Jagtial
-
గంగ రాళ్ల గలగల
కోరుట్ల: ఎక్కడైనా... ఎవరైనా గోదావరి తీరానికి వెళ్లడం సర్వసాధారణమే.. కానీ అక్కడి తీర గ్రామాల ప్రజల దృష్టి వేరేగా ఉంటుంది. ఇసుక తిన్నెల్లో దొరికే గంగరాళ్లను సేకరిస్తారు. పూజ గదుల్లో భద్రపరుస్తారు. ఇంట్లో అవి ఉంటే శుభప్రదమని విశ్వసిస్తారు. గోదావరి తీరానికి మొక్కులు, శుభకార్యాల కోసం వెళ్లిన ప్రతీ ఒక్కరు రంగురంగుల గంగరాళ్లపై దృష్టి పెడతారంటే అతిశయోక్తి కాదు. జగిత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి ధర్మపురి మండలం రాయపట్నం వరకు సుమారు 90 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో సుమారు 28 గ్రామాల వరకు ఉన్నాయి. ఈ గ్రామాల్లోనే కాదు.. చుట్టుపక్కల ఉన్న పట్టణ ప్రాంతాల్లోనూ గంగరాళ్ల సెంటిమెంట్ ఉంటుంది.శుభకార్యాలతో ముడిపడి..నీటితోనే మనిషి మనుగడ.. జలం జాడలున్న చోటే జనం అవాసాలు ఏర్పాటు చేసుకోవడం సాధారణం. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే గోదావరి నది.. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల వెంబడి ప్రవహిస్తుంది. ఈ ప్రాంతవాసులు గోదావరి గంగ అని పిలుచుకుంటారు. ప్రతీ శుభకార్యానికి గోదావరి నదికి వెళ్లి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి వారి సంప్రదాయం. పుట్టువెంట్రుకలు, గర్భిణులకు గంగ తెప్పలు, పౌర్ణమి పుణ్యస్నానాలు, గంగ మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా.. పితృదేవతలకు పిండాలు పెట్టడం, ఎవరైనా చనిపోతే.. ఆ వెంటనే గంగస్నానాలు చేయడం వంటి కార్యక్రమాలను గోదావరి తీరంలోనే చేస్తుంటారు. ఈ క్రమంలో గోదావరి (గంగ)తో ఇక్కడి ప్రాంతవాసుల జీవనశైలి, ఆచార వ్యవహారాలతో విడదీయరాని బంధం ఉంది. గంగరాళ్ల సెంటిమెంట్గంగ తీరంలో శుభకార్యాల కోసం బంధు మిత్రులతో కలిసి వెళ్లిన వారు పుణ్యస్నానాలు ముగించుకుని ఇక్కడి ఇసుకలో దొరికే రంగు రంగుల గంగరాళ్ల కోసం వెతకడం కనిపిస్తుంది. వీటిని పెద్దవాళ్లు శుభసూచకంగా భావిస్తే.. చిన్నపిల్లలు ఆట వస్తువులుగా.. గంగరాళ్లను సేకరిస్తారు. గంగ నీటి ప్రవాహంలో వందలాది కిలోమీటర్ల దూరం కొట్టుకువచ్చిన ఈ రాళ్లు.. విభిన్నమైన ఆకృతుల్లో, రంగుల్లో ఉంటాయి. దీంతో వీటిని ఇష్టంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇలా తీసుకువచ్చిన గంగరాళ్లను వ్యాపారులు తమకు శుభాలు కలగాలని కౌంటర్ టేబుల్పై పేపర్వెయిట్గా ఉపయోగిస్తారు. చిన్నగా ఉండి లింగాకారంలో ఉండే రంగురాళ్లను శివునికి ప్రతీకగా పూజ గదుల్లో ఉంచుతారు. మరికొంతమంది గంగరాళ్లను దేవుడి గది ముందు ఉంచుతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగినపుడు అదే రాయిపై కొబ్బరికాయలు కొట్టి దేవుళ్లకు అభిషేకం చేస్తుంటారు. మరికొంతమంది ఈ రంగురాళ్లను నీళ్లజాడీలో ఉంచి అలంకరణ కోసం వాడతారు. ఇలా ఈ ప్రాంత జనంలో గంగరాళ్ల సెంటిమెంట్ అనాదిగా కొనసాగుతోంది.బెల్లం రంగు రాళ్లు ఇష్టంగంగరాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. వాటిలో బెల్లం రంగులో ఉండే రాళ్లు బాగుంటాయి. ఎప్పుడు గోదావరి తీరానికి వెళ్లినా అలాంటి రాళ్లను వెతికి తెచ్చుకుంటాను. ను న్నటి పెద్ద గంగరాయి దొరికితే.. దాన్ని పూజ గదిలో ఉంచుకుంటాం. ఇంట్లో శుభకార్యాలు, దేవునికి పూజలు చేసే సమయాల్లో కొబ్బరి కాయలు కొట్టడానికి వాడతాం. – కంటాల అనితదేవి, కోరుట్లవ్యాపారం బావుండాలని..వ్యాపారులు గంగరాళ్లను కౌంటర్ టేబుల్పై పెట్టుకుంటారు. దీన్ని ఒకవైపు పేపర్వెయిట్గా.. మరోవైపు వ్యాపారాల్లో లాభాలు తెచ్చే శుభసూచకంగా వినియోగి స్తారు. మా పిల్లలు గంగకు వెళ్లినప్పుడు ఆసక్తిగా ఇసుకలో రంగురాళ్లను వెతికి తెచ్చుకుని ఆటపాటల్లో వినియోగిస్తారు. – చిద్రాల వినోద్, వ్యాపారి, కోరుట్ల -
వసతుల్లేని శ్మశానవాటికలు
జగిత్యాల: జిల్లాలోని శ్మశాన వాటికల్లో వసతులు లే క ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. శ్మ శాన వాటికల నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీల దే. అయితే అందులో సరైన వసతులు లేకపోవడంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులు స్నానాలు చేసేందుకు.. ఇతరత్రా కార్యక్రమాలు పూర్తిచేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. కనీసం నీటి వసతి లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా తెప్పించుకోవాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. స్నానాలు చేసి న తర్వాత బట్టలు మార్చుకునేందుకు గదులు లేవు. దోపిడీని అరికట్టేదెలా..? శ్మశాన వాటికల్లో దోపిడీ అధికమవుతోందని బాధి త కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. దహనానికి విని యోగించే కట్టెలకు టెండర్లు వేసేవారు లేకపోవడంతో అక్కడున్నవారు ఎంత అడిగితే అంతమొత్తం చె ల్లించాల్సి వస్తోంది. కట్టెలకు మున్సిపాలిటీ ద్వారా టెండర్లు పిలిస్తే బాధితులందరికీ ఒకే ధరకు కట్టెలు లభించడంతోపాటు మున్సిపాలిటీకి కూడా ఆదా యం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గదులు లేక ఇబ్బంది మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు లేని వారి బంధువులు చనిపోతే వారు అద్దెకు ఉండే ఇంటి యజమానులు శవాలను అనుమతించరు. ఇలాంటి వారికోసం శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు పూర్తి చేసి.. అనంతరం జరిగే ఇతరత్రా కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గదులు నిర్మిస్తామని ప్రకటించారు. కానీ.. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. జిల్లాకేంద్రంలో ఒక మోతె శ్మశాన వాటికలో మాత్రం గదులు ఉన్నాయి. మిగతాచోట్ల ఎక్కడా లేవు. 12 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించుకునేలా వసతులు ఏర్పాటు చేస్తే ఇల్లు లేని వారికి ఎంతో మేలుగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. అంత్యక్రియలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు స్నానాలు చేసేందుకు వేధిస్తున్న నీటి కొరత నీళ్లు చల్లుకుని ఇంటికి చేరుతున్న బంధువులు పట్టింపులేని మున్సిపల్ అధికారులు టెండర్లు పిలవాలంటున్న బాధితులువైకుంఠదామం పూర్తి చేయాలి రాయికల్ వైకుంఠదామంలో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తరుచూ బోరు రిపేరుకు రావడంతో స్నానాలకు ఇబ్బందికరంగా మారింది. దూరంలో ఉన్న వాగులోకి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు స్పందించి వైకుంఠదామం పూర్తి చేయాలి. – వెంకటేశ్, రాయికల్ ఉపయోగంలోకి తేవాలి ధర్మపురిలో రూ.కోటితో నిర్మించిన శ్మశాన వాటికలో అన్ని వసతులున్నప్పటికీ ఉపయోగంలో లేదు. పూర్తి శిథిలావస్థకు చేరాయి. మున్సిపల్ అధికారులు స్పందించి దానిని ఉపయోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి. అధికారులు స్పందించాలి. – బండారు లక్ష్మణ్, ధర్మపురి గదులు నిర్మించాలి చాలామంది ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఇంట్లో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే ఇంటి యజమానులు శవాన్ని అనుమతించడం లేదు. అలాంటి వారికి అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు గదులు అందుబాటులో ఉంచాలి. – కిరణ్ కుమార్, జగిత్యాల ఈ చిత్రం మెట్పల్లిలోని కాపుల శ్మశానవాటిక. ప్రహరీ, బోరు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. శవ దహనం అనంతరం స్నానాలు చేసేందుకు మున్సి పాలిటీ ట్యాంకర్పైనే ఆధారపడాల్సి వస్తోంది. మెట్పల్లిలో 9 శ్మశాన వాటికలు ఉన్నప్పటికీ ముఖ్యంగా నీటి వసతి, స్నానాల గదులు లేకపోవడంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులందరూ ఇబ్బంది పడుతున్నారు. మహిళల పరిస్థితి మరీ వర్ణణాతీతం.ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని గొల్లపల్లిరోడ్లో గల శ్మశాన వాటిక. ఇందులో సక్రమంగా నీరు లేకపోవడంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులకు ఇబ్బందికరంగా మారింది. ఇందులో శవాల దహనానికి వినియోగించే కట్టెలు ఇచ్చేవారు ఎప్పటి నుంచో ఉన్నారు. వారు బాధిత కుటుంబాల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టెండర్లు వేసి ఇవ్వాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలాగే మున్సిపల్ ట్యాంకర్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇది కోరుట్లలోని శ్మశాన వాటిక. కోరుట్లలో 20 ఉన్నప్పటికీ కొన్ని చోట్లలోనే బాగున్నా యి. మిగతా చోట్ల కనీస వసతులు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కట్టెలు లేకపోవడంతో ఎక్కడెక్కడి నుంచో తేవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇది ధర్మపురిలోని శ్మశాన వాటిక. రూ.కోటితో నిర్మించినప్పటికీ నిరుపయోగంగానే మారింది. వివిధ రకాల గదులు ఏర్పాటు చేసినా బాధ్యతలు ఎవరూ తీసుకోకపోవడంతో పారిశుధ్యం కరువై చెత్తాచెదారంతో నిండిపోయింది. బిగించిన తలుపులు విరిగిపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. ఇది రాయికల్లో నిర్మించిన వైకుంఠదామం. ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. రూ.కోటి నిధులు మంజూరైనప్పటికీ బర్నింగ్ షెడ్డు, ఫుడ్ స్టోరేజీ, శివుని విగ్రహం వంటి పనులు పూర్తి కాలేదు. దహన సంస్కారాల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. -
కుష్ఠు నిర్మూలనకు సహకరించాలి
సారంగాపూర్: కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీని వాస్ అన్నారు. బీర్పూర్ మండలం నర్సింహులపల్లెలో లెప్రసీ (ఎల్సీడీసీ)పై వైద్యసిబ్బంది సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వ్యాధి లక్షణాలను వివరించారు. శరీరం స్పర్శలేకుండా రాగి రంగులో, ఎర్రబారిన రంగులో మచ్చలు ఉంటే ఏడాదిపాటు మందులు వాడాలని సూచించారు. ఐదు మచ్చల కంటే తక్కువగా ఉంటే ఆరు నెలలు మందులు వాడాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులను అందుబాటులో ఉంచుతున్నామని, వైద్యులు సలహాలు పాటిస్తూ, మందులు తీసుకోవాలన్నారు. లెప్రసీ బాధితులను పకడ్బందీగా గుర్తించాలని సూచించారు. ఆయన వెంట సీహెచ్వో కుద్ధుస్, సూపర్వైజర్లు శ్రీనివాస్, కిశోర్, ఏఎన్ఎంలు ఉన్నారు. -
స్కానింగ్ సెంటర్లల్లో తనిఖీ
మెట్పల్లి: పట్టణంలోని పలు స్కానింగ్ సెంటర్లల్లో మంగళవారం ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి జైపాల్రెడ్డి తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రతి సెంటర్లో లింగ నిర్ధారణ చేయబడదు అనే ఫ్లెక్సీలు ప్రదర్శించాలని సూచించారు. ప్రతి నెలా 5తేదీ లోపు కేటాయించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్కానింగ్ వివరాలు అందించాలని పేర్కొన్నారు. లింగనిర్ధారణ జరిపితే జరిమానాతోపాటు మూడు నెలల జైలు శిక్ష విధిస్తామన్నారు. వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు. వారి వెంట హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాజేశం, సూపర్వైజర్ శ్యామ్ ఉన్నారు. సీసీ కెమెరాలకు మరమ్మతుజగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన చౌరస్తాల్లో ఉన్న సీసీ కెమెరాలను మున్సిపల్ ఉద్యోగులు సోమవారం ధ్వంసం చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే ముగ్గురు మున్సిపల్ ఉద్యోగులపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం సీసీ కెమెరాలకు యుద్ధప్రతిపాదికన మరమ్మతు చేపట్టారు. మరికొన్ని సీసీ కెమెరాలను బుధవారం సాయంత్రం వరకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన మున్సిపల్ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆయిల్ పాం సాగుతో రైతులకు లాభాలువెల్గటూర్: ఆయిల్ పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అఽధికారి భాస్కర్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్నా రు. రైతునేస్తం ప్రత్యేకత, వ్యవసాయ యాంత్రీకరణతో కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఆయిల్ పాం సాగు విధానంలో సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం మండలకేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్, ఏఈవోలు ఫిర్దోస్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ‘ఎల్ఆర్ఎస్’పై అవగాహన కల్పించాలిధర్మపురి: ఎల్ఆర్ఎస్పై చాలామందికి అవగాహన లేదని, ప్రభుత్వం కల్పించిన 25శాతం తగ్గింపును ప్రజల్లోకి తీసుకెళ్లాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అధికారులకు సూచించారు. మండలంలోని తిమ్మాపూర్లో మంగళవారం ఎల్ఆర్ఎస్పై సమీక్షించారు. గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ధర్మపురిలోని ఓ రైస్మిల్ను సందర్శించి సీఎంఆర్ సకాలంలో అప్పగించాలని, లేకుంటే మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో రవీందర్ తదితరులున్నారు. నైపుణ్య శిక్షణకు దరఖాస్తు చేసుకోండి జగిత్యాల: యువత నైపుణ్య శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. ప్రధానమంత్రి నైపుణ్య శిక్షణ పథకం కింద కోటి మంది యువతకు ఎంపిక చేసుకున్న వ్యాపారరంగంలో ఏడాదిపాటు నైపుణ్య శిక్షణ రూపొందించారని, ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భద్రాద్రి, మేడ్చల్ మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాల్లోని దాదాపు 200 కంపెనీల్లో నైపుణ్య శిక్షణ పొందేందుకు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 31లోపు P MI పోర్టల్ WWW.P MI NTQ N HIP. MC-A.GO V.I N ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. -
బల్దియా ప్రజలకు శుద్ధనీరు అందిస్తాం
రాయికల్: రాయికల్ మున్సిపల్ ప్రజలకు స్వచ్ఛమైన నీరందిస్తామని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఫిల్టర్బెడ్ను ఇరిగేషన్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. జగిత్యాల నియోజకవర్గంలో ఫిల్టర్బెడ్ల మరమ్మతు కోసం రూ.14 కోట్లు మంజూ రయ్యాయని, యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి నెలలోపు తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. పట్టణంలో 9, 10, 11 వార్డుల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని, పైప్లైన్ బూస్టర్ పంప్ బోర్వెల్ ద్వారా సరఫరా చేయాలని సూచించారు. పట్టణంలో అమృత్–2 పథకానికి స్థల సేకరణ చేపట్టాలని కమిషనర్ను ఆదేశించారు. ఆయన వెంట కమిషనర్ మనోహర్గౌడ్, ఇరిగేషన్ డీఈ జలేందర్రెడ్డి, ఏఈలు ప్రసాద్, దీపక్, చంద్రకాంత్, పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడి మహిపాల్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, మాజీ సర్పంచ్ ఎద్దండి భూమారెడ్డి, బాపురపు నర్సయ్య, బత్తిని భూమయ్య, శ్రీకాంత్, రమేశ్, సంతోష్ పాల్గొన్నారు. రోళ్లవాగు పరిశీలనసారంగాపూర్: రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణానికి ఏమైనా నష్టం ఉందా..? అనే అంశంపై అటవీశాఖలో అడవుల పరిరక్షణ బృందం మంగళవారం వివరాలు సేకరించింది. డిప్యూటీ కన్జర్వేటర్ వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో ఏడుగురు సీనియర్ ఫారెస్ట్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణంలో అటవీశాఖ, ఇంజినీరింగ్ అధికారులు పంపిన నివేదికలోని వివరాలు సరైనవేనా..? వన్యప్రాణులకు ఎంత మేర నష్టం జరగనుంది..? ఎన్ని చెట్లు కోలోతున్నాం..? వంటి అంశాలు సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వారి వెంట ప్రాజెక్టు డీఈ చక్రూనాయక్, ఏఈ అనిల్, సూపర్వైజర్ మోహన్ తదితరులు ఉన్నారు. -
మార్గదర్శకాల మేరకే ఇందిరమ్మ ఇళ్లు
సారంగాపూర్: ప్రభుత్వం నిర్ధేశించిన నమూనాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో కలెక్టర్ మంగళవారం పర్యటించారు. చిత్రవేణిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ స్థలాలు, నిర్మాణంలో ఉన్న ఇళ్ల ప్రగతిని పరిశీలించారు. దశలవారీగా బిల్లులు చెల్లించనున్నట్లు వివరించారు. బీర్పూర్లో రూ.1.43 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. నిధులు ఉన్నా పనుల జాప్యమెందుకని ప్రశ్నించారు. కొల్వాయి, తాళ్లధర్మారం, లక్ష్మీదేవిపల్లిలో రూ.20లక్షల చొప్పున నిధులతో నిర్మిస్తున్న పల్లె దవాఖానాల పనులను పరిశీలించారు. డీపీవో మదన్మోహన్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాస్, డీఈ మిలింద్, తహసీల్దార్లు జమీర్, ముంతాజొద్దీన్, ఎంపీడీవోలు గంగాధర్, లచ్చాలు, ఎంపీవో సలీం ఉన్నారు. కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలి జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. జిల్లా అధికారులు, ట్రాన్స్పోర్టు నిర్వాహకులు, రైస్మిల్లర్లతో సమీక్షించారు. కేంద్రాల్లో వసతులు కల్పించాలన్నారు. రవాణాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. టార్పాలిన్లు, గన్నీబ్యాగులు, క్లీనింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, సివిల్ సప్లై డీఎం జితేందర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఇఫ్తార్ జగిత్యాల: కలెక్టరేట్లో మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఒకరినొకరు గౌరవించుకునే స్ఫూర్తి, సహాయ సహకారాలు పెంపొందించుకునే గొప్ప సమయం రంజాన్ అన్నారు. ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో హకీం, వకీల్, నాగేందర్రెడ్డి పాల్గొన్నారు. -
‘రైతులను విస్మరించిన ప్రభుత్వం’
జగిత్యాల: అకాలవర్షాలు, వడగండ్లతో రైతులు పంటలు నష్టపోయినా వారిని ఓ మంత్రి కూడా పరామర్శించలేదని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నా రు. జగిత్యాలలో మంగళవారం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే దాటవేసే ధోరణిలో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.58లక్షల కోట్లు అప్పు చేసింద ని, ఇంత స్వల్పకాలంలో అంత అప్పు ఎవరూ చే యలేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎక్కడా జరగలేదన్నారు. ప్రభుత్వం కళ్లు తెరి చి అకాలవర్షాలతో నష్టపోయిన రైతులను పరా మర్శించి వారికి భరోసా కల్పించాలన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ కాంగ్రెస్ అసమర్థ పాలనలో పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే రైతులను ఆదుకోవాలన్నా రు. నాయకులు సతీశ్, గంగాధర్ పాల్గొన్నారు. సీఎం సహాయనిధిని వినియోగించుకోవాలి సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలువురికి సీఎం సహాయనిధి చెక్కులు అందించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. -
ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి
జగిత్యాల: ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశమయ్యారు. పెండింగ్ దరఖాస్తులన్నిటికీ ఈనెల చివరి వరకు పరిష్కారం చూపాలన్నారు. అదనపు కలెక్టర్ లత, తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా రాయాలివిద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఒత్తిడికి లోనుకావద్దన్నారు. 99.95 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు. ఆయన వెంట డీఈవో రాము, తదితరులు ఉన్నారు. క్షయ రహిత జిల్లాగా మార్చుదాంజగిత్యాల: జిల్లాను క్షయ రహితంగా మార్చడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. అంతర్జాతీయ క్షయ దినోత్సవం సందర్భంగా సోమవారం ఐఎంఏ హాల్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 16 గ్రామాలను క్షయ రహిత గ్రామాలుగా గుర్తించామని, ఎక్కడైనా వ్యాధికి సంబంధించి దగ్గు, తెమడ వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, జయపాల్రెడ్డి, అర్చన తదితరులు పాల్గొన్నారు. -
కోరుట్ల, ధర్మపురికి మున్సిపల్ కమిషనర్ల నియామకం
కోరుట్ల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి బల్దియాలకు ఎంపీడీవోలే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈనెల 22న ‘ఇదేమి తీరు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. కథనానికి మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించారు. మూడురోజుల క్రితం జగిత్యాల మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్గా స్పందనను నియమించారు. ఇదే క్రమంలో సోమవారం కోరుట్ల మున్సిపల్ కమిషనర్గా అల్లె మారుతీప్రసాద్ను నియమించారు. ఇన్చార్జిగా ఉన్న ఎంపీడీవో రామకృష్ణ నుంచి ప్రసాద్ బాధ్యతలు తీసుకున్నారు. మారుతి ప్రసాద్ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగులు నిక్కచ్చిగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. మున్సిపల్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ధర్మపురి మున్సిపల్ కమిషనర్గా రాజశేఖర్ ధర్మపురి: ధర్మపురి బల్దియా కమిషనర్గా కల్లెడ రాజశేఖర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పెగడపెల్లి ఎంపీడీవో శ్రీనివాసరెడ్డికి ఇన్చార్జి ఇచ్చారు. తాజాగా రాజశేఖర్ను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. -
● రేషన్ కార్డు కోసం పేర్లు డిలీట్ చేసుకున్న కొత్త జంటలు ● రాజీవ్ యువ వికాసం, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య శ్రీ పథకాలకు దూరం ● రేషన్కార్డులు వచ్చే వరకు పథకాలు లేనట్లే ● లబోదిబోమంటున్న అర్హులైన లబ్ధిదారులు
ఈ యువకుడు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బూస రాకేశ్. వివాహం అనంతరం తన భార్యతో కలిసి కొత్త రేషన్కార్డు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అధికారులు పాతకార్డులో పేరు తీసివేశారు. కొత్త రేషన్ కార్డు జారీచేయలేదు. దీంతో పాత కార్డులో పేరు ఉండక, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తోందో తెలియక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాడు.సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్కార్డును ప్రామాణికం చేయడంతో కొత్తకార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వకాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా చేర్పులు, మార్పులకు నోచుకోని పరిస్థితి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినా.. జారీ విషయంలో ప్రకటనలే తప్ప సరైన స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లయినవారు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్కార్డు నుంచి చాలామంది పేర్లు రద్దు చేసుకుని కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సైతం రేషన్కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి కొండ నాలుకకు మందు వేసుకుంటే ఉన్న నాలుక ఊడిపోయిన చందంలా మారినట్లయింది. కొత్త కార్డులోస్తాయని ఆశతో... ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంతో మంది కొత్తగా వి వాహం అయినవారు రేషన్కార్డు పొందేందుకు, త మ తల్లిదండ్రులతో ఉన్న తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి రాకపోగా, ఉన్న పాత రేషన్కార్డులో పేరు డిలీట్ కావడంతో ప్రభుత్వం అందించే సీ ఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, తదితర ఆరు గ్యారంటీలతో పాటు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్యువ వికాసం పథకం సైతం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9,78,620 రేషన్కార్డులుండగా, కొత్త కార్డుల కోసం సుమారు 50వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాగా.. రేషన్ కార్డులు ఉన్న పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నా లేని పేదల సంగతేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా.. కనీసం ఆ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పేదలు నష్టపోతున్నారు. -
ప్రజావాణికి వినతుల వెల్లువ
● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ ● పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ● జిల్లావ్యాప్తంగా 32 ఫిర్యాదులుజగిత్యాలటౌన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు భారీగా తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలు మూలల నుంచి వివిధ సమస్యలపై 32 ఫిర్యాదులు రాగా వాటిని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్.లత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు ఆదుకుంటాం
జగిత్యాలఅగ్రికల్చర్: వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం తరఫు న ఆదుకుంటామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో ఇటీవల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని సోమవారం పరిశీలించారు. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పంట నష్టం వివరాలు సేకరి స్తున్నారని, రైతులు వారికి సహకరించాలని సూ చించారు. పంట నష్టంపై సీఎం, వ్యవసాయమంత్రి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. లక్ష్మీపూర్లో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ త్వరలో పూర్తవుతుందన్నారు. రైతు నాయకులు గర్వందుల చిన్న గంగయ్య, ఏలేటి రాజిరెడ్డి, ఎడ్మల సత్తిరెడ్డి, చెరుకు జాన్, పురుపటి రాజిరెడ్డి, ఎల్లారెడ్డి, నారాయణ రెడ్డి, బాల ముకుందం, ఏఓ తిరుపతి నాయక్, ఏఈఓ హరీశ్ ఉన్నారు. -
ఇసుక కొరత తీరేదెప్పుడో..
మెట్పల్లి: జిల్లాలో ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో రీచ్లు గానీ, స్టాక్ పాయింట్లు గానీ లేకపోవడంతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఇంతకాలం జిల్లా అంతటా అక్రమంగా ఇసుక విక్రయాలు సాగుతూ వచ్చాయి. అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. అనుమతులు లేకుండా ఇసుక తరలించే వాహనదారులకు భారీగా జరిమానాలు విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ చర్యలతో చాలావరకు అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడగా.. మరోవైపు ఇసుక కొరతకు దారి తీయడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. కేవలం ఐదు చోట్లనే రీచ్లు ● జిల్లాలో ఇప్పటివరకు కోరుట్ల మండలం పైడిమడుగు, కథలాపూర్ మండలం సిరికొండ, రా యికల్ మండలం ఇటిక్యాల, మల్లాపూర్ మండలం సాతారాం, మెట్పల్లి మండలం ఆత్మకూర్ వాగుల్లో ఇసుక రీచ్లను ఏర్పాటు చేశారు. ● ఈ ఐదింటిలో విక్రయాలు ప్రారంభించారు. ● ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.800 ప్రభుత్వానికి చెల్లించేలా నిబంధన విధించారు. ● ఇవే కాక ధర్మపురి మండలంలో రెండు, బీర్పూర్ మండలంలో ఒకచోట రీచ్లను ఏర్పా టు చే యాలని ప్రతిపాదించినప్పటికీ ఇంకా వాటికి అనుమతులు రాలేదని తెలిసింది. ● జిల్లా మొత్తంగా 20మండలాలు ఉండగా.. కేవలం ఐదుచోట్ల మాత్రమే రీచ్లతో సరిపెట్టారు. ● మిగతా మండలాల్లో అక్కడి పరిస్థితులను బట్టి రీచ్లుగానీ, స్టాక్ పాయింట్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో అయా ప్రాంతాల్లో ఇసుక దొరకక నిర్మాణదారులు అవస్థలు పడుతున్నారు. ఇలా చేస్తే మేలు.. ● కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి అవకాశం ఉంటే రీచ్లు..లేని పక్షంలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఇసుక సరఫరా చేయాలి. ● ఇంతకాలం జిల్లా అంతటా అక్రమ ఇసుక విక్రయాలు సాగాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం దక్కలేదు. ప్రస్తుతం కొన్నిచోట్ల రీచ్లు ఏర్పాటు చేశారు. మిగతా చోట్ల కూడా రీచ్లు, స్టాక్ పాయింట్లు నెలకొల్పితే భారీగా ఆదాయం సమకూరుతుంది. ● ఇసుక వ్యాపారం చేసుకుంటూ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అక్రమ మార్గంలో ఈ దందా చేయడంతో వారంతా అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది. రీచ్ల వల్ల వారికి అవి తొలుగుతాయి. ● ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన ఇసుక లభ్యమయ్యే అవకాశం ఉంది. కేవలం ఐదు చోట్లనే రీచ్లు ఏర్పాటు మిగతా మండలాల్లో దొరకక ఇబ్బందులుఅందుబాటులో ఉండేలా చర్యలు జిల్లా అంతటా ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని చోట్ల రీచ్లు ప్రారంభమయ్యాయి. మరికొన్ని చోట్ల కూడా వీటిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అక్రమంగా ఇసుకను తరలించడం మానుకోవాలి. పట్టుబడితే రూ.25వేల జరిమానా విధిస్తాం. – జైసింగ్, జిల్లా మైనింగ్ అధికారి -
పెద్దవాగు ఇసుక రీచ్ రద్దు చేయండి
నీటి ఎద్దటికి కారణమవుతున్న ఇసుక రీచ్ను రద్దు చేయాల్సిందే. మెట్పల్లి మండలంలోని ఆత్మకూరు పెద్దవాగులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్తో గ్రామంలో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగు, సాగు నీటికి తీవ్ర ఎద్దడి ఏర్పడుతుంది. రీచ్ను రద్దు చేసి మా గ్రామాన్ని నీటి ఎద్దడి నుంచి కాపాడాలి. – ఆత్మకూరు గ్రామస్థులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లండి. పొరు గు రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి మా పొట్టకొడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు హామాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. – హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు -
నిలిచిన పనులకు నిధులు మంజూరు చేయండి
● అసెంబ్లీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల: నియోజకవర్గంలో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సోమవారం శాసనసభలో కోరారు. మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలు, సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులకు సరిపడా నిధులు ఇవ్వకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయని వివరించారు. ప్రతి సమావేశంలో తాను ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నానని, వాటికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు పట్టణాల్లోని జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు వారికి కేటాయించలేదని, సమస్యను పరిష్కరించాలని కోరారు. -
మూడునెలల కష్టం బుగ్గిపాలు
వీణవంక(హుజూరాబాద్): జాతరలో స్వీట్ దుకాణం పెట్టుకొని కాలం వెల్లదీస్తున్న ఆ కుటుంబం రోడ్డునపడింది. మూడునెలల పాటు వివిధ జాతరలు తిరిగి వచ్చిన డబ్బుతో తమ వాహనంలో ఇంటికి రాగా షార్ట్సర్క్యూట్తో మూడునెలల కష్టం బుగ్గిపాలైన ఘటన వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. నిదానం మహేందర్ వివిధ జిల్లాల్లో ఎక్కడ జాతర జరిగినా అక్కడ స్వీట్ దుకాణం పెట్టి బతుకు వెల్లదీస్తున్నాడు. మూడునెలల క్రితం తన ట్రాలీ ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి జాతర్లకు వెళ్లాడు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ జాతర చూసుకొని శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి మహేందర్ కుటుంబం అలిసిపోవడంతో స్వీట్కు సంబంధించిన ముడిసరుకులతో పాటు, రూ.2.16లక్షలు తన ఆటోలో ఉంచి ఇంట్లో నిద్రపోయాడు. ఆటో పైన ఉన్న విద్యుత్ వైరు గాలికి తెగి ఆటోలో ఉన్న వస్తువుల మీద పడటంతో ముడి సరుకులతో పాటు నగదు కాలిపోయాయి. వేకువజామున చూసేసరికి అప్పటికే నష్టం జరిగిపోయిందని బాధితుడు విలపించాడు. ఉన్న ఆధారం బుగ్గిపాలైందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
పాలకుర్తి(రామగుండం): కొత్తపల్లి గ్రామంలో వేల్పుగొండ కొమురయ్యకు చెందిన గూన పెంకుటిల్లు ఆదివారం విద్యుదాఘాతంతో దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. కొమురయ్యతోపాటు కుటుంబసభ్యులు ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఇంట్లోంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు.. కొమురయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పెద్దపల్లిలోని అగ్నిమాపక సిబ్బందికీ సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.2లక్షలతోపాటు 5తులాల బంగారం, గృహోపకరణాలు, బట్టలు పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు రోదిస్తూ తెలిపాడు. రేషన్బియ్యం పట్టివేతపోలీసులు పట్టుకున్న రేషన్ బియ్యం వీణవంక(హుజూరాబాద్): అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా మండలంలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు.. ఇద్దరు వ్యక్తులు వ్యాన్లో రేషన్ బియ్యం తీసుకొని కరీంనగర్ వైపు వస్తుండగా వాహనాన్ని తనిఖీ చేయడంతో 160క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. హుజూరాబాద్ మండలం శాలపల్లికి చెందిన వ్యాన్ డ్రైవర్ గద్దల రవి, జమ్మికుంటకు చెందిన తాడేం రమేశ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. స్వామివారి ఆలయంలో ఈనెల 10 నుంచి 22వరకు వైభవంగా నిర్వహించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 11 రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, సీ్త్రలు బట్టలు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా చెత్తాచెదారం కనిపించకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రూ.98.26 లక్షల ఆదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి రూ.98.26 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 70 వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, రైస్మిల్లర్స్, దాతలు, మున్సిపల్, పోలీస్, ట్రాన్స్కో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 11 రోజుల్లో 98.26 లక్షల ఆదాయం -
పుణ్యస్నానానికి వెళ్లి పరలోకాలకు..
వెల్గటూర్: గోదావరిలో పుణ్యస్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన వెల్గటూర్ మండలం కోటిలింగాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్కు చెందిన శ్రీమంతుల విఘ్నేష్ (32) ఆదివారం సెలవు దినం కావడంతో తన భార్యతో కలిసి కోటిలింగాల వద్దగల గోదావరిలో పుణ్యస్నానాలకు వచ్చారు. గోదావరిలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. భార్య కళ్ల ముందే భర్త నదిలో మునిగి మృతి చెందడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. గోదావరిలో మునిగి యువకుడి మృతి -
ఫుట్పాత్ సౌకర్యం కల్పించాలి
పట్టణంలో నిర్మించిన ఫుట్పాత్లను వినియోగంలోకి తేవాలి. ఫుట్పాత్ సౌకర్యం ఉన్నప్పటికీ కొందరు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారు. రోడ్ల వెంట నడవడం ప్రమాదకరంగా మారింది. మున్సిపల్ అధికారులు స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలి. – నర్సింహాచారి, కోరుట్ల ఆక్రమణలను తొలగించాలి మెట్పల్లి పట్టణంలోని ఆక్రమణలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. ఫుట్పాత్ల ఆక్రమణలు పెద్ద సమస్యగా మారాయి. రోడ్లపై నడవాలంటేనే నరకం కనిపిస్తోంది. కబ్జాదారులపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. – నవీన్, మెట్పల్లి -
గ్యాస్కట్టర్లో చేయి ఇరుక్కుని..
ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్లగొల్లపల్లిలో గ్రాస్కట్టర్లో ఇరుక్కొని చేయి తెగిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన నిమ్మత్తుల మధుకర్రెడ్డి–రజిత దంపతుల పెద్ద కుమారుడు సుదర్శన్రెడ్డి(11) ఆదివారం సెలవు కావడంతో తన తాతతో కలిసి ఆవుల షెడ్డు వద్దకు వెళ్లాడు. ఆవుల కోసం పచ్చిగడ్డిని తన తాత కట్టర్లో వేస్తుండగా పక్కనే ఉన్న బాలుడు సైతం వేసేందుకు ప్రయత్నించగా చేయి ఇరుక్కుంది. బాలుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన తాత మిషన్ను ఆపివేసి బాలుడి చేతిని బయటకు తీశాడు. అయితే అప్పటికే మోచేతి కింది భాగం వరకు నుజ్జునుజ్జు అయ్యింది. వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మోచేతి వరకు తొలగించారు. -
ప్రశాంతంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. స్వామివారి ఆలయంలో ఈనెల 10 నుంచి 22వరకు వైభవంగా నిర్వహించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 11 రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, సీ్త్రలు బట్టలు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా చెత్తాచెదారం కనిపించకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రూ.98.26 లక్షల ఆదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి రూ.98.26 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 70 వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, రైస్మిల్లర్స్, దాతలు, మున్సిపల్, పోలీస్, ట్రాన్స్కో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 11 రోజుల్లో 98.26 లక్షల ఆదాయం -
ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట
కరీంనగర్అర్బన్: తమ ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్యానికి కట్టుబడి పని చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమం జరగగా మంత్రి హాజరై మాట్లాడారు. తమతోపాటు సమాజం బాగుండాలన్న కోరికతో రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తారని తెలిపారు. ఈద్ వేడుకలకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు విజయవంతం అయ్యేలా ముస్లింలు ప్రార్థించాలని కోరారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి హైదరాబాదులో ఇఫ్తార్ విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, కరీంనగర్లో ఎలాంటి భేదభావాలు లేకుండా అందరూ కలిసి ఉంటారని, భవిష్యత్తులోనూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్యాదవ్, ట్రైనీ ఐపీఎస్ వసుంధర, ఆర్డీవో మహేశ్వర్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్రావు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
కేడీసీసీబీ సేవలు భేష్
కరీంనగర్అర్బన్: కేడీసీసీబీ సేవలు ప్రశంసనీయమని, మరింత పురోగతి సాధించాలని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ కె.సురేంద్రమోహన్ అన్నారు. ఆదివారం నుస్తులాపూర్ ప్యాక్స్తో పాటు కేడీసీసీబీలను సందర్శించారు. 2025 అంతర్జాతీయ సహకార సంవత్సర ప్రాధాన్యతతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వివిధ సహకార రంగ సంస్థలు చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. పెద్దమొత్తంలో రుణాలిచ్చే స్థాయికి ఎదగడం హర్షషీయమని, దేశానికే తలమానికంగా కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిలుస్తోందని కొనియాడారు. ఇక్కడి మంచి విధానాలను రాష్ట్రమంతా పాటించేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఉద్యానవన శాఖలు, మార్కెటింగ్ శాఖ, వివిధ సహకార రంగ సంస్థలను అనుసంధానం చేసి రైతుల ఉత్పత్తులను సమీకరించి, అధిక లాభాలు అందేలా పనిచేయించాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రజానీకానికి నగదు రహిత లావాదేవీల నిర్వహణ, బ్యాంకులు అందించే వివిధ సేవల గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సంఘాల ద్వారా జన ఔషధి కేంద్రాలను ప్రతీ మండల కేంద్రంలో స్థాపించి సభ్యులకు, ప్రజలకు చౌకగా లభించే మందులు విక్రయించాలని వివరించారు. కేడీసీసీ బ్యాంకు ముఖ్యకార్యనిర్వాణాధికారి సత్యనారాయణరావు మాట్లాడుతూ, ఇటీవల నిర్మించిన గోదాముల్లో మిగులు సామర్థ్యాన్ని ఎఫ్సీఐ, సివిల్ సప్లయి, మార్కెటింగ్ శాఖ, రైస్ మిల్లులు ఉపయోగించుకొనుటకు ప్రభుత్వపరంగా అనుమతులు ఇచ్చి సంఘాలకు అద్దెల రూపంగా డబ్బు వచ్చేలా చూడాలన్నారు. అదనపు కమిషనర్ జి.శ్రీనివాస్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార అధికారులు, ఎన్.రామానుజచార్యులు, సి.శ్రీమాల, మనోజ్కుమార్, రామకృష్ణ, సహకార అధికారులు, మార్క్ఫెడ్ అధికారులు, డీసీఎంఎస్ అధికారులు, బ్యాంకు జనరల్ మేనేజర్లు, సీనియర్ అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు, సహకార సిబ్బంది పాల్గొన్నారు. సహకార శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ -
తాళం వేసిన ఇళ్లలో చోరీ
వెల్గటూర్: తాళంవేసిన ఇళ్లలో దొంగలు దొంగతనం చేసిన ఘటన మండలంలోని పైడిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని గుడికందుల తిరుపతి, రాజేశం ఇళ్లలో శనివారం రాత్రి దొంగలు పడి బీరువా తాళాలు పగులగొట్టారు. తిరుపతి ఇంట్లో రెండున్నర తులాల బంగారం, రాజేశం ఇంట్లో నుంచి రూ.80వేలు ఎత్తుకెళ్లారు. తిరుపతి వ్యాపార నిమిత్తం కరీంనగర్లో, రాజేశం ముంబయిలో ఉంటున్నారు. వారిళ్లలో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు చొరబడి బంగారం, నగదు దోచుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇరుగుపొరుగు వారు చూసి ఇంటి యజమానులకు సమాచారం ఇచ్చారు. వారువచ్చి చూసి బీరువా తాళాలు పగుల గొట్టి ఉండడం, అందులో బంగారం, నగలు దొంగలు దోచుకెళ్లినట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్ను, క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. -
లేబర్ కార్డుకు దూరం
అవగాహన లోపం.. కరీంనగర్ 1,15,705 పెద్దపల్లి 84,974 జగిత్యాల 76,146 సిరిసిల్ల 54,739 మొత్తం 3,31,564 2014 నుంచి ఇప్పటి వరకు.. క్లెయిమ్లు: 49,795 చెల్లించిన డబ్బు: రూ.22,76,82,588● ఉమ్మడి జిల్లాలో 3.3 లక్షలకు మించని కార్డులు ● ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న కార్మికులు ● అవగాహన కల్పిస్తే మరింత మందికి ప్రయోజనంకరీంనగర్టౌన్: ఉమ్మడి జిల్లాలో కార్మికులకు తమ హక్కుల గురించి అవగాహన లేకపోవడంతో లేబర్ కార్డులకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం చాలా పథకాలు అమలులోకి తెస్తుండడంతో ఇప్పుడిప్పుడే కార్డులు పొందేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ప్రభుత్వం తరఫున కూడా అవగాహన కల్పించడంలో విఫలం అవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో కార్మికులు సాధారణంగా లేబర్ కార్డుల గురించి అవగాహన పొందడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాలో 3.3 లక్షల కార్డులే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 లక్షల పైగా జనాభా ఉండగా, ఇందులో 70 శాతం మంది వివిధ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. అంటే దాదాపు 20 లక్షల పైచిలుకు కార్మికులు ఉండగా కేవలం 3.3 లక్షల మంది మాత్రమే లేబర్ కార్డులు పొందడం గమనార్హం. ఈ గణాంకాలను చూస్తే కేవలం 10 శాతం లోపు మాత్రమే ఈ కార్డులు పొందారని తెలుస్తోంది. లేబర్ కార్డు పొందితే ప్రయోజనాలు ● లేబర్ కార్డు ఉన్న వ్యక్తి కూతుళ్ల పెళ్లికి రూ.30,000, ప్రసవానికి రూ.30,000 (ఇద్దరు కూతుళ్లకు మాత్రమే) ఒక సంవత్సరం ముందు బోర్డు నందు కార్మికుడు /కార్మికురాలుగా నమోదైనవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ● ప్రమాదం వల్ల చనిపోతే బాధిత కుటుంబానికి రూ.6,30,000, సాధారణ మరణానికి రూ.1,30,000 ఆర్థికసాయం అందుతుంది. ● కార్మికునికి దహన సంస్కార ఖర్చుల కోసం రూ.30,000 అందిస్తారు. ● ప్రమాదవశాత్తు అంగవైకల్యం కలిగినవారికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారం అందజేస్తారు. ● తాత్కాలిక వైద్య ఖర్చుల కింద కార్మికులకు నెలకు రూ.4,500 చొప్పున గరిష్టంగా రూ.13,500 సహాయం అందుతుంది. నిరంతరం అందజేస్తున్నాం లేబర్ కార్డు పొందేందుకు నిర్ణీత గడువు అంటూ ఏమీ లేదు. కార్మికులుగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరి దరఖాస్తును పరిశీలించి అర్హులందరికీ లేబర్ కార్డులు అందజేయడం జరుగుతుంది. 3.3 లక్షల మంది ఇప్పటి వరకు కార్డులు కలిగి ఉన్నారు. మిగతా జిల్లాలతో పోల్చితే మనం మెరుగ్గా ఉన్నాం. కార్మికులకు అవగాహన కల్పించి మరింత మంది కార్డులు పొందేలా ప్రోత్సహిస్తాం. – వెంకటరమణ, డిప్యూటీ లేబర్ కమిషనర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అర్హులు తీసుకోవాలి వివిధ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్న అర్హులందరూ లేబర్ కార్డులు తీసుకోవాలి. కార్డులు లేని చాలా మంది అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేబర్ కార్డులపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేసి, కార్మికులందరికీ కార్డులు అందేలా చర్యలు చేపట్టాలి. – కన్నం లక్ష్మణ్, కార్మిక సంఘం నాయకుడు -
పన్ను చెల్లించకుంటే రెడ్నోటీసులు జారీ చేయాలి
జగిత్యాల/మెట్పల్లి/రాయికల్ : బల్దియాల్లో స కాలంలో పన్ను చెల్లించకుంటే బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ఆదివారం రాయికల్ బల్ది యాలో ఎల్ఆర్ఎస్ చెల్లింపు, వివిధ రకాల పన్ను వసూళ్లను పర్యవేక్షించారు. ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో బల్దియాలో వందశాతం ఇంటి పన్ను వసూలు చేయాలన్నారు. ఇంటి పన్ను చెల్లించని వారితో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. పన్ను చెల్లించాలని సూచించారు. చెల్లించని వారికి రెడ్నోటీసు జారీ చేయాలని, అప్పుడు కూడా పన్ను చెల్లించకపోతే నల్లా, కరెంట్ కనెక్షన్లు నిలిపివేయాలని ము న్సిపల్ అ ధికారులను ఆదేశించారు. ఆయన వెంట కమిషనర్ మనోహర్గౌడ్, మేనేజర్ వెంకటి ఉన్నారు. పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలిపన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాల ని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాకేంద్రంలో ని వార్డు అధికారులు లక్ష్యాలను నిర్దేశించాలని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు, ఇంటి పన్ను బకాయిదారులకు ఫోన్చేసి పన్ను చెల్లించేలా చూడాలన్నారు. ఆయన వెంట కమిషనర్ స్పందన, రెవెన్యూ అధికారులు ఉన్నారు. మెట్పల్లిలో ఇంటిపన్ను వసూళ్లు, ఎల్ఆర్ఎస్ అమలు తీరును పరిశీలించారు. ఆయన వెంట కమిషనర్ మోహన్ ఉన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
పాలకుర్తి(రామగుండం): కొత్తపల్లి గ్రామంలో వేల్పుగొండ కొమురయ్యకు చెందిన గూన పెంకుటిల్లు ఆదివారం విద్యుదాఘాతంతో దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. కొమురయ్యతోపాటు కుటుంబసభ్యులు ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఇంట్లోంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు.. కొమురయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పెద్దపల్లిలోని అగ్నిమాపక సిబ్బందికీ సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.2లక్షలతోపాటు 5తులాల బంగారం, గృహోపకరణాలు, బట్టలు పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు రోదిస్తూ తెలిపాడు. రేషన్బియ్యం పట్టివేతపోలీసులు పట్టుకున్న రేషన్ బియ్యం వీణవంక(హుజూరాబాద్): అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా మండలంలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు.. ఇద్దరు వ్యక్తులు వ్యాన్లో రేషన్ బియ్యం తీసుకొని కరీంనగర్ వైపు వస్తుండగా వాహనాన్ని తనిఖీ చేయడంతో 160క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. హుజూరాబాద్ మండలం శాలపల్లికి చెందిన వ్యాన్ డ్రైవర్ గద్దల రవి, జమ్మికుంటకు చెందిన తాడేం రమేశ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పంట నష్టపరిహారానికి కృషి
● పంటల పరిశీలనలో ప్రభుత్వ విప్ ధర్మపురి/బుగ్గారం: అకాలవర్షంతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. అకాలవర్షంతో పంటలు నష్టపోయిన రైతుల పొలాలను ఆదివారం రైతులతో కలిసి సందర్శించారు. మండలంలోని రాయపట్నంలో మొక్కజొన్న, వరిపొలాలను పరిశీలించారు. చేతికందిన పంట ఇలా నేలపాలు కావడం బాధాకరమన్నారు. పంటల నష్టం విలువను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. గ్రామంలో 1480 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. బుగ్గారంలో వివిధ రైతుల పంట పొలాలను ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల సుభాష్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించాలి
సారంగాపూర్: ప్రజలకు అన్నిరకాల వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చినపుపడే వైద్య సిబ్బంది, ఆస్పత్రికి గుర్తింపు వస్తుందని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బీర్పూర్ మండలకేంద్రంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఆయన వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. బీర్పూర్ ఆస్పత్రిని త్వరలో కేంద్రప్రభుత్వ పరిధిలోని జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం ఆన్లైన్ వెరిఫికేషన్ చేపట్టనుందన్నారు. గర్భిణులు, ఇమ్యూనైజేషన్, అందుబాటులో ఉన్న మందులు, ఓపీ, ల్యాబ్ టెస్ట్, టీబీ పరీక్షలు, లెప్రసీ, జ్వర పరీక్షలు, ఈఎన్టీ, బీపీ, మధుమేహం తదితర అంశాలపై చర్చించారు. జాతీయ బృందం ఆస్పత్రిని బెస్ట్గా గుర్తించడానికి రోగులకు మరిన్ని సేవలు చేయడంతో పాటు, ఆస్పత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలని సూచించారు. మందుల నిల్వ ఉండాలిజగిత్యాల: ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలని, మందుల నిల్వ ఉండేలా చూసుకోవాలని శ్రీనివాస్ అన్నారు. టీఆర్నగర్లోని బస్తీ దవాఖానాను తనిఖీ చేశారు. ఆయన వెంట డాక్టర్లు ఉన్నారు. ఆదివారం ఆటవిడుపుబుగ్గారం: ఎండలు ముదురుతుండడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వేసవితాపం మొదలైంది. మండలంలోని యువకులు, చిన్నారులు వేసవితాపం నుంచి ఉపశమనం కోసం బుగ్గారం శివారులోని డీ–53 కాలువలో ఈతకొడుతూ ఇలా సేదతీరుతూ కనిపించారు. ఆదివారం కావడంతో పెద్దసంఖ్యలో చిన్నారులు తరలివచ్చారు. అథ్లెటిక్స్ పోటీల్లో గురుకులం విద్యార్థుల ప్రతిభజగిత్యాల: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మామిడాల స్వాతికాంజలి రజత పతకం సాధించింది. ఆదివారం హైదరాబాద్లోని గౌడీయం స్పోర్ట్స్పియాలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో బాలికల విభాగంలో 400 మీటర్ల పరుగుపందెంలో రజత పతకం సాధించింది. విద్యార్థినిని అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ముత్తయ్యరెడ్డి, అంజయ్య, రాందాస్, కొమురయ్య, ప్రిన్సిపల్ శ్రీలత, హరిరాంనాయక్ అభినందించారు. జగిత్యాల వాసికి రాష్ట్ర మహిళా శక్తి పురస్కారంజగిత్యాలటౌన్: జిల్లాకేంద్రానికి చెందిన ప్రము ఖ రచయిత్రి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అడువాల సుజాత సాహిత్య రంగంలో చేస్తున్న కృషికి రాష్ట్రస్థాయి మహిళాశక్తి పురస్కారం అందుకున్నారు. ఆదివారం మహబూబ్నగర్లో జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలు గు శాఖ పూర్వ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మనోజు బాలాచారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. సుజాత సాహితీ ప్రస్తానంతోపాటు సామాజిక సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో రచయిత్రి చుక్కాయపల్లి శ్రీదేవి, రావూరి శ్రీమతిరావు, కవులు, రచియిత్రులు పాల్గొన్నారు. సుజాతను జగిత్యాల బల్దియా మా జీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, కళాశ్రీ సాహితీ వేదిక నిర్వాహకులు గుండేటి రాజు, కవయిత్రులు మద్దెల సరోజన, కటుకం కవిత, చిందం సునీత, అయిత అనిత, లక్కరాజు శ్రీలక్ష్మి, ఓదెల గంగాధర్, శ్యాంసుందర్ అభినందించారు. -
రైతులను ఆదుకుంటాం
● ఎమ్మెల్సీ జీవన్రెడ్డి జగిత్యాలరూరల్: అకాల వర్షాలు, ఈదురుగాలులతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్, గుట్రాజ్పల్లి, అనంతారం, హైదర్పల్లి, కండ్లపల్లి గ్రామాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రెవెన్యూ, వ్యవసాయాధికారులతో వెంటనే నష్టపోయిన పంటలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను వెంటనే అధికారులు గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మంగళారపు మహేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జున్ను రాజేందర్, గాజంగి నందయ్య, లైశెట్టి శేఖర్, వెంకట్, లైశెట్టి విజయ్ ఉన్నారు. -
బల్దియా స్థలాల ఆక్రమణ
జగిత్యాల: జిల్లాలో మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టినా.. సెట్బ్యాక్ లేకున్నా నోటీసులు లేకుండానే కూల్చివేస్తున్నారు. ఎవరైనా మున్సిపల్ కబ్జా చేసుకుంటే మాత్రం మున్సిపల్ అధికారులు స్పందించండం లేదు. నిర్మాణాలను ఎలా కూల్చివేస్తున్నారో స్థలాలను ఆక్రమించుకున్న వారిని సైతం వెళ్లగొట్టి స్వాధీనం చేసుకోవాలని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అద్దెకు దుకాణాలను తీసుకుని దాని ఎదుట మరో దుకాణం అంత రేకులషెడ్డుతో కబ్జా చేస్తున్నారు. ఇది అంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..? జిల్లాలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు వెలిశాయి. ఇటీవల వ్యాపారాలు పెరగడం, ఎలాంటి సదుపాయాలు లేకుండా భవనాలు నిర్మించడం, ఫుట్పాత్లను సైతం ఆక్రమించి డ్రెయినేజీలపై కప్పులు వేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఆదాయానికి భారీగండి మున్సిపల్ స్థలాల్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మిస్తే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు, పాకలవర్గాలు పట్టించుకోకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. గతంలో జిల్లాకేంద్రంలో అంగడిబజార్లో ఉన్న ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఒక్కో షాపు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలతో టెండర్లు దక్కించుకున్నారు. కోట్లాది రూపాయల విలువ గల స్థలాల్లోని అక్రమణలను తొలగిస్తే జిల్లాకు ఆదాయం అధిక సంఖ్యలో లభిస్తుంది. మున్సిపల్ స్థలాల్లో అక్రమంగా షెడ్లు వేసుకున్నవారు మున్సిపల్కు కొంతమొత్తం మాత్రమే ఫీజు చెల్లిస్తున్నట్లు సమాచారం. షాపుల ముందు వరకూ సామగ్రిని పెట్టడం ద్వారా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. జిల్లాకేంద్రంలో టవర్సర్కిల్, తహసీల్ చౌరస్తా, కొత్తబస్టాండ్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో అధికంగా వాణిజ్య సముదాయాలున్నాయి. అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో అతిపెద్ద మున్సిపల్ అయిన కోరుట్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. పట్టింపులేని మున్సిపల్ అధికారులు కబ్జాకు గురవుతున్న విలువైన స్థలాలు సముదాయాలు నిర్మిస్తే బల్దియాకు ఆదాయం ఇది జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ ముందు నిర్మించిన వ్యాపార సముదాయాలు. అద్దెకు తీసుకున్నవారు దుకాణాలను మించి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి షెడ్లు వేసుకున్నా అడిగేవారు లేరు. ఫలితంగా ఆ ప్రాంతం రద్దీగా ఉండటంతోపాటు ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆర్టీసీ యజమాన్యం నోటీసులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు.ఈ చిత్రంలో కనిపిస్తోంది జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఉద్యానవనానికి సంబంధించిన స్థలం. ఈ స్థలాన్ని ఆక్రమించి పండ్ల దుకాణాలు, హోటల్స్, టీస్టాల్స్ ఏర్పాటు చేశారు. అయినా మున్సిపల్ అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. స్థలాన్ని ఆక్రమించుకున్న వారి నుంచి కొందరు అమ్యామ్యాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్ వద్దనున్న మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట దర్జాగా కబ్జా చేసుకున్నారు. ఇటీవల దానికి మెట్లు ఉండగా.. రోడ్డు వెడల్పు అని దానిని కూల్చివేసినప్పటికీ వాహనాలు పార్కింగ్ చేయడంతోపాటు, పండ్ల వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది మెట్పల్లి పట్టణంలోని ప్రధాన రోడ్డు. రోడ్డుపైనే పార్కింగ్లతోపాటు, రేకులషెడ్డులతో ముందుకు వస్తున్నారు. పార్కింగ్ సమస్య మారడంతో వెహికిల్స్ పెట్టుకోవాలంటే రోడ్డుపై పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది కోరుట్ల మున్సిపాలిటీలోని ప్రధానరోడ్డు. ఈ రోడ్డుపైనే దుకాణదారులు సామగ్రిని పెడుతున్నారు. ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాపారులు ఫుట్పాత్లను సైతం ఆక్రమించుకుంటున్నారు. -
● ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ● చెక్పోస్టులు పెట్టి కాంగ్రెస్ లీడర్లు దోచుకుంటున్నారు: గంగుల ● ఉద్యమ వ్యతిరేకి చేతిలో రాష్ట్ర పగ్గాలు: ఈశ్వర్ ● కేసీఆర్ ఒక తరాన్ని పరిచయం చేశారు: వినోద్కుమార్ ● జోష్ నింపిన పార్టీ వర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రజతోత్సవ వేడుకల వేళ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, కార్యకర్తలకు జిల్లా కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం కరీంనగర్లోని వీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో వివిధ వర్గాలకు జరిగిన అభివృద్ధిని అంకెలతో సహా వివరించేలా కార్యకర్తలు తయారవాలన్నారు. ఇందుకోసం పార్టీ అధిష్టానం నుంచి పరిశీలకులు, సమన్వయకర్తలు వస్తారని వెల్లడించారు. కేసీఆర్కు కరీంనగర్ అంటే ప్రత్యేకమైన అభిమానమని, సింహగర్జన నుంచి రైతుబంధు, దళితబంధు వరకు అనేక కార్యక్రమాలు ఇక్కడే మొదలుపెట్టారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లో కేవలం ఐదుమాత్రమే గెలిచామని, అందులో జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్లారన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలు మనమే గెలవాలని పిలుపునిచ్చారు. చెక్పోస్టులు పెట్టి మరీ: గంగుల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెక్పోస్టులు పెట్టి మరీ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మానేరు రివర్ ఫ్రంట్, తీగల బ్రిడ్జి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మొదలుపెడితే.. వాటిని ఖతం చేశారని, ఇదేంటని కాంట్రాక్టర్ను అడిగితే.. కాంగ్రెస్ హయాంలో అనేక మంది లీడర్లు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడని చెప్పారు. అమాయక ప్రజలను చెక్పోస్టులు పెట్టి పీల్చిపిప్పి చేస్తున్నారని కట్టెలమోపు కథ ద్వారా వివరించారు. ఉద్యమ వ్యతిరేకి చేతిలో.. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా పదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎవరి పాలనలో అయితే సుఖశాంతులతో ఉంటారో దాని కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘ఎన్నో పోరాటాలు, త్యాగాలతో రాష్ట్రం సాధించుకున్నాం. ఉద్యమానికి వ్యతిరేకంగా కరీంనగర్ ప్రజల మీదకు తుపాకీ పట్టుకుని వచ్చిన వాడి చేతిలో రాష్ట్రం ఉంది. ఈ చెర నుంచి విడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని పిలుపునిచ్చారు. ఒక తరాన్ని పరిచయం చేశారు బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్లు నిండుతున్న సందర్భంగా వరంగల్లో గొప్ప సభ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ పేర్కొన్నారు. పార్టీకి ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా ఆదుకునేది ఉమ్మడి వరంగల్, కరీంనగర్లే. కేసీఆర్ను శత్రువులు ఇబ్బందులు పెడితే, ఇక్కడికి వచ్చి గాలిపీలిస్తే ఆయనకు ఉత్తేజం వస్తదని తెలిపారు. ‘ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే అందులో కేసీఆర్ లీడర్గా ఎదిగారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, నేను పోటీ చేశాం. పిల్లగాళ్లు అని కాంగ్రెస్ వాళ్లు ఎగతాళి చేసినా గెలిచి చూపించాం. అలా కేసీఆర్ కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. 33 శాతం రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని మహిళలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, మనోహర్రెడ్డి, పుట్ట మధు, బాల్క సుమన్, నాయకులు రాజేశంగౌడ్, చల్మెడ లక్ష్మీనరసింహరావు, నారదాసు లక్ష్మణరావు, తోట ఆగయ్య, కర్ర శ్రీహరి, రాగిడి లక్ష్మారెడ్డి, రవీందర్రావు, గెల్లు శ్రీనివాస్యాదవ్, దావ వసంత, రాకేశ్, తుల ఉమ, కోలేటి దామోదర్, హరీశ్ శంకర్, పొన్నం అనిల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జోష్నింపిన బైక్ ర్యాలీ అంతకుముందు కేటీఆర్కు ఘనస్వాగతం పలికిన గులాబీ నాయకులు మంకమ్మతోట సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి బైపాస్ రోడ్డులోని వీ కన్వెన్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమావేశ మందిరం నాయకులతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తానికి కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త జోష్ నిండింది. -
జగిత్యాల మున్సిపల్ కమిషనర్గా స్పందన
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ కమిషనర్గా స్పందన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాయికల్ ఎంపీడీవో చిరంజీవి ఇన్చార్జి కమిషనర్గా కొనసాగారు. సంగారెడ్డి జిల్లాలో మెప్మా ఏవోగా పనిచేస్తున్న స్పందనను కమిషనర్గా నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపాలిటీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇన్చార్జి కమిషనర్ చిరంజీవి, మున్సిపల్ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నానో యూరియా వాడండిసారంగాపూర్: నానో యూరియా వాడి రైతులు దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని విండో సీఈవో లైశెట్టి శివ, ఇఫ్కో కంపెనీ ప్రతినిధి శ్రీధర్ అన్నారు. స్థానిక సింగిల్విండో ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నానో యూరియాపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. యూరియా బస్తాపై కేంద్ర ప్రభుత్వం రూ.2200 సబ్సిడీ భరిస్తోందని, రైతులకు మాత్రం రూ.270కి అందిస్తోందని అన్నారు. రసాయనాలు లేని నానో యూరియా వాడడం ద్వారా భూమి సారం మరింత పెరిగి, భూమి లోపలి పోషకాల సమతుల్యత దెబ్బ తినకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో విండో డైరెక్టర్లు కోండ్ర రాంచంద్రారెడ్డి, కాయితి శేఖర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. కమిషనర్లొస్తున్నారు.. ● ఎంపీడీవోలకు ఇన్చార్జి ఇవ్వడంపై విమర్శలుజగిత్యాల/కోరుట్ల: మున్సిపాలిటీ పాలనపై అవగాహన లేని ఎంపీడీవోలను జిల్లాలోని కొన్ని బల్దియాలకు ఇన్చార్జి కమిషనర్లుగా నియమించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ‘ఇదేమీ తీరు’ శీర్షికన శనివారం ప్రచురించింది. ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. ముందుగా జగిత్యాల ఇన్చార్జి కమిషనర్గా పనిచేస్తున్న రాయికల్ ఎంపీడీవో చిరంజీవిని తొలగించి సంగారెడ్డిలో మెప్మా ఏవోగా పనిచేస్తున్న స్పందనను నియమించింది. కోరుట్ల కమిషనర్గా ఉన్న తిరుపతి సస్పెండ్గా ఆయన స్థానంలో ఎంపీడీవో రామకృష్ణకు బాధ్యతలు ఇచ్చారు. అలాగే ధర్మపురి కమిషనర్ ఏసీబీకి పట్టుబడగా.. అతని స్థానంలో కూడా ఎంపీడీవోకు బాధ్యతలు అప్పగించారు. ఎంపీడీవోలకు కమిషనర్గా బాధ్యతలు ఇవ్వడంపై అభ్యంతరాలు వెల్లువెత్తడంతో మున్సిపల్ వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పూర్తిస్థాయి కమిషనర్లను నియమించాలన్న ఉద్దేశంతో కొందరు సాక్షి కథనాన్ని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు పంపించారు. దీనిపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగిత్యాలకు కమిషనర్ను నియమించినట్లే త్వరలోనే కోరుట్ల, ధర్మపురికి కూడా రెగ్యులర్ కమిషనర్లను నియమించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో కమిషనర్లు బదిలీ అయితే వారిస్థానంలో డీఈలకు, టీపీవోలు, మేనేజర్లకు ఇన్చార్జి కమిషనర్ బాధ్యతలు ఇస్తారు. ఎంపీడీవోలకు ఇవ్వడం ఇబ్బందికరంగా మారింది. పంట పొలాల వద్ద పాంపౌండ్లు నిర్మించుకోవాలికథలాపూర్: పంట పొలాల వద్ద నీటి నిల్వల కోసం పాంపౌండ్లను ఏర్పాటు చేసుకోవాలని భూగర్భజలశాఖ ఏడీ నాగరాజు తెలిపారు. మండలంలోని గంభీర్పూర్లో భూగర్భజలశాఖ, ఆదరణ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. వాల్పోస్టర్ ఆవిష్కరించి రైతులకు పంపిణీ చేశారు. వర్షకాలంలో నీటి నిల్వలు ఉండేలా రైతులు జాగ్రత్తపడాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే భూగర్భజలాలు పెరిగే అవకాశముందన్నారు. కార్యక్రమంలో ఏవో యోగితా, అధికారులు శ్రీకుమార్, అకిల్, శ్రీలత, గంగాలక్ష్మణ్, లింబాద్రి పాల్గొన్నారు. -
నేడు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
● ముఖ్య అతిథులుగా కేటీఆర్, హరీశ్రావు కరీంనగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నహాక సమావేశం ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వీ–కన్వెన్షన్లో జరగనుంది. ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరు కానున్నారు. శనివారం వీకన్వెన్షన్ ఫంక్షన్హాల్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లు పరిశీలించారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. జమిలి ఎన్నికలకు సీపీఐ వ్యతిరేకంకోరుట్ల: కేంద్రప్రభుత్వం తీసుకొస్తామంటున్న జమిలి ఎన్నికలకు సీపీఐ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. పట్టణంలోని సీ.ప్రభాకర్ భవన్లో శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. జనాభా ప్రాతిపాదికన పార్లమెంట్ నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే దక్షినాది రాష్ట్రాలకు ప్రాతినిథ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల అజయాయిషీ పెరిగి నష్టపోతామన్నారు. దేశంలో నక్సలిజం, కమ్యూనిస్టులను రూపుమాపే యత్నాలు జరుగుతున్నాయన్నారు. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. పార్టీ జిల్లా నేతలు వెన్న సురేష్, చెన్నా విశ్వనాథం, సుతారి రాములు, కొక్కుల శాంత, రాధ, మౌలాన, ముఖ్రం తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులను విస్మరిస్తే చర్యలు
జగిత్యాల: వృద్ధులను విస్మరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఏవో తఫజుల్ హుస్సేన్ అన్నారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో పొలాస గ్రామానికి చెందిన నర్సవ్వ, పట్టణానికి చెందిన భారతి, ధర్మపురి మండలం జైనకు చెందిన బాలమ్మ, సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన బుచ్చవ్వ, మల్యాల మండలం పోతారానికి చెందిన కస్తూరి రాజంవీరు కుమారులు, కూతుళ్లు, కోడళ్లు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 2007 సంరక్షణ చట్టం ప్రకారం వారిని ఆదుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికీ చాలామంది శిక్ష పడిందని పేర్కొన్నారు. విచారణకు హాజరు కాని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విచారణలో సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు హరి అశోక్కుమార్ పాల్గొన్నారు. కార్మికులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి ● సీఐటీయూ జిల్లా కో–కన్వీనర్ కోమటి చంద్రశేఖర్ జగిత్యాలటౌన్: గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతినెలా ఒకటో తేదీన గ్రీన్చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కో–కన్వీనర్ కోమటి చంద్రశేఖర్ ప్రభుత్వానికి సూచించారు. కార్మికులకు వేతనాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించాలని జిల్లా కమిటీ ఆధర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయ పాలనాధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీపీ సిబ్బందికి నష్టదాయకంగా మారిన జీవో 51ను సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేసి, పాత కేటగిరీలను అమలు చేయాలని కోరారు. బకాయిల చెల్లింపులకు పంచాయతీల నుంచి కార్యదర్శులు చెక్కులు అందించి మూడు నెలలు గడుస్తున్నా నిధులకు మోక్షం కలగలేదన్నారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు ఉన్నారు. -
ఇసుక రీచ్ ఏర్పాటుపై ఆందోళన
మెట్పల్లిరూరల్: పెద్దవాగును ఇసుక రీచ్గా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మెట్పల్లి మండలం ఆ త్మకూర్లో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రా మ పంచాయతీ ఎదుట బైటాయించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని రీచ్ను రద్దు చే యాలని డిమాండ్ చేశారు. ఇసుక తవ్వకాలతో భూ గర్భజలాలు తగ్గిపోయే ప్రమాదముందన్నారు. తా గు, సాగునీటికి ఇబ్బంది పడుతున్నామని, ఈ పరిస్థితుల్లో రీచ్ ఏర్పాటు సరికాదని మండిపడ్డారు. అనంతరం మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. -
బాటిల్నెట్ @ నోయూజ్
జగిత్యాల: ప్లాస్టిక్ వాడొద్దని, బాటిళ్లు యూజ్ చేయవద్దని ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు ఇచ్చినా.. హెచ్చరించినా.. ప్రజలు మాత్రం ప్లాస్టిక్ వాడటం మానడం లేదు. ఎక్కువగా వాటర్బాటిల్స్ కొనుగోలు చేసుకుని వాడుతుంటారు. తినడానికి ఏవైనా కొనుగోలు చేసినా హోటళ్ల నిర్వాహకులు కవర్లలోనే ప్యాకింగ్ చేస్తూ ఇస్తుంటారు. వీటిని కొనుగోలు చేసుకుని బాటిళ్లలోని నీటిని తాగుతూ వాటిని ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, ఆస్పత్రులు, పెద్దపెద్ద హోటళ్ల వద్ద ఈ సంఘటనలు చోటుచేసుకుంటాయి. వీటిని నివారించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అత్యంత వ్యయంతో బాటిల్నెట్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని జగిత్యాల మున్సిపాలిటీలో తప్ప వేరే మున్సిపాలిటీల్లో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. బాటిల్ ఆకారంలో ఉండే బాటిల్నెట్లను కొనుగోలు చేసి ప్రధానమైన చోట్ల ఏర్పాటు చేశారు. ఒక బాటిల్నెట్కు రూ.18 వేలు వెచ్చించారు. జిల్లా కేంద్రంలో సుమారు 15 ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా ఉపయోగంలో లేవు. దాంట్లో ఎవరూ వేసిన పాపాన పోలేదు. దాదాపు జగిత్యాలలో రూ.2.70 లక్షల ప్రజాధనం వృథాగానే మారిందని చెప్పవచ్చు. వాస్తవానికి వీటిని యూజ్ చేస్తే ఎన్నో ఉపయోగాలుంటాయి. అటు స్వచ్ఛ సర్వేక్షణ్తోపాటు ఇటు ఎలాంటి ప్రమాదాలూ లేకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్స్గానీ, బాటిల్స్ గానీ రోడ్లుపై పడేస్తే ప్లాస్టిక్ కవర్లు ఆవులు తిని అనారోగ్యానికి గురికాగా.. ప్లాస్టిక్ బాటిల్స్ మురికికాలువలో పడేయడంతో వాటితోనే నిండిపోవడంతో మురికినీరు బయటకు వెళ్లక రోడ్డుపైనే ప్రవహిస్తోంది. రోడ్డుపై వాటర్బాటిల్స్ ఉంటే వాహనదారులు దానిపై వెళ్తే వాహనం పడిపోయి ప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయి. అవగాహన లేకనే బాటిల్నెట్స్ వాటర్బాటిల్ ఆకారంలోనే ఏర్పాటు చేసి కొన్ని చోట్లలో ఏర్పాటు చేశారు. వీటిపై ఎవరికీ అవగాహన కల్పించకపోవడం, ప్లాస్టిక్ వస్తువులు, బాటిల్స్ ఇందులోనే వేయాలని తెలపకపోవడంతో ప్రజలు ఇష్టానుసారంగా పడేస్తున్నారు. ముఖ్యంగా పార్క్లలో అయితే ఎక్కబడితే అక్కడ ప్లాస్టిక్ వస్తువులు పడేస్తున్నారు. అధికారులు స్పందించి బాటిల్నెట్లలోనే ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు వేయాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించండం.. లేకుంటే జరిమానాలు వేయడం వంటివి చేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాధనం వృథా కొన్ని మున్సిపాలిటీల్లోనే ఏర్పాటు డ్రెయినేజీల్లోనే ప్లాస్టిక్ చెత్త బాటిల్నెట్లు ఏర్పాటు చేయాలి కోరుట్ల పట్టణంలో బాటిల్నెట్స్ ఏర్పాటు చేయలేదు. ప్లాస్టిక్ బాటిళ్లు రోడ్డుపైనే పడేస్తున్నారు. ప్రధాన కూడళ్లు, వార్డుల్లో రహదారుల వెంట ఏర్పాటు చేయాలి. మురికికాలువలోనే పడేస్తున్నారు. అధికారులు స్పందించాలి. – విఘ్నేశ్, కోరుట్ల ఉపయోగించుకోవాలి ధర్మపురిలో బాటిల్నెట్ పూర్తిస్థాయిలో లేవు. గోదావరి పరిసర ప్రాంతంలో జాలీలు ఏర్పాటు చేసినప్పటికీ అందులో వేయడం లేదు. మున్సిపల్ అధికారులు బాటిల్నెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుని అందులో వేసేలా చూడాలి. –లవన్కుమార్, ధర్మపురి ప్రధాన కూడళ్లలో పెట్టాలి బహిరంగ కూడళ్లలో బాటిల్నెట్స్ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయి. మెట్పల్లిలో ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అధికారులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు సైతం వాటిపై అవగాహన కల్పించాలి. – షరీఫోద్దీన్, మెట్పల్లి మురికికాలువలో వేస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్స్, ఇతరత్రా వస్తువులన్నీ మురికికాలువల్లోనే వేస్తున్నారు. దీంతో డ్రైనేజీలన్నీ నిండిపోయి దుర్గందం వెదజల్లుతోంది. బాటిల్స్ రోడ్డుపై పడేయడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించాలి. – రంజిత్, రాయికల్ ఇది కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన బాటిల్ నెట్. ఇది పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు చేయడంతో యూస్ లేకుండా పోయింది. కలెక్టరేట్కు నిత్యం వందలాది మంది వస్తుంటారు. ప్రజావాణి రోజు వివిధ సమస్యల ఫిర్యాదుల కోసం వస్తుంటారు. కానీ.. ఇందులో ప్లాస్టిక్ బాటిళ్లు వేసిన పాపాన పోలేదు. ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్ వద్దగల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు ఏర్పాటు చేసిన బాటిల్ నెట్. దీనిని పెట్టి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయినా ఏ ఒక్క బాటిల్ వేసిన పాపాన పోలేదు. ఏదో నామమాత్రంగా పెట్టినట్లుందే తప్ప దానిని ఎవరూ యూజ్ చేయడం లేదు. వాటిపై అవగాహన లేకపోవడం ఒకింత కారణంగా తెలుస్తోంది. ప్రజలు వాటర్బాటిళ్లు, ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువులను రోడ్డుపై లేకుంటే డ్రైనేజీల్లో పడేస్తున్నారు. ఇది ధర్మపురిలో ప్లాస్టిక్ వస్తువులు, ఇతరత్రా వస్తువులు వేసేందుకు వీలుగా చుట్టూ జాలి ఏర్పాటు చేశారు. ఇందులో ఎవరూ వేసిన పాపాన పోలేదు. గోదావరిలోనే ప్లాస్టిక్ బాటిల్స్ విచ్చలవిడిగా పడేస్తున్నారు. దీంతో పుణ్యక్షేత్రం కావడంతో నిత్యం అనేక మంది భక్తులు వస్తుంటారు. ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ప్లాస్టిక్ వస్తువులన్నీ గోదావరిలోనే పడేస్తున్నారు. ఇది రాయికల్లోని ఓ మురికికాలువ. మున్సిపాలిటీలో బాటిల్నెట్స్ లేకపోవడంతో డైనేజీల్లోనే ప్లాస్టిక్ వస్తువులు పడేస్తున్నారు. ప్లాస్టిక్తో పూర్తిగా నిండిపోవడంతో మురికినీరు కదలలేక ప్రజలకు ఇబ్బందిగా మారింది. -
అకాలవర్షం.. భారీగా పంట నష్టం
● నేలవాలిన మామిడి, వరి, మొక్కజొన్న పంటలు ● ప్రాథమిక నివేదిక రూపొందిస్తున్న అధికారులుజగిత్యాలఅగ్రికల్చర్/జగిత్యాలరూరల్/గొల్లపల్లి/వెల్గటూర్/ధర్మపురి: జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో రైతన్న భారీగా నష్టపోయాడు. ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో పంటలు నేలవాలాయి. మామిడి, నువ్వు, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వ్యవసాయ, ఉద్యాన పంటలు సుమారు 5,532 ఎకరాల్లో నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా నివేదిక రూపొందించారు. కలెక్టర్ సత్యప్రసాద్ వెల్గటూర్, ధర్మపురి మండలాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు. జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ జగిత్యాల రూరల్, ధర్మపురి, జిల్లా ఉద్యానశాఖాధికారి శ్యాం ప్రసాద్ కొడిమ్యాల, మల్యాల మండలాల్లో పర్యటించారు. 33 శాతానికి మించి నష్టపోయిన పంటలను అంచనా వేశారు. ధర్మపురిలో 1495 ఎకరాలు, సారంగాపూర్లో 18, పెగడపల్లిలో 100, బుగ్గారంలో 257, ఎండపల్లిలో 123, మేడిపల్లిలో 5, వెల్గటూర్లో 270, బీర్పూర్లో 8, జగిత్యాల రూరల్ మండలంలో 735, గొల్లపల్లిలో 365 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉద్యానశాఖ అధికారులు అయా మండలాల్లో పర్యటించి దాదాపు 549 రైతులకు చెందిన 2156 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదిక రూపొందించారు. 33శాతం నిబంధన రైతులకు శాపం పంట నష్టం 33 శాతానికి మించి జరిగితేనే అధికారులు నివేదికలు తయారు చేయడం రైతులకు శాపంగా మారింది. వారంలో కోతకు వచ్చే పంటలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లి, సారంగాపూర్ మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించా రు. ఎకరాకు రూ.50వేల చొప్పున పరిహా రం అందించాలని డిమాండ్ చేసారు. పెగడపల్లిలో 47.3 మి.మీ వర్షపాతం పెగడపల్లి మండలంలో అత్యధికంగా 47.3 మి.మీ వర్షపాతం నమోదైంది. బుగ్గారం మండలం సిరికొండలో 39.3 మి.మీ, ఎండపల్లి మండలం గుల్లకోటలో 38.3 మి.మీ, జగిత్యాల రూరల్ మండలం పొలాసలో 35 మి.మీ, గొల్లపల్లిలో 33.3 మి.మీ, ధర్మపురి మండలం నేరేళ్లలో 32.8 మి.మీ, జైనాలో 25.3 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మరో రెండు మూడు రోజులు కూడా మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని రాంనూర్లో అకాలవర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్డీవో మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి రాంచందర్, మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ పాల్గొన్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది గొల్లపల్లి మండలం భీంరాజ్పల్లి గ్రామానికి చెందిన రైతు సింగారపు మల్లేశం. తనకున్న భూమిలో ఆరుతడి పంటగా మొక్కజొన్న సాగు చేశాడు. ప్రస్తుతం పంట చేతికొచ్చే దశలో ఉంది. శనివారం వేకువజాము వరకు కురిసిన అకాల వర్షానికి పంటంతా నేలకొరింది. ఈదురుగాలులకు ధాన్యం కూడా రాలిపోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు ఈ రైతు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైదాపూర్(హుస్నాబాద్): ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని మండలంలోని గొల్లగూడెంకు చెందిన మర్రి సదానందం (47) మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. హుజూరాబాద్కు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు శుక్రవారం సైదాపూర్ వెళ్తుండగా బొత్తల్లపల్లి వద్ద మర్రి సదానందం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈప్రమాదంలో సదానందం తీవ్రంగా గాయపడ్డాడు. బ్లూకోల్ట్స్ సిబ్బంది 108లో సదానందంను హుజూరాబాద్ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం రామగుండం: రామగుండం–పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య గురువారం అర్ధరాత్రి దక్షిణ్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందినట్లు జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి తెలిపారు. మృతుడి వయస్సు 35–40 మధ్య ఉంటుందన్నారు. నల్లటి జీన్స్ ప్యాంట్, బ్లూ కలర్ ఫుల్షర్టు ధరించి ఉన్నాడన్నారు. తలపగిలి నుజ్జునుజ్జు కావడంతో ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా ఉందని తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచామని ఆయన పేర్కొన్నారు. సంబంధీకులు ఉంటే సెల్ నంబరు 99493 04574, 87126 58604లో సంప్రదించాలని ఆయన కోరారు. ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం లభ్యం హుజూరాబాద్: తుమ్మన్నపల్లి గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలో శుక్రవారం ఓ మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన వాసాల అరవింద్(21) కరీంనగర్ జిల్లా ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. ఈనెల 19న స్నేహితులతో కలిసి ఎల్ఎండీలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు ఈత కోసం వెళ్లి గల్లంతైనట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వృద్ధురాలు అదృశ్యంకొత్తపల్లి(కరీంనగర్): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన సావనపల్లి లక్ష్మి (70) బస్సులో కరీంనగర్కు ప్రయాణిస్తూ అదృశ్యం అయింది. నలుపు రంగు, గుండ్రని ముఖం కలిగి, ఎత్తు ఐదడుగులు ఉంటుంది. గులాబీ రంగు చీర, నీలం రంగు జాకెట్ ధరించి ఉంది. ఆమె కోసం బంధువులు, పోలీసులు ఆరా తీస్తూ గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆచూకీ లభించడం లేదు. ఆమె కనిపిస్తే కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు ఫోన్ నంబర్లు 9494490268/ 8712670765లకు సమాచారం అందించాలని, వారికి నగదు పారితోషికం ఇవ్వబడుతుందని ఎస్హెచ్వో, శిక్షణ ఐపీఎస్ వసుంధర యాదవ్ తెలిపారు. -
వస్త్రోత్పత్తి ఆర్డర్లు సకాలంలో పూర్తి చేయాలి
సిరిసిల్ల: వస్త్రోత్పత్తిదారులు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం వస్త్రోత్పత్తిదారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్, సంక్షేమశాఖల వస్త్రోత్పత్తి ఆర్డర్లను వెంటనే అందించాలన్నారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, టెక్స్టైల్ పార్క్ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్కుమార్ పాల్గొన్నారు. కారుణ్య నియామకాలు సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల వారసులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా కారుణ్య నియామకపత్రాలు అందించారు. ప్రజా ఆరోగ్య విభాగంలో పబ్లిక్ హెల్త్ వర్కర్గా పనిచేసే సిరిగిరి నర్సింహులు అనారోగ్యంతో 2020లో మరణించగా.. అతని కుమారుడు సిరిగిరి రాజుకు ఉద్యోగ నియామకపత్రం అందించారు. నగునూరి నాంపల్లి 2023 మరణించగా అతని భార్య నగునూరి లతకు నియామకపత్రం అందించారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి పాల్గొన్నారు. అర్హులకు ఓటుహక్కు కల్పించాలి జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారికి ఓటుహక్కు కల్పించాలని కలెక్టర్ కోరారు. శుక్రవారం రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా చేయాలన్నారు. ఎన్నికల సమయంలో కాకుండా ఓటర్ జాబితా సవరణపై రాజకీయ నాయకుల ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 2,30,157 మంది పురుషులు, 2,47,977 మంది మహిళా ఓటర్లు, 38 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాధాభాయి, రాజేశ్వర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు నాగుల శ్రీనివాస్, సంపత్, రాజన్న, రమేశ్, రమణ, ఎన్నికల సిబ్బంది రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
సందడిగా అల్ఫోర్స్ ‘ఫ్లిక్కర్’
కొత్తపల్లి: వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ మైదానంలో శుక్రవారం శ్రీఫ్లిక్కర్శ్రీ పేరిట నిర్వహించిన భగత్నగర్ అల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్ వార్షికోత్సవం సందడిగా సాగింది. వేడుకలను ఎస్సారార్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వి.మధుసూదన్రెడ్డితో కలిసి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 35ఏళ్లుగా అల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా రాష్ట్ర విద్యారంగానికి విశిష్ట సేవలు అందిస్తూ తలమానికంగా నిలుస్తున్నామని తెలిపారు. అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించిన హర్షిత్రెడ్డి ఇటీవల గేట్–2025లో ఆల్ఇండియా 60వ ర్యాంకు సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బిల్లుల కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షిణలుకరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన నిర్వహిస్తున్నదా లేక రాక్షస పాలన సాగిస్తున్నదా అని మాజీ సర్పంచుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరాజం ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ అభివృద్ధి బిల్లుల విడుదలకు మోకాలడ్డుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ, జిల్లావ్యాప్తంగా వరుస ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. బిల్లుల కోసం మంత్రుల చుట్టూ తిరిగినా, నిరాశే మిగిలిందని విమర్శించారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలను కలవడం అనైతికమా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. -
మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి
కరీంనగర్: దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేయాలని కుట్రచేస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు దేశ ప్రజలంతా సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి మాట్లాడారు. పార్లమెంటుస్థాయిలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకువచ్చి దక్షిణాది రాష్ట్రాలకుు తీరని అన్యాయం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోడీ అప్పుల దేశంగా మారుస్తున్నాడని, గతంలో రూ.80లక్షల కోట్ల అప్పు ఉంటే తాజాగా రూ.150 లక్షల కోట్ల అప్పుచేసి కార్పొరేటు వ్యవస్థలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కొంత ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా అనేక హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, అందెస్వామి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని సీపీఐ అభ్యర్థులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డిభవన్లో శుక్రవారం కార్యవర్గసభ్యుడు బత్తుల బాబు అధ్యక్షతన జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సీపీఐకి గణనీయమైన చరిత్ర ఉందని, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని, నేటికీ అనేక గ్రామాల్లో తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, సభ్యులు ఉన్నారని అన్నారు. అదే ఒరవడిని కొనసాగించేందుకు సీపీఐ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి -
ఇఫ్తార్కు ఏర్పాట్లు చేసి వెళ్తుండగా..
శంకరపట్నం(మానకొండూర్): రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించే ఇఫ్తార్ విందుకు తండ్రికొడుకులు ఏర్పాట్లు చేశారు. అంతలోనే జరిగిన రోడ్డుప్రమాదంలో అసులువుబాసారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రా మంలో ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల క థనం ప్రకారం.. మండలంలోని మక్త గ్రామానికి చెందిన తండ్రికొడుకులు షేక్ అజీమ్ (35), షేక్ రె హమాన్ (10) శుక్రవారం కేశవపట్నంలో ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేసి ఇంటికి బైక్పై వెళ్తున్నారు. అదే సమయంలో మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన మందాడి శ్రీనివాస్రెడ్డి, ఇజ్జిగిరి హరీశ్ కూడా కేశవపట్నం నుంచి బైక్పై వెళ్తుండగా వరంగ ల్ నుంచి కరీంనగర్ వస్తున్న లారీ కేశవపట్నం బ్రిడ్జి సమీపంలో ఇరువురి బైక్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో అజీమ్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు. మందాడి శ్రీనివాస్రెడ్డికి తీవ్ర, హరీశ్కు స్వల్పగాయాలయ్యాయి. కేశవపట్నం ఎస్సై రవి, సిబ్బంది 108వాహనంలో క్షతగాత్రులను హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అజీమ్, రెహమాన్ను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లడంతో పోలీసులు, స్థానికులు వంకాయగూడెంలో పట్టుకున్నారు. ప్రమాద స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్జీ, హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి పరిశీలించారు. ఇఫ్తార్ విందులో పాల్గొనాల్సిన తండ్రికొడుకుల దుర్మరణం స్థానికులను కలచివేసింది. రెండు బైక్లను ఢీకొన్న లారీ తండ్రికొడుకులు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
విత్తనోత్పత్తికి వానగండం
వీణవంక(హుజూరాబాద్): విత్తనోత్పత్తి రైతులకు కష్టకాలమొచ్చింది. ఈ నెల 21నుంచి నాలుగు రో జుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో సీడ్ రైతుల్లో కలవరం మొ దలైంది. ఈ సమయంలో వర్షం పడితే మగ రేణువులు విప్పుకోక ఆడ,మగ వరి మధ్య ఫలదీకరణ జరుగదు. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం ప డుతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే చలి కారణంగా ఆడ,మగ పైరు ఎదుగుదలలో వ్యత్యాసం ఏర్పడింది. పంటను కాపాడుకోవడానికి రసాయనాలు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. జిల్లాలో ఈ యాసంగి 1.10లక్షల ఎకరాలలో హైబ్రిడ్ వరి సాగుచేస్తున్నారు. తెలంగాణలోనే కరీంనగర్ జిల్లా హైబ్రిడ్సాగులో మొదటిస్థానంలో ఉంది. ఇక్కడి నేలలు సీడ్కు అనుకూలం కావడంతో విత్తన కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆ గంట సమయమే కీలకం ఆడ,మగ వరిసాగు కొంత కష్టమే. రెండు పైర్లమధ్య రెండు మీటర్ల ఎడం ఉంటుంది. పైరు పిలకదశలో ఉన్నప్పుడు మగవరి పుప్పొడి రేణువులు ఆడవరిపై పడేలా తాడు లేదా కర్రలతో దులుపాలి. దీంతో ఆడవరి ఫలదీకరణ చెందుతుంది. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15గంటల సమయంలో మాత్రమే ఈ పని చేయాలి. మగవరిలో రేణువులు ఈ సమయంలోనే బయటికి వస్తాయి. ఈ ఫలదీకరణ సమయం 12రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో వర్షాలు కురిస్తే గింజ తాలుగా మారి రంగు మారుతుంది. ఫలితంగా విత్తనం మొలకెత్తే స్వభావాన్ని కోల్పోతాయి. క్వింటాల్కు రూ.6వేల నుంచి రూ.20వేల వరకు హైబ్రిడ్సాగులో వీణవంక, శంకరపట్నం, జమ్మికుంటతో పాటు పెద్దపల్లి జిల్లా ముత్తారం, కాల్వశ్రీరాంపూర్, మంథని మండలాల్లో ఎక్కువ. జిల్లాలో ఆరు మల్టీనేషనల్ కంపెనీలతో పాటు 20కి పైగా వివిధ రాష్ట్రాల కంపెనీలు విత్తనం ఇచ్చాయి. ఇక్కడ పండిన పంట ఎనిమిదేళ్లయినా మొలకెత్తే స్వభావం ఉండటంతో కంపెనీలు పోటీపడి విత్తనం ఇస్తున్నాయి. క్వింటాల్కు గతేడాది విత్తనధర రూ.6వేల నుంచి 10వేల వరకు ఉండేది. ఈ సారి క్వింటాల్కు అదనంగా రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పెంచాయి. దీంతో పాటు దిగుబడి వచ్చినా, రాకున్నా.. ఎకరాకు రూ.లక్ష ఇస్తామని కంపెనీ డీలర్లు ప్రకటించడంతో రైతులు పోటీపడి సాగుచేశారు. నాలుగు రోజుల పాటు వర్షసూచన భయం.. భయంగా సీడ్ రైతులు ఇప్పుడు వానలు కురిస్తే ఫలదీకరణపై తీవ్ర ప్రభావం ఇప్పటికే ఆడ, మగ వరి ఎదుగుదలలో వ్యత్యాసం పంట దిగుబడి తగ్గుతుందని ఆందోళన జిల్లాలో 1.10 లక్షల ఎకరాలలో హైబ్రిడ్ వరిసాగు -
ఊరూవాడా చెప్పుకోవాలి
● రైతు రుణమాఫీ, రైతుభరోసా లబ్ధిదారుల పేర్లు ప్రదర్శన ● గ్రామాల్లో ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం ● లబ్ధిదారుల వివరాలు పేర్ల ముద్రణకు రంగం సిద్ధం ● జిల్లాలవారీగా టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ ● ఉగాది నాటికి ఏర్పాటు లక్ష్యంగా ప్రయత్నాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: చేసింది చెప్పుకోవాలి.. అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాము అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు, అందుకోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ప్రజలకు తెలియజెప్పాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ప్రభుత్వం కన్నా అధిక మొత్తంలో ఏకకాలంలో రుణమాఫీ చేశామని, రైతు భరోసా అమలు చేశామని, ఈ విషయాలను గ్రామస్తులు చర్చించుకునే విధంగా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందుకోసం లబ్ధిదారుల పేర్లను గ్రామంలోని ముఖ్యవీధుల్లో ప్రదర్శించడం, తద్వారా తాము చేసిన పనులకు ఇంటింటికి తెలియజేయడం, ప్రజల మనసు గెలుచుకోవాలన్న తాపత్రయంతో వ్యవసాయశాఖ అడుగులు వేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన పలువురు యువతకు నియామక పత్రాలు ప్రభుత్వం పెద్దలు స్వయంగా అందజేస్తున్న తరహాలోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిసింది. వచ్చే స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ఈ ప్రచారాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఏం చేస్తారు? రైతు రుణమాఫీ, రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.కోట్లు విడుదల చేస్తోంది. అదే సమయంలో తాము అత్యధిక నిధులు విడుదల చేసి చరిత్ర సృష్టించామన్నది కాంగ్రెస్ వాదన. అదే సమయంలో రుణమాఫీ, రైతు భరోసా అమలు తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అందుకే, ప్రతిపక్షాల వాదనలను సమర్థంగా తిప్పికొట్టేందుకే ప్రభుత్వం తాము చేసిన పనులను ఊరూ, వాడా చెప్పుకునేలా ఈ ఆలోచనకు తెరతీసింది. ప్రతీ గ్రామంలో కనీసం మూడు ముఖ్యమైన కూడళ్ల వద్ద ఆ గ్రామంలో రైతు భరోసా, రైతు రుణమాఫీలో ఏ రైతుకు ఎంత లబ్ధి జరిగింది? ఆ రైతు పేరు, మాఫీ వివరాలు అంకెల్లో పేర్కొంటూ ప్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు. వీటిని వీలైనంత మంది ఎక్కువగా ప్రజలు వీక్షించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఉగాదిలో టెండర్లు, ముద్రణ పూర్తి కావాలన్న లక్ష్యంతో కలెక్టర్లు, వ్యవసాయాశాఖాధికారులు పనిచేస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల రైతుల పూర్తి వివరాలు గణాంకాలతో సహా సిద్ధం చేశారు. టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ రాష్ట్రంలోని అన్నిజిల్లాల వ్యవసాఽయశాఖ అధికారులు రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల్లో రైతుల పేర్ల ముద్రణకు ఫ్లెక్సీ టెండర్లు పిలిచారు. వాస్తవానికి ఈ టెండర్కు అనుకున్నంత ప్రచారం జరగలేదు. ఈ ప్రకటన ద్వారా వచ్చిన టెండర్లను ఖరారు చేసి త్వరలోనే అధికారికంగా ముద్రణకు ఆదేశాలివ్వనున్నారు. ఆరుగడుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఈ ఫ్లెక్సీలు ఉండనున్నాయి. ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి ఫొటోలు ఫ్లెక్సీలో ఉండనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, ముద్రణకు ఆర్డర్ ఇవ్వడం, ఫ్లెక్సీలను గ్రామాల్లో కూడళ్లలో ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2.46 లక్షల మంది రైతులకు మూడు నుంచి నాలుగు దశల్లో ఇటీవల రైతు రుణమాఫీ జరిగింది. వీరికి దాదాపు రూ.రెండువేల కోట్ల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత మాఫీ అయిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
జగిత్యాల: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని, మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈనెల 23న కరీంనగర్లో కేటీఆర్ పాల్గొననున్న సన్నాహక సమావేశంపై శుక్రవారం బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టి ప్రజల గుండెల్లో నిలిచిన ఏకై క వ్యక్తి కేసీఆర్ అ న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, త్వరలో మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. సన్నాహాక సభకు జిల్లా నుంచి అత్యధిక మంది తరలిరావాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి పాల్గొన్నారు. క్షయపై అవగాహన కల్పించాలిజగిత్యాల: క్షయపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. శుక్రవారం మెడికల్ కళాశాలలో విద్యార్థులకు క్షయపై క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరికై నా క్షయ లక్షణాలు కన్పిస్తే ఆస్పత్రికి పంపించి చికిత్స తీసుకునేలా తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం విద్యార్థులను 10 గ్రూపులుగా విభజించి క్విజ్ కాంపిటిషన్ నిర్వహించారు. ఈనెల 24న జరిగే వరల్డ్ టీబీ డే కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సునీల్రావు, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సుమన్రావు, క్షయ నివారణ అధికారి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు. -
సేవా కార్యక్రమాలతోనే జీవితానికి సార్థకత
జగిత్యాలజోన్: సామాజిక సేవా కార్యక్రమాలతోనే జీవితానికి సార్థకత చేకూరుతుందని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కంచ ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అనాథ పిల్లల బాలసదన్కు జిల్లా లీగల్ ఎయిడ్స్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు శుక్రవారం కూలర్స్ అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, సంపాదనే ప్రధానం కారాదని, సేవా కార్యక్రమాలకు సైతం కొంత మొత్తం వెచ్చించి మనస్సుకు ప్రశాంతత చేకూర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కొంతమేరకై నా సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజా భివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఛీప్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. సతీశ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సి ల్ సభ్యులు ఆర్. విజయకృష్ణ, సీహెచ్.అనురా ధ, జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ నరేశ్, జిల్లా చైల్డ్ వె ల్ఫేర్ అసోసియేషన్ అధికారి హరీశ్ పాల్గొన్నారు. జిల్లాలో తేలికపాటి వర్ష సూచనజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలక్ష్మి తెలిపారు. ఈనెల 22 నుంచి 26 వరకు తేలికపాటి నుంచి అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 22 నుంచి 24 వరకు జిల్లాలో అక్కడక్కడ వడగళ్ల వాన, ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు వంటివి గంటకు 30– 40 కి.మీ కన్నా ఎక్కువ వేగంతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రత 36–39, రాత్రి ఉష్ణోగ్రత 24–25 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ ఉదయం 51–72 శాతం, మధ్యాహ్నం 13–26 శాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ఆగ్నేయ దిశ నుంచి గాలులు సరాసరి గంటకు 7–10 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. ఆయిల్పామ్ సాగుపై అవగాహనరాయికల్(జగిత్యాల): ఆయిల్పామ్ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ఉద్యానవన శాఖ ఏడీ కందుకూరి స్వాతి అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తపేట గ్రామంలో పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు చెట్లకు 90 శాతం సబ్సిడీ, డ్రిప్ పరికరాలకు బీసీ సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఓసీలకు 80 శాతం సబ్సిడీ ప్రభుత్వం కల్పిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకో వాలని కోరారు. మండల వ్యవసాయాధి కారి ముక్తేశ్వర్, ఉద్యానవన శాఖ అధికారి స్వాతి, ఏఈవో సౌందర్య, ఫీల్డ్ ఆఫీసర్ రాజేశ్, మాజీ సర్పంచ్ బత్తిని రాజేశం, రైతులు చింతలపల్లి గంగారెడ్డి, కాటిపల్లి గంగారెడ్డి పాల్గొన్నారు. బీసీ బిల్లు చరిత్రాత్మకం కోరుట్ల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం చరిత్రాత్మకమని కోరుట్ల కాంగ్రెస్ సెగ్మెంట్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. శుక్రవారం కోరుట్లలో భారీ బైక్ ర్యాలీ అనంతరం బస్టాండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించి కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ, బీసీ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం గొప్ప విషయమన్నా రు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీసీల కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుందన్నా రు. నాయకులు తిరుమల గంగాధర్, అన్నం అనిల్, పుప్పాల ప్రభాకర్, ఆడెపు మధు, భూంరెడ్డి, గడ్డం వెంకటేశ్గౌడ్, మార్కెట్ చైర్మ న్ అంజిరెడ్డి, నయీం, సోగ్రాబీ, సత్యనారాయణ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముందుకు నడిపించేది కవిత్వమే
కరీంనగర్ కల్చరల్: మానవాళిని ముందుకు నడిపించే శక్తి కవిత్వానికి ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్ అన్నారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నగరంలోని జ్యోతిబాపూలే మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కలం నుంచి కవిత్వం ఉద్భవిస్తుందన్నారు. కవితలకు సందర్భోచితమైన చిత్రాలను గీసి అన్నవరం శ్రీనివాస్, గుండు రమణయ్య, అన్నవరం దేవేందర్ మన్ననలు పొందారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు సీవీక ుమార్, కవులు గాజోజు నాగభూషణం, దామరకుంట శంకరయ్య, కందుకూరి అంజయ్య, కె.మహేందర్రాజు, మరిపల్లి మహేందర్, కూకట్ల తిరుపతి, విలాసాగరం రవీందర్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి
● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సురక్షిత ప్రయాణం ప్రత్యేక కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించే ఉద్దేశంతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను (బ్లాక్ స్పాట్లను) పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందన్నారు. ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రజల సహకారం అవసరమని, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. జి ల్లా వ్యాప్తంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే 43 బ్లాక్స్పాట్స్ను గుర్తించడం జరిగిందని, వివి ధ శాఖల సమన్వయంతో ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీ సు కళాబృందాల ద్వారా జాతీయ రహదారులపై ఉన్న గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్పై అవగాహన కల్పించడంతో పాటు వాటి పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ఖాన్, సీఐలు కృష్ణారెడ్డి, వేణుగోపాల్, రవి, ఎస్సైలు సదాకర్, నరేశ్, మల్లేశం, నేషనల్ హైవే ఏఈ లక్ష్మణ్, మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ ప్రమీల పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ముదిరాజ్ నాయకులు
వేములవాడ/ముస్తాబాద్: ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏకు మార్చాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా.. జిల్లాలోని ముదిరాజ్ కుల సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వేములవాడ ఠాణాకు ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, వేములవాడ టౌన్ ప్రెసిడెంట్ లాల దేవయ్య, జిల్లా యూత్ నాయకుడు రెడ్డవేని పరశురాంలను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ముస్తాబాద్ పోలీసులు మత్స్యకార సొసైటీ జిల్లా డైరెక్టర్ గాడిచెర్ల దేవయ్యను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల ప్రయోజనానికి సొసైటీలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం అదే రీతిలో నిధులు కేటాయించాలని కోరారు. -
తొలిరోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం
● 99.90 శాతం విద్యార్థుల హాజరు జగిత్యాల: జిల్లాలో శుక్రవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 67 కేంద్రాల్లో 11,838 మంది విద్యార్థులకు 11,826 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే సప్లమెంటరి విద్యార్థులు 31 మందికి 25 మంది హాజరయ్యారు. 99.90 శాతం నమోదైంది. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఫ్లయింగ్స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు సెంటర్లను పరిశీలించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు: కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కావద్దని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్, పురాణిపేట లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగని వ్వొద్దని, ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడం జరుగుతుందన్నారు. క లెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఈవో రాము, తహసీల్దార్ రామ్మోహన్ ఉన్నారు. రైతుమిత్ర వాహనం ద్వారా విద్యుత్ సేవలురాయికల్(జగిత్యాల): రైతుమిత్ర వాహనం ద్వారా రైతులు విద్యుత్ సేవలు పొందవచ్చని ఏడీఈ సింధూర్శర్మ అన్నారు. శుక్రవారం రా యికల్ మండలం సింగరావుపేట, భూపతి పూర్ గ్రామాల్లో పొలంబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహ న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని, మరమ్మతుకు గురైన ట్రాన్స్ఫార్మర్లను రైతుమిత్ర వాహనం ద్వారానే విద్యుత్ శాఖ మార్పిడి చేస్తుందన్నారు. దీని కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఏఈలు తుమ్మల నవీన్, రాజేశం, సబ్ ఇంజినీర్లు సంతోష్, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రాములోరికి గోటి తలంబ్రాలు
జ్యోతినగర్(రామగుండం): కల్యాణం కోసం తలంబ్రాల తయారీకి సాధారణంగా మరపట్టిన బియ్యం వినియోగిస్తారు. కానీ, శ్రీసీతారాముల కల్యాణం కోసం గోటితో వొలిచిన తలంబ్రాలు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలోనే ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలోని శ్రీసీతారామ సేవా సమితి సభ్యులు గోటితో వొలిచిన తలంబ్రాలను శ్రీసీతారామ కల్యాణం కోసం పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈఏడాది కూడా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏప్రిల్ 6న శ్రీరామ నవమి నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణోత్సవం కోసం మహిళలు గోటితో వొలిచిన తలంబ్రాలను పంపించి భక్తిని చాటుకుంటున్నారు. గోటితో కోటి తలంబ్రాలను వొలిచే ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీసీతారామ సేవా సమితి సభ్యులు కంది సుజాత, కొండు రమాదేవి, జనగామ రాజేశ్వరి, ఆలయ కమిటీ సభ్యుడు చెప్యాల సత్యానారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
సిగ్నల్స్.. ఉన్నా లేనట్టే
జగిత్యాల: జిల్లాకేంద్రం.. లక్షకు పైగా జనాభా. పది ప్రధాన కూడళ్లున్నాయి. ప్రతిరోజూ వివిధ పనులు నిమిత్తం జిల్లా కేంద్రానికి అనేకమంది వస్తుంటారు. ఇతర జిల్లాల నుంచి వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతరత్రా వాహనాలపై వస్తుంటారు. ఈ క్రమంలో వారంతా ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ పక్కన జనరల్ ఆస్పత్రి ఉండటంతో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడి ఇందిరమ్మ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినా కొద్దికాలంగా పనిచేయడం లేదు. ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది ఉండడం లేదు. జిల్లా కేంద్రంలోని మరో ప్రధానమైన ప్రాంతం కొత్తబస్టాండ్. ఇక్కడా సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదు. ఫలితంగా ట్రాఫిక్ నిత్యం నిలిచిపోతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసినప్పటికీ అవి పనిచేయడం లేదు. జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా, బైపాస్ చౌరస్తా సమీపంలోని సిగ్నల్స్ పనిచేయడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సిగ్నల్స్ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో ప్రధాన మున్సిపాలిటీలైన కోరుట్ల, మెట్పల్లిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీ సరిగా పనిచేయడం లేదు. కోరుట్ల మీదుగా వెళ్లే ఎన్హెచ్–63 హైవేపై ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ● ఇది జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ చౌరస్తా. ఇక్కడ సిగ్నల్స్ కొద్దిరోజులు పనిచేస్తే మరికొద్ది రోజులు పనిచేయవు. ఇక్కడి కొత్తబస్టాండ్కు నిత్యం అనేక బస్సులు వస్తుంటాయి. పెట్రోల్ బంక్లు ఉండటంతో అత్యంత రద్దీగా ఉంటుంది. సిగ్నల్ వ్యవస్థ పనిచేయక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రెడ్లైట్ 60 సెకన్లు పడితే.. గ్రీన్లైట్ 30 సెకన్లు మాత్రమే పడుతుండడం ఇబ్బందిగా మారుతోంది. సిగ్నల్స్ను సరిచేయాల్సిన అవసరం ఉంది. ● ఇది జిల్లాకేంద్రంలోని తెలంగాణ వైన్స్, పొన్నాల గార్డెన్స్కు వెళ్లే చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్. ఇది కొన్నాళ్లుగా పనిచేయడం లేదు. కనీసం వాటిని పట్టించుకునేనాథుడే కరువయ్యా రు. అధికారులు వాటిని విని యోగంలోకి తెచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఎప్పుడు పనిచేస్తాయో ఎవరికీ తెలియని వైనం కొన్నిసార్లు సిగ్నల్స్.. రోజుల తరబడి మూలకు బల్దియాల్లో అస్తవ్యస్తంగా మారుతున్న ట్రాఫిక్ నిత్యం ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు సిగ్నల్స్ వినియోగంలోకి తేవాలి జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ వ్యవస్థ అస్థవ్యస్తంగా మారింది. సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ సక్రమంగా పనిచేయడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ వినియోగంలోకి వచ్చేలా చూడాలి. – ఒడ్నాల రాజశేఖర్, జగిత్యాల టైమ్ ప్రకారం రావడంలేదు జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్స్ సక్రమంగా లేవు. టైమింగ్ ప్రకారం రావడం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకవేళ సిగ్నల్స్ పడినప్పుడు ఆగితే తర్వాత మళ్లీ వెంటనే రెడ్లైట్ పడుతోంది. అధికారులు కరెక్ట్ టైమింగ్ సెట్ చేయాలి. – కృష్ణ, జగిత్యాల అస్తవ్యస్తంగా ట్రాఫిక్ కోరుట్లలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది. ఎహెచ్–63 హైవే ఉండడంతో భారీ వాహనాలు వస్తున్నాయి. కొ ద్ది నెలలుగా సిగ్నల్స్ పనిచేయడం లేదు. రోడ్డు ప్ర మాదాలు జరిగే అవకాశాలున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – నరేశ్, కోరుట్ల ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్ ప్రాంతం. ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఎప్పుడో ఒకసారి పనిచేస్తాయి. పూర్తిస్థాయిలో పనిచేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఇది ప్రధాన చౌరస్తా కావడం.. ధర్మపురికి వెళ్లే దారి కావడంతో రద్దీ ఉంటోంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినా అవి పనిచేయడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని పరిస్థితి. ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్రోడ్గల పొన్నాల గార్డెన్స్, కరీంనగర్ రోడ్కు వెళ్లే చౌరస్తా. నిత్యం భారీ వాహనాలు వెళ్తుంటాయి. కొత్తగా సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పుడు పనిచేశాయంటే ఇప్పటివరకు పనిచేసిన దాఖలాలు లేవు. -
తెలంగాణలో పలు చోట్ల వర్ష బీభత్సం
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో వర్ష బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం పడింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది.మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి వడగళ్ల వాన కురిసింది. కాగజ్ నగర్లో దుకాణాలపై కప్పులు కూడా ఎగిరిపోయాయి. పోచమ్మ గుడి ముందున్న సుమారు 150 ఏళ్ల వృక్షం నేలమట్టం అయ్యింది. దీంతో వాహనాలను ఆ మార్గం నుంచి వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు.జగిత్యాల జిల్లాలో వాతావరణం చల్లబడటంతో ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊరట చెందారు. రాళ్లవానతో అక్కడక్కడా మామిడి రైతులకు నష్టం. వాటిల్లింది. గాలి దుమారానికి పిందెలు రాలిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో మంథని, రామగిరి, ముత్తారం, కమాన్పూర్, మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, ఎలిగేడు మండలం దూళికట్టలో వడగళ్ల వాన పడింది. అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. బోయిన్పల్లి రామడుగు మల్యాల మండలాల్లో మోస్తరు కంటే ఎక్కువ వర్షం కురుస్తోంది. -
ఆదాయం అంతంతే..
శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025● తలసరి ఆదాయంలో పెద్దపల్లి టాప్ ● అటవీ విస్తీర్ణంలో కరీంనగర్ లాస్ట్, ఉపాధి హామీలో భేష్ ● తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్–2025లో వెల్లడి– IIలోu గనుల ద్వారా ఆదాయం ఉమ్మడి జిల్లా సహజ వనరులకు నెలవైన ప్రాంతం. బొగ్గు, గ్రానైట్, ఇసుక, ఇటుక బట్టీలు తదితర మైనింగ్ కార్యకలాపాలతో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతుంది. ఉమ్మడి జిల్లా నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రూ.190.62 కోట్లకు గాను రూ.156.21కోట్ల ఆదాయం ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది.సాక్షి, పెద్దపల్లి: జిల్లాల పురోగతికి సూచికగా భావించే స్థూల జిల్లా దేశీయోత్పత్తి విలువ(జీడీడీపీ)లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు పర్వాలేదన్నట్లుగా ఉండగా.. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం విషయంలో జగిత్యాల మినహా మిగతా జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. అర్బన్ జనాభాలో కరీంనగర్లో 3లక్షలు, రామగుండంలో 2.5లక్షలు, జగిత్యాలలో లక్షమంది పట్టణాల్లో నివసిస్తున్నారు. జిల్లా విస్తీర్ణంలో అత్యల్పంగా అడవులు కలిగి ఉండి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా చివరి స్థానంలో నిలవగా, ఖనిజాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో ఉమ్మడి జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్– 2025లో ఈ అంశాలన్నీ వెల్లడయ్యాయి. జిల్లా టార్గెట్ వసూలైంది (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) పెద్దపల్లి 2,465.99 2,264.30 సిరిసిల్ల 1,465.07 1,342.18 కరీంనగర్ 12,872.16 10,658.72 జగిత్యాల 2,259.05 1,356.26 -
విజయీభవ..
● నేటి నుంచి టెన్త్ పరీక్షలు ● మెలకువలు పాటిస్తే మెరుగైన ఫలితాలు ● నిత్య సాధనతో గణితం సులువే ● సైన్స్లో పట్టికలు.. ప్రయోగాలు కీలకం ● సోషల్లో అవగాహన.. విశ్లేషణ ముఖ్యం ● లాంగ్వేజ్లో అక్షరదోషాలు నివారించాలి ● సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల సూచనలుగొల్లపల్లి: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే విద్యార్థుల్లో ఏదో తెలియని ఆందోళన, భయం వెంటాడుతోంది. దీనికి ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు కొన్ని చిట్కాలు వివరిస్తున్నారు. కొన్ని మెలకువలు పాటిస్తే సత్ఫలితాలు సాధించవచ్చంటున్నారు. గతేడాది నుంచి రెండు పరీక్షల స్థానంలో ఒకేరోజు పరీక్ష రాయాల్సి ఉంటుంది. గణితం, సోషల్ సబ్జెక్టులకు 80 మార్కుల పశ్నపత్రంలో 20 మార్కులు పార్ట్–బీకి కేటాయించారు. సైన్స్కు సంబంధించి ఫిజిక్స్, బయోలాజీ రెండు పేపర్లు వేర్వేరుగా నిర్వహిస్తారు. -
‘పది’ పరీక్షలకు సర్వంసిద్ధం
జగిత్యాల: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో రాము అన్నారు. ఈనెల 21 నుంచి జరిగే పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను గుర్తించామని, ఏ కేటగిరిలో 25, బీ కేటగిరిలో 20, సీ కేటగిరిలో 22 కేంద్రాలను కేటాయించామన్నారు. మొత్తంగా 11,850 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, నలుగురు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 826 మంది ఇన్విజ్లేటర్లను నియమించామన్నారు. అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. -
అట్రాసిటీ కేసులను త్వరగా పరిశీలించాలి
జగిత్యాల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. కేసుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలు, బాధితులకు అందించాల్సిన లబ్ధిపై సభ్యులతో చర్చించారు. ఎస్సీ, ఎస్టీల భూములను ఇతరులు కబ్జా చేయకుండా చూడాలని, కేసులను పరిష్కరించేలా చూడాలని కమిటీ సభ్యులు కోరారు. ప్రతినెలా జరిగే పౌరహక్కుల దినోత్సవంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎస్సైలు పాల్గొనాలని కోరారు. సమావేశంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్రెడ్డి, శ్రీనివాస్, డీఎస్పీలు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రాజ్కుమార్ పాల్గొన్నారు. మెట్పల్లి సీఐ నిరంజన్రెడ్డి బదిలీమెట్పల్లి: మెట్పల్లి సీఐ నిరంజన్రెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను ఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. ఆయన స్థానంలో కరీంనగర్ ఎస్బీ సీఐగా పనిచేస్తున్న వి.అనిల్కుమార్ను నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. -
స్కోరింగ్ ఆప్షన్ మ్యాథ్స్
గణతంలో కఠినమైన అంశాలపై పట్టు సాధిస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. పాత ప్రశ్నపత్రాలు, నమూన లెక్కలను ఎక్కువగా సాధన చేయాలి. అభ్యాసదీపికలు, ప్రీఫైనల్లో అడిగిన ప్రశ్నలను పరిశీలించాలి. ప్రతి అధ్యాయంలో ఇచ్చిన భావాలపై పట్టు సాధిస్తే ప్రశ్నను ఏవిధంగా అడిగినా సమాధానం రాసే విలుంటుంది. వాస్తవ సంఖ్య, సమితులు, బహుపదులు, త్రికోణమితి, అధ్యాయాలపై పట్టు సాధించాలి. ముందుగా సులువైన వాటికి స్పష్టంగా జవాబులు రాయాలి. తరువాత కఠినమైన వాటిని సాధించేందుకు ప్రయత్నించాలి. రేఖాచిత్రాలు పెన్సిల్తో గీయాలి. సాధనలు డబ్బాలో రాయాలి. – శ్రీనివాస్, మ్యాథ్స్టీచర్, జెడ్పీహెచ్ఎస్, యశ్వంతరావుపేట -
సమాజంపై అవగాహన అవసరం
జగిత్యాల: విద్యార్థులు సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులను గమనించాలని, అవగాహన పెంచుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. గురువారం ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2025 రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలను ప్రారంభించారు. కేంద్రప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్కు జగిత్యాలను నోడల్ జిల్లాగా ప్రకటించ డం అభినందనీయమన్నారు. విద్యార్థులు వన్ నేష న్, వన్ ఎలక్షన్ అంశంపై సృజనాత్మకత అంశాలు జోడించి అభిప్రాయాలు తెలపాలన్నారు. అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ ఇన్నోవేషన్ ప్రోగ్రాంపై అవగాహన పెంచుకోవాలని, విస్తృతంగా ప్రచారం చేస్తూ సామాజిక అభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, మాజీ చైర్మన్ అడువాల జ్యోతి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు మంచాల కృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ అశోక్, నోడల్ జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాస్, యువజన క్రీడల అభివృద్ధి అధికారి రాజ్కుమార్, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోహర్, ఎన్సీసీ అధికారి సాయిమధుకర్, శ్రీనివాస్, సురేందర్, గణపతి, దివ్యరాణి, కవిత పాల్గొన్నారు. మార్కెట్ల అభివృద్ధికి నిధులు జగిత్యాలజోన్: వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. చల్గల్ మార్కెట్లో చేపడుతున్న పనులను గురువారం పరిశీలించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల చొరవతో చల్గల్కు రూ.1.70 కోట్లు తీసుకొచ్చానని, గత ప్రభుత్వ హయాంలో రూ.8కోట్లతో లక్ష చదరపు అడుగుల షెడ్లు నిర్మించామని పేర్కొన్నారు. వాలంతరికి పదెకరాల స్థలాన్ని మామిడి మార్కెట్కు కేటాయించామన్నారు. నాయకులు గిరి నాగభూషణం, దామోదర్ రావు, ఎల్లారెడ్డి, ముకుందం, నారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, గంగయ్య, మల్లారెడ్డి, సురేందర్ రావు, మహేశ్వర్ రావు,మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు. -
జీడీడీపీలో అంతంతే..
ఒక ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువే జీడీడీపీ. జిల్లా ఆర్థికాభివృద్ధికి ముఖ్య కొలమానంగా పరిగణించే జీడీడీపీలో కరీంనగర్ మెరుగ్గా ఉంది. సిరిసిల్ల రాష్ట్రంలోనే 29వస్థానంలో నిలిచింది.జిల్లా జీడీడీపీ(రూ.కోట్లలో) ర్యాంకు కరీంనగర్ 30.216 12 పెద్దపల్లి 27,649 13 జగిత్యాల 24,011 18 సిరిసిల్ల 13,981 29 -
వెంకన్నకు పుష్పయాగం.. నృసింహునికి ఏకాంతోత్సవం
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు పుష్పయాగం, ఏకాంతోత్సవాన్ని గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామికి పుష్పయాగం చేశారు. శ్రీలక్ష్మినృసింహస్వామివారికి ఏకాంతోత్సవం జరిపించారు. పుష్పయాగం సందర్భంగా ఆలయంలో వివిధ రకాల పూలతో అలంకరించారు. స్వామివారి సేవపల్లకీతో ఐదు ప్రదక్షిణలు చేసి ఏకాంతోత్సవాన్ని పూర్తిచేశారు. ఈవో శ్రీనివాస్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, ఉప ప్రధా న అర్చకులు నేరెల్ల శ్రీనివాసాచారి ఉన్నారు. -
అభ్యాసదీపిక ఉపయోగకరం
ఎన్సీఈఆర్టీ రూపొందించిన అభ్యాస దీపిక విషయ సామగ్రి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ప్రతి భావనను రెండుసార్లు క్షణ్ణంగా చదువుకుని అర్థం చేసుకోవాలి. అవసరమైన చోట పట్టికలు, బొమ్మలు గీసీ భాగాలను తప్పకుండా రాయాలి. జతపర్చడం, తప్పు వాక్యాన్ని గుర్తించడం, వరుసక్రమంలో అమర్చడం. ఫ్లోచార్టులు, బొమ్మలువంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. పర్యావరణం, సాంకేతికత ఆధారంగా ప్రశ్నలు రూపొందిస్తారు. ముఖ్యంగా పట్టికలు నేర్చుకుని ప్రయోగాలపై పట్టు సాధిస్తే మంచి మార్కులు సాధించే అవకాశముంది. ప్రతి పాఠంలోని అంశాలు, నిర్ధిష్ట శీర్షిక కింద ఇచ్చిన భావనలు, బొమ్మలు, చార్టులు, కృత్యాలను నేర్చుకోవాలి. సెక్షన్ 3లో తప్పకుండా ప్రయోగం వస్తుంది. – యాళ్ల అమర్నాథ్ రెడ్డి, బయాలాజీ టీచర్, జెడ్పీహెచ్ఎస్, మల్లన్నపేట -
మానాలకు ఆర్టీసీ బస్సు సేవలు పునరుద్ధరణ
మల్యాల: మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని మానాల గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించి గురువారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. మానాల నుంచి తక్కళ్లపల్లి వరకు బస్సులో ప్రయాణం చేశారు. ఆర్టీసీ బస్సు పునరుద్ధరించడంతో రెండు గ్రామాల ప్రజలు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్ల తరబడిగా ఉన్న సమస్య తీరినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్, మల్లయ్య, తిరుపతి, రాజన్న, లక్ష్మీనారాయణ, శంకర్ గౌడ్, గంగారెడ్డి, దిండు ప్రవీణ్, మరాటి బుచ్చిరెడ్డి, మ్యాక లక్ష్మణ్, ఎంపీడీవో స్వాతి, తహసీల్దార్ మునీందర్, అధికారులు పాల్గొన్నారు. -
అవగాహనతోనే మంచి మార్కులు
విద్యార్థులు ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ చదవాలి. కీలక పదాలు రాసిపెట్టుకుని వాటిని గుర్తించుకుని ప్రశ్నలకు అనుగుణంగా సమాధానాలు రాయాలి. తప్పులు లేకుండా చక్కగా రాస్తే మంచి మార్కులు సాధించొచ్చు. పాఠాలు, గ్రాఫ్స్, పట్టికలు, పటాలవంటి అంశాల్లో సాధన చేయాలి. అభ్యాస దీపిక చదివితే మార్కులు పెరిగే అవకాశం ఉంది. పేరగ్రాఫ్ విశ్లేషణ చేస్తున్నప్పుడు పేరాలోని అంశాన్ని మరింత వివరించాలి. ప్రముఖుల లక్షణాలు, ఆశయాలు, నినాదాలు గుర్తుంచుకోవాలి. భారతదేశం, తెలంగాణ అవుట్ లైన్ మ్యాప్ గీయగలగాలి. ప్రపంచపటంలో దేశాలు, సముద్రాలు, పర్వతాలు, నదులు, పట్టణాలు, ఏడారులును జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. – రవి, సోషల్ టీచర్, జెడ్పీహెచ్ఎస్, ఆరపెల్లి -
ఉపాధి హామీలో మెరుగు..
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పించాల్సిన పనిదినాల విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకన్నా మెరుగ్గా ఉండటం విశేషం. ముందుచూపుతో రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలను కల్పించడంలో సక్సెస్ అయ్యారు.ర్యాంకు జిల్లా లక్ష్యం కల్పించిన శాతం (లక్షల్లో) పనిదినాలు 2 కరీంనగర్ 28.4 26.1 92.1 8 సిరిసిల్ల 21.8 19.6 90.0 12 జగిత్యాల 40.0 35.7 89.4 14 పెద్దపల్లి 25.5 22.8 89.4 -
ఘనంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం
మల్లాపూర్: మండలకేంద్రంలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా బుధవారం ఆలయ కమిటీ వేడుకలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. అర్చకులు శ్రీదేవి, భూదేవి సహిత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని కనులపండువగా జరిపించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ సంగ గంగరాజం, కాంగ్రెస్ నాయకులు కల్వకుంట్ల సుజిత్రావు, వాకిటి సత్యంరెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, తహసీల్దార్ వీర్సింగ్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ ఇల్లెందుల తుకారాం, సభ్యులు పాల్గొన్నారు. నిర్వాసితులు అభ్యంతరాలు ఉంటే తెలపండిఇబ్రహీంపట్నం: సదర్మాట్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు అభ్యంతరాలు ఉంటే తెలపాలని మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కోమటికొండాపూర్ శివారు గోదావరి కుర్రులో భూములు కోల్పోతున్న రైతులతో గ్రామ పంచాయతీ వద్ద సమావేశమయ్యారు. అభ్యంతరాలు తెలపకుంటే నిర్వాసితులకు ఎంత పరిహారం వస్తుందో వారంరోజుల్లో తెలియజేస్తామని తెలిపారు. అనంతరం మండలంలోని ఎర్దండి శివారు నల్ల గుట్ట వద్ద గల వివాదాస్పద భూములను పరిశీలించారు. సర్వే నంబర్ 104లో 250 మందికి ఒక్కొక్కరికి 180 చదరపు గజాల చొప్పున 1996లో అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని విద్యాసాగర్రావు పట్టాలు ఇచ్చారు. ఆ స్థలం తమదేనంటూ బర్ధీపూర్ గ్రా మానికి చెందిన సునీల్రెడ్డి అభ్యంతరం తెలుపుతున్నారు. ఆ స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో ఎప్పు డు పట్టాలు ఇచ్చారనే వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను త్వరలోనే ప రిష్కరిస్తానని వెల్లడించారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రసాద్, గ్రామ ప్రత్యేక అధికారి రామకృష్ణరా జు, ఆర్ఐలు రేవంత్రెడ్డి, రమేశ్, పంచాయతీ కార్యదర్శి సరిత , రైతులు పాల్గొన్నారు. 24న అసెంబ్లీని ముట్టడిస్తాంమల్లాపూర్: రైతుల సంక్షేమాన్ని విస్మరించి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 24న వేలాది రైతులతో అసెంబ్లీని ముట్టడిస్తామని రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు. మల్లాపూర్ మండలకేంద్రంతోపాటు మొగిలిపేట గ్రామాల్లో రైతులను కలిసి మద్దతు కోరారు. ప్రధాన కూడళ్ల వద్ద నిరసన తెలిపి నినాదాలు చేస్తూ రైతాంగ సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రైతు ప్రభుత్వమంటూ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. రుణమాఫీ కాని వేలాది మంది రైతులు కలెక్టర్ వద్దకు వెళ్లి విన్నవించుకుందామంటే ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని విమర్శించారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యలయాల ముందు రైతులు ధర్నా చేస్తున్నా.. ప్రభుత్వంలో చలనం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పసుపు పంటకు మద్దతుధర, రుణమాఫీ, రైతు భరోసా వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి పార్టీలకు అతీతంగా రైతులు ఈనెల 24న అసెంబ్లీ ముట్టడికి తరలిరావాలని కోరారు. కార్యక్రమాల్లో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, మారు మురళీధర్రెడ్డి, రైతు ఐక్యవేదిక మండల అధ్యక్షుడు డబ్బా రమేశ్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్లు వనతడుపుల నాగరాజు, భూక్య గోవింద్నా యక్, రైతు సంఘం నాయకులు కాటిపెల్లి ఆది రెడ్డి, కోమ్ముల జీవన్రెడ్డి, కాసారపు భూ మారె డ్డి, కళ్లెం మహిపాల్రెడ్డి, న్యావనంది లింబా రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, బండి లింగస్వామి, పె ద్దిరెడ్డి లక్ష్మణ్, ఎలాల జీవన్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు పెద్దపీట
కరీంనగర్ స్మార్ట్సిటీ రూ.101 కోట్లుస్పోర్ట్స్ స్కూల్ వరంగల్– కరీంనగర్ రూ.41 కోట్లుసాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర బడ్జెట్ 2025–26లో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులకే పెద్దపీట వేసింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు, తాయిలాల ప్రకటనకు ఈసారి ప్రభుత్వం దూరంగా ఉంది. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, పాత ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులకు పెద్దపీట వేసింది. కాళేశ్వరం, ఎల్లంపల్లి, వరదకాల్వల నిర్వహణకు నిధుల విడుదల చేయడం ఇందుకు నిదర్శనం. అదే సమయంలో పత్తిపాక ప్రాజెక్టుపై ప్రకటన లేకపోవడం, జగిత్యాల మెడికల్ కాలేజీ నిధులు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి మిగిలిన బకాయిల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. శాతవాహన వర్సిటీకి, కరీంనగర్ స్మార్ట్సిటీకి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. మానేరు రివర్ఫ్రంట్కు నిధులు కేటాయించకపోవడం విశేషం. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లో రూ.2,685 కోట్లు ప్రగతిపద్దులో కేటాయించడం చెప్పుకోదగిన అంశం. కేటాయింపులు ఇలా.. ● శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) నుంచి మిడ్మానేరును కలిపే వరద కాల్వకు రూ.299.16 కోట్లు పూర్తి కాని పనుల కోసం వాడనున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రూ.349.66 కోట్లు స్టేజ్–2లో పూర్తిచేయాల్సిన పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. ● మానేరు ప్రాజెక్టుకు రూ.లక్ష, బొగ్గులవాగు (మంథని): రూ.34 లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్: రూ.2.23 కోట్లు, చిన్న కాళేశ్వరం రూ.0, కాళేశ్వరం రూ.2,685 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. ఈ నిధులను పలుఅభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. కానీ.. అంతా ఆశించిన పత్తిపాక ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడం ఉమ్మడి జిల్లా వాసులను నిరాశకు గురిచేసింది. ● శాతవాహన యూనివర్సిటీకి రూ.35 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర క్రీడా విద్యాలయాలైన కరీంనగర్–వరంగల్లకు కలిపి రూ.41 కోట్లు ప్రకటించింది. ● అదే సమయంలో కరీంనగర్లోని ప్రతిష్టాత్మక మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) కోసం ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. మొత్తం రూ.800 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు వాస్తవానికి ఈఏడాది మేలో పూర్తవాల్సి ఉంది. గత ప్రభుత్వం రెండు విడదలుగా ఒకసారి రూ.310 కోట్లు మరోసారి రూ.234 కోట్లు మొత్తం కలిపి రూ.545 కోట్ల పైచిలుకు నిధులు విడుదల చేసింది. దీనికి టూరిజం వాళ్లు మరో రూ.100 కోట్లు కలపాల్సి ఉంది. కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడం, కొత్త కేటాయింపులు లేకపోవడం, సాంకేతిక కారణాల వల్ల ప్రాజెక్టులో జాప్యం నెలకొంది. గతంలో రూ.210 కోట్లు విడుదలవగా, ఇటీవల మరో రూ.130 కోట్ల వరకు విడుదలయ్యాయని తెలిసింది. ● కరీంనగర్ స్మార్ట్సిటీ ప్రాజెక్టు రూ.101 కోట్లు ఇస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్లకు సాయం కింద ఏమీ కేటాయించలేదు. ● ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.12,500 కోట్లు కేటాయించింది. పథకంలో భాగంగా ప్రతీ నియోజకవర్గంలో 3500 మంది లబ్ధిదారుల చొప్పున ప్రతీ ఒక్కరికీ రూ.5 లక్షల వరకు ప్రభుత్వం సాయం చేయనుంది. ప్రస్తు తం కేటాయింపుల ప్రకారం..చూసినపుడు119 నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గంలో దాదా పు 2100 ఇండ్లకే ఈ సాయం సరిపోతుంది. ● ఇక ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, కొండగట్టులకు ఎలాంటి ప్రకటన లేకపోవడం భక్తులను నిరాశకు గురిచేసింది. ● కీలకమైన కాకతీయ కాల్వల ఆధునికీకరణ, కల్వల ప్రాజెక్ట్ లకు నిధులు ఇవ్వకపోవడంపైనా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సంక్షేమం, సాగునీటి రంగానికి నిధులు ఎల్లంపల్లి, వరదకాల్వకు కేటాయింపులు కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యధికంగా.. మానేరు రివర్ ఫ్రంట్కు రిక్తహస్తమే కరీంనగర్ స్మార్ట్సిటీకి రూ.101 కోట్లు 2025–26 బడ్జెట్లో కానరాని కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన -
పరీక్ష కేంద్రాలకు వెళ్లేదెలా..?
కథలాపూర్: ఈనెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే గ్రామీణప్రాంతాల నుంచి పరీక్షకేంద్రాలకు వెళ్లడమే పరీక్షగా మారిందని మండలంలోని పలు గ్రామాల విద్యార్థులు వాపోతున్నారు. ఈ ఏడాది మండలంలో 510 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనున్నా యి. మండలకేంద్రంలోని మోడల్ స్కూల్, జెడ్పీ హైస్కూళ్లను పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. ఈ కేంద్రాల్లో కథలాపూర్, సిరికొండ, చింతకుంట, భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు పరీ క్ష రాయనున్నారు. చింతకుంట నుంచి కథలాపూర్ కు సుమారు 6 కిలోమీటర్ల దూరం ఉండగా.. ఉద యం 7 గంటలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలంటే ఉద యం 8:30 గంటలకు చింతకుంట నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తే అదే రూట్లో ఉన్న భూషణరావుపేట, పెగ్గెర్ల విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాల కు చేరుకునే అవకాశం ఉంటుంది. పరీక్ష ఉదయమే కావడంతో ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉండవని తల్లిదండ్రులు అంటున్నారు. మరోవై పు తక్కళ్లపెల్లి, బొమ్మెన జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బీమా రం మండలం మన్నెగూడెం జెడ్పీ హైస్కూల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. ఇవన్నీ మారుమూల గ్రామాలు కావడంతో ఆ రూట్లో బస్సు సౌకర్యమే లేదు. పరీక్షల వేళ బస్సు సౌకర్యం కల్పించాలని వి ద్యార్థులు కోరుతున్నారు. పోతారం జెడ్పీ హైస్కూ ల్ విద్యార్థులకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబారిపేట జెడ్పీ హైస్కూల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. ఈ రూట్లో బస్సు సౌకర్యం లేదు. ప్రత్యేకంగా ఉదయం 8:30 గంటలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. లేకపోతే పరీక్ష సమయానికి చేరుకోవడం కష్టమేనని ఆందో ళన చెందుతున్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి పదో తరగతి పరీక్ష సమయానికి ఉదయం, మధ్యాహ్నం బస్సుల సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చేరని ఆర్టీసీ సేవలు పరీక్షల వేళ బస్సు సౌకర్యం కల్పించాలంటున్న విద్యార్థులు మండలంలో 510 మంది పదోతరగతి విద్యార్థులు -
● బుక్లెట్ విధానంలో పది పరీక్షలు ● జిల్లాలో 67 సెంటర్ల ఏర్పాటు ● 11,855 మంది విద్యార్థులు
జగిత్యాల: పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది అధి కారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు ఇప్పటికే వి ద్యార్థులకు అనేక సూచనలు, సలహాలు ఇచ్చి సంసిద్ధం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఇబ్బందులు లే కుండా వసతులు కల్పించారు. నిమిషం నిబంధన లేనప్పటికీ విద్యార్థులు అరగంట ముందే కేంద్రాల కు చేరుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే వీలుంటుంది. ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్న ఉద్దేశంతో కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకుని ఫోన్ఇన్, ముఖాముఖి కా ర్యక్రమం ఏర్పాటు చేస్తూ విద్యార్థుల సందేహాలను తీర్చారు. జిల్లాలో మొత్తం 11,855 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, నలుగురు అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, నలు గురు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 22 మంది కస్టోడియన్స్, 827 మంది ఇన్విజ్లేటర్లను నియమించారు. వసతుల ఏర్పాటు ఈ ఏడాది ఎండలు మండిపోతుండడంతో కేంద్రాల వద్ద తాగునీటి వసతి ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి గదిలో ఫ్యాన్, ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులు సమయానికి కేంద్రానికి చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుంటే విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉండదు. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి నో పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎలాంటి అనుమతి లేదు. సీఎస్ డీవో, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. ఈ నిబంధన ఫ్లయింగ్ స్క్వాడ్స్కు ఉంటుంది. బుక్లెట్ విధానంలో పరీక్షలు ఈసారి జవాబులు రాసేందుకు విద్యార్థులకు బుక్లెట్ ఇస్తారు. ఇందులో మొత్తం 24 పేజీలుంటాయి. బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ పరీక్షలకు 12 పేజీల బుక్లెట్ ఇస్తారు. అలాగే ప్రతి ప్రశ్నపత్రంపై ఈసారి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎక్కడ లీకేజీ అయినా సంబంధిత చోట లీకేజీ అయినట్లు తెలిసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని అధికారులు పేర్కొంటున్నారు. హాల్టికెట్ పొందని వారు వెబ్సైట్ ద్వారాా సైతం డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీఈవో ప్రశాంతంగా రాయాలి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి. ప్రతి సెంటర్లో వసతులు ఏర్పాటు చేశాం. ఎలక్ట్రానిక్ వస్తువులు లోనికి తీసుకెళ్లకూడదు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలోచించి నిదానంగా పరీక్ష రాస్తే అత్యధిక మార్కులు సాధించవచ్చు. – రాము, డీఈవో -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
రాయికల్: అభివృద్ధి పనులను వేగవంతం చే యాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. రా యికల్ మండలం బోర్నపల్లిలో రూ.20 లక్షలతో చేపడుతున్న హెల్త్ సబ్సెంటర్, ఇటిక్యాలలో రూ.9 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు, అల్లీపూర్లో రూ.20 లక్షలతో చేపడుతున్న పల్లె దవా ఖానా పనులను బుధవారం పరిశీలించారు. సబ్సెంటర్ పనులను నెలరోజుల్లోపు పూర్తి చే యాలని, బ్రిడ్జిపనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూద న్, డీఈ మిలింద్, తహసీల్దార్ ఖయ్యూం ఉన్నారు. ఓటరు నమోదు పక్కాగా.. జగిత్యాల: జిల్లాలో ఎన్నికల నిర్వహణ, ఓటరు నమోదు పక్కాగా నిర్వహిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సందేహాలుంటే తెలపాలన్నారు. ఓటరు నమోదు నిరంతరమని, ఫాం–6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు జరుగుతుందన్నారు. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి పదో తరగతి పరీక్షల్లో లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, సిట్టింగ్ స్క్వాడ్స్తో సమీక్షించారు. ఈనెల 21 నుంచి నిర్వహించే పరీక్షలకు 67 సెంటర్లు ఏర్పాటు చేశామని, 11,855 మంది పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. డీఈవో రాము పాల్గొన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం వెల్దుర్తికి చెందిన మతులపురం రాజం (55) అప్పుల బాధతో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజంకు ఎకరంన్నర సొంత భూమి ఉంది. దాంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయా యి. ఈ క్రమంలో తనకున్న ఎకరం భూమి అమ్మి కొంత అప్పు చెల్లించాడు. ఇంకా రూ.10లక్షల వరకు అప్పు ఉంది. ఆ మొత్తం ఎలా చెల్లించాలా అని నిత్యం మదనపడుతున్నాడు. మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై సదాకర్ తెలిపారు. ప్రభుత్వ భూమిని కాపాడుతాం జగిత్యాలరూరల్: ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని జగిత్యాల రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని నర్సింగాపూర్ శివారులోగల సర్వేనంబరు 437, 251లో అసైన్డ్ భూములను క్రయవిక్రయాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ధరణి పోర్టల్లో పట్టా చేసుకున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పహాణీలో డైరెక్ట్ ఎంట్రీలో సర్వేనంబరు 437లో 71.13 ఎకరాల, 251 సర్వేనంబరులో 19.07 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమికి సంబంధించిన పట్టాలను రద్దు చేసి స్వాధీనం చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు. ముగ్గురు రైతులు స్వచ్ఛందంగా 3.15 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేశారని తెలిపారు. ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి చిట్యాల: ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందపడి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మీపూర్తండా గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పోతనవేన అజయ్కుమార్(24) వ్యక్తిగత పనుల నిమిత్తం చిట్యాల మండలం ఒడితల నుంచి మోరంచపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. లక్ష్మీపూర్ తండా గ్రామం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడంతో గాయాలపాలయ్యాడు. స్ధానికు లు 108 అంబులెన్స్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించగా అప్పటికే అజయ్కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి వీరేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్కుమార్ వివరించారు. ఇటలీలో ఎల్లారెడ్డిపేట వాసి..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం ఇటలీ దేశానికి వెళ్లిన ఓ వలస జీవి అక్కడ జరిగిన రో డ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేటలో విషాదం నింపింది. మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ రషీద్(47) రెండేళ్ల క్రితం ఇటలీకి వెళ్లాడు. కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. ఈ విషయం అక్కడి మిత్రులు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా మంగళవారం సమాచారం అందించారు. రషీద్ కుటుంబ సభ్యులు కొంతకాలంగా సిద్దిపేటలో ఉంటున్నారు. రషీద్ మృతదేహం బుధవారం ఎల్లారెడ్డిపేటకు రానుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కనులపండువగా నృసింహస్వామి రథోత్సవం
రాయికల్: మండలంలోని చెర్లకొండాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవం మంగళవారం కనులపండువగా నిర్వహించారు. అర్చకులు దేవుని నారాయణ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథంపై ప్రతిష్ఠించి ఆలయం చుట్టూ తిప్పారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. థాయ్లాండ్కు మరో విమానం సాక్షిప్రతినిధి,కరీంనగర్: కొలువుల కోసమని వెళ్లి థాయ్లాండ్ పరిసరదేశాల్లో సైబర్ కేఫ్ల్లో చిక్కుకు న్న యువతను ఇండియాకు తీసుకొచ్చే ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల అక్కడ చిక్కుకున్న యు వత దయనీయస్థితిని ‘సాక్షి’ వరుస కథనాలతో వె లుగులోకి తెచ్చింది. స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా ఆదేశాలతో మయన్మార్, థాయ్లాండ్లో చిక్కుకున్న 540మంది భారతీయులను రెండు సైనిక వి మానాల్లో సురక్షితంగా ఢిల్లీకి తరలించారు. వారిని సీబీఐ, ఎన్ఐఏ, ఐబీ తదితర దర్యాప్తు సంస్థలు విచారించిన అనంతరం స్వరాష్ట్రాలకు పంపారు. తాజా సమాచారం ప్రకారం.. మరికొందరు భారతీ య యువతీ, యువకులు ఇంకా అక్కడ చిక్కుకుపోయారని, వారిని కూడా రక్షించేందుకు కేంద్ర హోంశాఖ మరో విమానాన్ని థాయ్లాండ్కు పంపనుందని సమాచారం. ఈ వారాంతంలోగా మరో విమా నం ద్వారా వారిని తీసుకురానున్నారని తెలిసింది. -
విద్యార్థుల కళ్లకు సురక్ష
కథలాపూర్: కంటి సమస్య ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం వెలుగులు అందిస్తోంది. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) ద్వా రా సమగ్ర కంటి పరీక్ష, ఉచిత కళ్లద్దాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్బీ ఎస్కే వైద్యులు పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి చూపు మందగించిన వారిని గుర్తించి అద్దాలు అందించాలన్నది ఉద్దేశం. జిల్లాలో 45,626 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు ఆర్బీఎస్కే వైద్యుల ఆధ్వర్యంలో జిల్లాలోని 828 ప్రభుత్వ విద్యాసంస్థలల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 45,626 మంది విద్యార్థులకు ఇటీవల కంటి పరీక్షలు చేశారు. వీరిలో 2,506 మంది విద్యార్థులకు కంటి సమస్యలు, దృష్టిలోపం మందగించి చదవడానికి, రాయడానికి ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. వీరికి తప్పనిసరిగా కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. వీరికి ఆయా మండలకేంద్రాల్లోని పాఠశాలల్లో కళ్లద్దాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళ్లద్దాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చూపు లోపం ఉన్నవారికి మేలు -
కలెక్టర్ ఆదేశించినా కదలని అధికారులు
వేంకటేశ్వరస్వామి ఉత్తర, దక్షిణ దిగ్యాత్రలుధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామి మంగళవారం దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం ధర్మపురి పోలీస్స్టేషన్లో పోలీసుల నుంచి విశేష పూజలు అందుకున్నారు. సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్కుమార్ స్వామివారికి పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారిని ఆలయం నుంచి పోలీస్స్టేషన్ వరకు అశ్వవాహనంపై శోభాయాత్రగా తీసుకెళ్లారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులున్నారు.ధర్మపురి: ధర్మపురి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శాశ్వత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని స్వయంగా కలెక్టర్ ఆదేశించినా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఇది బాధాకరమైన విషయమని ఆలయ మాజీ చైర్మన్ ఇందారపు రామయ్య అన్నారు. ఆలయంలో ఈనెల 10 నుంచి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఏర్పాట్లపై ఫిబ్రవరి 13న కలెక్టర్ అధ్యక్షతన వివిధశాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు కల్పించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఇందులో ముఖ్యంగా తాగునీటి సమస్య. ఆ సమస్య తలెత్తకుండా చూడాలని రామయ్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్రహ్మగుండం నుంచి గడ్డ హన్మండ్లు ఆలయం వరకు పూర్వమున్న పాత పైప్లైన్ చెడిపోయిందని, మరమ్మతు చేస్తే సమస్య కొంత వరకు తగ్గుతుందని ఆయన కలెక్టర్కు విన్నవించారు. దీనికి కలెక్టర్ స్పందించి అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తే రూ.5లక్షలు మంజూరు చేస్తానని హామీ కూడా ఇచ్చారు. అయితే కలెక్టర్ సూచించిన విధంగా అధికారులు పాత పైపులైన్ను పరిశీలించి వెళ్లారు తప్ప అందుకు అవసరమైన నివేదికను తయారుచేయలేదు. దీంతో భక్తులు తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు నిత్యం వస్తున్న వేలాదిమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు గోదావరిలో ఉన్న బావి మోటార్ ఐదు రోజుల క్రితం కాలిపోవడంతో నీటి సమస్య తీవ్రమైంది. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి ఆలయం ముందున్న సంపును నింపే ప్రయత్నం చేస్తున్నారని రామయ్య తెలిపారు. ఒకవేళ కలెక్టర్ సూచించినట్లు పైపులైన్కు ఏస్టిమేట్ తయారు చేస్తే నిధులు వచ్చేవని, తద్వారా సమస్య తలెత్తేది కాదని భక్తులు అంటున్నారు. ● నీటి సమస్యతో భక్తుల ఇబ్బందులు -
నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తికి ఆర్నెళ్ల జైలు
జగిత్యాలజోన్: నిర్లక్ష్యంగా వాహనం నడపడమే కాకుండా ఇతరులకు గాయాలు కావడానికి కారణమైన నిందితుడికి ఆర్నెళ్ల జైలు, రూ.9వేల జరిమానా విధిస్తూ జిల్లా రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ వినీల్కుమార్ మంగళవారం తీర్పు చెప్పారు. గాయపడికి ఇద్దరు బాధితులకు రూ.30వేల చొప్పున పరిహారం అందించాలని కూడా తీర్పులో సూచించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.రజనీ కథనం ప్రకారం.. కొడిమ్యాలకు చెందిన పోతర్ల రవి 2019 మే 15న తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై వేములవాడ నుంచి కొడిమ్యాల వస్తున్నాడు. నల్గోండ లక్ష్మినృసింహాస్వామి గుడి వద్ద వేములవాడకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న మ్యాకల అంజయ్య అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపి ఎదురుగా వస్తున్న రవిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రవి, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు కొడిమ్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేసుకుని నిందితుడిపై కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో మ్యాకల అంజయ్యకు ఆర్నెళ్ల జైలు, రూ.9వేల జరిమానా విధించారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచాలి జగిత్యాల: విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సభ్యులు జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పలు మండలాల్లోని పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు మంచి ఫలితాలు ఇవ్వాలన్నారు. ఆయన వెంట జిల్లా కో–ఆర్డినేటర్ రాజేశ్, డీఈవో రాము ఉన్నారు. -
ఆరోగ్య కేంద్రాల సేవలపై అవగాహన
కోరుట్లరూరల్: కోరుట్ల మున్సిపల్ పరిధి యెఖీన్పూర్లో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆరోగ్య కేంద్రాల సేవలపై డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అవగాహన కల్పించారు. క్వాలిటీ అసెస్మెంట్ మేనేజర్ నాగరాజు ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ వసతులను వివరించారు. అనంతరం డీఎంహెచ్వో హెల్త్కేర్ ప్రొవైడర్స్ నాణ్యతను పరీక్షించారు. వసతులు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో 168 రకాల మందులు ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాలు 80 మార్కులు సాధిస్తే ఏటా రూ.1.25లక్షల చొప్పున మూడేళ్లపాటు నిధులు వస్తాయని, వాటిద్వారా వసతులు కల్పించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు శ్రీనివాస్, సతీష్ కుమార్, సమీనా తబస్సుమ్, డీపీఓ రవీందర్, ఏఏంఓ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి ఇబ్రహీంపట్నం: వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్వో సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. హెల్త్ సబ్సెంటర్లలో మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. -
మహిళా సంఘాలకు ఎన్నికలు
జగిత్యాల: మహిళాసాధికారత కోసం గతంలో స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ సంఘాలకు ఓ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు ఉంటారు. తాజాగా కొత్త అధ్యక్షులను ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. సంఘం సభ్యుల నుంచి గ్రామ, మండల, జిల్లా సమైక్యలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై మండలాల్లోని ఏపీఎం, సీసీ, డీఆర్డీఏ సిబ్బందికి జిల్లాలోని డీఆర్డీఏ కార్యాలయంలో శిక్షణ కల్పించారు. ఏపీఎంలు గ్రామస్థాయిలో వెళ్లి మహిళా సంఘాల అధ్యక్షుల ఎన్నికపై సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతమున్న అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవి కాలం ఈనెల 31తో ముగియనుండటంతో ఆ లోపు కొత్తవారిని ఎన్నుకోనున్నారు. జిల్లాలో 20 మండలాల్లో 14,957 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో 1,72,614 మంది సభ్యులున్నారు. ఈ గ్రూపులకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. కొత్తవారికి అవకాశం మహిళాసంఘాల్లో కొత్తవారికి అవకాశం కల్పించే దిశగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. వీరికి జిల్లా, మండలం, గ్రాస్థాయిలో కార్యవర్గాలున్నాయి. గ్రామస్థాయిలో ఒక్కో మహిళాసంఘానికి ఇద్దరు లీడర్లు, పాలకవర్గ సభ్యులుంటారు. అలాగే గ్రామ సమైక్యకు అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల చొప్పున ఐదుగురితో కార్యవర్గం ఉంటుంది. అలాగే మండల, జిల్లా సమైక్య కార్యవర్గాలుంటాయి. ఏటా మార్చిలో కొత్తవారికి అవకాశం కల్పిస్తుంటారు. ఇప్పుడున్న కార్యవర్గాలన్నింటినీ రద్దు చేసి కొత్త వారికి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక స్వయం సహాయక సంఘంలో 10 నుంచి 15 మంది వరకు మహిళా సంఘ సభ్యులుంటారు. వీరంతా కలిసి ఆసక్తిగా ఉండి.. చదువుకున్న సభ్యులను ఎన్నుకుని తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి కార్యవర్గంలో ఆసక్తి గల వారిని అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యదర్శిని ఎన్నుకుంటారు. మహిళా సాధికారత కోసం.. మహిళాసంఘాలు ఏర్పడినప్పటి నుంచే వారు సాధికారత దిశగా పయనించాలనే దిశగా ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ రుణాలతోపాటు, శ్రీనిధి రుణాలు కూడా అందిస్తుంటారు. మహిళలకు ఇందులో గ్రూపునకు, గ్రూపు సభ్యులకు లోన్లు అందిస్తుంటారు. మహిళలందరూ కలిసి గ్రూపుగా ఏర్పడి చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఒక సభ్యుడికి సైతం రుణం అందుకుని చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరు క్రమం తప్పకుండా మళ్లీ ప్రతినెలా బ్యాంక్ లింకేజీ రుణం ఎత్తుకుంటే బ్యాంక్వారికి, శ్రీనిధి వారికై తే శ్రీనిధికి బ్యాంకుల్లో జమచేస్తుంటారు. వీరికి సంబంధించిన బ్యాంక్ లింకేజీ రుణాలు, సీ్త్రనిధి రుణాలు, ఏవీ ఇవ్వాలన్నా మహిళాసంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. జిల్లావ్యాప్తంగా సీ్త్రనిధి బ్యాంక్ నుంచి లింకేజీ రుణాలు రూ.కోట్లలో లావాదేవీలు జరగడంతోపాటు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరికి సోలార్ ప్లాంట్లు, ఇటుక బట్టీల వ్యాపారాలు, పచ్చళ్ల వ్యాపారాలు చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తూ రుణాలు అందించనుంది. వాటితో మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. నూతన కార్యవర్గం ఏర్పడితే మరింత ఉత్సాహంతో పనిచేస్తూ మహిళలు ఇంకా సాధికారత సాధించే అవకాశాలుంటాయి. మార్చి నెలలో జిల్లా సమైక్య ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు డీఆర్డీఏ అధికారులు పేర్కొంటున్నారు. కసరత్తు చేస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ ఈనెల లోపు పూర్తయ్యేలా ప్రక్రియ జిల్లాలో 1,72,614 మంది సభ్యులుశిక్షణ అందించాం మహిళా సంఘాలకు నూతన కార్యవర్గాల ఏర్పాటుకు ఏపీఎం, సీసీలకు శిక్షణ అందించాం. ఈనెల వరకు ప్రస్తుతమున్న వారి పదవీకాలం ఉంది. అప్పటి వరకు పూర్తిగా ప్రణాళిక పూర్తి చేస్తాం. కొత్తవారికి అవకాశం ఇచ్చేలా చూస్తున్నాం. జిల్లాలో 14,957 మహిళా సంఘాలున్నాయి. – రఘువరణ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
‘భట్టి’ బడ్జెట్పై ఆశలు
సాక్షిప్రతితినిధి, కరీంనగర్: నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్, కొత్త ప్రాజెక్టులకు వచ్చే నిధులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్మార్ట్ సిటీ, జగిత్యాల మెడికల్ కాలేజీ, ముత్యంపేట షుగర్స్ ఫ్యాక్టరీ, పత్తిపాక రిజర్వాయర్కు ఎంత కేటాయిస్తారన్న దానిపై ఉమ్మడి స్పష్టత రానుంది. ● కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిధులు కరీంనగర్ కార్పొరేషన్ కు రావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్రం నుంచి రూ.429 కోట్లు, రాష్ట్రం నుంచి రూ.399 కోట్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.30 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయాలని ఇటీవల మాజీ మేయర్ సునీల్ రావు సీఎంకు లేఖ రాశారు. ఈ నిధులపై బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని బల్దియా అధికారులు ఆశాజనకంగా ఉన్నారు. ● మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామం నిజాంషుగర్స్ బకాయిలు మొత్తం రూ.250 కోట్లు ఉన్నాయి. తొలుత రూ.43 కోట్లు, తర్వాత అది రూ.192 కోట్లకు చేరింది. మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే ఇవ్వనుంది. ఫార్చున్ కన్సెల్టెన్సీ ప్రతితినిధులను పిలిచి ముత్యంపేట ఫ్యాక్టరీ రిపేరు చేయాలా? కొత్తది ఇన్స్టాల్ చేయాలా? అన్న విషయాలపై నివేదిక ఇవ్వమంది. మరమ్మతులకు రూ.50 కోట్ల వరకు ఖర్చవుతుందని.. ఒకవేళ నడిపినా పదేపదే మరమ్మతుల కారణంగా నష్టాలు వస్తాయని చెప్పింది. లాభాలు రావాలంటే కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని నివేదిక ఇచ్చింది. ఈ బడ్జెట్లో దీనిపై ప్రభుత్వం ఏంనిర్ణయం తీసుకుంటుదోనని తీసుకోనుందని ఉత్కంఠగా మారింది. ● 2022–23 మెడికల్ కళాశాల ప్రారంభం అయ్యింది. దీని హాస్టల్స్ భవన నిర్మాణానికి 500 కోట్లనిధులు మంజూరు అయ్యాయి. ధరూర్ క్యాంపులో 27.5 ఎకరాలు కేటాయించారు. ఇప్పటివరకు విడుదలైన రూ. 30 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి. ఇంకా 360 బెడ్స్ ఆసుపత్రి నిర్మాణం కావాల్సి ఉంది. ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రిలోని కొనసాగుతుంది. ఈ సారి బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ● ఉమ్మడి జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములకు నీరు అందించి స్థిరీకరణ చేసేందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక వద్ద ఒక రిజర్వాయర్ను నిర్మించాలని ప్రతిపాదించారు. దానికి బడ్జెట్లో చోటుఇస్తారని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి డీపీఆర్ కు ఆదేశించారు. సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రకటన ఉంటుందో చూడాలి. స్మార్ట్ సిటీకి నిధులు దక్కేనా? నిజాం షుగర్స్ పై ప్రకటనపై ఉత్కంఠ పత్తిపాక రిజర్వాయర్ పనులు మొదలయ్యేనా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులపై ఉమ్మడి జిల్లాలో ఆసక్తి -
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి సన్ని ధిలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. స్వా మి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అనంతరం ఆలయాల్లో మొక్కులు చెల్లించారు. భక్తులకు ఓల్డ్ టీటీడీ కల్యాణ మండపంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఖోఖో రాష్ట్ర జట్టు కెప్టెన్గా నవీన్కుమార్కథలాపూర్: టఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీల తెలంగాణ జట్టు కెప్టెన్గా కథలాపూర్ మండలం భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్ పీడీ నవీన్కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో ఈ పోటీలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా నవీన్కుమార్ ఎంపిక కావడంపై పాఠశాల హెచ్ఎం నల్ల రాజయ్య, పీడీలు అభినందించారు. బీసీలకు రూ.30వేల కోట్లు కేటాయించాలిజగిత్యాలటౌన్: బడ్జెట్లో బీసీలకు రూ.30వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని కోరారు. 42శాతం రిజర్వేషన్ అమలయ్యేలా అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తిరుపురం రాంచంద్రం, బండపెల్లి మల్లేశ్వరి, బొమ్మిడి నరేష్, హృషికేశ్ ఉన్నారు. రెండోరోజు కొనసాగిన అంగన్వాడీల ఆందోళనజగిత్యాలటౌన్: ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని రద్దు చేయాలని, కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన ఆందోళన మంగళవారం రెండోరోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట బైటాయించిన అంగన్వాడీలు ధర్నా నిర్వహించి కలెక్టరేట్ పాలనాధికారికి వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా కో–కన్వీనర్ కోమటి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి స్వప్న, జయప్రద, సరిత పాల్గొన్నారు. ప్రభుత్వ అసమర్థతతోనే ఎండుతున్న పంటలుజగిత్యాలరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే పంటలు ఎండుతున్నాయని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. డీ–53 కెనాల్ నుంచి నీరు విడుదల చేసి పంటలు ఎండిపోకుండా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతగాని ప్రభుత్వంలో రైతన్నల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో మండుటెండల్లో కూడా చెరువులు మత్తళ్లు దూకాయని, మళ్లీ కేసీఆర్ పాలన వస్తేనే రైతు జీవితాలు బాగుపడతాయని వివరించారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆనందరావు, నాయకులు అంజయ్య, గంగారెడ్డి, గంగాధర్, రాజేశ్, శంకర్, దుబ్బరాజం, వెంకన్న, రాములు, వెంకటేశ్, ఆదిరెడ్డి, శేఖర్, రైతులు లైశెట్టి వెంకటేశ్, జక్కుల వెంకట్ పాల్గొన్నారు. -
వామ్మో.. డంపింగ్ యార్డులు
● తగలబడుతున్న చెత్తాచెదారం ● కాలుష్యం బారిన పడుతున్న ప్రజలు ● నిరుపయోగంగా పొడి వనరుల కేంద్రాలు ● నిర్వహణ లేక వ్యాపిస్తున్న దుర్వాసనజగిత్యాల: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. సిబ్బంది పట్టింపు లేని ధోరణితో జిల్లాలోని ఐదు బల్దియాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం సేకరించే తడి, పొడి చెత్త గురించి పట్టించుకోకపోవడం సమస్యగా మారింది. మహిళలకు అవగాహన లేక రెండు కలిపే ఇస్తున్నారు. వాటిని అలాగే తీసుకెళ్లి డంపింగ్యార్డులో పోస్తున్నారు. దీంతో అక్కడ మంటలు అంటుకుని నిత్యం పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్ర జలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాకేంద్రంలో నూ కపల్లి ప్రాంతంలోని డంపింగ్యార్డులో నిత్యం మంటలు అంటుకున్నాయి. అక్కడ డబుల్బెడ్రూం ఇళ్లు, న్యాక్ కేంద్రం ఉన్నాయి. పొగంతా అ టుఇళ్లు.. ఇటు న్యాక్ కేంద్రాన్ని చుట్టుముట్టుతోంది. ఈ సమస్య ప్రతి మున్సిపాలిటీలోనూ నెలకొంది. కాలుష్య కోరల్లో కాలనీలు డంపింగ్యార్డులో తడి, పొడి చెత్త సేకరణ చేపట్టకపోవడంతో నిత్యం మంటలు అంటుకుని కాలనీలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. బల్దియా నిబంధనల ప్రకారం చెత్తను కాల్చకూడదు. కాలుష్యంతో నిండిన పొగతో గుండె, ఊపిరితిత్తులపై అధిక ప్రభావం పడుతుంది. మనుషుల ఆరోగ్యంతోపాటు, పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య కారకాల్లో పీఎం 2.5, పీఎం 10, నైట్రోజన్ ఆకై ్సడ్, సల్ఫర్ ఆకై ్సడ్ ఉంటాయి. గాలిలో పీఎం 2.5 స్థాయికి పెరిగేకొద్దీ వృద్ధులు, పిల్లలు శ్వాసకోశ వ్యాధులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. డంపింగ్యార్డులో పొగలు అంటుకోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం బల్దియాలపై ఉంది. చెత్తశుద్ధి కేంద్రాన్ని ఉపయోగంలోకి తేవాలి ధర్మపురి శివారులో ఏర్పాటు చేసిన తడి, పొడి చెత్త కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ కేంద్రం ఇప్పటివరకు నిరుపయోగంగానే ఉంది. ఈ చెత్త కేంద్రాన్ని వినియోగంలోకి తెస్తే మున్సిపాలిటీకి ఆదాయం రావడంతోపాటు, డంపింగ్యార్డులో చెత్త పేరుకుపోదు. – మహేశ్, ధర్మపురి చెత్తను వృథా చేయకూడదు తడి, పొడి చెత్తను వేరుచేసి ఎరువులు తయారుచేసేలా చర్యలు తీసుకోవాలి. ఇళ్ల నుంచి తీసుకెళ్తున్న చెత్తను డంపింగ్యార్డులోనే పడేస్తున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. అధికారులు స్పందించి చెత్తను వినియోగంలోకి తేవాలి. – శంకర్, మెట్పల్లి డంపింగ్యార్డు పొగతో ఇబ్బందులు ఒడ్డెరకాలనీ సమీపంలోనే డంపింగ్యార్డు ఉంది. పట్టణంలో సేకరించిన చెత్తనంతా ఇక్కడే పోస్తున్నారు. రాత్రి సమయంలో చెత్తకు నిప్పంటించడంతో పొగ వ్యాపిస్తోంది. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అనారోగ్యానికి గురవుతున్నాం. – భీమన్న, రాయికల్ తడి, పొడి చెత్త వేరుగా సేకరించాలి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. కాలనీలకు వాహనాలు వస్తు న్నా అంతా కలిపే తీసుకుంటున్నారు. ప్రజలకు అవగాహన క ల్పించాలి. డంపింగ్యార్డుల్లో చెత్తనంతా ఒకే చోట పోయడంతో నిత్యం మంటలు అంటుకుంటూ అందరికీ ఇబ్బందికరంగా మారింది. పొడి వనరుల కేంద్రాన్ని వినియోగంలోకి తేవాల్సి ఉంది. – సుమన్, జగిత్యాల ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని సెగ్రిగేషన్ చేసే కేంద్రం. తడి, పొడి చెత్త వేరు చేయడం లేదు. ప్లాస్టిక్కు సంబంధించిన వ్యర్థాలను వేరు చేస్తున్నారే తప్ప తడి, పొడిచెత్త వేరు చేయడం లేదు. గతంలో మహిళా సంఘాలకు ఇచ్చినప్పటికీ వారు సక్రమంగా చేయకపోవడంతో ప్రస్తుతం ఎన్విరాన్మెంటల్ అధికారులే చూస్తున్నారు. ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని డంపింగ్ యార్డు. యార్డులో కొద్దిరోజులుగా నిత్యం మంటలు అంటుకుంటున్నాయి. వెలువడే పొగ అక్కడున్న న్యాక్ కేంద్రంలోని విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సెగ్రిగేషన్ వ్యవస్థ లేకపోవడంతో తరచూ మంటలు అంటుకుంటున్నాయి. న్యాక్ కేంద్రం సమీపంలో చెత్త పోయొద్దని శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది జిల్లా కేంద్రంలో వృథాగా ఉన్న ఎరువులు తయారుచేసే కేంద్రం. తడి, పొడి చెత్త వేరు చేసిన అనంతరం దీంట్లో సేంద్రియ ఎరువును తయారుచేస్తారు. ఆ ప్రక్రియ లేకపోవడంతో వాటి కోసం నిర్మించిన షెడ్లు వృథాగానే ఉన్నాయి. ఎరువులు తయారు చేస్తే బల్దియాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది ధర్మపురిలోని తడి, పొడి చెత్త నిర్వహణ కేంద్రం. అర్ధంతరంగా నిలిచిపోయింది. స్థలం కొరత ఏర్పడటంతో కేంద్రం పనులు ముందుకు సాగడం లేదు. తడి, పొడి చెత్త ప్రక్రియ కొనసాగడం లేదు. ఫలితంగా ఎక్కడబడితే అక్కడే చెత్త పడేస్తున్నారు. ఇది మెట్పల్లి శివారులోని డంపింగ్యార్డు. తడి, పొడి చెత్త వేరు చేయకపోవడంతో కుప్పలు తెప్పలుగా పడి ఉంది. ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను డంపింగ్యార్డుకు తీసుకొచ్చి పోస్తున్నారు. సెగ్రిగేషన్ చేపట్టి మున్సిపల్కు ఆదాయం వచ్చేలా చూడాలంటున్నారు జనాలు. ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని డంపింగ్యార్డు పక్కనే నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లు. వాటి పక్కనుంచే రోడ్డు ఉంది. చెత్త నిత్యం కాలడం.. పొగ నేరుగా చివరన ఉన్న డబుల్బెడ్రూమ్లకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఇది రాయికల్లోని డంపింగ్యార్డు. ఇక్కడ తడి, పొడి చెత్త సేకరణ లేకపోవడంతో బయటన పడేస్తున్నారు. రాత్రిపూట మంటలు అంటుకోవడంతో ఇళ్లలోకి పొగ వస్తోందని చుట్టుపక్కల కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చివరి ఆయకట్టుకు నీరు చేరాలి
గొల్లపల్లి: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని లోత్తునూర్ గ్రామంలో డీ–64, డీ–53 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. కాలువల్లోని పిచ్చిమ్కొలను తొలగించాలని, మరమ్మతు ప్రతిపాదనలు పంపిస్తే ఉపాధి పథకం నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆయన వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఇరిగేషన్ ఈఈ ఖాన్, అధికారులు పాల్గొన్నారు. వైద్యసేవలు మెరుగుపర్చాలి ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, ల్యాబ్, ఐపీ రికార్డ్స్, మెడికల్, ఫార్మసీని పరిశీలించారు. ఓపీ సేవలు పెంచాలన్నారు. పిచ్చిమొక్కలను తొలగించాలని ఆదేశించారు. సాగునీటికి ఇబ్బంది రానీయొద్దు వెల్గటూర్: సాగునీటికి ఇబ్బంది రానీయొద్దని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండలంలోని కుమ్మరిపల్లి వద్ద డీ–3, డీ–54 కెనాల్ను పరిశీలించారు. చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించాలన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి జగిత్యాల: జిల్లాలో 3500 ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం ఉద్యాన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రానున్న మూడు నెలల్లో మండల వ్యవసాయాధికారులు తమ గ్రామాల ప రిధిలో 50 ఎకరాల్లో మొక్కలు నాటేలా చూడాలన్నారు. ఆయిల్ పాం సాగుతో కలిగే లాభాలను రై తులకు వివరించాలన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
జగిత్యాలక్రైం: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నృసింహుని సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన వారికి నీడ, నీటి వసతి, లడ్డూప్రసాదాలను అందుబాటులో ఉంచారు. భక్తులు తలనీలాలు సమర్పించారు. కోడెమొక్కు చెల్లించుకున్నారు. ‘ధరణి’ దరఖాస్తులు పరిష్కరించాలిజగిత్యాల: ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులన్నింటినీ ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని, పెండింగ్లో ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళారైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలుజగిత్యాలఅగ్రికల్చర్: మహిళా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ తెలిపారు. కేంద్రప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం కింద పరికరాల కోసం జిల్లాకు రూ.78.79 లక్షలు మంజూరయ్యాయని, ఈనెల 25లోపు లబ్ధిదారులను ఎంపిక చేసి యంత్రాలను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు 40శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 రాయితీపై పరికరాలు అందిస్తామని, బ్యాటరీ స్ప్రేయర్స్ 101, పవర్ స్ప్రేయర్లు 102, డ్రోన్ –1, రోటోవేటర్ 51, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 12, కల్టీవేటర్ 67, బండ్ఫార్మర్ 4, పవర్వీడర్ 2, బ్రష్ కట్టర్ 5, పవర్ టిల్లర్ 3, ట్రాక్టర్లు 3, స్ట్రాబలర్స్ 2 చొప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఆయా మండలాల వ్యవసాయాధికారులకు అందించవచ్చని తెలిపారు. కలెక్టరేట్ వద్ద వంటావార్పుజగిత్యాలటౌన్: ఎన్నిల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ అనుబంధం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన 48గంటల ధర్నాలో మాట్లాడారు. కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధాన చట్టం అమలైతే ఐసీడీఎస్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని, తద్వారా ఐసీడీఎస్ మూతపడే పరిస్థితి వస్తుందన్నారు. అనేక హామీలతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ కేంద్రం నిర్ణయాలను అమలు చేసేందుకు యత్నిస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, జిల్లా కో–కన్వీనర్ కోమటి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి స్వప్వ, జయప్రద, సరిత, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్దే భోజనం, నిద్ర ఉద్యోగ భద్రత, హామీల అమలు డిమాండ్తో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రాత్రిపూట కూడా నిరసన వ్యక్తం చేశారు. శిబిరం వద్దే వంటావార్పు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుటగల రోడ్డుపైనే రాత్రి నిద్రపోయారు. -
ఎన్హెచ్ 563లో కొత్త మలుపు!
● జగిత్యాల–కరీంనగర్ సెక్షన్ పాత టెండరు రద్దు ● సాంకేతిక కారణాలతోనే రద్దయినట్లు సమాచారం ● తాజాగా రూ.1,779 కోట్లతో మరో టెండరు ● రూ.276 కోట్ల వరకు పెరిగిన అంచనా వ్యయం ● వేగంగా కరీంనగర్–వరంగల్ సెక్షన్ పనులు సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర.. రెండు రాష్ట్రాలను కలిపే ప్రతిష్టాత్మక జాతీయ రహదారి ఎన్హెచ్ 563 టెండర్ కొత్త మలుపు తిరిగింది. గత జూలైలో కరీంనగర్–జగిత్యాల సెక్షన్కు సంబంధించి రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) టెండర్ల అంచనా వ్యయాలు ఖరారు అయ్యాయి. దాదాపు రూ.2,227 కోట్లతో టెండరుకు అంచనా వ్యయం కూడా రూపొందాయి. ఈ మేరకు టెండర్లు వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. వివిధ సాంకేతిక కారణాల వల్ల పాత అంచనాలతో రూపొందించిన టెండర్లు రద్దు అయ్యాయి. తాజాగా రూ.1,779 కోట్లతో ఆర్ఎఫ్పీ టెండర్లు పిలిచారు. మొత్తం 58.86 కిమీ పొడవైన ఈ రహదారి కరీంనగర్ బైపాస్ (కొత్తపల్లి సమీపంలో) నుంచి జగిత్యాల వరకు నాలుగు లేన్ల రహదారిగా వేయనున్నారు. గతంలో ఈ రహదారి ఖర్చు ప్రతీ కిలోమీటరుకు రూ.37 కోట్ల వరకు అంచనా వ్యయంగా ఉండటం గమనార్హం. అధునాతన సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ జాతీయ రహదారి నిర్మాణం కానుంది. ఈ మార్గంలో దాదాపు 241 హెక్టార్ల భూసేకరణ కోసం దాదాపు రూ.387 కోట్ల నిధులు కేటాయించారు. వాస్తవానికి గతంలో అంచనా వ్యయం రూ.1,503 కోట్లు మాత్రమే. (వీటికి జీఎస్టీ, భూసేకరణ కలుపుకుంటే అది రూ.2,227 కోట్ల వరకు చేరింది.) తాజాగా టెండరు ప్రకారం.. రూ.1,779 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగినట్లు సమాచారం. ఈ లెక్కన రూ.276 కోట్ల అంచనా వ్యయం పెరిగిందని సమాచారం. తాజా టెండర్ అంచనా వ్యయంలో జీఎస్టీ కలిసిందా? లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మార్కెట్లో పలు ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో అంచనా వ్యయం పెరిగి ఉండవచ్చని సమాచారం. వేగంగా రహదారి పనులు.. ఈ సెక్షన్లో కీలకమైన కరీంనగర్–వరంగల్ సెక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. గతంలో మోదీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ పనులు చేపట్టారు. తెలంగాణలో హైదరాబాద్ తరువాత ముఖ్య నగరాలైన వరంగల్– కరీంనగర్ పట్టణాలను కలిపే 68 కి.మీల ప్రతిష్టాత్మక రహదారి. దీన్ని 2025 జూలై నాటికి పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయం సమీపంలో టోల్గేట్ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. అదే సమయంలో మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్పర్తి వద్ద నిర్మించతలపెట్టిన బైపాస్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి.వరంగల్–కరీంనగర్ సెక్షన్ దూరం 68 కి.మీ అంచనా రూ.2,146 కోట్లు గడువు 16–7–2025 మానకొండూరు బైపాస్ 9.44 కి.మీ తాడికల్ బైపాస్ 6.65 కిమీ హుజూరాబాద్ బైపాస్ 15.05 ఎల్కతుర్తి బైపాస్ 4.60 కిమీ హసన్పర్తి బైపాస్ 9.57 కిమీ మైనర్ జంక్షన్లు 29కరీంనగర్–జగిత్యాల సెక్షన్ దూరం 58.8 కిమీ అంచనా రూ.1,779 కోట్లు (జీఎస్టీపై స్పష్టత రావాల్సి ఉంది) బ్రిడ్జిలు 24 ఆర్వోబీ/ఆర్యూబీ 03 మేజర్ జంక్షన్లు 27 మైనర్ జంక్షన్లు 29 టోల్ప్లాజా గంగాధర– తుర్కాశీనగర్ సమీపంలో (అంచనా) ట్రక్ బే టోల్ప్లాజా సమీపంలోనే (2 కి.మీలోపే) రెస్ట్ ఏరియా జగిత్యాల సమీపంలో.. -
మార్కెట్లు అధ్వానం
జగిత్యాల: జిల్లాలోని బల్దియా పరిధిలోని కూరగాయల మార్కెట్లలో వసతులు లేవు. నిర్మించిన మార్కెట్లు వృథాగా ఉండటంతో వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. జిల్లాకేంద్రంలోని టవర్సర్కిల్లో కూరగాయల మార్కెట్, విద్యానగర్లో రైతుబజార్ ఏర్పాటు చేశారు. ఇది కొన్నేళ్లుగా వృథాగా ఉండటంతో శిథిలావస్థకు చేరింది. ఇటీవల అందుబాటులోకి తెచ్చినా.. రైతులు రైతుబజార్ ముందున్న రోడ్డుపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. ప్రజలు లోపలికి వచ్చి కొనే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు కూడా బయటే ఉంటున్నారు. అలాగే ప్రధానంగా కొత్తబస్టాండ్, బీట్బజార్, హౌసింగ్బోర్డు, తులసీనగర్, కలెక్టరేట్ సమీపంలో రూ.9 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మించారు. విశాలమైన గద్దెలతోపాటు, రేకుల షెడ్లు వేశారు. కానీ అది పూర్తిగా నిరుపయోగంగా మారింది. ధర్మపురి మున్సిపల్లో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ రైతులకు అనుగుణంగా నిర్మించకపోవడంతో రోడ్డుపైనే విక్రయిస్తున్నారు. మెట్పల్లిలో నిధుల లేమితో సమీకృత మార్కెట్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. వసతులు కరువు రూ.కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్లు నిర్మించినా అవి అందుబాటులోకి రాకపోవడం కూరగాయల వ్యాపారులకు తలనొప్పిగా మారింది. వారు రోడ్లపైనే విక్రయిస్తున్నారు. ప్రధాన రోడ్ల వెంట టాయిలెట్స్, తాగునీరు వసతులు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కట్టిన మార్కెట్లు వారికి అనుగుణంగా లేకపోవడంతోనే వారు లోనికి వెళ్లి అమ్మడం లేదు. ● ఇది ధర్మపురిలోని సమీకృత మార్కెట్. ఇప్పటివరకు ఇందులో కూరగాయలు విక్రయించలేదు. మార్కెట్ లోపల రైతుల కోసం నిర్మించిన గద్దెలు ఎత్తుగా.. ఇరుకుగా ఉండటంతో రైతులు అందులో అమ్మడం లేదు. బయటనే కూర్చుని కూరగాయలు అమ్ముతున్నారు. మార్కెట్లో వసతులు లేవని కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైనే కూరగాయల విక్రయం అటు ప్రజలకు.. ఇటు వ్యాపారులకు ఇబ్బంది పట్టించుకోని అధికారులు ఇది రైతుబజార్ లోపల ఖాళీగా ఉన్న స్థలం. కూరగాయల వ్యాపారులు విక్రయించుకునేందుకు ఏర్పాటు చేసిన గద్దెలు. ఇందులో హోల్సేల్ కూరగాయల వ్యాపారులు వారి ఇష్టానుసారంగా గద్దెలను ఆక్రమించుకున్నారు. లోపల అంత స్థలం ఉన్నా రైతుబజార్ ముందు కూరగాయలు విక్రయించడంతో ప్రతి ఒక్కరికీ ఇబ్బందికరంగా మారింది. ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని ప్రధాన రైతుబజార్. దీనిని ఏళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. అప్పటినుంచి వృథాగా ఉన్న దీనిని ఇప్పుడిప్పుడే అందుబాటులోకి తెచ్చారు. అయితే రైతుబజార్ లోపల కూరగాయలు ఎవరూ అమ్మరు. ముందున్న రోడ్డుపైనే విక్రయిస్తుండడంతో రోడ్డంతా ట్రాఫిక్ జామ్ అవుతోంది. నిత్యం అక్కడ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. కూరగాయల వ్యాపారులను రైతుబజార్ లోపల విక్రయించేలా చూస్తే సమస్య పరిష్కారం అవుతుంది. -
శివయ్య పెళ్లికొడుకాయెనే..
వేములవాడ: రాజన్న సన్నిధిలో పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10.50 గంటలకు ఆలయ చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మంత్రోచ్ఛరణలు, భాజాభజంత్రీల మధ్య కల్యాణం వైభవంగా జరిగింది. ఈవో కొప్పుల వినోద్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, మున్సిపల్ తరఫున కమిషనర్ అన్వేశ్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు నమిలకొండ ఉమేశ్శర్మ ఆధ్వర్యంలో కల్యాణం జరిగింది. కన్యాదాతలుగా సురేశ్ దంపతులు, వ్యాఖ్యాతగా చంద్రగిరి శరత్శర్మ వ్యవహరించారు. గుడి చెరువులోని పార్కింగ్ స్థలంలో ఆలయం తరఫున అన్నదానం చేశారు. మంగళవారం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈనెల 19న సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
ఆలకించండి.. మార్గం చూపండి
● ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు ● పెరుగుతున్న వృద్ధుల ఫిర్యాదులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ ● పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలుజగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పిల్లల ఆదరణ కరువైందని, ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంటూ పలువురు వృద్ధులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలపై 35 ఫిర్యాదులు రాగా.. పరిశీలించిన కలెక్టర్ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్.లత, జగిత్యాల కోరుట్ల ఆర్డీవోలు పులి మధుసూదన్గౌడ్, జివాకర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ హామీలు అమలు చేయాల్సిందే..
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ జగిత్యాలటౌన్: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేయాల్సిందేనని, లేకుంటే బీఆర్ఎస్ గతే పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి నాయక్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసిందేమీలేదన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కులగణనకు బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఎంపీగా అర్వింద్ జగిత్యాల జిల్లా అభివృద్ధికి నయాపైసా ఖర్చు చేయలేదన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు అందడం లేదన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, తప్పెట్ల స్కైలాబ్బాబు, జిల్లా కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఇందూరి సులోచన, కోమటి చంద్రశేఖర్, ఎంఏ చౌదరి, మహిపాల్నాయక్ వినోద్ పాల్గొన్నారు. -
నీరు పచ్చరంగులో వస్తున్నాయి
కోరుట్లలో నీరంతా కలుషితం అవుతోంది. ప్రతి కాలనీలో నల్లా నీరు పచ్చరంగులో వస్తున్నాయి. వాటర్ ప్లాంట్ల వద్ద నీటిని కొనుక్కుంటున్నాం. అధికారులు స్పందించి నీరు కలుషితం కాకుండా చూడాలి. – ఫసియోద్దీన్, కోరుట్ల నల్లా ఉన్నా.. సరఫరా లేదు రెండేళ్ల క్రితం నల్లా కనెక్షన్ ఇచ్చారు. కానీ ఇంతవరకు నీటి సరఫరా లేదు. వేసవిలో బోర్లు ఎండిపోతే తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. అధికారులు స్పందించి నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. – భీంరావు, మెట్పల్లి నీరంతా కలుషితం నీరు రంగుమారాయి. అవి తాగితే రోగాల పాలే. బయట కొనుగోలు చేసుకుంటున్నాం. ఇంత లీకేజీలు అవుతున్నా అధికారులు మరమ్మతు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు స్పందించి మంచినీటిని సరఫరా చేయాలి. – కిశోర్, విద్యానగర్, జగిత్యాల -
విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం
● ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాయికల్: గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మండలంలోని ఉప్పుమడుగు గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో రూ.3.25 కోట్లతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. పట్టణంలో లైబ్రరీ మంజూరు చేశామని, త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. అనంతరం అల్లీపూర్లో రూ.ఆరు లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. డీఈఓ రాము, సింగిల్ విండో చైర్మన్ దీటి రాజిరెడ్డి, తహసీల్ధార్ ఖయ్యుం, ఎంపీవో సుష్మ, ప్రిన్సిపాల్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయనిధిని వినియోగించుకోవాలి జగిత్యాల: సీఎం సహాయనిధిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 102 మంది లబ్ధిదారులకు రూ.28.25 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. మున్సిపల్ మాజీ చైర్మన్లు జ్యోతి, నాగభూషణం, శ్రీనివాస్, దామోదర్రావు పాల్గొన్నారు. పట్టణాభివృద్ధికి సహకరించండి జగిత్యాల పట్టణాభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఎమ్మెల్యే అన్నారు. గోవిందుపల్లిలో ఈజీఎస్ నిధులు రూ.35 లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గోవిందుపల్లి వాగుపై రూ.4.5 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. మోతె చెరువుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. -
ఏప్రిల్ వరకు సాగునీరందించండి
● ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని కోరిన రైతులు సారంగాపూర్: యాసంగిలో సాగు చేసిన పంటలకు ఏప్రిల్ చివరి వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు ఆదివారం ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని కోరారు. బీర్పూర్ మండలం తుంగూర్, బీర్పూర్ గ్రామాల్లో జీవన్రెడ్డి పర్యటించగా.. రైతులు ఆయనతో మొరపెట్టుకున్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు నుంచి మొన్నటి వరకు చివరి భూములకు చేరిందని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద మరో రెండు తడులు నీరు అందుతుందని, అయితే ఏప్రిల్ చివరి వరకు నీరు అందించేలా చూస్తే పంటలు ఎండకుండా ఉంటాయని పేర్కొన్నారు. స్పందించిన జీవన్రెడ్డి విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట విండో చైర్మన్ పొల్సాని నవీన్రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్రావు, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుడిసె జితేందర్ ఉన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు● డీఈవో రాము జగిత్యాల: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిమిత్తం కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు డీఈవో రాము తెలిపారు. విద్యార్థులకు ఏదైనా సమాచారం కావాలంటే కంట్రోల్రూం నంబరు 94947 80085లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. విషయ సందేహాల నివృత్తి కోసం ఫోన్ఇన్ చేపట్టామని, సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కు సంబంధించిన నంబర్లు ఇప్పటికే పంపించామని వివరించారు. స్వయం ఉపాధికి సబ్ప్లాన్ నిధులు అందించాలిపెగడపల్లి: దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఎస్సీ సబ్ప్లాన్ నిధులను స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ పథకాలకు అందించాలని డీహెచ్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ అన్నారు. మండలకేంద్రంలో జిల్లా అధ్యక్షుడు మణుగూరు హనుమంతు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు ఎస్సీలకే కేటాయించాలన్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులను దళితబంధు కింద గత ప్రభుత్వం రూ.10లక్షలు ఇస్తే.. అంబేడ్కర్ అభయ హస్తం కింద రూ.12లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎస్సీల జనాభాకు అనుగుణంగా 20శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా.. 16 శాతం కేటాయించారని అన్నారు. డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్, శనిగరపు ప్రవీణ్, రామిల్ల రాంబాబు, మంథని రాజు, ఇరుగురాల శ్రీనివాస్, గంగనర్సయ్య, మంతెన స్వామి, సుంకె ప్రకాశ్, ఆత్మకూరు రాజేశ్, బొమ్మల స్వామి, కుంటాల లచ్చయ్య, కొత్తూరు నర్సయ్య, మల్లారపు నర్సయ్య పాల్గొన్నారు. ధ్యానంతో ఉన్నత స్థితికికోరుట్ల: ధ్యానంతో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని రామచంద్ర మిషన్ యోగా ట్రైనర్ హరికృష్ణ అన్నారు. పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో మూడు రోజుల ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ధ్యానంతో ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మోటూరి రాజు, కేఎల్ఎన్.కృష్ణ, పడిగెల శ్రీనివాస్, మంచాల జగన్, మంచాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
జగిత్యాల: మహిళల హక్కులను కాపాడుతూ వారి సాధికారతకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఆదివారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళల మెరుగైన జీవన ప్రమాణాల కోసం రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.10 లక్షల వరకు ప్రమాదబీమా, వ్యాపారవేత్తలుగా మలిచేందుకు సోలార్ పవర్ప్లాంట్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ పార్క్లో 5శాతం పెట్రోల్ బంక్లు ఇచ్చామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళలు కుటుంబం, సమాజపరంగా గౌరవం సాధిస్తూ పిల్లలను భావితరాలకు ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. అనంతరం ప్రతిభ కబనర్చిన వారికి ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్, సీడీపీవోలు, సూపర్వైజర్లు, చైల్డ్లైన్ సిబ్బంది పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పెగడపల్లి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు అందిస్తామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. లబ్ధిదారులెవరూ దళారులను ఆశ్రయించొద్దని సూచించారు. అర్హులకు పథకాలు అందకుంటే ఎంపీడీవో, తహసీల్దార్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లోని 88 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పంట రుణమాఫీ పూర్తి చేశామని, అందని వారి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాములుగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్, విండో మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు భాస్కర్, తిరుపతి, కిషన్, రవినాయక్, అంజయ్య, మల్లారెడ్డి, అనిల్గౌడ్, సత్తిరెడ్డి, సురేశ్, మల్లారెడ్డి, కృష్ణహరి, వెంకట్రావు, రామ్రెడ్డి, శ్రీనివాస్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు
● చెరువులు, కుంటల్లో తగ్గిన భూగర్భజలం ● ఉన్న నీరు పూర్తిగా కలుషితమయం ● అనారోగ్యం బారిన పడుతున్న జనాలు ● ఎక్కడ చూసినా పైప్లైన్ లీకేజీలే..● ఇది ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం నుంచి మెట్పల్లికి వస్తున్న నీరు. నెలరోజులుగా పూర్తిగా రంగు మారి వస్తున్నాయి. ఈ నీటిని తాగేందుకు ప్రజలు జంకుతున్నారు. అంతటా లీకేజీలు ఉండటంతో నీరంతా బురదమయంగా వస్తోంది. ఫలితంగా ప్రజలు తాగునీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని ప్రజలకు తాగునీరు అందించే ధర్మసముద్రం. మిషన్ భగీరథ నీరు రాకుంటే ఈ చెరువు నుంచి సరఫరా చేస్తారు. ఈ చెరువు నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. వేసవి మొదలుకావడం.. ఎండలు మండడంతో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోతే పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. మిషన్ భగీరథ నీరు చాలా తక్కువగా వస్తున్నాయి. దీంతో ప్రజలకు వేసవి గట్టెక్కుతుందా..? లేదా..? అన్న సంశయం నెలకొంది. ● -
మూడు గ్రామాలకో విద్యుత్ సబ్ స్టేషన్
● వినియోగదారుల విద్యుత్ కష్టాలకు చెక్ ● లో–వోల్టేజీ లేకుండా విద్యుత్శాఖ ఏర్పాట్లు జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వ్యవసాయం, గృహ, పరిశ్రమల అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫ రా చేయడంతో పాటు విద్యుత్ లాస్ను వీలైనంత మేరకు తగ్గించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ ముందుకెళ్తోంది. విద్యుత్ సరఫరాలో ఎప్పటికప్పుడు నష్టాన్ని నివారించడం, ఓవర్ లోడ్ను తగ్గించడం, లో– వోల్టో జీ సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు గ్రామాలకో విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేసింది. జిల్లాలో 117 విద్యుత్ సబ్ స్టేషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విద్యుత్ శాఖ ఎక్కడికక్కడే విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.1.50 కోట్ల నుంచి రూ.1.75 కోట్ల వరకు వెచ్చిస్తోంది. ప్రస్తుతం గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ను సరఫరా చేస్తుండటంతో పంపిణీలో ఇ బ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. వి ద్యుత్ సరఫరాలో సబ్స్టేషన్లే కీలకం కావడంతో వాటి నిర్మాణానికి నిర్ణయించింది. జిల్లాలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 117 పనిచేస్తున్నాయి. ప్ర స్తు తం జగిత్యాల అర్బన్ మండలంలో 7, జగిత్యాల రూరల్లో 7, రాయికల్లో 6, సారంగాపూర్లో 3, బీర్పూర్లో 3, ధర్మపురిలో 4, బుగ్గారంలో 3, వెల్గ టూర్లో 4, ఎండపల్లిలో 4, పెగడపల్లిలో 6, గొల్లపల్లిలో 5, మల్యాలలో 7, కొడిమ్యాలలో 5, కోరుట్ల లో 11, మెట్పల్లిలో 10, ఇబ్రహీంపట్నంలో 8, మ ల్లాపూర్లో 8, కథలాపూర్లో 7, మేడిపల్లిలో 3, భీమారంలో 6 విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 360 గ్రామాల వరకు ఉన్నాయి. దాదాపు మూడు గ్రామాలకో విద్యుత్ సబ్స్టేషన్లు పనిచేస్తున్నాయి. ఎనిమిది 132/33 కేవీ సబ్స్టేషన్లు జిల్లాలో ఎనిమిది 132/33 కేవీ సబ్స్టేషన్లు ఉన్నాయి. జిల్లాకేంద్రంతో పాటు ధర్మపురి, రాయికల్, కోరుట్ల, కథలాపూర్ మండలకేంద్రాలతో పాటు, కొడిమ్యాల మండలం పూడూరు, మెట్పల్లి మండలం గోధూర్, వెల్గటూర్ మండలం ఎండపల్లిలో ఉన్నాయి. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల–కోనాపూర్లో 220/132 కేవీ సబ్స్టేషన్ ఉంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి ఇంటి వరకు.. మొదట జిల్లాలోని పెంబట్ల–కోనాపూర్లో గల 220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు రామగుండం థర్మల్ స్టేషన్ నుంచి.. అక్కడి నుంచి జిల్లాలోని ఎనిమిది 132/33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు.. అక్కడి నుంచి 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా అవుతుంది. 33/11 కేవీ సబ్స్టేషన్ల కింద 11 కేవీ లైన్స్కు సంబంధించి 520 ఫీడర్లు ఉంటాయి. ఈ ఫీడర్ల ద్వారా గ్రామాల్లోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్లర్లకు చేరుతుంది. ఇలాంటివి జిల్లాలో 22,884 వరకు ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ల కింద 41 వేల ఎల్టీ ఫీడర్లు ఉంటాయి. ఇక్కడి నుంచి గృహాలు, వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఇలా నిత్యం జిల్లాలో 4 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారు. సబ్స్టేషన్ల పరిశీలనకు 255 మంది విద్యుత్ సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరాను చూసేందుకు 255 మంది పనిచేస్తున్నారు. ఇందులో 225 మంది ఆపరేటర్లు, 30 మంది వాచ్మెన్లు. వీరితోపాటు ఎప్పటికప్పుడు విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన ఎస్ఈ, డీఈ, ఏడీ, ఏఈ, లైన్మన్, హెల్పర్లు కూడా పరిశీలిస్తుంటారు. విద్యుత్ సబ్స్టేషన్లు అత్యధిక సంఖ్యలో ఏర్పాటు కావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం లేదు. ప్రస్తుతం ఇబ్బంది లేదు ప్రస్తుతం విద్యుత్ సరఫరా లో ఇబ్బంది లేదు. నాణ్య మైన కరెంట్ వస్తోంది. లో–వోల్టేజీ సమస్యతో వి ద్యుత్ మోటర్లు కాలిపోతాయనే బాధ కూడా లేదు. ఏదైనా సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు కొంత ఇబ్బంది ఎదురవుతున్నా.. ఒక్కరోజులోనే మరో ట్రాన్స్ఫార్మర్ బిగిస్తున్నారు. – నక్కల తిరుపతిరెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి(మం) నాణ్యమైన 24 గంటల విద్యుత్ నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అవసరమైనన్ని సబ్స్టేషన్లు నిర్మించాం. విద్యుత్ నష్టాలను వీలైనంత వరకు తగ్గించి.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నాం. విద్యుత్ సమస్యల పరిస్కారం కోసం జిల్లా, డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తున్నాం. – సాలియా నాయక్, ఎస్ఈ -
నిన్న హత్య.. నేడు అంత్యక్రియలు
జగిత్యాలక్రైం: క్షణికావేశంలో ఇంటిపెద్దను భార్య, కొడుకులు, కూతురు, అల్లుడు హత్య చేశారు. క్షణికావేశం నుంచి తేరుకున్నాక తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకులు, కూతురు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58)పై మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్, కూతురు శిరీష, అల్లుడు శోభన్ కలిసి క్షణికావేశంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో చికిత్స పొందుతూ కమలాకర్ మృతిచెందగా అతడి బంధువులు, గ్రామస్తులు మృతదేహాన్ని చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఆదివారం కొంత మంది సన్నిహితుల మధ్య పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని పొలాసకు తరలించారు. దీంతో హత్యలో ప్రమేయం ఉన్న వారంతా పోలీస్స్టేషన్లో ఉండటంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మానవత్వం చాటిన పోలీసులు ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య మొదటి భార్య జమున, కొడుకులు చిరంజీవి, రంజిత్, కుమార్తె శిరీష, అల్లుడు శోభన్ను పొలాసకు తీసుకెళ్లారు. దీంతో వారంతా కమలాకర్ మృతదేహంపై పడి రోదించడంతో స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి చితికి నిప్పంటించాడు. అంత్యక్రియల అనంతరం నిందితులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. మృతుడి ఇంట్లో ఆయుధాలుకుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురైన పడాల కమలాకర్ ఇంట్లో ఆదివారం పోలీసులు పరిశీలించగా భారీ ఆయుధాలు లభ్యమయ్యాయి. తల్వార్లతో పాటు కత్తులు, రాడ్లు కన్పించడంతో పోలీసులు బిత్తరపోయారు. కమలాకర్ పక్కా ప్రణాళికతోనే కొన్నేళ్లుగా మారణాయుధాలు వెంట ఉంచుకుంటూ తిరిగాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. నిందితుల రిమాండ్జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58)పై పెట్రోల్ పోసి నిప్పంటించి మృతికి కారణమైన ఐదుగురిని ఆది వారం రిమాండ్కు తరలించినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలి పారు. కుటుంబ కలహాలతో మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్, కుమార్తె శిరిష, అల్లుడు శోభన్బాబు కలిసి కమలాకర్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందగా అతడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదయింది. సమావేశంలో రూరల్ ఎస్సై సధాకర్ పాల్గొన్నారు. -
ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..?
జమ్మికుంట(హుజూరాబాద్): పరిపక్వతలేని ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణం తీసింది. ఇరు కుటుంబాల్లో ఎలాంటి నిర్బంధాలు లేవని, వారి ఫిర్యాదులతో తెలుస్తోంది. అయినా ఎందుకు ప్రాణాలు తీసుకున్నారో తేలాల్సి ఉందనే సందేహం కలుగుతోంది. జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్, పాపయ్యపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్పై శనివారం రాత్రి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంచిర్యాల రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన మెనుగు రాహుల్ (18)కు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఏరుచింతల గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)తో పరిచయం ఏర్పడింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయిన రాహుల్ హైదరాబాద్లో ఎల్ఈడీ బల్బస్ ఈవెంట్ వర్క్స్ చేస్తుంటాడు. ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి ఇంటికి వద్ద ఉంటున్నాడు. శ్వేత కరీంనగర్లోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పండుగకు ఇంటికి వెళ్లిన శ్వేత ఇటీవల కరీంనగర్ కళాశాలకు వచ్చింది. కాగా శనివారం రాత్రి ఇద్దరూ జమ్మికుంట మండలం పాపయ్యపల్లి శివారులోని రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడ్డారు. గూడ్స్ డ్రైవర్ హారన్ మోగించినా పట్టాల పైనుంచి జరగకుండా ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. వీరి మధ్య ప్రేమ ఎక్కడ, ఎలా చిగురించిందో తెలియదుగానీ, ఇద్దరూ ఏ నిర్బంధాలు లేకుండానే సున్నిత మనస్తత్వంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని రాహుల్ తండ్రి రాజు ఫిర్యాదు ఇవ్వగా.. ఏ కారణంతో చనిపోయిందో తెలియదని మృతురాలి తండ్రి రాజలింగు ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఏదిఏమైనా ఇద్దరి ఆత్మహత్య ఘటన కారణాలు లేకుండా మిస్టరీగా మారింది. ఇద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఆత్మహత్యలపై రైల్వే పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్, రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి ఆదివారం తెలిపారు. -
భర్త మూడో పెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
జగిత్యాల క్రైం: భర్త మూడో పెళ్లి చేసుకోవడంతో ఇంట్లో జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన మొదటి భార్య, ఆమె సంతానం ఇంటిపెద్దపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన శనివారం జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో జరిగింది. పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58) అదే గ్రామానికి చెందిన జమునను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అనంతరం కొంతకాలం తర్వాత జమున సొంత చెల్లి లలితను రెండో పెళ్లి చేసుకున్నాడు. లలితకు కూడా కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా ఇద్దరు భార్యలతో కమలాకర్కు విభేదాలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐదు నెలల క్రితం బీదర్కు చెందిన మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. దీంతో కొద్దిరోజులుగా ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం కమలాకర్ పొలాస గ్రామంలో మొదటి భార్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. విసిగిపోయిన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె, అల్లుడు అందరూ కలిసి అతనిపై కత్తితో దాడిచేసి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో కమలాకర్ కేకలు వేయడంతో స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సధాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమలాకర్ నుంచి న్యాయమూర్తి మరణ వాంగ్మూలం తీసుకున్నారు. కాగా, కమలాకర్ సాయంత్రం 6.30 గంటలకు మృతిచెందాడు. ఈ ఘటనలో మృతుడి కుటుంబ సభ్యులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బీదర్కు చెందిన మూడో భార్యను కూడా విచారిస్తున్నారు. కమలాకర్ సోదరుడి ఫిర్యాదు మేరకు మొదటి భార్య, పిల్లలు, అల్లుడిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. -
దాడి చేశారని ఇంటిబాట పట్టిన ఒడిశా కార్మికులు
జగిత్యాలరూరల్: దాడి చేశారని కూలీలు శనివారం గుట్టుచప్పుడు కాకుండా ఒడిశా వెళ్లేందుకు పయనమయ్యారు. కూలీలు వెళ్లకుండా ఇటుక బట్టీల వ్యాపారులు అడ్డు పడటంతో కొత్తబస్టాండ్లో గందరగోళం చోటుచేసుకుంది. వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లోని ఇటుక బట్టీల్లో పనిచేసే ఒడిశా కార్మికులు శుక్రవారం హోలీ వేడుకల్లో పాల్గొనగా మద్యం మత్తులో గొడవలు మొదలయ్యాయి. దీంతో బట్టీల నిర్వాహకుడి వ్యక్తి తమపై దాడిచేశాడని, సుమారు 80 మంది కార్మికులు ఒడిశా వెళ్లేందుకు శనివారం జగిత్యాల కొత్తబస్టాండ్కు చేరుకోగా, బట్టీల నిర్వాహకులు బస్సు ఎక్కకుండా అడ్డుపడటంతో సుమారు 2 గంటల పాటు గందరగోళం నెలకొంది. పట్టణ సీఐ వేణుగోపాల్ కార్మికులతో పాటు, బట్టీల నిర్వాహకులతో మాట్లాడారు. ఈక్రమంలో కార్మికులంతా బస్సులో ఇంటిబాటపట్టారు. -
వినియోగదారుల భద్రతకు ప్రత్యేక చట్టాలు
మెట్పల్లి(కోరుట్ల): వినియోగదారుల భద్రతకు ప్రత్యేక చట్టాలున్నాయని, వాటిని వినియోగించుకోవాలని సీనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్ నాగేశ్వర్రావు పేర్కొన్నారు. పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలన్నారు. వ్యాపారులు మోసాలకు పాల్పడితే న్యాయం కోసం కోర్టులు లేదా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలని పేర్కొన్నారు. మోసాలకు గురైతే తప్పకుండా న్యాయ పోరాటం చేయాలని సూచించారు. కా ర్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.లింబాద్రి, న్యాయవాదులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్, పన్ను వసూళ్లపై దృష్టి సారించండి రాయికల్(జగిత్యాల): రాయికల్ బల్దియాలోని ప్రజలు ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ లత కోరారు. శనివారం బల్దియాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్పై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారని ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ఇంటి స్థల యజమానులకు తప్పనిసరిగా ఫోన్ చేసి 25 శాతం రాయితీ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. బల్దియాలోని గృహ, వర్తక వ్యాపారస్తులు సకాలంలో పన్ను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వేసవి దృష్ట్యా పట్టణంలో తాగునీటి సమస్య ఉంటే చర్యలు చేపట్టాలని కమిషనర్ మనోహర్గౌడ్ను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ ఖయ్యూం, మేనేజర్ వెంకటి, టీపీవో ప్రవీణ్కుమార్, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్ పాల్గొన్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలిజగిత్యాల: ఫోన్ ఇన్ కార్యక్రమం సద్విని యోగం చేసుకోవాలని డీఈవో రాము పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేయగా డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలని, రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యలో ఫోన్ చేసి సందేహాలు తెలుసుకోవచ్చన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి ప్రథమస్థానంలో నిలిచేలా చూడాలన్నారు. సెక్టోరియల్ అధికారి కొక్కుల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. యూనిఫాంతయారీపై అవగాహన ఉండాలిజగిత్యాలరూరల్: యూనిఫాం తయారీపై మహిళ సంఘాలు అవగాహన పెంచుకోవాలని సెర్ఫ్ డీపీఎం విజయభారతి అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో దుస్తులు కుట్టే మహిళ సంఘ సభ్యులతో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మూనిఫాం తయారీ వేగవంతం చేయాలన్నారు. ఎవరికై నా ఆధునిక జాకీకుట్టు మిషన్లు, ఖాజాలు, గుండీలు కుట్టే మిషన్లు అవసరం ఉంటే వారికి కొనుగోలు చేసేందుకు రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏపీఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూచాళ్లు ఎత్తుకుపోతుంటారు. కానీ అన్నీ తెలిసిన యువతకు కొలువుల గాలమేసి విదేశీ కంపెనీలకు విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మనుషులను సంతలో పశువుల్లా విక్రయించే వారి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని భా
తమను భారత్కు పంపాలని మయన్మార్లో యువకుల నిరసన (ఫైల్)కరీంనగర్ పోలీసుల లుక్అవుట్ నోటీసులు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామరావు రాజశేఖర్ వయసు 25ఏళ్లలోపే. కానీ బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. అతను ఇప్పటి వరకూ వివిధ సైబర్ ఫ్రాడ్ కంపెనీలకు దాదాపు 300 మందికి పైగా యువతను విక్రయించాడు. జగి త్యాల జిల్లా రాయికల్కు చెందిన నలుగురిని ఇదేవిధంగా లావోస్ తరలించి వేధిస్తే వారు ఎలాగోలా ఇండియాకు వచ్చి రాజశేఖర్పై ఫిర్యాదు చేయగా.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి లుక్అవుట్ నోటీసు జారీచేసింది. గతేడాది సిద్దిపేటలోనూ రాజశేఖర్పై ఇదే తర హ కేసు నమోదైంది. ఫిబ్రవరి 22న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేటకు చెందిన కొక్కిరాల మధుకర్రెడ్డిని ఇదే తరహాలో మోసగించిన విషయంలో మానకొండూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు కరీంనగర్ పోలీసులు రాజశేఖర్పై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు.యువత అప్రమత్తంగా ఉండాలి కొలువుల కోసం విదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. కంపెనీ వివరాలు, వీసా, నియామక పత్రాలు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. ఇందుకోసం విదేశాంగశాఖ వెబ్సైట్ లేదా ఆయా దేశాల భారత దౌత్యకార్యాలయాల వెబ్సైట్లను సంప్రదించండి. ఆపద వస్తే ఆదుకునేందుకు కేంద్రం ఉంది. కానీ, ఆ ఆపద రావడం కన్నా.. ముందే అప్రమత్తంగా ఉండడం మంచిది. – బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఎలా తరలిస్తారు? గుజరాత్ పోరుబందర్కు చెందిన హితేశ్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన రాజశేఖర్ ఈ మానవ అక్రమ రవాణాలో కింగ్పిన్లని పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. మార్చి 10, 11 తేదీల్లో బాధితులను మయన్మార్లోని మైవాడీ జిల్లా నుంచి థాయ్లాండ్లోని మైసోట్ నగరానికి, ఆ పై మన దేశ రాజధాని ఢిల్లీకి తరలించాయి. అక్కడ నుంచి వచ్చిన బాధితుల ద్వారా సీబీఐ, ఎన్ఐఏ, రాష్ట్రానికి చెందిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ)లు మోసం ఎలా జరిగిందో వివరాలు రాబట్టాయి. ఆయా ఏజెన్సీలకు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల్లో కొలువుల కోసం చూస్తున్న అమాయకులకు తొలుత టెలీగ్రామ్ యాప్లో లింకులు పంపుతారు. అనంతరం వీరికి జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ, టైపింగ్ స్పీడ్ పరీక్షించి ఎంపిక చేస్తారు. వీరినుంచి రూ.3లక్షల వరకు ఉద్యోగం ఇచ్చినందుకు వసూలు చేస్తారు. ఇవ్వని వారినీ ఏమీ అనకుండా ఉచితంగా విమాన టికెట్ పంపుతారు. తీరా థాయ్లాండ్ వెళ్లాక..అక్కడ అవసరాన్ని బట్టి.. మయన్మార్, థాయ్లాండ్, లావోస్లకు సరఫరా చేస్తారు. పాస్పోర్టు లాక్కుని సైబర్ నేరాలు చేయాలని చిత్రహింసలకు గురిచేస్తారు.సూత్రధారుల్లో ఉమ్మడి జిల్లావారు.. ఈ కేసులో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామారావు రాజశేఖర్తోపాటు మరో ముగ్గురు ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయ్యారని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో శుక్రవారం మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. వీరిలో జగిత్యాలకు చెందిన అల్లెపు వెంకటేశ్, చల్లా మహేశ్, వేములవాడకు చెందిన కట్టంగూరి సాయికిరణ్ ఉన్నారు. మరో ఐదుగురు హైదరాబాద్కు చెందిన బషీర్ అహ్మద్, గాజుల అభిషేక్, ఎండీ జలాల్, బొమ్మ వసంత్కుమార్, దాసరి ఏక్నాథ్గౌడ్గా పోలీసులు తెలిపారు. మధుకర్రెడ్డి తరహాలో వందలాది మంది అమాయక యువకులను మయన్మార్లో బంధించారని ‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన కేంద్రం రెండు విమానాలతో మొత్తం 540 మందిని రక్షించి, సురక్షితంగా ఇండియాకు తరలించింది. ఈ క్రమంలో తమ పిల్లలను కేంద్రం సురక్షితంగా ఇంటికి తీసుకురావడంపై బాధిత కుటుంబాలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. -
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
మెట్పల్లిరూరల్ (కోరుట్ల): జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్లో మల్లన్న స్వామి జాతరకు సంబంధించిన భద్రత ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కింగ్, అత్యవసర సేవలు, బందోబస్తు తదితర విషయాలపై సిబ్బందితో చర్చించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతరకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేశ్, ఎస్సైలు శ్రీకాంత్, శ్యాంరాజ్, నవీన్ తదితరులు ఉన్నారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీటజగిత్యాలటౌన్: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుగుణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో జరిగిన సమావేశానికి హాజరై సభ్యత్వ నమోదును పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో తెలంగాణ దేశంలోనే ముందుండడం శుభపరిణామమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా నాయకులు సత్తా చాటాలని సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవిందమ్మ, కార్యదర్శి సుమలత, జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, సరిత, పిప్పరి అనిత, మంజుల, పద్మ, లావణ్య, మచ్చ కవిత, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంట పరిశీలనమేడిపల్లి(వేములవాడ): మండలంలోని పొరుమల్ల గ్రామంలో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, కరీంనగర్ మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు పంటలను పరిశీలించారు. పంట స్థితిగతులు, దిగుబడి, వచ్చే సీజన్లో ఉండబోయే డిమాండ్ గురించి రైతులతో చర్చించారు. మండల వ్యవసాయ అధికారి ఎండీ షాహిద్అలీ, విస్తరణ అధికారులు మంజుల, సృజన, రైతులు పాల్గొన్నారు. -
ఏఐతో సులభతరమైన విద్యాబోధన
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలరూరల్: విద్యార్థులకు సులభతరమైన వి ద్యాబోధన అందించేందుకు అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విద్యా విధానం ప్రవేశపెట్టడం జరిగిందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం జగిత్యాల రూ రల్ మండలం జాబితాపూర్లో ఏఐ ద్వారా విద్యాబోధనను ప్రారంభించారు. జిల్లాలో 21 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ ద్వారా బోధన ప్రారంభమైందన్నా రు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 3–5వ తరగతుల విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాల పెంపే ల క్ష్యంగా ఏఐ ద్వారా విద్య బోధిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో మధుసూదన్, డీఈవో రాము, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం అండ జగిత్యాల: దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత కేంద్రంలో ఉపకరణాలు అందజేశారు. డీఈవో రాము, జిల్లా కోఆర్డినేటర్ మహేశ్, ఆర్పీలు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలి జిల్లాలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. అదనపు కలెక్టర్ లత, డీఆర్డీవో రఘువరన్, మదన్మోహన్ పాల్గొన్నారు. -
కోనేటిరాయ.. కోటొక్క దండాలయా
ధర్మపురి: కోనేటి రాయడుకి భక్తులు కోటొక్క దండాలు సమర్పించారు. నర్సింహ నామస్మరణలతో కోనేరు మారుమోగింది. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ సమీపంలోని బ్రహ్మపుష్కరిణిలో శనివారం ఉగ్రనృసింహుని డోలోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలను వైభవంగా జరిపించారు. ఉత్సవమూర్తులను కోనేరులో హంసవాహనంపై ఐదు ప్రదక్షిణలు చేసి తెప్పోత్సవం, అనంతరం భోగ మండపంలోని ఊయలపై ఆసీనులు చేసి డోలోత్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే స్వామివారల దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలకు ధర్మపురి పోలీస్ స్టేషన్ను ముస్తాబు చేశారు. ఆదివారం పూజల కోసం ఠాణా ఆవరణలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీనృసింహుడు పోలీస్స్టేషన్ను సందర్శించడం ఆనవాయితీ. కాగా స్వామివారి రాకకోసం ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్స్టేషన్ విద్యుత్ దీపాలతో అలంకరించామని సీఐ రాంనర్సింహారెడ్డి పేర్కొన్నారు. -
భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
జగిత్యాల: జిల్లాలోని పొలాసలో దారుణం చోటు చేసుకుంది. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య. భర్త కమాలకర్ కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అవ్వగా, మరో పెళ్లి చేసుకున్నాడనేది కూడా ఆమె ఆరోపిస్తోంది. తమను రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని, అందుచేత భర్తపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు భార్య చెబుతోంది.గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసై తమను వేధిస్తున్నాడని భార్య పేర్కొంది. భార్యా పిల్లలను కొడుతుండటంతో ఓపిక నశించి కమలాకర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు చెబుతోంది. పిల్లలతో కలిసి కమాలకర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు భార్య స్పష్టం చేసింది. ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమాలకర్ పరిస్థితి విషమంగా ఉంది. -
రాజవ్వ అటుకులు.. ఆహా!
జగిత్యాల టౌన్: రాజవ్వ అటుకులంటే జగిత్యాలలో తెలియని వారుండరు. ఆ టేస్టుకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. జగిత్యాల పట్టణ టవర్ సర్కిల్లోని ప్రధాన కూరగాయల మార్కెట్లో రాజవ్వ అనే మహిళ గత 25 ఏళ్లుగా రుచికరమైన అటుకులు, చాయ్ హోటల్ నిర్వహిస్తున్నారు. శుచి, శుభ్రతతో తయారు చేసిన అటుకులకు దాల్చా చేర్చి నిమ్మకాయ పిండి ఇచ్చే అటుకులకు టిఫిన్ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఉదయం నుంచే రాజవ్వ అటుకుల కోసం టిఫిన్ ప్రియులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్లేట్ కేవలం రూ. 20కే అందిస్తున్న రాజవ్వ అటుకులను మార్కెట్కు వచ్చే కొనుగోలు దారులు, కూరగాయల అమ్మకం దారులు, వ్యాపారులు తెగ ఇష్టపడి తింటుంటారు. దేశ విదేశాల్లో కూడా రాజవ్వ అటుకుల గురించి చర్చ జరగడం ఇక్కడి అటుకుల రుచికి నిదర్శనమని పలువురు టిఫిన్ ప్రియులు చెబుతున్నారు. జగిత్యాల కూరగాయల మార్కెట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది రాజవ్వ అటుకులే కావడం విశేషం. అటుకులే కాదు రాజవ్వ చేసే చాయ్ అంటే కూడా చాయ్ ప్రియులు ఎంతో ఇష్టపడి తాగుతుండటం విశేషం. View this post on Instagram A post shared by shivani patel (@jagtial_pilla__)ఇంట్లో తిన్నట్లుంటుంది రాజవ్వ చేసే అటుకులు తింటే ఇంట్లో చేసిన అటుకులు తిన్న అనుభూతి కలుగుతుంది. శుచి, శుభ్రతతో పాటు మంచి రుచితో ఉండే రాజవ్వ అటుకులంటే నాతో పాటు నా మిత్రులు ఇష్టపడతారు. మిత్రులతో కలిసి రాజవ్వ హోటల్లో అటుకులు తింటాను. – ప్రసాద్గౌడ్, స్థానికుడుఅటుకులు బాగుంటాయి మాది జగిత్యాల మండలం నర్సింగాపూర్. నేను రైతును. పలు రకాల కూరగాయలు మార్కెట్కు తెచ్చి అమ్ముతుంటాను. రాజవ్వ హోటల్ వద్ద రుచికరమైన అటుకులు తిన్నాకే దందా మొదలు పెడతాను. రాజవ్వ చేసే అటుకులు చాలా రుచిగా ఉంటాయి. – గంగవ్వ, రైతు -
లైసెన్స్ తీసుకోరు.. రెన్యూవల్ చేసుకోరు
మెట్పల్లి(కోరుట్ల): పట్టణాల్లో వ్యాపారాలు నిర్వహించాలంటే మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ను తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న దుకాణం నుంచి మొదలుకొని భారీ పరిశ్రమల వరకు తప్పనిసరిగా ఈ లైసెన్స్ను కలిగి ఉండాలి. అలాగే ప్రతి సంవత్సరం దానిని రెన్యూవల్ చేసుకోవాలి. కానీ స్థానికంగా చాలా మంది లైసెన్స్ తీసుకోకుండానే దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రతీ వ్యాపారి లైసెన్స్ తీసుకునేలా చూడాల్సిన మున్సిపల్ శానిటేషన్ విభాగం సిబ్బంది ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సగం మందికే లైసెన్స్లు ● మెట్పల్లి పట్టణంలో కమర్షియల్ భవనాలు 1,162, మిక్స్డ్ కమర్షియల్ భవనాలు 959 ఉన్నాయి. అలాగే విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం స్థానికంగా మొత్తం 4,123 కమర్షియల్ మీటర్లు ఉన్నాయి. ● కానీ ట్రేడ్ లైసెన్స్లు ఇప్పటి వరకు కేవలం 1,138 మాత్రమే జారీ చేసినట్లు ఆ విభాగం సిబ్బంది తెలిపారు. అటు కమర్షియల్ మీటర్లు, ఇటు కమర్షియల్ భవనాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ట్రేడ్ లైసెన్స్లు లేని దుకాణాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆదాయనికి భారీగా గండి ● ట్రేడ్ లైసెన్స్ల జారీ కోసం పట్టణాన్ని మూడు జోన్లుగా విభజించారు. ఇందులో ఒక్కో జోన్కు ఒక్కో రకంగా ఫీజు నిర్దేశించారు. ప్రస్తుతమున్న లైసెన్స్ల ద్వారా ఏటా మున్సిపాలిటీకి రూ.20లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలిసింది. ● వాస్తవానికి పూర్తి స్థాయిలో దుకాణాలను గుర్తించి లైసెన్స్లు జారీ చేస్తే ఇంతకు రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశముంటుంది. కానీ, సిబ్బంది నిర్లక్ష్యంతో మున్సిపాలిటీకి ఏటా రూ.లక్షల్లో నష్టం జరుగుతోంది. కొలతల్లో అక్రమాలు ● ట్రేడ్ లైసెన్స్లను పర్యవేక్షించే సిబ్బంది దుకాణాలకు కొలతలు వేసే విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● పెద్ద వ్యాపార దుకాణాలకు ఉన్న ప్రకారం కాకుండా తక్కువ కొలతలు చూపి వ్యాపారుల నుంచి సిబ్బంది లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ● ఉన్నతాధికారులు స్పందించి ట్రేడ్ లైసెన్స్ల ద్వారా సమకూరే ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరముంది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా పెద్ద సంఖ్యలో వ్యాపారాల నిర్వహణ పట్టించుకోని అధికారులు ఏటా మున్సిపాలిటీకి రూ.లక్షల్లో నష్టం‘ఇది మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్. ఇందులో సుమారు వంద దుకాణాలు ఉన్నాయి. అయితే ఇందులో ఒక్క దానికి కూడా ట్రేడ్ లైసెన్స్ లేదు. ఈ కాంప్లెక్స్ను ఖాదీ యాజమాన్యం మున్సిపల్ నుంచి అనుమతులు తీసుకోకుండా నిర్మించడం.. వాటికి ఇంటి నంబర్లు లేకపోవడం వంటి కారణాలతో ట్రేడ్ లైసెన్స్లు జారీ చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు మున్సిపాలిటీకి రూ.లక్షల్లో నష్టం జరిగింది. ఇలా ఇదొక్కటే కాదు.. పట్టణంలో పెద్ద సంఖ్యలో దుకాణాలు ట్రేడ్ లైసెన్స్లు లేకుండానే నిర్వహిస్తున్నారు.’ నోటీసులు ఇస్తున్నాం పట్టణంలో ట్రేడ్ లైసెన్స్లు తీసుకోని వారితో పాటు లైసెన్స్లు ఉండి రెన్యూవల్ చేసుకోని వారిని గుర్తించి నోటీసులు ఇస్తున్నాం. ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రతీ వ్యాపారి లైసెన్స్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. కొలతల విషయంలో అక్రమాలు జరగడం లేదు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నాం. – రత్నాకర్, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్, మెట్పల్లి -
పులకించిన పుష్కరిణి
ధర్మపురి: గోవిందనామ స్మరణతో శుక్రవారం బ్రహ్మపుష్కరిణి మారుమోగింది. ఽ దర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలోని బ్రహ్మపుష్కరిణిలో నృసింహుని డోలోత్సవం, తెప్పోత్సవం ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. స్వామివారలను హంసవాహనంపై కోనేరులో ఐదు ప్రదక్షిణలు చేసి తెప్పోత్సవం, భోగ మండపంలోని ఊయలపై డోలోత్సవం నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి వేడుకలను తిలకించారు. విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందుతు తలెత్తకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, బాదినేని రాజేందర్, ఎస్.దినేశ్, వేముల రాజు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు 20 మంది ఎంపిక
మెట్పల్లి(కోరుట్ల): పట్టణంలోని మినీ స్టేడియంలో శుక్రవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. పోటీలకు పలు మండలాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–14,16,18,20 విభాగాల్లో నిర్వహించిన పలు పోటీల్లో 20మంది ప్రతిభ చూపారు. వీరిని ఈనెల 23న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాందాస్, వ్యాయమ ఉపాధ్యాయులు స్వప్న, కార్తీక్, ప్రశాంత్, వేణు తదితరులున్నారు. -
ఎల్ఆర్ఎస్ కిరికిరి
● రియల్ వ్యాపారుల మీమాంస ● మందకొడిగా రిజిస్ట్రేషన్లు కోరుట్ల: కటాఫ్ తేదీ తర్వాత జరిగే భూ క్రయ విక్రయాలకు ఎల్ఆర్ఎస్ డబ్బులు కడితేనే రిజిస్ట్రేషన్లు చేయాలన్న నిబంధన రియల్ వ్యాపారులను డైలమాలో పడేసింది. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న క్రయవిక్రయాల్లో చాలా మేర భూమిని కొని ..లాభం చూసుకుని అమ్మేసే రకం రిజిస్ట్రేషన్లు అధికం. నిజంగా ఇల్లు కట్టుకునేందుకు భూములు కొనుగోలు చేసేవారు తక్కువగా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు భూమి కొనుగోలు చేసినా ఇల్లు ఎప్పుడు కడతారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం జరిగే భూ క్రయవిక్రయాలకు చెందిన ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టాలనే మీమాంస నెలకొంది. ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టాలి ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో చాలా మంది ప్లాట్లు కొనుగోళ్లు చేసి ధర పెరిగినప్పుడు అమ్ముకునే వారే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం తేదీ 26–08–2020 కంటే ముందు లింక్ డాక్యుమెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ సమయంలో లేదా ఇల్లు కట్టే సమయంలో ఏదైనా ఓ సమయంలో ఎల్ఆర్ఎస్ డబ్బు కట్టేలా వెసులుబాటు ఇచ్చా రు. కానీ, కటాఫ్ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే మాత్రం తప్పకుండా ఎల్ఆర్ఎస్ చె ల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో రియల్ వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల అమ్మకాలు చేసే వ్యాపారుల నుంచి భూమి కొనుగోలు చేసిన అంశంలో వీళ్లలో ఎవరు ఇల్లు కట్టుకునే వారు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ సమయంలో ఎవరు ఎల్ఆర్ఎస్ రుసుము కట్టాలనే అంశం సమస్యగా మారింది. తగ్గిన రిజిస్ట్రేషన్లు జిల్లాలోని జగిత్యాల, మల్యాల, మెట్పల్లి, కోరుట్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీట న్నింటిలో కలిపి రోజూ సుమారు 250– 350 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కాగా, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఎల్ఆర్ఎస్ చెల్లించాలన్న కొత్త నిబంధన వచ్చిన అనంతరం ఈ పదిహేను రోజుల వ్యవధిలో రోజూ జిల్లావ్యాప్తంగా కేవలం 120–150 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఎల్ఆర్ఎస్కు సంబంధించి మున్సిపాల్టీల్లోనే వెబ్సైట్ సక్రమంగా పనిచేయ డం, ఇతర ప్రాంతాల్లో వెబ్సైట్ సరిగా ఒపెన్ కాకపోవడం రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడానికి కొంత కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద కొత్తగా ఎల్ఆర్ఎస్ డబ్బుల చెల్లింపు నిబంధన రియల్ వ్యాపారంలో క్రయవిక్రయాలపై కొంత ప్రభావం చూపినప్పటికీ ఇల్లు కట్టుకునే, రిజిస్ట్రేషన్ల సమయంలో ఎల్ఆర్ఎస్ చెల్లించే వారికి మాత్రం ఈ నెల 31 వరకు నిర్ణయించిన 25 శాతం డిస్కౌంట్ కలిసివస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
తూకంలో మోసం.. కల్తీ
● తూనికల కొలతల అధికారుల పర్యవేక్షణ కరువు ● నష్టపోతున్న వినియోగదారులుజగిత్యాల: జిల్లాలోని కిరాణాలు, సూపర్మార్కెట్లలో తూకాల్లో అనేక మోసాలు జరుగుతున్నాయి. వేయింగ్ మిషన్లలోని లొసుగులను తెలుసుకున్న వ్యాపారులు దాదాపు కిలోకు 150 గ్రాముల వరకు తక్కువగా ఇస్తూ వినియోగదారులను నష్టపరుస్తున్నారు. ఇలా కూరగాయల వ్యాపారుల నుంచి మొదలు కొని పెద్ద సూపర్మార్కెట్లలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అంతేకాక వివిధ వస్తువులను ప్యాకెట్లలో నింపి ఏదో చిన్న స్టిక్కర్ అంటిస్తూ మోసం చేస్తున్నారు. కొనిన చోట్ల ఎలాంటి స్టిక్కర్లు వేయకుండా, ధర లేకుండానే విక్రయిస్తుండగా, మరికొన్ని చోట్ల షాపునకు సంబంధించి స్టిక్కర్ వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజల అవసరాలను వ్యాపారులు అవకాశంగా మార్చుకుని ప్యాకెట్ల రూపంలో వస్తువులను అంటగడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా తూనికలు, కొలతల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు అందినప్పుడే దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారే తప్ప తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అనుమతి లేకుండానే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా నిత్యావసర వస్తువులు ప్యాకింగ్ చేయాలంటే తప్పనిసరిగా తూనికల కొలతల శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే కిరానాల్లో పప్పులు, చక్కెర, గోదుమపిండి తదితర వస్తువులను ప్యాకింగ్ చేస్తూ విక్రయిస్తున్నారు. వీటితో పాటు తినుబండారాలైన చిప్స్, మురుకులు, కార, బోందీ తదితరవాటిని ప్యాకింగ్లలోనే విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిత్యావసర వస్తువులపై సంబంధిత కంపెనీ చిరునామాతో పాటు పూర్తి వివరాలు ఉండాలి. కానీ పలుచోట్ల ఇలాంటివి కన్పించవు. జోరుగా జీరో దందా జిల్లాలోని పలువురు వ్యాపారులు పన్ను తప్పించుకోవడానికి జీరో దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్యాకెట్లపై ఎలాంటి ముద్రణ, తేదీ, కన్జుమర్ నంబరు లేకుండానే కిలో, అరకిలో, పావుకిలో చొప్పున విక్రయిస్తూ జీరో దందాను కొనసాగిస్తున్నారు. పట్టించుకోని అధికారులు జగిత్యాలలో తూనికల కొలతల శాఖ కార్యాలయం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నెలలో ఒక్కసారైనా తనిఖీలు చేపట్టడం లేదు. దీంతో వ్యాపారులది ఇష్టారాజ్యంగా మారింది. షాపుల్లోని వేయింగ్ మిషన్లలో వ్యత్యాసం రాకుండా నిత్యం తనిఖీలు చేపట్టాలి. కానీ అటువైపే చూడడం లేదు. ధరల్లో సైతం తేడాలు నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ రేట్లపైనే వస్తువులను విక్రయించాల్సి ఉండగా కొన్ని షాపుల్లో నిబంధనలు పాటించడం లేదన్నా ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. సినిమా థియేటర్లలోనైతే ఇష్టారాజ్యంగా ధరలు ప్రకటించి విక్రయిస్తున్నారు. కొత్త సినిమా రోజు సినిమా థియేటర్లలో ఒక కూల్డ్రింక్ రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. ఒక పాప్కార్న్ రూ.40కి అమ్ముతారు. వాటర్ప్యాకెట్స్ రూ.10, వాటర్బాటిల్స్ రూ.40, చిప్స్ రూ.30కి విక్రయిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.ప్రతీ ప్యాకింగ్పై వివరాలు ఉండాలి ప్రతీ ప్యాకింగ్ వస్తువుపై సంబంధిత కంపెనీ ముద్రణ, కన్జుమర్ నంబరు, ఎమ్మార్పీ రేట్లు ఉండాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. రోజూ తనిఖీలు చేపడుతున్నాం. తూనికల, కొలతల అధికారుల అనుమతి లేనిది ప్యాకింగ్ వస్తువులను విక్రయించరాదు. ఇలాంటి వాటిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మిషన్వారు సంవత్సరానికోసారి, తరాజుబాట్లు వాడేవారు రెండేళ్లకోసారి ముద్రణ వేయించుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. – అజీజ్ పాషా, తూనికల, కొలతల ఇన్స్పెక్టర్ అంతా కనికట్టు.. మోసం కనిపెట్టు ఓవైపు పెట్రోలు కల్తీ ..మరోవైపు కొలతల్లో తేడాలు...అంతేకాకుండా కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం.. ఇదీ ఉమ్మడి జిల్లాలో అధిక శాతం పెట్రోలు బంకుల్లో పరిస్థితి. ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించవు. త్వరగా గమ్యం చేరాలనే వినియోగదారుడి ఆరాటం..అవగాహన లోపం.. బంకుల యాజమాన్యాలకు కలసివస్తోంది. 8లోu -
ఎస్పీ ఆకస్మిక తనిఖీ
జగిత్యాలక్రైం/మెట్పల్లి: జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లను గురువారం అర్ధరాత్రి ఎస్పీ అశోక్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగిత్యాలటౌన్, కోరుట్ల, మెట్పల్లి పోలీస్స్టేషన్, పలు ప్రాంతాల్లో పర్యటించి పోలీసుల పెట్రోలింగ్ను ప్రత్యక్షంగా పరిశీలించారు. మెట్పల్లి ఠాణాలో సిబ్బంది, రాత్రి డ్యూటీ వివరాలు తెలుసుకున్నారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న సీఐ, ఎస్ఐ ఏ ప్రాంతంలో ఉన్నారంటూ ఫోన్ చేసి ఆరా తీశారు. కామునిదహన వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోటేశ్వరస్వామి సేవలో డీఈవోవెల్గటూర్(ధర్మపురి): కోటిలింగాలలోని కోటేశ్వరస్వామిని శుక్రవారం జిల్లా విద్యాధికారి రాము కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం డీఈవో గోదావరినదిలో బోటింగ్ చేశారు. ధర్మపురి ఎంఈవో సీతాలక్ష్మి, ఉపాధ్యాయ సంఘం నాయకులు గోవర్ధన్, భీమయ్య, పవన్కుమార్, సీఆర్పీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎంకోరుట్ల: కోరుట్ల ఆర్టీసీ డిపోలో శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ మనోహర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కోరుట్ల డిపో పరిధిలోని పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు తమ సమస్యలు, సలహాలు, సూచనలు 83745 34961 నంబర్కు ఫోన్ చేసి తెలపాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. -
కన్నులపండువగా కల్యాణం
వెల్గటూర్(ధర్మపురి): ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి కల్యాణం శుక్రవారం కన్నులపండువగా నిర్వహించారు. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తులకు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణలతో కల్యాణ క్రతువును కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్ ముఖ్య అథితిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విప్ అడ్లూరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, డా.గురువారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేశ్, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సూరీడు ‘మార్చి’ఫాస్ట్
జిల్లాలో ఈనెల 10 నుంచి 13 వరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలుజిల్లా 10 11 12 13 కరీంనగర్ 38.1 38.7 39.9 39.4 జగిత్యాల 38.6 39.1 40.3 39.9 పెద్దపల్లి 39.3 39.6 40.3 40.0 సిరిసిల్ల 39.8 39.5 40.0 38.7 జగిత్యాలఅగ్రికల్చర్/కరీంనగర్అర్బన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 14 నుంచి 17 వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వడగాలులు వీచే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు. 15న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
చెత్తబండి నిత్యం రావడం లేదు
రాయికల్లో చెత్త తీసుకెళ్లే బండి నిత్యం రాకపోవడంతో ఇంట్లోనే ఖాళీ సంచుల్లో నిల్వ చేసుకుంటున్నాం. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. డంపర్బిన్ ఏర్పాటు చేస్తే అందులో వేస్తాం. వాహనం నిత్యం వచ్చేలా చూడాలి. – పద్మ, రాయికల్ శ్మశానం పక్కనే చెత్త పోస్తున్నారు శ్మశానం సమీపంలోనే చెత్త పోయడంతో అంత్యక్రియలకు వచ్చే వారికి ఇబ్బందికరంగా మారింది. ప్రధానమైన చోట్ల డంపర్బిన్స్ ఏర్పాటు చేయాలి. చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. – రవీందర్, ధర్మపురి డంపర్బిన్స్ ఏర్పాటు చేయాలి జిల్లాకేంద్రంలో ప్రధానమైన చోట్ల డంపర్బిన్స్ ఏర్పాటు చేయాలి. కొన్నిచోట్లనే ఉండడంతో రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. దీంతో రోడ్ల వైపు వెళ్తుంటే దుర్గంధం వెదజల్లుతోంది. మున్సిపల్ అధికారులు స్పందించి చెత్త సేకరణ నిత్యం చేపట్టాలి. – కల్యాణ్, జగిత్యాల -
చెత్త సేకరణలో నిర్లక్ష్యం
● రోడ్లపై పేరుకుపోతున్న చెత్తాచెదారం ● పరిసరాల్లో వెదజల్లుతున్న దుర్వాసన ● ప్రధానచోట్లలో కనిపించని డంపర్బిన్స్ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని బైపాస్రోడ్లోది. ఇక్కడ కొద్దిరోజులుగా డంపర్బిన్ ఉండేది. ఇప్పుడు లేకపోవడంతో చెత్తనంతా రోడ్డుపైనే పడేస్తున్నారు. కొద్దిరోజులుగా అక్కడ చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఆ మార్గంమీదుగా స్కూల్కు వెళ్లే విద్యార్థులు, ప్రజలు దుర్వాసన భరించలేకపోతున్నారు. ఇది జిల్లాకేంద్రంలోని రామాలయం సమీపంలో ఉన్న డ్రైనేజీ. సమీప ప్రజలు చెత్తను ఇక్కడే పడేస్తున్నారు. ఫలితంగా డ్రైనేజీ నిండిపోయింది. రోడ్డంతా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, పాడైన ఫ్యాన్లు, కూలర్లు, పరుపులతో కనిపిస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు.జగిత్యాల: జిల్లాలోని మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ సక్రమంగా సాగడం లేదనడానికి ఈ చిత్రాలే ఉదాహరణ. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలో డంపర్బిన్స్ను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఎక్కడబడితే అక్కడే చెత్త పడేస్తున్నారు. దీంతో దుర్గంధం వెదజల్లుతోంది. వాస్తవానికి ఆలయాలు, ఆస్పత్రుల సమీపాల్లో డంపర్బిన్స్ను ఎక్కువగా ఏర్పాటు చేయాలి. కానీ.. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. రోడ్లపై చెత్త వెంటనే తీస్తే ఇబ్బంది ఉండదు. చెత్త సేకరణలో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోతోంది. పందులు, ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో డంపర్ఫేసర్ వాహనం మరమ్మతు చేసినా డంపర్బిన్స్ అత్యధికంగా లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. డంపర్బిన్స్ అత్యధికంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇది కోరుట్లలోని అయిలాపూర్ నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి వెళ్లే దారి. చెత్తను ఈ రోడ్డుపై పోయడంతో పెంట కుప్పలాగా మారింది. బల్దియా అధికారులు స్పందించకపోవడంతో ఆలయానికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ఇది ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న గోదావరికి వెళ్లే రహదారి. డంపింగ్యార్డు లేక పట్టణంలోని చెత్తనంతా తీసుకువచ్చి రోడ్డు వెంట పోస్తున్నారు. భక్తులు అటువైపు వెళ్లలేకపోతున్నారు. స్థానికులు దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు. ఇది జిల్లాకేంద్రంలోని శ్మశాన వాటిక ప్రాంతంలోగల బైపాస్రోడ్. ఇక్కడ పెద్ద డ్రైనేజీ ఉంది. చెత్త వేసేందుకు డంపర్బిన్ లేక వ్యర్థాలను పడేస్తున్నారు. చెత్త తొలగించేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.ఇది మెట్పల్లిలోని 12వ వార్డు కాలనీ. ఇక్కడ ప్రజల కోసం డంపర్బిన్స్ ఏర్పాటు చేయకపోవడంతో చెత్తను ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. కాలనీ అంతా దుర్గంధం వెదజల్లుతోంది.ఇది రాయికల్ మున్సిపాలిటీలోని అశోక్నగర్ కాలనీ. చుట్టుపక్క ప్రజలు చెత్తను ఇక్కడే పడేస్తున్నారు. ప్రతిరోజూ తొలగించకపోవడంతో చెత్త డ్రైనేజీలో పేరుకుపోతోంది. ఇది జిల్లాకేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలోని డంపర్బిన్. తహసీల్ చౌరస్తాలో ఉండడంతో త్వరగా నిండిపోతోంది. ప్రధాన ఆస్పత్రి, ప్రధానరోడ్డు కావడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. -
నృసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్గా రవీందర్
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ పాలకమండలిని గురువారం ప్రకటించారు. ఈవో శ్రీనివాస్ సమక్షంలో 13 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఏడాది కాలపరిమితితో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ శైలజారామయ్యర్ జీవో నంబర్ 76 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్గా జక్కు రవీందర్, ధర్మకర్తలుగా ఎదులాపురం మహేందర్, బాదినేని వెంకటేశ్, బొల్లారపు పోచయ్య, గుడ్ల రవీందర్, కొమురెల్లి పవన్కుమార్, మందుల మల్లేష్, నేదునూర్ శ్రీధర్, రాపర్తి సాయికిరణ్, సంబెట తిరుపతి, స్తంభంకాడి గణేష్, వొజ్జల సౌజన్య, అవ్వ సుధాకర్, ఎక్స్ అఫీషియో మెంబర్గా నేరెల్ల శ్రీధరాచార్యులుగా కొనసాగనున్నారు. నూతన పాలకమండలి సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో బుగ్గారం మాజీ జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, నాయకులు ఎస్. దినేష్, వేముల రాజు తదితరులున్నారు. ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్గా శ్రీనివాస్ధర్మపురి: ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్గా ధర్మపురికి చెందిన ఇమ్మడి శ్రీనివాస్ను నియమిస్తూ జీవో 209ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీనివాస్ ధర్మపురిలోని జూనియర్ సివిల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన ఏజీపీగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రౌతు రాజేష్, ఉపాధ్యక్షుడు రామడుగు రాజేశ్, ట్రెజరీ జాజాల రమేశ్, న్యాయవాదులు అభినందించారు. నృసింహస్వామి ఆలయ గిరిప్రదక్షిణవెల్గటూర్: మండలంలోని కిషన్రావుపేటలోగల శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పూలతో అంకరించిన శావపై ఊరేగించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు స్వామివారి నామసంకీర్తనలతో గిరి ప్రదక్షిణ చేపట్టారు. చివరిరోజైన శుక్రవారం ఎడ్లబండ్ల పోటీలు ఉంటాయని ఆలయ కమిటీ చైర్మన్ నైనాల అజయ్ తెలిపారు. హోలీని ఆనందంగా జరుపుకోవాలిజగిత్యాలరూరల్: హోలీ వేడుకలను ఆనందంగా నిర్వహించుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఎస్పీ అశోక్కుమార్ సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యువకులు అత్యుత్సాహం ప్రదర్శించరాదని, ద్విచక్ర వాహనాలపై ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది ముమ్మర పెట్రోలింగ్, డ్రంకెన్డ్రైవ్ చేపడతామన్నారు. స్నానాల కోసం అధిక నీటి ప్రవాహం, లోతైన ప్రదేశాల్లో వెళ్లి ప్రమాదాల బారినపడొద్దని హెచ్చరించారు. ఇతరులపై బలవంతంగా రంగులు చల్లడం.. గొడవ పడ డం.. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. లింగ నిర్ధారణ నేరంజగిత్యాల: లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పలు స్కానింగ్సెంటర్లను మాతాశిశు సంరక్షణ అధికారి జైపాల్రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. రోగుల సౌలభ్యం కోసం వసతులు కల్పించాలని, వెంటిలేషన్, వే యింటింగ్ హాల్ తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. జైపాల్రెడ్డి మాట్లాడుతూ స్కా నింగ్ సెంటర్లను రిజిస్ట్రేషన్ ఉన్నవారే నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. -
గడువులోపు వందశాతం పన్ను వసూలు చేయాలి
మెట్పల్లి: ఆస్తి పన్ను బకాయిలను ఈనెల 31లోపు వంద శాతం వసూలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. పట్టణంలో చేపడుతున్న ఆస్తి పన్ను వసూళ్లను గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బకాయిదారులతో మాట్లాడి మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. నెలాఖరు వరకు ఫీజు చెల్లిస్తే 25శాతం రాయితీ ఉందన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రతి దరఖాస్తుదారుడు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకునేలా చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం అర్బన్ హౌసింగ్ కాలనీలో నిర్మించే హెల్త్ సబ్ సెంటర్ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాస్, కమిషనర్ మోహన్ ఉన్నారు. ఎల్ఆర్ఎస్ చెల్లించండి జగిత్యాలరూరల్: గ్రామ పంచాయతీల్లో ఈనెల 31వరకు ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు గడువు ఉందని ఎంపీవో రవిబాబు అన్నారు. ఎల్ఆర్ఎస్ చెల్లిస్తే ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇస్తుందన్నారు. 2020లో రూ.వెయ్యి ఫీజు చెల్లించిన వారికి ప్రస్తుతం అవకాశం ఉందన్నారు. ఓపెన్ ల్యాండ్స్ ఉన్న వారంతా రెగ్యులరైజేషన్ చేసుకోవాలని కోరారు. ఇంటి పన్నులను ఈనెల 25లోపు ప్రతిఒక్కరూ చెల్లించాలని కోరారు. తిమ్మాపూర్ గ్రామంలో ఎల్ఆర్ఎస్ రుసుం ఆన్లైన్ చెల్లింపులను డీపీవో మదన్మోహన్ పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ వెంటనే చెల్లించాలని కోరారు. -
పల్లె దవాఖానాల్లో మెరుగైన వైద్యం
జగిత్యాలరూరల్: గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించేందుకు పల్లె దవాఖానాలు నిర్మిస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రూరల్ మండలం తక్కళ్లపల్లిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో భాగంగా రూ.20లక్షలతో నిర్మించనున్న పల్లె దవాఖానా నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. హన్మాజీపేట, బాలపల్లిలో రూ.31.50 లక్షలతో సీసీరోడ్డుకు శంకుస్థాపన చేశారు. తక్కళ్లపల్లిలో పల్లె దవాఖానా కోసం స్థలం అందించిన గడ్డం హన్మాన్రెడ్డిని సన్మానించారు. నాయకులు ముస్కు ఎల్లారెడ్డి, దశరథరెడ్డి, బాలముకుందం, రవీందర్రెడ్డి, జైపాల్రెడ్డి, విక్రమ్, రమణరెడ్డి, కృష్ణ, సతీశ్, నరేశ్, శంకర్, ప్రవీణ్రావు, మోహన్రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి జగిత్యాల: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని 29, 30 వార్డులు, న్యూ హైస్కూల్లో రూ.10 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఖాదర్, నాగయ్య, పంబాల రాముకుమార్, దుమాల రాముకుమార్, తోట మల్లికార్జున్, జగదీశ్, ధర్మరాజు, రాజేశ్ పాల్గొన్నారు. శ్రీడబుల్శ్రీ ఇళ్లలో సదుపాయాలు డబుల్ బెడ్రూం ఇళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. నూకపల్లి వద్దగల డబుల్బెడ్రూంలను పరిశీలించారు. లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లు అందిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జ్యోతి, ఏఎంసీ మాజీ చైర్మన్ దామోదర్రావు, కమిషనర్ చిరంజీవి ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
డ్రైనేజీలు అస్తవ్యస్తం
● కరువైన మరమ్మతు ● కొత్తవి నిర్మించరు.. పాతవి పట్టించుకోరు ● శానిటేషన్ మరిచిన అధికారులు ● నరకం అనుభవిస్తున్న ప్రజలు జగిత్యాల: నూతన డ్రైనేజీలు నిర్మించరు.. ఉన్నవాటికి మరమ్మతు చేయరు అన్నచందంగా మారింది జిల్లాలోని మున్సిపాలిటీల తీరు. పాలకవర్గం ఉన్న సమయంలోనూ డ్రైనేజీలను పట్టించుకోకపోవడంతో మురికినీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, మున్సిపాలిటీల్లోని డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో మురికినీరు రోడ్లపైకి చేరుతోంది. పర్యవేక్షించేవారు లేక పారిశుధ్య కార్మికులు వాటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ప్రజలు కూడా ప్లాస్టిక్, చికెన్ వ్యర్థాలను డ్రైనేజీల్లోనే వేస్తున్నారు. సాయంత్రం ఆరుగంటలు దాంటిదంటే ప్రతిఒక్కరూ తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు ఫాగింగ్ చేయకపోవడం, డ్రైనేజీల్లో ఆయిల్బాల్స్ వేయకపోవడంతో వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్రోడ్లోగల ప్రధాన కాలువ. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం.. కాలనీకి చెందిన కొందరు చెత్త పడేయడంతో నీరు కదలలేని పరిస్థితి. పరిసరాలన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. శుభ్రం చేయాల్సిన పారిశుధ్య కార్మికులు వారానికోసారైనా తీయడం లేదు. పందులు, దోమలు విజృంభిస్తున్నాయి. కాలనీవాసులు రోగాల పాలవుతున్నారు. -
14న మెట్పల్లిలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
మెట్పల్లి: పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 14న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఈనెల 23న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో పోటీలు ఉంటాయని, ఆసక్తి గలవారు మధ్యాహ్నం మూడు గంటలకు అర్హతపత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలిజగిత్యాలరూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. జగిత్యాల మండల ఐకేపీ కార్యాలయంలో బుధవారం మహిళాదినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. మహిళ సంఘాలకు ఇందిరామహిళ శక్తి కార్యక్రమం కింద ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రుణాలు ఇస్తోందన్నారు. డీపీఎం మాణిక్రెడ్డి, ఏపీఎం గంగాధర్, డీఎంసీ దేవయ్య, సీసీలు గంగారాం, మరియ, విద్యాసాగర్ పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేయాలిజగిత్యాలటౌన్: ప్రభుత్వం విడుదల చేసే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టం తేవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాంమాదిగ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని ప్రకటించిన నేపథ్యంలో గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టానికి రూపకల్పన చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే గ్రూప్–1, 2, 3, 4 సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో నాయకులు నురుగు శ్రీనివాస్, బెజ్జంకి సతీష్, బోనగిరి కిషన్, నక్క గంగారాం, నక్క రమేష్, సంకెపు ముత్తు, కొల్లూరు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ‘ఏఐ’ బోధనజగిత్యాల: జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించి విద్యాబోధన చేయనున్నట్లు డీఈవో రాము తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. ఈనెల 15 నుంచి ఎంఈవోలు, అకాడమిక్ మానిటరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఏఐ వాడటానికి అనుకూలంగా ఉండేలా కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులకు ఏఐ ద్వారా వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపర్చేలా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కో–ఆర్డినేటర్ రాజేశ్ పాల్గొన్నారు. రంగుమారిన తాగునీరుజగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పరిధి 13వ వార్డు సుతారిపేటలో కొన్ని రోజులుగా తాగునీరు కలుషితం అవుతోంది. రంగుమారిన నీరు వస్తోందని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
కిడ్నీలు పదిలమేనా?
కిడ్నీ.. మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవం. తినేతిండి, తాగే నీటిని వడకట్టి వడబోసి.. శరీరానికి అవసరమైన శక్తిని రక్తంలోకి, మలినాలను, వ్యర్థాలను మలమూత్రవిసర్జన ద్వారా బయటికి పంపించే ప్రక్రియను కిడ్నీ నిర్వహిస్తుంది. ఇటీవలకాలంలో జిల్లాలో కిడ్నీవ్యాధి బాధితులు పెరుగుతున్నారు. పిల్లలు, యువతను సైతం సమస్య వెంటాడుతోంది. అనేక మందికి ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపోయినా మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడం కనిపిస్తోంది. దశాబ్దకాలంలో వేలాదిమంది మరణాలకు కారణమైన వ్యాధికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు కాగా పేయిన్ కిల్లర్స్ అధిక వినియోగం, డీహైడ్రేషన్ మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కథనం. – 8లో... రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్రెడ్డి(55) వ్యవసాయం చేస్తుంటాడు. ఒకరోజు అనూహ్యంగా వాంతులయ్యాయి. కాళ్లు వాపులు వచ్చాయి. వెంటనే కరీంనగర్ వెళ్లగా రక్త పరీక్షలు చేసిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిలయ్యాయని నిర్ధారించారు. విజయేందర్రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపారు. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేశారు. ప్రతిసారీ రూ.5000 చొప్పున నెలకు రూ.40వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చులయ్యాయి. విజయేందర్రెడ్డిని ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసిన తమ్ముడు జితేందర్రెడ్డి(51) తన రెండు కిడ్నీల్లోని ఒక్కటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. విజయేందర్రెడ్డికి జితేందర్రెడ్డి కిడ్నీ మ్యాచ్ అయింది. అదిపని చేయడం ప్రారంభించింది. మృత్యుముంగిట అసహాయంగా చేతులు కట్టుకుని నిల్చున్న అన్నయ్యకు ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది. -
బ్యాంకులు రుణలక్ష్యం చేరుకోవాలి
జగిత్యాలజోన్: బ్యాంక్లు రుణలక్ష్యాన్ని చేరుకోవాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా బ్యాంక్ల సమన్వయ కమిటీ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలలో జాప్యం చేయరాదని, రానున్న మూడు నెలల్లో అత్యధిక రుణాలు అందించాలని సూచించారు. నాబార్డ్ డీడీఎం దిలీప్చంద్ర మాట్లాడుతూ.. ముద్ర, పీఎంఈజీపీ, ఎస్ఎస్జీ రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంకుమార్ మాట్లాడుతూ జిల్లాలో 26 బ్యాంక్లకు 133 శాఖలున్నాయని, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రుణాలు మంజూరు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఎల్డీవో పృథ్వీ, వివిధ శాఖల జిల్లా అధికారులు రాజ్కుమార్, నరేశ్, కిశోర్ పాల్గొన్నారు. -
యువతలో బీపీ, షుగర్
● 30ఏళ్లకే చుట్టుముట్టుతున్న వ్యాధులు ● ఎన్సీడీ స్క్రీనింగ్తో గుర్తింపు ● మారుతున్న జీవనశైలే కారణమంటున్న వైద్యులు ● ఒత్తిడి తీరిక లేని శ్రమతో మానసిక స్థితిపై ప్రభావం ‘జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్కు సుమారు 30ఏళ్లు ఉంటాయి. కొద్దిరోజులుగా అధిక దాహం, అధిక మూత్ర విసర్జనతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల జిల్లాకేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన ఎన్సీడీ సర్వేలో వైద్య సిబ్బంది అతడికి పరీక్షలు చేశారు. ఇందులో నరేశ్కు షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వైద్య సిబ్బంది అతడికి మందులు అందించి షుగర్ అదుపులో ఉండేందుకు సూచనలు చేశారు..’ ఇది ఒక్క నరేశ్ సమస్య కానేకాదు. వందలాది మంది యువతది ఇదే పరిస్థితి.గొల్లపల్లి: మారుతున్న జీవనశైలితో అనేక మంది వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. సరైన పోషకాలున్న ఆహారపదార్థాలను తీసుకోకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇందులో భాగంగా యువతకు కూడా బీపీ, షుగర్ వస్తున్నాయి. వృద్ధాప్యంలో రావాల్సిన ఇలాంటి వ్యాధులు 30ఏళ్లు దాటకున్నా.. బయటపడటం కలవరపెడుతోంది. వేలాది మంది ఇలా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ఎన్సీడీ పరీక్షల్లో నిర్ధారణ అవుతోంది. ఇప్పటివరకు జిల్లాలో చేపట్టిన స్క్రీనింగ్లో 90,390 మందికి బీపీ, 41,140 మందికి షుగర్ ఉన్నట్లు గుర్తించారు. దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు జిల్లాలోని ఎన్సీడీ కార్నార్ల్, క్లీనిక్ల ద్వారా అందిస్తున్న సేవలు విస్తృతం కావడం, పెద్ద సంఖ్యలో పరీక్షలు చేస్తుండటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆదేస్థాయిలో చికిత్స కూడా అందుతుంది. వంశపారపర్యంగానూ.. డయాబెటీస్ ఎక్కువగా వంశపార్యపరంగా.. వయసు పెరిగే కొద్ది వస్తుంది. దూమపానం, అల్కాహాల్ తీసుకోవడం ద్వారా పాంక్రియాటిక్ గ్రంథిలో ఇన్సూలిన్ ఉత్పత్తి తగ్గి వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి. చిన్నారులు నిత్యం, టీవీ ఎదుట కూర్చొని చిరుతిళ్లు తినడం, ఎలాంటి వ్యాయామం చేయకపోవడంతో ఊబకాయం పెరిగి అధిక డయాబెటీస్కు దారి తీస్తుంది. చిన్న వయస్సులో ఎత్తుకంటే అధికంగా బరువు పెరగడం వల్ల రాత్రి నిద్రించే సమయంలో కొన నాలుక అడ్డుపడి నిద్రపట్టక మానసిక ఒత్తిడికి గురవుతారు. నిర్లక్ష్యంతో పెరుగుతున్న నష్టం.. చాలామంది బీపీ, షుగర్ బాధితులు వాటి బారినపడిన సంగతిని గుర్తించడం లేదు. నిర్లక్ష్యంతోనే ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో పిల్లలోనూ డయాబెటీస్ లక్షణాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. జనులోపంతో పుట్టిన సమయంలోనే ఎక్కువగా పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. పదేళ్లలోపు పిల్లలు కూడా వ్యాధి బారినపడుతున్నారు. త్వరగా అలిసిపోవడం, తిన్న వెంటనే ఆకలి అనిపించడంతో పిల్లలు చదువు, ఆటలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా .. గత ఐదేళ్లలో బీపీ, షుగర్ బారిన పడిన వారిలో 40శాతం వరకు యువతే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వారే ఎక్కువగా మధుమేహం, రక్తంపోటు బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఒక్క జగిత్యాల పట్టణంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 9,334 మంది బీపీ, 4,297 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. నియంత్రణే మార్గం.. రక్తపోటు, మధుమేహం నియంత్రణ తప్ప నివారణకు అవకాశం లేదు. ఇలాంటి వ్యాధుల కట్టడికి కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద నాన్ కమ్యూనికేబుల్ డీసీస్ కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించింది. 30 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం గురయ్యేవారిని గుర్తించి ముందస్తుగా వారికి వైద్యసేవలు అందించడం..తద్వారా వారి ఆయుష్షును పొడిగించడం ఈ పథకం లక్ష్యం. జిల్లాలో పలు విడుతలుగా సర్వే నిర్వహించి బీపీ, షుగర్ బాధితులను గుర్తించగా సంబంధిత సెంటర్ల ద్వారా మందులు తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. జీవనశైలి మారాలి ప్రస్తుతం 30ఏళ్లకే బీపీ, షుగర్ వస్తోంది. జీవనశైలిలో మార్పులతోనే వీటిని అరికట్టవచ్చు. యువత జంక్ఫుడ్కు అలవాటుపడటం.. వాకింగ్ చేయకపోవడంతో వ్యాధులు వస్తున్నాయి. ఆహారంలో ఉప్పు చాలా మేరకు తగ్గించి ఒత్తిడి లేకుండా జీవించాలి. నిర్ణీత సమయంలో వ్యాధిని గుర్తించి తగిన చికిత్స చేసకోవడం ద్వారా నియంత్రించవచ్చు. – శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్వో వ్యాయామం తప్పనిసరి ఒత్తిడి కారణంగా ఈ జబ్బులు వస్తున్నాయి. వ్యాయాంమం చేయకపోవడం... సరైన ఆహారం తీసుకోకపోవడంతో చుట్టుముట్టుతున్నాయి. పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. పెద్దలు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడే అవకాశం ఉంటుంది. – అర్చన, ఎన్సీడీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ -
పరీక్షలు ప్రశాంతంగా రాయండి
● ఎవరూ ఒత్తిడికి లోనుకావద్దు ● ‘పది’ విద్యార్థులతో కలెక్టర్ జగిత్యాల: ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, ఎవరూ ఒత్తిడికి లోనుకావద్దని కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థులకు సూచించారు. జిల్లాలోని టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో వర్చువల్ ద్వారా మాట్లాడారు. పరీక్షలంటే విద్యార్థులు భయపడొద్దని, ఉపాధ్యాయుల సూచనలు పాటించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. డీఈవో రాము మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష రాసేముందు ఆరోగ్య నియమాలు పాటించాలని, పార్ట్బీ ప్రశ్నపత్రంలో ఎలాంటి తప్పిదాలూ దొర్లకుండా చూసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ చెల్లించేలా చూడాలి అర్హులు ఎల్ఆర్ఎస్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మండలాలవారీగా అధికారులతో బుధవారం సమీక్షించారు. మున్సిపల్, మండలాల పరిధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీపీవో మదన్మోహన్, టౌన్ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డ్రైనేజీలు నిర్మించాలి
శివారు కాలనీల్లో డ్రైనేజీలు లేక ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. మురికినీరంతా రోడ్లపైకే వస్తోంది. దీని వల్ల ఇంట్లోకి దుర్వాసన వస్తోంది. దోమల బెడద ఎక్కువైంది. అధికారులు వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. – ఆగమయ్య, మెట్పల్లి దుర్వాసన వస్తోంది మురికికాలువలు తీయకపోవడం, డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో మురికినీరంతా బయటకు వస్తోంది. అధికారులు బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలి. దుర్వాసన భరించలేకపోతున్నాం. – రమణ, కోరుట్ల ఏళ్ల తరబడి ఇలాగే.. డ్రైనేజీలను దశాబ్దకాలం క్రితం నిర్మించారు. కొత్త డ్రైనేజీలు నిర్మిస్తే మేలు. మురికినీరు వెళ్లకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మురికికాలువలు శిథిలావస్థలో ఉండటంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది. – దేవేందర్, రాయికల్ కాలువలు శుభ్రం చేయాలి జగిత్యాల జిల్లాకేంద్రం కావడంతో శివారు ప్రాంతాల్లో కొత్తగా ఇ ళ్లు కడుతున్నా రు. ఆ ప్రాంతంలో మురికికాలువలు లేక నీరంతా బ యటకు వస్తోంది. ముందుగా డ్రైనేజీ లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. – కిరణ్కుమార్, జగిత్యాల -
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
కార్యక్రమాలు విస్తృతపరచాలి షీటీమ్ పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృత పర్చాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలతో మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారు. షీటీమ్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు బాగున్నాయి. – మారు సత్తమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు, జగిత్యాల బస్టాండ్, పాఠశాలలు, కళాశాలలు వద్ద మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలు, కళాశాలల వద్ద షీటీమ్ ఫోన్ నంబర్లు తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – అశోక్కుమార్, ఎస్పీ -
అంధకారంలో బల్దియాలు
జగిత్యాల మున్సిపాలిటీ వార్డులు : 48వీధి దీపాలు : 10,200కోరుట్ల మున్సిపాలిటీ వార్డులు : 32వీధి దీపాలు : 8,966మెట్పల్లి మున్సిపాలిటీ వార్డులు : 26వీధి దీపాలు 5,184ధర్మపురి మున్సిపాలిటీ వార్డులు :15వీధి దీపాలు: 1,525రాయికల్ మున్సిపాలిటీ వార్డులు : 12వీధి దీపాలు : 1,754 ● ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాల నుంచి విద్యానగర్కు వెళ్లే రహదారి. ఇక్కడ స్ట్రీట్లైట్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. రాత్రిపూట చైన్స్నాచింగ్, కుక్కల బెడద అధికంగా ఉంది.●ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని బైపాస్రోడ్. ఇక్కడ స్ట్రీట్లైట్లు అసలే లేవు. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు చిమ్మచీకటి ఉంటుంది. రాత్రివేళ మహిళలు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
లైట్లు బిగించాలి
జిల్లాకేంద్రంలోని మినీస్టేడియం ముందు గేట్ వద్ద, వెనుకవైపు కాలేజీ సమీపంలో స్తంభాలు ఏర్పాటు చేసి స్ట్రీట్లైట్స్ బిగించాలి. ఆ వైపు చిమ్మచీకటిగా ఉంటోంది. లైట్లు లేక ఉదయం, సాయత్రం వాకర్స్, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. లైట్లు లేక మలవిసర్జన చేస్తున్నారు. – మచ్చ శంకర్, జగిత్యాల రాత్రిపూట భయంభయంగా రాయికల్లోని 3వ వార్డు ఇందిరానగర్లో విద్యుత్ స్తంభాలకు వీధిదీపాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఇందిరానగర్ నుంచి మెయిన్ రోడ్ వరకు విద్యుత్ స్తంభాలు లేక రాత్రిపూట కాలనీలోకి రావాలంటేనే భయాందోళనగా ఉంది. – రాజేశ్, రాయికల్వీధిలైట్లు ఏర్పాటు చేయాలి కోరుట్లలోని కల్లూరు రోడ్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. ము న్సిపల్ అధికారులు అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తున్నా అవి తొందరగానే చెడిపోతున్నాయి. అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. – లవంగ సాగర్, కోరుట్ల ● -
కనులపండువగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
రాయికల్: మండలంలోని ఇటిక్యాల గ్రామంలోగల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయ అర్చకులు జగన్మోహనార్యులు, కల్యాణచార్యులు ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. స్వామివారికి తులాభారం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, సురకంటి నాగిరెడ్డి, సామల్ల వేణు, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, రఘునాథాచార్యులు, కనపర్తి శ్రీనివాస్, ఉట్నూరి గంగాధర్ పాల్గొన్నారు. -
ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయండి
● మొక్కజొన్న, కందులు కొనాల్సిందే ● ఎమ్మెల్సీ జీవన్రెడ్డిజగిత్యాలటౌన్: భవన నిర్మాణదారులకు ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జిల్లాలో అక్రమ ఇసుక డంపులను అరికట్టడంలో కలెక్టర్ చొరవను అభినందించిన ఆయన.. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కజొన్నలకు గతేడాది క్వింటాల్కు రూ.2500 ఉండగా.. ఇప్పుడు రూ.రెండువేలకు పడిపోయిందని, మొక్కజొన్నలు, కందులు కొనాలని సీఎంకు లేఖ రాశానన్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. నాయకులు బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, మహ్మద్ భారి, సురేందర్, రఘువీర్గౌడ్, మహేందర్ తదితరులు ఉన్నారు. -
షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ హామీ నిలబెట్టుకోవాలి
మెట్పల్లి: అధికారంలోకి రాగానే ముత్యంపేటలోని చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు అన్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేశారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ అర్వింద్ కృషితోనే పసుపు బోర్డు ఏర్పాటైందని, పసుపు రైతుల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి నరేందర్రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్, నాయకులు దొనికెల నవీన్, సుంకేట విజయ్, బొడ్ల ఆనంద్, గౌతమ్ తదితరులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేయడం తగదు మెట్పల్లిలో బీజేపీ నాయకుల ధర్నా -
వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
జగిత్యాలఅగ్రికల్చర్: వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియానాయక్ అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి విద్యుత్ అధికారి వారికి నిర్దేశించిన హెడ్క్వార్టర్స్లో ఉంటూ రోజువారి విద్యుత్ లోడ్ను సమీక్షించాలన్నారు. పంటలు పూర్తయ్యేవరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. జిల్లాలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియానాయక్ -
మహిళల భద్రతకు షీటీంలు
● ఆకతాయిల ఆగడాలకు చెక్ ● ఫిర్యాదుల స్వీకరణకు సాంకేతిక పరిజ్ఞానం ● వేధింపులపై ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలుజగిత్యాలక్రైం: జిల్లాలోని కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్లు ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా షీటీం బృందాలు ప్రత్యేకంగా జనసంచారం ఉన్నచోట మఫ్టీలో తిరుగుతూ.. పోకిరీలను పట్టుకుంటున్నాయి. జగిత్యాల, మెట్పల్లి సబ్ డివిజన్ల పరిధిలో షీటీం పోలీసులు ఆ శాఖ పనితీరుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగ డాలను వీడియో రికార్డ్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. జగిత్యాల, మెట్పల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 20 మండలాల్లో షీ టీం బృందాలు పనిచేస్తున్నాయి. టీమ్లో ఎన్ఏ స్థాయి అధికారి, కానిస్టే బుల్ ఉంటారు. అవగాహన సదస్సులు ఆకతాయిలు వేదిస్తే వెంటనే షీటీంకు సమాచారం అందించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నారు. చీటింగ్పై పోలీసు శాఖ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటి వరకు 140 చోట్ల సదస్సులు నిర్వహించారు. వేధింపులకు గురిచేసే ఆకతాయిలు ఎక్కువగా సంచరించే 185 అడ్డాలను గుర్తించారు. ఇప్పటివరకు 40 ఫిర్యాదులు రాగా.. 5 కేసులు నమోదు చేశారు. 18 మందిపై ఈ–పెట్టి కేసులు నమోదు చేశారు. 22 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా షీటీం 120 పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే డయల్ 100 లేదా 87126 – 70783వాట్సప్ నంబర్లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. -
‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు
● నేడు కలెక్టర్తో ముఖాముఖి ● ఈనెల 15 నుంచి ఫోన్ఇన్ ● నిమిషం నిబంధన లేదు ● వసతులన్నీ ఏర్పాటుచేశాం ● అరగంట ముందు వస్తే ప్రశాంతం ● సాక్షి ఇంటర్వ్యూలో డీఈవో రాముజగిత్యాల: ‘పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక చొ రవ తీసుకుని జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలి పేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పిల్లలకు కలెక్టర్ లేఖల ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలిపా రు. ఇందులో భాగంగానే ఈనెల 12న (బుధవా రం) విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. విద్యార్థులు వారివారి పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకుంటే ప్రశాంతంగా పరీక్షలు రాయవచ్చు. వేసవికాలం కావడంతో విద్యార్థులకు సెంటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేశాం..’ అన్నారు డీఈవో రాము. ఈనెల 21 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో డీఈవో రాముతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. సాక్షి: జిల్లాకేంద్రంగా ఏర్పడిన మూడేళ్లు ఎస్సెస్సీ ఫలితాల్లో హ్యాట్రిక్ సాధించింది. తర్వాత నుంచి అట్టడుగు స్థానంలోనే ఉంటోంది. ఈసారి ప్రథమస్థానం సాధించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? డీఈవో: పదో తరగతి ఫలితాలపై కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయులు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రం ఏర్పడిన మూడేళ్ల పాటు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే. ఈ సారి కూడా అలాంటి ఫలితాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: విద్యార్థులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? డీఈవో: కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశాం. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ కలెక్టర్ స్వయంగా లేఖలు పంపించారు. విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా కష్టపడుతున్నాం. ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. సాక్షి : విద్యార్థుల సందేహాలను ఎలా తీర్చుతున్నారు..? డీఈవో: ఈనెల 15నుంచి ఫోన్ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతి సబ్జెక్ట్కు ఒక నిపుణుడిని నియమించాం. పరీక్షలు పూర్తయ్యేంత వరకు ఫోన్ ఇన్లో సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ ఫోన్ఇన్ నంబరు అందిస్తాం. ఈసారి జిల్లాలో మొత్తం 67 సెంటర్లు ఏర్పాటు చేశాం. అందులో అన్ని మౌలిక వసతులు కల్పించాం. సాక్షి: ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు? డీఈవో: జిల్లాలో మొత్తం 11,855 మంది పరీక్ష రాయబోతున్నారు. ఇందులో 5878 బాలురు, 5,977 మంది బాలికలు ఉన్నారు. ప్రైవేటు విద్యార్థులు 285 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేషన్ సిబ్బంది, ఫ్లయింగ్స్క్వాడ్, పోలీసు సిబ్బందికి సెల్ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. సాక్షి: సిబ్బందిని ఎంత మందిని నియమించారు..? డీఈవో: చీఫ్ సూపరింటెండెంట్లు 67, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 67, అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 4, ఫ్లయింగ్స్క్వాడ్స్ 4, కస్టోడియన్స్ 22, ఇన్విజ్లేటర్లు 827 మందిని నియమించాం. విద్యార్థులు ఎండనుంచి తప్పించుకునేందుకు తాగునీటి వసతి కల్పిస్తున్నాం. ప్రతి గదిలో ఫ్యాన్, ఫర్నిచర్ ఏర్పాటు చేశాం. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. ఈ సారి నిమిషం నిబంధన అమలులో లేదు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ప్రశాంతంగా విద్యార్థులు పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది. సాక్షి: ఫీజు చెల్లించని విద్యార్థులకు కొన్ని పాఠశాలలు హాల్టికెట్లు ఇవ్వడం లేదని తెల్సింది..? డీఈవో: అలాంటివారు మాకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. హాల్టికెట్ ఇవ్వకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. BE.TELA NGA NA.GOV.I N ద్వారా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
అద్భుతమైన ఇంజనీరింగ్ శైలి..
కోరుట్ల: పెద్ద పెద్ద రాతి స్తంభాలు.. వాటిపై శిలాఫలకాలతో శ్లాబ్ వంటి నిర్మాణాలు. అక్కడక్కడ చిన్నచిన్న విశ్రాంతి గదులు. దుస్తులు మార్చుకునేందుకు అనువైన నిర్మాణాలు. మూడు అంతస్తుల నిర్మాణం. భూమిపై కనిపించేది కేవలం ఒక అంతస్తు మాత్రమే.. మిగిలిన రెండు అంతస్తుల నిర్మాణం భూగర్భంలోకి వెళ్లిపోయింది. క్రీ.శ. 957–1184 మధ్య కాలం నాటి శిల్పుల ఇంజనీరింగ్ శైలికి నిదర్శనంగా నిలిచిన అద్భుతమైన నిర్మాణం జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. జైన చాళుక్యుల కాలంలో.. క్రీ.శ. 1042–1068 వరకు వేములవాడ రాజధానిగా పరిపాలన సాగించిన జైన చాళుక్యుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మించినట్లు సమాచారం. 7–10వ శతాబ్ది వరకు పరిపాలన సాగించిన కల్యాణి చాళు క్యులు, రాష్ట్రకూటుల హయాంలోనూ ఈ మెట్ల బావి (Stepwell) ఆ కాలం నాటి రాజవంశీయుల స్నానాలకు, విశ్రాంతి తీసుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి వినియోగించారని చెబుతారు. ఈ మెట్ల బావిలోని రాతి స్తంభాలపై చెక్కిన తీరు అమోఘం. రాతి స్తంభాల కింది భాగంలో భూగర్భమార్గంలో రాజకోటను చేరుకోవడానికి సొరంగం వంటి మెట్ల నిర్మా ణం ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. రాజవంశీయుల కాలంలో నిషిద్ధ ప్రాంతంగా ఉన్న ఈ మెట్ల బావి ప్రస్తుతం కోరుట్ల (Korutla) మున్సిపల్ అధీనంలో ఉంది. ఎక్స్లెన్స్ సర్టిఫికెట్ కోరుట్లలోని మెట్ల బావిలో స్నానాలకు వచ్చే రాజవంశీయులకు దుస్తులు మార్చుకోవడానికి అనువుగా మెట్లబావి రెండవ అంతస్తులో చిన్నచిన్న గదులుండటం గమనార్హం. వీటితో పాటు విశ్రాంతి తీసుకోవడానికి మెట్ల బావి చుట్టూ రాతి స్తంభాల మీద నిలబెట్టిన శిలాఫలకాలతో పెద్ద వసారా ఉంది. మెట్ల బావి (stair well) చుట్టూ దీపాలు వెలిగించడానికి అవసరమైన చిన్నపాటి గూళ్లు ఉన్నాయి. మెట్లబావిపై భాగంలో ఉన్న మెట్లకు వెంబడి ఎడమ వైపు ఉన్న ఓ రాతిపై శిలాశాసనం (Epigraphy) ఉంది. ఈ శిలాశాసనం సంపూర్ణంగా చదవడానికి వీలు కానట్లుగా సమాచారం. ఈ మధ్య కాలంలో దెబ్బతిన్న కోరుట్ల మెట్లబావిని మున్సిపల్ ఆధ్వర్యంలో బాగు చేయించి కొత్త సొబగులద్దారు. దీంతో ఈ మెట్లబావికి ఇండి గ్లోబల్ నెట్వర్క్ నుంచి 2022–23 సంవత్సరంలో ఎక్స్లెన్స్ సర్టిఫికెట్ దక్కింది. చదవండి: వెండితెరపై మానుకోట -
అంబేడ్కర్ను అవమానించడం సరికాదు
సారంగాపూర్: అంబేడ్కర్ను అవమానించడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని నాగునూర్లో సోమవారం పర్యటించారు. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. నిందితులకు శిక్షిపడేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. ఆయన వెంట జగిత్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కల్లెపల్లి దుర్గయ్య, నక్క జీవన్, మాజీ ఎంపీపీ ధర రమేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోండ్ర రాంచంద్రారెడ్డి, దళిత, అంబేద్కర్ సంఘాల నాయకులు పూడూరి శోభన్, మాలెపు సుధాకర్, ప్రశాంత, తదితరులు ఉన్నారు. -
ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు
● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ ● పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు కల్యాణం కమనీయంమల్లాపూర్: మండలంలోని రాఘవపేటలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని అర్చకులు మాధవాచార్యులు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సరోజన దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహిళలు సాముహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నత్తి లావణ్య, నాయకులు పాల్గొన్నారు. 7బాధితులకు సత్వర న్యాయం చేయాలిజగిత్యాలక్రైం: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల కు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వి విధ ప్రాంతాలకు చెందిన 14 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చే రువ చేయడమే లక్ష్యంగా ప్రజాసమస్యలను ప రిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే క్షయవ్యాధి నిర్మూలనకథలాపూర్: క్షయవ్యాధిని నిర్మూలించడమే లక్ష్యమని, ఇందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని ఊట్పల్లి, రాజారాంతండాల్లో సోమవారం పర్యటించారు. స్థానిక అధికారులతో పంచాయతీ కార్యాలయాల్లో సమావేశమయ్యారు. క్షయవ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు పంచాయతీ అధికారులు సహకరించాలన్నారు. ఈ రెండు గ్రామాల్లో క్షయవ్యాధిగ్రస్తులు లేకపోవడం విశేషమన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు ఇమ్రాన్, శ్రీధర్, ల్యాబ్ టెక్నీషియన్ చిన్నరాజం, కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రూప్–1 ఫలితాల్లో రాయికల్ యువకుడి ప్రతిభరాయికల్: పట్టణానికి చెందిన సురతాని అరవింద్రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 421 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. సురతాని మల్లారెడ్డి, భాగ్యలక్ష్మీ కుమారుడు అరవింద్రెడ్డి కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలలో ఇంటర్, ఢిల్లీలో బీఏ, ఎంఏ ఎకానమిక్స్ పూర్తి చేశాడు. యూజీసీ నెట్లో అర్హత సాధించి గ్రూప్–1 మొదటి ప్రయత్నంలోనే 421 మార్కులు సాధించాడు. అరవింద్రెడ్డిని పలువురు అభినందించారు. జగిత్యాలటౌన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై 50 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అనంతరం ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు బీఎస్ లత, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు పులి మధుసూదన్గౌడ్, జివాకర్రెడ్డి పాల్గొన్నారు. కోతుల బెడద నుంచి కాపాడండి గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి. అన్ని పంటలకు నష్టం చేస్తున్నాయి. ఆరుతడి పంటలు, పండ్లు, కూరగాయల పంటలను తినడమే కాకుండా నాశనం చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి ఆహారం, వస్తువులను ధ్వంసం చేస్తున్నాయి. – మేడిపల్లి మండలం, కొండాపూర్ గ్రామస్తులు ఒకే వ్యక్తి.. రెండు చోట్ల విధులు రాయికల్ మార్కెట్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కొయ్యడ శ్రీనివాస్ అదే మండలం కుమ్మరిపల్లిలో రేషన్ షాపు కూడా నిర్వహిస్తున్నాడు. ఏకకాలంలో రెండు విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై ఈ ఏడాది జనవరి 27న ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేశాను. ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. 25 ఏళ్లుగా రెండుచోట్ల విధులు నిర్వర్తిస్తూ ప్రభు త్వ సొమ్మును అక్రమంగా పొందుతున్న శ్రీని వాస్పై చర్యలు తీసుకోవాలి. కడకుంట్ల రమేష్శ్మశాన వాటిక, ప్రభుత్వ స్థలం కాపాడాలి జిల్లాకేంద్రంలోని ధరూర్క్యాంపు సర్వేనంబర్ 363, 364లోగల ఎస్సారెస్పీ స్థలాన్ని కొందరు ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. అదే స్థలాన్ని ఆనుకుని ఉన్న శ్మశాన వాటికను కూడా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ విషయమై ఎస్సారెస్పీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – జగిత్యాల తొమ్మిదోవార్డు ప్రజలు డబ్బుల్ ఇళ్లను పంపిణీ చేయండి జగిత్యాల అర్బన్ మండలం నూకపల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన 3500 ఇళ్లలో 800 ఇళ్లను ఇంకా లబ్ధిదారులకు అప్పగించలేదు. ఆ ఇళ్ల వద్ద పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి అర్హులైన పేదలకు పంపిణీ చేయండి. – భారత్ సురక్షా సమితి ప్రతినిధులుసోలార్ప్లాంట్ ఆలోచనలో ఉన్నాం ప్రభుత్వం బస్సులివ్వడం ఊహించలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, చెల్లించడమే తెలిసిన మాకు ఇది మంచి అవకాశం. నెలనెలా ఆర్టీసీ చెల్లించే డబ్బులతో సొలార్ ప్లాంట్లు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే స్థలాలు పరిశీలిస్తున్నాం. సమాఖ్యను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్, సెర్ఫ్ సీఈవో దివ్యదేవరాజన్లకు ధన్యవాదాలు. – హరిణి, ఉదయలక్ష్మి సమాఖ్య, చిగురుమామిడిప్రభుత్వానికి రుణపడి ఉంటాం మా సమాఖ్యకు బస్సు రావడం సంతోషకరం. మా మీద నమ్మకంతో బస్సు కేటాయించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. నెలానెలా బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతో కొత్త వ్యాపారాలు మొదలు పెడుతాం. మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళతాం. సరిత, శ్రీచైతన్య మండల సమాఖ్య, ధర్మపురిరోడ్డు నిర్మించండి వెల్గటూర్ మండలం జగదేవుపేట నుంచి చెర్లపల్లి, వెల్గటూర్ వెళ్లే దారి గుంతలమయంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, ఫైరింజన్, స్కూల్ బస్సులు కూడా వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామానికి రోడ్డు నిర్మించండి. – వెల్గటూర్ మండలం, జగదేవుపేట గ్రామస్తులు నర్సింగాపూర్లో భూకబ్జా జగిత్యాల జిల్లా రూరల్ మండలం నర్సింగాపూర్ శివారు సర్వే నంబర్ 437లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడండి. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుకబట్టీలను సీజ్ చేయండి. – సిరికొండ శ్రీనివాస్ ఆర్థికాభివృద్ధికి వినియోగిస్తాం ప్రభుత్వం మా సంఘానికి కేటాయించిన ఆర్టీసీ బస్సు ద్వారా వచ్చే రూ.77 వేల ఆదాయాన్ని సంఘ సభ్యుల ఆర్థికాభివృద్ధికి ఉపయోగిస్తాం. ఆదాయ మార్గాలను అన్వేషించి, కొత్త వ్యాపారం కోసం త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సంఘ సభ్యులంతా సమావేశమై సమష్టిగా చర్చిస్తాం. – గుర్రాల మహేశ్వరి, అధ్యక్షురాలు, రుద్రమ మండల సమాఖ్య, ముత్తారంబస్సు రావడం సంతోషంగా ఉంది మా మండల సమాఖ్యకు బస్సు రావడం సంతోషంగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొదటి బస్సు మాకే ఇచ్చారు. మండల సమాఖ్య సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్లో బస్సు నిర్వహణ ఖర్చుల విషయం, మాకు వచ్చే ఆదాయం చర్చించి ఏం చేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకుంటాం. మా సంఘంపై నమ్మకంతో బస్సును అందించినందుకు ధన్యవాదాలు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బస్సును అందించి బాసటగా నిలిచారు. – పంచెరుపుల విజయ, అభ్యుదయ మహిళా సంఘం అధ్యక్షురాలు, జయవరం -
‘బోర్డు’ వచ్చినా పెరగని ధర
నేటి మహాధర్నాను విజయవంతం చేయాలిజగిత్యాలఅగ్రికల్చర్: వాణిజ్య పంటలైన మిర్చి.. పత్తి వంటి పంటలకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. కానీ.. పసుపు ధరలు మాత్రం కొన్నేళ్లుగా పాతాళంలోనే ఉంటున్నాయి. పదేళ్లలో కేవలం గతేడాది ఒక్కసారి మురిపించినప్పటికీ.. ఈ ఏ డాది మళ్లీ చతికిలపడింది. చర్మసౌందర్య సాధనా ల్లో.. రంగుల పరిశ్రమల్లో.. ఔషధతయారీలో, ఆహార పరిశ్రమల్లో విరివిగా వాడే పసుపునకు దేశీ యంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటుంది. అయితే ఆ మేరకు ఎగుమతులు లేకపోవడంతో పసుపు పండించిన రైతులకు అనుకున్న స్థాయిలో ధర రావడం లేదు. పసుపు బోర్డు వచ్చినా రైతుల పోరాటాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా రైతులు పసుపునకు గిట్టుబాటు ధర కోసం మంగళవారం మెట్పల్లిలో ఆందోళనకు పిలుపునిచ్చారు. జగిత్యాల, నిజామాబాద్లదే అగ్రస్థానం పసుపు పంట సాగు, ఉత్పత్తిలో జగిత్యాలతోపాటు నిజామాబాద్దే అగ్రస్థానం. రాష్ట్రం మొత్తంగా 1.10 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు 60 వేల ఎకరాల్లో సాగవుతోంది. జిల్లా రైతులు పసుపు పంటను ఇంటిపంటగా భావిస్తుంటారు. ధర ఉన్నా.. లేకున్నా సాగు చేస్తున్నారు. పసుపు 9నెలల పంట కావడంతో ఈ పంటకు వచ్చే ఆదాయంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో బరువైన నేలలు ఉండడం.. అవి పసుపు పంటకు అనుకూలంగా కావడంతో డ్రిప్, సేంద్రియ ఎరువులు వాడుతూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. పసుపు రంగు, నాణ్యత బాగానే ఉన్నప్పటికీ.. ఇక్కడి రైతులు పండించిన పసుపులో కుర్కుమిన్ శాతం తక్కువగా ఉందనే ఒక అపవాదు ఉంది. ఈసారి దిగుబడి అంతంతే.. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉండటంతో పసుపు పంట దెబ్బతింది. ముఖ్యంగా ఎక్కువరోజులపాటు పంటలో నీరు నిల్వ ఉండటంతో పసుపు పంట మొక్కలు చనిపోయాయి. దుంపకుళ్లు రోగం వచ్చి దిగుబడి తగ్గింది. ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనుకుంటే కనీసం 15 నుంచి 20 క్వింటాళ్లు కూడా రాలేదు. ఒక్కో రైతు ఎకరాకు లారీ పశువుల లేదా కోళ్ల ఎరువుకు రూ.30వేల వరకు ఖర్చు పెట్టారు. కలుపుతీత, ఎరువులకు మరో రూ.30 వేలు, పంట తవ్వకం, కొమ్ములు విరవడం, ఉడకబెట్టేందుకు ఇంకో రూ.40వేలు.. ఇలా దాదాపు ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చు పెట్టినా ఆ స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో ధరలు అంతంతే.. గతేడాది పసుపు పంట క్వింటాల్కు రూ.17వేల నుంచి రూ.18వేలు పలికింది. దీంతో ఈ ఏడాది జిల్లాలో మరో 10వేల ఎకరాల సాగు పెరిగింది. పండించిన పసుపును రైతులు నిజామాబాద్, వరంగల్ మార్కెట్లతోపాటు తమిళనాడులోని ఇరోడ్, సేలం, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్కు తీసుకెళ్తుంటారు. అక్కడ ధర క్వింటాల్కు కేవలం రూ.8వేల నుంచి రూ.10 వేలు, మండ పసుపునకు రూ.7వేల నుంచి రూ.8వేలు మాత్రమే పలుకుతోంది. ఫలితంగా పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతల పోరుబాట నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పడినప్పటికీ రైతుల పోరాటాలు మాత్రం ఆగడం లేదు. పసుపు పంటకు క్వింటాల్కు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పసుపు పండించే గ్రామాల్లో వారం రోజులుగా పర్యటించి ఈనెల 11న మెట్పల్లిలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నారు. గతేడాది క్వింటాల్కు రూ.17వేల నుంచి రూ.18వేలు ప్రస్తుతం క్వింటాల్కు రూ.8వేల నుంచి రూ.10వేలు పెట్టుబడులు కూడా నష్టపోతున్న అన్నదాతలు గిట్టుబాటు ధర కోసం ఆందోళనకు రైతుల కార్యాచరణ నేడు మెట్పల్లిలో ధర్నాకు రైతు ఐక్య వేదిక పిలుపు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి: పసుపు పంటకు మద్దతు ధరను ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లను సోమవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటకు వ్యాపారులు చెల్లిస్తున్న ధరపై ఆరా తీశారు. పసుపునకు గిట్టుబాటు ధర అందక రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చే సీజన్లో పసుపు రైతులు కోటీశ్వరులు అవుతారని మాట్లాడిన నాయకులు.. ఇప్పుడు అందుతున్న ధరలపై రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. బోర్డు పేరుతో కేంద్రం రూ.15వేల మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పసుపు రైతులను మోసం చేస్తున్నాయన్నారు. మెట్పల్లిలో పసుపు రైతులు తలపెట్టిన మహాధర్నా విజయవంతం చేయాలని కోరారు. మూడెకరాల్లో సాగు చేశాను మూడెకరాల్లో పసుపు పంట వేశాను. గతేడాది రేటు మంచిగా ఉండే. ఈ ఏడాది అదనంగా మరో ఎకరం ఎక్కువగా వేశాను. దిగుబడి అనుకున్న స్థాయిలోనే వచ్చింది. మార్కెట్ ధర పెరిగిన పెట్టుబడికి ఏ మాత్రమూ గిట్టుబాటు కావడం లేదు. గతేడాదితో పోల్చితే రూ.లక్ష వరకు నష్టం వస్తోంది. – ఏలేటి మహేశ్ రెడ్డి, కొత్తధాంరాజ్పల్లి, మల్లాపూర్ క్వింటాల్కు రూ.15వేలు చెల్లించాలి పసుపు క్వింటాల్కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని కొన్నేళ్లుగా పోరాడుతున్నాం. ధర రానప్పుడు బోర్డు ఏర్పడినా.. ఏం ఉపయోగం లేదు. కష్టానికి తగిన ఫలితం వస్తేనే రానున్న రోజుల్లో సాగు చేస్తారు. రేటు పెరుగుతుందనే ఆశతోనే పసుపును సాగు చేస్తున్నాం. – న్యావనంది లింబారెడ్డి, మల్లాపూర్ -
మహిళలు..
మనీరాణులు!● మండల మహిళా సమాఖ్యలకు 47 బస్సులు ● బస్సుల కొనుగోలుకు రూ.14.10 కోట్లు మంజూరు ● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా జగిత్యాలకే 15 వాహనాలు ● ఏడేళ్లపాటు సమాఖ్యలకు ప్రతీనెల రూ.77వేలు చెల్లించనున్న ఆర్టీసీ ● ఈ ఆదాయంతో సోలార్ ప్లాంట్లు, ఇతర ప్రత్యామ్నాయ వ్యాపారాలు ● ప్రభుత్వ నిర్ణయంతో ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్న మహిళలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాత సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందాయి. ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలవరకు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది. -
గిట్టుబాటు ధర కోసం పోరుబాట
● చలో మెట్పల్లికి పిలుపునిచ్చిన రైతు ఐక్య వేదిక ● ఈనెల 11న మార్కెట్ యార్డు ఎదుట ఆందోళనకోరుట్లరూరల్: పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఆందోళన చేపట్టనున్నారు. మెట్పల్లి మార్కెట్ యార్డు ముందు ధర్నా చేపట్టి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈనెల 11న శ్రీచలో మెట్పల్లిశ్రీ పేరుతో ఆందోళనకు రైతులు పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకుడు, రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో పసుపు కల్లాల వద్ద రైతులను కలిసి మద్దతు కోరారు. కేంద్రప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ మద్దతు ధర కల్పించటం లేదని, ధర తక్కువగా ఉండడంతో పంట పండించిన రైతులకు నష్టాలే మిగులుతున్నాయ ని వివరిస్తున్నారు. గతేడాదితో పోల్చితే పసుపు పంటకు ఈ సారి తక్కువ ధర ఉండటం రైతుల ను ఆందోళన కలిగిస్తోంది. పసుపు బోర్డు ఏర్పా టు సమయంలో సంబరాలు జరుపుకున్న రైతులు.. మద్దతు ధర కల్పించకపోవటంతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్ హయాంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ద్వారా పసుపు పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేశారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పసుపు పంటకు ఆశించిన ధర లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహ న్ రెడ్డి కూడా ఈ పథకం ద్వారా ప్రభుత్వమే కొ నుగోళ్లు చేపట్టారని రైతు నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే పథకాన్ని వర్తింపజే సి రాష్ట్రంలో పసుపు క్వింటాల్కు కనీసం రూ.15 వేలు చె ల్లిస్తూ.. ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పలువురు రైతు సంఘ నాయకులు కోరుట్ల మండలంలోని వెంకటాపూర్, చిన్నమెట్పల్లి, జోగిన్పల్లి గ్రామాల్లో పసుపు రైతులను కలిసి మద్దతు కోరారు. మెట్పల్లిలో ని ర్వహించే ధర్నాకు తరలిరావాలని పిలుపుని చ్చా రు. కార్యక్రమంలో వెంకటాపూర్ మాజీ స ర్పంచ్ తోట లింగారెడ్డి, దాగె వెంకటేష్, దాగె గంగాదర్, మహేష్, లక్ష్మారెడ్డి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
కమనీయం శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
సారంగాపూర్:మండలంలోని దుబ్బరాజన్న ఆలయం ఆవరణలో శ్రీవేంకటేశ్వరస్వామి, అలివేలుమంగ, పద్మావతిదేవి కల్యాణాన్ని ఆలయ అర్చకులు ఆదివారం కనులపండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు మంగళవాయిద్యాల మధ్య శోభాయాత్ర చేపట్టారు. పెంబట్ల, కోనాపూర్, పోచంపేట గ్రామాల నుంచి మహిళలు 108 కలశాలను కల్యాణం కోసం తీసుకొచ్చారు. ఆలయ ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకరయ్య, విండో చైర్మన్ గుర్నాథం మల్లారెడ్డి, నాయకులు కోండ్ర రాంచంద్రారెడ్డి, తోడేటి శేఖర్గౌడ్, వాసం శ్రీనివాస్, పంగ కిష్టయ్య, తోడేటి గోపాల్కిషన్, కాలగిరి బాపురెడ్డి, కొంగరి లింగరెడ్డి, బొక్కల సునిత, భక్తులు పాల్గొన్నారు. -
ఆగని అవినీతి దందా
● ఏసీబీకి చిక్కుతున్న లంచావతారులు ● పట్టుబడుతున్నా కనిపించని మార్పు ● మున్సిపాలిటీల్లో అభివృద్ధికి ఆటంకం ● తాజాగా పట్టుబడిన ధర్మపురి కమిషనర్ ● ఇన్చార్జి కమిషనర్లతోనే నెట్టుకొస్తున్న బల్దియాలుజగిత్యాల: జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారుల అవినీతికి అంతులేకుండా పోతోంది. ప్రతిపనికీ లంచం డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫలితంగా బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తూ అవినీతి అధికారులను పట్టిస్తున్నారు. అయినా లంచావతారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. తాజాగా జిల్లాలోని ధర్మపురి మున్సిపల్ కమిషన్ శ్రీనివాస్ ఓ ఉద్యోగికి వేతనం చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కాడు. ఒప్పంద కార్మికులకు సంబంధించి వేతనాల చెల్లింపునకు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు వల పన్ని శ్రీనివాస్ను పట్టుకున్నారు. అదేరోజు కోరుట్ల కమిషనర్ తిరుపతిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల మున్సిపల్ సిబ్బంది చేపట్టిన సర్వే వేతనాలు చెల్లించకపోవడం.. పన్ను వసూళ్లలో వెనుకబడి ఉండటంతో అతడిపై వేటు వేశారు. ఇలా ప్రతి మున్సిపాలిటీలో ఏదో సంఘటన చోటుచేసుకుంటోంది. కమిషనర్లు ఏదో కేసులో ఇరుక్కోవడం, ఇక్కడి నుంచి బదిలీ లేదా సస్పెండ్ కావడం, ఏసీబీ వలలో చిక్కడంతో ఇన్చార్జిలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. అవినీతి ఆగేదెన్నడో.. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా శానిటేషన్, రెవెన్యూ విభాగాలతోపాటు టౌన్ప్లానింగ్ శాఖలో అమ్యమ్యాలు ఇస్తేనే పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల టౌన్ప్లానింగ్ విభాగంలో పనిచేసిన టీపీవో గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ ఘటనలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి హస్తం ఉండటంతో ఇద్దరూ సస్పెన్షన్ అయ్యారు. టౌన్ప్లానింగ్లో అత్యధికంగా అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. టౌన్ప్లానింగ్ విభాగంలో ఇంటి అనుమతులకు ఎక్కువగా అమ్యామ్యాలు ముడితేనే ఇస్తున్నారని ఆరోపణలు ఉండగా.. శానిటేషన్ విభాగంలో పారిశుధ్య కార్మికులకు సంబంధించిన పరికరాల కొనుగోలులో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ విభాగంలో ముటేషన్లు చేపట్టడానికి ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతున్నట్లు అన్ని మున్సిపాలిటీల్లో ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. -
జగిత్యాల
న్యూస్రీల్7పోచమ్మతల్లికి బోనాలుమల్లాపూర్: మండలంలోని కొత్తదాంరాజుపల్లిలో శ్రీరేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మతల్లికి బోనాలు సమర్పించారు. మాజీ ఎంపీపీలు కాటిపెల్లి సరోజన, బద్దం విజయ, మాజీ సర్పంచులు బద్దం సరిత, గజ్జి గంగారెడ్డి, ఉత్కం హన్మాంతుగౌడ్, మాజీ ఎంపీటీసీ మెండు గంగారెడ్డి, గౌడ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025 -
వన్యప్రాణుల దాహం తీర్చేలా
● అడవుల్లో 140 సాసర్పిట్స్ ఏర్పాటు ● మూడు సోలార్ బోర్ల నిర్మాణం ● అడవినుంచి బయటకు రాకుండా..జగిత్యాలక్రైం: అడవుల్లోని వన్యప్రాణులు వేసవిలో నీటి కోసం తపిస్తున్నాయి. ఈ క్రమంలో అటవీప్రాంతం నుంచి బయటకు వస్తుండటంతో కుక్కలు, వేటగాళ్ల బారిన పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తు బావుల్లో పడి మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వాటికి అడవుల్లోనే నిత్యం నీటిని అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలోని ఐదు రేంజ్ల పరిధిలో 53 వేల హెక్టార్లలో అటవీ విస్తరించి ఉంది. ఈ అడవుల్లో ఉండే వన్యప్రాణులు వేసవికాలంలో నీటికోసం బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. 140 సాసర్పిట్స్ నిర్మాణం జిల్లావ్యాప్తంగా గతంలో ఉన్నవాటితోపాటు నీటి నిలవ పెంచేందుకు మొత్తం 140 సాసర్పిట్స్, సర్కులేషన్ ట్యాంకుల నిర్మించారు. ట్యాంకర్ల ద్వారా అక్కడున్న నీటి వసతి ద్వారా సాసర్పిట్స్ నింపుతున్నారు. నీటి నిల్వ పెంచుతున్న చెక్డ్యామ్లు జిల్లాలోని అడవుల్లో భూగర్భజలాలు పెంచేందుకు ఇప్పటికే 47 చెక్డ్యామ్లను నిర్మించారు. వీటితోపాటు 112 నీటి కుంటలున్నాయి. వర్షం నీరు వృథాగా పోకుండా అడ్డుకట్ట వేసి చెక్డ్యామ్లు, నీటి కుంటల్లో నీరు నిల్వ చేస్తున్నారు. ఆ నీటిని వన్యప్రాణులు తాగుతూ దాహార్తి తీర్చుకుంటున్నాయి. మరోవైపు అడవుల్లో భూగర్భజలాలు కూడా పైకి వస్తున్నాయి. ఫలితంగా చెట్లు కూడా విస్తారంగా పెరిగేందుకు దోహదపడుతున్నాయి. మూడు సోలార్ బోర్లు అటవీప్రాంతంలో మూడు సోలార్ బోర్లు ఏర్పాటు చేశారు. అందులో లభించే నీటి ఆధారంగా ప్రస్తుతం మరికొన్ని బోర్లు వేసేందుకు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు సోలార్ బోర్లు ఏర్పాటు చేశారు. వీటికి సోలార్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు.. అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులకు వేసవి దృష్ట్యా నీటి వసతులు కల్పించాం. వన్యప్రాణులు బయటకు రావడంతో ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా నీటి వసతి కల్పించి వాటి దాహార్తి తీర్చేలా చర్యలు చేపట్టాం. – రవిప్రసాద్, జిల్లా అటవీశాఖ అధికారి -
లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం
జగిత్యాలజోన్: లోక్అదాలత్ల ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. నీలిమ అన్నారు. జిల్లాకోర్టులో శనివారం మెగా లోక్అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కక్షలతో సాధించేది ఏమీ లేదని, మానసిక ప్రశాంతతతో జీవించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నేరమయ జీవితానికి అలవాటు పడవద్దని, కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ.. కేసులతో విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జగిత్యాలరూరల్ మండలంలో చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదం కేసులో నష్టపరిహారంగా ఇన్సూరెన్సు సంస్థ నుంచి రూ.9లక్షల పరిహారాన్ని ఇప్పించారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురిలోని కోర్టుల్లో మొత్తంగా 1624 కేసులు పరిష్కరించారు. జిల్లా కేంద్రంలో ఐదు లోక్అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో జడ్జి నీలిమ, మొదటి అదనపు కోర్టులో జడ్జి నారాయణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి శ్రీనిజ, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జి జితేందర్, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జి వినీల్ కుమార్ కేసులను పరిష్కరించారు. బార్ అసోసియేషన్ జగిత్యాల అధ్యక్షుడు డబ్బు లక్ష్మారెడ్డి, లీగల్ ఎయిడ్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విజయ్కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ జిల్లావ్యాప్తంగా 1,624 కేసులు పరిష్కారం రూ.1.42 కోట్ల విలువైన పరిహారం అందజేత -
మహిళలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలి
మెట్పల్లి: మహిళలు తమకు ఎదురవుతున్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలని మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు అన్నారు. పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మేజిస్ట్రేట్ మాట్లాడారు. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అదే సమయంలో వారిపై ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టాలున్నాయని, వాటిపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు మహిళా న్యాయవాదులను సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ తదితరులున్నారు. మహిళలు హక్కులను వినియోగించుకోవాలి ● అదనపు కలెక్టర్ లత జగిత్యాల: మహిళలు తమ హక్కులను సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఆమె మున్సిపల్ ఉద్యోగులు సన్మానించారు. ప్రతి మహిళ రాణి రుద్రమదేవి, సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవా లన్నారు. ప్రతి ఒక్కటి చేయగలుగుతామనే నమ్మకంతో ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి ధర్మపురి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీచర్స్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి అన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామిని శనివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్రెడ్డి, ఏంఈవో సీతామహాలక్ష్మి, రాష్ట్ర నాయకులు గజభీంకార్ గోవర్దన్, జిల్లా, మండలి బాఽ ద్యులు, నాయకులు దినేష్ తదితరులున్నారు. పది నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం జగిత్యాల: జిల్లాకేంద్రంలో ఈనెల 10వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ సంస్కృతం సబ్జెక్ట్కు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని ఇంటర్ నోడల్ అధికారి నారాయణ తెలిపారు. ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందని, సంస్కృతం అధ్యాపకులు ఈనెల 10న ఉదయం 10 గంటలకు అపాయింట్మెంట్ ఆర్డర్తో రావాలని, అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ రిపోర్ట్ చేయాలని తెలిపారు. మూల్యాంకణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పేర్కొన్నారు. పసుపు రైతు మహాధర్నాను విజయవంతం చేయాలికోరుట్ల రూరల్/ఇబ్రహీంపట్నం: పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న మెట్పల్లి మార్కెట్ యార్డు వద్ద నిర్వహించే పసుపు రైతుల మహా ధర్నా విజయవంతం చేయాలని రైతు ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కోరట్ల మండలంలోని ఐలాపూర్, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రైతు ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ పసుపు క్వింటాలుకు రూ. 15000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల రమేశ్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, తెలంగాణా జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి, పిడుగు సందయ్య పాల్గొన్నారు. -
మహిళా సాధికారికతోనే సమాజ అభివృద్ధి
జగిత్యాలక్రైం: మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో మహిళలను సన్మానించారు. విధి నిర్వహణలో రాణించిన మహిళా పోలీస్ సిబ్బందికి బహుమతులు ప్రదానం చేశారు. మహిళల్లో సంకల్పశక్తి ఎక్కువని, అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని తెలిపారు. పోలీసు శాఖలో పలు విభాగాల్లో మహిళా అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని వివరించారు. గృహ హింస, వైవాహిక వివాదాల్లో బాధిత మహిళలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు రఘుచందర్, రాములు, మహిళా ఎస్సైలు గీత, సుప్రియ, రిజర్వ్ సీఐలు కిరణ్ కుమార్, వేణు, సీఐలు ఆరిఫ్ అలీఖాన్, జిల్లా పరిధిలోని వివిధ విభాగాల మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డ్స్ పాల్గొన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం -
కాంగ్రెస్వి మోసపూరిత హామీలు
● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత జగిత్యాలరూరల్: ఎన్నికల సమయంలో మహిళలకు కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చడంలో ఇప్పుడు విఫలమైందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జగిత్యాలరూరల్ మండలం వెల్దుర్తిలో మహిళలతో కలిసి వేడుకలు నిర్వహించారు. బంధాలు, బాధ్యతల కోసం తల్లిగా, గృహిణిగా అన్ని రంగాల్లో మహిళలు అందించే సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. అలాంటి సీ్త్రమూర్తులందరినీ గౌరవించేలా మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన మోసపూరిత హామీలపై, స్థానిక ఎమ్మెల్యేకు ఓటు వేసి గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మహిళలు చెంపలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. -
సమయం లేదు మిత్రమా..!
జగిత్యాల: బల్దియాల్లో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ వేగం అందుకోలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు సమయం సమీపిస్తున్నా.. ఇంకా కొన్ని బల్దియాల్లో లక్ష్యాన్ని మాత్రం చేరడం లేదు. వాస్తవానికి మున్సిపాలిటీల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలైతే ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్స్ కింద ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. గతేడాది కోరుట్ల మున్సిపాలిటీ 100 శాతం సాధించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో అవార్డు కూడా అందుకుంది. ఎప్పటిలాగే ఇప్పడు కూడా కోరుట్ల బల్దియా 76.45 శాతంతో ముందంజలో ఉంది. అలాగే మెట్పల్లి 73.25శాతం, రాయికల్ 69.73, ధర్మపురి 53.49శాతం వసూలు చేసింది. జిల్లాకేంద్రమైన జగిత్యాలలో మాత్రం కేవలం 52 శాతం వసూలుతో చాలా వెనుకబడిపోయింది. దీంతో స్పెషల్ గ్రాంట్ నిధులు రాక అభివృద్ధి కుంటుపడుతోంది. బకాయిదారులకు రెడ్ నోటీసులు జిల్లాలో చాలారోజులుగా పెండింగ్లో ఉన్న బకాయిదారులకు అధికారులు రెడ్నోటీసులు జారీ చేస్తున్నారు. మూడుసార్లు నోటీసులు జారీ చేసిన అనంతరం ఆస్తిపన్ను చెల్లించనివారి ఆస్తి జప్తు చేసుకుంటారు. జగిత్యాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు 100 మందికి రెడ్ నోటీసులు జారీ చేశారు. గతంలో బకాయి పడిన వారి ఇంటి ముందు డప్పు చాటింపు చేసి వినూత్న రీతిలో సైతం వసూలు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 32 బృందాలను ఏర్పాటు చేసి వసూలు చేస్తున్నా ఆస్తిపన్ను వసూళ్లలో మాత్రం జగిత్యాల వెనుకబడే ఉంది. అభివృద్ధికి ఆటంకం వందశాతం ఆస్తిపన్ను వసూలైతే ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంది. ఆ నిధుల ద్వారా అభివృద్ధి చేసుకునే పరిస్థితి నెలకొంటుంది. కానీ ప్రజలు ఆస్తిపన్ను చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గతంలో పట్టణ ప్రగతి నిధులు రాగా సుందరీకరణ పనులు, రోడ్లు, ఉద్యానవనాలు అభివృద్ధి చేశారు. అధికారులు స్పందించి పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు సహకరించాలి జిల్లాకేంద్రంలో ఆస్తిపన్ను చెల్లించని 100 మందికి ఇప్పటికే రెడ్నోటీసులు జారీ చేశాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు వందశాతం వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు సహకరించాలి. మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలి. ఆస్తిపన్ను కట్టకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. – చిరంజీవి, మున్సిపల్ కమిషనర్జిల్లాలోని బల్దియాల్లో పన్నుల డిమాండ్, బకాయిలు, వసూళ్లు (రూ.లక్షల్లో) మున్సిపాలిటీ డిమాండ్ ఏరియర్స్ మొత్తం వసూలు బ్యాలెన్స్ శాతం జగిత్యాల 737.79 563.82 1301.61 624.66 624.66 52.01కోరుట్ల 446.36 38.68 505.04 388.02 119.55 76.45మెట్పల్లి 359.88 35.79 395.67 288.54 105.37 73.25రాయికల్ 109.35 21.58 130.93 92.19 40.02 69.73ధర్మపురి 96.28 49.98 146.25 72.13 62.72 53.49మొత్తం 1769.66 709.84 2479.50 1517.83 952.32 61.45సకాలంలో పన్నులు చెల్లించాలి కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని, లేకుంటే ఆస్తులు సీజ్ చేస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు భవన సముదాయాలను సందర్శించి యజమానులకు నోటీసులు జారీ చేయించారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం ఆస్తిపన్ను 1355.07 లక్షలు ఉండగా.. ఇప్పటివరకు రూ.699.80 లక్షలు మాత్రమే వసూలు అయిందన్నారు. ఆస్తిపన్ను సకాలంలో చెల్లించకుంటే నోటీసులు జారీ చేసి పురపాలక సంఘం చట్టం 2019 ప్రకారం సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, రెవెన్యూ ఆఫీసర్ కనకయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపాల్ ఉన్నారు. త్వరలో ముగియనున్న ఆర్థిక సంవత్సరం బల్దియాల్లో ముందుకు కదలని పన్ను వసూళ్లు ఇప్పటివరకు 61.45 శాతమే పూర్తి 76.45శాతంతో ముందంజలో కోరుట్ల 52.01 శాతంతో వెనుకబడిన జగిత్యాల