Jagtial
-
విద్యార్థిగా మారిన మావోయిస్టు మాజీ అగ్రనేత
సాక్షి, జగిత్యాల జిల్లా: మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ విద్యార్థిగా మారిపోయారు. కోరుట్లలో నాలుగు దశాబ్దాల అనంతరం ఇవాళ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ అన్ని పరీక్షలు పాసైనా.. తెలుగు పరీక్ష తప్పిన దేవ్ జీ.. 1984- 1985లో ఇంటర్ చదివే రోజుల్లో విప్లవ భావజాలానికి ఆయన ఆకర్షితుడయ్యారు.కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన దేవ్ జీకి పరీక్ష రాసేందుకు ఇంటర్ బోర్డు నుంచి అనుమతి లభించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఎగ్జామ్ రాశారు. లాయర్ కావాలన్న ఉద్దేశంతో మళ్లీ పరీక్ష రాసినట్లు దేవ్జీ తెలిపారు. పరీక్షలు పాస్ కావాలని ఆయన కొద్ది రోజులుగా తిరుపతి ప్రిపేరవుతున్నారు. -
పారదర్శకంగా సేవలు
జగిత్యాలక్రైం: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అంది స్తున్నట్లు ఆ శాఖ అధికారి శ్రీనివాస్ తెలి పారు. ‘అక్కడ వారు చెప్పిందే ఫైనల్’ శీర్షికన ఈనెల 8న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. కార్యాలయంలో అన్నిరకాల సేవలను పారదర్శకంగానే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ సేవలు ఆన్లైన్లో దళారుల ప్రమేయం లేకుండా చూస్తున్నామని, కిందిస్థాయి ఉద్యోగుల పై నిఘా పెంచామన్నారు. ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేస్తున్న వారి బదిలీకి ఉన్నతాధికారులకు లేఖ రాశామన్నారు. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
పేదల సంక్షేమానికే పెద్దపీట
జగిత్యాలరూరల్/రాయికల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంతోపాటు రాయికల్లో మంగళవారం పర్యటించారు. జగిత్యాలలో 61 మందికి రూ.15.70లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్, 89 మంది రూ.89 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రాయికల్లో 40 మంది రూ.10.70లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్, 98మందికి రూ.98.9లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. రాయికల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, ఆత్మ జిల్లా చైర్మన్ గంగారెడ్డి, తహసీల్దార్ నాగార్జున, కమిషనర్ మనోహర్గౌడ్, ఎంపీవో సుష్మ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
ఆక్రమించిన నాలా స్థలాల పరిశీలన
జగిత్యాలరూరల్: ప్రభుత్వ స్థలాలు, నాలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవని జగిత్యాలరూరల్ తహసీల్దార్ హకీం హెచ్చరించారు. ‘యథేచ్ఛగా వాగులు కబ్జా’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి గ్రామస్తులు, మత్స్సకారులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు తిమ్మాపూర్ శివారులోని జగిత్యాల–గొల్లపల్లి ప్రధాన రహదారిలో సర్వేనంబరు 433, 434లోని ఒర్రె, నాలాను హకీం పరిశీలించారు. కొందరు మొ రం పోసి స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించారు. నాలాకు హద్దులు నిర్ణయించి, జేసీబీ సహా యంతో అక్కడ పోసిన మొరాన్ని తొలగించా రు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా, కబ్జాకు యత్నించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐలు భూ మయ్య, శంషుద్దీన్, జీపీవో నరేష్ ఉన్నారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయండి
జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గూగుల్మీట్ ద్వారా తహసీల్దార్లతో మాట్లాడారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన వసతులు కల్పించాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లర్లు, ట్రాన్స్పోర్టు యజమానులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మక్కల కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలుకొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించొద్దని సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, గోదాంలు తక్కువగా ఉంటే ప్రైవేట్వి తీసుకోవాలని, స్థానిక హమాలీలను వందశాతం ఉపయోగించుకోవాలని సూచించారు. లారీల కొరత ఉన్నచోట ట్రాక్టర్లను వినియోగించుకుంటున్నామని కలెక్టర్ సీఎంకు వివరించారు. అదనపు కలెక్టర్లత, ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరణ్, మనోజ్కుమార్, భాస్కర్, నరేశ్, ప్రకాశ్ పాల్గొన్నారు. కొడిమ్యాలలో మిల్లుల తనిఖీ కొడిమ్యాల: మండలంలోని చెప్యాలలోగల శ్రీలక్ష్మీగణేశ్, లక్ష్మీసరస్వతి, లక్ష్మీనరసింహ, శ్రీలక్ష్మీసాయి ఇండస్ట్రీస్, నమిలికొండలోని నరసింహ, ధరణి దత్తసాయి, చాముండి రైస్ మిల్లులను కలెక్టర్ పరిశీలించారు. మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా అన్లోడ్ చేసుకోవాలన్నారు. హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, సివిల్ సప్లై డీఎం జితేంద్ర ప్రసాద్, తహసీల్దార్ ఉన్నారు. వేగంగా మక్కల కొనుగోళ్లు జగిత్యాలరూరల్: జిల్లాలో మక్కల కొనుగోలు వేగంగా సాగుతోందని కలెక్టర్ అన్నారు. జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటుచేసి ఇప్పటివరకు 6,231 మంది రైతుల నుంచి 23,428 టన్నులు కొనుగోలు చేశామన్నారు. 15 గోదాములను సిద్ధం చేశామన్నారు. మార్క్ఫెడ్ డీఎం హబీబ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించి న పెద్ద జయంతి ఉత్సవాలు మంగళవారం సా యంత్రం ముగిశాయి. మూలవిరాట్టుకు పట్టు వస్త్రాలంకరణ, విశేష అభిషేకం, హోమం, మహాపూర్ణాహుతి, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సామూహిక విష్ణు సహస్ర పారాయణం, అమ్మవారికి కుంకుమార్చన, ఒడి బియ్యం, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ, కంకణోద్వాసన, మంత్రపుష్పం, మహాదాశ్వీరాదం, తీర్థ, ప్రసాద వితరణ నిర్వహించారు. అర్చకులు, ఆలయ అధికారులు యాగశాల నుంచి ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ఈఓ అంజనా రెడ్డి, ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, రామకృష్ణ, రఘు, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, స్థానా చార్యులు కపీందర్, ఏఈవో హరిహరనాథ్, సూపరింటెండెంట్ సునీల్ కుమార్, చంద్రశేఖర్, అశోక్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నర్స్ల సేవలు మరువలేనివిజగిత్యాల: నర్స్ల సేవలు మరువలేనివని మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ కృష్ణమూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్స్ల దినోత్సవం నిర్వహించారు. రోగులకు వారి సేవలు అమోఘమని, రోగం నయం అయ్యేవరకూ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. అనంతరం విశిష్ఠ సేవలందించిన 12 మందిని సత్కరించారు. కార్యక్రమంలో శ్రీపతి, నరేశ్, రాజ్గోపాల్ పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి● విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి జగిత్యాలరూరల్: వానాకాలం పంటలు సాగు చేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో వానాకాలం సీజన్ విత్తనాలపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. రైతులు విత్తనం కొనుగోలు చేసే ముందు నాణ్యతప్రమాణాలు చూసుకోవాలని, తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, రీజినల్ మేనేజర్ విష్ణువర్దన్రెడ్డి, మండల వ్యవసాయాధికారులు, ప్రాథమిక సహకార సంఘాల సీఈవోలు, డీసీఎంఎస్ సీవోలు, ఆగ్రోస్ రైతు సేవ సంఘం డీలర్లు పాల్గొన్నారు. మిల్లర్ల దోపిడీ అరికట్టాలని రైతుల ధర్నా● 41 కిలోలకు బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని ఆగ్రహంమెట్పల్లిరూరల్: రైస్మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లి–కోరుట్ల జాతీయ రహదారిపై రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. మెట్పల్లి మండలం కోనరావుపేట క్రాసింగ్ వద్ద గంటపాటు బైఠాయించారు. ధాన్యాన్ని 41 కిలోలకు బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు అక్కడికి చేరుకోగా.. తూకంలో జరుగుతున్న మోసాన్ని ఆయనకు వివరించారు. సమస్య పరిష్కరిస్తామని ఆయన చెప్పడంతో ఆందోళన విరమించారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు 20 మంది ఎంపికమెట్పల్లి: పట్టణంలోని మినీ స్టేడియంలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. అండర్–8, 10, 12, 14 విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 20మందిని ఈ నెల 17న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి తెలిపారు. పీఈటీ కొమురయ్య, సీనియర్ అథ్లెట్ వెంకటేశ్వర్లు, గజెల్లి రాందాస్ తదితరులున్నారు. -
నేడు పాలిసెట్
● 2,490 మంది అభ్యర్థులు ● 8 కేంద్రాలు ఏర్పాటుజగిత్యాల: మూడేళ్ల డిప్లొమా కోసం నిర్వహించే పాలిసెట్ బుధవారం జరగనుంది. ఇందుకు జిల్లా కేంద్రంలో ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,494 మంది హాజరుకానున్నట్లు ఎస్కేఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అరిగెల అశోక్ తెలిపారు. విద్యార్థులు ఓఎంఆర్ షీట్పై రెండువైపులా సంతకం చేయాలని, హెచ్బీ బ్లాక్ పెన్సిల్, ఎరైజర్, బ్లూ/బ్లాక్ పెన్ వెంట తెచ్చుకోవాలని, హాల్టికెట్పై ఫొటో లేకుంటే ఫొటో, ఆధార్కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎస్బీ టెట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్ తెలుసుకోవచ్చన్నారు. ఎస్కేఎన్ఆర్ కళాశాలలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. -
ఇష్టంతో నర్సింగ్ వృత్తి..
4చాలా ఇష్టంతోనే నర్సింగ్ వృత్తిని ఎంచుకున్న. 2011లో ఏఎన్ఎం చేశాను. నర్సింగ్ చదవాలని పట్టుదలతో డిగ్రీ వదిలేసి, జీఎన్ఎం కోర్సు పూర్తి చేశా. కాంట్రాక్ట్ పద్ధతిలో గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్లో నర్సింగ్ ఆఫీసర్గా ఐదేళ్లుగా పని చేస్తున్న. – స్రవంతి, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని చాలా సంతృప్తిగా ఉంది మాది ఖమ్మం. నాన్న సలహాతో బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేశాను. ఈ వృత్తిలోకి వచ్చాక రోగులకు సేవలందించడం చాలా సంతృప్తిగా ఉంది. మా కజిన్స్ కూడా నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు. ఇలా నాకు నర్సింగ్ సేవలపై ఇంట్రెస్ట్ కలిగింది. – కె.సరిత, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని -
వేసవిలో చిన్నారులు భద్రం
సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు ●ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వేసవిలో పిల్లల్లో డీహైడ్రేషన్, అలసట, జ్వరం, వాంతులు, చర్మసమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు వారి ఆరోగ్య పరిస్థితిని తరచూ గమనిస్తూ అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పండ్లు, ఆకుకూరలు, పోషకాహారం ఎక్కువగా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు కథల పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. డ్రాయింగ్, సంగీతం, నృత్యం, యోగా వంటి శిక్షణ తరగతులకు పంపించాలి. రోజూ కొంతసమయం చదువుకు కేటాయించేలా ప్రోత్సహించాలి. ఇంటిపనుల్లో చిన్న బాధ్యతలు అప్పగించడం ద్వారా క్రమశిక్షణ పెంపొందించాలి. పెద్దలతో సమయం గడిపేలా చేసి కుటుంబ విలువలను తెలియజేయాలి. మొక్కలు నాటడం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించాలి. క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా శారీరక–మానసిక వికాసం కలిగించాలి. జ్యోతినగర్: వేసవి సెలవుల్లో పిల్లలు అధిక సమయం ఇంట్లోనే గడపడం, బయట ఆటలపై ఆసక్తి చూపడం సహజం. మండుతున్న ఎండలు వారి ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందుకోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో వేసవి సెలవులను పిల్లల భవిష్యత్కు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సలహాలిస్తున్నారు. -
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది. జీతం కోసం కాకుండా సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలి. తమ మంచి మాటలతో రోగులకు ధైర్యం చెబుతూ వైద్య సేవలందించాలి. 34 ఏళ్ల క్రితం నర్సింగ్ ఉద్యోగంలో చేరాను. నాటి నుంచి నేటి వరకు రోగులకు వైద్య సేవలందిస్తున్నాను. – శోభ, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, కరీంనగర్ రోగులను కాపాడడంలోనే సంతృప్తి రోగులకు వైద్య సేవలందించి వారి ఆరోగ్యాన్ని కాపాడడంలోనే సంతృప్తి ఉంటుంది. ఒక రోగి తీవ్రమైన అనారోగ్యంతో వచ్చి వైద్య సేవలు పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్లేటప్పుడు ఎంతో అభిమానంగా తమతో మా ట్లాడే రెండు మాటలు ఎంతో సంతోషాన్ని స్తాయి. నర్సు అంటేనే సేవకు ప్రతి రూపం. ఈ వృత్తిలోకి వచ్చేవారందరూ మదర్ ఆఫ్ నర్సింగ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ను ఆదర్శంగా తీసుకోవాలి. – దీవెన, నర్సింగ్ ఆఫీసర్, కరీంనగర్ నర్స్ పాత్ర గొప్పది రోగులకు ప్రత్యక్షంగా సేవలందించడం ఒక్క నర్సింగ్ ఆఫీసర్లకే దక్కుతుంది. న ర్సింగ్ ఆఫీసర్ల పాత్ర గొప్పది. 22 ఏళ్లుగా నర్సింగ్ పని చేస్తున్న. మా పిన్ని జానకి ఏఎన్ఎంగా పని చేశారు. ఆమె సేవలకు స్ఫూర్తి పొంది నర్సింగ్ విభాగాన్ని ఎంచుకున్న. ఆస్పత్రుల్లో డాక్టర్లతోపాటు నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర చాలా ముఖ్యమైంది. – జమున,నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–2, పెద్దపల్లి -
పాపం పసివాడు
జమ్మికుంట(హుజూరాబాద్): ఓ గుర్తు తెలియని మహిళ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందగా, తన నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. సుమారు 28 ఏళ్ల వయస్సుగల మహిళ తన నాలుగేళ్ల కుమారుడితో శనివారం జమ్మికుంట రైల్వే స్టేషన్కు వచ్చింది. అంతలోనే ఎమైందో ఎమో కానీ, రైల్వే బుకింగ్ హాల్ వద్ద స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన రైల్వే బుకింగ్ ఉద్యోగి 108 అంబులెన్స్కు సమచారమిచ్చాడు. వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపుకార్డులు, వివరాలు లేవు. బ్లూ కలర్ డిజైన్ హాఫ్ ప్యాంట్, పింక్ బ్లూ, పసుపు డిజైన్ టాప్ ధరించి ఉంది. చేతిపై ‘సమ్మక్క, సలీమ్, అమ్మ’అని పచ్చబొట్టు గుర్తులు ఉన్నాయి. కాగా, చికిత్స సమయంలో తల్లి వద్దే ఉన్న కుమారుడిని ఆమె మృతిచెందడంతో ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది చైల్డ్ హోంకు పంపించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపర్చారు. మృతురాలి వివరాలు తెలిస్తే 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి అనాథ అయిన నాలుగేళ్ల కుమారుడు -
లైఫ్ డోనర్స్
ఏ ఉద్యోగమైనా ఉదయం పూట మాత్రమే విధులు నిర్వహిస్తుంటారు. కానీ, నర్సులు మాత్రం రాత్రి, పగలు తేడా లేకుండా సేవా భావంతో పనిచేస్తారు. కోవిడ్ సమయంలో మొక్కవోని ధైర్యంతో వారు సేవలు అందించిన రోజులను చూశాం. అన్నీ మూతపడ్డా ఆసుపత్రులు మాత్రం ఎళ్లవేళలా తెరిచే ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వచ్చినా వైద్యులు, సిబ్బంది 24 గంటల పాటు సేవలందిస్తూనే ఉంటారు. రోగమేదైనా నర్సులు మాత్రం రోగులను అక్కున చేర్చుకొని వైద్యాన్ని అందిస్తారు. సడలని సంకల్పంతో విధులు నిర్వహిస్తారు. వైద్యుల తర్వాత నర్సులదే కీలకపాత్ర వైద్య సేవల్లో వైద్యుల తర్వాత అత్యంత కీలకమైన పాత్ర పోషించేది నర్సులే. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా చిరునవ్వు, ఆత్మీయ స్పర్శతో రోగులకు సేవలందిస్తుంటారు. డాక్టర్ రౌండ్స్లో భాగంగా వార్డుకు వచ్చి రోగిని పరీక్షించి ఏయే మందులు వాడాలో కేస్షీట్పై రాసి వెళ్లిపోతారు. డాక్టర్ పేర్కొన్నట్లు రోగికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు ఇండెంట్ రాసుకొని మెడికల్ స్టోర్స్ నుంచి తెప్పించి వాడుతారు. ఏమైనా వైద్య పరీక్షలు అవసరమైతే నాల్గో తరగతి ఉద్యోగుల సాయంతో చేయిస్తారు. 24 గటలు అందుబాటులో ఉంటూ పేషెంట్కు వ్యాధి తగ్గే వరకు సేవలందిస్తారు. సేవలకు సలాం ప్రమాదాల్లో గాయపడినవారు, మందు తాగి ఆస్పత్రి పాలైనవారు, ఆపరేషన్లు చేయించుకున్నవారు, డెంగీ, మలేరియా వంటి జబ్బున పడినవారు మాత్రమే కాకుండా అనేక మంది చీము, నెత్తురుతో కలిసిన గాయాలతో ఆస్పత్రులకు వస్తుంటారు. వీరందరినీ పరీక్షించి మందులు రాసేది డాక్టర్. ఆపరేషన్లు చేసేది డాక్టర్. అయితే ఆ తర్వాత కోలుకోవడంలో, డ్రెస్సింగ్ చేసి గాయాలు మాన్పించడంలో ప్రధాన భూమిక పోషించేది నర్సులే. నర్సింగ్ కోర్సులపై ఆసక్తి నర్సింగ్ కోర్సులపై యువతుల్లో ఆసక్తి పెరుగుతోంది. కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్ పెరిగింది. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంఫిల్, పీహెచ్డీ తదితర కోర్సులు అందించేందుకు ఇన్స్టిట్యూట్లు కూడా పోటీ పడుతున్నాయి.కరీంనగర్/కోల్సిటీ(రామగుండం):ఒక డాక్టర్ ప్రాణాలు నిలబెడితే.. ఒక నర్సు తన సేవలతో రోగి ప్రాణానికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో ఎంతో మంది నర్సింగ్ వృత్తిలోకి వచ్చి తమలోని సేవాతత్పరతను చాటుకుంటున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అంకితభావం, నిబద్ధత, కృషికి గుర్తింపుగా ఆమె పుట్టిన రోజున ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. -
మద్యం తాగించి.. కత్తితో పొడిచి..
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన జూల వంశీ(28)ని పథకం ప్రకారం హత్య చేశారని గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల శంకరమ్మ తన కుమారుడు వంశీ గతనెల 29 నుంచి కనిపిండచం లేదని ఫిర్యాదు చేయగా ఈనెల 1న మిస్సింగ్ కేసు నమోదైంది. సీడీఆర్, మొబైల్ కాల్స్పై దృష్టి సారించిన పోలీసులు.. వంశీ స్నేహితురాలు అలేఖ్య, ఆ మె భర్త నీలం నవీన్, నవీన్ స్నేహితుడు బుర్ర భా స్కర్పై దృష్టి సారించారు. ఆధునిక సాంకేతికత సా యంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా.. వంశీని హత్య చేశామని అంగీకరించారు. ప్రాణం తీసిన గెట్టూగెదర్.. వంశీ, అలేఖ్య పదో తరగతిలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అలేఖ్య, నీలం నవీన్ను ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో టెన్త్క్లాస్ గెట్టుగెదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతస్నేహితులు కలిశారు. ఈక్రమంలోనే వంశీ.. అలేఖ్య మొబైల్ నంబర్ తీసుకొని తరచూ ఫోన్చేస్తూ, మెసేజ్లు పంపిస్తూ ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. హైదరాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లి మూడుసార్లు గొడవకు కూడా దిగాడు. భర్త నవీన్, స్నేహితుడు భాస్కర్ మందలించి అక్కడి నుంచి పంపించి వేశారు. వంశీ తనను వేధిస్తున్నాడని అలేఖ్య తన భర్తకు తెలిపింది. దీంతో వంశీని ఎలాగైనా హత్య చేయాలని నవీన్, భాస్కర్ పథకం వేసుకున్నారు. పథకం ప్రకారం అలేఖ్య, భాస్కర్ ఫోన్చేసి వంశీని హైదరాబాద్ రప్పించారు. గతనెల 30న వంశీ తొలుత అలేఖ్య నివాసానికి వెళ్లగా.. ముగ్గురూ కలిసి కారులో భాస్కర్ ఇంటికి చేరుకున్నారు. అప్పటకిఏ నవీన్ డ్యూటీకి వెళ్లాడు. ఈక్రమంలో భాస్కర్ వంశీకి మద్యం తాగించి గొడవకు దిగాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తితో చాతి, మెడపై విచక్షణారహితంగా దాడి చేయడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఫోన్ద్వారా నవీన్కు భార్య సమాచారం అందించింది. నవీన్ చేరుకొని భాస్కర్తో కలిసి గదిలోని రక్తపు మరకలను లైజాల్తో శుభ్రపర్చారు. భాస్కర్, నవీన్ కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్, మ్యాట్లో చుట్టి కారులో ఉంచారు. తర్వాత భాస్కర్ ఒక్కడే మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడుదులగండి ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు పక్క లోయలో పడవేశారు. పోలీసు విచారణలో ఈవిషయాలు వెల్లడయ్యాయి. నిందితుల నుంచి కారు, ఐదు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలేఖ్య, నవీన్, భాస్కర్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వివాహితను వేధిస్తున్నాడని వంశీ హత్య వివరాలు వెల్లడించిన ఏసీపీ రమేశ్ ముగ్గురు నిందితుల అరెస్ట్ -
బండి సంజయ్.. రాజీనామా చేయ్..
జగిత్యాలటౌన్: కేంద్రసహాయ మంత్రి బండి సంజ య్ కుమారుడు ఓ బాలికను లొంగదీసుకుని అరాచకం చేస్తుంటే సీఎం రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ కళ్లకు గంతలు కట్టుకున్నాడా..? లేక ఓటుకు నోటు కేసు కోసం బీజేపీతో లాలూచి పడ్డాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నేరాలు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులు బండి సంజయ్, రేవంత్రెడ్డి ఏంజరగనట్లు సైలెంట్గా ఉండటమే వారి బంధానికి నిదర్శనమన్నారు. తన దృష్టికి వచ్చిన విషయాన్ని సంబందిత శాఖ అధికారులకు రిఫర్ చేయడం కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బాద్యత అని, అలాంటిది స్వయంగా కేంద్రమంత్రే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం శిక్షార్హమన్నారు. నేరాలను ప్రోత్సహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా శిక్షార్హుడేనన్నారు. రాష్ట్రంలో నేరాలు జరుగుతుంటే మోదీ ఆదీనంలోని సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ బేటీ బచావో అంటే కేంద్ర మంత్రి బండి మాత్రం బేటా బచావో అంటున్నారని ఎద్దేవా చేశారు. తన కుటుంబ సభ్యులను నియంత్రించలేని బండి దేశంలో శాంతిభద్రతలు ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. బాలిక జీవితం అభాసుపాలు కావడానికి కారణమైన బండి సంజయ్కు ఏమాత్రం నైతిక విలువలున్నా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి కుమారుడు భగీరథ్పై గతంలోనే యాంటీ ర్యాగింగ్ కేసులున్నాయని, బాలికను లొంగదీసుకోవడం కిడ్నాప్ కింద కు వస్తుందని, ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్కు పోక్సోతోపాటు సాధారణ చట్టాల కింద దాదాపు 20ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందన్నారు. బాలిక ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించిన పేట్బషీరాబాద్ పోలీస్టేషన్ హౌజ్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, హరిచరణ్రావు, ధర రమేశ్, సురేందర్, చందా రాధాకిషన్, కల్లెపెల్లి దుర్గయ్య, గుండ మధు, వెంకటేశ్వర్రావు తదితరులు ఉన్నారు. -
లైఫ్ డోనర్స్
● వైద్యులకు దీటుగా రోగులకు సేవలు ● భరోసా కల్పించేలా తల్లికి మించి సపర్యలు ● నేడు ప్రపంచ నర్సుల దినోత్సవంనర్సులు.. అమ్మకు మించిన సేవా మూర్తులు. రోగి శరీరంలో చీము, నెత్తురు, గాయాలు, దుర్వాసనలను భరించి శుభ్రపరిచి, ఉపశమన పరచడంలో నర్సులు సేవానిరతికి నిలువెత్తు రూపాలు. కన్న తల్లి, కట్టుకున్న భార్య లేదా భర్త కూడా చేయలేని సేవలు అందిస్తున్న మానవరూపంలో కనిపించే దేవతలు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగశీలురు. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. – కరీంనగర్/కోల్సిటీ(రామగుండం)రాష్ట్రాలను జల్లెడ పడుతున్నారు..!కరీంనగర్క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో నిందితుల వేట పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టపగలు కాల్పులు జరిపి రూ.కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లిన ఆరుగురు నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దొంగతనం జరిగిన రోజు నుంచి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి పలు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నా.. నిందితులు అడుగడుగునా ఏమరుస్తున్నట్లు తెలుస్తోంది. టవర్ లొకేషన్లతో నిందితుల జాడ దర్యాప్తులో కీలకంగా మారిన మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు పశ్చిమబెంగాల్, బిహర్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టినట్లు సమాచారం. నిందితులు తరచూ సిమ్ కార్డులు మార్చడం.. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడం, అవసరమైన సమయంలో మాత్రమే ఫోన్లు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తుండటంతో వారి కచ్చితమైన లొకేషన్ను ట్రాక్ చేయడం పోలీసులకు సవాల్గా మారినట్లు తెలుస్తుంది. ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకుండా గంటల వ్య వధిలో ప్రాంతాలు మారుస్తూ పోలీసు బృందాలను అయోమయానికి గురిచేస్తున్నట్లు తెలిసింది. బంగారాన్ని పంచుకుని విడిపోయారా..? దోపిడీ అనంతరం ముఠా సభ్యులు కలిసి ప్రయాణించకుండా ప్రణాళిక ప్రకారం విడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోచుకున్న బంగారాన్ని వాటాలుగా పంచుకుని వివిధ రాష్ట్రాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో బంగారాన్ని విక్రయించే ప్రయత్నం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించడంలేదు. అతడి నుంచి కీలక సమాచారం లభించినట్లు.. మరో ఇద్దరు నిందితుల జాడ కూడా పోలీసులు కనిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కాల్స్తోనే క్లూస్.. నిందితులు ఫోన్లు పూర్తిగా వాడకపోయినా కుటుంబసభ్యులు, పరిచయస్తులతో అప్పుడప్పుడు మా ట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ ఆధారంగానే టెక్నికల్ టీమ్లు వారి కదలికలను విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, లాడ్జీలు, బంగారం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. అనుమానాస్పదంగా బంగారం విక్రయించే వ్యక్తుల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు తెలిసింది. ప్రత్యేక బృందాల ముమ్మర వేట కేసు ఛేదన కోసం కరీంనగర్ కమిషనరేట్ గోప్యంగా పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. బృందాలకు రాష్ట్రాలవారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో నిందితుల పాత నేరచరిత్ర, ముఠా లింకులు, ప్రయాణ మార్గాలపై లోతుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురిలో పలువురు నిందితుల జాడ పోలీసులు కనిపెట్ట గా.. మిగితా వారి కోసం వివిధ కోణాల్లో ద ర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఎంతదూరం పారిపోయినా.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
వేసవి శిబిరాలు వినియోగించుకోండి
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్గటూర్/బుగ్గారం: విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో సోమవారం సమ్మర్ క్యాంప్ను ప్రారంభించారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గానికొక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నామని అన్నారు. ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బుగ్గారం, గోపులాపూర్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ లత, నాగారం సర్పంచ్ చిలుముల లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు. -
బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని..
జగిత్యాలటౌన్/కోరుట్ల: బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో.. కోరుట్లలోని కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ భగీరథ్పై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు చర్యలు చేపట్టకపోవటం సరికాదన్నారు. సామాన్యులపై కేసు నమోదైతే వెంటనే అరెస్టు చేసే పోలీసులు ఎప్పుడు ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదైన 24గంటల్లో నిందితుడిని అరెస్టు చేయాల్సిన పోలీసులు మూడు రోజులుగా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ దేవేందర్నాయక్రాథోడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గోడు వినండి.. గోస తీర్చండి
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. హద్దులు తొలగించాడు మాది జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్పల్లి. శివారులోని సర్వేనంబర్ 109లో మాకు 50గుంటల వ్యవసాయ భూమి ఉంది. మా భూమిని ఆనుకునే సర్వేనంబర్ 110 ఉంది. అందులో భూమి ఉన్న ఆంజనేయులు రోడ్డుకున్న హద్దులు తొలగించాడు. రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం చేయడం లేదు. విచారణ చేపట్టి రోడ్డు హద్దు ఖనీలు ఏర్పాటు చేయించండి. – పయ్యావుల రమేశ్, గుట్రాజ్పల్లి ఇందిరమ్మ ఇల్లు పునరుద్ధరించండి మాది కోరుట్ల మండలం సంగెం. ఇదిరమ్మ ఇల్లు మంజూరైంది. ప్రొసీడింగ్ అందాక పిల్లర్ల వరకు నిర్మించుకున్నాం. బిల్లు కోసం వేచి చూస్తుండగా.. మాకు ఫోర్ వీలర్ (టాటాఏస్) ఉందంటూ ఇల్లును రద్దు చేశారు. నిరుపేదలమైన మేం ఆటోతో జీవనోపాధి పొందుతున్నాం. ఆటోను సాకుగా చూపి ఇల్లు రద్దు చేశారు. విచారణ చేపట్టి ఇంటిని పునరుద్ధరించండి. – బోయపల్లి మహేశ్వరి, సంగెం ఎఫ్టీఎల్ హద్దులు పెట్టండి జిల్లాకేంద్రానికి ఆనుకుని ఉన్న మోతె పెద్ద చెరువుపై ఆధారపడి 125 మత్య్సకార కుటుంబసభ్యులం జీవనం సాగిస్తున్నాం. కబ్జాదారులు చెరువులో మట్టిపోస్తూ చదును చేస్తూ చెరువును రోజుకింత చొప్పున ఆక్రమిస్తున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువుకు ఎఫ్టీఎల్కు హద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణలు జరగకుండా చూడండి. – మోతె మత్య్సకారులు ప్రభుత్వ భూమిలో ఇళ్లు మా గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 85 ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. భూకబ్జాపై విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని కాపాడండి. అక్రమార్కులపై చర్యలు తీసుకోండి. – సాయికుమార్, తుమ్మెనాల, ధర్మపురి -
పిల్లలే హమాలీలు..
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన బొడ్డు మనీష అనే మహిళా రైతు ఎఫ్సీఐకి విక్రయించేందుకు జగిత్యాల మార్కెట్యార్డులో 10రోజుల క్రితం మక్కలు పోసింది. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. హమాలీల కొరత తీవ్రంగా ఉంది. సోమవారం ఉదయం మార్కెట్ అధికారులు ఆమెకు గన్నీ బ్యాగులు ఇచ్చారు. దీంతో మనీష తన ఇద్దరు కూతుళ్లను వెంటబెట్టుకుని వచ్చి మార్కెట్లో ఇలా మక్కలను సంచుల్లో నింపింది. -
గిరి ప్రదక్షిణకు నిధులు
మల్యాల: కొండగట్టు గిరి ప్రదక్షిణకు నిధుల విడుదలకు కృషి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారిని సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు సరిపడా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జయంతి ఉత్సవాలకు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టామని అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ దినేష్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, గిరి నాగభూషణం, శైలేందర్రెడ్డి, నిశాంత్ రెడ్డి, రాములు పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలిమెట్పల్లి రూరల్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. మెట్పల్లి మండలం ఆత్మకూర్, ఆత్మనగర్, వెల్లుల్ల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సోమవారం తనిఖీ చేశారు. తూకం వేసిన బస్తాలను జాప్యం చేయకుండా మిల్లులకు తరలించాలన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ నీత, అధికారులు ఉన్నారు. బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలుజగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 14 మంది అర్జీ సమర్పించగా.. వారితో నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. -
కాషాయమయమైన కొండగట్టు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయం కాషాయమయమైంది. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా కొనసాగాయి. ఉదయం 9 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్థాపిత దేవతారాధన నిర్వహించారు. హోమం, సుందరకాండ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, అమ్మవారి కుంకుమార్చన, పుష్పాలతో సహస్రనామార్చన, హోమం, బలిహరణము, మహానివేదన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు కపిందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, వకుళాభరణం రఘు, జితేందర్ ప్రసాద్, వేదపండితులు పెద్దన్న శర్మ, రాజేశ్వర శర్మ, హరిబాబు శర్మ పాల్గొన్నారు. -
యథేచ్ఛగా వాగులు కబ్జా
జగిత్యాలరూరల్: రియల్ వ్యాపారులు వాగులు, వంకలను వదలడం లేదు. భూముల ధరలకు రెక్కలొస్తుండడంతో ముంపు, వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న సాగుచేయని భూములను గుర్తించి భూ యజమానులకు ఎంతో కొంత ఇస్తూ వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని రాత్రికి రాత్రే ముంపు ప్రాంతాల్లో మట్టిపోసి చదును చేసి ఇళ్లు, ఇతర నిర్మాణాలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. రియల్ వ్యాపారులకు అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఉండడంతో దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో మోతె నుంచి ప్రవహించే వాగు కింది ప్రాంతం తిమ్మాపూర్ శివారులో వారం రోజులుగా రాత్రివేళ టిప్పర్ల ద్వారా మట్టి తెప్పించి ముంపు ప్రాంతం, వాగు ప్రవహించే ప్రాంతాన్ని పూడ్చివేశారు. రానున్న రోజుల్లో నీటి ప్రవాహం వెళ్లకుండా మట్టితో చదును చేశారు. వానాకాలంలో వర్షాలు తీవ్రమైతే నీటి నిల్వలు పెరిగి జగిత్యాల, గొల్లపల్లి ప్రధాన రహదారిలో తాతమ్మ గుడి వద్ద ఉన్న వంతెన మునిగిపోయి రాకపోకలు స్తంభించిపోనున్నాయి. జగిత్యాల పట్టణానికి కూతవేటు దూరంలో వారం రోజులుగా ముంపు ప్రాంతాన్ని పూడ్చివేసి చదును చేస్తున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల విలువ గల భూములను చదును చేసి అమాయకులకు విక్రయించి రియల్ వ్యాపారులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. కనుమరుగైన వాగు ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చే వాగును మట్టి పోసి చదును చేశారు. దీంతో రానున్న రోజుల్లో ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తాతమ్మగుడి ప్రాంతం నుంచి శ్మశానవాటిక వరకు నీరు ప్రవహించే ప్రాంతాలను చదును చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే వాగులు, ముంపు ప్రాంతాలు కనుమరుగు కానున్నాయి. ఆందోళన చెందుతున్న రైతులు రానున్న రోజుల్లో దిగువ ప్రాంతంలోని ముప్పాల చెరువు, పొలాస చెరువులు నిండడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పంటలు సాగుచేయడం కష్టతరంగా మారనుంది. కొద్ది రోజులుగా తిమ్మాపూర్, రఘురాములకోట, మోతె గ్రామాలకు చెందిన రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ముంపు ప్రాంతాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. -
రత్నాకర్రావు సేవలు అమూల్యం
కోరుట్ల: మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్రావు సేవలు మరవలేనివని వెలమ సంక్షేమ సమితి చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. రత్నాకర్రావు వర్ధంతి సందర్భంగా స్థానిక వెటర్నరీ కళాశాల సమీపంలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వెటర్నరీ, పాలిటెక్నిక్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. పట్టణంలో సుమారు 5వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి కొత్తకాలనీ ఏర్పాటు చేసిన ఘనత అయనదేనన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కృష్ణారావు, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్లు తిరుమల వసంత, మైలారపు లింబాద్రి, కాంగ్రెస్ నాయకులు తిరుమల గంగాధర్, వెంకటేశ్గౌడ్, జిందం లక్ష్మీనారాయణ, శంకర్, సంగ లింగం, తెడ్డు విజయ్, పుప్పాల ప్రభాకర్, ఎలిశెట్టి భూంరెడ్డి, కౌన్సిలర్లు సోగ్రాబీ, కస్తూరి లక్ష్మీనారాయణ, మోర్తాడ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మోదీ సభకు తరలిన బీజేపీ శ్రేణులుమెట్పల్లి: హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఆ దివారం జరిగిన ప్రధాని మోదీ సభకు పట్టణం నుంచి బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సురభి నవీన్కుమార్, పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వీరిలో కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. -
బస్తాలు ఉల్టా పల్టా.. రైతుకే తంటా..
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల మార్కెట్యార్డులో రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో వరి, మొక్కజొన్న ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. రవాణా చేయాల్సిన మొక్కజొన్న ధాన్యం ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ముఖ్యంగా తూకం వేసిన బస్తాలు తడవడంతో బస్తాలను కిందిది మీద, మీద్ది కిందకు చేసి ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉండటం, కొనుగోళ్లు ఆగిపోవడంతో మొక్కజొన్న ధాన్యంపై రైతులు ఇంటి నుంచి కవర్లు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. తడిసిన బస్తాలను ఆరబెట్టేందుకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. -
ఈత వనానికి 50శాతం సబ్సిడీ కల్పించండి
జగిత్యాలరూరల్: గీత కార్మికులు ఈతవనం పెంచుకునేందుకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కల్పించాలని మాజీమంత్రి జీవన్ రెడ్డి కోరారు. ఆదివారం సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలో ఎల్లమ్మతల్లి ప్రాణప్రతిష్ఠ, పట్నాల మహోత్సవంలో పాల్గొన్నారు. గౌడ వృత్తి ప్రమాదకరమైందని, ఈ వృత్తిపై ఆధారపడిన వారికి ప్రభుత్వం చేయూత అందించాలని కోరారు. బెల్ట్షాపులు మూసివేస్తామని ప్రకటించిన కాంగ్రెస్కు గ్రామానికి 10బెల్ట్ షాపులు నడుస్తున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కిరాణషాపుల్లో కూడా లిక్కర్ విక్రయిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి, నరేష్ గౌడ్, మురళీగౌడ్ పాల్గొన్నారు. -
జిల్లాలో 23,390 కుక్కలు
కథలాపూర్: రాష్ట్రవ్యాప్తంగా కుక్కల బెడద నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్ని శునకాలు ఉన్నాయో వివరాలు సేకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో కుక్కలను లెక్కించారు. ఇంటింటికీ వెళ్లి పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, అందులో టీకాలు ఇప్పించినవి.. రోగాలతో బాధపడుతున్నవి.. కు.ని టీకాలు ఇప్పించినవి లెక్కించి ఈ– పంచాయత్ యాప్లో నమోదు చేశారు. అయితే లెక్కింపు సిబ్బందిని చూసి కుక్కలు వేరే వాడల్లోకి పరుగెత్తాయని పలువురు కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఫలితంగా లెక్కల సేకరణకు నానా తంటాలు పడాల్సి వచ్చిందంటున్నారు. 385 గ్రామాలు.. 23,390 కుక్కలు జిల్లాలో 385 గ్రామాలు ఉన్నాయి. అందులో 23,390 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో మగ 11,864, ఆడ 11,526 ఉన్నాయి. తల్లి కుక్కలు 2,465, చిన్నవి 5,630 ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ రికార్డుల్లో నమోదైంది. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్ మాట్లాడుతూ.. అధికారుల ఆదేశాల మేరకు 385 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో కుక్కల గణన చేయించామని, వాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు. -
గుట్టకాయ స్వాహా..!
మెట్పల్లిరూరల్: జిల్లాలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. నిబంధనలను గుట్టల్లో తొక్కి.. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. మెట్పల్లి మండలం బండలింగాపూర్ రెవెన్యూ పరిధిలోని 63వ జాతీయ రహదారికి కేవలం 400మీటర్ల దూరంలో ఉన్న కుందేలు గుట్టను ఎక్స్వేటర్లతో అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ దందా సాగుతున్నా.. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం, అడ్డుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కొన్నినెలల క్రితం కలెక్టర్ సత్యప్రసాద్ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తవ్వకాలకు కొద్దిరోజులు బ్రేక్ పడినప్పటికీ మళ్లీ ఎప్పటిలాగే యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తుండడం గమనార్హం. 38 ఎకరాల విస్తీర్ణం కుందేలు గుట్ట సుమారు 38 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో గతంలో బండలింగాపూర్ గీత కార్మిక సంఘానికి ఐదెకరాలు, ఒడ్డెర కులస్తులకు 20ఎకరాల వరకు అసైన్డ్ పట్టాలిచ్చినట్లు తెలిసింది. అక్కడ సాగుకు ఏ మాత్రం కూడా అనువు కాదని, చదునైతే అనువుగా మారుతుందని కొందరు అసైన్డ్ పట్టాదారులు మొరం అక్రమ తవ్వకాలకు అభ్యంతరం తెలపడంలేదని తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు గుట్టను ఇష్టారీతిగా తవ్వేస్తున్నారు. ఎక్స్వేటర్ల సహాయంతో పెకిలించిన మొరాన్ని టిప్పర్లలో మెట్పల్లి పట్టణంతోపాటు చుట్టుపక్క గ్రామాలకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు, వెంచర్ల అవసరాలకు విక్రయిస్తున్నారు. టిప్పర్ మొరానికి వ్యాపారులు రూ.4వేలకు పైగానే వసూలు చేస్తున్నట్లు సమాచారం. చీకటి పడిందంటే చాలు తవ్వకాలు ప్రారంభిస్తున్న అక్రమార్కులు.. వేకువజాము వరకు తవ్వుతూనే ఉన్నారు. పొద్దుపొడిచే వరకూ రహదారిపై మొరం వాహనాలు వెళ్తూనే ఉంటున్నాయి. చీకటి పడితే చాలు.. గతంలో పగలు, రాత్రి తేడా లేకుండా సాగిన ఈ తవ్వకాలు ప్రస్తుతం రాత్రి సమయాల్లోనే జరుగుతున్నాయి. ఇందుకు మొరం తవ్వకాల విషయంలో కొందరి మధ్య వివాదాలు ఏర్పడడం, అధికారులు వరుసగా ఫిర్యాదులు వెళ్లడమే కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సంజయ్ గుట్టను తవ్వేస్తున్న విషయంపై ఫిర్యాదు చేసిన సమయంలో మైనింగ్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. మొరం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఆ సమయంలో దందాకు బ్రేక్ పడుతుందేమోనని అందరూ భావించారు. తర్వాత మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడనేలేదు. దీంతో మొరం తవ్వకాలు,తరలింపు యథేచ్చగా సాగిపోతోంది. -
దొరికిన దొంగలు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అందరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారంరోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలుకోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలతో... ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు. బిహార్లో నగలు విక్రయిస్తుండగా దర్యాప్తులో భాగంగా దొంగలు ఘటన అనంతరం కరీంనగర్ నుంచి ధర్మపురి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారు ఉపయోగించిన పల్సర్ బైక్ను వదిలిపెట్టి గోదావరినదిని దాటి పరారైనట్లు సీసీ కెమెరాలు, స్థానిక సమాచారంతో నిర్ధారించారు. ఈ మార్గం ద్వారా వారు మహారాష్ట్ర లేదా ఛత్తీస్గఢ్ వైపు వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దోపిడీ కేసు వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి దోపిడీ ఘటనలతో పోల్చి చూశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, పాతనేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన గ్యాంగులతో విచారణ చేపట్టి నిందితుల కదలికలను, సేకరించిన సమాచారంతో బిహార్ రాష్ట్రంలో నగలు విక్రయిస్తుండగా దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
‘ఇందిరమ్మ’ లక్ష్యం చేరేనా..?!
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, వచ్చే జూన్ 12లోపు లక్ష్యం చేరుకునేలా చూడాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని చూస్తే ప్రభుత్వ సూచనలకు అందనంతా దూరంలో కనిపిస్తోంది. జిల్లాకు మొదటి విడత 10,865 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు కేవలం 751మాత్రమే పూర్తయ్యాయి. బేస్మెంట్ వరకు 1,743, వాలింగ్ వరకు 1,028, రూప్కాస్ట్ వరకు 3,968 కొనసాగుతున్నాయి. మొత్తం కలిపి 50శాతానికి చేరువలో ఇళ్ల నిర్మాణం ఉన్నప్పటికీ గృహప్రవేశం చేసేందుకు మాత్రం అవకాశం కనిపించడం లేదు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాకపోవడం.. ఖర్చులు తడిసిమోపెడు కావడం.. ఇసుక దొరకకపోవడం జాప్యానికి కారణంగా తెలుస్తోంది. ఈ సమస్య గ్రామీణప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ అధికంగా ఉంది. తప్పని ఇబ్బందులు పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు ఇబ్బంది తప్పడం లేదు. ప్రభుత్వం జూన్ 12 వరకు ఇళ్లు పూర్తిగా గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్నిచోట్ల ఇసుక దొరుకకపోవడం, మరికొన్ని చోట్ల ఇటుకలు, ఇతర సామగ్రి లేకపోవడం.. దొరికినా అత్యధిక రేట్లు ఉండటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గోదావరి నుంచి ఇసుక ట్రాక్టర్ల ద్వారా వస్తున్నా అది ఎటూ సరిపోవడం లేదు. కొన్నిచోట్ల ఉచితంగా ఇసుక ఇస్తున్నప్పటికీ జాప్యం జరుగుతోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ గృహ నిర్మాణం త్వరగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి జూన్ నుంచి వర్షాకాలం ఆరంభం అవుతుంది. ఇళ్ల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కరెంట్, ప్లంబర్, టైల్స్, కలర్స్ వంటి పనులు కాకున్నా.. గోడలు పూర్తయి దర్వాజలు పెట్టుకున్నా.. బిల్లులు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. మహిళ సంఘాల ద్వారా రుణాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిధులు లేని పక్షంలో మహిళ సంఘాల ద్వారా రుణాలు అందించాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కొందరు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లోన్లు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికీ జిల్లాలో రూ.11.60 కోట్ల రుణాన్ని లబ్ధిదారులకు అందించి ఇళ్ల నిర్మాణం చేపట్టుకునేలా ప్రోత్సహిస్తున్నారు. మంజూరైన ఇళ్లు 10,865 మార్కవుట్ చేసింది 8,946 బేస్మెంట్ వరకు 1,743 వాలింగ్ 1,028 రూప్కాస్ట్ 3,968 పూర్తయినవి : 751 బిల్లుల మంజూరులో జాప్యం జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నప్పటికీ బిల్లుల మంజూరులో జాప్యం ఎదురవుతోంది. కొందరు లబ్ధిదారులకు టెక్నికల్ సమస్యలతో రావడం లేదని అంటున్నారు. బిల్లులు తొందరగా ఇస్తే ఇళ్లు త్వరగా పూర్తవుతాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లక్ష్యం చేరుకునే అవకాశాలున్నాయి. బిల్లుల మంజూరుకు ప్రభుత్వం కొన్ని వెసులుబాటు కల్పించింది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – భాస్కర్, ఇన్చార్జి పీడీ -
జగిత్యాల
43.0/31.07గరిష్టం/కనిష్టంపోచమ్మకు బోనాలుమెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం వెల్లులలో ఆదివారం గౌడ కులస్తులు శ్రీరేణుకాఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. శోభాయాత్రగా ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం నుంచే ఎండ వేడిమి మొదలవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది.నృసింహుని సన్నిధిలో రద్దీధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వైశాఖ మాసం బహుళపక్షం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026 -
అమ్మ జ్ఞాపకంగా నిత్యాన్నదానం
సప్తగిరికాలనీ(కరీంనగర్): చిన్నతనంలోనే అమ్మ దూరమవగా.. తన జ్ఞాపకార్థం వేల మంది కడుపు నింపుతున్నాడు రేకుర్తికి చెందిన చెందిన గోదరి జితేందర్. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన ఆయన రేకుర్తిలో స్థిరపడ్డాడు. తన రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఆమె జ్ఞాపకార్థం 2016 ఫిబ్రవరి 15న గోదరి కాంతలక్ష్మి సేవా సమితిని స్థాపించాడు. ‘అమ్మ ప్రేమ.. సమాజ సేవ’ నినాదంతో 2020 నవంబర్ 27 నుంచి ప్రారంభించిన నిత్యాన్నదానం నేటికి 1,987 రోజులుగా నిరంతరంగా కొనసాగుతోంది. భార్య శరణ్య, స్నేహితులు, బంధువుల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. తాను బతికున్నంతకాలం అమ్మ జ్ఞాపకార్థం నిత్యాన్నదానం కొనసాగుతుందని జితేందర్ చెబుతున్నాడు. -
‘బంగారు’ తల్లి..
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన బంగారు లక్ష్మి–రాజయ్య దంపతులకు ఐదుగురు కూతుళ్లు. వారి చిన్నతనంలోనే 2000 సంవత్సరంలో అనారోగ్యంతో రాజయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ, కూలీ పనులు చేస్తూ కూతుళ్లను చదివించి అందరికీ పెళ్లి చేసింది. ప్రసుత్తం చిన్న కిరాణ షాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె స్వరూప డిగ్రీ పూర్తి చేసి ఆశవర్కర్గా ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు మంజుల 10వ తరగతి చదివి ఇంట్లోనే కుట్టు మిషన్ వర్క్ చేసుకుంటోంది. మూడో కూతురు రమాదేవి ఎంబీఏ చదివి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. నాలుగో కుమార్తె పద్మిని పీజీ చేసింది. ఐదో కుమార్తె సంగీత పీజీ (ఎమ్మెస్సీ) పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తోంది. -
అమ్మ ప్రోత్సాహంతోనే ఐపీఎస్గా..
గోదావరిఖని(రామగుండం): నా విజయంలో చిన్నప్పటి నుంచి అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మ కిరణ్కుమారిఝా కెమిస్ట్రి రిటైర్డ్ ఫ్రొఫెసర్. బిహార్ రాష్ట్రం మధుబని సొంత స్థలం. తండ్రి నందికిషోర్ఝా ఎంబీబీఎస్ డాక్టర్. సోదరి పారుల్ప్రియా సుంప్రీకోర్టు న్యాయవాది. సోదరుడు క్లిసైకిషోర్ఝా మైరెన్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అమ్మ చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో మా నిర్ణయానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సొంత ప్రాంతమైన మదుబనిలో 12వ తరగతి వరకు చదివా. తిర్చి ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. చిన్ననాటి నుంచి పోలీస్శాఖలో చేరాలనే ఆకాంక్ష ఉండేది. సివిల్స్ రాసి ఐపీఎస్గా ఉద్యోగం సాధించా. అమ్మ అన్ని విషయాల్లో తోడుంటూ మమ్మల్ని ప్రోత్సహించింది. ఏనాడూ టార్గెట్ పెట్టి చదివించలేదు. కెమిస్ట్రి ప్రొఫెసర్గా చేస్తూనే ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేసింది. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం తీర్చుకోలేనిది. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండంతల్లీ.. నీకువందనం..‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా’.. ‘అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తీయనంటా’.. అని కొందరు సినీ కవులు అన్నట్లు అమ్మ మాటల్లో తీయదనం ఉంటుంది. సృష్టికి మూలమైన రెండక్షరాల అమ్మ అనే పదం ప్రతీ గుండెను తాకుతుంది. తల్లి తమ పిల్లలకు ధైర్యం నింపుతుంది. నవమాసాలు కడుపున మోయడంతో మొదలయ్యే తల్లి బాధ్యత తన చివరి అంకం వరకు ఉంటుంది. నాన్న భవిష్యత్ను తీర్చిదిద్దితే.. తల్లి బతుకును అందిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పలువురు తల్లులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కన్న బిడ్డలను కంటికి పాపలా కాపాడుకుంటున్నారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. అచేతన స్థితిలో ఉన్న బిడ్డలకు అన్నీతానై సేవలందిస్తున్నారు. పేదరికం వారిని పగబట్టినా బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మాతృమూర్తులు. ఆదిలోనే మాంగళ్య బంధం తెగిపోయినా అధైర్య పడకుండా నేనున్నాను అంటూ అండగా ఉంటున్నారు. బిడ్డలను ఉన్నత శిఖరాలకు చేర్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపుకుంటూ అమ్మతనాన్ని చాటుకుంటున్నారు. అనాథలైన చిన్నారులను చేరదీసి వారికి అమ్మలవుతున్నారు మరికొందరు. కొందరు తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. పలువురు ఉద్యోగులు.. ఇంట్లో తల్లిగా.. సమాజంలో అధికారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భూదేవి అంత ఓపికతో.. కన్న బిడ్డలకు అండగా ఉంటున్న మాతృమూర్తి నీకు వందనం.. నేడు మదర్స్ డే సందర్భంగా...కొత్తపల్లి(కరీంనగర్): కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త శ్రీరాముల శ్రీనివాస్ సహకారంతో ఒత్తిడి తెలియకుండా ఉద్యోగంలో రాణిస్తున్నా. రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి ఉన్నా ఇంట్లో అర్థం చేసుకునే భర్త, సహకరించే అత్త ఉండడం వల్లే ఉద్యోగం, ఇంటి బాధ్యతలను బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. అమ్మ అనేది ఒక సంబంధం కాదు.. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమానంగా నడిపించే శక్తి. మదర్స్ డే సందర్భంగా ప్రతీ తల్లికి గౌరవం, గుర్తింపు, సహకారం అందాలని కోరుకుంటున్నా. – రేవెల్లి వెంకటలక్ష్మి, తహసీల్దార్, కొత్తపల్లి -
నా వెంటే నా పిల్లలు..
ఇల్లంతకుంట: నేను, మా ఆయన వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులం. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి చైత్ర 8వ తరగతి, చిన్నమ్మాయిని ఫ్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించా. పిల్లలిద్దరినీ నేను పని చేసే పాఠశాలలోనే చదివిస్తున్నా. విధులు నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలు, పిల్లలను చూసుకోవడం కష్టంగానే ఉన్నా ఇష్టంగానే చేస్తుంటా. ఉదయం 4 గంటలకు లేచి ఇంటి పని చేసుకుని పిల్లలను స్కూల్కు వెళ్తాం. ఇంటి పనుల్లో భర్త చేదోడు వాదోడుగా ఉంటారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో గడుపుతూ వారికి మంచి విలువలు, సంప్రదాయాలు నేర్పిస్తా. – సుప్రియ, ప్రభుత్వ టీచర్, ముస్కానిపేట -
నేటి నుంచి హనుమాన్ పెద్ద జయంతి
మల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజులపాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నుంచి తీసుకొచ్చిన పట్టువస్త్రాలను ఈనెల 10న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారికి సమర్పించనున్నారు. 11న స్థాపిత దేవతారాధన, హోమం నిర్వహిస్తారు. 12న స్వామివారి పెద్ద జయంతి సందర్భంగా ఉదయం 3 గంటలకు తిరుమంజనం, 6 గంటలకు ద్రవిడ ప్రబంధ పారాయణం, విశేష అభిషేకం, తులసీ అర్చన, పట్టు వస్త్రాల అలంకరణ, ఉత్సవమూర్తికి ఊయల సేవ, సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఉత్సవాలకు అంకురార్పణమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలకు శనివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలతో అంకురార్పణ చేశారు. యాగశాల శుద్ధి, పుణ్యహచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ అంజనా రెడ్డి, ప్రధాన అర్చకులు రామకృష్ణ, స్థానాచార్యులు కపీందర్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సునీల్, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ రెడ్డి.. రైతుల గురించి ఆలోచించు
మెట్పల్లి: ఫోర్త్సిటీ అంశాన్ని పక్కనపెట్టి ముందుగా రైతుల గురించి ఆలోచించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న కేంద్రాలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావుతో కలిసి శనివారం పరిశీలించారు. అక్కడి సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ లతతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలను ఆమెకు వివరించి పరిష్కరించాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రేవంత్రెడ్డికి ఫోర్త్ సిటీ మీద ఉన్న శ్రద్ద రైతులపై లేదని పేర్కొన్నారు. ఆయన పాలన ఇలాగే కొనసాగితే మరో రెండున్నర ఏళ్లలో వ్యవసాయం కనుమరుగవుతుందన్నారు. పంటల కొనుగోలులో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి నదీ జలాలను ఎల్లంపల్లికి మళ్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్.. ఇంతవరకు నిలబెట్టుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ గడువు ముగిసేలోపు హామీని నిలబెట్టుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు రేవంత్కు ఉండదన్నారు. -
శ్రీకోటేశ్వరస్వామి సన్నిధిలో జిల్లా జడ్జి
వెల్గటూర్: కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి శనివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారితో పూజలు చేయించారు. శేషవస్త్రంతో సన్మానించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేశ్, అర్చకులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లురాయికల్/జగిత్యాలరూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ మండలం ఆల్యనాయక్తండాకు కై క తార్యనాయక్ గృహప్రవేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అదనంగా మరో రెండు వేల ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానన్నారు. సర్పంచ్ జ్యోతి, సంతోష్, ఉపసర్పంచ్ గణేశ్, ఎంపీవో సుష్మ, మాజీ ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, రాయికల్ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్రావు పాల్గొన్నారు. అనంతరం సారంగాపూర్ మండలం పోతారానికి చెందిన మేకల తిరుపతి గృహాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు చీర కానుకగా అందించారు. సర్పంచులు మల్యాల శ్రీనివాస్, సొల్లు సురేందర్, శేఖర్, రమేశ్, కొలపాక రాధరాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అల్లీపూర్లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణంరాయికల్: మండలంలోని అల్లీపూర్లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవమూర్తులకు అర్చకులు నంబి వాసుదేవ సురేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు బాలె అరుణ, బాలె శ్రీరామ్, బాలె శ్రీనివాస్ వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం జరిపించారు. మాజీమంత్రి జీవన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత హాజరయ్యారు. సర్పంచ్ ఎంబారి గౌతమి, ఉపసర్పంచ్ వినయ్, అన్నదాన కమిటీ సభ్యులు మండ రవి, కొల్లూరి రాజేశ్, నాగరాజు, కట్ట రాజేశ్, కమలాకర్, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ముందస్తు నిర్ధారణతోనే క్షయ నివారణరాయికల్: ముందస్తు నిర్ధారణ పరీక్షలతోనే క్షయవ్యాధి నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి ఇటుకబట్టీలు, కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న కార్మికులకు శనివారం వైద్యశాఖ ఆధ్వర్యంలో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తారని పేర్కొన్నారు. హెల్త్ సూపర్ వైజర్ ఇల్లెందుల శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ కడకుంట్ల భూమయ్య, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కోరుట్లలో హిందూ సమ్మేళనంకోరుట్ల: పట్టణంలోని అష్టలక్ష్మీ ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి ఏకలవ్య బస్తీ కోరుట్ల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. వక్తలు హిందూ సమ్మేళనం ఆవశ్యకతను వివరించారు. -
త్వరితగతిన ధాన్యం కొనాలి
ధర్మపురి/వెల్గటూర్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బంది కలిగించొద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురిలోని నక్కలపేట, వెల్గటూర్లోని శాఖాపూర్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో ధర్మపురి, వెల్గటూర్ తహసీల్దార్లు, శ్రీనివాస్ శేఖర్ ఉన్నారు. స్వీయగణనలో పాల్గొనాలి జగిత్యాల: స్వీయగణనలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ అన్నారు. ఆదివారం ఒక్కరోజే అవకాశం ఉందన్నారు. మొబైల్ ఫోన్లో ప్రక్రియ సులభంగా చేయవచ్చని, నచ్చిన భాష ఎంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి ప్రత్యేక విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. కలెక్టర్తో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెంచడమే లక్ష్యమన్నారు. అకాలవర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
పార్టీలకతీతంగా వార్డుల అభివృద్ధికి కృషి
మెట్పల్లి: పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జనరల్ ఫండ్ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులను చైర్మన్ మైలారపు లింబాద్రితో కలిసి ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నర్సింగరావును పాలకవర్గ సభ్యులు సన్మానించారు. వైస్చైర్మన్ ఓంకారి నవీన్, కమిషనర్ శ్రీనివాస్గౌడ్, డీఈఈ నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు ఉన్నారు. నెరవేరుతున్న పేదల సొంతింటి కల మల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతోందని నర్సింగరావు అన్నారు. మండలంలోని చిట్టాపూర్లో ఇందిరమ్మ ఇంటి గృహాప్రవేశానికి హాజరయ్యారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సర్పంచ్ సంపతి శంకరమ్మ, ఉపసర్పంచ్ బాలసాని ప్రణయ్గౌడ్, మాజీ సర్పంచ్ కడకుంట్ల సాయికుమార్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనకుంటే పోరాటమే..
రాయికల్: మక్కల కొనకుంటే రైతుల పక్షాన పోరాడుతామని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలోని మార్కెట్యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొందరు రైతులు నిర్వాహకులకు డబ్బులిస్తేనే కాంటా చేస్తున్నారని వసంత దృష్టికి తీసుకురాగా.. వెంటనే ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆమె వెంట మాజీ జెడ్పీటీసీ గోపి మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ తురగ సౌజన్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్ పాల్గొన్నారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు మల్లాపూర్: మక్కలు, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని మెట్పల్లి ఆర్డీవో జి.నరసింహరావు అన్నారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. మండలకేంద్రంలోని మార్కెట్యార్డ్లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రాల్లో నీటి సదుపాయం కల్పించాలన్నారు. తహసీల్దార్ రాంచందర్, ఆర్ఐ రాజేశ్, అశోక్, ప్యాక్స్ సీఈవో రమేశ్ పాల్గొన్నారు. రైతులెవరూ అధైర్యపడొద్దు తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. స్థానిక మార్కెట్యార్డులో కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడపుల పుష్పలతతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే సంజయ్ రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. 10 రోజుల్లో మక్కల కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, కాంగ్రెస్ సేవాదళ్ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
జగిత్యాల
37.0/27.07గరిష్టం/కనిష్టంహరహర మహాదేవ వేములవాడ: రాజన్న, భీమన్న క్షేత్రాల్లో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. ఎండలకు లెక్కచేయకుండా భక్తులు రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం నుంచే ఎండ వేడిమి మొదలవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది.వేంకటేశ్వరస్వామి కల్యాణం కథలాపూర్: కథలాపూర్లో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026 -
టిఫిన్స్..
జిల్లాకేంద్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అప్పటివరకు ఇంట్లో టిఫిన్ చేయకపోవడంతో కలెక్టరేట్కు సమీపంలోని ఓ హోటల్కు వెళ్లి దోశ ఆర్డర్ ఇచ్చాడు. దానికి హోటల్ నిర్వాహకుడు రూ.80 బిల్లు వేశాడు. దీంతో అవాక్కయిన సదరు ఉపాధ్యాయుడు.. ఒక్క దోశకే ఇంతనా..? అని ప్రశ్నించగా.. ధరలు పెరిగాయని, సిలిండర్ల కొరత ఉందని, అందుకే రేట్లు పెంచాల్సి వచ్చిందని నిర్వాహకుడు జవాబిచ్చాడు.కొనలేంతినలేంజగిత్యాల: అసలే ఉరుకులు పరుగుల జీవితం. ఒక్కోసారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ (టిఫిన్) కాకపోతే చిరు ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా చిన్నచిన్న టిఫిన్ సెంటర్లకు వెళ్లి తింటుంటారు. మొన్నటివరకు ప్లేట్ పూరీ, ఇడ్లీ, వడ, దోశకు రూ.30 నుంచి రూ.40వరకు ఉండగా.. వాటి ధరలు అమాంతం పెంచారు. ఏకంగా రూ.80వరకు పెంచడంతో సామాన్యులు తినలేని పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సిలిండర్లు సక్రమంగా రాకపోవడం.. ఇటీవల కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచడంతో చిరువ్యాపారులకు గుదిబండగా మారింది. చిన్నచిన్న టిఫిన్ సెంటర్ల నుంచి పెద్దపెద్ద బిర్యానీ సెంటర్లు కూడా కట్టెల పొయ్యినే వినియోగిస్తున్నారు. అటు టిఫిన్స్, ఇటు మీల్స్ సెక్షన్లో ఒకేసారి రేట్లు పెంచారు. ఇది సామాన్య, మధ్యతరగతి వారికి ఇబ్బందిగా మారింది. చిరు హోటళ్లకు గుదిబండ ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, గప్చుప్ బండ్లు, చిన్నచిన్న హోటళ్లు, బిర్యానీ సెంటర్లు కమర్షియల్ సిలిండర్లపైనే ఆధారపడుతుంటారు. సాయంత్రం, మధ్యాహ్నం వేళ రోడ్లపై టిఫిన్స్ విక్రయిస్తుంటారు. ఇది సామన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సిలిండర్ల ధర పెంచడంతో విధిలేని పరిస్థితుల్లో టిఫిన్స్ ధర పెంచారు. ఒక హోటల్కు నెలకు 4–5 వాణిజ్య సిలిండర్లు అవసరం ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సిలిండర్ల ధర పెంచడంతో రూ.5వేల నుంచి రూ.6వేల భారం పడుతోందని, అందుకే విధిలేని పరిస్థితుల్లో టిఫిన్ ధరలు పెంచాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు ఇంటి అద్దెలు, సిబ్బంది వేతనాలు, నిత్యావసర కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వ్యాపారం సరిగా సాగడం లేదని, జీవనం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టమర్లకే ఇబ్బందులు ఏదైనా చిన్న హోటల్కు వెళ్లి పూరీ, దోశగాని తింటే రూ.30నుంచి రూ.40 ఉండేది. ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100కు పెరిగింది. ఈ ధర దాదాపు అ న్నంతో కూడిన భోజనం వస్తుంది. అలా ఒక్కసారి గా రేట్లు పెంచడంతో వినియోగదారులకు ఇబ్బంది గా మారింది. సామాన్య కుటుంబాలకు ఇది భారంగా మారింది. హోటల్ నిర్వాహకులు కట్టెల పొ య్యి ని వాడటంతో ఖర్చు అధికంగా అవుతుందని, దీంతో విధిలేని పరిస్థితుల్లో రేట్లు పెంచామని చెబుతున్నప్పటికీ అంతిమభారం కష్టమర్లపైనే పడుతోంది. ఇడ్లీ రూ.50 (రెండు) వడ రూ.70 (రెండు) మసాల దోశ రూ.80రవ్వ దోశ రూ.100పూరీ రూ.50బోండా రూ.60మీల్స్ రూ.200 -
చెరువుల్లో కలుపు మొక్కలను నివారించాలి
జగిత్యాల: చేపల చెరువులో కలుపు మొక్కలను నివారించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పారిశ్రామిక, మత్స్యకార, మార్కెటింగ్ లైసెన్స్ సహకార సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మత్స్యశాఖ చెరువుల్లో కలుపు మొక్కల నివారణ చేపట్టాలని, వ్యాధుల నివారణ, అధికోత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సురేశ్బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మార్కెట్ విలువల సవరణకు సంబంధించి ఫార్మర్–1 నుంచి 4 వరకు వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి ఈనెల 12లోపు సమర్పించాలన్నారు. నిబంధనలు, ప్రస్తుత రికార్డు, మార్కెట్లోని విలువలను పరిగణలోకి తీసుకుని ఖచ్చితమైన విలువలు నమోదు చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, రహదారులు, సర్వే నంబర్లు, వర్గీకరణల వారీగా వివరాలను పరిశీలించి పొరపాట్లు లేకుండా నివేదికలు పంపించాలని ఆదేశించారు. సమయ పాలన పాటిస్తూ నిర్ణీత గడువులోపు అన్ని ఫార్మెట్లు సమర్పించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి కూలీ లేబర్ కార్డు తీసుకోవాలి పెగడపల్లి(ధర్మపురి): భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికులకు లేబర్ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని, ప్రతీ ఒక్కరు లేబర్ కార్డు తీసుకోవాలని జిల్లా లేబర్ అధికారి అనిల్ కదం కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉపాధిహామీ పని ప్రదేశంలో కూలీలకు అవగాహన కల్పించారు. లేబర్ కార్డు పొందడం ద్వారా కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే రూ.2 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షలు జీవిత బీమా ద్వారా ఆర్థికసాయం అందే అవకాశముందన్నారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి లేబర్ కార్యాలయం నుంచి కార్డు ఇవ్వడం జరుగుతుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్పంచ్ అరుణ, ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి సదానందం, కార్యదర్శి ప్రవీన్, ఏఎంసీ డైరెక్టర్ విజయభాస్కర్, స్వామి, రవి పాల్గొన్నారు. -
సామాన్యులకు ఇబ్బందే..
ఇటు టిఫిన్స్ ధరలు పెరగడం సామాన్యులకు ఇబ్బందిగా మారింది. చిరు హోటళ్లలో రేట్లు పెంచడంతో అధిక భారం పడుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రేట్లు తగ్గించేలా చూడాలి. – కిరణ్, జగిత్యాల భారం ప్రజలపైనే అటు సిలిండర్ల ధరలు పెంచినా.. హోటల్ నిర్వాహకులు ధరలు పెంచినా భారం ప్రజలపైనే పడుతోంది. కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆలోచించాలి. హోటళ్లు మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. – కల్యాణ్, జగిత్యాల -
కొండగట్టుకు ఆధ్యాత్మిక శోభ
మల్యాల(చొప్పదండి): అంజన్న జయంతోత్సవాలకు కొండగట్టు ఆలయం ముస్తాబైంది. విద్యుద్దీపాలు, స్వాగత తోరణాలు, చలువ పందిళ్లతో ఉత్సవ శోభ నెలకొంది. ఈనెల 10 నుంచి 12 వరకు నిర్వహించే హనుమన్ పెద్ద జయంతికి సర్వం సిద్ధం చేశారు. సుమారు 2 వేల మంది పోలీసులు, అధికారులు, పారిశుధ్య సిబ్బందికి విధులు కేటాయించారు. ఏర్పాట్లు ఇలా.. ఉత్సవాలకు సర్వం సిద్ధం కొండగట్టు ఆలయంలో స్వామివారి జయంతోత్సవాలకు సర్వం సిద్ధం చేశాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశాం. లడ్డూ ప్రసాదాల కౌంటర్లు మూడు రోజులపాటు తెరిచి ఉంచుతాం. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు సహకరించాలి. – అంజనారెడ్డి, ఆలయ ఈవో -
రైతులు అధైర్య పడొద్దు
జగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్: రైతులెవరూ ఆందోళన చెందవద్దని, మార్కెట్యార్డులో ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు.జగిత్యాల మార్కెట్యార్డులో అకాల వర్షానికి తడిసిన వరి, మొక్కజొన్న ధా న్యాన్ని ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి పరిశీ లించారు. పంటలకు మద్దతు ధరలు ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకోవడంతో ఆ భారమంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఆదాయం సమకూర్చుకోవాలనే ముందుచూపుతో ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ అభివృద్ధిచేస్తున్నారని తెలిపారు. మాజీమంత్రి జీవన్రెడ్డి ఫ్యూచర్ సిటీపై చేసిన వ్యా ఖ్యలు సమంజసం కాదన్నారు. మంత్రి వెంట కలెక్ట ర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ వాణి, మా ర్కెట్ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, నాయకులు పాల్గొన్నారు. కేంద్రం తీరుతోనే కొనుగోలులో ఆలస్యం పెగడపల్లి: కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల వల్లనే ధాన్యం కొనుగోలులో ఆలస్యమైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. పెగడపల్లి మండలం ఆరవెల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కుప్పలను పరిశీలించారు. తూకంలో తేడా, ధాన్యంలో తరుగు పేరిట మిల్లర్లు సతాయిస్తే నిర్వాహకులు సంబంధిత అధికారులకు తెలుపాలని కానీ రైతులను మిల్లర్ల వద్దకు పంపవద్దని సూచించారు. పశు పోషణపై దృష్టి సారించాలి పశు పోషణపై దృష్టి సారించి అదనపు ఆదాయం గడించాలని మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్ రైతులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండలంలోని మద్దులపల్లిలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన పశుబీమా పునరుద్ధరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పునరుద్ధరణ అయ్యేలా కృషి చేస్తానన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు చేపట్టాలి ధర్మపురి: మండలంలోని నేరెల్ల శివారులో నిర్మిస్తు న్న యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ స్కూల్ పనుల ను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పనులు జరుగుతున్న తీరును పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి పరిశీలించారు. త్వరితగతిన పనులు చేపట్టాలని తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్/జగిత్యాలఅగ్రికల్చర్: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జగిత్యాల మండలం చల్గల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రాలకు వచ్చిన వరిధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అకాల వర్షాలు ఉన్నందున గన్ని సంచులు, టార్ఫలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఆయన వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు. గోదాం వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి జగిత్యాల: ఈవీఎం గోదాం వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ఈవీఎం గోదాంలను పరిశీలించారు. సీసీకెమెరాల పనితీరు, సాంకేతిక పరమైన అంశాలు సమగ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, ఏవో కిషన్, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
జగిత్యాలజోన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతిని కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించారు. ‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారంజగిత్యాలరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేద సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో వడ్లూరి సుజాత నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. రెండెకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు, సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఎంపీడీవో రమాదేవి, సర్పంచ్ కట్ట రాజేందర్, మాజీ ఎంపీటీసీ కర్నె భూమరెడ్డి, మాజీ సర్పంచ్ గంగారాం, సదానందం, లింగారెడ్డి, తిరుపతి, వెంకటేశ్, ప్రశాంత మల్లారెడ్డి, అనిల్ పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేజగిత్యాలఅగ్రికల్చర్: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అన్నారు. అకాల వర్షంతో తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని శుక్రవారం పరిశీలించారు. ధాన్యం తూకం వేసిన తర్వాత లారీలు రావడం లేదని, వర్షానికి సంచులు తడిస్తే రైతులదే బాధ్యత అంటున్నారని రైతులు జీవన్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జీవన్ రెడ్డి మా ర్క్ఫెడ్ ఎండీ, కలెక్టర్తో మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు. మార్కెట్లో 3 గో దాంలు ఖాళీగా ఉన్నాయని, అందులో నిల్వ చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగనీయవద్దని అధికారులకు సూచించారు. పశుసంపదను పెంచేందుకు రైతు సదస్సులుజగిత్యాలఅగ్రికల్చర్/జగిత్యాలరూరల్: జిల్లాలో పశుసంపదతో పాటు పాల ఉత్పత్తిని పెంచేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలంలోని మోరపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరంతో పాటు రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడి పశువుల్లో వ్యాధులను నియంత్రించేందుకు సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పాడి ఉత్పత్తిని పెంచేందుకు ఆచరించాల్సిన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. ఉచిత పశువైద్య శిబిరాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. వెటర్నరీ ఏడీ నరేశ్, శ్రీదేవి, డాక్టర్ నరేశ్, సర్పంచ్ రాజేందర్, నాయకులు ఆకునూరి గంగారాజం, లింగారెడ్డి, గంగారాం, భూమారెడ్డి, పారావెటర్నరీ సిబ్బంది రవీందర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతులపై నిర్లక్ష్యం..
మెట్పల్లి: రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో పట్టణంలో భూగర్భజలాలు వట్టి పోతున్నాయి. తద్వరా నీటి కొరత ఏర్పడి పలు వార్డుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవికి ముందే అధికారులు పనిచేయని చేతి పంపులు, పబ్లిక్ బోర్లను గుర్తించి మరమ్మతు చేయించాల్సి ఉండగా.. కొన్నిటికి మాత్రమే చేయించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వీటిపైనే ఆధారపడ్డ కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి. రెండు నెలలు గడిచినా.. దృష్టికి తీసుకొస్తే చర్యలు పట్టణంలో చాలాచోట్ల పని చేయని పబ్లిక్ బోర్లు, చేతి పంపులకు మర్మమతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చాం. ఎక్కడైనా పని చేయనివి ఉంటే ప్రజలు మ దృష్టికి తీసుకొస్తే మరమ్మతు చేస్తాం. నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. – నాగేశ్వర్రావు, మున్సిపల్ డీఈఈ -
సోలార్ విద్యుత్కు ప్రాధాన్యమివ్వాలి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాలఅగ్రికల్చర్: సోలార్ విద్యుత్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాసలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. థర్మల్, జల విద్యుత్తో పోల్చితే సోలార్తో తక్కువ ఖర్చవుతుందన్నా రు. నియోజకవర్గంలోని 78వేల పేద, మధ్య తరగ తి కుటుంబాలకు ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు. పర్యావరణానికి హాని చేయని సోలార్ విద్యుత్ వైపు ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మార్కెట్ చైర్మన్ నారాయణ రెడ్డి, డీఏవో భాస్కర్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం, డీఈ గంగారాం, ఏడీ తిరుపతినాయక్, ఎడీఈ జవహర్ నాయక్, ప్రోపెసర్ సుజాత, నాయకులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై పోరాడుతాం
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోరుట్లరూరల్: రైతు సమస్యలపై పోరాడుతూనే ఉంటామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును బుధవారం సదర్శించారు. నెలరోజులుగా మక్కలు కాంటా చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్ఫెడ్ డీఎంకు ఫోన్ చేసి మక్కలు త్వరగా కొనుగోలు చేయాలని సూచించారు. మక్కలు రోజుల తరబడి ఇలాగే ఉంటే అకాలవర్షాలకు తడిసిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రైతులకు పంట పెట్టుబడి సాయం, యూరియా అందించడంలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని కూడా సకాలంలో కొనలేకపోవటం దారుణమన్నారు. ప్రభుత్వం మీడియా మేనేజ్మెంట్ వదిలి గ్రౌండ్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలని, లేకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్ చీటి వెంకట్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..మల్లాపూర్: పంటల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన మొక్కజొన్న పంటను బుధవారం పరిశీలించారు. బాధిత మహిళారైతు గుమ్ముల లతతో మాట్లాడారు. ఆధైర్యపడోద్దని, పరిహారం అందించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి ఉన్నారు. మున్సిపల్ చైర్మన్, అధికారులపై ఫిర్యాదుమెట్పల్లి: మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మొన్నటివరకు పనిచేసిన కమిషనర్ స్పందన, విద్యుత్ అధికారులపై 11వార్డు కాంగ్రెస్ ఇన్చార్జీ కొమిరెడ్డి లింగారెడ్డి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వార్డులోని మంచినీటి బావి ప్రహరీ కొంతభాగాన్ని గోపనవేణి శేఖర్, బైన శ్రీనివాస్ పగులగొట్టి నీటిని వారి పంట పొలాలకు తరలిస్తున్నారని కొన్ని రోజుల క్రితం లింగారెడ్డి చైర్మన్, కమిషనర్, విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపి పైపులు, విద్యుత్ కనెక్షన్ తొలగించామంటూ లింగారెడ్డికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అక్కడ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలని లింగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో బుధవారం 45.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బీర్పూర్ మండలం కొల్వాయిలో 45.3, రాయికల్ మండలం అల్లీపూర్లో 45.2, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్లో 45.1, మల్లాపూర్ మండలం గోదూర్లో 44.8, మల్లాపూర్లో 44.7, కోరుట్ల మండలం అయిలాపూర్లో 44.5, మెట్పల్లిలో 44.5, ధర్మపురి మండలం జైనాలో 44.3, మేడిపల్లిలో44.1, రాయికల్లో 44.1 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. మక్క రైతుల ధర్నాజగిత్యాలఅగ్రికల్చర్: కొనుగోలు చేసిన మక్కలను తరలించడం లేదంటూ రైతులు జగిత్యాల మార్కెట్యార్డు ఎదుట నిజమాబాద్–కరీంనగర్ రహదారిపై బుధవారం ధర్నాకు దిగారు. 15 రోజులు గడస్తున్నా.. మక్కలు కొనడం లేదని, కాంటా వేసిన వాటిని తరలించడం లేదని ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మార్కెట్లో 10 వేల క్వింటాళ్లకు పైగా మక్కలు ఉన్నాయని, 15వేల బస్తాలు కాంటా చేసి ఉన్నాయని, వర్షం వస్తే తమ పరిస్థితి ఏంటని అధికారులను నిలదీసారు. స్థల సమస్య కారణంగా ఇతర రైతులు మక్కలను మార్కెట్కు తీసుకురాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఐ కరుణాకర్, ఎస్సై సదాకర్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి అధికారులతో ఫోన్లో మాట్లాడడంతో రైతులు శాంతించారు. మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మ దహనం ధర్మపురి: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని పేర్కొంటూ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మను పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సురేఖ హిందూదేవతలను కించపర్చారని, జైశ్రీరాం అంటే డబ్బులు రాలుతాయా..? అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మైనార్టీల ఓట్ల కోసం హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. నాయకులు గాజు భాస్కర్, స్తంభంకాడి శ్యాం, పల్లెర్ల సురేందర్ తదితరులున్నారు. -
దోపిడీకి స్కెచ్!
● దేశవ్యాప్తంగా సుశిక్షితులైన 70 మందితో క్రిమినల్ నెట్వర్క్ ● బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కేసులు ● చోరీ చేసిన మొబైళ్లు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ (ఫేస్టైంతోసహా)తో జైలు నుంచే వీడియో కాల్స్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఆదేశాలు. ● గోల్డ్ లోన్ కంపెనీలు, నగల దుకాణాలు, జువెల్లరీ షోరూంలే టార్గెట్ ● అనుచరులకు వేతనాలు, నేరాల్లో ప్రతిభ కనబరిస్తే బోనస్లు ● పలు రాష్ట్రాల్లో తనిష్క్, మణప్పురం, ముత్తూట్ తదితర సంస్థల నుంచి 30కిలోలకు పైగా బంగారం తస్కరణ. ● పారిపోయేందుకు ప్రత్యామ్నాయాలు, దోపిడీకి ముందు రెక్కీ ఈ గ్యాంగ్ ప్రత్యేకత. ● ప్రస్తుతం బిహార్, వెస్ట్బెంగాల్లో కేసులు. బిహార్ జైలు నుంచిసాక్షిప్రతినిధి,కరీంనగర్ : జులాయి సినిమాలో విలన్ ఒక దొంగ.. చోరీ చేసిన ప్రతిసారీ పోలీసులకు తప్పుడు క్లూ వదిలి.. తాను మాత్రం మరో మార్గంలో పరారవుతుంటాడు. దీనినే పోలీసు పరిభాషలో ‘అటెన్షన్ డైవర్షన్’ అంటారు. ఈ టెక్నిక్నే కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీలో దొంగలు వినియోగించినట్లు తెలుస్తోంది. దేశంలోని అనేక జువెల్లరీ షాపులను నిలువుదోపిడీ చేసిన బిహార్కు చెందిన ‘గోల్డ్ థీఫ్’ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ గ్యాంగ్ ఉత్తర భారతంలో దోపిడీలు, కిడ్నాప్లు, అక్రమ వసూళ్లకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా గోల్డ్ థీఫ్కి క్రిమినల్ నెట్వర్క్ ఉంది. ఇతను కన్నేశాడంటే.. ఇతని అనుచరులు పథకం పన్ని బంగారం మొత్తం ఊడ్చి పారేస్తుంటారు. సుశిక్షితులైన దొంగలు కావడంతో ఇప్పటివరకు అన్నీ భారీ చోరీలే నమోదయ్యాయి. ప్రస్తుతం గోల్డ్ థీఫ్ బిహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురికి వచ్చింది మొత్తం ఆరుగురు.. ఈనెల 3న.. కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో దొంగతనం చేసింది ఐదుగురు కాదు.. ఆరుగురిగా పోలీసులు గుర్తించారు. ఈనెల ఒకటిన ఉదయం ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిలో తొలుత నలుగురు, తర్వాత మరొకరు వచ్చారు. ఇంకోవ్యక్తి సాయంత్రం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతడే ఈ ఽఐదుగురిని ధర్మపురి నుంచి ఛత్తీస్గఢ్ లేదా ఝార్ఖండ్ వైపు తప్పించి ఉంటాడని అనుమానిస్తున్నారు. జార్ఖండ్కు చెందిన సౌరభ్కుమార్మిశ్రా పేరుతో విజయలక్ష్మి లాడ్జిలో రూ.1200కు గది అద్దెకు తీసుకున్నారు. ధర్మపురిలో దైవదర్శనం కూడా చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఉత్తరభారతంలో దొంగలు చోరీకి ముందు పూజలు చేయడం ఆనవాయితీ. ఏప్రిల్ 27నుంచి 30వరకు దొంగలు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో బస చేశారు. అక్కడ నుంచే దొంగతనానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ కూడా జార్ఖండ్కు చెందిన చిరునామాతో గుర్తింపుకార్డులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వ్యక్తులు మార్చి నెలలోనూ ఇదే లాడ్జిలో బస చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. చోరీకి ముందు సిద్దిపేట పరిసరాల్లోనూ ఈ ముఠా సంచరించినట్లు సమాచారం. ఘటనాస్థలంలో మహారాష్ట్రకు చెందిన బ్యాగు, గోదావరి తీరంలో బైక్ను అటెన్షన్ డైవర్షన్ కోసమే కావాలని వదిలేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్సర్ బైకు చాసీస్ను గుర్తించిన పోలీసులు అది ఢిల్లీదిగా తేల్చారు. బ్యాగు, బైకు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి దర్యాప్తు జాప్యానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. అది అనుభవమున్న దొంగలకే సాధ్యం. చోరీలో పాల్గొన్న వారి ఆచూకీని ఇప్పటికే కనుగొన్న పోలీసులు బిహార్లోని నిందితుల ఇళ్లు, నిందితులు, స్నేహితుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. ఎలాగైనా రెండు రోజుల్లో పట్టుకుంటామని ధీమాగా ఉన్నారు. -
కేంద్రప్రభుత్వ తీరుతోనే ఆలస్యం
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మపురి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతోనే కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి, మొక్కజొన్నలను బుధవారం పరిశీలించారు. కేంద్రప్రభుత్వం ఆన్లైన్లో ట్రక్షీట్, వాహనాలకు జీపీఆర్ఎస్ పెట్టాలని నిబంధన తేవడంతో 15 రోజులు ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. వారం పదిరోజుల్లో ధాన్యం కాంటా చేసి మిల్లులకు తరలిస్తామని, రైతులు అధైర్యపడొద్దని సూచించారు. ఆయన వెంట గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్, ఏఎంసీ చైర్పర్సన్లు వేముల నాగలక్ష్మి, చిలుముల లావణ్య, కౌన్సిలర్ చీపిరిశెట్టి రాజేశ్ తదితరులున్నారు. -
కేంద్రమంత్రిగా ఉంటూ బూతులా..
జగిత్యాల: కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ బూతులు మాట్లాడటమేంటని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. బీజేపీ క్రమశిక్షణ పార్టీ అంటారని, మోదీ, అమిత్షా ఇలాగే మాట్లాడమని చెప్పారా అని ప్రశ్నించారు. మంత్రి ఇంటికి కూతవేటు దూరంలో కాల్పులు జరిపి దొంగలు బంగారం ఎత్తుకెళ్తే ఏం చేశారని నిలదీశారు. కేటీఆర్ను కరీంనగర్కు రానివ్వబోమంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దత్తత ఇచ్చిందా అని ప్రశ్నించారు. కేటీఆర్పై విమర్శలు చేస్తే సహించబోమన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్రావు, దేవేందర్నాయక్ పాల్గొన్నారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అనంతారంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులంటే కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు అయిల్నేని ఆనందరావు, మోహన్, శ్రీపాల్, జలేందర్, రాజమల్లు, మల్లేశం, గంగాధర్, తిరుపతి, సత్తన్న పాల్గొన్నారు. -
వెలమ కార్పొరేషన్ చైర్మన్గా ‘జువ్వాడి’
కోరుట్ల: కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, సీనియర్ నాయకుడు జువ్వాడి నర్సింగరావుకు వెలమ కార్పొరేషన్ చైర్మన్గా నియామకమయ్యారు. రాష్ట్రంలో మొదటిసారి ఏర్పాటు చేసిన వెలమ కార్పొరేషన్కు నర్సింగరావు నియామకం కావడం విశేషం. ఇటీవల నియోజకవర్గంలో మూడోవంతు సర్పంచ్ స్థానాలు గెలవడంతోపాటు కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలను నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కై వసం చేసుకుంది. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఈయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఏపీఐఐసీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. కొంతకాలంగా జువ్వాడి నర్సింగరావుకు కార్పొరేషన్ పదవి ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్గా ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నూతనోత్సాహం నెలకొంది. పట్టణంలో టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. తనను వెలమ కార్పొరేషన్ చైర్మన్గా ఎంపిక చేసిన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని అన్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఇబ్రహీంపట్నం: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసా ద్ సూచించారు. మండలంలోని తిమ్మాపూర్, గో ధూర్, ఇబ్రహీంపట్నంలో కొనుగొలు కేంద్రాలను పరిశీలించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. రైతులు తమ ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తరలిస్తే కిరాయి చెల్లిస్తామని తెలిపారు. అకాల వర్షాలు ఉన్నందున నిర్వాహకులు గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని పేర్కొన్నారు. -
వీఎల్టీ స్థలం.. కమిషనర్కు గండం
కోరుట్ల: ఏదైనా స్థలానికి వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్టీ) వేయాలంటే ఆ స్థలానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తప్పకుండా ఉండాలి. స్థలం చుట్టూ హద్దులు చూపే రీతిలో కనీసం బేస్మెంట్.. అర్జీ దారుడిదే అని ధ్రువీకరించేందుకు చిన్నపాటి షెడ్డు చూపాలి. అన్నీ పరిశీలించాక.. నియమిత స్థలానికి మాత్రమే వీఎల్టీ కేటాయించాల్సి ఉంటుంది. కా నీ.. ఇవన్నీ పక్కనపెట్టి.. ఎలాంటి ధ్రువీకరణ లేకు న్నా.. ఓ వీలునామా ఆధారంగా హద్దులు లేని స్థలానికి ఆనుకుని గతంలో ఎప్పుడో ఇళ్లు ఉన్నాయ ని చెప్పి వీఎల్టీ నంబర్లు కేటాయించడం కోరుట్ల పట్టణంలో వివాదాస్పదంగా మారింది. ఈ వీఎల్ టీ కేటాయింపు వ్యవహారంలో మూడు రోజుల క్రితం బదిలీ అయిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ లెక్కలేని ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరికి కోరుట్ల నుంచి అర్ధాంతరంగా బదిలీపై వెళ్లారు. ఏమిటీ వివాదం.. కోరుట్ల పట్టణంలో చాళుక్యుల కాలం నాటి చారిత్రక కోటబురుజులు ఆనాటి ఖ్యాతికి ఆనవాళ్లుగా మిగిలాయి. అనంతరం కాలంలో సదరు కోట బురుజులకు ఆనుకుని ఉన్న సుమారు 14 వేల చదరపు గజాల స్థలం వారసత్వ సంపదగా నిర్ధారించి పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చారు. వందల ఏళ్లుగా ఆ బురుజులను ఆనుకుని ఉన్న స్థలంలో సుమారు 200 మీటర్ల మేర ఎలాంటి కట్టడాలకూ అనుమతి ఇవ్వలేదు. సదరు స్థలం తమకు వారసత్వంగా చెందుతుందని, ఆ స్థలంలో తమకు ఇదివరకు గడీలు, ఇళ్లు ఉండేవని వాటిని అమ్మేందుకు కొంతమంది ప్రయత్నాలు సాగించారు. వాటిలో కొంతభాగం అమ్మకాలు కూడా జరిగాయి. పురావస్తు శాఖ ఉత్తర్వులు అమల్లో ఉన్న క్రమంలో మున్సిపల్ నుంచి నిర్మాణాలకు అనుమతి రాలేదు. సుమారు 12 ఏళ్ల క్రితం గడి బురుజుల స్థలంలో అమ్మకాలు జరిగాయి. ఆ అమ్మకాలపై అప్పుడే వివాదం మొదలైంది. హైకోర్టుకు వివాదం కోరుట్ల కోట బురుజుల స్థలం వారసత్వ సంపద అని పేర్కొంటూ అప్పటి కౌన్సిలర్ ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషనర్ సరైన ఆధారాలు సమర్పించకపోవడం.. పురా వస్తు, రెవెన్యూ అధికార యంత్రాంగం సదరు స్థలా న్ని తమదిగా చూపడంలో ఉదాసీనంగా వ్యవహరించడంతో పరిస్థితి చేజారింది. ఎనిమిది నెలల క్రితం సదరు స్థలంలో కోట బురుజులు మినహా మిగిలిన స్థలం అంతా వారసులకే చెందుతుందని హెరిటేజ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసి వారసులకు ఆస్తిపై హక్కును ధ్రువీకరించింది. బురుజ ల నిర్మాణం ఉన్న పరిసరాల్లో 15 ఫీట్లు మినహా యించి మిగిలిన స్థలం అంతా వారసులదే అని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సదరు ఆస్తి వారసులు కోట బురుజుల ఆబాదిలో ఉన్న ఆ స్థలం అమ్మకాలకు యత్నించారు. సదరు స్థలం రిజిస్ట్రేషన్ కోసం అమ్మకానికి వీఎల్టీ వేసుకోవడం తప్పనిసరి అయింది. గతంలో ఉన్న తమ గడీలు, ఇళ్లకు సంబంధించిన మూడు ఇంటి నంబర్లను ఆసరాగా చేసుకుని కోరుట్ల మున్సిపల్ అధికారులు వేలాది గజాల స్థలానికి వీఎల్టీ నంబర్లు వేశారు. ఈ వీఎ ల్టీల కేటాయింపునకు ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ స్థలం ఖాళీగా ఉన్న సమయంలో మహిషాసుర మర్ధన కార్యక్రమానికి వేదికగా మారడం, దగ్గరలోనే ఉన్న కూరగాయల మార్కెట్ రోడ్డుపై ఉండటం, అందుబాటులో పార్కులు లేకపోవడంతో కో ట బురుజుల స్థలాన్ని ప్రజోపయోగానికి వినియోగించాలన్న డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్తో అఖిలపక్షాలు సుమారు మూడు నెలలుగా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. లెక్కలేని ఫిర్యాదులు.. నేడు విచారణ అఖిలపక్షాలు, స్థానికులు కొందరు కొందరు గడి స్థలంలో అక్రమంగా వేసిన వీఎల్టీలు రద్దు చేయాలని ఉద్యమాలు చేపట్టారు. బీజేపీ కౌన్సిలర్లు కలెక్టర్, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గడీ స్థలాలకు వీఎల్టీలు ఎలా వేశారన్న అంశంపై ఆర్డీవో జీవాకర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం విచారణకు రంగం సిద్ధమైంది. తప్పుడు రీతిలో వేసిన వీఎల్టీల విషయంలో అధికార యంత్రాంగం విచారణ ఎలాంటి ఫలితం ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తప్పుడు వీఎల్టీలకు కారణమైన బదిలీ అయిన మున్సిపల్ కమిషనర్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. గడీ స్థలం ప్రస్తుతం పట్టణ మధ్యభాగంలో ఇళ్ల మధ్య ఉంది. దీంతో సదరు స్థలం విలువ గజానికి రూ.15వేల వరకు పలుకుతోంది. దీనిపై స్థానిక భూమాఫియా కన్నేసి తక్కువ ధరకు చేజిక్కించుకునేందుకు యత్నాలు చేశాయి. ఈ క్రమంలో మళ్లీ గడి స్థలాల భూమిలో కొనుగోళ్లు.. నగదు లావాదేవీలు సాగినట్లు సమాచారం. ఎవరికి వారు అందినంత మేర దండుకునే యత్నాలకు శ్రీకారం చుట్టడం వివాదానికి దారి తీసింది. మున్సిపల్ అధికారులు ఈ విషయంలో చేతివాటం చూపారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. గడి స్థలంపై భూ మాఫియా.. -
మీ హయాంలో జరిగిన హత్యలకు మీదే బాధ్యతా?
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన న్యాయవాదుల జంట హత్యలు, దొంగతనాలు, ఇతర నేరాలకు కేసీఆర్, కేటీఆర్లే బాధ్యులో చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ డిమాండ్ చేశారు. దొంగతనం జరిగిన జువెల్లరీ షాప్ను మంగళవారం సందర్శించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలకు సీఎం రేవంత్రెడ్డికి ముడిపెట్టే నీచస్థితికి కేటీఆర్ దిగజారారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ ఎడిక్ట్ అయి, ఫామ్హౌజ్లో గడుపుతున్న విలాసవంతమైన కేటీఆర్ జీవితాన్ని ప్రజలకు తెలియచేసేందుకు డ్రోన్కెమెరాలతో చిత్రీకరిస్తే రేవంత్ను జైలుకు పంపించారన్నారు. అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి, ఇప్పుడు దొంగలతో సంబంధాలు అంటగడుతున్నారన్నారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన హత్యలు,దోపిడీ, దొంగతనాలకు అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కారణమా..? చెప్పాలన్నారు. జువెల్లరీ దొంగతనం జరిగితే హుటాహుటిన వచ్చిన కేటీఆర్, తమ ప్రభుత్వ హయాంలో నేరెళ్ల, కొండగట్టు బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నారు. దొంగలను పట్టుకొనేందుకు 15 ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని, నేరస్తులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొగోడైతే కాళేశ్వరం కేసులో కేసీఆర్కు సీబీఐ నోటీసులు ఇప్పించాలని లక్ష్మణ్కుమార్ సవాల్ విసిరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, పడిశెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, ఆకుల ఉదయ్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు. -
లాభదాయక పంటలు సాగు చేయాలి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు లాభదాయక పంటలు సాగు చేసి.. మంచి ఆదాయం పొందాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్యానపంటలపై సదస్సు నిర్వహించారు. రైతులు పండించడంతోపాటు మార్కెటింగ్ నైపుణ్యాన్ని అలవర్చుకోవాలన్నారు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్మీడియాను ఉపయోగించుకుని ఉత్పత్తులను అమ్ముకునే స్థాయికి ఎదగాలన్నారు. దొడ్డు రకం ధాన్యం తగ్గించి సన్నాలు సాగు చేయాలని సూచించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వాతి, ప్రత్యేక అధికారి రమేశ్ పాల్గొన్నారు. హిందువుల్లో ఐక్యత పెరగాలి రాయికల్: హిందువుల్లో ఐక్యత పెరిగితేనే ధర్మం చిరకాలం వర్ధిల్లుతుందని ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ్ సాయి మధుకర్ అన్నారు. మంగళవారం రాయికల్ మండలం ఇటిక్యాలలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలో సామూహిక భజన, గోపూజ, హనుమా న్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ గోమాతను పూజించాలని, గోవులో సర్వదేవతలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో స ర్పంచ్ నీరటి శ్రీనివాస్ హిందువులు పాల్గొన్నారు. -
45.3 డిగ్రీల ఉష్ణోగ్రత
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంగళవారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాయికల్ మండలం అల్లీపూర్లో 45.3, బీర్పూర్ మండలం కొల్వాయి, ఇబ్రహీంపట్నం గోదూరులో 45, ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 44.7, రాయికల్లో 44.6, ధర్మపురి మండలం జైనలో 44.4, కోరుట్ల మండలం అయిలాపూర్, ధర్మపురి మండలం నేరెళ్లలో 44.3, ఎండపల్లి, మెట్పల్లిలో 44.2, మేడిపల్లిలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కథలాపూర్ అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్కథలాపూర్: కథలాపూర్ అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ ఎండీ.ముస్తాక్అలీని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో బీట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో సెక్షన్ ఆఫీసర్కే బీట్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా అటవీశాఖలో వివాదం చోటుచేసుకుంటోంది. ఈ విషయంలోనే ముస్తాక్అలీ అసంతృప్తితో అనుమతి లేకుండా 19 రోజులు సెలవుపై వెళ్లారు. దీనిని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు అలీని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో కుమ్మరి పూర్ణిమ బాధ్యతలు తీసుకున్నారు. ఈమె అటవీ శాఖ జిల్లా మొబైల్ పార్టీలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. క్షయ నివారణకు కృషిచేయాలిగొల్లపల్లి: క్షయ నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డిజిటల్ మొబైల్ ఎక్స్రే మిషన్తో క్షయ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. సుమారు 72 మందికి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రీకాంత్, పర్యవేక్షకులు నరేందర్, ఎస్టీస్ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్స్ వికాస్, రాజీవ్ పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్కోరుట్ల: కోరుట్ల మున్సిపల్ కమిషనర్గా ఎం.శ్రీనివాస్రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఉద్యోగులు కమిషనర్కు స్వాగతం పలికారు. అనంతరం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అధికారులను, సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిజగిత్యాలరూరల్: ఇండియా, ఖతర్ లేబర్ మైగ్రేషన్ కారిడార్లో ఇరుదేశాల్లో సంఘాల సమన్వయంతో కార్మికుల సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలంగాణ ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మంద భీంరెడ్డి తెలిపారు. మంగళవారం ఖతర్ నుంచి ‘సాక్షి’తో మాట్లాడారు. వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బీడబ్ల్యూఐ) ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గ్లోబల్ ఆర్గనైజింగ్ అకాడమీ, ఆసియా పసిఫిక్ అనే సంస్థ ఈనెల 4, 5 తేదీల్లో ఫిలిప్పీన్స్లోని మనీలాలో కార్మిక సంఘాల ప్రతినిధులకు రెండు రోజుల శిక్షణ ఇచ్చిందన్నారు. 10 దేశాల్లో 22 అనుబంధ సంస్థల నుంచి 42 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. ఖతార్లోని తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు పాల్గొని స్వ దేశం, విదేశంలో పనిచేసే రెండు వేర్వేరు సంఘాలు సమన్వయంతో పనిచేస్తే.. వలస కా ర్మికుల సమస్యలను వేగంగా, సులువుగా పరి ష్కరించవచ్చని సూచించినట్లు పేర్కొన్నారు. -
ఏసీబీ సోదాల కలకలం
జగిత్యాల: కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఏసీబీ అధికారుల బృందం చేరుకుంది. డీఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు సిబ్బంది సోదాలు చేపడుతున్నారు. సోదాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. అవినీతి ఆరోపణలపైనేనా..! సంక్షేమ శాఖ కార్యాలయంలో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో అంగన్వాడీ టీచర్లు కొందరు ఆ శాఖ అధికారులపై ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. గతంలో పనిచేసిన అధికారులపైనా ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అధికారుల లావాదేవీలను పరిశీలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ శాఖ పరిధిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు నేరుగానే ఉన్నతాధికారులపైనే ఫిర్యాదు చేశారు. గతంలోనే అధికారులు విచారించారు. తాజాగా ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై డీఎస్పీని వివరణ కోరగా.. తనిఖీల్లో భాగంగానే సోదాలు చేశామన్నారు. నాడు మున్సిపాలిటీ.. నేడు సంక్షేమ శాఖ కార్యాలయం ఇటీవల ఏసీబీ అధికారులు సుమారు 15 మంది మున్సిపల్ కార్యాలయంలో సుమారు 10 గంటలకు పైగానే సోదాలు నిర్వహించారు. ప్రతి శాఖలోని రికార్డులను పరిశీలించి అందులో జరిగిన అవినీతి, అక్రమాలను వెల్లడించారు. రికార్డులను ఉన్నతస్థాయి అధికారులకు పంపించారు. తాజాగా జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల అందులో పనిచేస్తున్న ఓ అధికారిని కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ అవినీతి అక్రమాలు బయటపడితే మరింతమందిపై వేటు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రంలో ప్రజావంచన పాలన
జగిత్యాలటౌన్: రాష్ట్రంలో ప్రజావంచన పాలన సాగుతోందని, ధాన్యం సేకరణపై రైతులు రోడ్డెక్కితేగానీ ప్రభుత్వంలో చలనం రాకపోవడమే ఇందుకు నిదర్శనమని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలను వంచిస్తుంటే చూస్తూ ఉండలేక, రైతు బంధు, రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వాన్ని సమర్థించలేక కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చానని అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోడంతోనే జిల్లాలో కొనుగోళ్లు జరగడం లేదన్నారు. జిల్లాలోని పలుచోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేసి వారం రోజులు గడుస్తున్నా తరలించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు రేవంత్రెడ్డిని నమ్మబోరని తెలిసే రైతాంగ సమస్యలపై రాహుల్గాంధీతో వరంగల్ డిక్లరేషన్లో హామీలు ఇప్పించారని, ఆ హామీలను రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయడం లేదని అన్నారు. రుణమాఫీ సగం ఎగ్గొట్టారని, ప్రభుత్వం 25శాతం ప్రీమియం చెల్లించకపోవడంతో రాష్ట్రంలో పంటల బీమా అమలుకు నోచుకోవడంలేదన్నారు. పూడూరు రైతు ధర్నాతో జిల్లా మంత్రి ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని, సమీక్షతోనే సరిపెట్టకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో 7లక్షల మెట్రిక్ టన్నులకు గాను ఇప్పటికే 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని జగిత్యాల జిల్లాలో మాత్రం ఇప్పటికీ 5శాతం మించి కొనుగోళ్లు కూడా జరగలేదన్నారు. ఉన్నమాటంటే కాంగ్రెస్ నాయకులు ఉలిక్కిపడుతన్నారని అన్నారు. తమపై ప్రతి విమర్శలు మానుకుని ఎఫ్సీఐ నిబంధనల మేరకు కొనుగోళ్లు జరపాలని, కొనుగోలు చేసిన 24గంటల్లో ధాన్యాన్ని తరలించాలని కోరారు. గోదాం సౌకర్యం లేని పక్షంలో ఎక్కడికక్కడ నెట్టింగ్ వేయాలో కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరారు. అంతకు ముందు జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. జీవన్రెడ్డి లేకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండేది కాదన్నారు. అలాంటి జీవన్రెడ్డిపై చోటామోటా నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో హరిచరణ్రావు, గాజుల రాజేందర్, దేవేందర్నాయక్, సాగర్రావు, కల్లెపెల్లి దుర్గయ్య, నేహాల్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ముందుచూపులేని సర్కారు జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి ముందుచూపు లేదని, కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం బట్టపల్లిపోతారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మంగళవారం పరిశీలించారు. నెలరోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా.. ధాన్యం తూకం వేయడం లేదన్నారు. తేమశాతం పడిపోయి ధాన్యం బరువు తగ్గే అవకాశం ఉందని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. హమాలీల కొరత లేకుండా చూసుకుని కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యవసాయాధికారితో ఫోన్లో మాట్లాడారు. నాయకులు సత్యంరావు, రాంచందర్రెడ్డి, మధు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. రైతాంగం రోడ్డెక్కితేగాని ప్రభుత్వానికి సోయి లేదు ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికా లేదు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి -
దొంగల బస!
ధర్మపురిలో సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ నెల ఒకటిన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మి లాడ్జిలో బసచేసి, కరీంనగర్లో చోరీ అనంతరం 3వ తేదీన లాడ్జి ఖాళీచేశారు. అంతకన్నా ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ బసచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలాఉంటే దొంగలు వినియోగించిన నల్లరంగు పల్సర్ (220 సీసీ), హెల్మెట్ను ధర్మపురి గోదావరి తీరంలోని ఇటుకబట్టీల సమీపంలో మంగళవారం ఉదయం కనుగొన్నారు. టీఎస్ 08 ఎఫ్జీ 6876 నంబరు ప్లేటుతో ఉన్న ఈ బండిని దుండగులు చోరీ కోసం వినియోగించిందేనని ధ్రువీకరించారు. కానీ.. ఈ బైకుది ఫేక్ నంబరు ప్లేటుగా పోలీసులు తేల్చారు. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి చెందిన కారుదిగా గుర్తించారు. బండి చాసీస్ నంబరు ఆధారంగా ప్రయత్నించినా.. దాన్ని కూడా ముందే ధ్వంసం చేయడంతో బైకులను సెకండ్ హ్యాండ్లో కొన్నారా? లేక ఎత్తుకొచ్చారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రా లేదు. చోరీ కోసం వినియోగించిన మరో బైకు అపాచీ(తెలుపు) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దానికి పెట్టిన నంబరు ప్లేట్ కూడా ఫేక్గానే భావిస్తున్నారు. -
హనుమాన్ పెద్ద జయంతిని విజయవంతం చేద్దాం
మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బి. సత్య ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈనెల 10 నుంచి 12 వరకు కొండగట్టు శ్రీఆంజనేయస్వామి జయంతి ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం వివిధ శాఖల అధికారులు, పోలీసులతో సమీక్షించారు. భక్తులు పెద్ద ఎత్తు న తరలివచ్చే అవకాశం ఉందని, పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని సూచించారు. కోనేరు, ఆలయ పరి సరాల్లో పరిశుభ్రత, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, తాగునీటి వసతి కల్పించాలని పేర్కొన్నారు. మెట్లదా రిలో లైటింగ్, ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ సదుపాయం, ట్రాఫిక్ నియంత్రణకు ప్ర త్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం నిర్వహణకు అదనపు సిబ్బందిని కేటాయించాలన్నారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఎంపీడీఓ స్వాతి, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. ధాన్యాన్ని త్వరగా మిల్లులకు చేర్చాలిధాన్యం తూకం వేసి త్వరిగతిన మిల్లులకు తరలించా లని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేయాలని, రైతులు ఇబ్బంది రానీయొద్దని సూచించారు. -
ధాన్యం కొను‘గోల్’కు సర్వం సిద్ధం
బీజేపీ సంబరాలుజగిత్యాలటౌన్: సోమవారం వెలువడిన ఐదు రా ష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో బీజేపీ నాయకులు జగిత్యాల తహసీల్దార్ చౌరస్తాలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మోదీ సంక్షేమ పాలనకు స్వాగతం పలికిన బెంగాల్ ప్రజలు మమత పాలనకు చెరమగీతం పాడారని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మంత్రి లక్ష్మణ్కుమార్జగిత్యాలరూరల్: జిల్లాలో రబీ వరిధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో 439 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.60 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించనున్నారు. జిల్లావ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కావడంతో కొనుగోలు కేంద్రాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాత కొనుగోలు చేస్తారు. తూకం వేసేందుకు ప్రతి సెంటర్కు ఎలక్ట్రానిక్ కాంటా, తేమ శాతాన్ని పరిశీలించేందుకు మీటర్, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లను సిద్ధంగా ఉంచారు. తప్పతాళ్లు లేకుండా క్లీన్ చేసేలా ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేశారు. 76 మిల్లర్లకు ధాన్యం కేటాయింపు ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు 76 రైస్మిల్లులను కేటాయించారు. మిగతా కొన్నింటికి ధాన్యం సేకరణను దృష్టిలో ఉంచుకుని కేటాయింపు చేసే అవకాశాలున్నాయి. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయడంతోపాటు, మిల్లుల్లో కూడా వెంటనే ధాన్యాన్ని అన్లోడ్ చేసేలా మిల్లర్లకు హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తేమశాతం ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చేలా అవగాహన రైతులు పండించిన ధాన్యాన్ని పొలం నుంచి నేరుగా కొనుగోలు కేంద్రానికి కాకుండా ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. నేరుగా రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ధాన్యం ఆరబెట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయని రైతులకు తేమశాతం వచ్చిన ధాన్యాన్నే సెంటర్లోకి తీసుకురావాలని అవగాహన కల్పిస్తున్నారు. -
గంట ముందే స్పాట్కు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నగరంలోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎలాంటి బెరుకూ లేకుండా ఉదయాన్నే భారీ దోపిడీ చేసి, యథేచ్ఛగా పారిపోయిన వైనాన్ని సవాలుగా తీసుకున్నారు. దొంగల సంచారం, కదలికలు, వారి చిరునామా, నేరచరితపై కీలక సమాచారం సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను మహారాష్ట్ర, బిహార్కు పంపినట్లు సమాచారం. మరికొంతమంది పోలీసులు సీసీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. వారి ఫొటోల ఆధారంగా క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఏ) సాయంతో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు పుణే, మరొకరు నందూర్బర్ జిల్లాలతో పాటు బిహార్కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని ‘రివర్స్ మేనర్’(ఎలా వచ్చారు? అన్న విజువల్స్)లో విశ్లేషించినప్పుడు దొంగలంతా దోపిడీకి కేవలం గంట ముందే కరీంనగర్కు వచ్చినట్లు రికార్డు అయ్యింది. అంటే ముందు రోజు ఎక్కడా బస చేసిన దాఖలాలు లేవు. కొంతకాలంగా రెక్కీ నిర్వహించి, పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టే నింపాదిగా వచ్చారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర బ్యాగే పట్టిస్తోంది..? చోరీ సమయంలో నిందితుల్లో ఒకరి బ్యాగు కీలకంగా మారింది. ఆ బ్యాగుపై ‘ఐ లవ్ నందూర్బర్’ అని రాసి ఉంది. నందూర్బర్ ఉత్తర మహారాష్ట్రకు చెందిన జిల్లా. గుజరాత్ సరిహద్దులో ఉంటుంది. నిందితుల్లో మరొకరు పుణే జిల్లాలో నేరచరిత కలి గిన పఠాన్గా గుర్తించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు పారిపోవాలంటే పెద్దపల్లి, మంథని మీదుగా వెళ్లవచ్చు. కానీ.. ఆ మార్గంలో ట్రాఫిక్, చెక్పోస్టులు ఎక్కువ. అందుకనే చోరీ అనంతరం శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, రామడుగు, లక్ష్మీపూ ర్, రుద్రారం, గుండి, పెగడపల్లి, జగిత్యాల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీని పోలీసులు సంపాదించారు. ప్రధాన రహదారుల వెంట వెళ్తే సులువుగా పట్టుబడతామని, పోలీసుల కళ్లు గప్పేందుకు గ్రామీణ రహదారిని ఎంచుకున్నారు. వీరిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర, బిహార్కు బయల్దేరాయి. మరో నాలుగు బృందాలు (ఒక్కో బృందంలో నలుగురు చొప్పున సభ్యులు) కరీంనగర్ నుంచి జగిత్యాల మీదుగా మహారాష్ట్ర, బీహార్, ఇటువైపు హైదరాబాద్ వరకు వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని వడపోస్తున్నారు. నిందితులు వాడిన అపాచీ, పల్సర్ బైకు నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో గుర్తింపు కష్టంగామారింది. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లినట్టే వెళ్లి దారిమార్చి, వాహనాలనూ మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని విస్తృతంగా వాడుతున్నారు. నిందితుల ఫొటోల ఆధారంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ (నాట్గ్రిడ్) సాఫ్ట్వేర్ సాయంతో వారి నేరచరిత, ఎఫ్ఐఆర్, జైలు జీవితం, ఫోన్నంబర్లు తదితర వ్యక్తిగత వివరాలతో సహా కీలక అంశాలను ఇప్పటికే సేకరించారు. బందిపోట్లు, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల డేటాను నాట్గ్రిడ్లో పొందుపరుస్తారు. ఇది తిరిగి సీసీటీఎన్ఎస్తో అనుసంధానంగా ఉంటుంది. ఈ డేటాబేస్ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర జాతీయ దర్యాప్తు సంస్థలు వినియోగిస్తాయి. గతేడాది నుంచి ఈ డేటాబేస్ ఎస్పీ ర్యాంకు ఆఫీసర్లకు ఉగ్రవాద, ఇతర కీలక కేసుల్లో దర్యాప్తు కోసం యాక్సెస్ కల్పించారు. వచ్చిన వారు ఉగ్రవాదులు అయి ఉంటారన్న అంశాన్ని పోలీసులు కొట్టిపారేయకపోవడం గమనార్హం. నిందితులు వచ్చిన మార్గంలోని అన్ని సెల్టవర్ల పరిధిలో అనుమానిత సెల్ఫోన్ సంభాషణల కోసం డంప్ (సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ వివరాలు)ను సీడాట్ పద్ధతిలో జల్లెడ పడుతున్నారు. ఇందులోనూ కొన్ని అనుమానిత నంబర్లను పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ల సంచారం ఆధారంగానే పోలీసులు దొంగలను వెంటాడుతూ వెళ్లారని సమాచారం. చోరీ అనంతరం దొంగలు ఆ నంబర్లను మార్చడం గమనార్హం. -
పెద్ద చెరువులో హక్కులు కల్పించాలి
మెట్పల్లి డివిజన్ కోనరావుపేట కోండ్రిక్యాల పెద్ద చెరువులో చేపలు పట్టుకునే హక్కులు తమకే కల్పించాలని గ్రామానికి చెందిన గంగపుత్రులు కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహం బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తమ హక్కులు కాపాడాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. 44 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోనరావుపేట కోండ్రిక్యాల చెరువును వంద ఎకరాలుగా చూపిస్తూ స్థానికేతరులకు మత్స్య సొసైటీలో సభ్యత్వం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపండి బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామపంచాయితీ కార్యాలయంలో గత పాలకవర్గం, ప్రత్యేక అధికారి పాలనలో జరిగిన నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విచారణ జరపాలని డీపీవో, కలెక్టర్, రాష్టపంచాయతీరాజ్ కమిషనర్లను మేకల అక్షయ్కుమార్ కోరారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. విచారణ జరిపి అవినీతికి పాల్పడిన పాలకవర్గం, ప్రత్యేక అధికారులతో పాటు ఫిర్యాదులపై స్పందించని జిల్లా పంచాయితీ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ధాన్యం నిల్వకు గోదాంలు కేటాయించాలి
జగిత్యాల: జిల్లాలో రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు సిరిసిల్లలోని అపరల్ పార్క్లో ఉన్న గోదాంలు కేటాయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రిని సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరారు. జిల్లాలో గత ఖరీఫ్ సీజన్లో రైతుల వద్ద ప్రభుత్వం సేకరించిన ధాన్యం సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు రైస్మిల్లుల్లో నిలిచిపోయిందన్నారు. మళ్లీ సుమారు 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, గోదాంలు కేటాయించాలని కోరారు. -
మొబైల్ ఫోన్లతో కాలక్షేపం
జగిత్యాలటౌన్: క్షేత్రస్థాయిలో పరిష్కారం దొరకని సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి అధికారులకు ఆటవిడుపుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించాలని, సమయపాలన పాటించాలని కలెక్టర్ పలుమార్లు ఆదేశిస్తున్నా అధికారుల తీరు మారడం లేదు. సోమవారం నిర్వహించిన ప్రజవాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించే పనిలో నిమగ్నం కాగా, అధికారులు మాత్రం తమ మొబైల్ మునిగి తేలడం కనిపించింది. కొందరు రీల్స్ చూస్తుండగా, మరికొందరు ఫోన్లు మాట్లాడుతూ కనిపించారు. ఇంకొందరు ఫోన్లో చాటింగ్ చేస్తూ కనబడ్డారు. -
మహిళా సాధికారతకు కృషి
జగిత్యాలరూరల్: మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాష్ట్రంలో మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ వివిధ రంగాల్లో ప్రభుత్వం మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్ దావ తిరుపతి, ఉప సర్పంచ్ మహేశ్, నాయకులు లక్ష్మీదామోదర్రావు, రవీందర్రెడ్డి, గంగాధర్, ఎంపీడీవో విజయలక్ష్మీ, తహసీల్దార్ రాంమోహన్, ఎంపీవో వాసవి, ఏపీఎం రాజయ్య పాల్గొన్నారు. నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం చేయూత నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన దుబ్బాక పెద్ద నర్సయ్యకి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1.50 లక్షల ఎల్వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, గర్వందుల గంగన్న పాల్గొన్నారు. నష్టాల్లో ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నాం జగిత్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ సంస్థలైన మార్క్ఫెడ్, సివిల్ సప్లయిలు నష్ట్రాల్లో ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో సోమవారం నిర్వహించిన రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష కార్డులు అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, వ్యవసాయ కళాశాల డీన్ సుజాత, శాస్త్రవేత్తలు రవి, రాకేశ్, ఉద్యాన శాఖాధికారిణి స్వాతి, మార్కెట్ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్ నల్ల కవిత, ఉప సర్పంచ్ సత్తిరెడ్డి, ఏఈవో హరీశ్ పాల్గొన్నారు. -
కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించాలి
కొడిమ్యాల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించడం లేదంటూ రైతులు రోడ్డెక్కారు. కొడిమ్యాల మండలం పూడూరు చౌరస్తాలో సోమవారం జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. 43కిలోలు బదులు 40 కిలోలకే తూకం వేయాలని రోడ్డుపై వడ్లు పోసి నిరసన తెలి పారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఆందోళనతో ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మహిళా రైతులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో స్వల్ప తోపులాట జరిగింది. జీవన్రెడ్డి, రవిశంకర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రేవంత్రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలి అంటూ రైతులు నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చేంతవరకు ఆందోళన విరమించని పట్టుబట్టడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. రైతుల డి మాండ్ మేరకు 40 కిలోలకే తూకం వేసి, ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని రా తపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమి ంచారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు, మండల రైతులు పాల్గొన్నారు. -
45.7 డిగ్రీల ఉష్ణోగ్రత
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సోమవారం 45.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మల్లాపూర్ మండలం రాఘవపేటలో 45.7, ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 45.6, ఎండపల్లి మండలం గుల్లకోట, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్లో 45.5, ధర్మపురి మండలం నేరేళ్లలో 45.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాయికల్ మండలం అల్లీపూర్, బీర్పూర్ మండలం కొల్వాయిలో 44.9, ధర్మపురి మండలం జైనాలో 44.8, మెట్పల్లిలో 44.6, కోరుట్ల మండలం అయిలాపూర్లో 44.5, సారంగాపూర్లో 44.4, మల్లాపూర్లో 44.3, కొడిమ్యాల మండలం పూడూర్లో 44.2, గొల్లపల్లిలో 44.0 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. జయంతి ఉత్సవాలకు రండిమల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 10నుంచి 12వరకు నిర్వహించే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు రా వాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లకు ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వాన పత్రిక అందించారు. ఆలయ ఈవో అంజనారెడ్డి, ఉప ప్రధాన అర్చకులు చి రంజీవ స్వామి, వేద పండితులు పెద్దన్న శర్మ, సూపరిండెంట్ సునీల్కుమార్ పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరణజగిత్యాలక్రైం: జగిత్యాల డీఎస్పీగా నియమితులైన పురుషోత్తంరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ రఘుచందర్ నూతన డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి బాధ్యతలు అప్పగించారు. సహకార సంఘ చైర్మన్లకు నేటి నుంచి బాధ్యతలుజగిత్యాలరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల చైర్మన్ల పదవీ కాలం పూర్తి కావడంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం వారి పదవీ కాలాన్ని కొద్దిరోజులు పొడిగించింది. వెంటనే ప్రభుత్వం వారి పదవీకాలాన్ని రద్దు చేస్తూ ప్రత్యేకాధికారులను నియమించారు. దీంతో సహకార సంఘ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించే వరకు పాత సహకార సంఘాల పాలకవర్గ సభ్యులకే పదవీ బాధ్యతలు అప్పగి ంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంగళవారం జిల్లాలోని 52మంది సంఘాల చైర్మన్లు తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. క్షయతో అప్రమత్తంగా ఉండాలిజగిత్యాల: క్షయవ్యాధితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. సోమవారం గాయత్రి ఓల్డేజ్ హోంలో వృద్ధులకు పరీక్షలు నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు, రాత్రి చెమటలు పట్ట డం, బరువు తగ్గడం, చాతిలో పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆయన వెంట సూపర్వైజర్ శ్రీనివాస్, వికాస్ పాల్గొన్నారు. సజావుగా ధాన్యం కొనుగోళ్లుజగిత్యాల: వరిధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. వరిధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేవని జీవన్రెడ్డి ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశ్నించే గొంతుకగా చెప్పుకునే జీవన్రెడ్డి బీఆర్ఎస్ గొంతుగా మారిపోయాడని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు వ్యవసాయానికి రూ.2.68 కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ రెండేళ్లలో 1.52 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్కుమార్ నిత్యం కలెక్టర్తో సమీక్షలు నిర్వహిస్తూ ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం జరిగిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, ధా న్యం కొనుగోళ్లు త్వరితగతిన జరిగేలా చూస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, శంకర్ పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డు తరలించండి
మాది నూకపెల్లి డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ. కాలనీకి అతి సమీపంలోని మున్సిపల్ డంపింగ్యార్డు ఉంది. యార్డుకు తరలిస్తున్న టన్నుల కొద్దీ చెత్తతో దుర్వాసన వస్తోంది. వ్యర్థాలకు నిప్పు పెడుడతుండటంతో ఎగిసి పడుతున్న మంటల కారణంగా విషపూరితమైన పొగ, దుమ్ము, దూలితో రోగాల బారిన పడుతున్నాం. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. డంపింగ్ యార్డు తరలించాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేయడంతో డంపింగ్ యార్డుకు గోడ నిర్మించే పనులు మొదలు పెట్టారు. గోడపెట్టినా దుర్వాసన, పొగతో ఇబ్బందులు తప్పవు. కాలనీవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోడ నిర్మాణం కాకుండా డంపింగ్ యార్డును శాశ్వతంగా తొలగించి, దూర ప్రాంతానికి తరలించండి. -
శవం ఎదుటే ఆస్తి పంచాయితీ
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని వంజరివాడకు చెందిన రాములు, శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు సంతానం. అందరికీ పెళ్లి చేశారు. కుమారుడు రాజుకు భార్య మాధురి, కొడుకు ధీరజ్ ఉన్నారు. మూడేళ్ల క్రితం రాజు అనారోగ్యంతో మృతిచెందాడు. ఆ సమయంలో రాజు పేరిట ఉన్న కారు, బంగారం, ఇతరత్రా ఆభరణాలను శారదనే తీసుకుంది. మాధురిని పుట్టింటికి వెళ్లగొట్టింది. ఉన్న ఆస్తులు, డబ్బులను ఇద్దరు కూతుళ్లకు పంచి ఇచ్చింది. మాధురికి మాత్రం ఆస్తి ఇవ్వబోనంటూ మొండికేసింది. ఈ క్రమంలో మాధురి తన కుమారుడు ధీరజ్తో కలిసి కరీంనగర్లో సోదరుడి ఇంటి వద్ద ఉంటూ.. అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం వంజరివాడకు తెచ్చారు. అంత్యక్రియలు నిర్వహించాలని అత్త శారదను కోరినా ఒప్పుకోలేదు. అంతేకాక నయాపైసా ఇచ్చేది లేదంటూ భీష్మించుకుంది. ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా తమ తల్లిపేరిట ఉన్న ఆస్తి తమకే చెందుతుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మాధురి మృతదేహాన్ని ఆమె బంధువులు, కుటుంబసభ్యులు ఇంట్లోనే పూడ్చేస్తామంటూ గుంత తవ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శారద పేరిట ఉన్న ఆస్తులను ధీరజ్కు ఇస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు శాంతించారు. -
ధాన్యం తరలింపులో ఎఫ్సీఐ జాప్యం
● అందుకే రైతులకు కష్టాలు ● ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాలరూరల్: మిల్లుల్లోని ధాన్యాన్ని ఎఫ్సీఐ తరలించడంలో జాప్యంతోనే రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్ కుమార్ అన్నారు. రైస్మిల్లుల గోదాంల నుంచి ధాన్యం తరలించేలా కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, సర్పంచ్లు సతీష్ పాల్గొన్నారు. నిరుపేదల సొంతింటి కల సాకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేదల సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్, సారంగాపూర్ మండలం పెంబట్ల, గణేష్పల్లి, బీర్పూర్ మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరయ్యాయని, ఇప్పటివరకు 2400 ఇళ్లు వివిధ దశలో ఉన్నాయన్నారు. ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, కేడీసీసీబీ మాజీ మెంబర్ రాంచందర్రావు, ఎంపీడీవో సలీం, చిరంజీవి, భీమేష్, సర్పంచ్లు రాధ, శ్రీనివాస్, హరీశ్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. సారంగాపూర్ మండలకేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన మక్కలను కొనే దిక్కులేదన్నారు. రైతులంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. మక్కలు ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రభుత్వం 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామని నిబంధన పెట్టడమేంటని నిలదీశారు. సన్నాలకు రూ.500 బోనస్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎక్కడ కోరుకుంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొని మిల్లులకు తరలించామని పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు తేలు రాజు, సింగిల్ విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేశ్, నాయకులు బైరి మల్లేశ్ పాల్గొన్నారు. టీబీ రోగులకు మెరుగైన వైద్యం ● డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో శ్రీనివాస్ జగిత్యాలరూరల్: టీబీ రోగులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణ శివారులోని టీఆర్నగర్లో బస్తీ దావా ఖానాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలతోపాటు నెల నెలా మందులు కూడా అందిస్తోందన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసుల విస్తృత తనిఖీలుజగిత్యాలక్రైం: కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ షాపులో తుపాకులతో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడగా.. జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రహదారులపై పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి అణువణువునా తనిఖీలు చేపట్టారు. అనుమానిత వాహనాలను సీజ్ చేశారు. అనుమానితులను విచారణ చేపడుతున్నారు. నిందితుల చిత్రాలను పోలీసులు విడుదల చేయడంతో అనుమానితులు కన్పిస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు. -
ప్రశాంతంగా ‘నీట్’
కొడిమ్యాల: జేఎన్టీయూ (నాచుపల్లి)లో ఆదివారం ‘నీట్’ ప్రశాంతంగా ముగిసింది. కళాశాలలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక సెంటర్లో 240 మంది విద్యార్థులకు 234 మంది, మరో సెంటర్లో 196 మందికి 192 మంది హాజరయ్యారు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు లేకపోవడంతో పలువురు విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఒక విద్యార్థిని చెవికమ్మలు తీయమనడంతో తీసే క్రమంలో చెవికమ్మ ఎక్కడో పడిపోవడంతో అసహనం వ్యక్తం చేసింది. సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఐదు గంటలకుపరీక్ష రాసి బయటకు వచ్చే క్రమంలో రద్దీతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. కేంద్రాల తనిఖీ జగిత్యాలటౌన్: జగిత్యాల ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 360మంది విద్యార్థులకు 355మంది హాజరయ్యారు. జిల్లాలో మొత్తంగా 98.11శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్లు కో–ఆర్డినేటర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఎస్కేఎన్ఆర్ పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లత పరిశీలించారు. -
అంతా నిమిషాల్లోనే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్క్రైం: ఆదివారం ఉదయం.. నగరం ప్రశాంతంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే జ్యోతినగర్ – విద్యుత్ కార్యాలయం ప్రధాన రహదారి.. సెలవు రోజు కావడంతో సందడి తక్కువగా ఉంది. ఇదే దారిలో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్ను అప్పుడే తెరిచారు. సిబ్బంది లాకర్లలో ఉన్న బంగారాన్ని లెక్కచూసుకుంటూ తీసుకొచ్చి కౌంటర్లు, డిస్ప్లేలో పెడుతున్నారు. ఇంతలో పెళ్లి ఉంది.. బంగారం కావాలంటూ ఓ వ్యక్తి ఉదయం 11 గంటలకు షాపులోకి వచ్చాడు. బంగారం కొన్నట్లు నటించి, ఐదు నిమిషాల తువాత మిగితా నలుగురిని లోనికి రమ్మని సైగలు చేశాడు. 11.06 గంటలకు వారు షాపులోకి ప్రవేశించారు. తుపాకులతో బెదిరించి సిబ్బందిని తాళ్లతో బంధించారు. చేతికి అందిన బంగారాన్ని బ్యాగులో సర్దుకున్నారు. అడ్డువచ్చిన నలుగురిపై కాల్పులు జరిపా రు. సరిగ్గా 11.11 గంటలకు బైకులపై మల్కాపూర్, చింతకుంట మీదుగా సిరిసిల్ల వైపు పారిపోయారు. విషయం నిమిషాల్లో దావనంలలా వ్యాపించడంతో సీపీ గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్రెడ్డి, క్లూస్టీం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల వేలిముద్రలు సేకరించారు. ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్, మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, రూ.కోటిన్నర విలువైన కిలోకు పైగా బంగారం చోరీకి గురైందని సీపీ ఆలం ‘సాక్షి’కి తెలిపారు. దోపిడీ ఘటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధాన రహదారులు దిగ్బంధించి, తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని హై దరాబాద్ నుంచి వచ్చిన క్లూస్టీం సిబ్బంది రాత్రి పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు. బీదర్ లేదా మహారాష్ట్ర వైపు? జ్యోతినగర్లో ఉన్న జ్యువెల్లరీ దుకాణం అయితే చోరీకి అనువుగా ఉంటుందని పక్కాగా రెక్కీ చేశా రు. కస్టమర్లు, జనసంచారం తక్కువగా ఉంటుందని ఆదివారాన్ని ఎంచుకున్నారు. చోరీ అనంతరం పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల రూట్లోకి లేదా జగిత్యా ల రూట్లో పారిపోవచ్చని స్కెచ్ వేసుకున్నారని తెలుస్తోంది. ఇలాంటి దొంగతనాల్లో రైలుమార్గాలు దగ్గర ఉన్న ప్రాంతాలను ఎంచుకొని పారిపోతుంటారు. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లారని, ముందుగానే ప్లాన్ చేసి కామారెడ్డి మీదుగా హైదరాబాద్, బీదర్ లేదా మహారాష్ట వైపు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాస్కులు లేకుండానే దర్జాగా ఎక్కువశాతం దొంగతనాలకు పాల్పడేవారు తమను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్కులు, హెల్మెట్ ధరిస్తుంటారు. పీఏంజే ఘటనలో దొంగలు దర్జాగా, ఎలాంటి భయం లేకుండా చోరీకి పాల్పడడం చూస్తే ఈ ప్రాంతం వారు కాదని తెలుస్తోంది. వారు బైకులపై హెల్మెట్లు, ముఖానికి మాస్క్లేకుండా లేకుండా రావడం, పారిపోవడం చూస్తే ఉగ్రవాదులా..? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం 5 నిమిషాల్లో దోపిడీకి పాల్పడిన ముఠా దుకాణం సిబ్బందిని బెదిరించి వారి చేతులు వెనక్కి కట్టేసి, వాష్ రూంలో భయంతో దాక్కున్న మహిళను కూడా సినీఫక్కీలో బయటకు తీసుకొచ్చి బెదిరించారు. చోరీచేసి బయటకు వస్తున్న క్రమంలో గాలిలోకి కాల్పులు జరుపుతూ బైకుపై వెళ్లిపోయారు. నగలు ఎత్తుకెళ్తున్న ఓ బ్యాగు అక్కడే పడిపోగా.. దోపిడీ ముఠా సభ్యుడు కూడా కిందపడిపోయాడని, తర్వాత కొంతదూరం పరిగెత్తి బైక్ ఎక్కాడని అక్కడ ఉన్న పలువురు చర్చించుకున్నారు. దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే నిందితులు పాత నేరస్తులు లేదా ఉగ్రశిక్షణ పొంది ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మ్యాగ్జిన్.. బులెట్లు స్వాధీనం ఘటనా స్థలంలో ఓ షార్ట్ వెపన్ మ్యాగ్జిన్, మూడు కాలిన తూటాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక్కడ లభ్యమైన మ్యాగ్జిన్, బులెట్లపై ఉన్న క్లూస్ ఆధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారన్న వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీ అనంతరం దొంగలు వెళ్లిన దారితోపాటు వచ్చిన దారి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆదివారం జనసంచారం తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారంటే తప్పకుండా వారం రోజులకుపైగా రెక్కీ నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నారు. నాడు మొరాదాబాద్ దొంగలు 2022 సెప్టెంబరు 5న కరీంనగర్లోని సెవెన్హిల్స్ సమీపంలో సాయివాణి రెడీమిక్స్కు చెందిన రూ.15 లక్షలు చోరీ చేసిన ముఠా కూడా అపాచీ, పల్సర్ బైకులనే వాడింది. ఒకరు చింతకుంట మీదుగా సిరిసిల్ల వెళ్లగా.. మరొకరు తిమ్మాపూర్ మీదుగా పారిపోయి చివరికి సిద్దిపేట వద్ద కలుసుకున్నారు. తరువాత నాంపల్లిలో రైలెక్కి ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ వెళ్లారు. నిందితులు ధరంపాల్, మనీశ్, పింటూ, ఏక్తా అని గుర్తించి పోలీసులు రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నాడు ఆ దొంగల ను టాస్క్ఫోర్స్ సీఐగా ఉన్న సృజన్రెడ్డి అరెస్టు చేసి పట్టుకురావడం గమనార్హం. మొత్తంగా కొ న్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరం ఆదివారం ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పలువురి పరామర్శ ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. గాయపడిన జువెల్లరీస్ సిబ్బంది ముస్తాక్, మధుకర్, రాజేశ్, కమలాసన్ను ఆస్పత్రిలో పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. జువెల్లరీ షాపు ఘటనను గంగుల, పాడి రాజకీయం చేయడం తగదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రరెడ్డి సూచించారు. రెక్కీ చేశాకే పీఎంజే జ్యువెల్స్లో చోరీ ఐదు నిమిషాల్లో ముగించి.. రెండు బైకులపై పరారీ నిందితులు మహారాష్ట్రకు చెందిన ముఠా సభ్యులు? 2022లో మొరాదాబాద్ దొంగల తరహాలోనే దోపిడీ దుండగులు వచ్చిన దారి వెంట సీసీ ఫుటేజీల పరిశీలన -
పాఠశాల ఆస్తులు పైలమేనా..!?
జగిత్యాల: పరీక్షలు అయిపోగానే పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటిస్తుంది. ఇది పిల్లలకు ఆనందంగా ఉన్నా.. ఉపాధ్యాయులకు మాత్రం పెద్ద తలనొప్పి వ్యవహారమే. ఏటా నెలపాటు వేసవి సెలవులు రావడంతో బడులన్నీ మూతపడతాయి. గ్రామాల్లో ఉండే కొందరు ఆకతాయిలు పాఠశాలలను టార్గెట్ చేస్తూ.. అందులో ఆటలాడటమే కాకుండా కొందరు మద్యం తాగుతూ.. సీసాలు పగులగొడుతూ.. ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తుంటారు. బడిలో ఉన్న వస్తువులనూ చోరీ చేస్తుంటారు. ప్రస్తుతం ప్రతి బడిలో కంప్యూటర్లు ఉన్నాయి. విలువైన వస్తువులూ తెచ్చిపెట్టారు. వీటిని ఎత్తుకెళ్లినా, ధ్వంసం చేసినా ఇబ్బందే. బడి ప్రారంభంకాగానే వచ్చే ఉపాధ్యాయులకు ఇది ఏటా తలనొప్పిగా మారుతోంది. గతంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల ఆస్తులు అనేకం ధ్వంసం కావడంతోపాటు, పరిసరాలను అస్తవ్యస్తం చేసేవారు కొందరు ఆకతాయిలు. గుర్తుతెలియని వ్యక్తులు కిటికిలు, తాళాలు, తలుపులు ధ్వంసం చేసేవారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పాఠశాలల ఆస్తుల రక్షణకు కొన్ని మార్గదర్శకాలను విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ జారీ చేశారు. ఈసారి బడుల ఆస్తులకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు 22 ఉన్నాయి. ఇందులో అనేక విలువైన వస్తువులున్నాయి. గతంలోనే సీసీ కెమెరాలు అమర్చినప్పటికీ ప్రత్యేకమైన భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. సీసీకెమెరాలు, ప్రధానోపాధ్యాయుడితోపాటు, పీడీ, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు నిరంతరం నిఘా ఉంచాలని, పాఠశాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిపైనే పెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆకతాయిలకు చెక్ పెట్టేదెలా..? ప్రభుత్వ పాఠశాలలు 33కేజీబీవీలు 16ప్రాథమిక పాఠశాలలు 705మోడల్స్కూల్స్ 13భద్రత ఇలా.. చర్యలు తీసుకుంటున్నాం జూన్ వరకు బడులకు సెలవులు ఆస్తులు ధ్వంసం చేస్తున్న ఆకతాయిలు రక్షణకు ప్రభుత్వం మార్గదర్శకాలు బడుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యాశాఖ నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యా యి. నిత్యం పాఠశాలలను విజిట్ చేయడంతో పాటు, పోషకులు, విద్యార్థుల సహకారం తీసుకుంటాం. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. రాము, డీఈవో -
నేటి నుంచి రైతు వారం
కరీంనగర్ అర్బన్/జగిత్యాలఅగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారం నిర్వహిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల కార్యాచరణను రూపొందించగా సోమవారం నుంచి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం సాగు రంగానికి చేసిన సేవలు, విప్లవాత్మక మార్పులు, పంట రుణాలు, గతంలో చేసిన రుణమాఫీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను రైతులకు క్షేత్రస్థాయిలో వివరిస్తారు. అందులో భాగంగా ఈ నెల 4నుంచి 9 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతు వారం నిర్వహించనున్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ విభాగాలైన పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ, ఆత్మ, వ్యవసాయ మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ అధికారులు అన్నదాతకు అవగాహన కల్పించనున్నారు. కాగా, రైతు వేదికలే వేదికగా ప్రతి రోజూ కార్యక్రమాలను నిర్వహిస్తామని అధికారులు వివరించారు. కార్యక్రమాలు ఇలా.. ● 4వ తేదీన: సాగు భూమి ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, వినియోగదారులు కోరుకునే సన్నరకాల సాగు వంటి వివరాలను వివరించనున్నారు. ● 5న: ఉద్యాన పంటల ద్వారా వచ్చే ఆదాయం, ఆయా పంటల అభివృద్ధి, ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు. ● 6న పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలతో పాటు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులకు అందించే సేవలు, మార్కెటింగ్ అవకాశాలు. ● 7న: వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుమ్, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్. ● 8న: వ్యవసాయంలో కీలకమైన పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశువుల సంరక్షణ వంటి వివరాలు. ● 9న: చెరువుల్లో కంప చెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత. వివిధ కార్యక్రమాల రూపకల్పన రైతు వేదికల్లో నిర్వహణ భూసార పరీక్ష ఫలితాల వెల్లడి -
అమ్మానాన్న లేని అభాగ్యులు
● ఏ ‘ఆధార’మూ లేని చిన్నారులు ● చేరదీసిన అమ్మమ్మ, నాన్నమ్మ ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు వీర్నపల్లి(సిరిసిల్ల): ఆ బాలుడు పుట్టు మూగ. కన్నవారి ప్రేమకు నోచుకోలేదు. ఏ ఆధారమూ లేదు. కనీసం ఆధార్ కార్డు కూడా లేని అభాగ్యుడు. వీర్నపల్లి మండలం బంజేరు గ్రామపంచాయతీ పరిధి బీరప్పతండాకు చెందిన బట్టు శంకు పుట్టుకతోనే మూగ. అతడు పుట్టిన ఏడాదికే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. అప్పటి నుంచి తన అమ్మమ్మ బట్టు నానుకు వద్దే పెరుగుతున్నాడు. కనీసం ఆధార్ కార్డు కూడా లేక దివ్యాంగుల పింఛన్, చదువు, ఇతర పథకాలకు దూరమయ్యాడు. మనవడే ప్రాణం భర్త మరణించిన తర్వాత నానుకు అండగా నిలిచేవారు కరువయ్యారు. వృద్ధాప్య పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. కనీసం ఉండడానికి ఇల్లు లేక, చిన్న పూరిగుడిసెలో కాలం వెళ్లదీస్తోంది. మనవడు శంకును సాకడం ఆమెకు భారంగా మారింది. వయసు మళ్లినా కూలీ పనులకు వెళ్తే వచ్చే ఆదాయంతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు ఏదోలా రెక్కలు ముక్కలు చేసుకుంటానని, తర్వాత తన మనవడిని ఎవరు చూసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం స్పందించి బాలుడికి ఆధార్ ఇప్పించి, పింఛన్ సౌకర్యం కల్పించాలని తండావాసులు కోరుతున్నారు. మరో బాలుడిది అదే వ్యథ బీరప్పతండాకే చెందిన మరో బాలుడు బట్టు శివ పరిస్థితి కూడా ఇంతే. అతడి తల్లిదండ్రులు ఎటు వెళ్లారో తెలియదు. నాన్నమ్మ బట్టు సక్కుబాయి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. తల్లిదండ్రుల మమకారానికి దూరమై, తోటి పిల్లలను చూస్తూ ఈ చిన్నారులు పడుతున్న వేదన వర్ణనాతీతం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సదరు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. బీరప్ప తండాలో బట్టు నాను, ఆమె మనవడు శంకు పడుతున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. తక్షణమే ఆ బాలుడికి ఆధార్ నమోదు చేయించి, బట్టు నానుకు పింఛన్ వచ్చేలా కృషి చేస్తాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా చూస్తాం. – బట్టు కృష్ణ, సర్పంచ్, బంజేరు -
వలస బతుకులు.. ప్రసవ బాధలు
● ఈనెల 2న బిహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన సీతాదేవి (25) తన భర్తతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా గూడూర్ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి దర్భాంగా వెళ్లే భాగ్మతి రైలు ఎక్కారు. టికెట్ లేకుండానే ఎస్–6 బోగీలో కూర్చున్నారు. శనివారం వేకువజామున వరంగల్ రైల్వేస్టేషన్ దాటాక సీతాదేవికి పురిటి నొప్పులు వచ్చి కూర్చున్న చోటనే సుఖప్రసవమై ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రామగుండం: బతుకుదెరువు కోసం బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి నిరక్షరాస్యులైన దంపతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పనులు చేసుకునేందుకు వలస వెళ్తుంటారు. ఇటీవల రైలు ప్రయాణాల్లో గర్భిణులు ప్రసవించడంపై సంబంధిత అధికారుల్లో ఆందోళన నెలకొంది. పలువురు అనారోగ్యంతో సొంతూరు వెళ్లే క్రమంలోనే రైళ్లలో మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. కాగా, వీరందరూ నిరక్షరాస్యులు కావడం గమనార్హం. మూసివేసి ఉన్న ఎమర్జెన్సీ హెల్త్ రూమ్ సూదూర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే కనీసం రైల్వే ప్లాట్ఫాంపై ప్రాథమిక వైద్య సేవలు అందించని దుస్థితిలో రామగుండం రైల్వేశాఖ ఉంది. ప్రాథమిక చికిత్స కోసం అత్యవసర గదిని ఏర్పాటు చేసి బోర్డు తగిలించినా తెరుచుకున్న పాపానా పోలేదు. అమృత్ భారత్ పథకంలో కోట్లాది నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నా.. ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించలేని దుస్థితిలో రైల్వేస్టేషన్ ఉంది. అవగాహన లేమితో నిండు గర్భిణుల రైలు ప్రయాణం రామగుండం రైల్వేస్టేషన్లో రెండు ఘటనలు స్టేషన్లో అత్యవసర వైద్యసేవలు కరువునెలలు నిండిన గర్భిణులు, అస్వస్థతతో ఉన్న వ్యక్తులు రైళ్లలో ప్రయాణం చేయడం సరికాదు. అత్యవసరంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పెద్ద సిటీలలో వైద్య సేవలకు అనుకూలత ఉంటుంది. అటవీ ప్రాంతం సమీపంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే రైలు ప్రయాణాలు చేయాలి. – తిరుపతి, ఇన్చార్జి రైల్వే పోలీస్, రామగుండం -
జగిత్యాల
45.0/25.0సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 202 7గరిష్టం/కనిష్టంగోదావరిలో భక్తుల రద్దీధర్మపురి: గోదావరిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్నానాలు ఆచరించారు. ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ వేడిమి అధికమవుతుంది. ఉక్కపోత పెరుగుతుంది. -
ప్రభుత్వంలో చలనమే లేదు..
జగిత్యాలటౌన్: ఉద్యోగులు, నిరుద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై బీజేపీ అసెంబ్లీ లోపల, వెలుపల ఎంత నిలదీసినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మోదీ సభ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కేంద్రం జిల్లాకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తే స్థలం కేటాయించలేని దుస్థితిలో ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన రేవంత్రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని, కేసీఆర్ను చర్లపెల్లి జైలులో పెడతానని ఇప్పుడు ఫాంహౌజే కేసీఆర్కు జైలులాంటిదనడం వారిద్దరి బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్పై విశ్వాసం కోల్పోయిన రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, తెలంగాణకు దిశానిర్దేశం చేసేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారని తెలిపారు. ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో నిర్వహించే సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నాయకులు సురేందర్రెడ్డి, అనూప్రావు, పూదరి అరుణ, వడ్డెపల్లి శ్రీనివాస్, నలువాల తిరుపతి, సుంకెట దశరథరెడ్డి, భూమి రమణ, జుంబర్తి దివాకర్ ఉన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి -
కనికరించని మానవత్వం
● అనారోగ్యంతో యువకుడి మృతి ● తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు శంకరపట్నం: మండలంలోని కేశవపట్నంలో ఆదివారం రాత్రి అనారోగ్యంతో యాకుబ్(35) మరణించగా, కుటుంబసభ్యులు తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కేశవపట్నం గ్రామానికి చెందిన వీరయ్య, రుక్కమ్మకు కొడుకు యాకుబ్, కూతురు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయ్యాయి, యాకుబ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, వీరయ్య, రుక్కమ్మలు రోడ్డు పక్కన టేలాలో చెప్పులు విక్రయించగా, ప్రస్తుతం వ్యాపారం లేక పోవడంతో కేశవపట్నం మేన్ రోడ్డుపై తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటున్నారు. యాకుబ్ రోడ్డుపక్కన గదిలో ఉండగా ఆదివారం రాత్రి చనిపోయాడు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తోపుడు బండిపై యాకుబ్ శవాన్ని తల్లిదండ్రులతో పాటు సోదరి, బావ తీసుకెళ్లారు. సాహిత్యంతో పౌర సమాజం జాగృతంకరీంనగర్కల్చరల్: పండితుల పామరుల హృదయాలను కదిలించగలిగే సాహిత్యంతో పౌర సమాజం జాగృతం అవుతుందని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. ఆదివారం ఫిలింభవన్లో తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం, శాతవాహన లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన ఆదివారం శ్రీకవన గోదారిశ్రీ కవితా సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. తరుగుతున్న మానవీయ విలువలను తన కవిత్వంతో తట్టి లేపడానికి బుర్ర మధుసూదన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమన్నారు. సభాధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి కవి, రచయిత, కాలమిస్టు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, సమాజ సేవకులుగా పలు రంగాల్లో తమదైన విలక్షణ ప్రతిభను చాటుకుంటూ దూసుకుపోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో కవులు అన్నాడి గజేందర్రెడ్డి, డాక్టర్ మచ్చ హరిదాసు, కొత్త అనిల్ కుమార్, బొమ్మకంటి కిషన్, అనిత పాల్గొన్నారు. -
ఎందుకో ఇంత వివక్ష..?
కోరుట్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని ఎమ్మెల్యే ఫొటో, జగిత్యాలలో ఎమ్మెల్యే ఫొటోతో ఉన్న ఫ్లెక్సీజగిత్యాల: జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి పట్టణాల్లో ప్రజాపాలన–పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం నిర్వహించారు. జగిత్యాల, ధర్మపురిలో జరిగిన సమావేశాల్లో అధికార యంత్రాంగం స్థానిక మంత్రి, ఎమ్మెల్యేల ఫొటోలను ఫ్లెక్సీల్లో వాడుకున్నారు. కోరుట్లలో మాత్రం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫొటో మాత్రం పెట్టలేదు. జిల్లా అధికారులు అందరికీ ఒకే ప్రోటోకాల్ అనుసరించకుండా ఇలా వివక్ష చూపడంపై కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కల్లు దుకాణాల్లో నియంత్రణ కరువు
జగిత్యాలక్రైం: కల్లు షాపులపై అధికారుల నియంత్రణ కరువైంది. కొద్దిపాటి కల్లులోనే రసాయనాలు కలిపి భారీగా తయారుచేస్తూ సీసాల్లో నింపి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. చిన్నారులకు మద్యం విక్రయించవద్దని ఉన్నా అవేమీ పట్టించుకోకుండా కల్లు షాపుల్లో ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వారు విక్రయించే కల్లుతో ఎంతోమంది చిన్నారులు, పెద్దలు అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్రోడ్లో తండ్రితో కలిసి ఓ నాలుగేళ్ల బాలుడు వచ్చినా నిర్వాహకులు అడ్డుచెప్పలేదు. పైగా అతడికి తండ్రే కల్లు తాగిపించడం గమనార్హం. దీంతో బాలుడే అక్కడే నిద్రమత్తులోకి జారుకున్నాడు. బాలుడు కల్లు తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తండ్రితో కలిసి చిన్నారి కల్లు సేవిస్తున్నా అక్కడి షాపు యజమానులు చూసీచూడనట్లు వ్యవహరించారు. ఇటీవల కల్లు దుకాణాలపై ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణ కూడా కరువవడంతో ప్రజలకు అనారోగ్యం కలిగించే రసాయనాలు కలిపి కల్లు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని షాపుల్లో మత్తు పెంచేందుకు గుల్ఫారామ్ వంటి పదార్థాలు కలుతున్నా వాటిని పరిశీలించే వారే కరువయ్యారన్న ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. తండ్రితో కలిసి కల్లు తాగిన బాలుడు కల్లు నిర్వాహకుల ఇష్టారాజ్యం -
సమ్మర్ క్యాంపుపై సందిగ్ధం
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో యేటా నిర్వహించే వేసవి క్రీడా శిబిరాలపై ఈసారి సందిగ్ధం నెలకొంది. ఏడేళ్లుగా (కరోనా వైరస్, ఎన్నికల కోడ్ మినహా) నిరంతరంగా కొనసాగుతున్న శిబిరాలు ఈసారి ఉంటాయా? లేదా? అన్న సందేహం కోచ్లు, తల్లిదండ్రులు, చిన్నారులను కలవరపెడుతోంది. 2017 నుంచి వేసవి శిబిరాలను ప్రారంభించిన నగరపాలక సంస్థ 2020, 2021లో కరోనా వైరస్ కారణంగా, 2024లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్వహించలేదు. ఈసారి ఎలాంటి అడ్డంకి లేకున్నా శిబిరాల నిర్వహణపై నగరపాలక సంస్థ మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. శిబిరాలపై ఎలాంటి ప్రకటన లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. భారం అనుకుంటున్నారా? నగరంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు సరైన వేదిక కల్పించాల్సిన బాధ్యత బల్దియాపై ఉందని నగర ప్రజలు గుర్తుచేస్తున్నారు. చిన్నారులకు ఇచ్చే పాలు, గుడ్లు, అరటి పండ్లు, కోచ్లకు ఇచ్చే గౌరవ వేతనాల భారం తప్పించుకోవడానికే శిబిరాలను పక్కన పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రీడలపై ఆసక్తి పెంచే ఈ శిబిరాలు నిలిచిపోతే, యువతలో నైపుణ్యాల అభివృద్ధి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి శిబిరాల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా, వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని కోరుతున్నారు. శిబిరం నిర్వహణపై బల్దియా మౌనం ఉచిత శిక్షణ శిబిరాల సంప్రదాయానికి బ్రేక్? నిరాశలో చిన్నారులు, తల్లిదండ్రులు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహణ ఇలా ఏడాది క్రీడలు కోచ్లు చిన్నారులు గౌరవవేతనం 2017 17 28 1,500 రూ.5,000 2018 20 40 2,500 రూ.5,000 2019 22 45 2,600 రూ.5,000 2022 27 72 3,200 రూ.5,000 2023 28 70 3,000 రూ.8,000 2025 17 35 1,700 ఇవ్వలేదు -
వదలరు.. కదలరు..
జగిత్యాల: ఆ పది మంది ఎస్సైలు జిల్లాను వదలరు.. వారంతా ఒకే బ్యాచ్ వాళ్లు.. పదేళ్ల క్రితం జిల్లాలో పోస్టింగ్ పొంది.. అప్పటి నుంచి ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించుకుని తిష్ట వేశారు. నేతల ప్రాపకం ఉత్తర, దక్షిణ జిమ్మిక్కులతో సదరు ఎస్సైలు జిల్లాను వదలడం లేదన్న వాదనలు ఉన్నాయి. శ్రీవదల బొమ్మాళీ.. వదలశ్రీ అన్న రీతిలో ఆ బ్యాచ్ ఎస్సైలు ఖో ఖో అడినట్లు వాళ్లల్లో వాళ్లే ఒకరి నుంచి ఒకరికి ఖో ఇచ్చుకుని పోస్టింగ్లకు మారిపోవడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం ఒకే బ్యాచ్కు చెందిన పది మంది ఎస్సైలు జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వదలరు.. కదలరు జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పోలీస్ సర్కిళ్లు ఉన్నాయి. వాటి పరిధిలో 22 మంది ఎస్సైలు ఉన్నారు. వీరు కాక.. స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్, సీసీఎస్ వారిని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 30 మంది వరకు ఎస్సైలు ఉన్నారు. వీరిలో కనీసం పదిమంది ఒకే బ్యాచ్కు చెందిన వారు ఉండడం గమనార్హం. సదరు బ్యాచ్ ఎస్సైలు లూప్లైన్లలో పనిచేయడానికి అసలే ఇష్టపడరు. పదేళ్లుగా జగిత్యాల, మల్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి వంటి కీలక ప్రాంతాల్లో ఉంటున్నారు. రెండవ శ్రేణి పోస్టింగ్లుగా చెప్పుకునే రాయికల్, కథలాపూర్, మేడిపల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, జగిత్యాల రూరల్ వంటి పోలీస్స్టేషన్లలోనూ ఒకరి తరువాత ఒకరు వారే ఎక్కువ కాలం పనిచేశారు. ఇతర బ్యాచ్లకు చెందిన ఎస్సైలు ఎవరైనా జిల్లాకు వస్తే వారిని కుదురుకోకుండా చేయడంలోనూ వీరిది అందెవేసిన చేయిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రచారం ఉంది. ఈ అంశం ఇటీవల కాలంలో జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయంగా మారింది. ఉత్తర, దక్షిణల్లో దిట్టలు అధికార పార్టీ నేతల ప్రాపకం పొందడంలో సదరు బ్యాచ్ ఎస్సైలకు వెన్నతో విద్యగా చెప్పుకుంటారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల అధికార పార్టీ కీలక నేతలను ఆకట్టుకుని వారి ఉత్తరాలతో పోలీసు ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకుంటున్నారు. జిల్లాలో ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న కీలక ఠాణాల్లో పోస్టింగ్ల కోసం కొంతమంది ఆ బ్యాచ్ ఎస్సైలు అవసరమైతే శ్రీదక్షిణశ్రీ మంత్రం వేసి మరీ దస్తీలు వేసుకుంటున్న వైనం విస్మయం కలిగిస్తోంది. ఇంతలా జిల్లాను వదలకుండా కొంతమంది ఎస్సైలు ఏకధాటిగా ఇక్కడే పనిచేస్తున్న వైనం ఇటీవల కాలంలో ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాసర జోన్ వ్యాప్తంగా అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఎస్సైలు బదిలీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్న జిల్లాను సదరు బ్యాచ్ ఎస్సైలు వదలడం లేదు. దీని వెనక ఆంతర్యం ఏమిటన్న అంశం ఉన్నతాధికారులకు అంతు చిక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పదేళ్లుగా ఇక్కడే ఓ పోలీస్ బ్యాచ్ జిల్లాలో పది మంది తిష్ట ఉత్తర, దక్షిణ జిమ్మిక్కులు -
పోటెత్తిన భక్తులు
వేములవాడ: మండుతున్న ఎండలను లెక్క చేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో వేములవాడకు చేరుకుని తమ ఇలవేల్పు రాజన్న, భీమన్నలకు మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీని గమనించిన ఆలయ అధికారులు భక్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తాగునీటి క్యాన్లను అందుబాటులో ఉంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులచే నీటి సరఫరా చేయించారు. భీమన్న సేవలో సుడా చైర్మన్ వేములవాడ భీమన్నను శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి మండపంలో శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, ఆశీర్వచనాలు అందించారు. -
సబ్స్టేషన్ ఆవరణలో మంటలు
కొత్తపల్లి(కరీంనగర్): 220 కె.వీ. దుర్శేడ్ విద్యుత్సబ్స్టేషన్ ఆవరణలోని పోల్ సెంటర్లో ఆదివారం రా త్రి మంటలు చెలరేగాయి. గాలి దుమారం రావడంతో అల్గునూర్, హుజూరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే 32 కె.వీ. లైన్లు ఒకదానికొకటి రాపిడి జరిగి అగ్ని రవ్వలు కిండపడ్డాయి. అక్కడున్న చెత్త, గడ్డి అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై దుర్శేడ్ సబ్స్టేషన్ను ఆఫ్ చేసి ఫైరింజన్కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. దీంతో విద్యుత్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విద్యుత్ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని ట్రాన్స్కో డీఈ భూమయ్య వెల్లడించారు. తాళం వేసిన ఇంట్లో చోరీజగిత్యాల క్రైం: జగిత్యాలలోని వాణీనగర్కు చెందిన విద్యుత్ శాఖ లైన్మన్ రమేశ్ ఇంట్లో గుర్తుతెలియని దొంగలు పడి రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. రమేశ్ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లాడు. ఆదివారం తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. బీరువాలో డబ్బులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
జగిత్యాల: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడుతున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజ య్కుమార్ అన్నారు. 99రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, యువతకు క్రీడలు, విద్యుత్, పిల్లల భద్రతలో ముందుకెళ్తున్నామని పేర్కొన్నా రు. వైకుంఠదామాలు, పల్లెప్రకృతి, పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుగా ఇచ్చి ప్రజలు సహకరించాలన్నారు. నియోజకవర్గంలో 78 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతోందని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణా ల్లో అభివృద్ధి పనులను పూర్తిచేయాలన్నారు. సేవల్లో పారదర్శకత, నాణ్యత ఉండేలా చూడాలన్నా రు. ఎస్సీ అభివృద్ధి అధికారి రాజ్కుమార్, ము న్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో ని రోటరీ పార్క్ పక్కన రూ.48 లక్షలతో బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అమృత్ స్కీంలో నిధులున్నాయని, అధికారులు పనులను వేగవంతం చేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, నిమ్మల నాగరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, గట్టు సతీశ్, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉద్యోగం నుంచి బాలల పరిరక్షణ అధికారి తొలగింపు
● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ జగిత్యాల: జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం.హరీశ్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హరీశ్పై మహిళాఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు, విధుల్లో ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలపై సదరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల పనిప్రదేశాల్లో వేధింపుల చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసి పద్ధతి మార్చుకోవాలని ఉన్నతాధికారులు మందలించారు. అయినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఉద్యోగులు మరోసారి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని ఉన్నతాధికారులు తేల్చి నివేదిక అందించారు. పరిశీలించిన కలెక్టర్ డీసీపీవో హరీశ్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్లుజగిత్యాల/మెట్పల్లి: జగిత్యాల మున్సిపల్ కమిషనర్గా సత్యప్రణవ్, మెట్పల్లి కమిషనర్గా శ్రీనివాస్గౌడ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాలలో పనిచేసిన స్పందన బదిలీపై వెళ్లిపోవడంతో గ్రూప్–1 అధికారి సత్యప్రణవ్ కమిషనర్గా నియమితులయ్యారు. అలాగే డీఆర్డీఏ జిల్లా సూపరింటెండెంట్ శ్రీనివాస్గౌడ్ను డిప్యూటేషన్పై మెట్పల్లి కమిషనర్గా నియమించారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను పలు విభాగాల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులకు ఇబ్బందులుజగిత్యాల: గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులకు ఇబ్బందులు అని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం మాట్లాడారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.993కు పెంచడంతో పేదలపై భారం పడుతుందన్నారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం కమర్శియల్ గ్యాస్ ఆరుసార్లు పెంచడం ద్వారా చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీస్టాల్స్ మూతపడి కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయన్నారు. కార్మికుల దినోత్సవం రోజున సిలిండర్ ధరలు పెంచి మోదీ సామాన్యుల నడ్డీ విరిచారన్నారు. ఇప్పటికై నా ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బాధ్యతలు స్వీకరిస్తున్న కమిషనర్ సత్యప్రణవ్ బాధ్యతలు చేపడుతున్న శ్రీనివాస్గౌడ్ -
హనుమాన్ పెద్ద జయంతికి రండి
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి పెద్ద జయంతి ఉత్సవాలకు రావాలని దేవా దా య శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అధి కారులు ఆహ్వానపత్రిక అందించారు. ఈనెల 10 నుంచి 12 వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, సునీల్, స్థానాచార్యులు కపీందర్, తేజశర్మ తదితరులు పాల్గొన్నారు. 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో శనివారం 44.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ధర్మపురి మండలం బుద్దేశ్పల్లి, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 44.9, ధర్మపురి మండలం నేరెళ్లలో 44.7, కొడిమ్యాల మండలం పూడూరులో 44.6, రాయికల్ మండలం అల్లీపూర్, ఎండపల్లి మండలం గుల్లకోటలో 44.3, కోరుట్ల మండలం అయిలాపూర్లో 44.2, ఇబ్రహీంపట్నం మండలం గోదూరులో 44డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ‘రైతువారం’ కార్యక్రమాలు ఇలా..జగిత్యాలఅగ్రికల్చర్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతువారం నిర్వహిస్తున్నట్లు డీఏవో భాస్కర్ తెలిపారు. ఈనెల 4 అన్ని రైతువేదికల్లో నేల ఆరోగ్య పరిరక్షణ, ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, 5న ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పాం సాగు విస్తరణ, ప్రత్యామ్నాయ పంటలు, 6న పంట రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్పీవోల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, మార్కెటింగ్ అవకాశాలు, 7న వ్యవసాయ యంత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, వ్యవసాయ యాంత్రీకరణ, 8న పాడి పరిశ్రమ, పశు అభివృద్ధి, పశుసంరక్షణ, చేపల అధిక ఉత్పత్తికి చర్యలు, 9న సన్నరకాల సాగుపై అవగాహన సదస్సులు ఉంటాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు. పంట మార్పిడితో తెగుళ్లకు చెక్జగిత్యాలఅగ్రికల్చర్: పంట మార్పిడితో తెగుళ్లు, పురుగులకు చెక్ పెట్టవచ్చని పొలాస శాస్త్రవేత్త బి.శ్రీనివాస్ అన్నారు. రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శనివారం జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో సమావేశం నిర్వహించారు. ఏ పంటకై నా నీటిని ఎక్కువగా ఉపయోగించరాదని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వస్తుందని తెలిపారు. తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని కోరారు. సర్పంచ్ గంగోత్రి, ఏఈవో రవళి, సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు. నేడు ‘నీట్’..జగిత్యాల: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్– 2026 ఆదివారం జరగనుంది. జగిత్యాలలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, నాచుపల్లి జేఎన్టీయూలో రెండు కేంద్రాలు గుర్తించారు. మొత్తం 796 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుంది. పరీక్ష కేంద్రానికి 1.30 గంటల వరకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. హాల్టికెట్, ఆధార్కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, వాటర్బాటిల్కు అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అనమతించరు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా సిటి కో–ఆర్డినేటర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. డివిజన్ స్థాయిలో ప్రజావాణిజగిత్యాల: జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో ఆర్డీవో ఆధ్వర్యంలో డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ లత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 4 నుంచే ప్రారంభమవుతుందని, డివిజన్లకు సంబంధించి ఆర్డీవో నోడల్ అధికారిగా నియమించాని పేర్కొన్నారు. డివిజన్స్థాయి అధికారులు హాజరై వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జిల్లా స్థాయిలో యథాతథంగా జరుగుతుందని పేర్కొన్నారు. -
తూకం సరే.. తరలింపు ఎప్పుడో?
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట, చింతకుంట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. ధాన్యం తేమశాతం పరీక్షించిన నిర్వాహకులు తూకం వేశారు. తూకం వేసిన బస్తాలను వాహనాల్లో రైస్మిల్లులకు తరలిస్తామంటే రైస్మిల్ యజమానులు వద్దని చెప్పినట్లు రైతుల ద్వారా తెలిసింది. దీంతో తూకం వేసిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయాయి. రెండు గ్రామాల కేంద్రాల బస్తాలను తరలించేందుకు మెట్పల్లి మండలం పెద్దాపూర్ రైస్మిల్ కేటాయించారు. ధాన్యం బస్తాలు ఇప్పుడు తీసుకోమని రైస్మిల్ యజమాని చెప్పడంతో నిర్వాహకులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేరే రైస్మిల్ కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికై నా పౌరసరఫరాల శాఖ అధికారులు చొరవ చూపి ధాన్యం బస్తాలు తరలింపు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
మెట్పల్లిరూరల్: రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం జగ్గాసాగర్, ఆత్మకూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన అడిషనల్ కలెక్టర్ లతతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రాల్లోకి ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా ఎందుకు కొనుగోళ్లు చేయడం లేదని, తేమ శాతం వచ్చినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు తిప్పలు తప్పడం లేదని విమర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్లు జగన్గౌడ్, రాజారాం, నాయకులు రాజేందర్, నర్సింహులు, అంజయ్య పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కోరుట్ల రూరల్: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేలా కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
పాతాళానికి గంగ
జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో నీటి వినియోగం పెరిగిపోయి భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతి ఇంటికి బోరుబావి ఉండడం.. ఇష్టారీతిన వినియోగిస్తుండడంతో గంగమ్మ క్రమంగా లోతుకు చేరుతోంది. ఏప్రిల్లో మున్సిపాలిటీ పరిధిలో పరిశీలిస్తే జగిత్యాలలో 8.25మీటర్లు, కోరుట్ల 9.62, మెట్పల్లి లో 6.65, రాయికల్లో 3.21, ధర్మపురిలో 5.96 మీ టర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయింది. నాన్ఆయకట్టు ప్రాంతాల్లో.. నాన్ ఆయకట్టు ప్రాంతాలైన మల్యాల, మేడిపల్లి, కథలాపూర్, కొడిమ్యాల, భీమారం మండలాల్లో భూగర్భజలాలు మరింత పడిపోతున్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో జలాలు భారీగా తగ్గుతున్నాయి. మల్యాల మండలంలో 6.96మీటర్లు, కొడిమ్యాలలో 13.03, కథలాపూర్లో 3.42, మేడిపల్లిలో 6.53, భీమారంలో 4.51మీటర్లకు పడిపోయింది. ఒక్క నెలలోనే 0.52 మీటర్లు.. ఒక్కనెలలోనే నీటిమట్టం 0.52మీటర్లకు పడిపోయింది. మార్చిలో 4.98 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఏప్రిల్ చివరినాటికి 0.52 మీటర్లు పడిపోయి ప్రస్తుతం 5.50 మీటర్లకు చేరుకుంది. గతేడాది ఏప్రిల్తో పోల్చితే 0.07 మీటర్లు తగ్గినట్లయ్యింది. ఏప్రిల్ చివరి నాటికి బీర్పూర్ మండలంలో 2.94 మీటర్ల లోతులో నీరు ఉండగా.. 13.03 మీటర్ల లోతులో కొడిమ్యాల మండలంలో నీరు ఉండటం గమనార్హం. ఆయకట్టు మండలాల్లోను అంతంతే ఆయకట్టు మండలాల్లోనూ నీటిమట్టం పడిపోతూనే ఉంది. బుగ్గారం మండలంలో 5.35 మీటర్లు, ఎండపల్లిలో 7.13, గొల్లపల్లిలో 5.05, జగిత్యాల రూరల్లో 3.22, పెగడపల్లిలో 5.10, సారంగాపూర్లో 6.01, వెల్గటూర్లో 3.19, ఇబ్రహీంపట్నంలో 5.19, మల్లాపూర్లో 6.43 మీటర్లలోతుకు జలం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మేలో మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉన్నందున నీటిని పోదుపుగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.జగిత్యాలఅగ్రికల్చర్: రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. వేసవిలో రోజువారి అవసరాలకు నీటి వినియోగం ఎక్కువ కావడంతో నీటిమట్టం లోతుకు చేరుతోంది. కేవలం ఒక్క ఏప్రిల్ నెలలోనే నీటిమట్టం 0.52 మీటర్లు పడిపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక మే నెలలో మరెంత పడిపోతుందోనని ఆందోళన మొదలైంది. బోర్లు తవ్వాలంటే వాల్టా చట్టం ప్రకారం భూగర్భజల శాఖ అనుమతి తీసుకోవాలి. బోరు యంత్రాలు కూడా భూగర్భశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనుమతి లేకుండా తవ్వితే భారీ జరిమానాలు ఉంటాయి. భూగర్భజలాల పరిరక్షణకు ప్రతిఒక్కరూ ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. – శ్రీకాంత్, భూగర్భజల శాఖాధికారి బోర్లకు అనుమతి తప్పనిసరి -
ప్రజాపాలనతో సమస్యల పరిష్కారం
ధర్మపురి: ప్రజాపాలన కార్యక్రమంతో సమస్యలకు పరిష్కారం లభిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురిలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని, గత ప్రభుత్వ హయాంలో అందించని పథకాలను కాంగ్రెస్ అందిస్తోందని తెలిపారు. గోదావరి పుష్కరాలకు రూ.450 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపించామన్నారు. తొలి విడుత రూ.115కోట్లు విడుదలైనట్లు తెలిపారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, డిగ్రీ కళాశాల మంజూరైందని, ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. రెండేళ్లలో 474 మంది రైతులకు రైతుబీమా పథకం ద్వారా రూ.18.7 కోట్లు అందించామని వివరించారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ధర్మపురిని టెంపుల్ సిటీగా మార్చుతాం: కలెక్టర్ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని టెంపుల్ సిటీ, మాస్టర్ ప్లాన్ అమలుకు ఫైనల్ అయిందని, త్వరలోనే సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్.దినేష్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య తదితరులున్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
కోరుట్ల: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలు చేరుకోవాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. పట్టణంలో శనివారం నియోజకవర్గస్థాయి ప్రజాపాలన ప్రగతి నివేదిక సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి పట్టణం వరకూ చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను వేగంగా పరిశీలించడంతోపాటు అర్హత ప్రమాణాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భూ సమస్యలు, రేషన్కార్డులు, పింఛన్ల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బాలల భద్రత, డ్రగ్స్రహితంపై ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో జీవాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత, కౌన్సిలర్లు, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సర్పంచులు పాల్గొన్నారు. -
ధాన్యం తూకంలో జాప్యం చేయొద్దు
మల్యాల/కొడిమ్యాల: ధాన్యాన్ని తూకం వేయడంతో జాప్యం చేయొద్దని కలెక్టర సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని ముత్యంపేటలో కేంద్రాలను శనివారం సందర్శించారు. తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ తిరుపతి, అధికారులు ఉన్నారు. అనంతరం కొడిమ్యాల మండలకేంద్రంతోపాటు గంగారంతండా, చెప్యాలలోని కేంద్రాలను సందర్శించారు. ధాన్యంలో తేమశాతంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీఎస్వో జితేందర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వామి, తహసీల్దార్ నరేష్, ఏపీఎం మల్లేశం, సర్పంచ్ వినోద్, సీసీలు వీరకుమార్, మరియా, రైతులు పాల్గొన్నారు. -
అంతస్తుకో రేటు..!?
కోరుట్ల: మున్సిపాలిటీలోని పట్టణ ప్రణాళిక విభాగంలో ‘అవినీతి కంపు’ కామన్ అన్న తీరుగా తయారైంది. మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణ అనుమతికి ఒక్కో ఫైల్ లెక్కన వసూళ్ల తంతు నడుస్తుంటే.. కోరుట్లలో మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు మరో అడుగు ముందుకేశారు. ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్కు కేవలం అమ్యామ్యాలకు కింద రూ.10 వేలతో సరిపెట్టుకోకుండా ఒక్కో అంతస్తుకు ఒక్కో రేటు పెట్టారు. సొంత ఆదాయం మరింత పెంచుకోవచ్చన్న ఆశల్లోకి దిగుతున్నారు. బల్దియాలో వసూళ్ల దందా విచ్చలవిడిగా సాగుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. సొంత ఆదాయంపై దృష్టి.. కోరుట్ల మున్సిపాలిటీలో 33వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో ప్రతినెలా ఎంత తక్కువ అనుకున్నా సుమారు 150 నుంచి 200 ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. వీటిలో దాదాపు సగం ఇళ్ల నిర్మాణం జీప్లస్–1 అనుమతి తీసుకోవడం ఆనవాయితీ. గ్రౌండ్ఫ్లోర్ నిర్మాణానికే రూ.10 వేల మేర అమ్యామ్యాలు తీసుకుని కొంతమంది మున్సిపల్ అధికారులు జేబులు నింపుకుంటున్న విషయం బహిరంగ రహస్యం. మరో అంతస్తు నిర్మాణానికి మరో రూ.5వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడితో సరిపెట్టుకోకుండా ఆపై అంతస్తు నిర్మాణానికి రూ.20వేల నుంచి రూ.30 వేలు వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ లెక్కన మున్సిపాలిటీకి ఇళ్ల నిర్మాణాలపై వస్తున్న ఆదాయం కన్నా సిబ్బందికి ఎక్కువగానే సమకూరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వసూళ్ల దందా మొత్తం మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న కొంతమంది ఆర్కిటెక్టర్లతో నడుస్తున్నట్లు తెలిసింది. కాసులు ఎక్కువ మొత్తంలో సమర్పించి ఇంటి నిర్మాణ ఫైళ్లు అందించే లైసెన్స్డ్ ఆర్కిటెక్టర్ల అనుమతులు తొందరగా వస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. నిబంధనల ప్రకారం వ్యవహరించే ఆర్కిటెక్టర్లకు మొండి చేయి చూపుతూ.. లేనిపోని కారణాలు చెబుతూ కొర్రీలు పెడుతుండటం విశేషం. ఉత్తుత్తి పర్యవేక్షణ స్థానిక సంస్థలను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు కింది స్థాయి మున్సిపల్ అధికారుల తీరుపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కోరుట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇతర అధికారులపైనా లెక్కలేని ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనక కారణాలు ఏమిటన్న అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం పన్నుల వసూళ్ల అంశంపై ప్రతీరోజు సమీక్షలు నిర్వహించే ఉన్నతాధికారులు మున్సిపాలిటీలో అధికారుల కార్యకలాపాలు సక్రమంగా జరగుతున్నాయా..? లేదా..? అన్న అంశంపై దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
జయంతిని విజయవంతంగా నిర్వహించాలి
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 10నుంచి 12వరకు నిర్వహించనున్న హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల ను సమష్టిగా విజయవంతంగా నిర్వహించాల ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నా రు. శుక్రవారం ఉత్సవాల పోస్టర్ను ఆలయ ఈవో అంజనారెడ్డి, అర్చకులతో కలిసి ఆవిష్కరించారు. పారిశుధ్య కార్మికుల దినసరి కూలీ పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. మరో ఐదు పా రిశుధ్య కార్మికుల పోస్టులు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో నీలం రవి, సర్పంచ్ దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్గౌడ్, స్థానా చార్యులు కపీందర్, ప్రధాన అర్చకుడు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, ఏఈవో హరిహరనాథ్, సూపరింటెండెంట్ సునీల్ పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమానికి కృషికోరుట్ల: కార్మికుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని కటుకం సంఘయ్య ఫంక్షన్హాల్లో కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లోని వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికులకు తన సొంత నిధులతో లేబర్, ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. అనంతరం బ్యాంకు ఎల్డీఎం రామ్ కార్మికులకు చిరు వ్యాపారాలపై అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు గడ్డం మధు, టేకుల నరేశ్, ఫయీం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.డీసీఆర్బీ సీఐకి డీఎస్పీగా పదోన్నతిజగిత్యాలక్రైం: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో డీసీఆర్బీ సీఐగా పనిచేస్తున్న శ్రీని వాస్కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీనివాస్ శుక్రవారం ఎస్పీ అశోక్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేయగా, శ్రీనివాస్కు పదోన్నతి స్టార్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేస్తూ ఎన్నోఏళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి పదోన్నతి గొప్ప గుర్తింపు అన్నారు. గ్రామపంచాయతీలకు నిధుల కేటాయింపు లేదుజగిత్యాలరూరల్: గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. మే డే దినోత్సవం సందర్భంగా శుక్రవారం జగిత్యాలరూరల్ మండలం చల్గల్ గ్రామపంచాయతీ వద్ద పంచాయతీ కార్మికులను సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి వస్తున్న నిధులు తప్ప జీపీలకు రాష్ట్ర ప్రభుత్వ ం నుంచి నిధులు రావడం లేదన్నారు. దీంతో కార్మికులకు వేతనాలు చెల్లింపు పంచాయతీల పై భారం పడుతుందన్నారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు, సర్పంచ్ రాజేందర్ పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా కార్యవర్గం జగిత్యాల: ప్రభుత్వ వైద్యు ల సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అమరేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ముస్కు జైపాల్రెడ్డి, కోశాధికారిగా నవీన్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తామని తెలిపారు. -
రూ.82 లక్షలు పక్కదారికి యత్నం
రాయికల్: పట్టణంలోని వైకుంఠధామం అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్ కింద మంజూరు చేసిన రూ.82 లక్షలను పక్కదారి పట్టించేందుకు కాంట్రాక్టర్ యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయికల్ బల్దియాకు టీయూఎఫ్ఐడీసీ నిధుల ద్వారా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా రూ.82 లక్షలు ౖవైకుంఠధామానికి కేటాయించారు. ఆ పనులను పూర్తి చేసేందుకు ఆర్అండ్బీ శాఖ టెండర్ చేయడంలో ఆలస్యమైంది. అదే సమయంలో ప్రభుత్వం ప్రతీ మునిపాలిటీకి శ్మశాన వాటికల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ కింద రూ.కోటి మంజూరు చేసింది. రూ.కోటితో టెండర్ పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్ వైకుంఠధామంలో కాంపౌండ్వాల్, బర్నింగ్షెడ్, టాయిలెట్స్ నిర్మాణం, వుడ్ స్టోరేజీ వంటివి నిర్మించి చేతులు దులుపుకున్నాడు. టీయూఎఫ్ఐడీసీ కింద మంజూరైన రూ.82 లక్షల టెండర్ కాగా.. ఆ నిధులన్నీ వృథాగా ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కాంట్రాక్టర్ శ్మశాన వాటికలో సీసీరోడ్ల నిర్మాణం చేసేందుకు అప్పటి కమిషనర్, చైర్మన్ను కోరగా.. వారు తిరస్కరించారు. అవే నిధులతో పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు మళ్లించాలని సంబంధిత కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకురావడంతో కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ రూ.82 లక్షలను పట్టణంలోని కొన్ని కుల సంఘ భవనాలు, ఇతర అభివృద్ధి పనులు చేసుకోవడానికి పట్టణంలోని ఓ కాంట్రాక్టర్ ఫైల్ తయారుచేసి నూతన పాలకవర్గం ఆమోదం కాకముందే పాత కమిషనర్తో ఆమోదించినట్లుగా ఫైల్ క్రియేట్ చేసి ఈ నిధులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నూతన పాలకమండలి చైర్మన్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై కమిషనర్ కీర్తి నాగరాజును ‘సాక్షి’ వివరణ కోరగా వైకుంఠధామం నిర్మాణం కోసం మంజూరైన నిధులు వాటి అభివృద్ధికి కేటాయిస్తామని, మరే ఇతర పనులకు మళ్లించబోమని తెలిపారు. వైకుంఠధామంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి సుందరీకరణ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యం
జగిత్యాల: బాలల భరోసా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన మేడేతో పాటు, బాల భరోసా, నశాముక్త్ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరేళ్లలోపు పిల్లలు అంగవైకల్యానికి గురికాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం బాల భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, డ్రగ్స్ రహిత తెలంగాణ ము ఖ్య మంత్రి లక్ష్యమని తెలిపారు. చిన్నారులకు వివిధ పరీక్షలు చేసి లోపాలు ఉంటే వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ అందించి వైకల్యం రాకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18లక్షల చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మేడే సందర్భంగా కార్మిక శాఖ ద్వారా అందుతున్న పథకాలను జిల్లాలోని అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నశాముక్త్ కార్యక్రమంలో భాగంగా జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పో లీసులు కృషి చేయాలని, ఈగల్ టీం పేరుతో ఒక ఐపీఎస్ అధికారిని నియమించి డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ బాలభరోసా పథ కం ఎంతో గొప్పదని, పిల్లల్లో ఉన్న వైకల్యాలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడం జరుగుతుందన్నారు. శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ అనిత రాంచంద్రన్ మాట్లాడుతూ బాల భరోసా పథకం కింద పిల్లలకు వైద్యం నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన కుటుంబా లకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం మేడే సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సత్కరించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, దివ్యాంగుల శాఖ డైరెక్టర్ శైలజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఐసీడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి పరిశీలించారు. ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు పరిష్కరించాం జగిత్యాలటౌన్: తెలంగాణ ఏర్పాటులో కీలక పా త్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్బంగా శుక్రవారం ఆర్టీసీ డిపోలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి జెండా ఆవిష్కరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేవలం మూడు రోజుల్లోనే వారితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించామన్నారు. -
జగిత్యాలకు రాం రాం!
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ అంటే ప్రస్తు తం ప్రతీ నోట వినిపిస్తోంది. అవినీతికి కేరాఫ్ జగిత్యాల మున్సిపాలిటీగా ముద్రపడింది. ఇందులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తరుచూ ఫిర్యాదులు చేయడం, అటు ఏసీబీ అధికారులు, ఇటు విజిలెన్స్ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. ప్రతీ శాఖలో రికార్డులు తనిఖీ చేస్తున్నారు. గతంలో కొందరు అధికారులు చేసిన తప్పిదాల వల్ల జగిత్యాల మున్సి పాలిటీపై ఇప్పటికీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శానిటేషన్ విభాగంలో గతంలో జరిగిన డీజిల్ కుంభకోణంతో పాటు, ము న్సిపల్ ట్రాక్టర్లు మాయమైన సంఘటన తెలిసిందే. అలాగే రెవెన్యూ విభాగంలో అసెస్మెంట్కు సంబంధించి అనేక ఆరోపణలొచ్చాయి. ఓ భూమికేసులో మున్సిపల్ కమిషనర్తో పాటు, ఆర్వో సైతం జైలుకెళ్లారు. ఇ లాంటి అవకతవకలు అనేకం జరుగుతుండటంతో కొందరు సీడీఎంఏకు ఫిర్యాదు చేయడంతో వారు సైతం జగిత్యాలపై నిఘా పెట్టారు. ప్రతీ వి భాగంలో అవకతవకలు జరిగినట్లు వెలువడటంతో జగిత్యాల మున్సిపాలిటీపై దృష్టి సారించారు. ఆస్తిపన్ను విషయంలో సైతం ఓ అధికారి సొంతానికి వాడుకున్నట్లు బయటకు రావడంతో ఆ అధికారిని సస్పెండ్ చేసి డబ్బును రికవరీ చేశారు. ఇలా ఒకటే కాకుండా ప్రతీ విషయంలోనూ అవినీతి ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. మ్యూటేషన్లకు సంబంధించి అక్రమాలు, పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం, కార్మికులకు సంబంధించిన పీఎఫ్ పట్టించుకోకపోవడం, ట్రేడ్ లైసెన్స్లు, ఇంజినీరింగ్ సెక్షన్లో వాటర్ చార్జీలు, టెండర్లు సక్రమంగా లేకపోవడం, ముఖ్యంగా మున్సిపల్ కాంప్లెక్స్లకు సంబంధించి టెండర్లు వేయకపోవడం లాంటివన్నింటినీ ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ప్రతీ విభాగానికి సంబంధించిన అన్ని ఫైల్స్ పట్టుకెళ్లడంతో పాటు, ఇంటి అనుమతులతో పాటు, ఇతరాత్ర వాటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫోన్ నంబర్లు సైతం తీసుకెళ్లి వారికి ఫోన్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఏసీబీ అధికారులు వచ్చి 10గంటల పాటు మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించగా మరో వారం రోజుల వ్యవధిలోనే విజిలెన్స్ అధికారులు వచ్చి 17 టీంలుగా విభజించి భవనాల కొలతల్లో తేడాలున్నాయ ని అన్నింటినీ కొలిచి రికార్డు తీసుకెళ్లారు. ఇలా జగిత్యాల మున్సిపాలిటీలో మొదటి నుంచి అవినీతి ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి. బదిలీపై వచ్చేందుకు జంకుతున్న అధికారులు జగిత్యాల మున్సిపాలిటీకి బదిలీపై వచ్చేందుకు అధికారులు జంకుతున్నారు. సీడీఎంఏ నుంచి జగిత్యాల మున్సిపాలిటీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయితే అక్కడిదక్కడే మార్పులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయి. శానిటరి ఇన్స్పెక్టర్ లేకపోవడం, రెవెన్యూ సెక్షన్లో ఆర్వోలు, ఇన్చార్జిలుగా ఉండటం, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ సెక్షన్లలో అనేకంగా ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్కుమార్ సైతం సీడీఎంఏ కమిషనర్కు పోస్టులు భర్తీ చేయాలని లేఖ సైతం ఇచ్చారు. కానీ జగిత్యాల మున్సిపాలిటీ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారడంతో ఒక్క అధికారి సైత ం ఇక్కడకు రావడానికి భయాందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఎక్కడ మాపైన ఆరోపణలు వస్తాయోనని రావడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అధికారుల్లో గుబులు గతంలో జరిగిన సంఘటనలకు మేమెక్కడ బాధ్యులవమవుతామోనని ప్రస్తుతం పనిచేస్తున్న అధికా రులు భయాందోళనకు గురవుతున్నారు. శానిటేషన్లో నాలుగు ట్రాక్టర్లు మాయమైన సంఘటనపై కమిషనర్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తె లిసిందే. అంతేకాక ఇటు ఏసీబీ అధికారులు, అటు విజిలెన్స్ అధికారులు అన్ని ఫైల్స్ తీసుకెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులు నేరుగా సీడీఎంఏకే ఫైల్స్ పంపించనున్నారు. సంబంధిత అధికారులను బాధ్యలను చేసే అవకాశం ఉండటంతో చే య ని తప్పుకు తాము బాధ్యులమవుతామోనని భయా ందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు చొర వ చూపి మున్సిపాలిటీని గాడిలో పడేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నిత్యం ఫిర్యాదులు, అధికారుల దాడుల నేపథ్యంలో జగిత్యాల కమిషనర్గా పనిచేస్తున్న స్పందన బదిలీపై వెళ్లగా నూతన కమిషనర్గా గ్రూప్–1 ఆఫీసర్ సత్యప్రణవ్ నియమితులయ్యారు.ఇక్కడ కమిషనర్గా చేయాలంటే సవాళ్లతో కూడుకున్నదే. గతంలో అన్ని శాఖలో అవినీతి ఆరోపణలు రావడం, ప్రస్తుతం వాటిపై విచారణ చేస్తుండటంతో కమిషనర్గా వచ్చిన వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నూతనంగా వచ్చిన కమిషనర్ అటు అభివృద్ధి వైపు చూడటంతో పాటు, ఇటు ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గాడిన పడేదెలా..మున్సిపాలిటీకి ఇటీవలే కొత్త పాలకవర్గం ఏర్పడింది. చైర్పర్సన్గా సమిండ్ల వాణి కొనసాగుతున్నారు. పూర్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మున్సిపాలిటీని గాడిన పడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉంది. ముఖ్యంగా రెవెన్యూ, శానిటేషన్, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ సెక్షన్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండాలి
జగిత్యాల: యాసంగి సీజన్కు సంబంధించి వరిధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. యాసంగి సీజన్కు సంబంధించి దిగుమతుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, కేంద్రాల వద్ద క్లస్టర్స్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ వందశాతం పూర్తి చేయాలి ఫార్మర్ రిజిస్ట్రేషన్ వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ను జూన్ 2లోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈనెల 4నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే ఫార్మర్స్ వీక్ను విజయవంతం చేయాలని తెలిపారు. రైతులకు మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ లత, రాజాగౌడ్ పాల్గొన్నారు. హరితహారానికి నిధుల లేమిధర్మపురి: పల్లెల్లో పచ్చదనం పంచేందుకు ప్రభుత్వం హరితహారం కింద ఏటా నిధులు వెచ్చిస్తుంది. ఇందులో భాగంగా పల్లెల్లో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి అందులో మొక్కలు పెంచుతోంది. గతేడాది పనులు సవ్యంగా సాగినప్పటికీ ఈఏడాది నత్తనడకన సాగుతున్నాయి. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచి జూన్ వరకు హరితహారం కార్యక్రమానికి అందించాల్సి ఉంటుంది. కానీ.. ఈ ఏడాది మున్సిపాలిటీలలో మొక్కలు పెంపకానికే ఇంకా అడుగులు ముందుకు పడలేదు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 2023 నవంబర్ నాటికి నర్సరీల టెండర్లను పూర్తి చేసుకొని డిసెంబర్లో విత్తనాలు పెట్టి మొక్కలను పెంచి జూన్ వరకు అందించారు. ఈ సారి పనులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. నర్సరీల్లో పాత మొక్కలే దర్శనం మున్సిపాలిటీల్లోని నర్సరీల్లో పాత మొక్కలే దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి మార్చి, ఏప్రిల్, మే నెలలో నీరుపట్టి జూన్ వరకు మొక్కలు పెంచి ప్రజలతోపాటు ఆయా విభాగాలకు అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు నర్సరీల వైపు దృష్టి సారించలేకపోయారు. మొక్కుబడిగా పనులు ఈ ఏడాది హరితహారం పనులు మొక్కుబడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నర్సరీల్లో మొక్కలు లేకపోవడంతో జూన్ వరకు హరితహారం కార్యక్రమం ముందుకుసాగే పరిస్థితి లేదు. నర్సరీల్లో పాత మొక్కలే తప్ప కొత్త మొక్కలు కానరావడం లేదు. నిధుల కొరత, కూలీల కొరత, నీటి సమస్య మొక్కల పెంపకానికి అడ్డంకిగా మారాయి.మొక్కల పెంపకం లక్ష్యాలు (2025–2026) బల్దియా లక్ష్యం పాత మొక్కల నిల్వ ధర్మపురి లక్ష 3800 జగిత్యాల 39,000 1,12,500 కోరుట్ల 1,54,300 75,000 మెట్పెల్లి 1,27,400 56,300 రాయికల్ 89,000 3570 -
క్రీడా శిక్షణకు వేళాయే
కథలాపూర్(వేములవాడ): గ్రామీణప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకు క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుంచి 31వరకు క్రీడా పోటీలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల మైదానాల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు పీడీలు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులను 12 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. శిబిరాల నిర్వహణ ఇలా.. అథ్లెటిక్స్: ఎండపల్లి జెడ్పీ హైస్కూల్. బ్యాడ్మింటన్: కొడిమ్యాల జెడ్పీ హైస్కూల్, గొల్లపల్లి మండలం చందోలి జెడ్పీ హైస్కూల్. బాస్కెట్బాల్: రాయికల్ మండలం అల్లీపూర్, సా రంగాపూర్ మండలం కోనాపూర్ జెడ్పీ హైస్కూల్. బాక్సింగ్: జగిత్యాలరూరల్ మండలం జాబితాపూర్ ఉన్నత పాఠశాల. తైక్వాండో: మేడిపెల్లి జెడ్పీ హైస్కూల్. వాలీబాల్: వెల్గటూర్ జెడ్పీ హైస్కూల్, కథలాపూర్ జెడ్పీ హైస్కూల్, కోరుట్ల మండలం అయిలాపూర్ జెడ్పీ హైస్కూల్, మెట్పల్లి మినీ స్టేడియం. కరాటే: జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో శిబిరాలుంటాయి. ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది. నేటి నుంచి వేసవి శిబిరాలు జిల్లాలో 12 కేంద్రాల గుర్తింపు -
ఆధునిక సాగు పద్ధతులతోనే రైతులకు మేలు
గొల్లపల్లి(పెగడపల్లి): రైతులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి, శాసీ్త్రయ దృక్పథంతో వ్యవసాయం చేసినప్పుడే అధిక లాభాలు గడించవచ్చని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు స్వాతి, దీపిక సూచించారు. గురువారం పెగడపల్లి మండలం ఎల్లాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో రైతులకు సలహాలు, సూచనలు అందించారు. మార్కెట్లో ఏ వరి రకాలకు అధిక డిమాండ్ ఉందో గమనించి.. వాటిని సాగు చేయడం ద్వారా గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. నేల ఆరోగ్యం క్షీణించకుండా ఉండాలంటే రసాయనిక ఎరువులు, ముఖ్యంగా యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. భూసార సంరక్షణ కోసం పచ్చిరొట్ట పంటలను సాగు చేయాలని వివరించారు. ఏటా ఒకే పంట వేయకుండా పంట మార్పిడి విధానాన్ని పాటించాలని, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు. వరి కోత అనంతరం మిగిలిన పంట అవశేషాలను కాల్చడం ద్వారా నేలలోని మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోతాయని హెచ్చరించారు. వాటిని కాల్చకుండా నేలలోనే కలియదున్నడం ద్వారా భూమికి సహజ సిద్ధమైన బలం చేకూరుతుందన్నారు. పురుగు, తెగుళ్లు, కలుపు నివారణ మందులను వ్యవసాయ అధికారుల సలహా మేరకు నిర్దేశించిన మోతాదులో మాత్రమే వాడుకుంటూ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సబ్సిడీలను రైతులకు వివరించారు. ఆయిల్ పామ్ సాగుకు ఉన్న ఆవశ్యకతను, ఆ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అక్షయ్ కుమార్, ఎల్లాపూర్, రామభద్రునిపల్లి, రాజరంపల్లె, కీచులాటపల్లి గ్రామాల సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, క్లస్టర్ పరిధిలోని రైతులు పాల్గొన్నారు. -
వామ్మో.. ప్రభుత్వ ఆస్పత్రి
జగిత్యాల: అది జిల్లాకేంద్రంలోని అతిపెద్ద జనరల్ ఆస్పత్రి. ఇక్కడ మెడికల్ కళాశాల అందుబాటులోకి రావడంతో రోగులతో నిత్యం కిటకిటలాడుతోంది. కానీ.. ఇంతపెద్ద జనరల్ ఆస్పత్రిలో రోగులకు కావాల్సిన సౌకర్యాలు మాత్రం కరువయ్యాయి. అత్యవసరమైన మందులు సరిపడా లేవు. ఎవరైనా గుండెనొప్పితోనే.. ప్రమాదం జరిగి కాలో, చెయ్యో విరిగినా తీసేందుకు ఎక్స్రే పనిచేయడం లేదు. ఈసీజీకి సంబంధించి పేపర్ అందుబాటులో లేకపోవడంతో ప్రింట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా రోగులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కూడా ఏమీ చేయలేక మొబైల్ ఫోన్లలో ఫొటో తీసి ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే కొంతమంది వద్ద స్మార్ట్ఫోన్లు లేకపోవడం సమస్యగా మారింది. కొన్నిరోజులుగా ఈ సమస్యలు వేధిస్తున్నా.. అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ కనీసం పట్టించుకోకపోవడం శోచనీయం. రోగులు బయటి ఆస్పత్రుల్లో ఎక్స్రే తీయించుకుంటున్నారు. ఈసీజీనీ అక్కడే చేయించుకుంటున్నారు. మందులను ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొంటున్నారు. నిత్యం వెయ్యిమందికి పైగానే.. ఆస్పత్రికి జిల్లాకేంద్రంతోపాటు, ఇతర జిల్లాలు, మండలాల నుంచి నిత్యం వెయ్యి మందికి పైగానే రోగులు వస్తుంటారు. జ్వరం, ఇతరత్రా రోగాలతో బాధపడుతున్న వారు వచ్చి చికిత్స చేయించుకుంటారు. ఏదైనా ప్రమాదం జరిగినా ఇదే ఆస్పత్రికి తీసుకొస్తుంటారు. అయితే రోగులకు కావాల్సిన మందులు, ఈసీజీ ప్రింట్ అవుట్లు, ఎక్స్రే ఫిల్మ్స్ లేకపోవడంతో వైద్యులు బయట తీయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. చిన్నచిన్న మందులకు కూడా ప్రస్తుతం బడ్జెట్ లేక తెప్పించడం లేదని ఆస్పత్రి వర్గాలే పేర్కొంటున్నాయి. కొరత ఉన్న మందులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం అవసరమయ్యే మందులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా స్పిరిట్, కాటన్, లాబెటలాల్, నెపెంటిన్, లివోప్రిన్, బివీవైకై న్, ఎనామిన్, మెపెంట్రినిన్ వంటివాటితోపాటు పారసెట్మల్, ఇతరత్రా మందులు లేకపోవడంతో అత్యవసర సమయంలో రోగులకు ఇబ్బందిగా మారింది. సిబ్బందికి అవసరమయ్యే గ్లౌస్లు లేవని పేర్కొంటున్నారు. సర్జికల్కు సంబంధించిన సామగ్రిని వెంటనే తెప్పించేలా చూడాలని ఆస్పత్రి వర్గాలే పేర్కొంటున్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పనిచేయని ఎక్స్రే ఈసీజీకి ప్రింట్లు కరువు సరిపడా లేని మందులు పట్టించుకోని అధికారులు -
కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించండి
జగిత్యాలటౌన్: కేంద్రీయ విద్యాలయానికి జిల్లాకేంద్రంలో స్థలం కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రెస్క్లబ్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. జగిత్యాలతోపాటు నిజామాబాద్, వనపర్తికి కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయని, జగిత్యాలలో స్థలమే కేటాయించలేదన్నారు. ఎందుకు జాప్యం జరుగుతుందో అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అడ్లూరి స్థలం కేటాయింపులో జాప్యంపై స్పందించాలన్నారు. ఈనెల 15లోపు స్థలం గుర్తించాలని, లేకుంటే ఆర్డీవో కార్యాలయం ఎదుట ఽనిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, నాయకులు గంగాధర్, ఆముద రాజు, మ్యాదరి అశోక్, రమేశ్ పాల్గొన్నారు. నిరుపేద వైద్యానికి రూ.1.20లక్షల విరాళం ధర్మపురి: ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నిరుపేద విద్యార్థినికి వైద్య ఖర్చుల కోసం ఫేస్బుక్ మిత్రులు స్పందించి రూ.1.20 లక్షలు విరాళాలు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. మండలంలోని తుమ్మెనాల గ్రామానికి చెందిన లింగమల్ల లక్ష్మణ్, సుమిత్ర దంపతులకు ఇద్దరు కూతుళ్లు. లక్ష్మణ్ గ్రామ పంచాయతీలో కాంట్రాక్టు పద్ధతిన పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. చిన్న కూతురు శ్రీహిత (17) ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఐదు నెలల క్రితం అనారోగ్యానికి గురైంది. వైద్యం కోసం సుమారు రూ. 3లక్షల వరకు అప్పు చేశాడు. ప్రస్తుతం శ్రీహిత కోలుకున్నా.. మరో ఐదు నెలలు మందులు వాడాలని, వివిధ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కూతురు వైద్య ఖర్చులు లక్ష్మణ్కు భారం కాగా వీరి విషయాన్ని తెలుసుకున్న సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ ఏప్రిల్ 3న ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఎన్నారైలు, ఇతర దాతలు స్పందించి లక్ష్మణ్ బ్యాంకు ఖాతాకు రూ.1.20 లక్షలు విరాళంగా అందించారు. ఆ సొమ్మును ఎస్బీఐ అధికారుల చేతుల మీదుగా రమేశ్ పంపిణీ చేయించాడు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ నీచ రాజకీయాలుకోరుట్ల: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని బెల్లంపెల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మహిళా ఆక్రోశ సమ్మేళనం నిర్వహించారు. 76 ఏళ్ల నిరీక్షణ తర్వాత మహిళలకు నారీశక్తి వందన్ అధినియం ద్వారా చట్టసభల్లో సముచిత స్థానం లభించిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో వచ్చిన ఈ చట్టంతోలోక్సభ, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించారన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని పలు పార్టీలు ఈ చట్టాన్ని అడ్డుకోవటం సరికాదన్నారు. మహిళల కోసం కేంద్రం అనేక పథకాలు తీసకొచ్చిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూదరి అరుణ, అనూప్ రావు, జగి త్యాల ఇన్చార్జి బోగ ఽశ్రావణి, ఐఎంఏ మహిళా అధ్యక్షురాలు స్వీతీ అనూప్, నాయకులు పిండేరు భానుప్రియ, వడ్డేపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారా యణ, మెట్పల్లి, జగిత్యాల పట్టణ అధ్యక్షులు నవీణ్, కొక్కు గంగాధర్, కోరుట్ల, మెట్పల్లి మున్సి పల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. సామూహిక నిరాహార దీక్షకు తరలిరండిజగిత్యాల:206 సంఘాలతో ఏర్పడిన టీజీఈజేఏసీ విస్తృత సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న సామూహిక నిరాహార దీక్ష చేపడుతున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు అన్నారు. జూన్ 2లోపు పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు ఒకేసారి చెల్లించాలని, హెల్త్కార్డులు అమలు చేయాలన్నారు. దీక్షలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లికి చెందిన బేతి భూమారెడ్డి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా.. గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఏళ్లుగా రేషన్కార్డుల కోసం ఎదురుచూస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచి త విద్యుత్, సన్నబియ్యం అందిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు ము కుందం, గుంటి రవి, దామోదర్, గంగారెడ్డి, మహే శ్, గంగమల్లయ్య, మల్లేశ్, సురేశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
‘ఉపాధి’లో కూలీల సంఖ్య పెంచాలి
● డీఆర్డీఏ పీడీ రఘువరణ్ రాయికల్: ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. గురువారం మండలంలోని రాజనగర్లో కందకాల పనులు, వన నర్సరీ, గ్రామైఖ్య సంఘం భవన నిర్మాణాలను పరిశీలించారు. ఉపాధి పని ప్రదేశాల్లో సదుపాయాలు కల్పించాలని, సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం కూలీలు పనులు చేయాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 6 గంటల వరకు పనుల్లోకి రావాలని అన్నారు. ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ భారతపు రాజేశ్, ఏపీవో దివ్య, టెక్నికల్ అసిస్టెంట్లు విజయ్, రాజేందర్, పంచాయతీ కార్యదర్శి వెంకటాచలం, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేందర్ పాల్గొన్నారు. -
ఎల్నినో హెచ్చరికలతో నిద్రలేచిన సీఎం రేవంత్
జగిత్యాలటౌన్: ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే భయంతోనే సీఎం రేవంత్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు అంటూ కొత్త ఎత్తులు వేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. 152 మీటర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని 148 మీటర్లకు ఇరు రాష్ట్రాల మధ్యం ఒప్పందం కుదిరిన విషయం తెలిసి కూడా కాలయాపన కోసమే 150 మీటర్ల ఎత్తు అంటూ కొత్త కుట్రకు తెరతీస్తున్నారని విమర్శించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చి 30నెలలు గడిచి, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు తుమ్మడిహట్టి పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఆయన కుటుంబ ఆర్థిక లబ్ధి కోసమే ఫోర్త్ సిటీ అంటున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం గాలికొదిలేశారని తెలిపారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం.. కేసీఆర్ను దోషిగా చూపెట్టడం తప్ప మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోయి 30నెలలు గడుస్తుంటే రేవంత్రెడ్డి ఇప్పుడు నిద్రలేచాడని అన్నారు. మేడిగడ్డకు మరమ్మతు చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఎందుకు పునరుద్ధరణ చేపట్టలేదని ప్రశ్నించారు. ఎల్నినో హెచ్చరికలతో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడి తెలంగాణ ఎడారిగా మారితే దోషిగా నిలవాల్సి వస్తుందన్న భయంతోనే ఎత్తు పెంపు బాధ్యత కేంద్రమంత్రి కిషన్రెడ్డిదే అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు 152మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ను ఒప్పించాలని కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందంలో కేంద్రమంత్రి పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. కిషన్రెడ్డిని బూచిగా చూపి మరింత కాలయాపనకు రేవంత్ కుట్ర చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. మాయమాటలు మానుకుని రాష్ట్రంలో తాగు, సాగునీటి కష్టాలు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, హరిచరణ్రావు, గాజుల రాజేందర్, దేవేందర్నాయక్, సాగర్రావు, సింగరావు తదితరులు పాల్గొన్నారు. జాప్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు కొత్త డ్రామాలు ప్రజల దృష్టి మరల్చేందుకు ఎత్తు పేరుతో కొత్త పల్లవి రేవంత్కు ఫోర్త్ సిటీపై ఉన్న శ్రద్ధ ప్రజాసంక్షేమంపై లేదు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే రేవంత్దే బాధ్యత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి -
మెట్పల్లి జూనియర్ సివిల్ జడ్జిగా మాధవి
మెట్పల్లి: పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్గా వినుకొండ మాధవి గురువారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న అరుణ్కుమార్ను రంగారెడ్డి జిల్లా అమనగల్లుకు బదిలీ చేసి.. ఆయన స్థానంలో మాధవిని నియమించారు. ఆమెను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి, పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొండగట్టులో పూజలు మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మెట్పల్లి జూనియర్ సివిల్, ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ వినుకొండ మాధవి కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. నీతి ఆయోగ్ రూపొందించిన దివ్య భారత్ నివేదికలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం స్థానం పొందడంపై ఆలయ ఈవో అంజనారెడ్డి, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. -
అందరి కృషితోనే..
అందరి కృషితో మెరుగైన ఫలితాలు సాధించాం. 98.87 శాతంతో రాష్ట్రంలో రెండోసారి నాల్గో స్థానంలో నిలిచాం. ఉపాధ్యాయుల మార్గదర్శకం, తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణంగా నిలిచింది. – సత్యప్రసాద్, కలెక్టర్ ప్రణాళిక ప్రకారం ముందుకు.. పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాం. కలెక్టర్ చొరవ ప్రత్యేకం. ముఖాముఖీ నిర్వహించారు. సబ్జెక్ట్ల వారిగా సలహాలు ఇచ్చారు. వారిలో భయం పోగొట్టారు. – రాము, డీఈవో -
ఆర్వోబీ పనుల ఆలస్యంపై మేయర్ ఆగ్రహం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనుల్లో విపరీత జాప్యం పట్ల మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పనులు పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలో గుంతల రోడ్డు, దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూసేకరణ సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో సాగడంలేదన్నారు. ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టు ప్రత్యేక చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నారు. పనులు ప్రారంభించిన ఒక పక్క త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు కొంత ఇబ్బందులను తొలగించాలన్నారు. కార్యక్రమంలో రైల్వే ఏడీఈఎన్ భిక్షపతి, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సంతోష్, సాదినేని మునిందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘కొప్పుల’ను విమర్శించడం మానుకోవాలి
ధర్మపురి: అభివృద్ధి పనులు చేయకుండా.. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ను విమర్శించడం మానుకోవాలని డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి అన్నారు. ధర్మపురిలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా... ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయారని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ కనిపిస్తున్నాయని, కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ పాలనలోనే ప్రతిపాదనలు వచ్చాయన్నారు. గోదావరి పుష్కరాలకు ఏడాది మాత్రమే సమయం ఉందని, ఎక్కడా పని మొదలు పెట్టలేదని పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, నాయకులు అయ్యోరి రాజేష్, బండారి రంజిత్, చిలువేరు శ్యామ్సుందర్ తదితరులున్నారు. ఇసుక మాఫియాపై సస్పెక్ట్ షీట్లుకరీంనగర్రూరల్: ఇసుక అక్రమ రవాణాదారులపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తున్నట్లు కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. బుధవారం ఇసుక అక్రమ రవాణా చేస్తు పట్టుబడిన నగునూరుకు చెందిన వల్లెపు వెంకటేశ్, ఇరుకుల్లకు చెందిన సంకరి శ్రీనివాస్లను తహసీల్దార్ ఎదుట రూ.లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు వివరించారు. అయినా పలుమార్లు ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన బొమ్మకల్కు చెందిన గాలిపల్లి నరేందర్, నేరెల్ల శ్రీనివాస్పై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 16మంది ఇసుక అక్రమరవాణదారులపై సస్పెక్ట్షీట్లు ఓపెన్ చేయడం జరిగిందని, మరోమారు పట్టుబడినట్లయితే పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని సీఐ నిరంజన్రెడ్డి హెచ్చరించారు. పురుడుపోసిన 108 సిబ్బంది ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని కందికట్కూర్ గ్రామంలో బిహార్కు చెందిన భార్యాభర్తలు పూజభవాని, కరంబీర్ నివాసముంటున్నారు. పూజభవాని నిండు గర్భిణి. మంగళవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారమిచ్చారు. ప్రసవం కోసం వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఆశావర్కర్ సాయంతో 108 సిబ్బంది కూనబోయిన రాజశేఖర్, చెరకు దినేశ్ పురుడుపోయగా, మగబిడ్డ జన్మించాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఖేలో ఇండియా ఫుట్బాల్ విజేతగా కరీంనగర్రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఖే లో ఇండియా అండర్–16 బాలికల ఫుట్బాల్ పోటీలు బుధవారం ముగిశాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన పోటీల్లో కరీంనగర్, రంగారెడ్డి జట్లు ఫైనల్స్కు చేరాయి. కరీంనగర్ జట్టు 1–0 తేడాతో ఛాంపియన్గా, రంగారెడ్డి జట్టు రన్నరప్గా నిలిచాయి. క్రీడలకు సమయం కేటాయించాలి క్రీడల కోసం సమయం కేటాయించాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఖేలో ఇండియా పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో ఉన్నతంగా రాణించాలంటే పట్టుదల ముఖ్యమన్నారు. స్థానిక ఠాగూర్ స్టేడియంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. మందమర్రి జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, స్థానిక ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ డాక్టర్ మధుకుమార్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రాయికల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ మండలం అయోధ్య, పట్టణంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అదనంగా మరో రెండు వేల ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, కౌన్సిలర్లు రాకేశ్, పల్లికొండ గంగాధర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్రావు, నాయకులు కోల శ్రీనివాస్, ఏనుగు మల్లారెడ్డి, గన్నె రాజిరెడ్డి, సురేశ్, వినోద్, నర్సయ్య, ముత్తయ్య, మాజీ సర్పంచ్ జీవన్రెడ్డి, ఉపసర్పంచ్ రాజేశం, మాజీ ఎంపీటీసీ రవి పాల్గొన్నారు. -
‘పది’లో ‘అల్ఫోర్స్’ విద్యార్థుల హవా
కొత్తపల్లి(కరీంనగర్): పదోతరగతి 2025–26 వార్షిక పరీక్షల ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులతో హవా కొనసాగించారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించినవారిని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి అభినందించారు. అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కు చెందిన ఆర్.సాత్విక్ 589/600 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఓ.ఆద్య, టి.రాజు, బి.అక్షిత్ రెడ్డి 588 మార్కులు సాధించినట్లు తెలిపారు. 1,274 మందికి 1,026 మంది 500 మార్కులు, ఆపై సాధించడం అభినందనీయమన్నారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా సాధించగా. 334 మంది విద్యార్థులు 560 మార్కులు పైగా సాధించి సత్తాచాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
జగిత్యాలరూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సత్యప్రసాద్ రైతులకు సూచించారు. రూరల్ మండలం చల్గల్, తాటిపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు. పారదర్శకంగా, వేగంగా కొనుగోలు ప్రక్రియ సాగాలని అధికారులను ఆదేశించారు. వాహనాలను మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, షేడ్నెట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాతావరణం మార్పుల దృష్ట్యా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరన్, తహసీల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం..
ఎస్.రిశ్వంత్బి.రిషికజి.అనువంశీకఆర్.అనూష్కబి.చరణ్యమల్లాపూర్: మల్లాపూర్ మండలంలో 436మందికి 436మంది ఉత్తీర్ణులైనట్లు ఎంఈవో దామోదర్రెడ్డి తెలిపారు. మొగిలిపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఆర్.అనుష్క(574/600), జి.అనువంశీక(573/600), బి.రిషిక(572/600), రేగుంట జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని బి.లయశ్రీ(571/600), మల్లాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎస్.రిశ్వంత్(570/600), బి.చరణ్య(568/600) మండల టాపర్లుగా నిలిచారు. -
కథలాపూర్లో 99.08 శాతం ఉత్తీర్ణత
కథలాపూర్: మండలంలో 99.08 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. నక్క వేదాక్షరి 563 మార్కులతో మండల టాపర్గా నిలిచింది. మామిండ్ల లాస్యవర్ధిని 562 మార్కులతో ద్వితీయస్థానంలో నిలిచింది. భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్కు చెందిన కూన శ్రీహిత 560, గంభీర్పూర్ జెడ్పీ హైస్కూల్కు చెందిన పోతు మాధవి 560 మార్కులు సాధించారు. మండలంలో 12 ప్రభుత్వ పాఠశాలల నుంచి 436 మంది పరీక్ష రాయగా 432 మంది ఉత్తీర్ణులయ్యారు. తక్కళ్లపెల్లి, బొమ్మెన, కథలాపూర్ గంభీర్పూర్, పోతారం, తాండ్య్రాల జెడ్పీ హైస్కూల్, మోడల్ స్కూల్, కేజీబీవీ వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. తండ్రి వ్యవసాయ కూలీ.. తల్లి టైలరింగ్ నక్క వేదాక్షరి తండ్రి వీవోఏ, వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి టైలరింగ్ చేస్తోంది. ఒకగానొక్క కూతురు వేదాక్షరి మండల టాపర్గా నిలిచింది.కూన శ్రీహితపోతు మాధవిలాస్యవర్ధిని -
కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతుల ధర్నా
ఇబ్రహీంపట్నం: లారీల కొరత తీర్చాలని, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చే స్తూ.. రైతులు వ్యవసాయ మార్కెట్యార్డు ముందు రోడ్డుపై బైఠాయించారు. 20వేల బస్తాలు ఐదు రోజుల క్రితం కాంటా అయ్యాయయని, లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిపివేశారని, అకాలవర్షం పడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ వరప్రసాద్, ఎస్సై నవీన్కుమార్ రైతుల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు నల్ల రమేశ్, రైతులు పాల్గొన్నారు. -
మండల టాపర్లుగా రైతు బిడ్డలు
ఇబ్రహీంపట్నం: పది ఫలితాల్లో రైతుబిడ్డలు మండల టాపర్లుగా నిలిచారు. గోధూర్కు చెందిన గిన్నె ప్రణిత 578 మార్కులతో మండల టాపర్గా నిలిచింది. తల్లిదండ్రులు రమ, రాజ్కుమార్ వ్యవసాయ చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. అలాగే తిమ్మాపూర్కు చెందిన బోడ హర్షిణి 569 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు సంగీత, శ్రీనివాస్ వ్యవసాయదారులు. బీడీలు చుట్టే సమయంలో తల్లికి తోడుగా వైష్ణవి చేదోడువాదోడుగా నిలుస్తోంది. గిన్నె ప్రణితబోడ హర్షిణి -
శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మెట్పల్లిరూరల్: జగ్గాసాగర్లో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి(కొండస్వామి) బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బండలింగాపూర్లోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఎదుర్కోలుగా తీసుకొచ్చి కల్యాణం జరిపించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్పంచ్ పుల్ల జగన్గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, ఉపసర్పంచ్ లక్మ చిన్నయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లిరాయికల్: మండలంలోని ఇటిక్యాలలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలతో శోభాయాత్రగా రేణుకాఎల్లమ్మ ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించారు. ఆలయంలో పట్నాలు వేశారు. అన్నప్రసాద వితరణ చేశారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.నృసింహుని సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి: శ్రీలక్షీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి జయంత్యోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. -
ఆలయాల అభివృద్ధికి కృషి
ధర్మపురి: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని సోమవారం కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్, దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలి కా రు. గోదావరి పుష్కరాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ధర్మపురితో పా టు భద్రాచలంలోని శ్రీరామచంద్రస్వామి, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర, బాసరలోని సరస్వతీ అమ్మవారి ఆలయాలను అభివృద్ది చేస్తామన్నారు. ధర్మపురిలో మాస్టర్ప్లాన్ అమలు నృసింహస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ అమలు చేయాలని, ఇందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి అధికారులను ఆదేశించారు. 1400 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మపురిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ అన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, ము న్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, దేవస్థానం ఈవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, గడ్డం వివేక్వెంకటస్వామి -
కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరిబాబు మెట్పల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు సూచించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉందని, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కేంద్రం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజల్లోకి తీసుకపోవాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూదరి అరుణ, అనూప్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి శ్రీనివాస్, నాయకులు ధర్మపురి వేణు, కొయ్యల లక్ష్మణ్, లోలపు అనిల్ తదితరులున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా నవీన్ బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకులు దొనికెల నవీన్ను నియమించారు. నియామక పత్రాన్ని యాదగిరిబాబు అందించారు. నవీన్ గతంలో ఏబీవీపీ, బీజేవైఎంలో పలు పదవులు నిర్వహించారు. పట్టణంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. -
తిప్పలు పెడుతున్నారు
మక్కలు కొంటామంటూనే లేనిపోని నిబంధనలు పెట్టి రైతులను తిప్పలు పెడుతున్నారు. పంట పండించడం ప్రభుత్వ దృష్టిలో తప్పుగా మారింది. 40 క్వింటాళ్లు పండిస్తే 25 క్వింటాళ్లు కొంటామనడం ఎంతవరకు సబబు..? ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి రైతులకు అండగా నిలవాలి. – పన్నాల తిరుపతి రెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకుడుప్రభుత్వ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే మక్కలు కొంటున్నాం. కొనుగోలు చేసిన మక్కలను నిల్వ చేసేందుకు గోదాంలను పరిశీలిస్తున్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తాం. ఎండీ.హబీబ్, జిల్లా మార్క్ఫెడ్ అధికారి -
ఇంటర్ బోర్డు నిఘా పెట్టాలి
ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరుతో టీచర్లు, అధ్యాపకులను మానసికంగా వేధించడం మానుకోవాలి. సెలవు దినాల్లోనూ పనులు చేయించుకునే పద్ధతికి స్వస్తి చెప్పాలి. టీచర్లు, అధ్యాపకులను బోధనేతర పనులకు ఉపయోగించుకోవడం సరికాదు. వర్క్షాపుల పేరుతో మానసిక ఇబ్బందులకు గురి చేస్తే స హించేదిలేదు. ఇన్ని చేస్తున్నా చాలా విద్యాసంస్థల్లో జీతాలు కూడా సరిగా ఇవ్వ డం లేదు. ఇలాంటి యాజమాన్యాలపై ఇంటర్బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలి. – కె.రాణాప్రతాప్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి -
మక్కల కొనుగోలులో కొర్రీలు
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్లో రైతులు పండించిన మక్కలను కొంటున్న మార్క్ఫెడ్ సంస్థ.. రైతులకు అనేక కొర్రీలు పెడుతోంది. ఫలితంగా కష్టపడి పంట పండించినప్పటికీ అమ్ముకునేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వంతో పోరాడే మార్గం లేకపోవడం.. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి యాసంగి సీజన్లో జిల్లాలో దాదాపు 46,298 ఎకరాల్లో సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన దాదాపు 16 నుంచి 18 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400కాగా.. బహిరంగ మార్కెట్లో క్వింటాల్కు రూ.1800గా ఉంది. రైతుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. గతంలో లేనివిధంగా మార్క్ఫెడ్ లేనిపోని కొర్రీలు పెడుతోంది. ఫలితంగా మద్దతు ధర రైతులకు అందకుండాపోతోంది. తక్కువ ధరకు దళారులకు విక్రయం నిబంధనలు తెలియని రైతులు పంటను కేంద్రంలో పోస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు వచ్చి ఇన్ని నిబంధనలు చెప్పేసరికి నోరెళ్లపెడుతున్నారు. అక్కడ 25 క్వింటాళ్లు విక్రయించి మిగిలిన పంటను దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇలా లేనిపోని నిబంధనలతో చాలా మంది రైతులు ఇప్పటికే క్వింటాల్కు రూ.1800 నుంచి రూ.1900 చొప్పున కోళ్ల ఫారాలు, వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1.50లక్షల క్వింటాళ్ల మక్కలు కొన్నప్పటికీ ఒక్క రైతుకు కూడా రూపాయి జమ చేయలేదు. డబ్బులు రావాలంటే 15 నుంచి నెలరోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. నత్తనడకన కొనుగోళ్లు మక్కల కొనుగోళ్లు నత్తనడకన నడుస్తున్నాయి. రోజు 40 నుంచి 50 లారీల మక్కలు కొంటున్నట్లు అధికారులు చెబుతున్నా అన్ని కేంద్రాల్లో భారీగానే పేరుకుపోతున్నాయి. మార్క్ఫెడ్కు ఊహించని రీతిలో మక్కలు వస్తుండటంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. మక్కలను నిల్వ చేసేందుకు గోదాంలు దొరకకపోవడంతో తూకం వేసిన బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయి. పంట ఎంతొచ్చినా.. కొనేది 25 క్వింటాళ్లే! మొక్కజొన్న ఎకరాన 40 క్వింటాళ్ల దిగుబడి విధి లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతులు మక్కలు పండించినట్లు పోర్టల్లో ఉంటేనే కొనుగోలు25 క్వింటాళ్లే కొనుగోలు మక్కలను మార్క్ఫెడ్కు అమ్మాలంటే ముందుగా పంట సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ పోర్టల్లో నమోదు చేసి ఉండాలి. ఇన్ని ఎకరాల్లో వేసినట్లు ఏఈవోలకు సమాచారం ఇవ్వకపోయినా.. ఒకవేళ ఏఈవో ఏదో కారణంతో నమోదు చేయకపోయినా ప్రస్తుతం అమ్ముకునే పరిస్థితి లేదు. ఎకరాకు ఎన్ని క్వింటాళ్లు పండించినా 25 క్వింటాళ్లే కొంటున్నారు. రైతులు ఇతర రైతుల పేర్లపై నమోదు చేయించుకుని పంటను విక్రయించుకో వాల్సిన దుస్థితి వచ్చింది. పైగా రైతు విక్రయించే సమయంలో వేలిముద్ర తప్పనిసరి చేయడం రైతులను మరింత క్షోభకు గురిచేస్తోంది. -
బతుకు పోరాటం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘మీ ఇంట్లో పిల్లలు ఎంత మంది. ఏం చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారు.. మా పాఠశాల/కళాశాలలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉంటుంది. ఫలితాలు చూడండంటూ’ పేపర్లు చూపుతున్నారు. సీటు ఇప్పుడు కన్ఫార్మ్ చేసుకుంటే ఫీజులో రాయితీ ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. తల్లిదండ్రుల నంబర్లు తీసుకుని రోజూ నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు. తమకు టార్గెట్లు ఉన్నాయంటూ వేడుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు లేక 45 డిగ్రీల సెల్సియస్ ఎండల్లో ఉదయం, సాయంత్రం యాజమాన్యాలు ఇచ్చిన టార్గెట్ల కోసం కష్టపడుతున్నారు. మండే ఎండలు ఒకవైపు, వీధి కుక్కలు మరోవైపు, పిల్లల కోసం తలుపులు తడితే ఛీత్కరించుకునే ఇంటి యజమానుల మాట లను భరించుకుంటూ బతుకు బండి లాగేందుకు ప్రయాసపడుతున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు టీచర్లు. సెలవులు లేని కొలువు పనిచేసేది పాఠశాలలోనైనా సెలవనే మాట ఉండదు. ఆదివారమైనా.. వేసవి సెలవులైనా, పండుగలైనా.. పాఠశాల కోసం పని చేయాల్సిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. యాజమాన్యం ఇచ్చి న టార్గెట్ చేయించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. అందుకే వేసవి సెలవుల్లోనూ ఇంటింటికి తిరుగుతూ ‘మీ పిల్లలను మా విద్యాసంస్థల్లో చేర్పించండి.. ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తాం’ అంటూ తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. మెడపై అడ్మిషన్ల కత్తి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు భారీగా చేయాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆ సంఖ్యను బట్టే జీతా ల చెల్లింపు.. ఇంక్రిమెంట్లు, ఉద్యోగభద్రత ఉంటుందని చెప్పడంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని, ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహించి దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో 15 వేల మందికిపైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా అందరిదీ అదే పరిస్థితి.ఉద్యోగులతో వెట్టిచాకిరీ... అడ్మిషన్ల టార్గెట్లే కాకుండా.. యాజమాన్యాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 10 నుంచి 12గంటలు పని చేయాలని, శని, ఆదివారం, జాతీయ సెలవు దినాలు, పండుగ రోజుల్లోనూ స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదంటున్నారు. టీటీసీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సులు చేసి ఉపాధి కోసం పని చేస్తున్నామని, ఇక్కడ ఉద్యోగ భద్రత లేకపోగా పని ఒత్తిడి చేస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులు కరీంనగర్ 298 6,254 రాజన్న సిరిసిల్ల 132 1,555 పెద్దపల్లి 192 4,224 జగిత్యాల 292 3,480 -
బాలికల భద్రతకు భరోసా
జగిత్యాల: బాలికల భద్రతకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. జిల్లాకేంద్రంలోని ఐడీవోసీలో బాలల భద్రత, డ్రగ్స్ వద్దని చెప్పండి కార్యక్రమంలో భాగంగా మంగళవా రం స్నేహగ్రూప్ కౌమార బాలికలకు అవగా హన కల్పించారు. బాల్య వివాహాలు, టీనేజ్లో గర్భధారణలు, ఎలో ప్మెంట్ కేసులు, ఆన్లైన్ ప్రేమలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు తదితర విషయాల గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజ్కుమార్, డీఆర్డీవో రఘువరన్, డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి, ఎంప్లాయ్మెంట్ అధికారి సత్తమ్మ పాల్గొన్నారు. భగ్గుమంటున్న భానుడు జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45.8 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 45.8, కోరుట్ల, పెగడపల్లి, కొడిమ్యాల మండలం పూడూర్, ఎండపల్లి మండలం గుల్లకోటలో 45.7, ధర్మపురి మండలం జైనా, బీర్పూర్ మండలం కొల్వాయి, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్లో 45.6, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 45.4, బుగ్గారం మండలం సిరికొండలో 45.3, మెట్పల్లి, రాయికల్, గొల్లపల్లిలో 45.1, కోరుట్ల మండలం అయిలాపూర్, అల్లీపూర్లో 45 డిగ్రీల చొప్పున నమోదైందిరాయికల్ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికరాయికల్: రాయికల్ మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులను మంగళవారం ఎన్నుకున్నారు. ముందుగా చైర్మన్ కట్కం రవి, కమిషనర్ కీర్తి నాగారాజు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సభ్యుల మద్దతుతో కో–ఆప్షన్ సభ్యులుగా మాజీ వార్డు మెంబర్ సుధవేని లత, మాజీ కౌన్సిలర్ వల్లకొండ మహేశ్, మైనార్టీ కోటాలో ఇర్ఫాన్ ఆలీ, ఇంతియాజ్పర్వీన్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తాగునీటి సమస్యపై దృష్టిరాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య, పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చైర్మన్ రవీందర్ తెలిపారు. బల్దియా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన మంగళవారం సాధారణ సమావేశం నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ.. అమృత్–2 పనులు పెండింగ్లో ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని, సీసీ రోడ్లకు మరమ్మతు చేపట్టాలని కోరారు. అనంతరం 25అంశాలను ఆమోదించారు. కమిషనర్ కీర్తి నాగరాజు, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కౌన్సిలర్లు ప్రశాంతి, రాకేష్ నాయక్, మానస, మౌనిక, లతిక, గంగాధర్, మహేశ్వరి, గంగలక్ష్మి, శ్రీధర్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు. అంజన్న సన్నిధిలో దేవాదాయ కమిషనర్ పూజలుమల్యాల:కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి వారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు, ధార్మిక సలహాదారు గోవిందహరి దర్శించుకున్నారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శేషవస్త్రంతో ఈవో అంజనారెడ్డి సన్మానించారు. ఏఈఓ హరిహరనాథ్, సూపరింటెండెంట్ సునీల్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, చిరంజీవ స్వామి, స్థానాచార్యులు కంపీదర్ పాల్గొన్నారు. -
హిందూ ధర్మ సంరక్షణకు పాటుపడాలి
రాయికల్: హిందూధర్మ పరిరక్షణకు హిందువులంతా ఐకమత్యంగా పాటుపడాలని అభయ హిందూ సేవా ఫౌండర్, భగవద్గీత ప్రచారకులు రాధామనోహర్ దాస్ పిలుపునిచ్చారు. పట్టణంలో మంగళవారం రాత్రి నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచమొత్తం మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని, మన ఆచార సంప్రదాయాలను అలవర్చుకుంటున్నాయని తెలిపారు. అలాంటి దేశాన్ని కొన్ని దుష్టశక్తులు విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని కోరారు. ఆవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్టేనన్నారు. అనంతరం గోపూజ చేశారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భజన సంకీర్తనలతో పట్టణం మారుమోగింది. తెలంగాణ ప్రాంత గ్రామ వికాస ప్రముఖ్ జిన్నా సత్యనారాయణ రెడ్డి, మచ్చ జ్యోత్స్న, హిందూ సమ్మేళన్ అధ్యక్షులు ఎలగందుల రమేశ్, ప్రధాన కార్యదర్శి దాసరి గంగాధర్, భక్తులు పాల్గొన్నారు. ఆవుకు పూజ చేస్తున్న రాధామనోహర్ దాస్ హారతులు ఇస్తున్న మహిళలు ఆవులో సకల దేవతలు భగవద్గీత ప్రచారకులు రాధామనోహర్ దాస్ -
ఎస్పీని కలిసిన మెట్పల్లి సీఐ
జగిత్యాలక్రైం: మెట్పల్లి సీఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సురేశ్బాబు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాలజోన్: కోర్టుల్లో పెండింగ్ కేసులు తగ్గించేందుకు జడ్జిలు కృషి చేస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. జిల్లా మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజకోహిర్కర్ గోదావరిఖని కోర్టుకు బదిలీ కాగా.. ఆమెకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ.. శ్రీనిజ తన మూడేళ్ల పదవి కాలంలో 1076 కేసులు పరిష్కరించారని తెలిపారు. కోర్టు బెంచ్కు న్యాయవాదులు, పోలీసులు సహకరించడంతోనే కేసులు పరిష్కారమయ్యాయని శ్రీనిజ పేర్కొన్నారు. సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ, రెండో అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ఉపాధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి అందె మారుతి పాల్గొన్నారు. అడవి జంతువులకు ప్రాణహాని తలపెట్టొద్దుజగిత్యాలక్రైం: వన్యప్రాణులకు ప్రాణ హాని తలపెడితే క్రి మినల్ కేసులు న మోదు చేస్తామని అటవీ శాఖ అధి కారి రవిప్రసాద్ తెలి పారు. సోమవారం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో రైతు భూక్య రవి తన వరిపంటను రక్షించుకునేందుకు ఈనెల 21న విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడని, విద్యుత్షాక్ తగిలి రెండు అడవి దున్నలు మృతిచెందాయని పేర్కొన్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారని, కొంత భాగం దహనం కాకపోవడంతో అసలు విషయం వెలుగుచూసిందన్నారు. ఈ మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేశామన్నారు. రేచపల్లి బీట్ ఆఫీసర్ గోపాల్, సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్పై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామన్నారు. వన్యప్రాణులను కాపాడాల న్నారు. గ్రామాల్లోకి వస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. రాయికల్: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ఆత్మ చైర్మన్ గంగారెడ్డి అన్నారు. మండలంలోని ఇటిక్యాలలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ సాయిరెడ్డి, ఆర్ఐ దేవదాసు, కార్యదర్శి రాజేశ్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరిస్తున్నాంజగిత్యాలక్రై ం: ఎస్పీ కార్యాలయానికి వస్తున్న బాధితుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించగా.. 14మంది అర్జీలు సమర్పించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడారు. చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. -
మెట్పల్లి కాంగ్రెస్లో సీనియర్ నాయకుల తిరుగుబాటు
మెట్పల్లి: కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు వ్యవహారశైలిపై మెట్పల్లికి చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకులు బహిరంగంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించడం హస్తం గూటిలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగం కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎర్రొల హన్మాండ్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బర్ల సాయన్న, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ యామ రాజయ్య, మాజీ కౌన్సిలర్ ఎండీ.షాకీర్, మాన్కల గంగాధర్, అందె మారుతి, మారంపల్లి శంకర్, ఎలాల సంతోష్రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నర్సింగరావు వైఖరిని వారు తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీలో సీనియర్లను ఏమాత్రం లెక్క చేయడం లేదని, ఆర్థికంగా బలంగా ఉన్న వారిని మాత్రమే చుట్టూ పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నామినేటేడ్ పోస్టుల విషయంలో కాంగ్రెస్ కేడర్ను విస్మరిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను తొందరలోనే అధిష్టానం దృష్టికి తీసుకపోతామని స్పష్టం చేశారు. అసంతృప్తికి కారణాలివే.. ఎదురుదాడికి సిద్ధమవుతున్న జువ్వాడి మద్దతుదారులు -
స్వీయ గణన ప్రారంభం
జగిత్యాల: జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ సోమవారం ప్రారంభమైనట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జనగణన రెండు విడుతలుగా ఉంటుందని, మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన, రెండో విడతలో జనాభా గణన ఉంటుందన్నారు. మే 10 వరకు స్వీయగణనకు అవకాశం ఉందన్నారు. అవగాహన కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇంధన వనరులు నిల్వ ఉంచితే చర్యలు ఇంధన వనరులు నిల్వ ఉంచితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. పెట్రోల్బంక్ యజమానులు, సేల్స్ ఆఫీసర్లతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. పెట్రోల్ కొరత లేకుండా చూడాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బాలల భద్రత, డ్రగ్స్ రహిత పోస్టర్ ఆవిష్కరించారు. మే 2 వరకు వారం పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
మొన్న ఏసీబీ, నేడు విజిలెన్స్..
● 20 మంది బృందంతో రాక ● 7 టీంలతో అసెస్మెంట్ల కొలతలు జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో అటు ఏసీబీ, ఇటు విజిలెన్స్ అధికారులు తనిఖీలతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవలే సుమారు 20 మంది ఏసీబీ అధికారులు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు రికార్డులు పరిశీలించారు. అధికారుల వివరాలు తీసుకుని వెళ్లారు. వాటిపై విచారణ సాగుతోంది. తాజాగా మళ్లీ విజిలెన్స్ అధికారులు సోమవారం ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు తనిఖీ లు చేపట్టారు. గతంలో టౌన్ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజనీరింగ్ సెక్షన్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రికార్డులు తీసుకెళ్లారు. తాజాగా 20 మంది విజిలెన్స్ అధికారులు రాగా.. ఏడు టీంలతో తనిఖీలు చేపట్టారు. భవనాల అసెస్మెంట్ల కొలతలు ఏడు బృందాలు.. 60 మందితో మున్సిపల్ పరిఽ దిలోని పలు ప్రాంతాల్లో పలు భవనాలకు మళ్లీ కొలతలు చేపట్టారు. కొన్ని భవనాల పన్నుల్లో అవకతవకలు జరిగాయని, వారు జాబితా తీసుకుని వచ్చారు. అందులో ఉన్న భవనాలకు వెళ్లి వాటి కొలతలు చేపట్టారు. మున్సిపాలిటిలో ఉన్న వివరాలు, భవన వాస్తవ పరిస్థితుల మధ్య తేడాలను గుర్తించారు. ఆదిలాబాద్లో జోనల్స్థాయి శాస్త్రవేత్తల సమావేశాలుజగిత్యాలఅగ్రికల్చర్: పొలాస జోనల్ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల సమావేశాలను ఆదిలాబాద్లో ఈనెల 28న నిర్వహిస్తున్నారు. వానాకాలం, యాసంగిలో సాగు చేయాల్సిన పంటలు, తెగుళ్లపై చర్చించనున్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్కుమార్ శర్మ అధ్యక్షతన జరగనున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన, విస్తరణ డీన్లు పాల్గొంటారు. -
రాష్ట్రం సాధించిన నేత కేసీఆర్
జగిత్యాల: కుట్రలు, కుతంత్రాలను ఎదురించి ప్రజలందరినీ ఏకం చేసి రాష్ట్రం సాధించిన నేత కేసీఆర్ అని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, దేవేందర్నాయక్, కేసరిబాబు పాల్గొన్నారు. జీవన్రెడ్డి స్వగృహంలో... మాజీమంత్రి జీవన్రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుర్గయ్య, హరిచరణ్రావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రమణ క్యాంప్ కార్యాలయంలో... ఎమ్మెల్సీ ఎల్.రమణ క్యాంప్ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
స్వీయగణనకు సిద్ధంకండి
మల్లాపూర్: జనగణనకు తొలిఘట్టం ప్రారంభమయింది. కేంద్రప్రభుత్వం ప్రజలకు స్వీయగణనకు అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను మే10వ తేదీ వరకు చేసుకోవచ్చు. ప్రజలే స్వయంగా తమ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. తద్వారా జనగణన కు సమయం ఆదా అవుతుందని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో చేపట్టనున్న జనగణన కోసం అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమవుతోంది. జనగణనలో పాల్గొననున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతోపాటు ఇతర సిబ్బందికి గణనపై పూర్తి అవగాహన ఉండేలా శిక్షణ ఇస్తోంది. ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు తీయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా 2021లో జనగణన సాధ్యపడలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్క చేపట్టాలని భావించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందులో భాగంగా గతంలో మ్యానువల్ పద్ధతిలో ఈ జనాభా లెక్కలను సేకరించగా.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ ఈ సారి డిజిటల్ విధానంలో జనగణన ఉండనుంది. అలాగే ప్రజలే నేరుగా తమ వివరాలను సులువుగా నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. స్వీయ గణనలో నమోదు ఇలా.. ఈ జనగణనలో ప్రజలే నేరుగా పాల్గొనే సౌకర్యం ఉంది. ఇటీవల జరిగిన అధికారుల శిక్షణలో స్వీయ నమోదులోనే తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఉద్యోగి తమకు తెలిసిన 10 నుంచి 15 మందికి స్వీయగణనపై వివరాలు వెల్లడించి నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఈ స్వీయ నమోదులో మొదటగా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన https-://se.census.gov.in లోకి వెళ్లాల్సి ఉంది. మొబైల్స్, కంప్యూటర్ల ద్వారా వివరాల నమోదు వెసులుబాటు కల్పించిన కేంద్రప్రభుత్వం ఈ నెల 26 నుంచి మే 10 వరకు అవకాశం -
రూ.కోటి విరాళం
కలియుగ ఇష్టదైవమైన శ్రీపద్మావతి సమేతవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించాం. మాది సామాన్య రైతు కుటుంబం. స్వామివారి ఆశీస్సులతో నా వంతుగా స్వామివారి ఆలయ నిర్మాణానికి రూ.కోటి వెచ్చించిన. ప్రస్తుతం అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. – మరాటి సత్తయ్య, లంబాడిపల్లి దాతలు సహకరిస్తున్నారు దాతల సహకారంతో శ్రీరామ మందిర నిర్మాణం చేపడుతున్నాం. రూ.2కోట్ల అంచనాతో పనులు ప్రారంభించాం. చాలామంది దాతలు ముందుకొస్తున్నారు. వారంరోజుల్లోనే రూ.40లక్షలు విరాళాలు సేకరించాం. నిర్మాణాలకు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తుండడం అభినందనీయం. – జనార్ధన్ రెడ్డి, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ఆలయాలతో ఆధ్యాత్మికత ఆలయాల నిర్మాణంతో హిందూ సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణతోపాటు, ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పూజలతో ప్రజల్లో మానసిక ప్రశాంతతతోపాటు, శాంతియుత జీవన విధానానికి తోడ్పడుతుంది. సామూహిక పూజా కార్యక్రమాలతో ప్రజల్లో ఐక్యత పెంపొందుతుంది. ప్రణీత్ శర్మ, పురోహితులు, మల్యాల -
పెద్దమ్మ తల్లికి బోనం
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలో పెద్దమ్మ తల్లికి ముదిరాజ్ కులస్తులు ఆదివారం బోనాలు చేశారు. ఐదేళ్లకోసారి పెద్దమ్మ తల్లిని అద్దకం కోసం రెండు వారాల క్రితం ఆలయం నుంచి సంఘం భవనానికి తీసుకొచ్చారు. అద్దకం చేసిన తర్వాత పోతరాజుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా గ్రామశివారులోని అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించారు. సర్పంచు బద్దం గోపి, టీజేఎస్ కోరుట్ల ఇన్చార్జి కంతి మోహన్రెడ్డి, మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, ఉపసర్పంచ్ నాంపెల్లి రమేశ్, మెట్పల్లి సీఐ సురేష్బాబు, ఎస్ఐ నవీన్కుమార్, ముదిరాజ్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
విరాళాలతో ఆలయాలు
మల్యాల: మల్యాల మండలంలో ఆధ్యాత్మిక పరిమళాలు విరబూస్తున్నాయి. ఊరూరా ఆలయాల నిర్మాణాలతో ప్రజల్లో భక్తిభావం పెంపొందుతోంది. ఇప్పటికే కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. ఇదేక్రమంలో ఆలయాల నిర్మాణాలకు దాతలు తమ శక్తిని మించి విరాళాలు అందిస్తున్నారు. గ్రామాల్లో ఆలయాల నిర్మాణాల కోసం విశ్రాంత ఉద్యోగులు, నాయకులు చొరవ తీసుకుంటూ నిర్మాణాలకు బాటలు వేస్తున్నారు. రూ.కోటితో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం లంబాడిపల్లి గ్రామంలో అదే గ్రామానికి చెందిన మరాటి సత్తయ్య తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.కోటి వెచ్చించారు. ప్రజలను ఆధ్యాత్మికతవైపు నడిపించేందుకు శ్రీపద్మాసమేత ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టారు. వివిధ గ్రామాల నుండి తరలివస్తున్న భక్తులతో లంబాడిపల్లిలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఇంకా ఆలయ అభివృద్ధికి దాతలు సహకరిస్తున్నారు. ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన మిట్టపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సుమారు రూ.80లక్షలతో అయ్యప్పక్షేత్రం నిర్మించారు. శ్రీదత్తాత్రేయ సాయి ఆలయానికి రూ.50లక్షలు, పోచమ్మ ఆలయానికి రూ.60లక్షలు వెచ్చించారు. మార్కండేయ ఆలయం, శివాలయాల అభివృద్ధికి రూ.30లక్షలు వెచ్చించారు. రామగిరి శ్రీరామ మందిరం రూ.2కోట్లతో నిర్మిస్తున్నారు. మానాల గ్రామంలో నల్లగుట్ట శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు గండ్ర రాఘవేంద్రరావు సుమారు రూ.30లక్షలతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మరో రూ.50లక్షలతో అభివృద్ధి చేస్తున్నారు. తాటిపల్లి శివారులో మల్లెగట్టు మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని సుమారు రూ.25లక్షలతో నిర్మించారు. పోచమ్మ ఆలయాలు, హనుమాన్ ఆలయాల పునరుద్ధరణ చేపడుతున్నారు. ఆలయాల అభివృద్ధికి స్థానికులు విరాళాలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండడంతో ఊరూరా పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం కొనసాగుతోంది. రూ.2కోట్లతో రామమందిర నిర్మాణం.. మండలకేంద్రంలో శ్రీరామమందిర నిర్మానానికి విశ్రాంత ఉద్యోగి ఎల్లాల జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణ కమిటీ ఏర్పాటు చేశారు. దాతల నుండి విరాళాలు సేకరిస్తున్నారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు స్థానికులతో గల్ఫ్లో ఉన్న స్థానికుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న నిర్మాణాలు విరబూస్తున్న ఆధ్యాత్మిక పరిమళాలు -
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని గ్రామాల్లో సోమవారం నుంచి మే 23 వరకు రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లాలోని 64 గ్రామాలను ఎంపిక చేశారు. గతేడాది నిర్వహించిన గ్రామాల్లో కాకుండా ఈ ఏడాది కొత్త గ్రామాలను గుర్తించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందం 8 గ్రామాల్లో రైతులతో చర్చావేదికలు నిర్వహించనుంది. ఒక్కో బృందంలో వ్యవసాయ శాస్త్రవేత్తతోపాటు మండల వ్యవసాయ అధికారి, ఏఈవో, వ్యవసాయ విద్యార్థి ఉండనున్నారు. కార్యక్రమాన్ని పరిశీలించేందుకు నోడల్ అధికారిగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అధికారి కె.రాజేశ్ను నియమించారు. డీఏవో భాస్కర్ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించనున్నారు. సాగు విషయాలు తెలియజేసేందుకు.. పంటల సాగులో రైతులు చేస్తున్న తప్పులు, సాగు ఖర్చు తగ్గించుకునే పద్ధతులు, ఎలాంటి పంటలు పండించాలి..? మార్కెటింగ్ వ్యూహాన్ని ఎలా అమలు చేయాలి..? వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇలా సాగు సంబంధిత విషయాలపై రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా వానాకాలంలో దొడ్డురకం ధాన్యం తగ్గించి సన్నాలు పండించాలని రైతులను కోరనున్నారు. రసాయన ఎరువులను వీలైనంతగా తగ్గించి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించేలా చర్చావేదికలు నిర్వహించనున్నారు. పంట మార్పిడితో ఎలాంటి లాభాలు ఉన్నాయో వివరించనున్నారు. సాగు నీటిని ఉపయోగించే పద్ధతులు, భూసార పరీక్షలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. ప్రధానంగా విత్తనోత్పత్తితో కలిగే లాభాలు, విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడే విషయాలపై చర్చించనున్నారు. నేటినుంచి జిల్లాలోని 64 గ్రామాల్లో సమావేశాలు శాస్త్రవేత్తలు, అధికారులతో 8 బృందాల ఏర్పాటు -
చెరువులపై ఫోకస్
జగిత్యాల: గతంలో హైదరాబాద్లో చెరువులు, కుంటలు కబ్జాకు గురికావడంతో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు. చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపునకు ఏర్పాటు చేసిన హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో టౌన్ప్లానింగ్, రెవెన్యూ ల్యాండ్ సర్వే అధికారులు, మండల పరిధిలో రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, వాగులు, కుంటలను క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్నారు. కమిటీ పరిశీలన మేరకు.. ప్రభుత్వం ఒక ఫార్మట్ ఏర్పాటు చేసి దాని ఆధారంగా నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువులు, కుంటలు, వాగులను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, వాగులను గుర్తించి వాటి ఫొటోలు తీసి ఎంత విస్తీర్ణం, ఆక్రమణకు ఎంత గురైందో నివేదిక పంపించేలా నమూనా జారీ చేశారు. నమూనా ఫాంలో మండలం, విలేజ్, ట్యాంక్, గుర్తించిన తేదీ, ఎంకై ్వరి చేసిన తేదీలను అధికారులకు పంపించాలి. ఇందులో ఫారెస్ట్, తహసీల్దార్, మండల సర్వేయర్, ఎంపీడీవో, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొంటారు. అధికారులు ఏ మేరకు కబ్జాకు గురయ్యాయో వాటిని వివరంగా తీసుకుని జిల్లా ల్యాండ్ సర్వే అధికారులకు పంపిస్తారు. ఇప్పటికే తహసీల్దార్ల ఆధ్వర్యంలో చెరువులను వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని గుర్తిస్తున్నారు. మున్సిపాలిటీలు, మండలస్థాయిలో ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు హద్దులు గుర్తిస్తున్నారు. హైడ్రా తరహాలో అమలయ్యేనా..? జిల్లా కేంద్రంతో పాటు, వివిధ మండలాలు, గ్రామాల్లోని 740 చెరువులు చాలా వరకు కబ్జాకు గురైనవే ఉన్నాయి. వాటికి హద్దులు లేకపోవడంతో ఇష్టానుసారంగా చెరువుల చుట్టే నిర్మాణాలు చేపట్టారు. కొందరు బఫర్ జోన్ పరిధిలో ఇళ్లు సైతం నిర్మించారు. మున్సిపాలిటీల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సైతం భూములకు అత్యధికంగా రేట్లు పలకడంతో చెరువులకు సంబంధించిన భూములపై ఆక్రమణదారుల కన్నుపడి అవి కుదించుకుపోతున్నాయి. దీంతో వరదలు వచ్చినప్పుడు కాలనీలను నీళ్లు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేయడంతో హైడ్రా తరహాలో అమలైతే చెరువులు మళ్లీ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. హైడ్రా తరహాలో అమలు చేయాలని ప్రజలు సైతం కోరుతున్నారు. -
సత్యనారాయణ వ్రతాలు
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అన్నివర్గాల ప్రజలు వ్రతంలో పాల్గొంటారని, ఐక్యత, సమరసతతోపాటు భక్తి భావాన్ని పెంపొందించేందుకే ఈ వ్రతాలు నిర్వహిస్తున్నామని ఆవాసం కమిటీ అధ్యక్షుడు జిడిగె పురుషోత్తం తెలిపారు. సుమారు 200 జంటలు పాల్గొన్నాయి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంచాలక్ భీమనాతిని శంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, చిత్తారి మధుకర్, సురేష్, అశోక్రావు, అవాస ప్రముఖ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. ఆదివారం సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలో గోపినేని రాజమల్లు, లావణ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్రామగ్రామాన పండుగలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయయని, పట్టణంలో 4500 డబుల్ బెడ్ రూం నిర్మించామని పేర్కొన్నారు. నిరుపేదలకు నూతన రేషన్ కార్డు మంజూరు చేసి సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. సర్పంచ్ చెట్లపల్లి రమ, శంకర్ రెడ్డి, రాజు, మాజీ సర్పంచ్లు రమణరావు, శేఖర్ గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కొండగట్టు నిత్యాన్నదాన సత్రానికి రూ.లక్ష విరాళంమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలోని నిత్యాన్నదాన సత్రానికి హన్మకొండకు చెందిన భక్తులు కె.వినయ్కుమార్, కీర్తన దంపతులు విరాళం ఇచ్చారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారి హరిహరనాథ్కు రూ.లక్ష విరాళం అందించారు. ఆలయ సూపరింటెండెంట్ ఉపాద్యాయుల చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. వాసవీమాత ఆశీస్సులు అందరిపై ఉండాలిజగిత్యాలటౌన్: ధర్మం, అసింహ, సమానత్వం ప్రపంచానికి తెలియజేసిన వాసవీమాత ఆశీస్సులు అందరిపై ఉండాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన వాసనీమాత జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో రవికుమార్, కో–ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పదోన్నతితో బదిలీ చేపట్టాలిరాయికల్: ప్రభుత్వ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం రాయికల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బదిలీ ప్రక్రియను జాప్యం లేకుండా జూలైలో చేపట్టాలని, అర్హులకు పదోన్నతి కల్పించాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి పీఆర్సీ అమలు చేయాలని కోరారు. మే 5న జిల్లాకేంద్రంలో చేపట్టే నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేష్, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లె చిన్నయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అంగడి రవీందర్, కన్వీనర్ ముక్కెర శేఖర్, నాయకులు రాజ్ కిశోర్, రమేశ్, సత్యనారాయణ, నాగభూషణం, సురేష్, మధు మండల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, టీఆర్టీఎఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
వీఎల్టీ రద్దు చేయాలని రాస్తారోకో
కోరుట్ల: పట్టణంలోని గడి బురుజుల స్థలంలో వీఎల్టీలు రద్దు చేయాలని, తైబజార్ వసూలు చేయొద్దని స్థానిక కార్గిల్ చౌరస్తా వద్ద అఖిలపక్షాల ప్రతినిధులు, కూరగాయల వ్యాపారులు శనివారం రాస్తారోకో చేశారు. బురుజుల స్థలంలో అక్రమంగా వేసిన వీఎల్టీ నంబర్లు రద్దు చేయించాలన్నారు. తమకు వసతులు కల్పించి తైబజార్ రద్దు చేయించాలని మహిళా రైతులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత భర్త, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఘటన స్థలానికి చేరుకున్నారు. వీఎల్టీల విషయంలో పూర్తి వివరాలు పరిశీలిస్తామని అక్రమంగా వేసినట్లు గుర్తిస్తే రద్దు చేయిస్తామన్నారు. అవసరమైతే కలెక్టర్తో మాట్లాడుతామన్నారు. కూరగాయల వ్యాపారులకు సౌకర్యాల కల్పనలో చర్యలు తీసుకుంటామన్నారు. అఖిలపక్షాల ప్రతినిధులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ముజాహిద్, చింత భూమేశ్వర్, ముజబుర్ రహ్మన్, మహ్మద్ షేక్ షాహిద్, నగేష్, సుతారి రాములు, మానుక ప్రవీన్కుమార్, శికారి గోపి, కూరగాయల వ్యాపారులు పాల్గొన్నారు. వసతుల కోసం రోడ్డెక్కిన కూరగాయల రైతులు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడి హామీతో విరమణ -
భూభారతి సమస్యలు పరిష్కరించాలి
జగిత్యాల: రెవెన్యూ సదస్సుల్లో భూభారతి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నా రు. శనివారం అధికారులతో సమీక్షించారు. సాదా బైనామా, అసైన్డ్ భూములు, డిజిటలైజేషన్ వంటి అంశాలను పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు, డిపాల్టర్ రైస్మిల్లర్లపై ఆర్వోఆర్ చట్టం ప్రకారం తీసుకునే చర్యలు, ఇసుక నిర్వహణ, తడి భూముల నిర్వహణ, సీఏ భూములపై పరిశీలించా లన్నారు. ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. అందుబాటులోకి స్వీయగణన జనగణనలో తొలిసారిగా స్వీయగణన సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. జనగణన ఈనెల 26 నుంచి మే10 వరకు కొనసాగుతుందని, వెబ్సైట్ E.CENU.GOV.IN పోర్టల్ ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను 10–20 నిమిషాల్లో నమోదు చేసుకోవచ్చని, ప్రత్యేకమైన ఐడీ పొందవచ్చన్నారు. ఐడీని భద్రపర్చుకోవాలని, ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు చూపించాలన్నారు. ఉద్యోగులు, సిబ్బంది స్వీయ లెక్కింపులో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. -
కదిలిన బస్సు
జగిత్యాలటౌన్: ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సులను యథావిధిగా నడిపించనున్నట్లు జేఏసీ నాయకులు శంకర్రెడ్డి, రామయ్య తెలిపారు. సమ్మె విరమించి విధులకు హాజరవుతామని పేర్కొన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, రమేశ్రావు, ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలుఇబ్రహీంపట్నం: రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిస్తున్నామని జిల్లా పట్టు పరిశ్రమ అధికారి లత అన్నారు. మండలంలోని మూలరాంపూర్లో రైతులు ఏర్పాటు చేసుకున్న డ్రిప్ పరికరాలను పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90శాతం, సన్న, చిన్నకారు రైతులకు 80 శాతం, ఇతరులకు 70 శాతం సబ్సిడీపై పరికరాలు సరఫరా చేస్తున్నామని, ఆసక్తి గలవారు ఉద్యాన అధికారులను సంప్రదించాలని సూచించారు. ఉద్యాన అధికారి కే.శ్రీనివాస్, విస్తరణ అధికారి శ్రీలత, ఇంజినీర్ సాయికృష్ణ పాల్గొన్నారు. టీబీ నియంత్రణపై అవగాహన కల్పించాలిమల్యాల: టీబీ నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నూకపల్లిలో క్షయ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల నుంచి తెమడ సేకరించారు. ఊపిరితిత్తుల్లో దుమ్ము, దూళి చేరి క్షయవ్యాధి సోకే ప్రమాదం ఉంటుందని, సకాలంలో పరీక్ష చేయించుకుని తొలిదశలో గుర్తిస్తే నియంత్రించవచ్చని పేర్కొన్నారు. మొబైల్ ఎక్స్రే యంత్రం ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చని అన్నారు. పీహెచ్ఈఎన్ నాగలక్ష్మీ, హెచ్ఈఓ రమేశ్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. దోమలు నివారించాలి జగిత్యాల: దోమల నివారిస్తే మలేరియా రాకుండా అడ్డుకోవచ్చని శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మలేరియా దోమకాటుతో వచ్చే వ్యాధి అన్నారు. జ్వరం వస్తే రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు. ప్రోగ్రాం అధికారి అర్చన, స్రవంతి, శ్రీధర్, మురళీధర్ పాల్గొన్నారు. అధికారుల విచారణజగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన పంచాయతీ కార్యదర్శి అనుమతివ్వడం లేదంటూ లబ్ధిదారు రేగుంట గంగు శుక్రవారం పంచాయతీ కార్యదర్శికి రూ.50 వేలు ఇచ్చేందుకు వెళ్లిన విషయం తెల్సిందే. దీనిని శ్రీఇందిరమ్మ ఇంటికి అనుమతివ్వడం లేదని..శ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీ కథనం ప్రచురించడంతో స్పందించిన ఎంపీడీవో సలీం శనివారం గ్రామానికి వెళ్లి గంగును విచారించారు. పంచాయతీ కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంగుపై ఫిర్యాదు గంగు తన విధులకు ఆటంకం కలిగించిందన్న పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అరిఫోద్దీన్ సారంగాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టినట్లు ఎస్సై గీత తెలిపారు. -
తేలిన ‘పరిషత్’ ఓటర్ల లెక్క
జగిత్యాల: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవలే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు పూర్తయినా ప్రాదేశిక ఎన్నికల్లో జాప్యం జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోని ఓటరు జాబితాతోపాటు, తాజాగా ఓటు నమోదు చేసుకున్న వారిని కలిపి శుక్రవారం ముసాయితా జాబితా ప్రకటించారు. పెరిగిన ఓటర్లు 3,278 2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు ఎన్నికల సంఘం ఆమోదం లభించిన ఓటర్లను ఓటరు జాబితాలో చేర్చి సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ లెక్కన అధికారులు ఓటరు జాబితాను సవరణ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 3,278 మంది ఓటర్లు పెరిగాయి. ఇప్పటికే ఆలస్యం జిల్లా, మండల పరిషత్కు సంబంధించి పదవికాలం జూన్ 2024తో ముగిసింది. రెండేళ్లు కావస్తున్నా.. ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గతంలో సర్పంచ్గా ఓడిపోయిన వారితోపాటు, కొత్తవారు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సందడేసందడి ఈనెల 23 వరకు తుది ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవాలని ఎన్నికల సంఘం పేర్కొనడంతో అధికారులు నిర్వహణలో నిమగ్నమయ్యారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సందడి మొదలైంది. గతంలోనే సర్పంచులతోపాటు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. తాజాగా కొంతమేర రిజర్వేషన్లను మార్చే అవకాశం కనిపిస్తోంది. ఈసారి 3,278 మంది ఓటర్లు పెరిగారు. ఓటరు జాబితా ముసాయిదాను ప్రకటించాం. ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి అన్ని సిద్ధం చేశాం. – గౌతమ్రెడ్డి, జెడ్పీ సీఈవో మండలాలు : 20 పంచాయతీలు 385 గతంలో ఓటర్లు 6,07,263 ప్రస్తుత ఓటర్లు 6,10,541 పెరిగిన ఓటర్లు 3,278 పోలింగ్ కేంద్రాలు 1123 ఎంపీటీసీ స్థానాలు 216 జెడ్పీటీసీ స్థానాలు 20


