breaking news
Jagtial
-
జగిత్యాల
27.0/16.07గరిష్టం/కనిష్టంజిల్లా జడ్జిని కలిసిన పీపీలు జగిత్యాలజోన్: జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ధర్మపురి బార్ అసోసియేషన్ సభ్యులు ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతిని మర్యాదపూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.వాతావరణం వాతావరణం సాధారణంగా ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. సూర్యోదయం దాటినా మంచు కురుస్తుంది. చలి గాలులు వీస్తాయి. ఎండ ఉంటుంది.శబరిమలైకి మంత్రి అడ్లూరి ధర్మపురి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ 41 రోజుల అయ్యప్ప దీక్షను పూర్తిచేసి, ఇరుముడి కట్టుకొని శబరిమలైకి బయల్దేరారు. కరీంనగర్లోని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026 -
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
జగిత్యాలజోన్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నోడల్ అధికారులు ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం మున్సిపల్ ఎన్ని కలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, నామినేషన్ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రణాళికలతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని, నామినేషన్ కేంద్రాన్ని మున్సి పల్ కమిషనర్లు స్వయంగా సందర్శించి, ఖరారు చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత, వసతులు, ఎన్నికల కోడ్ అమలు, ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ పాల్గొన్నారు. 10వరకు అభ్యంతరాల స్వీకరణ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వెలువరించిన ఓటర్ల జాబితాపై ఈ నెల 10 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఒకే కుటుంబానికి చెందినవారి పేర్లు వేర్వేరు వార్డుల్లో వచ్చాయని, విలీన గ్రామాల్లోని వారందరిని ఒకేవార్డులో పేర్కొనలేదని, ఒకే ప్రాంతానికి చెందిన వారిని రెండు, మూడు వార్డుల్లో విభజించారంటూ రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు. ఈ విషయమై క్షేత్రస్థాయిలో పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను అదేశించారు. -
వారసత్వం వదిలేశారు
కోరుట్ల: వారసత్వ సంపదను కాపాడాల్సిన హెరిటేజ్ డిపార్ట్మెంట్ కోరుట్ల కోట బురుజుల వెంట రెవెన్యూ రికార్డుల్లో ఆబాదీగా ఉన్న స్థలం చేజార్చుకున్న వైనం చర్చనీయంగా మారింది. కోరుట్లలో జైన చాళుక్యుల కాలం నుంచి ఉన్న కోట బురుజులు, కోనేరు వంటి వారసత్వ సంపదను ఆనుకుని సుమారు 3.02 ఎకరాల స్థలం ఉంది. ఆరు నెలల క్రితం వరకు పురాతన కట్టడాలను ఆనుకుని ఉన్న స్థలం పురాతత్వ, వారసత్వ, సాంస్కృతికశాఖకు చెందిది కావడంతో ఈ ప్రాంతంతో పాటు ఆనుకుని ఉన్న 200 మీటర్ల లోపు నిర్మాణాలకు మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ దసరాకు మహిషాసుర మర్ధనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. హెరిటేజ్శాఖ వారు 2025 జులైలో కొత్త ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. వారసత్వం వదిలేశారు జైన చాళుక్యుల కాలం నాటి కోట బురుజులు, కోనేరు కాలక్రమేణా దేశ్ముఖ్లు, జమీందార్ల స్వాధీనంలోకి వచ్చాయి. రెవెన్యూ రికార్డుల్లో ఆబాదీగా ఉన్న కోట బురుజులను ఆనుకుని ఉన్నస్థలం కొన్నేళ్లపాటు వారసత్వంగా కొందరి ఆధీనంలో ఉంది. అనంతరం కోట బురుజులతో పాటు పక్కనే ఉన్న స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పురాతత్వశాఖ నిర్దేశించింది. కోరుట్ల కోట బురుజుల పక్కన ఉన్న 3.02 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకునేందుకు కొందరు యత్నించగా స్థాని కంగా వివాదాలు నెలకొన్నాయి. 2007లో సాయిని రవీందర్ అనే వ్యక్తి కోట బురుజులను, కోనేరును ఆనుకుని ఉన్న 3.02 ఎకరాల స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ రిట్ పిటిషన్ నంబరు 27884 ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పూర్తి వివరాలు అందించాలని పురాతత్వశాఖను కోరింది. అనంతరం పరిశీలించిన హైకోర్టు 2010లో సా యిని రవీందర్ వేసిన కేసును కొట్టేసింది. అనంతరం అనుభవదారులు పురాతత్వశాఖ నివేదికలో కోట బురుజులు, కోనేరులు మాత్రమే చారిత్రక వారసత్వ ప్రాధాన్యత కింద వస్తాయని మిగిలిన స్థలానికి ఎలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న విషయాన్ని వెల్లడించకపోవడాన్ని తప్పు పడుతూ ఈ స్థలం తమకు చెందుతుందని 2013లో మళ్లీ హై కో ర్టును ఆశ్రయించారు. రెండు నెలల్లో ఈ సమస్యను తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. పురాతత్వశాఖ కోట బురుజులు, కోనేరులకు మాత్రమే చా రిత్రక ప్రాధాన్యత ఉందని వీటిని పరిరక్షించడానికి వాటి చుట్టూ 10 నుంచి 15 ఫీట్ల స్థలాన్ని ఇవ్వాలని ఆనుభవదారులను కోరడంతో వారు అంగీకరించారని తెలుపుతూ కోర్టుకు నివేదిక ఇచ్చింది. దీంతో కోట బురుజులను ఆనుకుని ఉన్న 3.02 ఎకరాల స్థలం పురాతత్వ, వారసత్వశాఖ నుంచి చేజారింది. అమ్మకానికి యత్నాలతో వివాదం చారిత్రక కట్టడాలు మినహా మిగిలిన 3.02ఎకరాల్లో తమకు సంబంధం లేదని పురాతత్వశాఖ కోర్టుకు నివేదించిన క్రమంలో అనుభవదారులు సదరు స్థలాన్ని రిజిస్ట్రేషన్లు చేయించేందుకు సన్నాహాలు మొదలెట్టారు.ఆ స్థలం పక్కన తమకు ఉన్న ఇండ్ల నంబర్లు వాడుకుని పక్కన ఉన్న స్థలానికి ము న్సిపల్ అధికారుల నుంచి వేకెంట్ ల్యాండ్ టాక్స్ వేయించుకుని బిల్లు చెల్లించారు. ఎకరాల స్థలానికి వేకెంట్ ల్యాండ్ టాక్స్ వేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కొందరు ఉన్నతాఽధికారులకు ఫిర్యాదు చేశారు. కోరుట్ల భూపరిరక్షణ కమిటీ ప్రతినిధులు సైతం సదరు స్థలాన్ని రిజిస్ట్రేషన్లు చేయద్దని కోరుట్ల సబ్ రిజిస్ట్రార్కు వినతి పత్రం ఇచ్చారు. మొత్తం మీద సుమారు 50 ఏళ్ల నుంచి కోరుట్ల వారసత్వ సంపదగా ఉన్న స్థలం ప్రభుత్వ శాఖల నిర్లిప్త ధోరణితో చేజారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అమ్మకు అక్షరమాల విజయవంతం చేయాలి
జగిత్యాలజోన్: మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మకు అక్షరమాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం అమ్మకు అక్షరమాల కార్యక్రమం నిర్వహించారు. రాజాగౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక మహిళా గ్రూపు సభ్యులు చదవడం, రాయడం నే ర్చుకోవాలన్నారు. మెప్మా ఏవో శ్రీని వాస్గౌడ్, డీఎంసీ సునీత, టీఎంసీ రజిత, సీవోలు రాధా, గంగారాణి, శరణ్య, సీఆర్పీలు పాల్గొన్నారు. గ్రావిటీకి సహకరించాలి పెగడపల్లి: గ్రావిటీ కాలువ నిర్మాణానికి రైతులు సహకరించాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–2 కింద నిర్మించే కాలువ భూ సేకరణకు మండలంలోని నందగిరి, ల్యాగలమర్రి గ్రామాల్లో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఆర్డీ వో మాట్లాడుతూ నందగిరి శివారులో 8మంది రైతుల నుంచి 1.08 ఎకరాలు, ల్యాగలమర్రికి చెందిన 125 మంది రైతుల నుంచి 41.24 ఎకరాలు, దీకొండలో 48 మంది నుంచి 16.18 ఎకరాలు గ్రావిటీ కోసం భూసేకరణ చేయడం జరిగిందన్నారు. ఇందుకు ప్రభుత్వం పరిహా రం చెల్లిస్తుందన్నారు. సర్పంచ్లు సురేందర్రావు, రజిత, రవి, డీఈ నర్సింగరావు, తహసీల్దార్ ఆనంద్కుమార్ పాల్గొన్నారు. విజ్ఞానం పెంచుకోవాలి ఇబ్రహీంపట్నం: విద్యార్థులు ప్రజ్ఞా పాటవ పోటీల్లో పాల్గొని విజ్ఞానాన్ని పెంచుకోవాలని డీఐఈవో నారాయణ సూచించారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మండలంలోని తొమ్మిది హై స్కూళ్లకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞాపాటవ పోటీలు నిర్వహించారు. గోధూర్ హైస్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి, మోడల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతి, వేములకుర్తి విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు. వీరికి ఎంఈవో మధు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందించారు. ఎంపీడీవో చిప్ప గణేశ్, ప్రిన్సిపాల్ సంజీవ్ పాల్గొన్నారు. క్రీడోత్సవాల్లో జయకేతనం జగిత్యాలఅగ్రికల్చర్: అంతర్ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ క్రీడోత్సవాల్లో జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ కళాశాల జట్టు జయకేతనం ఎగురవేసింది. ఈ పోటీలు జనవరి 3 నుంచి 6 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగాయి. పొలాస వ్యవసాయ కళాశాల జట్టు వాలీబాల్, చెస్లో ప్రథమ స్థానాన్ని, క్రికెట్, అథ్లెటిక్స్లో రెండోస్థానం, రిలే పరుగు పందెంలో తృతీయస్థానాన్ని దక్కించున్నాయి. జట్టు మేనేజర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ రత్నాకర్ వ్యవహరించారు. పాఠశాల తనిఖీ కథలాపూర్: కథలాపూర్ మండలం అంబారిపేట జెడ్పీహైస్కూల్ను జిల్లాస్థాయి ప్యానెల్ బృందం మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థుల రికార్డులు పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. నోడల్ అధికారి రాజేందర్, ఎస్ఆర్జీ మనోహరచారి, హెచ్ఎం కిషన్రావు పాల్గొన్నారు. 10 నుంచి పరీక్షలు జగిత్యాలజోన్: జిల్లాలో ఈ నెల 10 నుంచి 13వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాము తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హైయర్ గ్రేడ్ పరీక్షల హాల్టికెట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. -
అంజన్నకు మొక్కులు
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన స్వామివారిని దర్శించుకున్నారు. క్షేత్రపాలకుడు బేతాళస్వామి ఆలయం, శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక అభిషేకాలు చేశారు. భక్తుల ప్రత్యేక దర్శనాలు, వాహన పూజలు, ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.12.57లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో శ్రీకాంత్రావు, ఏఈవో హరిహరనాథ్ పర్యవేక్షించారు. -
గణపయ్యకు పూజలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని మహాగణపతి ఆలయంలో మంగళవారం అంగారక సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్కుమార్ మంత్రోచ్ఛారణలతో స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి మంత్రపుష్పము నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ తదితరుల పాల్గొన్నారు. -
కష్టపడ్డ వారికే అవకాశం
రాయికల్/జగిత్యాలటౌన్: రాయికల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా వేస్తామని, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన కార్యకర్తలకే బీఫాంలు అందజేస్తామని మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రాయికల్లో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, వర్తక సంఘ భవనంలో మున్సిపల్ ఎన్నికలపై ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పదేళ్లకాలంలో రాయికల్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తే వెంటనే మాదిగకుంటను హుస్సేన్సాగర్ తరహాలో మారుస్తామని, రూ.5 కోట్లతో ఫిల్టర్బెడ్ మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, మహిళ అధ్యక్షురాలు మమత, నాయకులు మ్యాకల అనురాధ, కొయ్యడి మహిపాల్రెడ్డి, బాపురపు నర్సయ్య, కడకుంట్ల నరేశ్, షాకీర్, నాగరాజు, రాజిరెడ్డి, భూమయ్య పాల్గొన్నారు. పారదర్శకంగా ఓటరు జాబితా ప్రకటించాలి సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిని జగిత్యాల మున్సిపాలిటీలోని వివిధవార్డుల్లో ఓటర్లుగా నమోదు చేయడం దారుణమని జీవన్రెడ్డి అన్నారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాల ని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసి, ఆ లేఖ ప్రతిని కలెక్టర్ సత్యప్రసాద్కు అందజేశారు. పట్టణంలోని 48వార్డుల్లో మార్పులు చేయకుండా నూకపల్లి అర్బన్ కాలనీలో స్థిరపడిన కుటుంబాలతో 2వార్డులు ఏర్పాటు చేసి మొత్తం 50వార్డుల్లో పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించాలని కోరారు. -
రోడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన
వెల్గటూర్: మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం అధికారులు కోటిలింగాలలో పుష్కరాల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా రోడ్డు నిర్మాణాల పనుల సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన పుష్కర పనులకు ముహూర్తం ఎప్పుడో అనే కథనానికి స్పందించారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా దృష్టి పెట్టామని పంచాయతీరాజ్ ఈఈ లక్ష్మణరావు, డీఈ గోపాల్ తెలిపారు. కోటిలింగాల ముఖ ద్వారం నుంచి నాలుగు వరుసల రోడ్డు, వెల్గటూర్లోని అయ్యప్ప ఆలయం ముందు నుంచి కాళేశ్వరం లింక్–2 ప్రాజెక్టును ఆనుకొని కోటిలింగాల ఆలయం వరకు నూతన రోడ్డు నిర్మాణానికి సాధ్యసాధ్యాలు పరిశీలించారు. కోటేశ్వరాలయం ఎదుట నూతన పుష్కర ఘాట్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ నెల 17న జరిగే సమావేశంలో పుష్కరపనులపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
ఉపాధి.. హామీ!
గ్రామాభివృద్ధికి జగిత్యాల: ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి.. కొత్త పాలకవర్గాలు కొలువుదీరా యి. సర్పంచ్గా ఎన్నికై నందుకు సంబరంగా ఉ న్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలకు నిధుల కొరత వెంటాడుతుండటంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం సవాలే. ఈ పరిస్థితుల్లో ఉపాధిహామీ పథకం అండగా నిలుస్తోంది. పక్కాగా, ప్రణాళికబద్ధంగా పనులు చేయించగలిగితే కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, పల్లెలను ప్రగతి దిశగా తీసుకుపోవచ్చు. గతంతో పోలిస్తే పథకంలో కొన్ని మార్పులు చేశారు. పథకంపేరు మార్చడంతో పాటు పనిదినాలు 100 నుంచి 125కు పెంచారు. 266 పనులు అదనంగా గుర్తించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాటిపై సర్పంచులు దృష్టిసారిస్తే గ్రామాభివృద్ధి ఇట్టే సాధ్యం. ‘దారి’ వేసుకోవచ్చు గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పంట పొలా లకు దారులు లేని ప్రాంతాలకు ఉపాధి పథకం కింద పొలం బాటలు వేసుకోవచ్చు. ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలవుతుంది. పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం లేకుంటే ఉపాధి హామీ పథకంలో నిర్మించుకునే వీలుంది. హరితహారం పెంచాలి గ్రామాల్లో మొక్కలునాటి హరితవనం పెంపొందించేందుకు వీలుంది. పంచాయతీల్లో నర్సరీ అందుబాటులో ఉంటుంది. గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం.. పోషణకూ డబ్బులు ఇస్తున్నారు. నీటిని నిల్వచేసుకోవచ్చు సాగు భూముల్లో కాంటూరు కందకాలు, ఊటకుంటలు, పాంపాండ్స్, చెక్డ్యాంలు, రాళ్లకట్టలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని పక్కాగా పనులు పూర్తిచేస్తే.. భూగర్భ నీటిమట్టం పెరుగుతుంది. స్వచ్ఛ గ్రామాలుగా ముందుకెళ్లొచ్చు గ్రామాలను సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఉంది. మరుగుదొడ్ల నిర్మాణంలో అవసరమైన గుంతలను కూలీలతో తవ్వించి, ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించవచ్చు. సాగు.. బాగు.. చెరువులు, చెక్డ్యాంలు, ఊటకుంటలు, ప్రాజెక్టు కాల్వల నుంచి పూడిక తీసుకునేందుకు అవకాశ ముంది. కూలీలతో పనులు చేయిస్తే వారికి ఉపాధి చూపడంతో పాటు నీటి వనరులు బాగు చేసుకో వచ్చు. సాగునీటి సమస్య లేకుండా చేసుకోవచ్చు. వీరిని సంప్రదించండి ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు మండలస్థాయిలో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. జిల్లాలో పీడీతో పాటు ఏపీడీ, మండలాల్లో ఏపీవో, సాంకేతిక సహాయకులు, గ్రామాల్లో క్షేత్ర సహాయకులు ఉంటారు. మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనుల గుర్తింపు, ఎంపిక, ఆమోదం, మంజూరు ఉంటాయి. ఉపాధి కూలీలు 2.74 లక్షలు జాబ్కార్డులు ఉన్నవారు 1.68 లక్షలు0ఉపాధి నిధులతో గ్రామాల అభివృద్ధి గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులే కీలకం. గతంలో పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. గత పాలకులు సైతం అప్పుల పాలయ్యారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధిహామీ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నిధులు మంజూరు చేస్తుందనే నమ్మకంతో అభివృద్ధి పనులు చేపడుతాం. రాష్ట్ర ప్రభుత్వం నిధులు వస్తే మరింత మంచిది. – మల్యాల రమేశ్, సర్పంచ్, దుంపేట, కథలాపూర్ -
కొండగట్టు గిరి ప్రదక్షిణ దారి పరిశీలన
మల్యాల: కొండగట్టు గిరి ప్రదక్షిణ దారిని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అటవీశాఖ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. గిరి ప్రదక్షిణ పొడవు ఆరు కిలోమీటర్లు ఉండగా.. 3కిలోమీటర్లు ఘాట్ రోడ్డు, మరో మూడు కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని 50 ఫీట్ల వెడల్పుతో 20 ఫీట్ల ఫుట్పాత్ నిర్మాణం కోసం అధ్యయనం చేశారు. భక్తుల సౌకర్యార్థం లైటింగ్, పార్కింగ్ ఏర్పాటు చేసేలా అంచనాలు రూపొందించారు. 1150 మీటర్ల మేర దారి అటవీశాఖ పరిధిలోకి వస్తుందని గుర్తించారు. గిరి ప్రదక్షిణకు అటవీశాఖ పూర్తిగా సహకరిస్తుందని, అటవీశాఖ భూమికి ప్రత్యామ్నాయంగా దేవాదాయ శాఖ భూమి బదిలి చేసే ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు. డీఎఫ్ఓ రవీందర్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ వసంత, ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి, ఉప సర్పంచ్ కందిరి ముత్యంరెడ్డి, నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు గండిజగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం రేచపల్లి శివారులో డీ–53 12ఎల్ కాలువకు గండి పడింది. దిగువ రైతులకు నీరు అందడం లేదు. విషయాన్ని సారంగాపూర్, పోతారం రైతులు పెద్దిరెడ్డి మహేందర్రెడ్డి, నర్సింగంతోపాటు మరికొంత మంది రైతులు ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎస్సారెస్పీ అధికారి చక్రనాయక్కు సమాచారం అందించారు. కాలువ గండిని పూడ్చి రైతులకు తక్షణమే నీరందించాలని కోరుతున్నారు. చైనామాంజా విక్రయిస్తే చర్యలు:ఎస్పీ అశోక్కుమార్జగిత్యాలక్రైం: నిషేధిత చైనామాంజాను విక్రయించినా.. వినియోగించినా చర్యలు తప్పవని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. చైనామాంజ విక్రయాలపై స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. నైలాన్, సింథటిక్ దారాలు పక్షులు, మనుషులు, పర్యావరణానికి హాని చేస్తాయన్నారు. మాంజా విక్రయిస్తే డయల్ 100కు కాల్చేసి సమాచారం అందించాలన్నారు. ఈవీఎం గోదాంల వద్ద భద్రతజగిత్యాలజోన్: ఈవీఎం గోదాంల వద్ద పటిష్టమైన భద్రత ఉంచడంతోపాటు అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్లోగల ఈవీఎం గోదాంను సోమవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ఇతర సాంకేతికమైన అంశాలను పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ బీఎస్.లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ తదితరులు ఉన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన అవసరంజగిత్యాలక్రైం: రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట శివారులోని ఓ పాఠశాల విద్యార్థులకు రోడ్డు రవాణా భద్రతపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకూడదన్నారు. హెల్మెట్, సీటుబెల్టు ధరించేలా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. అనంతరం విద్యార్థులు అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు వెంకన్న, అభిలాష్, రియాజ్, కో–ఆర్డినేటర్ అనిల్, పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్రావు, హరిచరణ్రావు, మౌనికరావు పాల్గొన్నారు. -
విద్యుత్ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ 1912
● ప్రజలకు అందుబాటులో 24/7 సేవలు కొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలందించే క్రమంలో 1912 టోల్ ఫ్రీ సేవలను మరింత విస్త్తృత పరిచినట్లు కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి టోల్ ఫ్రీ సేవలు నిర్వహిస్తారని, 16 సర్కిళ్ల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల ఫేయిల్యూర్, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు, కరెంట్ బిల్లులో హెచ్చుతగ్గులు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, విద్యుత్ మీటర్ల మార్పు, అన్నిరకాల కొత్త సర్వీసుల మంజూరుకు సంబంధించి పేరు మార్పు, కేటగిరీ, లోడ్ మార్పు తదితర సమస్యలకు టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించి సేవలు పొందాలని కోరారు. 24/7 అందుబాటులో ఉండే ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలోనే కొండగట్టు అభివృద్ధిమల్యాల: కాంగ్రెస్ పాలనలోనే కొండగట్టు అభివృద్ధి జరిగిందని, బీఆర్ఎస్ పాలనలో రూపాయి కూడా విడుదల చేయలేదని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ అన్నారు. కొండగట్టు అభివృద్ధికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఏమీ చేయలేదంటున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వ్యాఖ్యలను ఖండించారు. అభివృద్ధిపై చర్చకు రావాలన్న రవిశంకర్ వ్యాఖ్యలను సవాలు చేస్తూ.. మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టులోగల వైజంక్షన్ వద్దకు జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. రవిశంకర్ చర్చకు రావాలని సవాలు విసిరారు. ఈ సందర్భంగా ముత్యం శంకర్ మాట్లాడుతూ కొండగట్టులో కొత్త కోనేరు నిర్మాణం కాంగ్రెస్ పాలనలో నిర్మించినవే అన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్ల నిధులు మంజూరు చేశామనేది వాస్తవం కాదని, కేవలం జీవో మాత్రమే జారీ చేశారని గుర్తు చేశారు. రవిశంకర్ ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి తీసుకురాలేదని అన్నారు. కొండగట్టులో చేపట్టిన అభివృద్ధి పనులకుసైతం దేవాలయ నిధులతో చేపట్టినవేనని అన్నారు. అభివృద్ధిపై చర్చకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అవసరం లేదని, యూత్ కాంగ్రెస్ చాలని అన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి సహకరించాలని 2024లో మేడిపల్లి సత్యం పవన్ కల్యాణ్కు వినతిపత్రం సమర్పించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు నేరళ్ల సతీశ్ రెడ్డి, గాజుల అజయ్ గౌడ్, శ్రీకాంత్, రాజు, మహేశ్, అనిల్, జలందర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వోను కలిసిన టీఎన్జీవోస్జగిత్యాలజోన్: డీఎంహెచ్వో సుజాతను సోమవారం టీఎన్జీవో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏనుగంటి రాజేశం, జిల్లా కార్యదర్శి కుత్బుద్దిన్, సంఘం నాయకులు సుగుణాకర్, శైలజ, విజయలక్ష్మి, అరుణ, నారాయణ పాల్గొన్నారు. -
ఘనంగా జీవన్రెడ్డి జన్మదిన వేడుకలు
జగిత్యాలటౌన్: మాజీమంత్రి జీవన్రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి జంబిగద్దె ప్రాంతంలోని ఆంజనేయస్వామి, మార్కండేయ ఆలయాల్లో పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జీవన్రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆటపాటలు, కేరింతల మధ్య జీవన్రెడ్డిని భారీ క్రేన్ సహాయంతో గజమాలతో సత్కరించారు. పూల వర్షం కురిపించారు. జీవన్రెడ్డిపై యువజన కాంగ్రెస్ రూపొందించిన పాట సీడీనీ ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకులు, అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి 75 కిలోల భారీ కేక్కు కట్చేశారు. కార్యక్రమంలో నాయకులు కొత్త మోహన్, కల్లెపల్లి దుర్గయ్య, విజయలక్ష్మి, బండ శంకర్, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ముంజాల రఘువీర్గౌడ్, గుండ మధు తదితరులు పాల్గొన్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజలు మల్యాల: ముందుగా జీవన్రెడ్డి కొండగట్టు ఆంజనేయస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంగ ఆనందరెడ్డి, నాయకులు ఉన్నారు. -
ప్రజావాణికి సమస్యల వెల్లువ
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 55 మంది అర్జీలు సమర్పించగా.. వాటిని పరిశీలించిన కలెక్టర్ వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, జగిత్యాల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాది పెగడపల్లి మండలం నందగిరి. గ్రామ పరిధిలో 52 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 63, 67, 458, 237, 173/1, 442/2434, 226, 163, 160 సర్వేనంబర్లలో ఉన్న 52ఎకరాల భూమిని నిరుపేద దళితులమైన మాకు కేటాయించండి. – నందగిరి దళితులు, పెగడపల్లి మండలం జిల్లాకేంద్రం శివారు సర్వేనంబర్ 138/ఆలోని 13.19 ఎకరాల ప్రభుత్వభూమి అన్యాక్రాంతం అవుతోంది. వివాదాస్పదంగా మారిన ఆ భూమిపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కమిటీ నియమించి నెల రోజులైనా చర్యలు తీసుకోలేదు. సదరు కమిటీ విచారణ నివేదిక సర్టిఫైడ్ కాపీ కోసం సహ చట్టం కింద దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వడంలేదు. – పిల్లి బాలకృష్ణ, జగిత్యాల మాది మెట్పల్లి మండలం ఆత్మకూరు. మా గ్రామం మధ్య నుంచే పెద్దవాగు ప్రవహిస్తుంది. వాగులో నీరుంటేనే తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ వాగులో ప్రభుత్వం ఇసుక రీచ్ గుర్తించడంతో భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదముంది. ఇసుక రీచ్ రద్దు చేయాలని తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చాం. – ఆత్మకూరు వీడీసీ సభ్యులు జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్ వెలుపల, రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లు, డివైడర్లతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. అసలే ఇరుకుగా ఉన్న ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు, డివైడర్లతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్లే బస్ ప్లాట్ఫాం వైపు బైక్ పార్కింగ్, కార్గో సర్వీసులు పెడుతున్నారు. రద్దీ తక్కువగా ఉండే ప్లాట్ఫాంవైపు కార్గో, బైక్ పార్కింగ్ను మార్చండి. – ముజాహిద్, వ్యాపారి జగిత్యాల జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ పరిధిలోని సర్వేనంబర్ 437లో గల గుట్టపై అక్రమ తవ్వకాలను నిలువరించేందుకు చర్యలు తీసుకుని ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడండి. పశుపక్ష్యాదులకు, ప్రకృతి రమణీయతకు నెలవుగా ఉన్న గుట్ట అక్రమ మైనింగ్పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. – నర్సింగాపూర్ సర్పంచ్, వార్డు సభ్యులు మాది ధర్మపురి మండలం దొంతాపూర్. ఎస్సీ నేతకాని కులానికి చెందిన నేను బీర్పూర్ మండలం కోమన్పల్లి ఎస్టీ నాయకపు కులానికి చెందిన బర్ది పవన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న. 15రోజులకు నాభర్త కులస్తులు మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు. కోమన్పల్లిలో ఉండొద్దంటూ ఎలాంటి శుభకార్యాలకు పిలవకుండా అవమానిస్తున్నారు. బహిష్కరణ చేసి వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోండి. – పసుల సంగీత, దొంతాపూర్ ప్రమాదాలు నివారించండిజిల్లాకేంద్రంలోని కరీంనగర్రోడ్డులోగల జయశంకర్ కూడలి వద్ద ట్రాఫిక్తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. విద్యుత్ భవన్, ఐఎంఏ భవన్, నర్సింగ్ కళాశాల, రిజిస్ట్రేషన్ కార్యాలయం, కోదండ రామాలయం, గణేశ్ ఆలయాలతో రద్దీగా మారిన కరీంనగర్ రోడ్డులోని జయశంకర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ పెరిగి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కూడలిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలి. – నాగిరెడ్డి మధుసూదన్రెడ్డి, న్యాయవాది -
అడ్డులేని ఇసుక
అక్రమ రవాణామెట్పల్లిరూరల్: ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాగుల్లో తవ్వకాలు చేపడుతున్న ఇసుకాసురులు ట్రాక్టర్లలో గ్రామాలు, పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మెట్పల్లి మండలం రామలచ్చక్కపేటలో కొద్దిరోజుల క్రితం ఇసుక తవ్వకాల కోసం వీడీసీ (విలేజ్ డెవలప్మెంట్ కమిటీ) వేలం వేసింది. అందులో రూ.లక్షలు పెట్టి ఇసుకను విక్రయించేందుకు అనుమతి దక్కించుకున్న కొందరు ఆ ప్రాంతంలోని ఒర్రె నుంచి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ దందాకు మాత్రం బ్రేక్ పడడంలేదు. ఇసుక రవాణా విషయంలో కఠినంగా వ్యవహరించాలని మెట్పల్లి తహసీల్దార్ నీత జీపీవోలకు కొన్నిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమణ రవాణాను సహించేదిలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. అప్పుడు కఠినంగా వ్యవహరించిన జీపీవోలు ప్రస్తుతం మామూలుగా తీసుకుంటున్నారు. ట్రాక్టర్ లోడ్కు రూ.1500 రామలచ్చక్కపేటలో ఒర్రె నుంచి ఇసుక తవ్వేందుకు ట్రాక్టర్ లోడ్కు రూ.1500 తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆ ఇసుకను మెట్పల్లితోపాటు ఇతర గ్రామాల్లో విక్రయించేందుకు వ్యాపారులు రూ.4 వేలకుపైనే తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసు క తరలిపోతున్నా.. వాటిని ఎవరూ అడ్డుకోవడంలే దు. రామలచ్చక్కపేట, జగ్గాసాగర్, వెల్లుల మీదుగా పట్టణానికి ట్రాక్టర్లలో ఇసుక వస్తోంది. అయినా ఆయా గ్రామాల జీపీవోలు ఇసుక రవాణాను ఎందుకు అడ్డుకోవడంలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి. మొదట్లో ట్రాక్టర్లను పట్టుకొని వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి జరిమానాలు విధించేలా కఠినంగా వ్యవహరించారు. ఇప్పుడు వాటి వైపు దృష్టి పెట్టడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఇసుక అక్రమ రవాణా దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఈ విషయమై తహసీల్దార్ నీత మాట్లాడుతూ.. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నం ఇసుక రవాణా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యహరిస్తున్నట్లు పదేపదే చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ విభాగంలోని కొందరు సిబ్బంది ఇసుక వ్యాపారులకు పరోక్షంగా సహకరించడంతోనే దందాకు అడ్డుపడడంలేదన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. -
తప్పు చేస్తే శిక్ష ఖాయం
జగిత్యాలక్రైం: నేరాలు చేసిన వారు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో తప్పించుకునే పరిస్థితి లేదు. చేసిన తప్పులను పోలీసులు రుజువు చేస్తుండటంతో న్యాయస్థానాల్లో శిక్షలు తప్పడం లేదు. నేరం చిన్నదైనా.. పెద్దదైనా శిక్ష అనుభవించాల్సిందే. నేరం చేసి ప్రపంచంలో ఎక్కడికెళ్లినా పోలీసులు పట్టుకొస్తున్నారు. ఇటీవల మల్యాల మండలం బల్వంతాపూర్ శివారు ఆశ్రమంలో పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన సంఘటనలో కోర్టు ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. సాంకేతికతతో విచారణ గతంలో నేరం జరిగితే దానిని నేరుగా చూసిన వాళ్లు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉండేది. నేరం జరిగిన ప్రాంతంలో నిందితుడు ఉన్నాడా? లేదా? అనేది కూడా ఎవరైనా చూసి ఉండి.. కోర్టులో సాక్ష్యం చెప్పాలి. నేడు పరిస్థితి మారిపోయింది. నేరస్థలంలో సదరు వ్యక్తి ఉన్నాడా..? లేదా..? తెలుసుకునేందుకు నిందితుడు వాడే సెల్ఫోన్, సదరు ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలు, ఫొరెన్సిక్ ల్యాబ్, డాగ్స్క్వాడ్ వంటి వాటిని వినియోగిస్తూ సరైన సాక్ష్యాలను సేకరించి చార్జిషీట్లో పొందుపరుస్తున్నారు. ఇవి కేసులకు బలం చేకూరుస్తూ.. నిందితులకు తగిన శిక్ష పడేలా చేస్తున్నాయి. సమన్వయంతో సత్ఫలితాలు నేరం జరిగిన వెంటనే ఎస్ఐఆర్ నమోదు, చార్జిషీట్ దాఖలు, పక్కాగా సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టి నేరాన్ని నిరూపిస్తే వంద శాతం శిక్ష పడడం ఖాయమని పోలీసులు చెబుతున్నారు. కేసుల నమోదు, విచారణలో నాణ్యత పాటించాలని, సాంకేతికతను వినియోగించాలని పోలీస్ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాల్లో దిశనిర్దేశం చేస్తూ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నారు. తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. చేసిన తప్పును పరిగణనలోకి తీసుకుని దానికి తగినట్లు న్యాయస్థానం శిక్ష వేస్తుంది. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, కోర్టు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇటీవల వెలువడిన పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. – అశోక్కుమార్, ఎస్పీ శిక్ష 2022 2023 2024 2025 జీవితకాలం 2 14 10 23 5నుంచి పదేళ్లు 2 2 11 26 3నుంచి ఐదేళ్లు 3 6 3 10 1నుంచి మూడేళ్లు 9 20 12 27 ఏడాది లోపు 44 13 26 29 మొత్తం 60 55 62 115 -
కువైట్లో కనగర్తివాసి మృతి
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మారుపాక నర్సయ్య(55) కువైట్లో గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మారుపాక నర్సయ్య గత 15 ఏళ్లుగా ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లి, వస్తున్నాడు. కొంతకాలంగా కరీంనగర్ శివారులోని చింతకుంటలో ఉంటున్నాడు. స్వగ్రామానికి వచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఈక్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం తన గదిలో ఉండగా గుండెపోటుతో మృతిచెందాడు. నర్సయ్యకు భార్య పద్మ, కూతురు భవానీ, కుమారుడు దత్తు ఉన్నారు. -
ప్రజెంటేషన్ ముఖ్యం
విద్యార్థులు తెలివి తేటలు జ్ఞాపకశక్తి కన్నా పరీక్షల్లో ప్రజంటేషన్ కీలకం. చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురై తెలిసిన ప్రశ్నలకు సైతం జవాబులు రాయలేరు. పిల్లలను స్వేచ్ఛగా చదవనివ్వాలి. ఏ సమయంలోనైనా పరీక్షను సులభంగా రాయగలిగేలా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయు కృషితోనే ఇది సాధ్యం. – అట్ల శ్రీనివాస్రెడ్డి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ఏడాది శ్రమ వృథా అవుతుంది పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక సంఘర్షణకు లోనైతే ఏడాది కష్టం వృథా అవుతుంది. తెలిసిన అంశాలకు స్పష్టమైన సమాధానాలు రాయాలి. మనోవిజ్ఞానికంగా ఉన్న విషయ పరిజ్ఞానాన్ని వ్యక్తం చేస్తే మంచి మార్కులు వస్తాయి. పరీక్షల కోసం చదివేటప్పుడు మాత్రమే లక్ష్యం ఉండాలి. – గాజుల రవీందర్, ఉపాధ్యాయుడు, జెడ్పీ పాఠశాల సప్తగిరికాలనీటీవీలు బంద్ చేయడం ఉత్తమం తల్లిదండ్రులు ఎక్కువ సమయం టీవీల ముందు కాలక్షేపం చేస్తే ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుంది. పరీక్షలు ముగిసేంత వరకు తల్లిదండ్రులు ఎంతో కొంత త్యాగం చేయాలి. లేదంటే తమ పిల్లల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. బయట ఆహారానికి పుల్స్టాప్ పెట్టి ఇంటి వంటలే చేసి పెట్టాలి. – శనిగరపు రవీందర్, గణిత ఉపాధ్యాయుల -
ఆర్టీసీ బస్సు, కారు ఢీ: ఆరుగురికి గాయాలు
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం మేడిపల్లిలో ఆదివారం వేకువజామున ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెట్పల్లి నుంచి హైదరాబాద్కు వెళ్తోంది. మేడిపల్లి వద్దకు చేరుకోగానే.. కమ్మర్పల్లి వైపు నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని కోరుట్ల పట్టణానికి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తెలిపారు. -
కుట్టుమిషన్తో ఉపాధి
మాది కోనరావుపేట మండలం మామిడిపల్లి. నేను నాగారంలో ఏర్పాటు చేసిన జీఎమ్మార్ శిక్షణ కేంద్రంలో కుట్లు, అల్లికల్లో శిక్షణ పొందాను. రెండు నెలల శిక్షణ పొందిన తర్వాత మా గ్రామంలోనే స్వయం ఉపాధి పొందుతున్నాను. నాగారంలో అన్ని రకాల అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మహిళలకు ఉపయోగకరంగా ఉంది. – ప్రవళిక, మామిడిపల్లి(కోనరావుపేట) నాణ్యమైన శిక్షణ అందిస్తున్నాం నాగారంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి వివిధ వృత్తిపరమైన శిక్షణలు అందిస్తున్నాం. చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా యువకులు వచ్చి వివిధ అంశాలను నేర్చుకుంటున్నారు. వచ్చిన వారందరికీ నాణ్యమైన శిక్షణతోపాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నాం. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న యువకులకు తగిన ఉపాధి కూడా కల్పిస్తున్నాం. – ఎం.మహేశ్, సెంటర్ ఇన్చార్జి -
ఆలిండియా వాలీబాల్ పోటీలకు ఎంపిక
జూలపల్లి(పెద్దపల్లి): మండల కేంద్రానికి చెందిన సుల్తాన్ సాగర్ రామగుండం కమిషనరేట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆలిండియా పోలీస్ వాలీబాల్ సెలెక్షన్లో సెలెక్ట్ అయ్యాడు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరిగే ఆలిండియా పోలీస్ జట్టుకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు సీనియర్ క్రీడాకారుడు ఆవుల రాజు తెలిపాడు. సాగర్ ఎంపికపై గ్రామస్తులతో పాటు సీనియర్ క్రీడాకారులు ఆమరగాని గంగాధర్, కమలాకర్రెడ్డి, వెంకటేశ్, ఖాజామియా, సతీశ్, శేఖర్, మహేశ్, రాకేశ్ తదితరులు అభినందించారు. రాష్ట్ర వాలీబాల్ జట్టు కోచ్గా సయ్యద్ ఖాజాబీ పెద్దపల్లి: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగులో జరిగే 69వ పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయస్థాయి అండర్–14 బాలికల వాలీబాల్ జట్టు కోచ్గా చందనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సయ్యద్ ఖాజాబీ ఎంపిక అయినట్లు తెలంగాణ స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఉషారాణి, జిల్లా సెక్రటరీ కనుకుంట్ల లక్ష్మన్, జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి సురేశ్ తెలిపారు. ఖాజాబీ ఎంపికపై జిల్లా విద్యాధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్, చందనాపూర్ పాఠశాల హెచ్ఎం లక్ష్మి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ తమ్మన్నవేని రాజయ్య, ఫిజికల్ డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. టిప్పర్ల పట్టివేతసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): అనుమతి లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఆదివారం పట్టుకున్నట్లు సుల్తానా బాద్ ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. ఎలిగేడు మండలం నుంచి వేబిల్లు లేకుండా మట్టిని టిప్పర్లలో తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకుని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
ఎనిమిది నెలలకే నూరేళ్లు
కోనరావుపేట(వేములవాడ): ఇద్దరు కూతుళ్ల తర్వాత కొడుకు పుట్టాడని ఎంతగానో సంతోషపడ్డారు. వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఎనిమిది నెలలకే మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు శోకసంధ్రంలో మునిగారు. రాజన్నసిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన జాగిరి అనిల్–సుస్మిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు శ్రీహర్షిక(6), ఆరాధ్య(4), కొడుకు వేదాంత్(8 నెలలు) ఉన్నారు. కొంతకాలంగా వేదాంత్ న్యూమోనియాతో బాధపడుతున్నాడు. సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారి వేదాంత్ మృతిచెందాడు. మహిళకు తీవ్రగాయాలు జమ్మికుంట: ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి మహిళ తీవ్రగాయాలపాలైంది. స్థానికులు, బాధితురాలి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బండారి స్వరూప జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. తిరిగి వెళ్లేందుకు జమ్మికుంట బస్టాండులో బస్సు ఎక్కింది. ప్రమాదశాత్తు కాలుజారి కింద పడింది. తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయింపుకొడిమ్యాల: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖంచాటేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన మండలంలోని నాచుపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ యువతి, ఓ యువకుడు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతి పెళ్లి చేసుకుందామని నిలదీయడంతో ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో సదరు యువతి యువకుడి ఇంటిముందు బైఠాయించి న్యాయం చేయాలని వేడుకుంది. వాహనం ఢీకొని విరిగిన విద్యుత్ స్తంభం ఇల్లంతకుంట: మండలకేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద ఆదివారం బ్లేడ్ బండి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం విరిగింది.సెస్ విద్యుత్ కాంట్రాక్టర్ వెంటనే స్పందించి సిబ్బందితో విరిగిన స్తంభం స్థానంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసిన విద్యుత్తీగలను సరిచేశారు. సెస్ ఏఈ నగేశ్కుమార్, లైన్మెన్ ఎల్లయ్య, హెల్పర్ తిరుపతి విరిగిన స్తంభాన్ని అక్కడ నుంచి తొలగించి విద్యుత్ను పునరుద్ధరించారు. -
కొండగట్టు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
కరీంనగర్టౌన్: కొండగట్టు ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ హయంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఆలయ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సవాల్ విసిరారు. కరీంనగర్లో ఆదివారం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సత్యం చేసిన ఆరోపణాలు సరికాదన్నారు. కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిధులు తీసుకురావడం శుభపరిణామం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండగట్టుకు ఒక్క రూపాయి ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చేసిన వ్యాఖ్యకు మేడిపల్లి సత్యం కట్టుబడి ఉండాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే 680ఎకరాల భూమిని కొండగట్టు ఆలయానికి కేటాయించిన విషయం గుర్తు చేశారు. గంట్ల వెంకటరెడ్డి, సాగి మహిపాల్ రావు, ఆకుల మధుసూదన్, చీకట్ల రాజశేఖర్, పూడూరు మల్లేశం, విజయేందర్రెడ్డి, ఉప్పల గంగన్న, నాగ శేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సత్యం అసత్యాలు మాట్లాడొద్దు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ -
భవితకు బంగారు బాట
కోనరావుపేట(వేములవాడ): గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వృత్తి శిక్షణ ఇచ్చి, ఉపాధి చూపుతుంది జీఎమ్మార్ వరలక్ష్మి ఫౌండేషన్. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో ఏర్పాటు చేసిన జీఎమ్మార్ వరలక్ష్మి ఫౌండేషన్ నిరుద్యోగ యువతకు వరంగా మారింది. వివిధ వృత్తిపరమైన శిక్షణ పొందుతూ యువకులు పక్కా ఉపాధి పొందుతున్నారు. ఎనిమిదేళ్లుగా సేవలు కోనరావుపేట మండలం నాగారంలో ప్రతిమ ఫౌండేషన్, జీఎమ్మార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సహకారంతో జీఎమ్మార్ వరలక్ష్మి ఉపాధి శిక్షణ కేంద్రాన్ని 2017 సెప్టెంబర్ 2న ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర అప్పటి గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు, మై హోమ్ రామేశ్వర్రావు ప్రారంబించారు. భవిష్యత్పై భరోసా నాగారంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో మహిళలకు నర్సింగ్, బెడ్సైడ్, టైలరింగ్, హోమ్సైడ్ వర్క్, యువకులకు బైక్ రిపేర్, సోలార్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్పై శిక్షణ ఇస్తున్నారు. వీటితోపాటు ఉత్తమ శిక్షణ, యోగా, క్రీడలు, కంప్యూటర్ శిక్షణ, వ్యక్తిత్వ వికాస తరగతులు, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు కూడా అదనంగా నేర్పిస్తున్నారు. శిక్షణకాలంలో ఉచిత భోజన సదుపాయం, వసతి కల్పిస్తున్నారు. రోజూ వచ్చి వెళ్లే వారికి ట్రావెలింగ్ చార్జీలు సైతం చెల్లిస్తున్నారు. 1350 మందికి ఉపాధి 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు 1,520 మందికి శిక్షణ ఇచ్చారు. ఒక్కో బ్యాచ్కు 20 నుంచి 30 మందిని చేర్చుకుంటున్నారు. 1520 మందికి ఇప్పటి వరకు 1,320 మందికి ఉపాధి కల్పించారు. శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రికల్లో శిక్షణ పొందాను మాది కోనరావుపేట మండలం నాగారం. మా గ్రామంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో ఎలక్ట్రికల్లో రెండు నెలలు శిక్షణ పొందాను. అన్ని రకాల అంశాలపై తర్పీదునిచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్గా ఉపాధి పొందుతున్నాను. – బాస అజయ్, నాగారం(కోనరావుపేట) స్వయం ఉపాధికి మార్గం నేను కుట్టు, అల్లికలపై రెండు నెలలు శిక్షణ తీసుకున్నాను. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందించారు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ కుట్టు మిషన్ నడుపుతున్నాను. స్వయం ఉపాధి పొందుతున్నాను. నాగారంలో అందిస్తున్న శిక్షణ యువతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. – శ్రావణి, వేములవాడ యువకుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జీఎమ్మార్ శిక్షణ ఇచ్చి ఉపాధి చూపుతున్న సంస్థ నాగారంలో ఎనిమిదేళ్లుగా సేవలు -
టెన్షన్ వద్దు
కరీంనగర్టౌన్: విద్యార్థి జీవితాన్ని కీలకమలుపు తిప్పేది పదోతరగతి. ఇక్కడవేసే అడుగు భవితకు బాటు వేస్తుంది. మరో 70 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 14,196మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి, మార్చి విద్యార్థులకు పరీక్షల కాలమే. ఏడాది పొడవునా పాఠ్యాంశాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు ఆఖరు పరీక్షలు కావడంతో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని అధిగమించి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. ఏడాది పొడవునా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు చివర్లో అనారోగ్యానికి గురై ఫలితాల సాధనలో వెనకబడిన సందర్భాలు అనేకం. ఈ సమయంలో విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. మాంసాహారానికి దూరంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకోవాలి. తద్వారా పోషకాలు లభించడంతో పాటు మానసికంగా ఉత్సాహం చేకూరుతుంది. పండ్లు,కూరగాయలు తినడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.పరీక్షలకు చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలి. మొదటి, రెండో పేపర్లకు మాదిరి ప్రశ్నాపత్రాలు తయారు చేసుకోవాలి. వాటికి సమాధానాలు రాయాలి. క్వశ్చన్ బ్యాంక్లోని చిన్న, పెద్ద ప్రశ్నలను చదవాలి. రోజు ఆరు పాఠ్యాంశాలు విధిగా చదవాలి. ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయపాలన రూపొందించుకోవాలి. ఏడాదికాలంలో చదివిందంతా రెండున్నర గంటల్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి అక్షర దోషాలు, కొట్టివేతలు లేకుండా అన్ని అక్షరాలు సమానంగా, తలకట్టు, గుడి ఒకేలా, గుడి దీర్ఘాలు పెద్దగా, చిన్నగా కాకుండా సరిపడేలా రాయాలి. జవాబులు అందంగా రాసేలా మెరుగు దిద్దుకోవాలి. ఇష్టంగా చదివితే ఉత్తమ ఫలితాలు ‘పది’ సూత్రాలు పాటిస్తే ప్రయోజనాలు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడి మాయం తల్లిదండ్రులు తోడ్పాటునందించాలిఆహారం ఎంతో కీలకంచక్కటి ప్రణాళిక -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
వృద్ధుడికి గాయాలు కోనరావుపేట మండలం నిజామాబాద్ ఎల్లమ్మ గుడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా పొన్నాజిపేటకు చెందిన రామయ్య(65) తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని సత్తెపీరీలదర్గా వద్ద ఆదివారం రెండు బైక్లు ఢీకొన్నాయి. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. గంభీరావుపేట మండలం గోరింట్యాలకు చెందిన అతికం దత్తాద్రిగౌడ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి బైక్పై ఎల్లారెడ్డిపేటకు వస్తున్నాడు. అదే సమయంలో ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన గంగాధరి కిరణ్ వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దత్తాద్రిగౌడ్తోపాటు ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. దత్తాద్రిగౌడ్ భార్య మీనా ఫిర్యాదుతో కిరణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీపీఐది వందేళ్ల త్యాగాల చరిత్ర
కరీంనగర్టౌన్: సీపీఐ ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లో ఆదివారం నిర్వహించిన పార్టీ శతవసంతాల ముగింపు ఉత్సవాలకు హాజరయ్యారు. ముందుగా సర్కస్గ్రౌండ్ నుంచి రెవెన్యూగార్డెన్ వరకు భారీ ర్యాలీ తీశారు. రెవెన్యూ గార్డెన్లో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సభలో పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐ డిసెంబర్ 26తో వందేళ్లు పూర్తి చేసుకుందన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నాయకులు స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యారన్నారు. భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి కార్యక్రమాలు సీపీఐ పోరాటాల ఫలితంగానే అమలయ్యాయన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర గొప్పదన్నారు. 3,500 గ్రామాల విముక్తి, 4500మంది ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర సీపీఐదన్నారు. రాబోయే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర సహాయకార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, డీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు అందెస్వామి, పొన్నగంటి కేదారి, శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్రెడ్డి, కోయడ సృజన్కుమార్, బోయిని అశోక్ పాల్గొన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
కోరుట్ల: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు క్షేత్రస్థాయిలో అఽధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో.. వార్డుల రిజర్వేషన్ల మార్పు విషయంలో నెలకొన్న సందిగ్ధం ఇంకా వీడడంలేదు. ఫలితంగా వార్డుల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు ఇదివరకు ఉన్న రిజర్వేషన్లు మారితే ప్రత్యామ్నాయంగా ఎవరిని పోటీలో నిలపాలి..? ఈ మార్పును తట్టుకుని విజయం ఎలా సాధించాలి..? అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఈనెల 10న ఓటరు జాబితా ఫైనల్ చేసిన తరువాత రిజర్వేషన్ల ప్రక్రియ మొదలవుతుందన్న ప్రచారం జరుగుతోంది. మార్పుపై ఆశ..నిరాశ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లలో మార్పు జరిగిన క్రమంలో ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లోనూ రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. వార్డుల్లో ఓటరు లిస్టులు ఫైనల్ అయిన తరువాత ఆయా వార్డుల్లో కులాల వారీగా ఉన్న ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు కేటాయింపు ఉంటుందన్న ఆశల్లో కొంత మంది అభ్యర్థులు ఉన్నారు. మరికొందరు రిజర్వేషన్లు మారితే మళ్లీ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న మీమాంసలో ఉన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 136 వార్డులు ఉన్నాయి. ఈసారి వార్డుల్లో ఓటర్ల సంఖ్య పెరగడంతో ఆయా కులాలవారీగా జనాభాలో మార్పులు రానున్నాయి. తద్వారా రిజర్వేషన్లు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వినవస్తున్నాయి. ప్రత్యామాయాల వెతుకులాట.. ఇదివరకు ఉన్న రిజర్వేషన్లు మారితే సిట్టింగ్లు కొందరు మళ్లీ పోటీ చేసే అవకాశం లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో తమ తమ వార్డులను వదిలి వేరే వార్డులకు వెళ్లాలా..? లేక భార్య, లేదా తల్లిని ఎన్నికల బరిలో నిలపాలా..? అన్న యోచనలతో మీమాంసలో పడ్డారు. గతంలో రిజర్వేషన్లు అనుకూలించక అవకాశాలు కోల్పోయిన ఆశావహులు ఈ సారి రిజర్వేషన్లు మారితే తమకు కలిసివస్తుందన్న ఆశల్లో ఉన్నారు. ఒకవేళ రిజర్వేషన్లు వచ్చినా.. రాకున్నా పోటీకి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రం తాము పోటీకి సిద్ధమైన వార్డుల్లో ఉన్న ఓటర్లను కలుస్తూ తమ ప్రచార సన్నాహాలకు పావులు కదుపుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయా..? మారుతాయా..? అన్న సందేహాలు బరిలో నిలిచే అభ్యర్థులను వేధిస్తున్నాయి. మరో వారం పాటు వేచిచూస్తే తప్ప రిజర్వేషన్ల మార్పు ఉందా..? లేదా అనే అంశంలో స్పష్టత రానుంది. పుష్కర పనులకు ముహూర్తం ఎప్పుడో..? -
మైలారం మల్లన్న జాతరలో విప్ ఆది శ్రీనివాస్
మేడిపల్లి: మండలంలోని కాచారంలో మైలారం మల్లన్న జాతర మహోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బోనమెత్తారు. స్వామివారికి నైవేద్యం సమర్పించారు. సర్పంచ్ చిట్యాల హైమావతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏనుగు రమేశ్రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు చిట్యాల సురేశ్, వెంకట్రావుపేట సర్పంచ్ కానుగంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మల్లన్నకు బోనాలుకథలాపూర్: మండలంలోని తాండ్య్రాల గ్రామంలో ఆదివారం మల్లికార్జునస్వామికి బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం బోనాలతో గ్రామం నుంచి ఆలయం వరకు శోభాయాత్ర చేపట్టారు. స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. -
‘కాంగ్రెస్ పార్టీ అంగడి సరుకు కాదు..’
● పార్టీ జెండా మోసినోళ్లకే పదవులు ● కార్యకర్తల హక్కుల పరిరక్షణకు ఎంతటి త్యాగానికై నా సిద్ధం ● కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదని, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే సహించేదని మాజీమంత్రి జీవన్రెడ్డి హెచ్చరించారు. పార్టీతో ఎలాంటి సంబంధమూ లేనివాళ్లు, పార్టీ జెండా మోయనివారు పార్టీలోకి చొరబడి టికెట్లు పంచుతామంటే ఊరుకోబోమని, కాంగ్రెస్ వారి అబ్బసొత్తు కాదన్నారు. – వివరాలు మెయిన్లో.. -
మీకేం కాదని..
మేమున్నామని..సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అక్రమాల విషయంలో మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. గత వీసీల హయాంలో జరిగిన అక్రమాల విషయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయి ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు ఇటీవల నివేదిక సమర్పించారు. త్వరలోనే కొందరు విచారణ నివేదిక మీద ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుందని అంతా అనుకుంటున్న క్రమంలో కొందరు పైరవీకారుల రంగప్రవేశం చర్చనీయాంశంగా మారింది. తాము విచారణ నివేదికను తొక్కిపెడతామని, బుట్టదాఖలు చేస్తామని, ఎలాంటి చర్యలూ లేకుండా కాపాడతామంటూ బయల్దేరారు. అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వచ్చిన సమయంలో పనిచేసిన వర్సిటీ మాజీ, ప్రస్తుత సిబ్బందికి ఏకంగా అభయమిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడుతామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఏయే అంశాలపై ఫిర్యాదు చేశారంటే.. ప్రభుత్వ జీవోను తుంగలో తొక్కి నాన్ టీచింగ్ సిబ్బందిని ఇష్టానుసారంగా నియామకం చేయడం, యూజీసీ నియమనిబంధనలు పాటించకుండా రిటైర్డ్ అధ్యాపకులను నియమించడం, అర్హత లేకపోయినా నచ్చిన వారిని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా అక్రమ క్యాష్ ప్రమోషన్లు ఇవ్వడం, 12బీ యూజీసీ గుర్తింపు కోసం తప్పుడు నివేదికలతో ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులను తప్పుడు ఆరోపణలతో తొలగించారు. అంతేకాకుండా రెగ్యులర్ కోర్సులుగా నడుస్తున్న నాలుగు డిపార్ట్మెంట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చడం, అర్హతలేని వ్యక్తిని ఫైనాన్స్ ఆఫీసర్గా, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేకపోయినా రిటైర్డ్ ప్రొఫెసర్ను నియామకం చేసుకోవడం, ఫోన్ ట్యాపింగ్ పేరిట సిబ్బందిని బెదిరించారంటూ ఆరోపిస్తూ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలు తెలుసంటూ.. శాతవాహన యూనివర్సిటీలో మాజీ ఉపకులపతి హయాంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని పలు ఆధారాలతో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, విజిలెన్స్ డీజీకి 2024 జూన్ 18న ఫిర్యాదు వెళ్లింది. శాతవాహన ప్రొటెక్షన్ డెవలప్మెంట్ ఫోరం తరఫున కోట శ్యాంకుమార్, శ్రవణ్ దాదాపు 15 అంశాలపై పెద్ద నివేదికను ఆధారాలతో సహా సమర్పించారు. దీనిపై 2024 జూలై, ఆగస్ట్లో విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు 15 నెలల అనంతరం పూర్తి నివేదికను కరీంనగర్ విజిలెన్స్ కార్యాలయం నుంచి 2025 సెప్టెంబర్లో రాష్ట్ర విజిలెన్స్ కార్యాలయానికి పంపా రు. ఇప్పుడు హైదరాబాద్లోని విజిలెన్స్ ఉన్నతాధికారుల వద్ద నివేదిక ఉంది. గతంలో వర్సిటీలో పనిచేసిన కొందరికి గత ప్రభుత్వ పెద్దలతో బంధుత్వం ఉందని, వారిలో కొందరు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారు విజిలెన్స్ నివేదికపై చర్యలు లేకుండా అడ్డుకోగలరని చెబుతున్నారు. దీంతో విజిలెన్స్ విచారణ ను తొక్కిపెట్టేందుకు తాము సహకరిస్తామని, ఇతర ఉద్యోగుల వద్ద పైరవీలకు దిగుతున్నారు. వీరికి చెక్పెట్టేలా వర్సిటీలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని విజిలెన్స్ డీజీ, ముఖ్యమంత్రిని విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. -
రాయికల్ బల్దియాపై బీఆర్ఎస్ జెండా ఎగరాలి
రాయికల్: రాయికల్ బల్దియాపై బీఆర్ఎస్ జెండా ఎగరాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం పట్టణంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాయికల్ను మున్సిపాలిటీగా చేశామని. అభివృద్ధికి రూ.25కోట్లు మంజూరు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన రెండేళ్లలో చేసిందేమీ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని, కౌన్సిలర్ల గెలుపునకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు మారంపల్లి రాణి, ఎనుగందుల ఉదయశ్రీ, మాజీ కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, మారంపెల్లి సాయికుమార్, శ్రీరాములు సత్యనారాయణ, మహేశ్ గౌడ్, కో–ఆప్షన్ మాజీ సభ్యురాలు వనితసోహెల్, నాయకులు పాల్గొన్నారు. -
మావోళ్లు.. ఎక్కడున్నట్టు?
‘మా అన్న నక్సల్స్లోకి వెళ్లాడు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. లొంగిపోవాలని చెప్పారు. నిన్న డీజీపీ చెప్పిన లిస్టులో మా అన్న పేరు లేదు. ఎక్కడున్నాడో కనీసం మావోయిస్టు బాధ్యులు కూడా చెప్పడం లేదు. అన్నలు, పోలీసులు ఎవరు ఆచూకీ చెప్పకుంటే ఎలా’అని కోరుట్ల నుంచి 44 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన బెజ్జారపు కిషన్ తమ్ముడు ఆంజనేయులు ప్రశ్న. కిషన్ భార్య కూడా తన భర్త ఎక్కడున్నాడో తెలపాలని వేడుకుంటోంది.జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి 44 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన నిజాముద్దీన్ కుటుంబ పరిస్థితి కూడా దాదాపు ఇదే. మావో టెక్ విభాగ ఇన్చార్జ్గా పనిచేసినట్టు చెప్పుకున్న నిజాముద్దీన్ ఆచూకీ ఎక్కడా దొరకడం లేదు. ఇలా ఉత్తర తెలంగాణ నుంచి నక్సల్స్ ఉద్యమంపై ఆసక్తితో అజ్ఞాతంలోకి వెళ్లి జాడ లేకుండా పోయిన వారు పదుల సంఖ్యలో ఉంటారని అంచనా.కోరుట్ల: కోరుట్ల నుంచి ప్రస్తుత మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లడానికి మూడేళ్ల ముందే అంటే.. 1982లో కోరుట్లకు చెందిన బెజ్జారపు కిషన్, మహ్మద్ నిజాముద్దీన్ నక్సల్స్లో చేరి దళాల్లో వివిధ హోదాల్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ప్రకటించిన లిస్టులో ఈ ఇద్దరి వివరాలు లేవు. ⇒ కోరుట్ల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ముక్కా వెంకటేశం డీసీఎం స్థాయిలో 1998లో యాదగిరిగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ⇒ పసుల రాంరెడ్డి తెలంగాణ పశ్చిమ డివిజన్ దళానికి డీసీఎంగా పనిచేస్తూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వద్ద 2000 సంవత్సరంలో జరిగిన మద్దిమల్ల ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ లెక్కన కోరుట్ల నుంచి నక్సల్స్లోకి వెళ్లిన బెజ్జారపు కిషన్, నిజాముద్దీన్, తిప్పిరి తిరుపతి, ముక్కా వెంకటేశం, పసుల రాంరెడ్డిల్లో ఇద్దరు ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. మరో ఇద్దరు జాడ లేకుండా పోయారు. ఏడాది క్రితం వరకు తెలంగాణ నుంచి 55 మంది వరకు మావోయిస్టుల్లో ఉన్నారని పోలీసు రికార్డులు చెబుతుండగా, ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారని..వారి పేర్లు ప్రకటించడం గమనార్హం.దీంతో ఇప్పటి వరకు ‘మావో’ల్లోనే మావారు ఉన్నారని అనుకొని వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నాయి. పౌరహక్కుల సంఘాలు, ఇతర మార్గాల ద్వారా మావోయిస్టు ప్రతినిధులకు సమాచారం పంపినా ఫలితం దక్కలేదు. ఆచూకీ లేకుండా పోయిన వారు ఉద్యమంలో ఉన్నారా? జైళ్లలో ఉన్నారా ? లేకుంటే చనిపోయారా? అన్న విషయంలో మావోయిస్టులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
కొండగట్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూజలు
మల్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించా రు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. టీటీడీ బోర్డు మంజూరు చేసిన రూ.35.19కోట్లతో నిర్మించే 96గదుల సముదాయం, దీక్ష విరమణ మంటపానికి భూమిపూజ చేశారు. పవన్ కల్యాణ్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి పవన్కు వినతిపత్రం సమర్పించారు. పవన్ రాకతో భక్తులు మూడు గంటలపాటు ఇబ్బంది పడ్డారు. జేఎన్టీయూ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ తరలివెళ్లారు. కార్యక్రమంలో దేవా దాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈఓ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఎర పంటలు వేయకనే తెగుళ్లు
జగిత్యాలఅగ్రికల్చర్: మిరప తోటల చుట్టూ ఎర పంటలు వేయకపోవడంతో ఈ ఏడాది తెగుళ్ల, పురుగుల బెడద ఎక్కువగా ఉందని జిల్లా ఉద్యానశాఖాధికారి గడ్డం శ్యాంప్రసాద్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం మోరపల్లి, తాటిపల్లి, అంతర్గాంలో రైతులు సాగు చేసిన మిరపతోటలను శనివారం పరిశీలించారు. మిరపలో నల్ల తామర పురుగు, నల్లి పురుగు, కాయతొలుచు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్, ముడత నివారణకు డైఫెంతురాన్ లేదా ప్రొపెర్గైట్, కాయ తొలుచు పురుగు నివారణకు 0.5 మి.లీ కోరజెన్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. -
ఓటరు జాబితా అస్తవ్యస్తం
జగిత్యాల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీలకు సంబంధించి వార్డులవారీగా ఓటరు జాబితా రూపొందించిన అధికారులు.. ఈనెల ఒకటో తేదీన ముసాయిదా విడుదల చేశారు. అభ్యంతరాలుంటే తెలపాలంటూ ఈనెల 5వరకు గడువు ఇచ్చారు. అయితే అధికారులు ప్రకటించిన ముసాయిదాలో అనేక తప్పిదాలు దొర్లాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామపంచాయతీలో ఉన్న ఓటర్లను జగిత్యాల మున్సిపాలిటీలోని 18వ వార్డులో కలిపారు. అలాగే 7వ వార్డులోని 200 ఓటర్లను 26వ వార్డులో కలిపారు. ఇలా అనేక వార్డుల్లోని ఓట్లు మరో వార్డులో కలిశాయి. అలాగే ఒక కుటుంబానికి సంబంధించి వార్డులోని ఓటర్లు వారి వార్డులో కాకుండా మరో వార్డులో వచ్చాయి. అలాగే విద్యానగర్, విజయపురి, కృష్ణానగర్, అరవింద్నగర్ ఇలా చాలా కాలనీల్లోని ఓట్లన్నీ గజిబిజీగా మారాయి. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాలను గుర్తించాల్సి ఉండగా.. అధికారుల నిర్లక్ష్యమో.. ఇతర కారణాలో తెలియదుగానీ.. జాబితా మొత్తం అస్తవ్యస్తంగా మారింది. అభ్యంతరాల వెల్లువ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ప్రతి వార్డులో ఉన్న ఓటర్లను గుర్తించి.. జాబితా తయారు చేసి.. వార్డులవారీగా ముసాయిదా విడుదల చేశారు. రోజుల తరబడి కసరత్తు చేసిన అధికారులు జాబితాను మాత్రం అస్తవ్యస్తంగా తయారు చేయడంతో కౌన్సిలర్లుగా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులు అయోమయంలో పడిపోయారు. వారివారి వార్డుల్లో ఉన్న ఓటర్లను మరో వార్డులోకి మార్చడంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక జగిత్యాల మున్సిపాలిటీలోనే 33 అభ్యంతరాలు వచ్చాయి. మరో రెండు రోజులు సమయం ఉండటంతో చాలా వస్తాయని అంచనా వేస్తున్నారు. అధికారులు మాత్రం టీ పోల్ ఆధారంగా జాబితా తయా రు చేశామని, ఇందులో భాగంగానే ధరూర్ గ్రామపంచాయతీ ఓటర్లు ఇందులో కలపామని చెబుతున్నారు. ఒక వార్డు ఓటర్లు మరో వార్డులో... ఒక వార్డుకు సంబంధించిన ఓటర్లందరికీ పోలింగ్ బూత్ ఉండేలా ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరికీ ఒకే బూత్కు కేటాయించాల్సి ఉంటుంది. కానీ జాబితా మొత్తం తప్పుల తడకగా ఉండడం. ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డులో.. ఒకే కుటుంబంలోని ఓటర్లు వివిధ బూత్లకు వెళ్లారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 2,33,940 ఓటర్లు ఉన్నారు. ఐదు మున్సిపాలిటీల్లో సవరించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు ఫిబ్రవరిలో ఉంటాయన్న గ్రీన్ సిగ్నల్ మేరకు ఆశావహులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. సవరించేలా చర్యలు ఓటరు ముసాయిదాకు సంబంధించి మూడు రోజులుగా అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 5వ తేదీ వరకు మాత్రమే స్వీకరిస్తారు. 6న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. 10న తుది జాబితాను ప్రకటిస్తారు. అనేక వార్డుల్లో ఇలాంటి సమస్యలే ఉండటంతో ఆ లోపు పూర్తిస్థాయిలో సవరణ జరుగుతుందా..? అని ఆందోళన చెందుతున్నారు. కౌన్సిలర్ పదవి ఆశిస్తున్న అభ్యర్థులందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను కలుస్తూ సమస్యలు తీర్చుతూ ముందుకెళ్తున్నారు. మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు పోలింగ్ కేంద్రాలు ధర్మపురి 15 14,222 24 జగిత్యాల 50 96,410 149 రాయికల్ 12 13,195 24 కోరుట్ల 33 63,741 94 మెట్పల్లి 26 46,371 64 మొత్తం 136 96,411 355 -
అజరామరం!
అభీష్టం..అభ్యుదయం..● వృత్తిలో రాణిస్తూ.. ప్రవృత్తిలో ప్రతిభ చాటుతూ.. ● కుటుంబ బాధ్యతలు మోస్తూ.. సమాజసేవలో తరిస్తూ.. ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఇష్టమైన పనిచేయడం సాధారణం.. ఆ పనినే విభిన్నంగా చేయడం అభీష్టం. అభీష్టాలను సమాజానికి ఉపయోగపడేలా చేయడం అభ్యుద యం. అంతటి అభ్యుదయ భావాలతో సమాజంలోని అవసరార్ధులు.. అన్నార్థులు.. అనాథలను ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తిని కొనసాగిస్తూనే ప్రవృత్తిగా సేవ చేస్తున్నారు. బతుకుదెరువు వెతుకుతూనే.. గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. కొందరు అన్నార్థుల ఆకలి తీరుస్తుండగా.. మరికొందరు అనాథశవాలకు అంత్యక్రియలు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఇలాంటి వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏ మూలకు వెళ్లినా కనిపిస్తారు. ఇలాంటి వారిపై ఈ వారం సండే స్పెషల్. రామడుగు(చొప్పదండి): అనాథలకు ఆపన్న హస్తం అందిస్తూ, వారికి కొడుకులా వ్యవహరిస్తూ మంచికట్ల శ్రీనివాస్ ఇప్పటి వరకు దాదాపు 11 మందికి అన్నీ తానై దహన సంస్కారాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్కు చెందిన శ్రీనివాస్ ఐదేళ్లుగా రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధిలో స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఎవరైనా ఆశ్రయం పొంది అనారోగ్యంతో మృతిచెందితే వారి కుటుంబ సభ్యులు సమాచారమిస్తారు. ఎవరూ స్పందించకుంటే తానే మృతదేహాన్ని వెలిచాల గ్రామ వైకుంఠధామానికి తీసుకెళ్లి అంతిమసంస్కారాలు చేస్తారు. ఆశ్రమంలో ప్రస్తుతం 35 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు.రామగుండం: జీవనశైలిలో మార్పు చేసుకుంటేనే ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఉంటుందని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అంటున్నారు. పదిహేనేళ్లుగా పూర్తిగా భోజనం మానేసి ఉదయం వ్యాయామంతో జీవన విధానాన్ని ఆరంభించడం అలవాటుగా మారిందని తెలిపారు. రోజూ ఆహారంగా అంబలి, రాగిజావ, మొక్కజొన్న గటుక, మొలకెత్తిన పెసర్లు, చిరుధాన్యాలు తీసుకుంటానని, తద్వారా చురుగ్గా ఉండి మానసిక ప్రశాంతత పొందగలుగుతాం అని వివరించారు. తాను నిత్యం ప్రజాక్షేత్రంలో తిరిగే క్రమంలో వాహనంలో క్యారెట్, కీరదోస తదితరాలను తీసుకుంటానని, దీంతో మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ నిత్య యవ్వనంగా ఉన్నట్లు అనిపిస్తుందని, అదే తన ఆరోగ్య రహస్యమని వివరించారు. -
కోర్టు సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి
జగిత్యాలజోన్: న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచడంలో కోర్టు సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి సూచించారు. జ్యూడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నూతన సంవత్సర కేక్ కట్ చేశారు. క్యాలెండర్, డైరీలు ఆవిష్కరించారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిజాయితీగా పనిచేసే సిబ్బందికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నారా యణ, సబ్ జడ్జి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కె. వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ, ప్రిన్సిపల్ జూని యర్ సివిల్ జడ్జి ఆర్.లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కె.నిఖిషా, జ్యూ డిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అ ధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్, కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎన్.శ్రీనివాస్, మీర్జా షఫీయోద్దిన్ బేగ్ పాల్గొన్నారు. -
‘గంగనాల’కు నీరు విడుదల చేయండి
ఇబ్రహీంపట్నం: సదర్మాట్ నుంచి గంగనాల ప్రాజెక్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయకట్టు రైతులు శనివారం ఆందోళనకు దిగారు. మూలరాంపూర్ శివారులో గోదావరిపై నిర్మించిన సదర్మాట్ ప్రాజెక్టు నుంచి గంగనాలకు నీరు విడుదల చేయాలని ధర్నా చేశారు. గంగనాల కింద వేములకుర్తి, యామపూర్, ఫకీర్కొండాపూర్, మల్లాపూర్ మండలం దామ్రాజ్పల్లి, నడికుడ, మొగిలిపేట గ్రామాల్లోని సుమారు 6వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, సదర్మాట్ నిర్మాణం పూర్తయ్యిందని, గేట్లు వేసి గంగనాలకు విడుదల చేయకపోవడంతో పొలాలకు నీరు చేరడం లేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇంకా నార్లు కూడా పోసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గంగనాలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రాజెక్టు ఏఈ కవితకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వేములకుర్తి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుమ్మల గంగన్న, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్లోని గంగనాల ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. -
బీసీల పాలిట రాబందు.. రేవంత్రెడ్డి
జగిత్యాలరూరల్: రాష్ట్రంలో బీసీలకు బందువు కేసీఆర్ అయితే.. రేవంత్రెడ్డి మాత్రం రాబందుగా మారారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పాలనలో బడుగు, బలహీనవర్గాల మహనీయులను స్మరించుకోవాలనే ఉద్దేశంతో జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని, విగ్రహాలను అలంకరించేవారమని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలంకరణ చేయడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దేవేందర్నాయక్, వొల్లం మల్లేశం, దయాల మల్లారెడ్డి, రాగుల రాజు, కిశోర్, రాము, అనురాధ, శ్రీనివాస్, వేణు, గంగాధర్, భగవాన్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి
జగిత్యాల: సావిత్రిబాయి పూలేను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శనివారం పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. మహిళల హక్కులు, దళిత సాధికారత, సామాజిక న్యాయం కోసం సావిత్రి పూలే పోరాడారన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం మహిళలకు ఆదర్శనీయమన్నారు. అవార్డులు పొందిన మహిళలను అభినందించారు. గోదావరి పుష్కరాలకు ప్రణాళికలు 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్షించారు. భక్తుల రద్దీని అంచనా వేసుకుని వసతులు కల్పించాలని, లింక్రోడ్లు నిర్మించాలని సూచించారు. 2015లో 1.50 కోట్ల మంది భక్తులు రాగా.. ఈసారి 4.50 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పుష్కర స్నానాలకు వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బంది రానీయొద్దని, స్నానఘట్టాలకు నేరుగా చేరుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, డెప్యూటీ కలెక్టర్ పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం జగిత్యాలరూరల్/జగిత్యాలటౌన్/మల్యాల: సావి త్రిబాయిపూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో తిప్పన్నపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు అయిత అనిత ఉత్తమ అవార్డు అందుకున్నారు. అలాగే మల్యాల మండలం తాటిపల్లి జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయురాలు భూక్య స్వర్ణలతకు కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ అవార్డు అందించారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి, డీఈవో రాము, మల్యాల ఎంఈవో జయసింహారావు పాల్గొన్నారు. -
‘ఎస్ఐఆర్’ నమోదు పూర్తి చేయాలి
జగిత్యాల: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) నమోదును గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని, ఓటరు జాబితా స్వచ్ఛత, పారదర్శకత కోసం ఇది అత్యంత కీలకమన్నారు. గడువులోపు పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో కోరుట్ల ఆర్డీవో జివాకర్, తహసీల్దార్లు పాల్గొన్నారు. కూచిపూడి కళాకారులకు సన్మానంజగిత్యాలరూరల్: శ్రీదుబ్బరాజేశ్వర కళానిల యం శిక్షకులు గుంటి యమున ఆధ్వర్యంలో ఆమె శిశ్యులు హైదరాబాద్లో ఇటీవల కూ చిపూడి నృత్యం ప్రదర్శించి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. నృత్యం చేసిన తాడూరి కేదరివేద్య, బండారి సమన్వి, మంద నిత్యశ్రీ, నినుగుర్తి మనుశ్రీ, ఏసుపునుటి రుచరిత, శనిగారపు మనస్విని సారంగాపూర్ మండలం కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేశ్, పాలకవర్గ సభ్యులు శనివారం సన్మానించారు. కూరగాయ తోటల సందర్శనజగిత్యాలఅగ్రికల్చర్: సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన వెంకటేశ్ రకరకాల కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేస్తూ ఆదర్శ రైతుగా గుర్తింపు పొందాడు. శనివారం జగిత్యాల నియోజకవర్గ ఉద్యానశాఖాధికారి స్వాతి సదరు రైతు సాగు చేస్తున్న పుచ్చకాయ, కర్భూజ, బంతిపూలు, సపోట తోటలను సందర్శించారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలిజగిత్యాలరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జగి త్యాల రూరల్ మండలం కల్లెడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శనివారం పరిశీలించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఇల్లులేని ఎవరికై నా ఎలాంటి రాజకీయ నాయకుల జోక్యం లేకుండా మంజూరు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు ఇండ్ల జమున, చవుల గంగన్న, నాయకులు అంకతి గంగాధర్, దామోదర్రెడ్డి, మొగిలి, అభి, రాజు, చకిణం గంగాధర్, గంగారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయిన వారి పిల్లలు అంజలి, చిన్ని, మురళీకి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. -
ఉత్తర్వులు ఉత్తవేనా..!?
కోరుట్ల: పట్టణంలోని కోట బురుజుల స్థలంలో ప్రైవేటు వ్యక్తుల పట్టాలు ఉంటే వీఎల్టీ వేయడంలో ఉత్సాహం చూపుతున్న మున్సిపల్ అధికారులు.. హెరిటేజ్ శాఖ ఉత్తర్వులను నిర్లక్ష్యం చేస్తున్నా రు. కోరుట్లలోని కోట బురుజులు, కోనేరును ఆనుకుని చుట్టూ 15 ఫీట్ల విస్తీర్ణంలో ఎలాంటి నిర్మాణా లు, కట్టడాలు ఉండరాదని ఆర్నెళ్ల క్రితం హెరిటేజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ ప్రకారం ఇప్పటికే కోట బురుజులు, కోనేరు పరిసరాలను ఆనుకుని చేపట్టిన నిర్మాణాలను బల్దియా అధికారులు తొలగించాల్సి ఉండగా.. పట్టించుకోకపోవడం గమనార్హం. అడుగు ఖాళీ లేదు.. జైన, చాళుక్యుల కాలంలో పాలకులు కోటకు రక్షణగా మూడు వరుసల్లో బురుజులు, మరో బురుజులు దూరంగా ఉన్నాయి. వీటితోపాటు కోనేరు (మెట్లబావి) నిర్మితమై ఉన్నాయి. నాలుగు కోట బురుజుల్లో ఒకటి ఇదివరకే నేలమట్టమైంది. మరో బురుజు శిథిలావస్థకు చేరి కూలిపోతోంది. మరో రెండు పటిష్టంగా ఉన్నాయి. వీటిని కోరుట్ల వారసత్వ సంపద, సాంస్కృతిక చిహ్నాలుగా భావించిన హెరిటేజ్ శాఖ ఇటీవల పరిసరాల్లోని పట్టాదారులు, పురాతన కట్టడాల స్థలాల విస్తీర్ణాన్ని నిర్ధారించి వీటి చుట్టూ 15 ఫీట్ల రేడియస్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులు రాక ముందే నాలుగు కోట బురుజుల్లో మూడింటిని ఆనుకుని ఇప్పటికే నిర్మాణాలు జరిగాయి. కనీసం ఒక్క అడుగు ఖాళీ జాగా లేకపోవడం గమనార్హం. ఆరు నెలలు గడిచినా.. హెరిటేజ్ శాఖ ఉత్తర్వులు జారీ అయి ఆరు నెలల కాలం గడిచిపోతున్నా కోట బురుజులు ఆనుకుని ఉన్న నిర్మాణాల తొలగింపుపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొత్త ఉత్తర్వుల్లో పట్టాదారుల స్థలా లకు హడావుడిగా వెకేంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసిన అధికారులు ప్రభుత్వ భూములను కాపాడటంతో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న అంశం ఎవరికి అంతుచిక్కడం లేదు. కోట బురుజుల వెంట ఆనుకుని నిర్మాణాలు జరిగిన సమయంలోనూ పలు మార్లు ఫిర్యాదులు వచ్చినా అప్పటి అధికారులు పట్టింపు చూపలేదు. హెరిటేజ్ డిపార్ట్మెంట్ కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో చర్యలు తీసుకుని కోరుట్ల మున్సిపల్ చిహ్నాలుగా నిలిచిన కోట బురుజులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
తెల్లారితే గల్ఫ్ పయనం.. అంతలోనే గుండెపోటు
జగిత్యాల జిల్లా: తెల్లారితే దుబాయ్ వెళ్లాల్సిన ఓ వలసకార్మికుడు.. పొలంలో పనిచేస్తుండగా గుండెపోటుకు గురై చనిపోయిన సంఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పంచతి గంగారెడ్డి (48) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. 25 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. కంపెనీ ఇచ్చిన సెలవులు పూర్తికావడంతో ఆదివారం తిరిగి దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. శనివారం తన పొలంలో కుటుంబసభ్యులతో కలిసి పనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గంమధ్యలో మృతిచెందాడు. గంగారెడ్డికికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండు రోజులుగా కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్న గంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. -
నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్
జగిత్యాల/మల్యాల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శని వారం జగిత్యాల కొండగట్టులో పర్యటించనున్నారు. గతంలో పవన్ కల్యాణ్ వారాహిపూజ సందర్భంగా కొండగట్టులో పర్యటించారు. కొండగట్టు అభివృద్ధికి కృషి చేస్తానని అప్పుడు హామీ ఇచ్చారు. ఈమేరకు ఇటీవల రూ.35.19 కోట్ల టీటీడీ నిధుల ను మంజూరు చేయించారు. ఆ నిధులతో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. పవన్ క ల్యాన్ హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు వెళ్లి ప్రత్యేక లపూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 9రోజుల పాటు హోమాలుజగిత్యాల: లోక కల్యాణార్థం జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీమాన్ నంబి నర్సింహ కౌశిక స్వామి పర్యవేక్షణలో తొ మ్మిది రోజుల పాటు హోమం నిర్వహిస్తున్నట్లు వేద పండితులు తెలిపారు. శుక్రవారం సంపుటీకరణ, శనివారం హనుమాన్ సుప్త హవనం, ఆదివారం హృదయ పారాయణ హవనం, సోమవారం నర్సింహ హవనం, మంగళవారం సుందరకాండ, బుధవారం లక్ష్మీనారాయణ ఇష్టి, గురువారం ఇష్టి మూల మంత్రహవనం, శుక్రవారం యాగం, మహాపూర్ణాహుతి ఉంటుందని వివరించారు. వేద పండితులు నంబి సత్యనారాయణ కౌశిక, నవీన్శర్మ, అజ్జు, అజయ్, భార్గవ్, వైభవ్, విష్ణు పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా మెలగాలిజగిత్యాలటౌన్: వసతి గృహ సిబ్బంది విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కె.రాజ్కుమార్ అన్నారు. షెడ్యూల్ కులాల వసతి గృహ ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం రూపొందించిన 2026 క్యాలెండర్ను శుక్రవారం జగిత్యాలలోని షెడ్యూల్ కు లాల శాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో షెడ్యూల్ కులాల వసతి గృహ పొరుగు సేవల సంఘం నాయకులు రాహుల్, శ్రీకాంత్, కొమురయ్య, లక్ష్మణ్, నరేశ్, స్వప్న, లలిత తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్లకు సత్వర సేవలుజగిత్యాలటౌన్: పెన్షనర్లకు సత్వర సేవలు అందిస్తామని జిల్లా ట్రెజరీ అధికారి సోఫియా అ న్నారు. తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రూపొందించిన 2026 టేబుల్, గోడ క్యాలెండర్లను శుక్రవారం ట్రెజరీ కార్యాలయంలో ఆవిష్కరించారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంతరెడ్డి, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, సంఘం ప్రతినిధులు అశోక్రావు, ప్రకాశ్రావు, యాకూబ్, సంజీవరావు, ట్రెజరీ సిబ్బంది పాల్గొన్నారు. నంచర్ల సహకార సంఘం సీఈవోకు అరుదైన అవకాశంపెగడపల్లి: పెగడపల్లి మండలం నంచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో రౌతు మధుకర్, స్టాఫ్ అసిస్టెంట్ దొనపాటి రాజశేఖర్లకు అరుదైన గౌరవం దక్కింది. సహకార సంఘంలో చేపడుతున్న కామన్ సర్వీసెస్ సెంటర్ల నిర్వహణ, ఎరువుల సరఫరా, ఎరువుల గోడౌన్ నిర్మాణం, ఎరువుల క్రయవిక్రయాలు, సంఘం ఆర్థికాభివృద్ది తదితర అంశాలపై సంఘం అందిస్తున్న కృషిని ప్రశంశిస్తూ జనవరి 26న న్యూ ఢిల్లీలో జరుగనున్న గణతంత్ర వేడుకలకు మధుకర్, రాజశేఖర్లు రావాలని ఆహ్వానం అందింది. టెట్ అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సుజగిత్యాలటౌన్: ఖమ్మం సెంటర్లో జరిగే టెట్ పరీ క్ష రాసే జగిత్యాల ప్రాంత అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్ సర్వీస్ నడుపుతున్న ట్లు జగిత్యాల డిపో మేనేజర్ కల్పన తెలిపారు. 92555 నంబర్ గల బస్ సర్వీస్ 3వ తేదీ రాత్రి 11.30గంటలకు జగిత్యాల నుంచి బయలు దేరుతుందన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ టికెట్లు బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. -
బియ్యం తీసుకోండయ్యా!
జగిత్యాలరూరల్: జిల్లాలోని రైస్మిల్లర్లు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ధాన్యం సేకరణతో పాటు, మరో వైపు ప్రభుత్వానికి బియ్యం అప్పగించాల్సి ఉండగా, ప్రభుత్వం బియ్యం సేకరణలో జా ప్యం చేస్తుండటంతో మిల్లర్లు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో రబీ 2024–25 సంవత్సరానికి గాను ఇచ్చిన ధాన్యానికి మిల్లర్లు 4.70 లక్షల మె ట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీంతో బియ్యం సేకరణ 2026 ఫిబ్రవరి 28లోపు అప్పగించాల్సిందిగా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కానీ బి య్యం ఇచ్చేందుకు మిల్లర్లు సుముఖంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు బియ్యం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు. మూతపడనున్న 90 పారాబాయిల్డ్ రైస్మిల్లులు జిల్లాలోని 90 మంది పారాబాయిల్డ్ రైస్మిల్లర్లు ప్రభుత్వానికి 2024–25 రబీ ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఇప్పటికే 2.35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించారు. మిగతా 2.35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉండగా, కేంద్ర ప్రభుత్వం పారాబాయిల్డ్ బియ్యాన్ని తీసుకునేందుకు నిరాకరిస్తోంది. రా రైస్ బియ్యాన్నే సేకరించాలని అధికారులకు ఆదేశాలు ఉండటంతో అధికారులు పారాబాయిల్డ్ రైస్ తీసుకోవడం లేదు. దీంతో పారాబాయిల్డ్ రైస్మిల్లర్లు రా రైస్ బియ్యం చేస్తే 50 శాతం నూక రావడంతో వారు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. తాము బాయిల్డ్ రైస్ అప్పగిస్తామని మిల్లర్లు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం రా రైస్ సేకరణకే సుముఖంగా ఉంది. దీంతో జిల్లాలోని పారాబాయిల్డ్ రైస్మిల్లులు మూతపడే అవకాశాలున్నాయి. భారంగా మారిన నిర్వహణ జిల్లాలోని 24 రా రైస్మిల్లులు, 90 పారాబాయిల్డ్ రైస్మిల్లుల నిర్వహణ యజమాన్యాలకు భారంగా మారింది. ఇప్పటికే రెండు నెలలుగా రైస్మిల్లులు నడవకపోవడంతో రైస్మిల్లుల్లో నిత్యం పనిచేసే హమాలీలు, ప్లాంట్ ఆపరేటర్లు, మెకానిక్లు అంతా వలస వెళ్లిపోతున్నారు. దీంతో మిల్లుల యజమానులకు విద్యుత్ బిల్లులతో పాటు, మిల్లుల నిర్వహణ భారంగా మారింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్కు అనుమతిస్తే తప్ప మిల్లులు నడిచే పరిస్థితి లేదు. దీనికి తోడు ప్రస్తుతం రైతుల వద్ద ఖరీఫ్కు సేకరించిన ధాన్యం కూడా రైస్మిల్లులకు కేటాయించడంతో రైస్మిల్లర్ల వద్ద భారీగా ధాన్యం పేరుకుపోయింది. 50 శాతం రా రైస్ తీసుకోవాలి జిల్లాలో బియ్యం సేకరణ కోసం కేంద్రం అనుమతించింది. 2026 ఫిబ్రవరి 28 వరకు మిల్లర్లు బియ్యం అప్పగించాల్సి ఉంది. ఇప్పటికే 2.35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించారు. మిగతా 2.35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రా రైస్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. మిల్లర్లు రా రైస్ ఇస్తే నష్టపోయే పరిస్థితి ఉందని వెనుకడుగు వేస్తున్నారు. – జితేందర్రెడ్డి, జిల్లా సివిల్సప్లయి అధికారి -
మహిళలే నిర్ణేతలు
జగిత్యాల: ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ మేరకు అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల వారీగా ఇప్పటికే ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఇందులో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. పురుషులు 1,12,898 ఉండగా, మహిళలు 1,21,015 ఉన్నారు. మహిళలే అత్యధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకం కానున్నాయి. ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించగా, అభ్యంతరాలు ఈనెల 5 వరకు స్వీకరించనున్నారు. తుది జాబితాను ఈనెల 10న రాజకీయ పార్టీల సమక్షంలో ప్రకటిస్తారు. తుది జాబితా విడుదలైన అనంతరం వార్డుల వారీగా ఎంత మంది ఓటర్లున్నారన్నది తెలుస్తుంది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ఓటర్ల ఆధారంగా పోలింగ్ కేంద్రాలను మ్యాపింగ్ చేయడంతో కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. జగిత్యాలలో 149, కోరుట్లలో 94, మెట్పల్లిలో 64 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదాను కలెక్టరేట్తో పాటు, ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం 5, 6 తేదీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి 10న తుది జాబితాను ప్రకటిస్తారు. ఇప్పటికే 2025 అక్టోబర్ 31న ప్రకటించిన ఓటరు జాబితా ఆధారంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో జగిత్యాలలో రెండు వార్డులు పెరుగగా, మిగతా మున్సిపాలిటీల్లో పెరగలేదు. నిబంధనల ప్రకారం 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. 800లకు మించి ఓటర్లు ఉండకూడదు. ఒకవేళ ఒక పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా ఓటర్లు ఉంటే మూడో కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఉండే ఓటర్లు ఒకే వార్డు, ఒకే పోలింగ్ కేంద్రం అన్న నిబంధన అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంట్లోని ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. ప్రతినిధుల చుట్టూ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్న భావనతో ఇప్పటికే అభ్యర్థులు ప్రధాన ప్రతినిధుల చుట్టూ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు కై వసం చేసుకుని చైర్మన్ సీటును కై వసం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల చైర్పర్సన్ బోగ శ్రావణి రాజీ నామా చేయగా, ఒక రెండు సంవత్సరాల పాటు ఇన్చార్జి ఉండగా, చివరి సంవత్సరంలో కాంగ్రెస్ వచ్చాక కాంగ్రెస్ మద్దతుతో అడువాల జ్యోతి ఎన్నికై ంది. ఎమ్మెల్యే సంజయ్కుమార్ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెబుతూ కాంగ్రెస్ వైపు కొనసాగుతున్నారు. ప్రస్తుతం తలనొప్పి అంతా కాంగ్రెస్లోనే ఉంది. బీఆర్ఎస్కు ప్రధాన నాయకులు లేనప్పటికీ మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్లో మాత్రం ఇటు ఎమ్మెల్యే సంజయ్కుమార్, అటు సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్రెడ్డి మధ్యనే పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. రిజర్వేషన్లపై ఆందోళన పాత రిజర్వేషన్లపై ఎన్నికలు జరుగుతాయా? మారుతాయా? అన్న ఆందోళనలో ఆశావహులు ఉన్నారు. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఏ విధంగా చేస్తారన్నది తెలియదు. ఆశావహులు రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించారు. ఈసారి జనరల్ వస్తే ఆశావహులు పోటీ చేయవచ్చని చూస్తున్నారు. మున్సిపాలిటీ మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు జగిత్యాల 96,411 46,794 49,596 21 కోరుట్ల 63,741 30,709 33,030 2 మెట్పల్లి 46,371 22,360 24,010 1 ధర్మపురి 14,222 6,826 7,393 3 రాయికల్ 13,195 6,209 6,986 0 మొత్తం 2,33,940 1,12,898 1,21,015 27 -
మెరుగైన సేవలు అందించాలి
జగిత్యాలరూరల్: ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సెక్షన్ 22ఏ అమలు పరిస్థితి, మైనర్ ఇరిగేషన్ సర్వే (బోర్లు, బావులు) సర్వే ప్రగతి, ఓటరు లిస్ట్ మ్యాపింగ్, కొత్త ఓటర్ల ఆడిట్ ప్రక్రియ, గ్రామాల వారీగా జీపీవోలో నమోదైన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఖచ్చితమైన డేటా నమోదు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్ సుజాత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
వివాదంలో చారిత్రక స్థలం
కోరుట్ల: క్రీ.శ.11వ శతాబ్దంలో జైన చాళుక్యుల కా లం నాటి కోట బురుజులు, కోనేరు పరిసర ప్రాంతాల స్థలం కోరుట్లలో చర్చనీయంగా మారింది. వందల ఏళ్లుగా పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న స్థలంపై కోట బురుజులు, కోనేరు మినహా మిగిలిన స్థలం పట్టాదారులకు చెందుతుందని ఇటీవల హె రిటేజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. కోట బురుజు, కోనేరును ఇక్క డ వైభవంగా విలసిల్లిన చారిత్రక, సంస్కృతి సంపదగా భావించిన స్థానికులు ఒక్కసారిగా ఈ స్థలంలో ముప్పాతిక వంతు పట్టాదారులకు చెందుతుందని ఉత్తర్వులు రావడంతో అయోమయంలో పడ్డా రు. ఈక్రమంలో కోరుట్ల భూ పరిరక్షణ ప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ స్థలం రెవెన్యూ రికార్డుల్లో అబాదీగా ఉందని ప్రజావసరాలకు వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర్వులతో కదలిక కోరుట్ల కోట బురుజులు, కోనేరుతో పాటు సుమారు 3.21 ఎకరాల స్థలం ఎనిమిది నెలల క్రితం వరకు పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని ఆంక్షలు అమలులో ఉండేవి. ఈ కారణంగా కోట బురుజుల సమీపంలో ఉన్న అనేక మంది మున్సిపల్ నుంచి ఇళ్ల నిర్మాణాలకు పర్మిషన్లు రాక అవస్థలు పడ్డారు. కోట బురుజులకు సుమారు 200 మీటర్ల పరిధిలో స్థలాలు ఉన్న పట్టాదారులు గత్యంతరం లేక మున్సిపల్ అనుమతులు లేకుండానే ఇళ్లు కట్టుకున్నారు. ఈక్రమంలో కోట బురుజులు, కోనేరు మినహా మిగిలిన స్థలంలో తమకు హక్కులున్నాయని పట్టాదారులు రెవెన్యూ, పురాతత్వ శాఖను ఆశ్రయించారు. ఈ సమస్య చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉండగా గతేడాది జూలై 3వ తేదీన హెరిటేజ్ శాఖ ఈ స్థలంలో ఉన్న కోట బురుజులు, కోనేరులు నిర్మించి ఉన్న స్థలం విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని 5,549 చదరపు ఫీట్ల స్థలం ప్రభుత్వానికి చెందుతుందని నిర్ధారించారు. మిగిలిన 8,984 ఫీట్ల స్థలం పట్టాదారులకు చెందుతుందని ఉత్తర్వుల్లో తెలిపా రు. ఈ ఉత్తర్వులతో ఏళ్ల తరబడి తమ పట్టా స్థలం కోసం ప్రయత్నిస్తున్న పట్టాదారులకు, ఈ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు మున్సిపల్ అనుమతులు లేక అవస్థలు పడ్డ వారికి ఊరట దక్కింది. ఎక్కడిక్కడే చిక్కులు హెరిటేజ్ శాఖ ఉత్తర్వులతో పట్టాదారులు తమ స్థలం స్వాధీనం చేసుకుని అమ్మకాలకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఎక్కడిక్కడే చిక్కులు ఎదురుకావడంతో మరోసారి కోట బురుజుల పరిసరాల స్థలం చర్చనీయంగా మారింది. ఈ స్థలంలో ఉన్న పట్టాదారుల మధ్య హద్దుల వివాదం నెలకొనడంతో మూడు రోజుల క్రితం కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయం సమీపంలో గొడవ జరిగినట్లు సమాచా రం. ఫలితంగా ఈ స్థలంలో భూ క్రయ విక్రయ రిజి స్ట్రేషన్లు తాత్కాలికంగా ఆపేసినట్లు కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ అశోక్ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ స్థలానికి మున్సిపల్ అఽధికారులు వీఎల్టీ న ంబర్ కేటాయించిన తీరు మరో వివాదానికి దారి తీసింది. దీనికి తోడు కోరుట్ల భూ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఈ స్థలం ఆబాదీగా నమోదైందని దీనికి వ్యక్తిగత యజమానులు లేరని, ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయరాదని సబ్ రిజిస్ట్రార్ అశోక్కు శుక్రవారం మరోసారి ఫిర్యాదు చేశారు. మొత్తం మీద రూ.కోట్ల విలువ చేసే కోరుట్ల కోట బురుజుల స్థలం అంశం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. -
సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనులకు సహకరించాలి
కథలాపూర్: సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులు సహకరించాలని కోరుట్ల ఆర్డీవో జివాకర్రెడ్డి కోరారు. కథలాపూర్ రైతు వేదికలో శుక్రవారం దుంపేట, చింతకుంట గ్రామాల భూనిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు కాలువ పనులకు సర్వే పూర్తయిందని, భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం ఇస్తామన్నారు మార్కెట్ ధర కంటే రెట్టింపు డబ్బులు ఇవ్వాలని పలువురు రైతులు కోరగా ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో తెలి పారు. తహసీల్దార్ వినోద్, సర్పంచ్ నాగం భూమ య్య, ఆర్ఐలు నాగేశ్, రవీందర్ పాల్గొన్నారు. -
కొండగట్టు ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించాలి
జగిత్యాల: కొండగట్టు ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శుక్రవారం శాసనమండలి సమావేశంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో రూ.100 కోట్లతో జీవో కూడా ఇచ్చినట్లు గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వపరంగా 600 ఎకరాల భూమిని కూడా కొండగట్టు ఆలయ పరిధిలోకి తీసుకువచ్చి కలెక్టర్ ద్వారా ప్రొసిడింగ్ సైతం ఇవ్వడం జరిగిందన్నారు. రోడ్లు, పార్కింగ్, తాగునీరు, మూత్రశాలలు, క్యూలైన్, భద్రత వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. -
రూ.7 కోట్ల పనులకు రూ.29 వేల రికవరీ
రాయికల్: రాయికల్ మండలంలోని 32 గ్రామాల్లో ఉపాధిహామీ పథకం పనులకు రూ.7,16,69,532 ఖర్చు కాగా, కేవలం రూ.29,870 రికవరీ జరిగినట్లు ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. శుక్రవారం రాయికల్లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలో మాట్లాడారు. 32 గ్రామాల్లో రూ.7,16,69,532 విలువ గల పనులు చేపట్టగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు డిసెంబర్ 24 నుంచి జనవరి 1వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి తనిఖీ చేపట్టారన్నారు. నివేదికను సమర్పించగా, ఈ పనులకు సంబంధించి కేవలం రూ.29,870 రికవరీ చేసినట్లు తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన టెక్నికల్ అసిస్టెంట్ రామును విధుల నుంచి తొలగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ మదన్మోహన్, ఎంపీవో సుష్మ, పీఆర్ ఏఈ ప్రసాద్, క్యూసీ మల్లికార్జున్, ఎస్ఆర్పీ దేవేందర్, కృష్ణారెడ్డి, ఏపీవో దివ్య, దేవేందర్రెడ్డి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలే అధికం
సాక్షిప్రతినిధి,కరీంనగర్: డిసెంబరు 31.. అంటేనే సంబరాల రోజు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికే దినోత్సవం వేళ.. మద్యం ఏరులై పారింది. అదేస్థాయిలో ప్రమాదాలకు కూడా కారణమైంది. డిసెంబరు 31న రాత్రి పూట 108 సిబ్బంది దాదాపు 216 మంది ప్రాణాలు కాపాడగా.. అందులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలే ఉన్నాయి. అందులోనూ మద్యంమత్తులో జరిగినవే అధికంగా ఉన్నాయని ఈఎంటీ సిబ్బంది వెల్లడించారు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో కొత్త సంవత్సరం సందర్భంగా పలు ఎమర్జెన్సీ కేసుల విషయంలో స్పందించిన సిబ్బంది పలువురి ప్రాణాలు కాపాడారు. 54 వాహనాలు, 108 మంది సిబ్బంది డిసెంబరు 31న రాత్రి మొత్తం 54 వరకు 108 అంబులెన్సుల్లో 108 మంది విధుల్లో ఉన్నారు. వీరిలో 54 మంది పైలెట్లు, 54 మంది ఈఎంటీలు ఉన్నారు. వాస్తవానికి పండగ రోజు, లోకమంతా సెలబ్రేషన్లలో మునిగి తేలుతున్నా.. అత్యవసర సేవలు కావడంతో వీరంతా విధినిర్వహణలోనే మునిగిపోయారు. ఈక్రమంలోనే 107 అత్యవసర కేసులు కాగా, 109 వరకు చిన్నా చితకా రోడ్డు ప్రమాదాల కేసులే అధికంగా నమోదవడం గమనార్హం. చిన్న రోడ్డు ప్రమాదాల్లోనూ 109 కేసుల్లో 90శాతం మద్యం వల్ల జరిగిన ప్రమాదాలే కావడం గమనార్హం. అదే రోజు రాత్రి ఉమ్మడిజిల్లాలో ప్రతీ చోటా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు జరిపినా.. తాగి వాహనాలు నడపవద్దని కోరినా.. మందుబాబుల్లో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. గర్భిణుల తరలింపు 36 తీవ్ర రోడ్డు ప్రమాదాలు 16 గుండెపోట్లు 32 శ్వాస సంబంధ వ్యాధులు 23 మైనర్ రోడ్డు ప్రమాదాలు 109 మొత్తం కేసులు 216సేవలోనే సంతృప్తి ప్రాణాలు కాపాడే ఎమర్జెన్సీ విదుల్లో పనిచేసే 108 సిబ్బందికి సేవలోనే సంతృప్తి. ముఖ్యంగా పండగలు, ప్రత్యేక రోజులలో ఖచ్చితంగా అందరూ విధుల్లో ఉండాల్సిందే. లేదంటే ప్రమాదాలలో గాయపడేవారిని, ఇతరత్రా ప్రమాదకర పరిస్థితుల్లో ఉ న్నవారిని కాపాడడం సాధ్యపడదు. 108 ప్రారంభం నుంచి నిర్విరామంగా మా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. – భూమా నాగేందర్, 108 ప్రోగ్రాం మేనేజర్, ఉమ్మడి కరీంనగర్ -
జగిత్యాల
28.0/13.0శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 20267గరిష్టం/కనిష్టంనృసింహస్వామికి మొక్కులుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహాస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. వాతావరణం ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుంది. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయి. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. -
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బీర్పూర్ మండలం తుంగూర్లో రూ.20 లక్షలతో నిర్మించే పంచాయతీ భవనానికి గురువారం భూమిపూజ చేశారు. గ్రామాల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. ఎంపీ అర్వింద్ సహకారంతో రోళ్లవాగుకు గేట్ల బిగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీకి స్థలం ఇస్తున్నట్లు సర్పంచ్ రాజగోపాల్రావు ఎమ్మెల్యేకు అఫిడవిట్ సమర్పించారు. పంచాయతీరాజ్ శాఖ డీఈ మిలింద్, ముప్పాల రాంచందర్రావు, ఉపసర్పంచ్ శీలం లింగన్న పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారమవుతోందని ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో రూరల్ మండలానికి చెందిన 83 మందికి ఇళ్ల ప్రొసీడింగ్లు పంపిణీ చేశారు. జగిత్యాల రూరల్ మండలానికి 794 ఇళ్లు మంజూరయ్యాయని, 529 పనులు సాగుతున్నాయని, 408 ఇళ్ల లబ్ధిదారులకు వారివారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. మండల ప్రత్యేకాధికారి నరేశ్, ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు, సర్పంచులు, ఉపసర్పంచులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
అభ్యంతరాలు స్వీకరణ
జగిత్యాల/కోరుట్ల/మెట్పల్లిరూరల్/ధర్మపురి/రాయికల్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఓట ర్ ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. వార్డుల వారీగా ఓటర్ల లెక్కను సరిచేశారు. ఓటర్ల ఆధారంగా పోలింగ్ కేంద్రాలను మ్యాపింగ్ చేయడంతో కొన్ని బల్దియాల్లో పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. జగిత్యాలలో 149, కోరుట్లలో 94, మెట్పల్లిలో 64 కేంద్రాలుగా గుర్తించారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదాను కలెక్టరేట్, ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. మూడురోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి.. 5, 6 తేదీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి.. ఈనెల 10న తుది జాబితాను ప్రకటించనున్నారు. నిబంధనల ప్రకారం 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున గుర్తించారు. 800కు మించి ఓటర్లు ఉండకూడదు. ఒకవేళ ఒక పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా ఓటర్లు ఉంటే మూడో కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు. ఒకే కుటుంబంలో ఉండే ఓటర్లు ఒకే వార్డు, ఒకే పోలింగ్ కేంద్రం అన్న నిబంధన అమలు చేస్తున్నా రు. ఓటరు పేరు, ఇతరత్రా తప్పొప్పులు, చిరునా మాలో మార్పులుంటే మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరించి, పరిశీలించి వెంటనే పరిష్కరిస్తారు. జాబితా విడుదల కార్యక్రమంలో మెట్పల్లిలో మున్సిపల్ కమిషనర్ మోహన్, మేనేజర్ వెంకటలక్ష్మీ, డిప్యూటీ ఈఈ నాగేశ్వర్రావు, టీపీవో రాజేంద్రప్రసాద్, ధర్మపురిలో మున్సిపల్ మేనేజర్ బాలె గంగాధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్, మెప్మా సిబ్బంది, కోరుట్లలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, అధికారులు పాల్గొన్నారు. వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల పెరిగిన పోలింగ్ కేంద్రాలు 5, 6తేదీల్లో రాజకీయ పార్టీలతో సమావేశంబల్దియా వార్డులు ఓటర్లు పోలింగ్ కేంద్రాలు ధర్మపురి 15 14,222 24 జగిత్యాల 50 96,410 149 రాయికల్ 12 13,195 24 కోరుట్ల 33 63,741 94 మెట్పల్లి 26 46,371 64 -
ట్రాఫిక్ నియమాలు పాటించాలి
జగిత్యాల: ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టరేట్లో గురువారం ఆవిష్కరించారు. ప్రయాణీకులు భద్రత పాటించాలన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారించడంలో అవగాహన, క్రమశిక్షణ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్ పాల్గొన్నారు. అంజన్న సన్నిధిలో మంత్రి అడ్లూరి, విప్ ఆది పూజలుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వారికి స్వామివారి తీర్థ, ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. అథ్లెటిక్స్ పోటీలకు భూషణరావుపేట విద్యార్థికథలాపూర్: మండలంలో ని భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థి అభినందన్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ నవీన్కుమార్ తెలిపారు. ఇటీవల మండలంలోని ఊట్పెల్లిలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అభినందన్ రెండోస్థానం దక్కించుకున్నాడు. హైదరాబాద్లో జరిగే పోటీల్లో రన్నింగ్ విభాగంలో జిల్లా జట్టు తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు. అభినందన్ను సర్పంచ్ బద్దం మహేందర్రెడ్డి, హెచ్ఎం రాజయ్య అభినందించారు. సుఖశాంతులతో జీవించాలిమల్లాపూర్: కొత్త సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నిండాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు చిట్యాల లక్ష్మణ్, తోట శ్రీనివాస్, రైతుబంధు జిల్లా కమిటీ మాజీ సభ్యుడు దేవ మల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముద్దం శరత్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామిగౌడ్, నాయకులు పాల్గొన్నారు. -
న్యూ ఇయర్ కిక్కు
జగిత్యాలక్రైం: జిల్లాలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యంప్రియులు తెగ తాగేశారు. జిల్లాలోని 71 వైన్స్షాపులు, 21 బార్లలో డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.8.07 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ నెల మొత్తంగా రూ.112,53,37,463 మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ మొత్తం రూ.73,38,63,772 అమ్మకాలు జరిగాయి. ఈసారి రూ.39,14,73,691 అమ్మకాలు పెరిగాయి. పోలీసు శాఖ మూడు రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. మద్యంప్రియులు అవేం పట్టించుకోకుండా భారీగా మద్యం కొనుగోలు చేసి వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. 138 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు ప్రత్యేక బృందాలతో జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం వేకువజాము 5 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో 138 మందిని మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. మద్యం షాపులకు కలిసివచ్చిన డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.8.07కోట్ల మద్యంఅమ్మకాలుఈ సారి మద్యం అమ్మకాలు పెరిగాయి డిసెంబర్ మొత్తంగా రూ.112.53 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది గతంలో కంటే రూ.39.14 కోట్ల అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 31నే రూ.8.07 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. – సర్వేశ్, ఎకై ్సజ్ సీఐ, జగిత్యాల -
ఆశావహుల సందడి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో 15 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలు కాగా.. మిగిలినవి పురపాలికలు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు కసరత్తు ప్రారంభించడంతో మున్సిపాలిటీలలో ఎన్నికల జోష్ కనిపిస్తోంది. ఆశావహుల సందడితో పట్టణాలు, నగరాల్లో రాజకీయ సందడి నెలకొంది. నిన్నటివరకు పల్లెపోరు కారణంగా పట్టణాల్లో మౌనంగా ఉన్న రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు రంగంలోకి దిగారు. బల్దియాల పరిధిలో ప్లెక్సీలు వెలుస్తుండటంతో ఎన్నికల హడావుడి మొదలైనట్లే అనిపిస్తోంది. మున్సిపాలిటీల్లోని ప్రతివార్డు, డివిజన్లోనూ తానే అభ్యర్థిని అన్నట్టు ఆశావహుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా శుభాకాంక్షల బ్యానర్లు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఏకాదశి, కొత్త ఏడాది, సంక్రాంతి వంటి పండుగలను వేదికగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. శుభాకాంక్షలతో పాటు పరిచయం పెంచుకోవడం అనే వ్యూహంతో ఇంటింటికీ తిరుగుతూ నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు పంచుతూ.. తమ ఉనికిని గుర్తు చేస్తున్నారు. ఇది కేవలం పండుగల శుభాకాంక్షలు మాత్రమే కాకుండా.. రాబోయే ఎన్నికలకు రిహార్సల్లా మారింది. పార్టీలకు ప్రతిష్టాత్మకం ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆటుపోట్లను చవిచూసిన పార్టీలు.. మున్సిపల్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బల్దియాల్లో పాగా వేసేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే పక్కాప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి జోష్ మీదున్న అధికార కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికలపైనా ధీమాగా ఉంది. గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీల్లో తామేం తక్కువ కాదన్నట్లు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక బీజేపీ పంచాయతీ ఎన్నికలో ఊహించిన దానికన్నా ఎక్కువ బలం పెంచుకుని మున్సిపాలిటీలపై కన్నేసింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆశావహుల గల్లీ బాట ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించి.. పోటీ చేసే ఆశావహులు గల్లీల బాట పట్టారు. ఉదయం ఆలయ దర్శనాలు.. మధ్యాహ్నం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం.. సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు. ఇదే రోజువారీ షెడ్యూల్గా మారింది. ప్రజల సమస్యలు వింటూ.. చిన్నచిన్న హామీలు ఇస్తూ తమపై సానుకూల అభిప్రాయం ఏర్పడేలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. పార్టీ పెద్దల కంట్లో పడేందుకు చేస్తున్న తాపత్రయం మరోస్థాయికి చేరుతోంది. జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే దానిపై ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ప్రజల్లో బలం చూపించాలి. మరోవైపు పార్టీ హైకమాండ్కు నమ్మకం కలిగించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించేందుకు వారు విశేషంగా శ్రమిస్తున్నారు. కొందరు ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో ముందుండగా.. మరికొందరు సేవా కార్యక్రమాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.బల్దియా వార్డులు జనాభా ఎస్టీ ఎస్సీ కరీంనగర్ 66 3,28,870 5,999 36,902 (కార్పొరేషన్) రామగుండం 60 2,37,636 4,278 50,744 (కార్పొరేషన్) ధర్మపురి 15 17,423 200 2,079 జగిత్యాల 50 83,168 547 5,229 కోరుట్ల 33 69,479 342 6,467 మెట్పల్లి 26 54,042 504 5,819 రాయికల్ 12 15,308 179 1,766 చొప్పదండి 14 16,459 205 3,062 హుజూరాబాద్ 30 34,555 309 6,326 జమ్మికుంట 30 39,476 286 7,623 మంథని 13 18,282 208 2,513 పెద్దపల్లి 36 50,762 312 4,527 సుల్తానాబాద్ 15 19,772 309 2,561 సిరిసిల్ల 39 92,091 104 6,346 వేములవాడ 28 43,620 453 6,545ప్రభుత్వపరంగా ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా కీలకంగా మారాయి. కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతోపాటు జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని పురపాలికల ఎన్నికలపై ప్రజల అభిప్రాయం, స్థానిక సమస్యలు, అధికార పార్టీపై ఉన్న సంతృప్తి.. లేదా అసంతృప్తి వంటి అంశాలను సేకరించేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. తొలి విడత సర్వే పూర్తయ్యిందని, రెండో విడతకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రూపకల్పన చేయనున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఆయా పార్టీలు ప్రైవేటు సర్వేలు చేయిస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలతో వార్డులు, డివిజన్లలో సర్వేలు చురుకుగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. రాజకీయంగా మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆశావహుల సందడి, పార్టీ వ్యూహాలు, ప్రభుత్వ సర్వేలు.. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల సమరం మొదలైనట్టే అనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
హ్యాపీ న్యూఇయర్
జగిత్యాలక్రైం: కొత్త సంవత్సరం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ కేక్ కట్ చేశారు. ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్శాఖలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టామని, సిబ్బంది పూర్తిస్థాయి నిబద్ధతతో విధులు నిర్వర్తించారని తెలిపారు. జిల్లాలో న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ తెలిపారు.డ్రంకెన్డ్రైవ్లో మొత్తం 138మందిని పట్టుకున్నట్లు వివరించారు. అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు కరుణాకర్, నీలం రవి, రాంనర్సింహారెడ్డి, సుధాకర్, ప్రవీణ్, ఆరీఫ్ అలీఖాన్, ఎస్సైలు పాల్గొన్నారు. జగిత్యాల: ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కలెక్టరేట్లో అధికారులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా అధికారులందరూ అదే ఉత్సాహంతో పనిచేసి 2026లో కూడా మంచి పేరు తీసుకురావాలన్నారు. అందరూ యోగా, వ్యాయామం చేయాలని, ఉదయం నడవాలని, ప్రతిరోజు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందరికీ శుభం కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్రెడ్డి, జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి పాల్గొన్నారు. -
కొత్త సంవత్సరంలో శుభాలు కలగాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యం, సుఖశాంతులు, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించా రు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు లో ప్రజల సహకారం కొనసాగాలని, జిల్లా అన్ని రంగాల్లో ముందుకు నడిపేందుకు అధి కారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. యావర్రోడ్ విస్తరిస్తాంజగిత్యాల: కొత్త సంవత్సరంలో యావర్రోడ్ విస్తరించేలా కృషి చేస్తానని, జిల్లాకేంద్రంలో మరో 230 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక తీసుకుంటానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడారు. ముందుగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏళ్లుగా సమస్య అయిన యావర్రోడ్ను ఈ సంవత్సరంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని, మెడికల్ కళాశాలకు అనుబంధంగా మరో 230 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసేలా చూస్తానని వెల్లడించారు. కేంద్రీయ విద్యాలయం, ఇంటిగ్రేటెడ్ స్కూల్, మినీస్టేడియం పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఇటీవల సీఎం చొరవతో జగిత్యాల బల్దియాకు మంజూరైన రూ.62 కోట్లతో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లా కేంద్రంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీతోపాటు, ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ కాలనీలో వసతులు ఏర్పాటు చేస్తానన్నారు. -
‘టెట్’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● 160 మంది అభ్యర్థులు ● అదనపు కలెక్టర్ లత జగిత్యాల: ‘టెట్’ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. నాచుపల్లి జేఎన్టీయూలో ఈనెల 4న నిర్వహించే పరీక్షకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మొత్తం 160 మంది అభ్యర్థులకు కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఉదయం 9 గంటల నుంచి 11.30, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు పరీక్ష ఉంటుందని, పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తుతోపాటు, 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. కంప్యూటర్స్, జనరేటర్, ఇతర వసతులు కల్పించాలన్నారు. డీఈవో రాము, డీఎం కల్పన, డీఎంహెచ్వో సుజాత, జేఎన్టీయూ చీఫ్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు. రోళ్లవాగు నుంచి సాగునీరు అందేలా కృషిజగిత్యాలరూరల్: రోళ్లవాగు నుంచి ఆయకట్టుకు సాగునీరు అందేలా కృషిచేస్తానని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ఆరుగుండాల ప్రాజెక్ట్ను రైతులతో కలిసి బుధవారం పరిశీలించారు. రోళ్లవాగు అభివృద్ధి, ఆరుగుండాల ప్రాజెక్ట్ పనులకు నిధులు మంజూరయ్యేలా చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ఫోన్లో కోరారు. ఆరుగుండాల ప్రాజెక్ట్కు రోళ్లవాగు నుంచే నీరు రావాల్సి ఉందని, వాగుపై ఆధారపడిన రైతులు సుమారు 100కు పైగా మోటార్లు పెట్టుకోవడం ద్వారా నీరు చివరి ఆయకట్టుకు చేరడం ఇబ్బందిగా ఉందన్నారు. వారం రోజులుగా విడుదలవుతున్న నీరు సరిపోవడం లేదని, ఆరుగుండాల ప్రాజెక్ట్లో నీరు చేరాలంటే మరో రెండు రోజులు విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
మున్సిపోల్స్ సందడి
జగిత్యాల: మున్సిపాలిటీల్లో మున్సిపోల్స్ సందడి మొదలైంది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఇటీవలే పంచాయతీ పోరు ముగియడంతో ప్రభుత్వం బల్దియాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాల పథకాల కింద రావాల్సిన గ్రాంట్లు, ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవడంతో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మున్సిపాలిటీల ఎన్నికలకు సమయాత్తం అవుతోంది. అధికారులు ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల సమాచారం, మున్సిపాలిటీలవారీగా పునర్విభజన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల ఒకటో తేదీన వార్డులు, పోలింగ్ కేంద్రాల వారిగా ముసాయిదా ఓటర్ల జాబితా తయారు చేసి అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం నోటీస్ బోర్డులో ఉంచనున్నారు. ఈనెల 5న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 6న జిల్లాస్థాయి సమావేశం ఏర్పాటు చేసి.. 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను రూపొందించనున్నారు. ఆశావహుల్లో సందడి మున్సిపల్లో ఓటరు జాబితా రూపొందిస్తున్న నేపథ్యంలో కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయన్న భావనలో కొందరు కౌన్సిలర్లుగా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆశావహ అభ్యర్థుల్లో సందడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించడంతో నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వార్డుల్లో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వివిధ పనులు చేపడుతున్నారు. నిలబడే అభ్యర్థులు కాలనీల్లో వాటర్, డ్రైనేజీ, వీధిలైట్ల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. ఎలాగైనా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో ఇప్పటినుంచే ప్రతి ఇంటింటికీ తిరుగుతున్నారు. జగిత్యాలలో 48 వార్డులు ఉండగా.. ఈసారి రెండు వార్డులు పెరిగాయి. మిగతా మున్సిపాలిటీల్లో యథావిధిగా ఉన్నాయి. పురపాలకల్లో పాత రిజర్వేషన్ల ప్రకారమా..? రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు ఉంటాయా..? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతమైతే అధికారులు ఓటర్ల వారిగా జాబితాను రూపొందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తాజామాజీ పాలకవర్గ సభ్యులతోపాటు, గతంలో ఓడిపోయిన అభ్యర్థులు ప్రచారంలోకి దిగుతున్నారు. రిజర్వేషన్లు రాకముందే అనుకూలిస్తాయన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన వారు వారు చేసిన అభివృద్ధిని చూపుతూ ముందుకెళ్తున్నారు. ప్రత్యేక పాలనలో.. జిల్లాలో పురపాలక సంఘాల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది అవుతోంది. 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 2025 జనవరితో ముగిసిపోయింది. అప్పటినుంచి ప్రత్యేక పాలనలోనే కొనసాగుతోంది. అప్పటినుంచి అభివృద్ధి కూడా అంతంతమాత్రంగానే ఉంది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఎవరైనా కాలనీల్లో సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. వీధిలైట్లు వెలగకున్నా.. డ్రైనేజీలు తీయకున్నా.. సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుందామన్నా.. ఇంటి అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు జరిగి కొత్త కౌన్సిలర్లు వస్తే కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. -
ప్రారంభానికి సదర్మాట్ సిద్ధం
● గోదావరి నదిపై నిర్మాణం ● 676.50 కోట్లతో పనులు ● 18వేల ఎకరాలకు సాగునీరు ● త్వరలో సీఎం చేతులమీదుగా ప్రారంభం?ప్రాజెక్టు వివరాలుఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్.. నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామాన్ని కలుపుతూ గోదావరిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ కమ్ బ్రిడ్జి పూర్తయ్యింది. 2016లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.676.50 కోట్లతో శ్రీకారం చుట్టింది. 1.58 టీఎంసీల నీటి సామర్థ్యంతో జగిత్యాల, నిర్మల్ జిల్లాలోని 18వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలన్నది లక్ష్యం. ప్రాజెక్టు పనులకు 2017లో అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులను దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ముందుగా పనులు నత్తనడకన చేసినప్పటికీ.. తర్వాత వేగవంతం చేశారు. మొత్తంగా తొమ్మిదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేశారు. ప్రాజెక్టుతో లాభాలు గోదావరిపై జగిత్యాల, నిర్మల్ జిల్లాల సరిహద్దున 55 గేట్లతో ఈ సదర్మాట్ ప్రాజెక్టు కమ్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు జిల్లాలోని సుమారు 18వేల ఎకరాలకు సాగునీరందనుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లోని 13 వేల ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని గంగనాల ప్రాజెక్టు ద్వారా 5వేల ఎకరాలకు నీరు అందించనున్నారు. అలాగే నిర్మల్ జిల్లాలోని వివిధ గ్రామాలకు వెళ్లేందుకు దూరభారం తగ్గనుంది. ప్రా జెక్టు నిర్మాణంతో ఎస్సారెస్పీ నుంచి గోదావరి ద్వా రా వచ్చే నీటిని సదర్మాట్ ప్రాజెక్టు వద్ద గేట్లు మూసి నిల్వ చేయనున్నారు. తద్వారా ప్రాజెక్టు వెనుక ఉండే మూలరాంపూర్, ఎర్దండి, కోమటికొండాపూర్ వైపు సుమారు 14కిలోమీటర్ల మేర నీటిని నిల చేయనున్నారు. ఫలితంగా భూగర్భజలాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో 1.58 టీఎంసీల నీరు నిల్వ ఉండి.. నిండుకుండను తలపిస్తోంది. ఎర్దండి, కోమటికొండాపూర్ వద్ద పుష్కరఘాట్లు మునిగిపోయాయి. ప్రాజెక్టు పక్కనుంచి బ్రిడ్జి నిర్మించడం ద్వారా జగిత్యాల జిల్లా నుంచి నిర్మల్ జిల్లా పొన్కల్ వైపు వెళ్లెందుకు దూరభారం తగ్గుతుంది. 370 ఎకరాలు ముంపు ప్రాజెక్టు కింద ఇబ్రహీంపట్నం మండలంలోని మూ లరాంపూర్, ఎర్దండి, కోమటికొండాపూర్ గ్రామాల పరిధిలో సుమారు 370 ఎకరాలు ముంపునకు గురైంది. నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించడంతో రైతులు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించారు. ప్రారంభానికి సిద్ధం చేస్తున్న అధికారులు సదర్మాట్ బ్యారేజీ కమ్ బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ఇప్పటికే శిలఫలకం అమర్చేందుకు పైలన్, హెలిపాడ్లు నిర్మించారు.ప్రారంభానికి ఏర్పాట్లు ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. – సురేందర్, సదర్మాట్ ప్రాజెక్టు డీఈ -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు ● పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం మెట్పల్లి రూరల్: మున్సిపల్ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు. మెట్పల్లి పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తలతో బుధవారం సమావేశమయ్యారు. బల్దియాల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో పట్టణాల్లో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతి వార్డులోనూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కోరారు. -
ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే
కోరుట్ల: ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడేది సీపీఐ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. పార్టీ శత వసంతాల వార్షికోత్సవాల్లో భాగంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ కోరుట్లలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ వద్దగల అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి ర్యాలీ ప్రారంభించారు. సీ.ప్రభాకర్ స్మారక గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సీపీఐ చేసిన పోరాటంలో ఐదువేల మంది అమరులయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే శత జయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి చెన్నా విశ్వనాథం, రాష్ట్ర నాయకుడు తాళ్లపల్లి లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సుతారి రాములు, ఎండీ.మౌలానా, ముఖ్రం తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
రాయికల్: కేక్ కట్ చేస్తున్న మహిళలుహ్యాపీ న్యూఇయర్..న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం జిల్లాలోని స్వీట్షాపులు, బేకరీలు, చికెన్, మటన్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి. రెస్టారెంట్లు, ఫుడ్కోర్టులు, బేకరీలు, స్వీట్ షాపులు స్పెషల్ ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడింది. పలు పాఠశాలలు న్యూఇయర్ వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాయి. రాయికల్లో మహిళలు కేక్ కట్ చేశారు. – జగిత్యాలటౌన్/రాయికల్ -
చిట్టీ డబ్బులు అడిగినందుకు దారుణహత్య
జగిత్యాలక్రైం: చిట్టీ డబ్బులు అడినందుకు కొలగాని అంజయ్య (55)ను దారుణంగా హత్య చేశారు. జగిత్యాలలోని గోవిందుపల్లి కి చెందిన అంజయ్య మెస్తోపాటు, చిట్టీలు నిర్వహిస్తాడు. గణేశ్నగర్కు చెందిన శ్రీనివాస్ ఇటీవల చిట్టీ ఎత్తుకుని డబ్బులు చెల్లించకపోవడంతో బుధవారం రాత్రి గణేశ్నగర్లోని కమాన్ వద్దగల కాఫీ సెంటర్ వద్ద శ్రీనివాస్ కనిపించడంతో చిట్టీ డబ్బులు చెల్లించాలని అంజయ్య ఒత్తిడి చేశారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకోగా.. శ్రీనివాస్ తన కుమారునికి ఫోన్ చేసి రమ్మన్నాడు. శ్రీనివాస్ కుమారుడు తీవ్ర ఆగ్రహంతో వచ్చి అంజయ్యపై విచక్షణారహితంగా దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన అంజయ్యను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యలో ఎంతమంది ప్రమేయం ఉందన్న విషయంపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మల్లాపూర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చిట్టాపూర్–ధర్మారం గ్రామాల మధ్య బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని ఉమ్రి మండలకేంద్రానికి చెందిన నామ్లవర్ బాలాజీ(40) తన కుటుంబంతో బతుకుదెరువు కోసం రాయికల్ మండలం ఇటిక్యాలకు నాలుగేళ్ల క్రితం వలస వచ్చాడు. బట్టలు ఉతుకుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉపాధి కోసం తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చిట్టాపూర్–ధర్మారం గ్రామాల మధ్య రహదారిపై బైక్ ఆదుపుతప్పి కందకంలో పడిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
కారు ఢీకొని మహిళ దుర్మరణం
ఇబ్రహీంపట్నం: మండలంలోని అమ్మక్కపేట క్రాసింగ్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాళ్లపల్లి లక్ష్మీ (55) మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన శిరోజ్కుమార్ తన తల్లి లక్ష్మీతో కలిసి ద్విచక్రవాహనంపై వర్షకొండలోని వారి బంధువు ఇంటికి వెళ్లారు. తిరిగి సిరికొండకు వెళ్తుండగా అమ్మక్కపేట వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ఘటనలో లక్ష్మీ, శిరోజ్కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని మెట్పల్లి ఆస్పత్రికి తరలించగా.. లక్ష్మీ మృతిచెందింది. కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
రెండేళ్లుగా ‘హానీట్రాప్’ దందా..!?
● బాధితులు ఎందరో.. ● నిందితుల్లో ముగ్గురు రిమాండ్.. ● మరింత లోతుగా విచారణమెట్పల్లిరూరల్: మూడురోజుల క్రితం మెట్పల్లి లో వెలుగుచూసిన హానీట్రాప్ దందాలో లెక్కలేని మంది బాధితులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రెండేళ్లుగా ఈ ముఠా తమ దందాను కొనసాగించినట్లు సమాచారం. ముఠాలో ముగ్గురిని బుధవారం సాయంత్రం పోలీసులు రిమాండ్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కిన అనంతరం తిరిగివస్తామని చెప్పి జాడలేకుండా పోయినట్లు తెలుస్తోంది. వీరు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే యత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. రెండేళ్లుగా దందా మెట్పల్లిలో వెలుగుచూసిన హానీట్రాప్ దందా సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు సమాచారం. నిందితుని సెల్ఫోన్లో పదుల సంఖ్యలో వీడియోలు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో బాధితుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హానీ ట్రాప్లో చిక్కుకుపోయిన నిందితులు తమ పరువు ఎక్కడ పోతుందన్న భయంతో ఈ ముఠా అడిగినంత మేర డబ్బులు చెల్లించి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కొంత మంది వ్యాపారులు, రియల్టర్లు, చిన్నాచితక లీడర్లు ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి రావడంతో కొంతమంది బాధితులు పోలీసులను కలిసి తాము కూడా మోసపోయామని చెప్పుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ఈ వ్యవహారంపై వేగవంతంగా.. లోతుగా విచారణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. నిందితుల సెల్ఫోన్లను పూర్తిస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించే యత్నాల్లో ఉన్నారు. నిందితుల్లో ఒకరి సెల్పోన్లో సుమారు రూ.20 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్రౌడీషీటర్ నేతృత్వంలో హానీట్రాప్ దందాకు తెరలేపి.. ఉచ్చులో పడిన వ్యాపారుల నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని సీఐ అనిల్కుమార్ తెలిపారు. బుధవారం మెట్పల్లి సర్కిల్ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని దుబ్బవాడకు చెందిన కోరుట్ల రాజ్కుమార్ ఆలియాస్ రాజు రౌడీషీటర్. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒంటరిగా ఉంటున్న బల్మూరి స్వప్నతోపాటు బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్(రౌడీషీటర్), మాగని దేవనర్సయ్యతో ముఠా ఏర్పాటు చేశాడు. ఒక గదిని అద్దెకు తీసుకుని స్వప్నతో ధనవంతులైన వ్యాపారులకు ఫోన్ చేయించి కవ్వించి ట్రాప్ చేయించేవారు. స్వప్న ట్రాప్లో పడినవారిని గదికి పిలిపించి వారి నగ్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షలు వసూలు చేస్తున్నారు. మూడు నెలల క్రితం ఒక వ్యాపారిని టార్గెట్ చేసి డిసెంబర్ 28న గదికి పిలిపించి నగ్న వీడియోలు తీసి రూ.10లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. బాధిత వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో కేసు దర్యాప్తు చేయగా, ముఠా గుట్టురట్టయింది. రౌడీషీటర్ రాజ్కుమార్, బల్మూరి స్వప్న, మాగని దేవనర్సయ్యను అరెస్టు చేశామని, బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్ పరారీలో ఉన్నారని సీఐ అనిల్కుమార్ తెలిపారు. మెట్పల్లి ఎస్సై కిరణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గత కొంతకాలంగా విచ్చలవిడిగా సాగుతున్న హనీ ట్రాప్ దందాకు పోలీసులు బ్రేక్ వేశారు. ధనవంతులు, వ్యాపారులను టార్గెట్ చేసి ఉచ్చులో పడేసి నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ప్రధాన సూత్రధారి రాజుకుమార్, స్వప్నతో పాటు కొందరు రౌడీ షీటర్ల సహకారంతో ఈ దందాను నిర్వహిస్తున్నాడు. పట్టణంలో ఉన్న ధనవంతులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని, పరిచయాలు పెంచి వారిని ఓ ఇంటికి లేదా లాడ్జ్కు రప్పించి హనీ ట్రాప్లోకి దించేవారు. అనంతరం రహస్యంగా నగ్న వీడియోలు తీసేవారు. వాటిని బయటపెడతామంటూ బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేశారు.ఇటీవల ఈ ముఠా మెట్పల్లికి చెందిన ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. కాగా వీరి బెదిరింపులు తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గుట్టుగా దర్యాప్తు చేపట్టారు. ముఠా కార్యకలాపాలపై నిఘా పెట్టారు. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు అయిన వారి నుంచి మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డులు సహా ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. ఈ తరహా బ్లాక్మెయిల్ ఘటనలపై ప్రజలు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మెట్పల్లి పట్టణంలో కలకలం రేపిన ఈ హనీ ట్రాప్ కేసు, ఇలాంటి నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారనే సందేశాన్ని ఇచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
కూచిపూడిలో గిన్నీస్రికార్డ్
జగిత్యాలరూరల్:హైదరాబాద్లోని గచ్చిబౌళిలో ఇటీవల భరత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కూచిపూడి నృత్యం గిన్నీస్ రికార్డ్ సాధించింది. నృత్యంలో సారంగాపూర్ మండలం పెంబట్ల, లక్ష్మీదేవిపల్లికి చెందిన తూడూరి కేదారి వేద్య, బండారి సమన్వి, మంద నిత్యశ్రీ, నినుగుర్తి మనుశ్రీ, పసుపునూటి రుచెరిత, శనిగారపు మనస్వి పాల్గొన్నారు. వీరంతా కూచిపూడి కోచ్ గుండి యమున ఆధ్వర్యంలో నృత్యంలో పాల్గొన్నారు. -
బాధితులకు న్యాయం అందించాలి
జగిత్యాలటౌన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అధికారులను ఆదేశించారు. ఎస్టీకులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీతో సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, బాధితులకు జరిగిన న్యాయంపై చర్చించారు. జిల్లాలో 227 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధిత కుటుంబాలకు రూ.17,93,700 మంజూరు చేశామని, పెండింగ్లో ఉన్న 166 కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే చెల్లిస్తామని తెలిపారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్గౌడ్, డీఎస్పీ రఘుచందర్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రాజ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ తదితరులు ఉన్నారు. ఓటరు జాబితాపై కసరత్తుజగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుండడంతో అధికారులు ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు. బల్దియాల్లో ఓటరు జాబితాను సవరిస్తున్నారు. జగిత్యాలలో 50వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా కసరత్తు చేస్తున్నారు. జనవరి ఒకటిన పట్టణ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా ప్రకటించనున్నారు. వచ్చేనెల 5న మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఐఎంఏ జిల్లా శాఖకు అవార్డుజగిత్యాల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. మంగళవారం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో నిర్వహించిన ఐఎంఏ జాతీయస్థాయి సదస్సులో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్రెడ్డి పురస్కారం అందుకున్నారు. రక్తదాన శిబిరాలు, వ్యాక్సినేషన్ డ్రైవ్, రక్తహీనత నివారణ కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, వైద్యుల కోసం నిర్వహించిన శాసీ్త్రయ సమ్మేళనాలతో పాటు, ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. వీటన్నిటిని జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుని పురస్కారాన్ని ప్రదానం చేసింది. జాతీయస్థాయి ప్రతినిధుల చేతుల మీదుగా అందించారు. నృసింహుడికి 10 కిలోల వెండి వస్తువులు బహూకరణ ధర్మపురి: ధర్మపురికి చెందిన గుండె వైద్య నిపుణుడు కస్తూరి శ్రీధర్, సునీత దంపతులు నృసింహ స్వామివారికి 10 కిలోల వెండితో తయారుచేసిన పాదపీటను మంగళవారం బహూకరించారు. ముక్కోటి వేడుకలకు హాజరైన సందర్భంగా స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు దంపతులను సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
ముక్కోటి మొక్కులు..
మల్యాల: శ్రీవేంకటేశ్వరస్వామికి పూజలు చేస్తున్న కలెక్టర్ దంపతులు వాల్గొండలోని ఆలయ గర్భగుడిలో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వరస్వామి కోరుట్ల: అష్టలక్ష్మీ దేవాలయంలో.. ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తున్న స్వాములను వీక్షిస్తున్న భక్తులుజగిత్యాల/కోరుట్ల/ధర్మపురి/జగిత్యాలటౌన్/మల్యాల/మల్లాపూర్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాకేంద్రంలో ని ధరూర్ క్యాంపులోగల శ్రీకోదండరామాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, బ్రాహ్మణవాడలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల్లో సందడి నెలకొంది. కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో శ్రీవేంకటేశ్వరస్వామి, భూదేవి, శ్రీదేవి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. కలెక్టర్ సత్య ప్రసాద్ దంపతులు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. ఆర్డీవో మధుసూదన్, ఈఓ శ్రీకాంత్రావు, తహసీల్దార్ వసంత పాల్గొన్నారు. మల్లాపూర్ మండలం వాల్గొండలోగల శ్రీరామలింగేశ్వర త్రికూటాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం 7.40గంటలకు శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించారు. భక్తులు తన్మయత్వంతో పులకరించిపోయారు. జిల్లా కేంద్రంలోని టవర్సర్కిల్లోగల శ్రీశ్రీనివాసఆంజనేయ భవాని శంకర ఆలయంలో మహతికృష్ణ శ్రీవేంకటేశ్వరస్వామి వేషధారణతో ఆకట్టుకున్నారు. కోరుట్ల పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి, అష్టలక్ష్మీ ఆలయాల్లో భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు దంపతులు, ఆర్డీవో జివాకర్రెడ్డి, సీఐ సురేష్ బాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల అధ్యక్షులు యతిరాజం నర్సయ్య, బూరుగు రామస్వామి, ధర్మకర్తలు పాల్గొన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుష్పవేదికపై మువ్వురు స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చేతుల మీదుగా ఉత్తర ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం సమయంలో మువ్వురు స్వాములను పురవీధుల మీదుగా అశేష భక్తజనం మధ్య శోభాయాత్ర చేపట్టారు. స్వామివార్లను కలెక్టర్ సత్యప్రసాద్, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత దర్శించుకున్నారు. -
డబుల్ ఇళ్లకు వెళ్లేనా
జగిత్యాల: పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని అర్బన్హౌసింగ్ కాలనీలో 4,520 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మూడు విడతల్లో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి 4,194 మందికి లక్కీడ్రా ద్వారా ఇళ్లను కేటాయించింది. మున్సిపాలిటీలోని 48వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మరీ.. లబ్ధిదారులను ఎంపిక చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో డబుల్బెడ్రూం ఇళ్లను కేటాయించారు. ఏడాది గడుస్తున్నా కొందరు ఆ ఇళ్లలోకి వెళ్లడం లేదు. దీంతో అధికారులు వారికి డెడ్లైన్ విధించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులందరూ ఈనెల 31లోపు చేరకుంటే వారి అర్హతను రద్దు చేసి మరొకరికి ఇస్తామని అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. సుదూరం.. వసతుల లేమి అర్బన్కాలనీ జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతోనే లబ్ధిదారులు అక్కడకు వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో వసతులు సమకూర్చుతామని, లబ్ధిదారులు తప్పకుండా వెళ్లాల్సిందేనని హౌసింగ్ అధికారులు చెబుతున్నా.. అక్కడున్న సౌకర్యాల దృష్ట్యా ఎవరూ ముందుకు రావడంలేదు. జిల్లాకేంద్రంలో అన్ని వసతులు ఉండటం, నిరుపేదల పిల్లలు కూడా ఇక్కడి పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. ఈ క్రమంలో అర్బన్కాలనీకి వెళ్తే ఇక్కడి రావడానికి అదనపు భారం పడుతుందని ఆలోచిస్తున్నారు. ఆటోల్లో వెళ్తే సుమారు రూ.100 నుంచి రూ.150వరకు తీసుకుంటున్నారు. రాత్రివేళ వెళ్లాలంటే భయపడాల్సి వస్తుంది. ఒక్కో ఇంటికి రూ.5.30లక్షలు నిరుపేదల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ. 5. 30 లక్షల చొప్పున కేటాయించి 4,520 ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇందులో వసతుల కల్పనకు ఇటీవల రూ.30 కోట్లు అదనంగా కేటాయించారు. తక్షణ అవసరాలైన డ్రైనేజీ, తాగునీరు, క రెంట్ కల్పించారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పైగా దూరం కావడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు అక్కడ బేస్మెంట్ వరకు కట్టుకున్నారు. దూర ప్రాంతం కావడంతో వారు కూడా ఎవరూ వెళ్లలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా అడవిని తలపిస్తోంది. గడువు పెంచేనా..?డబుల్బెడ్రూంలు పొందిన లబ్ధిదారులు కచ్చితంగా వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీమంత్రి జీవన్రెడ్డి కూడా లబ్ధిదారులు అక్కడకు వెళ్తేనే బాగుంటుందని పేర్కొంటున్నారు. నేటితో గడువు ముగియడంతో మరికొద్దిరోజులు గడువు పొడగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మరో నెల వరకు గడువు పొడిగిస్తే ఆలోపు వెళ్తామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సామగ్రి దొంగలపాలు ఇళ్లు దక్కించుకున్న వారు కచ్చితంగా వెళ్లాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచి స్తున్నా.. ఎవరూ ముందుకు కదలడం లే దు. మరోవైపు అధికారులు ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనుంది. అధికారుల మాటలు విని కొందరు వెళ్తున్నా.. చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. డబుల్బెడ్రూం ఇళ్ల వద్ద నుంచి కాపర్ వైరు, విద్యుత్ వైర్లు, ఇతరత్రా పైపులు, మంచినీటి పైపులు, తలుపులకు సంబంధించిన వస్తువులు దొంగలపాలవుతున్నాయి. లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్తే దొంగల బాధ ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. భయం భయం -
ఆసుపత్రిని ఎందుకు పట్టించుకోవడం లేదు..?
ధర్మపురి: ధర్మపురి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం గత ప్రభుత్వ హయాంలో రూ.7కోట్లు వెచ్చించి 50 పడకలతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని నిరుపయోగంగా మారుస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పట్టణంలోని ఎంసీహెచ్ను మంగళవారం సందర్శించిన ఆ యన.. ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభు త్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం ఎంసీహెచ్లు ఏర్పాటు చేశామని, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఆస్పత్రి నిరుపయోగంగా మారినా మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. భవనాన్ని ఉపయోగంలోకి తెచ్చి రోగులకు వైద్యం అందించే తీరిక మంత్రికి లేదా అని ప్రశ్నించారు. ఆయన వెంట నాయకులు ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, సంగి సత్తెమ్మ, ఇందారపు రామన్న, అయ్యోరి రాజేశ్, చిలువేరి శ్యాం, ఎల్లాగౌడ్, చుక్క భీమ్రాజ్, ముత్తినేని లక్ష్మ ణ్ పాల్గొన్నారు. -
ముక్కోటికి ఏర్పాట్లు
ముక్కోటికి ముస్తాబైన ధర్మపురి దేవస్థానం ముస్తాబైన శ్రీరామలింగేశ్వర ఆలయం ధర్మపురి/మల్లాపూర్:ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలను ముస్తాబు చేశారు. భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం, మల్లాపూర్లోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాలను అందంగా అలంకరించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆదేశాల మేరకు నృసింహాలయం లోపల విద్యుత్దీపాలతో అలంకరించారు. ముందు, వెనుక భాగంలో ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు చేశారు. భక్తుల కోసం లడ్డూ, పులిహోర తయారు చేయించారు. ముక్కోటి సందర్భంగా యోగా, ఉగ్ర లక్ష్మీనృసింహుడితోపాటు శ్రీవేంకటేశ్వర స్వాములకు ప్రత్యేక పూజలు చేస్తారు. ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి చేతులమీదుగా ఉత్తరద్వారం తెరుస్తారు. మల్లాపూర్ మండలం వాల్గొండలోని త్రికూటాలయం ఉత్తర ముఖద్వారం కలిగిన అతిపురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. వేకువజామున ఆలయంలోని శివలింగంపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరించడం ఆలయం ప్రత్యేకత. ముక్కోటికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సాంబారి శంకర్, వైస్ చైర్మన్ చిలివేరి లక్ష్మీ తెలిపారు. -
ఆలకించండి.. పరిష్కరించండి
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు జిల్లావ్యాప్తంగా తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన సమస్యలపై సమగ్ర విచారణ జరిపి పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, శిక్షణ డిప్యుటీ కలెక్టర్ హారిణి, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్గౌడ్, జివాకర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బీటీ రోడ్డు వేయండి జిల్లాకేంద్రం నుంచి మోతె బైపాస్ మీదుగా వెల్దుర్తి గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పాడైంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు రావడం లేదు. 2009లో నిర్మించిన రోడ్డుకు మూడేళ్ల క్రితం మరమ్మతు చేశారు. బీటీ రోడ్డుకు ఒప్పందం కూడా అయ్యింది. రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోండి. – వెల్దుర్తి సర్పంచ్, పాలకవర్గం పరిహారం ఇప్పంచండి Ð]l*¨ Möyìl-Ð]l*ÅÌS Ð]l$…yýl-ÌS… ç³Nyýl*Æý‡$. fW™éÅÌS Ò$§ýl$-V> Mø§éyýl Ð]lÆý‡MýS$ °ÇÃçÜ$¢¯]l² gê¡Ä¶æ$ Æý‡çßæ-§éÇ 563ÌZ {V>Ð]l$…-ÌZ° ç³Ë$Ð]l#Æý‡$ Ð]lÅÐ]l-ÝëĶæ$ ¿¶æ*Ð]l¬-Ë$, Câ¶æ$Ï, Rêä´ëÏr$Ï MøÌZµ-™èl$-¯é²Æý‡$. hÌêÏ ç³Ç«¨ÌZ Cç³µ-sìæMóS ç³Ë$ {V>Ð]l*-ÌZÏ ç³ÇàÆý‡… A…¨…-^éÆý‡$. Ð]l* {V>Ð]l*-°MìS Ð]l*{™èl… ç³ÇàÆý‡… A…§ýl-Ìôæ§ýl$. ÒOÌñæ-¯]l…™èl ™èlÓÆý‡-V> ç³ÇàÆý‡… Cí³µ…^ól-Ìê ^èl*yéÍ. త – – పూడూరు గ్రామస్తులు అడ్డుపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి మాది కథలాపూర్ మండలం సిరికొండ. గౌడ సంఘం అభివృద్ధికి మల్యాల శ్రీనివాస్ అడ్డు తగులుతున్నాడు. సర్వేనంబర్ 463లోని 8.32 ఎకరాలను కులస్తులందరి సమ్మతితో విక్రయించి ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మించాం. భూమికి సంబంధించిన డబ్బులను మేం పంచుకున్నామని అంటూ శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ అడ్డుకుంటున్నాడు. పైగా కుల బహిష్కరణ చేశారంటున్నాడు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విచారణ చేపట్టి ఎలాంటి అవకతవకలూ జరగలేదని నిర్దారించారు. ఆ తీర్మానంపై శ్రీనివాస్ కూడా సంతకం చేశాడు. ఇప్పుడు సభ్యులపై అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నాడు. – సిరికొండ గౌడ కులస్తులు, కథలాపూర్ కోతులను నివారించాలి జిల్లాకేంద్రంలోని తొమ్మిదో వార్డు ధరూర్క్యాంపు, హౌజింగ్బోర్డు, వినాయకనగర్, శ్రీనగర్ కాలనీల్లో కోతుల బెడద అధికంగా ఉంది. దాడి చేస్తూ పలువురిని గాయపరుస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కాలనీవాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కోతులను నియంత్రించండి. – గడ్డల లక్ష్మి, బీజేపీ నాయకురాలు -
ముందుకు.. వెనక్కి..!
జగిత్యాల: ఈ ఏడాది జిల్లాలో విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రానికి మంజూరైన మెడికల్ కళాశాల ఈ ఏడాది కూడా ముందకు కదలలేదు. నిధులలేమితో హాస్టల్, లైబ్రరీ వంటివి సంపూర్తిగానే మిగిలిపోయాయి. మూడేళ్లుగా భవన నిర్మాణం కొనసాగుతూనే ఉంది. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో ఉన్న ఓల్డ్ ఆస్పత్రి భవనం శిథిలావస్థలో ఉంది. ఇది జనరల్ ఆస్పత్రికి నిత్యం అనేక మంది పేషెంట్స్ వస్తుంటారు. మరమ్మతు చేపట్టకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ మరో రూ.200 కోట్లతో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి ప్రారంభమైంది. త్వరలోనే పనులు సైతం ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. 50 పడకలతో నిర్మితమైన క్రిటికల్ కేర్ భవనం ఇంకా ప్రారంభోత్సవం కావడం లేదు. క్రిటికల్ కేర్ ప్రారంభమైతే రోగులకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. విద్యకు పెద్దపీట.. జిల్లా కేంద్రానికి కేంద్రీయ విద్యాలయం మంజూరుతోపాటు, ఇటీవల నవోదయ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. పొలాసలో గతంలో ఏర్పాటైన వ్యవసాయ పరిశోధన స్థానానికి అనుబంధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఏర్పాటు చేశారు. ఎంతోమంది విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేస్తున్నారు. కోరుట్లలో ఇప్పటికే వెటర్నరీ కళాశాల ఉండటంతో ఎడ్యుకేషన్ హబ్గా మారింది. ఆలయాల అభివృద్ధి.. జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి నృసింహస్వామి ఆలయాలున్నాయి. గోదావరి ప్రాంతం కావడంతో 2027లో జరిగే పుష్కరాలకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేరోజు లక్ష మంది పుష్కరస్నానాలు ఆచరించేలా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ధర్మపురికి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.200 కోట్లతో అభివృద్ధికి అంచనాలు రూపొందించారు. గత ప్రభుత్వంలో కొండగట్టు, ధర్మపురి, వెల్గటూర్ ఆలయాలకు రూ.100 కోట్ల చొప్పున నిధులు ప్రకటించినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. తాజాగా కొండగట్టుకు టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో రూ.35.19 కోట్లు మంజూరు చేశారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీపై నీలినీడలు జిల్లాలో ప్రధానంగా చెరుకు పంట పండిస్తుంటారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించేందుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చింది. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన రుణభారం వన్టైం సెటిల్మెంట్ కింద రూ.190 కోట్లు తీర్చింది. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 50 వేల ఎకరాల మామిడితోటలు కలిగి ఉండగా.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు మామిడి ఎగుమతి జరుగుతుంది. అలాగే వరి మూడు లక్షల ఎకరాల వరకు సాగవుతుంది. సారంగాపూర్ మండలంలో రోల్లవాగు ఆధునీకరణకు రూ.130 కోట్లు మంజూరయ్యాయి. పనులు పూర్తయినప్పటికీ అటవీశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం వద్ద ఏర్పాటు సదర్మాట్ పూర్తిస్థాయిలోకి వచ్చినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఇది అందుబాటులోకి వస్తే 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే కథలాపూర్ మండలంలో సూరమ్మ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు. ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మండలాల్లో పక్కా భవనాలెప్పుడు..? జిల్లాలో గతంలో 18 మండలాలు ఉండగా కొత్తగా రెండు మండలాలను చేర్చారు. వీటికి పక్కా భవనాలు లేకపోవడంతో కార్యాలయాలకు ఇబ్బందికరంగా మారింది. మున్సిపాలిటీలకు అత్యధిక నిధులు ఇటీవల ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించింది. పనులను జరుగుతున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీకి రూ.60 కోట్లు, రాయికల్కు రూ.15 కోట్లు మంజూరయ్యాయి. మున్సిపాలిటిల్లో మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోవడం లేదు. జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ గతంలో అమలైనప్పటికీ గొడవలతో నిలిచిపోయింది. మళ్లీ అధికారులు ఆ దిశగా ప్రారంభించడం లేదు. ఇరుకు రోడ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యావర్రోడ్ ఇరుకుగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. డబుల్బెడ్రూంలు సిద్ధం రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా జగిత్యాలలోనే 4520 బెడ్రూంలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇటీవల అర్హులైన లబ్ధిదారులకు కేటాయించారు. అందులో వసతులు లేక వెళ్లడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈనెల 31వరకు ఇళ్లలోకి వెళ్లకుంటే వారి పట్టాను రద్దు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కొలువుదీరిన సర్పంచులు జిల్లాలో 385 గ్రామపంచాయతీల్లో సర్పంచులు కొలువుదీరారు. రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కుంటుపడింది. అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల -
ప్రాణం తీసిన భూపంచాయితీ
● కనగర్తిలో ఒకరు మృతి ఓదెల(పెద్దపల్లి): భూ పంచాయితీ ఓ రైతు ప్రాణం తీసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కనగర్తి గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య)ను ఇదే గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పొలం వద్ద పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో తన్ని బురదలో తొక్కి చంపేశాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్, మృతుడి కూతురు వొడ్నాల లావణ్య కథనం ప్రకారం.. కనగర్తిలో ఒంటరిగా ఉంటున్న రాజయ్య వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఆది రాజయ్య భూమి ఆయన పొలాన్ని ఆనుకొని ఉంది. ఇద్దరి భూముల మధ్య గెట్టు(ఒడ్డు) విషయంలో పలుమార్లు గొడవలు, కులపెద్ద మనుషుల సమక్షంలోనూ పంచాయితీలు జరిగాయి. సోమవారం ఉదయం ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) కూలీలతో పొలంలో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో ఒడ్డు వద్దగల హద్దు రాయిని రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పీకేశాడు. దానిని ఎందుకు పీకేశావని ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) అడిగాడు. దీంతో ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) చేతులతో పిడిగుద్దులు గుద్దాడు. కాళ్లతో తన్ని బురదలో తొక్కాడు. దీంతో బురదలో బొర్లపడి ముక్కు మూసుకుపోయి ఊపిరి ఆడక ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కూతురు వొడ్నాల లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ, పొత్కపల్లి, సుల్తానాబాద్ ఎస్సైలు రమేశ్, చంద్రకుమార్ పరిశీలించారు. పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని తన తండ్రిని చంపేశారని మృతుడి కూతుళ్లు బోరున విలపించారు. వరి నాట్ల సమయంలో రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగిసిన ఎస్జీఎఫ్ కరాటే టోర్నీ కోల్సిటీ(రామగుండం): నగరంలోని ఆర్సీవోఏ క్లబ్లో అండర్–17 చేపట్టిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కరాటే టోర్నీ, ఎంపిక పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 240 మంది బాలబాలికలు హాజరయ్యా రు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ నేతృత్వంలో పోటీలు నిర్వహించా రు. దాసరి మల్లేశ్ పర్యవేక్షించారు. ఇన్చార్జి డీఈవో హనుమంతు హాజరై మాట్లాడారు. ప్రతినిధులు కరాటే శ్రీనివాస్, వడ్డేపల్లి సురేశ్, పసునూటి శంక ర్, మంధని నాగరాజు, పసునూటి చందు, శ్రావణ్ కుమార్, సుంకే రాజు, బండి పరమేశ్, పవన్, బోయపోతు రాము, అన్వేశ్ రిఫరీలుగా వ్యవహరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోచ్, మేనేజర్లుగా ముక్తిశ్రీ, సునేహ సుల్తానా పాల్గొన్నారు. 13 బంగారు పతకాలు.. జాతీయ పోటీలకు 13 మంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 13 మంది క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో పుణెలో జరగనున్న జాతీయస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలకు 13 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. బంగారు పతకాలు సాధించినవారిలో సృష్టి టుమానే, శ్రీహర్ష, శ్రీవల్లి, పి.శ్రీజ, బి.సహస్త్ర, పి.సహస్త్ర, శ్రీరాజ్ విఘ్నేశ్, టి.జయసాయిచరణ్, ఆకాశ్, డి.శివహర్షవర్ధన్, డి.దేవాన్ష్ ఉన్నారు. ముగింపు కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్క్లబ్ అధ్యక్షుడు డి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్కుమార్, కోశాధికారి రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు కేఎస్ వాసు, రాష్ట్ర పేట అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొమురోజు శ్రీనివాస్, శోభారాణి, జావిద్, విజయ్, ఖాజాభీ రమేశ్, కనకేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం కరీంనగర్టౌన్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి, పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్ పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక తెలంగాణ చౌక్ నుంచి మహాత్మ జ్యోతిరావు పూలే గ్రౌండ్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా సమానమైన విద్యను అందించేందుకు ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్, గట్టు ఆకాష్, రాకేశ్, సందేశ్, మానస, సంజన, సన్నీ, అక్షయ్ పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
ధర్మపురి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. దూరప్రాంతాల నుంచి కాలినడకన వస్తున్న పేదవిద్యార్థులకు సైకిళ్లు అందించేందుకు ఎన్నారైలు ముందుకొచ్చారు. సామాజిక సేవకుడు, ధర్మపురికి చెందిన రేణిగుంట రమేశ్ ఫేస్బుక్లో చేసిన పోస్ట్కు స్పందించిన వివిధ దేశాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల ఎన్నారైలు, జిల్లా సత్యసాయి అభయహస్తం సభ్యులు, ఇతరులు ఏకంగా రూ.2.71 లక్షలు విరాళాల రూపంలో అందించారు. ఆ మొత్తంతో సుమారు 56 సైకిళ్లు కొనుగోలు చేసి ధర్మపురి, బీర్పూర్ మండలాలకు చెందిన విద్యార్థులకు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాన్ని మంచి కోసం వినియోగిస్తున్న రమేశ్ను అభినందించారు. పదేళ్లుగా ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ.. ప్రతినెలా నిరుపేదలకు సాయం అందిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థితికి చేరుకోవాలని, పోలీస్శాఖ పక్షాన ఇద్దరు పేద విద్యార్థులకు రెండు సైకిళ్లను బహూకరిస్తామని ప్రకటించారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనవంతుగా ఓ సైకిల్ అందిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్సై మహేశ్, ఎంఈవో సీతామహాలక్ష్మి, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులున్నారు. -
జగిత్యాల
27.0/12.07గరిష్టం/కనిష్టంఅయ్యప్పకు శాస్ర్త్రాపీతిరాయికల్: పట్టణంలోని చెన్నకేశవనాథ ఆలయంలో చండీపరివార్, భక్తుల సహకారంతో అయ్యప్పస్వామికి శాస్ర్త్రాపీతి మహోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు మునుగోటి సత్యనారాయణశర్మ, సాయిశర్మ ధ్వజారోహణం, గణపతి హోమం చేశారు. వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి కొనసాగుతుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. ఉదయం పొగమంచు కురుస్తుంది. ‘ముక్కోటి’కి కొండగట్టు ముస్తాబుమల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం ముక్కో టి ఏకాదశికి ముస్తాబైంది. ఉత్తరద్వారం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి దర్శనాన్ని ఉదయం 5గంటల నుంచే కల్పిస్తారు. మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
ఇక..పురవేఢీ!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాలకవర్గాల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న బల్దియాల్లో ఎన్నికల నగరా మోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణకు కార్యాచరణ చేపట్టింది. మంగళవారం నుంచి వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి, జనవరి 1న పట్టణ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. 5న ఆయా మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ కమిషనర్లు రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జనవరి 10న వార్డుల వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ చేపట్టనున్నట్లు ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. -
నాడు తండ్రి.. నేడు తల్లి..
జగిత్యాలక్రైం: ‘విధి ఆ చిన్నారుల పాలిట శాపంగా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులిద్దరూ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో సోమవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం తలమాల గ్రామానికి చెందిన జ్యోతి 15 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోపాల్ను ప్రేమవివాహం చేసుకుని కల్లెడకు వచ్చింది. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. వీరికి అంజలి (13), చిన్ని (6), మురళీ (5) సంతానం. గోపాల్ ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి జ్యోతి ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న జ్యోతి కూడా చనిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో పంచాయతీ సిబ్బందే జ్యోతి తల్లి సోంబాయి, తండ్రి భీమ్ ఆటోలో కల్లెడకు తీసుకొచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో మాజీ సర్పంచ్ అంకతి గంగాధర్, కారోబార్ సురేందర్ కలిసి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి మృతదేహం వద్ద ముగ్గురు చిన్నారులు రోధనలు చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. తన అనేవారు లేని చిన్నారులను స్వచ్ఛంద సంస్థలైనా.. ప్రభుత్వమైనా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనాథలైన ముగ్గురు చిన్నారులు -
భీమేశ్వరుడికి మొక్కులు
వేములవాడ: శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం భీమన్నను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండం మూసివేయడంతో భక్తులు స్నానాలు చేసేందుకు ప్రత్యేక స్నానపు గదులను రాజేశ్వరపురం వసతి గదులు కూల్చివేసిన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవమూర్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా ఫ్లైఓవర్ బ్రిడ్జీలను తాత్కాలికంగా తొలగించనున్నారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలను చేపట్టే పనులపై జాతర సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. -
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన కోత్వల్ కృష్ణ (43) గుండెపోటుతో మృతిచెందాడు. కృష్ణ జగిత్యాల పట్టణంలోని మార్కండేయనగర్కు చెందిన ఎక్కల్దేవి కృష్ణ వద్ద రూ.70వేలు తీసుకున్నాడు. అనంతరం రెండు ఫోన్నంబర్ల ద్వారా కృష్ణ సెల్ఫోన్కు ఫోన్పే చేయించాడు. ఆ రెండు నంబర్లు సైబర్క్రైంకు సంబంధించినవి కావడంతో ఎక్కల్దేవి కృష్ణ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. బాధితుడు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నవంబర్ 3న కోత్వల్ కృష్ణను అరెస్ట్ చేసి జగిత్యాల స్పెషల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో కృష్ణ సోమవారం ఉదయం ఛాతిలో నొప్పిగా ఉందని జైలు సిబ్బందికి తెలపడంతో జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఎస్కార్ట్ సిబ్బందితో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆయన మృతివార్తను సబ్జైలర్ ఉన్నతాధికారులు, కుటుంబసభ్యులకు తెలిపారు. ఆర్డీవో మదుసూదన్, రెండో అదనపు జుడిషియల్ మేజీస్ట్రేట్ నిఖిష ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో తీవ్రంగా రోధించారు. కృష్ణపై సూర్యపేట, ములుగు, కొత్తగూడెం, హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్లో పలు కేసులు నమోదై ఉన్నాయి. నిర్మల్ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు ఉంది. మొత్తంగా అతడిపై సుమారు 50 కేసుల వరకు ఉన్నట్లు సమాచారం. మృతునిది నిర్మల్ జిల్లా కేంద్రం విచారణ చేపట్టిన ఆర్డీవో మధుసూదన్ కేసు నమోదు చేసిన పట్టణ సీఐ కరుణాకర్ -
ఎన్నికలతో ముగిసి..
ఆటలతో మొదలై..పోలీస్ స్పోర్ట్స్ మీట్తో మొదలైన 2025.. ఎమ్మెల్సీ ఎన్నికలతో వేగం అందుకుని, పంచాయతీ ఎన్నికలతో ప్రశాంతంగా ముగిసింది. దక్షిణకాశీగా పిలిచే వేములవాడలో దర్శనాలు నిలిపివేయడం భక్తులకు తీవ్ర అసౌకర్యం కల్పించినా.. ఆలయాభివృద్ధి కోసం తప్పలేదు. సీబీఐ వామనరావు దంపతుల కేసు.. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై విచారణ ప్రారంభించింది. క్రిప్టో కరెన్సీ పేరిట వెలుగుచూసిన రెండు కుంభకోణాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేశాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ను ‘సిట్’ విచారించింది. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
వృద్ధురాలిపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి
● చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి జగిత్యాలక్రైం: మతిస్థితిమితం లేని ఓ వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లిలో చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ కథనం ప్రకారం.. హైదర్పల్లికి చెందిన వంగ రాజవ్వ (72) తన మనుమరాలు గోనెపల్లి మమతతో ఆదివారం మధ్యాహ్నం మాట్లాడుతోంది. అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని గోనెపల్లి అనిల్ రాజవ్వను కర్రతో కొట్టాడు. తల, చాతిలో బలమైన గాయాలవడంతో స్థానికులు జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతితంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో సోమవారం విషాదం నింపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సారంపల్లికి చెందిన మహమ్మద్ హమీద్(47)కు సోమవారం చాతిలో మంటగా అనిపించింది. కుటుంబ సభ్యులు బద్దెనపల్లిలోని ఆర్ఎంపీ పర్శరాములు క్లినిక్కు తీసుకెళ్లగా రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఇంజక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే హమీద్ స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హమీద్ను వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హమీద్ అప్పటికే మరణించాడని తెలపడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య షబేరా, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో తన భర్త మరణించాడని మృతుని భార్య షబేరా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు. హుజూరాబాద్రూరల్: మండలంలోని శాలపల్లె ఇంద్రనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సోనవేని కనుకయ్య(74) మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన కనుకయ్య రోడ్డు దాటుతుండగా హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనుకయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. పెళ్లయిన రెండు నెలలకే..● రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన కండ్లి లోకేశ్ (23) బైక్ అదుపుతప్పి కింద పడి మృతిచెందాడు. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. లోకేశ్కు కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన శ్వేతతో రెండు నెలల క్రితం వివాహమైంది. ఆదివారం రాత్రి బైక్పై భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్తున్నాడు. తక్కళ్లపెల్లి శివారులో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో లోకేశ్, శ్వేత తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో లోకేశ్ మృతిచెందాడు. వివాహమైన రెండు నెలలకే లోకేశ్ మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వాహనం అదుపు తప్పి యువకుడి మృతిరాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలూరుకు చెందిన జటోతు భూమేశ్ (19) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూమేశ్ స్నేహితుడైన దినేశ్తో కలిసి ద్విచక్ర వాహనంపై రాయికల్ నుంచి చింతలూరు వైపు వెళ్తున్నారు. భూపతిపూర్ శివారులో వాహనం అదుపుతప్పి రేలింగ్కు ఢీకొనడంతో భూమేశ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దినేశ్ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో భూమేశ్ కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. -
జాతీయస్థాయి చెకుముకి పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్ విద్యార్థులు కరీంనగర్ పద్మనగర్లోని ఓ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెక్ముకి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి తెలిపారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పాఠశాలకు చెందిన కే ఓం కార్తికేయ (10వ తరగతి), ఎస్.రీషాల్ (9వ తరగతి), ఓ.శివస్మరణ్రెడ్డి (8వ తరగతి) రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నారు. సోమవారం విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయస్థాయిలో సత్తాచాటాలని ఆకాంక్షించారు. పాఠశాలలో నిపుణులైన వైజ్ఞానిక శాస్త్ర ఉపాధ్యాయులచే విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేస్తున్నామని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి
జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. యావర్రోడ్ను 60 నుంచి 100 ఫీట్లకు విస్తరించాల్సి ఉందన్నారు. సాగునీటి ఇబ్బందులు లేకుండా కాలువలు మరమ్మతు చేపట్టాలన్నారు. రోళ్లవాగుకు అటవీశాఖ అనుమతులు ఇప్పించి గేట్లు బిగించాలని కోరారు. డీఎంహెచ్వోగా సుజాతజగిత్యాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా సుజాత నియామకం అయ్యారు. ఇక్కడి వైద్యాధికారి శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయన స్థానంలో సుజాత బాధ్యతలు స్వీకరించారు. ఆమె కలెక్టర్ సత్యప్రసాద్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించాలిమల్లాపూర్: గ్రామపంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్కో ఏడీఈ అమరేందర్ అన్నారు. వ్యవసాయ, గృహ, వాణిజ్య విద్యుత్ బకాయిలను నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా చెల్లించి సంస్థ నిర్వహణకు తోడ్పడాలన్నారు. ప్రజలకు మెరుగైన నిరంతర విద్యుత్ సరఫరాకు ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇన్చార్జి ఏఈ సంతోష్, సర్పంచ్ తోట శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మోహన్, కారోబార్ రంజిత్, విద్యుత్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. జీవాల్లో నట్టలు నివారించాలిరాయికల్: గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేయాలని, తద్వారా వాటి మరణాల రేటు తగ్గించుకోవాలని జిల్లా పశువైద్యాధికారి ప్రకాశ్ అన్నారు. మండలంలోని అల్లీపూర్లో జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన మందులతో నట్టలు చనిపోయిన ఆకలి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎంబారి గౌతమి, వెంకట్రెడ్డి, పశువైద్యాధికారి నరేశ్రెడ్డి, ఉపసర్పంచ్ వినయ్, యాదవ రైతులు మనోజ్, భీమయ్య, ఎల్ఎస్ఏ శివకుమార్ పాల్గొన్నారు. ఉత్తమ సహకార సంఘంగా రాయికల్ సొసైటీరాయికల్: రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ సేవలందించినందుకు రాయికల్ సహకార సంఘానికి అవార్డు లభించింది. సంఘం ఆధ్వర్యంలో రై తులకు రుణాలు ఇవ్వడంలో.. ఇచ్చిన రుణా లను రికవరీ చేయడంలో.. డిపాజిట్ల సేకరణ లో.. బ్యాంకింగ్ కార్యకలాపాలల్లో సంఘం మె రుగైన ఫలితాలు సాధించింది. ఈ మేరకు సహకార వారోత్సవాల్లో భాగంగా సోమవారం హై దరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా సీ ఈవో రవీందర్ ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఆయిల్ పాం ఆకులు తొలగించొద్దుజగిత్యాలఅగ్రికల్చర్: ఆయిల్ పాం తోటల్లో మొక్కల ఆకులు తొలగించొద్దని, దిగుబడి తగ్గుతుందని జగిత్యాల నియోజకవర్గ ఉద్యానశాఖాధికారిణి స్వాతి తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్లోని ఆయిల్ పాం తోటలను రైతులతో కలిసి సోమవారం పరిశీలించారు. 30 నెలలు దాటిన తోటల్లో పరాగ సంపర్కం కోసం కీటకాలను వదులుతున్నామని తెలిపారు. భూమిలో బోరాన్ లోపం ఉన్నట్లు తెలుస్తోందని, దీని నివారణకు ప్రతి చెట్టుకు 100 గ్రాముల బోరాన్ వేసుకోవాలని సూచించారు. హెచ్ఈఓ అనిల్, ఆయిల్ పాం కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
‘పది’కి రెండు నెలలే కీలకం
మల్లాపూర్(కోరుట్ల): పదో తరగతి వార్షిక పరీక్షలకు దాదాపు రెండునెలల సమయం మాత్రమే ఉంది. మార్చి 14 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ టైంటేబుల్ విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజులకో పరీక్ష చొప్పున నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గనుందని విద్యా శాఖ భావిస్తోంది. అయితే విద్యార్థులు ఈ కాస్త సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక ప్రకారం చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ‘సంకల్పం’ పేరుతో ప్రత్యేక తరగతులు పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు జిల్లా విద్యా శాఖ ఇప్పటికే ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ‘సంకల్పం’ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. రోజూ సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ఉన్నత పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఒక టైం టేబుల్ను సిద్ధం చేశారు. ఏ రోజు యే సబ్జెక్టు బోధించాలనేది అందులో పేర్కొన్నారు. జనవరి నుంచి రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. గతేడాది ఉత్తీర్ణత.. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 11,849 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా, 11,636 మంది పాసయ్యారు. జిల్లాలో 98.20 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లాలో 12,370 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరంతా ఉత్తమ మార్కులు సాధించేలా, మిగిలిన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాల్సి ఉంది. ప్రత్యేక శ్రద్ధ సీ– గ్రేడ్ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అలాగే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేయడంతో పాటు, సిలబస్ త్వరగా పూర్తి చేసి పునశ్చరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.జిల్లాలో.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు : 187 కస్తూరిబా విద్యాలయాలు : 14 ప్రభుత్వ పాఠశాలలు : 13 మోడల్ స్కూళ్లు : 13 సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు : 5 తెలంగాణ మైనార్టీ స్కూళ్లు : 5 బీసీ వెల్ఫేర్ స్కూళ్లు : 3 ప్రైవేటు స్కూళ్లు : 103 పదో తరగతి విద్యార్థుల సంఖ్య : 12,370 -
ప్రాణత్యాగాల పార్టీ కాంగ్రెస్
జగిత్యాలటౌన్: ప్రాణ త్యాగాల పార్టీ కాంగ్రెస్ అని జిల్లా అధ్యక్షుడు గాజంగి సదయ్య అన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో పార్టీ జెండా ఎగరేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం కోసం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహాత్మాగాంధీ పేరును చెరిపివేయాలని ప్రధాని మోదీ చూస్తున్నారని, పథకాల పేరు మార్పుతో గాంధీ పేరు చెరిపివేయలేరని అన్నారు. పేదల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకం పేరు మార్చి, నీరుగార్చేందుకు కుట్ర చేస్తున్న మోదీ పాలన నుంచి దేశ ప్రజలను విముక్తి చేసేందుకు మరో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల గుండెల్లోని కాంగ్రెస్ పార్టీని చెరిపివేయలేరన్నారు. కార్యక్రమంలో బండ శంకర్, కొత్త మోహన్, తాటిపర్తి విజయలక్ష్మి, కల్లెపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, రమేశ్రావు, ఎలిగేటి నర్సయ్య, గుగ్గిళ్ల హరీశ్, మున్నా, నేహాల్, రమేశ్బాబు, అనిత, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యంకథలాపూర్(వేములవాడ): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ 129వ కార్యక్రమాన్ని ఆదివారం మండలంలోని సిరికొండ గ్రామంలో బీజేపీ నాయకులతో కలిసి ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ ప్రతీ భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడబోమని ప్రపంచానికి ప్రధాని మోదీ తన నిర్ణయాలతో స్పష్టం చేశారన్నారు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత మోదీకే దక్కిందన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మోదీ దేశంలోని ప్రతీ పౌరుడికి దేశాభివృద్ధి, గొప్పతనం, ఔన్నత్యాన్ని చెప్పారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, మోతే గంగారెడ్డి, వెంకటేశ్వర్రావు, ఎడ్మల వినోద్రెడ్డి, బద్రి సత్యం, బండ అంజయ్య, కాసోజి ప్రతాప్, మహేశ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకంలోనే సమస్యలు
ప్రతి సీజన్లో వరిధాన్యం కొనుగోలుకు 420 కేంద్రాలు, వానాకాలంలో మొక్కజొన్న కొనుగోలుకు 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, ప్రతీ ధాన్యం కుప్పను తూర్పార పట్టమనడం, మిల్లర్లు క్వింటాల్కు 2 కిలోల తరుగు తీయడం, హమాలీలు ఇష్టారీతిన రేట్లు పెంచడంతో ఇబ్బందిపడ్డారు. మొక్కజొన్నను మార్క్ఫెడ్ కొనుగోలు చేసినా నెలన్నర వరకు డబ్బులు చెల్లించకపోవడంతో యాసంగి పెట్టుబడికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పత్తి పంటను 15 వేల ఎకరాల్లో వేసినా సీసీఐ నిబంధనలతో చాలా మంది గ్రామాల్లోనే తక్కువ రేటుకు దళారులకు అమ్ముకున్నారు. -
ఒడిదొడుకుల సాగు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా రైతులకు 2025 ఏడాది కన్నీళ్లు, నష్టాలనే మిగిల్చింది. పంటలకు తెగుళ్లు, పురుగులతో నెట్టుకొస్తున్న రైతులకు, చివరికి అకాల వర్షాలు దెబ్బతీశాయి. దీంతో, పంటలపై వచ్చే ఆదాయం ఏమో కానీ, పెట్టుబడులు కూడా రాలేదు. దీంతో, రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయి భూములు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.యాసంగిలో వరితో పాటు దాదాపు 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న వేయడంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. ఆ సీజన్లో ఏదోలాగా నెట్టుకొచ్చిన రైతులకు, వానాకాలం సీజన్లో యూరియా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. సొసైటీలు, దుకాణాల వద్ద రైతులు రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఒకట్రెండు బస్తాలు పొందె పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో క్యూ లైన్లలో నిలబడే ఓపిక లేక పట్టాదారు పాస్బుక్కులు, చెప్పులను పెట్టి రోజంతా వేచి చూసినా ఒక బస్తా కూడా దొరకలేదు. ఆదాయం రాక అన్నదాతల ఆగమాగం పెరుగుతున్న పంట పెట్టుబడి ఖర్చులు సంప్రదాయ పంటలవైపే జిల్లా రైతులు 2025 ఏడాది రైతులకు అంతంతే.. 2026పైనే ఆశలుదెబ్బతీసిన వర్షాలు జిల్లా రైతులు వరి, మొక్కజొన్న, పసుపు తదితర పంటలను దాదాపు 3.80 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే, మూడునెలల పాటు కురిసి భారీ వర్షాలతో మక్క, పసుపు పంటల్లో నీరు నిలిచి దెబ్బతిన్నాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇసుకను తొలగించేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. యాసంగి మార్చిలో కురిసిన వడగళ్ల వానకు వరిగింజలు రాలిపోయాయి. దాదాపు 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదించిన రైతులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మామిడిపూత, కాయలు రాలిపోయి తీవ్రనష్టం జరిగింది. వానాకాలంలో వరిపంట కోతకు గంటకు రూ 4.వేలు పెట్టి చైన్ హార్వేస్టర్లను ఉపయోగించారు. యూరియా కష్టాలు -
సర్పంచుల గెలుపే కాంగ్రెస్ బలానికి నిదర్శనం
ధర్మపురి: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుల గెలుపే కాంగ్రెస్ పార్టీ బలానికి నిదర్శనమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు ఆదివారం స్థానిక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని పటేల్ విగ్రహం నుంచి గాంధీ, నంది, అంబేడ్కర్ కూడళ్ల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన 108 మంది సర్పంచులు గెలుపొందడంతో నియోజకవర్గంలో పార్టీ బలం ఎంత ఉందో నిరూపించుకున్నామని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్కు ప్రజల నుంచి విశ్వాసం లభించిందని, అది ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు నిజాలు మాట్లాడితే బీఆర్ఎస్ తట్టుకోలేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు మళ్లించడం ద్వారా దళిత, గిరిజన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, సదరు నిధులపై ఆ శాఖ మంత్రిగా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్టంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకెంతో దోహదపడుతున్నాయని, ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని, మిగిలిన రెండు త్వరలో తప్పక అమలు చేస్తామన్నారు. ధర్మపురి లక్ష్మీనృసింహుని దయ, నియోజకవర్గ ప్రజల అండదండలతో ఎమ్మెల్యే, విప్, మంత్రిగా ఎదిగానని, ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చి వాగ్దానాలను నెరవేర్చుతున్నానని, ఐటీఐ కళాశాల, ధర్మపురిలో బస్డిపో తప్పకుండా ఏర్పాటు చేయిస్తానని స్పష్టం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధుల మంజూరుపై సుముఖంగా ఉన్నారని వెల్లడించారు. అనంతరం సర్పంచులను సన్మానించారు. కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, ఏఎంసీ చైర్పర్సన్లు, మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
చేల చుట్టూ.. చీరకట్టు..
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని పలువురు రైతులు యాసంగిలో మొక్కజొన్న సాగు చేస్తుండగా, అడవిపందులు గుంపులుగా పంట చేలపై పడి మొక్కలను కొరికేస్తున్నాయి. ఈనేపథ్యంలో పంట పొలాల చుట్టూ రంగురంగుల చీరలు కడితే అడవిపందులు వచ్చే అవకాశం తక్కువ. దీంతో రైతులు పంట పొలాలను చీరలతో సింగారిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్పల్లి, లక్ష్మీపూర్ గ్రామ రైతులు అంగట్లో ఒక్కో చీరను రూ.20 కొనుగోలు చేసి, చేల చుట్టూ కట్టి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా ఊర్లలో ఏ మొక్కజొన్న తోటను చూసినా చీరలతో సింగారించుకున్నట్లు ఉంటుంది. -
ఉపాధ్యాయ సమస్యలకు త్వరలో పరిష్కారం
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలజోన్: ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్లో పీఆర్టీయూటీఎస్–2026 క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నందున, వాటి స్థితిగతులను మార్చేందుకు కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన ఉన్నందున త్వరలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘ నాయకులతో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని వివరించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బోయనపల్లి ఆనందరావు, యాల్ల అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. తపస్ కార్యవర్గ సభ్యులకు అభినందన జిల్లా తపస్ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అభినందించారు. ఉపాధ్యాయ సమస్యలే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మార్చేందుకు సంఘాలు కృషి చేయాలన్నారు. అధ్యక్ష, కార్యదర్శులు బోయినపల్లి ప్రసాద్, కోక్కుల రాజేశ్, నాయకులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, సరస్వతి శిశుమందిర్, శ్రీవాణి జూనియర్ కళాశాలల వ్యవస్థాపకుడు కాసుగంటి సుధాకర్రావు శనివారం అనారోగ్యంతో మృతిచెందగా, ఆదివారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. సొంత జిల్లాలోనే టెట్ నిర్వహించాలిధర్మపురి: టెట్ రాసే వారికి ఇతర జిల్లాల్లో కాకుండా సొంత జిల్లాలోనే సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి రొట్టె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థులు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడడమే కాకుండా, చాలా మంది పరీక్ష సమయానికి చేరుకోలేక పోయిన ఘటనలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల సొంత జిల్లాలోనే పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని కోరారు. -
నేరాలపై ఉక్కుపాదం: కోరుట్ల పోలీసుల ఏడాది రికార్డు
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడం ద్వారా పోలీసులు ప్రజల ప్రశంసలు పొందారు. అలాగే 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని రూ.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల్లో 1,351 ఫిర్యాదులు రాగా.. వాటిలో రూ.1.72 కోట్ల నగదు తిరిగి బాధితులకు అందజేశారు. న్యాయ నిరూపణ ద్వారా ఈ సంవత్సరం 100 కేసులలో నిందితులకు శిక్షలు పడ్డాయి. అలాగే ఐదు విడతల లోక్ అదాలత్ల ద్వారా 9,595 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా జిల్లాలో 11 మంది ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ నిర్వహణ విధుల నిర్వహించి రాష్ట్రంలోనే జగిత్యాల రెండో జిల్లాగా నిలిచింది. జగిత్యాలక్రైం: జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే 5.05శాతం నేరాలు తగ్గాయి. 2024లో 5,620 నేరాలు నమోదు కాగా.. 2025లో 5,919 నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి 229 కేసులు, (5.05 శాతం) తగ్గాయి. ఇందులో అత్యధికంగా జగిత్యాల టౌన్ పోలీస్స్టేషన్లో 770 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా బుగ్గారం పోలీస్స్టేషన్లో 135 నమోదయ్యాయి. ఈ ఏడాది మొత్తం 29 హత్య కేసులు నమోదు కాగా.. వీటిలో కలహాలు, ఆస్తి వివాదాలు, వరకట్న హత్యలు, చిన్నచిన్న గొడవలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.381 దొంగతనాలు381 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా.. వాటిలో 187 కేసులను చేధించి రూ.22,92,37,439 విలువైన ఆస్తి (69.85 శాతం)ని రికవరీ చేశారు. 104 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా.. గతేడాదితో పోలిస్తే 5 కేసులు తగ్గాయి. జిల్లాలో 19 పీడీఎస్ రైస్ కేసులు నమోదు చేసి 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాలో 234 కేసుల్లో 410 మంది నిందితులను, 260 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాక్ట్ కింద 167 కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.30,62,036 నగదు స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 9,290 కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 మందికి జైలు శిక్షలు పడ్డాయి. అలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినప్పటికీ.. మృతుల సంఖ్య తగ్గింది. మాదక ద్రవ్యాలపై 86 కేసులుమాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా 2025లో ఇప్పటివరకు 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 86 కేసుల్లో 203 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు మాదకద్రవ్యాల నివారనే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. 75 హిస్టరీ, 33 రౌడీషీట్ కేసులుతరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతున్న వారిపై 75 హిస్టరీ షీట్లు ఓపెన్ చేశా రు. హత్య కేసుల్లో పాల్గొన్న వారిపై 33 రౌడీ షీట్లు నమోదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. డయల్ 100కు 30,954 కాల్స్ రాగా.. 130 కేసులు నమోదు చేశారు. గల్ఫ్ పంపిస్తామని చెప్పి మోసం చేసిన వాటిలో 44 కేసుల్లో 54 మందిని అరెస్ట్ చేశారు. అధిక వడ్డీల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ 11లో భాగంగా 11 కార్యక్రమాలు నిర్వహించి 76 మంది పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు. ఎన్నికల్లో 21 కేసులుఇటీవల జిల్లాలో రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై 21 కేసులు నమోదు చేశారు. 21 మంది నుంచి రూ.2,07,643 విలువైన 318.76 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 34 కేసులు నమోదు చేసి 34 మంది నిందితుల నుంచి రూ.180,800 విలువైన 199.5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాలుహన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో కరీంనగర్ ఏసీబీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 2న సోదాలు చేపట్టారు. శ్రీనివాస్పై ఆదాయానికి మించి ఆస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో జగిత్యాలలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టు 6న జిల్లా రవాణా శాఖ అధికారి బానోవత్ భద్రునాయక్, ఆయన డ్రైవర్ అరవింద్ జేసీబీ వాహనానికి పొల్యుషన్, ఇన్సూరెన్స్ లేదని యజమానిని బెదిరించి రూ.40 వేలు డిమాండ్ చేశారు. సదరు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. -
ధర్మపురిని నాశనం చేసింది బీఆర్ఎస్సే
కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–2 పేరుతో 1,020 ఎకరాల రైతుల భూములు లాక్కొని, గిరిజనులు, ఒడ్డెర జాతి ప్రజలను బెదిరించి ధర్మపురి నియోజకవర్గాన్ని నాశనం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం కరీంనగర్ ఆర్అండ్బీ అతిథిగృహంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితో కలిసి మాట్లాడారు. 2016లో జీవో నంబరు 71 ప్రకారం ప్రారంభించిన ప్రాజెక్టును ఆరేళ్లపాటు కొనసాగించి, పూర్తి చేయకుండానే అంచనాలను రూ.66కోట్ల నుంచి రూ.136 కోట్లకు పెంచారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా అప్పటి కాంట్రాక్టర్తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఇదేనా బీఆర్ఎస్ పాలకుల అభివృద్ధి మోడల్ అని ప్రశ్నించారు. ధర్మపురిని సస్యశ్యామలం చేస్తామని నాటి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయని, 146 గ్రామాలకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక్కసారి కూడా ఈ అంశంపై ప్రశ్నించలేదని విమర్శించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఆరు నెలల్లోనే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నానని అన్నారు. 80 మంది విద్యార్థులను పొలాస అగ్రికల్చర్ కాలేజీకి పంపించి, రూ.7 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి నాయకత్వంలో చెల్లించామని తెలిపారు. తను రాజీనామా చేయాలా వద్దా అనేది నిర్ణయించేది ధర్మపురి ప్రజలేనని... బీఆర్ఎస్ నేతలు కాదని స్పష్టం చేశారు. మరో మూడు సంవత్సరాల్లో తాను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రజలకు జవాబుదారిగా ఉండాలిధర్మపురి: నూతన సర్పంచులు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరిస్తూ, ప్రజలకు జవాబుదారిగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. బుగ్గారం మండలం సిరికొండ సర్పంచ్ ధర్మరాజుతో పాటు పలువరు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సిరికొండ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని పేర్కొన్నారు. -
నిందితులను అరెస్టు చేయాలి
జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్: టీఆర్నగర్లో ఇటీవల ఓ వర్గంపై దాడిచేసిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ స్తులు ఆందోళన చేపట్టారు. టీఆర్నగర్ గ్రా మానికి చెందిన కొందరు అదే గ్రామానికి చెందినవారిపై నాలుగు రోజుల క్రితం దాడిచేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులు తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితులు శుక్రవారం జగిత్యాల తహసీల్ చౌరస్తాతో పాటు, పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పట్టణ సీఐ కరుణాకర్ హామీ ఇవ్వడంతో శాంతించారు. స్వర్ణోత్సవాల్లో గోపా ప్రతినిధులు జగిత్యాల: హైదరాబాద్లో జరుగుతున్న గౌడ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్వర్ణోత్సవాల్లో జగిత్యాల జిల్లాశాఖ బాధ్యులు పాల్గొన్నారు. జగిత్యాల గోపా జిల్లా అధ్యక్షుడు దుర్గపు రవీందర్గౌడ్, ప్రధాన కార్యదర్శి అంబటి రాజయ్య, కోశాధికారి సత్యనారాయణగౌడ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, గుడాల రాజేశంగౌడ్, సత్తయ్యగౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం కోరుట్ల/జగిత్యాలటౌన్: ప్రజా సమస్యలపై సీసీఐ పోరాటాలు చేస్తోందని జిల్లా కార్యదర్శి చెన్నా విశ్వనాథం అన్నారు. సీపీఐ ఆవిర్భవించి 100ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని సి.ప్రభాకర్ స్మారక భవనం, అల్ల మయ్య గుట్ట ప్రాంతాల్లో సీపీఐ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో సీపీఐ ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. సీనియర్ నాయకుడు మౌలానా, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, ఎండీ ముఖ్రం, రాధ పాల్గొన్నారు. వర్ణ,వర్గ రహిత సమాజమే లక్ష్యం వర్ణ, వర్గ రహిత సమాజమే లక్ష్యంగా సీపీఐ వందేళ్లుగా పోరాటం సాగిస్తోందని పార్టీ జగిత్యాల పట్టణ కార్యదర్శి మాడిశెట్టి కిరణ్ అన్నారు. పట్టణంలోని టవర్సర్కిల్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెన్న మహేశ్, ధర్మన్న, శ్రీగాద దేవదాసు, ఎద్దండి భూమయ్య పాల్గొన్నారు. -
పారిశుధ్యం.. అస్తవ్యస్తం
జగిత్యాల: జిల్లాకేంద్రమైన జగిత్యాలలో లక్షకు పైగా జనాభా ఉంటుంది. నాలుగు జోన్లు ఉన్నాయి. చెత్త సేకరణకు నిత్యం 48 మున్సిపల్ ఆటోలు తిరుగుతుంటాయి. 300లకు పైగా పారిశుధ్య కార్మికులున్నారు. కానీ పట్టణంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడా డ్రెయినేజీలు తీయకపోవడంతో మురికినీరంతా నిలిచి రోడ్లపైకే ప్రవహిస్తోంది. అలాగే డ్రెయినేజీల చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడం లేదు. జిల్లాలోని 48 వార్డుల్లో ఏదో ఒకరోజు పారిశుధ్య కార్మికులు డ్రెయినేజీలు తీస్తూ.. పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారే తప్ప నిత్యం పనులు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో చుట్టూ ఉన్న ఇళ్ల యజమానులు భరించలేకపోతున్నారు. వారికి నోటీసులు ఇచ్చి చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నప్పటికీ బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టణంలోని 48 వార్డులకు 48 ఆటోలుంటే 20కి పైగా మరమ్మతుల్లో ఉన్నాయి. డంపర్బిన్స్ లేవు. ఇటీవలే డోజర్ సైతం చెడిపోయింది. అధికారులు మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫాగింగ్ మచ్చుకు కన్పించడం లేదు. ప్రతిరోజు కాలనీల్లో ఉదయం, సాయంత్రం ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఫాగింగ్ మిషన్లు చెడిపోయినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో మెరుగైన పారిశుధ్యం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.పట్టణంలోని జాంబాగ్ రోడ్డు వద్ద గల బైపాస్రోడ్డు. ఈ కాలువ వెంటే ప్రజలు చెత్త పడేస్తుంటారు. ఈ ప్రాంతంలో ఇంటింటికీ చెత్తవాహనం వెళ్లకపోవడంతో ప్రజలే చెత్తను తీసుకువచ్చి వేస్తున్నారు. ఇక్కడ పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. చెత్తతో రోడ్డు నిండిపోతోంది. సమీపంలోని డంపర్బిన్ను కొద్దిరోజులకే తొలగించారు. దీంతో ఇక్కడి ప్రజలకు చెత్త కష్టాలు తప్పడం లేదు.ఇది కొత్తబస్టాండ్లోని వాటర్ట్యాంక్ ప్రాంతం. ఇక్కడ నిత్యం పారిశుధ్య పనులు చేపట్టాలి. క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. అధికారులు పట్టించుకోకపోవడంతో ట్యాంక్ సమీపంలో పూర్తి చెత్తమయంగా మారింది. అధికారులు స్పందించి శుభ్రం చేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
ఎకరాకు రూ.లక్ష పెట్టిన
ఎకరాకు రూ.లక్ష చొప్పున, రెండు ఎకరాలకు రూ.2లక్షల పెట్టుబడి పెట్టి పసుపు సాగు చేశాను. అధిక వర్షాలతో దుంపకుళ్లు రోగం సోకింది. దాదా పు ఎకరంలో పంట నష్టం జరిగింది. పసుపు పైకి బాగానే కనబడుతున్నప్పటికీ.. పురుగు ఆశించిన మొక్కకు బలం లేకుండా పోయింది. – మామిడి ధర్మారెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లిపంటలో నీళ్లు నిలిచాయి పసుపు పంట రెండు ఎకరాల్లో సాగు చేసినప్పటికీ అనుకున్న పరిస్థితిలో ఆదాయం వచ్చేలా కనిపించడం లేదు. భూమిలో వర్షానికి నీరు ఆగి, పసుపుకు తెగుళ్లు సోకడంతో దిగుబడులు సగానికి పడిపోనున్నాయి. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – మారు మురళీధర్రెడ్డి, వెల్లుల్ల, మెట్పల్లి దెబ్బతీసిన వర్షాలు ఈ ఏడాది నెల రోజుల పాటు వర్షాలు కురువడంతో పసుపు పంటకు ఇబ్బందిగా మారింది. నీరు బయటకు వెళ్లలేక, పసుపు పంటలోనే రోజుల తరబడి నీరు నిల్వడంతో దుంపకుళ్లు, అడుగు రోగం సోకి, దిగుబడులు వచ్చేటట్లు కనబడటం లేదు. – మెక్కొండ రాంరెడ్డి, అలూర్, రాయికల్ -
ఆకతాయిలకు ముకుతాడు
జగిత్యాలక్రైం: జిల్లాలో కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీంలు ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా షీటీంలు జనసంచారం ఉన్న చోట మఫ్టీలో తిరుగుతూ ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో కాపుకాస్తున్నారు. జగిత్యాల, మెట్పల్లి సబ్ డివిజన్ల పరిధిలో షీటీం బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవగాహన సదస్సు జిల్లావ్యాప్తంగా షీటీం ఇప్పటి వరకు 115 అవగాహన సదస్సులు నిర్వహించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 64 ఫిర్యాదులు రాగా 77 కేసులు నమోదు చేశారు. ఈ పెట్టి కేసులు 41 నమోదు చేశారు. రెడ్హ్యాండెడ్గా 178 మందిని పట్టుకుని 157 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి, మిగతా వారిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ పెద్ద పట్టణాలతో పాటు, మండల కేంద్రాల్లోని బస్టాండ్ కళాశాలలు, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. భద్రతకు ప్రాధాన్యం మహిళలు, విద్యార్థుల రక్షణకు షీటీం బృందాలు నిరంతరం కృషిచేస్తున్నాయి. తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగడాలను వీడియో రికార్డ్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు సైతం నమోదు చేస్తున్నారు. జగిత్యాల, మెట్పల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 20 మండలాల్లో షీ టీం బృందాలు పనిచేస్తున్నాయి. టీంను ఎస్సైస్థాయి అధికారి సమన్వయం చేస్తుండగా.. మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారు. సమాచారం గోప్యం ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నా రు. జిల్లాలో ఆకతాయిలు ఎక్కువగా సంచరించే 185 ప్రాంతాలను గుర్తించారు. జిల్లావ్యాప్తంగా షీ టీం బృందాలు 115 పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సు నిర్వహించగా 9,600 మంది వి ద్యార్థులు హాజరయ్యారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తే డయల్ 100 లేదా 87126 70783కు వాట్సప్ నంబ ర్లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.బస్టాండ్, పాఠశాలలు, కళాశాలలు వద్ద మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జగిత్యాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీసుస్టేషన్లలో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలలు, కళాశాలల వద్ద షీటీం ఫోన్ నంబర్లు తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – అశోక్కుమార్, ఎస్పీ -
జగిత్యాల
29.0/13.07గరిష్టం/కనిష్టంహుండీ లెక్కింపు పెగడపల్లి: పెగడపల్లి శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపు శుక్రవారం జరిగింది. రూ.95వేలు వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఒరుగల శ్రీనివాస్ తెలిపారు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.వాతావరణం జిల్లాలో నేడు వాతావరణం సాధారణంగా ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. మంచు కురుస్తుంది. చలిగాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండ ఉంటుంది.గంగమ్మకు మొక్కులు ధర్మపురి: గోదావరిలో శుక్రవారం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గంగమ్మ, గౌరమ్మలకు తెప్పలు సమర్పించారు. ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకున్నారు.శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
‘అంజన్న’కు నోటీసులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో దేవాదాయ– అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. కొండగట్టు మీది ప్రాంతం మాత్రమే గుడిదని, ఇటీవల తమ భూముల్లోకి చొచ్చుకువచ్చి దాదాపు ఆరున్నర ఎకరాల భూమిని దేవాదాయశాఖ ఆక్రమించిందని అటవీశాఖ ఆరోపిస్తోంది. ఆ ఆరున్నర ఎకరాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మార్కింగ్ చేయడంతో రెండుశాఖల మధ్య వివాదం మొదలైంది. ఈ ఆరున్నర ఎకరాల భూమి తమదంటే తమదని ఇరుశాఖలు వాదించుకుంటున్నాయి. కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూములను ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుతో తాము తీసుకునే అవకాశం ఉందని దేవాదాయశాఖ అధికారులు చెబు తుండగా.. అనుమతి లేకుండా తమ భూములు ఎలా తీసుకుంటారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. మొత్తానికి అటవీశాఖ అధికారులు పెట్టిన కిరికికి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారేలా కనిపిస్తోంది. వివాదం ఇదీ.. కొండగట్టు ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దేవాదాయశాఖ కొన్ని అభివృద్ధి పనులు చేపట్టింది. గుడి ఉన్న గట్టు ప్రాంతం మినహా కింద ఉన్న భూములు తమకే చెందుతాయని అటవీశాఖ వాదన. గట్టు కింద భక్తుల కోసం 20 గదుల వసతి భవనం, ఈవో కార్యాలయ భవనం, వాహన పూజా మండపం తదితర భవనాలు దశాబ్దకాలం క్రితం నిర్మించారు. అవన్నీ తమ పరిధిలోకి వస్తాయని అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, మార్కింగ్ చేయడంతో విషయం వివాదంగా రూపుదాల్చింది. ఆలయ భూములు సంరక్షించాలని, భూములను ఆలయానికి అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. వై జంక్షన్ వద్ద గేటు ఏర్పాటు సన్నాహాలతో కొండగట్టు ఘాట్రోడ్డు, జేఎన్టీయూ రోడ్డు కలిసే వైజంక్షన్ వద్ద అటవీశాఖ అధికారుల గేటు ఏర్పా టు సన్నాహాలు రెండుశాఖల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా చేశాయి. రెండున్నరేళ్ల క్రితం కొండగట్టు పరి సరాల్లోని అటవీభూముల్లో అర్బన్ పార్కు ప్రతిపాదనలో భాగంగా వైంజక్షన్ వద్ద గేటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గేటుతో వాహనాల పార్కింగ్కు ఇబ్బందిగా మారుతుందని ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామం రెండుశాఖల మధ్య దూరం పెంచింది. కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులు సైతం వైజంక్షన్ సమీపంలో అటవీశాఖ గేటు ఏర్పాటు చేస్తే.. తాము వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల య ఈవో శ్రీకాంత్ రావు కూడా ఆ భూములు ఆలయానికే చెందుతాయని స్పష్టంచేస్తున్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎఫ్వో రవికుమార్ సమక్షంలో అటవీశాఖ, దేవాదాయశాఖ, రెవెన్యూశాఖ ముకుమ్మడిగా హద్దుల ఏర్పాటు కోసం సర్వే చేపట్టారు.గుడికి భూములిచ్చేందుకు సిద్ధం కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రెవెన్యూ భూములు బదిలీ చేశాం. ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ప్రత్యామ్నాయంగా భూముల కేటాయింపు చేసుకునే అవకాశముంది. కలెక్టర్ ఆదేశాలతో కొండగట్టులో అటవీశాఖ, దేవాదాయశాఖ సరిహద్దుల వివాదం పరిష్కరించేందుకు సర్వే చేపట్టాం. అటవీశాఖ హద్దులు గుర్తించాం.– పులి మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల -
కబ్జా చేసి.. కలిపేసి!
మెట్పల్లిరూరల్: చివరి ఆయకట్టుకు నీరందించే ఎస్సారెస్పీ ఉప కాలువలు కనుమరుగవుతున్నా యి. కొన్నేళ్లుగా తూములకు సరిపడా నీరు అందకపోవడంతో ఉపకాలువలు నిరుపయోగంగా ఉన్నా యి. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు రైతులు పూడ్చివేసి కబ్జా చేస్తున్నారు. ఉపకాలువల భూమిని వ్యవసాయ భూముల్లో కలిపేసుకుంటున్నారు. పంటలు వేసి సాగుచేస్తున్నారు. మెట్పల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో ఎస్సారెస్పీ ఉపకాలువలు కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు కొందరు కాలువను పూడ్చివేయించి తమ భూముల్లో కలిపేసుకోవడం గమనార్హం. 8 ఉపకాలువలు.. 55వేల ఎకరాల ఆయకట్టు మెట్పల్లి ప్రాంతంలో డి– 30, డి–32,డి–32(ఎ),డి–32(బి),డి–33,డి–34,డి–35,డి–36 ఉపకాలువలు ఉన్నాయి. వీటి కిందట 55 వేల ఎకరాలపై ఆయకట్టు ఉంది. మెట్పల్లి, రేగుంట, వెల్లుల, చౌలమద్ది, పెద్దాపూర్, చింతపేట, వేంపేట ప్రాంతాల గుండా ఉప కాలువలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాలువకు ఇరువైపులా భూములను వ్యవసాయ భూముల్లో కలిపేసుకున్నారు. మిగతా చోట్ల కాలువను పూడ్చివేసి భూముల్లో కలుపుకున్నారు. ఎస్సారెస్పీ కాలువల భూములను కలిపేసుకుంటున్న రైతులను చూస్తున్న మిగతా కొందరు సైతం కాలువ భూములను ఆక్రమిస్తున్నారు. దృష్టి సారించని అధికారులు ఎస్సారెస్పీకి భూములు ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలువ భూములను ఆక్రమించినా, పూడ్చివేస్తున్నా అధికారులు దృష్టి సారించకపోవడం వారి పనితీరు విషయంలో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉపకాలువ పూడ్చివేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. అటువైపు కన్నెత్తి చూడడం లేదని కొందరు ‘సాక్షి’ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాజిద్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.ఈ స్థలం మెట్పల్లి మండలం వెల్లుల శివారులోనిది. ఇక్కడ మొన్నటి వరకు ఎస్సారెస్పీ డీ–32(ఎ) ఉపకాలువ ఉండేది. పూడ్చివేయించిన ఓ రైతు పక్కనే ఉన్న తన వ్యవసా య భూమిలో కలిపేశాడు. కొన్నేళ్లుగా తూ ముకు సరిపడా నీరు విడుదలకాకపోవడంతో ఈ ఉపకాలువలోకి నీరు ప్రవహించడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న చాలా మంది రైతులు కాలువను కబ్జా చేశారు. -
పచ్చ బంగారం.. దిగుబడి భారం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో పసుపు ప్రధాన పంట. దిగుబడికి తగిన ధర లేక ఇబ్బందులు పడుతు న్న రైతులకు, ఈ ఏడాది తెగుళ్లతో మరింత నష్టం జరిగే అవకాశముంది. ఈసారి కురిసిన అత్యధిక వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితులతో పంట కు తెగుళ్లు వచ్చాయి. పెట్టుబడి కూడా వచ్చే అవకా శం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 35వేల ఎకరాల్లో పసుపు సాగవుతోంది. మల్లాపూర్, ఇబ్ర హీంపట్నం, మెట్పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, జగిత్యాల రూరల్, గొల్లపల్లి, రాయికల్, సా రంగాపూర్ మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. పంట విత్తిన నెల పాటు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఆక్టోబర్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పంటచేలో నీరు నిలిచింది. భూమిలో తేమ శాతంపెరిగి, తెగు ళ్లు, పురుగులకు నిలయంగా మారింది. పసుపు పంటకు రసాయన ఎరువులు కాకుండా పశువుల పేడ, కోళ్ల ఎరువు ఎక్కువగా వేస్తుంటారు. నీటినిల్వతో సేంద్రియ ఎరువుల పోషకాలు పసుపు మొక్కకు అందకుండా పోయాయని రైతులు అంటున్నారు. తీవ్రంగా దుంపకుళ్లు తెగులు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పసుపు పంట ఆకులు పచ్చగా ఉండి, భూమిలో దుంపకుళ్లు రోగం సోకితే, మరికొన్ని ప్రాంతాల్లో ఆకులు ఎండిపోయి భూమిలో దుంప మురిగిపోవడం జరిగింది. పంటకు నవంబర్ నుంచి జనవరి వరకు కొమ్ములు ఊరే దశ. ఈ దశలోనే దుంపకుళ్లు సోకడంతో ఎకరాల కొద్ది నష్టం జరుగుతోంది. దుంపలో పురుగులు చేరి, గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కుళ్లిపోతున్నాయి. దుంపలో పసుపు రంగుకు బదులు మట్టి రంగు ఏర్పడి, పసుపు కాండం వేరు కుళ్లి ఉండి, ఒత్తితే నీరు కారుతోంది. జిల్లాలోనే దాదాపు 15 వేల ఎకరాల్లో దుంపకుళ్లు రోగం సోకినట్లు తెలుస్తోంది. గతేది ఎకరాకు 40 డ్రమ్ములు(25 క్వింటాళ్లు) దిగుబడి వస్తే, ఈ ఏడాది కనీసం 20 డ్రమ్ములు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. దెబ్బతీసిన వర్షాలు వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పంటచేలు నుంచి నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వేసిన ఎరువులను మొక్క తీసుకోకపోవడంతో పాటు పురుగులు, తెగుళ్లకు నిలయంగా మారింది. ఎకరాకు కనీసం రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టగా, పంట అమ్మితే అదీ వచ్చే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. -
ఇక భూముల లెక్క పక్కా..
జగిత్యాల: జిల్లా కేంద్రంలో నేషనల్ జియో ఫేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హబిటేషన్ (నక్ష) సర్వే ప్రారంభమైంది. గతేడాడే సర్వే ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఆగిపోయింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 8 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా.. అందులో జగిత్యాల కూడా ఉంది. భారత గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న కార్యక్రమం ఇది. అర్బన్ ఆస్తులకు సంబంధించిన నక్ష సర్వే రూపొందించడం, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. గతేడాది ఫిబ్రవరిలో హెలికాప్టర్ ద్వారా జగిత్యాల మున్సిపాలిటీ ఏరియల్ ఇమేజ్ సర్వే ప్రారంభించారు. ఇప్పటికే ఇమేజ్లు సేకరించారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాల వివరాలు, రోడ్లు, ఇంటి నంబర్లు, ఇంటి యజమాన్య రిజిస్ట్రేషన్ పత్రాలు, సమాచారం కోసం సర్వే చేస్తున్నారు. వాస్తవానికి నక్ష గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ఏదైనా భూములకు సంబంధించి నక్షను ఏర్పాటు చేస్తారు. దాని మాదిరిగానే పట్టణాల్లోనూ భూముల లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాగు భూములకు మాత్రమే ఉండే నక్ష పట్టణాల్లోనూ పటాలకు రూపకల్పన చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సర్వే ఆఫ్ ఇండియా, మున్సిపాలిటీ, భూమి కొలతలు, దస్త్రాల నిర్వహణ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. నక్షతో రక్షణ జిల్లా కేంద్రం కావడం.. చుట్టూ 6 కిలోమీటర్లు విస్తరించడం, ఇటీవల పలు గ్రామాలను ఇందులో విలీనం చేయడం జరిగిపోయింది. దీంతోపాటు అక్రమాలూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. నక్షతో ప్రతి ఒక్కరి ఆస్తులకు సంబంధించిన హద్దులతో కూడిన పత్రం ఇస్తారు. ఎలాంటి అక్రమణగానీ, గొడవలు ఉండవు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికావు. వీటికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో భూముల రక్షణకు నక్ష ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో చిత్రీకరణ జగిత్యాల మున్సిపాలిటీలో భవనాలను డ్రోన్లతో చిత్రీకరించారు. వీటి సహాయంగానే జిల్లా కేంద్రంలోని ప్రతి భవనం, ఆస్తులను కొలతలు చేయడంతోపాటు, వాటి సరిహద్దులకు బౌండరీలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో పొందుపర్చుతారు. ప్రతి ఒక్క ఆస్తిని అక్షాంశాలు, రేఖాంశాలతో హద్దులు గుర్తించి సంబంధిత ఆస్తులకు గుర్తింపు కార్డులు అందించనున్నారు. వీటితోపాటు, ప్రభుత్వ స్థలాలైన చెరువులు, ఆలయ భూములు పకడ్బందీగా ఉంటాయి. వాటిని ఎవరూ కబ్జా చేసే అవకాశం ఉండదు. విస్తరిస్తున్న పట్టణం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో నుంచి పైలెట్ ప్రాజెక్టులుగా కోరుట్ల, జగిత్యాల బల్దియాలను ల్యాండ్ రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో జగిత్యాల ఎంపిక కావడం గమనార్హం. ఈ మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన గ్రామాల్లోని భవనాలను కూడా ఇందులోనే చేర్చుతారు. 48 వార్డులు.. లక్షకు పైగా జనాభా జగిత్యాల బల్దియా నక్షతో కూడిన పట్టణంగా ఏర్పాటు కానుంది. బల్దియాలో లక్షకు పైగా జనాభా ఉంది. దాదాపు 45 వేల గృహాలుంటాయి. 48వార్డులున్నాయి. వీటన్నింటిని డ్రోన్ల ద్వార చిత్రీకరించి పట్టణ మ్యాప్ రూపొందించి నక్ష ఏర్పాటు చేయనున్నారు. జగిత్యాల వ్యూ -
నిన్న జగ్గాసాగర్.. నేడు వెల్లుల
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం వెల్లుల గ్రామ రైతులు వ్యవసాయ విద్యుత్ సర్వీస్ చార్జీలు ఒకేరోజు వందశాతం చెల్లించి ఆదర్శంగా నిలిచారు. పదేళ్లుగా వందశాతం బిల్లులను ఒకేసారి చెల్లిస్తున్న రైతులు.. ఈ ఏడాదికి సంబంధించిన చార్జీలను కూడా గురువారం చెల్లించారు. 1,221 పంపుసెట్లకు సంబంధించి రూ.4,18,672ను విద్యుత్ అధికారులకు అందించారు. కార్యక్రమంలో ఏడీఈ రవి, ఏఈ రమేశ్, లైన్ఇన్స్పెక్టర్లు శంకర్, శ్రీదేవి, శేఖర్, లైన్మెన్లు నరహరి, ప్రసాద్, ఏఎల్ఎంలు, రైతులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో వసతుల కల్పనకు కృషి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ రాయికల్: గ్రామాల్లో వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. గురువారం అయోధ్య, రామాజీపేట పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వసతుల కల్పనకు కృషి చేస్తానని, ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో రామాజీపేట సర్పంచ్ బెజ్జంకి మోహన్, విజయ్, రాజశేఖర్, మారుతి, శ్రీనివాస్రావు, నందనగిరి లక్ష్మీ, భరత్రెడ్డి పాల్గొన్నారు. పంచాయతీల అభివృద్ధికి పాటుపడండిజగిత్యాలరూరల్: పంచాయతీల అభివృద్ధికి సర్పంచులు నిరంతరం కృషి చేయాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి సర్పంచ్, బొలిశెట్టి రాజేశ్, వార్డుసభ్యులు వసంత గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వసంత వారిని సన్మానించారు. బీఆర్ఎస్ నాయకులు న్యాడెం శంకర్, ఎల్ల రాజన్న, శ్రీకాంత్, దినేశ్, అఫ్సర్ఖాన్, గణేశ్, రాజేందర్ పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల పొలంబాటమెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం పాటిమీదితండాలో విద్యుత్ అధికారులు గురువారం పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. రైతులు వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని, భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. టెక్నికల్ డీఈ అంజయ్య, డీఈ మధుసూదన్, ఏడీఈ రవి, ఏఈ రమేశ్, రైతులు పాల్గొన్నారు. -
ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ
ధర్మపురి/మేడిపల్లి/జగిత్యాలరూరల్: ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు పెండ్యాల బాలకృష్ణస్వామి, రాజేశ్ ఆధ్వర్యంలో గణపతి పూజ చేశారు. అలాగే భీమారం మండలంలోని మన్నెగూడెంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. పొలాస శివారులోని అయ్యప్ప ఆలయంలో వేలాది మంది దీక్షాపరులు పడిపూజలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి పాల్గొన్నారు. -
వాచ్పేయి సేవలు మరవలేనివి
జగిత్యాలటౌన్/మెట్పల్లి/రాయికల్/పెగడపల్లి/కథలాపూర్/మల్లాపూర్/మల్యాల: దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి దేశానికి చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో వాజ్పేయి చిత్రపటానికి భారత సురక్షా సమితి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పుప్పాల సత్యనారాయణ, అక్కినపెల్లి కాశినాథం, చిట్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఆముద రాజు, సిరికొండ రాజన్న, గాదాసు రాజేందర్, పవన్సింగ్, సాంబారి కళావతి, గడ్డల లక్ష్మి, దూరిశెట్టి మమత తదితరులు పండ్లు పంపిణీ చేశారు. పెగడపల్లిలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం, మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి, గంగుల కొంరెల్లి, చింతకింది అనసూయ, గంగుల లక్ష్మీ,, కూన కుమార్, శ్రీరాం చారి పాల్గొన్నారు. వాజ్పేయి రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యమిచ్చి ఆదర్శంగా నిలిచారని బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి శ్రీనివాస్, కొండ్లెపు శ్రీనివాస్, చెట్లపల్లి సత్యనారాయణ, డాక్టర్ వెంకట్రెడ్డి, మద్దెల లావణ్య, బొడ్ల ఆనంద్, జుంగుల అనిల్ పాల్గొన్నారు. కథలాపూర్లో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు వెంకటేశ్వర్రావు, కొడిపెల్లి గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయికల్లో పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు అల్లె నర్సయ్య, కడార్ల శ్రీనివాస్, శ్రీగద్దె శ్రీనివాస్, దాసరి రవి, గోపి, తోకల శంకర్, కట్కం కిశోర్, మచ్చ శంకర్, తాటిపాముల శేఖర్ పాల్గొన్నారు. మల్లాపూర్లో వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మీ, లవంగ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మల్యాల మండలకేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, సంబురాలు నిర్వహించారు. మల్లేశం, ప్రసాద్, వెంకటస్వామి, గోవర్ధన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
కలవరపెడుతున్న వరుస చోరీలు
జగిత్యాలక్రైం: జిల్లాలో వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. ఇంటికి తాళం వేసి వెళ్లామా.. దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను పరిశీలించి రాత్రివేళల్లో చొరబడుతున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 381 దొంగతనాల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో 187 దొంగతనాల కేసులను పోలీసులు చేధించారు. మధ్యాహ్న సమయంలో 13, రాత్రి సమయంలో 132, ఇతర సమయంలో 224, దారిదోపిడీలు ఒకటి, ఇతరత్రా 11 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రూ.4,18,57,918 విలువైన వస్తువులు చోరీ చేయగా.. రూ.2,92,37,439ను పోలీసులు రికవరీ చేయగలిగారు. తాళం వేసిన ఇళ్లల్లోనే చోరీలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీసీకెమెరాలున్నా... ఆగని దొంగతనాలు నేరాల నియంత్రణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో శ్రీనేనుసైతంశ్రీ కార్యక్రమం ద్వారా పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీకెమెరాలు ఏర్పాటు చేసినా చోరీలు తగ్గడం లేదు. మరోవైపు పోలీస్ శాఖ కూడా నిరంతరం నిఘా పెడుతోంది. బ్లూకోల్ట్స్ బృందాలను నియమించింది. వారు రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్నా.. గస్తీ తిరుగుతున్నా.. దొంగలు మాత్రం తమ పనికానిచ్చేస్తున్నారు. పోలీసులకు చిక్కని దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారు మంకీక్యాప్, చేతులకు గ్లౌస్లు ధరిస్తున్నారు. పైగా వేలిముద్రలు నమోదు కాకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో నిందితులను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. రాత్రివేళల్లో పోలీసుల మఫ్టీలో తిరుగుతూ అనుమానితులను విచారిస్తున్నా.. అసలు దొంగలు మాత్రం పట్టుబడటం లేదు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్ర జలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్తే పోలీసులతోపాటు స్థాని కంగా ఉండే వారికి సమాచా రం ఇవ్వాలి. అలాంటి ఇళ్లవైపు నిఘా పెంచుతాం. ప్ర జలు ఇళ్లల్లో విలువైన వస్తువులు ఉంచి తాళాలు వేసుకుని బయటకు వెళ్లవద్దు. చాలా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. – అశోక్కుమార్, ఎస్పీ -
కూత షురూ..
● అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ● హాజరైన మంత్రి శ్రీధర్బాబు, వివిధ క్రీడల ప్రముఖులు ● ఆకట్టుకున్న మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా కబడ్డీ కూత షురూ అయ్యింది. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు గురువారం రాత్రి నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఒలింపిక్, రాష్ట్ర, జిల్లా కబడ్డీ క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 952 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా జిల్లాల బృందాల ఫ్లాగ్ మార్చ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలిమ్యాచ్ పురుషుల విభాగంలో కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య జరిగింది. -
అమ్మానాన్న ఆశ్రమానికి అవ్వ
జ్యోతినగర్(రామగుండం): కుటుంబసభ్యులు వద్దన్నా..అవ్వకు ప్రభుత్వ అధికారులు ‘అమ్మానాన్న’లో ఆశ్రయం కల్పించారు. దిక్కులేని వారికి ప్రభుత్వమే అండగా ఉందని నిరూపించారు. వివరాలు.. గోదావరిఖని విఠల్నగర్కు చెందిన వృద్ధురాలు మొగిలమ్మ కొద్దిరోజులుగా రామగుండం రాజీవల రహదారి బీ – పవర్హౌస్ బస్స్టాప్ వద్ద అనాథగా ఉంటోంది. భిక్షాటన చేయడంతోపాటు తినడానికి ఎవరైనా ఇస్తేతీసుకుని కాలం గడుపుతోంది. సమాచారం అందుకున్న జిల్లా ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి స్వర్ణలత.. కలెక్టర్ ఆదేశాల మేరకు వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి యత్నించగా.. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. శిశు సంక్షేమాధికారి ఆదేశాలతో వృద్ధురాలిని హైదరాబాదు చౌటుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించారు. నెలరోజుల క్రితం పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో ఓ వయోవృద్ధురాలు(80) కూడా ఇదేస్థితిలో ఉండడంతో ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యస్థితి బాగుపడిన తర్వాత చౌటుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రయానికి పంపించారు. హైదరాబాద్ తరలించిన ఎఫ్ఆర్వో స్వర్ణలత -
డంపింగ్ యార్డులు అస్తవ్యస్తం
జిల్లాలోని మున్సిపాలిటీలు, చెత్త సేకరణ వివరాలురూ. 2.40 లక్షలు రూ. 1.25లక్షలురూ.లక్ష 34.25 టన్నులు3210చెత్తసేకరణ(రోజు)ట్రాక్టర్లుమెట్పల్లికోరుట్లజగిత్యాల ధర్మపురిరాయికల్ -
ఒకేరోజు వందశాతం విద్యుత్ బిల్లుల చెల్లింపు
గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలుధర్మపురి: ధనుర్మాసం సందర్భంగా ధర్మపురి గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి గంగమ్మ, గౌరమ్మకు మొక్కులు చెల్లించారు. మంగలిగడ్డ, సంతోషిమాత ఘాట్లు భక్తులతో పులకించిపోయాయి. మెట్పల్లిరూరల్: వ్యవసాయ విద్యుత్ బిల్లులను ఒకేరోజు వందశాతం చెల్లించి ఆదర్శంగా నిలిచారు మెట్పల్లి మండలం జగ్గాసాగర్ రైతులు. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశమైన రైతులు.. వ్యవసాయ బిల్లులు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. 753 వ్యవసాయ మోటార్ల సర్వీస్ చార్జీలను ఒకేరోజు రైతులంతా చెల్లించారు. కనెక్షన్కు రూ.360 చొప్పున రూ.2,71,080 సర్వీస్చార్జీ, రూ.14,440 బకాయిలు చెల్లించారు. రైతులు సమష్టిగా నిర్ణయం తీసుకుని వందశాతం బిల్లు చెల్లించడం అభినందనీయని ఏఈడీ రవి అన్నారు. ఇతర గ్రామాల రైతులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈ రమేశ్, సబ్ ఇంజినీర్ అభినయ్, లైన్మెన్లు లక్ష్మణ్, నరహరి, రాజు, శివ, జలపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కొండగట్టు ఆలయ భూములు రక్షించండి
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయ భూములను రక్షించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. శ్రీఆంజనేయస్వామి వారిని బుధవారం దర్శించుకున్నారు. ఆలయ భూముల హద్దులు పరిశీలించారు. వందల ఏళ్ల నాటి ఆలయ భూములను అటవీశాఖ భూములు అనడం సరికాదన్నా రు. మాజీ సీఎం కేసీఆర్ కొండగట్టును యాదాద్రిని మించి అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేశారని పేర్కొన్నారు. కొండగట్టులో దేవాదాయ, అటవీశాఖల మధ్య భూముల వివాదం నెలకొన్నా.. మంత్రి కొండా సురేఖ పట్టించుకోకపోవడంపై సరికాదన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినా బండి సంజ య్ ఆలయ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్రావు, పునుగోటి కృష్ణారావు, బోయినపల్లి మధుసూదన్రావు, బద్దం తిరుపతి రెడ్డి, కొండబత్తిని త్రినాథ్, ఎండీ.అజారొద్దీన్ పాల్గొన్నారు. -
రూ.2.69 కోట్ల పన్నుల వసూలు
● లక్ష్యం రూ.12.38 కోట్లు ● మార్చి 31 చివరి తేదీ జగిత్యాలరూరల్: జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వేళ పన్నులు భారీగా వసూళ్లయ్యాయి. 20 మండలాల్లోని 385 గ్రామపంచాయతీల్లో నవంబర్ నుంచి ఇప్పటివరకు రూ.2,69,19,913 పన్ను వసూలు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థులు, వారిని బలపర్చే వారు కూడా ఇంటి, నీటిపన్నులు చెల్లించాల్సి ఉండటంతో భారీగా పన్నులు వసూలయ్యాయి. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. లక్ష్యం రూ.12.38 కోట్లు జిల్లాలో గ్రామపంచాయతీల్లో పన్ను వసూళ్లకు 2026 మార్చి 31 వరకు రూ.12,38,61,750 లక్ష్యం ఉండగా.. అక్టోబర్ 30 వరకు రూ.1,87,32,110 వసూలు చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రావడం, బకాయి పన్ను చెల్లించిన వారికే పోటీచేసే అవకాశం ఉండటంతోపాటు, బలపర్చే అర్హతలు ఉండటంతో భారీగా పన్నులు చెల్లించారు. భక్తులకు ఇబ్బంది కలగనీయొద్దు ధర్మపురి: ముక్కోటి ఏకాదశికి వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హారిణి సూచించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి కార్యాలయంలో ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షించారు. ముక్కోటికి వేలాది మంది భక్తులు వస్తారని, వారికి వసతులు, ఏర్పాట్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాన్య భక్తులు, ప్రముఖులకు ఇబ్బంది రానీయొద్దన్నారు. ప్రత్యేక క్యూలైన్లు, గోదా వరి తీరం, పట్టణంలోని పలు వీధుల్లో పారిశుధ్యం పరిశీలించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, సీఐ రాంనర్సింహరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, సీని యర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, ధర్మకర్తలు తదితరులున్నారు. -
నిఘా పెంచాల్సిందే..
కోరుట్ల: గంజాయి.. రెండు, మూడేళ్లుగా పట్టించుకునేవారు లేక కొత్త సంవత్సరం వేడుకల్లో యువతకు చేరవైంది. దీని నియంత్రణకు ఏడాదిగా దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. నూతన సంవత్సర వేడుకలకు వారం మాత్రమే ఉన్న క్రమంలో పోలీసు యంత్రాంగం మరింత పక్కాగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. కోరుట్ల, మెట్పల్లి సర్కిళ్లు కీలకం నాందేడ్, రుద్రంగి, మానాల నుంచి గంజాయి సరాఫరాను అడ్డుకోవడంలో జిల్లా సరిహద్దుల్లో ఉన్న కోరుట్ల, మెట్పల్లి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది. రుద్రంగి, మానాల పరిసర ప్రాంతాల నుంచి గంజాయిని తరలించేవారు కోరుట్ల సర్కిల్లోని కథలాపూర్, మేడిపల్లి మండలాల నుంచి.. మెట్పల్లి సర్కిల్ను ఆనుకుని ఉన్న నిజామాబాద్ జిల్లా సరిహద్దు.. కొమరంభీంఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చే గంజాయిని అడ్డుకోవడానికి మెట్పల్లి సర్కిల్లోని మల్లాపూర్ ఠాణా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ఈ రెండు సర్కిళ్లలో పోలీసుల యంత్రాంగం న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తే ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకల్లో గంజాయికి అడ్డుకట్ట వేయడం పెద్ద సమస్యగా కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. వేడుకల్లో గంజాయి నివారణకు డివిజన్ పరిధిలోని కోరుట్ల, మెట్పల్లి సర్కిల్ పోలీసులతో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చే స్తున్నాం. ఈ ఏడాది డివిజన్ పరిధిలో గంజా యి కట్టడిలో మంచి ఫలితాలు సాధించాం. – రాములు, మెట్పల్లి డీఎస్పీ నాందేడ్, ఆదిలాబాద్ దారుల్లో.. ఏటా న్యూ ఇయర్ వేడుకకు యువతకు గంజాయి చేరవేసి సొమ్ము చేసుకునే సరఫరాదారులు ఈ ఏడాది కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని నాందేడ్, ఉమ్మడి ఆదిలాబాద్లోని కొమరంభీంఆసిఫాబాద్, రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి, మానాల ఏరియాల నుంచి ఎక్కువ మొత్తంలో గంజాయిని జిల్లాకు తరలించే అవకాశాలున్నాయని పోలీసువర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లో మొత్తం 24 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 203 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో సగానికి మించిన గంజాయి సరఫరాదారులు నాందేడ్ పరిసరాల నుంచి జిల్లాకు తెస్తున్నట్లు తేలింది. నాందేడ్ నుంచి రైలు మార్గంలో నిజామాబాద్కు.. అక్కడి నుంచి మోటార్సైకిళ్లు, బస్సుల్లో జగిత్యాల సరిహద్దుల్లోని కమ్మర్పల్లి గండిమనుమాన్ ఏరియా నుంచి గంజాయి జిల్లాలోకి వస్తోంది. ఈసారి కూడా న్యూఇయర్ వేడుకల్లో అదే ప్రాంతాల నుంచి గంజాయిని జిల్లాకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
రైతులకు న్యూ టెక్నాలజీ అందించాలన్నదే లక్ష్యం
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేసేందుకు వ్యవసాయ వర్సిటీలో సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్, సెంటర్ ఫర్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సెంటర్ ఫర్ సస్టేనబుల్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాం. మానవ రహిత వ్యవసాయం చేసేలా రోబోటిక్స్, డ్రోన్స్, సెన్సార్ వంటి టెక్నాలజీపై పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు ఓ వైపు పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు రైతులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం ఖరీఫ్ సీజన్కు ముందు 1200 గ్రామాల్లో శ్రీరైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలుశ్రీ కార్యక్రమం నిర్వహించాం. పరిశోధన స్థానాల్లో రూపొందించిన విత్తనాలను అభ్యుదయ రైతులకు ఉచితంగా ఇచ్చేలా విత్తన మేళాలు ఏర్పాటు చేశాం. వారు పండించిన విత్తనాలను గ్రామంలోని రైతులందరికీ అందేలా చూస్తున్నాం. గతంలో రైతు పిల్లలకు మాత్రమే వ్యవసాయ విద్యలో రిజర్వేషన్పరంగా సీట్లు ఉండేవి. ఈ ఏడాది నుంచి రైతు కూలీల పిల్లలకు కూడా 180 సీట్లు ఇచ్చాం. గతంలో అగ్రికల్చర్ స్పెషల్ కోటా సీట్ల ఫీజు రూ.10 లక్షలు ఉంటే.. సామాన్యుడికి భారం కాకుడదని రూ.5లక్షలకు తగ్గించాం. ఈ మొత్తం కూడా ఒకేసారి కాకుండా సెమిస్టర్కు రూ.62,500 చొప్పున 8 విడతలుగా చెల్లించేలా నిబంధనలు తెచ్చాం. తెలంగాణ వ్యవసాయ వర్సిటీ వివిధ దేశాలతో పలు ఒప్పందాలు చేసుకుంది. అమెరికాలోని కాన్సాప్ స్టేట్ యూనివర్సిటీ, ఫ్లోరిడా యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీతో ఒప్పందాలు చేసుకున్నాం. దేశీయ సంస్థలైన బిట్స్పిలాని, ఐసీఎఆర్, ఐఐఆర్ఆర్, స్విట్జర్లాండ్కు చెందిన సార్ మ్యాప్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. వ్యవసాయ యూనివర్సిటిలో 2013 నుంచి వైస్ చాన్స్లర్ పోస్టు మినహా మిగతా ఖాళీగా ఉండేవి. నేను బాధ్యతలు తీసుకున్న 100 రోజుల్లో యూనివర్సిటీ ఉన్నతాధికారులు పోస్టులు భర్తీ చేసి పాలన సజావుగా జరిగేలా చూశాను. రిజిస్ట్రార్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్, డీన్ ఆఫ్ రిసెర్చ్, డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్..ఇలా అన్ని పోస్టులను భర్తీ చేశాం. రసాయనాలు తగ్గించేలా సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు చేస్తున్నాం. పురుగుల మందులతో రక రకాల సమస్యలు వస్తున్నాయి. యూరియాపై సబ్సిడీ ఇవ్వడంలో కేంద్రప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. రాష్ట్రంలో డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేని చోట రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాల ద్వారా రైతులకు సాగుపై సలహాలు, సూచనలు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఏడు వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. వీటికి తోడు అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కళాశాల, రెండు ఫుడ్ సైన్స్ కళాశాలలు, ఒక హోం సైన్స్ కళాశాల ఉంది. ఒక వ్యవసాయ కళాశాల స్థాపించేందుకు ఐసీఎఆర్ నిబంధనల ప్రకారం 100 ఎకరాలతోపాటు రూ.150 కోట్లు నిధులు అవసరం. ప్రతి కళాశాలకు 180 మంది సిబ్బంది ఉండాలి. ఇందులో 40 మంది టీచింగ్ సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉంది. డాక్టర్ జానయ్య జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాల్లోకి తీసుకెళ్లేందుకు న్యూ టెక్నాలజీ రూపంలో ముందుకెళ్తున్నామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్య అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి వచ్చిన ఆయన శ్రీసాక్షిశ్రీతో ముచ్చటించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్య -
నేటినుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: నేటి నుంచి నాలుగు రోజుల పాటు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం కబడ్డీ కూతతో హోరెత్తనుంది. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పోటీలకు రాష్ట్రంలోని 33జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారు. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు క్రీడాదుస్తులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ అమిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశ్గౌడ్, రాష్ట్ర కబడ్డీ సంఘ ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు, కోచ్లు మల్లేశ్, శ్రీనివాస్, పద్మ అందించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, సీపీ, ప్రముఖులు హాజరుకానున్నారు. -
వ్యవసాయం.. జీవన విధానం
కరీంనగర్: వ్యవసాయం వృత్తి కాదు.. జీవన విధానమని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన కిసాన్ గ్రామీణ మేళాను ప్రారంభించారు. స్టాల్స్ను సందర్శించారు. అధునాతన వ్యవసాయ యంత్రాలు, సీడ్స్, డెయిరీ, ఆర్గానిక్ స్టోర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అందుకోసం రైతులు సంఘటితంగా మారాలన్నారు. తమ భూములను భూసార పరీక్ష చేసుకొని, తగిన మోతాదులో ఎరువులు వాడటం ద్వారా అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. కిసాన్ జాగరణ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని, యువత వ్యవసాయం, ఇతర చేతివృత్తుల పైపు కాకుండా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల వైపు వలసలు వెళ్తున్నారని అన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుకు, వారిని చైతన్యపరచుటకు కిసాన్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు సమగ్ర వ్యవసాయం వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన రైతు రక్షణవేదిక యూట్యూబ్ చానల్ను దత్తాత్రేయ చేతుల మీదుగా ప్రారంభించారు. వరంగల్ మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్రావు, ట్రాన్స్పోర్ట్ చైర్మన్ సమ్మిరెడ్డి, గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు మల్లేశం యాదవ్, మారుతి, బ్రహ్మం, శ్రీకాంత్రెడ్డి, మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షం హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కరీంనగర్లో కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభం -
నానీ లే.. అన్నం పెడతా
● సెప్టిక్ ట్యాంకు తొట్టిలో పడి చిన్నారి మృతి ● సిరిసిల్లలో విషాదం సిరిసిల్లటౌన్: నానీ లే నానీ..ఆకలి అన్నావుగా..అన్నం పెడతా..ఆడుకునేటోన్ని నేను స్ట్రాంగ్ అంటావుగా ఇలా పడిపోయావు..లే నాన్న అంటూ.. ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంటనీరు పెట్టించింది. బడి నుంచి వచ్చి ఆటకని బయటకు వెళ్లిన చిన్నారి సెప్టిక్ట్యాంకు తొట్టిలో పడి మృతిచెందిన సంఘటన బుధవారం సిరిసిల్లలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. మామిడి లావణ్య–శ్రీనివాస్ దంపతులకు నికేశ్(6) కొడుకు. లావణ్య అనారోగ్యంతో పట్టణంలోని సర్దార్నగర్లో తల్లి వద్దే ఉంటూ.. కొడుకును చదివిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదివే నికేశ్ రోజు మాదిరిగానే బడికెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆడుకునేందుకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి తల్లి లావణ్య కొడుకు కోసం ఆ ఏరియా మొత్తం గాలించింది. అదే ప్రాంతంలో కుసుమ శ్రీనివాస్ కొత్త ఇల్లు కడుతున్నాడు. సెప్టిక్ట్యాంకులో ఏదో పడిందని చూస్తుండగా బాలుడు పడిపోయినట్లు గమనించి స్థానికుల సాయంతో బయటకు తీయించారు. లావణ్య అక్కడికి చేరుకొని అచేతన స్థితిలో ఉన్న కొడుకుని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా సెప్టిక్ట్యాంకు తొట్టికి మూత లేకపోవడంతో ఆ ప్రదేశానికి ఆటకు వచ్చిన నికేశ్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. -
రైళ్ల వేగం మరింత పెంపు
● రైలుపట్టాల కింద సిమెంట్ స్లీపర్లు ● పాత సిమెంట్ స్లీపర్ల తొలగింపు ● కాజీపేట – బల్హార్షా సెక్షన్ల మధ్య పనులు ఓదెల(పెద్దపల్లి): కాజీపేట బల్హార్షా సెక్షన్ల మధ్య రైళ్లవేగం మరింత పెంచేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి వరకు రైలుపట్టాల కింద కొత్త సిమెంట్ స్లీపర్లు అమర్చుతున్నారు. ప్రస్తుతం మూడోలైన్ అందుబాటులోకి రావడంతో ఒకేమార్గంలో రెండు రైళ్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నాయి. కాలం చెల్లిన సిమెంట్ స్లీపర్లను తొలగించి రైలు వేగాన్ని తట్టుకునేలా గేజ్పెంచిన ఆధునిక సిమెంట్ స్లీపర్లు వేస్తున్నారు. ఒక్కో రైలు వేగం గంటకు 110 కి.మీ. ఉందని, దానిని గంటకు 130 కి.మీ. వరకు పెంచేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. మూడోలైన్తో గూడ్సురైళ్ల వేగం కూడా పెంచనున్నారు. ఒక రైలు వెనకాల మరోరైలు వెళ్లేందుకు వీలుగా ఆటోమెటిక్ సిగ్నల్స్ సిస్టం ప్రారంభించారు. -
గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
ధర్మపురి: అర్హులందరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 140 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు పంపిణీ చేశారు. మొదటి, రెండో 172 మంది లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందించామని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. ఇళ్లు కట్టుకున్న ప్రతి కుటుంబానికీ రూ.5లక్షలు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కన్నం హారిణి, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. -
ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
జగిత్యాల: క్రిస్మస్ పండుగ అత్యంత పవిత్రమైందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయమని, ప్రేమను పంచుకోవడం, సేవభావంతో మానవత్వం కాపాడుకోవడం ఎలా అనేవి క్రీస్తుబోధనలు తెలియజేస్తాయన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. హెచ్ఐవీ బాధితులకు చికిత్స అందించాలిజగిత్యాల: హెచ్ఐవీ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఆర్టీ కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 4,387 మంది మహమ్మారి బారిన పడ్డారని, వారిలో 3900 మంది ఏఆర్టీ చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. 117 మందికి మహమ్మారి వ్యాప్తి చెందిందని, వారికి చికిత్స అందించాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు 15,963 మందికి రక్త పరీక్షలు చేశామన్నారు. సమావేశంలో డాక్టర్ శిరీష, శ్రావణి పాల్గొన్నారు. పెట్రోల్ బంక్ తొలగించండిజగిత్యాలటౌన్: యావర్రోడ్డు విస్తరణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న పెట్రోల్ బంక్ను తొలగించాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు దుమాల గంగారాం అన్నారు. జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా యావర్రోడ్డు విస్తరణకు కట్టుబడి ఉన్నానన్న ఎమ్మెల్యే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ముందుగా మంచాల కృష్ణ పెట్రోల్ పంపు తొలగించాలని సూచించారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తే అన్ని కుల, ప్రజాసంఘాలను కలుపుకుని ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామన్నారు. బెజ్జంకి సతీష్, బొల్లె అనిల్, పొడేటి సునీల్ తదితరులు పాల్గొన్నారు. మల్యాల పీహెచ్సీ తనిఖీమల్యాల: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డీఎంహెచ్వో శ్రీనివాస్ తనిఖీ చేశారు. ల్యాబ్, ఫార్మసీ రిజిస్టర్లను పరిశీలించారు. మాతాశిశు కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. వైద్యురాలు మౌనిక ఆయనను సన్మానించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్, హెచ్ఈఓ రమేశ్, సిబ్బంది సాధిక్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. రోళ్లవాగు కాలువకు మరమ్మతుజగిత్యాలరూరల్: రైతులకు సాగునీరు అందించేందుకు రోల్లవాగు ప్రధాన కాలువకు మరమ్మతు చేపట్టినట్లు డీఈ చక్రూనాయక్ అన్నారు. ఇటీవలి భారీ వర్షాలకు బీర్పూర్ చౌరస్తా వద్ద రోళ్లవాగు ప్రధాన కాలువకు గండిపడగా బుధవారం పూడ్చివేయించి మరమ్మతు చేపట్టారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ సాగునీరు విడుదలవుతుండడంతో ప్రాజెక్ట్ నుంచి రైతులకు సాగునీరు అందించేందుకు సాగునీరు వృథా కాకుండా కాలువలకు మరమ్మతు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఏఈ అనిల్ పాల్గొన్నారు. -
డబ్బులు ఇప్పించాలని సెల్ టవర్ ఎక్కిన రైతు
● ఎస్ఐ సూచనతో దిగివచ్చిన బాధితుడు ఇల్లంతకుంట(వేములవాడ): అమ్మిన భూమి పైసలు ఇవ్వడం లేదని సెల్ టవర్ ఎక్కగా.. పోలీసులు కల్పించుకోవడంతో దిగారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన రైతు, మాజీ ఉపసర్పంచ్ కర్ల రవి బుధవారం వల్లంపట్ల పొలిమేరలోని సెల్టవర్ ఎక్కాడు. అది చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సెల్టవర్ పై నుంచే తన బాధను ఫోన్లో ఎస్సైకి వివరించగా.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దిగి వచ్చాడు. తన 3.13 ఎకరాల వ్యవసాయ భూమిని రూ.75.47లక్షలకు గ్రామానికి చెందిన మాందాటి కరుణాకర్రెడ్డికి మూడేళ్ల క్రితం అమ్మి రిజిస్ట్రేషన్ చేశానని తెలిపారు. అయితే ఇంకా తనకు వడ్డీతో సహా రూ.43లక్షలు రావాల్సి ఉందని, ఇవ్వడం లేదని తెలిపారు. రెవెన్యూ అధికారి శశికుమార్ రిపోర్ట్ నమోదు చేసి తహసీల్దార్ ఫరూక్కు అందజేశారు. తనకు న్యాయం చేయాల్సిందిగా కర్ల రవి అధికారులను వేడుకున్నాడు. -
ఒంటరి తనం భరించలేక ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
మేడిపల్లి: మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొండాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి జలందర్ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా, కొద్ది నెలలకే విడాకులయ్యాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న జలందర్ ఇలీవలే గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చాడు. 18 నెలలుగా ఒంటరిగా ఉంటున్న జలందర్ మానసికంగా బాధపడుతున్నాడు. జీవితం మీద విరక్తితో మంగళవారం ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి గొల్లపల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. 14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేతరాయికల్: మండలంలోని ఇటిక్యాల పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్లను మంగళవారం తహసీల్దార్ నాగార్జున మైనింగ్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. కుజదోష నివారణ పూజలు ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మంగళవారం కుజదో ష నివారణ పూజలు చేశారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య కుటుంబ కలహాలు, వాస్తుదోషాలు ఉన్నవారు కుజదోష నివారణ పూజలు చేశారు. జలంధర్(ఫైల్) -
పొగమంచుతో రైళ్ల ఆలస్యం
రామగుండం: ఉత్తరాదిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో న్యూఢిల్లీ, బిహార్, యూపీ రాష్ట్రాల నుంచి వచ్చే పలు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. అయ్యప్ప మాలాధారణ స్వాములు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. న్యూఢిల్లీ నుంచి చైన్నె, త్రివేండ్రం వైపు వెళ్లే సూపర్ఫాస్ట్ రైళ్ల మంగళవారం చాలా ఆలస్యంగా నడిచాయి. మధురై సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(20494) మధ్యాహ్నం 2.53 గంటలకు రామగుండం రావాల్సి ఉంది. కానీ, ఏడు గంటల ఆలస్యంతో రాత్రిపది గంటలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏపీ ఎక్స్ప్రెస్(20806) మధ్యాహ్నం 3.50గంటలకు రావాల్సి ఉండగా ఆరు గంటల ఆలస్యంగా నడుస్తోంది. జీటీ ఎక్స్ప్రెస్(12616) సాయంత్రం 4.10గంటలకు రావాల్సి ఉండగా 4 గంటల ఆలస్యంగా నడుస్తోంది. కేరళ ఎక్స్ప్రెస్(12626) మధా్య్హ్నం 3.23గంటలకు రావాల్సి ఉండగా 11 గంటల ఆలస్యంతో బుధవారం వేకువజామున నాలుగు గంటలకు రామగుండం రానుంది. సంఘమిత్ర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(12296 ) రాత్రి 9.45గంటలకు రావాల్సి ఉండగా రెండు గంటల ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు తెలిపారు. -
కూతుళ్లు పట్టించుకోవడం లేదని..
జగిత్యాలటౌన్: కనిపెంచిన కూతుళ్లు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మంగళవారం జగిత్యాల ఆర్డీవోను ఆశ్రయించారు. జిల్లాకేంద్రానికి చెందిన గుండ మల్లేశ్వరి, శంకర్ దంపతులకు నలుగురు కూతుళ్లు. వీరిలో పెద్ద కూతురు మాత్రమే తల్లిదండ్రుల సంరక్షణ తీసుకుంది. మిగిలిన వారు తమను పట్టించుకోవడం లేదని, పక్షవాతంతో బాధపడుతున్న తమను ఉన్న ఆస్తిని వారి పేరిట మార్చాలంటూ వేధిస్తున్నారని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్ సహకారంతో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పీసీ హన్మంతరెడ్డి, వి.ప్రకాష్రావు, నాయిని సంజీవరావు ఉన్నారు. -
ఓటరు జాబితా సవరణ చేపట్టాలి
జగిత్యాల: ఓటరు జాబితా సవరణ మ్యాపింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్స్లో ఓటరు జాబితా మ్యాపింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటరు జాబితా సవరణ, డెమోగ్రఫిక్, సిమిలర్ ఎంట్రీలను నూతన జాబితాను జనవరి 13 నాటికి పూర్తి చేయాలన్నారు. రాబోయే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా బ్లర్ ఫొటోలున్న ఓటరు ఎంట్రీలను ఒకే వ్యక్తికి సంబంధించిన సమాన వివరాలున్న డూప్లికేట్ వివరాలను పరిశీలించి సవరణ చేపట్టాలన్నారు. బీఎల్వో, తహసీల్దార్లు, డీటీలు, సూపర్వైజర్లకు ఓటరు జాబితా తప్పులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన, తహసీల్దార్ పాల్గొన్నారు. -
కన్నుల పండువగా అయ్యప్ప మహాపడిపూజ
రాయికల్:రాయికల్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నివేదిత కృష్ణారావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, మాతలతో కుంకుమపూజ, స్వాములతో లక్ష పుష్పార్చన, 108 కలశాలతో అయ్యప్ప అభిషేకం చేశారు. శబరిమల సహాయ అర్చకులు ఉన్ని కృష్ణన్ నంబూద్రి ఆధ్వర్యంలో మహాపడిపూజ నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ హిమవంతరావు, మున్సిపల్ కమిషనర్ మనోహర్గౌడ్, పర్యవేక్షకులు ఏలిగేటి రామకృష్ణ, రమేశ్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. -
వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చాలి
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చితేనే రైతులకు మనుగడ సాధ్యమని పలువురు వక్తలు అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం జాతీయ రైతు సదస్సు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయంలోనూ ఇతర దేశాలతో పోటీపడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మనం పండించిన పంటల్లో రసాయనాల శాతం అధికంగా ఉండటంతో అమెరికా వంటి చాలా దేశాలు మన ఉత్పత్తులను తిరస్కరిస్తున్నాయని తెలిపారు. సహకార సంఘాలు, ఎఫ్పీఓ సంఘాలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రతి పంటకూ ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. రైతు భూసార పరీక్షలు చేయించుకుని, ఆ మేరకు రసాయన ఎరువులు వాడాలన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్కుమార్ శర్మ మాట్లాడుతూ.. మానవ రహిత వ్యవసాయం చేసేందుకు వర్సిటీ పరిధిలో రోబోటిక్ ల్యాబ్ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ మాట్లాడుతూ.. మార్కెట్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పంటల సరళి మార్చాలన్నారు. వరి పంటల్లో యాజమాన్య పద్ధతులపై శ్రీనివాస్, నూతన వరి రకాలపై సతీష్చంద్ర, యాసంగి పంటల్లో వచ్చే తెగుళ్లపై ఎన్.సుమలత, పంటల్లో యాజమాన్య పద్ధతులపై వై.స్వాతి, రవి, మామిడి పంటపై కె.స్వాతి, రబీలో జింక్లోపంపై సాయినాథ్ వివరించారు. కోతుల బెడదతో వ్యవసాయం చేయలేకపోతున్నామని, రైతులకు అవసరమైన విషయాలపైనే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని రైతులు కోరారు. ఉత్తర తెలంగాణలోని వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు రూపొందించిన వరి, చెరుకు, పత్తి, నువ్వులు, మొక్కజొన్న రకాలను ప్రదర్శనగా పెట్టారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ భారతీనారాయణ్ భట్, పొలాస సర్పంచ్ శంకరయ్య పాల్గొన్నారు.మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్, హాజరైన వివిధ జిల్లాల రైతులు రైతు వ్యాపారిలా ఆలోచించాలి అప్పుడే అన్నదాతలకు మనుగడ పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీయ రైతు సదస్సు పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు, శాస్త్రవేత్తలు ఆకట్టుకున్న వివిధ స్టాళ్లు -
కోరుట్లకు నిధులివ్వడంలో సర్కారు నిర్లక్ష్యం
● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి: కోరుట్ల నియోజకవర్గానికి నిధుల మంజూరు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు దామోదర్రావు మంజూరు చేసిన రూ.40లక్షలతో పట్టణంలో నిర్మించే ప్రభుత్వ పాఠశాల భవనం పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైతే పేద, మధ్యతరగతి విద్యార్థులకు మేలు జరుగుతుందని, కాంగ్రెస్ వైఖరితో నిధులు మంజూరుకాక ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయని వెల్లడించారు. నియోజకవర్గంలో అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటికి అవసరమైన నిధులు విడుదల చేయాలని విజ్ఞ ప్తి చేసినప్పటికీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. డీఈఓ రాము, ఎంఈఓ చంద్రశేఖ ర్, బల్దియా కమిషనర్ మోహన్ తదితరులున్నారు. పోలీస్ సిబ్బందికి ఆధునిక జిమ్జగిత్యాలక్రైం: పోలీసులు శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం కోసం ఆధునిక జిమ్ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. ఎస్పీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన జిమ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి శారీరక ఫిట్నెస్ ముఖ్యమన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలందిస్తారని తెలిపారు. అధికారులు ఖాళీ సమయంలో వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు ఆరీఫ్ అలీఖాన్, రఫీక్ఖాన్, కిరణ్కుమార్, సైదులు, వేణు పాల్గొన్నారు. జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలిగొల్లపల్లి: గొర్రెలు, మేకల పెంపకందారులు ప్రభుత్వం అందించే నట్టల నివారణ మందును జీవాలకు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బోనగిరి నరేశ్ అన్నారు. మండలకేంద్రంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ నల్ల నీరజతో కలిసి మంగళవారం ప్రారంభించారు. జీవాల్లో పరాన్నజీవులతో కలిగే నష్టాలను నివారించి, వాటి ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం మందు సరఫరా చేస్తోందన్నారు. ఈనెల 31 వరకు మందులు వేస్తామన్నారు. వెటర్నరీ వైద్యుడు రవీందర్, సిబ్బంది గంగాధర్, రాజశ్రీ, రవి, రమేశ్, నిశాంత్, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. జేఎన్టీయూలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లిలోగల జేఎన్టీయూలో బీటెక్ విద్యార్థులకు ఎక్స్ఎల్ఆర్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం క్యాంపస్ రిక్యూర్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ అవినాష్ సంస్థ విధివిధానాలు, ఉద్యోగ అవకాశాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం వివిధ దశలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. 170 మంది హాజరుకాగా.. 20 మందిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న వారికి వార్షిక వేతనం రూ.4లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుందని, 2026 ఫిబ్రవరిలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందని కళాశాల ప్లేస్మెంట్ అధికారి సతీష్ కుమార్ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న వారిని ప్రిన్సిపల్ నరసింహ అభినందించారు. -
కాకతీయ కాలువకు నీటి షెడ్యూల్ విడుదల
జగిత్యాలఅగ్రికల్చర్: ఎస్సారెస్పీ కాకతీయ కాలువకు బుధవారం నుంచి నీరు విడుదల చేయనున్న విషయం తెల్సిందే. ఈ మేరకు షెడ్యూల్ను ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు. ఏడు విడతలుగా వారబంధీ పద్ధతిలో ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 24 నుంచి మార్చి 31 వరకు ప్రతిరోజూ నీరు విడుదల చేస్తారు. మొదటి విభాగంలో డిస్ట్రిబ్యూటరీ కాలువ–5 నుంచి 53 వరకు ఏడు రోజులు, రెండో విభాగంలో డి–54 నుంచి 94 వరకు 8 రోజులు విడుదల చేయనున్నారు. మొదటి విభాగానికి నీరు ఇచ్చినప్పుడు రెండో విభాగానికి నీరు వెళ్లకుండా జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లి వద్ద కాలువ గేట్లు మూస్తారు. రెండో విభాగానికి నీరు ఇచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటరీ గేట్లను మూసివేస్తారు. జిల్లాలో 62 డిస్ట్రిబ్యూటరీలు కాకతీయ ప్రధాన కాల్వ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం నుంచి పెగడపల్లి వరకు 91 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. డి–21 నుంచి డి–83ఎ వరకు 62 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. ఒక్కో డిస్ట్రిబ్యూటరీ ఆయకట్టు ఏరియాను బట్టి కాలువకు ఎడమ వైపు 25, కుడివైపు మరో 25 మైనర్ కాలువలు ఉంటాయి. ఈ మైనర్ కాలువల ద్వారా సాగునీరు పంట పొలాలకు వెళ్తుంది. -
మా బతుకులు మారవా..?
● సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన ● జీతం చారెడు.. పని బారెడు ● అరకొర వేతనాలతో ఇబ్బందులు కరీంనగర్టౌన్: జిల్లా విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా పథకంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న 1,993 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నా ప్రభుత్వాలు తమపై చిన్నచూపు చూస్తున్నాయని వాపోతున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోమార్లు చర్చలకు పిలిచినా ఫలితం లేకపోయిందని, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే సచివాలయానికి పిలిచి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా నేటికీ నెరవేరకపోవడంతో తమ పరిస్థితి ముందు నొయ్యి.. వెనుక గొయ్యిలా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,993 మంది ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్షా విభాగంలో వివిధ కేటగిరీల్లో 1,993 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 560 మంది, కరీంనగర్లో 560, పెద్దపల్లిలో 428, రాజన్నసిరిసిల్లలో 445 మంది ఉన్నారు. కేజీబీవీల్లో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది, యూఆర్ఎస్ పాఠశాలల్లో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది, డీపీవో కాంట్రాక్ట్ స్టాఫ్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్, ఎంఆర్సీ కంప్యూటర్ ఆపరేటర్స్, భవిత సెంటర్లలో ఐఈఆర్పీలు, సీర్పీలు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఎంఆర్సీ మెసెంజర్లుగా, వాచ్మెన్లుగా, స్కావెంజర్, కుక్స్గా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ భద్రత కరువు విధి నిర్వహణలో పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి, ఇతరకారణాల వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు మరణిస్తే ప్రభుత్వం నేటి వరకు ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని ఆదుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న విధంగా తెలంగాణలో కూడా టీఏ, డీఏలు ఇస్తూ ఉద్యోగ భద్రత, తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మొండిచేయి ఆంధ్రప్రదేశ్లో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణలో కంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, గతంలో ఉన్నత విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం మొండిచేయి చూపుతోందన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ నియామకాలకు సరిపోయే విద్యార్హతలు ఉన్నా వెయిటేజీ ఇవ్వకపోవడంతో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. -
కబడ్డీ.. కబడ్డీ
కరీంనగర్స్పోర్ట్స్: కబడ్డీ.. కబడ్డీ.. కూత రేపటినుంచి నగరంలో హోరెత్తనుంది. రాష్ట్రస్థాయి కబడ్డీపోటీలకు కరీంనగర్ వేదికై ంది. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు అంబేద్కర్స్టేడియంలోని హాకీ మైదానంలో 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయి. 17ఏళ్ల తరువాత రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయి. పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారు. పురుషులు, మహిళల విభాగంలో 32 జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి 2 జట్లు హాజరుకానున్నాయి. మొత్తంగా 34 చొప్పున పురుషుల, మహిళల జట్లు ట్రోపీ కోసం పోటీపడనున్నాయి. 952 మంది క్రీడాకారులు, 156 మంది కోచ్, మేనేజర్లు, 100 మంది రెఫరీలు, 40 మంది కబడ్డీ సంఘం ప్రతినిధులు హాజరుకానున్నారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. ఆస్ట్రో టర్ఫ్ కోర్టులపై ఆట అంబేద్కర్ స్టేడియంలోని హాకీ మైదానాన్ని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్లో తొలిసారిగా ఆస్ట్రోటర్ఫ్ కోర్టులపై కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. గతంలో ఇదే స్టేడియంలోని ఇండోర్హాల్లో కబడ్డీ ప్రీమీయర్ లీగ్ నిర్వహించారు. ఈసారి ఆరు కోర్టులు సిద్ధం చేస్తున్నారు. మంత్రులతో ప్రారంభం 17 ఏళ్ల తరువాత కరీంనగర్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్, సీపీ, మున్సిపల్ కమిషనర్ హాజరుకానున్నట్లు కబడ్డీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు తెలిపారు. 28న జరిగే ముగింపు పోటీలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. 8 చొప్పున పూల్లు.. 142 మ్యాచ్లు అంబేద్కర్ స్టేడియంలో నాలుగు రోజులు కబడ్డీ కూత మోగనుంది. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరగనున్నాయి. మహిళలు, పురుషుల జట్లను 8 విభాగాల చొప్పున మొత్తం 16 గ్రూప్లుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. మొత్తంగా 142 మ్యాచ్లు జరుగనున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళలో మ్యాచ్లు జరుగనున్నాయి. రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించడానికి సన్నద్ధం చేస్తున్నారు. ఇక్కడ రాణించిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపికచేసి, 72వ జాతీయస్థాయి సీనియర్స్ పోటీలకు పంపనున్నారు. మహిళల జాతీయ కబడ్డీ పోటీలు హైదరాబాద్లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనుండగా, పురుషుల పోటీలు గుజరాత్లో ఫిబ్రవరి 24 నుంచి 27వరకు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జరిగే 72వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్, పారమిత విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఈ.ప్రసాద్రావు పిలుపునిచ్చారు. మంగళవారం మంకమ్మతోటలోని పారమిత పాఠశాలలో పోటీల వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వేదికగా 17ఏళ్ల అనంతరం కబడ్డీలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అమిత్ కుమార్, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి మల్లేశ్గౌడ్, పారమిత విద్యాసంస్థల డైరెక్టర్ అనుకర్ రావు, కబడ్డీ సంఘం కోశాధికారి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. రేపటి నుంచి కరీంనగర్ వేదికగా రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీలు 33 జిల్లాల నుంచి హాజరుకానన్న క్రీడాకారులు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా కబడ్డీ సంఘం -
కొత్త పంటల గురించి తెలిసింది
మా ప్రాంతంలో పత్తి, జొన్న, మక్క వేస్తాం. పరిశోధన స్థానంలో సాగుచేసే ఆవాలు, అలిసెంత వంటి కొత్త పంటల గురించి తెలుసుకున్నాం. కొత్త విషయాలు తెలుసుకునేందుకు పొలాస పరిశోధన స్థానంలో జరిగే ప్రతి సదస్సుకు హాజరవుతుంటాను. – గంగుబాయి, ఊట్నూర్, మంచిర్యాల జిల్లా ఇక్కడ శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలను ఆకళింపు చేసుకుని, మా పొలంలో ప్రయోగాలు చేస్తుంటాను. రైతు సదస్సుకు రావడంతో ఎన్నో కొత్త సాగు విషయాలు తెలిశాయి. తోటి రైతులు సాగు చేసే పంటల గురించి తెలుసుకున్నాను. – పవన్కుమార్, భోదన్, నిజమాబాద్ జిల్లా రైతు సదస్సులో ఖర్చు తగ్గించే పద్ధతులు చెప్పారు. యాసంగిలో పంటల్లో ఏ సమస్యలు వస్తాయి..? వాటిని ఎలా ఎదుర్కోనాలనే విషయాలను వివరించారు. వరిని ఎక్కువగా సాగు చేస్తుండటంతో ఇతర పంటలవైపు దృష్టి మళ్లింది. – మహేష్, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా -
ఇటుకబట్టీల్లో విచారణ
పెద్దపల్లిరూరల్: గౌరెడ్డిపేట గ్రామశివారులోని ఓ ఇటుకబట్టీలో రెవెన్యూ, పోలీస్, కార్మికశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. కనీస సౌకర్యాలు లేవని జాతీయ మానవహక్కుల సంఘానికి కొంతకాలం ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం విచారణ చేసినట్లు తెలిసింది. ఇటుకబట్టీ నిర్వహణ తీరు పరిశీలించిన కార్మికశాఖ అధికారి హేమలత, రూరల్ ఎస్సై మల్లేశ్, రెవెన్యూ డెప్యూటీ తహసీల్దార్ విజేందర్.. నిర్వహణకు సంబంధించిన రికార్డులు తనిఖీచేసి నివేదిక రూపొందించారు. బుధవారం కలెక్టర్కు నివేదించనున్నట్లు కార్మికశాఖ అధికారి హేమలత తెలిపారు. -
‘యావర్' చుట్టూ రాజకీయం
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని యావర్రోడ్ ఎన్హెచ్–63ను కొత్తబస్టాండ్ నుంచి ధర్మపురి రోడ్ వరకు తాకుతుంది. ఇది జిల్లాకేంద్రంలోనే ప్రధానమైన వాణిజ్య వ్యాపారాలు గల రోడ్డు. దీనిని విస్తరించాలని గతంలో చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ అక్కడున్న వ్యాపారులు కోర్టులకు వెళ్లడం, ఇతరత్రా కారణాలతో నిలిచిపోయింది. జిల్లాకేంద్రం కావడం.. వాణిజ్య కేంద్రాలు పెరిగిపోవడంతో రోడ్డంతా ఇరుకుగా మారింది. ప్రస్తుతం 80 ఫీట్లుగా ఉన్న ఈ దారిని 100ఫీట్లకు విస్తరిస్తే తప్ప ఇబ్బందులు తప్పేలా లేవు. రోడ్డు ఇరుకుగా మారడంతో ప్రయాణికులు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పైగా ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడిననాటి నుంచి.. జగిత్యాల మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి ఉన్న రోడ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జగిత్యాలకు ప్రధానమైంది యావర్రోడ్డు. జిల్లాకేంద్రం కావడం, లక్షకు పైగా జనాభా ఉండడం.. నిత్యం వివిధ పనుల నిమిత్తం వందలాది మంది జిల్లాకేంద్రానికి వస్తుంటారు. ఉద్యోగాలు, చదువుల నిమిత్తం వేలాది మంది ఉపాధి పొందుతూ ఇక్కడే ఉంటున్నారు. దీంతో ట్రాఫిక్ అత్యధికంగా పెరిగిపోయింది. ఐదేళ్లకోసారి ప్రజాప్రతినిధులు మారుతున్నా జగిత్యాల రూపురేఖలైతే మారడం లేదు. డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు ఈ యావర్రోడ్ ఇరుకుగా ఉండటంతో గతంలో బైపాస్రోడ్ను నిర్మించారు. బైపాస్రోడ్ కూడా పూర్తిగా ట్రాఫిక్గా మారిపోయింది. అత్యధిక స్కూళ్లు, హోటల్స్, వాణిజ్య వ్యాపారాలు ఆ రోడ్డుపై వెలవడంతో అవి ట్రాఫిక్ సమస్యగానే మారింది. విస్తరణ జరిగేనా..? జిల్లాలో అతిపెద్ద సమస్య అయిన యావర్రోడ్డు విస్తరణకు ఎమ్మెల్యే సంజయ్కుమార్ కోసం కృషి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోట 100 ఫీట్ల రోడ్లు చేపట్టారు. మిగతావి కేసులు ఉండటంతో అలాగే ఉండిపోయాయి. ఆక్రమణలు యావర్రోడ్డు 80 ఫీట్లు ఉన్నా.. వ్యాపారులు రోడ్డు ను ఆక్రమించుకున్నారు. ఎలాంటి సెట్బ్యాక్ పా టించకుండా వ్యాపారాలు నిర్వహించడంతో ప్రజల రాకపోకలకూ కష్టంగా మారుతోంది. కనీసం వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. యావర్రోడ్డులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఇటీవల మాజీమంత్రి జీవన్రెడ్డి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. బైపాస్ అంటేనే భయం జిల్లా కేంద్రం కాకముందు ప్రజల వెసులుబాటు కోసం బైపాస్రోడ్ వేశారు. ఆ సమయంలోనే బైపాస్ను 100 ఫీట్లు వేస్తే బాగుండేది. ఆ రోడ్డు ఇప్పుడు ఇరుకుగా మారడం.. జనాభా, ట్రాఫిక్ పెరిగిపోవడం సమస్యగా మారింది. ఇరుకు రోడ్లే.. జిల్లా కేంద్రంలో ప్రదానమైన రోడ్లన్నీ ఇరుకుగానే ఉన్నాయి. 1983లోనే ఉన్న మాస్టర్ ప్లానే అమలు కావడంతో రోడ్లు అభివృద్ధి కావడం లేదు. మా స్టర్ ప్లాన్ అమలు కాకపోవడం, రోడ్లు విస్తరణ కాకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరంగా మా రింది. కనీసం వాహనాలు పార్కింగ్ చేద్దామన్నా స్థలాలు లేని పరిస్థితి. ముఖ్యంగా తహసీల్ చౌరస్తా నుంచి టవర్ నుంచి కొత్తబస్టాండ్, గంజ్ కనీసం ఆటో సై తం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ యావర్రోడ్తో పాటు, బైపాస్రోడ్ల విస్తరణ చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సీఎం దృష్టికి రోడ్డు విస్తరణ యావర్రోడ్డును విస్తరించాలని, ఇందుకు నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే సంజయకుమార్ సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రోడ్డు విస్తరిస్తేనే తాను రాజకీయాల్లో కొనసాగుతాయని కూడా ప్రకటించారు. దీనిపై మాజీమంత్రి జీవన్రెడ్డి స్పందించారు. పదేళ్లుగా ఏం చేశారని, ఇప్పుడు రహదారి విస్తరిస్తేనే రాజకీయాల్లో ఉంటానని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మొత్తంగా జిల్లా రాజకీయం మొత్తం ఈ యావర్ రోడ్డు చుట్టే తిరుగుతోంది. -
జిల్లాలో నేరాలు తగ్గుముఖం
జగిత్యాలక్రైం: జిల్లాలో ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని, ఇందుకు పోలీస్శాఖ చేపట్టిన శాంతి భద్రతల రక్షణే కారణమని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. 2025లో నేరాలు, పోలీసుసేవలపై ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. హత్యలు, దోపిడీలు, చైన్స్నాచింగ్, ఆన్లైన్ మోసాల్లో నిందితులను త్వరితగతిన గుర్తించామని, పెండింగ్ కేసుల పరిష్కారంలో పురోగతి సాధించామని తెలిపారు. షీ టీమ్స్, ఏహెచ్టీయూ, భరోసా కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామన్నారు. గతేడాది 5,919 నేరాలు నమోదు కాగా.. ఈ ఏడాది 5,620 నమోదయ్యాయని, ఈ లెక్కన 229 కేసులు తగ్గినట్లయ్యిందన్నారు. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో అత్యధికంగా 770 కేసులు, అత్యల్పంగా బుగ్గారం పోలీస్ స్టేషన్లో 135 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 29 హత్య కేసులు, 381 ప్రాపర్టీ కేసులు నమోదయ్యాయని, 187 కేసులను చేధించి రూ.22,92,37,439 రికవరీ చేశామన్నారు. 104 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదై గతేడాదితో పోలిస్తే 5 కేసులు తగ్గాయన్నారు. 19 కేసుల్లో 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాలో 234 కేసుల్లో 410 మంది నిందితులు, 260 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, గేమింగ్ యాక్ట్ కింద 167 కేసులు నమోదుకాగా.. నిందితుల నుంచి రూ.30,62,036 స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 9,290 కేసులు నమోదయ్యాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేశామన్నారు. 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 86 కేసులు నమోదు చేశామని, 203 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 33మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశామన్నారు. డయల్ 100 కాల్ ద్వారా 30,954 కాల్స్ రాగా.. 130 కేసులు నమోదు చేశామన్నారు. గల్ఫ్ పంపిస్తామని చెప్పి మోసం చేసిన వాటిలో 44 కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్ట్ చేశామన్నారు. అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఏడుగురిపై కేసు పెట్టామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై 21 కేసులు నమోదు చేశామని, 21 మంది నుంచి రూ.2,07,643 విలువైన 318.76 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సంచలన కేసులు.. కోరుట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించామని, 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని రూ.25 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నామని, బర్ నేరాల్లో 1,351 ఫిర్యాదులు రాగా.. రూ.1.72 కోట్లు తిరిగి అందించామని పేర్కొన్నారు. 00 కేసులలో నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టామన్నారు. ఐదు విడతల లోక్అదాలత్ ద్వారా 9,595 కేసులు పరిష్కరించామన్నారు. కొండగట్టు ఆలయం పరిధిలో 383 సీసీ కెమెరాలను జిల్లా కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశామని, గ్రీవెన్స్ డే ద్వారా 720 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారికి న్యాయం చేశామన్నారు. మై ఆటోఈజ్ సేఫ్లో భాగంగా జిల్లాలో 2,093 ఆటోలకు ఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు ఆరీఫ్ అలీఖాన్, కరుణాకర్, రాంనర్సింహారెడ్డి, నీలం రవి, సుధాకర్, రఫీక్ఖాన్, ఆర్ఐలు వేణు, సైదులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..?
● హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల ఆందోళనజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద శక్తి మిల్క్ డెయిరీలో కలవేని కిరణ్ (29) ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన కిరణ్ మిత్రుడు రాజేశ్తో కలిసి అన్నపూర్ణ థియేటర్ వద్ద శక్తి మిల్క్ డెయిరీ ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి ఇద్దరు కలిసి దుకాణం మూసి వేర్వేరు గదుల్లో పడుకున్నారు. మంగళవారం ఉదయం లేచేసరికి కిరణ్ దుకాణంలో ఉరేసుకుని కనిపించాడు. దీంతో రాజేశ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కిరణ్కు ఎలాంటి ఇబ్బందులూ లేవని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీస్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతుడి భార్య వీణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్ తెలిపారు. -
ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ను జీపీటీ హుస్నాబాద్ కళాశాల జట్టు కై వసం చేసుకోగా బాలికల విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రభుత్వ మోడల్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు కై వసం చేసుకున్నాయి. అథ్లెటిక్స్ బాలికల విభాగంలోలో కె.కీర్తన (కరీంనగర్), బాలుర విభాగంలో బి.అభిషేక్(కోరుట్ల) చాంపియన్గా నిలిచారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ డి.శోభారాణి ట్రోఫీలు అందించారు. బాలికల విజేత కరీంనగర్, బాలుర చాంపియన్ హుస్నాబాద్ -
పదేళ్లు ఏం చేశారు..
జగిత్యాలటౌన్: యావర్రోడ్డు విస్తరిస్తేనే రాజకీయాల్లో కొనసాగుతానంటున్న ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలు హాస్యాస్పదని, పదేళ్లుగా ఏం చేశారో ప్రజలకు చెప్పాలని మాజీమంత్రి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యావర్రోడ్డును ఆనుకుని ఉన్న షాపుల యజమానులను ఒప్పించి 40 ఫీట్ల నుంచి 60ఫీట్లకు.. 2014లో తిరిగి ఎమ్మెల్యే అయ్యాక 100ఫీట్లకు విస్తరించేందుకు మున్సిపాలిటీలో తీర్మానాన్ని ఆమోదింపజేశానని, ప్రజాభిప్రాయ సేకరణ చేయించి 2017లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి నివేదించానని గుర్తు చేశారు. ఆ ఫైల్ను తొక్కిపెట్టిన అప్పటిమంత్రి కేటీఆర్ 2018 ఎన్నికల సందర్భంగా సంజయ్ను గెలిపిస్తే యావర్రోడ్డు విస్తరిస్తామంటూ హామీ ఇచ్చారని, 2023 ఎన్నికల్లో టీడీఆర్ను తెరపైకి తెచ్చారని తెలిపారు. కాలయాపనకు కారణమైన ఎమ్మెల్యే చేసిన పాపం కడుక్కుంటే పోదన్నారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ముందు యావర్రోడ్డులోని అక్రమ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకూ ఉందన్నారు. ఆక్రమణలను అడ్డుకుంటున్న అదృశ్యశక్తి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఆయన వెంట బండ శంకర్, గాజుల రాజేందర్, జున్ను రాజేందర్, సురేందర్ పుప్పాల అశోక్, దుర్గయ్య, ధర రమేష్, మన్సూర్, ఎండీ భారీ, రాదాకిషన్, రఘువీర్గౌడ్ ఉన్నారు. గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు మల్లాపూర్/ఇబ్రహీంపట్నం: గోదావరి పుష్కరాల కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ తెలిపారు. మల్లాపూర్ మండలం వాల్గొండ శ్రీరామలింగేశ్వర స్వామి ఆల య సమీపంలో.. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి వద్ద పుష్కరఘాట్లను స్టేట్ టీం సభ్యులతో మంగళవారం పరిశీలించారు. గతంలో పుష్కరా లకు వచ్చిన భక్తులు, వారి కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. 20 27లో గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ధర్మపురి, వాల్గొండతో పాటు ప్రధాన ఘాట్ల వద్ద శాశ్వత ఏర్పాట్లు చేస్తామన్నారు. రద్దీని నియంత్రించడం, ట్రాఫిక్ నిర్వహణపై దృష్టి సారించామన్నారు. తహసీల్దార్లు రమేశ్గౌడ్, వరప్రసాద్, ఎంపీడీవోలు శ్రీకాంత్, గణేశ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఆనంద్, ఇరిగేషన్ డీఈ దే వా నంద్, రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చై ర్మ న్ సాంబారి శంకర్, దేవదాయశాఖ ఈవో విక్రమ్గౌడ్, సర్పంచు గంగాధర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పైడిపల్లిలో ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం
వెల్గటూర్: పైడిపెల్లి గ్రామంలో నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా ముగిసింది. గ్రామంలో నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. రీపోలింగ్ జరపాలని, ప్రమాణ స్వీకారం ఆపాలని గ్రామస్తుల డిమాండ్ల నేపథ్యంలో ప్రమాణస్వీకారంపై కొంత అయోమయం నెలకొంది. పోలీసుల ప్రత్యేక బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నూతన సర్పంచ్ గంగుల మంగ ప్రమాణ స్వీకారం చేశారు. ఒకే కుటుంబం నుంచి ఉపసర్పంచ్, ఇద్దరు వార్డుసభ్యులుకథలాపూర్: మండలంలోని ఊట్పల్లిలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వార్డుసభ్యులుగా గెలుపొందారు. వీరిలో ఒకరు ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామానికి చెందిన ముదాం శేఖర్ 8వ వార్డుసభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ అయ్యారు. ఆయన పెద్దమ్మ ముదాం రాజమణి రెండో వార్డుసభ్యురాలిగా, శేఖర్ పెద్దనాన్న కుమారుడు ముదాం ప్రమోద్ ఒకటో వార్డు నుంచి గెలుపొందారు. ముదాం రాజమణిముదాం ప్రమోద్, ముదాం శేఖర్రాయికల్: మండలంలోని శ్రీరాంనగర్ పంచాయతీలో సర్పంచ్, వార్డుసభ్యులు, చివరకు కార్యదర్శి కూడా మహిళే కావడం విశేషం. సర్పంచ్గా రాధికగౌడ్, ఒకటో వార్డు సభ్యురాలుగా కూస దేవమ్మ, రెండో వార్డు మెంబర్గా శేర్ కిష్టమ్మ, మూడోవార్డ్ మెంబర్గా కొంపల్లి సుమలత, నాలుగో వార్డు సభ్యురాలుగా కొంపల్లి ప్రియాంక గెలుపొంది సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రమాణం చేశారు. వారితో మహిళాకార్యదర్శి అయిన పుష్పలత ప్రమాణం చేయించారు. -
బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 10 మంది బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నేడు జాతీయ రైతు దినోత్సవంజగిత్యాలఅగ్రికల్చర్: పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం జాతీయ రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు పరిశోధన స్థానం డైరెక్టర్ హరీష్కుమార్ శర్మ తెలిపారు. వివిధ పంటల్లో సాగు వివరాలపై సదస్సులో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. షాపుల నిర్వహణకు వేలంజగిత్యాలరూరల్: దుబ్బరాజేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి కోసం షాపుల నిర్వహణకు వేలం వేశారు. కొబ్బరికాయలు, పూజ సామగ్రి నిర్వహణకు 12 రోజులకు రూ.4 లక్షలు, కొబ్బరిముక్కల సేకరణకు రూ.2.60 లక్షలు, చలువపందిళ్ల నిర్మాణానికి రూ.1.20 లక్షలు, లైటింగ్, సౌండ్ సిస్టమ్కు రూ.84,400, టెంట్లు రూ.78 వేలు, రంగులు, సున్నం వేసేందుకు రూ.1.25 లక్షలు, మహాశివరాత్రి పూల అలంకరణకు రూ.93,940 కేటాయించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు రాజమౌళి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ పొరండ్ల శంకరయ్య, రెనోవేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
భార్య ఉపసర్పంచ్.. భర్త వార్డుమెంబర్
కథలాపూర్: మండలంలోని ఇప్పపల్లి పంచాయతీలో భార్యాభర్తలు చెన్నవేని సు జాత, రంజిత్ కుమార్ వార్డుసభ్యులుగా గెలిచారు. వీరిలో సుజాత ఉపసర్పంచ్గా నియామకం అయ్యా రు. సోమవారం ఆమె ఉపసర్పంచ్గా.. ఆమె భర్త రంజిత్కుమార్ వార్డుసభ్యుడిగా ప్రమాణం చేశారు. బోర్నపల్లి సర్పంచ్గా 70 ఏళ్ల రాజవ్వరాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కొడిపల్లి రాజవ్వ సర్పంచ్గా బరిలో నిలిచి గెలుపొందారు. సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సేవ చేయడానికి వయస్సు అడ్డుకాదని, నిరుపేదలకు సేవ చేయడమే తమ పాలకవర్గ లక్ష్యమని తెలిపారు. ప్రమాణం చేసిన రోజే ఉపసర్పంచ్కు రాజీనామాధర్మపురి: ఉపసర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన గంట వ్యవధిలోనే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీవోకు లేక సమర్పించిన ఘటన మండలంలోని కమలాపూర్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి ఎన్నికల్లో రాజూరి శ్రీనివాస్గౌడ్ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఆయనను ఉపసర్పంచ్గా ఎన్నుకున్నారు. అయితే సోమవారం ప్రమాణం చేసిన ఆయన.. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీవో నరేష్కుమార్కు లేఖ సమర్పించారు. -
కేసీఆర్.. నోరు అదుపులో పెట్టుకో..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సీఎం రేవంత్రెడ్డిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవారం కరీంనగర్లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మార్పును కోరిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని, జూబ్లీహిల్స్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పును జీర్ణించుకోలేక.. బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనే భయంతో కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లపాటు ఫాంహౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని కేసీఆర్ ఇప్పుడు పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని భావించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారని తెలిపారు. గత పాలనలో రాష్ట్ర బడ్జెట్ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. సీఎంపై వ్యక్తిగతంగా మాట్లాడటం సరికా దని, ఎవరి దయదాక్షిణ్యాలతోనో కుర్చీలో కూర్చోలేదని పేర్కొన్నారు. బయట విమర్శలు చేయడం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సూచించారు. కేటీఆర్కు అహంకారం ఎక్కువగా ఉందని, హరీశ్రావు బాధ్యతలేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బుద్ది తెచ్చుకొని ప్రజలు ఆమోదించే పనులు చేయాలని హితవుపలికారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. -
పర్యాటక అందాలను వెలుగులోకి తెండి
జగిత్యాలటౌన్: జిల్లాలో ఇప్పటివరకు వెలుగుచూడని పర్యాటక అందాలను వెలుగులోకి తెచ్చేలా ఫొటోలు, వీడియోలను వందపదాలకు మించకుండా తయారు చేసి గూగుల్ఫాం లేదా సోషల్ మీడియాలో పొందుపరచాలని కలెక్టర్ సత్యప్రసాద్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు వెలుగులోకి రాని పర్యాటక అందాలను ఆవిష్కరించేందుకు 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. యువత ఫొటో, వీడియోగ్రాఫర్స్, కవులు, రచయితలు పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజలకు పెద్దగా తెలియని జలపాతాలు, పురాతన ఆలయాలు, ట్రెక్కింగ్ పాయింట్లు వంటి వంద కొత్త గమ్యస్థానాలను గుర్తించి వాటి వివరాలతో కాపీ టేబుల్ బుక్ రూపొందించడమే పోటీల లక్ష్యమన్నారు. ప్రకృతి, వైల్డ్లైఫ్, ఆర్ట్అండ్కల్చర్, హెరిటేజ్, వాటర్ బాడీస్, వంటకాలు, ఫాంస్టెస్, రిసార్ట్, స్పిర్చువల్, అడ్వెంచర్ వంటి పది విభాగాల్లో www.ot ur-ir-m.te a nfa na,gov.i nMకు తమ ఎంట్రీలు పంపాలన్నారు. తాము ఎంచుకున్న విభాగానికి సంబంధించి మూడు మంచి ఫొటోలు, 60 సెకండ్ల వీడియో, ఆ ప్రదేశానికి వెళ్లి వచ్చేందుకు రవాణా, బసకు సంబంధించి బడ్జెట్ వివరాలతో కూడిన సమాచారాన్ని తయారు చేసి వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. ఉత్తమ ఎంట్రీలకు మొదటి బహుమతి రూ.50వేలు, రెండో బహుమతి రూ.30వేలు, మూడో బహుమతి రూ.20వేలతోపాటు కన్సోలేషన్ బహుమతులుగా హరిత హోటల్లో ఉచిత బస కల్పిస్తారని తెలిపారు. సంక్రాంతికి విజేతలను ప్రకటిస్తారని తెలిపారు. ఆసక్తి గలవారు జనవరి 6లోపు ఎంట్రీలు పంపాలని సూచించారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, ట్రైనీ డిప్యుటీ కలెక్టర్ హారిణి, యువజన, క్రీడల అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


