breaking news
Jagtial
-
మహిళలను అణగదొక్కే కుట్ర
జగిత్యాలటౌన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటూ వేదికలపై ప్రకటనలు చేస్తున్న నాయకులు జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఆరోపించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదన్న ఎమ్మెల్యే మాటలు సత్యదూరమన్నారు. నగర్వాన్ యోజన కింద జగిత్యాల నియోజకవర్గానికి రూ.2కోట్లు మంజూరయ్యాయన్నారు. మొదటి విడతలో రూ.1.4కోట్లు విడుదలవగా దానికి సంబందించిన ఖర్చుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించకపోవడంతోనే మిగతా నిధులు విడుదల కాలేదన్నారు. నియోజకవర్గానికి ఎంపీ అరవింద్ మంజూరు చేయించిన రూ.60కోట్ల నిధులు ఎక్కడికి పోయాయో తెలియడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని, ప్రజల ఆశీశిర్వాదంతో తాను నిలబడి కలబడతానని పేర్కొన్నారు. కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, గట్టిపెల్లి మానస, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, సిరికొండ రాజన్న, ఇట్యాల రాము, పవన్సింగ్, కడార్ల లావణ్య, సింగం పద్మ, మామిడాల కవిత ఉన్నారు. -
సాగునీరు విడుదల చేయాలి
కథలాపూర్(వేములవాడ): రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువ ద్వారా కథలాపూర్ మండలం భూషణ రావుపేట, కథలాపూర్ గ్రామాలకు నీరు విడుదల చేయాలని రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశా రు. రాళ్లవాగు ప్రాజెక్టులో పంటలకు సరిపడా నీళ్లున్నప్పటికీ కాలువల ద్వారా నీరు వదిలే విషయాన్ని అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. వరి పొట్టదశకు వచ్చిందని, కాలువలో చు క్కనీరు లేక పంటలు ఎండిపోయే ప్రమాదముందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి నీరు వదిలి పంటలను కాపాడాలని కోరారు. సర్పంచ్ బద్దం మహేందర్రెడ్డి, రైతు నాయకులు గడ్డం శేఖ ర్రెడ్డి, పూండ్ర జనార్ధన్రెడ్డి, పర్కుటపు గంగారెడ్డి, బోడ మాధవరెడ్డి, శ్రీపాల్రెడ్డి, కూన శ్రీనివాస్, ఏలేటి రాజారెడ్డి, పూల్సింగ్ పాల్గొన్నారు. -
శత లక్ష్యం.. జాప్యం
జగిత్యాల/మెట్పల్లి: జిల్లాలోని మున్సిపాలిటీలు ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకబడ్డాయి. ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. కానీ, ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఆస్తి పన్ను వసూలు కాలేదు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా వసూళ్లలో జగిత్యాల చాలా వెనుకంజలో ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 23 రోజులు ఉన్నాయి. కాగా, మున్సిపల్ ఎన్నికలు వసూళ్లపై తీవ్ర పభావం చూపాయని అధికారులు చెబుతున్నారు. సిబ్బంది అంతా ఎన్నికల పనుల్లో నిమగ్నం కావడంతో సుమారు నెలన్నర పాటు పన్ను వసూళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఈ నెలాఖరులోగా వంద శాతం వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రచారం కరువు మొండి బకాయిదారులకు నోటీసులు వంద శాతం పన్ను వసూళ్ల లక్ష్యానికి అడ్డుగా ఉన్న మొండి బకాయిదారులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకంజ దగ్గరపడుతున్న ఆర్థిక సంవత్సరం వసూళ్లపై మున్సిపల్ ఎన్నికల ప్రభావం లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారుల ప్రయత్నాలుజిల్లాలో వసూళ్లు ఇలా.. (రూ.కోట్లలో) మున్సిపాలిటీ మొత్తం ఇళ్లు లక్ష్యం వసూలైంది జగిత్యాల 27,877 14.03 5.59కోరుట్ల 19,714 5.70 4.78మెట్పల్లి 13,823 4.78 3.32ధర్మపురి 4,849 1.87 56.59(లక్షలు) రాయికల్ 5,527 1.34 88.47(లక్షలు) మొత్తం 71,790 27.72 15.13 -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
వెల్గటూర్(ధర్మపురి): మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్, గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన మహిళా శక్తి సంఘ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. సంఘాల ద్వారా బస్సులను నడిపించడం, పెట్రోల్ బంక్లు, వ్యాపారరంగంలో ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను చేపట్టి, స్వయం ఉపాధి అవకాశాలు చూపించి సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, డీఆర్డీవో రఘువరణ్, సర్పంచ్ సంగ రమేశ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మద్దుల గోపాల్రెడ్డి, మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న జాతర.. సమస్యల పరంపర
కోరుట్ల: దాదాపు లక్ష మంది భక్తులు.. 40 వేల బోనాలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి తరలివచ్చిన భక్తులు. ఇంత మందికి సౌకర్యాలు కల్పించడంలో ముందు జాగ్రత్త వహించాల్సిన దేవాదాయ శాఖ నిర్లిప్తంగా వ్యవహరించిన ఫలితంగా వేలాది మంది తిప్పలు పడ్డారు. పెద్దాపూర్ జాతరకు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, కార్లు, ఆటోల్లో వచ్చే వారు ఉంటారు. పార్కింగ్ పరేషాన్ పెద్దాపూర్ మల్లన్న జాతరకు వెళ్లేందుకు నాలుగు దారులు ఉన్నాయి. కోరుట్ల, ఇస్కాన్ టెంపుల్, కెనాల్ బ్రిడ్జి, కోరుట్ల–కోనరావుపేట రోడ్డు, రాంరావుపల్లి బ్రిడ్జి వెంట మరో రూట్ ఉంది. దీనికి తోడు మెట్పల్లి– ఆరపేట మీదుగా పెద్దాపూర్ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ఉండటం సమస్యాత్మకంగా మారింది. వాహనాలు అంత దూరంలో పార్క్ చేసి ముల్లెమూటలతో భక్తులు ఎండలో నడిచివెళ్లడం ఇబ్బందికరంగా మారింది. దేవాదాయ శాఖ అధికారులు ముందుజాగ్రత్తగా పార్కింగ్ స్థలాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పంటలు సాగు చేసే రైతులకు సీజన్కు సరిపడా డబ్బు చెల్లిస్తే భక్తుల ఇక్కట్లు తప్పేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీస వసతులు కరువు మల్లన్న సన్నిధిలో భక్తిశ్రద్ధలతో బోనాలు వండి నైవేద్యం సమర్పించి మొక్కు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. సుమారు లక్ష మంది భక్తులు హాజరు కావడంతో పాటు 40వేల వరకు బోనాలు తీయడం జరుగుతోంది. బోనాల నైవేద్యం సిద్ధం చేయడానికి దేవాదాయ శాఖ భక్తులకు అరకొరగా టెంట్లు ఏర్పాటు చేసింది. దీంతో ఏటా భక్తులు చెట్ల నీడలో, గ్రామంలోని ఇళ్ల చూరు నీడలో, మురికి కాల్వల పక్కన బోనాలు సిద్ధం చేసుకోవాల్సిన దుస్థితి. ఆలయానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న వసతులు కల్పించాలన్న ధ్యాస ఎవరికి లేకపోవడం గమనార్హం. కాగా, ఆలయానికి వెళ్లే దారివెంట వందలాది షాపులకు అనుమతులు ఇచ్చి కనీసం భక్తులు నడవడానికి రోడ్డు లేని పరిస్థితి కల్పించారు. ఇక నీటి వసతి జాడలేదు. అంబులెన్స్ ఎక్కడ ఉంటుందో కనిపించదు. వైద్య సిబ్బంది మొత్తం ఓ గదిలో అడ్జస్ట్ అయిపోయి ఎవరికి కనిపించకుండా, ఎండ తగలకుండా కాలం గడిపేస్తారు. ముదిరిన ఎండలకు భక్తులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎక్కడి వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. పట్టించుకోని నేతలు ఏళ్ల తరబడి మల్లన్న సన్నిధిలో ఇదే పరిస్థితి ఉన్నా కోరుట్ల నియోజకవర్గ నాయకులు ఎవరికి పట్టింపులేకపోవడం గమనార్హం. కేవలం ఫ్లెక్సీలు పెట్టుకుని, ఆలయం చుట్టూ అసలే ఇరుకుగా ఉన్న తోవల్లో పెద్ద కార్లలో అనుచరగణం వేసుకుని రావడం..మట్టి, దుమ్ము లేచి భక్తులు చేసుకునే నైవేద్యాల్లోకి చేరడం..కళ్లల్లోకి చేరి అవస్థలు పడటం జరుగుతోంది. కళ్ల ముందు భక్తులు పడుతున్న అవస్థలు కనిపిస్తున్నా, నేతలు మాత్రం తమ దారిని తాము వచ్చి వెళ్లిపోవడం తప్ప మార్పు, అభివృద్ధి అనే అంశాలపై దృష్టి పెట్టకపోవడం విడ్డూరంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల కింద వంటలుముల్లెమూటలతో నడిచి వెళ్తున్న భక్తులు పెద్దాపూర్లో గుడికి దూరంగా పార్కింగ్ ముల్లెమూటలతో భక్తుల కాలినడక వంటావార్పునకు చెట్లనీడనే దిక్కు పట్టించుకోని నేతలు -
భక్తిరథం
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఆదివారం సాయంత్రం మువ్వురు స్వాముల రథోత్సవ వేడుకలను కన్నులపండువగా జరిపించారు. లక్ష్మీనృసింహునితో పాటు శ్రీవేంకటేశ్వర, రామలింగేశ్వరస్వాములను ఆలయం ఎదుట రథాలపై ఆసీనులు చేయగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి నంది కూడలి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. తర్వాత ఉత్సవమూర్తులను గోదావరినదికి తీసుకెళ్లి చక్రస్నానం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ స్వామివారలను దర్శించుకున్నారు. పది రోజుల నుంచి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడం జరిగిందని, రానున్న గోదావరి పుష్కరాలను ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. – ధర్మపురి -
వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర అమోఘం
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయరంగంలో మహిళా రైతుల పాత్ర అమోఘమని వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్కుమార్శర్మ అన్నారు. ఆదివారం జగిత్యాలరూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో మహిళా రైతు కిసాన్మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగురంగం ఎప్పటికప్పుడు కొంత పుంతలు తొక్కుతుందని, ఆ మేరకు మహిళా రైతులు ముందుకు రావాలన్నారు. ప్రస్తుతం సాగులో సంప్రదాయకతకు పెద్దపీట వేస్తూ ఆధునిక సాంకేతిక పద్ధతులను ఆచరించాలని సూచించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నీరజ మాట్లాడుతూ, వ్యవసాయంలో వస్తున్న నూతన పోకడలను మహిళా రైతులు పసిగట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలపై డాక్టర్ సరిత, పుట్టగొడుగుల పెంపకంపై డాక్టర్ ఎల్లాగౌడ్, వరి విత్తనోత్పత్తిపై డాక్టర్ మధుకర్, కూరగాయల పెంపకంపై డాక్టర్ స్వాతి రైతులకు వివరించారు. అలాగే, విద్యార్థినులు పలు రకాల విత్తనాలను ప్రదర్శనగా ఉంచారు. పలు పంటలపై శాస్త్రవేత్తలు రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కోరుట్ల ఏడీఏ రమేశ్, రైతులు పాల్గొన్నారు. -
పెద్దవాగులో అడ్డగోలు తవ్వకాలు
మెట్పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డగోలుగా జరగుతున్నాయి. ఆదివారం ఉదయాన్నే వాగులోకి భారీగా వచ్చిన ట్రాక్టర్లు పెద్ద ఎత్తున్న ఇసుకను తరలించాయి. ఒక్కసారిగా 50కి పైగా ట్రాక్టర్లు రాగా, ట్రిప్పునకు రూ.1,000 చొప్పున వీడీసీ వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఇసుక అక్రమ రవాణా విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆదివారం పెద్దాపూర్ మల్లన్న జాతర ఉందని అధికార యంత్రాంగం అక్కడే ఉండిపోతుందని భావించిన వీడీసీ సభ్యులు ముందుగానే ఇసుక వ్యాపారులకు ఫోన్ చేసి ఇసుక తీస్తున్నట్లు చెప్పినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇసుక కోసం భారీగా ట్రాక్టర్లు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇసుక తవ్వకాలు, రవాణా విషయంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆ ప్రాంతానికి సిబ్బందిని పంపించారు. ఇది గమనించిన ఇసుక వ్యాపారులు కొందరు అక్కడి నుంచి జారుకోగా, నాలుగు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. కాగా, ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఆత్మకూర్ వీడీసీ అధ్యక్షుడి ఓ ఆడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. -
గుర్తు తెలియని మృతదేహం
కరీంనగర్క్రైం: కరీంనగర్ కలెక్టరేట్ రోడ్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కిందపడిపోగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఈనెల 6వ తేదీన మధ్యాహ్నం కలెక్టరేట్ రోడ్లో ఓ వ్యక్తి కిందపడిపోగా అతడిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతదేహం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. వ్యక్తి వయసు సుమారు 55ఏళ్లకు పైగా ఉంటుందని, గుర్తు పట్టినవారు వన్టౌన్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. -
స్వయం కృషి.. ఆర్థిక స్వావలంబన
ధర్మపురి: కుటుంబ పోషణలో భర్తలకు దీటుగా పని చేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్న పలువురు మహిళలు మహారాణులుగా ఎదుగుతున్నారు. ఒకరి వద్ద పని చేసేకంటే స్వయంకృషితో పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ధర్మపురికి చెందిన కొల్లూరి లక్ష్మి, వీరబాబు దంపతులు చిన్నపాటి పూజాసామగ్రి దుకాణంతో కుటుంబాన్ని నడిపించారు. వీరికి కూతురు, కొడుకు సంతానం. బీటెక్, డిగ్రీ చదువుతున్నారు. ఖర్చులు పెరగడంతో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ఈనేపథ్యంలో లక్ష్మి ఆలోచనతో పట్టణంలోని గోదావరి ఒడ్డున అగరుబత్తీలు తయారు చేసే కుటీర పరిశ్రమను ప్రారంభించారు. ఇందుకు మహిళా సంఘం నుంచి రూ.2లక్షలు రుణం తీసుకున్నారు. పిల్లలు తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే చదువుకుంటున్నారు. రోజూ రెండురకాలైన 10 కిలోల అగరుబత్తీలు తయారు చేసి పట్టణంలోని దుకాణాల్లో విక్రయిస్తారు. అగర్బత్తీల తయారీకి ఆలయంలో వాడిన పూలను తీసుకొచ్చి ఎండబెట్టి వాటి పౌడర్ను వినియోగిస్తారు. ప్రస్తుతం రెండు చిన్నపాటి మిషన్లతో పాటు ఒక పండి గిర్నీ నడిపిస్తున్నారు. కుటుంబమంతా పని చేస్తూ రోజూ రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకానికి నోచుకోలేదని, సబ్సిడీ ఇస్తే కుటిర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి నలుగురికి ఉపాధి కల్పిస్తానని లక్ష్మి తెలిపారు. -
నాడు బీడీకార్మికురాలు.. నేడు అధ్యాపకురాలు
కరీంనగర్సిటీ: వారిది నిరుపేద చేనేత కుటుంబం.. తల్లీ బీడీ కార్మికురాలు.. తల్లికి చేదోడువాదోడుగా బీడీలు చేస్తూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన శ్రీవాణి. ఆమె చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ర్యాంకులు, బంగారు పతకాలతో సాగింది. ఎలిగేడు జెడ్పీ స్కూల్లో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో, కరీంనగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అన్ని సబ్జెక్టుల్లో మొదటి ర్యాంకు సాధించింది. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 9వ ర్యాంకు, ఎంఏ ఎకనామిక్స్లో ఫస్ట్ ర్యాంకుతో 3 బంగారు పతకాలు కై వసం చేసుకుంది. ఒకే ఏడాదిలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో అర్థశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీవాణి విద్యారంగంలో అత్యున్నతంగా రాణిస్తున్నందుకు పలు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఈసందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక కారణాలతో చాలామంది మట్టిలో మాణిక్యాలు బయటి ప్రపంచానికి రాలేకపోతున్నారని, అలాంటివారిని గుర్తించి విద్యా పరిశోధనా రంగంలో తీర్చిదిద్దుతానని, శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. -
‘సాక్షి’ చక్కటి అవకాశం కల్పించింది
డబుల్బెడ్రూమ్ కాలనీలో సమస్యలు తెలుసుకున్న. సాక్షి యాజమాన్యం నన్ను స్టార్ రిపోర్టర్గా ప్రజల మధ్యకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడి సమస్యలు తెలుసుకున్న. తాగునీరు, వైకుంఠధామాలు లేక ఇబ్బందులు పడుతుండ్రు. పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం తదితర సమస్యలను ఎమ్మెల్యే కే.తారకరామారావు, కలెక్టర్ గరీమా అగ్రవాల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. మున్సిపల్ నుంచి ప్రత్యేక దృష్టి సారిస్తాం. మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం కృషి చేస్తుంది. – జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్, సిరిసిల్ల -
కూతురుంటే గర్వపడాలి
కరీంనగర్ అర్బన్: మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మన ఆలోచనా ధోరణే కారణం. ఇందులో మొదటిది ఆడ, మగా అనే వివక్ష. కొడుకు, కూతురు మధ్య వివక్షత చూపొద్దు. చిన్నప్పటి నుంచే ఇద్దరూ సమానమేనని తెలిసేలా పెంచండి. పరిపాలనా పరంగా మహిళలకు అన్ని విషయాల్లో యంత్రాంగం తోడుంటుంది. మహిళలు, పిల్లల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తాం. సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ ద్వారా చిన్నారుల శారీరక పటిష్టతకు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత ద్వారా తోడ్పాటునిస్తాం. – చిత్రామిశ్రా, కలెక్టర్, కరీంనగర్ -
మసాలా సు‘చరిత’
● 2019లో ప్రారంభించి.. 15 మందికి ఉపాధి ● ఆదర్శంగా నిలుస్తున్న సుచరిత జమ్మికుంట(హుజూరాబాద్): స్వయంకృషితో చిరుపరిశ్రమ ప్రారంభించి పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జమ్మికుంట పట్టణానికి చెందిన సుచరిత. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లికి చెందిన వర్మని సుచరిత, రమేశ్ దంపతులు. రమేశ్ ఎలక్టీషియన్. జీవనం కష్టంగా ఉన్న రోజుల్లో చిన్న ఆలోచనతో పెద్ద విజయం సొంతమైంది. కీర్తన మసాల తయారీ, రిటైల్ అండ్ హోల్సేల్ పరిశ్రమను 2019లో ప్రారంభించారు. మొదట ముగ్గురు కుటుంబ సభ్యులు, రూ.3వేల పెట్టుబడితో మసాల ప్యాకెట్లు తయారు చేసి జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లోని కిరాణం షాపుల్లో హోల్సేల్గా విక్రయించారు. మెప్మా, నెహ్రూ గ్రూపుల సాయంతో 2022లో రూ.లక్ష రుణంతో వ్యాన్ కొనుగోలు చేశారు. పీఎంజీ ద్వారా రూ.5లక్షలు రుణంతో మిషన్ కొని మసాలాలు ప్యాకింగ్ చేసి వరంగల్, కరీంనగర్, జనగాం, పెద్దపల్లి, గోదావరిఖని తదితర పట్టణాల్లో హోల్సేల్గా విక్రయిస్తున్నారు. ఏడాదిలో రూ.లక్షల్లో టర్నోవర్ చేస్తూ 15 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. నెలకు రూ.50 వేల ఆదాయం మసాలా తయారీ, అమ్మకంతో నెలకు ఖర్చులు పో నూ రూ.50వేల వరకు ఆ దాయం వస్తుంది. మసాలా తయారీ, ప్యాకింగ్ కో సం 15 మంది మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.10వేల వరకు జీతం ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నాం. స్వయంకృషితో తమ కుటుంబంతో పాటు పలువురికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది. – సుచరిత, కీర్తన మసాలా చిరు పరిశ్రమ, జమ్మికుంట -
దుబాయ్లో కోమాలో జగిత్యాల జిల్లా వాసి
జగిత్యాలక్రైం: దుబాయ్లో కోమాలో ఉన్న జగిత్యాల జిల్లా వాసిని ఆదుకుని, ఆస్పత్రి బిల్లు మాఫీ చేసి స్వదేశానికి రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన నిరుపేద యువకుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. లక్షల్లో పేరుకుపోతున్న బిల్లులు కట్టలేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్పల్లికి చెందిన కొండ్ర రాజేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఇటీవల సోరియాసిస్తో ఫిబ్రవరి 27న దుబాయ్లోని ఆస్టర్ హాస్పిటల్లో చేరిన ఆయన, చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లిపోయాడు. మార్చి 3వ తేదీ నాటికే ఆసుపత్రి బిల్లు ఏకంగా రూ.13,23,383 చేరుకుంది. అంత భారీ మొత్తంలో బిల్లు చెల్లించే స్థోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు యువజన నాయకుడు తలారి రాజేశ్తో కలిసి జగిత్యాలలో మాజీ మంత్రి టి.జీవన్రెడ్డిని ఆశ్రయించారు. స్పందించిన జీవన్రెడ్డి ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్చైర్మన్ మంద భీంరెడ్డితో మాట్లాడి బాధితుడికి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు రాజేశ్ భార్య అనూష శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణికి దరఖాస్తు చేసుకున్నారు. బాధితుడి వివరాలను కేంద్ర ప్రభుత్వ మదద్ పోర్టల్ ద్వారా దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లారు. -
మీ సేవలతోనే ప్రజారోగ్యం
కోరుట్ల: మీరు చేసే సేవలతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు.. అలాంటి మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం.. ఏమైనా సమస్యలు ఉంటే నాతో నేరుగా చెప్పండి.. పరిష్కారానికి కృషిచేస్తాను.. అంటూ కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత–గంగాధర్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీసాక్షిశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిబేట్లో మహిళా పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. కార్మికుల మంచి, చెడు తెలుసుకున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడి మున్సిపల్ తరఫున అందాల్సినవి అందుతున్నాయో.. లేదో తెలుసుకున్నారు. మహిళా కార్మికులకు మున్సిపల్ తరఫున ప్రతీ మూడు నెలలకోసారి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాత్రి వేళ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరికి ఆఫ్రన్, చీరలు, పార, తట్టలు ఎప్పటికప్పుడు కొత్తవి ఇస్తామన్నారు. ఎవరికై నా ఆఫ్రన్లు, చెప్పులు అందకుంటే తనకు తెలపాలని సూచించారు. స్థానికంగా నయంకాని అనారోగ్య సమస్యలు ఉంటే హైదరాబాద్లో ఈఎస్ఐ ఆస్పత్రి సౌకర్యాలు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. మున్సిపల్లో పనిచేస్తున్న 40 మంది మహిళా కార్మికులకు ఈఎస్ఐ వసతి ఉందని తెలిపారు. ఇటీవల ఓ మహిళా కార్మికురాలికి అక్కడే ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించండి ఈ సందర్భంగా పలువురు మహిళా పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ.. తమకు ఆరోగ్యపరంగా ఏమైనా పెద్ద సమస్యలు వస్తే సాయం చేయాలని కోరారు. కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డులు, పింఛన్లు ఇప్పించాలని విన్నవించారు. స్పందించిన చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ మహిళా కార్మికులకు ఎలాటి సమస్యలు ఉన్న తనను నేరుగా కలిసి చెప్పుకుంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇల్లు లేని వారందరికీ ఇండ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాలు వర్తించేలా చూస్తామన్నారు. ఊరు బాగు కోసం పనిచేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులకు ఓ మహిళా చైర్పర్సన్గా తనవంతుగా పూర్తి సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. సాక్షి డిబేట్లో కోరుట్ల చైర్పర్సన్ వసంత మీకు సమస్యలు ఉంటే నాతో చెప్పవచ్చు పారిశుధ్య కార్మికులతో మాటముచ్చట -
నిత్య జనగణమనతో దేశభక్తి, జాతీయభావం
జగిత్యాలటౌన్: నిత్య జనగణమనతో ప్రజల్లో జాతీయభావం, దేశభక్తి పెరుగుతుందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన నిత్య జనగణమన కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఊటూరి గంగారాంసరోజనల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్కూలర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ భావం పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన నిత్య జనగణమన మిత్రబృందం ప్రతినిధులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలతో నేను నా దేశం అనే భావం పెంపొందుతుందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, నాయకులు గోలి శ్రీనివాస్, మల్లికార్జున్, డిష్ జగన్, కొలగాని సత్యం, రేపల్లె హరికృష్ణ, బొడ్ల జగదీశ్, జ్ఞానేశ్వర్, నిత్య జన గణ మిత్ర బృందం సభ్యులు ఉత్తూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
విశ్వఖ్యాతి
నారీశక్తి..ఆమెకు భయం ఎక్కువే.. కానీ భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది. ఆమెకు బాధా ఎక్కువే.. కానీ.. అన్ని బాధ్యతలు మోస్తుంది. కుటుంబానికి చేదోడుగా ఉంటూ.. ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన అతివలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా.. ఏ రంగాన్ని ఎంచుకున్నా అగ్రపథాన నిలుస్తున్నారు. ఆనాడు అక్షరాలు అంటే తెలియని మహిళలు నేడు డిజిటల్ మార్కెటింగ్లో రికార్డు సృష్టిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని, పిల్లలను ఉన్నతంగా చవిదించి, జీవితంలో స్థిరపడేలా చేస్తున్నారు. ఒకప్పుడు పోలీసు అంటేనే భయపడేవారు.. ఇప్పుడు ఆ రంగంలో ఉత్సాహంగా రాణిస్తున్నారు. ఐపీఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు బాధితులకు అండగా నిలుస్తున్నారు. బీడీలు చుట్టిన చేతులు పిల్లలకు ఓనమాలు నేర్పిస్తున్నాయి. పల్లెల్లో వ్యవసాయ పనుల్లో వినిపించిన గొంతులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచ గుర్తింపు పొందుతున్నాయి. పలువురు మహిళలు ఉమ్మడిగా ఏర్పడి ప్రారంభించిన హోంఫుడ్స్ ఖండాంతరాల్లో రుచులు పంచుతున్నాయి. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు ఆదర్శ మహిళలపై ప్రత్యేక కథనం..!! మహిళల భద్రతకు పెద్దపీట విద్య, వ్యాపారం, ఉద్యోగంలో అతివల ప్రతిభ కుటుంబ బాధ్యతలు మోస్తూ పిల్లలను తీర్చిదిద్దుతున్న వైనం ఖాకీ చొక్కా వేసుకుని బాధితులకు సత్వర న్యాయం పల్లెపాటల గొంతుకు ప్రపంచ గుర్తింపు అమ్మచేతి వంటకు విదేశాల్లో అభిమానులు ఆదర్శం.. ఉమ్మడి జిల్లాలోని పలువురు అబలలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
మెరుగైన ఫలితాలు రావాలి
కొడిమ్యాల: మండల కేంద్రం, ధమ్మాయిపేట, నాచుపల్లి గ్రామంలో కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నాచుపల్లి జెడ్పీహెచ్ఎస్ను సందర్శించారు. వంట గది పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించిన తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదోతరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రణాళిక ఏర్పర్చుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రం, ధమ్మాయిపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులు, గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్ర భవనం తదితర అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్, జిల్లా హౌసింగ్ అధికారి ప్రసాద్, డీఈవో రాము, ఎమ్మార్వో కిరణ్కుమార్, ఎంపీడీవో స్వరూపరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
క్యాష్లెస్ లావాదేవీల్లో ‘నిర్మల’
యైటింక్లయిన్కాలనీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు డిజిటల్ చెల్లింపులపై రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ అల్లూరు గ్రామానికి చెందిన చిరు కిరాణా వ్యాపారి బాలసాని నిర్మల శ్రద్ధపెట్టారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించి, అత్యధికంగా రూ.5,340 క్యాష్ బ్యాక్ పొంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దృఢసంకల్పానికి అబ్బురపడిన కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. నిర్మల తన భర్త బాలసాని రవికుమార్ గౌడ్తో కలిసి ఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ చేతుల మీదుగా సత్కారం పొందారు. స్వనిధి రుణంతో నవచైతన్యం నిర్మల నవ చైతన్యం–2020లో సీఎం స్వనిధి పథకంలో తొలి విడతగా రూ.10వేలు రుణం పొంది ఇంట్లో కిరాణం ప్రారంభించారు. క్రమం తప్పకుండా రుణ వాయిదాలు డిజిటల్ రూపంలో చెల్లించడంతో ప్రభుత్వం రెండో విడతగా రూ.20 వేలు మంజూరు చేసింది. ఆ మొత్తంతో కిరాణంతో పాటు చీరల వ్యాపారం, కుట్టు మిషన్, మగ్గంవర్క్ ప్రారంభించి సక్సెస్ అయ్యారు. మూడోవిడత రూ.50వేలు రుణం పొంది ఆదర్శంగా నిలిచారు. -
4
4452● ధైర్యంగా ఫిర్యాదు చేస్తే సత్వర న్యాయం ● పోలీసుశాఖలోకి యువతులు రావాలి ● కుటుంబం అండతో ఉద్యోగంలో రాణిస్తున్నా ● ‘సాక్షి’తో ఏసీపీ వాసంశెట్టి మాధవిఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రస్తుత సమాజంలో వారికున్న స్వేచ్ఛ, సమానత్వం, నిర్ణయాలు.. తదితర అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా.. 100మంది మహిళలు చెప్పిన సమాధానాలు ఇలా.. 25%కరీంనగర్క్రైం/హుజూరాబాద్: ‘అతివల భద్రతకు పోలీసుశాఖ పెద్దపీట వేస్తోంది. ఏ విషయంలోనైనా అన్యాయానికి గురైతే పోలీసుస్టేషన్కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయండి. నిందితులపై చర్యలు తీసుకుని, సత్వర న్యాయం అందేలా చూస్తాం. యువతులు భద్రత లేని ప్రైవేటు ఉద్యోగాల కన్నా పోలీసు ఉద్యోగంలోకి రావాలి. శివంగుల్లా నేరస్తుల భరతం పట్టాలి’. అని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి. కుటుంబం అండగా ఉండడంతో పోలీసు ఉద్యోగంలో రాణిస్తున్నాని వెల్లడించారు. ధైర్యంగా ముందడుగు వేస్తేనే విజయం సాధిస్తామని సూచిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.మహిళల భద్రతకు పోలీసింగ్లో మార్పులు పోలీసుశాఖలోని షీటీంలు మహిళల కోసం పని చేస్తాయి. సైబర్క్రైం యూనిట్ల ద్వారా నిందితులను త్వరగా పట్టుకుంటున్నాం. స్పెషల్ ఉమెన్ స్టాల్స్, మహిళా బ్లూకోల్ట్స్, హ్యాక్ఐ యాప్, సీసీ కెమెరాలు, భరోసా సెంటర్, షీ బాక్కులు, హెల్ప్లైన్ సెంటర్లు మహిళల కోసం ఏర్పాటు చేసినవే. మహిళలు రాత్రివేళలలో వెళ్లేప్పుడు సురక్షిత మార్గాలు ఎంచుకోవాలి. ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తే వాహన నంబర్లు కుటుంబసభ్యులకు మెసేజ్ చేయాలి. లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, 181, 8712670759 ఫోన్ నంబర్ను సంప్రదించాలి. నేరాలు పెరుగుతున్నాయి గృహహింస, సైబర్నేరాలు, స్టాకింగ్, లైంగికదాడి కేసులు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, మైనర్లపై ప్రేమపేరుతో జరుగుతున్న మోసాలపై బాధితులు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫొటో, వీడియో మార్ఫింగ్ కేసులు పెరుగుతున్నాయి. గృహహింస కేసుల్లో బాఽధితులు ఫిర్యాదు చేసిన తర్వాత కుటుంబ ఒత్తిడి, వారి పిల్లల భవిష్యత్తు, ఆర్థికపరమైన ఇబ్బందులు భరించలేక చాలామంది కేసుల్లో రాజీ పడుతున్నారు. దీంతో నిందితులకు శిక్ష పడే అవకాశం తక్కువగా ఉంటుంది. మహిళలకు స్వేచ్ఛగా వారి సమస్యను తోటి మహిళా అధికారికి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితులు స్వయంగా పోలీసుల సాయం తీసుకోవచ్చు. పోలీసు ఉద్యోగం సవాలే పోలీసుశాఖలో క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ధైర్యం, నిబద్ధత, పారదర్శకతతో పనిచేయడం ద్వారా ఎన్ని సవాళ్లైనా ఎదుర్కోవచ్చు. పోలీసు ఉద్యోగం ప్రతిరోజు సవాల్గానే ఉంటుంది. నేను వ్యక్తిగతంగా ఇప్పటి వరకు ఎలాంటి సవాళ్లు ఎదుర్కోలేదు. నా 30ఏళ్ల సర్వీసులో ఎస్సై, సీఐ, ప్రస్తుతం ఏసీపీగా కొనసాగుతున్నా పోస్టింగ్లో మహిళ అన్న వ్యత్యాసం ఎక్కడా చూడలేదు. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నా. డిపార్డుమెంటులో చేరేందుకు యువతులు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి రక్షణలేని కాల్సెంటర్లు, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం కన్నా ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుశాఖలోకి రావాలి. ఈ ఉద్యోగంతో మానసికంగా, శారీరకంగా బలంగా ఉండొచ్చు. నన్ను కదిలించిన ఘటన అదే.. ప్రేమపేరుతో మోసపోయి, లైంగికదాడికి గురైన ఓ బాధితురాలు పిచ్చిదైపోయింది. ఆ ఘటన ఆమె జీవితాన్నే మార్చింది. మానసిక వైకల్యం కింద నెలనెలా పెన్షన్ తీసుకోవడం నాకు బాధనిపించింది. ఆ కేసులో నిందితుడికి శిక్షపడేలా చేశాను. బాధితురాలికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కింద రూ.5 లక్షలు ఇప్పించేందుకు ముందుండి పనిచేశాను. తనుకు చేసిన తరువాత సాయం నాకు గర్వంగా అనిపించింది. ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు చిన్నపిల్లల తల్లులు ఓటువేసి వచ్చే వరకు, పిల్లలను లాలించడం ఆనందంగా అనిపించేది. ధైర్యంగా ముందుకు సాగాలి మహిళలు బాధితులుగా ఉన్న కేసుల్లో సామాజిక అవగాహన లోపం, లేట్ రిపోర్టింగ్తో నిందితులకు త్వరగా శిక్ష పడడం లేదు. కొన్ని కేసుల్లో సాక్ష్యులను కోర్టుకు రప్పించడంలో కష్టమైనా ముందుకు వెళ్తున్నాం. స్పీడ్ ట్రయల్ నడిపిస్తూ ముందుకు సాగుతున్నాం. మహిళలు ధైర్యంగా ఉండాలి. తమ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండి, ఆపద సమయంలో పోలీసులసాయం పొందాలి. అందరికీ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.8 మంది100%50%40 మంది252 మందిస్నేహితుల సూచనతల్లిదండ్రుల నిర్ణయం8మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును సొంత నిర్ణయంతో చేస్తున్నారా?సొంత నిర్ణయంలేదు90మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంతమేర మద్దతు లభిస్తుంది?కొద్దిమేరపూర్తిగాసమాజంఒక సీ్త్ర స్వతంత్రంగా ముందుకు వెళ్లాలంటే ఎవరి సహకారం ఎక్కువ అవసరం?93కుటుంబం3స్నేహితులు– సప్తగిరికాలనీ(కరీంనగర్)తన పిల్లలతో బట్టు మంగవ్వమామిడి కొనాల మీన.. జానపదాలతో ట్రెండింగ్లో నాగవ్వ సాక్షి, కరీంనగర్ డెస్క్: యక్షగానంతో ఆమె ప్రస్థానం ప్రారంభించింది. నాన్న పాటలను కై కట్టి నేర్చుకుంది. చదువుకోకున్నా జానపదాన్ని ఒంట పట్టించుకుంది. పంటపొలాల సాక్షిగా తన పాటలను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘తిరుపతి రెడ్డి’ అంటూ మొదలు పెట్టి ‘మోహన లా లి’ పాటతో పాపులర్ అ య్యింది. మంగ్లీతో జతకట్టి ‘బాయిలోనే బల్లి పలికే’ పాటతో వరల్డ్ ఫేమస్ కాగా.. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాటతో యూట్యూబ్లో ట్రెండింగ్ సృష్టిస్తోంది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోటకు చెందిన నాగవ్వ. యక్షగానంతో ప్రారంభమై.. తల్లిగారి ఊరైన అంబారిపేటలో యక్షగానంతో నాగవ్వ పాట ప్రారంభమైంది. తండ్రి యక్షగానం వింటూ పెరగడంతో పాటు తనూ బతుకమ్మ పాటలు, జానపదాలు, కాముని పాటలు పాడేది. పెళ్లి తరువాత అత్తగారిల్లు గుల్లకోటకు వచ్చాక కూడా పాటను మర్చిపోలేదు. తన భర్త భజన పాటలు పాడుతూ.. నాగవ్వను కూడా గొంతు బాగుంటుందని ప్రోత్సహించడంతో పాటు కొడుకులిద్దరూ కలిసి ‘సీఎంఎస్ చానెల్’ పెట్టి జానపదాలు పాడించారు. అలా తను తొలిపాట ‘తిరుపతి రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘మోహనలాలి’ పాటతో మరింత దగ్గరైంది. ‘సారంగదరియా షో’లో మూడు ఎపిసోడ్లలో పాల్గొంది. మంగ్లీతో కలిసి ‘కొప్పులోని పువ్వమ్మ బాయికాడి బతుకమ్మ’ పాట పడింది. తరువాత ‘బాయిలోనే బల్లి పలికే’ పాట ప్రపంచాన్ని ఊర్రూతలూగించింది. లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాట సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. వ్యూస్లో లక్షల్లో దూసుకెళ్తుంది. తనకు గుర్తింపు రావడానికి తన కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉందని నాగవ్వ చెబుతోంది. ముఖ్యంగా కొడుకులిద్దరూ తాను పాడడాన్ని ఎంతో ప్రోత్సహిస్తారని వివరించింది. మీరు తీసుకునే రోజూవారి నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు? -
ఠాణాలో వెంకన్నకు ఘన పూజలు
ధర్మపురి: బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం శ్రీవేంకటేశ్వరస్వామికి దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధర్మపురి పోలీస్స్టేషన్లో శనివారం స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్నర్సింహారెడ్డి, ఎస్సై మహేశ్ ప్రత్యేక పూజలు చేశారు. దిగ్యాత్రల సందర్భంగా దేవస్థానం నుంచి పోలీస్ స్టేషన్ వరకు అశ్వవాహనంపై శోభాయాత్రగా తీసుకెళ్లారు. పోలీస్స్టేషన్ ఆవరణలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి స్వామివార్లను ఆశీనులు చేసి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని ఉత్తర దిగ్యాత్ర సందర్భంగా స్థానిక ఉసిరికవాగు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఊరూరా ఉప్పు అమ్మి.. ఉజ్వల భవితనిచ్చి
వీర్నపల్లి(సిరిసిల్ల): ఆమె చదువుకోలేదు. కానీ చదువు విలువ తెలుసు. ఆమెకు ఆస్తులు లేకున్నా పిల్లలే తన ఆస్తి అనుకుంది. ఉప్పు తట్ట మోసింది. ఎడ్ల బండిపై ఊరూరా తిరుగుతూ ఉప్పు అమ్మింది. భర్త దూరదేశం వెళ్లినా అధైర్యపడలేదు. కూరగాయలు అమ్మి బిడ్డలు సమాజంలో ఉన్నతస్థానాల్లో నిలబెట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని భావుసింగ్నాయక్ తండాకు చెందిన బట్టు మంగవ్వ. నలుగురు సంతానం మంగవ్వ– హరిచంద్ దంపతులకు నలుగురు సంతానం. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో హరిచంద్ గల్ఫ్దేశాలకు వెళ్లాడు. కుటుంబ భారం మంగవ్వపైనే పడింది. తాను గంజినీళ్లు తాగినా పిల్లలకు మంచి చదువు చెప్పించింది. పెద్ద కొడుకు బట్టు విజయ్కుమార్ ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడు. నిర్మల్లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరి, ఆరు నెలల్లోనే అక్కడే ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించాడు. కూతురు సుజాత తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో మ్యూజిక్లో (ఎం.ఏ) పూర్తి చేసి, మణుగూరు ఏకలవ్య పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మరో కొడుకు రాజేష్ ఎన్ఏసీలో ల్యాండ్ సర్వేయర్గా శిక్షణ పొంది, కరీంనగర్ కలెక్టరేట్లో సర్వేయర్గా సేవలందిస్తున్నారు. చిన్న కుమార్తె సరిత ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఒకప్పుడు ఉప్పు అమ్మితే కానీ పూట గడవని స్థితి నుంచి నేడు నలుగురు పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో ఉండటం చూసి తండావాసులు మంగవ్వను అభినందిస్తున్నారు. -
అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం
వైభవంగా ఉత్తర దిగ్యాత్ర బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మీనృసింహుని ఉత్తర దిగ్యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయం నుంచి ఉసిరిక వాగు వద్దకు స్వామివార్లను అశ్వవాహనంపై శోభాయాత్రగా తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామివారలను ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారల కల్యాణం అనంతరం దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలుగా బయలుదేరుతుంటారని పండితులు తెలిపారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – ధర్మపురి కమనీయం.. కల్యాణం -
సామరస్యంగా పరిష్కరించుకోవాలి
మెట్పల్లిరూరల్(కోరుట్ల): గ్రామాల మధ్య సరిహద్దు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తహసీల్దార్ నీత, సీఐ అనిల్ అన్నారు. ఈ నెల 5న ‘సాక్షి’లో ‘సరిహద్దు పంచాయితీలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం మెట్పల్లి మండలం చెర్లకొండాపూర్, రాజేశ్వర్రావుపేట గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల ప్రజలతో చర్చించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని, గ్రామంలో వీడీసీ ఆంక్షలు విధించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అది నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీవో సురేశ్, ఎస్సై నవీన్, ఎంపీవో మహేశ్వర్రెడ్డి, ఆర్ఐలు ఉమేశ్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. ‘భోగ శ్రావణి అవినీతిపరురాలు’జగిత్యాలటౌన్: భోగ శ్రావణి పెద్ద అవినీతి పరురాలని, ఆమెను చూసి ఏం నేర్చుకోవాలో ఎంపీ అరవింద్ చెప్పాలని బీజేపీ బహిష్కృత నేతలు ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాట్లాడారు. బల్దియా ఎన్నికల్లో అభ్యర్థుల డబ్బు రూ.60లక్షలు నొక్కేస్తే ఆమైపె ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం కమిటీ కూడా వేయలేదన్నారు. పార్టీని భ్రష్టు పట్టిస్తే సరిదిద్దాల్సిన పెద్దలే వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల పట్టణంలో పార్టీకి 20వేల ఓట్లు వస్తే మున్సిపల్ ఎన్నికల్లో 11వేలకు ఎందుకు పడిపోయిందో చెప్పాలన్నారు. కనీసం సొంత వార్డులో కూడా పార్టీని గెలిపించుకోలేని శ్రావణిని చూసి ఏం నేర్చుకోవాలో ఎంపీ చెప్పాలని ఎద్దేవా చేశారు. ఎంపీ అరవింద్ తమను కాల్చి పారేస్తామంటే తాము గాజులు తొడుక్కుని కూర్చుంటామా అని ప్రశ్నించారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకుని పోరాటం చేసిన తాము అరవింద్ తాటాకు చప్పుళ్లకు భయపడమని స్పష్టం చేశారు. సమావేశంలో బహిష్కృత (సీనియర్) నాయకులు ఏసీఎస్ రాజు, సీపెల్లి రవీందర్, లింగంపేట శ్రీనివాస్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, ఆంకారి సుధాకర్, ప్రమోద్గౌడ్, బిట్టు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సాగుపై అవగాహన జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో శుక్రవారం రైతులు, శాస్త్రవేత్తల చర్చావేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల నిర్వహణ, తెగుళ్లపై అవగాహన కల్పించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న బీపీటీ–5204, జై శ్రీరామ్, జేజీఎల్–1798, కేఎన్ఎం–1638, హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్–15048 వంటి సన్న రకాలను సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ సూచించారు. ఆత్మ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ తనిఖీ జిల్లా కేంద్రంలోని హస్నాబాద్లో గల శైల సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ను శుక్రవారం డీఏవో భాస్కర్ తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించడం లేదని తేలడంతో అమ్మకాలు నిలిపివేయాలని సంస్థ యజమానికి అదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకుండా విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. మండల వ్యవసాయాధి కారులు తిరుపతినాయక్, వినీల పాల్గొన్నారు. -
పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత
జగిత్యాల: పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం ప్ర జాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పనులు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింద ని, అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నా రు. కార్యాచరణలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. వార్డుల్లో డ్రెయినేజీలు, నీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. ప్రజలు కూడా అధికారులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ప్రత్యేకంగా పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపర్చడం, డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించడం, కార్యాలయాల పరిశుభ్రత, పన్ను వసూళ్లు, ఫైల్స్ క్లియరెన్స్, నిరంతరం తాగునీటి సరఫరా చేసేలా కృషి చేయాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, లత, కమిషనర్ స్పందన తదితరులు పాల్గొన్నారు. -
నిరుపయోగంగా ఎఫ్ఎస్టీ ప్లాంట్
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని డంపింగ్యార్డులో ఏ ర్పాటు చేసిన ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ) నిరుపయోగంగా మారింది. దాదా పు రూ.5 కోట్లతో ఎఫ్ఎస్టీపీ నెలకొల్పారు. బల్దియాలోని గృహాల నుంచి మానవ వ్యర్థాలను ట్యాంకుల ద్వారా తీసుకువచ్చి ఇందులో పోసి ఎరువులు తయారుచేస్తుంటారు. కాగా, డంపింగ్ యా ర్డు పట్టణానికి దూరంగా ఉండడంతో వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్లే కొందరు నిర్వాహకులు శివారు ప్రాంతాల్లో వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సమీపంలోని నివాస గృహాలవారికి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. ఈ అంశంపై అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో డంప్.. నివాస గృహాల్లోని సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాలను మున్సిపాలిటీల ద్వారా లైసెన్స్ పొందిన స్లడ్జింగ్ ఆపరేటర్లు నేరుగా ఎఫ్ఎస్టీ ప్లాంట్కు తరలిస్తారు. అక్కడ దానిని ఎరువుగా తయారుచేసి మున్సిపాలిటీలోని మొక్కలకు ఉపయోగించడంతో పాటు, రైతులకు విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొందరు ప్రైవేటు ఆపరేటర్లు వ్యర్థాలను సేకరించి బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేయడంతో వాతావరణం కలుషితం అవుతోంది. జగిత్యాల బల్దియాలో ఐదుగు రు లైసెన్స్ ఆపరేటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాస్తవంగా సెప్టిక్ ట్యాంక్ నుంచి వ్యర్థాలను లైసెన్స్డ్ ఆపరేటర్లే సేకరించాలి. ఇతరులు సేకరించడం, బహిరంగ ప్రదేశాల్లో పోయడం నిషేధం. ప్లాంట్ ఉన్నట్టా.. లేనట్టా.. జిల్లా కేంద్రంలోని ఎఫ్ఎస్టీ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. నెలలో ఒకసారి మాత్రమే మానవ వ్యర్థాలను ఎరువుగా తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు సపదించి పూర్తిస్థాయిలో ఎఫ్ఎస్టీ ప్లాంట్ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం ఎఫ్ఎస్టీ ప్లాంట్ రన్ అవుతుంది. కొంత మేర ఇబ్బందులున్నప్పటికీ పూర్తిస్థాయిలో కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నాం. పట్టణ శివారుల్లో మానవ వ్యర్థాలను పోస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల -
నేషనల్ అవార్డుకు నర్సింహునిపేట నామినేట్
● ముస్తాబవుతున్న గ్రామం పెగడపల్లి(ధర్మపురి): మండలంలోని నర్సింహునిపేట గ్రామ పంచాయతీని అధికారులు నేషనల్ అవార్డుకు నామినేటెడ్ చేయడంతో గ్రామం కొత్త శోభ సంచరించుకుంటుంది. గార్మంలో 718 జనాభా, 563 మంది ఓటర్లు, సుమారు 207 కుటుంబాలు, 19 మహిళా సంఘాలున్నాయి. ‘దీన్ దయాళ్ ఉపాద్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్’లో భాగంగా పేదరిక నిర్మూలన గ్రామం కింద జాతీయస్థాయి అవార్డు ఎంపిక కోసం నామినేట్ చేశారు. దీంతో గ్రామస్తుల సహకారంతో వారం రోజులుగా మండలస్థాయి అధికారులు, సర్పంచ్ సంది రాజమణి, పాలకవర్గ సభ్యులు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పంచాయతీ భవనానికి రంగులు వేసి, కార్యాలయం చుట్టూ మొక్కలు నాటారు. కేంద్ర బృందం సభ్యులు గ్రామాన్ని సందర్శించి వారిచ్చిన మార్కుల ఆధారంగా అవార్డుకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని ఎంపీవో శశికుమార్రెడ్డి తెలిపారు. ఈ గ్రామం అవార్డుకు ఎంపికై తే ప్రైజ్ మనీ కింద మొదటి బహమతి రూ.కోటి, రెండో బహుమతి రూ.50 లక్షలు, 3వ బహుమతిగా రూ.25 లక్షలు అందుతాయి. -
రోడ్లు ఛిద్రం.. పనులు గగనం
● నత్తనడకన అమృత్–2 పనులు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు ● ఇబ్బందుల్లో పట్టణ ప్రజలురాయికల్: రాయికల్ బల్దియాలో అమృత్–2 పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేయడంతో పట్టణంలోని సీసీ రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ధ్వంసం చేసిన సీసీరోడ్లకు మరమ్మతు చేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయికల్ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు కేంద్రప్రభుత్వం అమృత్ 2.0 పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బల్దియాకు రూ.15.25 కోట్లు మంజూరయ్యాయి. 20 కిలోమీటర్ల మేర ఉన్న 12 వార్డుల్లోని సీసీరోడ్లలో పైప్లైన్ హౌస్ కలెక్షన్, ఫీడర్ లైన్, డిస్ట్రిబ్యూషన్ లైన్ వంటి పనులు చేయాల్సి ఉంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పట్టణంలో ఇప్పటివరకు సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో పలు వార్డుల్లోని సీసీరోడ్లను ధ్వంసం చేస్తూ నామమాత్రంగా పనులు చేస్తున్నాడు. హౌసింగ్ కనెక్షన్, పైప్లైన్ కనెక్షన్ సరిగా బిగించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తవ్విన సీసీరోడ్ల వద్ద ఈ పనులు పూర్తి గా చేపట్టి యథావిధిగా రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ పనులు చేపడుతున్నారని ఆయా వార్డుల కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కనీసం పైప్లైన్ కోసం తవ్విన మట్టిని తొలగించి పనులు చేపట్టాలని కోరినప్పటికీ పట్టించుకోవడం లేదంటునానరు. సంబంధిత వార్డు కౌన్సిలర్లే ధ్వంసం చేసిన సీసీరోడ్లపై ఉన్న మట్టిని తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్లలో తరలించారు. మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, కమిషనర్ నాగరాజు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు చేపట్టి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. భూమి ఇచ్చేందుకు ససేమిరా.. పట్టణానికి అమృత్ 2.0 పథకానికి భూమి ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. ఇటీవల రెవెన్యూ, మున్సిపల్ అధికారులు 20 గుంటల భూమి గుర్తించినప్పటికీ ఆ భూమిని రైతులు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. మరోవైపు అమృత్ 2.0 పథకం కోసం రోడ్లను తవ్వి మరమ్మతు చేయని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
మార్కెట్లో వసతులు కల్పించాలి
● డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి మెట్పల్లి: మార్కెట్ యార్డులో రైతులకు వసతులు కల్పించాలని మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి స్థానిక అధికారులకు సూచించారు. మార్కెట్ను ఆమె గురువారం సందర్శించారు. పసుపు కొనుగోళ్ల తీరుపై రైతులు, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. టాయ్లెట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆమెకు వివరించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్ ఉన్నారు. -
నేడు ప్రజాపాలనపై సమీక్ష
● హాజరుకానున్న మంత్రి తుమ్మల కరీంనగర్ అర్బన్: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణపై కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమీక్షించనున్నారు. శుక్రవారం జిల్లాకు రానుండగా కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా సమావేఽశం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ‘ప్రతిమ’ ఆర్థో వైద్యుడికి అవార్డుకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్ధలో ఆర్థోపెడిక్ ఫ్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్రెడ్డి నూకలకు ప్రతిష్టాత్మక ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ –2025 కన్సల్టెంట్ విభాగంలో బెస్ట్ పేపర్ అవార్డు అందుకున్నారు. డాక్టర్ శ్రీనివాస్రెడ్డి ఇప్పటివరకు 2 వేలకు పైగా ఇలిజారోవ్ శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాన్ ఇజ్రాయిల్, సీఏవో రాంచందర్రావు, రిజిస్ట్రార్ ప్రసాద్రావు, సూపరింటెండెంట్ సీఎన్ ప్రసాద్, ఏవో కల్యాణ్ చక్రవర్తి, హెచ్వోడీలు మోతిలాల్, నిఖిల్, వరుణ్కృష్ణ, అభిలాష్, నరేశ్, అనిల్కుమార్, తిరుపతి, ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న బ్రహ్మోత్సవాలు షురూ..
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో స్వామి వారికి ఏకాంతంగా పూజలు చేశారు. ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ పార్కింగ్ ప్రాంగణంలోని శివార్చన వేదికపై కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 8న రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. 9న అవబృత స్నానం, ఏకాదశ ఆవరణాలతో శివకళ్యాణ మహోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. యాగశాలలో అర్చకులు, వేద పండితులకు వర్ని సమర్పించారు. రాజన్నకు ఏకాంత సేవలు ప్రచారరథం ముందు ప్రత్యేక పూజలు రాజగోపురం ముందు హోమాలు -
ఆర్టీసీ అధికారుల వైఖరిపై నిరసన
● హిందూసంఘాల ఆందోళన మెట్పల్లి:పట్టణంలోని ఆర్టీసీ ఇన్ గేట్ పక్కన ఉన్న హనుమాన్ ఆలయం వద్ద నిర్మిస్తున్న గద్దెను ఆర్టీసీ అధికారులు తొలగించే ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రి హిందూ సంఘాలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గద్దె నిర్మాణంతో ఎలాంటి ఇబ్బందులూ లేకపోయినప్పటికీ అధికారులు దానిని తొలగించేందుకు యత్నించడం సరికాదన్నారు. ఆందోళనతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అక్కడి చేరుకొని వారితో మాట్లాడారు. కొద్దిసేపటికి ఎంపీ అర్వింద్ అక్కడకు వచ్చి గద్దెను పరిశీలించారు. గద్దెతో ట్రాఫిక్కుగాని, ఇతర ఎలాంటి సమస్యకు దారి తీసే అవకాశం లేకపోయినప్పటికీ ఎందుకు తొలగిస్తున్నారని డీఎం సరస్వతీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని, నిర్మాణానికి సహాకరించాలని ఆమెకు సూచించారు. -
ట్రాక్టర్లతో మట్టిని తరలించాం
9వ వార్డులో అమృత్ 2.0 పథకం కోసం కాంట్రాక్టర్ రోడ్లను తవ్వాడు. రోడ్లపై ఉన్న మట్టిని తొలగించలేదు. పైప్లైన్కు మరమ్మతు చేయలేదు. కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. కాలనీవాసుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ట్రాక్టర్లు, కూలీల సహకారంతో సీసీరోడ్లపై ఉన్న మట్టిని తొలగించాం. – బత్తిని మహేశ్వరి, 9వ వార్డు కౌన్సిలర్ చర్యలు తీసుకుంటాం పట్టణంలో అమృత్ 2 పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మా దృష్టికి కూడా వచ్చింది. కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసి పనులు చేపట్టకపోతే చర్యలు తీసుకుంటాం. అలాగే రాయికల్ పట్టణంలో 20 గుంటల స్థలం ఇవ్వడానికి రైతులు విముఖత చూపడం కూడా మా దృష్టికి వచ్చింది. – నాగరాజు, మున్సిపల్ కమిషనర్ -
పెళ్లి జరగాల్సిన ఇంట్లో మహిళ దారుణ హత్య
రామడుగు: పెళ్లి జరగాల్సిన ఇంట్లో మహిళ దారుణ హత్య రామడుగులో సంచలనం రేపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఈరెల్లి గౌరమ్మ(65)కు ఇద్దరు కుమారులు. పదిహేను రోజుల క్రితం గల్ఫ్ నుంచి వచ్చిన పెద్ద కుమారుడు మహేశ్కు గ్రామానికి చెందిన అమ్మాయితో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. బట్టలు తీసుకోనేందుకు మహేశ్ కరీంనగర్ వెళ్లాడు. మృతురాలి భర్త కొంరయ్య గ్రామంలోని ఓ పెళ్లికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న గౌరమ్మను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో మెడకోసి పరారయ్యారు. భర్త ఇంటికి వచ్చేసరికి భార్య రక్తపుమడుగులో పడిఉంది. చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సమీప బంధువులే హత్య చేసినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్కు తరలించారు. హత్యలో గౌరమ్మ చిన్నకుమారుడు అనిల్ను అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గొంతుకోసి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు సమీప బంధువుల పనేనని అనుమానం? సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు -
ధాన్యం కమీషన్ డబ్బుల వివాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో వరి ధాన్యం కమీషన్ డబ్బులపై వివాదం నెలకొంది. సర్పంచ్ మేడిశెట్టి పద్మ, ఉపసర్పంచ్ గొట్టే శ్రీకాంత్ సమక్షంలో గురువారం ఏర్పాటు చేసిన గ్రామసభలో రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తుల మధ్య కమీషన్ డబ్బులపై వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామంలో పదేళ్లుగా రైతుల నుంచి ధాన్యం సేకరించగా వచ్చిన కమీషన్ లెక్కలు చెప్పాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. పదేళ్లుగా కమీషన్ డబ్బుల వివరాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక పంటకు రూ.3.30లక్షల చొప్పున కమీషన్ వచ్చిందని, 20 పంటల కమీషన్ డబ్బుల లెక్కలు తేల్చాల్సి ఉందన్నారు. దాదాపు రూ.66లక్షల కమీషన్ డబ్బులను సీఏలే సొంతంగా వాడుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇదే సమయంలో మహిళా సంఘాల సభ్యులు కూడా తమ వాదనను వినిపించడంతో సమావేశం వేడెక్కింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ మేడిశెట్టి పద్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు కొందరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. పదేళ్ల లెక్కలు చెప్పాలంటూ గ్రామస్తుల డిమాండ్ సీఏలే సొంతంగా వాడుకున్నారని ఆరోపణలు -
మరణంలోనూ వీడని బంధం
పెగడపల్లి: కలకాలం కలిసి ఉంటామని బాస చేసిన ఆ దంపతులు మరణంలోనూ కలిసేపోయారు. ఈ విషాద ఘటన పెగడపల్లి మండలం మద్దులపల్లిలో విషాదం నింపింది. బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సురకంటి చుక్కారెడ్డి, శంకరమ్మ భార్యాభర్తలు. వీరిది వ్యవసాయ కుటుంబం. కుమారుడు, కూతురు సంతానం. వృద్ధాప్యం దరిచేరడంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చుక్కారెడ్డి బుధవారం రాత్రి సమయంలో మృతిచెందాడు. ఆయన మృతిని తట్టుకోలేని శంకరమ్మ కూడా గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. దంపతులిద్దరూ ఒకేరోజు మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. గురువారం ఒకేసారి ఇద్దరికి అంత్యక్రియలు పూర్తి చేశారు. వీరి కుమారుడు సురకంటి సత్తిరెడ్డి ప్రస్తుతం పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. విషయం తెలుసుకున్న పలు గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఒకేరోజు భార్యాభర్తల మృతి మద్దులపల్లిలో విషాదం -
పేదలకు అండగా ప్రభుత్వం
జగిత్యాలరూరల్: పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్కు చెందిన కొత్తపల్లి లింగం, ప్రణీత దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రణీతకు చీరను కానుకగా అందించారు. సర్పంచ్ శీలం సురేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, ఉప సర్పంచ్ బాలే శ్రీనివాస్, ఎంపీఓ వాసవి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ ఆంక్షలు సడలించాలి ఉపాధి హామీ పథకంపై విధించిన ఆంక్షలను సడలించాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల అర్బన్ ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులకు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రం తీరు సరికాదన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మారుతాయన్నారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్, పీఆర్ ఏఈ విజయ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినయ్, హౌసింగ్ ఏఈ భార్గవ్, సర్పంచులు మహేష్, గంగాధర్, సురేందర్ పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ వినియోగించుకోవాలి జగిత్యాల: సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. పురాణిపేటకు చెందిన చిట్యాల జ్యోత్స్నకు మంజూరైన రూ.25వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది పేదలకు వరమని, ప్రతి ఒక్కరు దీనిని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలె శంకర్, నవీన్, మహేశ్ పాల్గొన్నారు. -
మహిళా ఆరోగ్యానికి 100 రోజుల హెల్త్ మిషన్
● డీఎంహెచ్వో గుజ్జుల సుజాతజగిత్యాల: మహిళాఆరోగ్యానికి 100 రోజుల హెల్త్ మిషన్ కార్యక్రమం చేపడుతున్నామని, 30 రకాల వైద్య పరీక్షలు చేసి ప్రతిఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇస్తామని డీఎంహెచ్వో సుజాత అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ మిషన్ 100 పేరుతో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీ డయోగ్నోస్టిక్ హబ్ సెంటర్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రోగ నిర్ధారణ చేపడతామన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 9 వరకు నాలుగు దశల్లో ఈ సేవలు నిర్వహిస్తామన్నారు. మొదటి దశలో మెడిసిన్, గైనకాలజీ, పిడియాట్రిక్, కంటి, ఎముకలు, రెండో దశలో క్యాన్సర్, మూడో దశలో వడదెబ్బ, అతిసారం, నాలుగో దశలో ఫుడ్సేఫ్టీ మేళా నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు రవీందర్, భూమేశ్వర్ పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహుని దక్షిణ దిగ్యాత్ర గురువారం విజయవంతంగా సాగింది. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. దిగ్యాత్రలో భాగంగా స్వామివారు ధర్మపురి పోలీస్స్టేషన్ను సందర్శించారు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు స్వామివారికి స్వాగతం పలికారు. స్టేషన్లో రికార్డులు పరిశీలించిన అనంతరం వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయం నుంచి పోలీస్ స్టేషన్వరకు అశ్వవాహనంపై స్వామివార్లను శోభయాత్రగా తీసుకెళ్లారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, ఎస్సైలు మహేశ్, రమేశ్, ఉదయ్కుమార్, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. దిగ్విజయంగా దక్షిణ దిగ్యాత్ర -
భూ పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమ
● అదనపు కలెక్టర్ బీఎస్.లత మల్యాల: జాతీయ రహదారి 563 విస్తరణలో భూములు కోల్పోతున్న మండలంలోని రాజారం గ్రామస్తులతో అదనపు కలెక్టర్ బీఎస్.లత గ్రామసభ నిర్వహించారు. రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న వారి సందేహాలు నివృత్తి చేశారు. బాధితుల జాబితా తయారు చేశామని, భూ విస్తీర్ణాన్ని బట్టి పరిహారం చెల్లిస్తామని, బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం విజయ్, తహసీల్దార్ వసంత, ఆర్ఐ తిరుపతి, కార్యదర్శి ఉపేంద్ర, ప్రజలు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి
● ‘నవోదయ’ వార్షికోత్సవంలో ఎంపీ అర్వింద్ కోరుట్ల: నవోదయ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పట్టణంలోని నవోదయ విద్యాలయం మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు తిలకించారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో మంచిస్థానాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ముందుగా ఎంపీ సంగెం రోడ్లో నవోదయ విద్యాలయం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి, విద్యాలయ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. -
బీజేపీలో ముదిరిన లొల్లి
● ఎంపీ పర్యటన నేపథ్యంలో గొడవ ● ఫర్నిచర్ ధ్వంసం, గ్రీన్మ్యాట్ల చించివేత ● అదుపులోకి తీసుకున్న పోలీసులు ● పదిమందిపై కేసు నమోదుజగిత్యాల: జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీలో వర్గపోరు ముదురుతోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన బోగ శ్రావణి.. మరోవర్గానికి కొన్నిరోజులుగా పడటం లేదు. ప్రతి విషయంలో శ్రావణి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని మరోవర్గం వారు గొడవకు దిగుతున్నారు. ఎంపీ అర్వింద్ వర్గానికి చెందిన శ్రావణి పార్టీలో సీనియర్లను విస్మరిస్తున్నారని, కొత్తవారికి పెద్దపీట వేస్తున్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు, సీనియర్లకు టికెట్లు ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారని ఇటీవల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ రెబల్స్గా బరిలో నిలిచి గెలిచారు. వారిని పార్టీ సస్పెండ్ చేసింది. గురువారం ఎంపీ అర్వింద్ జిల్లాకు వస్తున్నారన్న సమాచారంతో సీనియర్ నేతలు బోగ శ్రావణి ఇంటి వద్ద హల్చల్ చేశారు. అక్కడున్న కుర్చీలు, మ్యాట్లు ధ్వంసం చేశారు. శ్రావణి భర్త ప్రవీణ్ను దుర్భాషలాడారు. విషయం తెలుసుకున్న సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే ఎన్నికల నుంచే.. జగిత్యాల బల్దియాలో బీఆర్ఎస్ తరఫున చైర్మన్గా కొనసాగిన బోగ శ్రావణిని బీజేపీలోకి తీసుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించారు. ఆమె 40వేలకు పైగా ఓట్లు సాధించినా ఓడిపోయారు. తన ఓటమికి కారణం కొందరంటూ అప్పుడే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. త్రీమెన్ కమిటీ వేయగా.. వారు కూడా కొందరు సీనియర్లు శ్రావణికి కాకుండా వేరేవారికి మద్దతు ఇచ్చినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి గొడవ ముదురుతూ వస్తోంది. దాడి సరికాదు.. తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని, మహిళ అని కూడా చూడకుండా తనపై దాడిచేశారని శ్రావణి అన్నారు. ఎంపీ పర్యటన నేపథ్యంలో సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ సస్పెండ్ అయిన కొందరు తన ఇంటిపై దాడి చేశారని, తన భర్త ప్రవీణ్ను చంపేస్తామని, అంతు చూస్తామని దుర్భాషలాడారని పేర్కొన్నారు. సీఐ సంఘటన స్థలానికి చేరుకుని గొడవ లేకుండా చూశారని, ఆందోళన చేసిన వారిపై కలెక్టర్, ఎస్పీలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బోగ శ్రావణి ఇంటి వద్ద గొడవ చేస్తున్న బీజేపీ రెబల్స్అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు నేను వచ్చాక దాడి చేస్తే నా అంగరక్షకులే కాల్చిపారేసేవారు: ఎంపీ అర్వింద్ జగిత్యాలటౌన్: కోవర్టు రాజకీయాలు తనకు కొత్త కాదని, ఇవి తన ముందు నడవవని, కోవర్టులను ఇప్పటికే బయటకు పంపించామని, ఎవరైనా ఉంటే ఏరిపారేస్తామని ఎంపీ అర్వింద్ అన్నారు. శ్రావణి నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. పార్టీని బలోపేతం చేస్తున్న శ్రావణి కోవర్టులకు శత్రువులా కనిపిస్తున్నారని, అందుకే దాడులకు పాల్పడుతున్నారని, తాను వచ్చాక అటాక్ చేసి ఉంటే తన అంగరక్షకుడే కాల్చిపారేసేవాడని పేర్కొన్నారు. సస్పెండ్ అయిన వారి గురించి ఆరేళ్ల తర్వాత ఆలోచిస్తామన్నారు. రాజకీయాలు మానుకుని కేంద్రీయ విద్యాలయానికి చల్గల్లో పదెకరాల స్థలం కేటాయించాలన్నారు. రాబోయే రోజుల్లో జగిత్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10 మందిపై కేసు నమోదు జగిత్యాలక్రైం: బోగ శ్రావణి ఇంటి వద్ద హంగామా సృష్టించిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఎంపీ అర్వింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. బీజేపీ రెబల్స్ సీపెల్లి రవీందర్, సిరికొండ శ్రీనివాస్, సుధాకర్, ప్రజోత్, కమలాకర్, ప్రమోద్, కిశోర్సింగ్, సతీశ్, మరికొంత మంది ఆందోళన చేశారు. వారిపై పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
విద్యార్థుల చదువు ఇదేనా..!
● హెచ్ఎంపై కలెక్టర్ ఆగ్రహంమెట్పల్లి: ‘విద్యార్థుల చదువు ఇదేనా.. ఏం బోధిస్తున్నారు..? ఏం చేస్తున్నారు..’ అని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్పల్లి పట్టణంలోని చావిడి వద్ద ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించారు. తొమ్మిదో తరగతిలోకి వెళ్లి ఓ విద్యార్థిని చదవాలని కోరాగా.. సరిగా చదవలేకపోయాడు. దీంతో ప్రధానోపాధ్యాయురాలిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీసం చదవడం, రాయడం వంటి నైపుణ్యం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. నెలరోజుల్లో మరోమారు పాఠశాలకు వస్తానని, ఆ లోపు విద్యార్థుల పరిస్థితి మెరుగుపడకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యమైన భోజనం అందించాలి అనంతరం కలెక్టర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించారు. పరిశుభ్రతను పాటించడంతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. సౌకర్యాలు, సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వద్దు అనంతరం కలెక్టర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. పన్నుల వసూళ్లపై తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్తి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి మెట్పల్లిరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ అన్నారు. మెట్పల్లి మండలం వెల్లులలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు ఉండాలని సూచించారు. అధికారులు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. హౌసింగ్ పీడీ ప్రసాద్, ఎంపీడీవో సురేశ్, ఎంపీవో మహేశ్వర్రెడ్డి, కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. -
అంజన్న ఆలయ అభివృద్ధికి కృషి● ఇన్చార్జి ఈవో రమాదేవి
ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ జగిత్యాలరూరల్: ఇంటర్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని బోర్డు అబ్జర్వర్ నరేంద్ర కుమార్ అన్నారు. బీర్పూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని గురువారం సందర్శించారు. కేంద్రంలోని సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఘనంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవంమెట్పల్లి: పట్టణంలోని అయ్యప్ప ఆలయ 30వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. యజ్ఞ అర్చకులు నారబట్ల హరిప్రసాద్ చేతులమీదుగా గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప, పంచముఖ ఆంజనేయస్వామికి 108పాదుకలతో అభిషేకం చేశారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పా టు చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, ఆలయ కమిటీ సభ్యులు గంగుల వివేక్, దొమ్మాటి ప్రవీణ్, అంకతి భరత్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు జగిత్యాలరూరల్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే పంపించనున్నట్లు కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శివాజీ తెలిపారు. ఈనెల 27న జరగనున్న స్వామివారి కల్యాణానికి సంబంధించిన తలంబ్రాలను దేవాదాయ శాఖ సహకారంతో పోస్టల్ శాఖ భక్తులకు అందిస్తోందన్నారు. భద్రాచలం వెళ్లి స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తులు.. తమ ఇళ్ల వద్దనే ఉంటూ తలంబ్రాలు పొందేందుకు వీలుగా అన్ని పోస్టాఫీసులలో బుకింగ్ సదుపాయాన్ని తెచ్చామన్నారు. రూ.450 చెల్లించి ప్యాకేజీ బుక్ చేసుకున్న వారికి తలంబ్రాలు, ముత్యం, కుంకుమపు వ్వు, పటికబెల్లం, జీడిపప్పు ప్రసాదంగా అంది స్తామని, రూ.151 చెల్లిస్తే ముత్యాల తలంబ్రాలు మాత్రమే అందుతాయని పేర్కొన్నా రు. ఈనెల 20లోపు సమీపంలోని పోస్టాఫీస్లో సంప్రదించి బుక్ చేసుకోవాలని సూ చించారు. శ్రీరాముడిభక్తులంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
జేఎన్టీయూలో వర్క్షాప్
కొడిమ్యాల: నాచుపల్లి జేఎన్టీయూలో సీఎస్పీ విభాగం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ 4.0 ఎస్సెన్షియల్ ఆన్ ట్రైనింగ్ ఇన్ ఏఐ, ఐవోటీ, ఏడబ్ల్యూఎస్ అంశంపై గురువారం నుంచి మూడు రోజులపాటు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ నరసింహ తెలిపారు. ఎడ్యుటెక్ సంస్థకు చెందిన కల్యాణ్, శ్రీచరణ్ బృందం విద్యార్థులకు ఏఐ, ఐవోటీ, ఏడబ్ల్యూఎస్ వంటి ఆధునిక సాంకేతికలపై శిక్షణ అందిస్తున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, సీఎస్సీ హెచ్వోడీ చత్రపతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ భాస్కర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తొలిసారి నాన్నా అంటున్నా..
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల: ‘తండ్రి ప్రేమ తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా ‘నాన్నా’అని ఇప్పటికి కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని ‘నాన్నా..’అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను..’అంటూ గణపతి కుమారుడు శ్రీనివాసరావు పేరిట ఓ ఆడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలా ఆడియో విడుదల కావడం చర్చకు దారి తీసింది. ఎంతో భావోద్వేగంతో 4.18 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియోలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఒకప్పటి పరిస్థితులతో పోలి్చతే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉందని, నేటి తరానికి మార్గనిర్దేశనం చేసేందుకు రావాలంటూ తన అభిలాషను బయటపెట్టారు. కాగా ఈ ఆడియో గణపతి కుమారుడిదేనని ఓ పోలీస్ ఉన్నతాధికారి నిర్ధారించారు. ఆ ఆడియోలో ఏముందంటే.. అమ్మ కన్నీటితో ఎన్ని మెత్తలు తడిచిపోయాయో.. ప్రతి కుటుంబం చిరునవ్వు వెనక కనబడని ఒక గొప్ప తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానై పెంచింది నన్ను కన్నతల్లి. అమ్మా నీకు వందనం. మీరు ఎంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాన జీవితం ప్రారంభించాక అమ్మ కన్నీటితో ఎన్ని మెత్తలు తడిచిపోయాయో తెలియదు. ఏ బట్ట కట్టిందో.. ఏ తిండి తిన్నదో కూడా ఎవరికీ తెలియదు. సమాజానికి ఎదురుపడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది. నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో, చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం అంటే అది ఆత్మార్పణమే.. ఇది నా అభిలాష ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనేంతగా ఎదిగి సమాంతర ప్రభుత్వం నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. సమాజంలో అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష. -
అమ్మో... పులి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రాంతంలో సేదతీరుతోంది. గురువారం తెల్లవారుజామున అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కదలికలు చిక్కడంతో కచ్చితంగా నిర్ధారణ అయింది. మహారాష్ట్రలోని తడోబా అడవి నుంచి వచ్చిన ఈ పులి కొన్ని నెలలుగా ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో సంచరిస్తోంది.మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్ద పులి కదలికలపై పూర్తి స్థాయి సమాచారం కోసం అటవీ అధికారులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. గట్టుపొడిచినవాగు బ్యాక్వాటర్ ప్రాంతంలో గురువారం అటవీ అధికారుల బృందం పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో బీట్ అధికారి శ్రీదేవికి అలసట రావడంతో అక్కడే ఉన్న కల్వర్టు మీద కూర్చున్నారు.ఇది గమనించకుండా బృందంలోని మిగిలిన సభ్యులు కొంత ముందుకు వెళ్లారు. ఇదే సమయంలో వెనుక వైపు 30 మీటర్ల దూరంలో అలికిడి వినిపించడంతో శ్రీదేవి ఆవైపు చూడగా, పెద్ద పులి నడిచి వెళుతూ కనిపించింది. దీంతో ఆమె అక్కడికక్కడే మూర్ఛపోయారు. కల్వర్టుకు ఇవతలివైపు పడిపోయారు. అధికారుల బృందం తక్షణమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కల్వర్టుకు అవతలివైపు పడిపోయి ఉంటే పులికి ఆహారం అయ్యేదానినని శ్రీదేవి విలపిస్తుండటంతో అధికారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు.ఏ బిడ్డా.. ఇది నా అడ్డామన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పెద్ద పులులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అటవీ శాఖ చేపట్టిన జంగిల్ సఫారీలో భాగంగా పర్యాటకులకు తరచూ పెద్ద పులులు కనిపిస్తూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి విధుల్లో భాగంగా సఫారీ వాహనంలో వెళ్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి.. గుండం వద్ద చెట్ల పొదల నుంచి వచ్చిన పెద్దపులి కనిపించింది. సఫారీ వాహనం దీపాలను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపైనే ఠీవిగా నడుచుకుంటూ సాగిపోయింది. దీంతో అధికారులు తమ సెల్ఫోన్లలో పులి కదలికలను వీడియోలు తీశారు.కెమెరాకు చిక్కిన చిరుతపులిబోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కరత్వాడ గ్రామ శివారులోని లక్కాయి లొద్ది వద్ద చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం కరత్వాడ గ్రామానికి చెందిన ద్యాగాల గంగయ్యకు చెందిన ఆవు.. లక్కాయి లొద్ది వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిని చిరుత దాడిగానే భావించిన అటవీ శాఖ అధికారులు అక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 5.29 గంటల ప్రాంతంలో ఆవు కళేబరాన్ని చిరుత తింటున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆవును చంపింది చిరుతేనని అటవీ అధికారులు ధ్రువీకరించారు. చిరుత సంచారం దృష్ట్యా అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పశువుల కాపరులు, వృద్ధులు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. -
పకడ్బందీగా ప్రజాపాలన
జగిత్యాల: ఈనెల ఆరో తేదీ నుంచి జూన్ 12వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన.. ప్రగతి పాలనను 99రోజులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేయాలని, పారిశుధ్యం, ఉపయోగంలో లేని ఫర్నిచర్, వస్తువులు తొలగించాలని, టాయిలెట్స్, పరిసరాలు, పార్కింగ్ స్థలాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీకేంద్రాలకు మరమ్మతు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యలపై మండలాల వారీగా నివేదిక సమర్పించాలని సూచించారు. బాల్య వివాహాల నియంత్రణకు లైంగిక వేధింపుల కమిటీలు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. ఇందిరా మహిళాశక్తి భవనాలు పూర్తి చేయాలన్నారు. గ్రామపంచాయతీ, అంగన్వాడీలు, సీసీరోడ్లు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలన్నారు. 5కే రన్, 2కే రన్, మారథాన్, యోగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నిరుపయోగంగా ఉన్న వాహనాలను తొలగించాలన్నారు. ఉపయోగంలో లేని బావులను పూడ్చివేయాలన్నారు. కుక్కలకు కు.ని చేయించాలని కమిషనర్లను ఆదేశించారు. రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్నారు. మహాలక్ష్మీ, రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్ పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులపై అడిషనల్ కలెక్టర్ సమీక్ష
బుగ్గారం: మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల ప్రగతిపై అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో కలిసి బుధవారం సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వేసవిలో తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. వసతులు తెలుసుకున్నారు. జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను పరిశీలించి పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. సర్పంచ్ నక్క రాజవ్వ, ఎంపీడీవో సుమం, ఎంఈవో వెంకటేశ్వర్లు, ఎంపీవో వాసవి పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంజగిత్యాల: ఇంటర్ పరీక్షలు ఆరోరోజు ప్రశాంతంగా జరిగాయి. జనరల్ కోర్సులో 6,080 మందికి 5,976 మంది, ఒకేషనల్లో 845 మందికి 807 మంది హాజరయ్యారు. పలు కేంద్రాలను అదనపు కలెక్టర్ లత పరిశీలించారు. ఆమె వెంట డీఐఈవో నారాయణ, తహసీల్దార్ ఉన్నారు. కొండగట్టు ఆలయ ఇన్చార్జి ఈవోగా రమాదేవిమల్యాల: మండలంలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ఇన్చార్జి ఈవోగా రమాదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె వేములవాడ ఆలయ ఈవోగా కొనసాగుతున్నారు. రమాదేవిని అర్చకులు, ఆలయ సిబ్బంది సన్మానించారు. క్షతగాత్రులను కాపాడితే రూ.25 వేలు ప్రోత్సాహకం ేజగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి కి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలు కాపాడిన వారిని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన రహ్వీర్ పథకం ద్వారా రూ.25 వేలు, ప్రశంసపత్రం అందించనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఏటా వేల సంఖ్యలో రో డ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రమా దం జరిగిన తొలి గంటను గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నా రు. కొంతమంది పోలీస్ కేసు అవుతాయనే భయంతో గాయపడిన వారికి సహాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని, ఆ భయాలను తొలగించేందుకు కేంద్రం రహ్వీర్ పథకం అమలు చేస్తోందని వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంట నే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేలు అందించడంతోపాటు, ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులూ ఉండవన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సేవలకు సమాచారం ఇవ్వాలని, సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రాణాలను కాపాడేందుకు భాగస్వామి కావాలని ఎస్పీ కోరారు. -
సరిహద్దు పంచాయితీలు
మెట్పల్లి మండలంలో ఐదు కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి. చెర్లకొండాపూర్, రామారావుపల్లె, పాటిమీదితండా, ఏఎస్ఆర్ తండా, కేసీఆర్తండా గ్రామాలను 2019లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఆయా గ్రామాల్లో పాలనపరమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేనప్పటికీ సరిహద్దు విషయాల్లో మాత్రం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజేశ్వర్రావుపేట వీడీసీ సభ్యులపై ఫిర్యాదు మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట వీడీసీ సభ్యులు చెర్లకొండాపూర్ గ్రామస్తుల విషయంలో ఆంక్షలు విధించారని చెర్లకొండాపూర్ ప్రజలు మెట్పల్లి డీఎస్పీ రాములుకు ఫిర్యాదు చేశారు. మెట్పల్లిలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం డీఎస్పీని కలిసిన చెర్లకొండాపూర్ గ్రామస్తులు.. రాజేశ్వర్రావుపేట వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చెర్లకొండాపూర్ ప్రజలకు రాజేశ్వర్రావుపేట గ్రామస్తులు పాలు పోయరాదని, కిరాణసరుకులు, చికెన్ విక్రయించరాదని, గేదెల కాపరిగా వెళ్లరాదని, చాయ్ పోయరాదని, ఏ విషయంలోనూ సహకరించరాదని, సహకరిస్తే రూ.5 వేలు జరిమానా విధించేలా తీర్మానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెట్పల్లిరూరల్: కొత్త గ్రామ పంచాయతీలను సరిహద్దు సమస్యలు వెంటాడుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా గ్రామాలు అభివృద్ధి బాటలో దూసుకెళ్తున్నప్పటికీ.. కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. విలీనమైన, కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు సరిహద్దు విషయాల్లో వివాదాలు తలెత్తున్నాయి. ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదాలు ఏటూ తేలకపోవడం సమస్యగా మారింది. ముఖ్యంగా ఈ సరిహద్దు పంచాయతీల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లు జోక్యం చేసుకోవడంతో మరింత ముదురుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
జనగణనలో కులగణన చేయాలి
● మాజీ మంత్రి జీవన్రెడ్డి జగిత్యాలటౌన్: దేశంలో చేపట్టనున్న జనగణనలో కులగణన చేసి బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉద్యోగకల్పనతోపాటు సామాజిక న్యాయం చేయాలని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. దేశ జనాభా లెక్కలు తేల్చేందుకు జనగణన చేపట్టబోతున్నామని గతంలో కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో కులగణన కూడా చేపట్టాలన్నారు. కేవలం జనగణనతో ఆశించిన ఫలితాలు రావన్నారు. కులగణన అంశాన్ని అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల మద్దతుతో కేంద్రానికి నివేదిక పంపాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో జనగణనలో కులగణన జరిపేలా ప్రస్తావించాలన్నారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజుల రాజేందర్, జున్ను రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, దేవేందర్రెడ్డి, అబ్దుల్ బారి, చాంద్ పాష ఉన్నారు. -
గోదావరి పుష్కరఘాట్ల పరిశీలన
మల్లాపూర్: మండలంలోని గోదావరి తీరప్రాంతా లైన మొగిలిపేట, ఒబులాపూర్, కొత్తదాంరాజుపల్లి, పాతదాంరాజుపల్లి, వాల్గొండ, వీవీరావుపేట గ్రామాల్లోని పుష్కర ఘాట్లను మెట్పల్లి డీఎస్పీ రాములు బుధవారం పరిశీలించారు. వాల్గొండ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఘాట్ల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా తీసుకోవా ల్సిన చర్యలను పరిశీలించారు. స్టాళ్లు, తాగునీ రు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్ ఇతర ఏర్పాట్లపై ఆరాతీశారు. ఘాట్ల వద్ద మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడకుండా చూస్తామని, బారీకేడ్లు, సీసీ కెమెరాలు, లైటింగ్, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, మళ్లింపు వంటి అంశాలపై దృష్టి సారించామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో జగదీశ్, సర్పంచ్లు గోల్కోండ కళ, తోట మాధూరి, ఎగ్యారపు లింబా ద్రి, రొండ్ల రాజేశ్వరి, తోపారపు వసంత, ధరంసోత్ సురేష్, కనుముల వెంకటేశ్, ఎస్సై అనిల్ పాల్గొన్నారు. -
కీలక పోస్టులు ఖాళీ
జగిత్యాల: జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో కీలకపోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఐదేళ్లకోమారు ప్రజాప్రతినిధులు, బదిలీపై అధికారులు మారుతున్నా.. పోస్టులు మాత్రం భర్తీకి నోచుకోవడం లేదు. ఫలితంగా బల్దియా అభివృద్ధి కుంటుపడుతోంది. ఖాళీ పోస్టుల ప్రభావం ముఖ్యంగా శానిటేషన్పై ప్రభావం చూపుతోంది. పట్టణంలో ఎక్కడ చూసినా శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భర్తీకి ప్రతిపాదనలు బల్దియాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేసే లా చూడాలని కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ డైరెక్టర్కు ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఆలస్యమవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి జగిత్యా ల మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో నియమించి అభివృద్ధికి తోడ్పడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటిలో కీలకమైన పోస్టులు ఖా ళీగా ఉండడంతో అభివృద్ధి పనులు ముందుకు కదలడం లేదని భావించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ డైరెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. పోస్టులు ఖాళీగా ఉండడంతో జిల్లాకేంద్రంలో శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో పర్యవేక్షించేవారు కరువై రోడ్లన్నీ డంపింగ్యార్డులుగా దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీలను వారంలో ఒకసారి కూడా తీయడం లేదు. మురికి కాలువలన్నీ సిల్ట్తో నిండి నీరంతా బయటకు వచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. శానిటరీ ఇన్స్పెక్టర్ను నియమించి ఆ వ్యవస్థను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.శానిటేషన్ అస్తవ్యస్తం -
వావివరసలు మరిచి చెల్లెపై కన్నేసి...
ధర్మపురి: వావివరుసలు మరిచి ఓ యువకుడు వరసకు చెల్లె అయిన బాలికపైనే కన్నేశాడు. ప్రేమ పేరిట వేధించి..శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక గత డిసెంబర్ 8న క్రిమిసంహారక మందు తాగింది. అప్పటినుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్యపల్లెకి చెందిన దంపతులకు కూతురు, కుమారుడు సంతానం. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. పిల్లలను చదివిస్తూ తల్లి ఇంటివద్దనే ఉంటోంది. కూతురు జగిత్యాలలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది. వరసకు సోదరుడైన కోల మహేశ్ బాలికపై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని బాలిక కోరగా.. నిరాకరించిన మహేశ్ ‘చస్తే చావు..’అని చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగులమందు తాగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. విషయం తెలిసిన తండ్రి నెల క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. బాలిక మరణానికి కారణమైన మహేశ్పై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో, రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారులో మంగళవారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన యాదగిరి పరిస్థితి విషమంగా ఉంది. ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాస్గౌడ్, ఎస్సై రాహుల్రెడ్డి సందర్శించారు. వారు తెలిపిన వివరాలు.. కోనరావుపేట మండలం చిన్నబోనాలకు చెందిన రాగుల యాదగిరి– శంకరమ్మ దంపతులు టీవీఎస్ఎక్సెల్ ద్విచక్రవాహనంపై ఎల్లారెడ్డిపేట మండలం ధూమాలలో ఉంటున్న బంధువుల ఇంటికి ఉదయం వచ్చారు. బంధువులను కలిసి తిరిగి వెళ్తున్న క్రమంలో సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంపై ప్రయాణిస్తున్న దంపతులు దూరంగా ఎగిరిపడ్డారు. ద్విచక్రవాహనం నుంచి పెట్రోల్ లీకయి మంటలు ఎగిసిపడి పూర్తిగా కాలిపోయింది. గాయపడిన దంపతులను పోలీసులు 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంలో గాయపడిన దంపతులు వృద్ధ దంపతులకు తీవ్రగాయాలు మంటల్లో కాలిపోయిన ద్విచక్రవాహనం -
అబుదాబి విమానాశ్రయంపై ఇరాన్ దాడి
● పోతిరెడ్డిపల్లి వాసికి గాయాలు ● భయాందోళనలో కుంటుంబ సభ్యులు ● స్వగ్రామానికి రప్పించాలని వేడుకోలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇజ్రాయెల్– ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆదివారం అబుదాబి ఏయిర్పోర్ట్పై జరిగిన దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి వాసికి గాయాలైన ఘటన మంగళవారం వెలుగుచూసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లికి చెందిన నందెల్లి రాజేశ్వర్రావు నాలుగేళ్లుగా బతుకు దెరువు కోసం అబుదాబిలోని ఏయిర్పోర్ట్లో క్లీనింగ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇరాన్ మిసైల్ దాడిలో ఏయిర్పోర్ట్ అద్దాలు పగిలి రాజేశ్వర్రావుకు గాజుపెంకులు చాతి, కుడి చేతి భాగాన కుచ్చుకుపోవడంతో హాస్పిటల్కు తరలించారు. చికిత్స తర్వాత తన గదికి పంపించినట్లు తన సోదరుడు రామారావుకు మెస్సేజ్ పంపించారు. అలాగే ఏయిర్పోర్ట్ సమీపంలో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్కు చెందిన ముగ్గురు మృతిచెందినట్లు సమాచారం అందించినట్లు తెలిపారు. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో స్వదేశానికి వచ్చే పరిస్థితులు లేవని, రెండుమూడు రోజుల్లో విమాన రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలిపినట్లు చెప్పారు. జరిగిన ఘటన తెలుసుకున్న రాజేశ్వర్రావు భార్య మీనా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎలాగైనా స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని రాజేశ్వర్రావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాడుల నేపథ్యంలో అక్కడున్న తమ వారు ఎలా ఉంటారోనని ఆందోళన చెందుతున్నారు. రాజేశ్వర్రావుకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీటీ పర్యంతమయ్యారు. విలపిస్తున్న రాజేశ్వర్రావు కుటుంబ సభ్యులు -
చిప్పకుర్తిలో యువకుడి అదృశ్యం
రామడుగు: రామడుగు మ ండలం చిప్పకుర్తి గ్రామానికి చెందిన బుర్ర సునీల్ గౌడ్(21) మంగళవారం మ ధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని గ్రామస్తులు తెలిపా రు. కుటుంబసభ్యులకు గ్రా విటీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటాన ని చెప్పి ఇంట్లోంచి వెళ్లినట్లు తెలిపారు. సునీల్ గౌడ్ సెల్ఫోన్ కాలువ గట్టుపైన లభ్యమైంది. కాలువలో గ్రామస్తులు గాలించగా రాత్రి వరకు ఆచూకీ లభించలేదని గ్రామస్తుల తెలిపారు. మల్యాలలో యువతి..మల్యాల: మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షేక్ శిరీన్(26) అదృశ్యమైంది. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన షేక్ శిరీన్ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈనెల 2న స్కూల్కు వెళ్లేందుకు జగిత్యాల బస్టాండ్లో బస్సు ఎక్కింది. కానీ.. స్కూల్కు చేరలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతిమానకొండూర్: మానకొండూర్ మండలం శంషాబాద్ గ్రామానికి చెందిన మెరుగు రాయమల్లు(75) బహిర్భూమికని వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మెరుగు రాయమల్లు మంగళవారం సాయంత్రం బహిర్భూమికని ఆరుబయటు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయబావిలో పడి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్ట నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాయమల్లుకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. రాయికల్: మండలంలోని తాట్లవాయి అటవీ ప్రాంతంమీదుగా కలపను అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో వనసంరక్షణ సమితి చైర్మన్ ఆకుల శేఖర్, కొండవేని సంజనమధు, సర్పంచ్ ఆకుల మల్లేశం, కోసరి మహేశ్ కలిసి పట్టుకున్నారు. కలప తరలిస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. దుండగులు ఐదు దుంగలను వదిలి పారిపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సర్పంచ్ జిల్లా అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమణారెడ్డిని వివరణ కోరగా.. అటవీ ప్రాంతంలోకి వెళ్లి కలపను స్వాధీనం చేసుకున్నామని, కొంత మంది అనుమానితులను గుర్తించామని, వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
మృతదేహం కోసం రోడ్డెక్కిన బంధువులు
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వివాహిత బాధనవేణి కావ్య (30) ఫిబ్రవరి 19న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమెదు చేశారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కావ్య అత్తగారు, తల్లిగారు రుద్రంగి. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట కెనాల్ వద్ద మృతదేహం లభించడంతో కావ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహంపై ఉన్న దుస్తుల ఆధారంగా కుటంబ సభ్యులు కావ్యగా గుర్తించారు. అయితే, కావ్య దుస్తులే చూపెట్టారని, మృతదేహాన్ని అప్పగించకుండా ఖననం చేశామని పోలీసులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. మంగళవారం రుద్రంగి మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదుట కోరుట్ల– వేములవాడ ప్రధాన రహదారిపె బైఠాయించారు. మృతదేహాన్ని అప్పగించాలని నిరసన వ్యక్తం చేశారు. కనీసం చివరిచూపు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని అప్పగించాలని కావ్య తమ్ముడు, కొడుకులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు మొదటి నుంచి కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆరోపించారు. కనీసం మృతదేహాన్ని అప్పగించాలని సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని రోదిస్తూ వేడుకున్నారు. కావ్య కొడుకులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కాగా, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో కావ్యగా నిర్ధారించలేమని, డీఎన్ఏ టెస్ట్ ఆధారంగా నిర్ధారణకు వస్తామని బాధితులను సముదాయించారు. -
వెంటాడుతున్న విషాదం
గోదావరిఖని: ఆ కుటుంబాన్ని విషాదం వెంటాడుతూనే ఉంది . తండ్రితో మొదలైన మృత్యువు.. ఆ తర్వాత పెద్దకొడుకు.. ఇప్పుడు చిన్నకొడు కు భార్గవ్(28)నూ కబళించింది. గోదావరిఖని వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎంకాలనీ టీటూ–236 క్వార్టర్లో నివాసం ఉంటూ ఆర్జీ–2 ఏరియా వకీల్పల్లిగనిలో పనిచేసిన మిగినబోయిన గణేశ్– స్వరూప దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. గణేశ్ సింగరేణిలో ఉద్యోగం చేసి గతంలోనే ఉద్యోగ విరమణ చేశాడు. తన స్థానంలో పెద్దకొడుకు అనిల్కుమార్కు ఉద్యోగం ఇప్పించాడు. కొంతకాలానికి అనారోగ్యంతో గణేశ్ చనిపోయాడు. కొంతకాలానికే అనూహ్యంగా జరిగిన గని ప్రమాదంలో అనిల్కుమార్ కూడా మృతి చెందాడు. దీంతో ఇతడి ఉద్యోగం చిన్నకుమారుడు భార్గవ్కు వ చ్చింది. భార్గవ్ కొద్దిరోజులుగా డ్యూటీకి సరిగా వె ళ్లక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. రెండేళ్ల నుంచి అండర్గ్రౌండ్ డ్యూటీ చేయలేక ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబ పోషణకు అప్పు చేసి తీర్చలేక మనోవేదనక గురవుతున్నాడు. సోమవారం కుటుంబసభ్యులతో వేములవాడ, కొమురవెల్లి జాతరకూ వెళ్లి వచ్చాడు. తర్వాత తెల్లవారుమున ఇంటి వెనకాల షెడ్డు పైకప్పుకు ఉరేసుకుని మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ● మొన్న తండ్రి, పెద్ద కుమారుడు.. నిన్న చిన్నకుమారుడు మృతి ● ఉరివేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య ● ఒకేఇంట్లో ముగ్గురి మృతితో తీరని విషాదం -
ముదిరిన భూవివాదం.. మహిళ ఆత్మహత్యాయత్నం
ముత్తారం(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారంలోని కాసార్లగడ్డలో ఇటీవల రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రాంతంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న కేతిరి లక్ష్మి, సారయ్య కుటుంబం స్థలాన్ని కబ్జా చేసిందని, వెంటనే ఖాళీ చేయాలని భూదాతలు, కొందరు పెద్దలు, ఓ సామాజిక వర్గం మధ్య నెలరోజులుగా వివాదం జరుగుతోంది. ఇదికాస్త ముదురి చివరికి దాడి చేసుకునే స్థాయికి చేరింది. సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఇందులో కేతిరి లక్ష్మి గాయాలయ్యాయి. అనేకఏళ్ల నుంచి నివాసం ఉంటున్న తమ ఇంటిని కూలగొట్టి, తమపై దాడి చేశారనే మనోవేదనతో ఆమె పురుగులమందు తాగింది. వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. ఆత్మహత్యాయత్ననికి కారకులపై ఆమె భర్త సారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం నారాయణరెడ్డి, కుమార్, రాజయ్య, సతీశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. మరోవైపు.. ఎరుకుల కుటుంబం దాడి చేసిన, లక్ష్మి ఆత్మహత్యాయత్ననికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేశ్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆర్ల సందీప్, కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు మంథని లింగయ్య డిమాండ్ చేశారు. నలుగురిపై కేసు నిందితులను అరెస్ట్ చేయాలి కార్మిక సంఘూల డిమాండ్ -
‘కల్లు’ తేలేస్తున్నారు !
సిరిసిల్ల క్రైం: కార్మికక్షేత్రంలో కల్లు విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సిరిసిల్ల పట్టణ పరిధితోపాటు చుట్టుపక్కల గ్రామాలలో పెద్దగా తాటి, ఈత వనాలు లేకపోయినా నిత్యం వేలాది లీటర్ల కల్లు మాత్రం విక్రయిస్తున్నారు. పొద్దంతా శ్రమించే నేతకార్మికులు, హమాలీలు, అడ్డాకూలీలు రాత్రి పూట శ్రమను మరిచిపోయేందుకు కల్లును ఆశ్రయిస్తున్నారు. తక్కువ డబ్బులు పెడితే ఒక లీటర్ కల్లు వస్తుందని కార్మికులు, కూలీలు డిపోల వద్దకు పోయి తాగుతుంటారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కల్లు వ్యాపారులు కల్తీకి తెరలేపారు. తీయదనం ఇచ్చే రసాయనంతోపాటు మత్తును ఇచ్చే క్లోరోఫామ్ కలిపి కల్లు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిరిసిల్ల డిపోలలో కల్లు తాగిన వారు ఇంటికి చేరుకునేలోపే మత్తు ఆవహించి రోడ్లపైనే నిద్రపోయే దృశ్యాలు రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిత్యం కనిపిస్తున్నాయి. ఇంతా జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు మాత్రం తనిఖీలు చేస్తున్నామంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కల్లు దిగుమతి సిరిసిల్ల పట్టణానికి జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, జమ్మికుంట ప్రాంతాల నుంచి మూడు రోజులకోసారి మినీ వ్యాన్లలో కల్లును తీసుకొస్తున్నారు. ఇలా మూడు రోజులకోసారి 800 లీటర్ల అసలు కల్లు వస్తున్నట్లు సమాచారం. ఈ కల్లులో నీరు, ఇతర రసాయనాలు కలిపి నిత్యం సుమారు వెయ్యి లీటర్ల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. అధికారికంగా 4 డిపోలే.. అనధికారికంగా డబుల్ సిరిసిల్లలో అధికారికంగా నాలుగు డిపోల ద్వారా కల్లు విక్రయిస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎనిమిది డిపోలు ఉన్నట్లు సమాచారం. ఒక్కో డిపో కింద నాలుగు నుంచి ఐదు దుకాణాలు ఉన్నాయి. రోజుకు వంద లీటర్ల కల్లుమాత్రమే అమ్ముడుపోతున్నట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతుంటే.. వాస్తవానికి అంతకు ఐదింతలు విక్రయిస్తున్నట్లు సమాచారం. అధికారికంగానే సిరిసిల్లకు జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల నుంచి కల్లు తీసుకొచ్చేందుకు అనుమతులు ఉన్నాయి. కానీ సుల్తానాబాద్, జమ్మికుంట ప్రాంతాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యం ఎప్పటికప్పుడు కల్లు కల్తీ నివారణకు తనిఖీ చేయాల్సిన ఎకై ్సజ్ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో కార్మిక క్షేత్రంలో కృత్రిమ కల్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల జారీతోపాటు పలు ఆరోపణల నేపథ్యంలో గతంలో ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్తోపాటు సీఐ స్థాయి అధికారి సస్పెన్షన్ గురైన విషయం తెలిసిందే. ఇప్పటికై నా కార్మిక క్షేత్రంలో కల్తీ కల్లు విక్రయాల నివారణపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. కల్తీ మత్తు.. జీవితాలు చిత్తు సిరిసిల్లలో కనిపించని ఈత, తాటివనాలు పట్టణంలో విచ్చలవిడిగా కల్లు విక్రయాలు కృత్రిమ కల్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఎకై ్సజ్ తనిఖీలపై అనుమానాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం సహజ సిద్ధంగా లభించే కల్లు తాగితే ఎలాంటి నష్టం ఉండదు. కానీ చక్రీన్, క్లోరోఫామ్ కలిపిన కల్లు తాగితే ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. కల్లును ఎక్కువగా కూలీలు, కార్మికులే సేవిస్తుంటారు. ఈ కల్లు తాగిన వారిలో ఎక్కువగా కాలేయ సమస్యలు, కిడ్నీ వ్యాధులు, దృష్టి లోపాలు వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిరిసిల్లలో కూలీలు చాలా మంది ఇలాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పలువురు వైద్యుల ద్వారా తెలిసింది. నిబంధనల ప్రకారం ప్రతీ 15 రోజులకోసారి కల్లు డిపోలను నేనే స్వయంగా తనిఖీ చేస్తున్నాను. శాంపిల్స్ తీసి వరంగల్లో పరీక్షలు చేయిస్తున్నాం. ఇప్పటి వరకు కృత్రిమ రసాయనాలు వాడినట్లు తేల లేదు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తనిఖీలు సజావుగా సాగుతున్నాయి. మద్యం, కల్లు వ్యాపారం అంటేనే విమర్శలు ఉంటాయి. – శ్రీనివాస్, ఎకై ్సజ్ సీఐ, సిరిసిల్ల -
ఆలయాల మూసివేత
ధర్మపురిలో శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు కొండగట్టు ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు వేములవాడలో ఖాళీగా ఉన్న రాజన్న ఆలయ క్యూలైన్లు చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం వేములవాడ రాజన్న, భీమన్న, ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాలను అధికారులు మూసివేశారు. దీంతో ఆలయాల ఆవరణలు బోసిపోయి కనిపించాయి. సాయంత్రం ఆయా ఆలయాల్లో సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతించారు. – వేములవాడ/ధర్మపురి/మల్యాల -
డంపింగ్ యార్డులో మంటలు
జగిత్యాల: జిల్లాకేంద్రం శివారులోని డంపింగ్యార్డు అస్తవ్యస్తంగా మారింది. నిత్యం మంటలు అంటుకుంటున్నాయి. అందులోనుంచి వెలువడే పొగ చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించి ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఓవైపు ఫైరింజన్, మరో వైపు సిబ్బంది జేసీబీ, డోజర్లతో ప్రయత్నిస్తున్నా మంటలు మాత్రం ఆగడం లేదు. మున్సిపాలిటీకి ఖర్చు పెరగడంతోపాటు కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పేరుకుపోతున్న చెత్తాచెదారం డంపింగ్యార్డులో సెగ్రిగేషన్ లేక చెత్తాచెదారం పేరుకుపోతోంది. బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చి పడేస్తుండడంతో మంటలు నిత్యం వ్యాపిస్తున్నాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలతోపాటు మున్సిపాలిటీ సిబ్బంది అక్కడకు వెళ్లేందుకు జంకుతున్నారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడి, పొడి చెత్త ఎక్కడ..? {糆 Ð]l¬°Þç³ÌŒæ çÜÐ]l*-Ðól-Ôèæ…-ÌZ ^ðl™èl¢¯]l$ ™èlyìl, ´÷yìl-V> ÐólÆý‡$-^ólíÜ M>ÇÃMýS$-ÌSMýS$ A…¨…-^éÌS° A«¨M>Æý‡$-Ë$, {ç³gê{ç³-†°-«§ýl$-Ë$ çÜ*_çÜ$¢-¯é²Æý‡$. AÐ]l$-Ë$ÌZ Ð]l*{™èl… BÐ]l$yýl §ýl*Æý‡…-ÌZ E…sZ…¨. M>ÇÃMýS$-Ë$ MýS*yé Ðésìæ° yýl…í³…VŠæ-Ķæ*-Æý‡$z-ÌZ ç³yól-çÜ$¢…yýl-yýl…-™ø ´÷VýS-Ë$ ÐéÅí³-çÜ$¢-¯é²Æ‡$$. °º…«§ýl-¯]lÌS {ç³M>Æý‡… ^ðl™èl¢¯]l$ ™èlyìl, ´÷yìl-V> õÜMýS-Ç…-^éÍ. {糆 ÐéÆý‡$z-ÌZÏMìS ºÍªÄ¶æ* Ðéçßæ-¯éË$ Ððlâê¢Æ‡$$. {ç³fË$ GÌê CõÜ¢ AÌêVóS ç³r$t-MðS-â¶æ$¢-¯é²Æý‡$ ™èlí³µ™ól ÐéÇMìS AÐ]l-V>çßæ¯]l MýS͵…^èl-Ìôæ-MýS-´ù-™èl$-¯é²Æý‡$. ^ðl™èl¢¯]l$ ÐólÆó‡Ó-Æý‡$-V> õÜMýS-ÇõÜ¢ ´÷yìl ^ðl™èl¢¯]l$ Ñ{MýS-Ƈ$$…^ól AÐ]l-M>Ôèæ… E…r$…¨. ™èl §éÓ-Æ> ºÍªÄ¶æ*MýS$ B§éĶæ$… Ð]lçÜ$¢…¨. M>±.. ºÍª Ķæ* A«¨M>Æý‡$-Ë$ ç³sìæt…^èl$-MøÐ]lyýl… Ìôæ§ýl$. ™èlyìl, ´÷yìl ^ðl™èl¢¯]l$ ÐólÆó‡ÓÆý‡$ ^ólõÜ…§ýl$MýS$ ¯]l*MýS-ç³-ÍÏ ÕÐéÆý‡$-ÌZ òÜ{WVóS-çÙ¯ŒS òÙyýl$z °ÇÃ…-^éÆý‡$. §é° °Æý‡Ó-çßæ-׿¯]l$ Ð]l$íßæ-âêçÜ…-çœ*-ÌSMýS$ Aç³µ-W…^éÆý‡$. ÐéÆý‡$ ™èlyìl, ´÷yìl టyìl ^ðl™èl¢¯]l$ ÐólÆý‡$ ^ólíÜ ´÷yìl ^ðl™èl¢¯]l$ Ñ{MýS-Ƈ$$…^éÍÞ E…¨. AƇ$$™ól Mö°² M>Æý‡-×êÌS-™ø ÐéÆý‡$ ^ól™èl$-Ìñæ-™ól¢-Ô>Æý‡$. çÜÒ$ç³…-ÌZ ¯]lÇÞ…V>ç³NÆŠ‡ {V>Ð]l$…-™ø´ër$ ¯éÅMŠS MóS…{§ýl… E…¨. CMýSPyól yýlº$ÌŒæ-»ñæ-yŠæ-Æý‡*… CâýæÏ¯]l$ °ÇÃ…-^éÆý‡$. CâýæÏ-ÌZMìS Mö…§ýlÆý‡$ C糚-yìl-糚yól ^ólÆý‡$-™èl$-¯é²Æý‡$. yýl…í³…VŠæ-Ķæ*Æý‡$z ¯]l$…_ ´÷VýS ÐéÅí³-çÜ$¢…yýl-yýl…-™ø ÐéÆý‡…-™é Cº¾…¨ ç³yýl$-™èl$-¯é²Æý‡$. Ô>ÓçÜ ¡çÜ$-MøÐ]l-yé-°MìS MýSçÙt…V> Ð]l*Ç…§ýl° BÐól-§ýl¯]l Ð]lÅMýS¢…^ól-çÜ$¢-¯é²Æý‡$. °º…«§ýl-¯]lÌS {ç³M>Æý‡… ^ðl™èl¢¯]l$ M>ÌS-aMýS*-yýl§ýl$. ´÷VýS Ð]lõÜ¢ Ð]l$¯]l$-çÙ$ÌS VýS$…yðl, Fí³-dž™èl$¢-ÌSOò³ A«¨MýS {糿êÐ]l… ç³yýl$-™èl$…¨. Ð]l$¯]l$-çÙ$ÌS BÆøVýSÅ…-™ø´ër$, ç³Æ>Å-Ð]l-Æý‡-×ê°² §ðlº¾¡õÜ M>Ë$çÙÅ M>Æý‡-M>ÌZÏ ï³G… 2.5, ï³G… 10, O¯ðl{sZ-f¯ŒS BOMð ÞyŠæ, çÜÌS-¹ÆŠ‡ BOMð ÞyŠæ E…sêÆ‡$$. V>ÍÌZ ï³G… 2.5 Ýë¦Æ‡$$MìS ò³ÇVóS-Mö©ª Ð]l–§ýl$®-Ë$, í³ÌS-ÏË$ Ô>ÓçÜ-MøÔ> ÐéÅ«§ýl$-Ë$¯]l² ÐéÇOò³ ¡{Ð]l {糿êÐ]l… ^èl*õ³ AÐ]l-M>Ôèæ… E…r$…§ýl° OÐðl§ýl$Å-Ë$ ^ðlº$™èl$-¯é²Æý‡$. నిరుపయోగంగా పొడి వనరుల కేంద్రందట్టంగా కమ్ముకున్న పొగలు వారంలో పని మొదలు పొడి వనరుల సేకరణ కేంద్రాన్ని వారంలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఏజెన్సీని మార్చాం. ప్రజలకు తడి, పొడి చెత్త వేరు చేయాలని ఇప్పటికే సూచనలు ఇచ్చాం. ప్రజలు కూడా సహకరించాలి. – స్పందన, మున్సిపల్ కమిషనర్ -
ప్రగతి ప్రణాళికలో కలెక్టర్
జగిత్యాల: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సీఎం సదస్సుకు హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండగట్టు గిరిప్రదక్షిణమల్యాల: కొండగట్టు గిరిప్రదక్షిణలో మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సురేశ్ఆత్మారాం మహరాజ్ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ ప్రదక్షిణ పూర్తి చేశారు. ఖతార్ వలస కుటుంబాల్లో ఆందోళన వద్దుమెట్పల్లి: ఖతార్ దేశానికి ఉపాధి నిమిత్తం వలస వచ్చిన వారి కుటుంబాలు యుద్ధం పట్ల ఎలాంటి ఆందోళనలు చెందవద్దని ఖతార్లోని తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాజా నిజాముద్దీన్ సూచించారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి ఉపాధి కోసం ఖతార్ వచ్చిన వారు వందలాది మంది ఉన్నారని, కొన్ని రోజులుగా అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో తెలంగాణ వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగడం లేదన్నారు. ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఖతార్కు వచ్చిన ఉమ్మడి జిల్లా వాసులంతా క్షేమంగా ఉన్నారని, మీడియాలో వస్తున్న కథనాలను చూసి వారి కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురి కావొద్దని కోరారు. -
గాయత్రి, మృత్యుంజయ యజ్ఞం
ధర్మపురి: మండలంలోని తీగలధర్మారం గీతాశ్రమంలో గాయత్రి, మృత్యుంజయ యజ్ఞం నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గీతాశ్రమ అధ్యక్షుడు వేముల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ ప్రభాకర్, గంధం రమేశ్, ఎన్నం బాపురెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులున్నారు. మల్లన్న సన్నిధిలో అగ్నిగుండాలు కథలాపూర్: మండలంలోని చింతకుంటలో మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కోర్కెలు తీర్చే స్వామి అంటూ భక్తులు అగ్నిగుండంలో నడిచారు. భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేశారు. -
● సమీకృత మార్కెట్ నిర్మాణంలో తీవ్ర జాప్యం ● మూడేళ్లుగా నిలిచిపోయిన పనులు ● అమ్మకందారులకు ఇబ్బందులు
మెట్పల్లి: పట్టణంలో మాంసం, కూరగాయల విక్రయాలు ఒకే చోట జరిగేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ వ్యాపారాలను వేర్వేరు ప్రదేశాల్లో ఎలాంటి వసతులు లేని చోట నిర్వహిస్తుండడం వల్ల అటు వ్యాపారులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఒకే చోట అన్ని వసతులతో ఉండేలా సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు వీటిని మంజూరు చేసింది. మెట్పల్లికి రూ.6.50కోట్లు మంజూరు.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే కారణం.. తప్పని ఇబ్బందులు పనులు కావు..సమస్యలు తీరవుఈ చిత్రం మెట్పల్లిలోని చావిడి మార్గంలో రోడ్డు పక్కన కూరగాయలు విక్రయాలు. పట్టణంలో ప్రత్యేకంగా మార్కెట్ లేకపోవడంతో చావిడితోపాటు వెల్లుల్ల మార్గంలో రోడ్డుకిరువైపులా ఇలా కూరగాయలు విక్రయిస్తున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అసౌకర్యాల మధ్య అమ్మకందారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఐదేళ్ల క్రితం ఖాదీ స్థలంలో సమీకృత మార్కెట్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ ఇంతవరకు ఆ పనులు పూర్తి కాలేదు. అది వినియోగంలోకి వస్తే తమ ఇబ్బందులు తొలిగిపోతాయని భావిస్తున్న అమ్మకందారులకు నిరాశే మిగులుతోంది. -
రోజూ నీరు పెట్టాల్సిందే
గతంలో నాలుగైదు రోజులకోసారి పొలానికి నీరు పెట్టేవాడిని. ప్రస్తుతం ఎండలు ముదురుతుండడంతో ప్రతిరోజూ నీరు పెట్టాల్సి వస్తోంది. దీంతో నీరు లోతుకు పడిపోతోంది. బావుల్లో తొందరగా నీరు ఊట రావడంలేదు. – బద్దం లక్ష్మారెడ్డి, జోగిన్పల్లి, కోరుట్ల నీటిని పొదుపుగా వాడుకోవాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. వర్షాలు కురిస్తేగానీ భూగర్భజలాలు పెరిగే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఉన్న నీటినే రైతులు పొలాలకు పొదుపుగా వాడాల్సిన అవసరం ఏర్పడింది. – జి.నాగరాజు, భూగర్భజల వనరుల అధికారి, జగిత్యాల -
తగ్గుతున్న భూగర్భజలాలు
జగిత్యాలఅగ్రికల్చర్: ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో.. జిల్లాలో భూగర్భజలాలు లోతుకు పడిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే 0.29 మీటర్ల దిగువకు చేరింది. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏప్రిల్, మేలో మరింత లోతుకు పడిపోనున్నాయి. తద్వారా తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా పట్టణాల్లో ఎగువ ప్రాంతాల్లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు మున్సిపాలిటీలు సిద్ధమయ్యాయి. బల్దియాల్లో పెరుగుతున్న నీటి వినియోగం జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో నీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాకేంద్రంలో జనవరిలో 4.61 మీటర్ల లోతులో జలాలు ఉండగా.. ప్రస్తుతం 2.72 మీటర్లకు పడిపోయాయి. ఫిబ్రవరిలో అది 7.33 మీటర్లకు చేరుకుంది. కోరుట్లలో గత నెల 7.28 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం.. 1.11 మీటర్లకు పడిపోయి ప్రస్తుతం 8.39 మీటర్లకు చేరుకుంది. మెట్పల్లిలో గతనెల 5.29 మీటర్ల లోతులో భూగర్భజలం ఉండగా.. 0.7 మీటర్లు పడిపోయి 5.99 మీటర్లకు చేరుకుంది. ధర్మపురిలో గతనెల 4.35 మీటర్ల లోతులో భూగర్భజలం ఉండగా.. ప్రస్తుతం 0.47 మీటర్లు పడిపోయి 4.82 మీటర్లకు చేరుకుంది. ఇటీవల వర్షాలు కురవడంతో రాయికల్ మున్సిపాలిటీలో మాత్రం గతనెల 2.92 మీటర్ల లోతులోనే భూగర్బజలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం 2.83 మీటర్ల లోతులో జలాలు ఉన్నాయి. నాన్ఆయకట్టు ప్రాంతాల్లో అంతంతే జిల్లాలో నాన్ఆయకట్టు ప్రాంతాలైన మల్యాల, మేడిపల్లి, కథలాపూర్, కొడిమ్యాల, మెట్పల్లి ప్రాంతాల్లో భూగర్భజలాలు మరింతగా పడిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో పంటలకు సాగునీటిని ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో భూగర్భజలాలు తగ్గుతున్నాయి. మల్యాల మండలంలో గత నెల 5.07 మీటర్ల లోతులో నీరు ఉండగా.. 0.98మీటర్ల లోతుకు పడిపోయి ప్రస్తుతం 6.05 మీటర్ల దిగువన నీరు ఉంది. కొడిమ్యాలలో గతనెలలో 7.83 మీటర్లు ఉంటే.. 1.8 మీటర్లకు పడిపోయింది. వరదకాలువలో నీరు ప్రవహిస్తుండటంతో కథలాపూర్లో 1.93 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ప్రస్తుతం 0.27 మీటర్లు పెరిగింది. మేడిపల్లిలో 3.68 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టం 0.41 మీటర్లు పెరిగి 4.09 మీటర్లకు చేరుకుంది. ఒక్క నెలలోనే పడిపోయిన నీటి మట్టం జిల్లాలో ఒక్క నెలలోనే నీటి మట్టం సగటున 0.29 మీటర్లకు పడిపోయింది. జనవరిలో 4.20 మీటర్ల లోతులో ఉండగా.. ఫిబ్రవరి చివరినాటికి 0.29 మీటర్లకు తగ్గింది. గతేడాదితో పోల్చితే 0.37 మీటర్లు తగ్గింది. ఆయకట్టు మండలాల్లోనూ అదే స్థాయిలో జిల్లాలో ఆయకట్టు మండలాల్లో ఫిబ్రవరి చివరివరకు నమోదైన భూగర్భజలాలను పరిశీలిస్తే.. బీర్పూర్లో 1.82 మీటర్లు, బుగ్గారంలో 5.42 మీ, ఎండపల్లిలో 6.50 మీ, గొల్లపల్లిలో 3.05 మీ, జగిత్యాలరూరల్లో 2.51 మీ, పెగడపల్లిలో 4.65 మీ, సారంగాపూర్లో 5.43 మీ, వెల్గటూర్లో 2.65 మీ, ఇబ్రహీంపట్నంలో 4.63 మీ, మల్లాపూర్లో 4.86 మీ, భీమారంలో 3.40 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. -
అందరి సహకారంతో బల్దియా అభివృద్ధి
రాయికల్: రాయికల్ బల్దియాను అందరి సహకారంతో అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్గా కట్కం రవి, వైస్ చైర్పర్సన్గా తురగ సౌజన్య, పాలకమండలి సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీతోపాటు జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు విభిన్న తీర్పు ఇచ్చారని, పాలకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఉన్నారని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎంపీ ధర్మపురి అర్వింద్ సహకారం తీసుకుంటామన్నారు. వసంత మాట్లాడుతూ.. రాయికల్ వంటి మేజర్ గ్రామపంచాయతీని బల్దియాగా గుర్తించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. వసతులపై ప్రత్యేక దృష్టి మున్సిపాలిటీలో వసతుల కల్పన దిశగా దృష్టి సారిస్తానని చైర్మన్ కట్కం రవి అన్నారు. పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాల నిర్వహణ వంటి వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. వివిధ పార్టీలు, యువజన సంఘ సభ్యులు పాలకవర్గాన్ని సన్మానించారు. కమిషనర్ కీర్తి నాగరాజు, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, కౌన్సిలర్లు తోపారపు ప్రశాంతి, రాకేశ్నాయక్, తురగ సౌజన్య, కూనారపు మానస, వేముల మౌనిక, ఎలిగేటి లితక, పల్లికొండ గంగాధర్, బత్తిని మహేశ్వరి, మచ్చ గంగలక్ష్మీ, పుర్రె శ్రీధర్, కల్లెడ ధర్మపురి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
కుటుంబాలకు న్యాయం చేయండి
మల్లాపూర్ మండలం మొగిలిపేట శివారులో ఇటీవల ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయండి. ప్రమాదంలో చనిపోయిన గంగు, వైష్ణవి, సంపంగి సాయమ్మ, మంగళారపు లలిత కుటుంబాలు కూలి చేసుకుని బతికేవి. ప్రమాదం జరిగి ఆ కుటుంబాలు మరింత ఇబ్బంది పడుతున్నాయి. – మొగిలిపేట గ్రామస్తులు, మల్లాపూర్ హద్దులు ఏర్పాటు చేయండి నాకు రాపల్లి శివారు సర్వేనంబర్ 147/1లో 11గుంటల భూమి ఉంది. ఆ భూమికి హద్దులు చెరిపేస్తూ కొందరు కబ్జా చేస్తున్నారు. హద్దులు ఏర్పాటు చేయాలని గొల్లపల్లి తహసీల్దార్ను సంప్రదించగా.. ఏవో కారణాలు చూపుతున్నారు. భూమి లేకుంటే జీవనాధారం కోల్పోతాను. భూమికి హద్దులు ఏర్పాటు చేసి న్యాయం చేయండి. – వేముల రాజవ్వ, రాపల్లి, గొల్లపల్లి చిట్ఫండ్ డబ్బులు ఇప్పించండిమాది గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లి. అక్షర చిట్ఫండ్ పేరిట జగిత్యాలలో బ్రాంచ్ తెరిచారు. చీటీలు, డిపాజిట్లు కట్టించుకున్నారు. చిటీ కాలపరిమితి ముగియగా.. డిపాజిట్గా మార్చామంటూ వడ్డీ ఆశచూపారు. డిపాజిట్ల కాలపరిమితి ముగిసే సమయానికి బ్రాంచి మూసేశారు. వరంగల్లోని హెడ్డాఫీసును సంప్రదిస్తే రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. చిట్ఫండ్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని మా డబ్బులు మాకు ఇప్పించండి. కందుకూరి ఆదినారాయణ కొడుకులు పట్టించుకుంట లేరు మాది బుగ్గారం. ఆరో గ్యం సహకరిస్తలేదు. కొడుకులు శ్రీనివాస్, అంజయ్య పట్టించుకుంటలేరు. నాకున్న 20గుంటల భూమిని ఇద్దరికి స మానంగా పంచాను. ఇటీవల భార్య చనిపోయింది. ఆర్నెళ్లు పోషించిన పెద్ద కొడుకు ఇంటినుంచి వెళ్లగొట్టాడు. అదే గ్రామంలో అద్దెకుంటున్న. పింఛన్ రూ.2వేలు మందులకు సరిపోవ డం లేదు. కొడుకులు పట్టించుకునేలా చూడండి. – కొడిమ్యాల రాజయ్య, బుగ్గారం -
ఇక్కడ అభయం!
అక్కడ యుద్ధం..సాక్షిప్రతినిధి,కరీంనగర్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పష్టం చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కార్మికులు, టెక్నీషియన్లు, నర్సులు పశ్చిమాసియా దేశాల్లో పనిచేస్తుండగా, అక్కడి యుద్ధ వాతావరణం కారణంగా వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్రతీరోజు ఫోన్ కాల్స్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. వివిధ రంగాల్లో ఉమ్మడి జిల్లావాసులు ఇజ్రాయెల్– ఇరాన్ సరిహద్దు ఉద్రిక్తతలు, అలాగే కొన్ని గల్ఫ్ దేశాల్లో భద్రతా హెచ్చరికలు జారీ కావడంతో అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లిన కొందరు యువకులు నిర్మాణ రంగంలో, మరికొందరు ఆసుపత్రుల్లో, వివిధ కంపెనీలతో పాటు గృహాల్లో సేవలందిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఏఐ వీడియోలపై అప్రమత్తత సోషల్ మీడియాలో యుద్ధానికి సంబంధించిన పేరుతో కొన్ని ఏఐ రూపొందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏఐ వీడియోలను చూసి గల్ఫ్దేశాల్లో ఉండే కార్మికుల, ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. అయితే ఏఐ వీడియోలను నమ్మి భయపడవద్దని అధికారులు సూచిస్తున్నారు. అధికారిక సమాచారం కోసం భారత రాయబార కార్యాలయాలు, విదేశాంగ శాఖ విడుదల చేసే ప్రకటనలనే అనుసరించాలని సూచించారు. కాగా గల్ఫ్లో ఉన్న వారు సైతం సోషల్ వదంతులు నమ్మవద్దని తాము క్షేమంగానే ఉన్నామంటూ వీడియోలు పోస్టుచేస్తుండడం కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులను ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దుబాయి, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాలో నివసిస్తున్న వారు రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరి అక్కడి నుంచి భారత్కు తిరిగి రావచ్చు. ఒమన్ ప్రవేశానికి ముందస్తు విజిట్/ఈ–వీసా తప్పనిసరి. అమెరికా, యూకే, కెనడా, జపాన్ లేదా షెంగెన్ వీసా ఉన్నవారికి ఆన్–అరైవల్ వీసా సదుపాయం ఉంది. పాస్పోర్ట్ కనీసం ఆరునెలలు చెల్లుబాటు కావాలి. సమాచారం కోసం మస్కట్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. – బండి సంజయ్కుమార్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వందన బరువా: +91 9871999044, సీహెచ్ చక్రవర్తి: +91 9958322143జావేద్ హుస్సేన్: +91 9910014749, రక్షిత్ నాయక్: +91 9643723157 -
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సోమవారం మూడోరోజుకు చేరాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు ఆచరించి అనంతరం దేవాలయాల్లో మొక్కులు చెల్లించారు. భక్తులకు నీడ, నీటివసతి, సరిపడా ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. భక్తులు నృసింహునికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కొబ్బరి బెల్లాలు సమర్పించారు. కాముని దహనంరాయికల్/మల్లాపూర్: రాయికల్లో సోమవారం రాత్రి కాము ని దహనం చేశారు. దహనం మరుసటి రోజు హోలి జరుపుకొంటారు. మల్లాపూర్లో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, వార్డుసభ్యులు, వీడీసీ చైర్మన్ సంగ గంగరాజం, అర్చకులు ప్రభాకర్శర్మ పాల్గొన్నారు. -
శ్రీపాదరావుకు నివాళి
జగిత్యాలటౌన్: శ్రీపాదరావు వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రజలకు సేవచేయడం ద్వారా కీర్తిప్రతిష్టలు గడించారని తెలిపారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్గౌడ్, జీవాకర్రెడ్డి, డీఆర్డీవో రఘువరణ్, ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్కుమార్, డీపీఆర్వో నరేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ హోలీ శుభాకాంక్షలుజగిత్యాల:రంగుల పండగ హోలీ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ ఆనందోత్సవాల మధ్య పండగను జరుపుకోవాలని, జీవితం రంగుల హరివిల్లు కావాలని ఆకాంక్షించారు. సహజ రంగులతో పండుగ జరుపుకోవాలన్నారు. నీటి వృథాను నివారిస్తూ పర్యావరణాన్ని కాపాడేలా పండుగ చేసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 15 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. హోలీని ప్రశాంతంగా నిర్వహించుకోవాలిహోలీని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బలవంతంగా రంగులు చల్లడం, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం, గొడవలకు దిగడం చేయొద్దని సూచించారు. చెరువులు, కాలువలు, లోతైన నీటి కుంటల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. జగిత్యాల కమిషనర్కు మెట్పల్లి బాధ్యతలుమెట్పల్లి: జగిత్యాల బల్దియా కమిషనర్ స్పందనకు మెట్పల్లి కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడి కమిషనర్ మోహన్ రెండురోజుల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. జగిత్యాల కమిషనర్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమె మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. నేడు చంద్రగ్రహణం ధర్మపురి: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఆలయాలను మూసివేయనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన డోలోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రానున్నారు. చంద్రగ్రహణం ఉన్నందున సాయంత్రం 6 గంటలకు నిర్వహించాల్సిన తెప్పోత్సవం, డోలోత్సవం ఉదయం ఆరు నుంచి 7గంటల వరకు మాత్రమే బ్రహ్మపుష్కరిణిలో నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు దర్శనాలు ఉండవని, బుధవారం 5 గంటలకు సంప్రోక్షణ అనంతరం 8 గంటల నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని తెలిపారు. -
డిగ్రీ కళాశాలకు స్థల పరిశీలన
ధర్మపురి: ధర్మపురిలో ఏర్పాటు చేయనున్న డిగ్రీ కళాశాలకు అనువైన స్థలం కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ జూనియర్ కళాశాల మైదా నంలో పరిశీలించారు. సమీప విద్యార్థులు డిగ్రీ చదువు కో సం దూర ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే మానేస్తున్నారని, అందుకే డిగ్రీ కళాశాల మంజూరు చేయించానని తెలిపారు. 2027 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. బీఏ, బీకాం, కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ లైఫ్సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సులు అందుబాటులో తెస్తామన్నారు. ధర్మపురికి బస్డిపో, రెవెన్యూ సబ్ డివి జన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వంటి హామీలు త్వరలోనే నెరవేరుస్తామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, రాజు, నాయకులు దినేష్, జిల్లా అధికారులు తదితరులున్నారు. -
విరాసత్ చేస్తలేరు
మాది కోరుట్ల. బొమ్మెన శివారు సర్వే నంబర్ 59/2లో నా భర్త భూమాచారి పేరిట మూడెకరాలు ఉంది. నా భర్త 2019లో మరణించారు. కొందరు కబ్జాదారులు ఆ భూమిని ఆక్రమించుకుని వారి పేరిట పట్టా చేసుకోవాలని చూస్తున్నారు. నా భర్తకు వారసత్వంగా వచ్చిన భూమిని నా పేరిట విరాసత్ చేయాలని తహసీల్దార్కు అర్జీ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. విరాసత్ చేసేలా చూడండి. – ఉరుమల్ల శ్యామల, కోరుట్ల మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించండి. జిల్లాలో 31వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ప్ర స్తుతం పంట చేతికి వచ్చే సమయంలో బహిరంగా మా ర్కెట్లో వ్యాపారులు ధర తగ్గించి రైతులకు గిట్టుబాటు కాకుండా చేస్తున్నారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆద్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలవాలి. గత ఖరీఫ్లో కథలాపూర్ మండలంలోని 300మంది రైతులకు ఆరు వేల క్వింటాళ్ల బకాయిలు ఇప్పించండి. – జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు -
విన్నపాలు వినవలె..
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. 62 దరఖాస్తులు రాగా పరిశీలించిన ఆయన పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, లత, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు పులి మధుసూదన్, జీవాకర్రెడ్డి, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ‘బెస్ట్’లో ప్రవేశాలు కల్పించండి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో బెస్ట్ అవైలెబుల్ స్కూల్ పథకం కింద ఎస్సీ విద్యార్థులకు సీట్లు కల్పించండి. గౌతమ మోడల్ స్కూల్, మానస, జ్యోతి, అల్ఫోర్స్, శ్రీచైతన్య, ఆక్స్ఫర్డ్, ఏస్ టెక్నోలో ప్రవేశాలు కల్పించి మెరుగైన విద్య అందేలా చూడండి. – ఎమ్మార్పీఎస్ నాయకులు పరిహారం ఇప్పించండి మాది జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట. గ్రామ శివారులోని సర్వే 542, 547/అ లో ఉన్న భూమి మా తండ్రి, స్వర్గీయ పోగుల మల్లయ్య నుంచి వారసత్వంగా వచ్చింది. ఇద్దరం సాగుచేసుకుంటున్నం. ఆ భూమిని జాతీయ రహదారి నిర్మా ణం కోసం సేకరించారు. మాకు రావాల్సిన పరిహా రాన్ని ఇతర వ్యక్తుల పేరిట నమోదు చేసిన ట్లు తెలి సింది. మోఖాపై విచారణ జరిపి న్యా యం చేయండి. – పోగుల రాజన్న, వెంకన్న, అంబారిపేట -
విద్యుత్ సంస్థలో విలీనం చేయండి
జగిత్యాలఅగ్రికల్చర్: ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న అన్మ్యాన్డ్ వర్కర్లను విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని కార్మికులు విద్యుత్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఎస్పీడీసీఎల్ సంస్థ అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించిందని, ఎన్పీడీసీసీఎల్ మాత్రం గుర్తించడం లేదన్నారు. ప్రాణాలకు తెగించి, సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కార్మికులను సంస్థలో విలీనం చేయాలన్నారు. ఎస్ఈ సుదర్శనంకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు తిరుపతి, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, వెంకటరమణ, రాజు, శ్రీధర్, వెంకటేషం, శ్రీకాంత్, రాజేషం, గంగాధర్ పాల్గొన్నారు. మెట్పల్లి ఆర్డీవోగా నర్సింహారావుమెట్పల్లి: మెట్పల్లి రెవెన్యూ డివి జనల్ అధికారిగా నర్సింహారావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన శ్రీనివాస్ను ఖమ్మంకు బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న నర్సింహారావును ఇక్కడకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న ఆయన కలెక్టర్ సత్యప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
అమృత్ 2.0 ఆలస్యం
జగిత్యాల: రానున్నది వేసవికాలం. ఎండలు ముదిరే అవకాశం ఉంది. కనీసం ఈ వేసవిలోనైనా అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న తాగునీటికి సంబంధించిన పనులు పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదు. మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 కింద మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేశాయి. ఈ పథకం కింద వాటర్ ట్యాంక్లు, వాటర్ సంప్, పైప్లైన్లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 2024 జూన్లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఏడాదిలోపే పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. వర్క్ ప్రోగ్రెస్ పూర్తిస్థాయిలో ఎక్కడా కాలేదు. జగిత్యాలలో ధర్మసముద్రం వద్ద ఒక వాటర్ సంప్, 1500 కిలోలీటర్ల ట్యాంక్ నిర్మిస్తున్నారు. సంప్ 70 శాతం పూర్తి కాగా.. వాటర్ ట్యాంక్ పనులు 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న ట్యాంక్ పనులు 40 శాతం కూడా పూర్తి కాలేదు. కొత్తబస్టాండ్ ఆవరణలో నిర్మిస్తున్న ట్యాంక్ ఇంకా 5శాతం పనులు చేయాల్సి ఉంది. పైప్లైన్లు పూర్తయినప్పటికీ ట్యాంక్ల నిర్మాణాల్లోనే జాప్యం జరుగుతోంది. కోరుట్లలో యెఖిన్పూర్లో నిర్మిస్తున్న ట్యాంక్ 80శాతం పూర్తి కాగా.. ఇంకా 20శాతం పూర్తి కావాల్సి ఉంది. పైప్లైన్ పూర్తిస్థాయిలో కాగా.. హౌస్ కనెక్షన్స్ ఇవ్వలేదు. మెట్పల్లిలో ఆరపేట విలేజ్లో చేపట్టాల్సిన పనులు అండర్ ప్రాసెస్లోనే ఉన్నాయి. రాయికల్లో నిర్మిస్తున్న వాటర్ సంప్, ట్యాంక్కు సంబంధించి ప్రభుత్వ భూమి లేకపోవడంతో ప్రైవేటు భూమిని గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ భూ సమస్యతో ఆగిపోయింది. అలాగే ధర్మపురిలో ట్యాంక్ల నిర్మాణంలో ఇంకా 15 శాతం వరకు పనులు పెండింగ్లోనే ఉన్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం? అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న పనుల్లో కాంట్రాక్టర్ల అలసత్వం కనిపిస్తోంది. కొన్ని చోట్ల కాంట్రాక్ట్లు పొందినప్పటికీ పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా పనులు ముందుకెళ్లడం లేదు. పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మున్సిపాలిటీల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని బల్దియాలకు విడుదలైన నిధులుబల్దియా నిధులు (రూ.కోట్లలో) జగిత్యాల 38.06కోరుట్ల 41.05మెట్పల్లి 19.04ధర్మపురి 23రాయికల్ 15.02పెరుగుతున్న పట్టణాలుజిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి అతిపెద్ద మున్సిపాలిటీలు. ఈ బల్దియాల్లో జనాభా ఏటేటా పెరిగిపోతోంది. ప్రతి కాలనీకి నీరు అందించాలన్న ఉద్దేశంతో జనాభాకు సరిపడా ట్యాంక్లు ఏర్పాటు చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ పనులు జరగడంలో ఆలస్యం జరుగుతున్నాయి. వేగంగా జరిగేలా చర్యలు అమృత్ 2.0 పనుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొన్నిచోట్ల స్థల సమస్యతో ఇబ్బందిగా ఉండేది. పనులు నెమ్మదించిన విషయం వాస్తవమే. వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అలసత్వం ప్రదర్శించిన కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశాం. – సంపత్రావు, పబ్లిక్ హెల్త్ ఈఈ -
పాలిషింగ్తోనే పసుపునకు ధర
జగిత్యాలఅగ్రికల్చర్: పసుపు అత్యధికంగా సాగు చేసే జగిత్యాల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి ప్రాంతాల నుంచి పసుపు అమ్మేందుకు నిజామాబాద్, మహారాష్ట్రలోని సాంగ్లీ, జిల్లాలోని మెట్పల్లి మార్కెట్లకు తీసుకెళ్తుంటారు. బహిరంగ మార్కెట్లో పసుపు క్వింటాల్కు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు పలుకుతున్నప్పటికీ.. జిల్లా రైతులకు మాత్రం రూ.10వేల నుంచి రూ.11 వేలకు మించి రావడం లేదు. దీనికి ప్రధాన కారణం పసుపులో సరైన నాణ్యత లేకపోవడమేనని తెలుస్తోంది. అధిక బరువు వస్తుందనే కారణంతో తేమ ఉన్న పసుపును మార్కెట్కు తరలిస్తుండడం.. కొనుగోలుదారులకు ఇంపుగా ఉండేలా పాలిషింగ్ చేయకపోవడంతో ధర తక్కువ పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నాణ్యతలో రాజీ వద్దు.. పసుపులో ప్రధానంగా కుర్కుమిన్ శాతాన్ని బట్టి వ్యాపారులు రేటు నిర్ణయిస్తుంటారు. రంగుల, ఔషధ పరిశ్రమల్లో కుర్కుమిన్ ప్రధాన భూమిక పోషిస్తుంది. గట్టిగా ఉన్న పసుపు కొమ్మును కట్ చేసి.. అందులోని పదార్థాన్ని పరిశీలించి రేటు పెడుతుంటారు. పసుపు కొమ్ములు ప్రకాశవంతంగా కనబడటంతోపాటు నారింజ నుంచి ముదురు నారింజ రంగు ఉంటే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కొనుగోలు చేసిన పసుపులో తేమ ఉంటే బూజు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఏ మాత్రం తేమ లేకుంటేనే అధిక ధర నిర్ణయిస్తారు. పసుపునకు దేశీయంగా పోల్చితే.. అంతర్జాతీయంగా పెద్ద మార్కెటింగ్ వ్యవస్థ ఉండటంతో చాలామంది వ్యాపారులు ఆయా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పసుపును పంపించాల్సి ఉంటుంది. ఆధునిక యంత్రాలతో.. పసుపు పంట కాలం సుమారు 8 నుంచి 9 నెలలు. పంట పండించడం ఒక ఎత్తైతే.. తర్వాత చేసే పనులు మరో ఎత్తు. పంట తవ్వడం, కొమ్ములు విరవడం, పసుపు గడ్డలకు ఉన్న వేర్లు తొలగించడం, పసుపు ఉడుకబెట్టడం, ఆరబెట్టడం, పాలిషింగ్ చేయడం, మార్కెట్కు తరలించడం వంటి పనులు ఓపికతో చేస్తేనే మార్కెట్లో అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పసుపు రైతులు ఆధునిక యంత్రాలను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యాన మిషన్ ద్వారా పసుపును ఉడుకబెట్టేందుకు.. పాలిషింగ్ చేసేందుకు సబ్సిడీపై ఆధునిక యంత్రాలు ఇస్తున్నారు. జిల్లాలోని మేడిపల్లి, మల్లాపూర్ తదితర మండలాల్లో పసుపును భోజ పద్ధతిలో ట్రాక్టర్ ద్వారానే వేస్తుండటం, ట్రాక్టర్ ద్వారానే తవ్వడం చేస్తున్నారు. కొన్ని మండలాల్లో సంప్రదాయ పద్ధతిలో పసుపును ఇనుప చువ్వలతో తవ్వడం ద్వారా కొమ్మలు విరిగిపోవడం, ఉడకబెట్టినప్పుడు మరి చిన్నగా అవడంతో మార్కెట్లో ధర రావడం లేదు. పసుపును ఉడుకబెట్టేందుకు కూడా ఆవిరి యంత్రం వచ్చింది. ఇది పసుపు నాణ్యతను దెబ్బతినకుండా చేస్తోంది. పాలిషింగ్పైనే ప్రధాన దృష్టి రైతులు 9 నుంచి10 నెలలు కష్టపడి పంట పండించి.. చివరి దశ అయిన పసుపును ఉడుకబెట్టి కొంచెం పచ్చిగా ఉండగానే ఎటువంటి పాలిషింగ్ చేయకనే మార్కెట్కు తరలించి భారీగా నష్టపోతున్నారు. పాలిషింగ్ చేసేందుకు కూడా ఆధునిక యంత్రం రావడం రైతులకు పెద్ద సమస్య కాదు. కాని ఉడకబెట్టిన పసుపు కనీసం 10 రోజులు ఎండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు కురుస్తుండడంతో మార్కెట్కు తరలిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు తక్కువ రేటుకు రైతుల నుంచి కొనుగోలు చేసి, కూలీలతో ఆరబెట్టించి, పాలిషింగ్ చేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. నాణ్యత పెంచేందుకు ఆధునిక యంత్రాలు మార్కెట్కు చేర్చే వరకూ రైతులకు పోరాటమే -
పాలకా.. పట్టించుకోవాలిక..!
● రాయికల్లో పేరుకుపోయిన సమస్యలు ● పాలకవర్గానికి స్వాగతం పలుకుతున్న సవాళ్లు ● నేడు పాలకమండలి బాధ్యతల స్వీకరణఅపరిశుభ్రంగా కనిపిస్తున్న మాదిగకుంటరోడ్డు మీదనే కూరగాయలు విక్రయిస్తున్న చిరువ్యాపారులురాయికల్: జిల్లాలోనే చిన్న మున్సిపాలిటీ అయిన రాయికల్లో సమస్యలు పేరుకుపోయాయి. 12 వార్డులు ఉన్న ఈ బల్దియాలో అభివృద్ధి మందగించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌకర్యాలు లేక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. నిధులు లేక మున్సిపాలిటీ లక్ష్యం నీరుగారింది. మొన్నటివరకు పాలకవర్గం లేక.. స్పెషలాఫీసర్ల పాలనలో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం కొత్త పాలకవర్గం ఏర్పడడంతో పట్టణ ప్రజలు వారిపైనే కొండంత భారం వేసి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఎన్నికై న చైర్మన్తోపాటు పాలకమండలిసభ్యులు సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో పట్టణంలో ఏళ్లతరబడిగా ఉన్న సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించి మంచి పాలన అందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. -
నాణ్యత దెబ్బతినకుండా చూస్తాం
తవ్వకంలో.. ఉడుకబెట్టడంలో.. పాలిషింగ్లో పసుపు నాణ్యత దెబ్బతినకుండా చూస్తున్నాం. ఇప్పుడు ఆధునిక యంత్రాలు రావడంతో పసుపు నాణ్యత పెద్దగా దెబ్బతినే అవకాశం లేదు. పసుపులో కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉండే రకాలు రావాల్సి ఉంది. – రాంకిషన్, వెల్దుర్తి, జగిత్యాల రూరల్(మం) తేమ ఉంటే రేటు రాదు చాలామంది రైతులు బరువు వస్తుందనే నెపంతో పచ్చి పసుపును మార్కెట్కు తీసుకొస్తారు. తేమ ఉంటే పసుపునకు బూజు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి తేమ లేకుండా పసుపు కొమ్ములు విరగకుండా.. పాలిషింగ్ చేస్తే మార్కెట్లో అధిక ధర వస్తుంది. – తిరుపతి, వ్యాపారి, జగిత్యాల -
వైభవంగా రథోత్సవం
వెల్గటూర్: ఎండపల్లి మండలం కొండాపూర్లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ స్వామివారి రథం లాగారు. స్వామి దయతో నియోజకవర్గ ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. సర్పంచ్ తాటిపర్తి రాజమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, ఐఎంఏ ఉపాధ్యక్షుడు గురువారెడ్డి పాల్గొన్నారు. మల్లన్నకు బోనాలు కథలాపూర్: మండలంలోని చింతకుంటలో శ్రీమల్లికార్జునస్వామి జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు బోనాలతో ఆలయం వరకు శోభాయాత్రగా వెళ్లారు. స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గు కళాకారుల నృత్యాలు అలరించాయి. దాడులు సరికాదుకోరుట్లటౌన్/మల్లాపూర్: ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు సరికాదని సీపీఐ జిల్లా నాయకుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షు డు సుతారి రాములు తెలిపారు. దాడులను తీ వ్రంగా ఖండించారు. ఒక దేశంపై మరో దేశం దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్నారు. సమస్యలుంటే సైనిక దాడులు కాకుండా దౌత్యపరమైన చర్యలు చేపట్టేందుకు ఐక్యరాజ్య సమితి తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. భారత ప్రభుత్వం శాంతి పరిరక్షణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. శాంతిని నెలకొల్పడం, ప్రజల జీవన హక్కులు కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో ప్రవాస భారతీయులు ఎవరూ ఆందోళన చెందవద్దని గల్ఫ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెనుకుల అశోక్ అన్నారు. ఆదివారం వీవీరావుపేటలో గల్ఫ్ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల చేస్తున్నందున వలస కార్మికులు, ప్రవాస భారతీయుల రక్షణ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొన్నారు. -
ఆశ.. నిరాశేనా
కోరుట్ల: మావో కీలక నేత లొంగుబాటుతో తమ వారి ఆచూకీ దొరుకుతుందన్న ఆశల్లో ఉన్న కుటుంబాలు తీవ్ర నిరాశకు గురవుతున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన తమవాళ్లు పోలీసు రికార్డుల్లో లేరన్న విషయం ఇప్పటికే స్పష్టం కాగా.. కనీసం అజ్ఞాత మావోయిస్టుల్లో ఎక్కడో ఓ చోట ఉండి ఉంటారన్న ఆశలు ఉండేవి. వారంక్రితం మావోయిస్టు కీలక నేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయిన క్రమంలో కోరుట్లకు చెందిన బెజ్జారపు కిషన్, నిజాముద్దీన్ ఆచూకీ వెల్లడి కాలేదు. అసలు వీరిద్దరు ఎక్కడ ఉన్నారన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. తిరుపతి సమకాలీకులే.. కోరుట్లలో తిప్పిరి తిరుపతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న సమయంలో నిజాముద్దీన్ క్లాస్మేట్. వీరికి బెజ్జారపు కిషన్ రెండేళ్లు సీనియర్. కోరుట్ల జూనియర్ కళాశాలలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాల్లో తిరుపతి, నిజాముద్దీన్తోపాటు కిషన్ కూడా పాలుపంచుకునేవాడని సమాచారం. కిషన్ జగిత్యాలలో రాజ్దూత్ వంటి వాహనాల మెకానిక్గా పనిచేసేవాడు. జగిత్యాల జైత్రయాత్ర సమయంలో వీరంతా కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే కాకుండా.. వాల్రైటింగ్స్ రాసేవారని సమాచారం. అంతే కాకుండా 1984–88 మధ్య కాలంలో ఈ ముగ్గురు పోలీసు నిర్భంధం ఫలితంగా ఒకటి రెండేళ్ల కాలంలోనే ఒక్కొక్కరుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతకాలం పాటు వీరంతా ఒకే ఏరియాల్లో పనిచేసి కాలక్రమేణా వేర్వేరు ప్రాంతాల్లోని మావోయస్టు దళాలుగా విడిపోయినట్లు ప్రచారం జరిగింది. నిజాముద్దీన్, బెజ్జారపు కిషన్ మావోయిస్టు టెక్ విభాగంలో పనిచేసినట్లు కొంతకాలం ప్రచారం జరిగింది. ఆ తరువాత కాలంలో వీరి జాడలేకుండా పోయింది. కొన్నాళ్లపాటు పోలీసులు వీరి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి కిషన్, నిజాముద్దీన్ను లొంగిపోవాలని కోరారు. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసు రికార్డుల్లో లేకపోవడం గమనార్హం. ఆశలు అడియాసలు.. ఇటీవల తెలంగాణ డీజీపీ మావోయిస్టుల జాబితా ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో పోలీసు రికార్డుల్లో కిషన్, నిజాముద్దీన్ లేరన్న విషయంలో మరింత స్పష్టత వచ్చింది. ఇక మావోయస్టుల నుంచి తమవారి సమాచారం వస్తుందన్న ఆశలు మిగిలి ఉండేవి. మావోయస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి లొంగిపోతున్నాడన్న సమాచారంతో ఆయన సహచరులు కిషన్, నిజాముద్దీన్ సమాచారం ఆయన వద్ద ఎంతో కొంత ఉంటుందని కుటుంబాలు ఎంతో ఆశపడ్డాయి. తిరుపతి లొంగుబాటు అనంతరం ఎలాంటి సమాచారమూ లేకపోవడంతో కిషన్, నిజాముద్దీన్ కుటుంబాలు నిరాశలో మునిగిపోయా యి. ఏళ్ల తరబడి ఎదురుచూపులతో కాలం గడిపినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ తమవారు ఉన్నారా..? లేరా..? అనే విషయంలో జవాబుదారీ ఎవరు అనే ఆందోళనలో కిషన్, నిజాముద్దీన్ కుటుంబాలు కలత చెందుతున్నాయి. ఇంకా తెలియని బెజ్జారపు కిషన్, నిజాముద్దీన్ ఆచూకీ తిప్పిరి తిరుపతి లొంగిపోయినా లభించని జాడ వారి కుటుంబాల్లో అంతులేని ఆవేదన -
జాగ్రత్తలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం
కోరుట్ల: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వాసవీ కల్యాణ భవనంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా లారీ, కారు, డీసీఎం, ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వాహన చోదకులు ప్రతీ మూడునెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అలాగే డ్రైవింగ్ మధ్యలో విశ్రాంతి కూడా అవసరమని, కంటిన్యూ డ్రైవింగ్తో అలసిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. 210 మంది డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు. మెట్పల్లి డీఎస్పీ రాములు, సీఐ సురేశ్బాబు, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొమ్ముల జీవన్రెడ్డి, సెక్రటరీ లక్ష్మారెడ్డి, వైద్యులు సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు గుర్తింపు
మెట్పల్లి/కోరుట్లరూరల్: అంకితభావంతో పని చేసే ఉద్యోగులకు ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ మోహన్ ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, కమిషనర్గా మోహన్ అందించిన సేవలను అభినందించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, డీఎస్పీ రాములు, డీఆర్డీఏ పీడీ రఘువరన్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కల్లూర్ శివారులో గల కస్తూరిబా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు నమోదు రిజిస్టర్ను పరిశీలించారు. హాస్టల్లోని సదుపాయాలు, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంఈవో నరేశం తదితరులు పల్గొన్నారు. -
అలసిన దళపతి.. మావోయిస్టు గణపతి!
● మాస్టర్ మైండ్కు వయోభారం.. అనారోగ్యం ● ఆపరేషన్ కగార్ ఫినిషింగ్ టచ్ ‘లక్ష్మణుడే’? ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉత్కంఠఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన గణపతి మొదటి నుంచి తిరుగుబాటు స్వభావం గల వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ ఈ ఏడాది మార్చితో ముగుస్తుండడంతో లక్షణ్రావు పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. పలువురు లొంగిపోయారు కూడా.. కగార్ గడువు దగ్గరపడుతుండడంతో పెద్దన్నపైనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది.– సాక్షి,కరీంనగర్ డెస్క్ – వివరాలు 8లో అణగారిన వర్గాల బతుకుల బాగు కోసం ఆరాటపడ్డాడు.. బానిస బతుకులను చూసి కలతచెందాడు.. ఐదు దశాబ్దాల క్రితమే బందూకు పట్టి బరిగీసి నిల్చున్నాడు. భూస్వాముల పాలిట తిరుగుబాటుదారుడయ్యాడు.. బహుజనుల జీవితాల్లో ఆరాధ్యుడయ్యాడు. అజ్ఞాత దళాలకు అగ్రనేతయ్యాడు. బలహీన వర్గాలకు పెద్దన్నగా నిలిచాడు.. ఆయనే ముప్పాళ్ల లక్ష్మణ్రావు ఉరఫ్ గణపతి.గణపతికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు. తల్లిదండ్రులు, ఓ సోదరుడు, సోదరి గతంలో మృతిచెందారు. భార్య విజయ, కుమారుడు శ్రీనివాస్ హైదరాబాద్, అమెరికాలో జీవిస్తున్నారు. స్వగ్రామం బీర్పూర్లో ఆయన రక్త సంబంధికులు ఎవరూ లేరు. ఇల్లు మొత్తం కూలిపోయింది. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా అడుగుజాగే మిగిలింది. -
అప్పు తీర్చాల్సిందే..
జగిత్యాల: మహిళలు సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లింకేజీ, సీ్త్రనిధి రుణాలు అందజేస్తుంది. ఈ రుణాల ద్వారా మహిళ సంఘాల సభ్యులు వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో కొందరు సభ్యులు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో ఆయా గ్రామాలు, మున్సిపాలిటీలు నాన్ పర్ఫార్మ్ అసెట్లోకి పోతున్నాయి. దీంతో సక్రమంగా కట్టిన మహిళలకు సైతం రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మహిళా సంఘాల్లో రుణం ఎత్తుకున్న సభ్యుల్లో ఒక్కరు కట్టకున్నా ఇతరులకు రుణాలు అందేవి కావు. సీ్త్రనిధి అధికారులు కొంత వెలుసుబాటు కల్పించినా కొందరు సభ్యులు చెల్లించడం లేదు. దీంతో మొండిబకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఆస్తులు జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో సెర్ప్, మెప్మా పరిధిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.18 కోట్ల వరకు పెండింగ్లో ఉండగా, ఇందులో దాదాపు రూ.8 కోట్లకు పైగా మొండి బకాయిలున్నాయి. ఇవి చాలా రోజులుగా పెండింగ్లో ఉండటంతో వాటిని వసూలు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లక్ష్యం రూ.110 కోట్లు సీ్త్రనిధి రుణాలు ఈ సంవత్సరం రూ.110 కోట్లు అందజేయాల్సి ఉండగా, ఫైనాన్స్ ఇయర్ ముగుస్తున్న సమయానికి రూ.15 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కొంత మంది తీసుకున్న రుణాలు కట్టకపోవడం వల్ల మొండి బకా యిలతో రుణా ల పంపిణీ లక్ష్యం పూర్తి కా వడం లేదు. అయి తే ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణాలు కట్టించాలన్న ఉద్దేశంతో ఆర్ఆర్ యాక్ట్ను ప్రయోగిస్తోంది. మరో నెలలో ఆర్థిక సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో మళ్లీ సంవత్సరం టార్గెట్ రానుంది. ఈ నెలలోపు రూ.15 కోట్లు పంపిణీ చేసేలా చూస్తున్నారు. ముందుగా అవగాహన సీ్త్రనిధి రుణాలు తీసుకుని చెల్లించని మహిళ సంఘాలతో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పిస్తారు. బకాయిలు చెల్లిస్తే మరింత రుణాలు పొందవచ్చని, వాటి ద్వారా సాధికారత సాధించవచ్చని సీ్త్రనిధి బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. మహిళ సంఘాల్లో గ్రూపులతో పాటు, ఒక్క మహిళకు సైతం రుణాలు అందించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రుణాలు తీసుకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని అవగాహన కల్పిస్తున్నారు. మొండి బకాయిలు వసూలు చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ రికవరీ చట్టంతో భూములు, ఇళ్లు జప్తు చేసే అవకాశం ఉంది. దీంతో మహిళలు ఇప్పటికై నా రుణాలు చెల్లిస్తే మళ్లీ పొంది ముందుకెళ్లే అవకాశం ఉంది. లేకుంటే ఆస్తులను జప్తు చేస్తారు. సెర్ప్ ఆధ్వర్యంలో.. మహిళా సంఘాలు : 14,935సభ్యులు : 1,77,613సీ్త్రనిధి రుణాల లక్ష్యం : రూ.110 కోట్లు పంపిణీ చేసిన రుణాలు : రూ.95 కోట్లు ఇవ్వాల్సిన రుణాలు : రూ.15 కోట్లుపెండింగ్ బకాయిలు : రూ.18 కోట్లకు పైగా చేతివాటం మెప్మా ఆధ్వర్యంలో.. మహిళా సంఘాలు : 5,400 సభ్యులు : 64,200కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో సీ్త్రనిధి రుణాలు ఎత్తుకున్న మహిళలు సంబంధిత ఆర్పీలు, వీవోలకు డబ్బు చెల్లిస్తున్నారు. కానీ, వారు బ్యాంక్లో కట్టకపోవడంతో పెండింగ్ చూపిస్తున్నాయి. గతంలో రాయికల్, మెట్పల్లి, జగిత్యాలలో సొంతానికి వాడుకున్నట్లు బయపడిన విషయం తెలిసిందే. కొంత మందిని సస్పెండ్ చేయగా, మరికొందరిపై రికవరీ పెట్టారు. రుణాలు తీసుకున్న సభ్యులు సంబంధిత సంఘాల అధ్యక్షులకు డబ్బు అందజేస్తున్నారు. వారు బ్యాంకులో చెల్లించకపోవడంతో వివాదాలకు దారితీస్తోంది. బకాయిల వసూళ్లకు చర్యలు సీ్త్రనిధి రుణాల బకాయిలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం. మహిళ సంఘాల సభ్యులు రుణాలను సకాలంలో చెల్లిస్తే మళ్లీ అందించడం జరుగుతుంది. బకాయిలు చెల్లించకుంటే కొత్త రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు. మహిళలు ఇప్పటికై నా గడువులోగా రుణాలు చెల్లించాలి. లేకుంటే రికవరీ యాక్ట్ ప్రయోగించాల్సి వస్తుంది. – రామ్నారాయణ, ఆర్ఎం -
ఉన్నత లక్ష్యాలు చేరేందుకు శ్రమించాలి
జగిత్యాల: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరేందుకు నిరంతరం శ్రమించాలని, పరిశుభ్రత సైతం ఎంతో ముఖ్యమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం పీఎం పోషణ్ తనిఖీల్లో భాగంగా జగిత్యాలలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రత్యేక తరగతులు, రివిజన్ ప్లాన్, మోడల్ పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెస్ కమిటీ వ్యవహారాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. భోజనం బాగుంటుందా.. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులను ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే వంటశాలను తనిఖీ చేసి భోజనం బాగుంటుందా, కూరలు ఎలా ఉంటున్నాయని అడిగి తెలుసుకున్నారు. పీఎం పోషణ్ పథకం లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి అందుతున్న ఆహారం, వసతులపై తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఈవో రాము, తహసీల్దార్ రాంమోహన్, కేజీబీవీ ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 221 మంది గైర్హాజరు
జగిత్యాల: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా జరిగాయి. జనరల్ కోర్సులకు సంబంధించి 6,750 మందికి గానూ 6,614 మంది విద్యార్థులు హాజరు కాగా 136 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 1,142 మందికి 1,057 మంది హాజరు కాగా, 85 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ లత తనిఖీ చేశారు. ఎలాంటి మాల్ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. విద్యార్థులు ఏమైనా ఇబ్బందులుంటే టెలిమానస్కు 14416 ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ఆయిల్పాం లాభాలపై రైతులకు వివరించాలిమల్యాల(చొప్పదండి): రైతులు ఆయిల్పాం సాగు వైపు మళ్లేందుకు సర్పంచులు కృషి చేయాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్యాంప్రసాద్ కోరారు. శుక్రవారం న్యాక్ కేంద్రంలో మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి, ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూర్ మండలాల సర్పంచులకు శిక్షణలో భాగంగా ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించారు. రైతులకు ఆయిల్పాం సాగుతో కలిగే లాభాలు వివరిస్తూ, పంట సాగువైపు మళ్లించాలని సూచించారు. ఆయిల్పాం సాగుకు కోతులు, వన్యప్రాణుల బెడద ఉండదన్నారు. ఎంపీడీవో చిరంజీవి, ఉద్యానవన శాఖ ఏఈవో అనిల్ తదితరులు పాల్గొన్నారు. 1న ప్రవేశ పరీక్షజగిత్యాల: ఐదునెలల ఫౌండేషన్ కోర్సు ఉచిత శిక్షణకు మార్చి 1న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షలో ఎంపికై నవారికి వసతి, భోజన సౌకర్యాలతో పాటు స్టడీ మెటిరియల్స్ అందిస్తారని పేర్కొన్నారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారని, స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షున్ని కలిసిన బీజేపీ కౌన్సిలర్లురాయికల్(జగిత్యాల): రాయికల్ బల్దియాలో బీజేపీ కౌన్సిలర్లుగా కూనారపు మానస, తోపారపు ప్రశాంతి, పుర్రె శ్రీధర్, వేముల మౌనిక ఇటీవల గెలుపొందగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును హైదరాబాద్లో కలిశారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు మున్సిపల్ సమావేశంజగిత్యాల: ఇటీవల నూతనంగా ఎంపికై న మున్సిపల్ కార్యవర్గం శనివారం సమావేశం కానుంది. జగిత్యాలలో స్పెషల్ ఆఫీసర్ కాలంలో అనేక అభివృద్ధి పనులు పెండింగ్లో ఉండటంతో పాటు, పాలకవర్గం లేక అనేక సమస్యలు పేరుకుపోయాయి. శానిటేషన్ అస్తవ్యస్తంగా మారడంతో పాటు, ఇంటి అనుమతుల్లో జాప్యం, బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యం, అభివృద్ధి పనులు నత్తనడక సాగడం లాంటి అనేక సమస్యలున్నాయి. మొదటిసారి సమావేశమవుతున్న మున్సిపల్ కార్యవర్గం సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి కందుకూరి స్వాతి అన్నారు. శుక్రవారం జగిత్యాలరూరల్ మండలం పొలాస రైతు వేదికలో పెరటి తోటల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కనీసం కుటుంబం వరకై నా ఇంటి ఆవరణలో కూరగాయలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రసాయన మందులతో లేని పోని రోగాలు వస్తున్నాయని చెప్పారు. ఏడీఏ తిరుపతినాయక్ మాట్లాడుతూ, రైతులు సంప్రాదాయ పంటలైన వరి, మొక్కజొన్న కాకుండా ఇతర పంటలవైపు దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్ మిల్కూరి శేఖర్, ఉప సర్పంచ్ సంగ తిరుపతి, గుల్లపేట ఎఫ్పీవో చైర్మన్ దమ్మ గంగారెడ్డి, ఏఈవో హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి
రాయికల్(జగిత్యాల): గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. సీఎం రేవంత్రెడ్డి హయాంలో అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, మురికికాలువల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సర్పంచ్ అంజగౌడ్, ఉపసర్పంచ్ చాంద్పాషా, ఎంపీడీవో చిరంజీవి, సీడీపీవో మమత, ఎంపీవో సుష్మ, ఏఈ ప్రసాద్, నాయకులు తంగెళ్ల రమేశ్, తిరుపతిగౌడ్, ముకీద్, మమత, ఆదిరెడ్డి, వెంకన్న, శేఖర్గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కొండగట్టు!
మారనున్నసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇంతకాలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బొగ్గు, గ్రానైట్, ఇసుక లాంటి మైనింగ్ల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సింగరేణి బొగ్గు దేశీయంగా, గ్రానైట్ ఉత్పత్తులు అంతర్జాతీయంగా కరీంనగర్ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేస్తోంది. తాజాగా ఈ జాబితాలో మరికొన్ని మూలకాలు చేరనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లభించే అరుదైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) కావడంతో జాతీయస్థాయిలో పలు మైనింగ్ కంపెనీల కన్ను జిల్లాపై పడింది. రాష్ట్రంలో అరుదైన మూలకాల అన్వేషణకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) మైనింగ్ కోసం దేశవ్యాప్తంగా 11 బ్లాకులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. అందులో తెలంగాణలోని రెండు బ్లాకుల్లో ఒకటి కొండగట్టు సమీపంలో ఉండటం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మూలకాలను తవ్వి తీసుకునేందుకు కావాల్సిన ఎక్స్ ప్లోరేషన్ సర్టిఫికెట్ కోసం కేంద్రం ఇటీవల ఫిబ్రవరి 17న ప్రారంభించిన ఈ బిడ్డింగ్లో ఏప్రిల్ 10 వరకు పాల్గొనేందుకు పలు మైనింగ్ కంపెనీలకు కేంద్ర గనుల మంత్రిత్వశాఖ అవకాశం కల్పించింది. ఇక్కడ మైనింగ్ మొదలైతే కొండగట్టే కాదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వరూపమే మారిపోనుంది. టైటానియం, వనాడియం బ్లాకులు ప్రపంచవ్యాప్తంగా రక్షణ, ఆరోగ్య, మెడికల్, ఐటీ తదితర రంగాల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మార్కెట్కు మంచి డిమాండ్ ఉంది. ఈ రంగంలో చైనా, అమెరికా ప్రపంచ విపణిలో అగ్రగామిగా ఉన్నాయి. భారత్ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) అన్వేషణకు రంగం సిద్ధం చేసుకుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో సిరిసిల్ల– జగిత్యాల జిల్లాల సరిహద్దులోని కొండగట్టు సమీపంలో టైటానియం, వనాడియం బ్లాకును గుర్తించింది. ఇది 202.29 చదరపు కి.మీ మేర విస్తరించి ఉంది. ప్రస్తుతం ఎక్స్ప్లోరేషన్ సర్టిఫికెట్ పొందిన మైనింగ్ సంస్థలు ఇక మైనింగ్ ప్రారంభించనున్నాయి. టైటానియం చాలా బలమైనలోహం. దీని మిశ్రమలోహాలు తేలికై నవి, పలు రకాలుగా వినియోగించుకునే వీలున్నవి. వీటితో తయారయ్యే ఉపకరణాలను వైమానిక, రక్షణ, పెట్రోకెమికల్స్, మెడికల్, ఆటోమోటివ్, క్రీడా, జెవెల్లరీ, పారిశ్రామిక రంగాల్లో వినియోగిస్తుంటారు. ఇక వెనీడియం అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ కలిగి ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వనాడియం కీలకం. ఇది స్థానిక పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. న్లూక్లియర్ పరిశోధనలకు, రక్షణ, గ్లాసు, స్టీలు ఉత్పత్తి, జీవశాస్త్ర పరిశోధనల్లోనూ దీనికి ప్రాధాన్యం ఉంది. -
రెండేళ్లు గడిచినా ఇంకా తాత్సారమే
కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినప్పటికీ ఇంకా పంటల బీమాపథకాలపై తాత్సారం చేస్తూనే ఉంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు రైతులను పగబడుతున్నాయి. ఇటు ప్రభుత్వం పరిహారం ఇవ్వదు, అటు బీమా పథకాలు అమలు చేయదు. – పీసు రాజేందర్రెడ్డి, మూడు బొమ్మల మేడిపల్లి, మెట్పల్లి(మం) ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎవరు ఆదుకోకపోతే రైతులు ఏమి కావాలి. ప్రభుత్వం పరిహారం ఇవ్వలేనప్పుడు, కనీసం పంటల బీమా పథకాలు అమలు చేసి రైతులకు న్యాయం చేయాలి. – బద్దం మహేందర్రెడ్డి, రైతు ఐక్యవేదిక జిల్లా నాయకుడు, కథలాపూర్ -
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
జగిత్యాల: 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అందుకు అన్ని రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గోదావరి పుష్కరాలపై గురువారం అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలకు మన జిల్లాలో అనేక భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటి నుంచే ఘాట్ నిర్మాణాలు, రోడ్డు విస్తరణ, లైటింగ్, ఇతర ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్ పాల్గొన్నారు. -
రైతులెవరూ అధైర్యపడొద్దు
రాయికల్: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, రైతులెవరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. గురువారం రాయికల్ మండలం రామాజీపేటలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. 650 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వ్యవసా య, రెవెన్యూ అధికారులతో నివేదికలు అంచనా వే యించి రెండు రోజుల క్రితమే సీఎంతో మాట్లాడి స మస్య వివరించామన్నారు. త్వరితగతిన నష్టపరిహా రం అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ బెజ్జంకి మోహన్, మండల అధ్యక్షుడు రవీందర్రావు, నాయకులు కోల శ్రీనివాస్, ఏనుగు మల్లారెడ్డి, సురేందర్నాయక్, ఉప సర్పంచ్ సుధీర్, నారాయణ, భరత్, విజయ్, నర్సారెడ్డి, బేతి మోహ న్రెడ్డి, మల్లారెడ్డి, ఏవో ముక్తేశ్వర్ పాల్గొన్నారు. పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలి జగిత్యాల: తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని, విద్యతో పాటు క్రీడలు చాలా అవసరమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని ఈశా, గౌతమ్ స్కూల్లో జరిగిన పవర్ప్లే 2026 స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నా రు. క్రీడలు మానసిక ఉల్లాసం, ప్రశాంతత కల్పిస్తాయని, పోటీతత్వం పెంపొందిస్తుందని అన్నారు. విద్యాధికారి రాము, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి సుధీర్, పాఠశాల కరస్పాండెంట్ కంది అన్నపూర్ణ, డైరెక్టర్ శరత్, కై లాసం, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
జగిత్యాల: జిల్లాలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగా యి. 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా జనరల్ కోర్సులకు 5,927 మందికి గాను 5,832 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 839కి 801 మంది పరీక్షలు రాశారు. అదనపు కలెక్టర్ లత జిల్లాలోని కోరుట్ల, మేడిపల్లి, ఇబ్రహీంపట్నం కేంద్రాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఇంటర్ పరీక్షలకు పటిష్ట భద్రతజగిత్యాలరూరల్: జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. గురువారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పారదర్శకంగా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంలో పోలీసు శాఖ సహకరిస్తుందన్నారు. పరీక్ష విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్ పరీక్షల పరిశీలనరాయికల్: రాయికల్ ఉర్దూమీడియం ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్ పరీక్ష నిర్వహణ, ఉపాధ్యాయుల బోధనను గురువారం డీఈవో రాము పరిశీలించారు. వివిధ అంశాలపై విద్యార్థులను ప్రశ్నించి సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి నీరజ, ఎంఈవో రాఘవులు, ప్రధానోపాధ్యాయులు నజియ, పరిశీలకులు కడకుంట్ల అభయ్రాజ్, ఉపాధ్యాయులు మతిహ తబుస్సం, ఫీల్డ్ ఇన్వెిస్టిగేటర్ తషిఫ అర్ఫిన్ పాల్గొన్నారు. రేపు ఎంప్లాయిమెంట్ కార్డు రిజిస్ట్రేషన్ మేళాజగిత్యాలటౌన్: కలెక్టరేట్లోని ఉపాధి కల్ప నాధికారి కార్యాలయంలో ఈనెల 28న ఉచిత ఎంప్లాయిమెంట్ కార్డు రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బింగి సత్యమ్మ తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఎంప్లాయీమెంట్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. డిజిటల్ హెల్త్ కార్డులపై అపోహలొద్దుజగిత్యాల: డిజిటల్ హెల్త్కార్డులపై అపోహలొద్దని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి అన్నారు. గురువారం ఓల్డ్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సావిత్రి మోహన్రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు. హెల్త్కార్డుల నిర్వహణ ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఉంటుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబసభ్యులందరికీ ఈస్కీం వర్తిస్తుందన్నారు. పీఆర్టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, డీఈవో రాము, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్, హెచ్ఎం చంద్రకళ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్రావు, అమర్నాథ్రెడ్డి, నాయకులు నరహరి, లక్ష్మారెడ్డి, సుజాత, శ్రీనివాస్, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
ధర్మపురి పుణ్యక్షేత్రంలో శుక్రవారం నుంచి జరుగనున్న బ్రహ్మోత్సవాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల పనుల ప్రగతిపై గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నందున సరిపడా వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులంతా సమన్వయంతో పనులు చేపట్టాలని అన్నారు. అనంతరం గోదావరితీరం, మంగలిగడ్డ, ఆలయాలు, కల్యాణ మండపం, బ్రహ్మపుష్కరిణి కోనేరు, ఇసుక స్తంభం తదితర ప్రదేశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, కమిషనర్ శ్రీనివాస్, ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ తదితరులున్నారు. -
బ్రహ్మోత్సవాలకు వేళాయె..
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి మార్చి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది కంటే ఈసారి స్వామివారి ఉత్సవాలను మహా వైభవంగా జరిపించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ల ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు వారి వారి పనులను ముమ్మరం చేశారు. చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, బోధన్, నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆర్చీలు, వేసవి సందర్భంగా చలివేంద్రాలు, ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. గోదావరి నదిలోని పుష్కరఘాట్ల వద్ద భక్తులకు సరిపడా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో అన్నదానం బ్రహ్మోత్సవాలకు వచ్చే వేలాది మందికి అన్నదానం కోసం రైసుమిల్లర్లు, ఆర్యవైశ్యులు, వర్తక సంఘం, ఇతర దాతల సహకారంతో ఉచిత అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 400మంది పోలీసులతో బందోబస్తు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీస్లతో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. -
అటకెక్కిన పంటల బీమా
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటల నష్టం జరుగుతోంది. దీంతో పంటకు పెట్టిన పెట్టుబడులు రాక, బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రైతులకు గుదిబండగా మారుతున్నాయి. ప్రభుత్వాలకు పంట నష్టపరిహారం ఇవ్వడం చేతకానప్పుడు కనీసం రైతులకు ఆమోదయోగ్యమైన పంటల బీమా పథకాలు అమలు చేయాలని రైతులు కోరుతున్నప్పటికీ ఇప్పటికీ అతీగతీ లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినప్పటికీ ఎటువంటి బీమా పథకాలు అమలు చేయకపోవడంతో పంట నష్టం జరిగినప్పుడు రైతుల రోదనలు అరణ్యరోదనలుగానే మారుతున్నాయి. అమలు కాని బీమా పథకాలు రైతులు వేసిన పంటలకు నష్టం జరిగినప్పుడు పరిహారం ఇచ్చి ఆదుకునేందుకు గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రెండు పంటల బీమా పథకాలు అమలు అయ్యేవి. మొదటిది పంటల బీమా పథకం(ఫసల్ భీమా యోజన), రెండోది వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం. ఈ పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లిస్తుండగా, మరికొంత రైతులు చెల్లించేవారు. ఈ పథకాలను ప్రభుత్వాలు ప్రవేశపెట్టినప్పటికీ సరైన నిబంధనలు అమలు చేయకపోవడంతో రైతుల అభిమానాన్ని చూరగొనలేకపోయాయి. పంటల బీమా పథకం రద్దు పంటల బీమా పథకంలో భాగంగా పంట రుణం తీసుకున్న రైతుల నుంచి బ్యాంకులు ప్రిమియం వసూలు చేసి ఇన్సూరెన్సు సంస్థలకు చెల్లించేవి. కాని, పంట నష్టం జరిగినప్పటికీ రైతులకు పరిహారం చెల్లించడంలో ఇన్సూరెన్సు సంస్థలు మీన వేషాలు వేశాయి. దీనికి తోడు, పంట నష్టపోయిన రైతును యూనిట్గా కాకుండా, కొన్ని పంటలకు గ్రామాన్ని, మరికొన్ని పంటలకు మండలాన్ని యూనిట్గా తీసుకోవడంతో ఏ ఒక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం రాలేదు. ఈ పథకంలో పలు లోపాలున్నాయంటూ గతంలోని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాతావరణాధారిత బీమా అధిక ఉష్ణోగ్రతలు, వడగళ్లు, బలమైన ఈదురుగాలులు వంటి వాతావరణ మార్పులతో మామిడి, మిర్చి, పత్తి వంటి పంటలు నష్టపోతే, ఆయా పంటలకు నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వం వాతావరణ ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రైతులు చేరినప్పటికీ పంట నష్టం జరిగినప్పుడు పలు నిబంధనలంటూ ఇన్సూరెన్సు సంస్థలు పరిహారం ఇచ్చేందుకు వెనుకంజ వేశాయి. ఇందుకోసం ప్రతీ మండలంలో ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రాలు ఇచ్చే సమాచారాన్నే ప్రమాణికంగా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగినప్పటికి వాతావరణ కేంద్రం నుండి సరైన సమాచారం పోకపోవడంతో పరిహారం ఇచ్చేందుకు ఇన్సూరెన్సు సంస్థలు నిరాకరించాయి. దీనిపై రైతులు ఆందోళనలు చేశారు. దీంతో ఈ పథకాన్ని సైతం ప్రభుత్వం రద్దు చేసింది. ఊరిస్తున్న పంటల బీమా పథకం ఇప్పటి వరకు ఉన్న బీమా పథకాలు రైతులకు న్యాయం చేయలేకపోయాయని, రాబోయే రోజుల్లో రైతులందరికీ అమోదయోగ్యమైన పంటల బీమా పథకాన్ని తీసుకవస్తామని ప్రభుత్వ పెద్దలు హామీలు గుప్పిస్తున్నా ఇప్పటికీ అతీగతీ లేదు. గ్రామాన్ని యూనిట్గా కాకుండా రైతును యూనిట్గా తీసుకుంటామని, పంటకు నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్సు సంస్థ పరిహారం అందించేలా చూస్తామని చెబుతున్నారు. అలాగే, ఇన్సూరెన్సు సంస్థకు చెల్లించే ప్రీమియాన్ని సైతం రైతులపై భారం పడకుండా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలుపుతున్నారు. అయితే, ఆ పథకాలు ఎప్పుడు అమలవుతాయో కాని, ఇప్పుడైతే నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంట్లో తల్లి మృతదేహం.. ఇంటర్ పరీక్షకు..
జగిత్యాల జిల్లా: ఇంట్లో తల్లి మృతదేహం.. ఆపుకోలేని దుఃఖం.. ఇంతలోనే ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు రాయాల్సి రావడం.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.. అయినా, ధైర్యం తెచ్చుకున్న ఆ విద్యార్థిని.. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరైంది. ఏపీలోని విజయవాడకు చెందిన అనూష–లక్ష్మణ్ దంపతులు ఉపాధి కోసం జగిత్యాల శివారులోని నూకపెల్లి అర్బన్ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నారు. అనూష టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని సాకుతోంది. వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో తెలిసినవారి వద్ద కొంత అప్పు చేసింది. అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో మనోవేదనకు గురైన అనూష ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె పెద్దకూతురు రమ్యశ్రీ బుధవారం ఇంటర్ తెలుగు పరీక్ష రాయాల్సి వచ్చింది. పరీక్ష పూర్తయ్యాక తల్లి అంత్యక్రియలకు హాజరైంది. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది.హాల్కు వెళ్లడమే పెద్ద పరీక్షభద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన దివ్యాంగ విద్యార్థి ఆశాజ్యోతి టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం హెచ్ఈసీ చదువుతోంది. ఆమె నడిచే పరిస్థితి లేక ఎక్కడికైనా వీల్చైర్పైనే వెళ్లి వస్తుంది. బుధవారం ఇంటర్ పరీక్ష రాసేందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ కేంద్రానికి వీల్చైర్లో వచ్చింది. అయితే ఆమె పరీక్ష రాయాల్సిన రూమ్ మొదటి అంతస్తులో ఉంది. దీంతో మెట్లు ఎక్కలేకపోవడంతో కాలేజీ సిబ్బంది, ఆశా వర్కర్ కలిసి మొదటి అంతస్తులోని హాల్ వరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఈ విషయమై సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ బసవమ్మ, డిపార్ట్మెంటల్ అధికారి ఖాసీంను వివరణ కోరగా.. ఆశాజ్యోతికి తర్వాతి పరీక్షలకు కిందనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
హడలెత్తిస్తున్న పెద్ద పులి
● భయాందోళనలో ప్రజలు కొడిమ్యాల: దమ్మయపేట గ్రామంలో పెద్ద పులి ప్రత్యక్షమవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గమనించడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమాచారమందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పాద ముద్రలను పరిశీలించారు. అవి పెద్ద పులివే అని స్పష్టం చేశారు. పులి కనిపించిన వార్తతో గ్రామంలో కలకలం రేగింది. పశువులను బయట వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రాత్రి ఎవరూ బయటకెళ్లొద్దని, పులి కనిపించిన ప్రాంతాలకు పోవద్దన్నారు. పులి ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునేందుకు ఎఫ్ఆర్వో గులం మొయినుద్దీన్, డిప్యూటీ రేంజర్ ముసిరుద్దీన్, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. -
పరిహారమివ్వాలి
పంట నష్టం జరిగినప్పుడల్లా నివేదికలు రూపొందిస్తున్నారు. కాని ఇప్పటివరకు రూపాయి వచ్చిన పరిస్థితి లేదు. ప్రభుత్వాలకు రైతులంటే అంతా అలుసెందుకో అర్థం కావడం లేదు. ప్రస్తుతం జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం ఎకరాకు రూ.20వేల నష్ట పరిహారమందించి ఆదుకోవాలి. – బేతి లింగారెడ్డి, మోరపల్లి, జగిత్యాల రూరల్ప్రభుత్వానికి నివేదిస్తాం ప్రభుత్వ నిబంధనలను అనుసరించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ఆ మేరకు నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నాం. రైతులకు పంట నష్టం జరిగినప్పుడు ఆదుకునేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి పలు సూచనలు చేశాం. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల -
తప్పటడుగులు... రక్తపుమడుగులు!
‘ఈనెల 14న జగిత్యాలరూరల్ మండలం పొరండ్లకు చెందిన ఓ యువకుడు అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసి ఆ కుటుంబంలో గొడవ జరిగింది. ఆ వివాహిత భర్తను వదిలిపెట్టి ప్రియుని కోసం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు మహిళకు ప్రియుడిని అప్పగించారు. కోపోద్రిక్తుడై ఆమె భర్త ఈనెల 14న జగిత్యాలలోని బైపాస్రోడ్లో ఆ యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటనతో భర్త జైలుకు వెళ్లగా, పిల్లలిద్దరూ అభాగ్యులుగా మారారు.’జగిత్యాలక్రైం: మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. రెండు మనసులు కలిసి ఉంటామని చేసే బాసనే పెళ్లి. అయితే ఇటీవల బంధాలు బలహీనమవుతున్నాయి. ఆకర్షణకు లోనై శాశ్వతమైన బంధాలను తెంపేసుకుంటున్నారు. క్షణికావేశంలో చే స్తున్న పనులకు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పిల్లలు ఒంటరివారిగా మిగిలిపోతున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి సక్రమార్గంలో నడిపించాల్సిన పోలీసులు సై తం విఫలమవుతున్నారనే చర్చ సాగుతోంది. పోలీసుల తీరు వివాదాస్పదం కుటుంబ తదాగాదాలతో పోలీస్స్టేషన్ను ఆశ్రయిస్తున్న బాధితులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాలను చక్కదిద్దాల్సి ఉండగా.. పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో విడిపోతున్నారు. జిల్లా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సఖీ కేంద్రంతోపాటు భరోసా కేంద్రాలు ఉన్నా కలహాల కాపురాలుగానే మిగిలిపోతున్నాయి. ఠాణాలకు వచ్చిన వారిని కౌన్సెలింగ్ కోసం పోలీసులు ఈ కేంద్రాలకు పంపించడం లేదు.అయితే ఠాణాలను ఆశ్రయిస్తున్న వారిలో చాలా మంది కౌన్సెలింగ్కు ముందుకురావడం లేదని పలువురు పోలీసులు చెబుతున్నారు. దూరమవుతున్న బంధాలు జిల్లాలో చాలా కుటుంబాలు చిన్నచిన్న తదాగాలతో ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరమవుతున్నారు. దీంతో వారే కాకుండా వారి పిల్లలు కూడా కుటుంబ తగాదాలతో మానసికంగా కుంగిపోతున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా సరిగా లేకపోవడంతో ఆ కుటుంబాలు తరచూ గొడవలతో విచ్ఛిన్నమవుతున్నాయి. రోడ్లపైనే డంపు.. పట్టదా కంపు! -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
జగిత్యాల: జిల్లాలో బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. తొలిరోజు జనరల్ కోర్సులకు 7,049 మందికి గాను 6,879 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 1,112 మందికి గాను 1,029 మంది హాజరయ్యారు. 96.80 శాతం మంది పరీక్షలు రాశారు. జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో ఓ విద్యార్థిని 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఇంటికి పంపించారు. కోరుట్లలో సైతం ఓ విద్యార్థి 10 నిమిషాలు ఆలస్యంగా రాగా.. తిప్పి పంపించేశారు. జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. అదనపు కలెక్టర్ లత కోరుట్లలోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలను పరిశీలించారు. మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ పరీక్షల కన్వీనర్ నారాయణ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ బాలుర జూనియర్ కళాశాలలో తనిఖీ చేశారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఐవో నారాయణ, తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు. -
పరామర్శలే ప్రాప్తం!
జగిత్యాలఅగ్రికల్చర్: ప్రతీ ఏడాది జిల్లాలోని రైతులు అధిక వర్షాలు, వడగండ్లు, బలమైన ఈదురుగా లులు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తమ కళ్ల ముందే ధ్వంసమై.. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. అన్నదాతకు అండగా ఉంటామని చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పంట నష్టపోయిన ప్రతిసారీ అధికారులు నివేదికలు రూపొందించడం.. నష్ట పరిహారమిస్తామంటూ ప్రభుత్వం వాగ్దానాలకే పరిమితమవుతున్నారు. దీంతో పంట నష్టపోయిన రైతులు తమ ఖర్మ అనుకుంటూ దేవుడి మీదే భారం వేస్తున్నారు. లేనిపోని నిబంధనలు పంటలకు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాలు పరిహారమందించాలి. పరిహారమందించే ప్రయత్నాలను ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయాయి. దీనికి తోడు పంట నష్ట పరిహారం విషయంలో ప్రభుత్వం లేనిపోని నిబంధనలు పెట్టింది. దీంతో 33 శాతానికి పైగా పంట నష్ట పరిహారం జరిగితేనే వ్యవసాయాధికారులు నివేదికలు తయారు చేసే పరిస్థితి నెలకొంది. ఒకవేళ నివేదికలను అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు పంపినా.. పరిహారమందడం గగనంగానే మారింది. ప్రతీ ఏడాది అధిక వర్షాలతో వేలాది ఎకరాల పంట దెబ్బతిన్నా.. అధికారులు నివేదికలకే పరిమితమయ్యారు. గతేడాది జిల్లాలో వడగండ్ల వానతో యాసంగిలో పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారమిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఏడాది కావస్తున్నా రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. తూతూమంత్రంగా నివేదికలు ప్రస్తుత యాసంగి సీజన్లో సాగు చేసిన మొక్కజొ న్న, మామిడి పంటలతోపాటు మార్కెట్కు తీసుకెళ్లాల్సిన పసుపు పంట 2 రోజులుగా కురుస్తున్న అ కాల వర్షాలకు నేలవాలి నష్టం వాటిల్లినా.. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట నష్టం జరగలేదని అధికారులు నివేదికలే రూపొందించడం లేదు. రాజకీయ నాయకులు మాత్రం హడావుడి చేసి రైతులను పరామర్శిస్తున్నారు. రైతులు రా జకీయ నాయకుల ఎదుట కన్నీళ్లపర్యంతమవడంతో.. నష్టపోయిన తోటల్లో నుంచే కలెక్టర్తోపాటు వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. అధికా రులు చేస్తాం, చూద్దాం అనే రీతిలో తూతూమంత్రంగా ప్రాథమిక అంచనాలకే పరిమితమవుతూ చేతులు దులుపుకుంటున్నారు. చివరకు పరిహారం ఏమో కానీ.. పరామర్శలే ప్రాప్తంగా మారాయి. వారం రోజుల తర్వాత ఇటు అధికారులు, అటు రాజకీయ నాయకులు, రెతులు సైతం మర్చిపోతున్నారు. -
రేబిస్ భయం..
మెట్పల్లిరూరల్: వేంపేట గ్రామస్తులకు రేబిస్ వ్యాధి భయం పట్టుకుంది. గ్రామంలోని ఓ గేదైపె కొద్ది రోజుల క్రితం వీధి కుక్క దాడి చేసింది. దీంతో అనారోగ్యానికి గురైన గేదెను యజమాని పశు వైద్యాధికారులకు చూపించగా.. రేబిస్ వ్యాధి సోకినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. గేదె పాలను గ్రామంలోని ఓ పాల కేంద్రానికి సరఫరా చేశారు. పలువురికి ఇంటింటికి వెళ్లి అందజేశారు. దీంతో ఆ గేదె పాలు తీసుకున్న వారందరిలో ఆందోళన నెలకొంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 20 మందికి పైగా రేబిస్ నివారణ టీకాలు వేశారు. ఈ విషయంపై మెట్పల్లి మండల వైద్యాధికారి అంజిత్రెడ్డి మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాంటి క్రిములు ఏమైనా ఉంటే పాలను మరిగించే సమయంలో వేడి తీవ్రతకు చనిపోతాయని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. -
పౌష్టికాహారంతోనే ఎదుగుదల
రాయికల్: పౌష్టికాహారంతోనే బాలికలు ఆరోగ్యంగా ఎదుగుతారని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు హమంత్ అన్నారు. బుధవారం భూపతిపూర్ గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో 115 మంది బాలికలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. రక్తహీనతతో బాధపడుతున్న 70 మంది బాలికలకు నెలకు సరిపడా మందులు, శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. బాలికల ఆరోగ్యం, రక్తహీనత ఎలా వస్తుందన్న అంశాలపై ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ అచ్యుత్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాహితి అవగాహన కల్పించారు. సర్పంచ్ గుర్రం భావన, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఆర్ఎంపీ జక్కుల రాజేంద్రప్రసాద్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు బొల్లె చిన్నయ్య, ఉపాధ్యాయులు తాటిపల్లి వేణుగోపాల్, సురేశ్, శైలజ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదుజగిత్యాలటౌన్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణిపై జగిత్యాల నాయకులు ఫిర్యాదు చేశారు. బుధవారం హెదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును కలిసి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపు, పార్టీ నిధుల దుర్వినియోగంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంపీ అరవింద్ అండదండలతో పార్టీని తన సొంత జాగీరుగా భావిస్తూ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లను అవమానాలకు గురి చేస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అన్నారు. సీనియర్ నాయకులు రవీందర్రెడ్డి, ఏసీఎస్ రాజు, చందా సుగుణాకర్, అక్కినపెల్లి రవీందర్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, ఆంకారి సుధాకర్, భగవంతరావు, శ్రీనివాస్, నవ్వోతు సురేశ్, బుర్ర ప్రమోద్, కూర్మాచలం సతీశ్, బిట్టు తదితరులున్నారు. నవోదయతో నాణ్యమైన విద్యకోరుట్ల: కోరుట్లలో నవోదయ విద్యాలయం ఏర్పాటుతో ప్రాంతీయ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. పట్టణ శివారులోని సంగెం రోడ్డులో నవోదయ విద్యాలయం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని బుధవారం పరిశీలించారు. భూమి విస్తీర్ణం, సరిహద్దులు, రహదారులు, మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించేలా స్థలం ఎంపిక చేయాలన్నారు. స్థలంలో భూవివాదాలు లేకుండా చూడాలన్నారు. ఆర్డీవో జీవాకర్రెడ్డి, తహసీల్దార్ కృష్ణచైతన్య, డిప్యూటీ తహసీల్దార్ ఫారూఖ్ తదితరులున్నారు. గోడపై సంతకాలుమెట్పల్లి: గోడ ఏంది.. దానిపై ఎకై ్సజ్ సిబ్బంది సంతకాలు చేయడం ఏమిటి అనుకుంటున్నారా? అవును నిజమే. మెట్పల్లి ఎకై ్సజ్ కార్యాలయంలో హాజరు నమోదు రిజిస్టర్ అందుబాటులో లేక.. అందులో పని చేసే కొందరు సిబ్బంది అక్కడే ఉన్న గోడపై తమ పేరు రాసి సంతకాలు చేస్తున్నారు. విధులకు హాజరైనట్లు దానిపై చూపుతున్నారు. కార్యాలయంలో ఉండాల్సిన హాజరు రిజిస్టర్ను కొన్ని రోజుల క్రితం సీఐ తన వెంట తీసుకవెళ్లినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఆయన కార్యాలయానికి రాకపోవడంతో సిబ్బంది ఇలా గోడపై సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. విధుల్లో చేరినప్పటి నుంచి సీఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. -
రివార్డు ఇప్పించండి
ప్రభుత్వ పిలుపు మేరకు తుపాకీ వదిలి జనజీవన స్రవంతిలో కలిసిన. రివార్డు ఇప్పటివరకు రాలేదు. ఆర్థిక ఇబ్బంది పడుతున్న. సొంత ఇల్లు కూడా లేదు. లొంగిపోయిన సమయంలో ఛత్తీస్గఢ్, రాష్ట్ర ప్రభుత్వ రివార్డులు ఇప్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఏడాది గడుస్తున్నా అందించడం లేదు. – పసుల వసంత, మాజీ మావోయిస్టు, కోరుట్ల కులబహిష్కరణ చేసిండ్రు మాది ధర్మపురి మండలం దొంతాపూర్. ఎస్సీ నేతకాని కులానికి చెందిన నేను.. బీర్పూర్ మండలం కోమన్పల్లికి చెందిన ఎస్టీ నాయకపు కులానికి చెందిన బర్ది పవన్ను 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న. పెళ్లయిన 15 రోజుల నుంచి కుల పెద్దలు కుల బహిష్కరణ పేరుతో కక్ష సాధిస్తున్నారు. వారి వేధింపులు భరించలేకపోతున్నం. కోమన్పల్లిలో ఉండొద్దంటూ హెచ్చరిస్తున్నాడు. ఎలాంటి శుభకార్యాలకు పిలడం లేదు. ఈ విషయమై గతంలోనూ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. కుల బహిష్కరణ పేరిట వేధిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి. – పసుల సంగీత, పవన్ దంపతులు, దొంతాపూర్ గ్రామం -
సన్నవడ్ల బోనస్ ఇప్పించండి
మాది బుగ్గారం మండలం మద్దునూర్. 2024– 25 యాసంగిలో గ్రామ రైతులందరం ప్రభుత్వానికి సన్న వడ్లు విక్రయించినం. ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ ఇప్పటివరకు మా ఖాతాల్లో జమచేయలేదు. బోనస్ వెంటనే ఇప్పించండి. – మద్దునూర్ గ్రామ రైతులు భూమిలోకి పోనివట్లేదు సూరంపేట శివారు సర్వేనంబర్ 167/21లో 1.38 ఎకరాల భూమిని నా భర్త బానాల ఎల్లయ్యకు ప్రభుత్వం 40 ఏళ్ల క్రితం ఇచ్చింది. ఆయన మరణానంతరం నా పేరిట మార్పిడి చేయించుకున్న. ఇటీవల కొందరు ఆ భూమి తమదంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. సాగుచేసుకోకుండా అడ్డుకుంటున్నారు. విచారణ జరిపి భూమికి హద్దులు పెట్టాలని కొడిమ్యాల తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన. ఆ భూమికి సంబంధించిన రికార్డులు లేవని, సబ్డివిజన్ రికార్డు అందుబాటులో లేనందున కొలతలు వేయలేమని తహసీల్దార్ నివేదిక ఇచ్చారు. ఆ భూమిలోకి వెళ్లవద్దంటూ స్వయంగా తహసీల్దారే ఆంక్షలు విధిస్తున్నారు. మోకాపై విచారణ చేపట్టి న్యాయం చేయండి. – బానాల ఎల్లవ్వ, సూరంపేట, కొడిమ్యాల మండలం -
మత్తు పదార్థాల నిర్మూలనకు సమష్టి కృషి
జగిత్యాల: మత్తుపదార్థాల నిర్మూలన అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్కుమార్తో కలిసి అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. మత్తుపదార్థాల రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి యువతను దారితప్పించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటిపై పాఠశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతోపనిచేసి యువతను రక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ, పోలీసుల ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తున్నామని, సరిహద్దుల వద్ద తనిఖీలు మరింత కట్టుదిట్టం చేస్తామని వివరించారు. అనుమానం వస్తే ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఆర్డీవోలు శ్రీనివాస్, మధుసూదన్, జీవాకర్రెడ్డి పాల్గొన్నారు.రోడ్డు ప్రమాద నివారణకు బ్లాక్స్పాట్ల గుర్తింపు రోడ్డు ప్రమాద నివారణకు బ్లాక్స్పాట్లు గుర్తించామని కలెక్టర్ అన్నారు. రహదారి భద్రత కమిటీ, ఎస్పీతో కలిసి మాట్లాడారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్సిగ్నల్స్ పనిచేయడం లేదని, మరమ్మతు కోసం ఏజెన్సీకి నోటీసులు ఇవ్వాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మంచినీళ్ల బావి సమీపంలో లైట్ల మరమ్మతు చేపట్టాలని కమిషనర్ను ఆదేశించారు. గొల్లపల్లి బైపాస్రోడ్లో భవాని రోడ్ సమీపంలో గుంతలు పూడ్చాలన్నారు. ఎన్హెచ్63, ఎన్హెచ్563 రహదారులపై సైన్బోర్డులు తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. -
సర్వేతో సరి.. పరిహారం ఊసేది..?
కథలాపూర్: వానకాలం సీజన్లో అష్టకష్టాలు పడి వరి పంట సాగు చేయగా.. భారీ వర్షంతో చేతికందే దశలో తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయ అధికారులు అప్పట్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి బాధిత రైతుల వివరాలు సేకరించారు. నాలుగు నెలలు దాటినా ఇప్పటివరకు పరిహారం రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబుతున్న పాలకులు.. పరిహారం మంజూరు గురించి పట్టించుకో వడం లేదని బాధిత రైతులు మండిపడుతున్నారు. అక్టోబర్లో భారీ వర్షాలు జిల్లాలోని ఆయా గ్రామాల రైతులు వానకాలం సీజ న్లో మూడు లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. అక్టోబర్లో వరి పంట ఎదిగి చేతికొచ్చే సమయంలో భారీ వర్షం కురిసింది. వరి పంట నేలవాలగా.. వరి గింజలు రాలిపోయాయి. చేతికందే సమయంలో భారీ వర్షం తమకు నష్టం చేసిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. దిగుబడి రాకపోక.. పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి ఏర్పడిందని లబోదిబోమన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు సుమారు 20వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు అప్పట్లో అధికారులు అంచనా వేశారు. ఎకరానికి రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఇప్పటికీ పరిహారం దిక్కులేదని మండిపడుతున్నారు. మరోవైపు అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరి పంట వివరాలు మాత్రమే సేకరించారు. ఆ తర్వాత పట్టించుకోలేదని జిల్లాలోని ఆయా మండలాల రైతులు ఆరోపిస్తున్నారు. అక్టోబర్ చివరి వారం, నవంబర్ నెలలో కురిసిన వర్షాల ఆధారంగా నష్టపోయిన పంటల వివరాలు సేకరిస్తే బాగుండేదని అంటున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొర వ చూపి భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరి హారం ఇప్పించాలని అన్నదాతలు కోరుతున్నారు. -
రాజన్నకు స్వయం ప్రతిపత్తి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్వయం ప్రతిపత్తి అమల్లోకి వస్తే ఆలయ పరిపాలనలో విస్తృత మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. ఆలయ పనర్నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల్లో స్వతంత్ర నిర్ణయాధికారం లభించనుంది. హుండీ ఆదాయం, దానాల వినియోగం, అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ, సిబ్బంది నియామకాలు వంటి అంశాల్లో ఆలయ ట్రస్ట్ బోర్డు స్వయంగా నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. దేవాదాయశాఖ పర్యవేక్షణ పరిమితస్థాయిలో మాత్రమే కొనసాగనుందని తెలుస్తోంది. ఈ అంశంపై శ్రీసాక్షిశ్రీలో వెలువడిన కథనాలకు ప్రభుత్వం స్పందిస్తూ, ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలే తమ ప్రాధాన్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఆలయ పనర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాలు, విస్తరణ, క్యూలైన్ వ్యవ స్థ ఆధునీకరణ, వసతిగృహాల నిర్మాణం, పార్కింగ్ విస్తరణ, డిజిటల్ సేవల అమలు వంటి కార్యక్రమాలు వేగవంతం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయం పూర్తిగా అభివృద్ధి, సేవా కార్యక్రమాలకే వినియోగించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. స్వయంప్రతిపత్తి అమలులో పారదర్శకత, బాధ్యతాయుత నిర్వహణ కీలకమని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆలయ పరిపాలనలో అనుభవజ్ఞుడైన ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమిస్తే సమర్థవంతమైన పాలన సాధ్యమవుతుందనే వాదన వినిపిస్తోంది. దీంతో వేములవాడ క్షేత్రం రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందే అవకాశముంది. ఉగాది నాటికై నా పూర్తయ్యేనా? రాజన్న ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం భీమన్నఆలయంలో భక్తులకు రాజన్న దర్శనాలు కల్పిస్తున్నారు. రాజన్న ఆలయ పునర్మిర్మాణంలో భాగంగా అధికారులు కట్టడాలను తొలగించడం వరకే ఆరునెలల సమయం గడిచింది. ఇప్పటి వరకు పిల్లర్లు వేసిన దాఖలాలు లేవు. సమ్మక్క జాతరకు లక్షలాది మంది భక్తులు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. సమ్మక్క, శివరాత్రి జాతర ముగిసింది. కానీ రాజన్న దర్శనాలు మాత్రం భక్తులకు కలగడం లేదు. సమ్మక్క, శివరాత్రి జాతరల ఉత్సవాల సమయంలో రాజన్న దర్శనాలు ఉంటాయని భావించిన భక్తులకు నిరాశే మిగిలింది. భీమన్నను దర్శించుకున్న తరువాత కూడా రాజన్న మెట్ల వద్ద మొక్కి పోయిన భక్తులకు రాజన్న దర్శనం ఇంకెన్ని నెలలు పట్టవచ్చని ఎదురుచూస్తున్నారు. కనీసం ఉగాది నాటికైనా పునర్నిర్మాణ పనులు పూర్తిచేయాలని భక్తులు కోరుతున్నారు. ధర్మగుండం స్నానాలు భక్తులకు విశ్వాసం రాజన్న ధర్మగుండంలో స్నానాలు చేస్తే ఎలాంటి అంటువ్యాధులైనా పోతాయని భక్తులకు ప్రగాడ విశ్వాసం. ధర్మగుండంలో స్నానం చేసి తడి బట్టలతో రాజన్నను దర్శించుకుంటారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ధర్మగుండంలో స్నానాలకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో భక్తులకు కొంత నిరాశ కలిగిస్తోంది. భీమన్న ఆలయానికి వెళ్లే దారిలో నల్లాలు, షవర్లతో జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 14 మంది బాధితులు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 14 మంది అర్జీలు సమర్పించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడిన ఎస్పీ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ‘సీపీఎస్’ బకాయిలు చెల్లించండిజగిత్యాలరూరల్: సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు విడుదల చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గంగధరి మహేశ్ అన్నారు. కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. డీఏలను వాయిదాల రూపంలో చెల్లించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయి రూ.1200 కోట్లకు చేరిందన్నారు. ఉపాధ్యాయులు ప్రసాద్, శంకర్, శ్రీనివాస్, ప్రవీణ్, శ్రీనివాస్, ఉమేశ్, మురళీ, రాజు, శ్రావణ్, నవీన్, వసంత, రేఖ, హేమలత, శ్రీలత, వాసవి పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన అవసరంజగిత్యాల: సీపీఆర్పై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని డీఎంహెచ్వో సుజాత అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లో విద్యార్థులకు సీపీఆర్పై అవగాహన కల్పించారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రథమ చికిత్స చేయవచ్చని, తద్వారా ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు. వైద్యులు లవకుమార్, కో–ఆర్డినేటర్ మురళీ, శ్యామ్ పాల్గొన్నారు. చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వండిజగిత్యాలటౌన్: మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసే బదులు చెరువులు, కుంటల విస్తీర్ణానికి అనుగుణంగా నగదు అందించాలని మాజీమంత్రి జీవన్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం సీఎంకు లేఖ రాశారు. సకాలంలో చేప పిల్లల పంపిణీ చేపట్టకపోవడం.. పరిమాణం చిన్నగా ఉండడంతో ఆశించిన స్థాయిలో ఎదగలేదని, మత్స్యకారులు ఆశించిన స్థాయిలో ప్రయోజనం పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. చేప పిల్లల పంపిణీ ఆగస్టు, సెప్టెంబర్ వరకే పూర్తి చేయాల్సి ఉంటుందని, జిల్లాలో మొత్తం 756 చెరువులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 154 చెరువుల్లో మాత్రమే పిల్లలు వదిలారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు చెరువులు, కుంటల విస్తీర్ణానికి అనుగుణంగా నగదు బదిలీ చేపట్టాలని కోరారు. విద్యార్థులకు తెలుగు ప్రతిభా పరీక్ష మల్యాల: మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తెలుగు ప్రతిభ పరీక్ష నిర్వహించారు. మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి కాంప్లెక్స్ పరిధిలో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. విజేతలు విక్కి, సాత్విక్ రెడ్డి, ఎల్.శ్లోక, పి.మోక్షకు డీఈవో రాము బహుమతులు అందించారు. ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎంఈఓ జయసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
మూడెకరాల్లో నష్టపోయా
వానాకాలం సీజన్లో మూడెకరాల్లో వరి సాగుచేసిన. పంట ఎదిగిందని సంతోషపడిన. మరికొద్ది రోజుల్లోనే కోయాలని అనుకున్నా. అంతలోనే భారీవర్షాలు కురిసి పంట నేలవాలింది. గింజలు రాలిపోయాయి. 80 శాతం వరి పంట నష్టపోయింది. ప్రభుత్వం రైతులకు పరిహారం త్వరగా ఇవ్వాలి. – గడ్డం రాజేశ్వర్రెడ్డి, రైతు, భూషణరావుపేట రైతులను ఆదుకోవాలి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలి. వానకాలం సీజన్లో వరి పంటకు నష్టం జరిగితే నాలుగు నెలలు గడిచిన పరిహారం ఇవ్వకపోవడం దారుణం. నేతలు పరిహారం ఇప్పించడంలో నిర్లక్ష్యం చేయవద్దు. ఎకరానికి రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. – కిరణ్రావు, రైతు, తాండ్య్రాల ప్రభుత్వ ఆదేశాలు రావాలి అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా వరి పంటకు నష్టం జరిగినట్లు నివేదిక పంపించాం. వర్షాలు కురిసిన తర్వాత ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం వివరాలు రూపొందించారు. పరిహారం విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. మంజూరు కాగానే రైతుల ఖాతాలో జమ చేస్తాం. – యోగితా, మండల వ్యవసాయ అధికారి -
పురం.. ఆదాయమే మూలం
జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కొత్త పాలకవర్గం ఎన్నికై ంది. బల్దియాలను అభివృద్ధి వైపు నడిపించాలన్నా.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలన్నా ఆదాయ వనరులే ఆధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు వివిధ మార్గాల ద్వారా మున్సిపాలిటీలకు సమకూరే ఆదాయ వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటేనే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కొత్త పాలకవర్గాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు పట్టణ ప్రజలు. మున్సిపాలిటీలకు ప్రధానంగా ఆస్తిపన్నే ఆధారం. జగిత్యాలలో రూ.13 కోట్ల డిమాండ్ ఉండగా.. కోరుట్ల, మెట్పల్లిలో రూ.6 కోట్ల నుంచి రూ.7కోట్లుగా ఉంది. ప్రతి మున్సిపాలిటీల్లో ఈ నిధులతోనే అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంటుంది. బల్దియాల్లో ఖాళీ స్థలాలకూ ఆస్తిపన్ను విధించే అవకాశం ఉన్నా.. గత పాలకవర్గాలు ఎప్పుడూ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఖాళీ స్థలాలపై దృష్టి పెట్టాలి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలో మున్సిపల్ స్థలా లు అత్యధికంగా ఉన్నాయి. ప్రధానమైన చోట ఉండటంతో ఎక్కడబడితే అక్కడ ఆక్రమణలకు పాల్ప డి మున్సిపాలిటీలకు నామమాత్రపు ఫీజులు చెల్లిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఖాళీ స్థలాలపై దృష్టి పెట్టి ఆదాయం పన్ను పెంచుకుని ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. తైబజార్ కొన్ని మున్సిపాలిటీల్లో లేదు. దీనిని కూడా ఏర్పాటు చేసుకుంటే మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. పలు నిధుల ద్వారా ఆదాయం 14వ ఆర్థిక సంఘం నుంచి కేంద్రం ఏటా రెండుసార్లు నిధులు విడుదల చేస్తుంది. జనాభాను బట్టి ఈ నిధులు వస్తుంటాయి. వీటిని ప్రణాళిక, ప్రణాళికేతర పనులకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. స్వచ్ఛభారత్, పట్టణప్రణాళికకు వీటిని వినియోగిస్తుంటారు. స్టేట్ ఫైనాన్స్ ద్వారా వచ్చే నిధులను పారిశుధ్యం, ఇతరత్రా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. వీటి ద్వారా కాలనీలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఇలా అనేక మార్గాల ద్వారా మున్సిపాలిటీలకు నిధులు వస్తుంటాయి. వీటిని సక్రమమైన పద్ధతిలో వినియోగిస్తే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. -
కరీంనగర్లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి
కరీంనగర్రూరల్/గోదావరిఖని: అత్తింటి వేధింపులను భరించలేక భార్య ఆత్మహత్య చేసుకోగా.. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త ఆదివారం మృతిచెందాడు. వారం రోజుల వ్యవధిలో దంపతులు మరణించడం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు..గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగి కంబాల నరేశ్(30) ఏడాదిక్రితం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపలి్లకి చెందిన లింగంపల్లి మమత(29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గోదావరిఖనిలోని గంగానగర్లో నివాసముండగా వరకట్నం కోసం కుటుంబంలో గొడవలేర్పడ్డాయి. సోదరుడు మహేశ్కు చెప్పడంతో రూ.లక్ష ఇచ్చినప్పటికి మమతపై కుటుంబసభ్యుల వేధింపులు ఆగకపోవడంతో ఈ నెల 15న నస్పూర్కాలనీలోని బంధువుల ఇంటికి మమత వెళ్లింది. మరుసటిరోజు ఇంటి యజమాని ఫోన్ చేసి నరేశ్ మెట్లమీదనుంచి కిందపడిపోయి ఆపస్మారకస్థితిలో ఉన్నాడని చెప్పడంతో మమత గోదావరిఖనికి వచ్చింది. సింగరేణి ఆస్పత్రిలో చేర్పించగా నరేశ్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 17న ఆస్పత్రిలో ఉన్న మమతను అత్తింటివాళ్లు దూషించడంతో మనస్తాపానికి గురై తీగలగుట్టపలి్లలోని రైల్వేట్రాక్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మమత తండ్రి పోషం ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు. ఆదివారం వేకువజామున 4గంటలకు చికిత్స పొందుతూ భర్త నరేశ్ మృతిచెందాడు. దంపతులకు గోదావరిఖనిలో గొడవలు కావడంతోపాటు నరేశ్ శరీరంపై గాయాలుండటంతో తదుపరి విచారణ నిమిత్తం మృతదేహాన్ని గోదావరిఖనికి పంపించినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. నరేశ్ మృతిపై తండ్రి కంబాల భూమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో గోదావరిఖని వన్టౌన్ ఎస్సై మనోహర్ కేసు నమోదు చేశారు. -
వైభవం.. వెంకన్న కల్యాణం
తిమ్మాపూర్: మండలంలోని ఎల్ఎండీకాలనీ ఆండాళ్, లక్ష్మీ సమేత వేకంటేశ్వరస్వామి ఆలయ 47వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం స్వామివారి కల్యాణాన్ని ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, శ్రీకాంతా శేషాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గిరిజ ముత్యుంజయేశ్వరస్వామి ఆలయం తరఫున కమిటీ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు. మహిళా భక్తులు అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఒంటెల రవీందర్రెడ్డి, సంగెం లక్ష్మణ్రావు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జగిత్యాల: ఈనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈసారి 30కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. సీసీ కెమెరాలు నిఘా వేయనున్నాయి. విద్యార్థులందరూ ఉదయం 8.45గంటలకే కేంద్రాలకు చేరాల్సి ఉంటుంది. ప్రత్యేక కారణాలు ఉంటే మాత్రం 9.05గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి నారాయణ ప్రకటించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. -
వృథాగా.. భగీరథ నీరు
మెట్పల్లి: పట్టణ పరిధిలోని వెంకట్రావ్పేటలో జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ నుంచి వృథాగా పోతున్న నీరు ఇది. ఐదు రోజుల క్రితం పైపులైన్కు లీకేజీలు ఏర్పడడంతో అక్కడి నుంచి భారీగా నీరు వృథాగా పోతోంది. ఈ లీకేజీలకు సోమవారం నుంచి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించిన అధికారులు.. 25 తేదీ వరకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గడిచిన ఆరు నెలల్లో వెంకట్రావ్పేటలోనే మూడు, నాలుగు చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. తరచుగా ఎక్కడో ఓ చోట లీకేజీలు ఏర్పడుతుండడం.. వాటికి మరమ్మతులు చేపట్టడం అధికారులకు తలనొప్పిగా మారింది. మరోవైపు లీకేజీలతో కలుషిత నీరు సరఫరా కావడం, రోజుల తరబడి సరఫరా నిలిచిపోతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
నృసింహుని బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
వెల్గటూర్: మండలంలోని కిషన్రావుపేటలోగల నాగపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ను ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆదివారం ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. సర్పంచ్ కుమ్మరి సునీత, ఆలయ కమిటీ చైర్మన్ నైనాల అజయ్, కోటిలింగాల ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేశ్, మాచర్ల రాజేందర్ పాల్గొన్నారు. గంగమ్మతల్లికి మంత్రి పూజలు ధర్మపురి: గోదావరి ఒడ్డున నిర్మించిన గంగమ్మతల్లికి మంత్రి పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం బోరు, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దోనూర్లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. -
కమనీయం.. రమణీయం
రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్లో శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితులు గిరిధరాచార్యులు, అభిరామ్, హరికృష్ణ, వెంకటకృష్ణచార్యులు, వెంకటరమణ, రమణ ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం రథోత్సవాన్ని పురవీధుల మీదుగా శోభాయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం భావన, ఉపసర్పంచ్ మూగల సంజీవచారి, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఏనుగు ముత్యంరెడ్డి, ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. స్వామివారిని ఎమ్మెల్సీ రమణ, మాజీమంత్రి జీవన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బోగ శ్రావణి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. -
జత కోసమా..జాగ కోసమా..!
కోరుట్ల: నాలుగేళ్ల జే–1 టైగర్ 15 రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా అడవుల్లో తల్లి నుంచి విడిపోయి అడవిలో సంచారం మొదలెట్టింది. పగటిపూట కొండలు, గుట్టల్లో దాక్కుని.. రాత్రివేళ గ్రామీణ ప్రాంతాల సమీపంలో ఉన్న అడవుల నుంచి సంచరిస్తోంది. వారంక్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పరిసర ప్రాంతాల అటవీ ప్రాంతాల్లో తిరిగి.. అక్కడక్కడా పశువులపై దాడులు చేసి చంపుతూ ప్రస్తుతం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోతుకురావుపేట సమీప అడవులకు చేరుకుంది. ఆదివారం ఉదయం మోతుకురావుపేట సమీపంలో ఓ చిన్నకుంట వద్ద పెద్దపులి పాదముద్రలు ఓ రైతుకు కనిపించాయి. ఈ విషయాన్ని అటవీ అఽధికారుల దృష్టికి తీసుకురాగా.. వారు గాలింపులు చేపట్టారు. జత కోసమేనా.. జే–1 టైగర్ సిద్దిపేట పరిసరాలతోపాటు అడవుల్లో జత కోసం సంచరిస్తోందా..? లేక అనువైన ప్రదేశంలో నివాసముండటానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తుందా..? అన్న విషయంలో స్పష్టత రాలేదు. అనువైన ప్రాంతాల ఎంపిక కోసం పెద్దపులులు ఆయా ప్రాంతాలకు ఒకటికి రెండుసార్లు వచ్చిపోవడం ఆనవాయితీ. మేడిపల్లి మండలం మోతుకురావుపేట వద్ద పెద్దపులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు అక్కడక్కడ మల విసర్జన ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. గతేడాది ఇదే సమయంలో కొడిమ్యాల మండలం కొండాపూర్ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టించింది. ప్రస్తుతం కొడిమ్యాలకు దగ్గరలోనే మేడిపల్లి– మోత్కురావుపేట–గోవిందారం అటవీ ప్రాంతం ఉండటంతో మరోసారి ఈ ప్రాంతంలో సంచరించడం గమనార్హం. ప్రత్యేక బృందాలతో గాలింపు మేడిపల్లి మండలం మోత్కురావుపేట వద్ద కనిపించిన పెద్దపులిని పట్టుకోవడానికి మహారాష్ట్రలోని పుణే నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించారు. మోతుకురావుపేట–చందుర్తి వైపు ఉన్న అటవీ ప్రాంతం, కొడిమ్యాల–సూరారం వైపు ఉన్న మరో అడవితో పాటు కొండగట్టు సమీపంలోని అటవీ ప్రాంతాల్లోనూ గాలింపుల కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని రైతులను, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. పెద్దపులి సంచారంతో హడలుతున్న జనం యాదాద్రి నుంచి మోత్కురావుపేటకు -
ఈనామ్కే వాస్తే..
● లోకల్ వ్యాపారులే ఈ–నామ్లో ధరల నిర్ణయం ● రైతులకు అందే ధరలు అంతంతేజగిత్యాలఅగ్రికల్చర్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ మార్కెట్లలో ఈ–నామ్ ఆన్లైన్ కొనుగోలు పద్ధతిని కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 14న ప్రవేశపెట్టింది. కానీ.. క్షేత్రస్థాయిలో రైతు పంట ఉత్పత్తులను స్థానిక వ్యాపారులే కొనుగోలు చేస్తుండడం ద్వారా ఈ–నామ్ ప్రతిఫలాలు అన్నదాతలకు అందడం లేదు. ఫలితంగా మార్కెట్ వ్యవస్థ నామ్కే వాస్తేగా మారిపోయిందంటున్నారు. జిల్లాలో జగిత్యాల, మెట్పల్లి, గొల్లపల్లిలో ఈ–నామ్ మార్కెటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టినప్పటికీ అందులో లోకల్ వ్యాపారులే రేటు నిర్ణయిస్తుండటంతో పెద్దగా ఒరిగిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు. పోటీతత్వం పెంచేలా.. మార్కెట్కు రైతులు తీసుకొచ్చిన ఉత్పత్తులకు అధిక ధర పలికేలా.. వ్యాపారుల్లో పోటీ ఏర్పడేలా.. కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా ఈ–నామ్ మార్కెటింగ్ వ్యవస్థను తీర్చిదిద్దారు. ఇందుకోసం మార్కెట్యార్డుల్లో కంప్యూటర్లు, ఆపరేటర్లను నియమించారు. రైతుల పంట ఉత్పత్తులను లోకల్ వ్యాపారులతోపాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులూ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల మార్కెట్లను ఈ–నామ్కు అనుసంధానం చేశారు. ఈ విధానంలో ఆన్లైన్లో ఈ–బిడ్డింగ్ పద్ధతిలో విక్రయాలు చేపడతారు. ఈ పద్ధతిలో రైతులు మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి వ్యాపారుడు సరుకు కొని.. రైతులు బయటకు వెళ్లే వరకు ఇ–ఎంట్రీ, ఇ–టెండరింగ్, ఇ–పేమెంట్, ఇ–పర్మిట్..ఇలా అన్ని రకాల ప్రక్రియ ఆన్లైన్ పద్ధతిలోనే కొనసాగుతాయి. క్షేత్రస్థాయిలో లోకల్ వ్యాపారులే దిక్కు ఈ–నామ్ పద్ధతి ఉన్న మార్కెట్లలో రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు లోకల్ వ్యాపారులే దిక్కయ్యారు. రైతులు మార్కెట్యార్డుకు పంట ఉత్పత్తులు తీసుకరాగానే.. కమీషన్ ఏజెంట్లు ఇ–ఎంట్రీ పద్ధతిలో తమ దుకాణానికి ఎంత సరుకు వచ్చిందనే విషయాన్ని మార్కెట్లోని ఈ–నామ్లో ఎంట్రీ చేయిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులు యార్డుల్లో తిరిగి.. కాగితంపై రేటు రాసుకుని.. ఆ రేటును ఇ–టెండరింగ్లో నమోదు చేయిస్తున్నారు. ఫలితంగా ఎప్పటి మాదిరిగానే వ్యాపారుల్లో పోటీలేకపోవడంతో రైతులకు అనుకున్న స్థాయిలో ధర రావడం లేదు. ఆయా మార్కెట్లలోని కొనుగోలుదారులు ఏదోరేటును కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. ఆ రేటును కమీషన్ ఏజెంట్లు రైతులకు చెప్పడంతో ఇదేం ఖర్మరా బాబు అనుకుంటూ.. ఆ రేటుకే రైతులు సంతృప్తి చెందుతున్నారు. నాణ్యత పరికరాలు లేవు స్థానిక వ్యాపారుల్లోనూ పోటీ లేకపోవడం, బయటి వ్యాపారులు అసలు ఈ–నామ్లో పాల్గొనకపోవడంతో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదు. మార్కెట్లకు రైతులు తీసుకొచ్చిన ఉత్పత్తుల్లో నాణ్యత పరీక్షించే పరికరాలుగానీ, వసతులుగానీ లేవు. తేమశాతం, మట్టి, పక్వంరాని, చెడిపోయిన, రంగు మారిన ధాన్యం శాతం ఏ మేరకు ఉందనే విషయాలను మార్కెట్ సిబ్బంది ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుంది. అవేమీ ఈ–నామ్ మార్కెట్లలో కనబడకపోవడంతో నామమాత్రంగా వ్యవస్థను కొనసాగిస్తున్నారు.ఫలాలు అందడం లేదుత్వరలో నాణ్యత ల్యాబ్లుజగిత్యాల, గొల్లపల్లి, మెట్పల్లిలోని ఈ–నామ్ మార్కెట్లలో ఉత్పత్తుల నాణ్యత పరీక్షించే ల్యాబ్ను ఏర్పాటు చేయబోతున్నాం. మార్కెట్లలో వసతులు కల్పిస్తున్నాం. ఉత్పత్తులను ఇ–టెండరింగ్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. – ప్రకాష్, మార్కెటింగ్ అధికారిఈ–నామ్ ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఒక్క రైతు ధాన్యాన్ని కూడా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొన్నది లేదు. నామమాత్రంగానే నడిపిస్తున్నారు. ఉత్పత్తుల కొనుగోలుకు వ్యాపారులు పోటీపడితేనే రైతులకు మంచి ధర వస్తుంది. – పడిగెల రవీందర్ రెడ్డి, రాయికల్ -
ఎత్తుకు పైఎత్తు.. అనైతిక పొత్తు
కోరుట్ల: మున్సిపాలిటీల్లో చైర్మన్గిరీని తమ ఖాతాలో వేసుకోవాలన్న ఆత్రుతలో రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు, ఆశయాలు వదిలి అనైతిక పొత్తులకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో.. రెండింట్లో ఈ వైఖరి తేటతెల్లమైంది. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి నేరుగా చైర్మన్గిరీని దక్కించుకునే స్థాయిలో కౌన్సిలర్ స్థానాలు రాగా.. మెట్పల్లి, రాయికల్లో మాత్రం హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలు సిద్ధాంతాలు విస్మరించి అడ్డగోలు పొత్తులకు తెరలేపాయి. పార్టీల అంతర్మథనం మెట్పల్లి, రాయికల్ మున్సిపాటీల్లో హంగ్ పరిస్థితుల్లో పార్టీలు తరతమ బేధాలు వదిలేసి పొత్తులకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మెట్పల్లి మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ క్రాస్ ఓటింగ్ వెనక పార్టీ పెద్దల ప్రమేయం ఉందా..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాయికల్లో మాత్రం మున్సిపల్ చైర్మన్ పీఠం విషయంలో మాత్రం ఫ్రెండ్లీ కాంటెస్ట్కు అద్దం పట్టినట్లు కనిపించింది. ఈ రెండు మున్సిపాలిటీల్లో ఈ రీతిలో జరగడంలో పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో పార్టీ కీలక వర్గాలు అంతర్మథనంలో పడినట్లు సమాచారం. హంగ్ పరిస్థితుల్లో చేసేదేమీ లేక పార్టీలు తమ సిద్దాంతాలు, ఆశయాలు పక్కనబెట్టి పట్టు వదిలేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అడ్డగోలు పొత్తులు.. మెట్పల్లి మున్సిపాలిటీలో బీజేపీ 10, బీఆర్ఎస్ 6 కాంగ్రెస్ 6, స్వతంత్రులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు ఒకరోజు ముందు బీజేపీ నుంచి విప్ జారీ చేయడంలో పొరపాటు జరిగిందా..? లేక కావాలనే చేశారా..? అనే విషయంలో స్పష్టత లేదు. చైర్పర్సన్ ఓటింగ్ రోజు ఆరుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నలుగురు స్వతంత్రుల మద్దతుతోపాటు విప్ జారీలో పొరపాటుతో బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్ క్రాస్ ఓటింగ్ చేశారు. ఫలితంగా మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం 11మంది కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్కు దక్కింది. ఈ పొరపాటు కావాలనే చేశారని, కాంగ్రెస్తో కుమ్మక్కు అయ్యారని అనుమానించిన బీజేపీ నుంచి చైర్పర్సన్ రేసులో ఉన్న ఓ కౌన్సిలర్ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిపై గొడవకు దిగడం గమనార్హం. రాయికల్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉండగా.. బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, బీజేపీ 5, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. హంగ్ పరిస్థితులు ఉండటంతో ఇక్కడా చైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరిగింది. ఫలితంగా 3 స్థానాలు ఉన్న బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. -
విద్యార్థి దశ నుంచి విప్లవంలోకి..
కోరుట్ల: అణచివేతకు ఎదురొడ్డి.. భూస్వాముల దమనకాండను నిలదీసి.. అణగారిన వర్గాల్లో విప్లవ జ్వాలలు రగిలించిన తిప్పిరి తిరుపతి అలియాసదేవ్జీ రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడి నుంచి మావో అగ్రనేతగా ఎదిగారు. కోరుట్లలోని అంబేడ్కర్నగర్కు చెందిన తిరుపతి ఈ ప్రాంతంలో సామాన్య ప్రజానీకం భూస్వాముల అణచివేతపై చిన్నప్పటి నుంచే తిరుగుబావుటా ఎగురవేశారు. 1981లో పదో తరగతి నుంచే ఆయన రాడికల్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితులయ్యారు. ఆర్ఎస్యూ క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు.కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే సమయంలో విద్యార్థుల్లో విప్లవ భావాలను నూరిపోయడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు, దాడులు తీవ్రమయ్యాయి. పోలీసులు రాడికల్ విద్యార్థి సంఘం నాయకులపై నిఘా పెంచారు. ఇంటర్ పాసైన తిరుపతి 1983–84 సమయంలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీలో చేరారు. అక్కడ ఆర్ఎస్యూ కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసుల నిఘా పెరగడంతో 1984 చివర్లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.గిరాయిపల్లి ఒగ్గు కథ పాత్రధారి..వరంగల్లోని నాటి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ప్రస్తుత ఎన్ఐటీ)కి చెందిన నలుగురు విద్యార్థులు 1975లో సాయుధ రైతాంగ పోరాట నిర్మాణంలో పాలుపంచుకున్న క్రమంలో మెదక్ జిల్లా గిరాయిపల్లి వద్ద పోలీసులు వారిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. ఈ ఘటనపై గద్దర్ రచించి పాడిన మల్లన్న, బీరప్ప, కొమురన్న ఒగ్గు కథ ప్రచారంలో తిరుపతి చురుకుగా పాల్గొన్నారు. 1982–83లో గిరాయిపల్లి ఒగ్గుకథను కోరుట్ల జూనియర్ కళాశాల మైదానంలో ప్రదర్శించగా ఒగ్గు కథలో బీరప్ప పాత్రను తిరుపతి పోషించారు. ఈ కథ వినేందుకు కోరుట్లవాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆ సమయంలో పల్లెల్లో విప్లవ భావాలను రగిలించడంలో గిరాయిపల్లి ఒగ్గు కథకు కీలకపాత్ర పోషించింది. ఈ సభ అనంతరం నుంచి తిరుపతిపై పోలీసుల నిర్భంధం పెరిగింది.ఉద్యమ సహచరితో పెళ్లి..డిగ్రీ చదువుతున్న సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిన తిరుపతి కుటుంబంలో పెద్దవారు. తమ్ముడు వెంకటి చనిపోగా చిన్నతమ్ముడు గంగాధర్ కోరుట్లలోనే ఉన్నారు. ఆ సమయంలో కోరుట్ల అంబేడ్కర్నగర్లో చిన్నప్పుడే పెళ్లి చేసే సంప్రదాయం ఉండటంతో తిరుపతి తమ్ముళ్లకు చిన్ననాడే వివాహాలు అయ్యాయి. కానీ విప్లవబాట పట్టిన తిరుపతికి మాత్రం పెళ్లి కాలేదు. అజ్ఞాతంలోకి వెళ్లాక మహారాష్ట్రలో మావో ఉద్యమానికి ఊపిరిపోసే పనిలో నిమగ్నమైన క్రమంలో అదే ప్రాంతానికి చెందిన దళ కమాండర్ సృజనను ఆయన వివాహం చేసుకున్నారు. సృజన 2019లో గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు.ఒకే ఒక్క ఫొటో...తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లే ముందే తన ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. ఇంట్లోని ఫొటోలు, కోరుట్ల జూనియర్ కళాశాల, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలోని ఫొటోలు ఎవరికీ చిక్కకుండా చేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినప్పటి నుంచి పోలీసులకు ఫొటోలు దొరకలేదు. దీంతో ఆయన ఆనవాళ్లు తెలుసుకోవడం కష్టంగా మారింది. మావోయిస్టుగా వివిధ హోదాల్లో కొనసాగిన సమయంలోనూ ఆయన ఫొటోలేవీ బయటకు రాలేదు. 1995లో దండకారణ్యంలో జరిగిన ఓ ప్లీనరీ సమావేశానికి హాజరైనప్పుడు ఒకరు తీసిన ఓ ఫొటోనే పోలీసులకు దొరికింది. ఇప్పటికీ ఆయన ఆనవాళ్ల కోసం ఆ ఫొటోనే అందుబాటులో ఉంది. -
సానుకూల దృక్పథం అవసరం
– కోయ శ్రీహర్ష, ఐఏఎస్, కలెక్టర్, పెద్దపల్లిసాక్షి,పెద్దపల్లి: సిలబస్పై అవగాహన, ప్రణాళికతో మొదటి ప్రయత్నంలోనే 6వ ర్యాంకు సాధించాను. సివిల్స్ ఎంపికలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా ఒక్కో పరీక్ష ద్వారా వడపోత జరిపి ఎక్కువ అవగాహన, తెలివితేటలున్న వారిని ఎంపిక చేస్తారు. సివిల్స్కు సన్నద్ధం అయ్యేవాళ్లు సిలబస్పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. మాక్టెస్టులు రాస్తుండాలి. గతంలో వచ్చిన పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. షెడ్యూల్ ఫాలో అవుతూ, నోట్స్ మెయింటైన్ చేస్తూ, సమాజంలో జరిగే ప్రతి విషయంలో అనాలసిస్ చేయాలి. సిలబస్ పుస్తకాలు..ఆన్లైన్లో దొరికే మెటీరియల్ సిద్ధం చేసుకోవాలి. పత్రికలు, విజేతల నోట్స్ చదవాలి. కోచింగ్ తీసుకున్నవారే ఉద్యోగాలు సాధిస్తారనేది అపోహే. కోచింగ్ గెలుపు సూత్రమేమి కాదు. సివిల్స్ క్రాక్ చేయటంలో ఆన్సర్ రైటింగ్ చాలా ముఖ్యం. రోజూ 2–3 ఆన్సర్లు రాసి, టైమ్లో (7–9 నిమిషాలు/ప్రశ్న) పూర్తి చేయండి. ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఇది మార్కులు పెంచుతుంది. ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్, హంబుల్గా ఉండాలి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, తెలియకపోతే ‘సార్, నాకు తెలియదు’ అని చెప్పాలి. హైదరాబాద్లో సైతం మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. పట్టుదల, కన్సిస్టెన్సీతో రెగ్యులర్ ప్రాక్టీస్, స్ట్రాంగ్ బేసిక్స్, మెంటల్ స్ట్రెంత్, బ్యాలెన్స్డ్ లైఫ్తో ఎవరైనా యూపీఎస్సీ సాధించవచ్చు. -
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాలరూరల్: నియోజకవర్గంలోని నిరుపేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేటలో బొడ్డు మౌనిక, సురేశ్ నిర్మించుకున్న ఇంటిని శనివారం ప్రారంభించారు. పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు దామోదర్, బొడ్డు రత్నాకర్, పొన్నాల మధుసూదన్రెడ్డి, రంజిత్ పాల్గొన్నారు. వృద్ధుల సంక్షేమానికి చర్యలు జగిత్యాల: వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే అన్నారు. మంత్రి లక్ష్మణ్కుమార్ సహకారంతో రూ.కోటితో టీఆర్నగర్లో వృద్ధాశ్రమం ఏర్పాటు చేశామన్నారు. సీనియర్ సిటిజన్లకు ఉచితంగా అల్పాహారం, వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. వృద్ధుల సంఘం జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్, విశ్వనాథం, హన్మంతరెడ్డి పాల్గొన్నారు. కౌన్సిలర్లు అభివృద్ధికి పాటుపడాలి కౌన్సిలర్లు వార్డుల అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాలలోని 2, 3, 25, 32వార్డుల కౌన్సిలర్లు చంద్రకళ, ప్రదీప్, రాజశేఖర్, బుడుగ పద్మ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. -
నిరుత్సాహ పడొద్దు
– సత్యప్రసాద్, ఐఏఎస్, కలెక్టర్, జగిత్యాలజగిత్యాల: సివిల్స్ అంటే కొందరికి భయంగా ఉంటుంది. సునాయాసంగా చదువుకుంటూ వెళ్లాలి. 24 గంటలు చదవడం ముఖ్యం కాదు. ప్రణాళిక ఏర్పాటు చేసుకుని సాధించాలన్న కసితో ముందుకెళ్లాలి. డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి సివిల్స్ రాసేందుకు అర్హులు. గతంలో ఓసీ 6, బీసీ 9, ఎస్సీ వారికి ఎప్పుడైనా రాసే అవకాశం ఉండేది. ప్రస్తుతం కొన్ని మార్పులు జరిగినట్లున్నాయి. ముఖ్యంగా ఎకానమిక్స్, సైన్స్, జియోగ్రఫీ ఇలాంటివి అన్ని నోట్స్ తయారుచేసుకోవాలి. ప్రతిరోజు న్యూస్పేపర్స్ చదవడంతోపాటు ఇంటర్నెట్లో కొత్త సమాచారం తీసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ను చదవాలి. 32 ఏళ్ల వయస్సు వరకు ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. ఉద్యోగం చేస్తూ సైతం అభ్యర్థులు సివిల్స్కు ప్రయత్నించొచ్చు. ఓటములు ఎదురైనా నిరాశ చెందకుండా ముందుకెళ్తే పట్టు సాధించవచ్చు. 24 గంటలు చదివితేనే ఐఏఎస్ సాధించవచ్చనే భావన ఉంటుంది. కాదు.. సబ్జెక్ట్ ప్రకారం ప్రణాళిక తయారుచేసుకుని చదివితే ఈజీగా ముందుకెళ్లొచ్చు. ఇంతకుముందే సివిల్స్పై అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి. సివిల్స్లో రైటింగ్ సైతం ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరు నేను ఐఏఎస్ కొడతాననే ముందుకెళ్లాలి. ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఎస్సీఈఆర్టీ ఇంటర్, డిగ్రీలోని అంశాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోను కావద్దు. తేలికగా తీసుకునే మనస్తత్వం ఉంచుకోవాలి. -
కోఆప్షన్ ఎవరికో..?
జగిత్యాల: కౌన్సిలర్తో సమాన హోదా ఉండే కో–ఆప్షన్ పదవుల కోసం అప్పుడే నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఇక కో–ఆప్షన్ పదవుల భర్తీ మిగిలింది. ఆ పదవి కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపాలిటీ చట్టం ప్రకారం నోటిఫికేషన్ జారీ కాగానే కో–ఆప్షన్ పదవులను భర్తీ చేయనున్నారు. దాదాపు ఒక్కో మున్సిపాలిటీ నుంచి నలుగురు లేదా ఐదుగురు ఉండే అవకాశం ఉంటుంది. దరఖాస్తులను బట్టి అర్హులైన వారు ఎక్కువగా ఉంటే తీసుకోనున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్, మాజీ కౌన్సిలర్లు, అల్పసంఖ్యాక వర్గీయులు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. గతంలో ప్రతి మున్సిపాలిటీలో నలుగురు ఉండగా.. ఈసారి కొంత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఓడిన అభ్యర్థుల ప్రయత్నాలు కౌన్సిలర్గా పోటీ చేసి.. అత్యధికంగా ఖర్చు పెట్టిన వారు కనీసం కో–ఆప్షన్ పదవినైనా దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జగిత్యాలలో మాజీమంత్రి, ఎమ్మెల్యే వర్గాలు ఉండగా.. వీరిద్దరూ ప్రతిపాదించిన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అప్పుడే పైరవీలు మొదలుపెడుతున్నారు. గతంలో టికెట్లు రానివారికి పోటీ నుంచి విరమించుకుంటే కో–ఆప్షన్ పదవి ఇస్తామని బుజ్జగించిన విషయం తెల్సిందే. వారంతా ఇప్పుడు పదవి ఆశిస్తున్నారు. నేతల చుట్టూ ప్రయత్నాలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే కొత్త పాలకవర్గం మద్దతు తీసుకుని కో–ఆప్షన్ పదవి పొందాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నోటిఫికేషన్ జారీ కానప్పటికీ.. పైరవీలు మాత్రం జోరుగా సాగిస్తున్నారు. ఎన్నికల్లో కష్టపడ్డామని, టికెట్ రాకున్నా పక్కకు తప్పుకొన్నామని, కష్టపడిన ఓడిపోయామని, తమకు కో–ఆప్షన్ పదవి ఇవ్వాలని ఆశావహులు కోరుతున్నారు. పోటీ పెరిగే అవకాశం ఈసారి మున్సిపాలిటీల్లో పదవులకు పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరో అవకాశం లేకపోవడంతో కనీసం ఈ పదవినైనా దక్కించుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పదవిని కౌన్సిల్పై అనుభవం ఉన్నవారికి, స్వచ్ఛంద సంస్థలవారికి, రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఇస్తుంటారు. ఈసారి మాత్రం ఓడిపోయిన అభ్యర్థులు పదవులు ఆశిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇద్దరి నుంచి ముగ్గురిని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తులు అధికంగా వచ్చి సిఫారసులు అధికంగా ఉంటే మరికొందరిని కూడా తీసుకోవచ్చని మున్సిపల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
27 నుంచి శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలను ఈనెల 27 నుంచి మార్చి 11వరకు నిర్వహించనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టే వసతులు, ఏర్పాట్లపై శనివారం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులకు సరిపడా వసతులు కల్పించాలని, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఆర్డబ్ల్యూఎస్, నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు నిధుల కొరత లేదన్నారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు అధికారులు సెలవు పెట్టొద్దన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలను గోదావరి పుష్కరాలకు సెమీఫైనల్గా భావించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ఏఎంసీ చైర్ర్సన్ లావణ్య, కౌన్సిలర్లు తదితరులున్నారు. -
‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
జగిత్యాల: వచ్చేనెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్ అనుమతి ఇవ్వొద్దని, గుర్తింపు కార్డులు వేసుకునేలా చూడాలని, తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, బెంచీల సౌకర్యం కల్పించాలని కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఫ్లయింగ్స్క్వాడ్ అప్రమత్తంగా పనిచేయాలన్నారు. పరీక్షల విభాగం డైరెక్టర్ నరేందర్ మాట్లాడుతూ నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లాస్థాయిలో ఎస్హెచ్వీఆర్లో ఫైవ్స్టార్ రేటింగ్ సాధించిన ఉపాధ్యాయులను అభినందించారు. డీఈవో రాము పాల్గొన్నారు. సాండ్ బజార్లో ఇసుక కొనాలి జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన సాండ్బజార్లోనే ఇసుక కొనాలని కలెక్టర్ అన్నారు. కథలాపూర్ మండలం సిరికొండ, తక్కళ్లపల్లి, మెట్పల్లిలోని ఆత్మకూర్, కోరుట్ల మండలం పైడిమడుగు, మల్లాపూర్ మండలం సాతారం, వీవీరావుపేట, రాయికల్ మండలం ఇటిక్యాల, జగన్నాథపూర్లోని సాండ్ రీచ్లలో ఇసుక తవ్వకాలు సాధ్యంకావడం లేదని, ఈ క్రమంలో సాండ్బజార్ నుంచే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి టన్నుకు రూ.900 ఉంటుందన్నారు. -
ఎరువులు అధికంగా వాడొద్దు
మేడిపల్లి: పంటలకు మోతాదును మించి ఎరువులు వాడొద్దని డీఏవో భాస్కర్ అన్నారు. అ గ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని రైతువేదికలో రైతులకు ఎరువుల యాజమాన్యం, వాడకంపై అవగాహన కల్పించారు. యూరియా అధికంగా వాడితే తెగుళ్లు ఆశిస్తాయని, దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. ఏవో ఎండీ.షాహిద్ అలీ, ఏఈవోలు మంజుల, స్రవంతి, ఉపసర్పంచ్ అర్జున్, రైతులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనృసింహునికి జీవన్రెడ్డి పూజలుజగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం చల్గల్లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మాజీమంత్రి జీవన్రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ జున్ను రాజేందర్, నాయకులు సత్తన్న, రాధాకిషన్రావు, మాజీ ఎంపీపీ ధర రమేశ్బాబు పాల్గొన్నారు. ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు వరంమెట్పల్లిరూరల్: ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మెట్పల్లి ఎంఈవో చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని వెల్లుల, సత్తక్కపల్లి, రాజేశ్వర్రావుపేట, మేడిపల్లి, బండలింగాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు శ్రీసాక్షి శ్రీ రూపొందించిన గణితం, భౌతికశాస్త్రం స్టడీ మెటీరియల్ను శనివారం పంపిణీ చేశారు. స్టడీ మెటీరియల్ చాలా బాగుందని కితాబునిచ్చారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొగిలిపేటలో మాతృభాష దినోత్సవంమల్లాపూర్: మండలంలోని మొగిలిపేట ప్రాథమిక పాఠశాలలో శనివారం మాతృభాష దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులతో తెలుగు పద్యాలు, పాటలు, పొడుపుకథలు, గేయాలు పాడించారు. క్విజ్, ఉపన్యాస పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హెచ్ఎం వేముల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మూడు రోజులు నీటి సరఫరా నిలిపివేత జగిత్యాల: మెట్పల్లి మండలం వెంకట్రావ్పేట గ్రామంలో మిషన్ భగీరథ మెయిన్ పైప్లైన్ లీకేజీ కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ కార్యనిర్వాహక ఇంజినీర్ జానకి తెలిపారు. ఈనెల 23 నుంచి 25 వరకు కోరుట్ల, జగిత్యాలతోపాటు ధర్మపురిలోని వెల్గటూర్, ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్ మండలాలను మినహాయించి మిగతా ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు. -
ప్రాక్టీస్తోనే అవగాహన
శివమారుతి రెడ్డి, ఐపీఎస్, గ్రేహౌండ్స్ ఏఎస్పీ, ఒడిశాకోరుట్ల: సివిల్స్ సాధించడానికి సిలబస్పై పూర్తి పట్టు సాధించడం కీలకం. మాది కోరుట్ల మండలం అయిలాపూర్. రెండేళ్ల క్రితం సివిల్స్కు ఎంపికయ్యాను. 132వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఒడిశా గ్రేహౌండ్స్ విభాగంలో అడిషనల్ ఎస్పీగా కొనసాగుతున్నా. సివిల్స్లో సిలబస్ను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకుని ఒక్కో అంశాన్ని పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకోవాలి. ఎన్సీఈఆర్టీ బుక్స్ చదవాలి. డెవలప్మెంట్స్పై దృష్టి సారించాలి. మాక్ టెస్టులను ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్లో చక్కని ఫలితం సాధిస్తే మెయిన్స్ పెద్ద కష్టం కాదు. ఆప్షనల్స్లో ప్రతీ అంశంపై పట్టు సాధించడం అవసరం. మెయిన్స్లో గత పరీక్షల ప్రశ్నాపత్రాలను పరిశీలించాలి. అంతకుముందు సివిల్స్ టాపర్లుగా నిలిచిన వారి కాపీలను స్టడీ చేసి నోట్స్ సొంతంగా తయారు చేయాలి. ఇంటర్వ్యూలో మన కాన్ఫిడెన్స్ లెవల్స్ను పరిశీలిస్తారు. చదివేటప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ కావడం కీలకం. -
సివిల్స్ కొట్టు
ప్రామాణిక పుస్తకాలు చదవాలి● విడుదలైన సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ● దగ్గర పడుతున్న దరఖాస్తుల సమయం ● కొలువు సాధించడం కష్టమేం కాదంటున్న ఐఏఎస్, ఐపీఎస్లు ● సిలబస్పై పట్టు.. ప్రణాళిక.. చిత్తశుద్ధి ముఖ్యమంటున్న ఉమ్మడి జిల్లా బాస్లునోటిఫికేషన్ విడుదల: 4 ఫిబ్రవరి 2026దరఖాస్తుకు చివరి తేదీ: 24 ఫిబ్రవరి 2026ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 24 మే 2026మెయిన్స్ పరీక్ష ప్రారంభం: 21 ఆగస్టు 2026మొత్తం ఖాళీలు : 933గరీమా అగ్రవాల్, ఐఏఎస్, కలెక్టర్, రాజన్నసిరిసిల్లసిరిసిల్ల: ప్రామాణిక పుస్తకాలు చదువుతూ.. సిలబస్పై పట్టు సాధించాలి. నేను 2019లో ఆల్ ఇండియా సివిల్స్లో 40వ ర్యాంకు సాధించాను. సివిల్స్కు సన్నద్ధమయ్యే వారు జనరల్ స్టడీస్(జీఎస్)ను సమగ్ర అధ్యయనం చేయాలి. జీఎస్–1, జీఎస్–2, జీఎస్–3 అంశాలను క్షుణ్ణంగా చదవాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఆర్టీ) వెలువరించిన పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని చదవాలి. యూపీఎస్సీలో ప్రిలిమినరీ మెట్టు. అది దాటితే చాలా అంశాలు తెలుస్తాయి. మనం ఎక్కడ ఉన్నాం. పోటీ అంశాలు ఏమిటి..? కోచింగ్ ఏమైనా తీసుకోవాలా..? అనే అనేకాంశాలు తెలుసుకుని మెయిన్స్కు ప్రిపేర్ కావచ్చు. మనం ఎన్ని గంటలు చదివాం అనేది ముఖ్యం కాదు.. సమగ్రంగా చదివామా లేదా.. అందులో ఉన్న అంశాలను మనం గ్రహించి గుర్తుంచుకునేలా ఉండాలి. ఏదైనా ప్రణాళికాబద్ధంగా పట్టుదలగా చదవాలి. పరీక్ష హాల్లో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా.. సరైన సమాధానాలను నిర్దేశించుకుని, అక్షరాలను వేగంగా, అందంగా రాయడమూ ముఖ్యమే. సమయపాలన చాలా అవసరం. రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఏ అంశమైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించుకోవాలి. ఒత్తిడికి లోనుకాకుండా.. మానసికంగా ఉల్లాసంగా ఉంటూ.. ప్రిపరేషన్ సాగించాలి. తొలి ప్రయత్నం విఫలమైనా.. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ.. పట్టుదలగా ముందుకు సాగాలి.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్.. ఏటా వెలువడే నోటిఫికేషన్ కోసం డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఎందరో ఎదురుచూస్తుంటారు. లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనంతరం ఉద్యోగాలకు ఎంపికయ్యే వారి సంఖ్య వందల సంఖ్యలోనే ఉంటుంది. అయినా సివిల్స్ రాయాలని అందరికీ ఉంటుంది. ఏటా లక్షలాది మంది పోటీ పడినా లక్ష్యం చేరేది కొందరే. అందుకే సివిల్స్ ప్రత్యేకమైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా సిలబస్పై పట్టు.. ప్రణాళిక.. చిత్తశుద్ధితో ముందుకు వెళ్తే విజయం సులభం అంటున్నారు ఉమ్మడి జిల్లా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. ఒకసారి ఓడిపోయినా నిరుత్సాహ పడకుండా ప్రయత్నించాలని సూచిస్తున్నారు. భయాన్ని వీడి.. సబ్జెక్ట్లపై పట్టు సాధించాలని, ఇందుకు శిక్షణ కన్నా చిత్తశుద్ధి ముఖ్యమంటున్నారు. సివిల్స్కు ఎలా సన్నద్ధం కావాలి..? సిలబస్ ఏమిటి..? ప్రణాళిక..? తదితర సలహాలు.. సూచనలు వారి మాటల్లోనే.. -
పేదల సొంతింటి కల తీరుతోంది
కథలాపూర్: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం కథలాపూర్ మండలం ఊట్పెల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు. సర్పంచ్ పాల లక్ష్మి, ఉపసర్పంచ్ ముదాం శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, ఏఎంసీ డైరెక్టర్ వాకిటి రాజారెడ్డి పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ మేడిపల్లి: మేడిపల్లి రైతువేదికలో 39 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తహసీల్దార్ మునిందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏనుగు రమేశ్ రెడ్డి, సర్పంచులు గుగ్గిళ్ల రమేష్, యాగండ్ల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
అనుదీప్ దురిశెట్టి, ఐఏఎస్, కలెక్టర్ ఖమ్మం
మెట్పల్లి: సివిల్స్ సుదీర్ఘ ప్ర యాణం. కఠినమైన వడపోత ప్రక్రియ. ఇందులో ఓటమికి కుంగి పోవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచి సాధిస్తానన్న పట్టుదల ఉండాలి. నేను సివి ల్స్కు నాలుగుసార్లు హాజరయ్యాను. రెండోసారి ఐఆర్ఎస్కు ఎంపికయ్యా. ఉద్యోగం చేస్తూనే మరోసారి సివిల్స్కు ప్రిపేరయ్యాను. 2018 ఫలితాల్లో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు పొందాను. సివిల్స్లో విజేతగా నిలవాలంటే మొదట సిలబస్పై పట్టు సాధించాలి. ప్రధానంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివి హిస్టరీ, ఎకనామిక్స్, సైన్స్, జియోగ్రఫీ సబ్జెక్టుల్లో విలువైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించుకోవాలి. కరెంట్ అఫైర్స్పై పట్టు సంపాదించాలి. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సేకరించడం, సబ్జెక్టు నిష్ణాతుల నుంచి సందేహాలను నివృత్తి చేసుకోవడం ముఖ్యం. మెడిటేషన్, యోగా సాధన చేస్తే క్రమశిక్షణాయుత ప్రిపరేషన్ సాగించడానికి అవకాశముంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మనకు ఉండాలి. -
రెండురోజుల్లో జనజీవన స్రవంతిలోకి?
కోరుట్ల: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, మరో పాతికమంది కీలక మావోయిస్టు నేతలు రెండు రోజుల్లో తెలంగాణకు చెందిన ఓ కీలక నేత సమక్షంలో లొంగిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మధ్యవర్తులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జైళ్లలో ఉన్న మావోయిస్టుల లొంగుబాటుకు అవకాశం ఇచి్చ...మొదటగా ఛత్తీస్గఢ్లో అమలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో లొంగిపోయేందుకు సిద్ధమైన మావోయిస్టు నేతలు ఇతరత్రా పెద్దగా షరతులు పెట్టకుండా, జనజీవన స్రవంతిలో కలిసేటప్పుడు తమ భద్రతా సమస్యలపై భరోసా విషయంలో సంపూర్ణమైన హామీ కోసం ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. మధ్యవర్తులెవరు..!? దేవ్జీ, సంగ్రామ్లకు, ఎస్ఐబీ స్పెషల్ టీంకు మధ్యవర్తులుగా తెలంగాణలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్, కొంతమంది పౌరహక్కుల నేతలు వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వీరితో రాష్ట్రానికి చెందిన ఓ కీలకనేత టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దుల్లోని ఓ సేఫ్జోన్లో కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కర్రె గుట్టల్లో మళ్లీ ఆపరేషన్ మొదలు కావడం కలవరం రేపుతోంది. ఈ లెక్కన అజ్ఞాతంలో ఉన్న కీలక మావోయిస్టు నేతలపై ఓ వైపు ఒత్తిడి పెంచుతూ.. మరోవైపు సంప్రదింపుల ప్రక్రియ సాగించే వ్యూహం కొనసాగుతున్నట్టు తెలిసింది.వారం రోజులుగా సంప్రదింపులు సాగుతున్నట్టు తెలుస్తుండగా ఇంకా కొలిక్కిరాలేదని సమాచారం. కాగా, లొంగిపోయేందుకు చర్చలు జరుపుతున్న పాతికమంది మావోయిస్టుల్లో కీలక నేతలు ఉన్నారా? లేదా అన్న సందేహాలు కూడా వెంటాడుతున్నాయి. మొత్తం మీద మరో రెండు మూడు రోజుల్లో పాతికమంది మావోయిస్టులు రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలో లొంగిపోవడం ఖాయమని..వారు ఎవరెవరు అన్న విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
మైక్రో ఫైనాన్స్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య
సాక్షి జగిత్యాల: ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. తీసుకున్న బాకీ ఎట్టిపరిస్థితుల్లో చెల్లించాలంటూ మైక్రోఫైనాస్స్ సంస్థ ప్రతినిధులు వేధించడంతో సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నంకు చెందిన లక్కం రాజశేఖర్ అనే వ్యక్తి ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థలో రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నారు. అయితే పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక పోయాడు. దీంతో ఎలాగైనా అప్పు చెల్లించాలని ఆ మైక్రోఫైనాన్స్ సంస్థ వేధింపులకు గురి చేయడంతో అప్పు తీర్చలేక తన ఇంటిలోనే ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. -
సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం
కథలాపూర్(వేములవాడ): సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండలం గంభీర్పూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. తాండ్య్రాల గ్రామంలో రూ.30లక్షలతో నిర్మించే మూడు మహిళ సంఘాల భవనాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి స్వరాజ్య స్థాపనకు పాపన్న చేసిన ప్రయత్నాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని, మహిళ సంఘాల సభ్యులు వ్యాపార రంగాల్లో రాణించేలా రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచులు గుంటుక మనోహర్, జంగ శివాని, ఉప సర్పంచులు జనార్ధన్రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే పేదల సొంతింటి కల సాధ్యం
జగిత్యాలరూరల్: పేద, మధ్యతరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకంతోనే పేదల సొంతింటి కల సాధ్యమవుతోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండలం నాయకపుగూడెంలో సర్పంచ్ కొత్తూరి పుష్పనాథ్కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పేదల సొంతింటి కల నిజం చేయడం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. మొదటి విడతలో ఇల్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, సీనియర్ నాయకుడు గుర్రాల రాజేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ రాజేశ్వరి, మాజీ ఉపసర్పంచ్ ఏలూరి గంగారెడ్డి, నాయకులు రవీందర్, గంగారెడ్డి, మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
న్యూస్రీల్
పట్టుదలతో చదవాలిజగిత్యాలరూరల్: విద్యార్థులు పట్టుదలతో చదవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాము అన్నారు. శుక్రవారం బీర్పూర్ మండలం తుంగూర్, బీర్పూర్ జెడ్పీ స్కూల్లో జరిగిన ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈనెలలో నిర్వహించే ఎఫ్ఎల్ఎస్ జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించేలా విద్యార్థులకు పాఠశాల స్థాయిలో శిక్షణ అందించాలన్నారు. అనంతరం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. వసతుల కల్పనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఎంఈవో నాగభూషణం, హెచ్ఎం భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజగిత్యాల: 2026–27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవెలబుల్ స్కూల్ ఎంపిక కోసం జిల్లాలోని ప్రైవేటు ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంక్షేమాధికారి రాజ్కుమార్ తెలిపారు. బెస్ట్ అవెలబుల్ స్కూల్ పథకంలో భాగంగా విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్ వసతి, భోజన సౌకర్యం కల్పించాల్సి ఉంటుందన్నారు. ప్రతీ వి ద్యార్థికి రూ.42 వేల చొప్పున చెల్లించబడుతుందని, దరఖాస్తులను ఈనెల 25లోపు సమీకృత కార్యాలయంలో సమర్పించాలని కోరారు. బాల్క సుమన్ అరెస్టును ఖండిస్తున్నాంజగిత్యాల: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్లో ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించి స్పష్టమైన తీర్పు ఇచ్చినా, మంత్రి వివేక్ అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు సైతం కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పనిచేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, తప్పుడు కేసులు పెట్టి సుమన్ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అగ్నివీర్ ఉద్యోగాలపై అవగాహన ఉండాలిజగిత్యాల: అగ్నివీర్ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని ఉపాధి కల్పన అధికారి సత్తమ్మ అన్నారు. శుక్రవారం ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నివీర్, వాయుసేన నియామకాలపై అవగాహన కల్పించారు. డిఫెన్స్ రంగంలో పరీక్ష విధానం, అర్హతల గురించి తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేశ్, వైస్ ప్రిన్సిపాల్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మీదే పురతర బాధ్యత!
● బల్దియాల్లో స్వాగతం పలుకుతున్న సమస్యలు ● ఏళ్లకాలంగా ఇబ్బంది పడుతున్న స్థానికులు ● పరిష్కారానికి నగర, పట్టణ ప్రజల ఎదురుచూపులు ● నూతన పాలకవర్గంపై కొండంత ఆశలు పట్టణాలు, నగరాలుగా మారుతున్నా.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న మట్టిరోడ్లు. ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా పూర్తికాని డ్రైనేజీలు.. కంపుకొడుతున్న ఖాళీ ప్రదేశాలు.. రహదారులపై పారుతున్న మురుగునీరు.. వెంబడిస్తున్న కుక్కలు.. ఇళ్లలోకి చేరి రచ్చ చేస్తున్న కోతులు.. రోగాలు తెచ్చిపెడుతున్న డంపింగ్ యార్డులు.. ఇలా వందలాది సమస్యలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నగరాలు, పట్టణాల ప్రజలను నిత్యం వేధిస్తున్నాయి. పరిష్కరించాల్సిన పాలకులు ఇన్నాళ్లూ పట్టించుకోకపోగా.. నూతన పాలకవర్గాలు, మేయర్లు, చైర్మన్లపైనే ఆయా ప్రాంతాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. – వివరాలు IIలోuఇది జిల్లా కేంద్రంలోని యావర్రోడ్డు. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు విస్తరణకు నోచుకోక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు మారినా ఈ రోడ్డు దుస్థితి మారడం లేదు. -
తాకత్కు మించి..పైసలు పంచి
మున్సిపల్ కౌన్సిలర్ పదవుల కోసం ఇష్టారాజ్యంగా ఖర్చుజగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఖర్చు కౌన్సిలర్ అభ్యర్థులకు తడిచి మోపైడెంది. కౌన్సిలర్ పదవీ ఎలాగైనా దక్కించుకోవాలని ఒకరికి మించి ఒకరు ఖర్చు చేశారు. అటు ఓడిపోయిన అభ్యర్థులు అప్పులు ఎలా తీర్చాలని తలామునకలవుతుండగా గెలిచినవారు సైతం ఆందోళనలోనే ఉన్నారు. తాకత్కు మించి ఖర్చు పెట్టడంతో వాటిని ఎలా తీర్చాలనే సందిగ్ధంలో ఉన్నారు. కొందరు ఎన్నికల ఖర్చు కోసం విలువైన ఫ్లాట్లు, ఇళ్లకు సంబంధించిన కాగితాలు పెట్టి, బంగారం కుదవ పెట్టి ఖర్చు పెట్టారు. గెలిచిన అభ్యర్థులకు కొంత మేర ఊరట ఉన్నప్పటికీ ఓడినవారు మాత్రం తల పట్టుకుంటున్నారు. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలో అత్యధికంగా ఖర్చు కాగా, రాయికల్, ధర్మపురిలో రూ.10 లక్షలకు పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది. పోటాపోటీగా ఖర్చు.. కౌన్సిలర్ పదవుల కోసం ఒకరు ఓటుకు రూ.2 వేలు ఇస్తే మరొకరు రూ.4 వేలు ఇచ్చారు. ఇలా పోటాపోటీగా ఖర్చు పెట్టారు. జగిత్యాలలోని ఓ వార్డులో రూ.50 లక్షలకు మించి ఖర్చు చేసినట్లు, మరో ప్రముఖ నాయకుడు రూ.కోటికి పైగా ఖర్చు పెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయినట్లు చర్చ జరుగుతోంది. కొందరికి పెద్దగా సమస్య లేనప్పటికీ అప్పులు ఎలా కట్టాలన్న ధోరణిలో ఉన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 655 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం రూ.20 నుంచి రూ.30 లక్షల ఖర్చు పెట్టారు. జగిత్యాలలో మాత్రం వింత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ జరగడంతో ఇటు ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు, అటు మాజీమంత్రి జీవన్రెడ్డి వర్గీయులు సైతం ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో తీవ్రంగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో వార్డులో రూ.20– రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. పార్టీల నుంచి అంతంతే.. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులకు విరాళాలు కొంత మేరే వచ్చినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. నాయకులకు గుర్తింపుతో పాటు, ఆర్థిక బలం ఉంటేనే గెలిచే అవకాశాలుంటాయి. జగిత్యాలలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ కావడంతో ప్రధాన పార్టీల నుంచి కొంత మేరనే అందినట్లు తెలుస్తోంది. కొందరు చైర్మన్ పదవీ ఆశించిన వారు సైతం వార్డుల్లో వారి అభ్యర్థులను గెలిపించుకునేందుకు కొంత మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. ప్రధాన పార్టీ కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థికి రూ.లక్ష అందినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ వారు సైతం అందజేసినట్లు తెలిసింది. అభ్యర్థులకు ఇవ్వలేదంటూ వైరల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన అగ్రనాయకుడు అభ్యర్థులకు డబ్బులు ఇవ్వలేదనడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధిష్టానం నుంచి ఒక అభ్యర్థికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు ఇవ్వాలని డబ్బులు వచ్చినా కొంత మందికే ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సంతకాల సేకరణ సైతం చేస్తున్నారు. ప్రధాన పార్టీలో ఈ విషయం ఎక్కడకు దారి తీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పులు తీర్చేలా ప్రయత్నాలు ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థులు ఎలాగైనా అప్పులు లేకుండా చూసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాకట్టు పెట్టినవి అమ్మేసి, ఏవైనా ప్లాట్లు ఉంటే తీసేసి అప్పు తీసుకున్న వారి వద్ద చెల్లిస్తే కొంత మేర వడ్డీ తగ్గుతుందని భావిస్తున్నారు. కొందరైతే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎలాగైనా అప్పు తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
సేవాలాల్ బోధనలు మార్గదర్శకం
జగిత్యాల: సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా శుక్రవా రం కలెక్టరేట్లో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. చెడు అలవాట్లను విస్మరించి మంచి అలవా ట్లు అలవర్చుకోవాలని, ఉన్నతమైన జీవన విధానా న్ని పెంపొందించుకునేందుకు సంస్కృతి, సంప్రదా యాలను కొనసాగించాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రాజ్కుమార్, గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవార్డు కాపీలు త్వరగా అందించాలి జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను రైతులకు త్వరగా అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. భూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలు వెనువెంటనే పరిష్కరించాలని, మీసేవ సర్టిఫికెట్లు పెండింగ్లో ఉంచకూడదన్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తూ ఎలాంటి పొరపాట్లు లేకుండా జాబితా రూపొందించాలన్నారు. ప్రతి ఓటరు మ్యాప్ అయ్యేలా ప్రతి ఇంటి నుంచి కచ్చితమైన వివరాలు సేకరించాలని, అన్నిస్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ రామ్మోహన్ వరందన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
చైర్మన్ కార్యాలయానికి వాస్తుదోషం
రాయికల్(జగిత్యాల): రాయికల్ మున్సిపల్లో చైర్మన్, కమిషనర్ కార్యాలయాలకు సంబంధిత కాంట్రాక్టర్ వాస్తు ప్రకారం మూత్రశాలలు, మెట్ల నిర్మాణం చేయలేదు. దీంతో నూతన మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ వాస్తు పండితుల సలహా మేరకు చైర్మన్ కార్యాలయంలో మరమ్మతులు చేపట్టారు. మరమ్మతు పూర్తయిన తర్వాతే మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నట్లు చైర్మన్ తెలిపారు. ఏదేమైనా గతంలో మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ వాస్తు ప్రకారం కట్టడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. -
కుల బహిష్కరణ ఘటనపై విచారణ
జగిత్యాలరూరల్: బీర్పూర్ మండలం కందెనకుంటలో ఇటీవల కుల బహిష్కరణ జరిగిందన్న ఘటన అబద్ధమని జిల్లా సామాజిక సమరసత వేదిక నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆకుతోట వెంకటరాంరెడ్డి ఆధ్వర్యంలో సభ్యుల బృందం గ్రామంలో నిజనిజాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరాంరెడ్డి మాట్లాడుతూ, సంఘటనకు కారణమని చెబుతున్న సర్పంచ్ కొమిరె నర్సయ్య, మృతుడు ఎదుల రాజేశం కుటుంబ సభ్యులను కలిసి విచారించామన్నారు. మృతుడు రాజేశం, సర్పంచ్ దగ్గరి బంధువులేనని వివరించారు. మృతుడికి మేనమామ వరస అయ్యే కొమిరె పోచయ్యకు గ్రామంలో కొంత వివాదం నెలకొందని పేర్కొన్నారు. వివాదాల నేపథ్యంలో రాజేశం చనిపోయిన సమయంలో మృతదేహాన్ని దహనసంస్కారాలకు తాను ఒక్కడినే తీసుకు వెళ్తానని పోచయ్య చెప్పాడని తెలిపారు. ఈ విషయమై గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుల బహిష్కరణ చేసినట్లు వైరల్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్, గౌరవ అధ్యక్షుడు లచ్చన్న సంతోష్ పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, జీవన్రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఫుడ్ పాయిజన్ అయిందని జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. -
అగ్గి తెగులు.. తేరుకుంటేనే తొలుగు
కరీంనగర్ అర్బన్: అగ్గి తెగులు అన్నదాతల్లో గుబులు రేపుతోంది. యాసంగిలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగే ఎక్కువ. 2.80లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా 2.50లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ప్రతి సీజన్లో ఏదో తెగులు ఆందోళనకు గురి చేస్తుండగా తాజాగా నీడలా వెంటాడుతోంది. జిల్లావ్యాప్తంగా సదరు తెగులు ఇప్పుడిప్పుడే విస్తరిస్తుండగా పలు ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఅర్డినేటర్ డా.బోగారి హరికృష్ణ వివరించారు. లక్షణాలు ఇవీ వరిలో ఈ తెగులు ఏ దశలో అయినా ఆశిస్తుంది. వరి ఆకుల మీద వెన్ను మెడ భాగాల మీద ఆకులపై, నూలికండే ఆకారం కలిగిన గోధుమ రంగు అంచులు గల మచ్చలు ఏర్పడతాయి. మచ్చల మధ్యలో బూడిద రంగు ఉంటుంది. పిలకల కనుపుల వద్ద ఆశిస్తే ఆ ప్రదేశం వద్ద పిలక విరిగి వాలిపోతుంది. తెగులు సోకిన వెన్ను మెడ దగ్గర నల్లటి మచ్చలు ఏర్పడి వెన్ను విరిగి వేలాడుతూ కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఎక్కువ గింజలు తాలు గింజలుగా మారుతాయి. ఎందుకిలా.. ఈ తెగులుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులుంటే అంతే మరి. ఒక వారం రోజులపాటు రాత్రి ఉష్ణోగ్రత 18–22 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 90%, మంచు లేదా వర్షపు జల్లులు కారణం. నవంబర్ నుండి ఫిబ్రవరి మాసంలో ఈ పరిస్థితులు ఉన్నప్పుడు, నత్రజని మోతాదు ఎక్కువైనప్పుడు ఈ తెగులు త్వరగా అభివృద్ధి చెంది ఎక్కువ నష్టం కలగజేస్తుంది. నివారణ ఇలా అగ్గి తెగులును తొలి దశలో నివారించడానికి ఐసోప్రోతయోలిన్ 1.5 మిల్లీలీటర్, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, టేబుకొనజల్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకుని పిచికారి చేసుకోవాలని హరికృష్ణ వివరించారు. సస్యరక్షణ చర్యలతోనే అడ్డుకట్ట వరిలో విస్తరిస్తున్న తెగులు -
పదిలంగా చదివేద్దాం!
● సమీపిస్తున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ● ఒత్తిడి లేకుండా రాయాలంటున్న నిపుణులు ● పట్టుదల ఉంటే విజయం మీదేనంటున్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ● మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలుపదో తరగతి.. విద్యార్థి జీవితంలో ఎదిగేందుకు తొలిమెట్టు. తన భవిష్యత్కు కీలక మలుపు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధిస్తే ఉన్నత చదువులకు మంచి అవకాశం ఉంటుంది. మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మార్కులతో పోటీ మాత్రమే కాకుండా, క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన వంటి విలువలను పరీక్షించే సందర్భం. సమాజం మొత్తం ఈ పరీక్షలను ఒక ప్రమాణంగా చూస్తుంది. పరీక్షలకు మరో 20 రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ఏ సజ్జెక్టుపై పట్టు పెంచుకోవాలో తెలియక విద్యార్థులు తర్జనభర్జన పడుతుంటారు. సమయం దగ్గర పడుతున్న కొద్ది వారిపై అధిక ఒత్తిడి, మానసిక భారం పెరుగుతుంది. ఈ దశలో సరైన ప్రణాళిక, సమగ్ర పునర్విమర్శ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో అవసరం. భాషా సబ్జెక్టుల్లో భావవ్యక్తీకరణకు, గణితం, సైన్స్లో సూత్రాల అవగాహనకు, సోషల్లో విశ్లేషణాత్మక దృష్టికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలు భయపడాల్సినవి కాదు.. సిద్ధతను నిరూపించుకునే అవకాశం మాత్రమే అని తల్లిదండ్రులు ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. మార్కులకే పరిమితం కాకుండా నేర్చుకున్న జ్ఞానం భవిష్యత్కు పునాది అవుతుందని సూచించాలి. సమతుల్య దృష్టితో ముందుకు సాగితే పదో తరగతి పరీక్షలు విజయానికి ద్వారం తెరుస్తాయని గుర్తించాలి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు పదోతరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలి..? ఏఏ పాఠాలను ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది..? అనే అంశాలతో ఆయా సబ్జెక్టుల స్టేట్, డిస్ట్రిక్ రిసోర్సు పర్సన్లు, విషయ నిఫుణుల సలహాలు, సూచనలు.. –సప్తగిరికాలనీ(కరీంనగర్)


