breaking news
Jagitial District News
-
డ్యూటీలో పోలీస్ కపుల్స్
భార్యాభర్తలిద్దరూ పోలీసు అధికారులే. ఇద్దరికీ ఒకేచోట ఎలక్షన్ డ్యూటీ. అయితే, ఇద్దరం కలిసి ఎన్నికల విధులు నిర్వర్తించడం మరిచిపోలేని అనుభూతి అని వారిద్దరూ సరదాగా చెప్పారు. పెద్దపల్లి రూరల్ ఎస్సైగా మల్లేశ్, మహిళా ఠాణా ఎస్సైగా రాజమణికి పెద్దపల్లి మున్సిపల్ కౌంటింగ్ విధులు కేటాయించారు. పోలీస్కపుల్స్ కావడంతో పోలీసు అధికారులు అందరూ విధుల్లో ఉన్న దంపతులను చూసి స్వీట్ మెమోరీ అని అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు
నా భర్త గెలుపు కోసం వెన్నంటే ఉండి పోరాటం చేశానని, ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వాడజనం మా ఆయనను గెలిపించారని.. భర్త విజయం సాధించిన వార్త విని పరుగులతో వచ్చింది భార్య. ఆ క్షణం భర్త గుండైపె వాలి ఆనందంతో ఏడ్వసాగింది. తల్లి సైతం గారాల కొడుకును చూసి ముద్దులు ెపెడుతూ కన్నీరుతెచ్చుకుంది. ఈసన్నివేశం చూస్తూ గెలిచిన అభ్యర్థులంతా ఒక్కసారిగా వారి ప్రేమను చూస్తూ ఉండిపోయారు. పెద్దపల్లి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి పాగాల శ్రీకాంత్ గెలుపుతో తల్లి, భార్య, కూతురు, బంధువులు, కాలనీవాసుల ఆనందం ఆకాశాన్నంటింది. కౌంటింగ్ కేంద్రం బయట ఒకరికొకరు తమ మద్దతుదారులు గెలిచారంటూ సంబురాల్లో మునిగిపోయారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
టికెట్ దక్కకున్నా.. ప్రజామోదం దక్కింది..
జగిత్యాలటౌన్: టికెట్ దక్కకపోయినా ప్రజామోదం మాత్రం దక్కింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయాలు వెలువడ్డాయి. 22వ వార్డులో బీజేపీ టికెట్ ఆశించిన అరవ లక్ష్మి(బిట్టు)కి టికెట్ రాకపోవడంతో.. పార్టీ నాయకులకు ఫోన్ చేసిన లక్ష్మి కుమారుడు బోరున విలపించాడు. అనంతరం లక్ష్మి రెబల్గా బరిలోకి దిగారు. స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఘన విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 26వ వార్డులో బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమకు చివరి నిమిషంలో టికెట్ దక్కక తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె కుమారుడు శ్రీధర్ బోరున విలపిస్తూ పార్టీ నేతలకు ఫోన్ చేసి తానేం పాపం చేశానని నిలదీశాడు. రెబల్గా బరిలోకి దిగి ప్రజామోదంతో గెలుపొందారు. తల్లులకు టికెట్లు రాక ఆవేదనకు లోనైన వారి కుమారులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఇద్దరూ ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించడం జగిత్యాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ టికెట్ కంటే ప్రజాభిమానమే గొప్పదని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయని చర్చించుకుంటున్నారు. -
‘సింహం’ గెలుపు
గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్ల ఫలితాలు ఒక ఎత్తయితే.. 59వ డివిజన్ ఫలితం ఆద్యంతం ఉత్కంఠభరితంగా అభ్యర్థులను టెన్షన్ పెట్టించింది. డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖాజ సనా, సింహం గుర్తుపై బాలసాని తిరుపతి పోటీ చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగింది. మొదటిసారి లెక్కింపులో బాలసాని తిరుపతికి రెండు ఓట్ల లీడింగ్ వచ్చింది. ఈక్రమంలో గెలుపు ప్రకటించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. అయితే తిరిగి లెక్కించాలని నిర్ణయించారు. అయితే అదే ఫలితం రావడంతో.. తిరస్కరణకు గురైన నాలుగు ఓట్లను పరిశీలించారు. అందులో రెండు పరిగణలోకి తీసుకోవాలని ఖాజ సనా కోరారు. అయితే ఎన్నికల అబ్వర్వర్ వద్దకు పంచాయితీ వెళ్లింది. తిరస్కరణకు గురైన ఓట్లు సరిగానే ఉన్నాయని గుర్తించి.. బాలసాని తిరుపతి రెండు ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గతంలో 39వ డివిజన్లో జెట్టి జ్యోతి ఒక్క ఓటుతో మోహన్ అనే అభ్యర్థిపై విజయం సాధించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ కాంగ్రెస్దే జోరు
● సుల్తానాబాద్లో రెండు ఓట్లు తిరస్కరణ సాక్షి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లు సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పడ్డాయి. రామగుండం కార్పొరేషన్లో 467 ఓట్లకు 220 కాంగ్రెస్కు, 92 బీఆర్ఎస్కు, 46 బీజేపీకి పడ్డాయి. సింహానికి 45,ీ ససీపీఐకి 2, జనసేనకు 3, స్వతంత్రులకు 31 ఓట్లు పడ్డాయి. 28 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 65 ఓట్లు పోలవ్వగా, అందులో రెండు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 63 ఓట్లలో కాంగ్రెస్కు 31, బీఆర్ఎస్కు 14, బీజేపీకి 07, ఏఐఎఫ్బీకి 7, ఇండిపెండెంట్లకు 4 ఓట్లు పడ్డాయి. పెద్దపల్లిలో మొత్తం 215 ఓట్లలో కాంగ్రెస్కు 133, బీఆర్ఎస్కు 34, బీజేపీకి 19, ఇతరులకు 29 ఓట్లు పడ్డాయి. మంథనిలో 49 ఓట్లకు కాంగ్రెస్కు 30, బీఆర్ఎస్కు 12, ఏఐఎఫ్బీకి 2, ఇండిపెండెంట్లకు 5 ఓట్లు పడ్డాయి. నోటాకు 847.. సాక్షి పెద్దపల్లి: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి మద్దతు తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు. దేశంలో నిర్బంధ ఓటింగ్ వ్యవస్థ లేదు. దీంత వివిధ కారణాలతో చాలామంది ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతోంది. దీంతో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు నోటా (నన్ ఆఫ్ ది ఎబౌట్)ను తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. దీంతో రామగుండం కార్పొరేషన్లో 736 మంది, మంథనిలో 34మంది, పెద్దపల్లిలో 77మంది నోటాను వినియోగించుకున్నారు. సుల్తానాబాద్లో ఒక్కరు కూడా నోటాహక్కు వినియోగించుకోలేదు. పెద్దపల్లిలో ఒక ఓటరు పోస్టల్ బ్యాలెట్లో నోటాకు ఓటు వేయడం గమనార్హం. చెల్లని ఓట్లు 1,640 సాక్షి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పలువురు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో విఫలమయ్యారు. బ్యాలెట్ పత్రంలో సరైన విధంగా స్వస్తిక్ సింబల్ వేయకపోవడం, ఓటువేసిన వారు తప్పుగా మలచటం తదితర కారణాలతో రామగుండం కార్పొరేషన్లో 1,163 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. పెద్దపల్లిలో 288, సుల్తానాబాద్లో 101, మంథనిలో 88 ఓట్లు మొత్తంగా 1,640 ఓట్లు చెల్లకుండా పోయాయి. -
భార్యాభర్తలిద్దరూ..
గోదావరిఖని: ఒక్కరు పోటీలో ఉంటేనే ఇంటిల్లిపాది ప్రచారం చేసి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది రెండు డివిజన్లలో.. అదీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి భార్యాభర్తలిద్దరూ కార్పొరేటర్లుగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. 58వ డివిజన్లో బీఆర్ఎస్ నుంచి మేకల సమ్మయ్య కాంగ్రెస్ అభ్యర్థి మేకల హరికృష్ణపై 362 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 60వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మేకల శారద కాంగ్రెస్ అభ్యర్థి మోతిపాటి స్వప్నపై 89 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. నాడు భర్త.. నేడు భార్యరాయికల్: రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో నాడు భర్త తురగ శ్రీధర్రెడ్డి 4వ వార్డు కౌన్సిలర్గా ఎన్నిక కాగా.. ఆయన భార్య తురగ సౌజన్య శుక్రవారం అదే వార్డు నుంచి సురతాని భాగ్యలక్ష్మిపై విజయం సాధించారు. -
అక్క గెలుపు.. తమ్ముడు ఓటమి
యైటింక్లయిన్కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ పరిధి వెంకట్రావుపల్లి 15వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బుర్ర శశికళ–ముత్యాలగౌడ్ విజయం సాధించారు. ఆమె తమ్ముడు దాసరి శ్రీనివాస్ 18వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థిపై 376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. హ్యాట్రిక్ విజయంమెట్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 18వ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీలో నిలిచిన చెట్లపల్లి మీనా వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2014, 2020 ఎన్నికల్లో కూడా మీనా ఈ వార్డు నుంచి గెలుపొందారు. ప్రస్తుతం మరోమారు విజయం పొంది మున్సిపల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి కౌన్సిలర్గా రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో 10 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ ముందంజ వేసింది. మీనా ఆ పార్టీ నుంచి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మూడుసార్లు..జగిత్యాల: జగిత్యాల 21వ వార్డు కౌన్సిలర్ సిరికొండ పద్మ హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. గతంలో బీఆర్ఎస్ నుంచి 3వ వార్డులో పోటీ చేసి గెలుపొందగా.. రెండోసారి బీఆర్ఎస్ తరఫునే 17వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి 21వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ విజయం పొందారు. కోరుట్ల విశేషాలు..కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని 31వ వార్డులో పోటీ చేసిన ఓ స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు రాలేదు. ఒక్క ఓటు.. పట్టణంలోని 32, 24, 17, 12 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది. వీరు తమ ఓటు తాము వేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అత్యధిక మెజార్టీ.. పట్టణంలోని 25 వార్డులో బీజేపీ అభ్యర్థి కలాల రాధకు అత్యధిక మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ కవితపై 660 ఓట్ల మెజార్టీ వచ్చింది. అత్యల్పంగా 3వ వార్డు అభ్యర్థి మోర్తాడ్ లక్ష్మీనారాయణ 11 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి దొబ్బల వెంకటేశ్ రెండో స్థానంలో నిలిచారు. భార్య గెలుపు.. భర్త ఓటమి గత మున్సిపల్ ఎన్నికల్లో 10, 11 వార్డుల్లో పోటీ చేసిన దాసరి రాజశేఖర్–సునీత దంపతుల్లో రాజశేఖర్ ఓటమిపాలు కాగా.. సునీత గెలిచింది. ఈసారి కూడా రాజశేఖర్ పరాజయం పాలవ్వగా.. సునీత విజయం సాధించింది. పెళ్లి కాని కౌన్సిలర్ 28వ వార్డులో కొక్కెర వెంకటేశ్ బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. ఈయనకు 25 ఏళ్లు. పెళ్లి కాలేదు. -
అమ్మా.. నీకే అంకితం..
రాయికల్: రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డులో 70 ఏళ్ల మచ్చ గంగలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుంచి 223 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోలింగ్ కేంద్రంలో కుమారుడు శేఖర్ ఆమె కాళ్లకు దండం పెడుతూ.. ఈ గెలుపు నీకు అంకితమనడం అందరి హృదయాలను కదిలించింది. వరుస గెలుపులుహుజూరాబాద్: మేజర్ గ్రామ పంచాయతీ హుజూరాబాద్ మున్సిపల్గా ఏర్పాటైన నుంచి పట్టణంలోని సూపర్బజార్ ఏరియా 26 వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్య–నర్సింహారెడ్డి వరసగా 2006, 2014, 2020, 2026 మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. డిపాజిట్ దక్కని మాజీ చైర్మన్రాయికల్: రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు 7వ వార్డులో పోటీ చేయగా.. డిపాజిట్ సైతం దక్కలేదు. బీఆర్ఎస్కు చెందిన ఎలిగేటి లలితకు 565 ఓట్లు రాగా.. మోర హన్మండ్లుకు 109, బీజేపీ అభ్యర్థి సామాల్ల రాజేశంకు 36, కోన రాజుకు 46 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాయికల్లో అత్యధికం.. 702 ఓట్లురాయికల్: రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల్లో 4వ వార్డు కౌన్సిలర్ తురగ సౌజన్యకు అత్యధికంగా 702 ఓట్లు రాగా.. అత్యల్పంగా 8వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి మ్యాకల జనార్దన్కు కేవలం 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ ఓటమి రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఓటమి పాలయ్యారు. 7వ వార్డులో మోర హన్మండ్లు ఎలిగేటి లతికపై, 9వ వార్డులో రమాదేవి బత్తిని మహేశ్వరిపై పరాజయం పాలయ్యారు. అంతస్తు ముందు.. అభిమానం నెగ్గిందిసిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో అంతస్తుల ముందు అభిమానం గెలిచింది. కార్మిక క్షేత్రం సిరిసిల్లలోని 33వ వార్డులో బీజేపీ నుంచి పోటీ చేసిన కొండ వర్షిణి దంపతులకు ఉండడానికి భవనం లేదు. భర్త నరేశ్కు పెద్దల నుంచి వచ్చిన పది సాంచాలను నడిపిస్తూ సాధారణ జీవితం సాగిస్తున్నారు. చాలా ఏళ్లుగా బీజేపీకి విధేయంగా పని చేస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి అండదండలు లేవు. వీరి సేవలను గుర్తించి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థి దార అశోక్పై 67 ఓట్ల మెజార్టీతో వర్షిణి గెలిచారు. ఈ విషయం సిరిసిల్లలో హాట్ టాపిక్గా మారింది. -
ఓటమెరగని నేత..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మేజర్ పంచాయతీకి మూడుసార్లు వార్డు సభ్యుడిగా.. ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిలర్గా.. ఇప్పుడు మూడోసారి ఎన్నికై నూగిల్ల మల్లయ్య ఓటమి ఎరగని నేతగా నిలిచారు. 2014 ఎన్నికల్లో కౌన్సిలర్గా ఎన్నికయ్యాక హంగ్ ఏర్పడింది. అనూహ్య పరిణామాల మధ్య మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి నూగిల్ల మల్లయ్యనే వరించింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో తాను గతంలో ఎన్నికై న వార్డు నుంచి రిజర్వేషన్ కలిసి రాక 21వ వార్డులో పోటీ చేసి విజయం సాధించారు. ఆ వార్డులో గెలిస్తే చైర్పర్సన్! పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వార్డుగా 21వ వార్డు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే.. ఈ వార్డు నుంచి గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్ మమతారెడ్డి చైర్పర్సన్గా వ్యవహరించారు. ఈసారి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి అంటూ నూగిల్ల మల్లయ్య పేరును ఎమ్మెల్యే విజయరమణారావు ప్రకటించారు. దీంతో ఆయన కూడా 21వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. -
నాలుగోసారి..
జగిత్యాల: గత మూడు పర్యాయాలు దేవేందర్నాయక్ కౌన్సిలర్గా గెలుపొంది మళ్లీ నాలుగోసారి సైతం విజయం సాధించి రికార్డు సృష్టించారు. దేవేందర్నాయక్ ఎస్టీ రిజర్వేషన్ నుంచి పోటీ చేస్తుంటారు. జగిత్యాలలో మొదటిసారి 2వ వార్డు నుంచి, రెండోసారి 9వ వార్డు, మూడోసారి 48వ వార్డు, ఈసారి 11వ వార్డు నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలుపొంది రికార్డు సృష్టించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఒకే ఒక్క బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి వరుసగా కౌన్సిలర్గా గెలుపొందుతూ వస్తున్నారు. -
రాజీనామా చేసి.. ఆపై గెలిచి..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప ఆ పదవికి రాజీనామా చేశారు. తర్వాత మున్సిపల్ 7వ వార్డు నుంచి బరిలో నిలిచి 261 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదేవిధంగా 26వ వార్డు కౌన్సిలర్ పదవికి ఏఐబీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని వదులుకొని బరిలో నిలిచిన కుక్క శ్రావణ్.. 52 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. 2014 ఎన్నికల్లో 8వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికై న స్వరూప.. వైస్ చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో 3 ఓట్లతో పరాజయం పాలయ్యారు. మార్కెట్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అయితే ఈసారి చైర్పర్సన్ పదవి వరిస్తుందన్న ఆశతో ఉన్నారు. -
వరుసగా భార్యాభర్తలు
యైటింక్లయిన్కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ అల్లూరు 19వ డివిజన్ ఏరియాలో మారెల్లి సుశీల–రాజిరెడ్డి కాంగ్రెస్ నుంచి నాలుగుసార్లు కౌన్సిలర్, కార్పొరేటర్గా విజయం సాధించారు. మొదటిసారి జనరల్ కేటగిరిలో మారెల్లి రాజిరెడ్డి గెలుపొందారు. జనరల్ మహిళ కేటగిరిలో మూడుసార్లు తన భార్య మారెల్లి సుశీల గెలుపొందారు. 20వ డివిజన్ నుంచి.. పోతనకాలనీ న్యూమారేడుపాక గ్రామంలో 20వ డివిజన్ నుంచి ఒకసారి టీడీపీ నుంచి, ఏఐఎఫ్బీ నుంచి, రెండుసారర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్గా నాలుగుసార్లు విజయం సాధించిన తాళ్ల అమృత–రాజయ్య. మూడుసార్లు తాళ్ల అమృత గెలుపొందారు. ఒకసారి జనరల్ కేటగిరి రావడంతో తాళ్ల రాజయ్య విజయం సాధించారు. 16వ డివిజన్ నుంచి.. రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ 16వ డివిజన్లో బీజేపీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్గా విజయం సాధించిన మందల రమ–కిషన్రెడ్డి. రెండుసార్లు మందల కిషన్రెడ్డి గెలుపొందారు. ఈసారి జనరల్ మహిళ రావడంతో మందల రమ విజయం సాధించారు. మారెల్లి సుశీల–రాజిరెడ్డి మందల రమ–కిషన్రెడ్డి -
నాడు మేయర్.. నేడు కార్పొరేటర్గా ఓటమి..
గోదావరిఖని: రామగుండం నగరపాలక మేయర్గా పని చేసిన డాక్టర్ బంగి అనిల్కుమార్ నేడు కార్పొరేటర్గా ఓటమి పాలయ్యారు. 41వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనిల్కుమార్ పోటీలో ఉన్నారు. ఈసారి కూడా మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సీపీఐ అభ్యర్థి మార్కపురి సూర్య చేతిలో ఓటమి పాలయ్యారు. 119 ఓట్ల మెజార్టీతో సూర్య గెలుపొందారు. మేయర్గా పని చేసి మళ్లీ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన అనిల్కుమార్.. సీపీఐ అభ్యర్థి చేతిలో ఓటమిపాలు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డబ్బులు పంచుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత పోలీసులు చేరుకొని తనిఖీలు నిర్వహించడం.. సీపీఐ అభ్యర్థి జేబులో రూ.48వేలు దొరకడం.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మైనస్గా మారిందనే చర్చ జరుగుతోంది. -
● ప్రజాతీర్పుతో మరింత పెరిగిన బాధ్యత ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
ధర్మపురి: ధర్మపురి లక్ష్మీనృసింహుని దయ, ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టారని, ప్రజాతీర్పుతో మరింత బాధ్యత పెరిగిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడానని, ఓడినా గెలిచినా ప్రజలే దైవంగా భావించానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ధర్మపురి ప్రజలు ఈ తీర్పునిచ్చారని, వారి రుణం తీర్చుకుంటానని అన్నారు. ధర్మపురిలో బస్డిపో, పాల్టెక్నిక్ కళాశాల, డిగ్రీ కాలేజీ, శాశ్వత తాగునీటి పరిష్కారం, గోదావరిలో కలుషిత నీటికి పులిస్టాప్ తదితర పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అధికారంలో లేనప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు వచ్చినా ఓర్చుకొని ముందుకు సాగానని, అందుకే ప్రజలు తనను ఇంతవాడిని చేశారని గుర్తు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకు కోట్లాది రూపాయ ల నిధులు తీసుకొచ్చి ధర్మపురి రూపు రేఖలు మా ర్చేలా పనులు చేపడుతామని వివరించారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
వెల్గటూర్(ధర్మపురి): ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి కె.రాము అన్నారు. శుక్రవారం మండలంలోని రాజక్కపల్లి, కప్పారావుపేట పాఠశాలలను సెక్టోరల్ అధికారి చంద్రశేఖర్రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజక్కపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. బోర్డుపై లెక్కలు చేయించడం, ఆంగ్ల పదాలు, వర్ణమాల రాయించడం వంటివి పరీక్షించారు. విద్యార్థుల సామర్థ్యాలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రగతి కోసం ఉపాధ్యాయులు పోటీతత్వంతో పని చేయాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సహకరించాలని సర్పంచ్ దోరిశెట్టి మల్లేశంను కోరారు. విద్యార్థుల అభ్యసన సామగ్రి కోసం సర్పంచ్ రూ.2,000 విరాళం ప్రకటించారు. అనంతరం డీఈవోను సర్పంచ్ సత్కరించారు. కప్పారావుపేట పాఠశాలలో గైర్హాజర్ విద్యార్థులపై దృష్టి సారించి రెగ్యులర్గా పాఠశాలకు వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. ఎంఈవో బోనగిరి ప్రభా కర్, హెచ్ఎం రాధిక, కార్యదర్శి స్రవంతి, అంగన్వా డీ టీచర్ తిరుమల, సీఆర్పి వెంకటేశ్ పాల్గొన్నారు. -
జాప్యం సరికాదు
గ్రామాలకు ప్రధాన చెరువుల మరమ్మతుల విషయంలో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. దుంపేట శివారులోని ఊర చెరువుకు గండి పడి నెలలు గడుస్తున్నా మరమ్మతు విషయంలో జాప్యం చేయడం దారుణం. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు చొరవచూపి త్వరగా మరమ్మతు చేయిస్తే రైతులు, చేపలు పెంచుకునే మత్స్యకారులకు ప్రయోజనం. – మల్యాల రమేశ్, సర్పంచ్, దుంపేట కొచ్చెరువే ఆధారం గంభీర్పూర్ గ్రామానికి సాగు, తాగునీటికి ఆధారం కొచ్చెరువు. కొచ్చెరువులో నీళ్లుంటే గ్రామంలోని బోరుబావుల్లో నీళ్లుంటాయి. అలాంటి చెరువు మత్తడికి త్వరగా మరమ్మతు చేయించాలి. కొచ్చెరువులో నీళ్లు లేక యాసంగిలో పంటలకు సరిగా నీళ్లందవు. ప్రభుత్వం స్పందించి త్వరగా మరమ్మతు చేయించాలి. – మొగుళ్ల మల్లేశం, రైతు, గంభీర్పూర్ మరమ్మతు చేయిస్తాం గంభీర్పూర్ శివారులోని కొచ్చెరువు మత్తడికి మరమ్మతు చేయిస్తాం. దుంపేట చెరువుకు పడిన గండిని పూడ్చాలని గతంలో పనిచేసిన కాంట్రాక్టర్కు సూచించాం. పెగ్గెర్ల శివారులో ఊర చెరువు మత్తడి మరమ్మతుకు ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక పంపిస్తాం. నిధులు మంజూరు కాగానే పనులు చేయిస్తాం. – ప్రశాంత్, నీటిపారుదలశాఖ డీఈ, వేములవాడ -
పీఠాధిపతి మరణం ధర్మపురికి తీరని లోటు
ధర్మపురి: ధర్మపురి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతి అకాల మరణం తీరని లోటని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. పీఠాధిపతి మరణంపై చింతిస్తూ శుక్రవారం ధర్మపురిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రితో పాటు అర్చకులు, అధికారులు నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదుశ్రీ అన్నట్లు స్వామిజీ ఆజ్ఞ లేనిది ఏ కార్యక్రమాన్ని చేయలేదని, ఆయన సూచనల మేరకు ప్రతీ కార్యక్రమాన్ని నిర్వహించామని గుర్తు చేశారు. ధర్మపురిలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని లక్ష్మీనృసింహుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్పై అనాసక్తిరాయికల్(జగిత్యాల): రాయికల్ మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్పై ఉద్యోగులు ఆసక్తి చూపలేదు. 12 వార్డులకు గాను దాదాపు 100 మంది ఉద్యోగులు ఉండగా, కేవలం 23 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ ఉద్యోగి యే పార్టీకి ఓటు వేశారన్న విషయం తెలిసిపోతుందనే ఉద్దేశంతో పోస్టల్ బ్యాలెట్పై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ప్రశాంతంగా రాయికల్ బల్దియా కౌంటింగ్రాయికల్(జగిత్యాల): రాయికల్ బల్దియా ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించగా, ఒంటిగంటలోపే 12 వార్డుల ఫలితాలు ప్రకటించారు. మొదటి ఫలితం 10వ వార్డు ప్రకటించగా, మొదటి రౌండ్లోనే 10,1,7,4 ఫలితాలు వెలువడ్డాయి. రెండో రౌండ్లో 2,5,8,11, మూడో రౌండ్లో 12,9,6,3 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. స్పెషల్ ఆఫీసర్, జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి, కమిషనర్ కీర్తి నాగరాజు, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పర్యవేక్షణలో ఫలితాలు ఎప్పటికప్పుడు ప్రకటించారు. పట్టు నిలుపుకున్న జీవన్రెడ్డి జగిత్యాల: మాజీ మంత్రి జీవన్రెడ్డి జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ అధిష్టానం బీఫాంల విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని కాంగ్రెస్ వైపు ఉంటున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 35 బీఫాంలు కేటాయించారు. సీనియర్ నాయకులైన జీవన్రెడ్డికి 15 సీట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ఈ వివాదం తీవ్రస్థాయికి చేరింది. జీవన్రెడ్డి వర్గీయులు పార్టీ తరఫున, రెబల్గా 17 మంది గెలుపొంది పైచేయిగా నిలిచారు. ఎమ్మెల్యే సైతం దాదాపు 18 సీట్లను కై వసం చేసుకున్నారు. కానీ, కాంగ్రెస్లో చోటుచేసుకున్న గొడవతో 40 పైగా గెలవాల్సిన కాంగ్రెస్ సీట్లు కేవలం 23కే పరిమితమయ్యాయి. చైర్మన్ ఎంపిక విషయంలో అధిష్టానం ఎలా పరిశీలిస్తుందోనని ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా, ఇప్పటికే జీవన్రెడ్డి బహిరంగంగానే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్లో చిచ్చుపెట్టి పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చారని విమర్శిస్తున్నారు. వేములవాడ టు మేడిపల్లి బస్సు సర్వీస్ ప్రారంభంమేడిపల్లి(వేములవాడ): వేములవాడ నుంచి చందుర్తి, భీమారం మండల కేంద్రాల మీదుగా మేడిపల్లి మండల కేంద్రానికి నూతన బస్సు సర్వీసును శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఇంతకముందు వేములవాడ రాజన్న దర్శనానికి కోరుట్ల, జగిత్యాల మీదుగా వెళ్లేవారు. నూతన బస్సు సర్వీసుతో ఈ ప్రాంత ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. బస్సు సర్వీసు సౌకర్యం కల్పించిన విప్ ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్లు ఏనుగుల లచ్చన్న, దాసరి గణేశ్, పుల్లురి ఉమారాణి, ఇట్టెడి రాజరెడ్డి, చెక్కపల్లి స్వాతి, మకిలి కావేరి, యాగండ్ల సౌజన్య పాల్గొన్నారు. -
చెరువు.. పట్టింపు కరువు
కథలాపూర్(వేములవాడ): గ్రామాలకు సాగు, తాగునీరందించి భూగర్భజలాలు పెంచడంలో ప్రధానమైన చెరువులు గతేడాది కురిసిన వర్షాలకు గండ్లు పడి నీరంతా వృథాగా పోయింది. వర్షాలతో నష్టపోయిన చెరువులను అధికారులు, ప్రజాప్రతినిధులు అప్పట్లో పరిశీలించారు. కాగా, మరమ్మతు విషయంలో జాప్యం జరగడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం చెరువుల్లో నీళ్లు తక్కువగా ఉండటంతో వాటి మత్తడి, తూములకు మరమ్మతు చేస్తే వర్షకాలంలో కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు చేరుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరమ్మతు చేయాల్సిన ప్రధాన చెరువులు.. కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి ప్రధానమైన కొచ్చెరువు మత్తడి గతంలో కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైంది. దుంపేట శివారులోని ఊర చెరువు తూం వద్ద కట్ట కోతకు గురైంది. పెగ్గెర్ల శివారులోని ఊర చెరువు మత్తడి పగుళ్లు బారి నీరు వృథాగా బయటకు పోతోంది. వర్షాలతో నష్టపోయిన చెరువులను అప్పట్లో ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులు పరిశీలించారు. మరమ్మతు చేయిస్తామని చెప్పి ఇప్పటివరకు పురోగతి లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరమ్మతు చేయిస్తే వర్షకాలంలో నీళ్లు నిల్వ ఉండి ఏడాది పాటు సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పెగ్గెర్ల ఊర చెరువు మత్తడికి పగుళ్లు బారి లీకవుతున్న నీరుకోతకు గురైన దుంపేట ఊర చెరువు కట్ట -
● భద్రతను పర్యవేక్షించిన ఎస్పీ అశోక్కుమార్
జగిత్యాలక్రైం: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ అశోక్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనుమతి పొందిన సిబ్బంది, ఏజెంట్లను మాత్రమే కేంద్రం లోపలికి అనుమతించేలా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించామన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. ఆయన వెంట డీఎస్పీలు రఘుచందర్, రాములు ఉన్నారు. -
వైవిధ్యం.. పుర ఫలితం
032306కోరుట్ల మున్సిపాలిటీ మెట్పల్లి మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ ధర్మపురి మున్సిపాలిటీ రాయికల్ మున్సిపాలిటీ 18501226 1008330515040002స్వతంత్రులు01మొత్తం -
జగిత్యాల
29.0/19.0శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026Iగరిష్టం/కనిష్టంశివరాత్రికి ముస్తాబైన మండలకేంద్రంలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆలయానికి రంగులు వేసి, విద్యుద్దీపాలతో అలంకరించారు. IIలోuవాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. మున్సిపోల్స్.. అందని పల్స్మున్సిపల్ పోరు ఈసారి రసవత్తరంగా సాగింది. పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు అంచనాల్లో మునిగితేలుతున్నారు. లెక్కలు వేసుకుంటున్నారు. IIలోu -
కౌంట్డౌన్ !
టిక్..టిక్..టిక్..సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం జరగనుంది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరగగా, ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. రెండు కార్పొరేషన్లలో 126 డివిజన్లకు, 13 మున్సిపాలిటీలలో 341 వార్డుల ఫలితాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 764, జగిత్యాల 655, పెద్దపల్లి 580, సిరిసిల్ల 287 మొత్తం 2,286 మంది భవితవ్యం నేడు తేలనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రధాన పార్టీల్లో లెక్కలు మొదలయ్యాయి. ఎగ్జిట్ ట్రెండ్స్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశముందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐదు చోట్ల బీఆర్ఎస్కు ఆధిక్యం కనిపిస్తుండగా, రెండు చోట్ల బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరో వైపు ఎనిమిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు సునా యాస విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలకు సానుకూలత ఇక్కడే.. క్యాంపు రాజకీయాలు.. ఫలితాలు వెలువడగానే క్యాంపు రాజకీయాలు మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీల నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులతో ముందస్తు ఒప్పందాలకు సిద్ధమవుతున్నారు. హంగ్ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రతి ఒక్క కార్పొరేటర్/కౌన్సిలర్ ఓటు కీలకంగా మారనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ కొన్నిచోట్ల అభ్యర్థులను గురువారమే క్యాంపునకు తరలించింది. రామగుండం, మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి, వేములవాడలో అభ్యర్థులను క్యాంపుకు రావాలని ఆదేశాలిచ్చింది. బీఆర్ఎస్ నాయకులు కూడా కరీంనగర్, రామగుండం, సిరిసిల్ల, హుజురాబాద్, జమ్మికుంట, మెట్పల్లి, రాయికల్లో క్యాంపు రాజకీయానికి తెరలేపా రు. కరీంనగర్, వేములవాడలో క్యాంపు కోసం బీజే పీ అభ్యర్థులను సిద్ధంగా ఉండాలని సూచించింది. తారుమారు కానున్న స్థానిక రాజకీయం పుర ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రస్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా మారే అవకాశముంది. అధికార పార్టీలు తమపట్టును నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉండగా, ప్రతిపక్షాలు బలమైన ప్రాతినిథ్యం సాధించి భవిష్యత్ ఎన్నికలను శాసించేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి శుక్రవారం వెలువడే ఫలితాలు కేవలం మున్సిపల్ పాలనకే కాదు, జిల్లాలో భవిష్యత్ రాజకీయ దశ, దిశను నిర్ణయించనున్నాయి. అధికార కుర్చీ కోసం జరుగుతున్న ఈ పోరు ఉమ్మడి రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జగిత్యాల వార్డులు : 50 కోరుట్ల వార్డులు : 33 రాయికల్ వార్డులు : 12 మెట్పల్లి వార్డులు : 26 ధర్మపురి వార్డులు : 15 బల్దియాల వివరాలు నేడే బల్దియా ఎన్నికల ఫలితాలు నాలుగు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో 5 చోట్ల బీఆర్ఎస్కు, రెండు చోట్ల బీజేపీకి సానుకూలత 8 చోట్ల కాంగ్రెస్కు సునాయాస విజయం క్యాంపు రాజకీయాలకు సిద్ధమైన ప్రధానపార్టీలు ఇండిపెండెంట్లతో పార్టీల ముందస్తు ఒప్పందాలు మధ్యాహ్నంలోగా 126 డివిజన్లు, 341 వార్డుల రిజల్ట్స్ తేలనున్న 2,286 మంది భవితవ్యం -
సీఎం కప్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
జగిత్యాలటౌన్: సీఎం కప్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలను జిల్లాకేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత గురువారం ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, యోగా, బాస్కెట్బాల్, బాక్సింగ్, నెట్బాల్, బేస్బాల్ పుష్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈనెల 13, 14 తేదీల్లో వివిధ క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులే సామగ్రి తెచ్చుకోవాలని సూచించారు. డీవైఎస్వో రవికుమార్, ఫిజికల్ డైరెక్టర్లు విశ్వప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మిరాంనాయక్, పీఈటీలు కృష్ణప్రసాద్, అశోక్, అజయ్, వెంకటలక్ష్మి, మల్లేశ్వరి, జమునారాణి, వేణు పాల్గొన్నారు. -
నాంపల్లిపై చిన్నచూపు
వేములవాడఅర్బన్: వేములవాడకు వచ్చే భక్తులు నాంపల్లిగుట్టపై వెలసిన నృసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. కొలిస్తే.. మొలిచే పేరున్న నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంపై అధికారులకు పట్టింపు కరువైంది. నాంపల్లిగుట్టపై ఏర్పాట్ల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈనెల 14 నుంచి మొదలయ్యే మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు తూతేమంత్రంగానే చేసి చేతులు దులుపుకున్నారు. మూలనపడ్డ వాటర్ ఫౌంటేయిన్ నాంపల్లిగుట్టపై భక్తుల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేయిన్, రంగులైట్ల ప్రదర్శన మూలనపడింది. పట్టించుకునే వారు లేక నిరుపయోగంగా మారింది. వెలసిపోయిన కాళీయమార్ధనం నాంపల్లిగుట్టపై ఏర్పాటు చేసిన కాళీయమర్ధనంపై కృష్ణుడి బొమ్మ భక్తులను ఆకట్టుకుంటుంది. అయితే రంగు వెలసిపోయింది. కాళీయమర్ధనం ఎదుట ఉన్న నరసింహుడి బొమ్మ రంగుపోయి కళావిహీనంగా కనిపిస్తుంది. పారిశుధ్యం అస్తవ్యస్తం నాంపల్లిగుట్టపై పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసిన చెత్తాచెదారం కనిపిస్తుంది. కాళీయమర్ధనం పక్కన చెట్ల కింద ఎక్కడ మొత్తం చెత్తమయంగా మారింది. నిరుపయోగంగా మూత్రశాలలు గతంలో మహాశివరాత్రికి భక్తుల కోసం లడ్డూ కౌంటర్ వెనుక, కాశీయమర్ధనం పక్కన తాత్కాళికంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అవి వాడుకలో లేకపోవడంతో మూలకుపడ్డాయి. భక్తులకు అత్యవసరం ఏర్పడితే ఇబ్బందిగా ఉందని పలువురు వాపోతున్నారు. మహాజాతరకు ఏర్పాట్లు అంతంతే.. గుట్టపై పారిశుధ్యం నిర్వహణ అస్తవ్యస్తం నృసింహస్వామిపై పట్టింపు కరువు -
లేబర్కోడ్లు రద్దు చేయాల్సిందే..
జగిత్యాలటౌన్: కార్మికులను బానిసలుగా మార్చేలా కేంద్రప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులు, రైతులు, వివిధ రంగాల ఉద్యోగులు గురువారం జిల్లాకేంద్రంలోని టౌన్ హాల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. లేబర్కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ వర్కర్స్, వీవోఏ, ఆర్పీ తదితర వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ కల్పిస్తూ సమగ్ర చట్టం తేవాలని పేర్కొన్నారు. ముఠా, ఆటో, బిల్డింగ్, గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, కౌలురైతుల గుర్తింపు, ఉపాధి పఽథకాన్ని పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తూ 200పనిదినాలు కల్పించాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందూరి సులోచన, కోమటి చంద్రశేఖర్, ఏఐటీయూసీ నాయకులు ముఖ్రం, వెన్న మహేష్, మునుగూరి హన్మంతు, శ్రీగాధ దేవదాసు, కోరుకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమ్మెకు ఐఎన్టీయూసీ, టీయూసీసీ, ఓఐటీయూసీ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ మద్దతు ప్రకటించాయి. సార్వత్రిక సమ్మెలో కార్మిక సంఘాల నాయకులు -
‘సాక్షి’ స్టడీ మెటీరియల్తో అధిక మార్కులు
ఇబ్రహీంపట్నం: పదో తరగతి విద్యార్థులకు ‘సాక్షి’ అందిస్తున్న మ్యాథమేటిక్స్, ఫిజికల్ సైన్స్ స్టడీ మెటిరియల్ చదివితే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చని తహసీల్దార్ వరప్రసాద్, ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. మండలకేంద్రంలోని మోడల్ స్కూ ల్లో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరి యల్ అందించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా రూపొందించిన ‘సాక్షి’ యాజమాన్యానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ప్రిన్సిపాల్ ప్రభాకర్, వైస్ ప్రిన్సి పాల్ స్వర్ణలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ‘పది’లో ఉత్తమ మార్కులు సాధించాలిమల్యాల: పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఉత్తమ మార్కులు సాధించాలని డీఈవో కె.రాము అన్నారు. మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులం, జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను గురువారం సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎంఈఓ నీలగిరి జయసింహారావు, ప్రిన్సిపాల్ మానస, ప్రధానోపాధ్యాయురాలు శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శివరాత్రి ఏర్పాట్ల పరిశీలనవెల్గటూర్: మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగాలలోని కోటేశ్వరస్వామి ఆలయంలో ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి గురువారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ రమేశ్, ఈవో కాంతారెడ్డి, సర్పంచ్ పర్ష కోటయ్య, వెల్గటూర్, ధర్మపురి ఎస్సైలు ఉదయ్కుమార్, మహేశ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల నిరసనజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు గురువారం నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటి సవరణ బిల్లు–2025కు వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ పిలుపు మేరకు ఆందోళన చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక సంఘాలను రద్దు చేయాలని కుట్ర పన్నడం శోచనీయమన్నారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం, డీఈలు అంజయ్య, గంగారాం, మధుసూదన్, గోపికృష్ణ, ఎస్ఏఓ శ్రీనివాస్, జేఏసీ నాయకులు చేరాలు, ప్రసాద్, రాంజీ, వరుణ్, జవహార్లాల్నాయక్, సతీష్, ప్రవీణ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు భద్రత కల్పించండికోరుట్ల: జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులకు పోలీసులు భద్రత కల్పించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరారు. ఈ మేరకు గురువారం ఎస్పీ అశోక్ కుమార్ను కలిసి వినతి పత్రం అందించారు. కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు తమ అభ్యర్థులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. కౌంటింగ్ తర్వాత ప్రజాతీర్పును వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. -
విద్యుత్షాక్తో పంచాయతీ వర్కర్ మృతి
జగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం రంగపేట గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్, ఎలక్ట్రిషీయన్గా పనిచేస్తున్న ఏసు సుందర్రావు (60) విద్యుత్ మరమ్మతు చేస్తూ షాక్కు గురై మృతిచెందాడు. సుందర్రావు కొన్నేళ్లుగా పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్ తగిలి మృతిచెందాడు. మృతుడి భార్య ఏసు రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గీత తెలిపారు. హైదరాబాద్లో జగిత్యాల యువకుడు..జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని మార్కండేయనగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెట్పల్లి సంజయ్ (24) గురువారం చెరువులో అనుమానాస్పదంగా మృతిచెందాడు. సంజయ్ బుధవారం ఎన్నికల్లో ఓటు వేయడానికి జగిత్యాల వచ్చి ఓటు వేసి రాత్రి హైదరాబాద్ వెళ్లాడు. గురువారం మియాపూర్ చెరువులో మృతదేహమై కనిపించాడు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో ముంబయ్లో వ్యక్తి..జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్కు చెందిన గర్వంద రాజేశ్గౌడ్ (40) ముంబయ్లో గుండెపోటుతో మృతిచెందాడు. రాజేశ్గౌడ్ ముంబయ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. బుధవారం విధులకు వెళ్లి వచ్చిన ఆయన గురువారం వేకువజామున అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటిచే మృతిచెందినట్లు నిర్ధారించారు. రాజేశ్గౌడ్ మృతదేహాన్ని అంబులెన్స్లో లక్ష్మీపూర్కు తీసుకొస్తున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలుజగిత్యాలరూరల్:సారంగాపూర్ మండలం పెంబట్ల–కోనాపూర్లో శ్రీదుబ్బరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 13 నుంచి 17 వరకు మహాశివరాత్రి జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో అనూష తెలిపారు. ఈనెల 14న స్వామివారి కల్యాణం, 15న జాగరణ, 17న స్వామివారి రథోత్సవం, 23న ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. -
చిన్నారిని బలిగొన్న బైక్
మల్లాపూర్: రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మల్లాపూర్ మండలంలోని నడికుడలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్కొండాపూర్ గ్రామానికి చెందిన తోకల నాగరాజు, గౌతమి దంపతులకు కూతురు, కుమారుడు వేదాన్ష్ (4) సంతానం. నాగరాజు భార్యాపిల్లలతో కలిసి బుధవారం మల్లాపూర్ మండలం వాల్గొండలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. రాత్రి 7గంటల సమయంలో ఆటో దిగగానే వేదాన్ష్ రోడ్డు దాటేందుకు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో మొగిలిపేట నుంచి అతివేగంగా వస్తున్న ఓ బైక్ వేదాన్ష్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వేదాన్ష్ను కుటుంబసభ్యులు హుటాహుటిన నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. పరిస్థితి విషమించి అర్ధరాత్రి వేదాన్ష్ మృతి చెందాడు. బాలుడి మృతితో ఫకీర్కొండాపూర్లో విషాదం అలుముకుంది. బైక్ను అతివేగంగా.. నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన రాఘవపేటకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన మృత్యువు నిజామాబాద్లో చికిత్స పొందుతూ మృతి -
మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు
వేములవాడ: ఈనెల 14 నుంచి భీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. తన కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. రూ.1.96 కోట్లతో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జాతరకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2.50 లక్షల వరకు లడ్డూ ప్రసాదాలు సిద్ధమని తెలిపారు. భక్తు ల నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేశామని, రాజన్న జలప్రసాదం ఆరు ప్రధాన కేంద్రాలు, 30 ప్రాంతాల్లో అందుబాటులో ఉంచడమే కాకుండా ట్రాలీ ఆటోల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు వివరించారు. దాతల సహకారంతో లక్ష వరకు మజ్జిగ పాకెట్లు, టిఫిన్లు భక్తులకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 15న ఉదయం 8 గంటలకు ప్రభుత్వం తరఫున, 14న సాయంత్రం 7 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. 14 నుంచి 16 వరకు శివార్చన వేదికపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు కొనసాగుతాయని వివరించారు. 87369 36969 నంబర్కు ‘ఏజీ’ అని మెసేజ్ చేయడం ద్వారా ఆలయ సేవల వివరాలు పొందవచ్చని తెలిపారు. ఈవో రమాదేవి -
ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ బస్సులో పర్సు మరిచిపోయిన ప్రయాణికురాలికి అందజేసి కరీంనగర్–2 డిపో సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. గురువారం కరీంనగర్ ఆర్టీసీ–2 డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చింది. ఈ బస్సులో ప్రయాణించిన కరీంనగర్కు చెందిన రాజేశ్వరి తన పర్సును బస్సులో మరిచిపోయింది. బస్సు డైవర్ ఎన్.సంపత్, కండక్టర్ ఎన్.రజిత పర్సులో 5 తులాల బంగారం గొలుసు, కొంత నగదు ఉందని గమనించి ఆమెకు అందజేశారు. డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ సిబ్బందిని అభినందించారు. -
రంగస్థల నటుడు జేఎస్ కన్నుమూత
కోల్సిటీ(రామగుండం): గోదా వరిఖనికి చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ నటుడు, సింగరేణి మాజీ ఉద్యోగి జల్లారం సత్యనారాయణ(81) గురువారం అనారో గ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి కళా రంగాన్ని విషాదంలో ముంచింది. సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రంగస్థల నాటకాలు, టీవీ ప్రదర్శనల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు. స్థానిక కళాకారులు, పలు కళాసంఘాల బాధ్యులు దామెర శంకర్, మేజిక్ రాజా, కనకం రమణయ్య, చంద్రపాల్, మేకప్ అంజన్న, సిరిపురం శ్రీనివాస్, దయానంద్గాంధీ, మేజిక్ హరి, దామెర రాజేశ్ తదితరులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
రాయబేరాలు షురూ!
మెట్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. మొత్తం అభ్యర్థుల్లో విజేతలెవరో కొన్ని గంటల్లోనే వెల్లడి కానుంది. మెట్పల్లి మున్సిపల్లో 26వార్డులుండగా.. 150మంది పోటీ చేశారు. చైర్పర్సన్ పదవిని దక్కించుకోవాలంటే 14 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఈ సారి ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలే కాకుండా కొన్నిచోట్ల స్వతంత్ర, ఇతర పార్టీల అభ్యర్థులు విచ్చలవిడిగా ప్రలోభాలకు పాల్పడ్డారు. దీనివల్ల చాలావార్డుల్లో అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఈ క్రమంలో ఓటరునాడీ అంతుచిక్కక పార్టీలన్నీ మెజార్టీపై మల్లగుల్లాలు పడుతున్నాయి. గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ, స్వతంత్రులు ఎన్నికల్లో బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు పలు వార్డుల్లో గట్టి పోటీ ఇచ్చారు. చైర్పర్సన్ పదవిపై గురి పెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్కు పూర్తిస్థాయిలో మెజార్టీ రాని పక్షంలో అటు బీజేపీ, ఇటు ఇండిపెండెంట్ల మద్దతు ‘కీ’లకం కానుంది. బీజేపీ గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిస్తే.. ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నాలుగైదు వార్డుల్లో ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన స్వతంత్రులు ఇప్పుడు గెలుస్తారనే ప్రచారం జరుగుతోంది. రెండో వార్డులో ఎంఐఎం, 20వార్డులో జనసేన అభ్యర్థి కూడా ప్రధానపార్టీలకు గట్టి పోటీ ఇవ్వడంతో ఆయా వార్డుల్లో విజయం ఎవరిని వరిస్తుందోనన్నది ఆసక్తిగా మారింది. అడిగినన్ని డబ్బులు.. గెలిచే అవకాశాలున్న ఇండిపెండెంట్లల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ రెబెల్స్ కావడం గమనార్హం. ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచారు. ప్రస్తుతం వీరిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దృష్టి సారించాయి. గెలిస్తే తమ పార్టీలో చేరాలంటూ వారితో రాయ్ఙబేరాలుశ్రీ మొదలు పెట్టాయి. అడిగినంత డబ్బులు ఇస్తామంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. క్యాంపునకు తరలించడానికి ఏర్పాట్లు ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులను క్యాంపునకు తరలించడానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. సోమవారం చైర్పర్సన్, వైస్చైర్మన్ ఎన్నిక జరగనుంది. క్యాంపు నుంచి నేరుగా అక్కడకు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మెజార్టీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మల్లగుల్లాలు ఎన్నికల్లో ఇరుపార్టీల మధ్య గట్టి పోటీ ‘కీ’లకం కానున్న స్వతంత్రులు -
కూలీ పనికి వచ్చి తిరిగిరాని లోకాలకు...
జైపూర్: బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో జగి త్యాల జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల మేర కు జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన తూర్పాటి అభి (19), పెంబట్లకు చెందిన పురాణం రవి, పస్తం అరుణ్ ముగ్గురూ స్నేహితులు. చెన్నూర్లో పత్తి లోడింగ్ చేసేందుకు ఈ నెల 11న ముగ్గురూ క లిసి ఒకే బైక్పై కూలీ పనికి వచ్చారు. రాత్రంతా ప నిచేసిన యువకులు గురువారం తెల్లవారుజామున లక్సెట్టిపేటకు బయలుదేరారు. రసూల్పల్లి సమీ పంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. అభి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రవి, అరుణ్కు తీవ్రగాయాలు కావడంతో 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించారు. అభి తండ్రి తూర్పాటి అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బైక్ అదుపుతప్పి యువకుడు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
ఓట్ల లెక్కింపునకు 450 మంది పోలీసులతో బందోబస్తు
జగిత్యాలక్రైం: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 450 మంది పోలీస్లతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఓట్లు లెక్కించే ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాట్లను కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి గురువారం పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రత పెడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, బాణాసంచా కాల్చడం, సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిషేధమన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలను డాగ్స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్తో తనిఖీలు చేపడతామన్నారు. ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. డీఎస్పీలు రఘుచందర్, రాములు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో 144 సెక్షన్ అమలు విజయోత్సవ ర్యాలీలు నిషేధం ఈసీ గుర్తింపుకార్డులుంటేనే కేంద్రంలోకి ఎస్పీ అశోక్ కుమార్ -
మున్సిపోల్స్.. అందని పల్స్
జగిత్యాల: మున్సిపల్ పోరు ఈసారి రసవత్తరంగా సాగింది. పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు అంచనాల్లో మునిగితేలుతున్నారు. లెక్కలు వేసుకుంటున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. జగిత్యాలలో వింతపోరు నడిచింది. అధికార పార్టీ కాంగ్రెస్కు రెబల్స్ అత్యధికంగా ఉండటం.. ఇక్కడ జీవన్రెడ్డి, సంజయ్కుమార్ మధ్య పోటీ నెలకొన్నట్లయ్యింది. వారం పాటు ప్రచారం కొనసాగించి.. డబ్బులు, మందు, విందుల ద్వారా ప్రలోభాలకు గురిచేసినా అభ్యర్థుల్లో గెలుస్తామన్న ధీమా లేకుండా భయాందోళనలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో భవితవ్యం తేలనుండటంతో గెలుపు ఓటములు లెక్కలు వేసుకుంటున్నారు. అభ్యర్థులు ఎన్నికలు పూర్తయిన అనంతరం నిద్రలేకుండానే గడుపుతున్నారు. ఓడుతామో, గెలుస్తామోనన్న భయాందోళన వెంటాడుతోంది. ఇప్పటికే భవితవ్యం బ్యాలెట్ బాక్స్ల్లో నిక్షిప్తం కాగా.. ఓటరు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది. జగిత్యాలవైపే అందరి చూపు జగిత్యాల మున్సిపల్ పీఠంవైపే అందరి దృష్టి పడింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అంచనాకు వచ్చినప్పటికీ ప్రజాప్రతినిధులు అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. కాలనీల్లో ఎన్ని ఓట్లు పడే అవకాశాలున్నాయో అంచనా వేసుకుని ఓటరు జాబితాను ముందు పెట్టుకుని లెక్కలు వేసుకుంటున్నారు. జగిత్యాలలో ఎప్పుడూ అధికార, ప్రతిపక్షం మధ్య పోటీ జరిగేది. కానీ.. ఈసారి అధికార పక్షంలోనే రెబల్గా పోటీ జరిగినట్లయ్యింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్కుమార్ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని సంజయ్ కాంగ్రెస్లో చేరడం.. అధిష్టానం కూడా ఆయనకే ప్రాధాన్యం ఇవ్వడంతో జీవన్రెడ్డి వర్గీయులు తీవ్రంగా మండిపడ్డారు. బీఫాంల విషయంలో ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వడంతో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీని పక్కన పెట్టిన సీనియర్ అభ్యర్థులు ఇండిపెండెంట్గానే బరిలోకి దిగారు. ఒకానొక దశలో తీవ్రమైన పోటీ ఇచ్చారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయగా.. జీవన్రెడ్డి ఏకంగా తన వర్గీయులైన స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం చేశారు. దీంతో ఇక్కడ పోటీ విచిత్రంగా మారింది. అలాగే బీఆర్ఎస్, బీజేపీ సైతం వీరి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అప్పుల కుప్పలే ఎన్నికలను సవాల్గా తీసుకున్న కొందరు అభ్యర్థులు కౌన్సిలర్ పదవి దక్కించుకోవాలని విపరీతంగా ఖర్చు చేశారు. విచ్చలవిడిగా నగదు, మద్యం ఏరులై పారించారు. ఓ వార్డులో ఒక అభ్యర్థి రూ.50లక్షలకు పైగా ఖర్చు పెట్టాడంటే దీనిని బట్టి పోటీ ఎంతలా జరిగిందో తెలుస్తుంది. అభ్యర్థులు లక్షల్లో అప్పు చేయడంతోపాటు, భూములను తనఖా పెట్టారు. చైర్మన్ పీఠం కోసం పోటీ జగిత్యాల చైర్మన్ పీఠం బీసీలకు రావడంతో దానిపై ఇప్పటినుంచే కన్నేశారు. ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. చైర్మన్ పీఠం ఆశించే వారు ఒకానొక దశలో సొంత పార్టీ వారే చైర్మన్ స్థానంలో పోటీ పడుతున్న వారికి ఒకరినొకరు రెబల్స్కు డబ్బులు ఇచ్చుకుంటూ ఓడించే ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఇండిపెండెంట్ల హవా ఉన్నట్లు కన్పిస్తుండటంతో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎలా వెళ్దాం..? ఏం చేద్దాం..? అనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఇండింపెండెంట్ల హవా ఎక్కువగా ఉంటే అటు బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతిచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి వారే అంచనాలు అనుచరులతో అభ్యర్థుల సమావేశాలు చైర్మన్ పదవిపై ఆశలు -
శివరాత్రికి ముస్తాబైన పెగడపల్లి రాజన్న
పెగడపల్లి: మండలకేంద్రంలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆలయానికి రంగులు వేసి, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సమష్టిగా రూ.50లక్షల విరాళాలు సేకరించి నిర్మాణం పూర్తిచేశారు. సత్యనారాయణ స్వామి, దుర్గామాతదేవి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు, సూర్యుడు, నాగేంద్రుడు, బలిపీఠం విగ్రహాలు ప్రతిష్టించారు. ఇటీవల దేవాదాయశాఖ నుంచి రూ.50 లక్షలు మంజూరు కాగా రాజగోపురం నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. శివరాత్రి సందర్బంగా నాలుగు రోజులపాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. శివదీక్షాపరులతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియనుంది. 13న భూకలశ గణపతి పూజ, పుణ్యాహవచనం, 14న నవగ్రహ హోమాలు, కుంకుమపూజ, 15న స్వామివారి కల్యాణం, లింగోద్భవ దర్శనం, 16న బలిదానం, పూర్ణాహుతి, రథోత్సవం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రామచంద్రం, ఉత్సవకమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు గుండి శ్రీనివాస్శర్మ, వినయ్శర్మ తెలిపారు. -
గిరిజనులు ఆర్థిక అక్షరాస్యత పెంచుకోవాలి
● ఆర్బీఐ తెలంగాణ జనరల్ మేనేజర్ సుప్రభాత్రాయికల్: గిరిజనులు ఆర్థిక అక్షరాస్యత పెంపొందించుకోవాలని ఆర్బీఐ తెలంగాణ జనరల్ మేనేజర్ సుప్రభాత్ అన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మండలంలోని జగన్నాథ్పూర్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి కేవైసీపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచిత వ్యక్తుల నుంచి ఎవరు కాల్ చేసినా ఓటీపీ చెప్పవద్దని, అలాగే లింక్లపై క్లిక్ చేయవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి జీవనజ్యోతి, సురక్ష బీమా, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలతో పాటు మహిళలు ముద్ర లోన్లు పొంది ఉపాధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్కుమార్, టీజీబీ ఆర్ఎం రాజ్నరేంద్ర, తహసీల్దార్ నాగార్జున, ఎంపీవో సుష్మ, ఎస్బీఐ శాఖల మేనేజర్లు శంకర్, నరేశ్, పవన్, మాధురి, సెర్ఫ్ సీసీ లావణ్య, ఉపసర్పంచ్ మల్లయ్య పాల్గొన్నారు. -
నామమాత్రంగానే ఏర్పాట్లు
మహాశివరాత్రికి ఏటా నామమాత్రంగానే ఏర్పాట్లు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గుట్టపై ఆదా యం ఉన్న వసతులు మాత్రం లేవు. ఈ సంవత్సరం మహా శివరాత్రి ఏర్పాట్లు అంతంతే కనిపిస్తున్నాయి. – చిలివేరి బాబు, నాంపల్లి నాంపల్లిగుట్టపై ఎక్కడ చూసిన చెత్తాచెదారం కనిపిస్తుంది. గుట్టపై పారిశుధ్య సిబ్బందిని ఎక్కువగా ఏర్పాటు చేయాలి. గుట్టపై ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలి. – బుర్ర పర్శరాములు, నాంపల్లి మహాశివరాత్రి సందర్భంగా నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గుట్టపై పారిశుధ్యం లోపించకుండ చూస్తాం. గుట్టపై వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. – బండారి శంకర్, నాంపల్లి ఆలయ ఇన్చార్జి -
చిన్నారుల సమాచారం ఇవ్వండి
వరంగల్ క్రైం: కాజీపేట పోలీస్, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను అపహరించిన ముఠాను టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో నిందితులను విచారించగా మరో ముగ్గురు చిన్నారులు వివిధ ప్రాంతాల్లో అపహరణకు గురై ప్రస్తుతం శిశు సంక్షేమశాఖ సంరక్షణలో ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వారి తల్లిదండ్రులు సరైన ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో చిన్నారుల్లో ఒకరైన ఆరేళ్ల వయస్సు గల బాబును 2023 అక్టోబర్లో కాజీపేట రైల్వే ప్లాట్ ఫాం నుంచి అపహరించగా, ఏడు నెలల పాపను గతేడాది మంచిర్యాల రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో, ఇంకో ఐదు మాసాల పాపను రామగుండం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అపహరించినట్లు వివరించారు. పిల్లలకు సంబంధించి సరైన ఆధారాలను పట్టుకొని కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి సెల్ నంబర్ 87126 85122లో సంప్రదించి పిల్లలను తీసుకువెళ్లాలని సూచించారు. -
అగర్తల టు కన్యాకుమారి సైకిల్యాత్ర
వరంగల్ క్రైం: కాజీపేట పోలీస్, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను అపహరించిన ముఠాను టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో నిందితులను విచారించగా మరో ముగ్గురు చిన్నారులు వివిధ ప్రాంతాల్లో అపహరణకు గురై ప్రస్తుతం శిశు సంక్షేమశాఖ సంరక్షణలో ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వారి తల్లిదండ్రులు సరైన ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో చిన్నారుల్లో ఒకరైన ఆరేళ్ల వయస్సు గల బాబును 2023 అక్టోబర్లో కాజీపేట రైల్వే ప్లాట్ ఫాం నుంచి అపహరించగా, ఏడు నెలల పాపను గతేడాది మంచిర్యాల రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో, ఇంకో ఐదు మాసాల పాపను రామగుండం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అపహరించినట్లు వివరించారు. పిల్లలకు సంబంధించి సరైన ఆధారాలను పట్టుకొని కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి సెల్ నంబర్ 87126 85122లో సంప్రదించి పిల్లలను తీసుకువెళ్లాలని సూచించారు. -
మహిళా సంఘాలను బలోపేతం చేయాలి
మల్లాపూర్: మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మండలంలోని రాఘవపేటలో ఈజీఎస్ నిధులు రూ.30లక్షలతో నిర్మించనున్న మూడు వీవోఏ భవనాలకు గురువారం భూమి పూజ చేశారు. మహిళాసంఘాలను ప్రభుత్వం బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మహిళాసంఘాలు ఆర్థికంగా వృద్ధి చెందడానికి.. సమావేశాలు, శిక్షణ కోసం వీవోఏ భవనాలు ఎంతోగానే ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. అనంతరం పెద్దమ్మతల్లి జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సర్పంచ్ తోట శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీకాంత్, పీఆర్ ఏఈ రాగసుధ, ఏపీఎం విమోచన, సీసీ లక్ష్మీరాజం, ఉపసర్పంచ్ నర్సయ్య, వార్డుసభ్యులు పాల్గొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ రాఘవపేటలో వీవోఏ భవనాలకు భూమిపూజ -
క్యాంపులకు చలోచలో..
కోరుట్ల: గెలుపోటముల లెక్క తేలకముందే క్యాంపు రాజకీయాలకు రంగం సిద్ధంమైంది. కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరినీ శుక్రవారం ఉదయమే క్యాంపులకు తరలించే సన్నాహాల్లో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. చైర్మన్ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీల్లో కీలకపాత్ర పోషించనున్న బీజేపీ కూడా తమ అభ్యర్థులను కట్టుదిట్టం చేస్తోంది. ఎవరి ధీమా వారిదే.. కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో ఎవరికి వారు గెలుపు ధీమాపై ఉన్నారు. కోరుట్లలోని మొత్తం 33 స్థానాల్లో 23 గెలుచుకుంటామని కాంగ్రెస్ చెబుతుండగా.. కనీసం 15స్థానాలు కై వసం చేసుకుంటామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. వీరితోపాటు బీజేపీ తమకు మొదటిసారి 11 (డబుల్ డిజిట్) స్థానాలు వస్తాయని అంచనా వేస్తోంది. మెట్పల్లిలో మొత్తం 26 స్థానాల్లో కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతుండగా.. బీఆర్ఎస్ నాయకులు కూడా తాము తగ్గేది లేదని చెబుతున్నారు. ఇక్కడ మూడు నుంచి నాలుగు స్థానాలు స్వతంత్రులకు దక్కే అవకాశాలున్నాయని అంచనా. బీజేపీ 6 నుంచి 9 స్థానాలు దక్కుతాయన్న అంచనాల్లో ఉంది. క్యాంపు రాజకీయాలు షురూ.. జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో శుక్రవారం కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానున్న క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఉదయం ఐదు గంటల వరకే బ్యాగులు సర్దుకుని రెడీగా ఉండాలని రెండు పార్టీలు చెప్పినట్లు సమాచారం. మధ్యాహ్నం వరకు బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనున్న క్రమంలో ఎవరు క్యాంపులో ఉంటారో.. ఎవరు ఇంటిముఖం పడతారోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ క్యాంపు హైదరాబాద్ టు బెంగళూరుగా ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ క్యాంపు హైదరాబాద్లోననే ఊహా గానాలు వినవస్తున్నాయి. విహారయాత్రకు కాంగ్రెస్ అభ్యర్థులుధర్మపురి:మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు గురువారం రాత్రి క్యాంపునకు పయనమయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచనల మేరకు 15 మంది బయల్దేరి వెళ్లారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలి తాలు వెలువడనుండగా.. చైర్మన్ పదవిని కై వసం చేసుకునేందుకు క్యాంపు పేరుతో విహారయాత్రకు వెళ్లారు. ఈనెల 16న చైర్మన్ ఎన్నిక సమయానికి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వెళ్లిన బీజేపీ అభ్యర్థులు రాయికల్: రాయికల్ బల్దియాలోని 12వార్డుల్లో పోటీచేసిన బీజేపీ అభ్యర్థులు గురువారం రెండు వాహనాల్లో హైదరాబాద్కు బయల్దేరారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అభ్యర్థులంతా తమ ఆదీనంలో ఉండాలని అధిష్టానం సూచించడంతో హైదరాబాద్కు బయల్దేరారు. ఫలితాల రోజు కేవలం కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే లెక్కింపులో పాల్గొననున్నారు. రంగం సిద్ధం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ బెంగళూరు, హైదరాబాద్ తరలించే యోచన -
తొమ్మిదో వార్డులో 8వ వార్డు బ్యాలెట్ పేపర్లు
రాయికల్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాయికల్ జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో 9వ వార్డుకు సంబంధించిన ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చారు. కానీ.. వారికి 8వ వార్డు బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు. దీంతో ఓటర్లు, ఏజెంట్లు, అభ్యర్థులు వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కొంతసేపు పోలింగ్ నిలిచిపోయింది. మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో ఓటింగ్ యథావిధిగా కొనసాగింది. రెండు బ్యాలెట్ పేపర్లు మాత్రమే 9వ వార్డులో 8వార్డు పేపర్లు వచ్చాయని తెలిపారు. -
పోలింగ్కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
జగిత్యాల/ధర్మపురి: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పోలింగ్కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామన్నారు. అనంతరం ధర్మపురిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీ లించారు. వసతులు, ఏర్పాట్లపై ఓటర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నా రు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులున్నారు. ముగిసిన భాగవత సప్తాహంధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రంలోని బ్రాహ్మణ సంఘం భవనంలో నిర్వహించిన భాగవత సప్తాహం బుధవారం ముగిసింది. సమావేదం షణ్ముఖశర్మ ప్రవచనాలతో శ్రీమద్భాగవత సప్తాహ కథాయజ్ఞం చేపట్టారు. ఆరు రోజులపాటు సాగిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన దేశవేని గంగనర్సయ్య(54) బుధవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. గంగనర్సయ్య కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. చికిత్స చేయించినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో ఉరేసుకు ఆత్మహత్య చేసుకున్నాడు. గంగనర్సయ్య తండ్రి గంగారాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు. జమ్మికుంట: బజాజ్ ఆటో ఢీకొట్టిన ఘటనలో తలకు తీవ్ర గాయాలైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడని జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన మారపల్లి ఐలయ్య(59) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ధర్మారం బస్టాండ్ వైపు కాలినడకన వస్తుండగా.. వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన బుర్రగళ్ల రాజ్కుమార్ అనే వ్యక్తి అతివేగంగా బజాజ్ ఆటో నడుపుతూ ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలు కాగా.. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు అజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. జగిత్యాలక్రైం: జగిత్యాలలోని అరవింద్నగర్లో బుధవారం మహిళ మెడలోంచి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు రెండు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన గట్ల శైలజ నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడేసరికే దొంగలు పారిపోయారు. స్థానికులు, బంధువులు పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ ఏఎస్సై వేణు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రేగు పండ్ల కోసం వెళ్లి..వీణవంక: రేగు పండ్లు తెంపుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లారెడ్డిపల్లికి చెందిన ఈర్నాల శ్రీనివాస్–శారద దంపతుల కుమారుడు రాజు(11) ఆరోతరగతి చదువుతున్నాడు. మంగళవారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద రేగుపండ్ల కోసం వెళ్లి కాలు జారి బావిలో పడ్డాడు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు రాజు కనిపించకపోవడంతో వెతుకుతుండగా కొలిపాక శ్రీనివాస్ బావిలో శవమై కనిపించాడు. మృతుడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి విద్యార్థి దహన సంస్కారాలకు రూ.10వేలు అందజేశారు. -
బ్యాలెట్ బాక్స్ల్లో భవితవ్యం
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు జగిత్యాల వైపే పడింది. బ్యాలెట్ బాక్స్లు తెరిస్తే.. ఫలితాలు ఎటు వైపు ఉండబోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక్కడ నెలకొన్న పరిస్థితుల క్రమంలో హంగ్ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. జగిత్యాలలో 50 వార్డులు ఉండగా.. అధికార కాంగ్రెస్ బీఫామ్ గొడవతో రెండుగా చీలిపోయింది. ఈ అవకాశాన్ని ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ అభ్యర్థులు అందిపుచ్చుకున్నారు. బీఫామ్ విషయంలో కాంగ్రెస్లో సీనియర్ నాయకుడైన జీవన్రెడ్డికి 15 కేటాయించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని కాంగ్రెస్ వైపున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్కు 35 సీట్లు కేటాయించారు. ఇక్కడే విభేదాలు భగ్గుమన్నాయి. జీవన్రెడ్డి వర్గీయులు 50 మందిలో 15 మంది కాంగ్రెస్ తరుఫున పోటీ చేసినప్పటికీ మిగతా 35 స్థానాల్లో రెబల్స్ పోటీచేశారు. దీంతో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గానే మారింది. 50 స్థానాల్లో ఎమ్మెల్యే వర్గీయులు, 50 స్థానాల్లో జీవన్రెడ్డి వర్గీయుల మధ్య పోటీ జరిగినట్లయ్యింది. దీనిని అందిపుచ్చుకున్న బీజేపీ, బీఆర్ఎస్ కొంతమేర పుంజుకున్నట్లు తెలుస్తోంది. వణికిస్తున్న ఎయిర్ కండిషనర్ కాంగ్రెస్ రెబల్స్గా పోటీచేస్తున్న అభ్యర్థులకు ఒకరిద్దరు మినహా దాదాపు అందరికీ ఎయిర్ కండిషనర్ గుర్తు వచ్చింది. ఆ గుర్తుగల అభ్యర్థులు మార్మోగించారు. ప్రతి వార్డులో వీరు గట్టి పోటీ ఇచ్చారు. జీవన్రెడ్డి వర్గీయులు చాలామందికి ఈ గుర్తు రావడంతో ఆయనే స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేసినప్పటికీ పూర్తిస్థాయిలో చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. పంపకాల పర్వం అధికార కాంగ్రెస్.. రెబల్స్ మధ్య అత్యధిక పోటీ నెలకొనడంతో ఓ వైపు పోలింగ్ ప్రారంభమైనా కొన్ని వార్డుల్లో పంపకాలపర్వం కొనసాగింది. రెండురోజుల క్రితమే ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఇవ్వడంతోపాటు మద్యం, చీరలు, వెండి కుంకుమభరిణిలు పంపిణీ చేశారు. ఎక్కువగా కాంగ్రెస్ రెబల్స్కు ముందుకు సాగుతున్నట్లు వార్తలు రావడంతో మళ్లీ పంపకాల పర్వం మొదలుపెట్టారు. దాదాపు ప్రతి చోట రూ.2 వేలు ఇస్తే మరో అభ్యర్థి రూ.3 వేలు ఇచ్చినట్లు సమాచారం. ఒక వార్డులోనైతే ఓ అభ్యర్థి రూ.50లక్షల మేరకు ఖర్చు పెట్టగా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి తక్కువ ఖర్చు చేసినప్పటికీ గట్టి పోటీ ఇచ్చినట్లు తెలిసింది. చైర్మన్ అభ్యర్థులకూ రెబల్స్ చైర్మన్ అభ్యర్థులకూ రెబల్స్ బెడద నెలకొంది. అధికార కాంగ్రెస్లోనే చైర్మన్ సీటును ఆశిస్తున్నవారు రెబల్స్ను పెట్టి ఎదుటివారిని ఓడించే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్కడ పోటీ చేస్తున్న ప్రత్యర్థులకు వీరే డబ్బులు సమకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపు చైర్మన్ సీట్లు ఆశిస్తున్న ముగ్గురు ఒకరినొకరు ఓడించుకునే ప్రయత్నించినట్లు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది. పుంజుకున్న బీఆర్ఎస్, బీజేపీ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే వైపు రావడంతో ఆ పార్టీకి క్యాడర్ లేకుండా పోయింది. అయినా జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, ఎల్.రమణ ఆధ్వర్యంలో అన్ని స్థానాల్లో పోటీచేయగా.. చాలా స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి గతంలో ఐదు సీట్లు రాగా.. ఈ సారి మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. భిన్నమైన ఫలితాలు జగిత్యాలలో భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పాలకవర్గాలు కొనసాగాయి. గత ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ గెలుచుకుంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈసారి అనుకూల పవనాలు వీచినా.. ఇద్దరు నేతల మధ్య గొడవతో భిన్నమైన ఫలితాలు నెలకొనే అవకాశాలున్నాయి. -
ఓట్ల జగడం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్ కార్పొరేషన్ 58వ డివిజన్ జిల్లా పరిషత్ పోలింగ్బూత్లో బీఆర్ఎస్ నేతలు తమఓట్లు వేశారంటూ బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇది లాఠీచార్జ్కు దారి తీసింది. 32వ డివిజన్లో ఎంఐఎం, బీఆర్ఎస్ అభ్యర్థుల వర్గీయులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. 33వ డివిజన్లో దొంగ ఓట్లు పడ్డాయని ప్రచారం జరిగినా.. మున్సిపల్ కమిషనర్ ఖండించారు. 28 డివిజన్లో తమ నేతలను అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 49వ డివిజన్ రాంనగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి పద్మశ్రీ భర్త శ్రీనివాస్రెడ్డి సెల్ఫోన్ను బీజేపీ నాయకులు లాక్కుని పగులగొట్టార ని ఆరోపించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి బీజేపీ అభ్యర్థి భర్త ఎన్నం ప్రకాశ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 36వ డివిజన్లో పోలీసులతో స్వతంత్ర అభ్యర్థి యాదయ్య వాగ్వాదానికి దిగారు. 27 డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి బంధువు అయిన పోలీసు తమపై చేయి చేసుకున్నారని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఆరోపించాడు. పెద్దపల్లి జిల్లాలో.. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు అభ్యర్థి రజని కష్ణమూర్తి ఫొటోల గుర్తుతో కూడిన ఓటర్ స్లిప్పు పంపిణీ చేశారంటూ బీజేపీ అభ్యర్థి నిరసనకు దిగారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, మనోహర్రెడ్డి అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ ఎనిమిదోకాలనీ 17వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో అధికారుల వద్ద ఉండాల్సిన ఓటింగ్ లిస్టు బయటికి వచ్చిందని బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా జగిత్యాలలోని 31వ వార్డులో ఎంఐఎం బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. 26వ వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన బాపురపు చంద్రశేఖర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మెట్పల్లి మున్సిపాలిటీలో 12వ వార్డులో ఓ అంగన్వాడీ కార్యకర్త అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపణలు రావడంతో విధుల నుంచి తొలగించారు. జగిత్యాల 27వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థికి మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల 2వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఏకంగా ఒకరినొకరు తోసుకున్నారు. కోరుట్లలో 27 వార్డులో స్వతంత్ర అభ్యర్థి తన ఎన్నికల గుర్తు అయిన ఆపిల్ పండ్లు పంచుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి తనను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓ ఎస్సై సపోర్టు చేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. వేములవాడ మున్సిపాలిటీలో 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మారం కుమార్ సతీమణి పోలింగ్ ఏజెంట్గా మరో వ్యక్తి ఐడీ కార్డు మెడలో వేసుకుని ఓట్లు అడిగినట్లు కాంగ్రెస్ అభ్యర్థి తోట రాజు ఆరోపించారు. -
70.10
పోలింగ్ చిన్నచిన్న సంఘటనలు.. జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య నినాదాల విషయమై గొడవ చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోవడంతో సద్దుమణిగింది. 26వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పులి రమ పోటీ చేయగా.. ఆమె కొడుకు శ్రీధర్ తనను అన్యాయం చేశారంటూ కంటతడిపెట్టారు. ఫోన్ లాక్కోవడంతోపాటు దొంగ ఓట్లు వేయిస్తున్నారని బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో వార్డులో అధికార, స్వతంత్ర అభ్యర్థుల మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు వచ్చి గొడవను నిలువరించారు. కోరుట్ల 27వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఆపిల్ పండ్లు పంపిణీ చేయడంతో ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెట్పల్లిలోని 12వ వార్డులో అంగన్వాడీ కార్యకర్త అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తోందని అభ్యర్థులు ఆరోపించగా.. ఆమెను విధుల నుంచి తొలగించారు. అసౌకర్యాల మధ్య.. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1600 నుంచి 1800 మంది ఓటర్లు ఉన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలను దూరంగా ఏర్పాటు చేశారు. అసౌకర్యాల మధ్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని బూత్లలో పోలీసులు, సిబ్బంది వృద్ధులు, దివ్యాంగులు, అంధులను తీసుకెళ్లి ఓటు వేయించారు. పోలీసులు 100 మీటర్ల దూరంలో ప్రజలను నిలిపివేశారు. మెట్పల్లిలో మందకొడిగా ప్రారంభం మెట్పల్లి: బల్దియాలో ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ మందకొడిగానే సాగింది. ఒకటి, రెండుచోట్ల తప్ప ఎక్కడా ఓటర్లు క్యూలో ఉన్నట్లు కనిపించలేదు. ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 46,201 మంది ఓటర్లకు 31,975 మంది మాత్రమే ఓటేశారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కేంద్రాలకు వచ్చి ఓటేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటేశారు. కోరుట్లలో మధ్యాహ్నం నుంచి జోరుగా.. కోరుట్ల: మున్సిపాలిటీలో మధ్యాహ్నం నుంచి పోలింగ్ ఊపందుకుంది. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఎక్కడా పెద్దగా సందడి లేకుండా ప్రశాంతంగా ముగిసింది. 32వ బూత్లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా బూత్ల్లో ఇంటి నంబర్లకు అనుగుణంగా ఓట్లు లేక ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. ఒకటో వార్డుకు చెందిన ఇద్దరు మహిళలు 12 వార్డులో నమోదు కావడంలో తికమకపడ్డారు. చాలావార్డుల్లో చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉండటం గమనార్హం. కొంతమంది పేర్లు జాబితాలో లేకపోవడంతో బీఎల్వోలు మీసేవ కేంద్రాల్లో వెతుక్కోవాలని చెప్పడంతో ఓటేసేందుకు వచ్చిన మహిళలు నిరాశకు గురయ్యారు. రాయికల్లో ప్రశాంతం రాయికల్: మున్సిపాలిటీలోని 12 వార్డులకు 24పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. 13,084 మంది ఓటర్లకు 9,808 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా ఐదో వార్డులో 79.01 పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా 11వ వార్డులో 71.23 శాతం నమోదైంది. జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి, జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, మున్సి పల్ కమిషనర్ కీర్తి నాగరాజు, ఎస్సై సుధీర్రావు పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ధర్మపురిలో కట్టుదిట్టం ధర్మపురి: బల్దియాలో 15 వార్డుల్లో 13,988 మంది టు. 10,549 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలు వచ్చి ఓటేసి వెళ్లిపోయారు. పోలీస్శాఖ వారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు. జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అక్కడక్కడ చిన్నచిన్న ఘటనలు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నెమ్మదిగా సాగినా మధ్యాహ్నం వరకు ఊపందుకుంది. మొత్తంగా 70.13 శాతం ఓటింగ్ నమోదైంది. 2,31,627 మంది ఓటర్లకు 1,62,433 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం పెంచాలని అధికారులు అవగాహన కల్పించినా 70శాతానికి మించలేదు. 2020 నాటి మున్సిపల్ ఎన్నికల్లో 72.09 శాతం నమోదుకాగా.. ఈసారి కాస్త తగ్గింది. ఈసారి మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలామంది యువత ఓటింగ్లో పాల్గొనలేదు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు పెద్దగా ఆసక్తి చూపలేదు. కలెక్టర్ సత్యప్రసాద్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఎస్పీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.శాతంబల్దియా వార్డులు కేంద్రాలు ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు పోలైన ఓట్లు శాతం ధర్మపురి 15 29 14,035 6,722 7310 3 10549 75.16 జగిత్యాల 50 149 94,800 46,039 48742 19 65985 69.60 కోరుట్ల 33 106 63,507 30,604 32901 2 44116 69.47 మెట్పల్లి 26 75 46,201 22,283 23917 1 31975 69.21 రాయికల్ 12 24 13,084 6,157 6927 0 9808 74.96 మొత్తం 136 379 2,31,627 1,11,805 1,19,797 25 162433 70.13 -
స్ట్రాంగ్రూమ్కు బ్యాలెట్ బాక్స్లు
జగిత్యాలక్రైం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్స్లను భారీ బందోబస్తు మధ్య ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. స్ట్రాంగ్ రూం పరిసరాల్లో పోలీసు అధికారులు, సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. మల్టీలేయర్ భద్రతను అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా పెట్టామన్నారు. ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలిపారు. దుబ్బరాజన్న జాతరకు ప్రత్యేక బస్సులుజగిత్యాలటౌన్: సారంగాపూర్ మండలం పెంబట్ల–కోనాపూర్లోని దుబ్బరాజన్న స్వామి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఆలయంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జాతర ఉంటుందని, బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. జగిత్యాల నుంచి రూ.30 చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. రాయికల్ మండలం కొత్తపేట నాగాలయానికీ ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని స్థానాలూ మావే.. జగిత్యాల: జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయబోతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీమంత్రి కొప్పలు ఈశ్వర్, ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, రాజేశంగౌడ్, రమణరావు ఎంతో కృషి చేశారని, అన్ని మున్సిపాలిటీల్లో జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థుల తరఫున కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు శ్రీహర్షకొడిమ్యాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న కోల శ్రీహర్షగౌడ్ ఎస్జీఎఫ్ అండర్–17 విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ వేణు తెలిపారు. కళాశాల స్పోర్ట్స్ ఇన్చార్జి భాస్కర్, క్లాస్ టీచర్ జయపాల్ రెడ్డి, అధ్యాపకులు శ్రీహర్షను అభినందించారు. కోరుట్ల, మెట్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం కోరుట్లరూరల్: కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. పట్టణంలో బుధవారం ఎన్నికల సరళిని పరిశీలించారు. 13వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు. ఎస్కేఎన్ఆర్ కళాశాలకు రెండు రోజులు సెలవుజగిత్యాల: మున్సిపల్ ఎన్నికల లెక్కింపు సందర్భంగా జగిత్యాల ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఈనెల 12, 13 తేదీల్లో సెలవు ప్రకటించినట్లు ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది గమనించాలని సూచించారు. -
ఓటు వేసేందుకు కర్నాటక నుంచి రాక
● ఆదర్శంగా మారిన యువ ఇంజినీర్ జయాకర్ రాజు కోల్సిటీ(రామగుండం): కర్నాటక రాష్ట్రంలో పనిచేస్తున్న ఓ యువ ఇంజినీర్ పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించడానికి రెండురోజులు సెలవుపెట్టి తన ఇంటికి వచ్చాడు. గోదావరిఖని రమేశ్నగర్కు చెందిన జయాకర్రాజు కర్నాటక రాష్ట్రంలోని స్టాల్ప్లాంట్లో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. రోజూ దినపత్రికలు చదవడం అలవాటు ఉన్న జయాకర్రాజుకు రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని తెసింది. గోదావరిఖనిలోని తన మిత్రుల ద్వారా ఎన్నికల వివరాలు సేకరించాడు. ఓటుహక్కును ఎన్నికల్లో వినియోగించుకోవడానికి గోదావరిఖనికి వచ్చాడు. బుధవారం జవహార్నగర్లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటువేశాడు. తనవంతు బాధ్యత నిర్వర్తించాని తెలిపాడు. ఎక్కడ పనిచేస్తున్నామన్నది ముఖ్యం కాదని, మన ప్రాంత అభివృద్ధికి మన ఓటు ఎంతో కీలకమన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న జయాకర్ రాజు -
● మహిళల తీర్పే కీలకం
రాయికల్: మున్సిపాలిటీలోని 12 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్లో సైలెంట్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేశారు. డబ్బులు తీసుకున్న ప్రతి ఓటరూ తమకే ఓటేస్తారని ఆశావహులంతా ఎవరికివారు అంచనాలు వేసుకుంటున్నా.. వారు ఎవరికి ఓటు వేశారో మాత్రం అంతుచిక్కడం లేదు. బల్దియాలో ఏ పార్టీకీ పూర్తిస్థాయిలో మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. హంగ్ ఏర్పడితే స్వంతంత్రులు కీలకంగా మారనున్నారు. చైర్మన్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన కట్కం రవీందర్, మచ్చ నారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి గెలుపోటములపై తీవ్ర చర్చ నడుస్తోంది. వీరి విషయంలో కొందరు బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు సమాచారం. -
ఓటు లేకున్నా.. పోలింగ్ బూత్లోకి
జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్: ఓటు లేకున్నా.. ఓ వ్యక్తి ఓటేసేందుకు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఘటన జిల్లాకేంద్రంలోని ఏడోవార్డు బూత్ నంబర్ 22లో చోటుచేసుకుంది. దొంగ ఓటు వేయడానికి వచ్చాడని అనుమానించిన పోలింగ్ ఏజెంట్లు పోలీ సులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఓటు వేయలేదని తేలడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. అలాగే 26వ వార్డులో ఓటేసేందుకు ఓ వ్యక్తి రాగా.. పోలింగ్ కేంద్రం వద్దే స్వతంత్ర అభ్యర్థి భర్త సదరు వ్యక్తిని గుర్తించి నిలదీశాడు. దొంగ ఓటు వేసేందుకు వచ్చినట్లు ఒప్పుకున్నాడు. అతడిని పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
భీమన్న గుడిలో మహాజాతర
వేములవాడ: మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఈ యేడు భీమన్న ఆలయంలో నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో ఈసారి భీమేశ్వరస్వామి ఆలయంలోనే శివరాత్రి మహాజాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ చరిత్రలో తొలిసారి రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో దర్శనాలు, మొక్కులకు భీమన్న ఆలయానికి గత అక్టోబర్ 11న మార్చారు. దీంతో భక్తులు రాజన్న ఆలయం ముందు ప్రచారరథంలో స్వామి వారిని దర్శించుకుని, భీమన్న గుడిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈనెల 14, 15, 16 తేదీల్లో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఉన్నందున భీమన్న ఆలయంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రాజన్న ఆలయ చరిత్రలోనే మొదటిసారి ఉత్సవాల వేదిక మారింది. భక్తుల సౌకర్యమే లక్ష్యం హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆలయం మరింత వైభవంగా రూపుదిద్దుకునే దిశగా రూ.150కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులతో ప్రధాన ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ, భద్రత సమస్యల దృష్ట్యా భీమన్న ఆలయాన్ని జాతర వేదికగా ఎంపిక చేశారు. ఆమేరకు గత డిసెంబర్ 30న జాతర సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు మహా జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో గుడి చెరువు పార్కింగ్ స్థలంతోపాటు భీమన్న ఆలయం వద్ద తాత్కాలిక షెడ్లు, క్యూలైన్లు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, ఆలయ అధికారులు, జిల్లాలోని వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనాలు ఇలా.. ● ఈనెల 14, 15, 16 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతర ఉత్సవాలను రాజరాజేశ్వరస్వామికి ఏకాంతంగా సేవలు నిర్వహిస్తూనే భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్శర్మ తెలిపారు. భీమన్న ఆలయంలో... ● 14న ఉదయం 7.30 గంటలకు టీటీడీ ఆధ్వర్యంలో పట్టువస్త్రాల సమర్పణ. ● 15న ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టువస్త్రాల సమర్పణ. ● 14న రాత్రి 11.30 నుంచి 15న తెల్లవారుజాము 3.30 గంటల వరకు పట్టణ ప్రజలకు దర్శనాలు. ● 15న ఉదయం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులకు దర్శనాలు. ● 15న సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివదీక్షా స్వాములకు దర్శనాలు. ● 15న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అనువంశిక అర్చకుల ఆధ్వర్యంలో మహాలింగార్చన. ● 15న రాత్రి 11.35 గంటల నుంచి లింగోద్భవ కాలంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. కొనసాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు ఏర్పాట్లు చేసిన అధికారులు ఈనెల 14 నుంచి ఉత్సవాలు మహా శివరాత్రి జాతర మహోత్సవాలను ఈసారి భీమేశ్వరాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు పనులు పరిశీలించాం. వివిధ శాఖలకు అప్పగించిన పనులపై సమీక్షిస్తూ పరిశీలిస్తున్నాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం. – గరీమా అగ్రవాల్, కలెక్టర్, ఉత్సవ కమిటీ చైర్పర్సన్ -
వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆందోళన
వేములవాడ: పట్టణంలోని 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి పోలింగ్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. కృష్ణవేణి మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఎస్సై బీఆర్ఎస్ నాయకులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అందరిని 100 మీటర్ల దూరంలో ఉంచేశారు. 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఆయన సతీమణి మరొకరి ఐడీ కార్డు మెడలో వేసుకుని పోలింగ్ ఏజెంట్గా కూర్చుని ప్రచారం చేసిందని.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోట రాజు ఆరోపించారు. పోలీసులు విచారణ చేపట్టి ఆమెను బయటకు పంపించి వేశారు. కోడ్ ఉల్లంఘించిన ఇద్దరిపై కేసు వేములవాడలోని 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మారం కుమార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున వారి దంపతులపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. పోలింగ్స్టేషన్లో తన తరఫున ఉన్న ఏజెంట్ ఐడీ కార్డును ఆయన సతీమణి వేసుకుని ఉండడం, పోల్ చీటి వెనుక భాగంలో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ముద్రించిన అంశంపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి దంపతులపై కేసు -
ట్రాన్స్ జెండర్ల ఆదర్శం
కోల్సిటీ(రామగుండం)/పెద్దపల్లిరూరల్: రామగుండం నగరంలోని ట్రాన్స్జెండర్లు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు అవగాహన కోసం నియమించిన ట్రాన్స్జెండర్ ఐకాన్ ఓరుగంటి లైలా ఆదేశాల మేరకు జిల్లా మోడ్రన్ అవీర్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించారు. వారు మాట్లాడుతూ, ప్రలోభాలకు గురికాకుండా సరైన నాయకున్ని ఎన్నుకునేందుకు ఓటుహక్కు వినియోగించుకున్నామన్నారు. పురుషులు, మహిళలకు తీసిపోని విధంగా ట్రాన్స్జెండర్స్ను ఎన్నికల సంఘం గుర్తించి, ప్రత్యేక విభాగం కింద ఓటుహక్కు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటుహక్కును వినియోగించుకున్న వారిలో జిల్లా మోడ్రన్ అవరైస్ సొసైటీ సభ్యులు సమక్క, భవాని, శివాని, లాస్య, సుష్మా, అనిత, శ్రావ్య శ్రీవర్ష, అన్విత, అపరంజి, గాయత్రి తదితరులు ఉన్నారు. మరోవైపు.. జిల్లాకేంద్రంలో హిజ్రాలు జ్వాలాముఖి, రిషిత తమ ఓటుహక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని పరశురాంనగర్కు చెందిన ట్రాన్స్జెండర్ నాంపల్లి కావ్య తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటుహక్కు వినియోగించుకున్న వైనం -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
జగిత్యాలక్రైం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడనున్నారు. ప్రజలు స్వేచ్ఛగా.. శాంతియుతంగా ఓటు వేయాలని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. ఎన్నికల బందోబస్తుపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇప్పటివరకు నమోదైన కేసులపై... మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జి ల్లాలో ఇప్పటికే 16 కేసులు నమోదు చేశాం. రూ.50వేల కంటే ఎక్కువ నగదు, ఎక్కు వ మొత్తంలో గిఫ్ట్ ఐటమ్స్ రవాణాపై సరైన ఆధారాలు లేకుంటే కేసులు నమోదు చేస్తున్నాం. అలాగే జిల్లా సరిహద్దుల్లో ఇప్పటివరకు ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేశాం. ప్రతి వాహనాన్ని అణువణువునా తనిఖీ చేసిన తర్వాతే జిల్లాలోకి అనుమతిస్తున్నాం. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే సుమారు 100 మందిని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో తహసీల్దార్ల ముందు బైండోవర్ చేశాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డులకుగాను మొ త్తం 379 పోలింగ్ కేంద్రాలు ఉన్నా యి. ఇందులో 30 పో లింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించాం. వాటి ని ఇప్పటికే గుర్తించి అక్కడ ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా అన్ని చర్యలు చేపట్టాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అదనపు బందోబస్తు ద్వారా ఎన్నికలు స జావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. నలు గురు డీఎస్పీలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 11 మంది సీఐలు, స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేశాం. మున్సిపల్ ఎన్నికల్లో చేపడుతున్న బందోబస్తుపై..జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సుమారు 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. -
చట్టానికి లోబడే ప్రచారంలో పాల్గొన్నాం
ధర్మపురి: పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టారని, తాము మాత్రం అధికారం అడ్డం పెట్టుకుని ఎవరినీ ఇబ్బంది పెట్టిన చరిత్ర లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ గొప్పదని, ఆయన చూపిన అడుగు జాడల్లో గెలిచిన తాను ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో మంత్రిగా కొనసాగిన కొప్పుల ఈశ్వర్ ధర్మపురి వాసులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సీఎంను ఒప్పించి సంస్కృతాంధ్ర కళాశాలకు నిధులు మంజూరు చేయించానని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతానని అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగు అమలు చేశామని మిగిలినవి త్వరలో నెరవేర్చుతమని పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యాలపై ఆగ్రహం సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాకు గౌరవం ఇవ్వాలి తప్ప నోరు పారేసుకోవద్దని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదని, తా ము రెండేళ్లలో నిరుపేదలందరికీ కార్డులతోపాటు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు ఏర్పాట్లు చేస్తామన్నారు. తాము ఎన్నికలకోడ్ను ఉ ల్లంఘించలేదని, బ్రాహ్మణ సంఘంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి వెళ్లివస్తే.. సోషల్ మీడియాలో వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని అన్నా రు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులున్నారు. -
జగిత్యాల
29.0/19.0Iగరిష్టం/కనిష్టంగిట్టుబాటు లేక.. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లోని పార్కింగ్ స్టాండ్ నిరుపయోగంగా మారింది. ఆదాయాన్ని పరిశీలించకుండా ఊహాజనిత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంజన్నకు కోరుట్ల ఎమ్మెల్యే పూజలుమల్యాల: కొండగట్టు అంజన్నను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. సాయంత్రం చలిగాలులు వీస్తాయి. IIలోuబుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 -
సమర్థవంతంగా పనిచేయండి
జగిత్యాలక్రైం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అశోక్కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. ఓటర్లు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు పోలీస్శాఖ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లాకేంద్రంలో మంగళవారం బ్రీఫింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు, సిబ్బంది చేయాల్సినవి, చేయకూడని పనులపై వివరించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 136 వార్డులకు 379 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మొత్తంగా 900 మంది పోలీస్ సిబ్బందిని నియమించామని తెలిపారు. పోలింగ్ సామగ్రి, సిబ్బందిని ఎస్కార్ట్ మధ్య 45 రూట్లలో తరలించామన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా నలుగురు డీఎస్పీలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 11 మంది సీఐలు, స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, ఎస్సైల ఆధ్వర్యంలో పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారికి సెల్ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్బాటిళ్లు, వాటర్ బాటిళ్లు వంటి వాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని సూచించారు. పోలింగ్ బూత్లో సెల్ఫీలు దిగడంపై నిషేధమని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ రఘుచందర్, సీఐలు కరుణాకర్, సుధాకర్, రవి, రాంనరసింహారెడ్డి, ఆర్ఐ వేణు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మంచి నాయకుడిని ఎన్నుకుందాం..
ఓటు అనేది వజ్రాయుధం వంటిది. దానిని దుర్వినియోగం చేస్తే ఐదేళ్లపాటు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఆలోచించి ఓటువేయాలని అభిప్రాయపడ్డారు పలువురు. మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. – రాయికల్ సమస్యలు పరిష్కరించే వారినే.. మున్సిపాలిటీల్లో సమస్యలపై అవగాహన ఉండి.. పరిష్కరించే నాయకుడిని ఎన్నుకోవాలి. అప్పుడే పట్టణం అభివృద్ధి చెందుతుంది. ప్రలోభాలకు లొంగి ఓటును దుర్వినియోగం చేసుకోవద్దు. సమర్థవంతమైన అభ్యర్థిని ఎంపిక చేసుకుని ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి మేలు. – చెరుకు మహేశ్వరశర్మ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓటును అమ్ముకోవద్దు మున్సిపల్ ఎన్నికల్లో అమూల్యమైన ఓటును డబ్బులకు అమ్ముకోవద్దు. ఒకవేళ డబ్బు తీసుకున్నట్లయితే గెలిచాక సదరు ప్రజాప్రతినిధి మనం చెప్పినా మన మాట ఎవరూ వినరు. నిజాయితీగా ఓటు వేస్తే సమస్యలపై నిలదీయొచ్చు. ఎప్పుడు పరిష్కరిస్తావని ప్రశ్నించవచ్చు. – పారిపల్లి వర్షిత, టీచర్ అవినీతికి అవకాశం ఇవ్వొద్దు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులందరూ ప్రచారం చేస్తారు. మేం మంచి చేస్తామంటే.. మేం చేస్తామని చెబుతారు. కొందరు డబ్బులు వంటి ప్రలోభాలకు గురిచేస్తారు. గెలిచిన తర్వాత పదిరెట్లు మననుంచే వసూలు చేస్తారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దు. – బూర్ల సాత్వి గృహిణి , రాయికల్ సమర్థులకే పెద్దపీట రాజకీయాల్లో సమర్థవంతమైన నాయకులుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక ఓటు ద్వారా సమర్థవంతమైన నాయకుడికి అవకాశం ఇస్తే ఐదేళ్ల పాటు అభివృద్ధి చెందుతుంది. సమర్థవంతమైన నాయకులను ఎన్నుకునేందుకు ఓటును కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. – అంజిత్రెడ్డి, రాయికల్ ప్రజల కోసం పనిచేయాలి ఓటు వజ్రాయుధం. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు ఉపయోగించుకుంటా. ప్రజల కోసం పనిచేసే నాయకుడిని గెలిపించేందుకు ఓటేస్తా. స్వార్థపరులను గెలిపిస్తే అవినీతి పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రజ సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్నోడినే గెలిపించాలి. – కొత్తపెల్లి రంజిత్, న్యాయవాది ఆలోచించి ఓటు వేయాలి ఓటు అనేది మన ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలి. ఐదేళ్లు మనల్ని పాలించే ప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు బాగా ఆలోచించి ఓటు వేయాలి. నిస్వార్థంగా నిజాయితీతో పనిచేసే వారిని ఎన్నుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు. – బాలె శేఖర్, విద్యావేత్త -
నేడే ఓట్ల పండుగ
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోని 136వార్డులకు సంబంధించిన సామగ్రిని ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బందికి అందించగా.. వారంతా సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లతో సహా బస్సులు, ఇతర వాహనాల్లో కేంద్రాలకు చేరుకున్నారు. పంపిణీ కేంద్రాల్లో టెంట్లు, టేబుల్స్ వేయించారు. పోలీసు, పోలింగ్ సిబ్బందికి భోజనం సమకూర్చారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో పంపిణీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రికార్డు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డులకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 2,31,627 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 379 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 455 మంది పీవోలు, 455ఏపీవోలు, 1637 మంది సిబ్బందిని నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ను ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికల జనరల్ అబ్జర్వర్ కాళిచరణ్ సుదమారావు పర్యవేక్షించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో నిఘా ఉంచారు. మున్సిపల్ ఏర్పాట్లు పూర్తి రాయికల్: మున్సిపాలిటీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ.. బల్దియాలో 13,084 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై సుధీర్రావు పేర్కొన్నారు. కోరుట్లలో 102 పోలింగ్ కేంద్రాలు కోరుట్లరూరల్: పట్టణ శివారులోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబూషన్ కేంద్రంలో సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందించారు. పట్టణంలోని 33వార్డులకు 102 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు సీఐ సురేష్ బాబు తెలిపారు. ధర్మపురిలో 29 కేంద్రాలు ధర్మపురి: బల్దియాలో 15 వార్డులకుగాను 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేశారు. వీరంతా ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది మెట్పల్లి: పట్టణంలో 26వార్డులకు 75 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్సారెస్పీ క్యాంపులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి అధికారులు సామగ్రి అందించారు. అక్కడి నుంచి వాహనాల్లో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరారని కమిషనర్ మోహన్ తెలిపారు. రాయికల్: బ్యాలెట్ బాక్స్లతో సిబ్బంది సమస్యలపై ఫిర్యాదుకు టోల్ఫ్రీ నంబరు 96662 34383 -
ధర్మపురిని ఏం అభివృద్ధి చేశావ్..?
జగిత్యాల: అధికారంలోకొచ్చి రెండేళ్లవుతున్నా ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ప్రశ్నించారు. ఇప్పటికీ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని తెలిపారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ధర్మపురి ఒకటని, మంత్రిగా ఇప్పటివరకు ఏం చేశాడో అడ్లూరి చెప్పాలన్నారు. డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్, రెవెన్యూ డివిజన్, ఐటీఐ కళాశాల ఏర్పాట హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో రెండు గురుకులాలు, మాతాశిశు సంక్షేమ కేంద్రం, డయాలసిస్సెంటర్, రోడ్ల నిర్మాణం, మురికినీరు గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకున్నామన్నారు. లక్ష్మణ్కుమార్ మాత్రం ఎక్కడా తట్టెడు మట్టి తీయలేదని ఎద్దేవా చేశారు. వికలాంగులు ఉపకరణల కోసం ఎదురుచూస్తున్నారని, బడ్జెట్లో ఎన్ని నిధులు పెట్టావో చెప్పాలన్నారు. ధర్మారం, నందిమేడారం రిజర్వాయర్ నీళ్లు సిద్దిపేట, సిరిసిల్లకు పోతున్నాయని అంటున్నాడని, ఆ ప్రాజెక్ట్లపై మంత్రికి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి..? ఏయే జిల్లాలకు వెళ్తాయి..? జిల్లాలవారీగా నీటి వాటా ఎంత ఉంటుందో ముందుగా తెలుసుకోవాలన్నారు. లక్ష్మణ్కుమార్ తన ఆస్తులపై మాట్లాడుతున్నారని, అది ప్రజలందరికీ తెలుసునన్నారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ పారదర్శకంగా, బాధ్యతతో పనిచేశానన్నారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీమంత్రి రాజేశంగౌడ్ పాల్గొన్నారు. -
శ్రీచైతన్య విద్యార్థులకు ఘన స్వాగతం
కరీంనగర్టౌన్: మంకమ్మతోటలోని శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్సీసీ విద్యార్థులకు కరీంనగర్లో ఘన స్వాగతం లభించింది. కళాశాలకు చెందిన బి.సంధ్య, కె.అజయ్ అనే విద్యార్థులు 2026 సంవత్సరానికి గాను ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే క్యాంపునకు ఎన్నికయ్యారు. సుమారు 40 రోజులపాటు శిక్షణ పొంది జనవరి 26న రాష్ట్రపతి, దేశ ప్రధాని సమక్షంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కళాశాలకు చెందిన సంధ్య కర్తవ్యపత్ ర్యాలీలో, అజయ్ పీఎం ర్యాలీలో పాల్గొన్నారు. సోమవారం క్యాంప్ పూర్తి చేసుకొని వచ్చిన ఆ ఇద్దరితో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు 9టీ బెటాలియన్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజధానిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పరేడ్లో తమ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సన్మానం చేసి యాజమాన్యం తరఫున రూ.25,000 చొప్పున నగదు బహుమతి అందజేసినట్లు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణారెడ్డి, ఎన్సీసీపీఐ స్టాఫ్ పి.అశోక్, కేర్ టేకర్ జి.రాజేందర్, 9 తెలంగాణ బెటాలియన్ సుబేదారు విజయ్కుమార్, హవల్దార్ పీవీరావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
సంతోషంగా ఉంది
హైదరాబాద్ నారాయణ గూడలోని ఆర్బీవీఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఓటు మన జన్మ హక్కు. దాన్ని సద్విని యోగం చేసుకుంటా. అవినీతిపరులకు కాకుండా అభివృద్ధికి పాటుపడే వ్యక్తికి ఓటేస్తా. – ఆవుదరి సిరిచందన, రాంనగర్ హైదరాబాద్లోని ఓరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నా. గత సంవత్సరం ఓటు నమోదు చేయించుకున్నా. మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వినియోగించుకోనున్నాను. మనది ప్రజాస్వా మ్య వ్యవస్థ. కీలకమైనది, అత్యంత విలువైనది దేశం కల్పించిన హక్కు ఓటు. ఓటు సక్రమంగా వినియోగిస్తే నిజాయితీపరులు ఎన్నికవుతారు. – పల్లెర్ల స్నేహిత, అశోక్నగర్ గచ్చిబౌలిలోని నియట్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఓటేయడం ఎంతో ముఖ్యం. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ.. అభివృద్ధి కోసం, ప్రజలకు స్వార్థం లేకుండా సేవలందించాలనే ఉద్దేశంతో పోటీలో నిలబడిన వారిని గుర్తించి ఓటెయ్యాలి. – నరాల సాయి మనుహార్ష్ -
కుటుంబ సభ్యులతో కలిసి..
హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నా. ఓటరుగా గత సంవత్సరం నమోదు చేసుకున్నా. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకుంటా. భారత పౌరుడిగా ఓటును సద్వినియోగం చేసుకునే అవకాశం తొలిసారిగా వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి ఓటేస్తా. – రాచమల్ల అభిలాష్, అశోక్నగర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉ ద్యోగం చేస్తున్నా. ఓటు హక్కు రావడమే కాదు.. దాన్ని సద్వి నియోగం చేసుకోవడం కూడా గొప్ప విషయమే. గత సంవత్సరం నమోదు చేసుకున్నా. తొలిసారిగా ఓటు వినియోగించుకుంటున్నా. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన యువతకు ఓటేస్తా. వారిలో అవినీతి ఉండదు. – వాసాల స్నేహ, సాయినగర్ -
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
మేడిపల్లి: బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తొంబర్రావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం.. తొంబర్రావుపేటకు చెందిన సంగ రాజు (52) కొంతకాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు కుమారుడు రమేశ్, కూతురు ధరణి ఉన్నారు. సంగ రాజు భర్త చిన్న భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. శాస్త్రవేత్తకు డాక్టరేట్కరీంనగర్రూరల్: ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పని చేసిన కల్వల శేఖర్కు వ్యవసాయ విద్యలో పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ సాత్నకోత్సవంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక నిపుణులు ప్రభు పింగళి పట్టాను అందించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా పని చేస్తున్న శేఖర్.. ఉత్తర తెలంగాణలోని నేలల్లో అధిక భాస్వరం తగ్గించి చేసే యాజమాన్య పద్ధతులు, ప్రధాన పంటలను ప్లాంటర్తో ఎత్తు మడుల్లో సాగు చేస్తే అధిక వర్షాలు, తేమ తక్కువగా ఉన్న సందర్భాల్లో కలిగే పంట నష్టాలను కచ్చితంగా తగ్గించొచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఫ్రొఫెసర్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించారు. -
తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ
● అనాథ వృద్ధులను పలకరించిన విద్యార్థులు ● వృద్ధుల జ్ఞాపకాలు.. విద్యార్థుల పలకరింపులు ● అనుబంధాల వేదికగా మా అనాథ వృద్ధాశ్రమం గంభీరావుపేట(సిరిసిల్ల): ఎవరూ లేరని ఆ గుండెలు తడారిపోయాయి. మలివయసులో అనాథ వృద్ధాశ్రమంలో సేద తీరుతున్న వారిని పసిహృదయాలు తట్టిలేపాయి. వృద్ధుల అనుభవాలు.. విద్యార్థుల పలకరింపులతో రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని మా అనాథ వృద్ధాశ్రమం అనుబంధాల వేదికగా నిలిచింది. మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యాసంస్థల్లో భాగమైన జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు ‘మా’ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని సోమవారం సందర్శించారు. ఆశ్రమంలోని వృద్ధులతో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించారు. పసిపిల్లల ఆప్యాయతను చూసిన ఆ వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్దమనసు చూస్తామని ఊహించలేదంటూ పలువురు కన్నీరుపెట్టారు. కుటుంబాలకు దూరంగా జీవి స్తున్న తమకు ఈ పిల్లల రాక ఓ పండుగలా మారిందన్నారు. వృద్ధులపై మన బాధ్యత ఏమిటో గుర్తు చేసేలా ఈ సందర్శన నిలిచిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి 25 కిలోల సన్నబియ్యం అందించారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం భూస లక్ష్మణ్, తెలుగు సబ్జెక్టు టీచర్ శివకుమార్ పాల్గొన్నారు. మా నాన్నను కాపాడండి ● పది నెలల క్రితం కేన్సర్తో తల్లి మృతి ● నేడు ప్రాణాపాయ స్థితిలో తండ్రి ● ఆదుకోవాలని వేడుకుంటున్న కూతురు చందుర్తి(వేములవాడ): రెక్కాడితేనే కాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఈ కుటుంబాన్ని కొద్ది రోజులుగా విధి వెంటాడుతోంది. పది నెలల క్రితం తల్లి కేన్సర్తో మృతిచెందగా.. ఇప్పుడు తండ్రి గుండె సంబంధిత వ్యాధితో ప్రభుత్వాస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఖరీధైన వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక, కుటుంబానికి అండగా నిలిచే దిక్కులేక ఆ ఇంటి పెద్దబిడ్డ తన తండ్రిని కాపాడాలని వేడుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన మ్యాదరి విజయ, లక్ష్మణ్ దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు పావని(16), కుమారులు నితిన్(12), రిషిత్(10). ఈ దంపతులు ఇద్దరు కూలీ పనిచేసి జీవించేవారు. గతేడాది తల్లి విజయకు నోటి కేన్సర్ వచ్చింది. వ్యాధి ముదిరి 10 నెలల క్రితం మృతిచెందింది. తండ్రి అన్నీతానై పిల్లలను సాదుకుంటున్నాడు. ఈక్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు. రెండు రోజులుగా మంచం పట్టడంతో 16 ఏళ్ల కూతురు పావని సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి గుండె పంపింగ్ సరిగ్గా లేదని.. ఇక్కడ వైద్యం చేసేందుకు సౌకర్యాలు లేవని.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యసిబ్బంది చెప్పారు. అయితే ఎలాంటి దిక్కులేని ఆ కుటుంబం చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వాస్పత్రిలో తండ్రి మంచం పక్కన కూర్చొని ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఎవరైనా దాతలు సాయం చేసి తన తండ్రి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటుంది. దాతలు 95423 96066లో సంప్రదించి, ఆదుకోవాలని కోరుతుంది. -
కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో మద్యం నిల్వలు
● పట్టుకున్న ఎంఐఎం కార్యకర్తలు జగిత్యాలక్రైం/ జగిత్యాలలోని ఓ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఇంట్లో మద్యం బాటిళ్లు డంప్ చేస్తుండగా ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎంఐఎం కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని పరిశీలించి వెళ్లిపోయారు. సదరు అభ్యర్థి ఇంట్లోకి వెళ్లకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోచీబజార్లో మద్యం పట్టివేత పట్టణంలోని మోచీబజార్లో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. రూ.3,250 విలువైన 13 లీటర్ల మద్యాన్ని ఇంట్లో ఉంచగా.. పోలీసులు పట్టుకున్నారు. అరవింద్నగర్కు చెందిన ఒకరి ఇంట్లోనుంచి రూ.3వేల విలువైన 2.5లీటర్ల మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. -
ఉన్నత చదువుకు ‘అంబేడ్కర్ విద్యానిధి’
● దళిత విద్యార్థులకు చక్కని అవకాశం ● రూ.20లక్షల వరకు రుణం పొందే చాన్స్ ● పది దేశాల్లో చదివేందుకు ప్రాధాన్యం కరీంనగర్టౌన్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం ఓ వరంగా మారింది. చదువుపై శ్రద్ధాశక్తులు ఉండి చేతిలో డబ్బులు లేని పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తోంది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం కింద గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 210 మంది విద్యార్థులకే సాయమందించింది. ఇటీవల ప్రభుత్వం ఏటా 500 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. అభ్యర్థులు చదివే కోర్సు ఫీజులను బట్టి గరిష్టంగా రూ.20లక్షల వరకు ఆర్థిక సాయమందిస్తోంది. ప్రతిభ ఆధారంగా ఎంపిక తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా అభ్యర్థి వివరాలను పూరించి సంబంధిత ధ్రువపత్రాలను జేపీజీ ఫార్మాట్లో జతపర్చాలి. రాష్ట్రస్థాయిలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. జీఆర్ఈ/జీమ్యాట్లో ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికై న వారికి విదేశీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రవేశ లేఖ ఆధారంగా రూ.20లక్షల వరకు ఆర్థిక సాయమందజేస్తారు. కోర్సులో చేరిన వారు మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరంలోకి ప్రవేశించినట్లు ధ్రువపత్రాలు పంపిస్తేనే ఫీజుకు సంబంధించిన సాయం విడుదల చేస్తారు. అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించకుంటే సాయం నిలిచిపోతుంది. కావాల్సిన ధ్రువపత్రాలు పాస్పోర్టు సైజ్ ఫొటో, బోనాఫైడ్ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డు, స్థానికత ఽధ్రువపత్రం, పదోతరగతి మెమో, చివరి కోర్సు మార్కుల మెమో, బదిలీ సర్టిఫికెట్, జీఆర్ఈ/జీమ్యాట్/ఇతర స్కోర్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశ లేఖ, పాస్పోర్టు కాపీ. అర్హులెవరంటే.. ● కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల్లోపు ఉండాలి. ● ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ● జీఆర్ఈ/జీమ్యాట్లో అర్హత మార్కులు సాధించాలి. ● ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టులో ప్రతిభ. ● ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి మాత్రమే అర్హులు. ● దరఖాస్తు గడువు మార్చి 31. ● అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో చదువుకోవచ్చు. -
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు
జగిత్యాలక్రైం: జగిత్యాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్ల స్వామిరెడ్డిపై పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 35మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పనిచేసి.. ప్రస్తుతం అధికార దాహంతో కాంగ్రెస్ బీఫామ్లు తెచ్చుకుని.. కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం సరికాదని కరపత్రాలు ముద్రించి న్యూస్పేపర్ల ద్వారా పంపిణీ చేశారు. దీనిపై 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బోనగాని ఉషశ్రీ ఫిర్యాదు మేరకు స్వామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇసుక లారీ పట్టివేతఇబ్రహీంపట్నం: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. మల్లాపూర్ మండలకేంద్రానికి చెందిన లారీ యజమాని ఇస్లావత్ శంకర్, డ్రైవర్ బూక్య వంశీ వేంపల్లి శివారు గోదావరి నది నుంచి లారీలో ఇసుకను అనుమతి లేకుండా నింపుకొని తరలిస్తుండగా ఇబ్రహీంపట్నంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద పట్టుకున్నామని, గ్రామ పంచాయతీ అధికారి సుంకం తిరుపతి ఫిర్యాదు మేరకు లారీ యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మదర్ థెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో టాస్క్ ఆధ్వర్యంలో డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్క్యూఎల్ అనే అంశంపై మూడురోజుల వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్ క్యూ ఎల్కి సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు కల్పించినట్లు రిసోర్స్ పర్సన్ రత్నప్రియ తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏవో పవన్కుమార్, అకడమిక్ ఇన్చార్జి ఇజాజ్ఖాన్, హెచ్వోడీ శశికాంత్, నవ్య, షాకీర్, శిరీష పాల్గొన్నారు. -
వణికిస్తున్న రెబెల్స్..
జగిత్యాల: ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో రెబల్స్ గుబులు పట్టుకుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల మున్సిపాలిటీలో వింత పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నుంచి టికెట్లు ఇప్పించుకుని.. కాంగ్రెస్లో చేరకుండా.. ఎప్పుడూ పార్టీ కండువా కొప్పుకోని వారి తరఫున ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రులుగా మారిన వారి తరఫున కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీమంత్రి జీవన్రెడ్డి ప్రచారం చేశారు. దీంతో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అందరిచూపు జగిత్యాలపై పడింది. మొత్తంగా జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికలు ప్రధానంగా జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్కమార్ మధ్యే అని చెప్పవచ్చు. సంజయ్ వర్గం నుంచి 50 మంది.. జీవన్రెడ్డి వర్గం నుంచి 50 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్లో దొంగలు పడ్డారని, ఈ వయస్సులో తన గొంతు కోశారని, కాంగ్రెస్ జెండా మోసిన వారే ఇప్పుడు కానివారయ్యారని, వారు స్వతంత్రులుగా మారాల్సి వచ్చిందంటూ జీవన్రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఏనాడూ కాంగ్రెస్ జెండామోయకున్నా.. టికెట్ తెచ్చుకున్న వారిని ఓడించాలని, పార్టీ కష్టకాలంలో తోడుంటూ.. ఇప్పుడు టికెట్ రాకున్నా బరిలో ఉన్న వారిని గెలిపించాలని ప్రచారం చేశారు. అటు సంజయ్కుమార్ కూడా అభివృద్ధే తన ధ్యేయమని, ప్రభుత్వంతో కలిసి వెళ్లేవారికే ఓటు వేయాలని ఓట్లు అభ్యర్థించారు. ఇక్కడ విశేషమేమంటే.. జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు జగిత్యాలలో మాత్రం ఇక్కసారి కూడా ప్రచారం చేయలేదు. ఇప్పటివరకు జగిత్యాలకు కనీసం ఇన్చార్జి మంత్రి రాకపోవడం కూడా గమనార్హం. దీంతో అటు ప్రతిపక్షానికి.. ఇటు అధికారపక్షానికి రెబల్స్ బెడద పొంచి ఉంది. శ్రమిస్తున్న నేతలు ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గట్టిగానే శ్రమిస్తున్నారు. లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయే వరకూ వార్డుల్లో కలియ తిరుగుతున్నారు. మెజార్టీ స్థానాల్లో గెలుపుదిశగా ప్రయత్నాలు చేశారు. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 30 మంది.. ప్రస్తుతం ఎమ్మెల్యే వైపే ఉన్నారు. వారందరూ ఇప్పుడు కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ బీఫామ్పై పోటీచేసి ఓడిపోయిన వారికి ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం గట్టిపోటీ ఇస్తుడడం.. పోలింగ్కు ఒక్కరోజే మిగిలి ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. పట్టణ ఓటర్లు ఎటువైపో..? గ్రామీణ ప్రాంత ఓటర్లు ప్రలోభాలకు మొగ్గు చూపినప్పటికీ పట్టణాల్లో మాత్రం కొద్దిగా విభిన్నంగా ఆలోచిస్తుంటారు. ఏ అభ్యర్థికి ఓటు వేయాలి..? ఎలా వేయాలి..? అవగాహన ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఇప్పటికే గమనిస్తున్నారు. -
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలోని అన్ని బల్దియాల కమిషనర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఓటర్ స్లిప్ల పంపిణీ, బ్యాలెట్బాక్స్లు, సామగ్రి మొత్తం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్స్టేషన్ల వద్ద పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్లు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. పోలింగ్ అధికారులు డైరీ నిర్వహించాలని, ప్రతి అంశాన్ని కచ్చితంగా నమోదు చేసుకోవాలన్నారు. ఏర్పాట్లకు స్పెషల్ ఆఫీసర్లు, కమిషనర్ బాధ్యత వహించాలన్నారు. మూడో ర్యాండమైజేషన్ పూర్తి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ఎన్నికల అబ్జర్వర్ కాళీచరణ్ సుదామారావుతో కలిసి ర్యాండమైజేషన్ చేపట్టారు. పోలింగ్ కేంద్రాలవారీగా సిబ్బందిని నియమించామని, తప్పిదాలు జరగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. బ్యాలెట్బాక్స్లు, పోస్టల్బ్యాలెట్ల తరలింపు సక్రమంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలి ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని, గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని వివరించారు. -
జగిత్యాల
29.0/19.0Iగరిష్టం/కనిష్టంప్రభుత్వాసుపత్రిలో విద్యార్థులు మల్లాపూర్:మోడల్ స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం ఫీల్డ్ ట్రీప్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పీహెచ్సీ డాక్టర్ వాహిని, సీహెచ్వో రామ్మోహన్, ల్యాబ్ టెక్నిషన్ ఉమాదేవి విధులు, సేవలపై అవగాహన కల్పించారు. వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ వేడిమి పెరుగుతుంది. సాయంత్రం, రాత్రి సమయంలో చలిగాలులు కొనసాగుతాయి. శివదీక్షాపరుల శోభాయాత్ర కథలాపూర్: మండలకేంద్రంలో శివదీక్షపరులు శోభా యాత్ర నిర్వహించారు. అలంకరించిన వాహనంలో శివుడి చిత్రపటం ఉంచి ప్రధానవీధుల గుండా ఊరేగించారు. స్వామివారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి మొక్కులు చెల్లించుకున్నారు.మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 -
ప్రజలంతా బీఆర్ఎస్ వైపే..
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల్లో ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. ఆయన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఓటర్లను అధికార పార్టీ ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో మిరాకిల్ జరగబోతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే జగిత్యాల, రాయికల్ అభివృద్ధి చెందాయని వివరించారు. జిల్లాకేంద్రంతోపాటు అన్ని రకాల వసతులు కల్పించామని పేర్కొన్నారు. ముందుగా ఆయన జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ముమ్మర ప్రచారం చేశారు. ప్రశ్నించే గొంతుకలకు ప్రజలు పట్టంగట్టబోతున్నారని తెలిపారు. పేదల వైద్యం కోసం మెడికల్ కళాశాల ఏర్పాటు, ప్రతి గల్లీలో సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు పట్టణ సుందరీకరణలో భాగంగా జంక్షన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. శ్మశాన వాటికలు, డివైడర్లు ఏర్పాటయ్యాయన్నారు. ఓటును రాయికల్లో వినియోగిస్తా.. రాయికల్: రాయికల్ మున్సిపాలిటీని రూ.25కోట్లతో అభివృద్ది చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్సీ రమణ అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి రూ.25 కోట్లు వెచ్చించి ప్రతి వార్డులో వసతులు కల్పించామని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నానంటూ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల హామీలకు మాత్రమే బీజేపీ పరిమితమని ఎద్దేవా చేశారు. రాయికల్ మున్సిపల్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని తెలిపారు. తన ఓటు హక్కును రాయికల్లోనే వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీమంత్రి రాజేశంగౌడ్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కట్కం రవి తదితరులు పాల్గొన్నారు. -
ష్.. గప్ చుప్
జగిత్యాల: మున్సిపాలిటీల్లో ప్రచారపర్వం ముగిసింది. వారంపాటు మైకులు, లౌడ్స్పీకర్లతో అభ్యర్థులు హోరెత్తించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గల్లీగల్లీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రధాన పార్టీల నాయకులను రప్పించి మాట్లాడించారు. ప్రచారానికి గడువు ముగియడంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అభ్యర్థులందరూ సైలెంట్మోడ్లోకి వెళ్లిపోయారు. ఈనెల 11న పోలింగ్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులందరూ వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి వెళ్లి చివరిప్రయత్నంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డుల వారీగా ప్రత్యేక దృష్టి గెలుపులో ఒక్క ఓటు కూడా ముఖ్యం కావడంతో అభ్యర్థులు ప్రతివార్డులోని ఓటర్లను అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికే మహిళా సంఘాలు, యువ త, వ్యాపారవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటింటి ప్రచారానికి పెద్దపీట వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. మంగళవారం కూడా వ్యక్తిగతంగా ఇంటింటా తిరుగుతూ చివరి ప్రయత్నంగా హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలపై పోటాపోటీగా ప్రకటనలు చేశారు. అధికా ర పార్టీ నేతలు వారు చేపడుతున్న సంక్షేమ పథకాలపై వివరించగా.. బీజేపీ కేంద్రం అందిస్తున్న నిధులతోనే అ న్ని సౌకర్యాలు సమకూరుతున్నాయని వివరించారు. బీఆర్ ఎస్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. అమలుచేయని హామీలను ప్రజలకు వివరించారు. ఇక ధన ప్రవాహం.. ఇప్పటికే ఒక్కో అభ్యర్థి వార్డుల్లో విందులు, వినోదాలకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఓ అభ్యర్థి 200 మందికి భోజనాలు పెట్టిస్తే.. మరో అభ్యర్థి 400 మందికి పెట్టించడం గమనార్హం. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి విందులు ఇచ్చుకుంటూ ముందుకెళ్లారు. ఎలాగైనా కౌన్సిలర్ పదవిని దక్కించుకునేందుకు ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అధికా రులు మాత్రం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పే ర్కొంటున్నారు. అభ్యర్థులు చూపే ఆశలకు ఓటర్లు లోనవుతూ.. ఎటువైపు మొగ్గుచూపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. అభ్యర్థుల ఖర్చును నిరోధించేందుకు యాక్ట్ ఉన్నా.. ఒక్కో అభ్యర్థి రూ. 10లక్షల నుంచి రూ.20లక్షలపైనే ఖర్చు చేస్తున్నారు. కుల పెద్దలతో మంతనాలు వార్డుల్లో మహిళాసంఘాల ఓట్లే కీలకం కావడంతో గంపగుత్తగా కొనుగోలు చేసేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. అలాగే వివిధ కుల సంఘాల పెద్దలను ఆశ్రయించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయా వర్గాల ఓట్లు ఎన్ని ఉన్నాయి..? ఎన్ని పడతాయి..? అని పెద్దలతో చర్చిస్తూ ఓట్లు తమకే రావాలంటూ వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాగే హామీలు కూడా గుప్పిస్తున్నారు. వార్డుల్లో ఏం పనులు కావాలన్నా.. గెలిచిన వెంటనే చేస్తామని హామీలు ఇస్తున్నారు. ప్రతి కాలనీలో సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా లో ఏయే సామాజిక వర్గాలు ఎంత మంది ఉన్నారు..? ఎన్ని ఓట్లు ఉంటాయి..? పోల్ మేనేజ్మెంట్ను శాసించే సామాజిక వర్గాల మద్దతును కూడగట్టుకుంటే విజయం వరిస్తుందని ఆలోచిస్తున్నారు. దూర ప్రాంతాల వారిని రప్పించేందుకు.. అభ్యర్థులు సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే వాహనాలు సమకూర్చడం, బస్ చార్జిలు పంపించేలా చూస్తున్నారు. యువత ఎక్కువగా చదువు, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటోంది. అలాంటి వారిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యూహాలు.. ప్రతివ్యూహాలు మున్సిపాలిటీ పరిధిలో కాలనీల వారీగా ఇప్పటికే సర్వే చేయించిన ప్రధాన పార్టీల నాయకులు.. నివేదికలు తెప్పించుకుని వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా ఆయా పార్టీల నాయకులు పోల్ మేనేజ్మెంట్ ద్వారా డబ్బులు ఎలా పంపిణీ చేయాలని చూస్తున్నారు. పార్టీల నాయకులు తమకు నమ్మకమైన వ్యక్తుల ద్వారా డబ్బులు, ఇతరత్రా వస్తువులను పంపుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
జగిత్యాల: ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. సోమవారం జగిత్యాల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు 4500 ఇళ్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రాయికల్ బల్దియాపై బీఆర్ఎస్ జెండా ఎగరాలి రాయికల్: రాయికల్ బల్దియాౖైపె బీఆర్ఎస్ జెండా ఎగరాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ప్రజలు వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాయికల్ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తరువాత ఎలాంటి పనులు ముందుకు కదలలేదని తెలిపారు. సమావేశంలో చైర్మన్ అభ్యర్థి కట్కం రవి, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎనుగందుల ఉదయశ్రీ, మారంపెల్లి రాణి, పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
జీవన్రెడ్డిపై కాంగ్రెస్ తీరు బాధాకరం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు మెట్పల్లి: మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పట్ల కాంగ్రెస్ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉంటూ.. పార్టీ బలోపేతానికి కృషి చేసిన జీవన్రెడ్డిపై ఆ పార్టీ పెద్దలు నడుచుకుంటున్న తీరు సరిగా లేదన్నారు. గతంలో బీఆర్ఎస్లో చేరాలని ఆయనను కోరినప్పుడు తాను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పారని గుర్తు చేశారు. ఆ సమయంలోనే బీఆర్ఎస్లో చేరి ఉంటే ఆయనకు మంత్రి పదవి దక్కేదన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కై వసం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రాంగ్రూంల వద్ద ఏర్పాట్లు చేయాలి జగిత్యాల: స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఎన్నికల సిబ్బందిని అదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సోమవారం తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది, వసతులు అన్నీ ఉండాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. లోటుపాట్లకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. నోడల్ అధికారి మదన్మోహన్, కమిషనర్ స్పందన ఉన్నారు. కాషాయ జెండా ఎగరాలిజగిత్యాల/రాయికల్: మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే కాషాయ జెండా ఎగరాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల, రాయికల్లో పర్యటించారు. మున్సిపాలిటీలకు కేంద్రమే నిధులు విడుదల చేస్తోందన్నారు. ఆమె వెంట కొండ లక్ష్మణ్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ హయాంలో ప్రతి కుటుంబానికీ లబ్ధి
కోరుట్లరూరల్: బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఏదోవిధంగా లబ్ధి చేకూరిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్ అన్నారు. పట్టణంతోపాటు మున్సిపాలిటీలో విలీనమైన యెఖీన్పూర్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో డ్రైనేజీలు, రోడ్లు, వీధీదీపాలు, అవసరమైన చోట పార్కులు నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకొచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం పొరండ్ల జెడ్పీ పాఠశాలకు చెందిన 56 మంది పదో తరగతి విద్యార్థులకు సోమవారం గ్రామ సర్పంచ్ నక్క హరీశ్ చేతులమీదుగా ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇన్చార్జి హెచ్ఎం రాంమనోహర్రావు, ఉపసర్పంచ్ ముద్దం మల్లేశం, ఉపాధ్యాయులు రామకృష్ణ, రాంరెడ్డి, దత్తాత్రేయ, ప్రవీణ్, శ్రీనివాస్, మధు పాల్గొన్నారు. ప్రశాంత ఎన్నికలకే ఫ్లాగ్మార్చ్జగిత్యాలక్రైం: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకే పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్మార్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని మంచినీళ్ల ప్రాంతం నుంచి తీన్ఖని చౌరస్తా, టవర్సర్కిల్ మీదుగా పాతబస్టాండ్ వరకు సోమవారం ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్ని కల నిర్వహణకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలన్నారు. ఈనెల 11న ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని పోలీంగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, మద్యం, నగదు, ఇతర ప్రలోభాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సీఐలు కరుణాకర్, సుధాకర్, ఎస్సైలు సుప్రియ, కుమారస్వామి, సదాకర్, రాజు, సుధీర్రావు, గీత పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు స్పందనజగిత్యాలక్రైం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు బాధితులు తరలివచ్చారు. వారితో ఎస్పీ అశోక్కుమార్ నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు రానీయొద్దువెల్గటూర్: కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 15న జరిగే మహా శివరా త్రికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేశ్ అన్నారు. జాతర ఏర్పాట్లపై అన్నిశాఖల అధి కారులతో సోమవారం సమీక్షించారు. విద్యుత్, శానిటైజర్, పోలీస్ శాఖ, పార్కింగ్, చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ పాకెట్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆలయ ఈవో కాంతారెడ్డి, స ర్పంచ్ కోటయ్య, తహసీల్దార్ ఆర్.శేఖర్, వి ద్యుత్ ఏఈ శ్రీనివాస్, ఏఎస్సై శ్రీనివాస్, ఆర్ఐ రాంరెడ్డి, ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు. ఆల్రౌండర్గా అదరగొడుతున్న తక్షిల్కొడిమ్యాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న తక్షిల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న అండర్–19 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్లో రాణిస్తున్నాడు. తక్షిల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. వరంగల్లో నిర్వహిస్తున్న టోర్నమెంట్లో ఆదిలాబాద్తో జరిగిన మ్యాచ్లో 122 బంతుల్లో 186 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. బౌలింగ్లోనూ రాణించి నాలుగు వికెట్లు తీశా డు. ఆ మ్యాచ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తక్షిల్ను కళాశాల ప్రిన్సిపల్ వేణు, స్పోర్ట్స్ ఇన్చార్జి భాస్కర్, అధ్యాపకులు అభినందించారు. -
ఒకసారి భర్త, రెండుసార్లు భార్య విజయం
మెట్పల్లి: ప్రస్తుత రోజుల్లో ఒకసారి గెలవడమే సులువు కాదు. అలాంటిది మూడుసార్లు విజయం సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పట్ట ణానికి చెందిన చెట్లపల్లి మీనా, సుఖేందర్గౌడ్ దంపతులు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మెట్పల్లి 2004లో మున్సిపాలిటీగా ఏర్పడింది. 2005లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో సుఖేందర్ 12వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 18వార్డు నుంచి ఆయన సతీమణి మీనాను బరిలో దింపి గెలిపించుకున్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ మద్దతుతో సుఖేందర్ కో–ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికై .. అప్పటి పాలకవర్గంలో దంపతులిద్దరూ కొనసాగారు. 2020లో నిర్వహించిన ఎన్నికల్లో మారో మారు అదేవార్డు నుంచి సురేఖ గెలుపొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మూడోసారి ఆమె పోటీ చేస్తున్నారు. విశేషమేమిటంటే ఈ వార్డులో అత్యధికంగా ఉన్న మైనార్టీల ఓట్లు గెలు పోటములను ప్రభావితం చేస్తాయి. బీజేపీ నుంచి నిలబడుతున్న మీనా ఆ వర్గం మద్దతును కూడా దక్కించుకుని విజేతగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మరోమారు బరిలో నిలిచిన ఆమె ‘హ్యాట్రిక్’ విజ యాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చే స్తున్నారు. ఎన్నికల బరిలో దిగితే విజయమే.. ఆదర్శంగా నిలుస్తున్న మీనా, సుఖేందర్ దంపతులు -
ఓటరు మహాశయులారా?
కోల్సిటీ(రామగుండం): పొద్దున లేచించి మొదలు.. రాత్రి వరకూ గల్లీలన్నీ పాటలతో మార్మోగుతున్నాయి. మైకుల శబ్దం, వాహనాల గర్జన మధ్య శ్రీపలానా గుర్తుకే మన ఓటుశ్రీ అని వినిపించే జానపద పాటలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. వాటికి చిన్నారులు స్టెప్పులు వేస్తుంటే.. పెద్దలు చిరునవ్వుతో తలూపుతున్నారు. అయితే, అభ్యర్థుల పేర్లకన్నా ముందే ఓటర్ల చెవుల్లో నాటుకుపోయే స్వరాల వెనుక ఉన్నవారు ఎవరు? ఒక్క పాటతో గల్లీని కదిలించే ఆ గొంతులు ఎలా ఉంటాయి? ఎన్నికల రణరంగంలో వాహనాలపై తిరుగుతూ రాత్రింబవళ్లు స్వరం వినిపిస్తూ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసే గాయకుల కథ ఇదే. ఓటు రాజకీయాల మధ్య నడిచే కళాకారుల కనబడని ప్రయాణమిది. కళను కాపాడాలంటే కళాకారులను నిలబెట్టాల్సిందే అంటున్నారు. లేదంటే పాట మిగులుతుంది కానీ.. పాట పుట్టిన గొంతు కష్టాల్లోనే కరిగిపోతుంది. మూడు దశాబ్దాలుగా కళనే శ్వాసగా, జీవనాధారంగా నమ్ముకున్నాడు. డప్పు ప్లేయర్గా, గాయకుడిగా, నృత్య మాస్టర్గా, రచయితగా తనదైన ముద్ర వేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి చైతన్య గీతాలు, ఉద్యమ గీతాలు అందించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతిబింబించే బహుజన గీతాలు, ప్రజల్ని కదిలించే ప్రచార గీతాలు రచించి పాడారు. కళను నమ్ముకున్నా.. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించే ఆదాయం సమకూరడంలేదు. అవార్డులు, రివార్డులు వచ్చాయి. సన్మానాలు, సత్కారాలు జరిగాయి. అవి జీవనానికి భరోసా ఇవ్వలేకపోయాయి. – గాజుల రమేశ్, డప్పు కళాకారుడు, గోదావరిఖని -
నేను.. నా పోరాటం
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: ‘విప్లవ పార్టీలో దళ సభ్యుడిగా మొదలైన నా ప్రయాణం గడ్చిరోలికి చేరింది. ఇస్రోజీవాడి నుంచి గడ్చిరోలి వరకు విప్లవ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు.. అంతకు మించి సంతృప్తి.. కాలక్రమంలో గడ్చిరోలి నుంచి.. అబూజ్మడ్ అడవులకు చేరి.. అక్కడే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వైనం.. తాడిత, పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఘటనలకు సాక్ష్యం చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ జీవిత చరిత్ర. నక్సలైట్ ఉద్యమంలో తొలి ఆత్మకథ చందర్దే కావడం విశేషం. ఎన్కౌంటర్కు ముందు తాను రాసుకున్న విప్లవ ఆత్మకథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది’. ఈనెల 5న ఎన్కౌంటర్లో చనిపోయిన సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్– మహారాష్ట్ర వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్రావు(57) అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ మృతదేహం కామారెడ్డి జిల్లాలోని ఆయన సొంత ఊరు ఇస్రోజివాడికి ఆదివారం తీసుకొచ్చారు. ఆయన అంత్యక్రియలకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు మాజీ నక్సలైట్లు హాజరయ్యారు. ఎర్రజెండాలు, విప్లవ నినాదాలు, పాటలతో ఆయన అంత్యక్రియలు సాగాయి. ప్రభాకర్ ఆత్మకథలోని కొన్ని ముఖ్య ఘటనలు.. ● మావోయిస్టు ఉద్యమకారుడు స్వామి తన ఆత్మకథలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించారు. ఇస్రోజీవాడిలో జరిగిన ఒక సంఘటన చందర్ను అడవిబాట పట్టేలా చేసింది. గ్రామంలోని మాలి పటేల్, ఇతర పెత్తందార్లకు వ్యతిరేకంగా చేస్తున్న విప్లవ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని పోలీసులతో గ్రామస్తులను పోలీస్స్టేషన్లో బంధించారు. పోలీసులకు లొంగిపోవాలని, లేదా అడవిబాట పట్టాలని సభ్యులపై ఒత్తిడి తేగా.. ఆ కుట్రను ఛేదించారు. ● 1991లో పూర్తిస్థాయిలో అప్పటి పీపుల్స్వార్లో చేరిపోయారు. 1991 నుంచి 33 నెలలపాటు కామారెడ్డి దళంలో పనిచేశారు. తర్వాత దళ అవసరం రీత్యా సిర్నాపల్లి దళంలో సభ్యుడికి చేరి, కమాండర్, డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ఎస్సైగా పని చేస్తున్న శ్రీనివాస్రావును 1998లో మందుపాతర పేల్చి చంపిన ఘటనలో ముగ్గురితో కలిసి తాను అంబూష్లో పాల్గొన్నారు. నిజానికి ఈ ఘటన రాంచందర్ చేసినట్లు ప్రచారం జరగ్గా.. ఆ రాంచందర్ వన్పల్లి ఎన్కౌంటర్లో మరణించాడు. కానీ, లోకేటి చందర్రావు అలియాస్ స్వామి నాయకత్వంలోనే ఈ ఘటన జరిగినట్లు ఆయన ఆత్మకథలో పేర్కొన్నారు. ● 1999లో కోనరావుపేట మండలం మరిమడ్లలో పోలీసులను గుర్తించడంలో విఫలమైన తమ సెంట్రీ విఫలమయ్యాడని, దీంతో పోలీసులు సమీపించగానే ముందుగా కాల్పులు జరపడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రాణనష్టం, కిట్బ్యాగుల నష్టం ఏమీ కాలేదని, మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్స్టేషన్పై దాడి చేసిన ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు. ● 1999 నుంచి 2000 వరకు కామారెడ్డి ఏరియాకు ఇన్చార్జిగా, 2000 నుంచి 2003 వరకు సిరిసిల్ల ఏరియాకు జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ నిర్ణయం మేరకు 2003లో దండకారణ్యం వెళ్లారు. అక్కడ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2006లో ఎజేడ్సీలోకి, 2011లో దక్షిణ సబ్ జోన్ నుంచి పశ్చిమ సబ్ జోన్కు వెళ్లారు. ఇక్కడే 2020 వరకు సబ్ జోనల్ బ్యూరో మెంబర్గా, పశ్చిమ సబ్ జోనల్ కమాండర్ ఇన్ చీఫ్గా, ఉత్తర గడ్చిరోలి డివిజన్కు సబ్ జోనల్ బ్యూరో నుంచి ఇన్చార్జిగా పనిచేశారు. 2020 నుంచి 2024 వరకు పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ప్రభారిగా పనిచేశారు. ● ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో ఆయన పని చేసిన కాలంలో జరిగిన ఘటనలు, నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం పడ్కల్లో జరిగిన ఎన్కౌంటర్ను, తన 35 ఏళ్ల అజ్ఞాత జీవితం, భార్యాపిల్లల జీవనం, సాయుధ పోరాటం, పేదల ప్రజలపై దండకారణ్యంలో చేసిన ప్రజాపోరాటాలను తన ఆత్మకథలో సమగ్రంగా వివరించారు. కొసా దాదా అంత్యక్రియలకు హాజరైన స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెలో సెప్టెంబరు 25న జరిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కొసా దాదా అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి అంత్యక్రియల్లో స్వామి పాల్గొని కడసారి చూపులు చూసుకున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో సెప్టెంబరు 21న పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో కొసా, ఆయనతో పాటు మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మరణించారు. సెప్టెంబరు 25న గోపాల్రావుపల్లెలో కొసా దాదా అంత్యక్రియల్లో అంత్యంత రహస్యంగా స్వామి పాల్గొని అగ్రనేతకు నివాళి అర్పించడం విశేషం. పోలీసుల నిఘా మధ్య, ఆయన గోపాల్రావుపల్లెకు చేరుకుని అంత్యక్రియల్లో ఎవరూ గుర్తించకుండా పాల్గొని వెళ్లడం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పోరాట క్షేత్రంగా ఆత్మకథ పోరాట క్షేత్రంగా తన కళ్ల ముందే చనిపోయిన సహచరుల పేర్లు, వారి కులాలు, నేపథ్యాలను స్వామి గుర్తు పెట్టుకుని ఆత్మకథలో రాశారు. ముఖ్యంగా తన గార్డుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన మానస గురించి రాసిన తీరు ఆయన సహచర ప్రేమను చాటుతోంది. కరుడుగట్టిన విప్లవకారుడి లోపల కూడా ఒక సున్నితమైన మనిషి ఉంటాడని స్వామి ఆత్మకథ స్పష్టం చేస్తుంది. కన్నీటి వీడ్కోలు మా ఊరు ఇస్రోజివాడి అంటూ.. స్వామి తన అజ్ఞాత జీవితాన్ని ఆవిష్కరించారు. తల్లి పేరు లోకేటి కిష్టాబాయి, తండ్రి వీరన్న, నలుగురు సంతానంలో నేను నాలుగో వాడిని. మా పెద్ద అక్క గంగబాయి, ఆ తరువాత ఇద్దరు అన్నలు రాజేశ్వర్రావు, మానిక్రావు, నేను చిన్నోడిని చందర్రావును. నేను 1969లో జన్మించాను. అంటూ.. తాను 6వ తరగతి పాస్ అయ్యాయని.. రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్)లో పని చేస్తూ.. మావోయిస్టు ఉద్యమంలో చేరిన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఛత్తీస్గఢ్లో కూంబింగ్కు వచ్చిన హెలీకాప్టర్ను కూల్చడం నుంచి మొదలు పెడితే.. అనేక హింసాత్మక ఘటనలను ఉటంకించారు. 35 ఏళ్ల పాటు సాయుధ పోరాటం సాగించిన స్వామి తుదకు ఎన్కౌంటర్లో అమరుడై.. సొంత ఊరికి చేరితే కన్నీటితో వీడ్కోలు పలికింది ఇస్రోజివాడి. 22 ఏళ్ల ప్రాయంలో అడవిబాట దళ సభ్యుడిగా మొదలైన ప్రయాణం ఎన్నెన్నో దాడులు.. యుద్ధరీతులు ముందే ఆత్మకథలో ఆవిష్కరించిన స్వామి సోషల్ మీడియాలో వైరల్ -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): కార్పొరేషన్ పరిధిలోని ఫెర్టిలైజర్సిటీ(ఎఫ్సీఐ)టౌన్షిప్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ 2000–01 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 25ఏళ్ల రీయూనియన్ సమావేశం ఆదివారం హైదరాబాద్లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్లో నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వారంతా ఒకేవేదికపైకి చేరారు. బాల్యంలోని స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ పాఠశాలలో గడిపిన మధురమైన క్షణాలను ఆనందంగా పంచుకున్నారు. ఎఫ్సీఐ టౌన్షిప్లో గడిపిన రోజులను శ్రీభూమిపై స్వర్గంశ్రీగా అభివర్ణిస్తూ స్నేహాలు, ఆటలు, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని స్మరించుకున్నారు. తరగతి గదులు, ఆటస్థలాలు, గురువుల మార్గదర్శనం, స్నేహితులతో గడిపిన చిరునవ్వుల రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం వారికి అపూర్వమైన ఆనందాన్ని ఇచ్చింది. సభ్యులంతా తమ జీవిత ప్రయాణాలు, వత్తిపరమైన అనుభవాలు, విజయాలను పంచుకుంటూ భవిష్యత్లో ఇలాంటి సమావేశాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. రోడ్డుపై పడిపోయిన బండరాయిచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ స్టేజీ వద్ద హుస్నాబాద్– కరీంనగర్ ప్రధాన రహదారిపై గ్రానైట్ లారీ నుంచి బండరాయి పడిపోయింది. ఆదివారం మధ్యాహ్నం బొమ్మనపల్లి గ్రానైట్ క్వారీ నుంచి ఆసిఫ్నగర్కు కటింగ్ నిమిత్తం లారీలో తీసుకెళ్తుండగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న కారును తప్పించబోయిన, డ్రైవర్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ రాయి లారీ నుంచి రహదారిపై పడింది. గ్రానైట్ రాయి పడినచోట రహదారి పూర్తిగా ధ్వంసమైంది. చిగురుమామిడి ఏఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి వెళ్లి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. గుంతపడిన చోట మట్టితో పూడ్చివేయించారు. -
పెద్దపులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలి
చిగురుమామిడి: కోహెడ మండల పరిధిలో పెద్దపులి సంచరిస్తుందన్న సమాచారంతో చిగురుమామిడి మండలంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎం.రమేశ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కోహెడ మండల అటవీప్రాంతంలో పెద్దపులి తిష్టవేసినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారని తెలిపారు. పులి కదలికలు చిగురుమామిడి మండల సరిహద్దులకు చేరువలో ఉండటంతో రానున్న రెండు రోజులు రైతులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతులు పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, చుట్టుపక్కల రైతులతో కలిసి వెళ్లాలని సూచించారు. పులికదలికలు కనిపించినా, పశువులపై దాడిచేసి చంపినట్లు కనిపించినా తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
శివరాత్రి ఉత్సవాలకు రండి
పెగడపల్లి: మండలకేంద్రంలోని శ్రీస్వయంభూ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ఆలయ కమిటీ సభ్యులు ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలిసి ఆహ్వానపత్రం అందించారు. మాజీమంత్రి కొప్పులను కలిసి ఆహ్వానించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శి శ్రీనివాస్, రామచంద్రం, ఏఎంసీ చైర్మన్ రాములు, సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలిజగిత్యాల: ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నా రు. మెప్మా భవన్లో మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ పేపర్ల ధృవీకరణ చేపట్టినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం పరిశీలన కొనసాగుతుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ స్పందన, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బీజేపీని ఆశీర్వదించండి
రాయికల్: మున్సిపాలిటీల్లో బీజేపీని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాయికల్ బల్దియాలో పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, బల్దియాలో కూడా బీజేపీని గెలిపిస్తేనే నిధులు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలుకు నోచుకోవడంలేదని, మరోసారి నమ్మి ప్రజలు మోసపోవద్దని పిలుపునిచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ.. కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చిన ప్రచారం చేయడమేంటని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేశామని, రేషన్ బియ్యం, ఆరోగ్య బీమా, పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో బీజేపీలో పనిచేసి.. బీఆర్ఎస్లో చేరిన తురగ శ్రీధర్రెడ్డిని తిరిగి బీజేపీలో చేరారని కోరడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు బోగ శ్రావణి, పట్టణ అధ్యక్షులు కుర్మా మల్లారెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, పడాల తిరుపతి పాల్గొన్నారు. బీఆర్ఎస్..కాంగ్రెస్ మోసం చేస్తున్నాయి కోరుట్ల: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నాయని ఎంపీ అర్వింద్ అన్నారు. కోరుట్లలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం, స్కూటీలు, పింఛన్ల పెంపు, రైతు భరోసా హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల సొమ్మును కాజేసిందన్నారు. ప్రధాని మోదీ కరోనా సమయంలో వ్యాక్సిన్లు, ఆరోగ్యబీమా, సడక్ యోజన, అమృత్ వంటి పథకాలు అందించారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ను గద్ద ముక్కోడు అని, సీఎం రేవంత్రెడ్డిని పొట్టోడు.. అని ఎంపీ మాట్లాడడం గమనార్హం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఏ పార్టీ..? రాయికల్ బల్దియాపై బీజేపీ జెండా ఎగరాలి ఎంపీ ధర్మపురి అర్వింద్ -
‘ఫార్మర్ రిజిస్ట్రీ..’ స్పందన అంతంతే
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి అవసరమయ్యే డిజిటల్ డేటాబేస్ను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్స్ రిజిస్ట్రీని చేపట్టింది. ఈ రిజిస్ట్రీకి రైతులు పెద్దగా మొగ్గు చూపకపోవడంతో అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. కార్యక్రమం నత్తనడకన నడుస్తుండటంతో వేగవంతం చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. జిల్లాలో మే 2025న ఫార్మర్స్ రిజిస్ట్రీ ప్రారంభమైనప్పప్పటికీ రైతులు వివిధ కారణాలతో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో మొత్తం రైతులు 2,46,317 మంది ఉండగా.. ఇప్పటివరకు కేవలం 1,25,601 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రీ చేసుకున్నారు. ఇంకా 1,20,706 మంది చేయించుకోవాల్సి ఉంది. మేడిపల్లి మండలంలో 6,252 మంది రైతులకు అత్యధికంగా 4,289 మంది ఫార్మర్స్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. అత్యల్పంగా జగిత్యాల అర్బన్ మండలంలో 5,964 మంది రైతులకు కేవలం 2,069 రైతులే చేయించుకున్నారు. మిగతా మండలాల్లో 50 నుంచి 60 శాతం పూర్తయ్యింది. ఆధార్నంబర్తో.. ఏఈవోలు ఆధార్నంబర్ల అధారంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ చేపడుతున్నారు. తద్వారా భూమి సర్వేనంబర్లన్నీ ఆధార్నంబర్కు అనుసంధానం అవుతాయి. రిజిస్టర్ చేసేటప్పుడు సెల్నంబర్కు రెండు, మూడుసార్లు ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ ఎంటర్ చేయగానే రిజిస్ట్రీ పూర్తవుతుంది. అక్షరజ్ఞానం లేని కొంతమంది రైతులు ఆధార్నంబర్ ఇస్తే ఏమవుతుందో..? ఫోన్కు వచ్చే ఓటీపీ చెబితే డబ్బులు పోతాయేమో..? సర్వేనంబర్లన్నీ ప్రభుత్వానికి తెలిస్తే తమకు వచ్చే పథకాలు రద్దవుతాయేమో..? అని చాలామంది వివరాలు ఇవ్వడం లేదు. కొంతమంది రైతులు చనిపోవడం, వ్యవసాయ శాఖ వద్ద పాత డేటా ఉండటంతో రిజిస్ట్రీ నత్తనడకన నడుస్తోంది. రిజిస్ట్రీ ఏఈవోలతోపాటు మీసేవా కేంద్రాల్లో కూడా చేయించుకోవచ్చు. ఏఈవోలు యాసంగి పంటల నమోదుకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. పారదర్శకంగా అందించేందుకు.. అపోహలు వద్దు గ్రామాల్లో ఏఈవోలు చేపడుతున్న ఫార్మర్స్ రిజిస్ట్రీపై అపోహలు వద్దు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఫోన్నంబర్, ఆధార్నంబర్తో భూ రికార్డులు లింక్ అవుతాయి. – భాస్కర్, డీఏవో -
కౌంట్డౌన్..
జగిత్యాల: మున్సిపాలిటీల్లో పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. సోమవారంతో ప్రచార గడువు కూడా ముగియనుంది. సాయంత్రం నుంచి మైకులు బంద్ కానున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో అభ్యర్థులు కార్నర్ మీటింగ్లు, సభలతో హోరెత్తించారు. ఈనెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్నిపార్టీలు చివరి దశలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ప్రతి ఓటు కీలకం కావడంతో పోల్ మేనేజ్మెంట్ ప్రకారం ఓట్లు ఎలా రాబట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే గల్లీగల్లీ తిరిగిన అభ్యర్థులు, నాయకులు చివరిరోజు తీసుకునే నిర్ణయాలే గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలోననే ప్రయత్నాల్లో అభ్యర్థులు ఉన్నారు. కార్నర్ మీటింగ్లు.. సభలు పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారపర్వం హోరెత్తింది. ఒకవైపు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అభ్యర్థులతో కలిసి కార్నర్ మీటింగ్లు నిర్వహించడంతో సందడి నెలకొంది. అభ్యర్థుల మద్దతుగా పార్టీల అగ్రనేతలు రావడంతో రాజకీయ వేడి రాజుకుంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ప్రతి వార్డులో ప్రతి ఓటరును కలవాలన్న ఉద్దేశంతో అభ్యర్థులు జనసమీకరణ చేపట్టి ఒకేచోట 5నుంచి 6 వార్డులు కవర్ అయ్యేలా ప్రచారం నిర్వహించారు. తమను గెలిపస్తే చేసే పనులను హామీల రూపంలో గుమ్మరించారు. అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు అభివృద్ధికే పట్టం కట్టాలని, ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని ముందుకెళ్లింది. కేంద్రప్రభుత్వం నుంచే నిధులు వస్తాయని, వాటితోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని బీజేపీ ప్రచారం చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు చెబుతూ ముందుకెళ్లారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కావడం లేదంటూ ప్రచారం చేసింది. ప్రజలు ఒకసారి ఆలోచించాలని, కాంగ్రెస్కు ఓటు వేస్తే అన్ని ఇబ్బందులే ఉంటాయని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నేటితో ముగియననున్న ప్రచారం రోడ్షోలతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు కార్నర్ మీటింగ్లతో హామీలు, ప్రకటనలు ఈనెల 11న మున్సిపల్ పోలింగ్ -
ఇస్రో సైంటిస్ట్గా కొడిమ్యాల యువకుడు
కరీంనగర్టౌన్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజసింహ ఇస్రో సైంటిస్ట్గా ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజశేఖర్, ఉమారాణిల కుమారుడు రాజసింహ జగిత్యాలలో 10 వ తరగతి, వరంగల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశా డు. జేఈఈ అడ్వాన్స్ ద్వారా కేరళ తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ సీటు సాధించాడు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇస్రో సైంటిస్టుగా ఎంపికయ్యాడు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు రాజసింహను అభినందించారు. -
మౌనమే అయితే..
కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థుల ప్రచారంతో మొదలైన నా వాయిస్ ఓవర్ ప్రయాణం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకూ విస్తరించింది. ప్రధాన పార్టీలే కాదు.. స్వతంత్ర అభ్యర్థులూ శ్రీఈ వాయిస్ కావాలిశ్రీ అంటున్నారు. రామగుండమే కాదు.. మంథని, మంచిర్యాలలోనే నా గొంతు వినిపించింది. ఎన్నికల ప్రచారానికే కాకుండా.. ఆలయాల ప్రారంభం, బ్రహ్మోత్సవాలు, పుష్కరాలు, సమ్మక్క – సారలమ్మ జాతర, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వ్యాపార–వాణిజ్య ప్రకటనల వరకూ ప్రత్యక్ష వ్యాఖ్యాతగా, వాయిస్ ఓవర్గా సేవలందించాను. 1986 నుంచి దాదాపు 40 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నా. సుమారు 4వేల వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. దివంగత సీఎం వైఎస్సార్ హాజరైన 4 బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం, పెద్దపల్లి జిల్లా ఆవిర్భావ సభకు వాయిస్ ఇవ్వడం నా జీవితంలో మైలు రాళ్లు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అప్పటివరకు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశా. అరకొర జీతంతోపాటు, కళా రంగం ఇచ్చిన ఆదాయం నా కుటుంబ జీవనాన్ని పెద్దగా ఇబ్బందు లు లేకుండా నడిపించింది. ఇప్పుడు రిటైర్ అయ్యాను. అ నుభవం, సేవాభావం, అంకితభావం ఉన్న కళాకారు లను గుర్తించి, గౌరవంతోపాటు స్థిరమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే. ఎందుకంటే కళాకారుడి గొంతు మౌనమైతే.. చరిత్రే మౌనమవుతుంది. – మేజిక్రాజా, వాయిస్ ఓవర్ కళాకారుడు, గోదావరిఖని -
ప్రచారంలో పదనిసలు
కోరుట్ల: పట్టణంలోని ఓ వార్డులో పండ్లు అమ్ముకునే ఓ అభ్యర్థి తనకు అప్పటివరకు బాకీ ఉన్న మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని, ఓటుమాత్రం తనకే వేయాలని తాయిలాలు ప్రకటించడం గమనార్హం. ఆయన వద్ద పండ్లు తీసుకెళ్లి మార్కెట్లో అమ్మకాలు సాగించే వారంతా ఫుల్ ఖుష్ అయిపోయారు. ఒక్కరోజు 3 క్వింటాళ్లు పట్టణంలోని వేములవాడ రోడ్ వెంట ఉన్న ఓ వార్డులో ఓ అభ్యర్థి ఆదివారం ఒక్కరోజే సుమారు 3 క్వింటాళ్ల మటన్తో భోజనం పంపిణీ చేశాడు. ఇప్పటివరకు అభ్యర్థులు కేవలం చికెన్తో సరిపెట్టగా.. ఆ అభ్యర్థి మాత్రం ఏకంగా మటన్తో భోజనాలు పెట్టించడం విశేషం. ఈ సంగతి తెలియగానే ఆయన ప్రత్యర్థి వెంటనే రెండు క్వింటాళ్ల చికెన్ను అదే వార్డులో ఇంటింటికీ పంపిణీ చేయడం కొసమెరుపు. మొత్తంగా సదరు వార్డులోని అన్ని ఇళ్లలో మటన్, చికెన్, మందు బాటిళ్లు కనిపిస్తున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇంటింటికీ గిఫ్ట్లు పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఓటు కోసం ఖరీదైన గిఫ్ట్లు పంపిణీ చేస్తున్నారు. వాటిలో పూజకు ఉపయోగించే ఇత్తడి, వెండి దీపాలు, మంగళహారతులు, చీరలు, వెండి బిళ్లలు, భగవద్గీత పంపిణీ చేస్తున్నారు. కొన్ని వార్డుల్లో నగదు, మందు పంపిణీ జోరుగా సాగింది. బీడీలు బంద్ వారం రోజులుగా మహిళలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో బీడీలు చుట్టడం బంద్ అయిందని కమీషన్ ఏజంట్లు మొత్తుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి అన్ని వార్డుల్లో మహిళలు అభ్యర్థులు, కీలక నేతల ప్రచార కార్యక్రమానికి హాజరుకావడంతో బీడీలు చేసే వారే లేకుండా పోయారు. బకాయిలు మాఫీ -
పర్యటిస్తూ.. ఓటు అడుగుతూ..
కోరుట్ల: బీఆర్ఎస్ హయాంలో కోరుట్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఎన్నికల్లో ఓటు వేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలువార్డుల్లో కార్నర్ మీటింగులు, ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. పట్టణ అభివృద్ధి, పారదర్శక పాలన, యువతకు ప్రాధాన్యం ఇవే బీఆర్ఎస్ లక్ష్యాలని పేర్కొన్నారు. తమ పార్టీ హయాంలోనే కోరుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. కేసీఆర్ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని, పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్టు వంటి ఎన్నో పథకాలు అందించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఓట్లేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ -
● ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని నిరసన ● మా ఇంటికి రాకండి.. అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు
కరీంనగర్ కార్పొరేషన్: ‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. మా ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు. మేము పన్నులుకట్టడం లేదా. మేం చెల్లించిన పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి. మీకు ఎందుకు ఓటు వేయాలి. మా ఇంటికి రాకండి’.. అంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కరీంనగర్ నగరపాలకసంస్థ 36వ డివిజన్లోని మారుతినగర్కు చెందిన కోటేశ్వర్ అనే వ్యక్తి తన ఇంటికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో రోడ్లు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నాయని... మీకు ఎందుకు ఓటువేయాలంటూ ఆయన ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నలు సంధించారు. -
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
జగిత్యాల: కేసీఆర్ హయాంలోనే జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించి.. అభివృద్ధిలో నిలిచిందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా నిలవాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని పలువార్డులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే జిల్లా ఏర్పడి మెడికల్ కళాశాల మంజూరైందని, ఆస్పత్రులు మెరుగయ్యాయని, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు. అవ్వా కేసీఆర్ను మరువకు అవ్వా.. కేసీఆర్ను మరువకు.. వృద్ధులకు పింఛ న్లు పెంచి ఇచ్చిండు.. అంటూ వసంత ఓ వృద్ధురాలిని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకేంద్రంలో పర్యటిస్తుండగా.. ఓ వృద్ధురాలు ఎదురుపడగా ఆమెను ఆప్యాయంగా పలుకరించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత -
ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని కలుషితం చేస్తుండు
జగిత్యాలటౌన్: సమాజమే తన కుటుంబం అని, తనను నమ్ముకున్నోళ్లకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని, వలసవాదులను తరిమికొట్టి నిజమైన కాంగ్రెస్వాదులకు గెలిపించాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలోని పలు వార్డుల్లో తన అనుచరులకు మద్దతుగా ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 40 ఏళ్లుగా ప్రజలమధ్య ఉన్నానని, కాంగ్రెస్ కార్యకర్తలను కాదని ఇతరులకు టికెట్ ఇవ్వడం న్యాయమా..? అని ప్రశ్నించారు. అణిచివేతకు గురవుతున్న వారికి అండగా చివరివరకూ పోరాడతానన్నారు. కష్టపడిన వారికి టికెట్ ఇవ్వకుండా తనను గోడుగోడునా ఏడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్ పార్టీని కలుషితం చేస్తున్నాడని, తాను కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు తాపత్రయ పడుతున్నానని పేర్కొన్నారు. అధికారం, ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరులో నిజమైన కాంగ్రెస్వాదులను గెలిపించాలని పిలుపునిచ్చారు. నమ్ముకున్నోళ్లకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు వలసవాదులను తరిమి కొట్టి కాంగ్రెస్వాదులను గెలిపించండి బల్దియా ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జీవన్రెడ్డి -
బాల్యానికి భరోసా
● అక్షరాలు దిద్దాల్సిన బాల్యం పనుల్లో.. ● ఆపరేషన్ స్మైల్లో 37 మంది గుర్తింపు ● పనిలో పెట్టుకున్న ఐదుగురిపై కేసు నమోదు మెట్పల్లిరూరల్: పాఠశాలకు వెళ్లి అక్షరాలు దిద్దాల్సిన వయస్సులో చిన్నారులు బాలకార్మికులుగా మగ్గిపోతున్నారు. బాల్యం నుంచే వయస్సుకు మించి పనులు చేస్తున్న చిన్నారుల జీవితం దుర్భరంగా మారి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, హోటళ్లు, దుకాణాలు, ఇతరత్రా వ్యాపార సముదాయాల్లో బాలకార్మికులుగా కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏటా పోలీసులు పలు శాఖలను సమన్వయం చేసుకుని ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో చిన్నారులకు విముక్తి లభిస్తోంది. 37 మంది బాలకార్మికులకు విముక్తి.. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని జనవరి ఒకటి నుంచి 31 వరకు నిర్వహించిన అధికారులు.. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నెలరోజులపాటు జరిగిన ఈ కార్యక్రమం కోసం పోలీస్శాఖ ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు, మహిళ కానిస్టేబుల్ను ప్రత్యేకంగా కేటాయించింది. ఇందులో చైల్డ్ వెల్ఫేర్, రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులు, సిబ్బంది భాగస్వాములై చర్యలు చేపట్టారు. ప్రైవేట్ వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించగా.. వేర్వేరు ప్రాంతాల్లో 37 మంది బాలకార్మికులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే బాల కార్మికులను పనిలో పెట్టుకున్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భరోసా కలిగేలా.. బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్న అధికారులు తల్లిదండ్రులు లేనివారిని రక్షణ గృహాలకు తరలిస్తున్నారు. మిగతా వారిని పాఠశాలల్లో చేర్పించడం, తల్లి దండ్రులకు అప్పగించడం, కౌన్సెలింగ్ వంటివి చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఏటా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ స్మైల్తో ఎంతో మంది బాలకార్మికులకు విముక్తి లభిస్తోందని, వారికి భరోసా ఇస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాలి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి. ఎక్కడైనా వ్యాపార సముదాయాల్లో చిన్నారులను పనిలో పెట్టుకున్నట్లైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. బాలలను పనిలో పెట్టుకోవడం నేరం. చిన్నారులను పనిలో పెట్టుకున్న వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తాం. – కిరణ్కుమార్, ఎస్సై, మెట్పల్లి -
కళకు జీవితమిస్తే..
ఇరవై ఐదేళ్లు.. ఇదొక సాధారణ కాలం కాదు. కళనే శ్వాసగా, పాటనే ఆయుధంగా మలుచుకుని సాగించిన పోరాట కాలం. కమాన్పూర్ మండలం రొమ్మికుంట గ్రామానికి చెందిన పులిపాక బాలయ్య అనే కాళాకారుడు కళాకారుడిగా అనేక సేవలు చేశాడు. పాటలు రాయడం నుంచి వేదికలపై పాడటం వరకూ ప్రజల మధ్య చైతన్యం నింపే కార్యక్రమాల నుంచి సామాజిక సందేశాల వరకూ అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉద్యమ గీతాల ద్వారా ప్రజల గుండెల్లో స్పందన రేపాడు. ఉద్యమాల వేడి వేదికలపై కనిపించినా.. జీవితంలో కష్టాలే ఎదురయ్యాయి. ఇంతకాలం కళకు అంకితమై ఉన్నా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వెంటాడుతోంది. ప్రస్తుతం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ,చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కళాకారుడి ప్రతిభను చూసే సమాజం, అతడి బతుకును చూడడం మరిచిపోతుందంటున్నాడు. ఉద్యమాల సమయంలో అవసరమైన కళాకారులు.. ఆ ఉద్యమం ఫలించిన తర్వాత పక్కన పడిపోవడం బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రభుత్వం స్పందించాలని, కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరుతున్నాడు. – పులిపాక బానయ్య, పాటల రచయిత, కమాన్పూర్ -
శివరాత్రి వేడుకలకు రండి
● మంత్రి అడ్లూరికి ఆహ్వానం వెల్గటూర్: కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 15న మహాశివరాత్రి ఉత్సవాలకు రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేశ్ శనివారం మంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. శివరాత్రి రోజు నిర్వహించే పూజలు, గోదావరి పుణ్యస్నానాలకు రావాలని ఈవో కాంతారెడ్డి, అర్చకులు సంజీవ్ శర్మ, ఆలయ సిబ్బంది రాజయ్య తదితరులు కోరారు. ఏప్రిల్ నాటికి ఆయిల్ పాం కోతలు● జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్గొల్లపల్లి: ఆయిల్ పాం తోటలు ఏప్రిల్ నాటికి కోతకు వస్తాయని జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ అన్నారు. మండలంలోని దట్నూర్లో సాగవుతున్న ఆయిల్ పాం తోటలను శనివారం జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యాంప్రసాద్ పరిశీలించారు. ఒక్కో చెట్టుకు 10 నుంచి 12 గెలలు ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 2022–23లో నాటిన తోటలు ఏప్రిల్, మే నెలల్లో కోతకు వస్తాయని, రైతులకు కోత విధానంపై త్వరలో ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. రైతులు ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ధర్మపురి ఉద్యాన అధికారి అర్చన, హెచ్ఈవోలు, రైతులు పాల్గొన్నారు. చిన్నారులకు టీకాలు వేయించాలి● డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ జగిత్యాలరూరల్: చిన్నారులు భవిష్యత్లో ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా తప్పనిసరిగా టీకాలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం హబ్సీపూర్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. పుట్టినప్పటి నుంచి ప్రతినెలా వ్యాక్సిన్లు సక్రమంగా వేయించాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ‘ఎఫ్ఎల్ఎస్’ పరీక్షకు సన్నద్ధం చేయాలిరాయికల్: ఎఫ్ఎల్ఎస్ పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఈవో రాము అన్నారు. మండలంలోని మైతాపూర్ ప్రభుత్వ పాఠశాలను శనివారం సందర్శించారు. మూడో తరగతి విద్యార్థులకు పునాది అక్షరాస్యత, సంఖ్య జ్ఞానంపై ఆరా తీశారు. తెలుగు, ఆంగ్లం ఎంతవరకు స్పష్టంగా చదువుతున్నారో గుర్తించాలని, గణితంపై పట్టు సాధించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో రాఘవులు, సెక్టోరియల్ ఆఫీసర్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు గుండేటి కల్పన, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రవీందర్ పాల్గొన్నారు. కోరుట్ల: పట్టణంలోని జెడ్పీ పాఠశాలలో శిక్షణ కల్పించారు. జిల్లా సెక్టోరియల్ అధికారి సత్యనారాయణ, ఎంఈఓ నరేశం, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ల జారీకి దరఖాస్తులు ఆహ్వానం జగిత్యాల: అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. 2026–27 సంవత్సరానికిగాను జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు ఆహ్వానించామని, అర్హత గల వర్కింగ్ జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పౌరసంబంధాల శాఖ అధికార వెబ్సైట్ IPQ.TELANGANA.GOV.INలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 9 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. -
బీజేపీ, బీఆర్ఎస్కు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్టే
కోరుట్ల/మెట్పల్లి: మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్టేనని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి శనివారం కోరుట్ల, మెట్పల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయనుందన్నారు. ఢిల్లీలో రాహూల్గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కోరుట్లలో జువ్వాడి నర్సింగరావు పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కోరుట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణానికి అధిక నిధులు మంజూరు చేసి అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రుణమాఫీ, యువతకు 70 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల ఇస్తామని పేర్కొన్నారు. కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి మాట్లాడుతూ కోరుట్ల అభివృద్ధి రత్నాకర్ రావు హయాంలోనే జరిగిందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో శూన్యమని పేర్కొన్నారు. కోరుట్లలో పాలిటెక్నిక్, వెటర్నరీ విశ్వవిద్యాలయం, 4500 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలి అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ల్లో పాల్గొన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని, ఐదేళ్లలో ఒక్కరేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందని తెలిపారు. కోరుట్ల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలి అభివృద్ది సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం భారీ నీటిపారుదల, పౌరసఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి -
ప్రత్యేక మేనిఫెస్టోలు.. ఆకట్టుకునే హామీలు
మెట్పల్లి: ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్వతంత్రులు ప్రత్యేకంగా మేనిఫెస్టోలు రూపొందించి ప్రచారం చేస్తున్నారు. మెట్పల్లి బల్దియాలో కాంగ్రెస్ రెబల్స్గా పోటీలో ఉన్న అభ్యర్థులు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు చర్చనీయాంశమయ్యాయి. ఓ వార్డులో ఓ అభ్యర్థి తాను గెలిచిన నెలలోపు 9 గ్యారంటీలు అమలుచేస్తానని ఇంటింటికి హామీ పత్రం అందిస్తున్నాడు. వార్డులోని పేద కుటుంబాల్లో ఆడపిల్ల వివాహానికి రూ.12వేలు, అంత్యక్రియల ఖర్చుకు రూ.5వేలు, దసరాకు హిందువులు, రంజాన్కు ముస్లిం మహిళలందరికీ చీరెలు అందిస్తానని, దుబాయ్, మస్కట్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లే యువతకు ఉచితంగా వీసా, విమాన టికెట్లు ఇవ్వడం వంటి హామీలు ఇస్తున్నాడు. మరో వార్డులో కూడా ఓ అభ్యర్థి వార్డులోని ఆడపిల్ల వివాహానికి రూ.10,116 ఆర్థిక సహాయం, పేద పిల్లలకు ఉచితంగా విద్య, రవాణా సౌకర్యం, 24గంటలపాటు అంబులెన్స్ సౌకర్యం, పండుగల సందర్భంగా మహిళలకు చీరలు అందిస్తానని, సౌదీ, ఖతర్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉపాధికి ఉచితంగా వీసాలు ఇవ్వడం తదితర హామీలతో ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. -
సుపరిపాలన కోసం బీఆర్ఎస్కు మద్దతు తెలిపాలి
మెట్పల్లి: మున్సిపాలిటీల్లో సుపరిపాలన కోసం బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోరారు. పట్టణంలోని పలు వార్డుల్లో శనివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావుతో కలిసి ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు. తాగునీటితోపాటు ఇతర వసతులు కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పూర్తిగా విఫలమైందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ధర్మపురి: పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్టణ ప్రజలకు కనీసం తాగునీటి సమస్యకు పరిష్కారం చూపలేకపోయిందన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే అక్కపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేసి పట్టణానికి తాగునీటి సమస్య దూరం చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
వలస కాంగ్రెస్ నాయకులను బొంద పెడదాం
రాయికల్: మున్సిపల్ ఎన్నికల్లో వలస కాంగ్రెస్ నాయకులను ఓటుతో బొందపెట్టాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. బల్దియాలో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా శనివారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ జెండా మోయని వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్లు ఇచ్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. చేతిగుర్తును దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. అభివృద్ధి పేరిట ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు స్పీకర్ ప్రకటించినా.. కాంగ్రెస్ కార్యకర్తలను కాదని ఏనాడూ జెండా మోయని వారికి టికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. జగిత్యాలలో తైబజార్ ఎత్తివేసినట్లు రాయికల్లో కూడా ఎత్తివేస్తామని తెలిపారు. తమది ఒరిజినల్ కాంగ్రెస్ అని గుర్తుచేశారు. బాధ్యతగల పౌరుడిగా పోరాడుతా.. జగిత్యాలటౌన్: తనకు పదవి లేకున్నా.. ప్రజల తరఫున పోరాటం చేస్తానని జీవన్రెడ్డి అన్నారు. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న కాలుష్యం, పొగతో ఇబ్బంది పడుతున్నామంటూ నూకపెల్లి డబుల్బెడ్రూం కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శనివారం డంపింగ్ యార్డును సందర్శించారు. బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా దుర్గంధం వెదజల్లుతోందన్నారు. చెత్తను గుట్ట సమీపంలో వేసి బయోమైనింగ్ నిర్వహించి పొల్యూషన్ లేకుండా చూడాలని కోరారు. -
స్వతంత్రులతోటి..!
పోటాపోటీ..జగిత్యాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. జిల్లాలో ప్రధానంగా పెద్ద మున్సిపాలిటీలైన జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఉండగా.. జగిత్యాలలో స్వతంత్రులదే హవా నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రులు బరిలో ఉన్న వార్డుల్లో పోటీ ఆసక్తిగా మారింది. స్వతంత్రులతోనే ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా జగిత్యాలలో అటు జీవన్రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ తరఫున 15 మంది, 35 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. అటు సంజయ్ వర్గీయులు 35 కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా.. 15 మంది స్వతంత్రులుగా ఉన్నారు. వీరి మధ్యనే అత్యధికంగా పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల బీఆర్ఎస ప్రభావం చూపే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల బీజేపీ వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థుల సవాల్ జగిత్యాల మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులే కీలకం అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. చైర్మన్ ఎన్నికలో వీరు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవన్రెడ్డి వర్గీయులు 35 మంది కాంగ్రెస్ టికెట్ ఆశించి రాకపోవడంతో స్వతంత్రులుగా బరిలో ఉండటంతోపాటు వారికి జీవన్రెడ్డి మద్దతు ఇస్తున్నారు. స్వతంత్రులను గెలిపించాలని వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దీంతో 35 మంది గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు వ్యక్తిగత చరిష్మా, సామాజిక వర్గం, ఆర్థిక బలం, గతంలో పోటీచేసిన అనుభవం ఉండటంతో వీరు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా కొన్నిచోట్ల సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు సైతం అత్యధికంగా ఉండటంతో గంపగుత్తగా పడే అవకాశాలున్నాయి. తమకు కేటాయించిన గుర్తులను చూపిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఒకవేళ స్వతంత్రులు గెలువకున్నా వారు మాత్రం ప్రధాన పార్టీల గెలిచే అభ్యర్థులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ రెబల్ కాంగ్రెస్ మధ్యనే పోటీ జరుగుతోంది. కొన్ని సీట్లలో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ పంచుకునే అవకాశాలున్నాయి. బీజేపీ నుంచి బోగ శ్రావణి, బీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్లో రెబల్స్కు జీవన్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులకు సంజయ్కుమార్ ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల్లో మంత్రులు లక్ష్మణ్కుమార్, ఉత్తమ్కుమార్రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా.. జగిత్యాలలో మాత్రం ప్రధాన నాయకులు మాత్రం ఇప్పటివరకు ఎవరూ ప్రచారం నిర్వహించలేదు. గెలుపే లక్ష్యంగా ప్రణాళిక మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. మహిళ సంఘాలు, కుటుంబ సభ్యులు, యువజన సంఘాలు, ఇతర సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ప్రణాళికప్రకారం ముందుకెళ్తున్నారు. సంఘాలకు హామీలివ్వడంతో పాటు, ప్రతి పని చేసిపెడతామని పేర్కొంటున్నారు. మహిళాసంఘాలు గెలుపు ఓటముల ప్రభావం వీరిపైనే ఉండటంతో వారి అవసరాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐదు మున్సిపాలిటీల్లో అత్యధికంగా మహిళ ఓటర్లే ఉన్నారు. వీరి ఓట్లను గంపగుత్తగా వస్తే గెలుపు ఒకేవైపు ఉంటుందని మహిళాసంఘాలకు కొంతమేర అప్పజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అభ్యర్థులు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ పోటీ ఇస్తున్న అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో ఓట్ల చీలిక భయం గెలుపోటములపై తీవ్ర ప్రభావం ఊపందుకున్న అన్ని పార్టీల ప్రచారం ప్రలోభాలు ప్రచారపర్వానికి రెండు రోజులు మాత్రమే ఉండటంతో మున్సిపాలిటీల్లో నాయకులు కార్నర్ మీటింగ్లు, సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పగలంతా ఇంటింటి ప్రచారం చేపట్టడం, సాయంత్రం వేళల్లో గల్లీల వద్ద కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కొన్నిచోట్ల ఇప్పటి నుంచే ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పట్టుచీరలు, కుంకుమ భరణిలు, కొందరు వారి గుర్తులకు సంబంధించిన వస్తువులు, మరికొందరు మద్యం, మాంసం అందించేందుకు శ్రీకారం చుడుతున్నారు. మొత్తానికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని గల్లీల వద్ద విందులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. మద్యం పంపిణీతో పాటు, కొన్ని చోట్ల చికెన్, మటన్ పంపిణీ చేస్తున్నారు. -
లారీ, బస్సును ఢీకొన్న ఇసుక లారీ
● ఆరుగురు ప్రయాణికులు, లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు ● బోల్తా పడ్డ యూరియా లారీ పగిలిన ఆర్టీసీ బస్సు అద్దాలు బోల్తా పడ్డ యూరియా లారీ శంకరపట్నం: తాడికల్ గ్రామంలో శనివారం యూరియా లారీ, ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొంది. ప్రయాణికులు, స్థానికుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు 70 మంది ప్రయాణికులతో కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తోంది. తాడికల్ సహకార సంఘానికి యూరియా లోడ్తో వస్తున్న లారీని ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో యూరియా లారీ వెనక భాగం ముక్కలు ముక్కలై బోల్తా పడింది. యూరియా లారీ వెనకాల కరీంనగర్ నుంచి వస్తున్న హుజూరాబాద్ డిపోకు చెందిన అద్దె బస్సును ఇసుక లారీ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. యూరియా లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనానికి సమాచారమందించారు. ఆలస్యం కావడంతో ఆటోలో కొందరిని హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కేశవపట్నం పోలీసులు చేరుకొని 108 వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించి వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులు -
పాలిసెట్తో ఉజ్వల భవిత
కరీంనగర్టౌన్: ప్రస్తుతం పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఏం చేయాలనే ఆలోచన తల్లిదండ్రులు, విద్యార్థుల్లో మెదులుతుంది. చాలా మంది ఇంటర్ చదవడానికి ఆసక్తి చూపుతారు. సంప్రదాయ చదువులు కాకుండా.. త్వరితగతిన ఉపాధి, ఉద్యోగవకాశాలు కావాలనుకునేవారికి పాల్టెక్నిక్ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయని విద్యానిపుణులు చెబుతున్నారు. పదో తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాలిసెట్– 2026 ప్రవేశపరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు అవకాశం ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 40,701 మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. కరీంనగర్ జిల్లాలో 13,156, జగిత్యాల 12,298, పెద్దపల్లి 7,495, రాజన్న సిరిసిల్ల 7,752 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో టెక్నికల్ రంగం వైపు అడుగులు వేయాలనుకునే వారు పాలిసెట్ను ఎంపిక చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాటారం, హుస్నాబాద్, సిరిసిల్ల(ఆగ్రహారం), కోరుట్ల, కరీంనగర్ జిల్లాకేంద్రాల్లో పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో 480 సీట్లు, హుస్నాబాద్, కాటారం, కోరుట్ల, కరీంనగర్ కళాశాలల్లో 5 కోర్సులకు 66 చొప్పున 330 సీట్లున్నాయి. ఆసక్తిగల విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.300 అపరాద రుసుముతో ఏప్రిల్ 22 వరకు ఫీజు చెల్లించొచ్చు. మే 13న ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, పదో తరగతిలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా ఎంపిక చేస్తారు. మూడేళ్ల కోర్సులో ప్రతిభచాటిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా జెన్కో, ఎన్టీపీసీ, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వే, సింగరేణి, ఐవోసీఎల్, బీహెచ్ఈఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఐటీఐ, ఇంజినీరింగ్, పాలిటెక్నికల్ శిక్షకులుగా చేరవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఏప్రిల్ 20 వరకు అవకాశం.. మే 13న ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,701 మంది ఎసెస్సీ విద్యార్థులు ఉపాధి, ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి పాల్టెక్నిక్ విద్య తోడ్పడుతుంది. గ్రామీణ విద్యార్థులకు ఈ కోర్సు ఉపయోగకరం. తక్కువ ఫీజు చెల్లించి ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. మూడేళ్ల కోర్సులో ఆరు నెలలు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఇది విద్యార్థుల్లో అవగాహన పెంచుతుంది. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ చేస్తే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు ఉంటాయి. – డి.శోభారాణి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కరీంనగర్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 20 రూ.100 అపరాధ రుసుంతో ఏప్రిల్ 21 ప్రవేశపరీక్ష నిర్వహించే తేదీ మే 13 -
మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు
కరీంనగర్రూరల్: మూడేళ్లక్రితం కుటుంబకలహాలతో ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని పోలీసులు ఆధునిక టెక్నాలజీతో నేపాల్లోని ఖాఠ్మాండులో గుర్తించి శనివారం కరీంనగర్కు తీసుకొచ్చారు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు వివరాలు గోదావరిఖనికి చెందిన పస్తం సురేశ్(32)కు దుర్శేడ్కు చెందిన అనూషతో వివాహమైంది. మూడేళ్లక్రితం అత్తగారింటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కరీంనగర్రూరల్పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక విచారణతోపాటు ఆధునిక సాంకేతిక సాయంతో సురేశ్ విశాఖపట్నం,నేపాల్దేశంలోని ఖాఠ్మాండులో నివసిస్తున్నట్లు గుర్తించారు. చివరకు వివిధ ప్రయత్నాల ద్వారా సురేశ్ను పట్టుకుని శనివారం పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మిస్సింగ్కేసును చేధించిన పోలీసులను సీఐ నిరంజన్రెడ్డి అభినందించారు. -
ఎవరికెవరు ఏమవుతారో..?!
జగిత్యాలటౌన్: జగిత్యాల బల్దియా ఎన్నికల ప్రచారంలో వింత పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్డి తన అనుచరులైన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఎర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారంలో నిమగ్నమయ్యారు. దీంతో ఓట ర్లు విస్తుపోతున్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ పా ర్టీ ఫిరాయింపుపై ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత పిటిషన్ను కొట్టేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని మీడియా ముఖంగా ప్రకటించిన ఎమ్మె ల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అధికార పార్టీ సీనియర్ నాయకుడు స్వతంత్రులకు మద్దతుగా ప్రచారం చేస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ‘ఉపాధి’ ప్రచారం పెద్దపల్లిరూరల్: మున్సిపల్ ఎన్నికలు అనేకమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పెద్దపల్లిలో పలువురు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. చైర్పర్సన్ అభ్యర్థిగా ముందుకొచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్బ్లాక్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కళాబృందాలతో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయన ప్రచారశైలిని చూసిన ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులు.. మంథని ప్రాంతం నుంచి కళాకారులను రప్పించి ప్రచారం హోరెత్తిస్తున్నారు. వార్డుల్లో ప్రచారం చేస్తే రూ.200 పలువురు అభ్యర్థులు తమగుర్తుతో వార్డుల్లో ప్రచారం చేసేందుకు అదేవార్డుకు చెందిన వారితోనే తిరుగుతున్నారు. వీధుల్లో జెండాలు పట్టుకుని రెండుగంటల పాటు ఇలా తిరిగితే ఒక్కొక్కరికి రూ.200 ఇస్తున్నారు. ఇలాంటి ప్రజలు పొద్దున ఒకరికి, మధ్యాహ్నం మరొకరిని, రాత్రిపూట ఇంకొకరికి వారివారి జెండాలు, గుర్తులు పట్టుకుని ‘జై అభ్యర్థి.. జై పార్టీ’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయం గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు జనాల్ని పోగేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. మీరు మాతో ప్రచారానికి రండి అని అడిగితే.. ‘ఇప్పుడు పలానా అభ్యర్థికి మద్దతుగా వెళ్తున్నాం.. మీరు రెండు గంటల తర్వాత ప్రచారం చేసుకోండి’ అంటూ అభ్యర్థులకు స్థానిక ప్రజలు సూచిస్తున్నారు. ఓట్ల పండుగ పుణ్యాన మహిళలకు ఇలా రోజుకు కనీసం రూ.600 వరకు కూలి గిట్టుబాటు అవుతోంది. పెద్దపల్లిరూరల్: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎత్తులు, పైఎత్తులు వేస్తుంటారు. కానీ పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ అభ్యర్థి.. తమకు మద్దతుగా 150 మందిని సమీకరించారు. తన వార్డులో శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. కానీ, వారందరినీ సమీపంలోని మరోవార్డు అభ్యర్థి.. తన మద్దతుదారుల కోసం ఏర్పాటు చేసుకున్న భోజనం తినేందుకు పంపించాడు. అదే సమయంలో ఆ అభ్యర్థి మద్దతుదారులు అక్కడకు చేరుకున్నారు. వీరంతా ఎవరు? ఎందుకొస్తున్నారోనని సదరు అభ్యర్థితో సహా ఆయన మద్దతుదారులెవరికీ అంతుబట్టలేదు. ‘మిమ్మల్ని ఎవరు పంపించారు’ అని ఆరా తీయగా.. పొరుగువార్డుకు చెందిన ఓ నాయకుడని తేలింది. ‘మీ అందరికీ తలా రూ.200 చొప్పున డబ్బులు ఇవ్వమని అతడికి డబ్బులు ఇచ్చా.. మీరంతా ఆయన వద్దకే వెళ్లి తీసుకోండి’ అని చెప్పి వెనక్కి పంపిచేశాడు. ‘అరే.. మా అవసరానికి తగ్గట్టుగా భోజనం సిద్ధం చేసుకుంటే.. మాకు సంబంధం లేనివ్యక్తులను ఇలా పంపడమేంటో’ అని సదరు అభ్యర్థి వాపోయాడు. ఇలాంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి.ఒకరి ప్రచారం.. మరొకరి భోజనం! అధికార పార్టీకి ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రచారం స్వతంత్రులకు అధికార పార్టీ నాయకుడి ప్రచారం జగిత్యాలలో వింత పరిస్థితి -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వేములవాడరూరల్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు ఎస్సై చల్లా వెంక్రట్రాజం తెలిపారు. మృతునికి 50 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మెడలో రుద్రాక్ష, ఇతర మాలలు ధరించి ఉన్నాడు. మతిస్థిమితం సరిగ్గా లేక.. కాగితాలు ఏరుకునేవాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే 87126 56417లో సంప్రదించాలని కోరారు. ● పత్తిపాకలో దొంగతనం ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలోని మెన్నెని వెంకటనర్సింగరావు ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.. వెంకటనర్సింగరావు తన ఇంటికి తాళాలు వేసి పని నిమిత్తం కరీంనగర్ వెళ్లాడు. శనివారం ఉదయం వచ్చిచూడగా తాళం పగులకొట్టి కనిపించింది. లోనికి వెళ్లిచూడగా.. బీరువా ధ్వంసమై ఉంది. అందులోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి గుడికి సంబంధించిన 19 గ్రాముల బంగారు ఆభరణాలు, 510 గ్రాముల వెండి వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్టీం పోలీసులు వేలిముద్రలు సేకరించారు. 25ఏళ్లుగా స్వామివారి కానుకలు ఇక్కడే.. పత్తిపాకలో 2000–2001 సంవత్సరంలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాటినుంచి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సమకూరే కట్నకానుకలను మాజీ సర్పంచ్ వెంకటనర్సింగరావు ఇంట్లోనే భద్రపర్చుతున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చిన కట్నకానుకలనూ ఆయన ఇంట్లో ఉంచేందుకు భక్తులు రాగా.. తాను స్థానికంగా ఉండడం లేదు, వేరేవారి ఇంట్లో భద్రపర్చాలని చెప్పారు. అయినా, గ్రామస్తులు ఒప్పుకోలేదు. ఆయన ఇంట్లోనే ఆభరణాలు భద్రతపరిచారు. దొంగలు ఈ ఆభరణాలతోపాటు వాటి తాలూకు జాబితా కూడా ఎత్తుకెళ్లారు. దీంతో బంగారం, వెండి ఎంతుందనే సమాచారం తెలియడం లేదు. దీనిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ స్పష్టత ఇవ్వలేదు. సిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లో శనివారం రెండు వేర్వేరు సంఘటనల్లో రూ.4లక్షలు సీజ్ చేశారు. జగిత్యాలకు చెందిన శ్రీనాథ్ తన కారులో వస్తుండగా పోలీసుల తనిఖీల్లో రూ.2లక్షలు నగదు పట్టుబడిందని సిరిసిల్లటౌన్ సీఐ కృష్ణ తెలిపారు. వేములవాడ మండలం ఎదురుగట్ల నుంచి చిగురు వినోద్ సిరిసిల్ల వస్తుండగా స్థానిక చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.2లక్షలు నగదు తరలిస్తున్నట్లు నిర్ధారించి సీజ్ చేసినట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. -
మత్తు కోసం ఏవిల్ ఇంజెక్షన్లు !
● చెట్లపొదల్లో వెలుగుచూసిన సిరంజీలు, ఆంపుల్స్ ముస్తాబాద్ (సిరిసిల్ల): యువత మత్తు కోసం రోజుకో మార్గాన్ని కనిపెడుతున్నారు. తక్కువ ధరకు లభించే ఇంజెక్షన్లు తీసుకుంటూ మత్తులో జోగుతున్నారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజ న్నసిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రం శివారులో తెర్లుమద్ది, బందనకల్ గ్రామాల మధ్య చెట్ల పొదల్లో వాడి పడేసిన సిరంజిలు, ఆంపుల్స్ కవర్లు ప్రత్యక్షమయ్యాయి. ఫిజీషియన్ సమక్షంలోనే ఇచ్చే ఈ ఇంజెక్షన్లు ఇలా ఆరుబయట, చెట్లపొదల్లో పడి ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. మత్తు కోసమే వాడవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలోనే మత్తు కోసం దగ్గు మందు తాగేవారు. మత్తు కోసం ఇలాంటి మార్గాలు ఎంచుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిరిసిల్ల క్రైం: మున్సిపల్ ఎన్నికల నిబంధనలు అతిక్రమించి తరలిస్తున్న మద్యంను సిరిసిల్ల టౌన్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ కృష్ణ తెలిపిన వివరాలు. పట్టణంలోని సుభాష్నగర్ ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేయగా.. రూ.19,008 విలువైన మద్యం, బైక్, మొబైల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దార్నం అరుణ, దార్నం లక్ష్మీనారాయణ, మల్లికార్జున వైన్స్, రాచమల్లు రాముపై కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం తీసుకెళ్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
● గొడ్డలితో నరికి.. కత్తితో గొంతుకోసి ● భార్యను దారుణంగా చంపిన భర్త ● నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జగిత్యాలక్రైం: మూడుముళ్లు వేసి.. ఏడడుగులు వేసి.. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను అనుమానిస్తూ.. ఆమైపె కక్ష పెంచుకుని నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి.. కత్తితో గొంతు కోసి దారుణహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో శనివారం వేకువజామున వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీపూర్కు చెందిన అదరవేని మల్లయ్యతో 30 ఏళ్ల క్రితం జగిత్యాల పట్టణ శివారు ఉప్పరిపేటకు చెందిన సత్తవ్వతో వివాహమైంది. వీరికి కుమారుడు, కూతురు సంతానం. కొంతకాలంగా మల్లయ్య భార్యను అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మద్యానికి బానిస అయిన మల్లయ్య సత్తవ్వను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. పలుమార్లు పంచాయితీలు జరిగాయి. వేధింపులు భరించలేని సత్తవ్వ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయినా వేధించడంతో తల్లిగారింటికి వెళ్లి కొన్నేళ్లు అక్కడే ఉంది. మూడేళ్ల క్రితం పెద్దలు పంచాయితీ చేసి ఇద్దరిని కలిపారు. అప్పటినుంచి సత్తవ్వ పిల్లలను చూసుకుంటూ.. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. కుమారుడు హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న కూతురు నాలుగురోజుల క్రితం తన ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ వెళ్లింది. దీనిని అదునుగా చేసుకున్న మల్లయ్య.. శనివారం వేకువజామున రెండు గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సత్తవ్వను గొడ్డలితో నరికాడు. సత్తవ్వ సృహ కోల్పోవడంతో కూరగాయల కత్తితో గొంతు కోశాడు. విచక్షణరహితంగా శరీరంపై పొడిచాడు. ఆమె మృతిచెందిందని నిర్ధారించుకుని అక్కడినుంచి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి సోదరుడు గడ్డం చిన్నమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్ తెలిపారు. లక్ష్మీపూర్లో విషాదం ఇద్దరు పిల్లలతో కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సత్తవ్వ హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుమారుడు, కూతురును ఉన్నత చదువులు చదివిస్తున్న సత్తవ్వ హత్యకు గురికావడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సాయంత్రం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుడు మల్లయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. -
స్వామి.. ఓ సంచలనమే
సిరిసిల్ల: మావోయిస్టు చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ హయాంలో సిరిసిల్ల ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నడిచింది. పీపుల్స్వార్(ప్రస్తుత మావోయిస్టు) పార్టీ పశ్చిమ డివిజన్ కమిటీ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యుడి రెండేళ్లపాటు పనిచేశారు. తన కాలంలో భారీగా రిక్రూట్మెంట్స్తో ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ప్రస్తుతం సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్న లోకేటి చందర్రావు(57) గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో స్వామితోపాటు ఏడుగురు మరణించారు. ఈ ఎన్కౌంటర్లో పోలీస్ కమాండో కానిస్టేబుల్ దీపక్ చిన్నమదవి మంద్రా(38) ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడికి చెందిన చందర్ రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. కోనరావుపేట ఎస్సైపై కాల్పులు 1998లో కోనరావుపేట ఎస్సైగా ఉన్న ముసిపట్ల శ్రీనివాస్గౌడ్ పోలీసు బలగాలతో శివారు అడవుల్లోకి కూంబింగ్కు వెళ్లారు. ఎగ్లాస్పూర్కు చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిమ్మపల్లి వైపు వెళ్తుండగా అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న మావోయిస్టు స్వామి దళం పోలీసులపై మెరుపుదాడి చేసి కాల్పులు జరిపారు. కూంబింగ్లో ముందు వరుసలో వస్తున్న శ్రీనివాస్గౌడ్ అక్కడికక్కడే మరణించారు. మరికొందరు పోలీసులు గాయాలతో బయటపడ్డారు. ● అదే ఏడాది కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు కెనాల్ పక్కన హోంగార్డు శ్రీనివాసరాజు కోవర్టుకు పాల్పడుతున్నాడని కాల్చి చంపారు. ● కోనరావుపేట మండలం వట్టిమల్లలో 1997, జూలై 28న మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను సాయుధ నక్సలైట్లతో నిర్వహించారు. వట్టిమల్ల వేదికగా జనాన్ని సమీకరించి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగించారు. వట్టిమల్లకు వచ్చే నాలుగు దారుల్లోనూ సాయుధ నక్సలైట్లతో మందుపాతరలు అమర్చి మూడు గంటలపాటు పొద్దంతా సమావేశాన్ని నిర్వహించడం అప్పట్లో ఓ సంచలనం. ● వీర్నపల్లి మండలం గర్జనపల్లి, కోనరావుపేట మండలం మరిమడ్లలో అటవీశాఖ కాంట్రాక్టర్ల ద్వారా తునికాకు సేకరణ చేసింది. కూలీలకు కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించి సేకరించిన తునికాకును నిల్వ చేశారు. రూ.కోటి విలువైన తునికాకును లారీల్లో మధ్యప్రదేశ్కు అమ్మేసి ఆ డబ్బుల్లో కొంత మొత్తాన్ని గ్రామాభివృద్ధికి, కొంత ఉద్యమ అవసరాలకు వినియోగించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ● 1999లో కోనరావుపేట మండలం నిజామాబాద్లో ప్రజాకోర్టును నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మీడియాను తెప్పించి ప్రజాకోర్టును ఏర్పాటు చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీ సానుభూతిపరుడు భానును, కోనరావుపేట మండలం మరిమడ్లకు చెందిన నాగరాజు గర్జనపల్లి అడవుల్లో పట్టుకుని కాల్చి చంపారు. అప్పట్లో పీపుల్స్వార్కు, జనశక్తి పార్టీలకు మధ్య వైరుధ్యాలు ఉండేవి. ఆధిపత్య పోరులో భాగంగా జనశక్తికి చెందిన ఇద్దరిని కాల్చిచంపారు. ఇంకా అనేక హింసాత్మక ఘటనలకు, భౌతికదాడులకు, సంచలన ఘటనలకు పడ్కల్ స్వామి కేంద్రబిందువుగా నిలిచారు. పడ్కల్ స్వామిగా గుర్తింపు 1992 నుంచి అజ్ఞాతంలో ఉన్న స్వామి ఏనాడు ఇంటి ముఖం చూడలేదు. 1993లో నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడ్కల్లో సిర్నాపల్లి దళం సేదతీరుతుండగా పోలీసులు దాడి చేశారు. ఆ సంఘటనలో డిప్యూటీ దళకమాండర్ సంజీవ్, గోపి, క్రాంతి మరణించారు. పడ్కల్లో పోలీసులతో రెండు రోజులపాటు ఒక్కడే పోరాడి ఒక్క కానిస్టేబుల్ను కాల్చి చంపారు. అప్పటి డీజీపీ పడ్కల్కు రావడం విశేషం. స్వామి ఉన్న ఇంటికి నిప్పు పెట్టగా ఏకే 47తో కాల్పులు జరిపి పోలీసులు వెనక్కి తగ్గగానే తప్పించుకున్నారు. అప్పట్లో ఇదో సంచనం. అప్పటి నుంచి పడ్కల్ స్వామిగా లోకేటి చందర్రావుకు గుర్తింపు. ఆయన భార్య సులోచన అలియాస్ నవనీత పార్టీలో పనిచేస్తూనే 2016లో అనారోగ్యంతో మరణించారు. ఆయన కొడుకు రమేశ్ ఇటీవల పోలీసులకు లొంగిపోయారు. రమేశ్ భార్య బుజ్జి అలియాస్ కమలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వామి ఎన్కౌంటర్ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాబల్య గ్రామాల్లో శనివారం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఆవశ్యకతపై ప్రసంగం సిరిసిల్లలో చర్చనీయ ఘటనలు గొడ్చిరోలి ఎన్కౌంటర్లో మృతి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్న మాజీలు, సానుభూతిపరులు -
ఆరోగ్యం పైలం!
పరీక్షల కాలం..కరీంనగర్ స్పోర్ట్స్/హుజూరాబాద్: వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పక్షం రోజుల్లో ఇంటర్, 35రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి పుస్తకాలతో సబ్జెక్టులపై యుద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతూ.. అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఏడాదిలో విన్న పాఠాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. పరీక్షలు ఉన్నాయని చదవడమే కాదు.. ఆర్యోగ్యాన్ని కాపాడుకోవడమూ మఖ్యమని నిపుణులు అంటున్నారు. సరైన ఆహారం తీసుకోవాలని, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దని, నిద్రముఖ్యమని సూచిస్తున్నారు. – వివరాలు 8లో.. -
నా గొంతు కోయాలని చూస్తున్నారు..
జగిత్యాలటౌన్: రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలని చెప్పారని, మనం మాత్రం పార్టీ మారిన వారిని ఓట్లతో కొడదామని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాలలోని 24, 25 వార్డుల్లో తన అనుచరులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నా మీద కోపంతో నా వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా చేసి నా గొంతు కోయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం చివరి దశలో నన్ను క్షోభకు గురిచేస్తున్నారని భాగోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. జీవన్రెడ్డిని ఓదార్చిన స్థానిక మహిళలు 40 ఏళ్లుగా మాకు అండగా నిలుస్తున్న మీ వెన్నంటి ఉండి మీరు సూచించిన అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంగడిబజార్లోని కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడుతూ పదేళ్లు అదికారంలో ఉండి సోయి లేకుండా ఉన్నోళ్లు ఇప్పుడు అభివృద్ధి జపం ఆలపిస్తూ కాంగ్రెస్ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని అన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా నావారి కోసం కొట్లాడి తీరుతానని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదంతో జగిత్యాల బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని జీవన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
తలాపున గోదావరి ఉన్నా తాగునీరు ఇవ్వలేదు
ధర్మపురి: పట్టణానికి ఆనుకొని గోదావరి నది ఉన్నప్పటికీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు తాగేందుకు మంచినీరు ఇవ్వలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురిలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 8, 9వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన మంత్రి మధ్యాహ్నం 10, 11, 12 వార్డుల్లో కార్నర్ మీటింగ్ల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఏనాడు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.30లక్షలు వెచ్చించి బోర్లు వేయించానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
భూ సమస్యలు పరిష్కరించాలి
మల్లాపూర్: భూ సమస్యలతో పాటు అన్ని ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. శుక్రవారం మల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం సాదాబైనామా, అసైన్మెంట్ భూముల దరఖాస్తులపై నిర్ణయం తీసుకోనందున అందుకనుగుణంగా భూ సమస్యల పరిష్కారానికి సిద్ధింగా ఉండాలని సూచించారు. కేజీబీవీ విద్యాలయం తనిఖీ మండల కేంద్రంలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, వంటశాల, స్టోర్రూంను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. రోజువారీ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐలు రాజేశ్, అశోక్, కేజీబీవీ ప్రిన్సిపాల్ శ్రీలత, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నియమావళిపై కఠినంగా వ్యవహరించాలి
జగిత్యాలక్రైం: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎ న్నికల్లో నియమావళిపై కఠినంగా వ్యవహరించాల ని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎన్నికల్లో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు పాత్ర, ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠిన అమలు, పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లు, క్రిటికల్, సున్ని త ప్రాంతాల పర్యవేక్షణ, పోలింగ్రోజు తీసుకో వాల్సిన భద్రత చర్యలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత వంటి అంశాలపై చర్చించారు. పోలింగ్రోజు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో నేరా లకు పాల్పడిన, రౌడీ షీటర్లు, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు ఆరిఫ్ అలీ ఖాన్, అనిల్ కుమార్, సురేష్, కరుణాకర్, రాంనరసింహారెడ్డి, రిజర్వ్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నిర్వహణ భారం!
● మూడేళ్లుగా రైతువేదికలకు అందని నిధులు ● ఇబ్బంది పడుతున్న వ్యవసాయశాఖ అధికారులుజగిత్యాలరూరల్: వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు భారంగా మారాయి. రైతులకు ఆధునిక సాగు విధానంపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన వీటి నిర్వహణపై పట్టింపు లేకుండా పోయింది. ఏళ్ల తరబడి ని ధులు మంజూరు చేయకపోవడంతో ఆశించిన ల క్ష్యం మేరకు ముందుకు సాగడం లేదు. మూడేళ్లకు పైగా బకాయిలు పేరుకపోవడంతో ఏఈవోలకు భారంగా మారింది. ఏళ్ల తరబడి.. జిల్లాలో క్లస్టర్ల వారీగా 71 రైతువేదికలు ఉన్నాయి. ఇందులో డిసెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఐదునెలల పాటు నెలకు రూ.8వేల చొప్పున గత ప్రభుత్వం నిర్వహణ నిధులు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. మే 2022 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వ్యవసాయ విస్తరణాధికారులు నెలనెలా ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఒక్కో రైతు వేదికకు ప్రతినెలా నిర్వహణ చేయడం వారికి కష్టతరంగా మారింది. అన్నింటి భారం ఏఈఓల పైనే.. రైతువేదికల నిర్వహణకు ప్రభుత్వం దీర్ఘకాలంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు సమావేశమై సాగు సమస్యలు, ఆధునిక పద్ధతులపై చర్చించేందుకు వీలుగా రైతువేదికల్లో గతేడాది వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈఓలపై భారం పడుతోంది. కనీసం మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ, కరెంటు బిల్లుల చెల్లింపు, స్వీపర్లకు జీతాల చెల్లింపు, రైతునేస్తం, రైతులతో సమావేశాల నిర్వహణ సమయంలో టీ, బిస్కెట్లు వంటివాటికి నిధులు లేకపోవడంతో అన్నింటిని తామే భరించాల్సి వస్తుందని ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రైతువేదికల్లో అటెండర్ మొదలుకొని అన్ని పనులు ఏఈఓలే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు రైతువేదికల్లో ఏర్పాటుచేసిన మినీ భూసార పరీక్షల నిర్వహణ కూడా అటకెక్కింది. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సమయానికి రైతువేదికలను సిద్ధం చేయాలని అటెండర్ కూడా లేకపోవడంతో అన్ని పనులు తామే చేయాల్సి వస్తుందని అంటున్నారు. పైగా ప్రతినెలా తమ వేతనం నుంచే నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోందని ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. -
అభివృద్ధే నా లక్ష్యం
జగిత్యాల: జగిత్యాల, రాయికల్ అభివృద్ధే నా లక్ష్యమని, ఇప్పటికే జగిత్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మోతెలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగిత్యాల ప్రజల చిరకాల వాంఛ యావర్రోడ్డు విస్తరణ అని, గురువారం గుమ్లాపూర్లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారని అన్నారు. గతంలో మంత్రిగా ఉన్న జీవన్రెడ్డి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. టీడీఆర్ (ట్రాన్స్ఫర్ డెవపల్మెంట్ రైట్స్)లో భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించినట్లు తెలిపారు. అధికార పార్టీ అండతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద పనులు చేయించుకునే ప్రభుత్వంతో కలిసి పనిచేయించుకునే కౌన్సిలర్లను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు సతీశ్, దామోదర్రావు, శ్రీనివాస్, సురేందర్రావు పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయండి అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ప్రచారం చేశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నిధులు తెప్పించి ప్రతీ వార్డులో సీసీరోడ్లతో పాటు, అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణం, గట్టు సతీశ్, శ్రీనివాస్, సురేందర్ పాల్గొన్నారు. -
మైకుల హోరు.. ప్రచార జోరు
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగడంతో ప్రతీ వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా నాయకులే కనబడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. అవ్వ, అక్క, అన్న.. ఒకసారి అవకాశం ఇవ్వండి.. అంటూ ఓటర్లను వేడుకుంటున్నారు. ఏ సమస్య ఉన్నా మీ ముందు వెంటనే వాలుతానని, పనిచేస్తానని, అభివృద్ధి చేసి చూపిస్తానని భరోసా కల్పిస్తున్నారు. ఉదయం ఓటర్లు లేవకముందే ఇంటి ఎదుట ప్రత్యక్షమవుతున్నారు. కొందరు అభ్యర్థులైతే భార్యభర్తలు ఇద్దరే వచ్చి ఓటు వేయాలంటూ వేడుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ ఇంటింటికీ తిరుగుతూ మద్దతిచ్చి గెలిపించాలని కోరుతున్నారు. ఉదయం భార్యభర్తలు ఇద్దరు తిరుగుతూ మళ్లీ మధ్యాహ్నం 11 గంటల సమయంలో తమ మద్దతుదారులతో కాలనీలంతా తిరుగుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీలకు చెందిన ప్రధాన నాయకులు సైతం వార్డువార్డునా తిరుగుతూ మా అభ్యర్థికే ఓటు వేయాలని వేడుకోవడంతో అసలైన ప్రచార పర్వం మొదలైంది. సమయం ఎక్కువ లేకపోవడంతో అభ్యర్థులు ప్రతీ ఒక్క ఓటరును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల వార్డుల్లో కౌన్సిలర్గా అవకాశం ఇవ్వండి అంటూ మైకులతో హోరెత్తిస్తున్నారు. వారి అనుచరులు ఓటర్లు ఎక్కడున్నా వెళ్లి స్వయంగా కలుస్తున్నారు. వివిధ కాలనీలకు చెందిన వారు వారి పని నిమిత్తం ఉదయం ఎక్కడకు వెళ్లినా అక్కడికే వెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అవకాశాన్ని మలుచుకునేలా ప్రయత్నాలు వారి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు ముదరడంతో టికెట్ల పంపిణీలో సైతం వారి వర్గీయులకు రాకపోవడంతో ఎమ్మెల్యే, మాజీమంత్రి ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా, దీనిని అవకాశంగా తీసుకోవాలని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగ శ్రావణి సైతం వార్డుల్లో ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల సందడి ప్రచార జోరు ఊపందుకోవడంతో మున్సిపాలిటీల్లో ప్రధాన వీధులు, బస్టాండ్లు, వివిధపార్టీల నాయకులతో కళకళలాడుతున్నాయి. అటు హోటళ్లలో సైతం గిరాకీ పెరిగింది. ఈసారి మహిళలు ఎక్కువ ప్రచారం చేపడుతున్నారు. రాత్రే ప్రణాళికలు రూపొందించుకుని పోల్ మేనేజ్మెంట్ ప్రకారం ప్రచారం చేపడుతున్నారు. ప్రలోబాలకు ఎర అప్పుడే ప్రతీ వార్డుల్లో ఓ టర్లను ఆకట్టుకునేందు కు ప్రలోభాలకు ఎరచూపుతున్నట్లు తెలిసింది. వార్డుల్లో ఏది కావాలన్నా వెంటనే చేపిస్తామని, వీధిదీపాలు, డ్రెయినేజీ సమస్యలు గానీ, ఏ సమస్య ఉన్నా దృష్టికి తీసుకువస్తే వెంటనే చేపిస్తామని హామీ ఇస్తున్నారు. అటు జీవన్.. ఇటు సంజయ్.. జగిత్యాల మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన ప్రధాన నాయకులైన అటు జీవన్రెడ్డి... ఇటు సంజయ్కుమార్ వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. జీవన్రెడ్డికి కాంగ్రెస్ నుంచి 15 టికెట్లే దక్కడంతో ఆ 15 వార్డుల్లో కాంగ్రెస్కు ప్రచారం చేస్తుండగా.. మిగతా వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండగా వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ సైతం ప్రభుత్వానికి మద్దతిస్తున్న వారికి ఓటు వేయాలంటూ పేర్కొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా అటు జీవన్, ఇటు సంజయ్లు ఒకే పార్టీకి చెందిన ప్రచారం నిర్వహించడం, ఆయన వర్గీయులను గెలిపించుకోవాలని అతను, ఇతని వర్గాన్ని గెలిపించుకోవాలని ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల ఆర్వోలు, ఏఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబ ంధించి ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలని, శిక్షణ పొందిన ప్రతీ అధికారి ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమవళికి లోబడి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు, వెబ్కాస్టింగ్ పాత్ర చాలా కీలకమన్నారు. అన్ని రకాల మెటిరియల్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సమకూర్చుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, నోడల్ అధికారి రవికుమార్ పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలి మున్సిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ను ఉద్యోగులు వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఈనెల 11న జరుగనున్న మున్సిపల్ ఎ న్నికల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వా రా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పి ంచినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులు డ్యూటీ ఉత్తర్వుల కాపీ, ఐడీ కార్డు అందజేయాలని తెలిపారు. -
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
మల్లాపూర్: ‘సాక్షి’ దినపత్రిక పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్తో ప్రయోజనం చేకూరుతుందని సర్పంచులు పోతవేని నారాయణ, దప్పుల పద్మ నర్సయ్య అన్నారు. మండలంలోని సాతారం, గుండంపల్లి జెడ్పీ హైస్కూల్లలో పదో తరగతి విద్యార్థులకు సాక్షి ఆధ్వర్యంలో రూపొందించిన భౌతికశాస్త్రం, గణితం స్టడీ మెటీరియల్ను శుక్రవారం పంపిణీ చేశారు. విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సాక్షి సర్క్యులేషన్ ఇన్చార్జి సురేశ్, ఉప సర్పంచులు బేతి జగన్, జగ్గుల గంగాధర్, నాయకులు దప్పుల నర్సయ్య, పాఠశాలల హెచ్ఎంలు శ్రీహరి, మధు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 8న కరీంనగర్లో ఐటీ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంకరీంనగర్: జిల్లాలోని యువతకు ఐటీరంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కోడింగ్ ట్యూటర్ ఆధ్వర్యంలో ఐటీ జాబ్మేళా, ఇంటర్న్షిష్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనెల 8న ఆదివారం ఉ.10 గంటలకు, కరీంనగర్లోని శ్వేత హోటల్లో కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఐటీ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలు, కంపెనీలు ఏ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి... గ్రాడ్యుయేషన్ తర్వాత యువత ఎలా సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టవచ్చు.. ఇంటర్న్షిప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయనే విషయాలను ఫణిరాజ్ జాలిగామ వివరించనున్నారు. ఈ కార్యక్రమం డిగ్రీ/ఇంజినీరింగ్ పూర్తిచేసిన, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 89888 87333 నంబర్కి ఫోన్చేసి తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికే ప్రవేశం కల్పించబడుతుందన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లుజగిత్యాల: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులందరూ ప్రచారంలో ఉండగా అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్లో బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయింది. జగిత్యాలకు తరలించనున్నారు. పోల్ చిట్టీలు సైతం ప్రతీ కాలనీల్లో పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సైతం ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయ క్షేత్రం సందర్శనజగిత్యాలఅగ్రికల్చర్: సేంద్రియ వ్యవసాయం చేస్తున్న జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామ రైతు రంగు నరేశ్ వ్యవసాయ క్షేత్రాన్ని శుక్రవారం వ్యవసాయాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి వడ్డెపల్లి భాస్కర్ మాట్లాడుతూ, ప్రకృతి సిద్ధమైన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడం వల్ల రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు భూమి ఆర్యోగంగా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు పెద్దపీట వేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు తిరుపతి నాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు. న్యాయవాదుల నిరసనధర్మపురి: చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు స్వప్నను హత్య చేసిన ఘటనకు నిరసనగా శుక్రవారం ధర్మపురి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలుక వినోద్ మాట్లాడుతూ హత్యకు కారుకులైన వారిని వెంటనే ఫాస్ట్ట్రాక్ కోర్టులో కేసు విచరణ జరిపి శిక్షించాలని అన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రమేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్కుమార్, న్యాయవాదులు సత్యనారాయణరెడ్డి, రౌతు రాజేశ్, నిరంజన్, రామడుగు రాజేశ్, జితేందర్రెడ్డి, ఇంద్రకరణ్, శరత్, ఊర్మిళ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
మాదిగలు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తరు
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్పార్టీకే ఓటు వేయాలని మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్నూరుకాపు భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ముఖ్యనాయకుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగతో కలిసి మాట్లాడారు. మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయత్వాన్ని బలపర్చాలని రామకృష్ణ కోరారు. సామాజిక న్యాయం, దళిత వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సమావేశంలో నాయకులు అందే భవాని, కవ్వంపల్లి రవి, కూడెల్లి ప్రవీణ్ కుమార్, సప్పి పోశయ్య, ఎలుకంటి జనార్దన్, బొడ్డు రాములు, కృష్ణపెల్లి రాజలింగం, జంగాపల్లి రాజనర్సు, చిలుక రాజేశ్, తాటిపల్లి బాబు, గాలి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధితో ప్రత్యేక గుర్తింపు
● అర్ధంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టాం ● మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు ● ‘సాక్షి’తో రామగుండం బల్దియా మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కోల్సిటీ(రామగుండం): రామగుండం మొదటి మున్సిపల్ చైర్మన్గా పలు అభివృద్ధి పనులు, సంస్కరణలు చేపట్టి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సోమారపు సత్యనారాయణ. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా పని చేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గెస్ట్ ఫాకల్టీగా ఐఏఎస్ హోదా కలిగిన అధికారులకు పాఠాలు బోధించగల విజ్ఞానం ఆయన సొంతం. ఇంజినీరింగ్తోపాటు ఎంబీఏ చదివిన ఆయన తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, మేనేజ్మెంట్ నైపుణ్యంతో చేపట్టిన పనులు మున్సిపల్ చైర్మన్ పదవికే వన్నె తెచ్చాయి. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న సత్యనారాయణను మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ పలకరించగా నాటి అనుభవాలు, విశేషాలను ఇలా పంచుకున్నారు. సోమారపు సత్యనారాయణ రామగుండం మొదటి చైర్మన్గా ఎన్నికైనప్పు డు ఉన్న పరిస్థితుల్లో మీ అనుభవం? పాలకవర్గం లేకపోవడంతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉన్న కాలంలో చైర్మన్గా ఎన్నికయ్యాను. సింగరేణి నీటి సరఫరా తప్ప మున్సిపల్ నీళ్లు లేవు. అక్కడక్కడా ఉన్న బోర్వెల్ నీరే ఆధారం. డ్రైనేజీ వ్యవస్థ, సరైన రోడ్లు కూడా లేవు. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు ఇంటి పన్ను లేకపోవడంతో నిధులు చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లారు..? ముందుగా నిధుల కొరత అధిగమించే ప్రయత్నం చేశాను. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు నంబర్లు ఇచ్చి నామమాత్రపు పన్ను విధించాం. దగ్గరున్న బ్యాంకుల్లో కట్టుకోవడానికి వీలుగా చలానాలు పంపిణీ చేశాం. ఆ రశీదుల కారణంగానే తర్వాత కాలంలో వారికి సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నిధులు పొందడానికి రామగుండంకు అర్హత ఉండగా, నాటి సీఎంను ఒప్పించి ముందుగానే నిధులు రాబట్టి అభివృద్ధి పనులు చేపట్టాం. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? తాగునీటి సరఫరాపై ముందు దృష్టిపెట్టాను. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా అర్ధాంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టి, హెడ్ వర్క్స్, ట్యాంకులు నిర్మించడంతో మున్సిపల్ నీటి సరఫరా ప్రారంభమైంది. ఆ తర్వాత 24 గంటల నీటి సరఫరా చేసి దేశం దృష్టిని ఆకర్షించేలా చేయగలిగాను. ఆ తర్వాత దేనిపై దృష్టి పెట్టారు? పారిశుధ్యం దృష్టి పెట్టాను. శానిటేషన్తో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో దేశంలోనే మొదటిసారిగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం జరిగింది. చెత్త ఏరుకొని జీవించే వారిని గుర్తించి, వారికి పరుగు పందెం నిర్వహించి శారీరక సామథ్యం ఉన్నవారికి ఉచితంగా రిక్షాలు ఇచ్చి ఇంటింటా చెత్త సేకరించడం జరిగింది. అలాగే ఎడ్ల బండ్లతో చెత్త సేకరించే పారిశుధ్య కార్మికులకు ఆటోలు ఇచ్చాం. స్వశక్తి సంఘాలకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించి ట్రాక్టర్లు కొనుగోలు చేయించాం. వాటికి మున్సిపల్ నుంచి అద్దె చెల్లించడం ద్వారా ఒకపక్క ఉపాధి పొందడంతోపాటు మరో పక్క రుణం తీరిపోయి, వారే ఆ వాహనాలకు యజమానులయ్యారు. రోడ్లు, కాలువలను ఎలా అభివృద్ధి చేశారు? మున్సిపాలిటీలో నిధుల్లేవు, పబ్లిక్, ప్రయివేట్ పార్టీసిపేషన్ అంటే నగరపాలక సంస్థ, ప్రజల భాగస్వామ్యంతో 80: 20 ప్రాతిపదికన ఎవరూ ముందుకొస్తే అక్కడ రోడ్లు, కాలువలు నిర్మించాం. నా చొరవతో నాటి ముఖ్యమంత్రి డీఎఫ్ఐడీ నిధులు రామగుండంకు మంజూరు చేయడంతో రోడ్లు, కాలువలు వంటి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం దొరికింది. వినూత్నంగా ఆలోచించి చేపట్టిన పనులేవి? పట్టణానికి తగినట్టుగా దేశంలోనే మొదటిసారిగా బేబీ డ్రెయిన్లతో కాలువల నిర్మాణం చేపట్టాం. డ్రై వెదర్ డ్రెయిన్, ఫెర్రో సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణం నా హయాంలో చేపట్టడం జరిగింది. అత్యంత మన్నికతో వేసిన సీసీ రోడ్లు కొన్ని చోట్ల ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీటర్లు ఏర్పాటు చేసి వాడిన నీటికే బిల్లు తీసుకున్నాం. జనన, మరణ ధ్రు వీకరణ పత్రాలు కొరియర్ ద్వారా ఇంటికే పంపాం. పైరవీలకు తావు లేకుండా జరిగింది. కొత్త వెలుగు కోసం ఏం చర్యలు తీసుకున్నారు? చాలా మంది రిటైర్డ్ కార్మికులు ఇక్కడ సరైన వసతులు లేవని ఇతర ప్రాంతాలు, సొంత ఊళ్లకు వెళ్తున్న తరుణంలో అందరికీ అందుబాటులో ఉండేలా మున్సిపల్ కార్యాలయ భవనం, వినూత్న డిజైన్తో కొత్త కూరగాయల మార్కెట్ నిర్మించాను. ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ భవనానికి నిధులు మంజూరు చేయించి పునాది వేశాను. తాగునీటి సరఫరా, సెంట్రల్ లైటింగ్, ఇంటి ముందుకే చెత్త బండి రావడం తదితర సౌకర్యాలు సమకూరడంతో ఇళ్ల నిర్మాణం పెరిగింది. స్వశక్తి మహిళలకు సీఆర్సీ భవనం నిర్మించి, వారితో సూపర్ మార్కెట్లు పెట్టించాం. నేపాల్ నుంచి నిపుణులను రప్పించి టోపీలు కుట్టించే శిక్షణ ఇప్పించాను. మలుపు అనే పథకం ద్వారా వందల మందికి చెప్పులు కుట్టే శిక్షణ ఇప్పించాను. ఇలా అనేక ఉపాధి అవకాశాలు కల్పించాను. మీ పనులు ప్రభావితం చేశాయా? చేశాయి. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది స్టడీ టూర్లో భాగంగా రామగుండం సందర్శించారు. మున్సిపల్ విద్యుత్ బిల్లుల్లో రామగుండంకు రూ.25లక్షలు నేను రికవరీ చేసిన విధానం నచ్చి, అలాగే చేయాలని అన్ని మున్సిపాలిటీలకు నాటి ముఖ్యమంత్రి సర్క్యులర్ జారీ చేయించారు. రాగ్పిక్కర్ విధానం, 24 గంటల నీటి సరఫరా తీరును అనేక మంది పరిశీలించి వెళ్లారు. చైర్మన్గా గొప్పగా భావించేది ఏది? మురికివాడలను అభివృద్ధి చేయడం అన్నింటి కంటే ఎక్కువగా చెప్పుకోతగ్గది. నాడు రామగుండంలో 45 నోటిఫైడ్ 47 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఉండేవి. నేను చేపట్టిన పనులతో అవి ఇప్పుడు స్లమ్స్లా కనబడతలేవు. గుర్తింపు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అవార్డులకు ఎప్పుడూ నామినేషన్ వేయలేదు. కానీ, చేంజ్ మేనేజ్మెంట్ ఫోరంలో దేశంలో కేవలం ఇద్దరు మున్సిపల్ చైర్మన్లను ఎంపిక చేయగా, అందులో నేను ఒక్కడిని కావడం నాకు ఇచ్చిన పెద్ద గుర్తింపుగా భావిస్తున్న. ఏమైనా సలహాలు ఇస్తారా? ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. ఆ ఐడియాలజీ ప్రకారం పని చేసుకుంటూ పోతారు. -
కేంద్ర నిధులతోనే బల్దియాల అభివృద్ధి
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి రాయికల్: కేంద్ర నిధులతోనే బల్దియాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి అన్నారు. గురువారం పట్టణంలోని వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ సహకారంతో రాయికల్ బల్దియాలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ ఎలక్షన్ ఇన్చార్జి బానాల లక్ష్మారెడ్డి, ముత్యంరెడ్డి, రాయికల్ పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్, రాష్ట్ర నాయకులు పడాల తిరుపతి, సింగని సతీశ్, శ్రీగద్దె సుమన్ పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో రైతు మృతిమెట్పల్లిరూరల్: విద్యుత్షాక్తో ఓ రైతు మృతి చెందినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట గ్రామానికి చెందిన సబ్బని గణేశ్ రైతు. పంటకు అడవి పందుల బెడద ఉందని బుధవారం రాత్రి సమయంలో పొలం వద్దకు కాపలా కోసమని అదే గ్రామానికి చెందిన వినోద్, సురేశ్ను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఆ ప్రాంతంలో చీకటి ఉందని సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ లైట్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో విద్యుత్ షాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని వెంట ఉన్న వినోద్, సురేశ్ మెట్పల్లిలోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ప్రమాదమని తెలిసినా.. గణేశ్కు సహకరించిన వినోద్, సురేశ్పై మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు పరామర్శమల్లాపూర్: మండలంలోని మొగిలిపేటలో ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మృతిచెందగా మృతుల కుటుంబాలను గురువారం సర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో మండల సర్పంచులు పరామర్శించారు. పసుపు ఏరేందుకు వెళ్లిన మహిళా కూలీలు టాక్టర్ బోల్తాపడి మృతిచెందడం బాధకరమన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇక్కడ సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు రొండ్ల రాజేశ్వరి రాజరెడ్డి, మండల సర్పంచులు ఏలేటి వెంకట్రెడ్డి, ఎగ్యారపు లింబాద్రి, పోతవేని నారాయణగౌడ్, గోల్కోండ కళ రమేశ్, దప్పుల పద్మనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
షెడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం పక్కన ఖాళీ స్థలంలో జీపీవోలు కూర్చోడానికి నిర్మించే షెడ్డు స్థలాన్ని తహసీల్దార్ వరప్రసాద్ గురువారం పరిశీలించారు. భూభారతి సర్వేకు గ్రామాల్లో సర్పంచులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. సన్మానం కథలాపూర్: పెగ్గెర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఐదుగురు ఉపాధ్యాయులను పలువురు గురువారం సన్మానించారు. బదిలఅ ఈయని ఉపాధ్యాయులు ఆంజనేయులు, తిరుపతి, నర్సింలు, రాధ, సరస్వతిల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ పాల్తెపు లక్ష్మి, గంగారాం, నర్సయ్య, హెచ్ఎం స్రవంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మట్టి నమూనా సేకరణపై అవగాహన
పెగడపల్లి: శాసీ్త్రయ వ్యవసాయ సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గురువారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సాయిల్ హెల్త్ ప్రోగ్రాం నిర్వహించారు. మట్టి నమూనా సేకరించే విధానంపై క్షత్రస్థాయిలో అవగాహన కల్పించి మట్టిలో పోషకాలు, సమతుల్యత, పంటల దిగుబడిపై వివరించారు. సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల మార్పిడి పద్ధతులపై తెలియజేశారు. ఏవో శ్రీకాంత్, ప్రిన్సిపాల్ ప్రభాకర్రెడ్డి, ఏవోలు అక్షయ్, పవన్, సైన్స్ టీచర్ మధు పాల్గొన్నారు. -
ఆరుగురు బంగారం దొంగలు, వ్యాపారి అరెస్ట్
మెట్పల్లి: మెట్పల్లి ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు నిందితులు.. వారు తెచ్చిన సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో మెట్పల్లి ప్రాంతంలో ఆరుచోట్ల దొంగతనాలు జరిగాయి. మెట్పల్లి శివారులో వన్నెల గంగుపై పట్టపగలే దాడి చేసి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. ఇలా వరుస దొంగతనాలు జరగడాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు.. నిందితుల కోసం డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో సీఐ అనిల్కుమార్, ఎస్సైలు కిరణ్కుమార్, అనిల్, నవీన్తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మెట్పల్లి, నిజామాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్ట నిందితులను గుర్తించారు. అప్పటినుంచి వారి కోసం గాలిస్తుండగా గురువారం మెట్పల్లిలోని కొత్త బస్టాండ్ వద్ద పండుగ రమేశ్, పల్లెపు రమేశ్ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వారు ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు నిందితులు గుంజె గంగాధర్, గంగమణి, గైని కిరణ్, పెద్దూరు మల్లేశ్వరితోపాటు దొంగ సొత్తును కొనుగోలు చేస్తున్న వ్యాపారి ఇందూరి రాకేశ్ను అరెస్ట్ చేశారు. వీరందరి నుంచి 15 తులాల బంగారు, 32తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగవంతంగా చేధించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. నిందితులపై అనేక కేసులు అరెస్టయిన నిందితుల్లో నలుగురిపై గతంలో పలు స్టేషన్లలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కిరణ్పై 35, పండుగ రమేశ్పై 23, గంగాధర్పై 16, పల్లెపు రమేశ్పై 13 కేసులున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్కుమార్ -
రూ.200 పుచ్చుకో... జెండా పట్టుకో !
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ, పొలిమేర గ్రామాల్లోని మహిళలకు ఉపాధి పుష్కలంగా లభిస్తుంది. నామినేషన్లపర్వం ముగిసిపోయి బుధవారం నుంచి ప్రచారం ప్రారంభమైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో తన వెంట ఎక్కువ మంది కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. స్థానిక మహిళలతోపాటు పొరుగున్న ఉన్న పల్లెల నుంచి రూ.200 చొప్పున కూలీ చెల్లించి తమ వెంట ప్రచారానికి తెచ్చుకుంటున్నారు. వారు జెండా పట్టుకొని అభ్యర్థులు వెనుక ఉంటూ.. ‘.. మన అన్నకే ఓటేయాలి’, ‘అన్న గెలుపుతోనే వార్డు అభివృద్ధి’ అంటూ నినాదాలు చేయా లి. వీరు వచ్చిపోయేందుకు ఆటోలు పెడుతున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి అభ్యర్థి ఇంటి వద్ద లేదా తన వార్డు ఆఫీస్ వద్ద భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. పురుషులు ప్రచారానికి వస్తే అదనంగా మందు ఖర్చు చేస్తున్నారు. దీంతో పట్టణంలోని చికెన్, మటన్ సెంటర్ల వద్ద గిరాకీ పెరిగింది. సాధారణ రోజులతో పోల్చితే ఇప్పుడు బిర్యానీ ఆర్డర్లు రెట్టింపయ్యాయని బిర్యానీ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. -
తైబజార్ లేని మున్సిపాలిటీ జగిత్యాల
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీకి ప్రత్యేకత ఉంది. ఏ మున్సిపాలిటీలోనైనా తైబజార్ వసూలు చేస్తుంటారు. ఇక్కడ మాత్రం తైబజార్ వసూలు చేయరు. కూరగాయల వ్యాపారులైనా.. తోపుడు బండ్ల వ్యాపారులైనా.. రోడ్లపై చిన్నచిన్న వస్తువులను ఎవరైనా అమ్ముకోవచ్చు. ఇలాంటి వారికి తైబజార్ లేకపోవడం ఎంతో వెలుసుబాటు కలిగిస్తోంది. పైగా వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మున్సిపాలిటీలో అప్పటి పాలకవర్గం రూ.200కే నల్లా కనెక్షన్ అమలు చేశారు. అప్పటినుంచి అదే అమలువుతోంది. ఏ మున్సిపాలిటిలోనైనా నల్లా కనెక్షన్ తీసుకోవాలంటే కొంతమొత్తం వసూలు చేస్తుంటారు. ఇక్కడ కేవలం రూ.200కే కనెక్షన్ ఇస్తున్నారు. రైతులు, వ్యాపారులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కొనసాగుతున్న రూ.200కే నల్లా కనెక్షన్ -
ముగ్గురు ముఖ్యుల ఓట్లు 30వ డివిజన్లోనే..
రామగుండం: రామగుండం నగరంలోని 30వ డివిజన్పైనే అందరి దృష్టి నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ డివిజన్లో ముగ్గురు ముఖ్యులు అయోధ్యనగర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి కాగా, ఇటీవల అంతర్గాం మండల పరిధిలోకి తన ఓటును బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. కాగా దీని పక్కనున్న 28వ డివిజన్ అబాది రామగుండంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పీసీసీ ప్రోటోకాల్ చైర్మన్, ఏఐసీసీ ప్రతినిధి హర్కర వేణుగోపాల్రావు ఓటరుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 30వ డివిజన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములు ముగ్గురు ముఖ్యుల ఆధిపత్యాన్ని స్పష్టం చేయనుందనే చర్చ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కోలేటి దామోదర్కౌశికహరివేణుగోపాల్రావుమక్కాన్సింగ్ రామగుండంలో సర్వత్రా ఆసక్తికర చర్చ -
నువ్వక్కడ.. నేనిక్కడ!
● బల్దియా బరిలో భార్యాభర్తలు కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచేందుకు భార్యభర్తలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వేర్వేరు డివిజన్లలో భార్యాభర్తలు పోటీచేసి గెలుపొందిన సంఘటనలు గతంలో ఉండగా, ఈ సారి నగరంలో మూడు జంటలు బల్దియా పోరులో నిలిచాయి. బీఆర్ఎస్ నుంచి 47వ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, ఆమె భర్త బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ 21వ డివిజన్ నుంచి పోటీచేస్తున్నారు. 58వ డివిజన్ నుంచి దుడ్డెల శ్రీధర్, 57వ డివిజన్ నుంచి ఆయన భార్య దుడ్డెల మంజుల పోటీకి దిగారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన వీరు, దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 46వ డివిజన్ నుంచి మాజీ కౌన్సిలర్ వరాల నారాయణ, 13వ డివిజన్ నుంచి ఆయన భార్య వరాల అనసూయ స్వతంత్రులు పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికి, రాకపోవడంతో స్వతంత్రులుగా పోటీలో నిలిచారు. -
జనరలైనా.. తగ్గేదే లే..
● ఆసక్తికరంగా 63వ డివిజన్ పోరు కరీంనగర్ కార్పొరేషన్: మహిళా రిజర్వేషన్కే ఆ నాయకురాళ్లు పరిమితం కాలేదు. జనరల్ అంటే పురుషులకు కేటాయించినట్లు కాదంటూ, తాము బరిలోకి దిగి ఆ మహిళలు పోరుకు సై అన్నారు. నగరంలోని 63వ డివిజన్ పోరు ఆసక్తికరంగా మారింది. డివిజన్ రిజర్వేషన్ బీసీ జనరల్ అయినప్పటికి మూడు ప్రధాన పార్టీల నుంచి అతివలే బరిలోకి దిగారు. మాజీ కార్పొరేటర్ గందె మాధవి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ కర్రె పావని, బీజేపీ నుంచి దేశ శిల్ప పోటీపడుతున్నారు. డివిజన్ నుంచి మొత్తం నలుగురు పోటీలో ఉండగా.. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీసీ ఉద్యమ నేత కేశిపెద్ది శ్రీధర్రాజు బరిలో నిలిచారు. -
పంచిన మద్యం సీసాలు వైన్స్షాపుల్లోకి..
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ఓ వార్డులో ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ప్రతిరోజూ సాయంత్రం ముగ్గురు అభ్యర్థులు అడిగినవారికి లేదనకుండా మందు పంపిణీ చేస్తున్నారు. అయితే ముగ్గురు ఇచ్చిన మందును ఒకేరోజూ తాగలేకపోతున్నారు. దీంతో వారు కొత్త ఐడియాకు తెరతీశారు. ఒక అభ్యర్థి ఇచ్చిన మందును ఆ రోజు తాగి.. మిగిలిన అభ్యర్థులు ఇచ్చిన మందు బాటిళ్లను వైన్స్షాపులకు తీసుకెళ్లి ఇచ్చి నగదు తీసుకుంటున్నారు. ఇలా సమకూరిన డబ్బులను తలాకొంత పంచుకుంటుండడం విశేషం. ప్రచారంలో భాగంగా వచ్చిన మద్యం బాటిళ్లను ఇచ్చి డబ్బులు తీసుకెళ్లడంతో వైన్స్షాపు నిర్వాహకులు నివ్వెరపోతున్నారు. కండువాలు మారుతున్నాయ్.. కొందరు కార్యకర్తలు ఉదయం ఒకపార్టీకి.. మధ్యాహ్నం మరోపార్టీకి.. సాయంత్రం ఇంకో పార్టీకి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎప్పడికప్పుడు కండువాలు మారుస్తూ.. పోటీలో ఉన్న అభ్యర్థులను కంగారుపెడుతున్నారు. మహిళాసంఘాల సభ్యులైతే ఎవరు ప్రచారానికి రమ్మంటే వారివెంట వెళ్తున్నారు. అభ్యర్థులు కూడా కార్నర్ మీటింగ్లకు మహిళాసంఘాల సభ్యులను తరలిస్తున్నారు. వీరికి ఆయా పార్టీల వారు రూ.200 నుంచి రూ.300 వరకు ఇస్తున్నట్లు సమాచారం. పొద్దంతా మూడు పూటల మూడు పార్టీల ప్రచారంలో పాల్గొంటే ఎంత తక్కువనుకున్నా రూ.వెయ్యి వరకు గిట్టుబాటు అవుతోంది. కొంతమంది మహిళా సంఘాల ప్రతినిధులు బరిలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేసి ‘మీరేమీ అనుకోవద్దు.. మేం మీకే ఓటు వేయిస్తాం..’ కేవలం డబ్బుల కోసం ఓ పూట ప్రచారానికి వెళుతున్నామని చెబుతుండడం గమనార్హం. బాటిళ్లు ఇచ్చి నగదు తీసుకుంటున్న వైనం ఒక్కోరోజు ఒక్కో అభ్యర్థి పంచిన మద్యం సేవనం మిగిలిన వారు ఇచ్చిన బాటిళ్లకు వచ్చిన డబ్బులు తలాకొంత -
గ్రామ సరిహద్దులు చూపించండి
వెల్గటూర్: తమ గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ తాళ్లకొత్తపేట సర్పంచ్ ధ్యావనపల్లి సుధాకర్ గురువారం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఎల్లంపల్లి ముంపు గ్రామమైన తాళ్లకోత్తపేట గ్రామ ఆర్అండ్ఆర్ కాలనీని సర్వే చేసి బౌండరీ సరిహద్దు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే సర్వే నం.344లో అటవీశాఖ భూములకు సంబంధించి సర్వే చేయించి వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగు శ్రీకాంత్, వార్డు సభ్యులు కాల్ల సారవ్వ, సాయిని తిరుపతి, చేరుకూరి శ్రీనివాస్, దర్మాజ లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి మద్దతిచ్చే అభ్యర్థులను గెలిపించండి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: ప్రభుత్వానికి మద్దతిచ్చే అభ్యర్థులను గెలిపించాలని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. గురువారం జగిత్యాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానన్నారు. మున్సిపాలిటీలో గెలిస్తే ధర్మపురి రోడ్లో గంగపుత్రులకు వెండింగ్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లిలో రూ.10 లక్షలు, కల్లెడలో రూ.20 లక్షలతో నిర్మించే మహిళ సమైక్య భవనాలకు భూమిపూజ చేశారు. సర్పంచులు అంకతి మల్లయ్య, గంగోత్రి, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ వరందన్, డీఈ మిలింద్, ఎంపీవో రవిబాబు పాల్గొన్నారు. కోర్టుకు సదుపాయాలు కల్పిస్తా జగిత్యాలజోన్: జిల్లా కోర్టుకు సదుపాయాలను కల్పిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల బార్ అసోసియేషన్తో సమావేశమయ్యారు. కోర్టులో లిఫ్ట్, అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు. ఐఎంఏలో అవగాహన ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ‘లీగల్ లిటరసీ ఫర్ డాక్టర్స్ ప్రోటెక్టింగ్ ప్రాక్టీస్ అండ్ పేషంట్స్’ అనే అంశంపై న్యాయవాది గొనెపట్ల అజయ్ రెడ్డి ప్రసంగించారు. న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు రికార్డులు వైద్యుడికి సంరక్షణగా నిలుస్తాయన్నారు. ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.హేమంత్, ఎ.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కె.సుధీర్కుమార్ పాల్గొన్నారు. -
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
ఇబ్రహీంపట్నం: ‘సాక్షి’ దినపత్రిక పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్ ఎంతో మేలు చేస్తుందని సర్పంచ్ కొనకంటి వెంకట్ అన్నారు. మండలంలోని వర్షకొండ జెడ్పీ హైస్కూల్లో పదోతరగతి విద్యార్థులకు ‘సాక్షి’ ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ స్టడీ మెటిరియల్ను గురువారం పంపిణీ చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా స్టడీ మెటీరియల్ ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు గుర్తింపు తేవాలన్నారు. ఇన్చార్జీ హెచ్ఎం గాదె శ్రీనివాస్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాంల వద్ద భద్రత● కలెక్టర్ సత్యప్రసాద్జగిత్యాల: ఈవీఎం గోదాంల వద్ద భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సిబ్బందిని ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాంలను గురువారం పరిశీలించారు. గోదాముల్లోని యంత్రా ల భద్రత, సీసీకెమెరాల పని తీరు, సాంకేతిక అంశాలను పరిశీలించామన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, ఏ వో హకీం, తహసీల్దార్ రాంమోహన్ పాల్గొన్నారు. ఆడబిడ్డకు రూ.5 వేలురాయికల్: తనను సర్పంచ్గా గెలిపిస్తే తన పదవీకాలమంతా గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5 వేలు ఇస్తానని మండలంలోని కుర్మపల్లిలో హామీ ఇచ్చిన మ్యాకల మల్లేశ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. సర్పంచ్గా గెలిచాక గురువారం గ్రామంలో పుల్ల సాయి దంపతులకు ఆడబిడ్డ జన్మించగా వారికి మల్లేశ్ రూ.5 వేలు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ను గ్రామస్తులు అభినందించారు. విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం జగిత్యాలరూరల్: గ్రామంలోని విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని విద్యుత్ ఏడీ జవహర్నాయక్ అన్నారు. జగిత్యాల మండలం వంజరుపల్లిలో ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టారు. వినియోగదారుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను సర్పంచ్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఏడీ పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఏఈ, సబ్ ఇంజినీర్, ఎస్ఎల్ఐ రాజమల్లు, లైన్మన్ రాజా లింగం, ఏఎల్ఎంలు పాల్గొన్నారు. మోడల్ స్కూల్కు బస్సులు నడపండిమల్యాల: నూకపల్లి మోడల్స్కూ ల్ కు ఉదయం, సా యంత్రం మూడు బస్సులు నడిపించాలని కోరుతూ ప్రిన్సిపాల్ ఆదిత్య గురువారం కలెక్టర్ సత్యప్రసాద్, డీఈవో కె.రాము, జగిత్యాల బస్ డిపో మేనేజర్ కల్పనకు గురువారం వినతిపత్రం అందించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి నూకపల్లి మోడల్స్కూల్కు సుమారు 400మంది విద్యార్థులు వస్తుంటారని, గతంలో ఉదయం మూడు బస్సులు, సాయంత్రం మూడు బస్సులు నడిచేవని, ప్రస్తుతం ఒక్కటి మాత్రమే నడుస్తుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, సకాలంలో పాఠశాలకు చేరుకోలేకపోతున్నారని, అధికారులు స్పందించి, నూకపల్లి మోడల్ స్కూల్కు బస్సులు నడపాలని కోరారు. -
కాంగ్రెస్ జెండా ఎగరాలి
సాక్షిప్రతినిధి, కరీంనగర్/చొప్పదండి: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని బల్దియాలపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతిబాట బహిరంగ సభకు హాజ రై కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపారు. ముందుగా రామడుగు మండలంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజ లు పెద్ద ఎత్తున హాజరు కాగా.. ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజన్ని నింపింది. పట్టం కట్టి.. పనులు చేయించుకోండి సభా వేదికపైకి వచ్చిన సీఎం రేవంత్ బీజేపీ– బీఆర్ఎస్ బంధంపై నిప్పులు చెరిగారు. రెండేళ్ల వ్యవధిలో తాము చేసిన అభివృద్ధిని వివరించా రు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కరీంనగర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సుమారు రూ.2,778 కోట్లు ఇచ్చామన్నారు. రామగుండానికి రూ.586 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్కు రూ.1,489 కోట్లు, చొప్పదండి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు ఇచ్చామన్నా రు. ఇవన్ని పనులు జరగాల్సి ఉందని, కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టి, గెలిపించి పనులు పూర్తి చేయించుకోవాలని కోరారు. ఏప్రిల్లో రెండో విడు త ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. సుదీర్ఘంగా పట్టి పీడిస్తున్న రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపా రు. రాహుల్ గాంధీ, పార్టీ సూచనతో రాష్ట్రంలో కులగణన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నా రు. మనల్ని చూసి కేంద్రం కులగణనకు తల వంచిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టం కట్టాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కేబుల్ బ్రిడ్జి, రింగురోడ్డు, రివర్ ఫ్రంట్, డ్రైనేజీ పనులు పూర్తి చేయిస్తామన్నారు. ● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పిల్లల్లో నైపుణ్యం పెంచాలని సీఎంను కోరడం ద్వారా ఏటీసీ మంజూరైందన్నారు. డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సీఎం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాల్లోని బంధువులకు చెప్పి ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది సీట్లలో ప్రజలు గెలిపించారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న పవన్ కల్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల మధ్యకు వస్తోందన్నారు. ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం, ధర్మపురి లక్ష్మి నృసింహస్వామి ఆలయాలను అభివద్ధి చేయాలని కోరారు. రాబోయే గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు సౌకర్యాలు కల్పించాలన్నారు. యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి నాయకత్వంలో తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందన్నారు. సీఎం కాగానే రూ.240 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేశారని, గంగాధరలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులతో పాటు, పోస్టులు మంజూరు చేశారన్నారు. కొండగట్టుకు ఇటీవలే టీటీడీ ద్వారా రూ.35 కోట్లు ఇచ్చారని, మన ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రాజ్ఠాకూర్, విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.సార్.. జగిత్యాలకు ఇవి ఇవ్వండి..జగిత్యాల:జిల్లాకేంద్రంలో ప్రధాన సమస్య అయిన యావర్రోడ్డు విస్తరణకు సహకరించా లని, యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ వి ద్యాలయం, మినీస్టేడియం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్లో జరిగిన ప్రజాపాలన – ప్రగతి బాట సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మినీస్టేడి యం ఏర్పాటు ప్రతిపాదన అమలు చేస్తామన్నారు. -
మున్సిపాలిటీలకు ప్రభుత్వం నయాపైసా ఇవ్వలే..
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కోరుట్లరూరల్: మున్సిపాలిటీలకు రెండేళ్లకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నయాపైసా విడుదల చేయలేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కోరుట్ల, మెట్పల్లి పట్టణాలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కోరుట్ల మున్సిపాలిటీలోని సపాయి కార్మి కులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నా.. ఇక్కడి కాంగ్రెస్ నాయకుడు ఆయన తండ్రి విగ్రహానికి రూ.30లక్షలను మున్సిపల్ సొమ్మును వాడుకున్నారని పరోక్షంగా కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికా రంలో ఉన్నా.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే తాను అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ యా వార్డుల అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. -
జగిత్యాల
28.0/19.0శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20267ఘనంగా సంకటహర చతుర్థిధర్మపురి: ధర్మపురిలోని మహాగణపతికి సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్శర్మ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి మంత్రపుష్పం చేపట్టారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గరిష్టం/కనిష్టంశ్రీనివాసుని సైకత శిల్పంజగిత్యాలటౌన్:జిల్లాకేంద్రంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన శ్రీనివాసుని సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. వేముల ఉమారాణి ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి, గణపతి, సరస్వతి శిల్పాలకు వేదపండితులు నంబి వేణుగోపాలాచార్యులు పూజలు చేశారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. సాయంత్రం, రాత్రి వేళల్లో చలిగా ఉంటుంది. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటవ్.. పక్కన కాంగ్రెస్ అభ్యర్థులెందుకు..?
జగిత్యాల: ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అంటున్నవ్.. పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎందుకు కూర్చోబెట్టుకున్నవ్.. దమ్ముంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించు..’ అని ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఉద్దేశించి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి చూస్తుంటే జాలేస్తోందని, ఒకరోజు కాంగ్రెస్ పార్టీ అని, మరోరోజు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు పొందిన అభ్యర్థులను వెంటపెట్టుకునే దుస్థితి ఎందుకని ప్రశ్నించారు. ఓ వైపు ప్రజలు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు తిట్లపురాణం వింటుంటే తామే వినలేకపోతున్నామని ఎద్దేవా చేశారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్లు స్పీకర్ నడుస్తున్నారని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రావాలిగానీ.. కాంగ్రెస్ ఫ్లెక్సీ పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. జగిత్యాల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, జిల్లాకేంద్రంగా చేశారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు వొల్లం మల్లేశం, కార్యదర్శి ఆనందరావు పాల్గొన్నారు. -
రెండేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు
ధర్మపురి: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురి బల్దియా ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలుచేశామని, మిగిలిన రెండు త్వరలోనే తీరుస్తామని తెలిపారు. 2018 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేస్తానని మాట తప్పారని, యాదాద్రిని అభివృద్ధి చేశారే తప్పా ధర్మపురికి రూపాయి ఇవ్వలేదని తెలిపారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. ముందుగా ఇంటింటా ప్రచారం చేశారు. -
కలెక్టరేట్లో సోషల్ జస్టిస్ డే
జగిత్యాల: అన్నివర్గాల వారికి సమాన అవకాశాలు అందాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం సోషల్ జస్టిస్ డే వేడుకలు నిర్వహించారు. అన్నివర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తోందని, ఇందులో భాగంగా ఈనెల 4న సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహించుకోవాలని నిర్ణయించిందన్నారు. సమసమాజ స్థాపనకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ముందుగా విద్యార్థుల నృత్యాలు, కళాజాత బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, సునీత, చిత్రు, రాజ్కుమార్ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి మున్సిపల్ ఎన్నికల రెండో ర్యాండమైజేషన్ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో ఎన్నికల అబ్జర్వర్ సుదమరావు ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలన్న ఉద్దేశంతో ర్యాండమైజేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల అధి కారి రాము, కలెక్టరేట్ ఏవో హకీం పాల్గొన్నారు. వైద్య సేవలపై ఆరామెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం ఆత్మకూర్లోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నరేందర్ బుధవారం సందర్శించారు. కేంద్రంలోని వైద్య సేవలపై ఆరా తీశారు. సాధారణ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలపై తెలుసుకున్నారు. మాతాశిశు ఆరోగ్య సేవలు, టీకాల నిల్వలు, కోల్డ్చైన్ నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏఎన్ఎంలతో సమావేశమై సలహాలు, సూచనలు ఇచ్చారు. మెట్పల్లి మండల వైద్యాధికారి అంజిత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాల డీన్గా నీరజజగిత్యాలఅగ్రికల్చర్: పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా బోగ నీరజ నియమితులయ్యారు. బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ డీన్గా భారతీనారాయణ్ భట్ పనిచేశారు. నీరజ గతంలో ఉద్యానవర్సిటీలో పనిచేశారు. జేఎన్టీయూ విద్యార్థులకు త్రీడీ వర్క్షాప్కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూలో వన్డే హ్యాండ్ ఆన్ వర్క్షాప్ త్రీడి ప్రింటింగ్, ఆప్టిట్యూడ్ మ్యానుఫ్యాక్చరింగ్ నిర్వహించారు. టీబీఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా రాకేష్ వ్యవహరించారు. బీటెక్ మెకానికల్ సెకండియర్, థర్డియర్, ట్రిపుల్ఈ థర్డియర్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి వివిధ రకాలైన నమూనాలను త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారుచేశారు. అధ్యాపకులు ప్రతిభ కనబరచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరసింహ, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కోరుట్ల చెక్పోస్టు..కాంచీట్
కోరుట్ల: 1957 సంవత్సరం నాటికే కోరుట్ల పట్టణం నగర పంచాయతీ. ఆ రోజుల్లో సరుకుల అమ్మకాలకు చుట్టపక్కల గ్రామాల నుంచి వచ్చేవారికి పట్టణ శివారులో చెక్పోస్టు ఉండేది. ఆ చెక్పోస్ట్ ప్రస్తుత చాకలి అయిలమ్మ విగ్రహం నుంచి లక్ష్మీ టాకీస్ ఏరియా వరకు ఉండేది. ఆ రోజుల్లోనే కొంచెం పెద్ద పట్టణంగా గుర్తింపు ఉన్న కోరుట్లకు పక్క నే ఉన్న గ్రామాల నుంచి కూరగాయలు, మొ క్కజొ న్నలు, వడ్లు వంటి సరుకుల అమ్మకానికి చెక్పోస్టు నుంచే వచ్చేవి. దీనికి కాస్త పక్కన మెయిన్ రోడ్డు వెంట గూనపెంకులతో నగర పంచాయతీ కార్యాలయం ఉండేది. ప్రస్తుతం ఆ పాత కార్యాలయాన్నే పాత మున్సిపాలిటీగా పిలుచుకుంటున్నారు. అర్ధరూపాయి.. అమ్మకానికి చీటీ ఆ కాలంలోనే బల్దియాగా గుర్తింపు పొందిన కోరుట్లకు రావడానికి ప్రధాన రహదారి కాంచీట్ ఏరియా. ఆ కాలంలో అది నిర్మానుష్య ప్రాంతంగా ఉండేది. బల్దియా సిబ్బంది అక్కడే ఉండి కోరుట్లకు స రుకులు అమ్ముకోవడానికి వచ్చే వారి నుంచి రోజు కు అర్ధ రూపాయి తీసుకుని చీటీ ఇచ్చి అనుమతించేవారు. మరుసటి రోజు మళ్లీ సరుకులు అమ్ముకోవడానికి వస్తే మళ్లీ బల్దియా పన్ను వసూలు చేసే వా రు. సరుకుల అమ్మకాలకు కోరుట్లకు వచ్చే వారు కాంచీట్ ఏరియా నుంచి అయిలాపూర్ దర్వాజా మీ దుగా శ్రీవేంకటేశ్వరాలయం, కాల్వగడ్డ ఏరియాలో ఉన్న మార్కెట్ వద్ద సరుకులు అమ్ముకుని వెళ్లేవారు. సైకిల్.. ఎడ్లబండ్లకు బిళ్లలు ప్రస్తుతం కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్తోపాటు ఇతరత్రా చార్జీలను ఆర్టీవో కార్యాలయం అధికారులకు చెల్లిస్తామో.. అదే రీతిలో ఆ కాలంలో కొత్త సైకిల్ కొన్నా.. ఎండ్లబండి చేయించుకున్నా బల్దియా నుంచి సీమెండి బిల్లలు ఇచ్చేవారు. ఇందుకు సైకిళ్లకు రూ.5, ఎడ్లబండికి రూ.7 వసూలు చేసేవారు. ఒక్కసారి వాహనానికి పన్ను చెల్లిస్తే జీవితకాలం అనుమతి ఉండేది. బల్దియా బిళ్ల లేని సైకిల్, ఎడ్లబండి కనిపిస్తే రూ.10వరకు జరిమానా వేసేవారు. ఆ కాలంలో పొలాల్లో, చేలలో పశువులు మేస్తే వాటిని బంధించి ఉంచడానికి కోరుట్లలోని ఆరు ప్రాంతాల్లో బంజరుదొడ్డి ఉండేవి. వాటి విడిపించుకోవాలంటే ఒక్కో ఆవు, బర్రెకు రూ.10 పన్నుగా వసూలు చేసే ఆనవాయితీ ఉండేది. ప్రస్తుతం బల్దియా పరిధిలో ఉన్న ఆ బంజరుదొడ్ల స్థలాలు దాదాపు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బల్దియాకాలం నాటి ముచ్చట్లను సీనియర్ సిటిజన్ గొనె శంకర్ వివరించారు. నాడు సరుకుల రాకపోకల దారి అక్కడే బల్దియా పన్ను వసూలు సైకిళ్లు, ఎడ్లబండ్లకు మున్సిపల్ బిళ్ల్లలు -
వారే వీరు..గుర్తులే తారుమారు
జగిత్యాల బల్దియాలో వింత పరిస్థితి జగిత్యాల: జిల్లాలో ప్రచార సమరం ప్రారంభమైంది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడం.. బీఫామ్ల లొల్లి కూడా కొలిక్కి రావడంతో టికెట్లు వచ్చిన అభ్యర్థులు కదనరంగంలోకి దిగారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల్లో రెబల్స్ ప్రభావం పెద్దగా లేదు. కానీ.. జగిత్యాలలో మాత్రం వింత పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 50 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ నుంచి అటు జీవన్రెడ్డి, ఇటు ఎమ్మెల్యే సంజయ్కుమార్ వర్గీయులు అన్ని స్థానాలకు నామినేషన్లు వేశారు. అయితే వీరిలో సంజయ్ వర్గంలోని 35 మందికి బీఫామ్లు దక్కాయి. జీవన్రెడ్డి వర్గంలోని 15 మందికి మాత్రమే బీఫామ్లు లభించాయి. అయితే సంజయ్ వర్గం నుంచి బరిలో ఉన్నవారంతా తాజా మాజీ కౌన్సిలర్లు కావడం విశేషం. 35 మందిలో 30 మంది గతంలో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. సంజయ్ కుమార్ కూడా ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచే గెలిచినప్పటికీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వెంట నడిచిన వారు ప్రస్తుతం కూడా ఆయనతోనే ఉన్నారు. తాజాగా వారికే కాంగ్రెస్ నుంచి టికెట్లు కూడా లభించాయి. పాతకాపులే పోటీ చేస్తున్నా.. కేవలం పార్టీ గుర్తులు మాత్రం మారాయి. ఇరువర్గాల మధ్య పోటీ తీవ్రం.. ఎమ్మెల్యే వర్గీయులకు అత్యధికంగా టికెట్లు రావడం.. జీవన్రెడ్డి వర్గీయులు ఒక్కరు కూడా విత్డ్రా చేసుకోకపోవడంతో పోటీ తీవ్రమైంది. ప్రధాన పార్టీల మధ్య పోరు ఉండాల్సింది పోయి కాంగ్రెస్ రెబల్స్ మధ్యనే పోటీ నెలకొంది. మున్సిపాలిటీని సునాయాసంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ బీఫామ్ల గొడవతో ఏ పార్టీ గెలుస్తుందోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడంతో ఆ పార్టీ కాస్త ఢీలా పడినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత కాంగ్రెస్ గొడవను క్యాచ్ చేసుకుని బల్దియాను ఎలాగైనా కై వసం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. ఆచీతూచి వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ ఎక్కడెక్కడ వీక్ ఉందో చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. బీజేపీ కూడా బల్దియాలో పాగా వేసేందుకు ప్రచారంలోకి దిగింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే జగిత్యాల జిల్లా అయ్యిందని, మెడికల్ కళాశాల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలను చెప్పుకుంటూనే కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ జిల్లాలో జగిత్యాలే అతిపెద్ద మున్సిపాలిటీ. ఇక్కడ 50 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డులకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ మినహా ఏ పార్టీలోనూ రెబల్ లేరు. ఒక్క కాంగ్రెస్లోనే రెబెల్స్ మోగిస్తున్నారు. జీవన్రెడ్డి వర్గీయులకు టికెట్లు రాకపోవడంతో బరిలో ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే తన మద్దతు అని జీవన్రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఆయన చరిష్మాతో విజయం సాధిస్తామని, కాంగ్రెస్ జెండామోయకున్నా..టికెట్ దక్కించుకున్న వారిని ఓడిస్తామని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతూ అనుకూలమైన వారందరికీ ప్రచారం చేస్తానని ప్రకటిస్తూ.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ ఎమ్మెల్యే వర్సెస్ జీవన్రెడ్డి పోటీగా మారింది. మొగ్గు ఎటువైపో..? ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ.. గతంలో బీఆర్ఎస్లో ఉన్నవారికి ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున టికెట్లు ఇప్పించుకున్నారు. వీరు కూడా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు జీవన్రెడ్డి వర్గం తామే అసలైన కాంగ్రెస్వాదులమని, తమను గెలిపించి పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో ఇక్కడ ఎన్నికల సమరం రసవత్తరంగా నడుస్తోంది. అభివృద్ధి మంత్రంతో అధికార పార్టీ.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు అధికార పార్టీ అన్నిదారులు వెతుకుతోంది. ఉచిత కరెంట్, మహాలక్ష్మీ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గెలిపించాలని కోరుతోంది. బీజేపీ కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. -
ఒకే ఇంటి నుంచి ఇద్దరు పోటీ
రాయికల్: రాయికల్ బల్దియాలో ఒకే ఇంటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు పోటీ చేస్తున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లుతోపాటు ఆయన తమ్ముడి కుమారుడు మోర రాంమూర్తి బరిలో నిలి చారు. మోర హన్మండ్లు ఏడోవార్డులో బరిలో ఉండగా.. మోర రాంమూర్తి 12వ వార్డులో పోటీలో ఉన్నా రు. హన్మండ్లు రిటైర్డ్ లెక్చరర్ కావడంతోపాటు మొ దటి మున్సిపల్ చైర్మన్గా ప్రజలకు సేవలందించారు. హన్మండ్లు తమ్ముడు, స్వర్గీయ ఆంజనేయులు గతంలో ఎంపీపీగా పనిచేశారు. ఆయన కుమారుడు రాంమూర్తి మొదటిసారి 12వవార్డు నుంచి పోటీలో ఉన్నారు. -
జగిత్యాల అభివృద్ధి కోసమే ఆరాటం
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: జగిత్యాల అభివృద్ధి కోసమే తన ఆరాటమని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బుధవారం మోతె పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చొరవతో రూ.62.5 కోట్ల యూఐడీఎఫ్ నిధులు మంజూరయ్యాయని, మున్సిపాలిటీకి రూ.245 కోట్లు వచ్చాయని తెలిపారు. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే పేదలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలన్నారు. యావర్రోడ్డు విస్తరణకు కట్టుబడి ఉన్నానని, సీఎం కూడా హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. మెజార్టీ స్థానాలు గెలుచుకునేలా పనిచేయాలన్నారు. నాయకులు గట్టు సతీశ్, గిరి నాగభూషణం, చంద్రశేఖర్గౌడ్, దామోదర్రావు, చెట్పల్లి సుధాకర్, క్యాదాసు నాగ య్య, తోట మల్లికార్జున్, గంగాధర్ పాల్గొన్నారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి రాయికల్: బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే సూచించారు. పట్టణంలో కాంగ్రెస్ బీఫామ్ పొందిన అభ్యర్థులతో సమావేశమయ్యా రు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రతిఒక్కరూ గెలుపొందేలా చూడాలని పిలుపునిచ్చారు. -
● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల/మెట్పల్లి: బీఆర్ఎస్ హయాంలోనే కోరుట్ల, మెట్పల్లి పట్టణాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం కోరుట్లతోపాటు మెట్పల్లిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. మెట్పల్లి మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తెచ్చామని, ప్రతి వార్డులో వసతులు కల్పించామని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మోజార్టీతో గెలిపించాలన్నారు. -
● సర్వేల పేరిట కాసుల వసూలు ● అభ్యర్థుల్లో ఆందోళన
కోరుట్ల: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ప్రధాన పార్టీలు సర్వేటీంలను నియమించిన విషయం తెల్సిందే. క్షేత్ర స్థాయిలో అభ్యర్థుల తీరుతెన్నులను పరిశీలించేందుకు పంపించారు. హైదరాబాద్లోని ఏజన్సీల నుంచి సర్వే కోసం వచ్చామని చెప్పి కొంతమంది జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో పర్యటించారు. అభ్యర్థులు అసలే తమకు పార్టీ టికెట్ వస్తుందో..రాదోనని టెన్షన్లో ఉండగా సర్వే టీం మెంబర్లు అభ్యర్థులను కలిసి సర్వే అనుకూలంగా ఇస్తామని, తమను ‘ఎంతోకొంత’ చూసుకోవాలని చెప్పి కాసులు వసూలు చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా పార్టీల టికెట్ కోసం పోటీలో ఉన్న అందరి నుంచి రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇక్కడితో ఆగకుండా ‘మళ్లీ రెండో సర్వే ఉంది.. మీ పరిస్థితి ఏంటో చెబుతాం.. మీరు ఎలా ప్రచారం చేయాలి.. మీ వార్డులో ఎవరు మీకు అనుకూలంగా ఉన్నారు..? ఎవరు ప్రతికూలంగా ఉన్నారనే విషయాలు తేల్చుతాం..’ అంటూ అభ్యర్థుల సెల్పోన్లకు మెసేజ్లు పెట్టి మరోసారి కాసుల వసూలు దిగడానికి సిద్ధమైనట్లు సమాచారం. అభ్యర్థుల టెన్షన్ను ఆసరాగా చేసుకున్న ఇలాంటి వారు ఎవరికివారు ఇలా సొమ్ము చేసుకుంటున్న తీరు కలవరపెడుతోంది. -
బర్త్డే పార్టీలో యువకులపై దాడి
కరీంనగర్రూరల్: నడిరోడ్డుపై బర్త్ డే పార్టీ చేసుకోవడమే కాకుండా కారుపైకి ఎక్కి తల్వార్తో కేక్ కట్ చేసి హంగామా చేసి, ఇరువురిపై దాడి చేసి డబ్బులు,సెల్ఫోన్ తీసుకున్న తొమ్మిది మందిని మంగళవారం కరీంనగర్రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు.. తీగలగుట్టపల్లిలోని హన్మాన్నగర్లో గత నెల 31న అర్ధరాత్రి 12గంటలకు నడిరోడ్డుపై ఓ మైనర్ బర్త్ డే పార్టీని యువకులు నిర్వహించారు. కారుపైకి ఎక్కి తల్వార్తో కేక్ ట్ చేయడంతోపాటు టపాసులు కాల్చుతూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేశారు.ఈ సమయంలో టెంట్హౌజ్ సామగ్రిని వాహనం నుంచి దించుతున్న యుగంధర్, చరణ్పై కొందరు యువకులు కర్రలు, బండలతో దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ.2వేలతోపాటు సెల్ఫోన్ తీసుకుని పగులకొట్టారు. స్థానికులు వచ్చి యువకులను అక్కడి నుంచి వెళ్లగొట్టి బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. మరుసటిరోజు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజయ్, విఘ్నేష్, రంజిత్లు మేజర్లు కాగా మిగితా ఆరుగురు మైనర్లున్నారని సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. ముగ్గురిని కరీంనగర్జైలుకు, ఆరుగురు మైనర్లను వరంగల్ జువైనల్హోమ్కు తరలించినట్లు వివరించారు. తొమ్మిది మంది అరెస్టు


