కీలక పోస్టులు ఖాళీ | - | Sakshi
Sakshi News home page

కీలక పోస్టులు ఖాళీ

Mar 5 2026 7:38 AM | Updated on Mar 5 2026 7:38 AM

● శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన మహేశ్వర్‌రెడ్డి ఇటీవల కమిషనర్‌గా పదోన్నతి పొంది రామగుండంకు బదిలీ అయ్యారు. ● ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ● ఇటీవలే ఆ సెక్షన్‌లో ఉన్న ఓ మహిళా ఉద్యోగికి శాని టరీ ఇన్‌స్పెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు తెలిసింది. ● మేనేజర్‌ పోస్ట్‌ గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. ఆ స్థానంలో ఎవరూ లేకపోవడంతో వివిధ పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ● రెవెన్యూ శాఖలో పనిచేసే ఆర్వో గతంలో ఓ కేసులో అరెస్టయి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇన్‌చార్జి ఆర్వోనే కొనసాగుతున్నారు. ●ఫలితంగా ముటేషన్లు, రెవెన్యూకు సంబంధించిన పనులన్నీ పెండింగ్‌లోనే ఉన్న ట్లు తెలుస్తోంది. ● పూర్తిస్థాయి అధికారులు లేక.. ఇన్‌చార్జిలతో కా లం వెళ్లదీయడంతో పనులు ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో టీపీవో, ఇద్దరు టీపీఎస్‌లు, ముగ్గురు బీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ● టీపీవోకు ధర్మపురి మున్సిపాలిటీ ఇన్‌చార్జి ఇచ్చారు. ● టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఇద్దరు టీపీఎస్‌, బీఐలు లేకపోవడంతో ఇంటి అనుమతులు, అసెస్మెంట్ల విషయంలో జాప్యం జరుగుతోంది. ● ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్‌ స్పందనకు ఇటీవల మెట్‌పల్లి కమిషనర్‌గా ఇన్‌చార్జి ఇచ్చారు. ● రెవెన్యూ విభాగంలో గతంలో ఆర్వోలు ఉన్నప్పటికీ వివిధ కేసుల్లో ఇరుక్కోవడంతో పూర్తిస్థాయి ఆర్వోలు రావడం లేదు.

కుంటుపడుతున్న బల్దియా అభివృద్ధి అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి పట్టని ప్రజాప్రతినిధులు, అధికారులు భర్తీ కోసం మున్సిపల్‌ డైరెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

జగిత్యాల: జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో కీలకపోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఐదేళ్లకోమారు ప్రజాప్రతినిధులు, బదిలీపై అధికారులు మారుతున్నా.. పోస్టులు మాత్రం భర్తీకి నోచుకోవడం లేదు. ఫలితంగా బల్దియా అభివృద్ధి కుంటుపడుతోంది. ఖాళీ పోస్టుల ప్రభావం ముఖ్యంగా శానిటేషన్‌పై ప్రభావం చూపుతోంది. పట్టణంలో ఎక్కడ చూసినా శానిటేషన్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

భర్తీకి ప్రతిపాదనలు

బల్దియాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేసే లా చూడాలని కమిషనర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఆలస్యమవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి జగిత్యా ల మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో నియమించి అభివృద్ధికి తోడ్పడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటిలో కీలకమైన పోస్టులు ఖా ళీగా ఉండడంతో అభివృద్ధి పనులు ముందుకు కదలడం లేదని భావించిన ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మున్సిపల్‌ డైరెక్టర్‌ అధికారులతో మాట్లాడారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

పోస్టులు ఖాళీగా ఉండడంతో జిల్లాకేంద్రంలో శానిటేషన్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లేకపోవడంతో పర్యవేక్షించేవారు కరువై రోడ్లన్నీ డంపింగ్‌యార్డులుగా దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీలను వారంలో ఒకసారి కూడా తీయడం లేదు. మురికి కాలువలన్నీ సిల్ట్‌తో నిండి నీరంతా బయటకు వచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను నియమించి ఆ వ్యవస్థను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

శానిటేషన్‌ అస్తవ్యస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement