహాల్ ప్యాలెస్ ముందు వందలాది మంది యోగా భంగిమలను ప్రదర్శించారు. రాబోయే రోజుల్లో మరిన్ని యోగా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మంచి ఆరోగ్యానికి, సంతృప్తికరమైన జీవితానికి యోగా సమాధానమని అన్నారు. ఆటోడ్రైవర్పై యువతి దాడి శివాజీనగర: రాష్ట్రంలో కన్నడిగులపై దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరులో ఉత్తరాది యువతి ఆటోడ్రైవర్ను చిన్న విషయానికే దూషిస్తూ చెప్పుతో కొట్టింది. ఈ దాష్టీకం వీడియో వైరల్ అయ్యింది. ఆటో డ్రైవర ముందు వెళ్తున్న యువతి స్కూటర్ను గట్టిగా తాకాడనే విషయంలో రగడ మొదలైంది. యువతి ఆటోడ్రైవర్ను హిందీలో తిడుతూ చెప్పు తీసుకుని పదే పదే కొట్టింది. ఆటోడ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి అకృత్యంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జ్వరం, దగ్గు, జలుబు.. స్కూలుకు పంపొద్దు
శివాజీనగర(కర్ణాటక): రాష్ట్రమంతటా పాఠశాలలు పునర్ ప్రారంభం అవుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ దిగులు నెలకొంది. ఆరోగ్య శాఖ పాఠశాలల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ సాంకేతిక కమిటీ ఆదేశాలతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలను ఇచ్చింది.ఇవీ మార్గదర్శకాలు● పాఠశాల పిల్లల్లో జ్వరం, దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు కనిపిస్తే బడికి పంపరాదు,● వెద్యులతో చికిత్స చేయించాలి. సుస్తీ నయమైన తరువాతనే పిల్లలను పాఠశాలలకు పంపించాలి.● జ్వరం, దగ్గు, జలుబు, ఇతర రోగ లక్షణాలు ఉన్న పిల్లలు పాఠశాలకు వస్తే, వారి తల్లిదండ్రులకు తక్షణమే సమాచారమిచ్చి ఆ పిల్లలను ఇంటికి పంపించాలి.● పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే వైద్యసేవలను పొందాలి.● అన్ని పాఠశాలల్లో కోవిడ్ ముందు జాగ్రత్తా చర్యలను తప్పకుండా పాటించాలి.రాజధానిలో 150కి పైగా కేసులుబెంగళూరులో కోవిడ్ కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. క్రియాశీల కేసులు 150 ని మించిపోయాయి. మహాదేవపుర, తూర్పు జోన్తో పాటుగా బెంగళూరులోని పలు ఏరియాల్లో కోవిడ్ బాధితులు పెరుగుతున్నారు. రోగ బాధితులు, వారి పక్కన ఉండేవారు కోవిడ్ నియమావళిని పాటించాలని వైద్య నిపుణులు తెలిపారు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికై నా సిద్ధంగా ఉండాలి. వెంటిలేటర్లు, ఆక్సిజన్, బెడ్లకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య ఆదేశించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇది తీవ్రతరమైన వైరస్ కాదు. వృద్ధులు, వివిధ జబ్బు పీడితులు తప్పకుండా మాస్క్ ధరించాలి. అందరూ మాస్క్ ధరించాలన్న నియమం లేదు అని చెప్పారు. -
ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం
బళ్లారిటౌన్: జిల్లాలోని కురుగోడు తాలూకా కోళూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిని కంప్లి ఎమ్మెల్యే జేఎన్.గణేష్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పురాతన కాలం నుంచి వచ్చిన మన ఆయుర్వేద వైద్యం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలగవన్నారు. ఈ మందుల వాడటం వల్ల రోగాలు పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీన్ని స్థానికులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యులు కూడా రోగులతో సౌజన్యంగా నడుచుకొని సేవలు అందించాలన్నారు. కోళూరు జీపీ అధ్యక్షురాలు దొడ్డబసమ్మ, ఉపాధ్యక్షుడు చెన్నప్ప, జిల్లా ఆయుష్ అధికారి ఎన్.విరుపాక్షప్ప, వైద్యాధికారి కేపీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఆక్యుప్రెషర్లో బంగారు పతకం రాయచూరు రూరల్: బెంగళూరులో జరిగిన బసవ ఆక్యు ప్రత్యామ్నాయ మందుల అకాడమీ ఆధ్వర్యంలో రాయచూరుకు చెందిన రాజా శంకర్ ఆక్యుప్రెషర్లో బంగారు పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షుడు బసవరాజ్, హెచ్.భోజరాజు, తమిళనాడు హిలర్ అధ్యక్షుడు డా.మణికణ్ణన్లున్నారు. ఎమ్మెల్సీపై చర్యలకు డిమాండ్ రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాధికారి ఫౌజియ తరన్నంను నిందించిన ఎమ్మెల్సీ రవి కుమార్పై చర్యలు తీసుకోవాలని అంజుమన్–ఏ–రాయచూరు డిమాండ్ చేసింది. శనివారం అదనపు జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు సయ్యద్ అమీనుల్లా హసన్ మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ జిల్లాధికారిని అవమానించడం తగదన్నారు. ఆయనపై చర్యలు చేపట్టాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానంద ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. అధిక ఫీజుల వసూలు తగదు రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని జనసేవా ఫౌండేషన్ అధ్యక్షుడు జావిద్ఖాన్ పేర్కొన్నారు. శనివారం మాన్విలోని పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యా శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు ఉన్నారన్నారు. అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యా శాఖాధికారులను డిమాండ్ చేశారు. జనౌషధి కేంద్రాల మూసివేత సరికాదురాయచూరు రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన జనౌషధి కేంద్రాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని బీజేపీ నాయకులు ఆరోపించారు. శనివారం బాగల్కోటె జిల్లా ఇలకల్ ప్రభుత్వాస్పత్రి వద్ద చేపట్టిన ఆందోళనలో ఇలకల్ నగర అధ్యక్షుడు అరవింద్ మాట్లాడారు. పేదలు దుబారా వ్యయంతో కూడిన మందులు కొనుగోలు చేయడం కష్టమని భావించి ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలను ప్రారంభించి వారికి సౌకర్యం కల్పించారన్నారు. కాంగ్రెస్ సర్కార్ వాటిని మూసివేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేశారు. ఆందోళనలో తృప్తి సాలిమఠ, మల్లికార్జున, శ్యాం సుందర్, బసప్ప, చంద్రశేఖర్, నాడగౌడ, ప్రకాష్, విజయ్ గిరెడ్డి, నాగేష్, శ్రీనివాస్, శివరాజ్, వీరేష్, పరశురామ్, సూగూరేష్, రాజేంద్రలున్నారు. -
కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఉరవకొండ, ఉరవకొండ రూరల్: ఉరవకొండ మండల పరిధిలోని బూదగవి గ్రామ సమీపంలోని అనంతపురం–బళ్లారి 42వ జాతీయ రహదారిలో కేసీఆర్టీసీ బస్సు, కారును వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరానికి చెందిన జాన్రెడ్డి, చెన్నమ్మ దంపతులు తమ కుమార్తె సైనీ దీప్తి అల్లుడు రోహన్రెడ్డితో కలిసి కర్ణాటకలోని హంపీ క్షేత్రాన్ని సందర్శించి శనివారంనాడు ధర్మవరానికి తిరిగి వెళ్తున్నారు. బళ్లారి నుంచి ఉరవకొండకు వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు బూదగవి సమీపంలో ఓవర్టేక్ చేసే క్రమంలో కారును వెనుకభాగంలో ఢీకొట్టింది. దీంతో కారులో అదుపుతప్పి దూసుకెళ్లింది, కారు ధ్వంసం కాగా, అందులో ప్రయాణిస్తున్న జాన్రెడ్డి (80) అక్కడికక్కడే చనిపోయాడు, సైనీదీప్తి, రోహన్రెడ్డి, చెన్నమ్మతో పాటు కారు డ్రైవర్ వెంకటరమణకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని 108 అంబులెన్సులో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి పంపించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు ఢీకొని కూలీలకు గాయాలు పావగడ: పట్టణంలోని తేజస్ హోటల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రజవంతి గ్రామానికి చెందిన 14 మంది మహిళా కూలీలు గాయాలపాలై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాలూకాలోని నీలమ్మనహళ్లికి వేరుశనగ పంట కలుపును తీయడానికి ఆటోలో వెళ్లి తిరిగి స్వగ్రామం రజవంతికి ఆటోలో వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. స్థానిక పీయూ కళాశాల లెక్చరర్ విశ్వనాథ్, రాజవంతికి చెందిన మంజునాథ్ తదితరులు బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. బూదగవి సమీపంలో ఘటన కారులోని ఒకరు మృతి, నలుగురికి గాయాలు -
క్రస్ట్గేట్ నిర్మాణ పనులపై నిరాసక్తి
హొసపేటె: తుంగభద్ర డ్యాం 32 క్రస్ట్గేట్ల భర్తీ పనులకు మళ్లీ టెండర్ పిలిచినా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోలేదు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల కంపెనీలు మళ్లీ ఈ–టెండర్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. తుంగభద్ర డ్యాం గేట్లను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ఎన్డీటీ సర్వీస్ కంపెనీ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత నిపుణులు కూడా మార్పు అవసరమని చెప్పారు. అందువల్ల తుంగభద్ర బోర్డు 32 గేట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అప్పుడు కూడా నాలుగు కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. సాంకేతిక కారణాల వల్ల, మళ్లీ టెండర్ పిలిచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పుడు నాలుగు కంపెనీలు మాత్రమే దరఖాస్తులను సమర్పించాయి. గుజరాత్కు చెందిన అనార్ కంపెనీ, హార్డ్వేర్ టూల్స్, మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీలు తుంగభద్ర డ్యాం 32 గేట్ల పునర్నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాయి. తెలంగాణ నుంచి రెండు కంపెనీలు.. మరో వైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వప్రా, బెకామ్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పుడు సాంకేతిక బిడ్ తెరిచి ఉంది. రాబోయే రోజుల్లో టెండర్ ఎవరు దక్కించుకున్నారో తెలుస్తుందని తుంగభద్ర బోర్డు వర్గాలు తెలిపాయి. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల నిర్మాణంలో స్థానిక కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ను కోరారు. అయితే తుంగభద్ర బోర్డు మళ్లీ టెండర్లు పిలిచినా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోలేదు. జలాశయం క్రస్ట్గేట్ల నిర్మాణంలో అనుభవం, అర్హతలు కలిగిన ఏవైనా కంపెనీలు కర్ణాటకలో ఉన్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్గేట్ 2024 ఆగస్టు 10న కొట్టుకుపోయింది. ఈ గేటుకు స్టాప్లాగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు క్రస్ట్గేట్ నిర్మాణం కోసం గుజరాత్కు చెందిన హార్డ్వేర్ టూల్స్, మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీకి టెండర్ అప్పగించారు. ఈ కంపెనీ మెటీరియల్ను కొనుగోలు చేసి, గేట్ తయారీ పనిలో బిజీగా ఉంది. జూన్ నెలాఖరు నాటికి ఈ కంపెనీ గేట్ను ఏర్పాటు చేయాలని టెండర్లో పేర్కొన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కర్ణాటక, ఆంధ్రల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోని వైనం -
పొగ.. ఆరోగ్యానికి సెగ
హొసపేటె: దురలవాట్లకు బానిసయ్యే ముందు మీ జీవితం, జీవనోపాధి విలువలను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండగలరని సివిల్ జడ్జి ప్రశాంత్ నాగలాపుర అన్నారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన అవగాహన మార్చ్ను శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. యువత పొగాకు, నికోటిన్ వంటి ఉత్పత్తులపై ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నారు. దేశంలో 267 మిలియన్లకు పైగా పొగాకు వినియోగదారులు ఉన్నారన్నారు. ప్రతి సంవత్సరం 13.5 లక్షలకు పైగా ప్రజలు పొగాకు సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారన్నారు. హాస్యాస్పదంగా పొగాకు వినియోగదారుల్లో 47.6 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. కర్ణాటకలో 22.8 శాతం మంది వ్యక్తులు ఏదో ఒక రకమైన పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పొగాకు ఉత్పత్తుల చీకటి ఉద్దేశ్యాల గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు. జిల్లాను పొగాకు రహితంగా మార్చడంలో ప్రజల సహకారం చాలా ముఖ్యం అన్నారు. పొగాకు వాడకం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వస్తున్నాయి. నోరు, రక్తనాళాల నష్టం, తల, మెడ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, స్వరపేటిక, మెదడు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్కు కారణమవుతుందన్నారు. పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన తేవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి శంకర్ నాయక్, వైద్యులు భాస్కర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. దురలవాట్లకు బానిస కావద్దు బళ్లారిటౌన్: దురలవాట్లు, పొగాకు ఉత్పత్తుల సేవనానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీహెచ్ఓ వై.రమేష్బాబు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రపంచ పొగాకు రహిత దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పొగాకులో దాదాపు 2000 రసాయనిక అంశాలు దాగి ఉన్నాయన్నారు. అది మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. ఇందులో ముఖ్యంగా కిడ్నీలు, నరాల సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉత్పత్తి అవుతాయన్నారు. పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనే పథకాలను రూపొందించిందన్నారు. విద్యా సంస్థల వద్ద 100 మీటర్లలోపు పొగాకు అమ్మకం నిషేధం అని, అధికారులు కూడా మరింత జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ఈశ్వర్ దానప్ప, ఇంద్రాణి, జబిన్తాజ్, శ్రావణి, రాఘవేంద్ర, గోవిందప్ప, విరుపాక్షి, అంబదాసు, శివకుమార్, ఉమా మహేశ్వరి, సవిత తదితరులు పాల్గొన్నారు. పొగాకు సేవనానికి దూరంగా ఉండండి సివిల్ జడ్జి ప్రశాంత్ నాగలాపుర పిలుపు -
పరిశ్రమలకు ఈ–ఖాతా వర్తించదు
రాయచూరు రూరల్: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటికి ఈ–ఖాతాలను చేయించుకోవాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని సిటీ కార్పొరేషన్ అధికారులు ఉపసంహరించుకోవాలని కాటన్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు, హౌసింగ్, ఏపీఎంసీ, కేఏఐడీబీ, కేఎస్ఎస్ఐడీసీ వంటి వాటికి ప్రభుత్వమే కావేరి–2.0లో తీసుకుంటుందని, లేకపోతే సబ్ రిజిస్త్ట్రార్ కార్యాలయంలో అధికారులు నమోదు చేసుకోవడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. సర్కారు ఈ నిర్ణయంపై సరైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. నగరసభ అధికారులు ఈ విషయంలో పునరాలోచించాలన్నారు. -
పేదలకు ఇళ్ల హక్కు పట్టాలిప్పిస్తాం
రాయచూరు రూరల్: మురికి వాడల్లో నివసించే పేదలకు ఇళ్ల హక్కు పట్టాలిప్పిస్తామని ఎమ్మెల్సీ వసంత్ కుమార్ వెల్లడించారు. శనివారం పండిట్ సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో మురికి వాడల క్రియా వేదిక ఆధ్వర్యంలో జరిగిన స్లం హబ్బను ప్రారంభించి మాట్లాడారు. గత 20 ఏళ్ల నుంచి మురికి వాడల ప్రాంతంలో నివసిస్తున్న వారికి నగరసభ అధికారులు, నగరాభివృద్ధి ప్రాధికార అధికారులతో చర్చించి సమస్యలకు పరిష్కారం కనుగొంటామన్నారు. నగరంలో నివసించే పేదల్లో 2024లో 1.64 లక్షల మందికి హక్కు పట్టాల పత్రాలను అందించారన్నారు. ఇళ్ల స్థలాలను కేటాయించాలని ఆర్డీఏ అధికారులతో ప్రతిపాదించి చర్యలు చేపడతామన్నారు. సర్కార్ మురికి వాడల ప్రజలకు ఇంటి హక్కు పట్టాలివ్వడానికి సిద్ధమన్నారు. అంతకు ముందు అంబేడ్కర్ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి, పవన్ కుమార్, రజాక్ ఉస్తాద్, రవీంద్ర జాలదార్, అంబన్న, అనిల్, మురికి వాడల క్రియా వేదిక అధ్యక్షుడు జనార్దన్లున్నారు. -
కాంగ్రెస్ వల్లే మత కలహాలు పెచ్చు
హుబ్లీ: వర్గాల మధ్య ధ్వేష వాతావరణం సృష్టించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మాజీ సీఎం, బెళగావి ఎంపీ జగదీష్ శెట్టర్ ఆరోపించారు. హావేరిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి మత కలహాలు పెరిగాయన్నారు. దీంతో ఓ వర్గం కాంగ్రెస్ కార్యకర్తలకు విరక్తి పుట్టిందని మంగళూరు ఘటనను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఒక మెసేజ్కు ఓ వర్గం వేలాది మంది యువకులు గుమిగూడతారన్నారు. అప్పటి కమిషనర్ ముందస్తు చర్యలు తీసుకోక పోవడంతో పెను ముప్పు జరిగిందన్నారు. మంగళూరులో ప్రతీకార హత్యలు జరుగుతున్నాయి. హావేరి గ్యాంగ్ రేప్ నిందితులు ఊరిలో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మొత్తం మీద నిందితులకు చట్టంపై భయం లేని వాతావరణం కాంగ్రెస్ సర్కారు వల్ల నెలకొందన్నారు. పీఎఫ్ఐ కార్యకర్తల కేసు రద్దు చేసినందుకు గతంలో కేజీ హళ్లి, డీజీ హళ్లి అల్లర్లు జరిగాయి. మైనార్టీలను ఆకర్షించేందుకు మంత్రి వర్గంలో ఇష్టమొచ్చినట్లుగా కేసుల రద్దు నిర్ణయాలను తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. ఇక మీదటైనా ఇలా జరగరాదు. హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానన్నారు. ధార్వాడలో కోవిడ్ కేసు నమోదుహుబ్లీ: ధార్వాడ జిల్లాలో ఓ కోవిడ్ కేసు నమోదైంది. కోవిడ్ లక్షణాలతో 71 ఏళ్ల మహిళ జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని జిల్లా యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొంది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయండి హుబ్లీ: విధాన పరిషత్లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు అర్హులైన వ్యక్తులను ఎంపిక చేసి నామినేట్ చేయడానికి సిఫార్సు చేసే గురుతర బాధ్యత మీదేనని సీఎం సిద్దరామయ్యకు విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ హొరట్టి సూచించారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఓ లేఖ రాశారు. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా అర్హులైన వ్యక్తులను ఎంపిక చేయాలన్నది తన అభిలాష అని తెలిపారు. రాష్ట్రంలో మంచి పనులను చేసి సీఎం ప్రజల మనసులో ఆదరణ చూరగొన్నారు. సాహిత్యం, సంగీతం, కళలు, సాంస్కృతిక, విద్య, పత్రికా రంగం, సమాజ సేవ తదితర రంగాల్లో సాధకులను ఈసారి నామినేట్ చేస్తారని తాను నమ్ముతున్నానని తెలిపారు. పర్మినెంట్ చేయాలని ఒత్తిడిరాయచూరు రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లా సంచాలకులు శ్రీశైల నాయక డిమాండ్ చేశారు. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద అధికారికి వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. నవోదయ, మొరార్జి దేశాయి, రాణి కిత్తూరు చెన్నమ్మ, మైనార్టి పాఠశాలకు ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. మున్సిపల్ ఉద్యోగుల ధర్నా విరమణ హొసపేటె: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో పాటు 19 డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నీటి సరఫరా మినహా అన్ని సేవలను నిలిపివేసి గత 4 రోజుల నుంచి మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక ధర్నాను శనివారం మున్సిపల్ ఉద్యోగులు విరమించుకున్నారు. రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘం విజయనగర జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర వర్మ మాట్లాడుతూ నెల రోజుల్లోగా తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. సల్మాన్ శేషన్న, రవికుమార్, భారతి, ఈరన్న, సురేష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. నడిరోడ్డులో గుంత.. ప్రయాణికులకు చింత హొసపేటె: నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పక్కనే ఉన్న బసవణ్ణ కాలువ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చారు. దీనిని మెరుగు పరచనందున గుంతలు పడి ప్రతి రోజూ వేలాది మంది విద్యార్థులను తీసుకెళ్లే వాహనదారులు, ఆటోలు, కార్లు ప్రయాణికులు ఇప్పుడు ప్రాణభయంతో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే నియంత్రణ కోల్పోయి బసవణ్ణ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం రోడ్డు పన్నుతో సహా అన్ని రకాల పన్నులను వసూలు చేస్తోంది. కానీ వాటి నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలను సంబంధిత అధికారులు వెంటనే మూసివేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేశారు. -
ఉద్యోగ విరమణ సహజం
రాయచూరు రూరల్: ఉద్యోగంలో పదవీ విరమణ సహజమని టాగూర్ స్మారక విద్యా మండలి అధ్యక్షుడు అమరేష్ అభిప్రాయపడ్డారు. శనివారం టాగూర్ స్మారక విద్యా సంస్థ కళాశాలలో పదవీ విరమణ చేిసిన ప్రిన్సిపాల్ శ్రీనివాస రాయచూరుకర్ను సన్మానించి వీడ్కోలు పలికి మాట్లాడారు. విద్యార్థులకు ఉత్తమ బోధనలతో పాటు గ్రామాల్లో ఎలా సమాజ సేవ చేయాలో నేర్పిన వ్యక్తిగా కొనియాడారు. మండలి పదాధికారులు శివబసప్ప మాలి పాటిల్, విరుపాక్షప్ప, శాంతప్ప, పంపనగౌడ, నిర్మల, హేమరెడ్డి, నాగభూషణ్, రాజేశ్వరి, విజయ్ కుమార్, అళ్లప్ప, వెంకటేష్, దేవిరెడ్డి, చెన్నమల్లికార్జున, వీరప్ప, కల్లయ్యలున్నారు. -
పొగాకు వ్యసనం మానండి
బనశంకరి: ఇటీవల రోజుల్లో పాఠశాల విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు చాలా సులభంగా లబించడం చాలా ప్రమాదకరమని ఫిడిలిటస్ ఎండీ అచ్యుత్గౌడ అన్నారు. ప్రపంచ పోగాకు రహితదినోత్సవం సందర్బంగా శనివారం శిల్పా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో బనశంకరి రెండోస్టేజ్ ట్రాఫిక్సిగ్నల్ వద్ద జనజాగృతి నిర్వహించారు. సిగరెట్, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు నేటి యువత, బాలలు బానిసలు కావడం బాధాకరమని చెప్పారు. పొగాకు సేవనాన్ని త్యజించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి లభిస్తుందని తెలిపారు. పొగ తాగడానికి బదులు పుస్తక పఠనం మంచి అభ్యాసమని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు పూలు, పండ్లు అందించి పొగాకు వ్యసనాన్ని మానాలని కోరారు. -
టెన్త్ ఉత్తీర్ణత అంతేనా?
శివాజీనగర: ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల్లో 60 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత పొందిన జిల్లాల డీడీపీఐలకు నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్ను ఆదేశించారు. శనివారం విధానసౌధలో జరిగిన రాష్ట్ర ప్రగతి పరిశీలన సభలో అన్ని జిల్లాధికారులు, జడ్పీ సీఈఓలతో సీఎం మాట్లాడారు. ఎక్కువ జిల్లాల్లో ఫలితాలు ఎందుకు తగ్గాయో డీడీపీఐలు ఇచ్చే సమాధానం సబబుగా లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్ఎస్ఎల్సీలో ఉత్తీర్ణత తగ్గడంపై ఆగ్రహించారు. జిల్లా కేంద్రాల్లో కూర్చోవద్దు ఉపాధ్యాయుల కొరత, సిబ్బంది కొరత అని నెపం చెప్పరాదని ఘాటుగా సీఎం హెచ్చరించారు. డీడీపీఐలు, జిల్లా ఇన్చార్జ్ కార్యదర్శులు పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులు సరిగా పనిచేస్తున్నారో, లేదో పరిశీలించాలి. శ్రద్ధతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు. డీడీపీఐలు జిల్లాల్లో కూర్చోకుండా అంతటా పర్యటిస్తూ ఉండాలని తెలిపారు. పాఠశాలల నూతన గదుల నిర్మాణం పూర్తి కాకపోవడంపై జిల్లాధికారులను ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల అడ్మిషన్లు తగ్గరాదు, డ్రాపవుట్లు పెరగరాదని ఆదేశించారు. దీనికి తగిన చర్యలను తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పిల్లలకు గుడ్డు, పాలు, రాగిమాల్ట్, హాస్టల్ సదుపాయం అన్నిటిని ఇచ్చినా కూడా ఎందుకు బడుల్లో చేరడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. బాల్య వివాహాలపై ఎస్సీ ఎస్టీలు, బీసీలు, పేదల జనాభా ఎక్కువగా ఉన్నచోట్ల బాల్య వివాహాలు, బాల గర్భిణీ కేసులు ఉంటాయి. దీనిని తప్పకుండా అరికట్టాలని సీఎం చెప్పారు. నిఘా వహించి, రిపోర్ట్ ఇవ్వని పీడీఓలు, రెవెన్యూ సిబ్బంది విరుద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. డీడీపీఐలు, ఉపాధ్యాయులకు శ్రద్ధ లేదా! కలెక్టర్ల భేటీలో సీఎం సిద్దు మండిపాటు -
వృథా ప్రకటనలు మానుకోవాలి
రాయచూరు రూరల్: నాయకులు వృథా ప్రకటనలను ఇవ్వడం మాని నిజమైన మాదిగలకు న్యాయం చేకూర్చాలని, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు నాయకులే అడ్డంకి అని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు దేవమిత్ర పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లికార్జున ఖర్గే, ఆంజనేయ, ప్రియాంక్ ఖర్గే అంటరానితనం నిర్మూలనకు కృషి చేయకుండా అంబేడ్కర్ ఆశయాలకు తిలోదకాలిస్తున్నారన్నారు. మాజీ మంత్రి ఆంజనేయ తాను మాదిగ అని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఇతర కులాలను ఎస్సీ జాబితాలో చేర్చడం తగదన్నారు. -
దక్షిణ కాశీ.. హరిహరేశ్వరాలయం
బళ్లారి రూరల్ : శతాబ్దాల క్రితం శైవులు (శివభక్తులు) వైష్ణవుల (విష్టుభక్తులు) మధ్య అంతరాలు పెరిగి మేము గొప్ప అంటే మేముగొప్ప అని వాదులాడుకొనేవారు. అలాంటి వారికి మేమిద్దరం ఒక్కటేనన్న సందేశాన్ని ఇచ్చేలా దావణగెరె జిల్లా హరిహరలోని హరిహరేశ్వర ఆలయం తార్కాణంగా నిలిచింది. దక్షిణకాశీగా పేరొందిన హరహరేశ్వరాలయం తుంగభద్ర నదికి కుడివైపున వెలసింది. సువిశాల ప్రాంగణంలో హొయ్సళ శిల్పకళా నిర్మాణ శైలి ఉట్టిపడుతోంది. క్రీ.శ.1224 హొయ్సళ రాజు రెండో నరసింహ సేనాధిపతి పోళాల్వ నిర్మించాడు. ఉత్సంగి పాండ్యులు, విజయనగర పాలకులు ఽఈ ఆల యాన్ని అభివృద్ధి పరిచినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం పొడవుగా కాకుండా వెడల్పుగా నునుపైన 56 స్తంభాలతో చతురస్రాకారంతో నవరంగ మహామండపంలా ఉంటుంది. ఈ ఆలయంలో ఏకశిలలో పరమశివుడు, విష్ణుమూర్తి దర్శమిస్తారు. మూల విరాట్ హరిహరేశ్వరుడు కుడివైపున జపమాల, త్రిశూలంతో, ఎడమవైపు కిరీటం, పీతాంబరాలతో శంఖు, చక్రంతో స్వయంభువుగా వెలశాడు. ఆలయ ప్రాంగణంలోనే మహాలక్ష్మిద ఆలయం ఉంటుంది. గర్భగుడికి ఆనుకొని ఎడమ వైపున శివలింగం, ఎదురుగా బసవేశ్వర శిలలు ఉంటాయి. ఈ ఆలయంలో శైవ, వైష్ణవ ఆచారాలను పాటిస్తారు. ఆలయ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. గుహాసురుని సంహారానికి హరిహరుల అవతారం స్కంధపురాణం ప్రకారం ఈ ప్రాంతంలో గుహాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో మహాశివుడు, విష్ణుమూర్తి వల్ల మరణం సంభవించకుండా వరం పొందాడు. అనంతరం దేవతలను, రుషులను, మానవులను బాధించేవాడు. హోమాలు, యగ్న యాగాలకు విఘ్నాలు కలిగించేవాడు. దీంతో దేవతలు, రుషులు విష్ణువును వేడుకొనగా శివుడు, నారాయణుడు కలసి హరిహరేశ్వరుడుగా అవతారమెత్తి గుహాసురున్ని సంహరించి ఇక్కడే కొలువు తీరారని స్థలపురాణం చెబుతోంది. అద్భుత శిల్పకళా నైపుణ్యంతో చతురస్రాకారంలో గుడి ఒకే మూలవిరాట్టుగా భక్తులకు హరిహరుల దర్శనం 56 నునుపైన సుందర స్తంభాలతో విరాజిల్లుతున్న వైనం -
రేప్ కేసులో ఎమ్మెల్యేకు ఊరట
దొడ్డబళ్లాపురం: అత్యాచారం కేసులో బెంగళూరు ఆర్ఆర్ నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. మునిరత్న, అతని అనుచరులు అత్యాచారం కేసులో ముందస్తు బెయిలు కోరుతూ కోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన కోర్టు వారిపై పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణని జూన్ 2కి విచారణ వాయిదా వేసింది. మైక్రో వేధింపులు.. మాజీ జవాన్ ఆత్మహత్య యశవంతపుర: రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ మైక్రోపైనాన్స్ సంస్థల వేధింపులు తగ్గడం లేదు. డెత్నోటు రాసి విశ్రాంత జవాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా మడికెరిలో జరిగింది. మాజీ జవాన్ దేవజన జగదీశ్ (56) మడికెరిలో నివాసం ఉండేవాడు. డబ్బు అవసరాల కోసం కొన్ని మైక్రో ఫైనాన్స్ల నుంచి అప్పులు తీసుకున్నాడు. వాటిని వెంటనే తీర్చాలని సిబ్బంది సతాయించసాగారు. దీంతో జగదీశ్ డెత్నోటులో ఆర్థిక సమస్యలతో పాటు మైక్రో పైనాన్స్ సిబ్బంది వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. ఓ గోదాములో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. రాష్ట్ర పోలీసుకు కేంద్ర పోలీసు వంచన యశవంతపుర: పెళ్లి చేసుకొంటానని నమ్మించి రాష్ట్ర మహిళా పోలీసు కానిస్టేబుల్ను లైంగికంగా వాడుకుని మోసం చేసిన కేంద్ర రిజర్వు కానిస్టేబుల్ బాగోతమిది. మోసగానిపై బెంగళూరు రాజాజీనగర పోలీసులు కేసు నమోదు చేశారు. యాదగిరి జిల్లాకు చెందిన సంజీవ చవాన్ నిందితుడు, ఓ మహిళ కానిస్టేబుల్తో సంజీవ్ ప్రేమాయణం నడిపారు. ఇద్దరూ యాదగిరి జిల్లాకు చెందినవారు కావడంతో పరిచయం మొదలై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెతో సంజీవ్ షికార్లకు వెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. పెళ్లి చేసుకుందామని మహిళా పోలీసు కోరగా, అతడు తప్పించుకు తిరగసాగాడు. ఆమె నిలదీయటంతో నీ ప్రైవేటు ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించసాగాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, రాజాజినగర పోలీసులు నిందితునికి విచారణకు రావాలని నోటీసులు పంపారు. శ్రీకంఠేశ్వరునికి కానుకల వెల్లువ మైసూరు: మైసూరు జిల్లాలో దక్షిణ కాశీగా పిలువబడే నంజనగూడులోని శ్రీకంఠేశ్వరస్వామి ఆలయానికి ఈ త్రైమాసికంలో భక్తుల నుంచి నగదు కానుకలు విరివిగా లభించాయి. రూ. 1.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఆలయ దాసోహ భవన్లో హుండీల లెక్కింపు జరిగింది. మహిళా స్వయం సహాయక బృందాలకు చెందిన వంద మందికి పైగా మహిళలు నగదు లెక్కింపులో పాల్గొన్నారు. దేవస్థానం ఏఈ జగదీష్, ఆలయ ఈవో సతీష్, తలకాడు వెంకటేష్ ప్రసాద్, బ్యాంకు సిబ్బంది ఉన్నారు. నగదు, బంగారం సొత్తు రూపంలో రూ.కోటిన్నర ఆర్జన లభ్యమైంది. సర్కారీ బడికి జడ్జి పుత్రుడు తుమకూరు: ప్రభుత్వ పాఠశాల అంటే పేదల పిల్లలు మాత్రమే చదివించుకుంటారని అనుకుంటారు. అధికారులు, ధనవంతులైతే ఇటు వైపు కన్నెత్తి చూడరు. లక్షల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు స్కూల్లో చదివించాలనుకుంటారు. మధ్యతరగతి కుటుంబాలు కూడా అప్పు చేసైనా ప్రైవేటు స్కూళ్లకే పంపుతారు. ఇలాంటి భావన ప్రబలిపోయిన నేటి సమాజంలో.. ఓ మహిళా జడ్జి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. శిర పట్టణ సీనియర్ సివిల్ జడ్జి జరీఫాబాను తమ కుమారుడు ఆజాద్ను ప్రభుత్వ కన్నడ మీడియం పాఠశాలలోని 5వ తరగతిలో చేర్పించారు. ఈ పాఠశాలలో 350 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు విద్యాబోధన ఉంది. ఇంగ్లిష్, కన్నడ మీడియం రెండూ ఉన్నాయి. న్యాయమూర్తి చొరవకు తాలూకా వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కమల్ క్షమాపణ చెప్పాలి: మంత్రి దొడ్డబళ్లాపురం: కన్నడ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు కమల్ హాసన్ కన్నడిగులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన సినిమాలు కర్ణాటకలో నిషేధిస్తామని కన్నడ, సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తండగడి అన్నారు. శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కమల్ క్షమాపణ చెప్పకపోతే వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే ఫిలిం చాంబర్తో, నటుడు శివ రాజ్కుమార్తో చర్చించామని, ఆయన కూడా అర్థం చేసుకోవాలన్నారు. కన్నడ భాష విషయంలో రాజీ అయ్యే ప్రశ్నే లేదన్నారు. అహంకారమే శివమొగ్గ: తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని చెబుతూ కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసిన నటుడు కమల్హాసన్పై కఠిన చర్యలు తీసుకోవాలని శివమొగ్గలోని డీసీ కార్యాలయం ఎదుట కరునాడు రక్షణ వేదిక నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. ఆయన కన్నడ భాషకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి, కానీ ఇలా మాట్లాడడం అహంకారానికి పరాకాష్ట అని ఆరోపించారు. తొందరపాటు ప్రకటనలు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య గందరగోళం సృష్టించకూడదని అన్నారు. -
సమస్యలపై స్పందించకుంటే చర్యలు
శివాజీనగర: మేము, మీరంతా ప్రజల పన్నుల సొమ్ముతో పరిపాలన చేస్తున్నాం. అన్ని సదుపాయాలను అనుభవిస్తున్నది ప్రజల పన్నుల సొమ్ము ద్వారానే అనేది మరువరాదు. అందువల్ల ప్రజల సమస్యలపై స్పందించకపోతే అటువంటి అధికారుల విరుద్ధంగా నిర్ధాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం సిద్దరామయ్య అన్ని జిల్లాధికారులు, జిల్లా పంచాయితీల సీఇఓలకు కట్టుదిట్టమైన హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల జిల్లాధికారులు, సీఇఓలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. చట్టాన్ని నాశనం చేస్తే చర్యలు తీసుకోండి: రాజ్యాంగ, ప్రజా వ్యతిరేక దుష్ట శక్తులు ఎంతటి ప్రభావం కలిగినా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకుంటామని సీఎం జిల్లా అధికారులను హెచ్చరించారు. శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా మారితే అభివృద్ధి సాధ్యపడదన్నారు. డీసీ, సీఇఓల పర్యటన కార్యక్రమం ప్రకటించాలి: జిల్లాధికారులు, సీఇఓలు తమ పర్యటన కార్యక్రమం వివరాలు ముందుగానే ప్రజలకు తెలిసేలా ప్రకటించాలి. తనిఖీల నివేదిక ఆధారాలను సక్రమంగా ఉంచుకోవాలి. పాఠశాలలు, హాస్టళ్లను ముందుగా సూచన లేకుండా తనిఖీ చేయాలని గతంలో ఆదేశించినా చాలా మంది పాటించలేదనే నివేదిక తనకు వచ్చిందని సీఎం అన్నారు. జిల్లాలో సామాన్య ప్రజలకు ఆరోగ్య, రవాణా సంచారం లాంటి మౌలిక సదుపాయాలు లభించకపోతే దానిని పరిపాలన వైఫల్యమనే పరిగణించాల్సి ఉంటుందన్నారు. అడవుల్లో పాఠశాల, రోడ్డు, ఆసుపత్రిలాంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎందుకు సాధ్యపడలేదని ప్రశ్నించారు. సీఇఓలు ఇటువంటి అడవులకు నిరంతరం భేటీ చేయాలని సూచించారు. జిల్లాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి కొందరు జిల్లాధికారులు, సీఇఓలు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వచ్చాయి. అణగారిన వర్గాలు, పేదలు, సామాన్య ప్రజలు సాధారణంగా జిల్లాధికారుల కార్యాలయానికి వస్తారు. అటువంటి వారి కష్టాలను మీరే ఆలకించకపోతే దానిని పరిష్కరించేవారు ఎవరు?, ఎవరి వద్ద వారు తమ కష్టాలను చెప్పుకోవాలి? అని సీఎం ప్రశ్నించారు. తాలూకా, జిల్లా కేంద్రాల్లో అధికారులు కేంద్ర స్థానంలో ఉండాలన్నారు. జిల్లా ఇన్చార్జి కార్యదర్శులు నెలలో కనీసం రెండు సార్లు ఆయా జిల్లాలకు భేటీ చేసి అభివృద్ధి పనులను పరిశీలించాలన్నారు. జిల్లాధికారులు తప్పు చేసినా నిర్ధాక్షిణ్యంగా చర్యలు: జిల్లాధికారి, జిల్లా భద్రతాధికారులు, సీఈఓలు తమ అహంభావం పక్కకుపెట్టి సమన్వయంతో పని చేస్తేనే రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం సిద్దరామయ్య అన్నారు. రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధంగా పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అధికారులను హెచ్చరించిన సీఎం సిద్దూబాల్య వివాహాలను అడ్డుకోలేరా?బాల్య వివాహాల గురించి సీఎం మాట్లాడుతూ బాల్య వివాహాలను ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నించారు. మీ కింది స్థాయివారు మీకు రిపోర్ట్ ఇవ్వటం లేదా? మీకు వారిపై నియంత్రణ లేదా? అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం 700 బాల్య వివాహాలు జరిగాయని, బాల్యంలోనే తల్లులైన ఘటనలు కూడా వార్తల్లో వచ్చాయన్నారు. ఈ మేరకు కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదనేది తమ దృష్టికి వచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి సంవత్సరాలు గడిచినా బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే ఎలా?, బాల్య వివాహాలు అరికట్టేందుకు ఉన్న చట్టాలు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. -
కమల్హాసన్ దిష్టిబొమ్మ దగ్ధం
మండ్య: కన్నడ భాషను అవమానిస్తూ మాట్లాడిన తమిళ నటుడు కమల్ హాసన్ సినిమా థగ్లైఫ్ను రాష్ట్రంలో విడుదల చేయకూడదని, ఆయన కన్నడిగులకు క్షమాపణలు చెప్పాలని కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు నగరంలోని జేసీ సర్కిల్లో శుక్రవారం గుమిగూడిన కార్యకర్తలు కమల్హాసన్ చిత్రపటానికి నిప్పంటించి దహనం చేశారు. కన్నడిగుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు.నిధుల దుర్వినియోగం ● మున్సిపల్ మేనేజర్ సస్పెన్షన్ దొడ్డబళ్లాపురం: ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలపై దావణగెరె జిల్లా మలెబెన్నూరు మున్సిపాలిటీ కార్యాలయ మేనేజర్ భజక్కనవర్ను సస్పెండ్ చేశారు. ఈ–ఖాతా ప్రక్రియలో అక్రమాలు చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని స్వంతానికి వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. ఆరోపణలు రుజువు కావడంతో భజక్కనవర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గంగాధరస్వామి ఆదేశాలు జారీ చేశారు.కప్ గెలిస్తే సెలవు ఇవ్వాల్సిందే ● సీఎం సిద్దరామయ్యకు క్రికెట్ అభిమాని లేఖ సాక్షి బెంగళూరు: ఏటా ఐపీఎల్ సందర్భంగా ‘ఈ సల కప్ నమ్దే’ అంటూ హోరెత్తిపోయి ఆ తర్వాత ఆర్సీబీ ప్రదర్శనతో నిరాశ చెందే కన్నడిగుల్లో ఈ పర్యాయం కొత్త జోష్ చోటు చేసుకుంటోంది. 18వ సీజన్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిన ఆర్సీబీకి అభిమానుల మద్దతు భారీగా పెరిగింది. ఆర్సీబీ ఫైనల్లో గెలిచి సంబరాల్లో మునగాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిస్తే సెలవు కావాలంటూ బెళగావి జిల్లా గోకాక్కు చెందిన శివానంద మల్లన్నవర్ అనే యువకుడు సీఎం సిద్ధరామయ్యకు ఈ మేరకు లేఖ రాశాడు. ఆర్సీబీ ఫైనల్లో గెలుపొందితే ఏటా ‘ఆర్సీబీ ఫ్యాన్స్ పండుగ’ పేరిట ఉత్సవాలు జరపాలని, విజ్ఞప్తి చేశాడు. కరెంటుకు విద్యార్థి బలి దొడ్డబళ్లాపురం: విద్యుత్ షాక్తో టెన్త్ విద్యార్థి మృతి చెందిన సంఘటన చిక్కబళ్లాపుర తాలూకా దొడ్డకిరుకుంబి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాదేశ్(16) గురువారం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. తన ఇంటి వద్ద ఇనుప కడ్డీతో డ్రైనేజీ పైప్ క్లీన్ చేస్తుండగా పైన ఉన్న విద్యుత్ తంతి తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. నందిగిరిధామ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మంత్రిపై హనీట్రాప్ కేసులో డీజీపీకి సిట్ నివేదిక బనశంకరి: సహకార శాఖ మంత్రి కేఎన్.రాజణ్ణపై హనీట్రాప్ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం దర్యాప్తు పూర్తి చేసి శుక్రవారం డీజీపీ ఎంఏ సలీంకు నివేదిక అందజేసింది. దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులకు ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదు. ఫిర్యాదుచేసిన మంత్రి రాజణ్ణ ఒకటి రెండు సార్లు తన కార్యాలయానికి యువతి వచ్చిందని, తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె చెంపపై కొట్టి పంపానని తెలిపారు. ఆమె జతలో గడ్డంతో ఉన్న యువకుడు కూడా వచ్చాడని తెలపగా, దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు. అంతేగాక మంత్రి ఆప్తులు, గన్మ్యాన్, సెక్యూరిటీ, పీఏను విచారణ చేసినా ఎలాంటి సాక్ష్యాలు దొరకనందున దర్యాప్తు పూర్తి చేసిన సిట్ అధికారులు డీజీపీకి నివేదిక అందజేశారు. -
సాహితీవేత్త హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి కన్నుమూత
శివాజీనగర: ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేశ్ మూర్తి (80) శుక్రవారం కన్నుమూశారు. వయస్సు పైబడిన వ్యాఽధితో బాధపతున్న ఆయన బెంగళూరులోని బీజీఎస్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అనేక సినిమాలకు పాటలు, కథ, సంభాషణ రాసిన ఆయన 85వ కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడయ్యారు. వెంకటేశమూర్తి మృతికి అనేక మంది ప్రముఖులు సంతాపం తెలిపారు. 1944 జూన్ 23న దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హూదిగెరె గ్రామంలో జన్మించిన వెంకటేశ్మూర్తి.. కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి బీఏ, బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి కన్నడలో ఎం.ఏ పట్టాపొందారు. కన్నడలో పీహెచ్డీ చేశారు. 1973లో బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ వాణిజ్య కాలేజీలో కన్నడ అధ్యాపక వృత్తి ఆరంభించిన ఆయన 2000లో రిటైర్డ్ అయ్యారు. వెంకటేశమూర్తి పార్థీవదేహం అంతిమ దర్శనానికి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్ర వెను భాగం బయలు రంగమందిరంలో ఏర్పాటు చేశారు. సీఎం సిద్దరామయ్య సంతాపం: హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి కన్ను మూయటం బాధకు గురి చేసిందని సీఎం సిద్దరామయ్య ఎక్స్లో పోస్టు చేశారు. కవితలు, నాటకం, పిల్లల సాహిత్యం, అనువాదం ఇలా సాహిత్యంలో వివిధ రీతుల్లో నిమగ్నమై అపారమైన చదవరులను కలిగిఉన్న విశిష్ట రచయిత వెంకటేశమూర్తి మృతి సాహితీ లోకానికి తీరని లోటన్నారు. అదేవిధంగా హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి మృతికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వేంకటేశమూర్తి సాహిత్య రంగానికి తనదైన సేవలు అందించారన్నారు. -
తుంగభద్ర నీటి విడుదలపై స్పష్టత ఇవ్వండి
సాక్షి,బళ్లారి: తుంగభద్ర జలాశయం నుంచి ఈ ఏడాది రైతులు నీరు పొందే విషయంపై ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర డ్యాంలోకి భారీగా వచ్చిన వరదలతో 19వ క్రస్ట్గేట్ కొట్టుకు పోయిందని గుర్తు చేశారు. అష్టకష్టాలతో క్రస్ట్గేటు యథావిఽఽధిగా అమర్చడం వల్ల ఖరీఫ్, రబీ పంటలకు నీరు అందాయన్నారు. అయితే క్రస్ట్గేట్లు అన్నింటికీ మరమ్మతులు చేయాలని, అవి సక్రమంగా లేవని నిపుణులు, ప్రభుత్వ పెద్దలు కూడా సూచించారని గుర్తు చేశారు. అయినా ఈ విషయంలో అధికారులు ఎందుకు పక్కా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అధికారులు చొరవ తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిపుణులు సూచించినా క్రస్ట్గేట్లు మరమ్మతులు చేయక పోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. 33 క్రస్ట్ గేట్లను మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు ఇచ్చిన సూచనలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఈ ఏడాది రైతుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం నీటి పారుదల సలహా సమితి అధ్యక్షుడు శివరాజ్ తంగడిగి రబీలో నీటి విడుదలను నిలుపుదల చేసి క్రస్ట్ గేట్లను మరమ్మతు చేస్తామని చెప్పినా ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం డ్యాంలోకి ఇన్ఫ్లో వస్తోందని, ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం అయిందన్నారు. త్వరలో కాలువలకు కూడా నీరు వదలాల్సిన పరిస్థితులు ఉన్నందున రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ఈసందర్భంగా రైతు సంఘం నాయకులు భీమన్నగౌడ, మల్లప్ప, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. క్రస్ట్గేట్లకు ఎందుకు మరమ్మతులు చేయలేదు? అధికారులపై రైతు సంఘం అధ్యక్షుడు మండిపాటు -
జనౌషధి కేంద్రాలను పునఃప్రారంభించాలి
బళ్లారి రూరల్ : ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరనలో జనౌషధి కేంద్రాలను మూసివేయాలని రాష్ట్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం బీఎంసీఆర్సీ ఆసుపత్రి ముందు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జనౌషధి కేంద్రాలను పునః ప్రారంభించాలన్నారు. కేవలం ప్రధాని మోదీ బొమ్మ ఉన్నందునే అధికార రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని ఆరోపించారు. అధిక మొత్తం చెల్లించి మందులు కొనలేని పేదలకు జనౌషధి కేంద్రాలు ఎంతో సహాయకారిగా ఉండేవన్నారు. జనౌషధి కేంద్రాలను మూసివేస్తే, మందులు కొనలేని పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. డ్రగ్ మాషియాలో భాగంగానే తక్కువ ధరకు మందులను అందించే జనౌషధి కేంద్రాలను మూసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. బీఎంసీఆర్సీ ఆసుపత్రిలో కుక్కకాటుకు వినియోగించే రేబిస్ మందుల కొరత ఉందన్నారు. అందువల్ల వైద్యులు బయట మందులషాపులకు చీటీలు రాసిస్తున్నారన్నారు. అందోళనలో భాగంగా బీజేపీ నాయకులు నినాదాలతో కూడిన ప్లకార్డులతో ఆసుపత్రి ముందు బైటాయించారు. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణుల ఆందోళన బీఎంసీఆర్సీ ఆసుపత్రి ముందు బైటాయించి ధర్నా -
ఇందిరా క్యాంటీన్ ప్రారంభం
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో రిబ్బన్ కట్ చేసి ఇందిరా క్యాంటీన్ను ఎంపీ ఈ.తుకారాం, హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్, పట్టణ పంచాయతీ అధ్యక్షురాలు బీ.రేఖా రమేష్, ఉపాధ్యక్షుడు సిద్ధయ్య ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రవాసి మందిరంలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఇందిరా క్యాంటీన్ ఏర్పాటుతో ఆస్పత్రికి వచ్చే రోగులకు, కార్మికులకు, పేదలకు ఎంతో అనుకూలం అవుతుందన్నారు. అయితే కొట్టూరులో ఉన్న ప్రస్తుత సమస్యల గురించి విలేకరులు అడగగా ఇక్కడ నెలకొన్న సమస్యలను రాబోయే రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు దొడ్డ రామణ్ణ, ఎంఎంజీ సత్యప్రకాష్, బీడీసీసీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకేష్, పట్టణ పంచాయతీ చీఫ్ నసరుల్లా, అడికె మంజునాథ్, ఇంజినీర్ అశోక్, డీఎస్ఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ బీ.మరిస్వామి, పట్టణ పంచాయతీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
5లోగా ఫీజు వివరాలు వెల్లడించండి
హొసపేటె: విజయనగర జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజు వివరాలను జూన్ 5వ తేదీలోపు ప్రకటించాలని, విస్మరిస్తే ఆ పాఠశాలల సమాచారాన్ని జిల్లా వెబ్సైట్లో ప్రకటిస్తామని విజయనగర జిల్లాధికారి ఎం.ఎస్.దివాకర్ హెచ్చరించారు. నగరంలోని తన కార్యాలయ సభాంగణంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పాలక మండళ్ల సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏ పాఠశాల అయినా అదనపు ఫీజులు వసూలు చేస్తే ఎలాంటి సంకోచం లేకుండా నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. ఫీజు వివరాలను అన్ని పాఠశాలల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలన్నారు. సమగ్ర సర్వే 86 శాతం పూర్తి షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేలో పని కోసం వారి వారి నగరాలు, తాలూకాలు, గ్రామాల నుంచి వలస వచ్చిన షెడ్యూల్డ్ కులాల కుటుంబాల సమగ్ర సర్వే 86 శాతం పూర్తయిందని జిల్లాధికారి దివాకర్ తెలిపారు. గురువారం నగరంలోని తన కార్యాలయ హాల్లో షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేకు సంబంధించి కమ్యూనిటీ నాయకులు, వివిధ సంఘ సంస్థల ఆఫీస్ బేరర్లతో ఏర్పాటు చేసి సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేపై జస్టిస్ నాగ మోహన్దాస్ సింగిల్ మెంబర్ విచారణ కమిషన్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పనులను పూర్తి చేసిందన్నారు. ఉపాధి, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలను మినహాయించిందన్నారు. సర్వేలో 14 శాతం మాత్రమే ఇంకా పెండింగ్లో ఉందన్నారు. -
దుకాణాల్లో డ్రగ్స్ విక్రయిస్తే ఖబడ్దార్
రాయచూరు రూరల్ : జిల్లాలో మత్తు పదార్థాలను మందుల దుకాణాల్లో విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య సూచించారు. గురువారం తన కార్యాలయంలో మందుల దుకాణాల వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిస కారాదన్నారు. యువతకు మత్తు పదార్థాలు విక్రయించే ముందు వైద్యుల సలహాలను పాటించాలన్నారు. మత్తు పదార్థాల సేవనంతో అనారోగ్యానికి తోడు మానసికంగా కుంగిపోతారన్నారు. సమావేశంలో ఏఎస్పీ హరీ్ష్, డీఎస్పీ శాంతవీర, సీఐలు ఉమేష్ నారాయణ కాంబ్లే, మహేష్, సాబయ్యలున్నారు.వ్యక్తి అదృశ్యంహొసపేటె: తాలూకాలోని 32వ వార్డు బాణదకేరిలోని గరడిమనె నివాసి కే.వెంకటేష్(57) అనే వ్యక్తి ఈనెల 10వ తేదీ నుంచి అదృశ్యం కావడంపై టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని తలకు గాయమై మానసిక అనారోగ్యంతో ఉన్నాడు. చాలా చోట్ల చికిత్స చేయించినా పూర్తిగా నయం కాలేదు. 5.4 అడుగుల ఎత్తు, గుండ్రని ముఖం, ముదురు రంగు శరీరఛాయ గల ఇతను కనిపించకుండా పోయినప్పుడు లేత నీలం రంగు పుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించాడు. కన్నడ భాషలో మాట్లాడగలడు. ఇతని ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీస్ స్టేషన్ను లేదా సెల్– 9480805745, 08394–224033, 224204 నంబర్లలో సంప్రదించాలని కోరారు.గంజాయి విక్రయం.. నిందితుల అరెస్ట్రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో హైడ్రో గంజాయిని విక్రయిస్తున్న కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అభిరామ్ ఎల్ వరసిద్ధి వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంగావతిలో అక్రమంగా సరఫరా చేస్తున్న రూ.18.06 లక్షల విలువైన 1.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. థాయిలాండ్ నుంచి భారత్కు అక్రమంగా గంజాయిని తెప్పించుకొన్న కేరళకు చెందిన భాగస్వాములు సౌజేష్(28), సలీం(27), దుర్గా ప్రసాద్(27), బాద్షా(32), మదన్ (26), సూర్యప్రతాప్రెడ్డి(19), మహ్మద్ హమీద్(22), మణికంఠ(23)లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.మిఠాయిలతో విద్యార్థులకు స్వాగతంరాయచూరు రూరల్: జిల్లాలో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు మిఠాయిలతో స్వాగతం పలికారు. 2025–26వ విద్యా సంవత్సరానికి సంబంధించి తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ తాలూకాలోని బిజినగేర, విజయ నగర క్యాంప్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అందాల్సిన పుస్తకాలు, యూనిఫాం, ఇతర సౌకర్యాలను కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.బాలిక ఆత్మహత్యదొడ్డబళ్లాపురం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దొడ్డబళ్లాపురం పట్టణ పరిధిలోని దర్గాపురలో చోటుచేసుకుంది. బీహార్కు చెందిన ధర్మేంద్రకుమార్ దర్గాపురలోని పిళ్లేగౌడ అనే వ్యక్తికి చెందిన తోటలో నివాసం ఉంటోంది. ధర్మేంద్ర సమీపంలోని రైల్వేస్టేషన్లో సిమెంటు మూటలు అన్లోడ్ చేసే పని చేస్తుండగా భార్య గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్తోంది. వీరికి నలుగురు సంతానం. రెండవ కుమార్తె చాందిని కుమారి(12) మానసిక రోగంతో బాధపడుతుండేది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లగానే ఇంట్లో తమ్ముడిని బయటకు పంపించి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పేదలకు భూములు పంచండి
రాయచూరు రూరల్: జిల్లాలో భూమి లేని పేదలకు భూములు పంచాలని భూ వసతి పోరాట సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సమితి అధ్యక్షుడు ఆంజనేయ మాట్లాడారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి భూములు పంపిణీ చేయాలని ఒత్తిడి చేశారు. అనంతరం స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. కేంద్రీయ పాఠశాలలో విద్యార్థులకు శిబిరం హొసపేటె: టీబీ డ్యాం పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం విద్యార్థులకు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. 3 నుంచి 10వ తరగతి ఆంగ్ల మీడియం విద్యార్థులకు తెలుగు భాష గురించి అక్షరాలను ఉపాధ్యాయురాలు జీ.సునీత తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయం ఈ సారి రీజినల్ లాంగ్వేజ్లో ఒకటైన తెలుగు అక్షరాలను చదవడం, రాయడంపై ఒక వారం పాటు విద్యార్థులకు ఈ శిబిరాన్ని చేపట్టామని ప్రిన్సిపల్ మనోహర్లాల్ తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు. నిలిచిన లారీకి కారు ఢీ.. ముగ్గురి దుర్మరణం హుబ్లీ: నిలబడిన లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన జిల్లాలోని అణ్ణిగేరి తాలూకా భద్రపుర వద్ద హైవేలో గురువారం చోటు చేసుకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మదన్, సురేష్, ఎల్ఎన్.వేణుగోపాల్ మృతి చెందారు. తోట చూసుకొని ముండరగి నుంచి బెంగళూరు వైపునకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను మైసూరు, బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అణ్ణిగేరి పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి రాయచూరు రూరల్ : జిల్లాలో సంచార నియమాలను తప్పకుండా ప్రతి ఒక్క వాహనదారు పాటించాలని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయం వద్ద ప్రచారాందోళనకు శ్రీకారం చుట్టి ఆయన మాట్లాడారు. యువత, ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అధిక శాతం మంది గ్రామీణ ప్రజలు సైబర్ నేరాలకు బలవుతూ లక్షల్లో డబ్బులు కోల్పోయారన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏఎస్పీ హరీ్ష్, డీఎస్పీ శాంతవీర, సీఐలు ఉమేష్ నారాయణ కాంబ్లే, మహేష్, సాబయ్య పాల్గొన్నారు. ఆకాశవాణి అధికారికి ఘనంగా వీడ్కోలు రాయచూరు రూరల్: రాయచూరు ఆకాశవాణిలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన అధికారి బావలత్తిని ఎద్దుల బండిలో ఊరేగించి ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం పదవీ విరమణ సందర్భంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలపడానికి భారీగా తరలివచ్చి నూతన ఒరవడితో వీడ్కోలు పలికారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప పాల్గొని మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన అధికారి బావలత్తి అందరి మనస్సులను దోచుకున్నారన్నారు. వెంకటేష్ బేవినబెంచి, సరోజ, విజయ రాజేంద్ర, బండేష్, ఈరణ్ణలున్నారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి బాలుడి ఘనత
హుబ్లీ: పాత హుబ్లీ ఇంద్రప్రస్థ నగర్ నివాసి సుస్విన్ అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం సైకిల్ తొక్కడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును దాఖలు చేసి ఘనత సాధించాడు. 4.8 ఏళ్ల సుస్విన్ 39.24 నిమిషాల్లో 11.18 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం ద్వారా అందరినీ ఆశ్చర్య పరిచాడు. కాగా ఇంతకు ముందు 5.3 ఏళ్ల తమిళనాడు చిన్నారి అదవ్ అశోక్కుమార్ అనే బాలుడు 10.3 కిలోమీటర్ల దూరాన్ని 39.44 నిమిషాల్లో అధిగమించాడు. దీన్ని సవాల్గా తీసుకున్న సుస్విన్ 2025 ఏప్రిల్ 5న సత్తూరు ఆశ్రయ కాలనీ నుంచి ఉదయం 6.40 గంటలకు సైక్లింగ్ ప్రారంభించి 7.19 గంటలకు ఉణకల్ క్రాస్ వరకు తొక్కి ఘనత చాటాడు. ప్రతి రోజు హుబ్లీ ఆనంద్నగర్ చుట్టు పక్కల ప్రాంతంలో తండ్రి వినాయక్ బాలుడికి సైక్లింగ్లో శిక్షణ ఇచ్చే వారు. రోజు అభ్యాసం చేస్తూ అలాగే అభ్యాసాన్ని రెట్టింపు చేసుకుంటూ చివరుకు 11 కిలోమీటర్ల దూరాన్ని 39.05 నిమిషాల్లో చేరుకున్నాడు. రింగ్ రోడ్డులో సాధన షురూ తొలుత హుబ్లీ రింగ్ రోడ్డులో సైకిల్ తొక్కడం ప్రారంభించి ఆ తర్వాత జంట నగరాల్లోని రోడ్లల్లో తొక్కడం ప్రారంభించారు. అనంతరం అభ్యాసంతో సైకిల్ రైడింగ్ అలవాటు చేసుకున్నాడని బాలుడి తల్లి సుష్మ తెలిపారు. పిల్లల ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో కీలకం అన్నారు. సుస్విన్ సైక్లింగ్లో సాధన ప్రారంభించిన వేళ మేమందరం చిన్నారికి మద్దతుగా నిలిచామన్నారు. ప్రస్తుతం చిరంజీవి రికార్డు సాధించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. తండ్రి వినాయక హళపేటె మాట్లాడుతూ తమిళనాడు బాలుడు రికార్డును బద్దలుగొట్టాలన్న లక్ష్యంతోనే కుమారుడు సుస్విన్కు నిరంతరం శిక్షణ ఇచ్చానున్నారు. ఆ విధంగా బాలుడు ప్రతి రోజు రెండు గంటలు ప్రాక్టీస్ చేయించేవాడినని, ప్రస్తుతం కుమారుడి రికార్డును ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దాఖలు చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. 11 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి చరిత్ర సృష్టించిన బాలుడు -
రైతులకు వ్యవసాయ సలహాలివ్వాలి
రాయచూరు రూరల్: జిల్లాలో రైతులకు వ్యవసాయంపై శాస్త్రవేత్తలు సలహాలివ్వాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప సూచించారు. రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద ఖరీఫ్ సీజన్ విత్తనాల అభియాన్ను వికసిత వ్యవసాయ సంకల్ప అభియాన్ జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వ్యవసాయ అంశాల గురించి రైతులకు వివరించాలన్నారు. 15 రోజుల పాటు జరిగే జాతా సందర్భంగా గ్రామాల్లో పర్యటించాలన్నారు. జాతాలో అధికారులు దురుగేష్, స భ్యులు మధుసూదన్, మల్లేష్, మధుసూదనరెడ్డిలున్నారు. -
డీసీసీబీ ఎన్నికల్లో కాంగ్రెస్కు భంగపాటు
కోలారు: తీవ్ర కూతూహలం రేకెత్తించిన డిసిసి బ్యాంకు డైరెక్టర్ల ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. బ్యాంకు పాలక మండలిలో 18 మండి డైరెక్టర్లు ఉండి ఇందులో 6 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. మిగిలి 12 డైరెక్టర్ల స్థానాలకు జరిగిన ఎన్నికలో 8 స్థానాల ఫలితాలు వెలువడి, ఇంకా 4 స్థానాల ఫలితాలు కోర్టు ఆదేశాల మేరకు రిజర్వులో ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పాలక కాంగ్రెస్ పార్టీకి నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఎన్నికలలో డిసిసి బ్యాంకు మాజీ అధ్యక్షుడు బ్యాలహళ్లి గోవిందగౌడతో పాటు మాజీ డైరెక్టర్లు, కొత్త అభ్యర్థులు బరిలోకి దిగారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, కేజీఎప్ ఎమ్మెల్యే రూపా శశిధర్, బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బరిలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర కసరత్తులు చేసినా ఫలించలేదు. బ్యాలహళ్లి గోవిందగౌడను ఓడించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నిక అనంతరం విలేకరులతో మాట్లాడిన బ్యాలహళ్లి గోవిందగౌడ తనకు ప్రాణహాని జరిగితే అందుకు మాజీ మంత్రి కె ఆర్ రమేష్కుమార్ కారణమని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చ చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. గోవిందగౌడ ఎన్నిక -
ఆలమట్టికి పోటెత్తిన వరద
రాయచూరు రూరల్: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు వరద పోటెత్తింది. ఫలితంగా ఆలమట్టి జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. రెండు రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు ఉపనది మలప్రభ ఉధృతంగా ప్రవహిస్తోంది. ముదోళ్ తాలూకా ధవళేశ్వరం బ్రిడ్జి కమ్ బ్యారేజీని వరద జలాలు తాకుతూ ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలోని రాజాపూర్, హిప్పరిగి జలాశయాల నుంచి వరద నీరు అలమట్టికి చేరుతున్నాయి. దీంతో 50 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. గుర్జాపూర వంతెన గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. యాదగిరి జిల్లాలో భారీ వర్షాలు యాదగిరి జిల్లాలో కుంభవృష్టి కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శహపుర తాలూకా యడళ్లిలో ఇళ్లలోకి నీరు చేరి వస్తు సామగ్రి, ధాన్యం తడిసి ప్రజలు నిరాశ్రయులయ్యారు. యాదగిరిలోని విద్యాభారతి పాఠశాల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిపైకి వరద నీరు చేరింది. వరదతో కృష్ణా నది పోటెత్తుతుండటందతో ప్రజలు నీటి వనరుల వద్దకు వెళ్లరాదని అధికారి నితీష్ ఆదేశాలు జారీ చేశారు. -
1న ప్రతిభా పురస్కారాలు ప్రదానం
సాక్షి,బళ్లారి: కర్ణాటక వీరశైవ లింగాయత్ ఉద్యోగుల క్షేమాభివృద్ధి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జూన్ 1న సముదాయంలోని ప్రతిభావంత విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఈమేరకు ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు చెన్నబసవస్వామి గురువారం వివరాలు వెల్లడించారు. 10వ తరగతి, పీయూసీలో 85శాతం పైగా మార్కులను తెచ్చుకున్న వారిని సన్మానించి, పురస్కారం అందజేస్తామన్నారు. ఇప్పటికే 10వతరగతి విద్యార్థులు 130 మంది, పీయూసీ విద్యార్థులు 135 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరిలో అర్హులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామన్నారు. సమావేశంలో బసవరాజు బిసలహళ్లి,ఎస్పీ జగదీష్,నాగేష్ తదితరులు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: గాణిగ సమాజం ఆధ్వర్యంలో జూన్ 1న ప్రతిభాపురస్కారాలు ప్రదానం చేయనుననట్లు ఆ సముదాయం అధ్యక్షుడు చెన్నప్ప తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టెన్త్, పీయూసీలో ఉత్తమ మార్కులు సాధించిన సముదాయానికి చెందిన విద్యార్థులకు నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలిపారు. బసప్పహళి, శంకరప్ప, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
దోపిడీదొంగల అరెస్టు
యశవంతపుర: జాతీయ రహదారిలో దోపిడీకి ప్లాన్ వేసిన గురుడ గ్యాంగ్కు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి కారంపొడి, కత్తిని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళూరు చొక్కబెట్టుకు చెందిన జలీల్ హుసైన్, భట్కళ హెబళె గాంధీనగరకు చెందిన డ్రైవర్ నాసీర్ హకీమ్ను అరెస్ట్ చేశారు. జలీల్పై ఇప్పుటీకే 11 కేసులు, నాసీర్పై 2 కేసులున్నట్లు భట్కళ పోలీసులు తెలిపారు. మరో నిందితుడు మైనర్ బాలుడు కాగా, అతనిపై కూడా ఒక కేసు ఉన్నట్లు పోలీసులు వివరించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హైవే మీద తెల్లవారుజామున ఐదు మంది పొంచి ఉండి, ఎవరైనా కనిపిస్తే దోచుకోవాలని సిద్ధమయ్యారు. అదే మార్గంలో వెళ్లతున్న భట్కళ పోలీసుల కంట పడ్డారు. ముగ్గురిని పట్టుకుని ఠాణాకు తరలించారు. ఇటీవలి కాలంలో నేరగాళ్లు గరుడ పేరుతో ముఠాలను ఏర్పాటు చేసుకుని హల్చల్ చేయడం పెరిగింది. డ్యాన్స్మాస్టర్ వంకరబుద్ధి కృష్ణరాజపురం: డ్యాన్స్ మాస్టర్ వంకర బుద్ధి ప్రదర్శించాడు. డ్యాన్స్ పేరుతో బాలికను తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.ఈ ఘటన బెంగళూరు నగరం మహదేవపుర నియోజకవర్గంలోని కాడుగొడిలో జరిగింది. భారతీ కన్నన్(32) అనే వ్యక్తి చిన్నారులకు డ్యాన్స్లో శిక్షణ ఇస్తుంటాడు. ఈ నెల 24న ఓ బాలికను డ్యాన్స్ శిక్షణ పేరుతో కారులో ఎక్కించుకొని నగరంలో పలు ప్రాంతాల్లో తిప్పాడు. ఈక్రమంలో లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో కాడుగోడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
నకిలీ ఐఎస్ఐ ఫ్లైవుడ్ స్వాధీనం
హుబ్లీ: ఉత్తర కన్నడ జిల్లా కార్వారలోని ఒక దుకాణంలో నకిలీ ఐఎస్ఐ మార్కుతో మేరిన్ ఫ్లైవుడ్ విక్రయిస్తుండగా అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఫ్లైవుడ్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులు ధ్రువీకరించుకోవాలని, ఆల్మార్కింగ్ ఉన్నవాటినే వినియోగదారులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. గంజాయి విక్రయాలు అరికట్టండి రాయచూరు రూరల్: యువతలో నేర ప్రవృత్తికి కారణమైన గంజాయి విక్రయాలను అరికట్టాలని, జిల్లాలో జరుగుతున్న హత్యలకు అడ్డుకట్ట వేయాలని కర్ణాటక రాష్ట్ర ది లేజండ్ టిప్పుసుల్తాన్ సంఘం అధ్యక్షుడు రశీద్ డిమాండ్ చేశారు. గురువారం ఆబ్కారీ శాఖ కార్యాలయం వద్ద ఆయన ధర్నా చేశారు. నగరంలో గంజాయి, హఫీం వంటి విక్రయాలు జరుగుతున్నాయని, వాటిని సేవించి యువత నేరాలకు పాల్పడుతోందన్నారు. దీనికితోడు జిల్లాలో హత్యల సంస్కృతి పెరుగుతోందన్నారు. రాత్రి 10 గంటల అనంతరం దుకాణాలు, హోటల్స్ బంద్ చేయాలన్నారు. అనంతరం ఆబ్కారీశాఖ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఫుట్పాత్ల్లో ఆక్రమణలు తొలగించుకోండి రాయచూరురూరల్: నగరంలో ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్లపై దుకాణాలు తొలగించుకోవాలని యజమానులకు డీఎస్పీ శాంతవీర్ సూచించారు. బుధవారం ఆయన నగరంలోని జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం నుంచి జైల్ రోడ్, ఏక్మీనార్, సూపర్ మార్కెట్, తీన్కందిల్, షరాఫ్ బజార్, మహవీర్ సర్కిల్ వరకు పర్యటించారు. ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను పరిశీలించారు. పాదచారులకు ఇబ్బందిగా ఉందని, వెంటనే దుకాణాలు తొలగించుకోవాలని యజమానులకు సూచించారు. లేని పక్షంలో తామే ఆక్రమణలు తొలగించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సదర్ బజార్ సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, ట్రాఫిక్ ఎస్ఐ సణ్ణ వీరణ్ణ పాల్గొన్నారు. రైల్వే ట్రాక్పై తనిఖీలు హుబ్లీ: భారీ వర్షాలు నేపథ్యంలో నైరుతి రైల్వే జోన్ జీఎం ముకుల్ శరణ్మాతూర్ గురువారం అటవీ ప్రాంతాలలోని రైల్వే ట్రాక్ను పరిశీలించి అవసరమైన సూచలను అందజేశారు. హుబ్లీ–కోలం విభాగంలో విండో ట్రయల్ ద్వారా ఈపరిశీల చేశారు. క్యాతల్రాక్, కోలం తదితర అటవీ ప్రాంతంలో పట్టాలు, వంతెనల స్థితిగతులపై ఆరా తీశారు. ట్రాక్ రిలేయింగ్ టైన్ యంత్రం వినియోగించి అమర్చిన ఇటీవల ఆధునీకరించిన ట్రాక్ స్లీపర్లను కూడా పరిశీలించారు. తనిఖీల్లో ఆర్డీఎస్ఓ ట్రాక్ డైరెక్టర్ బీపీ సింగ్,హుబ్లీ డీఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న స్థానికులు హుబ్లీ: జిల్లాలో ఉన్న కబేళాలకు మూగజీవాలను అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు అడ్డుకొని 40 ఆవులను రక్షించారు. ఈఘటన కలఘటగి పట్టణంలో జరిగింది. ఏపీఎంసీ ఆవరణంలో పాడుబడిన రెండు గోదాములలో ఈ పశువులను నిర్బంధించారు. వీటిని బుధవారం రాత్రి వాహనంలో తరలించడానికి ప్రయత్నిస్తుండగా స్థానిక యువకులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శ్రీశైల కౌజలగి తన సిబ్బందితో చేరుకుని దాదాపు రూ.6 లక్షల విలువైన గోవులను రక్షించారు. -
నగరంలో పచ్చదనం పెంచుదాం
రాయచూరు రూరల్: నగరాన్ని పచ్చదనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటి పోషించాలని కమిషనర్ జుబీన్ మోహపాత్రో పిలుపునిచ్చారు. రాయచూరు కార్పొరేషన్ భవనంలో మేయర్ నరసమ్మ అధ్యక్షతన బుధవరం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. జూన్ 5న నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన రహదారిలో కుడి ఏడమ వైపుల మొక్కలు నాటుతామని, నగరవాసులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఉప కమిషనర్ గురు సిద్దయ్య పాల్గొన్నారు.కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాంరాయచూరు రూరల్: నగరంలో పౌర కార్మికుల సమస్యలపై స్పందిస్తామని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ హమీచ్చారు. గురువారం నగరసభ కార్యాలయం వద్ద అందోళన చేపట్టిన కార్మికులను ఎమ్మెల్యే కలిసి మాట్లాడారు. ప్రభుత్వం పౌర కార్మి కుల సర్వీసులు రెగ్యులర్ చేసిందన్నారు. జ్యోతి సంజీవినీ, కేజీఐడీ ఇతర సౌలభ్యాలు కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు.గోవుల రక్షణకు చెక్పోస్టులు ఏర్పాటు చేయండిరాయచూరు రూరల్: జిల్లాలో గోవుల రక్షణకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని గోసేవా సంఘం కార్యదర్శి వినయ్ ిసింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గోవుల అక్రమ రవాణా జరుగుతోందని, దానిని నిలువరించేందుకు నగరంలోని నవోదయ, యరగేర, శక్తినగర. కల్లూర్ క్రాస్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. స్వప్న సింగ్, బాలప్ప, రాయరెడ్డి పాల్గొన్నారు.చికిత్స పొందుతూ క్షతగాత్రుడి మృతిహుబ్లీ: నగరంలోని నూల్వీక్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజాటౌన్ నివాసి ఆటో డ్రైవర్ నజీర్ అహమ్మద్ గురువారం మృతి చెందాడు. ఇతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. హుబ్లీ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.రాజకాలువలను శుభ్రం చేయాలితుమకూరు: ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని, వరదనీరు సక్రమంగా వెళ్లేలా నగరంలో రాజకాలువలను శుభ్రం చేయాలని నగర ఎమ్మెల్యే జ్యోతిగణేష్ జిల్లాధికారి శుభ కళ్యాణ్ను మనవి చేశారు. గురువారం జిల్లాధికారిని కలిసి నగరంలో ఉన్న అమాని చెరువు, చుట్టుపక్కలున్న గార్డెన్ రోడ్డు, దిబ్బూరు, ఎస్.మాల్ వెనుక భాగం, శిరా గేట్, ఈ ప్రాంతంలో వర్షాలు పడితే నీళ్లు ముంచెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. వర్షాలు పడటానికిముందే కాలువలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తీసేయాలి, మరమ్మత్తులు చేయించాలని కోరారు. నగరంలో అనేక లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు వస్తోందని, పరిష్కారం చేయాలని తెలిపారు.బ్రేక్ ఫెయిలై ప్రమాదంతాడిమర్రి: సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండల పరిధిలోని కేయన్ పాళ్యం వద్ద గురువారం ఓ కారు బ్రేక్ ఫెయిలై రాళ్ల కుప్పను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్పల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలు.. బెంగుళూరుకు చెందిన షరీఫ్, ఐదు మంది తమ బంధువులతో గూగూడు కుళ్లాయస్వామి దర్శనానికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు వస్తూ తాడిమర్రికి రావడానికి బదులు దారి తప్పి చిల్లకొండయ్యపల్లికి గ్రామానికి వెళుతున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో కేయన్ పాళ్యం వద్దకు రాగానే కారు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. దీంతో రోడ్డు పక్కన రాళ్ల కుప్పను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో వారికి స్పల్ప గాయాలయ్యాయి. -
తగ్గని కమల్ సెగలు
శివాజీనగర: కన్నడ భాష పుట్టుక గురించి ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కమల్ సినిమాలను నిషేధించాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి నేతలు సమావేశమయ్యారు. నిర్మాత సా.రా గోవిందు మాట్లాడుతూ, కమల్ హాసన్పై మాకెవరికీ కనికరం లేదు. శుక్రవారంలోగా కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే.. కన్నడనాట ఆయన సినిమాలను విడుదల చేయనివ్వం అని హెచ్చరించారు. ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ కన్నడ సంఘలు కమల్ సినిమాను బ్యాన్ చేయాలని పట్టుబట్టారు. కాబట్టి కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కమల్హాసన్ చేత క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆగని నిరసనలు రాష్ట్రంలో కమల్ సినిమాలను నిషేధించాలని కన్నడ సినిమా పంపిణీదారులు కమలాకర్ నేతృత్వంలో మరో భేటీ జరిగింది. ఈ సమయంలోనే కొన్ని కన్నడ సంఘాల కార్యకర్తలు ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పాలని కన్నడ సంఘాల పట్టు -
గుండెపోటుతో యువతి మృతి
యశవంతపుర: కరోనా వైరస్ ఉత్పన్నమయ్యాక యువతీ యువకులు కూడా గుండెపోటుతో బలవుతున్నారు. ఇదే మాదిరిగా హాసన్ జిల్లా కెలవత్తి గ్రామంలో కవన కె.వి (21) గుండెపోటుతో చనిపోయింది. ఆమె హాసన్ పట్టణంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. వార్షిక పరీక్షలు జరుగుతుండగా మూడు పరీక్షలను రాసింది. మరో మూడు రాయవలసి ఉంది. బుధవారం సాయంత్రం పరీక్ష రాసి ఇంటికి వెళ్లింది. దాహంగా ఉంది, నీళ్లివ్వాలని తల్లిని అడిగింది. ఆమె ఫిల్టర్ వద్దకెళ్లి నీటిని తీసుకువచ్చేలోపు కవన కుప్పకూలి పడిపోయింది. తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జిల్లాలోనే వారం రోజుల కింద సంధ్య అనే విద్యార్థిని కూడా గుండెపోటుతో మరణించింది. -
గురువుల ఉపదేశం బంగారం
చింతామణి: తాలూకాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన కై వార శ్రీ యోగినారేయణ స్వామి ఆలయంలో కాలజ్ఞాని శ్రీ యోగి నారేయణ తాతయ్య 190వ జీవ సమాధి ప్రవేశ పర్వ ఆరాధన ఉత్సవాలు గురువారం ఘనంగా ఆరంభమయ్యాయి. తాతయ్య విగ్రహానికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేసిన ధర్మాధికారి జయరాం మాట్లాడుతూ గురువుల ఉపదేశాలను మనం పాటిస్తే జీవనం బంగారంగా సాగుతుందన్నారు. మానవుడు అనేక ఆశలకు లోనవుతుంటాడు. అయితే యోగి ఆశలను వదిలి సాధనకర్తగా తయారువుతాడన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి కాషాయ వస్త్రాలను బహూకరించారు. తాతయ్య రచించిన తాటాకుల పుస్తకాలను విశేషంగా పూజించారు. నలమూలల నుంచి భక్తజనం తరలివచ్చారు. రాత్రి అఖండ భజన సాగింది. -
‘సలాం బళ్లారి’తో సమస్యలు పరిష్కారం
● ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి బళ్లారిఅర్బన్: నగరంలో సమస్యల పరిష్కారానికి సలాం బళ్లారి కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పేర్కొన్నారు. సలాం బళ్లారి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.1200 కోట్లతో నగరంలో శాశ్వత మంచినీటి పరిష్కారానికి త్వరలో శ్రీకారం చుడుతామన్నారు. గడిగి చెన్నప్ప సర్కిల్ త్వరలో ప్రారంభోత్సవం చేస్తామన్నారు. సీఎం, డీసీఎంలు హాజరవుతారన్నారు. ఇంతకు ముందు తాను పర్యటించిన వార్డుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. -
కసాప సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహిద్దాం
● మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి సాక్షి,బళ్లారి: బళ్లారి జిల్లాలో 68 సంవత్సరాల తర్వాత జరగనున్న అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళననాన్ని ఘనంగా నిర్వహిద్దామని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కసాప బళ్లారి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాలి రుక్మిణమ్మ, చెంగారెడ్డి కామర్స్ కాలేజీలో తల్లిదండ్రుల పేరుమీదుగా గురువారం ఏర్పాటు చేసిన స్మారక దత్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కన్నడ నేల, నీరు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. కన్నడ భాషాభివృద్ధికి కసాప చేస్తున్న కృషి శ్లాఘనీయమన్నారు. మాతృభాషను, పుట్టిన నేలను ఎప్పుడూ మరవకూడదని సూచించారు. కన్నడ కస్తూరి పరిమళాన్ని నలుదిశలా ప్రసరింపజేయడానికి అఖిలభారత భారత కన్నడ సమ్మేళాన్ని కన్నుల పండువగా నిర్వహించాలన్నారు. ఆ సమ్మేళనం బళ్లారిలో సువర్ణాక్షరాలతో లిఖించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టూరుస్వామి బీఎడ్ కళాశాల సహప్రాధ్యాపకులు ఎన్ జీ జయణ్ణ మాట్లాడుతూ ప్రాచీన కన్నడ సాహిత్యం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో కసాప జిల్లాధ్యక్షుడు నిష్టిరుద్రప్ప, మహానగర పాలికె విపక్ష నాయకుడు, కార్పొరేటర్ ఇబ్రహీంబాబు, కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కామ స్వామి మఠం ధ్వంసం
దొడ్డబళ్లాపురం: బాలికపై అత్యాచారం చేసిన దొంగ స్వామికి చెందిన మఠాన్ని అధికారులు జేసీబీలతో ధ్వంసం చేయించారు. బెళగావిలోని రామ మందిరమఠం లోకేశ్వర స్వామీజీ ఒక బాలికకు మాయమాటలు చెప్పి రాయచూరు, బాగలకోటకు తీసుకెళ్లి కొన్ని రోజులపాటు లాడ్జీలలో ఉంచి అత్యాచారం చేసాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిసి ఫిర్యాదుచేయగా అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించడం తెలిసిందే. గురువారంనాడు రాయభాగ తహసీల్దార్ ఆధ్వర్యంలో పోలీసులు మేఖళి గ్రామంలో ఉన్న సదరు మఠాన్ని జేసీబీలతో పడగొట్టించారు. 8 ఏళ్ల క్రితం స్వామిజీ 8 ఎకరాలను ఆక్రమించుకుని మఠం నిర్మించాడు. అనుమతులు లేనందున ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.16 మంది రైల్వే ఉద్యోగులపై కేసుదొడ్డబళ్లాపురం: తోటి ఉద్యోగిపై హత్యకు కుట్ర చేయడంతోపాటు కుల దూషణ చేశారని ఓ ఉద్యోగి కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు 16మంది రైల్వే ఉద్యోగులపై కేసు నమోదైన వ్యవహారం యలహంక న్యూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యలహంక సమీపంలోని రైల్వే వీల్ ఫ్యాక్టరీలో సీనియర్ మెకానిక్గా పని చేస్తున్న బసవలింగప్ప ఫిర్యాదుదారుడు. వేతనం, ప్రమోషన్ రాకుండా తోటి ఉద్యోగులు 16మంది తనపై హత్యకు కుట్ర చేసి, కుల దూషణతో వేధించారని ఆయన కేసువేశారు. కోర్టు ఆదేశాల మేరకు యలహంక న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.స్కూలు బస్సు పల్టీదొడ్డబళ్లాపురం: స్కూళ్లు తెరిచిన గురువారంనాడే స్కూల్ బస్సు ఒకటి అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన గదగ్ పట్టణ పరిధిలోని ఆర్కే నగరలో జరిగింది. స్థానిక శ్రీపార్శ్వనాథ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన స్కూల్ ఉదయాన్నే విద్యార్థులను తీసుకురావడానికి వెళ్తుండగా డ్రైవర్ బ్రిడ్జి కింద నిర్లక్ష్యంగా నడపడంతో బోల్తాపడింది. డ్రైవర్ స్వల్ప గాయపడ్డాడు. పోలీసులు క్రేన్ తెప్పించి బస్సును రోడ్డుపై నుండి తొలగించారు. ఖాళీ బస్సు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యయశవంతపుర: డెత్నోటు రాసి ఇంజినీరింగ్ విద్యా ర్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా పొన్నంపేట తాలూకా హళ్లిగట్టులో జరిగింది. తేజస్విని (19) సీఐటీ కాలేజీలో ఫస్టియర్ బీటెక్ చదువుతూ కాలేజీ హాస్టల్లో ఉంటోంది. గురువారం తెల్లవారుజామున గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. డెత్నోటులో 6 విషయాలు తెలిపింది. సబ్జెక్టుల్లో బ్యాక్లాగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు రాసింది.తుపాకుల విక్రేతల అరెస్టుదొడ్డబళ్లాపురం: నాటు తుపాకులు, రివాల్వర్లు తీసుకువచ్చి బెంగళూరులో అమ్ముతున్న ఇద్దరు నిందితులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక నాటు తుపాకి, ఒక రివాల్వర్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు కేజీ హళ్లి రౌడీషీటర్ కాగా మరొకరు ఆయుధాల విక్రేత. అరెస్టయిన రౌడీషీటర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పంజాబ్లోని తేజ్ బహద్దూర్ నగర్లో నివసిస్తున్న ఆయుధాల విక్రేతను అరెస్టు చేసి తీసుకువచ్చారు. తుపాకులను ఎవరెవరికి విక్రయించారు అనేది విచారిస్తున్నారు.సీఎం, డీసీఎం బదిలీల వార్బనశంకరి: సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బదిలీల గురించి విభేదాలు వచ్చాయి. ప్రజాపనుల శాఖ నుంచి జలవనరుల శాఖకు సీనియర్ ఇంజనీర్లను బదిలీ చేయడంపై డీకే శివకుమార్ అసహనం వెలిబుచ్చారు. తమ శాఖలో సీఎం జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. దీనిపై ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిసింది. డీకే మీడియాతో మాట్లాడుతూ.. జలవనరుల శాఖలో ఎక్కువ మంది ఇంజనీర్లు లేరు, మాకు అర్జెంటుగా ఇంజనీర్లు కావాలని అడిగాను. కానీ మా శాఖలోకి వచ్చి పదోన్నతి తీసుకుని ప్రజాపనులశాఖ, జిల్లా పంచాయతీ తో పాటు ఇతర శాఖలకు బదిలీ అవుతున్నారని వాపోయారు. మీ అనుమతి లేకుండా ఎవరు బదిలీచేశారని విలేకరులు ప్రశ్నించగా, ఉన్నతస్థాయిలో జరుగుతోందని పరోక్షంగా సీఎంను ప్రస్తావించారు. నాకు చెప్పకుండా ఎవరినీ బదిలీ చేయరాదని తెలిపానన్నారు. -
కోవిడ్కు వృద్ధుడు బలి
బనశంకరి: రాష్ట్రంలో కోవిడ్ కలవరం రేపుతోంది. బెంగళూరులో 100 కేసులకు పైగా చేరుకున్నాయి. బెళగావి తాలూకా బెనకనహళ్లి గ్రామంలో 70 ఏళ్ల వృద్ధుడు వయోభారంతో అనారోగ్యం బారినపడి బిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. వెంటనే కోవిడ్ వార్డులోకి తరలించారు. బుధవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. కోవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు చేశారు. కాగా రాష్ట్రంలో కోవిడ్ మరణాలు 3కు చేరాయి. కొత్తగా కేసులు నమోదు కాలేదని తెలిసింది. మాస్కుల వాడకం పెరిగింది. బీజేపీ ఎమ్మెల్సీలపై గవర్నర్కు ఫిర్యాదు శివాజీనగర: కల్బుర్గి జిల్లాధికారి ఫౌజియా తరున్నుం ని పాకిస్తానీ అని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్ దూషించారు. మరో చలవాది నారాయణస్వామి మంత్రి అయిన ప్రియాంక ఖర్గేను కుక్కతో పోల్చారు, వీరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గురువారం గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఎన్.ఎస్.బోసురాజు, సలీం అహమ్మద్ తదితరులు ఇందులో ఉన్నారు. ఆ ఎమ్మెల్సీలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సమాజాన్ని విడగొట్టే పని చేస్తున్నారని ఆరోపించారు. స్మారకాల సంరక్షణకు రారండి ● సంఘసంస్థలకు పర్యాటక మంత్రి పిలుపు బనశంకరి: రాష్ట్రంలో చారిత్రక స్థలాలు నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదని, రాష్ట్రంలో 25 వేలకు పైగా చారిత్రక స్థలాలను దత్తత ఇవ్వాలని నిర్ణయించామని పర్యాటక మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. బెంగళూరు చిత్రకళా పరిషత్లో నమ్మ ఆర్ట్స్ బెంగళూరు పేరుతో 5 రోజుల పాటు నిర్వహించే జాతీయ కళా ఉత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు, మఠాలు, ట్రస్టులు, సంఘసంస్థలు స్మారక దత్తు పథకం కింద స్మారకాలను దత్తత తీసుకోవచ్చునని తెలిపారు. దీంతో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి స్మారకాల రక్షణకు అవసరమైన సౌకర్యాల కల్పనకు వీలవుతుందన్నారు. చిత్రసంతెను చూస్తే చిత్రకళలో అభిరుచి లేనివారు కూడా ఆశ్చర్యానికి లోను అవుతారని తెలిపారు. కోల్కతా తరువాత కళల పట్ల ఆసక్తి కలిగిన రాజధాని బెంగళూరు కావడం గర్వకారణమన్నారు. ప్రముఖ కళాకారుడు విలాస్నాయక్ గీసిన చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిత్రకళాపరిషత్ అద్యక్షుడు బీఎల్.శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూ.25 లక్షలు నిధులు అందించి ప్రోత్సహిస్తోందని తెలిపారు. చిత్రకళావేడుక ఆదివారం వరకు జరుగుతుంది. -
దుష్ట శిక్షణలో రాజీ లేదు
శివాజీనగర: శిష్ట రక్షణ, దుష్టుల సంహారంలో భారతదేశం ఏనాడూ రాజీ పడలేదు, మునుముందు కూడా జరగదని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరు టౌన్హాల్లో జై హింద్ పేరిట కాంగ్రెస్ పార్టీ దేశభక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో రిటైర్డు సైనిక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు వందనం చేశారు. సీఎం మాట్లాడుతూ భారతీయ సైనికుల శక్తిని కొనియాడారు. దుష్టుల సహారానికి ప్రతి ఒక భారతీయుల కట్టుబడి ఉన్నారని అన్నారు. సైనికులు, రైతులు, వైద్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చిరస్మరణీయులని తెలిపారు. రిటైర్డ్ సైనికుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టామని తెలిపారు. -
ఏకధాటి వాన.. చామంతికి వేదన
చిక్కబళ్లాపురం: గత 10 రోజుల నుంచి కురుస్తున్న జడి వానలకు చామంతి పూల తోటలు పాడవుతున్నాయి. చెట్లు కుళ్లిపోవడంతో రైతులకు భారీ నష్టం వస్తోంది. తాలూకాలోని బన్నికుప్పె, నంది దిబ్బూరు, కత్తిరగుప్ప, గుండ్లగుర్కి, రాంపుర ఇతర గ్రామాలలో చామంతి పూల తోటలు ఎక్కువగా ఉన్నాయి. పూలను బెంగళూరుకు తరలించి అమ్ముతారు. గతేడాది ఇదే నెలలో 1 కేజీ పూలు రూ.300 పలికేవి. అన్ని రకాలుగా నష్టమే ఇప్పుడు అధిక వర్షాల వల్ల గిరాకీ తగ్గింది, పైగా తోటలు తడిసిపోయి చెట్లు కుళ్లిపోతున్నాయని శ్రీనాథ్ అనే రైతు తెలిపాడు. రెండు ఎకరాల పంటకు రూ.4 లక్షలు ఖర్చుచేశానని, అప్పులు చేసి పంట పెట్టానని తెలిపారు. వర్షపు నీరు పీల్చుకొని పూలు చెడిపోతాయి, మార్కెట్లో విలువ ఉండదని విచారం వ్యక్తంచేశాడు. చేతికి వచ్చిన చామంతి పూల చెట్లను పీకేస్తున్నారు. మామూలుగా నవంబరు, డిసెంబరు నెలల్లో రావలసిన తుపానులు మేలో వచ్చి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తమకు పరిహారాన్ని అందజేయాలని కోరుతున్నారు. కుళ్లిపోతున్న చెట్లు, పువ్వులు రైతులకు తీవ్ర నష్టం -
ఇద్దరిని బలిగొన్న ఆర్టీసీ బస్సు
తుమకూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు, బైకును ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. జిల్లాలోని తిపటూరు తాలూకా మత్తిహళ్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. బస్సు ఢీకొని అయ్యనబావి నివాసులు ఉమేష్ (32), రజనీకాంత్ (33) మరణించారు. మత్తిహళ్లి గ్రామంలో కూలిపనులు చేసుకుని స్వగ్రామానికి వాపసు వస్తున్నారు. ఆ సమయంలో తిపటూరు వైపు నుంచి కుందాపుర వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు వారిని నేరుగా ఢీకొనింది. ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడే కన్నుమూశారు. బస్సు డ్రైవర్పై హొన్నవళ్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనాస్థలిలో కుటుంబాల రోదనలు మిన్నంటాయి. వరద ప్రాంతాల్లో సమీక్ష ● మంత్రులకు సీఎం ఆదేశం శివాజీనగర: రాష్ట్రంలో వర్షంతో హానికి గురైన ప్రాంతాలకు తక్షణమే వెళ్లి సమీక్ష చేయాలని సీఎం సిద్దరామయ్య, జిల్లా ఇన్చార్జి మంత్రులకు, కార్యదర్శులకు ఆదేశించారు. ఈ నెల 30, 31న అన్ని జిల్లాధికారులు, జిల్లా పంచాయితీ సీఈఓ తదితరులతో వర్ష హాని గురించి సమావేశం అవుతానని తెలిపారు. వరద నష్టాల గురించి బుధవారం సీఎం సమీక్ష చేశారు. వరద బాధిత జిల్లాల్లో ప్రమాదాలు జరగకుండా సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. 170 తాలూకాలకు హాని రాష్ట్రంలో 170 తాలూకాలు వరద బీభత్సానికి గురైనట్లు సర్కారు తెలిపింది. బెంగళూరు పాలికె పరిధిలో 201 స్థలాలు వరదలకు గురయ్యాయి. మే 26 వరకు వర్షంతో రాష్ట్రంలో 45 ఇళ్లు కూలిపోగా, 1385 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చినట్లు సీఎంఓ తెలిపింది. మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం వాయిదా! శివాజీనగర: చాలా రోజులుగా ఎదురు చూస్తున్న బెంగళూరు మెట్రోలో ఎల్లో లైన్లో సంచారానికి మళ్లీ ఆటంకం ఏర్పడింది. సిగ్నలింగ్లో సమస్య వచ్చినట్లు బీఎంఆర్సీఎల్ తెలిపింది. ఆర్వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు సంచరించే ఎల్లో మార్గంలో మెట్రో రైలు సర్వీసులు జూన్ నుంచి మొదలవుతాయని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు కూడా అదే ఆశతో ఉన్నారు. కానీ సిగ్నలింగ్లో సమస్య రాగా దీనిని సరిచేసేందుకు నెల రోజులు కావాల్సి ఉంది. అందుచేత జూన్లో ఆరంభం అనుమానమేనని తెలిసింది. ఈ మార్గంలో రైలు పరీక్షలు పూర్తయ్యాయి, రైల్వే మండలి ఆమోదం తెలిపింది. ఫైనల్ దశ పరిశీలన కోసం త్వరలోనే మెట్రో రైలు సురక్షతా కమిషనర్ రావాల్సి ఉంది. ఇంతలో సిగ్నలింగ్లో సాంకేతిక లోపం బయటపడింది. సిగ్నలింగ్ కాంట్రాక్ట్ను చేపట్టిన సీమెన్స్ నిపుణులు ఇటీవల సిగ్నలింగ్ వ్యవస్థను తనిఖీ చేశారు. ఆ సమయంలో సాఫ్ట్వేర్ డేటా సెట్లలో లోపం కనిపించింది. పొగాకు ఉత్పత్తులపై వేటు యశవంతపుర: ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ–సిగరెట్, వేపింగ్ సాధనాలను, హుక్కాను నిషేధించినట్లు నగర పోలీసు కమిషనర్ బి.దయానంద తెలిపారు. మాల్లు, కాఫీ బార్లు తదితరాలలో నిత్యం తనీఖీలు చేయాలని పోలీసులకు సూచించారు. పొగాకు ఉత్పత్తుల వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్లు తీసుకోవాలన్నారు. ప్రజలలో కూడా జాగృతి తీసుకురావాలన్నారు. 2024–25లో బెంగళూరు నగరంలో సిగరెట్లతో పాటు పొగాకు కేంద్రాలపై 57,130 కేసులను నమోదు చేసి రూ.80.8 లక్షలు జరిమానాలు విధించినట్లు తెలిపారు. విశ్వ ధూమపాన దినం సందర్భంగా ఈ నెల 27వ నుంచి జూన్ 2 వరకు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
కిల్లర్ చిరుత కోసం గాలింపు
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా నాగపుర హాడి సొళ్లెపుర అటవీ ప్రాంతంలో సోమవారం మేకలు మేపుతున్న హరీష్ అనే యువకున్ని ఓ చిరుత హతమార్చింది. దానిని పట్టుకోవడానికి అటవీ శాఖ సిబ్బంది కూంబింగ్ చేపట్టారు. పెంపుడు ఏనుగులతో గాలింపు సాగిస్తున్నారు. నాగరహొళె విభాగంలోని 30 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. హుణసూరు వలయంలోని హనగోడు కురుబర హొసహళ్లి గ్రామానికి చెందిన హరీష్ (24) తండ్రి కృష్ణతో కలిసి అటవీ శాఖ స్థలంలో మేకలు మేపుతుండగా, చిరుత వచ్చింది. దానిని తరిమేందుకు ప్రయత్నించగా అది హరీష్ మీద పడి తీవ్రంగా కొరికింది. తీవ్రంగా గాయపడిన హరీష్ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. హరీష్కు మూడు నెలల క్రితమే పెళ్లయింది. రూ.20 లక్షల పరిహారం మృతుడు హరీష్ కుటుంబానికి అటవీ శాఖ రూ.20 లక్షల పరిహారం ప్రకటించింది. హరీష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, అక్కడికక్కడే రూ.5 లక్షల చెక్ను అందజేశారు. మిగతా రూ.15 లక్షల పరిహారధనం చెక్ను త్వరలో అందజేస్తామని డీసీఎఫ్ సీమా తెలిపారు. డ్రోన్, ఏనుగులతో.. చిరుత ఆచూకీ కోసం ఒక పెద్ద బోను, నాలుగు చిన్న బోనులు, 15 కెమెరా ట్రాప్లు అమర్చారు. ఒక డ్రోన్ ద్వారా ఆకాశం నుంచి తనిఖీ చేస్తున్నారు. 2 కుంకీ ఏనుగులు కూడా పాల్గొంటున్నాయి. చిరుతను పట్టుకుంటామని అధికారులు తెలిపారు. నవ వివాహితున్ని బలిగొన్న మృగం -
కమల్.. గోల్మాల్
శివాజీనగర: ప్రముఖ బహుభాషా సినీనటుడు కమల్హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. కన్నడం తమిళం నుంచి పుట్టింది అని ఆయన చెప్పడం మీద కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందా? కమల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ కొద్దివారాల్లో విడుదల కానుంది, మంగళవారం చైన్నెలో జరిగిన సినిమా ప్రి– రిలీజ్ వేడుకలో కమల్ మాట్లాడుతూ, కన్నడం.. తమిళం నుంచి పుట్టింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్కుమార్ కూడా ఉన్నారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కమల్ ప్రసంగాన్ని ఉయిరే, ఉరవే తమిళే.. అంటే నా జీవితం, నా బంధం అన్నీ తమిళమే అనే మాటలతో ప్రారంభించారు. వేదికపై ఉన్న కన్నడ నటుడు శివ రాజ్కుమార్ను చూస్తూ, ఇక్కడ ఉన్నది నా కుటుంబం. అందుకే ఆయన (శివ రాజ్కుమార్) ఇక్కడికి వచ్చారు. అందుకే నా జీవితం, బంధం, తమిళ్ అని మొదలుపెట్టారు. మీ భాష (కన్నడ) తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే అని అన్నారు. సంస్కృతి తెలియని వ్యక్తి: సీఎం సీఎం సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. కన్నడ భాష సంస్కృతికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది, పాపం కమల్కు ఆ విషయం తెలియదేమో అని హేళన చేశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర కమల్ను సంస్కారం లేని వ్యక్తి అని విమర్శించారు. కమల్హాసన్ గత కొన్నేళ్లుగా హిందూ మతాన్ని అవమానిస్తూ, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇప్పుడు 6.5 కోట్ల కన్నడగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కన్నడను అవమానించారు. కమల్ హాసన్ వెంటనే కన్నడిగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని విజయేంద్ర డిమాండ్ చేశారు. ఆయన భాషా చరిత్రలో నిపుణుడు కూడా కాదని విమర్శించారు. నిరసనలు కన్నడ భాషా అభిమాన సంఘాలు కమల్పై మండిపడ్డాయి. బెంగళూరులో కమల్హాసన్ పోస్టర్లను చించి, దిష్టిబొమ్మను తగులబెట్టారు. కన్నడను చిన్నచూపు చూడటం తగదని హెచ్చరించాయి. కన్నడ భాషను తక్కువ చేసేలా మాటలు సీఎం, నేతలు సహా ప్రజల మండిపాటు -
నైజీరియన్ అరెస్టు, రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని అమృతహళ్లి పోలీసులు భారీ ఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయిని స్వాధీనపరచుకుని ఆఫ్రికన్ని అరెస్టు చేశారు. వివరాలు.. నైజీరియాకు చెందిన పేపె మోరె పేయి(43) అనే డ్రగ్స్ నేరగాన్ని పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి సుమారు రూ.3 కోట్ల విలువ చేసే 3 కేజీల డ్రగ్స్, గంజాయిని జప్తు చేశారు. అమృతహళ్లి లో ఎండీఎంఏ క్రిస్టల్, గంజాయిని నిందితుడు విక్రయించేవాడు. రెండేళ్ల కిందట వ్యాపార వీసాతో ఇండియాకు వచ్చిన పేపె.. హెబ్బాళలోని టాటానగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదన కోసం డ్రగ్స్ వ్యాపారిగా మారాడు. కమ్మనహళ్లి లో మరో విదేశీ వ్యక్తి నుంచి ఎండీఎంఏను కొనుగోలు చేసి వస్త్ర వ్యాపారం పేరుతో నగరంలో సంచరిస్తూ విక్రయించేవాడు. డ్రగ్స్, ఓ స్కూటర్, మొబైళ్లు, కొంత నగదును సీజ్ చేశారు. కావేరి నదిలో మెడికో గల్లంతు ● ముగ్గురు క్షేమం మైసూరు: కావేరి నదిలో స్నానానికి దిగి ఒకరు గల్లంతు కాగా, ముగ్గురు యువకులు ప్రాణాలతో బయట పడిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల తాలూకాలోని శివనసముద్ర దర్గా వెనుక భాగంలో జరిగింది. వివరాలు.. బెంగళూరులోని దయానంద సాగర్ మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు శివనసముద్ర వద్ద ప్రవహించే కావేరీ నది సందర్శనకు వచ్చారు. అక్కడ నది అందాలను చూసి పులకించిపోయారు. వీరిలో నందకుమార్, ప్రఫుల్, తుషార్, ప్రమోద్ అనే నలుగురు స్నానం చేయాలని నదిలోకి దిగారు. అయితే ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండగా నందకుమార్ నీటిలో కొట్టుకునిపోయాడు. మిగతా ముగ్గురిని స్థానికులు, కొళ్లెగాల అగ్నిమాపక కేంద్రం అధికారి అరుణ్కుమార్ సిబ్బంది కాపాడారు. గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు కొనసాగుతోంది. జై కనక దుర్గా మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామ చెరువు సమీపంలో వెలసిన దుర్గాదేవి దేవాలయంలో బుదవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని విశేషంగా పూలతో అలంకరించారు. అభిషేకంతో పాటు వేదమంత్ర పారాయణం నిర్వహించారు. హంసల మధ్యన కూర్చున్న భంగిమలో అమ్మవారిని పుష్పాలతో అలంకరించడం భక్తులను ముగ్ధుల్ని చేసింది. వందలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజల కోసం పనిచేయండి ● ఉప లోకాయుక్త వీరప్ప మండ్య: సామాన్య ప్రజల కోసం మంచి పనులు చేసేవారికి అవసరమైతే కాళ్లు కూడా మొక్కుతానని, కానీ అవినీతికి పాల్పడేవారికి ఉరి శిక్ష పడేలా చేస్తానని ఉపలోకాయుక్త బీ.వీరప్ప హెచ్చరించారు. బుధవారం మండ్య నగరంలోని అంబేడ్కర్ భవనంలో జిల్లా యంత్రాంగం నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన ప్రసంగిస్తూ కష్టపడి సంపాదించింది కొంత సొమ్మే అయినా సంతోషాన్ని ఇస్తుందని, అవినీతికి పాల్పడి ఎంత డబ్బు ఆర్జించినా మనశ్శాంతిని ఇవ్వదని అన్నారు. అధికారులు కానీ, ఎవరైనా కానీ ప్రజలకు మంచిచేస్తే పాదాభివందనాలు చేస్తానని, తప్పుడు పనులు చేస్తే మాత్రం ఉరిశిక్ష పడేలా చేస్తానని చెప్పారు. అవినీతి అనేది సామాన్యమైన రోగం కాదని, ఇది క్యాన్సర్ కంటే చాలా పెద్ద వ్యాధి అని అన్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే నయం కాదని అన్నారు. -
హెచ్ఏఎల్ను తరలిస్తే సహించేది లేదు
శివాజీనగర: బెంగళూరులోని హెచ్ఏఎల్ని తరలిస్తారా.. అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెంగళూరులోని హెచ్ఏఎల్ను ఏపీలో విస్తరించాలని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. కేంద్రానికి చంద్రబాబు వినతి నేపథ్యంలో హెచ్ఏఎల్ ఉత్పత్తి యూనిట్లు ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్నాయని కొన్ని వర్గాలు ప్రచారం ప్రారంభించాయి. హెచ్ఏఎల్కు ఆంధ్ర కర్ణాటక సరిహద్దుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షిలో 10,000 ఎకరాల భూమిని అందించేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పారు. కర్ణాటకలో బెంగళూరు, తుమకూరులో హెచ్ఏఎల్కు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, శిక్షణా విమానాలు ఇందులో తయారవుతున్నాయి. నెహ్రూ స్థాపించిన సంస్థ: డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ హెచ్ఏఎల్ను బీజేపీ (మోదీ ప్రభుత్వం) ఏర్పాటు చేయలేదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ బెంగళూరులో స్థాపించారు. కర్ణాటక హెచ్ఏఎల్ యూనిట్లను కాపాడుకోవడానికి మేము దేనికై నా సిద్ధం అని అన్నారు. ఈ విషయంలో కర్ణాటక బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బీ.పాటిల్ మాట్లాడుతూ, హెచ్ఏఎల్ బెంగళూరులోని కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి. కొత్త యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే చేసుకోనీ అన్నారు. ఐదోతరం అత్యాధునిక మధ్యతరహా యుద్ధ విమానం (ఏఎంసీఏ) ప్రాజెక్ట్ బెంగళూరులో ఉన్న ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ఆధ్వర్యంలో హెచ్ఏఎల్ సహకారంతో నడుస్తోంది. ఈ తరుణంలో వివాదం రేకెత్తడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తేల్చిచెప్పిన సీఎం, డిప్యూటీ సీఎంలు సీఎం చంద్రబాబు ధోరణిపై ఆగ్రహంఅది సాధ్యం కాని పని: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రభుత్వ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఈ విషయమై మాట్లాడుతూ హెచ్ఏఎల్ తరలింపు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కర్ణాటకలో హెచ్ఏఎల్ యూనిట్లను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. నాకు తెలిసినంతవరకూ ఇది సాధ్యపడదు, హెచ్ఏఎల్ తరలింపు జరగదు అని సిద్దరామయ్య పేర్కొన్నారు. -
బడి.. అసౌకర్యాల ఒడి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం ప్రాధాన్యత, అవసరాన్ని గుర్తించి అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు పలు రకాల పథకాలను రూపొందించి అమలు జరుపుతోంది. ప్రత్యేకంగా ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలలను నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని భావించి పాఠశాల స్థాయి నుంచి హైస్కూల్ స్థాయి వరకు విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఈ కమిటీలతో విద్యా రంగంలో మార్పులు వస్తాయని ఆశించారు. కేవలం పదవులకు మాత్రమే కమిటీలని, ఆశించిన మేర ప్రోత్సాహం కనుమరుగు కావడంతో పేరుకు మాత్రమే కమిటీలున్నా ఫలితం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలోని పాతబడిన రాయచూరు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం మరమ్మతులకు రూ.5 కోట్ల నిధులు విడుదల చేసినా పనులు మాత్రం అలాగే మిగిలాయి. పాఠశాలల్లో కనీస వసతులు కరువు కళ్యాణ కర్ణాటకలోని ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూల్ స్థాయిలో పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయి. ప్రతి పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్వహణలో అధికారులు పట్టించుకోవడం లేదు. భవనాలకు తక్కువ మోతాదులో నిధుల విడుదలతో పనులు జరగకుండా పోతున్నాయి. పాఠశాలలో తాగునీటి ఎద్దడి, మూత్రశాలలు, మరుగుదొడ్లు, రక్షణ గోడలు, కిటికీలు, తలుపులు లేకపోవడం విచిత్రంగా ఉంది. ప్రజలు చెత్తాచెదారం వేసి పరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారాయి. పాఠశాల పక్కనే మురుగు గుంటలున్నాయి. దుర్వాసన వెదజల్లుతుంటే విద్యార్థులు విద్యనభ్యశించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలకు సెలవులు ప్రకటిస్తే పందులు, పశువులు స్వైర విహారంతో పాటు మరుగుదొడ్డిగా, రాత్రి వేళ బిచ్చగాళ్లకు నిలయంగా మారుతోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా అంద్రూన్ కిల్లా పాఠశాల భవనం మాత్ర ం శిథిలావస్థకు చేరింది. కల్యాణ కర్ణాటకలో పాఠశాలలు అధ్వానం అరకొర సౌకర్యాలతో చదువులు సాగేదెలా? పట్టించుకోని పాలకులు, విద్యా శాఖ అధికారులు నేటి నుంచి జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడుల ప్రారంభం ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా అభివృద్ధి ప్రభుత్వం డీపీఈపీ, ఓబీబీ, సాక్షరత, బాల కార్మిక, ఇతర పథకాల పేరుతో రూ.కోట్ల మేర నిధులు ఖర్చు పెట్టినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా విద్యా శాఖ నిర్వీర్యమైంది. విద్యార్థులకు చెట్ల కింద, దేవాలయాల్లో పాఠాలు బోధించే స్థితి నెలకొంది. ఈ నెల 29 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో 250, కొప్పళ జిల్లాలో 222, యాదగిరి జిల్లాలో 158, బీదర్ జిల్లాలో 211, విజయ నగర జిల్లాలో 96, కలబుర్గి జిల్లాలో 258 పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి. ఈ విషయంలో శాసన సభ్యులు, మంత్రులు, లోక్సభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు మౌనం వహించారు. 4518 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడానికి సర్కార్ ఆదేశాలు జారీ చేయకుండా అతిథి ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయించాలని చూస్తోంది. -
31న క్యాన్సర్ పరీక్ష శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 31న ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ఏర్పాటు చేసినట్లు బెట్టదూరు ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ జయ ప్రకాష్ పాటిల్ వెల్లడించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రిలో కలబుర్గి హెచ్సీజీ క్యాన్సర్ కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. స్తన, గర్భకోశ, శ్వాసకోఽశ, థైరాయిడ్, రక్త, లుకేమియా వంటి వ్యాధులకు చికిత్స అందిస్తారన్నారు. అక్రమ రేషన్ బియ్యం పట్టివేతహొసపేటె: నగర శివార్లలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బియ్యాన్ని తరలిస్తున్న వాహనంతో పాటు నిందితులను పట్టుకున్నారు. తాలూకా శివార్లలోని జంబునాథ ఆలయం మీదుగా జాతీయ రహదారి–67లో బళ్లారి నుంచి హుబ్లీ మార్గంలో వస్తున్న వాహనంపై పోలీసులు దాడి చేసి, బియ్యాన్ని పట్టుకుని, నిందితులను అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న రూ.11.33 లక్షల విలువ చేసే బియ్యం పట్టుబడిందని అధికారులు పేర్కొన్నారు. అలాగే బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని జప్తు చేశారు. ఈ రెండింటి విలువ మొత్తం రూ.38.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కాగా లారీ యజమాని ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు హొసపేటె రూరల్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రైలును బళ్లారి, గుంతకల్లు మీదుగా నడపాలి సాక్షి,బళ్లారి: సింధనూరు నుంచి బెంగళూరుకు వయా కారటగి, గంగావతి, హుబ్లీ మీదుగా రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అయితే సింధనూరు–హుబ్లీ–బెంగళూరు రైలు మార్గం మధ్య దూరం 681 కిలోమీటర్లు అవుతుందని రైల్వే క్రియాశీల సమితి నేత కేఎం మహేశ్వరయ్యస్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మార్గం మీదుగా ప్రయాణం వల్ల చాలా సమయం తీసుకోవడంతో పాటు ప్రయాణికులకు టికెట్ ధర భారం అవుతుందని తెలిపారు. ఈ రైలు సర్వీసును బళ్లారి, గుంతకల్లు మీదుగా బెంగళూరుకు నడిపితే మధ్య దూరం 502 కిలోమీటర్లు అవుతుందన్నారు. దీని వల్ల ప్రయాణికులకు డబ్బులతో పాటు సమయం కలిసి వస్తుందన్నారు.హైదరాబాద్, చైన్నె, తిరుపతి,వెళ్లే ప్రయాణికులకు గుంతకల్లులో పలు రైళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అందువల్ల సింధనూరు, బెంగళూరు రైలును బళ్లారి, గుంతకల్లు మీదుగా నడిపేందుకు సంబంధిత రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. హత్యలను నియంత్రించండి రాయచూరు రూరల్: నగరంలో హత్యల నియంత్రణకు పోలీస్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కర్ణాటక రాష్ట్ర ది లెజెండ్ టిప్పుసుల్తాన్ సంఘం అధ్యక్షుడు రషీద్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నగరంలో గత ఏడాది నుంచి నగరంలో గంజాయి, హఫీం వంటివి అధికంగా విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. రహదారుల్లో ప్రతి నిత్యం యువకులు మద్యం తాగి కేరింతలు కొడుతూ ట్రాపిక్ జామ్ చేస్తూ అల్లర్లకు పాల్పడుతున్నారన్నారు. నగరంలో రాత్రి 10 గంటల అనంతరం దుకాణాలు, హోటళ్లను బంద్ చేయడానికి పోలీసులు ముందుకు రావాలన్నారు. నగరంలో ఆరు మంది హత్యకు గురయ్యారన్నారు. భాషాభివృద్ధికి పాటు పడదాం సాక్షి,బళ్లారి: రక్షణ వేదిక కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్క కన్నడిగులు నేల, నీరు, సంస్కృతి సంపద్రాయాల విషయంలో అన్యాయం జరిగినప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలని కరవే ప్రవీణ్శెట్టి వర్గం నేత హర్దగేరి రామణ్ణ సూచించారు. ఆయన బుధవారం కరవే ఆధ్వర్యంలో కనక దుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా, వివిధ తాలూకాల పదాధికారులు నియామక ఆదేశ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ సంఖ్యలో వచ్చి వేదికలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అయితే పోరాటాలు చేస్తూ తమ హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు వచ్చినప్పుడు సంఘటితం కావాలన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని, తాము పోరాటాలకు ఎప్పుడూ సహకారం అందిస్తామన్నారు. కరవే ప్రముఖులు తిమ్మారెడ్డి, వీరారెడ్డి, ఉమేష్గౌడ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సుల్లో దొంగతనాలు.. అత్తా కోడలు అరెస్టు
కెలమంగలం: బస్సులో ప్రయాణికుల వద్ద డబ్బులు దొంగలించుకెళ్లిన అత్తా, కోడలిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. డెంకణీకోట సమీపంలోని జారకాలట్టి గ్రామానికి చెందిన మహిళ గత నెల 30వ తేదీన క్రిష్ణగిరిలో బంగారం కొనాలని రూ. లక్ష నగదుతో బస్సులో బయల్దేరింది. బస్సు దిగాక చూసుకుంటే డబ్బులు కనిపించలేదు. డెంకణీకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా, బస్టాండు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన అలమేలు (45), కోడలు భువన (22)ను అరెస్టు చేశారు. విచారణ చేయగా తామే దొంగతనం చేశామని చెప్పారు. బస్సుల్లో ప్రయాణిస్తూ డబ్బు, బంగారం కొట్టేస్తుంటామని తెలిపారు. వీరిపై కడలూరు, కల్లకురిచ్చి, పెరంబలూరు, సేలం, తంజావూరు, తిరుచ్చి, విళ్లుపురం పోలీస్ స్టేషన్లలో 11 చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
ఎస్సీ వర్గీకరణకు నాయకులే అడ్డు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి ఆంజనేయ, మంత్రి ప్రియాంక ఖర్గే కారణమని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర ఆరోపించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ జాబితాలో కొరమ, కొరచ, బోవిలను తొలగించాలన్నారు. మల్లికార్జున ఖర్గే, ఆంజనేయ, ప్రియాంక ఖర్గే అంటరానితనం నిర్మూలనకు కృషి చేయకుండా అంబేడ్కర్ ఆశయాలకు తిలోదకాలు వదులుతున్నారన్నారు. మాజీ మంత్రి ఆంజనేయ ఆది కర్ణాటక అని, మాదిగ అని ఎక్కడా ప్రస్తావన చేయలేదన్నారు. నాడు అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. బేడ జంగమలను ఎస్సీ జాబితాలో చేర్చడం తగదని కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి ఆంజనేయ, మంత్రి ప్రియాంక ఖర్గే ప్రకటనలను ఇవ్వడం మాని నిజమైన మాదిగలకు న్యాయం చేకూర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఖర్గే, ఆంజనేయ అంబేడ్కర్ వ్యతిరేక వాదులు ఎస్సీ జాబితా నుంచి కొరమ, కొరచ, బోవి కులాలను తొలగించాలి అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణం అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర -
ఔషధ దుకాణాల్లో మత్తు పదార్థాలు అమ్మొద్దు
రాయచూరు రూరల్: జిల్లాలో మత్తు పదార్థాలను మందుల దుకాణాల్లో విక్రయించరాదని, మత్తు పదార్థాల నియంత్రణకు సహకరించాలని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో మందుల దుకాణాల వ్యాపారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడరాదన్నారు. రోగులకు ఔషధాలు ఇచ్చే ముందు వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. మత్తు పదార్థాల సేవనంతో అనారోగ్యానికి తోడు మానసికంగా కుంగిపోతారన్నారు. -
జూన్ 6న మాదేవ చిత్రం విడుదల
రాయచూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6న మాదేవ చిత్రం విడుదల కానుందని కన్నడ చలన చిత్ర నటుడు వినోద్ ప్రభాకర్ వెల్లడించారు. ఆయన మంగళవారం రాత్రి మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వాములను దర్శనం చేసుకున్నారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం తనను కలసిన విలేఖర్లతో ఆయన మాట్లాడారు. తండ్రి బాటను అనుసరించి నటన చేయడం లేదన్నారు. మాదేవ చిత్రం విజయ వంతం కావాలని ఆలయాల దర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు. మైసూరు శాండల్ సోప్లకు రాయబారిగా తమన్నా భాటియాను నియమించడంపై మాట మార్చారు. నందిని పాల ఉత్పత్తులకు డాక్టర్ పునీత్ రాజ్కుమార్ను రాయబారిగా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు అవకాశం లభిస్తే తాను కూడా రాయబారిగా పని చేస్తానన్నారు. -
సెంట్రల్ జైలులో నిందితుల రాద్ధాంతం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలోని జైళ్లలో పేరుగాంచిన, బ్రిటిష్ హయాంలో నిర్మించిన అప్పటి సెంట్రల్ జైలులో నిందితుల గొడవలు, రాద్ధాంతాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో పాటు, అందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని సెంట్రల్ జైలులో ఓ హత్య కేసులో నిందితులు లేనిపోని సాకులు చూపుతూ జైలు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. శివమొగ్గలో ఇటీవల జరిగిన భజరంగదళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో నిందితులను బళ్లారి సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే వీరి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతూ జైలు సిబ్బందికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం జైలులోని నిందితుల ఆగడాలు, కిరికిరి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జైలు ఉన్నతాధికారులకు ఏం చేయాలో పాలుపోక తికమక పడుతున్నారు. రోజూ ఏదో సాకుతో గొడవ ఈ కేసులో నిందితులు జిలాన్, సయ్యద్ నిహాల్ అనే ఇద్దరు జైలులో రోజుకు ఒకటి చొప్పున సమస్యను సాకుగా చూపుతూ జైలు సిబ్బందిని వేధిస్తున్నారు. ఇటీవల ఈ వివాదం పతాక స్థాయికి చేరడంతో సిబ్బంది, నిందితుల మధ్య వాగ్వాదం జరిగిన కీలక వీడియో దృశ్యాలు వైరల్ కావడం సర్వత్రా చర్చానీయాంశమైంది. హర్ష హత్య కేసులో నిందితుడైన జిలాన్ను ఇంతకు ముందు కలబుర్గి జైలులో ఉంచారు. అయితే కలబుర్గి జైలులో వసతులు సరిగా లేవని, అతడు ధార్వాడ జైలుకు మార్చుకున్నారు. అక్కడ కూడా వసతులు సరిగా లేవని ఫిర్యాదు చేసి, మరొక చోటకు తరలించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే జిలాన్ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. జిలాన్కు బళ్లారి జైలు వసతులు మింగుడు పడటం లేదు. ఈ కేసులో మరో నిందితుడు సయ్యద్ నిహాల్ను జిలాన్ కన్నా ముందే బళ్లారి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అధికారులు, సిబ్బందికి దినదిన గండం మొత్తం మీద ఈ ఇద్దరు నిందితులు ఒకచోట చేరడంతో మొత్తం సీన్ మారింది. జైలు అధికారులు, సిబ్బంది రోజుకు గండంలా తయారైంది. తమను ప్రత్యేకంగా ఉంచరాదని, అందరితో పాటు ఉంచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాన్య ఖైదీలుగా ఉండేందుకు తమను వదలాలని, లేదా వేరే జైలుకు మార్చాలని పదే పదే డిమాండ్ చేస్తున్నట్లు, అది కూడా న్యాయవాది ద్వారాా చెప్పించేవారు. జైలు పాలనా నియమాలు వీటిని అంగీకరించకపోవడంతో ఉన్నఫళంగా వారికి వారే గొడవ పెట్టుకుని రాద్ధాంతం సృష్టించారని జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఇద్దరు ఏదో విషయమై రాద్ధాంతం సృష్టించినట్లు తెలియడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. గొడవల నేపథ్యంలో ఇద్దరిపీ వేర్వేరు సెల్లో ఉంచామని జైలు అధికారులు తెలిపారు. కాగా శివమొగ్గ హర్ష, దక్షిణ కన్నడ ప్రవీణ్ నెట్టార్ హత్య కేసుల్లోని నిందితులు కూడా బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్నారు. వీరందరినీ సాధారణ ఖైదీలుగా ఉంచామని జైలు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అధికారులకు తలనొప్పిగా మారిన వైనం -
ఆ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాధికారి ఫౌజియ తరన్నంను నిందించిన విధాన పరిషత్ సభ్యుడు రవికుమార్పై చర్యలు తీసుకోవాలని తెహ్రిక్–ఏ–నిసా మైనార్టీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కలబుర్గి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు రబియా ఖానం మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్ ఒక ఉత్తమ జిల్లాధికారిని అవమానించడం తగదన్నారు. బాధ్యుడైన ప్రజాప్రతినిధిపై చర్యలు చేపట్టాలని కోరుతూ పోలీస్ కమిషనర్ శరణప్ప ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. పాఠశాలల మూసివేత సరికాదు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కన్నడ పాఠశాలలను మూసివేయడం తగదని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. బుధవారం తాలూకాలోని విజయనగర క్యాంప్లో తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ప్రీతి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలకు పైగా ప్రభుత్వ కన్నడ పాఠశాలలను మూసివేతకు కుట్ర చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని కోరుతూ సంతకాల సేకరణ చేశారు. కమల్ వ్యాఖ్యలపై కరవే ఆందోళన రాయచూరు రూరల్: తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ప్రముఖ సినీ నటుడు కమల హాసన్ చేసిన వ్యాఖ్యలను కరవే తీవ్రంగా ఖండించింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్లో చేపట్టిన ఆందోళనలో కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడారు. కమల్ హాసన్ వ్యాఖ్యలను ఖండిస్తూ అతని చిత్రపటానికి పాదరక్షలతో దండించారు. అనంతరం చిత్రపటాన్ని తగలబెట్టారు. తాను చేసిన వ్యాఖ్యలను కమల్ హాసన్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారీగా గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్ హుబ్లీ: గబ్బూరు సమీపంలోని కుందగోళ క్రాస్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని బెండిగేరి పోలీసులు, సీసీబీ విభాగం సిబ్బంది సంయుక్తంగా కార్యాచరణ చేపట్టి అరెస్ట్ చేశారు. హావేరికి చెందిన మహమ్మద్ షాహిద్, రెహమాన్ బేగ్, నిసార్ అహమ్మద్ అరెస్ట్ అయిన నిందితులు. వీరి నుంచి రూ.12.64 లక్షలు విలువ చేసే 10.5 కేజీల గంజాయి, మూడు మొబైళ్లు, కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పునర్వసతి కల్పించాలని డిమాండ్రాయచూరు రూరల్: హస్మియా కాలనీ వాసులకు పునర్వసతి కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. బుధవారం హస్మియా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 40 ఏళ్ల నుంచి హస్మియా ప్రాంతంలో నివసిస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారులు ఉన్నఫళంగా వాహనాలతో వచ్చి స్థలాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వకుండా తొలగించారని ఆరోపించారు. హస్మియా స్థలం వక్ఫ్ బోర్డుది కాదని, ప్రభుత్వ స్థలమని అన్నారు. తమకు ప్రత్యామ్నాయ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి హుబ్లీ: తాలూకాలోని సిరగుప్పి గ్రామం వద్ద హుబ్లీ–గదగ్ హైవే సమీపంలోని డాబా వద్ద టాటా ఏస్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఫలితంగా ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. బుధవారం ఉమచిగి గ్రామానికి చెందిన చంద్రయ్య హుబ్లీమఠ(70) రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతూ మృతి చెందారు. టాటాఏస్ వాహనం డ్రైవర్ సమీర్ ఉదగట్టి తన ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ను కేఎంసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డెక్కిన ఉపాఽధి కూలీలు
సాక్షి,బళ్లారి: రెక్కాడితే కాని డొక్కాడని వ్యవసాయ కూలీలతో పనులు చేయించుకుని నెలల తరబడినా చేసిన పనికి సంబంధించిన కూలి సొమ్ము ఇవ్వకపోవడంతో వ్యవసాయ కూలీలు రోడ్డెక్కారు. బుధవారం ఏఐకేకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రతి రోజు ఉదయం సద్ది మూట కట్టుకుని ఉపాధి హామీ పనులకు వెళ్లి పని చేసి వస్తున్నామన్నారు. కూలీ ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలు ఎలా గడవాలని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. జిల్లా పంచాయతీ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపారు. ఐదు, పది రోజుల్లో డబ్బు జమయ్యేవి అనంతరం జరిగిన సమావేశంలో ఏఐకేకేఎంఎస్ జిల్లాధ్యక్షుడు గోవింద్, కార్యదర్శి గుర్రళ్లి రాజ మాట్లాడుతూ ప్రతి ఏటా ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఐదు లేదా 10 రోజుల్లో వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేవన్నారు. అయితే ఈ ఏడాది అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. కూలీలకు పనులు చేసిన తర్వాత డబ్బులు రాకపోతే వారు ఎలా జీవనం సాఽగించాలని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు వారికి జీతాలు రాకపోతే వెంటనే పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని, అదే కూలీలకు ఎందుకు సకాలంలో చెల్లించడం లేదని ప్రశ్నించారు. కూలీల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని మండిపడ్డారు. ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. తక్షణం కూలి సొమ్ములు విడుదల చేయాలని కోరారు. ఆందోళనలో ఏఐకేకేఎంసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెలల తరబడి అందని సొమ్ము జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా -
మత్తు పదార్థాలను అరికడదాం
రాయచూరు రూరల్ : జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లాధికారి నితీష్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని నవోదయ వైద్య కళాశాల ఆవరణలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మాదక వ్యసనాల నుంచి విముక్తిపై ప్రచారాందోళనలో పాల్గొని మాట్లాడారు. నేటి తరం యువకులు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారన్నారు. యువకులు దురలవాట్లకు గురై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మత్తు పదార్థాల సేవనంతో ఆరోగ్యంతో పాటు మానసికంగా కుంగిపోతారన్నారు. యువత గంజాయి, హఫీం వంటి వాటికి బానిసలు కాకుండా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ఒక్కరోజులోనే 9 కేసులను నమోదు చేశామని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. కార్యక్రమంలో డ్రగ్స్ నియంత్రణాధికారి ఉదయ్ కిశోర్, అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ దేవానంద్లున్నారు. -
పేదలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వండి
రాయచూరు రూరల్: నగరంలోని మురికి వాడల్లో నివసించే పేద ప్రజలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వాలని మురికి వాడల క్రియా వేదిక అధ్యక్షుడు జనార్దన్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్ల నుంచి మురికి వాడల్లో నివసిస్తున్న వారికి నగరసభ అధికారులు, నగర ప్రాధికార అధికారులు మౌనం వహించారన్నారు. నగర ప్రాంతంలో నివసించే వారి కోసం ఇళ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. 2024లో 3.36 లక్షల మందిలో కేవలం 1.64 లక్షల మందికి హక్కు పత్రాలను అందించారన్నారు. కానీ వారికి ఇళ్ల స్థలాలను కేటాయించడంలో ఆర్డీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. ప్రభుత్వం మురికి వాడల ప్రజలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వాలన్నారు. -
క్యారం పోటీల్లో ప్రథమ స్థానం
సాక్షి,బళ్లారి: క్యారం బోర్డు ఆట ఎంతో ఉత్కంఠమైన ఆటగా చెప్పవచ్చు. పిల్లలు, పెద్దలు ఇంటి పట్టునే ఉండి చక్కగా క్యారంస్ ఆడతారు. కాగా హైదరాబాద్ ప్రగతి నగర్లో సీనియర్ సిటిజన్స్ సంఘం ఏర్పాటు చేసిన క్యారం పోటీల సీనియర్స్ ఏ బృందంలో సంఘం శాశ్వత సభ్యుడు, జిల్లా సమాచార శాఖ విశ్రాంత డీడీ చంద్రకాంత్ ప్రథమ స్థానంలో నిలిచారు. చంద్రకాంత్ కేవలం 9.35 నిమిషాల్లో బోర్డులోని అన్ని 9 కాయిన్లను ప్యాకెట్లో వేసి విజయాన్ని అందుకున్నారు. సంఘం మరో సభ్యుడు టీవీ సీతారామారావు 10.35 నిమిషాలతో రెండో, కోటేశ్వరరావు 10.51 నిమిషాలతో మొత్తం కాయిన్లను ప్యాకెట్లోకి వేసి మూడో బహుమతి సాధించారు. జూనియర్స్ బీ.బృందంలో కేఎస్ఎల్ శాస్త్రి ప్రథమ, జే.నాగిరెడ్డి ద్వితీయ, సంఘం కార్యదర్శి ఈ.పుల్లయ్య తృతీయ బహుమతులను చేజిక్కించుకున్నారు. ఏ బృందంలో 14 మంది, బీ బృందంలో 15 మంది పాల్గొన్నారు. సంఘం సభ్యులు కామేశ్వరరావు, హరినాథ్ పోటీల నిర్వాహకులుగా వ్యవహరించగా, ఆ సంఘం అధ్యక్షుడు కామయ్య విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
ఐదేళ్ల లోపు పిల్లలకు టీకాలు తప్పనిసరి
హొసపేటె: జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఈ నెల 31 వరకు, జూన్ 23 నుంచి 28 వరకు ప్రత్యేక టీకా అభియాన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆర్సీహెచ్ అధికారి జంబయ్య తెలిపారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో కల్లహళ్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ప్రత్యేక టీకా ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని పిల్లలందరూ టీకాలు వేయించుకోవడం తప్పనిసరి అన్నారు. ముఖ్యంగా టీకాలు వేయని పిల్లలకు ప్రత్యేక టీకా అభియాన్లో టీకాలు వేస్తారన్నారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు తప్పకుండా టీకాలు వేయించాలని అన్నారు. కార్యక్రమంలో తాలూకా ఆరోగ్య అధికారిణి డాక్టర్ వినోద, జిల్లా ఆరోగ్య విద్య అధికారి ఎంపీ.దొడ్డమని, జిల్లా ఆరోగ్య ఇన్స్పెక్టర్ ఎం.ధర్మనగౌడ, ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ అధికారిణి లత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నందిని, ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
డిమాండ్ల సాధన కోసం ధర్నా
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో పాటు 19 డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, నీటి సరఫరా మినహా అన్ని సేవలను నిలిపి వేసి మంగళవారం నుంచి నిరవధిక ధర్నాకు దిగినట్లు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘం విజయనగర జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర వర్మ తెలిపారు. ఆయన ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ తమ డిమాండ్లను నెరవేర్చాలని తమ సంఘం ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. తమ అసోసియేషన్ కార్యనిర్వాహక సమావేశంలో నిర్ణయించిన విధంగా, ప్రభుత్వానికి గతంలో తెలియజేసినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకం, ఘన వ్యర్థాల నిర్వహణ వాహనాలకు డ్రైవర్ పోస్టుల కేటాయింపు, శాశ్వత అకౌంటెంట్ పోస్టు ఇంకా 19 ఇతర డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తమ ధర్నాను యథావిధంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. సల్మాన్ శేషన్న, రవికుమార్, భారతి, ఈరన్న, సురేష్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నెహ్రూ సేవలు అనన్యం
రాయచూరు రూరల్ : దేశానికి దివంగత మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు చేసిన సేవలు అనన్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. అత్యంత ప్రభావశాలి ప్రధానమంత్రిగా దేశంలో పంచశీల సూత్రాలను అమలు చేశారని కొనియాడారు. జయంతిరావ్, జాగీర్దార్, మరిస్వామి, మంజుల, సురేఖ, రాణి, మాలా, శశికళ, రంగరాజ్, ఈరణ్ణ, చేతన్, వెంకణ్ణలున్నారు. రాణా ప్రతాప్సింగ్ జయంతి రాయచూరు రూరల్ : నగరంలో రాజపుత్ సమాజం ఆధ్వర్యంలో రాణా ప్రతాప్ సింగ్ 485వ జయంతిని వైభవంగా నిర్వహించారు. నగరంలోని మావినకెరె చెరువు వద్ద నెలకొల్పిన రాణా ప్రతాప్ సింగ్ ప్రతిమకు రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. సమాజం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలన్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో జయంతిరావ్, శాంతప్ప, రమేష్, శ్రీనివాసరెడ్డి, రుద్రప్ప, నరసింహులు, మనోహర్ సింగ్, వెంకటసింగ్, శంకర్సింగ్, మాన్సింగ్లున్నారు. ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించండిరాయచూరు రూరల్: త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నగరసభలో ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్టీ నేతల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఒకరు మాత్రమే సభ్యులుగా కొనసాగుతున్నారన్నారు. భవిష్యత్తులో నాయక్ వర్గానికి 7 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించేలా చూడాలని జిల్లాధికారి, నగరాభివృద్ధి ప్రాధికార మంత్రికి లేఖలు రాశామన్నారు. జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ కోటాను పెంచాలన్నారు. బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్రాయచూరు రూరల్: హస్మియా రక్షణ గోడల తొలగింపుతో వీధిన పడ్డ నివాసులకు పునర్వసతి ఏర్పాటు చేయాలని బీజేపీ ఎస్పీ యువమోర్చా అధ్యక్షుడు సన్నీ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 40 ఏళ్ల నుంచి హస్మియా ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఉన్నఫళంగా ఆక్రమించిన స్థలాల్లో దుకాణాలు, హోటళ్లు నిర్మించుకున్న వారందరూ స్థలాలను ఖాళీ చేయాలని వారం రోజుల క్రితం ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా తొలగించడాన్ని ఖండించారు. వక్ఫ్ బోర్డు అధికారులు తొలగిస్తున్న తరుణంలో కలబుర్గి హైకోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలు వచ్చినా అధికారులు పునర్వసతి కల్పించకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. హస్మియా రక్షణ గోడ వక్ఫ్ బోర్డుది కాదు, ప్రభుత్వ స్థలమని అన్నారు. ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఒత్తిడి చేశారు. రాయచూరు, కలబుర్గిల్లో భారీ వర్షం రాయచూరు రూరల్: రాయచూరు, కలబుర్గి జిల్లాల్లో సోమవారం సాయంత్రం రెండు గంటల పాటు జడి వానతో కూడిన భారీ వర్షం కురిిసింది. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా రహదార్లు బురద గుంటలుగా మారాయి. అరబ్ కాలనీ పక్కనే వంతెన ఉండడంతో ఆ నీరు కాలనీలోకి ప్రవేశించాయి. రంగ మందిరం వెనుక, జహీరాబాద్ కాలనీలో పెద్ద చెట్లు కూలిపోవడంతో విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
సమర్థకు రాష్ట్రస్థాయి ద్వితీయ ర్యాంక్
హుబ్లీ: ధార్వాడ కేఈ బోర్డు ఆంగ్ల మాధ్యమ హైస్కూల్ విద్యార్థి సమర్థ ఉమర్జి 10వ తరగతి పరీక్షల రీవాల్యుయేషన్లో 624 మార్కులు సాధించి రాష్ట్రానికి ద్వితీయ, జిల్లాకు ప్రథమ స్థానంలో నిలిచారు. తొలుత వెల్లడైన ఫలితాల్లో సమర్థకు 619 మార్కులు మాత్రమే వచ్చాయి. అనంతరం రీవాల్యుయేషన్ జరపగా గణితంలో 80, ఇంగ్లిష్లో 79 మార్కులు సాధించి తన ప్రతిభను చాటాడు. కాగా తొలుత వెల్లడైన ఫలితాల మేరకు గణిత శాస్త్రంలో 76, ఇంగ్లిష్లో 78 మార్కులు వచ్చాయి అంటే ఇంగ్లిష్లో 1 మార్కు, గణిత శాస్త్రంలో అదనంగా మరో 4 మార్కులు సాధించాడు. కాగా రీవాల్యుయేషన్లో పలు విద్యార్థుల మార్కులు గణనీయంగా పెరగడం గమనార్హం. బురదమయంగా ఏపీఎంసీ మార్కెట్ హొసపేటె: వర్షం కారణంగా ఏపీఎంసీ మార్కెట్ బురదమయంగా మారడంతో అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. గతవారం నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. నగరంలోని ఏపీఎంసీ మార్కెట్ పూర్తిగా చిత్తడిగా మారడంతో వినియోగదారులకు, వ్యాపారులకు నానా ఇబ్బందులు తలెత్తాయి. భారీ వర్షం కారణంగా వ్యాపారులు, వినియోగదారులు వర్షంలోనే వ్యాపారాలు నిర్వహించడం కనిపించింది. ఉదయం కురిసిన భారీ వర్షం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన పడ్డారు. మహిళ కడుపులో 2 కేజీల గడ్డ తొలగింపు ● చిటగుప్పి ఆస్పత్రి వైద్య బృందం ఘనత హుబ్లీ: వాణిజ్య నగరి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్ నిర్వహణలోని చిటగుప్పి ఆస్పత్రి తాజాగా ఓ ఘనత సాధించింది. ఓ మహిళ కడుపులోని సుమారు 2 కేజీల బరువైన గడ్డను ఆపరేషన్ చేసి వైద్యులు తొలగించారు. ఉన్న స్వల్ప సౌకర్యాలతోనే ఈ క్లిష్టకరమైన ఆపరేషన్ చేసి మహిళకు పునర్జన్మ ప్రసాదించారు. మహిళలకు సురక్షితమైన కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఈ ఆస్పత్రి పేరుగాంచింది. ప్రస్తుత ఆస్పత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ దండెప్పనవర్ నేతృత్వంలో ఫైబ్రాయిడ్ చికిత్స కోసం దాఖలైన మహిళకు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. సదరు మహిళ రక్తహీనతతో బాధపడుతుండేది. దీంతో ఆమెకు నిస్సత్తువ, నడవడానికి వీలు కాని పరిస్థితి ఉండేది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోవడంతో చివరికి ఈ ఆస్పత్రిలో చేరారు. ఈమెను పరీక్షించగా కడుపులో గడ్డ ఉండడాన్ని గుర్తించిన వైద్య బృందం ఆమెకు ఒకటిన్నర గంట పాటు ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగా ఉంది. ముందు జాగ్రత్తే డెంగీకి మందు హొసపేటె: ప్రజల సహకారం, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా మాత్రమే డెంగీ కట్టడి సాధ్యమని జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అక్రమ్ అలీ షా తెలిపారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సహకారంతో నిర్వహించిన జాతీయ డెంగీ దినోత్సవ జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ శాఖల ప్రయత్నాలతో మాత్రమే వ్యాధి వ్యాప్తిని, అనారోగ్యాన్ని నివారించడం అసాధ్యమని అన్నారు. డెంగీకి టీకా లేదా యాంటీ వైరల్ చికిత్స ద్వారా నివారణ తమకు ఉన్న ఉత్తమ ఎంపిక అన్నారు. డెంగీ వ్యాధి ఏడిస్ దోమలు పగటి పూట కుట్టడం వల్ల కలిగే వైరల్ వ్యాధి అన్నారు. డెంగీకి సకాలంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే దీనిని నివారించవచ్చన్నారు. జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ శంకర్నాయక్ మాట్లాడుతూ గత సంవత్సరం 314 డెంగీ జ్వరాల కేసులు నమోదయ్యాయన్నారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు. ఈఏడాది ప్రారంభంలో 14 కేసులు గుర్తించామన్నారు. ఈ సందర్భంగా వైద్యులు జంబయ్య, భాస్కర్ పాల్గొన్నారు. ఎల్ఎల్సీపై దారి నిర్మించండి హొసపేటె: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ఎల్ఎల్సీ కాలువ ఎడమ గట్టుకు ఆనుకుని ఉన్న భూమి దగ్గర ఒక పెద్ద గుంట ఏర్పడింది. దీని వల్ల ఎల్ఎల్సీ కాలువ ప్రమాదంలో పడింది. ఈ సంఘటన విజయనగర జిల్లాలోని నాగేనహళ్లి గ్రామ సమీపంలో జరిగింది. భారీ వర్షపు నీటి ప్రవాహం కారణంగా ఎల్ఎల్సీ కాలువ దగ్గర రహదారి పూర్తిగా మూసుకుపోయింది. ఎద్దుల బండ్లు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాలువకు అడ్డుగోడ నిర్మించాలని 2020 నుంచి రైతులు పలుమార్లు ఈ విషయంపై తుంగభద్ర బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఈనేపథ్యంలో అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి త్వరలో సమస్యను పరిష్కరించక పోతే టీబీ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతు సంఘం నేత గాళెప్ప హెచ్చరించారు. -
కుటుంబ కలహాలతో భార్య హత్య
విజయపుర(బెంగళూరు గ్రామీణ): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను డంబల్స్తో కొట్టి హతమార్చి తాను కూడా ఉరి వేసుకొన్న సంఘటన విజయపుర పట్టణంలోని 5వ వార్డు మారుతి నగరలోని విజయనగర లేఔట్లోని 2వ క్రాస్లో చోటు చేసుకుంది. శిడ్లఘట్ట డీవియేషన్ రోడ్డులో నివాసం ఉన్న వెల్డింగ్ దుకాణం యజమాని బసవాచారి(46) అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి తన భార్య సుమా(38)ను డంబల్స్తో కొట్టి హత్య చేసిన ఆనంతరం తాను కూడా ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హాసన జిల్లాకు చెందిన బసవాచారి విజయపురకు వచ్చి సుమారు 25 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కుమారులు 9వ తరగతి, 7వ తరగతి చదువుతున్నారు. విషయం తెలియగానే బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ సీ.కే.బాబా పరిశీలించారు. విజయపుర టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆపై తనూ ఆత్మహత్య చేసుకున్న భర్త -
నెహ్రూ ఆధునిక భారతదేశ నిర్మాత
శివాజీనగర: స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆధునిక భారత నిర్మాత అని సీఎం సిద్దరామయ్య అన్నారు. నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం విధానసౌధ తూర్పు ద్వారం వద్ద ఆయన విగ్రహానికి, ఫొటోకు సీఎం పుష్పమాల సమర్పించారు. దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు నిబద్ధతతో పనిచేశారన్నారు. మిశ్రమ ఆర్థికత వ్యవవస్థను ప్రవేశపెట్టి అభివృద్ధికి పునాదాలు వేశారన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న 17 సంవత్సరాల కాలావధిలో అనేక ఆనకట్టలు, ప్రభుత్వ రంగాల పరిశ్రమలు, విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయన్నారు. బీజేపీకి తెలిసింది హింస, అబద్ధం బీజేపీకి తెలిసింది కేవలం హింస, అబద్ధం మాత్రమేనని సిద్దరామయ్య ధ్వజమెత్తారు. కేపీసీసీ కార్యాలయంలో జరిగిన జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితులు, శూద్రులపై కేసులు పెట్టటమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని. ఆ తరువాత వారిని జైలు నుంచి పిలుచుకొని వచ్చేది కూడా వారే. ఇదే నాటకం చేస్తూ వారు కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాల సృష్టికర్తలు బీజేపీ, ఆరెస్సెస్ సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉన్న అంబేడ్కర్, నెహ్రూ గురించి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అబద్ధాలను సృష్టించాయన్నారు. అంబేడ్కర్ను ఎన్నికల్లో ఓటమి పాలు చేసింది డాంగే, సావర్కర్ అని స్వయంగా అంబేడ్కర్ తన చేతి రాతలో లేఖ రాశారు. అయినా అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్ కారణమని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని దుయ్యబట్టారు. డీసీఎం డీ.కే.శివకుమార్, కాంగ్రెస్ నాయకులు బీ.కే.హరిప్రసాద్, హెచ్.ఎం.రేవణ్ణ, డాక్టర్ జీ.సీ.చంద్రశేఖర్, మంజునాథ్ భండారి, ఎం.ఉదయ శంకర్, ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ, ఎమ్మెల్సీ నజీర్ అహ్మద్, జిల్లాధ్యక్షుడు నంజయ్యనమఠ పాల్గొన్నారు. సీఎం సిద్దరామయ్య -
కరావళి, మలెనాడులో కుంభవృష్టి
బనశంకరి: రాష్ట్రంలో కరావళి, మలెనాడు, కావేరి జలానయన ప్రదేశాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నలుగురు మృత్యవాత పడ్డారు. దక్షిణ కన్నడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రెండు రోజుల పాటు అంగన్వాడీ, పాఠశాలలు, కాలేజీలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, పీయూ కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ దక్షిణ కన్నడ జిల్లా కలెక్టర్ ముల్లై ముగిలన్ ఆదేశాలు జారీ చేశారు. కరావళి, మలెనాడు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో వివిధ తాలూకాల్లో ఎడతెరపి లేని వర్షాలు పడుతున్నాయి. మంగళూరు పంప్వేల్ పై వంతెన పూర్తిగా జలమయమైంది. మంగళూరు కొడియాల్బైల్ భగవతినగర ద్వీపంగా మారింది. భారీ వర్షాల కారణంగా రాజ కాలువలోని నీరు జనవసతి ప్రదేశాల్లోకి చొరబడి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం దక్షిణకన్నడ జిల్లాలో భారీ వృక్షం కారుపై పడటంతో నలుగురు ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఈ ఘటన కడబ తాలూకా రామకుంజలో సంభవించింది. అబ్దుల్ సలీం, రామకుంజ రోడ్డు వీధిలో మారుతీ కారును పార్కింగ్ చేసి వెళ్లారు. ఒక్కసారిగా మామిడి చెట్టు శబ్దం విని కారులో నుంచి కిందికి దిగి బయటకు వెళ్లారు. 30 వరకు వర్షాలు ఈనెల 30వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉడుపి జిల్లాలో వర్షాలు తీవ్రరూపం దాల్చడంతో పడుకెరె సముద్ర తీరంలో భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి. తీరప్రాంతాల్లో నివాసులను జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. చిక్మగళూరు జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు పలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మూడిగెరె తాలూకా బాళూరు గ్రామం ఎస్టేట్లో అర్దరాత్రి కార్మికుడి ఇంటిపై భారీ చెట్టు కూలిపోవడంతో సునంద అనే మహిళ తీవ్రంగా గాయపడింది. 20 మంది కార్మికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. హాసన జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా సకలేశపుర అనేమహల్ వద్ద రహదారిలో మట్టి కుంగిపోవడంతో వాహనదారులు భయం భయంగా సంచరిస్తున్నారు. కూలిపోయిన హోటల్ గోడ సకలేశపురలో మలెనాడు కెఫె హోటల్ గోడ కూలిపోయింది. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. శిరాడీఘాట్ రోడ్డులో రెండు వైపులా భూమి కుంగిపోయింది. వర్షంతో 100 అడుగుల ఎత్తుగల కొండ కూలిపోతుందనే భయం ఏర్పడింది. హసన తాలూకా బాగే సమీపంలోని అరసు నగరలో భారీవర్షంలో కారు డ్రైవింగ్ చేస్తూ డివైడర్కు డీకొట్టడంతో కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. బెంగళూరు దాసరహళ్లికి చెందిన శరత్(28), అభిషేక్(27) మృతులు. కొడగు జిల్లా విరాజపేటె తాలూకా మాల్దారెలో ఇంటి వద్ద పని చేస్తుండగా చెట్టు కొమ్మ విరిగి పడటంతో విష్ణుబెల్లప్ప తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఉడుపి, ఉత్తరకన్నడ, దక్షిణకన్నడ, శివమొగ్గ, చిక్మగళూరు, కొడగు జిల్లాలకు 5 రోజులు రెడ్అలర్ట్ ప్రకటించారు. బీదర్, కలబురిగి, యాదగిరి, విజయపుర, బెళగావి జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేఆర్ఎస్లోకి మూడు అడుగుల మేర నీరు కావేరి జలానయన ప్రదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత 24 గంటల్లో కేఆర్ఎస్లో మూడు అడుగుల మేర నీరు పెరిగింది. పాతమైసూరు ప్రాంతానికి జీవనాడిగా ఉన్న మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా కేఆర్ఎస్ ఆనకట్టలో ఇన్ఫ్లో పెరిగింది. ఒకేరోజు మూడు అడుగుల నీరు చేరింది. రెండు రోజుల క్రితం జలాశయానికి 350 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా కావేరి జలానయన ప్రదేశంలో భారీ వర్షాలతో మంగళవారం 19,129 క్యూసెక్కుల నీరు చేరింది. ముంగారు ప్రారంభంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతుల ముఖాల్లో ఆనందం నెలకొంది. భారీ వర్షాలతో ముగ్గురి మృతి పలు జిల్లాల్లో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు కూలుతున్న ఇళ్లు, వృక్షాలు దక్షిణ కన్నడ జిల్లాలో నలుగురికి తప్పిన ప్రమాదం కేఆర్ఎస్లోకి వరద జలాలు -
అటవీశాఖ రాయబారిగా అనిల్ కుంబ్లే
● మంత్రి ఈశ్వర ఖండ్రె శివాజీనగర: మాజీ క్రికెట్ క్రీడాకారుడు అనిల్ కుంబ్లేను అటవీ, వన్యజీవి రాయబారిగా నియమించినట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. మంగళవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో కర్ణాటక వన్యజీవి మండలి ఉపాధ్యక్షుడిగా అనిల్ కుంబ్లే సేవలు అందించారన్నారు. ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అటవీ సంరక్షణ, అటవీ సంవర్ధక, వన్య సంరక్షణ, వన్యజీవి సంరక్షణపై ప్రజల్లో జాగృతి కల్పించేందుకు రాయబారిగా ఎంపిక చేశామన్నారు. అనిల్ కుంబ్లెకు వన్యజీవులపై అపారమైన ఆసక్తి ఉందన్నారు. ఆయన ఎలాంటి పారితోషకం తీసుకోకుండా రాయబారిగా ఉండేందుకు అంగీకరించారన్నారు. -
మాజీ మంత్రి వీరకుమార్ పాటిల్ కుమారుడు అరెస్ట్
దొడ్డబళ్లాపురం: వరకట్న వేధింపులతోపాటు మహారాష్ట్రలో సంచలనం కలిగించిన వైష్ణవి హత్య కేసులో నిందితులకు ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలపై మాజీ మంత్రి వీరకుమార్ కుమారుడు ప్రీతమ్ను పుణె పోలీసులు అరెస్టు చేశారు. వైష్ణవిని ఆమె మామ రాజేంద్ర, మరిది సుశీల్ హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరిపై కేసు నమోదుకాగా అరెస్టు కాకుండా ప్రీతమ్ ఆశ్రయం కల్పించడంతోపాటు ఆర్థిక సాయం చేశారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. హత్య కేసులో నిందితులు అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ పార్టీలో ముఖ్య నేతలు కావడం వల్ల ఈ కేసు మహారాష్ట్రలో సంచలనంగా మారింది. మైసూరులో చైన్ స్నాచింగ్ మైసూరు: మైసూరులో చైన్ స్నాచింగ్ జరిగింది. విద్యారణ్యపురంలో నివాసముంటున్న శారదమ్మ తన భర్త సుబ్రమణ్యశెట్టితో కలిసి దశరథ గుప్తుడి ఇంటికి వెళ్లింది. తిరిగి వస్తుండగా విద్యారణ్యపుర నాల్గవ ప్రధాన రోడ్డు సమీపంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు శారదమ్మ మెడలోని రూ.3.50లక్షల విలువైన బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. టోయింగ్ వల్ల సమస్యలు వస్తే రద్దు చేస్తాం ● హోంమంత్రి పరమేశ్వర్ దొడ్డబళ్లాపురం: నో పార్కింగ్లో ఉన్న వాహనాలను టోయింగ్ చేసే విధానాన్ని సమస్యగా భావిస్తే రద్దు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం సదాశివనగర్లో తమ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ మండ్యలో జరిగిన సంఘటన బాధాకరమని, ఈ వ్యవహారంలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశామని, ఈ సంఘటనకు సంబంధించి అధికారులతో సమావేశమై చర్చిస్తానన్నారు. ట్రాఫిక్ పోలీసుల వైఖరి క్షమించరానిదన్నారు. ఈ విషయంలో పోలీసులను హెచ్చరించి పలు సూచనలు చేశామన్నారు. మునిరత్నపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ● డీసీఎం డీకే శివకుమార్ శివాజీనగర: ‘ముత్యాలు, రత్నాలను బీజేపీ వారే ఉంచుకోవటంలో తమకు అభ్యంతరం లేదు. అయితే మునిరత్నను ఎందుకు సస్పెండ్ చేయలేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రశ్నించారు. మంగళవారం కేపీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎస్.టీ.సోమశేఖర్, హెబ్బార్ విధానసౌధలో ఎవరినీ రేప్ చేయలేదు. హెచ్ఐవీ ఇంజెక్షన్ పొడిచారా? అని ప్రశ్నించారు. మునిరత్నపై చాలావరకు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులకు ఇంజెక్షన్ ఎక్కించేందుకు వెళ్లారు. యడియూరప్పను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని డీసీఎం డీ.కే.శివకుమార్ ప్రశ్నించారు. -
మరో 9 కోవిడ్ కేసుల నమోదు
బోవి మండలి స్కాంలో ఆస్తుల జప్తు బనశంకరి: కర్ణాటక రాష్ట్ర బోవి అభివృద్ధి మండలిలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణంలో నిందితులకు చెందిన రూ.26.27 కోట్ల విలువచేసే స్థిరాస్థిని ఈడీ జప్తు చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ ఆస్తి విలువ రూ.40 కోట్లు ఉంటుంది. ఈ కేసులో బీకే.నాగరాజప్ప, ఆర్.లీలావతి తదితరులకు చెందిన ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. బోవి మండలికి చెందిన నగదు బదిలీ ద్వారా ఆస్తులను పొందారని ఈడీ పేర్కొంది. పులి పంజా.. నవ వివాహితుడు బలిమైసూరు: పులి దాడి చేసిన ప్రమాదంలో ఇటీవలే పెళ్లయిన యువకుడు బలయ్యాడు. మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకా గురుపుర గ్రామంలో జరిగింది. 5వ బ్లాక్లో హరీష్ (24) నివాసం ఉంటున్నాడు, సోమవారం ఊరి శివార్లలో అడవిలో మేకలను మేపుతున్న సమయంలో పులి దాడి చేసింది. యువకుడు గట్టిగ కేకలు వేశాడు. స్థానికలు వచ్చేలోగా పులి అతనిని చంపి పారిపోయింది. తీవ్రగాయాలతో పడి ఉన్న హరీష్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు, వైద్యులు పరిశీలించి చనిపోయినట్లు తెలిపారు. హుణసూరు గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. హరీష్కు 8 నెలల కిందటే పెళ్లి అయ్యిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 28 నుంచి చిత్ర సంతె–2 ● చిత్రకళాపరిషత్లో 5 రోజులు ప్రదర్శన బనశంకరి: చిత్రసంతె తరహాలో మరో చిత్ర ప్రదర్శన జరగనుందని నగరంలోని చిత్రకళా పరిషత్ అద్యక్షుడు బీఎల్.శంకర్ తెలిపారు. సోమవారం పరిషత్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 28వ తేదీ నుంచి 5 రోజుల పాటు నమ్మ ఆర్ట్స్ బెంగళూరు జాతీయ కళా ఉత్సవం – 2025 జరగుతుందన్నారు. ప్రముఖ కళాకారులు గీసిన చిత్రాల ప్రదర్శన, విక్రయాలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవంలో 100 మందికి పైగా చిత్రకారులు పాల్గొంటారని, దుకాణాలు, గ్యాలరీలో ప్రదర్శన కల్పించామని తెలిపారు. కర్ణాటక నుంచి 51 మంది చిత్రకారులు పాల్గొంటున్నారని, మిగతావారు ఇతర రాష్ట్రాల వారని తెలిపారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రదర్శనను నిర్వహిస్తామన్నారు. మలప్రభ, కృష్ణా నదుల జోరు● రోడ్లు, వంతెనలు జలార్పణం దొడ్డబళ్లాపురం: బెళగావిలోని పశ్చిమఘాట్ల ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో మలప్రభ నది పొంగిప్రవహిస్తోంది. దీంతో ప్రధాన రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. ముఖ్యంగా బెళగావి–గోవా ప్రధాన రహదారి తెగిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. బెళగావి, ఖానాపుర, రామనగర మార్గాల్లో చాలాంది గోవాకు వెళ్లేవారు. అయితే ఈసారి వర్షాకాలం ముగిసే వరకూ ఈ మార్గాన్ని మూసివేసే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదిలో నీటి ప్రవాహం రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాగే కొనసాగితే బెళగావి చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లో ముంపు ఏర్పడే ప్రమాదముంది. సైన్యానికి దత్తపీఠం రూ.25 లక్షల విరాళం మైసూరు: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మైసూరు దత్తపీఠం భారత సైన్యానికి రూ. 25 లక్షలు విరాళం ఇచ్చింది. మైసూరులోని దత్తానగర్లోని ఆశ్రమంలోని నాద మంటపంలో గణపతి సచ్చిదానంద స్వామి, చిన్నదత్త విజయానంద తీర్థ స్వామీ వేద పఠనం ద్వారా దత్త వెంకటేశ్వర బ్రహ్మోత్సవ వేద పారాయణాన్ని సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మైసూరు– కొడగు ఎంపీ యదువీర్ క్రిష్ణదత్త ఒడెయార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సచ్చిదానందస్వామి భారత సైన్యానికి రూ. 25 లక్షలు విరాళం చెక్కును ఎంపీ యదువీర్కి అందజేశారు. నారాయణ మూర్తి, మంజుల చెల్లూరు, టీఎస్ శ్రీవత్స ఉన్నారు. ముఖంపై స్ప్రే కొట్టి నగల దోపిడీ దొడ్డబళ్లాపురం: మహిళ మొహానికి స్ప్రే కొట్టిన దుండగులు ఆమె మెడలోని బంగారం మాంగల్యం చైను, కమ్మలు దోచుకుని పరారైన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా నందరామయ్యనపాళ్యలో చోటుచేసుకుంది. అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న లక్ష్మి, ఇంటి ముందు ఉండగా అక్కడకు వచ్చిన ఇద్దరు దుండగులు అడ్రస్ చెప్పాలని ఆమె దగ్గరకు వచ్చారు. వెంటనే ఆమె ముఖంపై ఏదో స్ప్రే కొట్టి బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. సుమారు రూ.1.80లక్షల విలువైన నగలు పోయినట్టు లక్ష్మి మాదనాయకనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైసూరు శాండల్ నకిలీ సోపుల తయారీ శివాజీనగర: కేఎస్డీఎల్ సంస్థ విషయంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర కన్నడ అభిమానం గురించి మాట్లాడుతున్నారు. ఆయనతో కన్నడ అభిమానం గురించి చెప్పించుకోవాల్సిన అవసరం లేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బీ.పాటిల్ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన మైసూరు శాండల్ వ్యాపారం పెంచడం కోసమే హిందీ నటి తమన్నా భాటియాను ప్రచార రాయబారిగా ఎంపిక చేశామన్నారు. హైదరాబాద్లో కొందరు నకిలీ మైసూరు శాండల్ సోప్ తయారు చేస్తున్నారు, దానిని బంద్ చేయించాం. మళ్లీ తయారు చేస్తున్నారని తెలిసింది, దీనిపై చర్యలు తీసుకొంటామని మంత్రి తెలిపారు. నగరసభపై లోకాయుక్త దాడి దొడ్డబళ్లాపురం: దొడ్డ నగరసభలో లోకాయుక్త దాడి జరిగింది. సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా వచ్చిన లోకాయుక్త పోలీసులు నగరసభ కార్యాలయంలోకి వెళ్లి దాఖలాల పరిశీలన చేపట్టారు. లోపల ఉన్న అధికారులను లోపలే ఉంచి తలుపులు వేశారు. ఈ–ఖాతాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపనలు వచ్చాయి. దీనిపై ప్రజాసంఘాలు కూడా ధర్నాలు చేశాయి. దీంతో లోకాయుక్త దాడి చేసినట్టు తెలుస్తోంది. బనశంకరి: రాష్ట్రంలో కోవిడ్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల అవధిలో కేసుల సంఖ్య 47కు చేరుకోగా ఒకరు చనిపోయారు. దీంతో రెండురోజుల్లో రెండు మరణాలు సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ వైద్యసిబ్బందిని ఆదేశించింది. ఎక్కువ మంది ఇంట్లోనే రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 47 కు చేరుకోగా 46 మంది రోగులు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశాఖ గత 24 గంటల్లో 104 మందికి కరోనా పరీక్షలు చేపట్టగా 9 కొత్త కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ శాతం 8.65 కు చేరుకుంది. రాష్ట్రంలో ఎలాంటి కొత్త రూపాంతర వైరస్ కనబడలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. పొరుగున కేరళలోనూ కేసులు గణనీయంగా పెరిగాయి. బెంగళూరు సౌత్లో అధికం ● గత 24 గంటల్లో 96 ఆర్టీ పీసీఆర్తో పాటు మొత్తం 104 మంది శాంపిల్స్ను సేకరించి కొత్త వైరస్ వేరియంట్లు వచ్చాయా అని పరీక్షించారు. ● ఈ ఏడాది రాష్ట్రంలో 98 కోవిడ్ కేసులు రాగా, 50 మంది రోగులు కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. ● బెంగళూరులో 71 కోవిడ్ కేసులు ఉంటే, అందులో మహదేవపుర వలయం కరోనా హాట్ స్పాట్గా నిలిచింది. సిటీ దక్షిణ జోన్లో తీవ్రత బాగా ఉంది. మహదేవపుర వలయంలో 16, దక్షిణ వలయంలో 14, బొమ్మనహళ్లి 7 , బెంగళూరు కేంద్ర 5, యలహంక 4, బెంగళూరు తూర్పు 13, బెంగళూరు పశ్చిమ 10, ఆర్ఆర్.నగర 1 కేసు నమోదయ్యాయి. ● నిమ్హాన్స్, బెంగళూరు మెడికల్ కాలేజీతో పాటు రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల్లో కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. రోజుకు 150–200 టెస్టులు చేయాలని సూచించారు. మాస్కు తప్పనిసరి కాదు! బెంగళూరు పాలికె కమిషనర్ మహేశ్వర్రావ్ 8 వలయాల కమిషనర్లతో కరోనా కట్టడి చర్యల గురించి చర్చించారు. కోవిడ్ ఉధృతం కాకుండా చూడాలి, ఆసుపత్రులకు వచ్చే వృద్ధులు, గర్భిణీలు పిల్లలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. నగర పాలికె ఆసుపత్రులకు వచ్చే రోగులు మాస్కు ధరించాలని ప్రచారం చేశారు. శ్వాసకోశ జబ్బులు ఎక్కువగా ఉండేచోట ప్రత్యేక వైద్యసేవలు అందించాలన్నారు. నమ్మ మెట్రో రైలులో ఇంకా మాస్కు తప్పనిసరి చేయలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాస్కు గురించి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. న్యూస్రీల్ రాష్ట్రంలో మొత్తం 47 మందికి పాజిటివ్ కొత్త వేరియంట్ కనబడలేదు బడుల రీ ఓపెన్ మార్పు? కోవిడ్ పరిస్థితిని మూడు నాలుగు రోజులు గమనించి స్కూళ్లు, కాలేజీల పునః ప్రారంభం గురించి నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. ఇప్పటి కరోనా వైరస్ ప్రమాదకరం కాదని చెప్పారు. నిజానికి 29వ తేదీ నుంచి పాఠశాలు ప్రారంభం కావాల్సి ఉంది. కేసులు పెరిగితే స్కూళ్ల రీఓపెన్ను వాయిదా వేసే అవకాశముంది. -
హైవేలో కారు పల్టీ.. యువ వైద్యుదు మృతి
కోలారు: ఆకస్మికంగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ మెడికో ని బలిగొంది. చైన్నె – బెంగుళూరు ఎక్స్ప్రెస్ హైవే కారిడార్లో సోమవారం కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నగరానికి యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు..వైద్యుడు కృష్ణ జగన్ (24), అనంతపురం నగరంలోని ఇందిరానగరవాసి, తండ్రి పేరు వెంకటేశులు. కృష్ణ జగన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పంలోని పిఈస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ని పూర్తిచేసి ఇంటర్న్షిప్లో ఉన్నాడు. పనిమీద అనంతపురానికి వెళ్లిన ఆయన మళ్లీ సోమవారం తెల్లవారుజామున కాలేజీకి ఐటెన్ కారును నడుపుతూ బయల్దేరారు.కారు కోలారు జిల్లా బంగారుపేట తాలూకా సిద్ధనహళ్లి వద్ద చైన్నె – బెంగుళూరు ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తూ వేగం వల్ల అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఓ టైర్ పేలిపోవడమే కారణమని తెలుస్తోంది. కారు నుజ్జునుజ్జుకాగా డాక్టర్ కృష్ణ ఘటనా స్థలంలోనే మరణించారు. ఉదయం 8:30 సమయంలో దుర్ఘటన జరిగింది. బంగారుపేట పోలీసులు చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
కురుస్తోంది కుండపోత
బనశంకరి: రాష్ట్రంలో గడువుకు ముందుగానే నైరుతి రుతుపవనాలు వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కరావళి, మలెనాడుతో పాటు చాలా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో నైరుతి వర్షాలు మరింత చురుకుగా కురుస్తుండటంతో జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఉత్తరకన్నడ జిల్లాలో కుమటా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మూమురు–అరకడ సంబంధాలు తెగిపోయాయి. జిల్లాలో వరద పరిస్థితి తలెత్తింది. ఘాట్ రోడ్లలో కూలిపోయిన బండరాళ్ల ను తొలగించే పనులు జరుగుతున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా రోడ్లు జలమయం కావడంతో వాహనాల సంచారానికి ఇబ్బందులు తలెత్తాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపైకి చేరడంతో వాహనాలకు ఇబ్బంది ఏర్పడింది. కరావళి ప్రదేశంలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం నెలకొంది. దక్షిణ కన్నడకు ఎన్డీఆర్ఎఫ్ రానున్న రెండురోజులు మంగళూరు తో పాటు కరావళి మరింత జోరుగా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కన్నడ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. సహాయక చర్యలకు గ్రామ పంచాయతీల సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న కుండపోతతో ప్రముఖ నాగక్షేత్రమైన కుక్కే సుబ్రమణ్య ఆలయంలో కుమారధార స్నానఘట్టం మునిగిపోయింది. కుమార ధార నది పొంగిపొర్లుతుండటంతో స్నానఘట్టం వద్ద వెళ్లరాదని భక్తులకు సూచించారు. కొన్నిచోట్ల వక్క, కాఫీ తోటల్లోకి నీరు చేరింది. సోమవారం ఉదయం వరకు కొడగు జిల్లాలో విరాజపేటేలో 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భాగమండలలో 23, ముల్కిలో 20 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక్కడ అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కావేరి నదికి ప్రవాహం కావేరి నది ప్రదేశాల్లో వానల వల్ల జీవనాడిగా పేరున్న మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ డ్యాంలో నీటిమట్టం పెరుగుతోంది. వానలు లేక జలాశయం నీటిమట్టం 89 అడుగులకు పడిపోవడంతో దిగులు నెలకొంది. ఇంతలో ముంగారు వర్షాలు జోరందుకోవడంతో ప్రవాహం మొదలైంది. నీటిమట్టం 15 టీఎంసీలను దాటినట్లు తెలిసింది. డ్యాం డెడ్ స్టోరేజీ 7 టీఎంసీలు. రాష్ట్రంలో ఐదురోజులు వర్షాలు ●రానున్న ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను ప్రకటించింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం వల్ల పరిసర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ● 30వ తేదీ వరకు చాలాప్రాంతాల్లో కుంభవృష్టికి ఆస్కారముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణకన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, కొడగు జిల్లాల్లో 5 రోజులు పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ● బీదర్, కలబుర్గి, యాదగిరి, విజయపుర, బెళగావి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వానలు ఘాట్ రోడ్లలో విధ్వంసం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు జలాశయాలకు నీటి చేరిక -
వరదల్లో చిక్కిన టూరిస్టులు
యశవంతపుర: ప్రకృతి అందాలను వీక్షిద్దామని వెళ్లిన పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. దక్షిణ కన్నడ జిల్లాలో వర్షాల వల్ల రెడ్ అలర్ట్ను ప్రకటించారు. నదీ తీరం, జలపాతాలు, సముద్రం వద్దకు వెళ్లవద్దని జిల్లా అధికారులు తెలిపారు. కానీ కొందరు పర్యటకులు పుత్తిగె వద్దనున్న ఎరగుండి జలపాతాన్ని చూడడానికి వెళ్లి అపాయంలో ఇరుక్కున్నారు. స్థానికుల మాటలను నిర్లక్ష్యం చేసి వెళ్లిన ఐదు మంది.. వరదనీటి ప్రవాహం ఎక్కువ కావడంతో బండరాళ్ల మీద కూర్చుని కాపాడాలని కేకలు వేశారు. స్థానికులు అతికష్టం మీద తాళ్ల ద్వారా రక్షించారు. వర్షాలు తగ్గేవరకు పర్యాటకులు క్లిష్టమైన ప్రాంతాలకు వెళ్లరాదని అధికారులు సూచించారు. బస్సు ప్రమాదం ప్రైవేట్ బస్సు పల్టీ పడిన ఘటన జిల్లాలో బంట్వాళ వద్ద జరిగింది. జాతీయ రహదారి– 75లో కల్లడ్క సమీపంలోని కుద్రెబెట్టులో బస్సు రోడ్డు పక్కన పల్టీ పడగా ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. పుత్తూరు నుంచి మంగళూరుకు వెళ్లతున్న ప్రైవేట్ బస్సు బ్రేక్ ఫెయిల్ వల్ల బోల్తా పడింది. -
బాలింత మృతిపై గొడవ
రాయచూరు రూరల్: ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన సోమవారం జిల్లాలో చోటు చేసుకుంది. మస్కిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో సిద్దమ్మ (23) అనే గర్భిణి కాన్పు కోసం చేరింది. ఆమెకు శిశువు జన్మించింది, గైనకాలజిస్టు డాక్టర్ సౌమ్య గుండళ్లి ఆదివారం రాత్రి బాలింత సిద్దమ్మకు సరైన సమయంలో వైద్యసేవలు అందించక పోవడం వల్లే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అంబులెన్సును ధ్వంసం చేశారు. ఇంతలో మస్కి ఎస్ఐ సిబ్బందితో వచ్చి వారిని అడ్డుకున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రికి వచ్చి పరిశీలించారు. -
టిప్పర్, కారు ఢీ.. ఐదుగురు మృతి
సాక్షి, బళ్లారి: అపార ఇనుప ఖనిజ నిల్వలున్న జిల్లాలోని సండూరు తాలూకాలో అతి వేగంతో వెళ్లే మైన్స్ టిప్పర్లతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు బలవుతుతున్నారు. విపరీతమైన వేగంతో ఇనుప ఖనిజం తరలిస్తున్న టిప్పర్ల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి పలువురు మృతి చెందుతున్నా అక్కడి పోలీసులు పట్టించుకోక మైన్స్ టిప్పర్ల వేగానికి అడ్డుకట్ట వేయకపోవటం వల్ల సోమవారం సండూరు తాలూకాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సండూరు తాలూకా జైసింగాపుర సమీపంలో ఇనుప ఖనిజం తరలిస్తున్న టిప్పర్, కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తాలూకాలోని లక్ష్మీపుర గ్రామానికి చెందిన ఆశా(28), నిండు గర్భిణి జయలక్ష్మి(21)లతో పాటు చిన్నారులు బిందుశ్రీ (4), సాయి (9), కారు డ్రైవర్ నందీశ్ (29) అక్కడికక్కడే మృతి చెందారు. మహాలక్ష్మి(3) అనే చిన్నారితో పాటు మరో వ్యక్తి రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సండూరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సను నిర్వహించిన తరువాత హుబ్లీకి తరలించారు. కారులో చిన్నారులతో పాటు నిండు గర్భిణి వెళుతున్న సందర్భంలో అతి వేగంగా వస్తున్న ఇనుప ఖనిజం తరలిస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను సండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదంలో మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన సమాచారం తెలిసిన తక్షణమే అక్కడికి పోలీసులు హుటాహుటిన చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో నిండు గర్భిణీతో సహా చిన్నారులు అతి వేగానికి అమాయకుల ప్రాణాలు బలి బళ్లారి జిల్లా సండూరు తాలూకాలో విషాదం -
భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
హొసపేటె: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలందరి జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వర్షం మధ్యాహ్నం వరకు కొనసాగింది. పాఠశాలలు తిరిగి తెరిచిన కొద్దిపాటి ఉపశమనం తప్ప కూరగాయల మార్కెట్లు, దుకాణాలకు వెళ్లే వారికి ఈ పరిస్థితి పెద్ద అడ్డంకిగా మారింది. హొసపేటెలోని కూరగాయల మార్కెట్లో వర్షం కురుస్తున్నా వినియోగదారులు, వ్యాపారులు గొడుగుల కింద వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం వంటి వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు. నిన్న సాయంత్రం, రాత్రి కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. సరైన డ్రైనేజీ లేక పోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. నాలుగు రోజులుగా ప్రతికూలంగా ఉన్న వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రేపటి నుంచి చిన్నచిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, స్తంభాలపై ఉన్న మట్టి ఇళ్లు కూలిపోయే అవకాశం ఉందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఇప్పటికే మండు వేడితో బాధపడుతున్న ప్రజలకు చల్లని వాతావరణం కష్టాలు తెచ్చింది. -
నిధుల స్వాహాపై కేసు నమోదు
● ఐదు మంది నిందితుల్లో మంత్రి అల్లుడి పేరు? రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పఽథకాల కింద కళ్యాణ కర్ణాటక పరిధిలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయనగర జిల్లాల్లో పనులు చేయకుండానే రూ.25 కోట్లు వ్యయం చేసినట్లు నిధుల స్వాహాపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రూ.25 కోట్లతో పనుల పేరుతో మంత్రి బంధువులతో కలిసి కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెండర్ల ద్వారా పనులు కల్పిస్తామని కాంట్రాక్టర్ వద్ద రూ.1.21 కోట్ల లంచం పుచ్చుకున్నట్లు కలబుర్గి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళ్యాణ కర్ణాటకలో కలబుర్గి లక్ష్మికాంత కట్టిమని, రాయచూరు సంతోష్ నాయక్, కిరణ్, బెంగళూరు శ్రీధర్, కొప్పళ జిల్లాలో రవి మాలిపాటిల్లు జల జీవన్ మిషన్(జేజేఎం) పథకంలో సబ్ కాంట్రాక్టులు పొందారు. కలబుర్గి లక్ష్మికాంత కట్టిమని తనకు ఉన్నతాధికారులు, మంత్రులతో పరిచయం ఉందని, పనులు కేటాయిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి వారి వద్ద నుంచి నిధులు కాజేశారని ఆరోపించారు. ప్రతి ఒక్క కాంట్రాక్టర్కు రూ.50 కోట్ల మేర కాంట్రాక్ట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన వారిపై అధికారులు కేసు నమోదు చేయించారు. కాగా అధికారులు మంత్రి అల్లుడి పేరును వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. -
రాష్ట్రాభివృద్ధికి సీఎం బద్ధ వ్యతిరేకి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాలకు తోడు రాష్ట్రాభివృద్ధికి బద్ధ వ్యతిరేకి ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని బీదర్ దక్షిణ క్షేత్రం శాసన సభ్యుడు శైలేంద్ర బేల్దాళ్ ఆరోపించారు. సోమవారం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరైనా కర్ణాటక నుంచి ఏ ఒక్క ప్రతినిధీ హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నిధుల మంజూరులో కేంద్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపుతోందని కేంద్రం వైపు వేలెత్తి చూపడాన్ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు పాల్గొన్నా కర్ణాటక నుంచి సమావేశాలకు వెళ్లక పోవడం సరికాదన్నారు. వికసిత భారత్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురించి వివరించారు. అధిక ఫీజుల వసూలు తగదు రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26వ విద్యా సంవత్సరంలో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని ఎస్ఎఫ్ఐ పేర్కొంది. సోమవారం రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అమరేష్ మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యాశాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడాన్ని ఖండించారు. అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి రితీక్ కుమార్, కమిషనర్ కావేరిలకు వినతిపత్రం సమర్పించారు. నకిలీ హెర్బల్ న్యూట్రీషన్లను అరికట్టాలి రాయచూరు రూరల్: జిల్లాలో అధికమవుతున్న నకిలీ హెర్బల్ న్యూట్రీషన్ విక్రయాలను అరికట్టాలని జనసేవా ఫౌండేషన్ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు జావిద్ఖాన్ మాట్లాడారు. మాన్విలో హెర్బల్ న్యూట్రీషప్ అంగడి యజమాని కళ్యాణ్, భార్య అంబికా నకిలీ హెర్బల్ న్యూట్రీషన్లను విక్రయిస్తున్నారని, లైసెన్సులను రద్దు చేసి, నకిలీ హెర్బల్ న్యూట్రీషనలను కొనుగోలు చేయకుండా అడ్డుకట్ట వేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆల్మట్టికి పోటెత్తిన వరద ● 52,650 క్యూసెక్కుల నీరు రాక రాయచూరు రూరల్: రుతుపవనాల ప్రభావంతో ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిపై బాగలకోటె జిల్లాలో నిర్మించిన ఆల్మట్టి డ్యాంలోకి 52,650 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. విజయపుర, బాగలకోటె, యాదగిరి, రాయచూరు జిల్లాల జీవనాడి కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. నారాయణపుర డ్యాంలో 14 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. మే నెలాఖరు నాటికి డ్యాంలోకి నీరు చేరడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. మలప్రభ నదిలో కూడా వరద అధికం అయింది. -
వ్యవసాయంపై లోతైన పరిశోధనలకు పిలుపు
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా ఇతర దేశాలతో పోటీ పడేలా వ్యవసాయంపై పరిశోధనలు జరపాలని రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ ధావర్చంద్ గెహ్లాట్ పిలుపు ఇచ్చారు. సోమవారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవాన్ని జిందాల్లో వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 25 ఏళ్ల నాటికి అమెరికా కంటే భారత్ ఆహార పదార్థాల ఉత్పత్తిలో ముందుండాలన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక రంగాలను అభివృద్ధి పరచుకొని అమెరికాను మించిపోవాలన్నారు. మంచి పేరు తేవాలి నేడు పర్యావరణం, జలసంరక్షణ, వాయు సంరక్షణలపై ఆలోచించాలన్నారు. నేటి విద్యా రంగం కేవలం ఉద్యోగం కోసం కాకుండా స్వయం ఉపాధికి తోడు నలుగురికి ఉపయోగ పడే విధంగా జీవితాన్ని రూపొందించుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ముఖ్య అతిథి, భారతీయ విశ్వ విద్యాలయాల వేదిక మహా కార్యదర్శి పంకజ్ మిత్తల్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వ్యవసాయ పథకాల గురించి మహిళా రైతులకు వివరించాలన్నారు. సిరిధాన్యా(మిల్లెట్)ల సాగు ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి నాబార్డ్ రూ.25 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. రైతులకు డాక్టరేట్ రైతులకు డాక్టరేట్ అవార్డులను ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. 352 మంది డిగ్రీ విద్యార్థులకు,136 మంది పీజీ విద్యార్థులకు, 19 మంది విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు అందించారు. పుట్టరాజ్కు ఆరు బంగారు అవార్డులు, సుశ్మితకు మూడు బంగారు అవార్డులు, రైతు దేవేంద్రప్ప శంకరప్పకు డాక్టరేట్ ప్రదానం చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి, వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, రిజిస్ట్రార్ దురుగేష్, అధికారులున్నారు. గవర్నర్, మంత్రి గైర్హాజరు రాష్ట్రంలో వానలు కురుస్తుండడంతో బెంగళూరు నుంచి రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం 14వ స్నాతకోత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్న హెలికాప్టర్లో బయల్దేరిన గవర్నర్, మంత్రి బళ్లారి జిల్లా జిందాల్లో దిగారు. అక్కడ విశ్రాంతి పొందుతున్న తరుణంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో జిందాల్ విశ్రాంతి గదిలో నుంచే వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. మరో వైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి కూడా వర్సిటీ స్నాతకోత్సవానికి గైర్హాజరయ్యారు. జిందాల్ నుంచి వర్చువల్ పద్ధతిలో శ్రీకారం వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ -
నకిలీ విత్తనాల బెడద అరికట్టండి
● అధికారులకు డివిజనల్ కమిషనర్ సూచన రాయచూరు రూరల్: కలబుర్గి డివిజన్లో అధికమవుతున్న నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ కలబుర్గి డివిజన్ కమిషనర్ వైఎస్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని వ్యవసాయ వర్సిటీ పాలక మండలి భవనంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, యాదగిరి, కలబుర్గి, విజయనగర జిల్లాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి పత్తి, పొద్దు తిరుగుడు, సజ్జ, కంది వంగడాల నకిలీ విత్తనాలను విక్రయించడానికి వచ్చేవారి వద్ద లైసెన్సులను గుర్తించి, నకిలీ విత్తనాలు కొనుగోలు చేయకుండా రైతులను చైతన్యపరచాలన్నారు. 2025–26వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల నియంత్రణకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక కమిటీలను నియమించామన్నారు. ఖరీఫ్లో మంచి వర్షాలు పడ్డాయని, రైతులకు అందుబాటులో ఉండేలా రైతు కేంద్రాలు పని చేయాలన్నారు. సమవేశంలో వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్సలర్ హన్మంతప్ప, బెంగళూరు వాటర్షెడ్ కమిషనర్ మహేష్ శిరూరు, డైరెక్టర్ పుత్ర, వెంకటరామరెడ్డి, పాటిల్, అనూస్, అంథోని, సదాశివ, జయ ప్రకాష్, మల్లికార్జున, దీపా, శ్రీనివాస్, గురునాథ్, నజీర్ అహ్మద్లున్నారు. -
మరమ్మతులకు నోచని క్రస్ట్గేట్లు
● డ్యాంకు మళ్లీ తప్పని ప్రమాదం ముప్పు హొసపేటె: తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్ గేట్ తెగిపోయి నెలలు గడిచాయి. కూలిపోయిన క్రస్ట్గేట్ మరమ్మతు పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వేసవిలోగా 19వ క్రస్ట్గేటు మరమ్మతులు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైనందున ప్రభుత్వం మిన్నకుండి పోతున్నట్లు కనిపిస్తోంది. ఇది స్థానికులను, రైతులను ఆగ్రహానికి గురి చేసింది. గేటును జోడించే ప్రక్రియ టెండర్ దశలోనే ఉంది. స్థానికంగా వ్యతిరేకత ఉంది. వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పుడు మూడు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ చెబుతున్నారు. 19వ గేట్ మాత్రమే కాదు, అన్ని గేట్లను మార్చాలని నిపుణులు అంటున్నారు. కానీ కనీసం 19 గేట్ పనులు కూడా ప్రారంభం కాలేదు. మిగిలిన గేట్ల మరమ్మతులు చేయకపోతే జలాశయం ప్రమాదంలో పడుతుంది. ఫలితంగా నీటిమట్టం 75 శాతం మాత్రం నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. 133 టీఎంసీల సామర్థ్యం గల జలాశయం 30 టీఎంసీల వరకు పూడిక చేరుకోవడంతో కేవలం నీటి నిల్వ 100 టీఎంసీలకు మాత్రం పరిమితం అయింది. ప్రస్తుతం గేట్లు మరమ్మతులు చేయకుండా ఉంటే 60 నుంచి 70 టీఎంసీలకు మాత్రమే నీటి నిల్వ పరిమితం కానున్నది. దీని వల్ల రైతులు తమ రెండో పంటకు సక్రమంగా నీరు పొందలేని పరిస్థితి ఏర్పడటం ఖాయమని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఘరానా ఇంటి దొంగ అరెస్ట్
హుబ్లీ: ఇళ్లలో చోరీలకు పాల్పడే ఘరానా ఇంటి దొంగను బెండిగేరి పోలీసులు అరెస్ట్ చేయడంలో సఫలీకృతులయ్యారు. అతని నుంచి మొత్తం 62 గ్రాముల బంగారం, 310 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హుబ్లీ దొడ్డమని కాలనీ నివాసి అమన్ బేపారి (24) అరెస్ట్ అయిన నిందితుడు. సదరు స్టేషన్ పరిధితో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈ దొంగ పగలు రాత్రి అనే తేడా లేకుండా తన చేతివాటం చూపాడు. అలా నాలుగు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇతడి నుంచి సుమారు రూ.6.10 లక్షల విలువ చేసే వివిధ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బెండిగేరి సీఐ ఎస్ఆర్ నాయక్, ఎస్ఐ రవి వడ్డర, సిబ్బంది నీలగార, అంబిగేర, కరగాంబి, అరకి, గళగి, మేటి, ఇత్తలమని, వాళికార, వగ్గనవర దాడిలో పాల్గొన్నారు. వేర్వేరు చోట్ల చోరీలు రెండు చోట్ల వేర్వేరుగా చోరీలు జరిగాయి. అమరగోళ ఏపీఎంసీ యార్డ్లో జేకే ట్రేడర్స్ అంగడి షట్టర్ తాళాలను పగలగొట్టి రూ.72 వేల నగదు, రూ.85 వేల విలువైన 6 సీసీ కెమెరాలు, మానిటర్, లెనోవో కంప్యూటర్ను చోరీ చేశారు. కేవల్చంద్ సోలంకికి చెందిన అంగడిలో ఈనెల 23న రాత్రి చోరీ జరిగినట్లు నవనగర ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో విద్యానగర్ అమృత టాకీస్ వెనుక ఉన్న ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి లోనికి వెళ్లి రూ.30 వేల నగదు, రూ.10 వేల విలువ చేసే బంగారు ఆభరణం చోరీ చేసిన కేసులో రేష్మా అనే మహిళ విద్యానగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో అంజాద్ పఠాన్పై కేసు నమోదైంది. రోటవేటర్కు చిక్కి రైతు మృతి హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని మసారి నెల్కుద్రి గ్రామంలో ఓ రైతు ట్రాక్టర్ రోటవేటర్లో చిక్కుకుపోయి మరణించాడు. గ్రామానికి చెందిన రైతు పంపాపతి(40) పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. వర్షాలు కురవడంతో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ రోటవేటర్లో చిక్కుకుని నుజ్జునుజ్జవటం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు ఇటగి పోలీసులు తెలిపారు. పాత కక్షలతో యువకుడి హత్య రాయచూరు రూరల్: పాత కక్షలతో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది. మాణిక్ నగర్లో మహ్మద్ గౌస్ ఆరిఫ్(21), ముజాహిద్(21) అనే యువకుల మధ్య ఆరు నెలల క్రితం కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో చిన్నపాటి గొడవలు జరిగాయి. తాజాగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో పాతకక్షలను మనసులో పెట్టుకున్న మహ్మద్ గౌస్ తన మిత్రులతో కలిసి ఆరిఫ్పై దాడి చేసి చాకుతో పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంద్రప్ప తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని ఆయన వెల్లడించారు. కృష్ణా నదిలో ఒకరు మృత్యువాత హుబ్లీ: గుహేశ్వర ప్రాంతంలో పశువుల కోసం పచ్చగడ్డి తేవడానికి కృష్ణా నదిలోకి వెళ్లిన ఓ వ్యక్తి నీటి ఉధృతికి మృత్యువాత పడిన ఘటన బాగలకోటె జిల్లా జమఖండి తాలూకా కంకనవాడి గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడిని ఆ గ్రామ నివాసి కల్లప్ప దోరప్ప అంబి(65)గా గుర్తించారు. మృతుడు ఈదుతూ కృష్ణా నదిని దాటడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో నది మధ్యలో భారీ వర్షాలతో వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మృతి చెందినట్లు జమఖండి రూరల్ పోలీసులు తెలిపారు. జనౌషధి కేంద్రాల మూసివేత తగదు బళ్లారిఅర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనౌషధి కేంద్రాలను మూసివేయరాదని రైతు సంఘం నేత శివమూర్తి కేణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి రాసిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో జనౌషధి కేంద్రాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మూసివేయాలని నిర్ణయించడం సబబు కాదన్నారు. పేదలకు ఈ ఔషధ కేంద్రాల వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతోందన్నారు. ఎట్టి పరిస్థితిలోను వీటిని తొలగించరాదని ఆయన ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్కు విజ్ఞప్తి చేశారు. -
చక్కెర కర్మాగారం కోసం ధర్నా చేస్తాం
హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హొసపేటెలో చక్కెర కర్మాగారం ప్రారంభిస్తామని చెప్పిన వారు ఇంత వరకు కర్మాగార నిర్మాణం పనులు చేపట్టలేదని, ఈ విషయంపై రైతు సంఘం తరఫున నిరవధిక సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తామని రైతు సంఘం నేత కటిగి జంబయ్య తెలిపారు. హొసపేటె ప్రెస్ హౌస్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత రెండేళ్ల నుంచి ఇలాంటి అబద్ధ హామీలు ఇస్తున్నారన్నారు. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ హొసపేటె రైతు సంఘం అధ్యక్షుడికి ఫోన్ చేసి ఈ సాధన సమావేశంలో హొసపేటెలోని చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించే విషయంపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని హామీ ఇచ్చారు. రైతుల దీర్ఘకాల డిమాండ్ అయిన చక్కెర కర్మాగారం స్థాపన తేదీ, ప్రదేశంపై బహిరంగ సమావేశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆ రోజు జరిగిన సాధన సమావేశంలో ఎటువంటి ప్రకటన లేక వాగ్దానం చేయలేదన్నారు. రైతుల చిరకాల డిమాండ్ అయిన చక్కెర కర్మాగారం స్థాపనకు ఎటువంటి చర్య తీసుకోనందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్, ఎమ్మెల్యే హెచ్ఆర్.గవియప్ప తీరును హొసపేటె రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 15 రోజుల లోపు ముఖ్యమంత్రి సిద్దరామయ్య చక్కెర కర్మాగారం ఏర్పాటు, నిర్మాణంపై ప్రకటన చేయాలని లేని పక్షంలో నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతు నేతలు ఉత్తంగి కొట్రేష్, జోగయ్య, యల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
రూ.40 కోట్లతో రాయచూరు నగరాభివృద్ధి
రాయచూరు రూరల్: నగరంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతామని నగరాబివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు రాజశేఖర్రామస్వామి తెలిపారు. ఆదివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యానవనాలు, చెరువుల సుందరీకరణ, మహనీయు విగ్రహాల ఏర్పాటు తదితర పనులు చేపడుతామన్నారు. అర్డీఏ పరిధి విస్తరిస్తారిస్తామన్నారు. అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ సర్కిల్, బుద్ద విహర్ అబివృద్ధికి తలా రూ.50 లక్షలు కే టాయించామన్నారు. బసవేశ్వర సర్కిల్, తీన కందిల్, నూతన కలెక్టరేట్ వద్ద ఉద్యానవనం కోసం రూ.25 లక్షలు, ఆర్డీఓ సర్కిల్, బసవన బావి సర్కిల్కు రూ.20 లక్షలు, ఈద్గా మైదానం, యరమరాస్, డాలర్స్ కాలనీలో హైమాస్ వి ద్యుత్ దీపాల ఏర్పాటుకు రూ.40 లక్షలు కేటాయించామన్నారు. గంజ్ నుంచి నవోదయ అస్పత్రి వరకు డివైడర్లకు రూ. 2.4 కోట్లు, పబ్లిక్ గార్డెన్ అభివృద్ధికి రూ.2 కోట్లు, గద్వాల అంబేడ్కర్ సముదాయ భవనం, మహవీర్ సర్కిల్, జాకీర్ హుసేన్ సర్కిల్, వాల్మీకి సర్కిల్ అభివృద్ధికి తలా రూ.25 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. నగరంలో 12 ఉద్యాన వనాలకు రూ.25 లక్షలు, రాంపూర్ తాగునీటి చెరువు, మన్సలా పూర్ చెరువు, గోల్లకుంట చెరువు, జలాల నగర చెరువుల అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాయచూరు నగర ప్రాధికార పరిదిలోకి నూతనంగా 15 గ్రామాలను చేర్చుకోవడానికిక ప్రతి పాదనలను సిద్ధం చేశామన్నారు. -
యువతకు మార్గదర్శకులుగా ఉండాలి
బళ్లారిఅర్బన్: ఆధునిక పోకడలు, మానసిక ఒత్తిళ్లు, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం ఫలితంగా యువత దారి తప్పుతోందని, పోషకులు తమ పిల్లలను సరైన మార్గంలో ఉంచాలని శ్రీ వాసవీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు విఠ కృష్ణ కుమార్ అన్నారు. విద్యార్థుల మనోభావన, ఆధునిక సాంకేతిక విజ్ఞాన ప్రభావం, జనాభా నియంత్రణ అనే అంశాలపై యువతను జాగృతి చేసేందుకు వాసవీ స్కూల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలను తీర్చిదిద్దాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాల హెచ్ఎం వీరేష్ మాట్లాడుతూ యువత సోషల్ మీడియాకు బానిస కాకుండా ఉండాలన్నారు. ట్రస్ట్ ఉపాధ్యక్షుడు జితేంద్ర, కార్యదర్శులు సురేష్, జేసీ వఠం ఆధిత్య, అగడి గవిసిద్దేశ్వర ప్రసాద్, ముదగల్ సుభాష్, విజయ్కుమార్, హస్య కళాకారులు ఎర్రిస్వామి, చంద్రశేఖర్ ఆచార్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఆకలి తీర్చడమే ధ్యేయం
హొసపేటె: పేదల ఆకలి తీర్చేందుకే ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే గవియప్ప అన్నారు. విజయనగరం జిల్లా హోస్పేట తాలూకా హంపీ సమీపంలోని కమలాపూర్లో కొత్తగా నిర్మించిన ఇందిరా క్యాంటీన్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ హంపీ, కమలాపురను సందర్శించే పర్యాటకులు, స్థానికంగా ఉన్న పేదల సౌలభ్యం కోసం బస్ స్టేషన్ సమీపంలో క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ హోటళ్లలో టిఫిన్, భోజనం ధరలు పెరిగాయని, ఇందిరా క్యాంటీన్ ద్వారా తక్కువ ధరతో ఆహార పదార్థాలు లభిస్తాయన్నారు. -
సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేది ఎప్పుడో?
సాక్షి,బళ్లారి: రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే బృహత్ సంకల్పంతో బళ్లారిలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పరిస్థితి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. నిధులు పుష్కలంగా ఉన్నా పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో ఆస్పత్రి పనులపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. దాదాపు రూ.400 కోట్లతో బెంగళూరు తరహాలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించేలా నగరంలోని బెళగల్లు రోడ్డులో ట్రామాకేర్ ఆస్పత్రి పక్కనే సువిశాలమైన ప్రదేశంలో 450 పడకలతో 18 సంవత్సరాలు క్రితం బీజేపీ హయాంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసి గుండె శస్త్ర చికిత్సలు ఇక్కడే చేయాలనే ఉద్దేశంతో ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. తొలుత పనులు శరవేగంగా సాగి అనంతరం చతికిలబడ్డాయి. దాదాపు 90 శాతంపైగా పూర్తయిన అనంతరం పనులు ముందుకు సాగలేదు. 2025 సంవత్సరంలోనైనా పూర్తవుతాయో లేదోనని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది నుంచి కాస్త పనులు జరుగుతున్నప్పటికీ వైద్య పరికరాలు, వైద్యుల నియామకంపై దృష్టి పెట్టలేదు. జిల్లా ఇన్చార్జ్ ఈ జిల్లా వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అభివృద్ధి పనులు మరింత నత్తనడకన సాగుతున్నాయని జనం మండిపడుతున్నారు. డీఎంఎఫ్ నిధులు, కేఎంఆర్సీ నిధులు వేల కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా ఆస్పత్రి నిర్మాణాలు పూర్తి చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి నిర్మాణాలు పూర్తి చేస్తే బళ్లారి జిల్లాతో పాటు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లోని రోగులకు కూడా ఇక్కడ మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది. ఇప్పటికై నా పాలకులు కళ్లు తెరచి నిర్మాణ పనులు ముందుకు సాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. నిధులున్నా పూర్తికాని ఆస్పత్రి పనులు ప్రభుత్వాలు మారుతున్నా ఉదాసీనతే -
ద్రౌపదాంబకు విశేష పూజలు
మాలూరు: తాలూకాలోని లక్కూరు ఫిర్కాపుర గ్రామంలో శ్రీ ధర్మరాయస్వామి, ద్రౌపదాంబ దేవి ఆలయ కరగ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని అలంకరించి పూజలను నిర్వహించారు. వేద మంత్ర పారాయణం గావించారు. లక్కూరు ఫిర్కాతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. మాజీ డీజీపీ హత్య కేసులో మరిన్ని సంగతులు బనశంకరి: ఇటీవల బెంగళూరులో నివాసంలో హత్యకు గురైన విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ కేసు సీసీబీ దర్యాప్తు తుది దశకు చేరుకుంది. కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన భార్య పల్లవిని విచారించారు. తన భర్త కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు, కూతురు కృతికకు పెళ్లి చేద్దామనే ఆలోచన కూడా ఉండేది కాదు. ఎప్పుడూ ఆయన సోదరి కుటుంబం అంటే అభిమానం చూపేవారు. ఇంట్లో సమస్య వస్తే సోదరికి ఇంటికి వెళ్లియేవారు. మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవారు. కుమార్తె చేతి ఖర్చులకు డబ్బు ఇచ్చేవాడు కాదు. పూర్తి డబ్బు వ్యవహారం ఓంప్రకాష్ చూసుకునేవాడు అని భార్య చెప్పినట్లు తెలిసింది. గతంలో భర్తతో గొడవపడిన పల్లవి ఇల్లు వదిలి వెళ్లేవారు. కుటుంబ కలహాలతో ఓంప్రకాష్ తనను హత్య చేయవచ్చునని పల్లవి భావించింది. హత్యకు గురయ్యే కంటే భర్త ను అంతమొందించాలని నిర్ణయించింది. ఈ కారణాలతో పల్లవి ఓంప్రకాష్ ను హత్యచేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. డివైడర్కు కారు ఢీ, మహిళ మృతి కోలారు: కారు ప్రమాదంలో వృద్ధురాలు దుర్మరణం చెందింది. కోలారు జిల్లా మాలూరు తాలూకా ఆనేపుర గ్రామం వద్ద చైన్నె – బెంగుళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. కేజీఎఫ్కు చెందిన పుష్పలత (70), తనయుడు మంజునాథ్ బెంగుళూరు నుంచి కేజీఎఫ్కు కారులో వస్తున్నారు. అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొని ధ్వంసమైంది. పుష్పలత గాయాలతో మరణించగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాలూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. పెద్ద పులి మృత్యువాత మైసూరు: మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని సాగరోళెలోని మద్దనహళ్లి అడవిలో పులి కళేబరం కనిపించింది. వారం క్రితం ఈ ప్రాంతంలోని అడవిలో వెంకటేష్ అనే వ్యక్తికి చెందిన ఆవును పులి చంపేసింది. ఇప్పుడు పులి చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పులి కళేబరం దగ్గర రక్తంతో కలిసిన పులి మలం కనిపించింది., పులి కూడా తీవ్రంగా గాయపడిన స్థితిలో కనిపించింది. అటవీ అధికారులు పి.ఏ.నీమా, ఎ.పి సుబ్రమణి పరిశీలించారు. పశు వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు. ఫలితాలను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమ్మవార్ల ఊరేగింపు బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళిలోని మంగమ్మనపాళ్య వార్డులో మహాగణపతి, సుబ్రమణ్యం స్వామి, కామాక్షీదేవి, ఓంశక్తి అమ్మవార్ల ఆలయ వార్షికోత్సవం, గ్రామదేవతల ఊరేగింపు ఘనంగా జరిగాయి. విశేష పూజలు, హోమాలు నిర్వహించి అమ్మవార్లను ఊరేగించారు. భక్తులు కలశాలను ఎత్తుకుని పాల్గొన్నారు. -
మా రిజర్వేషన్లు లాక్కుంటే ఎలా జీవించాలి?
బళ్లారిటౌన్: ఉన్నత వర్గాలైన వీరశైవులు బేడజంగమ పేరుతో ఎస్టీ రిజర్వేషన్లు లాకొంటున్నారని మాజీ మంత్రి హెచ్ ఆంజనేయులు ఆరోపించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బేడ జంగమ సమాజాన్ని ఎస్సీ జాబితా నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారస్సు చేయాలన్నారు. వీరశైవ లింగాయత్ సమాజం జంగమ గురువు స్థానంలో ఉందని, వారికి బేడజంగమకు సంబంధం లేదన్నారు. అటువంటి వారు తమ సమాజం రిజర్వేషన్ను లాక్కుంటే ఎలా అన్ని ప్రశ్నించారు. గత ఆగస్టు 1న వర్గీకరణ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మాదిగ సముదాయానికి కొద్దిగా ఊరట కలిగిందన్నారు. రాష్ట్రంలో జూన్లో ఎస్టీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు కానున్నాయని సిద్దరామయ్య హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్లు అమలు అయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగుగాలను భర్తీ చేయరాదని ప్రభుత్వంపై ఒత్తిడి చేసినందున ప్రస్తుతం ఆ ప్రక్రియను స్తంభింపచేసినట్లు తెలిపారు. సమావేశంలో చర్మ పరిశ్రమిక అభివృద్ధి నిగమ అధ్యక్షుడు ముండరిగి నాగరాజు, దళిత సీనియర్ నేతలు కే.మానయ్య, ఎల్ మారెణ్ణ, వెంకటేష్ హెగ్డే, శివరాజ్, యరకులస్వామి, ఫృద్వీరాజ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి రంగంలో జలవనరుల నిర్వహణ కీలకం
హుబ్లీ: సాగునీటి రంగంలో జలవనరుల నిర్వహణ అత్యంత కీలకమని వ్యవసాయ నిపుణులు ప్రొఫెసర్ బీవై.బండి వడ్డర అన్నారు. ధార్వాడలో కర్ణాటక నీటి పారుదల కార్పొరేషన్ సంస్థ, జల, నేల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యాగారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూములకు సాగునీరు సక్రమంగా అందించడంలో ఇంజినీర్లు ముఖ్య భూమిక పోషించాలన్నారు. జలము, నేల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్.గిరీష్ మరెడ్డి మాట్లాడుతూ మనకు లభించిన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలన్నారు. మలప్రభ యోజన డివిజన్ ఇంజినీర్ అశోక్ వాసనద, బెళగావి వైద్య విజ్ఞాన సంస్థ పాలనాధికారి డాక్టర్.సిద్దు, సహా సమన్వయ అధికారి చంద్రప్ప హొలేకర, పకీరేశ హగడి, అనురాధ పాల్గొన్నారు. గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి హొసపేటె: గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ మృతి చెందాడు. బళ్లారి తాలూకా హాలకుంది గ్రామానికి చెందిన దాదాసాహెబ్ (51) హొస్పేట పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం విధులకు హాజరు కావడానికి స్టేషన్కు వచ్చినప్పుడు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు హుబ్లీ: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జంట నగరాల మినహాయించి మిగిలిన చోట్ల 200 మీటర్ల మేర ఆవరణ నిర్భంధ ప్రాంతంగా ప్రకటిస్తు జిల్లాధికారి ఆదేశాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రం చుట్టూ 200 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు జారీ చేస్తూ ఆ పరిధిలో జిరాక్స్ అంగళ్లను పరీక్షలు జరిగే రోజులలో బంద్ చేయాలని జిల్లాధికారి దివ్యప్రభు ఓ ప్రకటనలో ఆదేశాలిచ్చారు. తాళం పగులగొట్టి చోరీ హుబ్లీ: దొంగలు తాళం పగలగొట్టి నగదు, నగలు చోరీ చేసిన ఘటన మిల్లత్ నగర్లో జరిగింది. శ్యామభాను అనే మహిళ వేరే ఊరికి వెళ్లిన సమయంలో దొంగలు చొరబడి రూ.60 వేల నగదు, రూ.11 వేల విలువైన నగలు చోరీ చేశారు. బెండిగేరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మాయమాటలు చెప్పి లక్షలు కొల్లగొట్టారుహుబ్లీ: ఇంట్లోనే కూర్చుని చక్కగా రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చునంటు మాయమాటలు చెప్పి రూ.10.97 లక్షలను ఆన్లైన్ కేటుగాళ్లు కొల్లగొట్టారు. హుబ్లీకి చెందిన చెన్నబసవనగౌడ అనే వ్యక్తిని వంచకులు టెలిగ్రాం యాప్ ద్వారా సంప్రదించి షేర్ మార్కెట్ గురించి వివరించారు. పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. తొలుత రూ.85 వేల పెట్టుడి పెట్టించారు. అనంతరం దశలవారీగా రూ.10.97 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం నిందితులు ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. దీంతో బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్ ప్రమాదంలో ఇద్దరు మృతి శెట్టూరు: కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న కర్ణాటక సరిహద్దులోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కళ్యాణదుర్గం పట్టాణానికి చెందిన బోయ శ్రీనివాసులు, బోయ కళ్యాణ్ అనే ఇద్దరు యువకులు పనిపై పొగురున కర్ణాటకకు వెళ్ళి తిరిగి వస్తున్నారు. సరిహుద్దులోని నందినీ డాబా వద్ద అదుపు తప్పి పడిపోయారు. బలంగా కింద పడడంతో ఇద్దరూ తీవ్ర గాయాలై చనిపోయారని స్థానికులు తెలిపారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి కర్ణాటక పోలీసులకు, కుటుంసభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు పరిశీలించారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తూ వెళ్లారు. పంటల దొంగల అరెస్టు శివమొగ్గ: మూడురోజుల కిందట శిరా కొప్పల్ పోలీస్స్టేషన్ పరిదిలో హనసోగి గ్రామానికి చెందిన గోపాలప్ప, సందీప, శివకుమార్ల పొలాల్లోని 25 క్వింటాళ్ల మొక్కజొన్న పంట అపహరణకు గురైంది. విచారణ చేపట్టిన శికారిపుర డీఎస్పీ కేశవ్, సీఐ సంతోష్, సిబ్బంది హావేరి జిల్లా హీరకరూర్ తాలూకా సీతేకొండ నివాసి నవీణ్(21) రాజేంద్ర (20)ను అరెస్టు చేశారు. రూ. 9 లక్షల విలువైన మినీ లారీని సీజ్ చేశారు. పురసభ అప్గ్రేడ్పై హర్షం మాలూరు: మాలూరు పురసభను నగరసభగా మార్చడానికి మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేయడంపై పురసభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే రూపా శశిధర్కు కృతజ్ఞతలు తెలిపారు. పురసభ వ్యాప్తి 712 చదరపు కిమిలు ఉంటుంది. నగరసభ కావడం వల్ల అభివృధ్ది కార్యక్రమాలు మరింత వేగంగా జరుగాతాయని నిధులు ఎక్కువగా అందుతాయన్నారు. పురసభ అధ్యక్షురాలు విజయలక్ష్మి, కమిషనర్ ప్రసాద్, మాజీ అధ్యక్షురాలు కోమల, స్థాయీ సమితి అధ్యక్షుడు రాజప్ప, పురసభ సభ్యులు పరమేశ్వర్, ఆర్.వెంకటేష్, ఇంతియాజ్, భానుతేజ తదితరులు పాల్గొన్నారు. -
తుంగభద్రకు కొనసాగుతున్న ఇన్ఫ్లో
హొసపేటె: కర్ణాటక, ఏపీ, తెలంగాణ రైతుల జీవనాడి అయిన తుంగభద్ర జలాశయానికి ముందస్తు వర్షాలు జీవం పోశాయి. జలాశయంలోకి కేవలం ఆరు రోజుల్లోనే 10 టీఎంసీలు పైగా పెరిగింది. వారం రోజులుగా జలాశయం వ్యాప్తిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో నీరు వచ్చి చేరుతోంది, దీంతో రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. 15 రోజులు క్రితం జలాశయంలో నీరు పూర్తిగా తగ్గి పోవడంతో జలచరాలకు సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం ఎగువున మంచి వర్షాలు కురుస్తున్నందున ఇన్ఫ్లో పెరిగింది. ఆదివారం 3 వేలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 1589.60 అడుగులు, నిల్వ 10.703 టీఎంసీలు, ఔట్ఫ్లో 1995 క్యూసెక్కులుగా ఉందని టీబీ బోర్డు వర్గాలు తెలిపారు. -
విధానసౌధ గర్వకారణం
బనశంకరి: విధానసౌధ మన రాష్ట్ర ప్రజాప్రభుత్వ జీవితకథ, దీని గురించి ప్రజలకు తెలియజేయడం గర్వపడే కార్యక్రమని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్కే.పాటిల్ తెలిపారు. ఆదివారం విధానసౌధలో వాకింగ్ గైడెడ్ టూర్ అనే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా విధానసౌధ ఇకపై ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, దూరం నుంచి చూసేబదులు లోపలికి వచ్చి సందర్శించవచ్చని చెప్పారు. ఇది కట్టడం కాదని ప్రపంచంలో అత్యంత సుందరమైన నిర్మాణమని, జూన్ 1 నుంచి పరిమిత రోజుల్లో విధానసౌధను ప్రజల వీక్షించవచ్చని తెలిపారు. ప్రముఖ గైడ్లు విధానసౌధ విశేషాలను పర్యాటకులకు వివరిస్తారని స్పీకర్ యూటీ ఖాదర్ తెలిపారు. ప్రతి నెలా రెండవ ఆదివారం, నాలుగో శనివారం విధానసౌధ వీక్షణం ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో టికెట్లు రిజర్వు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో పరిషత్ స్పీకర్ బసవరాజ హొరట్టి, కాంగ్రెస్ నాయకురాలు వసంత కవితారెడ్డి పాల్గొన్నారు. 29 నుంచి పాఠశాలలు షురూ శివాజీనగర: వేసవి సెలవుల తరువాత రాష్ట్రంలో మే 29 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఆ రోజున అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పండుగ మాదిరిగా చేయాలని, విద్యార్థులకు ఘనంగా స్వాగతించాలని విద్యాశాఖ సూచించింది. ఆ రోజు నుంచే అడ్మిషన్లను ఆరంభించి జూన్ 30 కి పూర్తిచేయాలని ఆదేశించింది. తొలి రోజునే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారమ్ పంపిణీ చేయాలని హెచ్ఎంలకు సూచించారు. రాష్ట్రంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఏకరూప విద్యావిధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రేవ్ పార్టీకి ఖాకీల బ్రేక్
దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి ఎయిర్పోర్టు సమీపంలో కన్నమంగల వద్ద ఉన్న ఫాంహౌస్లో రేవ్ పార్టీపై దేవనహళ్లి పోలీసులు ఆదివారంనాడు దాడి చేసి 10 మంది యువతులు, 20 మంది యువకులను అరెస్టు చేశారు. అందరూ శనివారం ఉదయం నుంచే మజా చేస్తున్నట్లు తెలిసి పోలీసులు సోదాలు జరిపారు. అందరినీ నిర్బంధించి సోదాలు చేశారు. నిషేధిత మత్తు పదార్థాలు లభించినట్లు సమాచారం. వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎయిర్పోర్టుకు అతి సమీపంలో ఉన్న ఫాంహౌస్లో రేవ్ పార్టీ జరగడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో పాల్గొన్నవారు బడాబాబులని, అమ్మాయిలను పిలిపించి నృత్యాలు, మద్యం తదితరాలతో జల్సా చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పెద్దసంఖ్యలో కార్లు, బైక్లు, మొబైళ్లు తదితరాలను సీజ్చేశారు. ఎయిర్పోర్టు వద్ద ఫాంహౌస్పై దాడి -
రెండు జిల్లాల్లో భారీ వర్షాలు
హొసపేటె: అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. విజయనగర, రాయచూరు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. విజయనగర జిల్లా హొస్పేటలో ఆదివారం ఉదయం గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల కాలువలై ప్రవహించాయి. వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించింది. ఇళ్లలోకి వర్షం నీరు చొరబడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవడంతో వంకలు, వాగులు ఏరులై ప్రవహించాయి. రాయచూరురూరల్: రాయచూరులో అదివారం భారీ వర్షం కురిిసింది. రహదారులు జలమయం అయ్యాయి. గాంధీచౌక్, బసన బావి చౌక్, అంద్రూన్ కిల్లాలో వర్షపు నీరు పోటెత్తింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. టిప్పు సుల్తాన్ రహదారిలోని దుకాణంలోకి నీరు చేరి వస్తువులు తడిసిపోయాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహించడంతో దుర్వాసనతో వెదజల్లింది. రోడ్లలో మోకాలు లోతు నీరు ప్రవహించాయి. విజయనగర, రాయచూరు జిల్లాల్లో స్తంభించి జనజీవనం -
కోట్ల ఆస్తిని వదిలి.. సన్యాస దీక్షకు కదిలి ●
● యాదగిరి జిల్లా నుంచి రెండో వ్యక్తి ● పారిశ్రామికవేత్త అసాధారణ నిర్ణయం రాయచూరు రూరల్: కోట్లకు పడగలెత్తిన ఓ పారిశ్రామికవేత్త తన యావదాస్తిని వదిలి సన్యాసాశ్రమ దీక్షకు పూనుకున్న ఘటన కల్యాణ కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. గతంలో యాదగిరిలో 26 ఏళ్ల నిఖిత అనే యువతి కూడా దీక్ష పొంది రెండు నెలలు కాకుండానే తాజాగా యాదగిరి తాలూకా సైదాపూర్కు చెందిన దిలీప్ కుమార్ దోఖా అనే 55 ఏళ్ల వ్యక్తి అదే జిల్లా నుంచి సన్యాసాశ్రమం పొందిన రెండో వ్యక్తిగా నిలిచారు. భార్య లీలాబాయి, ముగ్గురు ఆడ పిల్లలను వదిలి దిలీప్ కుమార్ దీక్షకు పూనుకున్నారు. 12 ఏళ్ల పాటు అమెరికాలో వ్యాపారాలు చేసి బెంగళూరులో కోట్ల ఆస్తులు సంపాందించారు. -
నేత్రపర్వం.. ఊరమ్మదేవి రథోత్సవం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని గ్రామ దేవత శ్రీ ఊరమ్మ దేవి రథోత్సవం గురువారం సాయంత్రం లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. గత మంగళవారం ప్రారంభమైన రథోత్సవం మతపరమైన కార్యక్రమాల తర్వాత గురువారం ఉదయం పట్టణం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూలు, పండ్లు, గింజలు, చీరలు, బియ్యం సమర్పించడం ద్వారా తమ భక్తిని ప్రదర్శించారు. 15 ఏళ్ల తర్వాత జరిగిన ఈ జాతరకు పట్టణంలోని ప్రతి ఇంటికి రక్త సంబంధీకులను, సన్నిహితులను ఆహ్వానించారు. ఊరమ్మదేవి జాతరలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నుంచి తమ సోదరీమణులను జాతరకు ఆహ్వానించి, వారికి కొత్త చీరలు పెట్టి, బియ్యంతో వేడుకలు జరుపుకున్నారు. హాజరైన లక్షలాది మంది భక్తులు రథోత్సవంలో భాగంగా భక్తులు మతపరమైన ఆచారాలు నిర్వహించి, సాయంత్రం ఊరేగింపుగా ఊరమ్మ దేవి అమ్మవారి విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించారు. తరువాత కూడ్లిగి జోయిస్ వేణుగోపాల్ ఆచార్ మహామంగళ రథం నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళా బృందాలు ఊరేగింపులో పాల్గొన్నాయి. అమ్మవారి ఊరేగింపు, రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు అరటిపండ్లు విసిరి భక్తిని ప్రదర్శించారు. మదకరి సర్కిల్, పాదగట్టె సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్ మీదుగా పర్యాటక ఆలయం సమీపంలోని ఊరమ్మ నడక దారి వరకు రథాన్ని లాగారు. భక్తులు శ్రీ ఊరమ్మదేవికి ఘనంగా పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ముగించారు. లక్షలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. డీఎస్పీ మల్లేష్ దొడ్డమని నాయకత్వంలో సీఐ ప్రహ్లాద్ ఆర్ చెన్నగిరి, పీఎస్ఐ సీ.ప్రకాష్, తమ సిబ్బందితో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 ఏళ్ల తర్వాత జరిగిన జాతర కిటకిటలాడిన కూడ్లిగి వీధులు -
72 గంటల్లోగా అతివృష్టి పరిహారం ఇవ్వాలి
బళ్లారిటౌన్: జిల్లాలో జరుగుతున్న ముంగారు సీజన్లో వర్ష నష్టంపై 72 గంటల్లోగా బాధితులకు పరిహారం అందించాలని జిల్లా ఇన్చార్జి కార్యదర్శి డాక్టర్ కేబీ త్రిలోక్చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా పంచాయతీ నజీర్ సభాంగణంలో ఏర్పాటు చేసిన కేడీపీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసారి ఖరీఫ్లో ఎక్కువ వర్షాలు కురిశాయన్నారు. మరింత వర్షం కురిసే సూచనలు ఉన్నందున ఇప్పటికే జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించామన్నారు. ఆయా తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో వార్షిక వర్షపాతం 599.5 మి.మీ. ఉండగా ఇప్పటికే 88.4 మి.మీ. నమోదైందన్నారు. జిల్లాలో విత్తనాలు, ఎరువులు సమర్థంగా పంపిణీ చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా కీటనాశక మందులు కూడా నాణ్యతగా సరఫరా చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా, జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమేరా, ఉపకార్యదర్శి గిరిజా శంకర్, వాగీష్ శివాచార్య పాల్గొన్నారు. -
దశాబ్దాలు గడిచినా మారని దశ
రాయచూరు రూరల్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రజా ప్రతినిధులు కాలయాపన తప్ప మరేం చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సింధనూరు తాలూకా హనుమనగరలో తాగు నీటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు చెందలేదు. ఐదు దశాబ్దాలు గడిచినా గ్రామానికి నీరందడం లేదు. పురాతన కాలంలో తవ్విన నీటి కుంటలే ఆధారంగా ఉన్నాయి. హనుమనగర నుంచి రెండు కి.మీ. నడుచుకుంటూ ఈ.జే.హొసళ్లికి వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. గ్రామంలో 50 కుటుంబాలున్నాయి. ఇంటింటికీ జల జీవన్ మిషన్(జేజేఎం) పథకం కింద కొళాయిలు బిగించినా నీటి సరఫరాలో లోపాలు ఉన్నాయి. దీంతో నీటి కుంటలో కలుషిత నీటినే ప్రజలు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. నేటికీ అందని రక్షిత కొళాయి నీరు మూలన పడిన జేజేఎం పథకం హనుమనగర వాసులకు తప్పని పాట్లు -
బాధ్యులపై చర్యలు చేపట్టాలి
రాయచూరు రూరల్: రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ కర్ణాటక రైతు సంఘం చేపట్టిన ఆందోళన సందర్భంలో అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి కృష్ణను అవమానపరిచే విధంగా మాట్లాడటం తగదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కెమెరామ్యాన్ మృతికి సంతాపం బళ్లారిటౌన్: ఇటీవల ఓ ప్రైవేట్ చానల్ కెమెరామ్యాన్ సంతోష్(30) అనారోగ్యంతో ఉన్నఫళంగా మృతి చెందడంతో శుక్రవారం నగరంలోని పత్రికా భవనంలో కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. అతని చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి పలువురు అతని గుణగణాలను కొనియాడారు. చిన్న వయస్సులో మృతి చెందడం అందరినీ కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార శాఖ అధికారి గురురాజ్, వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్.వీరభద్రగౌడ, సభ్యులు వెంకోబి, పురుషోత్తం, మహేంద్రకుమార్, కిన్నూరేశ్వర, హరిశంకర్, మారుతీ, రేణుకారాధ్య, వెంకటేష్ కులకర్ణి, హనుమేష్ రావ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కంబారకు అవార్డు ప్రదానం హుబ్లీ: అన్ని అవార్డుల కన్నా తన సొంత ఊరైన కర్ణాటక విశ్వవిద్యాలయం హరివే గురు అవార్డు ఇవ్వడం హర్షనీయం అని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర కంబార తెలిపారు. బెంగళూరులోని తన నివాసంలో కర్ణాటక విశ్వవిద్యాలయ పాలక మండలి బృందం ప్రదానం చేసిన హరివే గురువు అవార్డు స్వీకరించాక ఆయన మాట్లాడారు. కర్ణాటక వర్సిటీ తనదైన ఘనత కలిగి ఉంది. విద్య, సాహిత్యం, కళా రంగాలకు చేసిన సేవలను గుర్తించి సదరు విశ్వవిద్యాలయం అవార్డు ప్రదానం చేయటంపై తాను రుణపడి ఉన్నానన్నారు. సదరు విశ్వవిద్యాలయం విద్యార్థి అయిన తాను అవార్డు స్వీకరించడం చిరస్మరణీయ క్షణం అన్నారు. ఈ సందర్భంగా ఆ విశ్వవిద్యాలయం గత ఇన్చార్జి ఈసీ ప్రొఫెసర్ జయశ్రీ,, రిజిస్ట్రార్ డాక్టర్ ఏ.చెన్నప్ప, డాక్టర్ ఎన్వై మట్టిహాళ, శ్యామ్ మల్లనగౌడర, మహేష్, డాక్టర్ బసవరాజ్, డాక్టర్ ఎంఎం కడకోళ, డాక్టర్ సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. తుంగభద్రకు పెరిగిన ఇన్ఫ్లో ● రోజుకు పది వేల క్యూసెక్కులకు పైగా వరద చేరిక ● ప్రస్తుతం డ్యాంలో 6 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ హొసపేటె: మలెనాడులోని తుంగభద్ర పరివాహక ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కర్ణాటక జీవనాడి అయిన తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వరద నీటి రాక ప్రారంభమైంది. వేసవిలో డ్యాంలో నీటిమట్టం దాదాపుగా ఖాళీ అయి డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకున్న తర్వాత తుంగభద్ర జలాశయంలోకి ఇన్ఫ్లో 10 వేల క్యూసెక్కులకు పైగా పెరిగింది. నాలుగు రోజుల్లో జలాశయంలోకి 6 టీఎంసీల నీరు చేరింది. జలాశయంలోకి నీటి ప్రవాహం లేకపోవడంతో జలచరాలకు సమస్యలు ఎదురయ్యాయి. వేసవిలో ముందస్తుగా కురిసిన వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయంలోకి పెద్ద మొత్తంలో నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి ఇన్ఫ్లో పెరగడంతో రైతుల్లో ముఖాల్లో ఆనందం తాండవిస్తోంది. -
విధి నిర్వహణతో బాధ్యతల వృద్ధి
రాయచూరు రూరల్: ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే అధికారుల బాధ్యతలు పెంచుతాయని కళాశాల ప్రిన్సిపాల్ డా.సుగుణ పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ సేవా పథకంలో విజయం సాధించిన అధికారి సంతోష్కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యువజన సేవా పథకంలో చేసిన సేవలను గుర్తించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉమాదేవి, స్వరూప రాణి, సరస్వతి, ఆస్మా, రంగనాథ్, వెంకటేష్, రశీద్, పర్వీన్లున్నారు. పిల్లల స్నేహి పాఠశాల షురూ రాయచూరు రూరల్: శక్తినగర్ పోలీస్ స్టేషన్లో పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ పిల్లల స్నేహి పాఠశాలను జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య శుక్రవారం ప్రారంభించారు. పిల్లలను ఆటల పట్ల మొగ్గు చూపేలా చేయడమే దీని ఉద్దేశమన్నారు. పోలీస్ స్టేషన్ పట్ల చిన్నారుల్లో దాగి ఉన్న భయం తొలిగి పోవాలన్నారు. కుటుంబ సభ్యులు ఇంటిలో పసి పిల్లలను ప్రేమాభిమానాలతో ఆదరించి వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీలు శాంతవీర, ప్రేమానంద్ ఘోడక్, పీఐ, ఎస్ఐలున్నారు. క్రమశిక్షణకు శిబిరాలు దోహదం రాయచూరు రూరల్: విద్యార్థుల్లో క్రమశిక్షణకు వేసవి శిబిరాలు దోహదపడతాయని హందర్ద్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు గుండూరావ్ దేశాయి అన్నారు. హందర్ద్ ప్రాథమిక పాఠశాలలో పండిట్ తారానాథ్ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమ ప్రతిభతో రాణించాలన్నారు. శిబిరంలో విద్యార్థులకు పెయింటింగ్, గీతాలాపన, కథలబోధన, చిత్రలేఖనం, సంస్కృతి, సంస్కారం, ఆచార, విచారాలు, సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తారన్నారు. జొన్నల కొనుగోలుకు వినతి రాయచూరు రూరల్: రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేయాలని కర్ణాటక రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం జిల్లాలోని మాన్వి పట్టణంలోని బసవ సర్కిల్లో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలను బంద్ చేసి జొన్నల కొనుగోళ్లను నిరాకరించడాన్ని తప్పుబట్టారు. రైతులు తెచ్చిన జొన్నలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ అధికారి కృష్ణకు వినతిపత్రం సమర్పించారు. ఐదు రైల్వే స్టేషన్లు ప్రారంభం రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటకలోని ఐదు ఆధునికీకరించిన రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మునిరాబాద్, బాగల్కోటె, గదగ్, గోకాక్, ధార్వాడ స్టేషన్లకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద గదగ్ రైల్వే స్టేషన్ను రూ.23.24 కోట్లు, మునిరాబాద్ను రూ.18.40 కోట్లు, బాగల్కోటెను రూ.16.06 కోట్లు, గోకాక్ను రూ.16.98 కోట్లు, ధార్వాడను రూ.17.1 కోట్లతో ఆధునికీకరించి అభివృద్ధి పరిచారు. 1882లో ప్రారంభమైన గదగ్ రైల్వే స్టేషన్లో తాజాగా రెండు లిప్ట్లు, ఎస్కలేటర్లు, రెండు చోట్ల వాహనాల పార్కింగ్, పైవంతెన, వైఫై, ఇతర సౌకర్యాలు కల్పించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డి (73) సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాలు.. చెళ్లకెరె తాలూకాకు చెందిన కేశవరెడ్డి సోములదొడ్డి వద్ద ఉన్న ఓ బోర్వెల్ సంస్థలో పని చేస్తున్నాడు. గురువారం రాత్రి సంస్థ కార్యాలయం నుంచి గోడౌన్కు కేశవరెడ్డితో పాటు మరొక వ్యక్తి బైకులో వెళుతూ సర్వీస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న మరొక బైకును ఢీ కొట్టారు. కేశవరెడ్డికి బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
21 వేల ప్రభుత్వ పాఠశాలలు శిథిలం
బళ్లారిఅర్బన్: ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించి అభివృద్ధి పరచాలని ఏఐడీఎస్ఓ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ ఎదుట సామాన్య ప్రజలతో సంతకాల సేకరణ అభియాన్ చేపట్టారు. ఆ సంస్థ నేత సుభాష్ బెట్టదకొప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో 46,755 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 21,255 పాఠశాల భవనాలు శిథిలమై ప్రమాదంలో ఉన్నాయి. వీటిలో బళ్లారి జిల్లాలో 171 పాఠశాలలు ఉన్నాయన్నారు. గత కొన్నేళ్ల నుంచి దుస్థితిలో ఉంటూ మరమ్మతులకు నోచుకోక పైకప్పు కూలడంతో విద్యార్థులు గాయపడటం, కొన్ని చోట్ల ప్రాణాలు పోయిన ఘటనలు జరిగాయన్నారు. పైకప్పు కూలి విద్యార్థిని మృతి బళ్లారి తాలూకా శంకరబండలో 8వ తరగతికి చెందిన విద్యార్థినిపై పాఠశాల పైకప్పు కూలడంతో తీవ్రంగా గాయపడి, అనంతరం మృతి చెందిన ఘటన జరిగాయని గుర్తు చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని పాఠశాలల దుస్థితికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు పేద పిల్లల ఆశాకిరణాలని, వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దే పునాది ప్రభుత్వ పాఠశాలలే అన్నారు. ఉపాధ్యాయులు తగినంత మంది లేక ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం దారుణం అన్నారు. ఆ మేరకు 6 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం తగదన్నారు. విద్యా శాఖ మంత్రి ప్రకటన హాస్యాస్పదం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ప్రకటన ఇస్తూ ప్రైవేట్ పాఠశాలల తరపున వాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నెల 29న పాఠశాలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ సారి అత్యధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి తక్షణమే ఈ శిథిలమైన పాఠశాల భవనాలపై దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలి. అలాగే అవసరమైన మేరకు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లాధ్యక్షుడు కే.ఈరణ్ణ, ఉపాధ్యక్షురాలు ఎం.శాంతి, ఉమా, నిహారిక, కంబళి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని అభియాన్ ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ -
ఇందిరా క్యాంటీన్ ప్రారంభమెప్పుడో?
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వం ఆకలి లేని రాష్ట్రాన్ని సృష్టించడానికి ఇందిరా క్యాంటీన్ అనే ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేసింది. ఇది పేదలకు, కార్మికులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. అయితే విజయనగర జిల్లా కొట్టూరులో నిర్మించిన పేదలకు పట్టెడన్నం పెట్టే నూతన ఇందిరా క్యాంటీన్ ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. ఐదు హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టూరులోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో ఇందిరా క్యాంటీన్ ఏర్పాటుకు అన్ని సన్నాహాలు చేసింది. ఇందిరా క్యాంటీన్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కానీ ఇప్పటి వరకు దానిని ప్రజాసేవకు అందుబాటులోకి తీసుకు రాకపోవడం విడ్డూరం. ఇందిరా క్యాంటీన్ను కొట్టూరులో వీలైనంత త్వరగా ప్రారంభిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. ఈ ఇందిరా క్యాంటీన్ను త్వరలో ప్రారంభిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి పని కోసం వచ్చే రోజువారీ కూలీ కార్మికులు, ఆస్పత్రులను సందర్శించే పేద రోగులు, ప్రజలకు ఇది సహాయపడుతుందని స్థానిక ప్రముఖులు రమేష్, మంజునాథ్, అంజని, ప్రవీణ్కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య విధానాన్ని అనుసరిస్తున్నారని వారు ఆరోపించారు. ఏదేమైనా పేదల ఆకలి తీర్చే ఇందిరా క్యాంటీన్ ప్రారంభించే గడియ ఎప్పుడు వస్తుందా? అని పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
సబ్బు, సుందరి.. ఓ అల్లరి
యశవంతపుర/ మైసూరు: మైసూరు శాండల్ సబ్బు ప్రచారకర్తగా ప్రముఖ అందాల తార తమన్నా భాటియాను ప్రభుత్వ రంగ కెఎస్డిఎల్ సంస్థ ఎంపిక చేయడంపై రోజురోజుకూ తీవ్ర వివాదమవుతోంది. అనేకమంది ప్రతిపక్ష నాయకులు, కన్నడ సంఘాల నేతలు నిరసన తెలుపుతున్నారు. శుక్రవారం బెంగళూరులో కర్ణాటన రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణగౌడ మాట్లాడుతూ మైసూరు శాండల్ ప్రచారకర్తగా తమన్నాకు రూ.6.2 కోట్ల ఫీజును చెల్లించడం అవివేకమని ఆరోపించారు. ప్రభుత్వానిది బాధ్యతా రాహిత్యమని ధ్వజమెత్తారు. కన్నడ సంఘాల ర్యాలీ మైసూరు సోప్స్ బ్రాండ్ అంబాసిడర్గా నటి తమన్నా నియామకాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు ఆందోళన చేశాయి. బెంగళూరులో యశవంతపుర నుంచి సోప్స్ ఫ్యాక్టరీ వరకు ఊరేగింపు నిర్వహించారు. కన్నడ నటీమణులను కాదని బాలీవుడ్ నటిని ఎంపిక చేయరాదని నినాదాలు చేశారు. తక్షణం ఒప్పందాన్ని రద్దు చేసి కన్నడ నటీనటులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. పిచ్చికి పరాకాష్ట: ఎంపీ యదువీర్ నటి తమన్నా భాటియాకు కర్ణాటక సంస్కృతి , చరిత్రతో ఎలాంటి సంబంధం లేదని, కన్నడ భాష కూడా తెలియదు, అలాంటి నటిని మన గంధంతో చేసిన సబ్బులకు ప్రచారకర్తగా చేయాల్సిన అవసరం ఏమిటి అని రాజవంశీకుడు, మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మైసూరు మహారాజు నాళ్వడి కృష్ణరాజ ఒడెయార్ స్థాపించిన సంస్థలో ఒకటి అయిన మైసూరు సోప్స్, డిటర్జెంట్స్ సంస్థకు పరాయి భాషలకు చెందిన తమన్నా ను ప్రచార రాయబారిగా నియమించడం సరికాదని, ఇది కన్నడిగులను అవమానించడమే ఆరోపించారు. 1916లో మైసూరు రాజు సంస్థ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారన్నారు. ఈ సంస్థ సబ్బులు ఎంతోమంది ప్రజల మన్ననలు పొందాయని చెప్పారు. కన్నడిగుల అమూల్యమైన ఉత్పత్తులకు పర భాషా నటిని ప్రచారానికి నియమిండం పిచ్చికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఆమెకు రూ. 6 కోట్ల ను చెల్లిస్తారని, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. కన్నడలో ఎంతో నటీనటులు ఉన్నారని, వారిని అవమానించడమేనని విమర్శించారు. సర్కారు తయారుచేసే మైసూరు శాండల్ ఉత్పత్తులకు గతంలో ఎంతోమంది ప్రముఖ నటీమణులు ప్రచారకర్తలుగా కనిపించారు. ఇప్పుడు బాహుబలి సుందరి తమన్నా ఎంపికై ంది, అంతే పెద్ద రగడ మొదలైంది. కన్నడ నటీమణులే లేరా అని విపక్ష నేతలు, కన్నడ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. కియారా అద్వానీ, పూజా హెగ్డే ఈ డీల్ వద్దన్నారు. దీపక, రశ్మిక మందణ్ణ కూడా చేయం అన్నారు, అందుకే తమన్నాను ఎంచుకున్నాం అని సర్కారు చెబుతోంది. ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో! మైసూరు శాండల్ ప్రచారకర్తగా నటి తమన్నా ఇందుకు రూ. 6 కోట్ల పారితోషికం భగ్గుమన్న కన్నడ సంఘాలు ఒప్పందానికి మన నటీమణులు ఒప్పుకోలేదన్న మంత్రి ఎంబీ పాటిల్ రశ్మిక, దీపిక వద్దన్నారు – మంత్రి పాటిల్ వివాదం గురించి పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికీ తమన్నా భాటియాను ఎంపిక చేసిన్నట్లు చెప్పారు. సంస్థ వ్యాపారాన్ని రూ. 5 వేల కోట్లకు చేర్చాలన్నదే లక్ష్యమని, అందుకే తమన్నాను ఎంపిక చేశాం. పూజా హెగ్డే, కియారా అద్వాని ప్రచారకర్తగా చేయడానికి నిరాకరించారు. దీపికా పదుకొణె మా బడ్జెట్కు ఒప్పకోలేదు. రశ్మిక మందణ్ణ కూడా తిరస్కరించారు. కన్నడ కళాకారులపై ప్రభుత్వానికి గౌరవం ఉందని మంత్రి తెలిపారు. -
నోరూరించే మామిడి, పనస మేళా
మైసూరు: మైసూరు నగరంలోని కుప్పణ్ణ పార్క్కు వెళితే నోరూరుతుంది, కారణం.. తీయగా సువాసనలు వెదజల్లే మామిడి, పనస పండ్ల రాశులే. ఈ పండ్ల మేళాను శుక్రవారం ప్రారంభించారు. ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చి పండ్లను కొనుగోలు చేశారు. రైతులకు, ప్రజలకు దళారుల బెడద లేకుండా నాణ్యమైన పండ్లను చవక ధరకే అందేలా ఈ మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ, రెవెన్యూ, ఉద్యానవన అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు సాగే మేళాలో 12 జాతులకు చెందిన మామిడి, వివిధ రకాల పనస పండ్లు కొలువుతీరాయి. 47 స్టాల్స్ ఏర్పాటయ్యాయి. ఒక స్టాల్లో 12 రకాల మామిడి పండ్లు అమ్ముతున్నారు. స్థానిక ఎమ్మెల్యే హరీష్ గౌడ, అధికారులు హెచ్.ఎం.నాగరాజు, మంజునాథ్ అంగడి, హబీబా, మమత సందర్శించి పండ్లను కొనుగోలు చేశారు. మైసూరులో షురూ -
ప్రేమించాను, ఈ పెళ్లి వద్దు
యశవంతపుర: సినిమాలో మాదిరిలో తాళి కట్టే సమయంలో ఆటంకం ఏర్పడింది, వధువు ఈ పెళ్లి చేసుకోనని మొండికేయడంతో వరునితో సహా అందరూ అవాక్కయ్యారు. హాసన్ పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఆదిచుంచనగిరి కళ్యాణ మంటపంలో పల్లవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేణుగోపాల్ అనే వధూవరులకు ఘనంగా పెళ్లి వేడుక జరుగుతోంది. అన్ని శాస్త్రాలను పూర్తి చేశారు. వధూవరులను పెళ్లి వేదికపై తీసుకొచ్చి మాంగళ్య ధారణ పూర్తి చేసే సమయంలో వధువు ఈ పెళ్లి వద్దని స్పష్టంచేసింది. వేరే యువకున్ని ప్రేమిస్తున్నాను, అతనినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి, తన గదిలోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు బుజ్జగించారు, పోలీసులకు తెలిసి వారు కూడా వచ్చి రాజీ చర్చలు చేశారు. కానీ పెళ్లికూతురు మెట్టు దిగలేదు. ముందే చెప్పి ఉంటే.. ఇంత జరగడంతో వరుడు వేణుగోపాల్కు కూడా అవమానం జరిగినట్లు కావడంతో ఈ వివాహం చేసుకోనని చెప్పేశాడు. ఈ పరిణామాలతో వధువు తల్లిదండ్రులు ఎంతగానో విలపించినా పల్లవి మనసు కరగలేదు. ఆమె ప్రేమ విషయం తెలియదు. తెలిసి ఉంటే పెళ్లిని కుదిర్చేవాళ్లమే కాదు అని బంధువులు తెలిపారు. తల్లిదండ్రులు షాక్లో ఉండటం వల్ల ఏమి మాట్లాడలేక పోతున్నారు. లక్షలాది రూపాయలను పెళ్లికి ఖర్చు చేశారు. అన్ని రకాలుగా నష్టపోయారు. ఇక పెళ్లికొడుకు వారు కూడా బాగా వ్యయం చేశారు, ఆ మొత్తం పెళ్లికూతురు కుటుంబం నుంచి ఇప్పించాలని పోలీసులను కోరారు. పరువు తీశావు కదే అని బంధువులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు. పీటలపై వధువు మొండిపట్టు వివాహ వేడుక భగ్నం హాసన్లో విడ్డూరం -
జిల్లా ఆస్పత్రుల్లో కిమోథెరపీ
మైసూరు: క్యాన్సర్ బాధితుల కోసం రాష్ట్రంలో సుమారు 16 జిల్లా ఆస్పత్రుల్లో కిమోథెరపి చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం సిద్దరామయ్య చెప్పారు. శుక్రవారం మైసూరులోని మేటెగళ్ళిలోని జిల్లా ఆస్పత్రిలో నూతన కిమోథెరపి కేంద్రాన్ని ప్రారంభించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 70 వేలమంది ప్రజలు క్యాన్సర్ రోగానికి గురవుతున్నారు, వారంతా చికిత్స పొందడానికి బెంగళూరు కిద్వాయి ఆస్పత్రికి వస్తారు. వారి ఇబ్బందులను చూసి దగ్గరగా చికిత్స లభించేలా జిల్లాల ఆస్పత్రుల్లో కిమోథెరపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మైసూరు నగరంలో 20 బెడ్లతో కూడిన కేంద్రం ఉందని, అదనంగా మరో 10 బెడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇకనుంచి కిద్వాయికి వెళ్లే అవసరం ఉండదని అన్నారు. కిమోథెరపీ చికిత్స ద్వారా బాధితుడు మరో 15 సంవత్సరాలు జీవించవచ్చని చెప్పారు. -
గంగమ్మ తల్లికి దీపార్చన
చింతామణి: పట్టణంలోని శాంతినగర ప్రాంతానికి చెందిన మహిళలు గంగమ్మకు దీపాలు సమర్పించి పూజలు జరిపారు. ఉదయమే పెద్దసంఖ్యలో మహిళా భక్తులు పూల దీపాలు ఎత్తుకుని ఆలయానికి వచ్చారు. అమ్మవారికి విశేష మొక్కులు ఉన్నవారు బలిహారం చేశారు. ఈసారి వరుణ దేవుడు కరుణిస్తున్నాడని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు. వేంకట రమణుల ప్రతిష్టాపన బొమ్మనహళ్ళి: బెంగళూరు సిడదేహళ్ళిలో ఉన్న సౌందర్య నగర వెలసిన శ్రీ సౌందర్య వెంకటరమణ స్వామి వారి దేవాలయంలో ప్రతిష్టాపన, బ్రహ్మ కలశాభిషేకం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉడుపి పేజావర అధోక్షజ మఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామి పాల్గొని ప్రతిష్టాపన పూజలు చేశారు. బెళ్తంగడికి చెందిన విద్వాన్ కే.ఆర్. శశాంక ఇన్నెంజెత్తాయ తదితర పండితులు శాస్త్రోక్తంగా బ్రహ్మ కలశాభిషేకం జరిపించారు. విశ్వ ప్రసన్న తీర్థ స్వామి మాట్లాడుతూ భక్తి అంటే సర్వస్వాన్ని సమర్పించడమని, మనం అందరం ఖాళీ చేతులతో వచ్చిన వారమని, దేవున్ని నమ్ముకొని పూజించాలని, అదే మనం భగవంతునికి ఇచ్చే నిజమైన నైవేద్యమని అన్నారు. పెద్దసంఖ్యలో భక్తులు వెంకట రమణస్వామిని దర్శించుకున్నారు. జాడ లేని ఎమ్మెల్యే మునిరత్న యశవంతపుర: మహిళపై అత్యాచారం కేసులో నిందితునిగా ఉన్న రాజరాజేశ్వరనగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను పోలీసులు అరెస్టుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే అదృశ్యమయ్యారు. ఎమ్మెల్యే ఆఫీసులో ఆయన అనుచరులు మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ముఖంపై మూత్ర విసర్జన చేసి, ప్రమాదకర వైరస్ను ఎక్కించారని ఇటీవల ఆర్ఎంసీ యార్డు ఠాణాలో ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ కేసును సిట్కి బదిలీ చేశారు. సిట్ పోలీసులు అరెస్ట్ చేయవచ్చని ప్రచారం సాగింది, ఇంతలోనే మునిరత్న రెండు రోజుల నుంచి ఎవరికీ కనిపించడం లేదు. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్ అయ్యింది. మరోవైపు ముందస్తు బెయిల్కు హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. చాముండి రథోత్సవం మండ్య: మండ్య నగరంలోని శ్రీచాముండేశ్వరి లేఔట్లోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో బ్రహ్మరథోత్సవం శుక్రవారం రమణీయంగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారి ఆలయంలో గణపతిపూజ, దుర్గా హోమం, దేవికి రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి మహా మంగళ హారతి ఇచ్చారు. చండికా పారాయణం నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి 12:45 గంటల మధ్య అభిజిత్ ముహూర్తంలో భక్తులు అమ్మవారి రథోత్సవానని నిర్వహించారు. పిల్లలూ, పెద్దలూ ఉత్సాహంగా తేరును లాగారు. ఆల్మట్టి ఎత్తును పెంచుతాం● డిప్యూటీ సీఎం శివకుమార్ సాక్షి, బళ్లారి: కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యాం ఎత్తును 524 మీటర్లకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. శుక్రవారం ఆయన విజయపుర జిల్లా కొల్హారలో వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొని మాట్లాడారు. తగిన నివేదిక రూపొందించి కేంద్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఎత్తును పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. డ్యాం ఎత్తు పెంచితే ఆయకట్టు విస్తీర్ణం పెరిగి ఈ ప్రాంత రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు. కృష్ణా ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇది మహా మానవతావాది బసవణ్ణ జన్మించిన ప్రాంతమని, సమాజంలో శాంతి, సమానత కోసం శ్రమించారని అన్నారు. -
ఆకాంక్షకు కన్నీటి వీడ్కోలు
యశవంతపుర: పంజాబ్లో ఓ విద్యాసంస్థలో భవనంపై నుంచి పడి మరణించిన ధర్మస్థళకు చెందిన ఏరోనాటిక్స్ ఇంజినీర్ ఆకాంక్ష (24) మృతదేహాన్ని ఐదు రోజుల తరువాత గురువారం ఆమె పుట్టిన ఊరు దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా బోళియార్కు చేరుకొంది. బెంగళూరు విమానాశ్రయం నుంచి అంబులెన్స్లో తీసుకెళ్లారు. కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె ఇంటికి సమీపంలో ఖననం చేశారు. ఆమె చదివే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, కేరళవాసి మ్యాథ్యూ ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె భవనం మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. అప్పులుచేసి చదివిస్తే.. ఆకాంక్ష చిన్ననాటి నుంచి చదువులో మేటి, తల్లిదండ్రులు బ్యాంక్లో రూ. 15 లక్షలు అప్పు తీసుకుని, భూమిని అమ్మి ఆకాంక్షను చదివించారు. అప్పుడే మమ్మల్ని విడిచిపోయావా తల్లీ అని కన్నవారు రోదించడం గ్రామస్తులను కలిచి వేసింది. ఎమ్మెల్యే హరీశ్ పూంజా పరామర్శించారు. -
విత్తనాల కోసం రైతుల పడిగాపులు ●
● అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి రైతుల రాక బళ్లారి రూరల్ : తొలకరి వానలు ఆరంభమైన తరుణంలో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం పొలాలను దున్ని విత్తనాలు సిద్ధం చేసుకొనే క్రమంలో కంది విత్తనాల కోసం బళ్లారి నగరంలోని కేసీ రోడ్డులో విత్తనాల దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాశారు. కేసీ రోడ్డులోని ఓ దుకాణం వద్ద నాణ్యమైన ధనలక్ష్మి కంది విత్తనాలు లభ్యమౌతాయని అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, కూడేరు, ఆత్మకూరు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని పరిసర ప్రాంతాల నుంచి రైతులు ఉదయాన్నే దుకాణం వద్ద వేచి ఉన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయని ఉదయాన్నే దూర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలిపారు. ఐఎఫ్ఎస్లో జిల్లావాసికి 41వ ర్యాంక్ రాయచూరు రూరల్: భారత అటవీ సేవ(ఐఎఫ్ఎస్) పరీక్షల్లో రాయచూరు జిల్లా వాసికి దేశానికే 41వ ర్యాంక్ లభించింది. రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా కరడకల్కు చెందిన ఆనంద్ కుమార్ నాగరాళ లింగసూగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న బసవరాజ్ కుమారుడు. యూపీఎస్సీ పరీక్షలకు బెంగళూరు, న్యూఢిల్లీల్లో కోచింగ్ పొంది ఇటీవల వెలువడిన ఐఎఫ్ఎస్ పరీక్ష ఫలితాల్లో ర్యాంకు సాధించి జిల్లాకు కీర్తిని గడించారు. గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురికి బెయిల్ హుబ్లీ: హావేరి జిల్లా హానగల్లో సామూహిక అత్యాచారం కేసులో కీలక నిందితులైన 7 మందికి అక్కడి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో 19 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 10 నెలల క్రితం 12 మంది నిందితులు బెయిలు పొంది హావేరి సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా 7 మంది నిందితులు అఫ్తాబ్, మదార్ సాబ్ మండక్కి, షమీ ఉల్లా, మహమ్మద్ సాదిక్, షోయబ్ ముల్లా, తౌసిఫ్ బోటి, రియాజ్ సాదికేరిలకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. పునర్నియామకంపై హర్షం బళ్లారిఅర్బన్: జిల్లాలోని ప్రముఖ విద్యా సంస్థ వీరశైవ విద్యావర్థక సంఘం, వీరశైవ కళాశాల పాలక మండలి అధ్యక్షుడిగా శాంతనగౌడ ధార్వాడ హైకోర్టు ఆదేశం మేరకు పునర్నియామకం అయ్యారు. ఈ మేరకు ఆయన సదరు కళాశాల పాలక మండలి కార్యాలయంలో అధికార బాధ్యతలు చేపట్టారు. కొన్ని కారణాలతో సదరు సంఘం శాంతనగౌడను అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆ పదవిలో సాహుకార్ సతీష్ బాబును నియమించింది. దీన్ని ప్రశ్నిస్తూ శాంతనగౌడ ధార్వాడ హైకోర్టు నుంచి నిలుపుదల ఆదేశాలు తెచ్చుకోవడంతో తిరిగి ఆయన అధ్యక్షుడిగా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా శాంతనగౌడను మిత్రులు తదితరులతో పాటు ఆ సంఘం సభ్యులు అభినందించారు. తిమ్మప్ప సేవలు చిరస్మరణీయం బళ్లారి అర్బన్: రాఘవ మెమోరియల్ అసోసియేషన్ స్థాపనతో పాటు అభివృద్ధికి ఎంతో కృషి చేసిన దివంగత కాకర్లతోట కనుగోలు తిమ్మప్ప సామాజిక సేవలతో పాటు కళా సేవలు చిరస్మరణీయం అని జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యశ్వంత్ రాజ్ నాగిరెడ్డి తెలిపారు. కాకర్లతోట తిమ్మప్ప 25వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. రాఘవ కళా మందిరం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు అవ్వారు మంజునాథ్, సురేష్బాబు, దొడ్డనగౌడ, సొంతా గిరిధర్, డాక్టర్ మర్చేడ్ మల్లికార్జున గౌడర, రామచంద్ర, కే.చెన్నప్ప, కే.శ్యామ్, సురేంద్ర కుమార్ బాగ్నే తదితరులు పాల్గొని కాకర్లతోట తిమ్మప్పకు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ఏపీఎంసీ ఆవరణలో ఉన్న జిల్లా వాణిజ్య, పరిశ్రమల సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఆస్పత్రిలో రోగులకు విశేషంగా వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
వాన నీరు నిలవకుండా చర్యలు చేపట్టండి
బళ్లారి రూరల్ : వర్షాకాలం ఆరంభమైన నేపథ్యంలో నగరంలో రోడ్లపైన, కాలనీల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్ సూచించారు. దావణగెరె జిల్లాధికారి కార్యాలయంలోని సభాభవన్లో గురువారం ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించి ఆమె మాట్లాడారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పూర్తి కాని రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అండర్పాస్, సర్వీసు రోడ్లను నిర్మించి సంచారానికి వీలు కల్పించాలన్నారు. నగరంలోని ఎస్ఎస్ హైటెక్ ఆసుపత్రి ప్రధాన రోడ్డు ముఖద్వారం 48వ జాతీయ రహదారి చైనేజ్ అండర్ పాస్ ద్వారా బస్సులు, కార్లు, వాహనాల సంచారం అధికంగా ఉంటుంది. ఇక్కడ వంతెనలు చిన్నవిగా ఉన్నాయి. ఈ విషయంపై జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ అధికారులతో చర్చిస్తానన్నారు. నగరంలో ఆటోలకు తప్పనిసరిగా మీటర్లు, డిస్ప్లే అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిలో ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను రక్షించడానికి ప్రతి 70 కి.మీ.కు ఒక అంబులెన్స్ను సిద్ధంగా ఉంచాలన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ఇంజినీరు నరేంద్రబాబు, డీఎస్పీ విజయకుమార్ ఎం.సంతోష్, దుడా ప్రణాళికా సంచాలకుడు మహంతేశ్, నియంత్రణాధికారి ఫక్రుద్దీన్, డీహెచ్ఓ డాక్టర్ షణ్ముకప్ప తదితర అధికారులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న స్కూటీ.. విద్యార్థి మృతి
హుబ్లీ: బేలూరుకు వస్తున్న వేళ స్కూటీ నిలబడిన లారీని ఢీకొనడంతో నరేంద్ర బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందారు. స్కూటీపైన గొడుగు పట్టుకొని డ్రైవ్ చేస్తుండగా ఈ దురంతం చోటు చేసుకుంది. మదిహాళ పీజీలో ఉంటున్న సదరు విద్యార్థి విశ్వాస్ మృతుడు. ప్రమాదంలో గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో అనుమానాస్పద మృతి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. రోణ సమీపంలోని ముగలి గ్రామ పొలం వద్ద బావిలో ఓ వ్యక్తి శవం దొరికింది. ఈ ఘటనలో మహిళతో పాటు ఓ ఇద్దరిని అరెస్ట్ చేశారు. రోణలోని అకారి వీధి ఈశ్వర గుడి నివాసి శంకరప్ప(30) మృతదేహం లభించింది. శంకరప్ప తల్లి రేణుకా కొళ్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శంకరప్ప ఈనెల 14న తెల్లవారు జామున మట్టిని నింపడానికి వెళుతున్నానని భార్యకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అలా వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఈ నెల 19న మృతదేహం లభించింది. హత్య జరిగి ఉండవచ్చన్న అనుమానాస్పద మృతిపై కేసు దాఖలు చేసుకున్న పోలీసులు మృతుడి భార్యతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వర్ష బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలి రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వరి కోతలు కోయక ముందే పంటలు దెబ్బ తిన్న రైతులకు నష్ట పరిహారం అందించాలని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ డిమాండ్ చేశారు. గురువారం మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వాములను ఆయన దర్శనం చేసుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించడంలో విఫలమైందని ఆరోపించారు. తమ అధికారవధిలో ఆర్టీపీఎస్ను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. బెంగళూరుకు ఎలాంటి మౌలిక సౌకర్యాలను కల్పించకుండా గ్రేటర్ బెంగళూరుగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా శివశంకర్, నరసింహ నాయక్, లక్ష్మీపతి, అదిరాజ్, హంపయ్యనాయక్, నాగరాజ్, దూళయ్య నాయక్లున్నారు. పైపులు మీద పడి ముగ్గురు మృతి ●● కొప్పళ జిల్లాలో ఘోరం సాక్షి,బళ్లారి: లారీలో ఉన్న పైపులను దింపడానికి వెళ్లిన ముగ్గురు కార్మికులు పైపులు మీద పడటంతో మృతి చెందిన ఘటన గురువారం కొప్పళ జిల్లా కుష్టిగిలోని పారిశ్రామికవాడలో జరిగింది. లారీలో ఉన్న పైపులను దింపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ముగ్గురు కార్మికులు పైపుల కింద పడి మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుష్టిగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఎస్ఎస్ఎల్సీ పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు హొసపేటె: జిల్లా వ్యాప్తంగా మే 26 నుంచి జూన్ 2 వరకు జరగనున్న ఎస్ఎస్ఎల్సీ–2 పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలని ఆంక్షలు విధిస్తూ జిల్లాధికారి దివాకర్ ఆదేశించారు. పరీక్షలను సజావుగా, శాంతియుతంగా జరపాలనే ఉద్దేశ్యంతో నిషేధిత ప్రాంత సమీపంలో జిరాక్స్, సైబర్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోకి బయట వ్యక్తులు, అపరిచితులు, అన్ని రకాల మీడియా ప్రతినిధుల ప్రవేశం నిషేధించారు. పరీక్ష కేంద్రాల్లో అత్యవసర పరిస్థితుల్లో సమాచారం కోసం చీఫ్ సూపరింటెండెంట్కు సాధారణ మొబైల్ ఫోన్ను మాత్రమే వినియోగించడానికి అనుమతి ఉందని, పరీక్షలకు నియమితులైన అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను కూడా నిషేధించినట్లు ఆయన తెలిపారు. ప్రధానిపై అవహేళనగా పోస్టు.. వ్యక్తి అరెస్ట్ సాక్షి, బళ్లారి: సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాగలకోటె తాలూకా కలాదగి పట్టణానికి చెందిన మహమ్మద్ అజీజ్ అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఎడిట్ చేసి అవహేళనకరంగా పోస్టు చేయడంతో అక్కడి పోలీసులు దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఓవైసీ ఫొటో కూడా ఎడిట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వర్షం వెలసింది.. కష్టం మిగిలింది
సాక్షి,బళ్లారి: ఈసారి ముందస్తుగానే భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి బళ్లారి జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో రోడ్లలో ఎక్కడబడితే అక్కడ నీరు నిలిచిపోయాయి. పలు వంకలు, వాగులు భారీ ఎత్తున ప్రవహించాయి. అయితే గురువారం వర్షం ఆగిపోయినా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా వారం రోజుల పాటు లోతట్టు ప్రాంతాల్లో నీరు వంకలు, వాగుల తరహాలో నిలిచిపోతున్నాయి. దీంతో ఆయా రోడ్లు దాటాలంటే జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులా అండర్పాస్ రంగమందిరం సమీపంలోని అండర్పాస్ చెరువును తలపిస్తోంది. భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో అటు, ఇటు వచ్చిపోయే వాహనదారులు ఎలా వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లలో వర్షం నీరు నిలిచిపోయి ఓ వైపు ఇబ్బందులు సృష్టిస్తుంటే, మరో వైపు ఏపీఎంసీ బురదమయంగా మారడం షరా మామూలైంది. వర్షం వచ్చినప్పుడల్లా వారం రోజుల పాటు బురదలో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముతుండటం వల్ల జనం కూడా గత్యంతరం లేక వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఏపీఎంసీ అధికారులు, స్థానిక పాలకులు ఏపీఎంసీని బాగు చేయాలన్న కనీస ఆలోచన చేయకపోవడం వల్ల ఏపీఎంసీ బురదలో వ్యాపార కేంద్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని సిరుగుప్ప తాలూకాలో భారీ వర్షానికి రారావి, ముదేనూరు గ్రామాల్లో పాత మట్టిమిద్దెలు కూలిపోయి పేదలకు నిలువ నీడ లేకుండా పోయింది. వానతో జనజీవనం అస్తవ్యస్తం లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు బురదమయంగా ఏపీఎంసీ మార్కెట్ -
ముంపు ముంగిట
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025బెంగళూరు.. బనశంకరి: బెంగళూరు నగరంలో అతివృష్టి వల్ల 200 ప్రదేశాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని నెల రోజులు క్రితం కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. కానీ ఎవరూ మేలుకోలేదు, దాని ఫలితమే ఆదివారం నుంచి పలు ప్రాంతాలు మునిగిపోయి లక్షలాది మంది అవస్థలు పడడం. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకోలేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. సిలికాన్ సిటీ ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. హోసూరు రోడ్డు, హెణ్ణూరు తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, అపార్టుమెంట్లు జలమయం కాగా వరద భయం ఏర్పడింది. లోతట్టు ప్రదేశాల్లో ఇళ్లలోకి నీరు చొరబడింది. సిటీలో బొమ్మనహళ్లి వలయం, రాజరాజేశ్వరి నగర, యలహంక తో పాటు వలయాల వారీగా వరదలు తలెత్తే అవకాశం ఉందని ఆయా ప్రాంతాలను విపత్తు నిర్వహణా శాఖ గుర్తించి హెచ్చరించింది. 8 వలయాల్లో ఏప్రిల్ 15 నుంచి వరదలు హెచ్చరికలు జారీచేసి అప్రమత్తంగా ఉండాలని బీబీఎంపీ, జలమండలి, బెస్కాం, పోలీస్శాఖ కు సమాచారం అందించింది. సాధారణం కంటే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపినా ఆ స్థాయిలో చర్యలను చేపట్టలేదు. ఇంకా ఎక్కడెక్కడ? బెంగళూరు తూర్పు భాగంలో హెచ్ఆర్బీఆర్ లేఔట్, వీరణ్ణపాళ్య, పశ్చిమ బెంగళూరు రాజాజీనగర పారిశ్రామికవాడ, గాలి ఆంజనేయస్వామి ఆలయం జంక్షన్, నాయండహళ్లి జంక్షన్, బన్నేరుఘట్ట రోడ్డు, జయదేవ ఫ్లై ఓవర్, సిల్క్బోర్డు జంక్షన్, మెక్గ్రాత్–బ్రిగేడ్ రోడ్డు జంక్షన్, దక్షిణ బెంగళూరులో విల్సన్గార్డెన్ పీడబ్ల్యూడీ క్వార్టర్స్, యలహంక వలయంలో ఎల్బీఎస్నగర, మహదేవపుర వలయంలో సర్జాపురరోడ్డు, వర్తూరు, పణత్తూరు, బెళగెరె, హుడి తీవ్ర వరదలు తలెత్తే ప్రదేశాలు గా గుర్తించారు. ఎడాపెడా చెరువులను కబ్జా చేయడం, రాజకాలువల ఆక్రమణలు, వాననీరు వెళ్లే మార్గాలు లేకపోవడం తదితర కారణాల వల్ల ముంపు సమస్య ఏటేటా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. న్యూస్రీల్ సిటీలో 200 ప్రదేశాలు యమ డేంజర్ కుంభవృష్టి కురిస్తే ప్రజలకు నరకమే హెచ్చరికలు ఉన్నా సర్కారు చర్యలు సున్నాఎండాకాలం వస్తే నీటి కరువు, వర్షాకాలం వస్తోందంటే భారీ వర్షాలతో ఇళ్లు, వీధులు ముంపు. ఇదీ సిలికాన్ నగరవాసుల కష్టాలు. వాటితోనే సహజీవనం చేస్తున్నారు తప్ప పరిష్కారం కోసం గొంతెత్తడం లేదు. ముంగారు వానలు రాకముందే వరుణుడు పేట్రేగడంతో బెంగళూరు ముంపు ముప్పులో చిక్కుకుంది. ఏ వలయంలో ఎన్ని ప్రాంతాలు పాలికెలో 8 వలయ ప్రదేశాలైన బొమ్మనహళ్లి వలయం – 19 ప్రదేశాలు, దాసరహళ్లి వలయ–11, బెంగళూరు తూర్పు వలయ– 29, మహదేవపుర వలయ–30, రాజరాజేశ్వరినగర వలయ –29, దక్షిణ వలయ –34, పశ్చిమ వలయ–38, యలహంక వలయ –10 ప్రదేశాలు ముంపునకు గురవుతున్నాయి. వీటితో కలిపి రాజధానిలో మొత్తం 200 వరద పీడిత ప్రాంతాలున్నట్లు ఏప్రిల్ 2వ తేదీన ఆదేశాల్లో విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఈ ప్రదేశాల్లో రియల్టైమ్లో 12 గంటల ముందుగా వాతావరణ హెచ్చరికలను అందిస్తుంది. ఇక బెంగళూరులో తీవ్రంగా ముంపునకు గురయ్యే ప్రదేశాలు 58 ఉన్నాయి. 153 ప్రదేశాలు మధ్యస్థాయిలో వరదలకు గురవుతాయి. రాజరాజేశ్వరినగర వలయంలో 39 ప్రదేశాలు, పశ్చిమ బెంగళూరులో 38 స్థలాలకు ఎక్కువ ముప్పు నెలకొంది. బొమ్మనహళ్లి వలయంలో 12 ప్రాంతాలు తీవ్ర ముంపునకు గురైయ్యే ప్రదేశాలు ఉండగా మహదేవపుర వలయంలో 11 ప్రాంతాలున్నాయి. -
5 రైల్వేస్టేషన్లకు హంగులు
శివాజీనగర: అమృత్ భారత్ కింద దేశంలో పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరించారు. ఇందులో కర్ణాటకకు చెందిన ఐదు రైల్వే స్టేషన్లు కొత్త సౌలభ్యాలను సంతరించుకున్నాయి. ధారవాడ, గదగ్, గోకాక్, మునీరాబాద్, బాగలకోట రైల్వే స్టేషన్లను ఆధునికంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 50కి పైగా స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు, దశలవారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అత్యాచారం కేసులో టీవీ నటుడు అరెస్టు బనశంకరి: అత్యాచారం కేసులో పరారీలో ఉన్న టీవీ నటుడు మాదనూరు మను ను గురువారం బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరినగర పోలీసులు అరెస్ట్చేశారు. అత్యాచారం కేసు నమోదైన వెంటనే హాసన్లోని మాదనూరులో తలదాచుకున్నాడు. పోలీసులు గాలించి నిర్బంధించారు. కామెడీ ఖిలాడిగళు అనే టీవీ షోలో మను నటిస్తున్నాడు. మరో సినిమాలోనూ చిన్న పాత్ర చేస్తున్నారు. టీవీ షోలో సహ నటి ఫిర్యాదు చేసింది. తనను ప్రేమ, పెళ్లి పేరుతో లోబర్చుకున్నాడని, రెండుసార్లు అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోమని అడిగితే తిరస్కరించాడని ఫిర్యాదులో ఆరోపించింది. సిట్కు మునిరత్న కేసు బనశంకరి: మహిళను వివస్త్రను చేసి అనుచరులతో అత్యాచారానికి పాల్పడి వైరస్ సోకే ఇంజెక్షన్ వేసిన ఆరోపణలతో ఆర్ఆర్ నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న పై నగర ఆర్ఎంసీ యార్డు పోలీస్స్టేషన్లో నమోదైన కేసును సర్కారు సిట్కు అప్పగించింది. మునిరత్న పై నమోదైన పలు కేసుల దర్యాప్తు కోసం గత ఏడాది ప్రభుత్వం సిట్ను ఏర్పాటుచేసింది. మునిరత్న పై కగ్గలిపుర ఠాణాలో అత్యాచారం కేసు, వయ్యాలికావల్ ఠాణాలో నమోదైన కులదూషణ, ప్రాణ బెదిరింపులు కేసులను సిట్ విచారిస్తోంది. ఈ కేసును కూడా అప్పగిస్తూ ఫైళ్లను సిట్ బృందానికి అందజేశారు. ప్రొఫెసర్ ఇంట్లో చోరీ మైసూరు: వారసత్వ నగరిలో దొంగల గోల పెరిగిపోయింది. ఇంటి బాల్కనీ నుంచి లోపలకు చొరబడిన దొంగలు అల్మరాలో భద్రపరిచిన రూ.15.60 లక్షల విలువ చేసే 195 గ్రాముల బంగారు నగలు, డబ్బును దోచుకున్నారు. మైసూరులోని విజయనగర మొదటి స్టేజ్లో జరిగింది. ఉద్యానవన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా డాక్టర్ మంజునాథ్, మండ్యలోని వీసీ ఫాంలో ప్రొఫెసర్గా భార్య డాక్టర్ సుమ పని చేస్తున్నారు. ఇద్దరూ విధులకు వెళ్లిన సమయంలో దుండగులు ఇంటి బాల్కనీ నుంచి లోపలకు ప్రవేశించి గదిలోని అల్మారాలో దాచిన డబ్బు బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితులు విజయనగర ఠాణాలో ఫిర్యాదు చేశారు. పెళ్లిపీటల నుంచి పరీక్షలకు యశవంతపుర/ మైసూరు: పెళ్లి మండపంలో తాళి కట్టగానే, నవవధువు నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది. హాసన్ నగర చన్నపట్టణ లేఔట్కు చెందిన కవన హాసన్లో డిగ్రీ చివరి ఏడాది చదువుతోంది. ఆమెకు దినేశ్తో గురువారం ఉదయం 9 గంటలకు వివాహం జరిగింది. అదేరోజు పరీక్ష కూడా ఉంది. మాంగళ్య ధారణ కాగానే తమ్ముడు కార్తీక్తో బైక్మీద పరీక్షా కేంద్రానికి చేరుకొని పరీక్ష రాసింది. ఇదే మాదిరి సంఘటన చామరాజనగర జిల్లా కొళ్లేగాలలో జరిగింది. కొళ్లేగాల వాసవి కాలేజీలో బీకాం చివరి ఏడాది చదివే ఆర్.సంగీతకు కొళ్లేగాల పట్టణంలో స్థానికు వరునితో పెళ్లి ఘనంగా జరిగింది. తర్వాత వెంటనే పెళ్లి దుస్తుల్లోనే సంగీత కొళ్లేగాలకు పరీక్ష రాయడానికి వెళ్లింది. ఈ హడావుడి చూసి అతిథులు ఆశ్చర్యపోయారు. ఏనుగు దాడిలో మహిళ బలి మైసూరు: అడవి ఏనుగు దాడిలో ఓ ఆదివాసి మహిళ మరణించగా, మరొకరు గాయపడిన ఘటన జిల్లాలోని హెచ్డీకోటె తాలూకాలోని బళ్లె అటవీ ప్రాంతంలో బుధవారం జరిగింది. బళ్లెహాడి నివాసి రాజు భార్య సీత (46) మృతురాలు. సీత, భర్త రాజు, కుమారుడు రాజేష్, బంధువు సుదీప్ నలుగురూ బళ్లె అడవిలోకి వెళ్లి తేనెను సేకరించి గ్రామానికి తిరిగి వస్తుండగా దారి మధ్యలో అడవి ఏనుగు దాడి చేసింది. గాయపడిన సీత, సుదీప్, కుమారున్ని తరలిస్తుండగా మార్గమధ్యలో సీత చనిపోయింది. సుదీప్కు కాలు విరిగింది. పోలీసులు, అధికారులు స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాధితులను ఎమ్మెల్యే అనిల్ చిక్కమాదు పరామర్శించారు. అటవీ అధికారులు ఎవరూ ఆస్పత్రికి రాలేదని మండిపడ్డారు. అటవీ హక్కు చట్టం ప్రకారం ఆదివాసీలు అడవికి వెళ్లి తేనెను సేకరించే అవకాశం ఉంది. నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. -
జొన్నల కొనుగోలు కోసం రైతుల ధర్నా
రాయచూరు రూరల్: రైతులు ఖరీఫ్లో పండించిన జొన్నలను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. గురువారం మాన్విలోని బసవ సర్కిల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో సుమారు వంద ట్రాక్టర్లతో రాస్తారోకో చేపట్టారు. రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలి పాటిల్ మాట్లాడుతూ అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు కేంద్రాలను బంద్ చేసి జొన్నల కొనుగోళ్లను నిరాకరించడాన్ని తప్పుబట్టారు. రైతులు తెచ్చిన జొన్నలను కొనుగోలు చేయాలని కేంద్రం వద్ద విన్నవించుకున్నా అధికారులు బేఖాతరు చేశారంటూ రాస్తారోకో జరిపారు. తాలూకాలో 1510 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. గత 10 రోజుల నుంచి కేంద్రాల వద్ద అధికారులు లేకపోవడంతో వాటిని బంద్ చేయడాన్ని ఖండించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదన్నారు. -
కొనసాగిన వర్షాలు.. నీటమునిగిన పంటలు
హొసపేటె: కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. చారిత్రాత్మక కమలాపురలో చెరువు నిండిపోయి బయటకు నీరు ప్రవహించింది. హొసపేటె తాలూకాలో కమలాపుర, హంపీ, హరపనహళ్లి, కూడ్లిగి తాలూకాల్లో కొన్ని ప్రాంతాలు వర్షం నీటితో బురదమయంగా మారాయి. అదే విధంగా హొసపేటె– బయలువద్దిగేరి మధ్య ఉన్న వాగులో వేగంగా ప్రవహిస్తున్న వర్షపు నీటిలో ఒక ఆవు కొట్టుకుపోయింది. హరపనహళ్లి తాలూకాలోని హూవినహడగలి, కొట్టూరు తాలూకాల్లో పంటలు దెబ్బతిన్నాయి. హొసపేటె తాలూకాలోని బైలువద్దిగేరి రైల్వే స్టేషన్ సమీపంలో జెస్కాం ఉద్యోగి పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కాలువ నీటిలో చిక్కుకున్నారు. ఆ సమయంలో స్థానిక యువకులు ఉద్యోగి ప్రాణాలను కాపాడారు. -
పిడుగుపాటుకు గురై ఇద్దరు బలి
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని రాయచూరు, కలబుర్గి జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. బుధవారం సాయంత్రం జిల్లాలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దేవదుర్గ తాలూకా లింగదహళ్లిలో యల్లమ్మ(55) అనే మహిళ గ్రామ శివార్లలోకి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన సమయంలో పిడుగుపాటుకు గురై మరణించారు. లక్ష్మి(28), రామయ్య(30) గాయపడ్డారు. కలబుర్గి జిల్లా అప్జల్పుర తాలూకా కర్జిగిలో నబీలాల్ సాబ్ చౌదరి(70) పిడుగుపాటుకు గురై మరణించారు. ధార్వాడ జిల్లాలో.. హుబ్లీ: ధార్వాడ జిల్లాలో మంగళవారం పిడుగుపాటుకు గురై ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. చెరువులో ఎద్దులకు స్నానం చేయించడానికి వెళ్లిన యువకుడు పిడుగుపాటుతో మృతి చెందిన ఘటనలో జిల్లాలోని కుందగోళ తాలూకా హిరేనర్తి గ్రామంలో చోటు చేసుకుంది. హిరేహరకుణి గ్రామానికి చెందిన మైలారప్ప(18) అనే యువకుడు తాత ఇంటికి వచ్చిన వేళ ఈ దురంతం జరిగింది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకుడు మధ్యాహ్నం ఎద్దులను చెరువు దగ్గరకు తీసుకెళ్లగా భారీ వర్షం కురిసింది. దీంతో పక్కన ఉన్న పొలంలోని వేపచెట్టు దగ్గర నిలబడగా పిడుగుపాటుతో మృతి చెందాడు. ఇతడికి కొంచెం దూరంలోనే నిలబడి ఉన్న మంజునాథ్ నాయక్ను కూడా పిడుగు తాకడంతో గాయాలయ్యాయి. తక్షణమే కుందగోళ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కేఎంసీకి తరలించారు. మృతుడు మైలారప్ప తల్లి ఫిర్యాదు మేరకు కుందగోళ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని పోగొట్టుకున్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడ ఉన్న వారిని కలచివేసింది. కాగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన కుందగోళ తహసీల్దార్ రాజు మాట్లాడుతూ దర్యాప్తు ప్రక్రియ ముగిశాక తక్షణమే జాతీయ విపత్తుల పరిహార నిధి ద్వారా రూ.4 లక్షలు, అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మరో రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.మరో ఇద్దరికి గాయాలు -
ఎడతెగని వానలు.. పొంగిన వాగులు
హొసపేటె: విజయనగర జిల్లాలో అకాల వర్షాలు గత మూడు రోజుల నుంచి యథావిధిగా కొనసాగుతున్నాయి. బుధవారం కురిసిన వర్ష ప్రభావానికి రోడ్లతో పాటు చెక్ డ్యాంల్లో వర్షపు నీరు నిండి వాగులను తలపిస్తున్నాయి. ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా మరికొన్ని చోట్ల రోడ్లపై నీరు పొంగి ప్రవహించింది. జిల్లాలోని హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హడగలి, హరపనహళ్లి, కొట్టూరు తాలూకాల్లో కూడా వర్ష ప్రభావం కొనసాగింది. గంటల తరబడి వర్ష ప్రభావం తగ్గని పరిస్థితి నెలకొనడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. -
దేశానికి రాజీవ్గాంధీ సేవలు అనన్యం
రాయచూరు రూరల్ : దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ దేశానికి చేసిన సేవలు అనన్యమని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. నాడు రాజీవ్గాంధీ అత్యంత ప్రభావశాలి ప్రధానమంత్రిగా ఉండి దేశంలో విజ్ఞాన, సాంకేతిక రంగంలో సామాజిక దృష్టితో అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసేంత స్థాయికి వివిధ రంగాలను తీర్చిదిద్దారన్నారు. దేశభద్రతను పటిష్ట పరిచే ప్రక్రియలో రాజీవ్గాంధీ చేసిన ప్రయత్నం మరువలేనిదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు చట్టప్రకారం రిజర్వేషన్లు, దళితులకు, మైనారిటీ, వెనుకబడిన వర్గాలకు పదవులు లభించేలా చేశారన్నారు. కార్యక్రమంలో అమరేగౌడ, రుద్రప్ప, చేతన్, ఆంజనేయ, శంశాలం, శివమూర్తి, జయంత్రావ్లున్నారు. కాగా యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరిస్వామి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఒపెక్ ఆస్పత్రిలో రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. -
వైభవంగా కంచు మారెమ్మ జాతర
రాయచూరు రూరల్: నగరంలోని హరిజనవాడలో వెలసిన కంచు మారెమ్మ జాతర వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి ఆలయం వద్ద వందలాది మంది భక్తుల సమక్షంలో ఊయల ఉత్సవం జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం హుబ్లీ: జిల్లాలో సమగ్ర బాల వికాస అభివృద్ధి పథకంలో ఖాళీగా ఉన్న 23 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, అలాగే మొత్తం 97 అంగన్వాడీ సహాయకుల ఉద్యోగాల నియామకాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. ఆసక్తిగల వారు జూన్ 18లోగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. వివరాలకు ధార్వాడ గ్రామీణ సీడీపీఓ కార్యాలయం, హుబ్లీ గ్రామీణ సీఈపీఓ కార్యాలయం, కలఘటిగి సీడీపీఓ కార్యాలయం, కుందగోళ, నవలగుంద కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ఎస్ సంకనూరు ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాలల మూసివేత తగదురాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కన్నడ పాఠశాలలను మూసివేయడం తగదని ఏఐడీఎస్ఓ పేర్కొంది. బుధవారం జగ్జీవన్ రామ్ సర్కిల్లో చేపట్టిన 50 లక్షల సంతకాల సేకరణ సందర్భంగా అధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6 వేలకు పైగా ప్రభుత్వ కన్నడ పాఠశాలలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తూ సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు. పాఠశాలల మార్పునకు వినతిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం 100 కన్నడ పాఠశాలలను కర్ణాటక పబ్లిక్ స్కూల్(కేపీఎస్)లుగా ప్రకటించిన మేరకు జిల్లాలోని ప్రభుత్వ ఉరూ పాఠశాలలను కేపీఎస్లుగా మార్చాలని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్కు వినతిపత్రం సమర్పించారు. సిరవార, మస్కి, కవితాళ, సింధనూరులో మొరార్జీ దేశాయి గురుకుల పాఠశాల, రాయచూరు, యరమరస్ క్యాంప్, ఆశాపూర్లలో మౌలానా ఆజాద్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను మంజూరు చేయాలని కోరారు. ధర్మ సందేశాలు పిల్లలకు నేర్పాలిరాయచూరు రూరల్: హిందూ వైదిక ధర్మ సందేశాలను పిల్లలకు బోధించడం మనందరి కర్తవ్యమని సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రామలింగేశ్వర ఆలయంలో జిల్లా బేడ జంగమ సంఘం ఏర్పాటు చేసిన వేద అధ్యయన శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సనాతన సంప్రదాయాలు, ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి మంత్రోపచారణ, ఇష్టలింగ పూజ, ఆచమ, ఆగమ, ఇతర పురాణాలను శిబిరంలో నేర్పిన విద్య చిరకాలం ఉంటుందని తెలిపారు. శిబిరంలో శాంత మల్ల శివాచార్య, వీర సంగమేశ్వర స్వామి, పంపాపతి శాస్త్రి, శరణయ్య, బసవరాజ్లున్నారు. అలరించిన కరగ ఉత్సవం కోలారు : తాలూకాలోని సువర్ణహళ్లి గ్రామంలో రంగనాథస్వామి కళ్యాణోత్సవం, గంగాదేవి, మారికాంబా దేవి జాతర మహోత్సవంలో భాగంగా నిర్వహించిన కరగ ఉత్సవం గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈసందర్భంగా హసికరగ, పూల కరగ, అగ్నిగుండ ప్రవేశం, దీపోత్సవం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. -
అవినీతిపై విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: రాయచూరు ఽథర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీఎస్)లో రూ.130 కోట్ల మేర జరిగిన అవినీతిపై విచారణ జరపాలని జయ కర్ణాటక సంఘం డిమాండ్ చేసింది. బుధవారం ఆర్టీపీఎస్ ప్రధాన ద్వారం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శివకుమార్ యాదవ్ మాట్లాడారు. స్యాండ్ బ్లాస్టింగ్, ఐపాక్స్ పెయింటింగ్ పనుల్లో నియమాలను గాలికొదిలి ఒకే కంపెనీకి 4 కాంట్రాక్ట్ పనులు కేటాయించారని ఆరోపించారు. ఆర్టీపీఎస్ అధికారులు భాగస్వాములై నాసిరకంతో పనులు చేపట్టి రాష్ట్ర సర్కారు ఖజానా నుంచి రూ.వందలాది కోట్లను లూటీ చేశారన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎండీకి వినతిపత్రం సమర్పించారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలిబళ్లారిఅర్బన్: జిల్లాతో పాటు తాలూకాలోని ప్రైవేట్ పరిశ్రమల్లో కనీసం 70 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని సువర్ణ కర్ణాటక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లాధికారికి వినతిపత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాలూకాలోని హలకుంది, హరగినడోణి, జానెకుంటె, వేణివీరాపుర, తోరణగల్లు, బెళగల్లు, శిడిగినమొళతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ కర్మాగారాల్లో అత్యధిక సంఖ్యలో రాష్ట్రేతరులే ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఉద్యోగ నియామకాల్లో స్థానికులను నిర్లక్ష్యం చేశారన్నారు. అయితే ఆయా కర్మాగారాల్లో పని చేసే స్థానికుల సంఖ్య కనిష్ట స్థాయిలో ఉండగా, బయట రాష్ట్రాల వారు గరిష్ట సంఖ్యలో ఉన్నారన్నారు. నేల, నీరు, ఊరు మనది. అయితే ఇక్కడ పని చేస్తున్న వారు మాత్రం స్థానికేతరులు ఎక్కువేనన్నారు. ఇది శోచనీయమైన విషయం అన్నారు. స్థానికులకు అవకాశం కల్పించాలి లేకుంటే జిల్లా పరిధి నుంచి కర్మాగారాలను తరలించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు వేలాది సంఖ్యలో ఉన్నారు. నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు. వీరందరికీ ఆయా ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పించాలని ఆయన ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలను డిమాండ్ చేశారు. వేదిక జిల్లాధ్యక్షుడు, ఇతర పదాధికారులున్నారు. 29న ఇందిరా క్యాంటీన్ ప్రారంభంకేజీఎఫ్ : పేదల ఆకలి తీర్చేందుకు నగరంలో ఏర్పాటు చేసిన ఇందిరా క్యాంటీన్ను ఈ నెల 29వ తేదీన జిల్లా ఇన్చార్జ్ మంత్రి భైరతి సురేష్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. బుధవారం ఆమె నగరంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రి ముందున్న ప్రభుత్వ స్థలంలో రూ. కోటితో ఇందిరా క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రికి వచ్చి వచ్చే పేదలకు ఈ క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇందిరా క్యాంటీన్కు మెరుగులు దిద్దడం కోసం నగరసభ నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. టిఫిన్ రూ.5, భోజనం రూ.10తో అందజేస్తారని తెలిపారు. నగరసభ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, నగరసభ స్థాయీ సమితి అధ్యక్షుడు వళ్లల్ మునిస్వామి ఉన్నారు. పరిసరాలను నిర్లక్ష్యం చేయొద్దుకోలారు : ప్రతి ఒక్కరూ సంపాదనలో పడి ప్రకృతిని, పరిసరాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది ప్రమాదకర పరిణామమని జిల్లా కలెక్టర్ ఎం ఆర్ రవి అన్నారు. వాతావరణ పరిస్థితులపై నగరంలోని పాత్రికేయుల భవనంలో గ్రామ వికాస సంస్థ, పాత్రికేయుల సంఘం, భారతీయ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యాగారంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ప్రజలకు సరైన రీతిలో తెలియజేయాల్సిన బాధ్యత విలేకరులపై ఉందన్నారు. వదంతులను ప్రచారం చేయకుండా వాస్తవాంశాలను ప్రజల ముందుంచాలన్నారు. పాత్రికేయుల సంఘం జిల్లా అధ్యక్షుడు బీవీ గోపినాథ్, వాతావరణ శాఖ డైరెక్టర్ కేజీ రమేష్, బెంగళూరు ఎంసీ యోజనా విజ్ఞాని షేక్దర్గా సాహెబ్, రాష్ట్ర కార్యవర్గ సమితి సభ్యుడు కేఎస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఈడీ దాడులు
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025హోం మంత్రి విద్యాసంస్థలపై తుమకూరులోని సిద్దార్థ వైద్య విద్యాలయం తుమకూరు: రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ మంత్రుల్లో ఒకరైన హోం మంత్రి జీ.పరమేశ్వర్కు కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆకస్మికంగా షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన సిద్దార్థ గ్రూప్ విద్యా సంస్థల్లో బుధవారం ఉదయం నుంచి దాడులు ప్రారంభించింది. సిద్దార్థ గ్రూప్ విద్యా సంస్థల మూడు కార్యాలయాలలో 30 మందికి పైగా ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. బెంగళూరు నెలమంగల సమీపంలోని టీ.బేగూరు వద్ద ఉన్న సిద్దార్థ వైద్య కళశాల, తుమకూరులోని మరళూరులో ఉన్న సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ, హెగ్గెరె సమీపంలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలలో దాఖలాలు, కంప్యూటర్లను పరిశీలిస్తున్నారు. కాలేజీ వద్ద నియంత్రణ మూడు కార్లలో 10 మందికి పైగా ఈడీ అధికారులు తుమకూరులోని మరళూరు వద్ద ఉన్న సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీపై దాడి చేశారు. కాలేజీ లోపలకు మీడియా వారితో సహా ఎవరూ ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. అలాగే టీ.బేగూరు, లగ్గెరెలోని విద్యాలయాలకు చేరుకున్నారు. అక్కడి సిబ్బందిని బయటకు వెళ్లకుండా, కాల్స్ చేయకుండా నియంత్రించారు. వైద్య సీట్లపై నిఘా ఈడీ అధికారులు మెడికల్ సీట్ల ఫీజులు, దాఖలాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈడీ వెంట భద్రతగా కేంద్ర బలగాలు వచ్చాయి, అలాగే కాలేజీల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో 2019లో మెడికల్ సీట్ల అక్రమాలు జరిగాయని సిద్దార్థ విద్యా సంస్థలపై ఐటీ దాడులు చేశారు. పరమేశ్వర్ పీఏను ఐటీ అధికారులు ప్రశ్నించారు, దీంతో ఆ పీఏ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ దాడుల సమాచారాన్ని ఐటీవారు ఈడీకి ఇచ్చారని, వాటి కొనసాగింపే ఈ తనిఖీలని సమాచారం. తుమకూరుకు మంత్రి రాక ఈడీ దాడుల గురించి తెలియగానే హోం మంత్రి జీ.పరమేశ్వర్ భార్య కన్నికతో కలిసి బెంగళూరు నుంచి తుమకూరు సమీపంలోని టీ.బేగూరు, లగ్గెరెల్లోని మెడికల్ కాలేజీలకు వెళ్లారు. సోదాలు ఎందుకని ఈడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరులో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. తుమకూరు, నెలమంగల వద్ద వైద్య, ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలు హుటాహుటిన తుమకూరుకు పరమేశ్వర్ రన్య రావుతో లింకులు? కొంతకాలంగా బంగారం స్మగ్లింగ్తో పేరుపొందిన రన్య రావు కేసుకు, ఈ దాడులతో సంబంధముందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమెతో ఆర్థిక లావాదేవీలు జరిగాయని, అది గుర్తించి ఈడీ దాడులు చేసిందని సమాచారం. రన్యకు మంగళవారమే బెయిలు రావడం తెలిసిందే. మరుసటి రోజే ఈడీ కదిలింది. దాడుల గురించి ఇంకా ఈడీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. -
బెంగళూరు– బీదర్ మధ్య స్పెషల్ రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బెంగళూరు– బీదర్– బెంగళూరు మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య అధికారులు బుధవారం తెలిపారు. ఈ నెల 22, 24, 26వ తేదీల్లో బెంగళూరు జంక్షన్ నుంచి నంబరు– 06589 రైలు రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు బీదర్ జంక్షన్కు చేరుతుందన్నారు. అలాగే ఈ నెల 23, 25, 27వ తేదీల్లో బీదర్ జంక్షన్ నుంచి ( రైలు నంబరు 06590) మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు బెంగళూరు జంక్షన్కు చేరుతుందన్నారు. ఈ రైళ్లు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూర్, కృష్ణ, యాద్గరి, షాహబాద్, కలబురిగి, హుమ్నాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఈ రైళ్లకు 3ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయన్నారు. -
రమణీయం.. రోకలి కరగ
మాలూరు: తాలూకాలోని కుడియనూరు గ్రామంలో శ్రీ ధర్మరాయస్వామి, ద్రౌపదాంబ దేవి దేవాలయంలో కరగ ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఒనకె (రోకలి) కరగ ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 6 అడుగుల పొడవు ఉన్న రోకలిని తలపై నిలిపి దాని మీద రాగి పాత్రను నీటితో నింపి కరగ పూజారి మంజునాథ్ నృత్యమాడారు. సుమారు గంటకు పైగా నిర్వహించిన రోకలి కరగ నృత్యాన్ని చూస్తూ భక్తులు మైమరిచారు. ఆలయం పరిసరాలలో జాతర సందడి నెలకొంది. సిందూర్ను కించపరచొద్దు మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఉన్న ద్వేషంతోనే కాంగ్రెస్ నాయకులు ఆపరేషన్ సిందూర్ గురించి తేలికగా మాట్లాడుతున్నారు అని మైసూరు బీజేపీ మాజీ ఎంపీ ప్రతాప్ సింహ ఆరోపించారు. మైసూరులో మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ చిన్నయుద్ధమని ఏఐసీసీ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్గాంధీ చెప్పడం సరికాదన్నారు. ఆపరేషన్ విజయవంతమైంది. ఎన్ని విమానాలు పోయాయి అంటున్నారు, నువ్వు చైనా, పాకిస్తాన్ ఏజెంటా అని ధ్వజమెత్తారు. ఇప్పుడు చైనా ఆయుధాలను కొనడానికి ఎవరూ రావడం లేదన్నారు. భారతదేశ బ్రహ్మోస్ క్షిపణికి 14 దేశాలు నుండి డిమాండ్ వచ్చిందని చెప్పారు. మెట్రో చిక్స్ అల్లరి చేష్టలు బనశంకరి: వేలాదిమంది సంచరించే బెంగళూరు మెట్రో రైళ్లలో పోకిరీలు, కొందరు విద్యావంతులు కూడా రహస్యంగా మహిళా ప్రయాణికులను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం పెరిగిపోయింది. అల్లరిమూకలు మెట్రోస్టేషన్లు, రైళ్లలో సంచరిస్తూ యువతులు, మహిళల అసంబద్ధ ఫోటోలు, వీడియోలను క్లిక్ చేయడంతో పాటు అశ్లీల క్యాప్షన్ పెట్టి ఇన్స్టాలో అప్లోడ్ చేసినట్లు కనబడింది. 5 వేలమందికి పైగా ఫాలోయర్స్ కలిగిన మెట్రో చిక్స్ అనే అకౌంట్లో ఏప్రిల్ 11 నుంచి వీడియో, ఫోటోలను అప్లోడ్ చేశారు. గమనించిన బనశంకరి పోలీసులు స్వయంప్రేరితంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సూట్కేసులో బాలిక శవం● నగర శివార్లలో ఘోరం బనశంకరి: బాలికను హత్యచేసి తల–మొండెం వేరు చేసి సూట్కేసులో కుక్కి పడేశారు. ఈ భయానక సంఘటన బుధవారం ఆనేకల్ వద్ద చందాపుర రైల్వేపట్టాలపై కనపడింది. వెంటనే సూర్యనగర పోలీసులు, బయప్పనహళ్లి రైల్వే పోలీసులు చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన బాలిక వయసు 9, 10 సంవత్సరాలు ఉంటుంది. స్థానికులు సూట్కేసును చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎవరో ప్రయాణికులు పడేసుకుని ఉంటారని పరిశీలించారు. అందులో ముక్కలైన బాలిక శవాన్ని చూసి అందరూ హడలిపోయారు. ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానాలున్నాయి. పోలీసులు విచారణ చేపట్టారు. ఫ్యాక్టరీ సంపులో ఇద్దరు కార్మికుల మృతి తుమకూరు: కర్మాగారంలోని సంపును శుభ్రం చేయడానికి వెళ్లిన నలుగురిలో ఇద్దరు కార్మికులు ఊపిరాడక మరణించారు. ఈ దుర్ఘటన స్థానిక వసంతనరసాపుర పారిశ్రామికవాడలో బుధవారం జరిగింది. ప్రతాప్ (23), వెంకటేష్ (32), మంజణ్ణ (42), యువరాజ్(32) కర్మాగారంలోని లక్ష లీటర్ల సామర్థ్యమున్న సంపులోకి దిగి శుభ్రం చేస్తుండగా రసాయనాల తాకిడికి ఊపిరి ఆడక పడిపోయారు. మిగతా కార్మికులు చూసి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ప్రతాప్, వెంకటేష్ మరణించారు. మిగతా ఇద్దరు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. బాధితులందరూ జిల్లావాసులే. కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితుల బంధువులు ధర్నాచేశారు. కోరా పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎమ్మెల్యే ఆఫీసులో అత్యాచారపర్వం
యశవంతపుర: మహిళను వివస్త్రను చేసి సహచరులతో అత్యాచారం చేయించారని బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మునిరత్న, సహచరులు వసంత్, చెన్నకేశవ, కమల్పై అత్యాచారం కేసును ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు నమోదు చేశారు. 2023లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడారు. దీనితో పాటు అంటువ్యాధి సోకేలా వైరస్ ఇంజక్షన్ వేశారు. దీనివల్ల నాకు జబ్బు సోకిందని ఫిర్యాదులో తెలిపింది. పలు రకాలుగా అసభ్యంగా ప్రవర్తించారు అని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినదానిని ఏకరువు పెట్టారు. ఫిర్యాదులో ఏముంది? ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. నేను బీజేపీ మహిళ కార్యకర్తగా పని చేస్తున్నాను. మొదట రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోయా, తరువాత జగదీశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని జీవిస్తున్నా. 2023లో ఎ1 నిందితుడు మునిరత్న నాపై పీణ్య పోలీసులచే వ్యభిచారం కేసు పెట్టించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తరువాత మునిరత్న సహచరులు, నిందితులు నందినిలేఔట్కు వసంత్, చన్నకేశవ, కమల్తో కలిసి ఆశ్రయనగరకు చెందిన సునీతబాయి ద్వారా నాపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసుస్టేషన్లో హత్యయత్నం కేసును నమోదు చేసి మళ్లీ జైలుకు పంపారు. 2023 జూన్ 11న నా ఇంటికి వచ్చి కేసులను మునిరత్న వాపస్ తీసుకొంటారని చెప్పారు. యశవంతపుర జేపీ పార్క్ వద్దనున్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని పిలుచుకెళ్లారు, ఆఫీసులో లైంగికదాడి చేశారు, తరువాత నా ముఖంపై మూత్రం పోశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికై నా చెబితే కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించి మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టారు అని తెలిపింది. ఆమె ఫిర్యాదుపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు విచారణ చేపట్టారు. మునిరత్న, అనుచరులపై బీజేపీ మహిళా కార్యకర్త ఫిర్యాదు -
విజయపుర జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం విజయపుర (బిజాపుర) జిల్లాలో మనగోళి వద్ద షోలాపూర్– చిత్రదుర్గ హైవే–50 లో స్కార్పియో కారు డివైడర్కు ఢీకొని అవతలి లేన్లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. అదే సమయంలో లారీ కూడా ఈ రెండు వాహనాలను ఢీకొంది. స్కార్పియో కారు తుక్కు తుక్కు కాగా అందులో ప్రయాణిస్తున్న ఐదు మంది అక్కడికక్కడే మరణించారు. అలాగే బస్సు డ్రైవర్ బసవరాజ్ రాథోడ్ కూడా గాయాలతో మృతి చెందారు. బ్యాంకు మేనేజర్ కుటుంబం బలి స్కార్పియో వాహనంలో తెలంగాణకు చెందిన గద్వాల కెనరా బ్యాంక్ మేనేజర్ టి.భాస్కరన్, ఆయన భార్య పవిత్ర, కుమార్తె జ్యోత్స్న, కుమారుడు అభిరాం, డ్రైవర్ వికాస్ శివప్ప ప్రాణాలు కోల్పోయారు. వీరు మహారాష్ట్రలోని షోలాపూర్కు వెళ్తున్నట్లు తెలిసింది. భాస్కరన్ కుమారుడు ప్రవీణ్ తేజ, లారీ డ్రైవర్ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోని కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం తాండవించింది. విజయపుర జిల్లా ఎస్పీ, పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను, మృతదేహాలను విజయపుర ఆసుపత్రికి తరలించారు. బస్సును ఢీకొన్న స్కార్పియో వాటిని టిప్పర్ లారీ ఢీ 6 మంది మృత్యువాత స్కార్పియో డ్రైవరు, బ్యాంకు మేనేజర్, భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం బస్సు డ్రైవర్ సైతం మృతి -
నూతన పోలీస్ బాస్ సలీం
అడవినోదంస్మార్ట్ మీటర్లపై గవర్నర్కు ఫిర్యాదుబనశంకరి: ఇళ్లకు విద్యుత్ స్మార్ట్మీటర్ల కొనుగోలులో దోపిడీతో పాటు వినియోగదారులకు అన్యాయం జరుగుతుందని బీజేపీ నేతలు ఆరోపించారు. బుధవారం బీజేపీ నేతలు ఆర్.అశోక్, సీఎన్.అశ్వత్నారాయణ నేతృత్వంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ను కలిసి స్మార్ట్మీటర్ల టెండర్లలో కుంభకోణం జరిగిందని వినతిపత్రం ఇచ్చారు. ఆపై విలేకరులతో మాట్లాడారు. స్మార్ట్మీటర్ల వల్ల కస్టమర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వేలాది కోట్లు లూటీ అయ్యాయి, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం , ఇంధనశాఖ అధికారులు భాగస్వాములయ్యారని ఆరోపించారు. మీటర్ల ధర చాలా అధికంగా ఉందని, అర్హతలేని కాంటాక్టర్లకు అప్పగించారని చెప్పారు. ఈ కుంభకోణం గురించి గవర్నర్కు వివరించామన్నారు.శివాజీనగర: రాష్ట్ర నూతన డీజీపీగా సీఐడీ చీఫ్ డాక్టర్ ఎం.ఏ.సలీం నియమితులయ్యారు. డీజీపీ అలోక్మోహన్ బుధవారం ఉదయం రిటైరయ్యారు. పోలీస్ కవాతు మైదానంలో అట్టహాసంగా వీడ్కోలు వేడుక జరిగింది. ప్రభుత్వం తాత్కాలిక డీజీపీగా సలీంకు పగ్గాలు అప్పగించింది. కేంద్ర యూపీఎస్సీ ఆమోదం తరువాత పూర్తిస్థాయి డీజీపీని నియమిస్తారు. సీనియారిటీ ఆధారంగా ఐపీఎస్లు ప్రశాంత్కుమార్ ఠాకూర్, సలీం, సైబర్ విభాగం చీఫ్ ప్రణవ్ మొహంతి తదితర ఏడుమంది ఉన్నారు. సీనియారిటీలో ఠాకూర్ది అగ్రస్థానం. అయితే సిద్దరామయ్య సర్కారు సలీంకు కట్టబెట్టింది. బెంగళూరువాసే 1966 జూన్ 25న బెంగళూరులోని చిక్కబాణవారలో జన్మించిన సలీం ఎంబీఏ తరువాత పలు పీజీ కోర్సులు చేశారు. సివిల్స్లో ఉత్తీర్ణులై 1993లో కర్ణాటక కేడర్ ఐపీఎస్గా వచ్చారు. గుల్బర్గా, కొడగు తదితర జిల్లాల్లో పనిచేశారు. ఆయన బెంగళూరువాసి, మైనారిటీ కావడంతో కలిసివచ్చిందని సమాచారం. దేశంలో ఉత్తమ పోలీసులు దేశంలోనే కర్ణాటక పోలీస్ బెస్ట్ అని రిటైరైన డీజీపీ అలోక్ మోహన్ ప్రశంసించారు. కోరమంగల కేఎస్ఆర్పీ పరేడ్ మైదానంలో ఘనంగా వీడ్కోలు వేడుక జరిగింది. పోలీస్ శాఖలో 38 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలంగా సేవలందించాను. కర్ణాటక పోలీస్ బలగాలు దేశంలో బెస్ట్ అని చెప్పేందుకు గర్వంగా ఉందని కొనియాడారు. తాత్కాలిక డీజీపీగా నియామకం -
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ
సాక్షి,బళ్లారి: శబరిలోని అయ్యప్ప స్వామి ఆలయం తరహాలో బళ్లారిలో అద్భుతంగా నిర్మించిన అయ్యప్పస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ, పుష్పాభిషేకం, కుంభాభిషేకంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని అనంతపురం రోడ్డులోని రాఘవేంద్ర కాలనీలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రముఖులు, అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్టు అధ్యక్షుడు జయప్రకాష్ గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలోని బాల రాముడిని తయారు చేసిన విగ్రహ రూపకర్త, మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా తయారు చేసిన నవగ్రహ విగ్రహాల ప్రతిష్ట, కుంభకోణం అవార్డు విన్నర్ రామ్ కుమార్తో పంచలోహాలతో తయారు చేసిన దేవి విగ్రహాలను బెంగళూరుకు చెందిన వాసవీ పీఠానికి చెందిన సచ్చిదానంద సరస్వతీ చేతుల మీదుగా ప్రతిష్టాపనతో కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి శబరిమలై మూలస్థానం అర్చకులైన శ్రీరంగం శరణ్ మోహన్ పడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశేషమైన పుష్పాభిషేకం, 18 మెట్లకు పడిపూజ చేయడంతో పాటు అయ్యప్పస్వామి విగ్రహానికి 18 రకాలుగా పుష్పాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పుష్ప, కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ట -
రుణాలిప్పిస్తామని నమ్మించి మోసం
హొసపేటె: కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు అందిస్తామని హామీ ఇచ్చి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో మోసపోయిన స్వయం సహాయక సంఘాల మహిళలు బైలువద్దిగేరి జీపీ సభ్యులు, మాజీ అధ్యక్షులు సహా 19 మంది విజయనగర జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం హొసపేటె నగరంలో ప్రియాంక మహిళా పరపతి సహకార సొసైటీని ప్రారంభించి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉచిత కుట్టు, కంప్యూటర్ శిక్షణ అందించి మోసగించిన సహకార సంఘానికి చెందిన ప్రియాంక జైన్, తాయమ్మదేవి శక్తి సంఘం అధ్యక్షురాలు కవితా ఈశ్వర్ సింగ్, ఆమె సన్నిహితురాలు లలితమ్మ, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి నుంచి డబ్బును తిరిగి రాబట్టాలని ఆ ఫిర్యాదులో కోరారు. సీపీఎం నాయకులు భాస్కర్రెడ్డి, యల్లాలింగ, దళిత హక్కుల కమిటీ నాయకులు మరడి జంబయ్య నాయక, బీ.తాయప్ప నాయక, బీ.రమేష్కుమార్, సూర్యనారాయణ, డీవైఎఫ్ఐ నాయకులు ఈడిగర మంజునాథ్, వడ్డరహళ్లి స్వామి, తిరుకప్ప తదితరులు హాజరై నిందితులకు ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని, ఫిర్యాదుదారులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసు శాఖ అధికారులను వారు కోరారు. జిల్లా ఎస్పీకి బాధితుల ఫిర్యాదు -
మూడేళ్లుగా ఫలితాలు పెండింగ్
రాయచూరు రూరల్: కలబుర్గి విశ్వ విద్యాలయంలో డిగ్రీ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను ప్రకటించడంలో జాప్యం చేస్తోందనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. విద్యాభ్యాసం ముగించుకొని ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలనుకునే వారి ఆశలకు విశ్వ విద్యాలయం గండి కొట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో పరీక్ష పేపర్లు చోరీ అయ్యాయనే ఆరోపణలున్న నేపథ్యంలో నేడు ఫలితాలను ప్రకటించడంలో జరుగుతున్న జాప్యంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కలబుర్గి విశ్వ విద్యాలయం పరీక్ష సుధారణ సమితి విచారణలో సమాధాన పత్రాల మూడు బ్యాచ్ల విద్యార్థుల మార్కులు, ఫలితాలను పెండింగ్లో ఉంచారు. కలబుర్గి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శ్రీరాములు వివరిస్తూ డిగ్రీ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను త్వరలో ప్రకటిస్తామన్నారు, నకిలీ మార్కుల జాబితాల కేసు విషయంలో లోకాయుక్త అధికారుల విచారణతో జాప్యమైందన్నారు. ఈ విషయంలో విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యురాలు శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి రోజు 200 మంది విద్యార్థులు వర్సిటీ క్యాంపస్లో ఉండి ఫలితాలు ప్రకటించాలని విన్నవించుకున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం పరీక్ష సుధారణ సమితి ఏర్పాటైన సమయంలో 16 వేల మంది విద్యార్థుల ఫలితాల్లో కేవలం 9,024 మంది విద్యార్థుల ఫలితాలు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. నూతన విద్యా పథకం జారీ కావడంతో పరీక్షలు నిర్వహించామన్నారు. ఫెయిలైన వారికి పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యమైందన్నారు. పరీక్షలు ముగిసిన 45 రోజుల్లో ఫలితాలు ప్రకటించాల్సి ఉందన్నారు. 9,024 మంది పరీక్షార్థుల ఎదురుచూపులు అంధకారంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కలబుర్గి విశ్వవిద్యాలయం నిర్వాకం -
నిత్యావసరాల ధరలు తగ్గించండి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన పేదలు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని జేసీటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర కార్యదర్శి శరణ బసవ మాట్లాడారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను లూటీ చేసిందన్నారు. నేడు విద్యుత్, బస్ చార్జీలు, పాల ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెంచిన ధరలను తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, వక్ఫ్ బిల్లును, లేబర్ కోడ్ నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ గవర్నర్కు స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శ్రీశైలరెడ్డి, కాశప్ప, పద్మ, వీరేష్, నరసింహ, లక్ష్మణ, గోకారమ్మ, ఇందిర, చంద్రకళ, భీమప్ప, విజయలక్ష్మి, హులిగప్ప, మల్లికార్జునలున్నారు. -
ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
● బెంగళూరులో విషాదం దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్బీఆర్ లేఔట్లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్స్టేషన్లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి. యాత్రకు వెళ్తే, ఇల్లు ఖాళీ మైసూరు: మైసూరులోని దొంగతనాలు ఏమాత్రం తగ్గడం లేదు. రోజూ ఒక చోరీ చొప్పున జరుగుతోంది. ఓ ఇంట్లో దొంగలు చొరబడి లక్షల విలువైన నగలు, నగదును దోచుకున్న సంఘటన తాలూకాలోని చిక్కళ్లి లో జరిగింది. మాదప్ప దంపతులు మంత్రాలయానికి దర్శనానికి వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చినప్పుడు ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి, బీరువా, అల్మరాలలో దాచిన రూ. 7.80 లక్షల నగదు, 3 లక్షల విలువ చేసే బంగారు నగలను కనిపించలేదు. మాదప్ప అల్మరా వద్ద తాళాలను భద్రపరిచాడని, అది తెలిసిన దొంగలు తాళాలు సేకరించి పని కానించినట్లు అనుమానాలున్నాయి. సమాజ సేవ విస్తరించాలి మండ్య: ప్రపంచంలో సమాజ సేవ చేసేవారి సంఖ్య పెరగాలని, సమాజ సేవ ద్వారా సామాన్య ప్రజల కన్నీటిని తుడవాలని, అప్పుడే సమాజంలో సంతోషం వెల్లివిరుస్తుందని ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథ స్వామి అన్నారు. మంగళవారం మండ్య జిల్లా కేఆర్ పేటెలో ఆర్టీఓ మల్లికార్జున చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారం, సేవాతత్పరులకు సన్మానం జరిగింది. స్వామీజీ మాట్లాడుతూ పేదలకు సేవ చేయడం సంతోషకరమన్నారు. నేను, నా కుటుంబం అని కాకుండా సమాజం కోసం కూడా ఉపయోగపడాలని సూచించారు. సమాజ సేవకులకు గొప్ప ధైర్యం ఉండాలని అన్నారు. బాల్కనీలో చదువుతూ కింద పడి.. మైసూరు: మైసూరులోని మండి మొహల్లాలోని ఎస్ఆర్ రోడ్డులో అక్షత అపార్ట్మెంట్లో ఒక యువతి ఇంటి బాల్కనీ నుంచి పడి మరణించింది. మొదటి అంతస్తులో షేక్ అలీ కుటుంబం ఉంటోంది. కుమార్తె అనిక (20) మైసూరులో కళాశాలలో బిబిఏ చివరి ఏడాది చదువుతోంది. సోమవారం రాత్రి బాల్కనీలో తిరుగుతూ చదువుతోంది. మంగళవారం ఉదయం బాల్కనీ కింద యువతి మృతదేహం కనిపించింది. బాల్కనీ నుంచి పడిపోవడంతో తలకు బలమైన గాయం కావడంతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఓ చేత్తో పుస్తకం పట్టుకుని, మరో చేత్తో ఫోన్ చూస్తూ ఉందని, ఆ సమయంలో పట్టుతప్పి పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. మండి పోలీసులు పరిశీలించి కేసు నమోదుచేశారు. -
భారీ వర్షం.. రోడ్లు జలమయం
అణ్ణిగేరి పురసభ హస్తగతం ● అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం హుబ్లీ: అణ్ణిగేరి పురసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఎస్టీ అభ్యర్థి శివానంద అధ్యక్షుడిగా, బీసీఏ కేటగిరికి చెందిన నాగప్ప దళవాయి ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే ఎన్హెచ్.కోనరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలో అందరూ సామానులే అన్నారు. శాసకాంగం, కార్యాంగం సంయుక్తంగా పని చేసినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులకు సూచించారు. తహసీల్దార్ మంజునాథ్, సీఐ రవికుమార్, రెహమాన్ సాబ్, మంజునాథ్, పురసభ ముఖ్యాధికారి వైజీ.గద్దిగౌడరు, పురసభ సభ్యులు పాల్గొన్నారు. కాగా పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహొళి ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న పురపాలక నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరులో ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన చేపట్టారు. మంగళవారం ప్రభులింగ బృహన్మఠంలో కిల్లె మఠాధిపతి శాంతమల్ల శివాచార్య 22వ పట్టాధ్యక్షుడు ప్రభులింగ శివాచార్యుల మూల విరాట్కు అభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన, మంగళళహారతి నెరవేర్చారు. అనంతరం ప్రభులింగ శివాచార్యుల పుణ్యారాధన చేశారు. గబ్బూరు మఠాధిపతి బూదిబసవ శివాచార్యులు, సుల్తాన్పుర మఠాధిపతి శంభు సోమనాథ శివాచార్యులు, రేణుకాచార్య, శరణయ్యలున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. 26న గ్రంథాలయ పర్యవేక్షకుల సంఘం ఆందోళన హుబ్లీ: గత 30 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న గ్రంథాలయ పర్యవేక్షకులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 26న గ్రంథాలయ పర్యవేక్షకుల సంఘం ఆధ్వర్యంలో బెంగళూరులోని స్వతంత్ర ఉద్యానవనంలో నిరవధిక ఆందోళన చేపడుతున్నారు. అరివు కేంద్రం గ్రంథ పాలకులను గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులుగా ఆదేశాలు వెల్లడించి ఒకే నియమావళిని రూపొందించాలి లేకుంటే తమను మాతృశాఖ ప్రజా గ్రంథాలయ శాఖకు పంపించాలి. పూర్తిగా కనీస వేతనాలను ప్రతి నెల 5వ తేదీలోగా నేరుగా వారి ఖాతాలకు చెల్లించాలి. గ్రాచ్యుటీ, పింఛన్ సౌకర్యం కల్పనతో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోసం ఈ ఆందోళన చేపట్టినట్లు ఆ సంఘం ధార్వాడ జిల్లాధ్యక్షుడు యల్లప్ప బోవి ఓ ప్రకటనలో తెలిపారు. జీవితంలో భక్తిభావం పెంచుకోవాలి రాయచూరు రూరల్: మానవుడు తన జీవితంలో భక్తిభావాలు పెంపొందించుకునేందుకు కృషి చేయాలని సనాతన సంస్థ సంస్థాపకుడు సచ్చిదానంద అథవాలే పిలుపు ఇచ్చారు. సోమవారం గోవాలోని పోండాలో మూడు రోజుల పాటు జరిగే సనాతన శంఖునాద మహోత్సవాలను ప్రారంభించి సభికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. నేడు మానవుడు పని ఒత్తిడితో ప్రతి నిత్యం ఎంతో మదనపడుతున్నాడన్నారు. కొంత సమయాన్ని ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. ప్రతి ఆలయంలో ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో 23 దేశాల నుంచి వచ్చిన సుమారు 20 వేల మందికి పైగా సాధకులు హాజరయ్యారు. సభలో సత్శక్తి, బిందా నీలేష్ సింగబాళ, అంజలి, చిత్శక్తిలున్నారు. ఉద్యోగాల పేరుతో వంచన ● ముంబై వాసి అరెస్ట్ యశవంతపుర: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసిన ముంబైకి చెందిన మసీవుల్లా అతివుల్లాఖాన్(36) అనే నిందితుడిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరు నగర పోలీసుకమీషనర్ అనుపమ్ అగర్వాల్ మంగళవారం వివరాలు వెల్లడించారు. నిందితుడు అతివుల్లాఖాన్ పలువురు నిరుద్యోగులకు వల వేసి విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తనని ఆశ పెట్టాడు. ఓ నిరుద్యోగి వద్దనుంచి రూ.1.65 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. దీంతో బాధితుడు మంగళూరు తూర్పు పోలీసుస్టేషన్లో 2024 డిసెంబర్లో ఫిర్యాదు చేశాడు. అయితే కేసు దర్యాప్తులో సీఐ సోమశేఖర్, విచారణాధికారి ఎస్ఐ ఉమేశ్ నిర్లక్ష్యం వహించారు. అప్పట్లో వీరిద్దరూ సస్పెన్షన్కు గురయ్యారు. అనంతరం ఈకేసుపై పోలీసులు దృష్టి సారించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. పలువురి నుంచి రూ.1.82 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.హొసపేటె: అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. గతవారం రోజులుగా నగరంలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోయారు. ప్రతి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు, ఆపై చల్లని వాతావరణం, అక్కడక్కడ మాత్రం చిరుజల్లులు కురిసేవి. ఇలాంటి తరుణంలో మంగళవారం ఉదయం నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల రోడ్లపై నీరు పొంగి ప్రవహించింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినా ఉదయం 10 గంటలైనా వర్ష ప్రభావం తగ్గని పరిస్థితి నెలకొనడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. మరి కొన్ని చోట్ల వాహనాలకు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. బైపాస్ రోడ్డుపై నిలిచిన వాహనాలు -
ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాం
హొసపేటె: ఎన్నికల వేళ మేం ఇచ్చిన హామీల్లో ఐదు గ్యారంటీలతో పాటు రెండేళ్లలో 142 హామీలు నెరవేర్చాం. తదుపరి మూడేళ్లలో మిగిలిన హామీలను పూర్తి చేస్తాం అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన సమర్పణ సంకల్ప సమావేశంలో 1,11,111 కుటుంబాలకు హక్కు పత్రాలను పంపిణీ చేసి, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రతిమను లోకార్పణ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మన రాష్ట్రం అన్ని కులాల శాంతి తోట అని, అందరినీ సమానంగా గౌరవించే రాష్ట్రం అని సీఎం అన్నారు. రాష్ట్రంలో జేడీఎస్, బీజేపీ ఒక్కటయ్యాయన్నారు. అయినా బీజేపీ ఇంతవరకు సొంత శక్తితో అధికారంలోకి రాలేదన్నారు. ఆపరేషన్ కమల చేసి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. 1.22 కోట్ల కుటుంబాలకు గృహలక్ష్మి పథకం కింద రూ.2 వేలను, గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ను, మొత్తం రాష్ట్రంలోని మహిళలకు శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించామని అన్నారు. ఈ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు అంతకు ముందు నగరంలోని బసవేశ్వర సర్కిల్ నుంచి జానపద కళాకారుల బృందం ఊరేగింపును క్రీడా మైదానం వరకు చేపట్టారు. వివిధ తాలూకాల నుంచి వచ్చిన కళాకారులు ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజన వ్యవస్థ కల్పించారు. సమావేశానికి వర్షం ఆటంకం సాధన సమావేశానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే సమావేశం ప్రారంభం కాకముందే భారీగా వర్షం కురువడంతో సమావేశం జరుగుతున్న మైదానం తడిసి ముద్దయింది. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు వర్షం తాకిడితో తడిచి పోయారు. సమావేశం వేదిక లోపలకు వర్షం నీరు చేరింది. భారీ వర్షానికి బ్యానర్లు, కటౌట్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిలా మారింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య సందడిగా సంకల్ప సమావేశం -
వర్ష బీభత్సం.. అంతా అస్తవ్యస్తం
● లోతట్టు ప్రాంతాలను వీడని ముంపు ● కొనసాగుతున్న సహాయక చర్యలు ● కుదేలైన సిలికాన్ సిటీ ● మూడురోజులుగా వానలే వానలు బనశంకరి: గత మూడు రోజులుగా బెంగళూరు నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాలతో జనం కడగండ్లు పడుతున్నారు. ఉప్పొంగిన డ్రైనేజీలు, మునిగిన కూడళ్లు, ఇళ్లలోకి వచ్చిన నీరు, ట్రాఫిక్ ఇబ్బందులు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 7 గంటల వరకు మళ్లీ వర్షం వచ్చింది. విరామం ఇచ్చి మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాటు కురిసింది. నగరవ్యాప్తంగా పలు లేఔట్లలో ముంపు ఏర్పడింది. చెట్లు కూలిపడ్డాయి, మరో పక్క పాత కట్టడాలు కూలిపోయే భయం ఉండడంతో అందులోని నివాసులు బిక్కుబిక్కుమంటున్నారు. పాత ఇళ్లను ఖాళీ చేయాలి ఉదయమే వానతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. చెట్లు కూలిపోవడం, ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో వాహనదారులు రోడ్లపై చిక్కుకుపోయారు. సిటీలో 10 కిపైగా ప్రాంతాలు ఎక్కువ జలమయమయ్యాయి. పాత కట్టడాల్లో నివసించే నివాసులు ఖాళీ చేయాలని బీబీఎంపీ అధికారులు ప్రకటించారు. అయితే ఇల్లు వదిలి ఎక్కడకు వెళ్లాలని చాలామంది ప్రశ్నించారు. పద్మనాభనగరలో ఓ భారీ చెట్టు కూలి ఇంటి మీద పడడంతో ఇల్లు ధ్వంసమైంది. సాయిలేఔట్కు కటకట ● హొరమావులోని సాయిలేఔట్ పూర్తిగా జలమయం కావడంతో ఇళ్లలో చిక్కుకున్న ప్రజలను ట్రాక్టర్లు, రబ్బరు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ పరిస్థితి తీవ్రంగా ఉంది. మోటార్ల ద్వారా నీటిని తొలగిస్తున్నారు. ● మారతహళ్లి దీపా నర్సింగ్హోమ్, చిన్నప్పనహళ్లి 5వ క్రాస్, పణత్తూరు రైల్వే అండర్పాస్, గ్రీన్హుడ్, ఇబ్బలూరు జంక్షన్, బాలాజీ లేఔట్, కొత్తనూరు, ఏ.నారాయణపుర కృష్ణనగర, సునీల్ లేఔట్, హరళూరు, బీఎస్పీలేఔట్, మహదేవపుర వలయంలోని అనేక లేఔట్లు నీటమునిగాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు. ● ఇన్ఫ్యాంట్రీరోడ్డు హిందూ ప్రెస్ సమీపంలో చెట్టు కూలి ట్రాఫిక్కు ఆటంకం ఏర్పడింది. వర్షం వల్ల సిల్క్బోర్డు, రూపేన అగ్రహార మధ్య హోసూరు రోడ్డు ఫ్లై ఓవర్ ను తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికులు ఇతర మార్గాల్లో వెళ్లాలి. ● కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ వద్ద చెట్టుకొమ్మ పడి మేక్రీ సర్కిల్ వరకు వాహనాలకు ఆటంకం ఏర్పడింది. కస్తూరినగర రింగ్రోడ్డు గ్రాండ్ సీజన్ హోటల్ వద్ద నీరు నిలిచింది. పలు రోడ్లు బంద్ మడివాళ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని అయ్యప్ప అండర్పాస్లో నీరు నిండిపోవడంతో హోసూరు మెయిన్ రోడ్డులో నగరం నుంచి రాకపోకలు దాదాపు స్తంభించాయి. హోసూరు మెయిన్రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు జలమయమైంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సంచరించాలని పోలీసులు తెలిపారు. బన్నేరుఘట్టరోడ్డు ద్వారా నగరంలోకి రావచ్చు. హొసగుడ్డెదహళ్లి జంక్షన్ నుంచి మైసూరురోడ్డు టోల్గేట్ వర్షంనీరు నిలిచి ఉండటంతో ట్రాఫిక్ నెమ్మదించింది. బెంగళూరు సిటీలో ఏయే రోడ్లు జలమయం జయదేవ ఆసుపత్రి వైపు నుంచి ఈస్ట్ఎండ్ సర్కిల్ వరకు వర్తూరు కాలేజీ వైపు నుంచి వర్తూరు మరవ వరకు కాటన్పేటే నుంచి సుల్తాన్పేటే సర్కిల్ వరకు బీలేకహళ్లి వైపునుంచి జీడీమర వరకు సారక్కి జంక్షన్ నుంచి సింధూర జంక్షన్ వరకు -
మఠాల సేవలు ప్రశంసనీయం
హుబ్లీ: భారతీయ సంస్కృతిలో మఠాలకు ప్రత్యేక గౌరవం ఉంది, ఎన్నో మఠాలు పిల్లలకు భోజన వసతితో పాటు ఉచిత విద్యాభ్యాసం కల్పించడం ప్రశంసనీయం అని, వారి సేవలను సదా గుర్తు పెట్టుకోవాలని కుందగోళ ఎమ్మెల్యే ఎంఆర్ పాటిల్ పేర్కొన్నారు. ఆయన కుందగోళ తాలూకాలోని జిగళూరు గ్రామంలో సద్గురు శేషాచార్య గురువుల మఠం నిర్మాణం కార్యక్రమానికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.4 లక్షలు కేటాయించి భూమిపూజ నెరవేర్చిన అనంతరం మాట్లాడారు. జిగళూరు మఠానికి అభివృద్ధి చెందిన ఇతర మఠాల మాదిరిగా అన్నదానం చేసేంత శక్తి కలగాలని ఆకాంక్షించారు. జిగళూరు మఠం కూడా మరింతగా ఎదగాలని, గ్రామానికి మేలు జరగాలని కోరారు. ప్రముఖులు మాలతేష్, మంజునాథ పాటిల్, జగదీశ్, తమ్మణ్ణ, రేవణ్ణప్ప కట్టి పాల్గొన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం రాయచూరు రూరల్: మనిషి ఆరోగ్య రక్షణకు యోగా దోహదపడుతుందని సీనియర్ యోగా సాధకుడు భవర్లాల్ అన్నారు. మంగళవారం ఎల్వీడీ కళాశాల మైదానంలో పతంజలి యోగా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందన్నారు. యోగా ధ్యానంతో మానవుడి ఆయుష్షు వృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిరంతరం యోగా, ధ్యానం చేయాలన్నారు. విఠోబ, పరమేశ్వర సాలిమఠ, రుతుగౌడ, అరుణలున్నారు. రేపు సామాజిక నాటక ప్రదర్శన బళ్లారిఅర్బన్: రాఘవ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కాకర్లతోట కనుగోలు తిమ్మప్ప 25వ వర్ధంతిని ఏర్పాటు చేశారు. రాఘవ కళా మందిరంలో ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా బళ్లారి రంగ సంస్కృతి సారథ్యంలో సంపద అనే తెలుగు సామాజిక నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నాటకాన్ని వైఎస్.కృష్ణేశ్వరరావు రచించగా, లాల్రెడ్డి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు. అధిక ఫీజుల వసూలు తగదు రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని కర్ణాటక రైతు సంఘం సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం దేవదుర్గలో విద్యా శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మరిలింగ పాటిల్ మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యా శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ఖండించారు. అధిక ఫీజులు వసూలు చేయరాదంటూ అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాధికారి బడిగేర్కు వినతిపత్రం సమర్పించారు. చిన్న కారణానికి దాడి.. కులదూషణపై ఫిర్యాదు హుబ్లీ: చిన్న కారణానికి దాడి చేసి ప్రాణాలు తీస్తామని బెదిరించడమే కాకుండా కులదూషణ చేశారని జిల్లాలోని కుందగోళ పోలీస్ స్టేషన్లో చెన్నబసప్ప, ఈరప్పలపై అనిల్కుమార్ ఫిర్యాదు చేశారు. వివరాలు.. కుందగోళ తాలూకాలోని రొట్టిగెవాడ గ్రామంలో నీటి తోపుడు బండిని తోచుకుంటూ వెళుతుండగా రోడ్డుపై అడ్డుగా ఉన్న రాయిని పక్కకు జరిపారన్న కోపంతో చెన్నబసప్ప, ఈరప్ప కలిసి తనపై మారణాయుధాలతో దాడి చేశారని, తన తల్లి, సోదరిపై కూడా దాడి చేసి చంపుతామని బెదిరించారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. భక్తులకు ప్రసాదం పంపిణీరాయచూరు రూరల్: దేవసూగూరులో భక్తులకు ప్రసాదంగా పెరుగన్నం పంపిణీ చేశారు. సూగూరేశ్వర ఆలయంలో 6000 మందికి పెరుగన్నం దానం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ఉదయం సూగూరేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం సమర్పించారు. దేవస్థానంలో భక్తులు మల్లప్ప, శశికళ తదితరులు పాల్గొన్నారు. -
పసిడి స్మగ్లింగ్ కేసులో రన్యరావుకు బెయిలు
బనశంకరి: సంచలనం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసులో అరైస్టెన నటి రన్య రావు కు బెంగళూరు ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిల్ను మంజూరు చేసింది. మార్చి 3వ తేదీన బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రన్య రావును సోదాలు చేయగా 14.8 కేజీల బంగారం లభించడంతో అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి తీసుకొస్తూ ఆమె పట్టుబడింది. కేసు నమోదు చేసి కొన్నిరోజుల పాటు తీవ్రంగా ప్రశ్నించారు. తరువాత పరప్పన అగ్రహార జైలుకు రిమాండు తరలించారు. పలుమార్లు ఆమె బెయిలు పిటిషన్లు దాఖలు చేయగా, ఎట్టకేలకు లభించింది. ఆమెతో పాటు అరెస్టయిన తరుణ్ రాజుకు ఇంకా బెయిలు దొరకలేదు. ఐశ్వర్య బెయిలు అర్జీ వాయిదా బెంగళూరులో బంగారు షాపుల నుంచి భారీ మొత్తంలో నగలు కొట్టేసిన కేసులో అరైస్టెన ఐశ్వర్య గౌడ బెయిల్ పిటీషన్ విచారణను హైకోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నిస్తూ ఐశ్వర్య వేసిన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారించింది. అరెస్ట్కు సరైన కారణం చూపలేదని ఆమె వకీలు వాదించారు. ఈడీ న్యాయవాది వాదనలకు సమయం కోరడంతో వాయిదా వేశారు.