Jagitial District News
-
‘నీట్’ ప్రశాంతం
కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ(నాచుపల్లి)లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని మూడు నిమిషాలు ఆలస్యంతో పరీక్ష కేంద్రానికి హాజరుకావడంతో సిబ్బంది అనుమతించలేదు. వెంట వచ్చిన తల్లి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి తన బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుందని, లోపలికి పంపించాలని వేడుకుంది. తమ చేతుల్లో ఏమీలేదని, నిబంధన ప్రకారం నడుచుకుంటున్నామని సిబ్బంది తెలిపారు. కళాశాలలో రెండు కేంద్రాలు, ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాలలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. జేఎన్టీయూతోపాటు ఎస్కేఎన్ఆర్ కళాశాలలో 870 మందికి గాను 690 మంది పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. జేఎన్టీయూలో ఇన్చార్జిగా తిరుపతమ్మ, జగదీష్ వ్యవహరించారు. -
కాంట్రాక్టర్.. టెండర్
పట్టణంలోని 22, 23, 24వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి యూఐడీఫ్ నిధుల నుంచి రూ.2కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు ఆ పనులకు పలుమార్లు టెండర్లు నిర్వహించారు. అయినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆయా వార్డుల్లో మౌలిక వసతులు చేపట్టడం అధికారులకు ఇబ్బందిగా మారింది. కేవలం ఇవే కాకుండా ఈ నిధులతో చేపట్టే మరికొన్ని పనులపైనా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. మరోసారి టెండర్ నిర్వహిస్తాం మెట్పల్లి: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. గతంలో పనులు దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీ పడే పరిస్థితులు ఉండేవి. కానీ.. కొంతకాలంగా పనులంటేనే వెనుకంజ వేస్తున్నారు. చేసిన పనులకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరగకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెట్పల్లి మున్సిపాలిటీకి కొన్ని నెలల క్రితం పట్టణ మౌళిక సదుపాయాల అభివృద్ధి (యూఐడీఎఫ్) కింద నిధులు మంజూరయ్యాయి. ఇందులో కొన్ని పనులకు అధికారులు ఇప్పటికీ ఐదుసార్లు టెండర్లు నిర్వహించినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడమే దీనికి నిదర్శనం. 11 పనులు..రూ.18.70కోట్లు బిల్లులపై అనుమానంతోనే.. యూడీఐఎఫ్ నిధులతో చేపట్టే పనుల్లో కొన్నింటికి కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేదు. అలాంటి వాటికి మరోసారి టెండర్ నిర్వహిస్తాం. టెండర్ పూర్తయిన వాటిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించారు. మిగతా వాటిని కూడా తొందరలోనే మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వర్రావు, డీఈఈ, మెట్పల్లి -
నై..నై నైరుతి
జగిత్యాలఅగ్రికల్చర్: నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైనా.. వాతావరణంలో మార్పులతో వర్షాలు కురవడం లేదు. మృగశిర కార్తె ముగిసినప్పటికీ ఒక్కసారి కూడా చినుకు పడలేదు. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల గరిష్ట స్థాయిలో కదలాడుతున్నాయి. దీంతో రైతులు వర్షాలకోసం కప్ప తల్లి ఆటలు, ఆలయాల్లో జలాభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు పంటల సాగుకు అదునుదాటుతోందంటూ అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. 68 శాతం లోటు వర్షపాతం ఈ ఏడాది మొత్తంగా చూస్తే ఇప్పటివరకు జిల్లాలో 68శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 20 మండలాల్లో కేవలం వెల్గటూర్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ (మృగశిర కార్తె ముగింపు) వరకు జిల్లా సాధారణ వర్షపాతం 120 మిల్లీమీటర్లు. కానీ.. ఇప్పటివరకు 20శాతం కూడా కురవలేదు. కోరుట్ల, మెట్పల్లి, కథలాపూర్ మండలాల్లో లోటు వర్షపాతం ఏర్పడింది. మిగిలిన 16 మండలాల్లో అధిక లోటు వర్షపాతం నమోదైంది. భీమారంలో 98 శాతం, ధర్మపురిలో 92, కొడిమ్యాలలో 83, జగిత్యాల రూరల్లో 83, రాయికల్లో 81, గొల్లపల్లిలో 79, సారంగాపూర్లో 76, బీర్పూర్లో 74, బుగ్గారంలో 73, పెగడపల్లిలో 72, మేడిపల్లిలో 71, మల్యాలలో 70, మల్లాపూర్లో 69, ఇబ్రహీంపట్నంలో 69, ఎండపల్లిలో 63, జగిత్యాలలో 60, కోరుట్లలో 59, మెట్పల్లిలో 51, కథలాపూర్లో 50 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ పంటల సాగు వాస్తవానికి 60 నుంచి 70 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే పంటలు సాగు చేయాల్సి ఉంటుంది. విత్తనాలను వేసి ఇబ్బంది పడొద్దని ఓ వైపు వ్యవసాయాధికారులు ప్రకటిస్తున్నప్పటికీ అదును దాటుతోందంటూ రైతులు అక్కడక్కడ పంటలు సాగు చేస్తున్నారు. నిజానికి పసుపు వంటి పంటలు జూన్లోనే సాగు చేయాల్సి ఉంటుంది. మెట్పల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కోరుట్ల మండలాల్లో వానతో సంబంధం లేకుండా పసుపు విత్తనం వేస్తున్నారు. వర్షాలు ఎలాగైనా కురుస్తాయనే ఆశతో విత్తనాలు వేసిన రైతులు.. విత్తనాలు మాడిపోకుండా బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని డ్రిప్ ద్వారా తడులు అందిస్తున్నారు. ఎంత నీరు ఇచ్చినప్పటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వేడి వాతావరణంతో విత్తనాలు కొన్ని ప్రాంతాల్లో భూమిలోనే మాడిపోతున్నాయి. కొద్దిపాటి జల్లులకే జనుము, జీలుగ విత్తనాలు చల్లిన రైతులు మొలకలను కాపాడుకునేందుకు నీటి తడులు అందిస్తున్నారు. వరిలో దీర్ఘకాలిక రకాలు సాగు చేసే రైతులు వ్యవసాయ బావుల్లో ఉన్న కొద్ది నీటితో నార్లు పోసుకుంటున్నారు. మృగశిర ముగిసినా జాడలేని వర్షాలు జిల్లాలో 68శాతం లోటు వర్షపాతం అదునుదాటుతోందని రైతుల్లో ఆందోళన వర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపులు -
నీటి తడులు అందిస్తున్న
అదును దాటిపోతుందని పసుపు సాగు చేశాను. కొద్దిరోజులుగా డ్రిప్ ద్వారా తడులు ఇచ్చాను. ఆ నీరు సరిపోవడం లేదని నాలుగైదు రోజులుగా పైపుల ద్వారా పారిస్తున్నాను. వ్యవసాయ బావిలో ఉన్న నీరు ఇప్పుడు సరిపోవడం లేదు. వర్షాల కోసం ఎదురుచూడని రోజంటూ లేదు. – కొలగాని రాంకిషన్, వెల్దుర్తి, జగిత్యాల రూరల్(మం)విత్తనాలు తెచ్చిపెట్టుకున్న మల్లాపూర్: నాకున్న పొలంలో సోయా, మొక్కజొన్న, పసుపు, మిర్చి పంటలు సాగు చేద్దామని భూమినంతా కలియదున్నిచ్చి సిద్ధం చేశాను. విత్తనాలూ కొనుగోలు చేశాను. వర్షాలు పడితే విత్తుకుందామని చూస్తున్న. వాన జాడే లేకుండా పోయింది. – ఏలేటి మహేష్రెడ్డి, రైతు, కొత్తదాంరాజుపల్లి ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఈ ఏడాది రుతుపవనాలు మందగించాయి. ఎల్నినో ప్రభావంతో ఇప్పటివరకు లోటు వర్షపాతమే ఉంది. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి వంటి పంటలను ఇప్పుడే సాగు చేయవద్దు. కంది, పెసర, చిరు ధాన్యాలు వంటి పంటలు సాగు చేసుకుంటే బాగుంటుంది. – వడ్డెపల్లి భాస్కర్, డీఏవో -
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట
కథలాపూర్: అన్నదాతలు విత్తనాల కొనుగోలు నుంచి పంట అమ్ముకునే వరకు ఏదో ఒక రూపంలో నష్టపోతున్నారు. ఈ క్రమంలో నకిలీ విత్తనాలు విక్రయించినా.. తయారుచేసినా పీడీ యాక్డ్ అమలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతోపాటు ప్రత్యేకంగా పోలీసులు, వ్యవసాయ అధికారులతో విజిలెన్స్ టీంలను ఏర్పాటు చేసింది. షాపుల్లో తనిఖీలనూ ముమ్మరం చేసింది. తనిఖీలు ముమ్మరం జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలున్నాయి. వానాకాలం సీజన్లో రైతులు సుమారు 30వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. విత్తనాలు, ఎరువులు విక్రయించేందుకు 32 షాపులకు అనుమతి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఓ గ్రామంలో విత్తనాలు విక్రయిస్తుండగా.. అధికారులు తనిఖీ చేసి వాటి శాంపిళ్లను ఉన్నతాధికారులకు పంపించారు. మరో గ్రా మంలో విత్తనాల దుకాణం లైసెన్స్ను రెన్యూవల్ చేసుకోలేదని గుర్తించి నోటీసులు ఇచ్చారు. విత్తనాల దుకాణాల్లో సోదాలు చేస్తూ.. ఏయే విత్తనాలు విక్రయిస్తున్నారో పరిశీలిస్తున్నారు. వాటిని ఎక్కడ కొనుగోలు చేశారు..? ఆ విత్తనాల మొలకశాతం ఎంత..? అనే విషయాలను తెలుసుకుంటున్నారు. విత్తనాలను ఎవరికి విక్రయిస్తున్నారో రైతు పేరు, సెల్ఫోన్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని దుకాణాల యజమానులకు సూచిస్తున్నారు. మంచి విత్తనాలు కొనుగోలుపై రైతులకు అవగాహన వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కొనుగోలు చేసే విత్తనాలు ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని కొనుగోలు చేయాలని చెబుతున్నారు. లూజు, కంపెనీ లేబుల్ లేని విత్తనాలను కొనుగోలు చేయవద్దని, విత్తనాలు కొనే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచిస్తున్నారు. రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టి మోసం చేస్తే చట్టపరంగా చర్యలను తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముమ్మర తనిఖీ చేస్తున్న అధికారులు విత్తనాల కొనుగోలుపై రైతులకు అవగాహన -
తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి జయశంకర్ సార్
జగిత్యాలటౌన్: స్వరాష్ట్ర సాధనకు తొలిదశ నుంచి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ వరకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ మార్గదర్శిగా నిలిచారని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని జయశంకర్ కూడలిలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమం.. స్వరాష్ట్రంలో జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పదేళ్ల పాలన సాగిందన్నారు. ప్రజలను ఆశల పల్లకీలో ఊరేగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని న్యాయవాది కూర్మాచలం ఉమామహేష్ అన్నారు. డిగ్రీ కళాశాల సమీపంలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏనుగుల రాజేందర్, వీరబత్తిని అనిల్, నల్ల శ్యాం, మూలాసపు రాజన్న పాల్గొన్నారు. యోగాతో మానసిక ఒత్తిడి దూరం జగిత్యాలజోన్: యోగాతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి ఆదివారం యోగా చేశారు. ధ్యానంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని, నిద్రలేమి సమస్య ఉండదని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సబ్ జడ్జి నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. యోగాతో శారీరక, మానసిక ధృడత్వం పెరుగుతుందన్నారు. యోగా శిక్షకుడు చింతకింది కిశోర్ను జడ్జిలు సన్మానించారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సునీత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, రెండవ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జిని కలిసిన జిల్లా జడ్జిలు జగిత్యాలజోన్: హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్ ఆదివారం జగిత్యాలకు వచ్చారు. జిల్లా న్యాయమూర్తులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి, సబ్ జడ్జి నాగేశ్వర్రావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా ఉన్నారు. అభివృద్ధితోనే సమాధానంరాయికల్: తాను అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నానని, ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోబోనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణానికి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో తనతోపాటు పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్రావు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కౌన్సిలర్లు పల్లికొండ గంగాధర్, నాయకులు మోర హన్మాండ్లు, గండ్ర రమాదేవి, మహేందర్ గౌడ్, బాబా, మచ్చ శేఖర్ పాల్గొన్నారు. -
ఒంటికి యోగా మంచిదేగా..
యోగాసనాలు వేస్తున్న ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్యోగా సాధన చేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందిఎస్పీ కార్యాలయంలో యోగా చేస్తున్న ఎస్పీ అశోక్కుమార్జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్: యోగా దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్కుమార్, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పునుషోత్తంరెడ్డి, సీఐలు ఎస్సైలు పాల్గొన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్కుమార్, జగిత్యాల బల్దియా చైర్పర్సన్ సమిండ్ల వాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది ఆసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. డీఎంహెచ్వో సుజాత, ఆయుష్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి
జగిత్యాలక్రైం: నేరాల నియంత్రణ, ప్రజాభద్రతపై దృష్టి సారించాలని, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం తప్పనిసరిగా అమలు చేయాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. జగిత్యాల టౌన్, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లను శనివారం తనిఖీ చేశారు. కేసుల వివరాలు, పెండింగ్ కేసుల పురోగతి, విచారణ విధానం, నేరాల నియంత్రణ చర్యలు, స్టేషన్ నిర్వహణ పరిశీలించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత పెంచాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రికార్డులు, ట్రాఫిక్ చలానాలు, రోడ్డు భద్రత అమలు పరిశీలించారు. వాహన రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలో సాంకేతికతను వినియోగించాలని పేర్కొన్నారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, పట్టణ సీఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్, ఎస్సైలు సదాకర్, కుమారస్వామి, సుప్రియ ఉన్నారు. -
నాన్న స్ఫూర్తితో కంపెనీ
రామగుండం: తండ్రి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఎవల్ఫినిటీ టెక్నాలజీస్ పేరుతో కంపెనీ స్థాపించాడు గద్దె శ్రీచరణ్. రామగుండానికి చెందిన గద్దె శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అవార్డులు కై వసం చేసుకున్నారు. శ్రీచరణ్ అదే బాటలో నడుస్తూ మరిన్ని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు. 2016లో ఎల్పీయూ యూనివర్సిటీలో సీఎస్ఈ ఇంజినీరింగ్ పూర్తి చేసే క్రమంలో సొంతంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్లు రూపొందించాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి జల్ జీవన్ మిషన్కు సంబంధించి కమ్యూనికేషన్ అవసరాల నిమిత్తం సోషల్ ఆడిట్ మోబైల్ అప్లికేషన్ రూపొందించాడు. ఈ కంపెనీ ప్రస్తుతం 500 క్లయింట్లకు సేవలందించడంతో పాటు 1,050 ప్రాజెక్టులను డెలివరీ చేసి, ఒక మిలియన్ డాలర్ రెవెన్యూ మైలు రా యికి చేరుకుంది. నాన్న ప్రోత్సాహమే ఇందుకు కారణం అంటున్నాడు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాలరూరల్: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెరకాలనీకి చెందిన బోదాసు లావణ్య, నర్సయ్య గృహప్రవేశం చేయగా.. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలంతా సొంతింటి నిర్మాణంతో ఆనందంగా ఉన్నారన్నారు. నాయకులు నోముల శేఖర్రెడ్డి, నక్కల రవీందర్రెడ్డి, ఆదిరెడ్డి పాల్గొన్నారు. ఎరువుల కొరతకు కేంద్రమే కారణం రాయికల్: యూరియా కొరతకు కేంద్రమే కారణమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మండలంలోని తాట్లవాయిలో రూ.33 లక్షలతో, భూపతిపూర్లో రూ.15 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. పట్టణంలో 40 మందికి రూ.12.60 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్, 17 మందికి కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. యూరియాను యాప్ ద్వారా ఇవ్వాలని కేంద్రమే ఆదేశాలు ఇచ్చిందని, ఈ విషయంలో ఎంపీకి కనీస అవగాహన లేదని పేర్కొన్నారు. మండలానికి రూ.2.30 కోట్లతో ఈజీఎస్ రోడ్లు మంజూరైనట్లు తెలిపారు. ఉప్పుమడుగు, లింగాపూర్, దావన్పల్లి, కండ్లపల్లి–కిష్టంపేట, మూటపల్లి–కొత్తపేట డబుల్రోడ్, కొత్తపేట, ఒడ్డెలింగాపూర్, ఒడ్డెరకాలనీకి రోడ్డు, మూటపల్లి–కొత్తపేట డబుల్రోడ్, లింగాపూర్, తాట్లవాయి డబుల్రోడ్డు పనులు ప్రారంభమయ్యాయన్నారు. సర్పంచులు ఆకుల మల్లేశం, గుర్రం భావన, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, మాజీ ఎంపీపీ సంధ్యారాణి, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, రాగి సాగరిక, ఉపసర్పంచులు, నాయకులు మోర హన్మండ్లు, కోల శ్రీనివాస్, తంగెళ్ల రమేశ్, ముఖీద్, పృథ్వీరాజ్ పాల్గొన్నారు. -
నా విజయం.. నాన్నకు అంకితం
జ్యోతినగర్(రామగుండం): నేను ఈ స్థాయికి రావడానికి నాన్న ఉమామహేశ్వర్ చూపిన క్రమశిక్షణే కారణం. ఆయన ప్రోత్సాహంతో ఇటీవల యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో ఆల్ ఇండియా 78వ ర్యాంకు సాధించా. నాన్న పర్యావరణవేత్త, రైతు. అమ్మ న్యాయవాది. అన్నయ్య ఆదిత్య హైదరాబాద్లో ఓ సంస్థలో పని చేస్తున్నారు. వదిన పూజా చెబ్రోలు అమెరికాలోని వెయిల్ కార్నెల్ మెడిసిన్లో, వైద్య ప్రపంచ ఆరోగ్య విభాగంలో సహాయ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కుటుంబం అండతో ఈ స్థాయికి ఎదిగాను. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి, సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వాన్ని నాన్న నేర్పించారు. యూపీఎస్సీ వంటి క్లిష్టమైన పరీక్షలో విజయం సాధించడానికి కుటుంబ ప్రోత్సాహం ఎంతో కీలకం. నా విజయం నాన్నకు అంకితం. యువత పట్టుదలతో ముందుకు సాగితే గుర్తింపు సాధించవచ్చు. – శశాంక్ దహెగాం, ఎన్టీపీసీ, రామగుండం -
నాన్నే మొదటి గురువు
జగిత్యాలజోన్: మా నాన్నే.. నా మొదటి గురువు. నేను జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నానంటే అంతా మా నాన్న భిక్షే. మాది రాజమండ్రి. నాన్న చిత్తూరి లక్ష్మణ్రావు(లచ్చారావు) న్యాయవాది. నా రోల్ మోడల్, నా ఇన్స్పిరేషన్ అంతా నాన్నే. అమ్మాయిలంటే ఇంటి పని, వంట పని కాదని, ఉన్నత స్థాయికి ఎదిగి, నీవే పది మందికి ఆదర్శంగా మారాలని ఎప్పుడు చెపుతుండేవారు. నాది సైన్స్ గ్రూపు అయినా నాన్నను ఆదర్శంగా తీసుకుని ఎల్ఎల్బీ పూర్తి చేశా. నాన్న నాపై చూపెడుతున్న ప్రేమ, అనురాగాలతో యూనివర్శిటీ స్థాయిలో నాలుగు గోల్డ్మెడల్ సాధించేవరకు తీసుకవచ్చాయి. తర్వాత నాన్న వద్దే అడ్వకేట్గా శిష్యరికం తీసుకున్నా. నాన్న జ్యూడిషియల్ వ్యవస్థలో ఉన్న మంచి చెడులు చెపుతుండడం, పది మందికి న్యాయం చేస్తే మనకు కలిగే మనశ్శాంతి, అనుభూతుల గురించి వివరించేవారు. దీంతో, అడ్వకేట్గా కేసులు వాదించే స్థాయి నుంచి జడ్జిగా కేసుల్లో తీర్పులు ఇచ్చే స్థాయికి ఎదిగానంటే అంతా మా నాన్న చలవే. అందుకే జీవితాంతం నాన్నకు రుణపడి ఉంటాను. చిన్నప్పుడు నాన్నతో ఉన్న జ్ఞాపకాలు రోజూ గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కొన్ని బరువైన జ్ఞాపకాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. నాన్నను తలచుకోని రోజు ఉండదు. నాన్నతో పాటు అమ్మ ప్రేమలత, పెంచిన అమ్మ అన్నపూర్ణమ్మ, తమ్ముడు శ్రీనివాస్లు కూడా నా పురోభివృద్ధికి కారణం. – సి.రత్నపద్మావతి, జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
G°² MýSÚët-ÌŸ-_a¯é ˘ భరించారు
వేములవాడ: మా నాన్న గుండ్లూరి ఆంజనేయులు. ఎన్ని కష్టాలొచ్చినా భరించేవారు. హైదరాబాద్ శివారులో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాళ్లం. కేవలం నా చదువుల కోసం హైదరాబాద్కు షిఫ్ట్ అయి సివిల్ కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్గా పని చేశారు. నేను నిద్ర లేవకముందే ఇంటి నుంచి వెళ్లి, నేను పడుకున్నాక ఇంటికి వచ్చిన రోజులు కోకొల్లలు. అప్పట్లో మాకు చెల్లించే స్కూల్ ఫీజులతో ప్లాట్లు వచ్చేవని నాన్న ఫ్రెండ్స్ అనేవారు. వారి మాటలను లెక్కచేయకుండా పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించారు. అలా చదవడం వల్లే నేను ఉద్యోగం సాధించి వేములవాడ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నా. నాన్నే నాకు స్ఫూర్తి. -
సర్వం నాన్నే!
నాన్న.. రెండక్షరాల ఈ పదం ప్రతీ వ్యక్తికి గుండె ధైర్యం.. ప్రపంచాన్ని జయించేంత మనో నిబ్బరం.. అమ్మ లోకానికి పరిచయం చేస్తే.. నాన్న ప్రపంచాన్ని చూపిస్తాడు. మనం భూమిపై పుట్టాక పరిచయమయ్యే తొలి స్నేహితుడు నాన్న.. జీవిత పాఠాలు బోధించే తొలి గురువు నాన్న.. బుడిబుడి అడుగులు వేసే సమయంలో ఎక్కడ పడిపోతామోనని భయపడుతూ.. వెన్నంటే ఆయన వేసే అడుగులు మనం లైఫ్లో స్థిరపడే వరకూ ముందుండి నడిపిస్తాయి. నాన్న ఎన్నో కష్టాలు పడుతూ.. పిల్లల సంతోషం కోసం అన్నీ త్యాగం చేస్తాడు. పిల్లలు జీవితంలో ఎక్కే ప్రతీ మెట్టులో నీడలా వెన్నంటే ఉంటాడు. కుటుంబ సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా ఒంటెద్దు బండిలా లాగుతూ.. పిల్లల ముఖంలో నిత్యం చిరునవ్వులు చూస్తూ సంతోషించే వ్యక్తి నాన్న.. నాన్న అంటే భయపడే రోజు నుంచి స్నేహితుడిగా అన్నీ పంచుకునే కాలంలో చాలా మంది ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనాలు..!!తల్లిదండ్రులతో శశాంక్గద్దె శ్రీచరణ్, ఎవల్ఫినిటీ టెక్నాలజీస్ కంపెనీ వ్యవస్థాపకుడు -
డ్రగ్స్ నివారణకు కృషి చేయాలి
జగిత్యాల: డ్రగ్స్ నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో చేపడుతున్న యాంటి డ్రగ్స్ 3కే రన్కు సంబంధించిన పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. యువత భవిష్యత్ను దెబ్బతీస్తున్న మత్తుపదార్థాల నిర్మూలనకు కలిసికట్టుగా ముందుకురావాలన్నారు. పట్టణ ప్రజలు, యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో యాంటి డ్రగ్స్ 3కే రన్లో పాల్గొనాలని కోరా రు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్, ఆకుతోట శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులకు విజిలెన్స్ నోటీసులుజగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్, ఏసీబీ అధికారులు ఇప్పటికే దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్యాక్స్ హెచ్చుతగ్గులు, కమర్షియల్ భవనాల పన్నుల నిర్ధారణలో జరిగిన అవకతవకలపై హాజరు కావాలని మున్సిపాలిటీలోని రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు శనివారం కరీంనగర్ కార్యాలయంలో హాజరయ్యారు. ఈ విషయంలో గతంలో ఓ అధికారి సస్పెండ్ కాగా.. మళ్లీ విజిలెన్స్ అధికారులు బల్దియాపై దృష్టి సారించారు. దీంతో అధికారుల్లో దడ మొదలైంది. ఆదర్శం ఈ ఉపాధ్యాయురాలుజగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఖాజీపురలోగల ప్రభుత్వ ఉర్దూమీడియం హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సబిహానాజ్ తన కుమార్తె షర్పియనాజ్ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. షర్పియానాజ్ ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు తన కూతురును చేర్పించినట్లు సబిహానాజ్ తెలిపారు. హెచ్ఎం మహ్మద్ హఫీజుద్దీన్, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జి మహ్మద్ సమియోద్దీన్, శ్రీనివాస్, రాజ్కుమార్, షాహిస్త ఇర్ఫాన సబిహానాజ్ను సన్మానించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.13.25 కోట్లుధర్మపురి: నియోజవర్గంలోని ఆరు మండలాల్లో చేపట్టే 245 సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు రూ.13.25 కోట్లకు పరిపాలన అనుమతుల లభించాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చొరవతో ఉపాధి కింద ఈ పనులు చేపట్టనున్నారు. ధర్మపురి మండలంలో 40 పనులకు రూ.273.80 లక్షలు, ఎండపల్లిలో 36 పనులకు రూ.212 లక్షలు, గొల్లపల్లిలో 56 పనులకు రూ.325.50 లక్షలు, పెగడపెల్లిలో 53 పనులకు రూ.241.50 లక్షలు, వెల్గటూర్లో 38పనులకు రూ.164.50, బుగ్గారంలో 22 పనులకు రూ. 108.50 లక్షలకు అనుమతి లభించింది. కోరుట్ల నుంచి పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సుకోరుట్లరూరల్: కోరుట్ల నుంచి పలు పుణ్యక్షేత్రాలకు కోరుట్ల ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. శక్తి పీఠాలైన కొల్లాపూర్, తుల్జాపూర్, పండరీపూర్ పుణ్యక్షేత్రాలకు ఏసీ బస్సు నడిపిస్తున్నామని, పెళ్లి, ఇతర శుభకార్యాలు ఉంటే ప్రజలు ఆర్టీసీని వినియోగించుకోవాలని కోరారు. -
కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దు
జగిత్యాలజోన్: చిన్నచిన్న సమస్యలకు పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. జిల్లాకోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. మాట్లాడుకుంటూ చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల సమస్యలు చిన్నవని, కోర్టుల వరకూ చేరితే ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. కోర్టులపై భారం పడకుండా లోక్అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఎస్పీ అశోక్కుమార్ మాట్లాడుతూ రాజీ ద్వారా ఇరువర్గాలకు ప్రశాంత వాతావరణం లభిస్తుందన్నారు. మొదటి అదనపు జడ్జి సునీత మాట్లాడుతూ.. రాజీకొస్తే ఇద్దరూ గెలిచినట్టేనన్నారు. సబ్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. జీవితాన్ని కోట్లాటలు, గొడవలతో గడపవద్దని హితవు పలికారు. ఓ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు బాధితురాలికి రూ.3లక్షల పరిహారాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అందించారు. కా ర్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, రెండవ అదనపు జడ్జి నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు. 80 ఏళ్ల సమస్యకు పరిష్కారం ఆస్తి తగాదాకు సంబంధించి 80 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించారు. జగిత్యాలకు చెందిన నీలి కాశీనాథం, నీలి సంతోష్కుమార్, మరో 30 మంది మూడుతరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఆ సమస్యను ఏడాది క్రితం కోర్టులో వేయడంతో జడ్జిలు రత్న పద్మావతి, సునీత ఇరువర్గాలతో చర్చలు జరిపి లోక్ అదాలత్లో పరిష్కరించారు. యాక్సిడెంట్ కేసులో రూ 1.24 కోట్ల పరిహారం రాయికల్ మండలం భూపతిపూర్కు చెందిన కోమటిరెడ్డి రవిష్కుమార్ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ.. కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. 2023లో యాక్సిడెంట్కు గురికావడంతో కాలును తొలగించారు. దీంతో ఆయన కేసు వేయడంతో ఇన్సూరెన్సు సంస్థ దిగొచ్చి రూ.1.24 కోట్ల పరిహారం అందించేందుకు అంగీకారం తెలిపి.. కేసును రాజీ చేసుకుంది. విడిపోయి...కలిసిపోయారు జగిత్యాలకు చెందిన రమేశ్తో కథలాపూర్కు చెంది న మంజులకు 2021లో పెళ్లయ్యింది. చిన్న మనస్పర్థల కారణంగా కోర్టులో విడాకులకు దాఖలు చేశా రు. ఇద్దరు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నవారు కావడంతో ఇరువర్గాల న్యాయవాదులు, జడ్జిలు ప్రత్యేక చొరవ తీసుకుని వారిని ఏకం చేశారు. లోక్ అదాలత్లో 5,444 కేసులు పరిష్కారం జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి కోర్టుల్లో శనివారం జరిగిన లోక్ అదాలత్లో 5,444 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 34 సివిల్, 5,142 క్రిమినల్, 268 ప్రిలిటిగెంట్ కేసులున్నాయి. జగిత్యాల కోర్టులో 2,469, మెట్పల్లిలో 1,645, కోరుట్లలో 700, ధర్మపురిలో 630 కేసులు పరిష్కారమయ్యాయి. -
‘నీట్’ కోసం ఉచితంగా బస్సు
విద్యానగర్(కరీంనగర్): ఆదివారం జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు శనివారం తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించి, తమ ఇళ్ల నుంచి పరీక్ష కేంద్రాలకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఏసీ బస్సులు మినహా మిగితా అన్ని బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. మొహర్రం సందడిజగిత్యాల:మొహర్రం సందర్భంగా జిల్లా కేంద్రంలో సందడి మొదలైంది. పోచమ్మవాడలో పెద్ద పులుల వేషధారణతో ఆటలు ఆడారు. బైక్లపై ఎక్కి సరాదాగా షికారు చేశారు. -
కాంగ్రెస్ పాలన చూసి ముఖం చాటేసిన మేఘాలు
జగిత్యాలటౌన్: రాష్ట్రంలో పాలన తిరోగమనంలో సాగుతోందని, సీఎం పాలన చూసి మేఘాలూ ముఖం చాటేశాయని, రైతు గోస పట్టని సీఎం అవసరమా..? అని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. వరంగల్ డిక్లరేషన్ అమలు చేయకుండా రైతులను వంచిస్తున్న రేవంత్కు రోజులు దగ్గరపడ్డాయన్నారు. వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకొచ్చాక సన్నాలకు మాత్రమేనని, ఇప్పుడు కేవలం ఏడు రకాలకేనని చెప్పడం రైతులను వంచించడమేనన్నారు. కేంద్రం అనుమతించిన మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామంటే ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా యూరియా యాప్ తెచ్చి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. గతంలో పంటల మార్పిడి అని కేసీఆర్ అంటే రేవంత్రెడ్డి నానా హంగామా చేసిన విషయం మర్చిపోయారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుబీమా అమలు చేస్తే రేవంత్రెడ్డి ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం సాగుపై ఆంక్షలు సరికావని, రేవంత్కు వ్యవసాయం ఇష్టంలేకుంటే క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రమణ మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోనే రూ పొందించిన జీవన్రెడ్డి వంటి సీనియర్ నాయకులను బయటకు పంపిన రేవంత్ నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. నాలుగు దశాబ్దాలు గా రైతులకు అండగా నిలిచిన జీవన్రెడ్డి ఆ పార్టీని వీడటం కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని దావ వసంత విమర్శించారు. నాయకులు గాజుల రాజేందర్, విజయలక్ష్మి, కల్లెపెల్లి దుర్గయ్య, మసర్తి రమేశ్, సురేందర్, మహిపా ల్, అబ్దుల్ భారీ, రాధాకిషన్, నేహాల్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పాలనలోనే రైతులకు న్యాయం
ధర్మపురి: బీఆర్ఎస్ పాలనలో రైతులకు అన్నివిధాలా న్యాయం జరిగిందని డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఖండించారు. గతంలో 33 పంటలకు బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఏడు పంటలకు మాత్రమే ఇస్తామని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదన్నారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ అయ్యోరి రాజేశ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, పట్టణ అధ్యక్షుడు రంజిత్, రాంచందర్గౌడ్, మహేశ్, సింహాచలం, జగన్, శ్రీధర్ పాల్గొన్నారు. -
తాగుడు వద్దన్నందుకు.. ఉరేసుకుని ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం: తాగుడు మానేయాలని భార్య మందలించినందుకు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంగిలి పెద్దొళ్ల చిన్న నర్సయ్య(43) మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు మధ్యం తాగి వచ్చి భార్య కవితతో గొడవ పడుతున్నాడు. ఇలాగైతే ఎలా అని కవిత మందలించగా.. మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. నర్సయ్యకు ఇద్దరు కూతుళ్లు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆమె తలలో బుల్లెట్టు?
కోరుట్ల/మెట్పల్లి: వారం క్రితం ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ.. ఈ గొడవలో కర్ర తగిలి ఓ మహిళకు తలపై తీవ్ర గాయాలతో రక్తస్రావమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును యధాలాపంగా తీసుకున్న మెట్పల్లి పోలీసులు ఎప్పటిలాగే హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపారు. ఆ తరువాత సదరు మహిళను ఆసుపత్రికి పంపించారు. 2 రోజులు గడిచినా మహిళ తల నుంచి రక్తస్రావం ఆగలేదు. వైద్యులకు అనుమానం వచ్చి స్కానింగ్ చేయించారు. చివరికి ఆమె తలలో ఇను ప ముక్క కనిపించడంతో నివ్వెరపోయారు. కర్రతో చేసిన గాయం అయితే ఇనుప ముక్క ఎక్కడిదన్న విషయం అంతుచిక్కని ప్రశ్నగా మారి కలకలం రేపుతోంది. వారం క్రితం గొడవ మెట్పల్లి పట్టణంలోని మఠంవాడలో గొనెల రాజం–లక్ష్మి దంపతులు, ఆ పక్కనే అతడి తమ్ముడు గొనెల శంకర్, అతడి సమీప బంధువు ముత్తన్న నివాసముంటున్నారు. అన్నదమ్ములకు కొన్ని రోజులుగా ఓ భూపంచాయితీ విషయంలో గొడవలు జరుగుతుండగా.. ఈనెల 15న అర్ధరాత్రి దాటిన తరువాత గొనెల రాజం–లక్ష్మి దంపతులు, గొనెల శంకర్కు మళ్లీ గొడవ జరిగింది. ఈ గొడవలో గొనెల శంకర్, ముత్తన్న కలిసి గొనెల రాజం–లక్ష్మి దంపతులపై దాడికి పాల్పడ్డారు. లక్ష్మి తలకు తీవ్ర గాయాలు కావడంతో.. తనను కర్రతో కొట్టి చంపే యత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెట్పల్లి పోలీసులు గొనెల శంకర్, ముత్తన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. లక్ష్మి తల నుంచి రక్తస్రావం ఆగకపోవడంతో.. ఈనెల 17న హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి స్కానింగ్ తీయగా.. ఆమె తలలో బుల్లెట్టు వంటి ఇనుప ముక్క ఉందని గుర్తించి దాన్ని వెలికితీశారు. బుల్లెట్టా.. ఇనుప ముక్కా? లక్ష్మి తలపై కర్రతో దాడి చేస్తే ఆమె కంటి కింది భాగంలో బుల్లెట్టు వంటి ఇనుప ముక్క ఎందుకు దిగబడి ఉందన్న విషయంలో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అర్ధరాత్రి తరువాత చీకటిలో జరిగిన గొడవలో లక్ష్మి తనపై దాడికి కర్రను ఉపయోగించారా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా గమనించి ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఇనుప ముక్క తపంచా నుంచి వెలువడిన బుల్లెట్టు ముక్క కావచ్చన్న అనుమానాలున్నాయి. ఇనుప ముక్క బుల్లెట్టు అయితే తపంచా ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంలో సందేహాలున్నాయి. గొనెల శంకర్ వద్ద పని చేసే జేసీబీ డ్రైవర్లు కొందరు బీహార్, ఒరిస్సా ప్రాంతానికి చెందినవారు కావడంతో.. అక్కడి నుంచి తపంచా కొనుగోలు చేసి తెచ్చుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఏదైనా ఇనుప ముక్క అయితే తలలో కంటి కిందుగా లోతుకు ఎలా వెళ్లిందన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై మెట్పల్లి సీఐ సురేశ్బాబు మాట్లాడుతూ.. తలలో నుంచి బయటపడిన ఇనుప ముక్కను ఫోరెన్సిక్ నిపుణుల వద్దకు పంపామని, ఆ తరువాత స్పష్టత వస్తుందని చెప్పారు. ఇనుప ముక్క కావచ్చంటున్న పోలీసులు వారం రోజులుగా అంతుచిక్కని వైనం యధాలాపంగా పోలీసుల దర్యాప్తు ఆస్తి గొడవలో తపంచాతో కాల్చారా? -
వడ్ల గోదాముకే కన్నం
ఆరుగురి అరెస్ట్.. పరారీలో ఒకరుసిరిసిల్ల: సులభంగా డబ్బు సంపాదించాలనే దురా శకు వెళ్లిన ఇంటిదొంగలు కటకటాలపాలయ్యారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఆరుగురిని జిల్లా పోలీసులు శనివారం అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. జిల్లాలో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడులు రావడంతో రెండు నెలలుగా కొనుగోళ్లు నిరాటంకంగా సాగుతున్నాయి. ఈక్రమంలోనే అక్రమార్కులు వడ్ల గోదాముకే కన్నం వేశారు. 13 లారీల వడ్లను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో గతంలోనూ జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఏం జరిగిందంటే.. సిరిసిల్లకు చెందిన ఓ లారీ యజమాని, అతని తమ్ముడు, మరో ఇద్దరు కూలీలతో కలిసి గత సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు పెద్దూరు అపెరల్ పార్క్లోని ఓ గోదాములోకి లారీతో వెళ్లారు. సుమారు 150 నుంచి 200 బస్తాలను లారీలో ఎక్కించుకొని నేరుగా కోనరావుపేట మండలం మల్కపేట ఐకేపీ సెంటర్కు తరలించారు. అక్కడ ఆ వడ్లను కొనుగోలు చేసినట్లు ట్రక్షీట్ తయారు చేసి మళ్లీ అపెరల్ పార్క్లోని గోదాముకే తరలించేందుకు సిద్ధమయ్యారు. తీగ లాగితే కదిలిన డొంక అపెరల్పార్క్ గోదాములోని వడ్లను దొంగిలించిన ఘటనలో గోదాము మేనేజర్ ఉత్కం విజయ్ ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలోనే 13 లారీల వడ్లను అమ్మిన అక్రమాలు వెలుగుచూశాయి. 86 బస్తాలను దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేసిన గోదాం మేనేజర్ విజయ్ అక్రమ ట్రక్షీట్లకు, 13 లారీల వడ్లను దారి మళ్లించడానికి కారణకుడని తేలింది. విజయ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు కలిసి రూ.91 లక్షల విలువైన 13 లారీల వడ్లను అమ్మేసినట్లు తేలింది. కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన ఐకేపీ సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, మరో సింగిల్విండో చైర్మన్ కలిసి నకిలీ ట్రక్షీట్తో లారీ వడ్లను రైస్మిల్లులో దింపకుండానే దింపినట్లు రికార్డులు సృష్టించి వడ్ల సొమ్మును పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. ధాన్యం నిల్వలపై అనుమానాలు జిల్లాలోని 36 రైస్మిల్లులకు ధాన్యం అందించారు. మరోవైపు అపెరల్ పార్క్లోని 22 గోదాముల్లో వడ్ల ను నిల్వచేశారు. జగిత్యాల జిల్లాకు 14 గోదాములు కేటాయించగా.. రెండు గోదాముల్లో వడ్లను, మరో 12 గోదాముల్లో మక్కలు నిల్వచేశారు. 2024–2025 యాసంగి సీజన్లోనూ అపెరల్ పార్క్లో నిల్వ చేసిన ధాన్యానికి, తిరిగి రైస్మిల్లులకు కేటాయించిన ధాన్యానికి మధ్య 10వేల టన్నులు తేడా వచ్చింది. తాజాగా 13 లారీల వడ్లు పక్కదారి పట్టిన ఘటన చర్చనీయాంశమైంది. గుమ్మికి ‘ఇంటి దొంగల’ ఎసరు 13 లారీల వడ్లు పక్క దారి నకిలీ ట్రస్షీట్లతో అక్రమాలు ఆరుగురి అరెస్ట్.. పరారీలో రుద్రంగి ఐకేపీ సెంటర్ ఇన్చార్జి అధికార పార్టీ నేతలను ఆశ్రయించిన అక్రమార్కులుఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపిన వివరాలు. జూన్ 15న అర్ధరాత్రి సిరిసిల్ల శివారులోని అపెరల్ పార్క్ గోదాములోని 86 బస్తాల ధాన్యాన్ని లారీలో అక్రమంగా తరలిస్తున్నారని స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్కు చెందిన గోదాము మేనేజర్ ఉత్కం విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా గోదామ్ మేనేజరే మరికొందరితో కలిసి నకిలీ ట్రక్షీట్లతో 13 లారీల వడ్లను పక్కదారి పట్టించి సిద్దిపేటలో విక్రయించినట్లు తేలింది. అందరూ ఇంటిదొంగలే.. గోదాం మేనేజర్, కరీంనగర్కు చెందిన ఉత్కం విజయ్, వేములవాడరూరల్ మండలం అచ్చన్నపల్లికి చెందిన వాసాల గణేశ్ కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్షీట్లు తయారు చేశారు. రుద్రంగి ఐకేపీ ఇన్చార్జి గడ్డం స్వామి రెండు ట్రక్షీట్లు జారీ చేయగా.. గోదాం మేనేజర్ విజయ్ ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీంతో రైతుల పేరిట వచ్చిన ఆ రెండు లారీల ధాన్యం డబ్బులను ముగ్గురు కలిసి పంచుకున్నారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఆఫీస్లో పనిచేసే కుమ్మరి రాజశేఖర్, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పీఏసీఎస్(సింగిల్ విండో) కొనుగోలు కేంద్రం ఇన్చార్జి గాజుల నవీన్తో కలిసి ఒక్క లారీకి నకిలీ ట్రక్షీట్ తయారు చేసి గోదాం మేనేజర్ విజయ్కి అందించారు. వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో రాజశేఖర్ ఆ నకిలీ ట్రక్షీట్కు ఆమోదం తెలిపారు. రైతుల పేరిట వచ్చిన డబ్బులను ముగ్గురు పంచుకున్నారు. పది లారీల వడ్లను దారి మళ్లించారు అపెరల్ పార్క్ గోదాముకు వచ్చిన 10 లారీల వడ్లను అక్కడ దించకుండానే దించినట్లుగా ఆన్లైన్లో నమోదు చేశారు. ఆ వడ్లను వేములవాడకు చెందిన రైస్మిల్లర్ చేపూరి మధుకర్ ద్వారా సిద్దిపేటకు చెందిన కమీషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్కు అమ్మేశారు. ఆయన ఆ లారీలను వివిధ రైస్మిల్లులకు మళ్లించాడు. పది లారీల వడ్లను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను నిందితులు పంచుకున్నారు. ఇలా మొత్తం 13 లారీల వడ్లను అమ్మేశారు. ఈ ఘటనలపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహ ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి.. ఉత్కం విజయ్, వాసాల గణేశ్, కమ్మరి రాజశేఖర్, గాజుల నవీన్, చేపూరి మధుకర్, చిటుకుల శ్రీకాంత్లను అరెస్ట్ చేశారు. రుద్రంగి ఐకేపీ ఇన్చార్జి గడ్డం స్వామి పరారీలో ఉన్నారు. రూ.14.16 లక్షలు స్వాధీనం.. రూ.46.21 లక్షలు ఫ్రీజ్ ఆరుగురి వద్ద రూ.14.16 లక్షలు, సెల్ఫోన్లు, బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లోని రూ.46.21 లక్షలను ఫ్రీజ్ చేశామని ఎస్పీ మహేశ్ బీ గీతే వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను చేధించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు నాగరాజు, గణేశ్, హెడ్కానిస్టేబుల్ పుల్కం శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రవి, నాగరాజులను ఎస్పీ అభినందించారు. -
ఇంటిపనిలో ‘యోగ’ం
కరీంనగర్స్పోర్ట్స్: ఒకప్పుడు మన ఇళ్లలోనే యోగం ఉండేది. వాకిట్లో ముగ్గు, వంటింట్లో వంట, ఇంటి శుభ్రత, బట్టల ఉతుకుడు ఇవి కేవలం పనులు కాదు, ఆరోగ్యాన్ని కాపాడే యోగా వ్యాయామాలు. కాలక్రమేణా వాటిని సాధారణ పనులుగా భావించి, ఆరోగ్యం కోసం బయట వెతకడం ప్రారంభించాం. కానీ మన అవ్వలు, అమ్మలు చేసిన ప్రతి ఇంటి పని శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, కుటుంబానికి ప్రేమను అందించే ఇంటి యోగం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేటి ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం కోసం యోగా కేంద్రాలు, జిమ్లు, ఫిట్నెస్ కార్యక్రమాలకు ప్రజలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వేకువజాము నుంచే మొదలు వేకువజామున నిద్రలేచి ముగ్గు వేయడం ద్వారా మోకాళ్లు, వెన్నెముకకు వ్యాయామం లభించేది. బట్టలు ఉతకడం, ఆరేయడం వంటి పనులు చేతులు, భుజాలు, నడుంకు బలాన్ని ఇచ్చేవి. ఇల్లు ఊడ్చడం, గిన్నెలు తోమడం వంటి పనులు రక్తప్రసరణను మెరుగుపరచడంతో ఉపయోగపడేవి. ఇక నేటి తరంలో యంత్రాలపై ఆధారపడటం పెరిగింది. ఇంటి పనులు తగ్గి ఆరోగ్య సమస్యలు మాత్రం పెరుగుతున్నాయి. గంటల తరబడి కూర్చుని పనిచేసే జీవనశైలిలో మెడనొప్పి, నడుమునొప్పి, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు సాధారణమయ్యాయి. ఇంటి పనులపై సమాజం చేసిన ప్రధాన తప్పు ఇంటి పనులను తక్కువగా చూడటమే. యోగాసనం పేరుతో చేస్తే గౌరవం, ఇంట్లో చేస్తే సాధారణ పని అనే భావన ఏర్పడింది. ఇంటి పనుల వెనుక ఉన్న ప్రేమ, సేవ, బాధ్యత, కుటుంబ సంక్షేమం వంటి విలువలను మనం మరిచిపోయాం. నిజానికి వంట చేయడం అంటే కేవలం ఆకలి తీర్చడం కాదు. కుటుంబానికి ఆరోగ్యం, ప్రేమ అందించడం. ఇల్లు శుభ్రం చేయడం అంటే కేవలం దుమ్ము తొలగించడం కాదు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడమని అర్థం. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం -
యోగాసనమే శ్వాసగా..
కరీంనగర్స్పోర్ట్స్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన యోగా క్రీడాకారిణి జాపతి ఆమని యోగాను జీవిత విధానంగా మార్చుకుని జాతీయస్థాయికి ఎదిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వసతులు, శిక్షణ దొరకడం కష్టమైనప్పటికీ, పట్టుదల, కఠిన సాధనతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగిన యోగా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కేరళలో జరిగిన జాతీయస్థాయి సీనియర్స్లో సత్తా చాటి 5వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు మూడుసార్లు జాతీయస్థాయితో పాటు నేపాల్లో జరిగిన పోటీల్లో పతకాలు సొంతం చేసుకుంది. -
నేత్రాలు దానం
కోల్సిటీ: వేర్వేరు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఇద్దరి నేత్రాలను దానం చేసి రెంటు కుటంంబాలు ఆదర్శంగా నిలిచాయి. గోదావరిఖని కాకతీయనగర్కు చెందిన డి.రఘు (46) శుక్రవారం చెట్టుపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గాయాలుకావడంతో వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన సింగరేణి ఉద్యోగి రాజు (29) శనివారం తెల్లవారుజామున గోదావరిఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం కరీంనగర్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. మృతుల కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ ఇద్దరి నేత్రాలను సేకరించి హైదరాబాద్కు తరలించారు. ఈ నేత్రాల ద్వారా నలుగురు దృష్టి లోపం ఉన్న వారికి చూపు అందనుంది. విషాద సమయంలోనూ నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, మారెల్లి రాజిరెడ్డి, లగిశెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, కేఎస్ వాసు, వెల్ది కవిత అనంతరాములు, తడబోయిన రాములు, దేవి లక్ష్మీ నరసయ్య తదితరులు అభినందించారు. బావిలో పడి బాలుడి మృతికొత్తపల్లి: కరీంనగర్ పరిధిలోని రేకుర్తిలోని బతుకమ్మ చెరువు బావిలో పడి బాలుడు మృతిచెందాడు. కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.. రేకుర్తిలోని స్వామికాలనీకి చెందిన షకీర్ఖాన్ అలియాస్ ఇర్ఫాన్ ఖాన్ (16) తన స్నేహితులు షేక్ అఫ్రోజ్, యాకుబ్ అలీ, షకీర్ఖాన్లతో కలిసి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాలనీ సమీపంలోని బతుకమ్మ చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. చెరువు సమీపంలోని ఓ బావి వద్ద ఆడుకుంటుండగా షకీర్ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. తనతో ఉన్న స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే వారు షకీర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బటయకు తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ట్రాక్టర్ పైనుంచి పడి యువకుడి మృతి
● కుమారుడి కళ్లు దానం చేసిన తండ్రి వెల్గటూర్: ట్రాక్టర్ పైనుంచి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎండపల్లికి చెందిన తొట్ల మధూకర్ (26) తన పొలానికి పశువుల ఎరువు తీసుకెళ్లేందుకు ట్రాక్టర్ కిరాయి మాట్లాడుకున్నాడు. డ్రైవర్ అతివేగంగా.. అజాగ్రతగా నడపడంతో మధూకర్ అదుపు తప్పి కింద పడ్డాడు. ఘటనలో తల, చాతిపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కొడుకు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. కన్నుమూసినా ఇద్దరికి చూపు మధూకర్ మృతిచెందినా మరో ఇద్దరికి చూపునిచ్చాడు. మధూకర్ అవయవాలను దానం చేయాలని తండ్రి లచ్చయ్య నిర్ణయించుకుని ఎస్సై ఉదయ్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సిబ్బంది మధూకర్ నేత్రాలను సేకరించారు. చికిత్స పొందుతూ యువకుడి మృతిమల్లాపూర్: మండలంలోని హుస్సేన్నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన షేక్ ఖాసీం (19) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖాసీం తన బైక్పై రోడ్డుపై వెళ్తుండగా ఖానాపూర్ నుంచి మెట్పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఖాసీం తలకు తీవ్రగాయడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఖాసీం తండ్రి షేక్ నన్నేసాబ్ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ గుగ్లావత్ గోపిచంద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. యువకుడి ఆత్మహత్యకరీంనగర్క్రైం: తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ తన కుమారుడు మహ్మద్ అహ్మద్(19)తో కలిసి ఉపాధి నిమిత్తం కరీంనగర్ వచ్చారు. నగరంలోని చికెన్ సెంటర్లో పనిచేస్తున్నారు. అక్కడే ఓ గదిలో ఉంటున్నారు. ఇటీవల అహ్మద్ చికెన్సెంటర్కు రాకుండా బయట తిరుగుతుండడంతో శనివారం ఇర్ఫాన్ మందలించాడు. మనస్తాపానికి గురైన అహ్మద్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ఇర్ఫాన్ గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఇర్ఫాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ఆధునికం.. ఆహ్లాదం
యైక్లయిన్కాలనీ: అది సింగరేణి ప్రభావిత గ్రామం.. 20వ డివిజన్లోని న్యూమారేడుపాక నరసింహపురం జెడ్పీహై స్కూల్. తరగతి గదులను ఆధునికీకరించారు. డిజిటల్ పద్ధతిన విద్యాబోధన చేస్తున్నారు. హాజరు శాతం పెంచేందుకు ప్రతీనెల అత్యధిక హాజరుశాతం నమోదు చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రోత్సాహక బహుమతులు అందిస్తు న్నారు. విద్యతోపాటు ఆటల్లో పోటీపడేలా విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించారు. వాటికి రవీంద్రనాథ్ ఠాకూర్, అబ్దుల్ కలాం, ఝన్సీరాణి, సీవీ రామన్, శకుంతలాదేవి వంటి పేర్లు పెట్టారు. స్కౌట్స్ అండ్ గైడ్స్లోనూ శిక్షణ ఇస్తున్నారు. గతంలో 80 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 105మందికి చేరారు. ఇందులో 30 మంది పదో తరగతి విద్యార్థులు ఉండడం విశేషం. గతేడాది టెన్త్లో వంద శాతం ఉత్తీర్ణత సాదించడంతోపాటు నలుగురు విద్యార్థులకు 500కుపైగా మార్కులు సాధించారు. బాడిబాట ద్వారా 30 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. వంటగది.. డైనింగ్ హాల్ నిర్మాణం తరగతి గదులు, మూత్రశాలలు, వంటగది, డైనింగ్హాల్ లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్కు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే.. సింగరేణి ఆర్జీ–2 అధికారులతో మాట్లాడి దాదాపు రూ.9 లక్షలు మంజూరు చేయించగా.. ప్రహరీ, బడి వరకు సీసీరోడ్డు, వంటగది, డైనింగ్ హాల్ నిర్మించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు తరగతి గదులను డిజిటల్ బోధనకు అనుకులంగా తీర్చిదిద్దారు. స్టేజీ నిర్మించారు. బాల బాలికలకు వేరువేరుగా ప్రత్యేకంగా మూత్రశాలలు అందుబాటులోకి తీసుకొచ్చారు. రోజూ ప్రత్యేక తరగతులు పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు. ఆహ్లాదం పంచుతున్న చెట్లు.. పాఠశాల ఆవరణలోని మొక్కలు, చెట్లకు గణిత ఉపాధ్యాయురాలు పద్మ కుమారి సహకారంతో విద్యార్థులు రంగులు వేశారు. అందంగా తీర్చిదిద్దారు. వాటిద్వారా కలిగే ప్రయోజనాలు గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు. పచ్చదనంతో ఆహ్లాదం పంచుతున్న చెట్లు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. డిజిటల్ విద్యాబోధన ఆకట్టుకునే తరగతి గదులు పచ్చని చెట్లు.. అందమైన బొమ్మలు హాజరు శాతం పెంచేందుకు ప్రతీనెల ప్రోత్సాహకాలు ఆదర్శంగా న్యూమారేడుపాక ప్రభుత్వ పాఠశాల -
ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే సత్యం
కొడిమ్యాల: మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూషణ్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ రాజనర్సింగరావు, సర్పంచ్ జీవన్ రెడ్డి, నాయకులు ముత్యం శంకర్, నారాయణగౌడ్, జలంధర్, రాజు తదితరులు పాల్గొన్నారు. అంజన్న సన్నిధిలో ఒడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని ఒడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గుంజ రేణుక, నారాయణ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందించారు. ఆర్టీసీ బస్సు ప్రారంభంకథలాపూర్: మెట్పల్లి నుంచి వేములవాడ వరకు వెళ్లే ఆర్టీసీ బస్సును కథలాపూర్ మండలం పెగ్గెర్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. పెగ్గెర్లలో రూ.10లక్షలతో నిర్మించే మహిళాసంఘం భవనానికి భూమిపూజ చేశారు. మున్నూరుకాపు సంఘం భవనానికి రూ.5 లక్షలు, భూషణరావుపేటలో మర్రవ్వ ఆలయ అభివృద్ధికి రూ.5లక్షల ప్రొసీడింగ్ కాపీలు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నామని, గతంలో బేస్మెంట్, గోడలవరకు నిర్మించుకున్న వారికి ఆర్థికసాయం అందిస్తామని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్సార్ ఎస్సారెస్పీ నుంచి వరదకాలువకు శ్రీకారం చుట్టి మెట్ట ప్రాంతాలకు నీరందించారని తెలిపారు. రైతులు సన్నరకం వరి సాగు చేయాలన్నారు. ఆర్టీసీ మెట్పల్లి డీఎం హరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, ఏఎంసీ డైరెక్టర్ కారపు గంగాధర్, సర్పంచ్ కుంటాల లక్ష్మి, ఉపసర్పంచ్ పాల్తెపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అగ్నివీర్కు విద్యార్థి ఎంపికజగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) జూనియర్ కళాశాల విద్యార్థి చరణ్రాజు ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూనే ఇండియన్ ఆర్మీ అగ్నివీర్కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల జరిగిన సెలక్షన్స్లో ఎంపికయ్యాడు. అతడిని కళాశాల ప్రిన్సిపల్ నాగభూషణం అభినందించారు. ఈనెల 21 నుంచి మహారాష్ట్రలో ఆరునెలల పాటు ట్రైనింగ్ తీసుకుంటాడని, ఆర్మీలోకి వెళ్లడం అభినందనీయమని తెలిపారు. అధ్యాపకులు శ్రీహరి, స్వప్న, కృష్ణమోహన్ పాల్గొన్నారు. నృసింహుని సన్నిధిలో సినీ నటుడు పూజలుధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని చిరంజీవి మేనల్లుడు, సినీ నటుడు సాయి ధరమ్ తేజ గురువారం దర్శించుకున్నారు. ఆలయం తరఫున ఈవో శ్రీనివాస్ ఆయనకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, దేవస్థానం సిబ్బంది ఉన్నారు. -
టెన్త్లో 100శాతం ఉత్తీర్ణత
నేను ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివిన. మా అమ్మా నాన్నలు ఈఏడాది న్యూమారేడుపాక సర్కార్ స్కూల్లో ఆరో తరగతిలో చేర్పించా రు. వాతావరణం బాగుంది. సంతోషంగా ఉంది. – మహాలక్ష్మి, ఆరోతరగతి స్కూల్ అంటే ఎంతో ఇష్టం బడి వాతావరణం బాగుంది. రోజు ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులు సాదిస్తా. – శ్రీనిధి, పదో తరగతి రామగుండం ఎమ్మెల్యే, సింగరేణి సహకారంతో డిజిటల్ క్లాసులు, వంటగది, డైనింగ్ హాల్ నిర్మించుకున్నాం. ఈసారి ఉపాధ్యాయుల సహకారంతో టెన్త్లో 100శాతం ఉత్తీర్ణత సాధించాం. – స్వర్ణ, ప్రధానోపాధ్యాయురాలు -
భూ వివాదంలో కార్పెంటర్ ఆత్మహత్య
కోల్సిటీ: భూమి కొనుగోలు విషయంలో భార్య, బావమరిదితో ఏర్పడిన డబ్బుల వివాదంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. విషాదంలో కూడా కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానం చేసి ఇద్దరికి వెలుగులు పంచేలా చేశారు. వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని మేదర్బసీకి చెందిన పొన్నగంటి మధూకర్ (39) కార్పెంటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భూమి కొనుగోలు కోసం డబ్బులు చెల్లించే విషయంలో భార్య లావణ్య, ఆమె తమ్ముడు గణేశ్తో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భూమి కొనుగోలు డబ్బుల విషయంలో భార్య, ఆమె తమ్ముడితో తలెత్తిన గొడవలతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మధూకర్ బుధవారం రాత్రి తనసెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాడు. గమనించిన తండ్రి పొన్నగంటి నందయ్య, తమ్ముడు మాధవాచారి కలిసి ఇంటికి వెళ్లి చూడగా, మధూకర్ చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి నేత్రాలను దానం చేసేలా ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాక్ టెక్నీషియన్ ప్రదీప్నాయక్ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఇంతటి విషాదంలోనూ ఆయన నేత్రాలను దానం చేయడానికి వారు ముందుకు వచ్చారు. కార్నియాలను సేకరించిన టెక్నీషియన్.. సకాలంలో హైదరాబాద్కు తరలించారు. విషాదంలోనూ నేత్రదానం చేసిన కుటుంబసభ్యులు -
ప్రభుత్వ బడిని బతికించుకున్నారు
పాలకుర్తి: ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కళకళలాడిన సర్కారు బడిలో వందలాది మంది సెకండరీ విద్య పూర్తిచేశారు. ప్రస్తుతం విద్యార్థులు లేక మూతపడే పరిస్థితికి చేరింది. దీంతో సర్కారు బడిని బకించుకునేందుకు పంచాయతీ పాలకవర్గం నడుం బిగించింది. మూడురోజులుగా ప్రైవేట్ పాఠశాల బస్సులను గ్రామంలోకి అడ్డుకుంటూ వస్తోంది. దీంతో గురువారం ఒక్కరోజే 26మంది ప్రవేశాలు తీసుకున్నారు. సర్కారు బడికి పునరుజ్జీవనం పోసేందుకు ఈసాలతక్కళ్లపల్లి పంచాయతీ పాలకవర్గం చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. కేవలం 45మంది విద్యార్థులు.. ఈసాలతక్కళ్లపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక, జెడ్పీ హైస్కూళ్లు ఒకేప్రాంగణంలో ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో 20మంది, ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు ఉన్నారు. బడి మూతపడే పరిస్థితికి చేరడంతో పంచాయతీ పాలకవర్గం స్పందించింది. సర్పంచ్ బండి శ్రీనివాస్ నేతృత్వంలో పాలకవర్గం గ్రామంలోకి వచ్చే ప్రైవేట్ పాఠశాలల బస్సులు అడ్డుకుంది. సర్కారు బడిలో కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించింది. దీంతో గురువారం ప్రాథమిక పాఠశాలలో 20మంది, హైస్కూల్లో ఆరుగురు విద్యార్థులు ప్రవేశం పొందారు. మూడురోజులపాటు ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డగింత స్పందించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు ఒక్కరోజులోనే 26 మంది విద్యార్థులకు ప్రవేశాలు ఈసాలతక్కళ్లపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకత -
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు..
ధర్మపురి: బడిని బతికించుకునేందుకు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన తమ పిల్లలను తిరిగి ప్రభుత్వ బడిలో చేర్పించారు మండలంలోని గాదెపెల్లి గ్రామానికి చెందిన ప్రజలు. సుమారు 30 మంది పిల్లలు వివిధ ప్రైవేట్ పాఠశాలలకు పంపించడంతో సర్పంచ్ అల్పట్ల సురేష్ ఆధ్వర్యంలో గురవారం తల్లిదండ్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించి.. తమతమ పిల్లలను తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. సర్పంచ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్కులు పంపిణీ మండలంలోని కమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్ల పంపిణీ చేశారు. హెచ్ఎం ఎదుల మహేశ్ ఆధ్వర్యంలో సర్పంచ్ కుమ్మరి తిరుపతి పుస్తకాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలలనే నాణ్యమైన బోధన అందుతుందన్నారు. పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. -
ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టిన కారు
సిరిసిల్లటౌన్: ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం పోయేలా చేసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లాకు చెందిన చింత అభిషేక్(29) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రెండు నెలల క్రితం కొడుకు పుట్టగా దైవదర్శనం కోసం ఇంటికి రావాలనుకున్నాడు. బుధవారం రాత్రి విధులు నిర్వర్తించి గురువారం ఉదయం హైదరాబాద్లో ప్రైవేటు యాప్ ట్యాక్సీ కారును బుక్చేసుకుని ఎక్కాడు. కారు డ్రైవర్ జగిత్యాల జిల్లాకు చెందిన ఆర్మూరి శ్రీకర్, వేములవాడ సోమేశ్లను అదే కారులో ఎక్కించుకొని నలుగురు స్వస్థలాలకు బయల్దేరారు. గురువారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో సిరిసిల్ల బైపాస్రోడ్డులో ఆగిఉన్న డీసీఎం వ్యాన్ను వెనుకనుంచి ఢీకొట్టాడు. అభిషేక్కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించే సరికి మృతిచెందాడు. మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సంఘటనకు కారణమైన కారు డ్రైవర్ పారిపోవడంతో పోలీసులు వెతికి పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్ రోడ్డుపై ఆపడం, కార్డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు -
సమష్టి కృషితోనే మత్తు నిర్మూలన సాధ్యం
జగిత్యాలక్రైం: సమష్టి కృషితోనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమని ఎస్పీ అశోక్కుమార్ అన్నా రు. ఎస్పీ కార్యాలయంలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఈనెల 26న నిర్వహించనున్న యాంటి డ్రగ్స్ 3కే రన్ పోస్టర్ను ఎస్పీ గురువారం ఆవిష్కరించారు. మత్తు నిర్మూలన దిశగా ఐఎంఏ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. యువత 3కే రన్లో పాల్గొనాలని కోరారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు గూడూరి హేమంత్, కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి సుధీర్కుమార్, వేణుగోపాల్రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు. ఖమ్మంలో ధర్మపురి మున్సిపల్ బృందం పర్యటనఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కార్పొరేషన్లో సమగ్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు అమలుచేస్తున్న కార్యక్రమాల పరిశీలనకు ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం గురువారం పర్యటించింది. 54వ డివిజన్లో ఎన్టీఆర్ పార్క్ను పరిశీలించి అందులో వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంపై అభినందించారు. ఎన్నెస్పీ రోడ్డులో ఉన్న నర్సరీని పరిశీలించారు. డంపింగ్ యార్డ్లో బయో మైనింగ్ నిర్వహణ, డీఆర్సీసీ కేంద్రాల్లో పొడి చెత్త రీసైక్లింగ్ వివరాలు తెలుసుకున్నారు. ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ మహేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్ ఉన్నారు. -
భీమన్న సేవలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్
వేములవాడ: భీమేశ్వర స్వామిని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గుంజ రేణుక నారాయణ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు అందించారు. కార్గో సేవలు అలైటింగ్ ప్లాట్ఫాం వైపు: ఆర్ఎంవిద్యానగర్(కరీంనగర్): కార్గో వినియోగదారుల క్షేమంతోపాటు వారి సౌకర్యార్థం కరీంనగర్లోని కార్గో, లాజిస్టిక్స్ విభాగాన్ని అలెటింగ్ ప్లాట్ఫామ్ వైపు మార్చినట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. బస్స్టేషన్ ప్రయాణికుల ప్రవేశం ద్వారం ద్వారా లోనికి వచ్చి కార్గో, లాజిస్టిక్ విభాగ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అనుమానాస్పదస్థితిలో రైస్మిల్ కార్మికుడి మృతికోనరావుపేట: మండలంలోని కొలనూర్ శివారులో గల రైస్మిల్లులో ప్రేంకుమార్(20) అనే కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్లోని సహార్సా జిల్లా సోంబరస తాలుకా లాల్పూర్కు చెందిన సాదా ప్రేమ్కుమార్ కొంతకాలంగా రైస్మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం గొంతులో నొప్పి ఉందని చెప్పి పడిపోయాడు. తోటి కార్మికులు ద్విచక్ర వాహనంపై సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కోనరావుపేట ఎస్సై ప్రశాంత్రెడ్డి తెలిపారు. విద్యుత్ షాక్తో వ్యక్తి..మానకొండూర్: మండలంలోని శ్రీనివాస్నగర్లో విద్యుత్షాక్తో కూలీ చనిపోయాడు. గ్రామంలోని కేజీబీవీ విద్యాలయంలో నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కరీంనగర్లోని అశోక్నగర్కు చెందిన పెద్దపల్లి శ్రీకాంత్(27) గురువారం భవనం వద్ద ఐరన్ రాడ్ను పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్షాక్ తగిలి చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మట్టి టిప్పర్లు పట్టివేతవేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం వద్ద మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లు, ఒక జేసీబీని గురువారం పట్టుకున్నట్లు వేములవాడ తహసీల్దార్ జయంత్ కుమార్ తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారే..
కోరుట్ల: తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని ఆ పార్టీ జాతీయ మహిళా మోర్చ అధ్యక్షురాలు వనితాశ్రీనివాసన్ అన్నారు. మోదీ 12ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన సమావేశానికి కాగజ్నగర్ ఎమ్మెల్యే హరీశ్బాబుతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇప్పటికే 24 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 80 సీట్లు సాధించి సర్కార్ ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నా.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్లు కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి కేంద్రం పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ముందుగా బీజేపీ శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీతో నేతలకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనూప్రావు, రుద్ర శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, నవీణ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
పానీపూరి బాధితులు త్వరగా కోలుకోవాలి
సిరిసిల్ల/కరీంనగర్: పానీపూరీ తిని అస్వస్థతకు గురైన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్నగర్కు చెందిన 32 మంది పిల్లలు త్వరగా కోలుకోవాలని కేంద్ర మంర్రి బండి సంజయ్ ఆకాక్షించారు. ఎక్స్ వేదికగా గురువారస్పాయన ఘటనపై స్పందించారు. చిన్నారుల అస్వస్థత తనను ఎంతో బాధించిందన్నారు. ఇప్పటికే బాధిత పిల్లలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడానని, జరిగిన ఘటనపై ఆరా తీసినట్లు వెల్లడించారు. చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. మహిళపై హత్యాచారయత్నం జగిత్యాలక్రైం: పట్టణంలోని వాణీనగర్లో ఓ వివాహితపై గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు హత్యాచారయత్నం చేశారు. పోచమ్మవాడకు చెందిన ఓ మహిళకు వాణీనగర్కు చెందిన ఓ వ్యక్తితో పెళ్లయ్యింది. వీరికి కుమారుడు (15) ఉన్నాడు. కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండడంతో వేర్వేరుగా ఉంటున్నారు. భర్త ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం సదరు మహిళ అత్తాగారింటికి వెళ్లగా కుటుంబ సభ్యులు రానివ్వలేదు. అయినప్పటికీ ఆమె అక్కడే ఉండిపోయింది. రాత్రి కాగానే ఆమె మరిదితోపాటు మామ కలిసి ఇంటి గేట్లు వేసి ఆమైపె అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఇష్టారీతిన ఆమైపె దాడికి పాల్పడ్డారు. జాకెట్ చింపేశారు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు. వైద్యం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్సిరిసిల్లటౌన్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని సిరిసిల్ల పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్ చేశారు. టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం బోతిబాగోల్కు చెందిన మేలక్ గులాం దస్తగీర్(25) సిరిసిల్లకు చెందిన మైనర్ బాలికను ఇన్స్ట్రాలో పరిచయం పెంచుకున్నాడు. తరచూ మెసేజ్లు పెట్టగా బాలిక కూడా రిప్లై ఇస్తుంది. ఈక్రమంలో ఆమెను నమ్మించి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈనెల 14న సికింద్రాబాద్కు రమ్మని అక్కడి నుంచి రైలులో గుజరాత్లోని నడియాడ్కు తీసుకెళ్లాడు. తర్వాత రోజు అద్దె గది తీసుకొని మైనర్ అని తెలిసి కూడా లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాలిక ఇంటికి వెళ్లి పోతా అంటూ ఏడవడంతో బుధవారం ఉదయం సిరిసిల్ల పాతబస్టాండులో వదిలి వెళ్లిపోయాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినట్లు సీఐ తెలిపారు. ● కేంద్ర మంత్రి బండి సంజయ్ ● ఎక్స్ వేదికగా ప్రకటన -
కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ఆందోళన
జగిత్యాలటౌన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు మల్యాల రాకేశ్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్లోని డీఈవో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. పాఠశాలల్లో వసతులు కల్పించకుండా పరోక్షంగా ప్రైవేట్ బలోపేతానికి సహకరిస్తోందని ఆరోపించారు. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో, నాన్టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కాసుల గండం
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026వరద కాలువకుమెట్పల్లిరూరల్: జిల్లాలో పారుతున్న వరదకాలువను కాసుల గండం వెంటాడుతోంది. కాలువ మరమ్మతుకు ప్రభుత్వం నిధులను విడుదల చేయడం లేదు. ప్రతిపాదనలు పంపించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఆ విషయంలో ఎలాంటి ఊసేలేదు. నాలుగేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు మెట్పల్లి మండలంలో వరదకాలువ దెబ్బతినగా భారీగానే నష్టం వాటిల్లింది. వరద నీటి ఉధృతికి కట్టలు కోతకు గురయ్యాయి. పలుచోట్ల గండ్లు పడి వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. భారీ వర్షాలకు సామర్థ్యానికి మించి వరదనీరు ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కథలాపూర్, మేడిపల్లి, మల్యాల మండలాల మీదుగా వరదకాలువ పారుతుంది. నిర్మాణ సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి మాటుకాల్వల ద్వారా వచ్చే వరద నీరు చెరువుల్లోకి వెళ్లేలా సూపర్పాసెస్లు నిర్మించారు. మెట్పల్లి మండలం వెల్లుల, జగ్గాసాగర్ చెరువుల్లోకి నీరు వెళ్లేందుకు ఇక్కడి ప్రాంతంలో సూపర్ పాసెస్లు ఉన్నాయి. అప్పట్లో వర్షాలు కురిసిన సమయంలో సూపర్పాసెస్ల ద్వారా చెరువుల్లోకి నీరు బాగానే వెళ్లింది. నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలు కురవడంతో కాలువ సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో గట్టు దెబ్బతింది. సామర్థ్యానికి మించి నీరు రావడంతో జగ్గాసాగర్ చెరువు కోసం నిర్మించిన సూపర్పాసెస్ సమీపంలో రామలచ్చక్కపేట శివారులో కట్ట కోతకు గురై ఆనవాళ్లు కోల్పోయింది. అలాగే పలు చోట్ల గండ్లు పడడంతో సమీపంలోని వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. భారీ గా వచ్చిన వరదనీటి తాకిడికి పొలాల్లో మట్టి కూరుకుపోయి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. వర్షకాలంలో తప్పని తిప్పలు రూ.22.40 కోట్లతో ప్రతిపాదనలు.. మరమ్మతుకు నిధులు విడుదల చేయని ప్రభుత్వం గతంలో వర్షాలకు కొట్టుకుపోయిన కాలువగట్టు ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం ప్రశ్నార్థకంగా మారిన ఆయకట్టునిధులు మంజూరు కాలేదు రామలచ్చక్కపేట శివారులో దెబ్బతిన్న వరదకాల్వ గట్టు మరమ్మతుకు, మరో సూపర్పాసెస్ నిర్మాణానికి సంబంధించిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. మంజూరైతే మరమ్మతు చేయడంతోపాటు కావాల్సిన నిర్మాణాలు చేపడుతాం. – అరుణోదయ్ కుమార్, డీఈ నీటిపారుదలశాఖ, మెట్పల్లి -
‘ఎస్ఐఆర్’ పారదర్శకంగా నిర్వహించాలి
మల్లాపూర్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో గురువారం ఎస్ఐఆర్పై బీఎల్వోలకు శిక్షణ కల్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియను నిష్పక్షపాతకంగా చేపట్టాలన్నారు. ఇంటింటి సర్వేలో ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులను జాబితాలో నమోదయ్యేలా చూడాలని కోరారు. ఓటర్ జాబితాల నాణ్యతను మెరుగుపరచడంలో బీఎల్వోలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. కోరుట్ల ఆర్డీవో జీవాకర్రెడ్డి, తహసీల్దార్లు రాంచందర్, వినోద్, ఎంపీడీవో శ్రీకాంత్, ఆర్ఐలు అశోక్, రమేష్, బీఎల్వోలు, వీవీధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. శిక్షణలో సొమ్మసిల్లిన బీఎల్వో రాజకీయ పార్టీల నాయకులు, కలెక్టర్ ఎస్ఐఆర్పై వివరిస్తుండగా.. మల్లాపూర్కు చెందిన బీఎల్వో ఏనుగు రాధ సొమ్మసిల్లి కుర్చీ నుంచి కిందకు పడిపోయింది. తహసీల్దార్, ఎంపీడీవో రాధ వద్దకు వెళ్లి సర్పంచ్ లక్ష్మణ్ కారులో పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు రాధను మెట్పల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గోదాముల నిర్మాణం వేగవంతం చేయాలి జగిత్యాల: సహకార శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన 50 వేల టన్నుల గోదాముల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సహకార అభివృద్ధి మండలితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రాష్ట్రంలో జిల్లా మూడోస్థానంలో ఉందని, జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ వద్ద గోదాముల నిర్మాణానికి ఇప్పటికే భూమి కేటాయించామన్నారు. మిగతా పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సోలార్ పవర్ పాయింట్ ఏర్పాటు చేసి ఆ దిశగా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, జిల్లా సహకార అధికారి మనోజ్కుమార్, భాస్కర్, సత్యనారాయణరావు, లక్ష్మీకాంతరావు, ఎఫ్సీఐ అధికారి నవీన్ పాల్గొన్నారు. మల్లాపూర్లో మాట్లాడుతున్న కలెక్టర్ సత్యప్రసాద్మల్లాపూర్లో ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో సోమ్మసిల్లి పడిపోయిన బీఎల్వో రాధ కలెక్టర్ సత్యప్రసాద్ -
మొక్కలు నాటి సంరక్షించాలి
ధర్మపురి: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలంలోని తుమ్మెనాలలో గురువారం వన మహోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతిని వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, అధిక ఉష్ణోగ్రతలు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని తెలి పారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, డీఎఫ్ వో రవిప్రసాద్, డీఆర్డీవో రఘువరణ్, ఆర్డీవో మధుసూదన్, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మత్తు నివారణకు కృషి చేయాలిజగిత్యాల: మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి అన్నారు. నషాముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈనెల 15 నుంచి 26 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మత్తుబారిన పడిన వారు సహాయం కోసం జాతీయ డీ అడిక్షన్ హెల్ప్లైన్ నంబరు 14446లో సంప్రదించాలన్నారు. వన మహోత్సవంలో మంత్రి అడ్లూరి -
లైసెన్స్డ్ సర్వేయర్లకు రెమ్యునరేషన్
జగిత్యాల: భూ వివాదాలకు ప్రధాన కారణం హద్దులు. గ్రామాల్లో హద్దులు సక్రమంగా లేక నిత్యం వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం భూమి మొత్తం సర్వే చేయించాలన్న ఉద్దేశంతో ఇటీవల లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ కల్పించింది. కానీ.. వారికి రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. శిక్షణ పొందిన అనంతరం ఖాళీగానే ఉంటున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల నియమకాలు చేపట్టింది. జిల్లాలో సుమారు 181 మంది సర్వేయర్లకు శిక్షణ కల్పించారు. వారికి సంబంధించిన విధి విధానాలపై స్పష్టత లేకపోవడం, బాధ్యతలు లేకపోవడంతో శిక్షణ పొందినప్పటి నుంచి ఖాళీగానే ఉంటున్నారు. తాజాగా వారికి పనులు అప్పగించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాల్లో సర్వే చేయించాలనే ఉద్దేశంతో వారికి విధివిధానాలు ఖరారు చేశారు. ఎకరాన వారికి రూ.50 చొప్పున చెల్లిస్తుంటారు. 500ఎకరాల వరకు అప్పగించనున్నారు. నెలలో 500 ఎకరాలు సర్వే చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 20 మండలాలు జిల్లాలో 20 మండలాలు.. 385 గ్రామాలున్నాయి. ఇప్పటికే మండలాల్లో సర్వేయర్ల కొరత ఉంది. నూతనంగా ఈ లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించినా.. సరైన అధికారాలు లేకపోవడం ఇబ్బందిగా మారింది. క్షేత్రస్థాయిలో సర్వేయర్లు రైతులు భూ కొలతల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడస్తున్నా కొలవకపోవడం, టైం రాకపోవడం, రైతులందరూ కార్యాలయాల చుట్టూ తిరిగి నానా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల లైసెన్స్డ్ సర్వేయర్లతో ఈ అవస్థలు తొలగించాలన్న ఉద్దేశంతో నియమించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. వీరికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియమక పత్రాలు అందించారు. మండలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా వారికి రెమ్యునరేషన్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో భూ సమస్యలు తీరే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎకరాకు రూ.50 భూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు -
మైదానాల్లో క్రీడల జాతర
కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రంలోని పాఠశాల మైదానాలు త్వరలోనే సరికొత్త క్రీడా ఉత్సాహంతో ఉరకలెత్తనుండగా.. ఉమ్మడి జిల్లా సైతం సిద్ధమవుతోంది. విద్యార్థుల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభను వెలికితీసి వారిని రేపటి భవిష్యత్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన క్రీడల క్యాలెండర్ను విడుదల చేసింది. క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, అంకితభావం తదితర అంశాలతో ఈ ఏడాది సరికొత్త క్రీడాపండుగకు అధికారులు రూపకల్పన చేయడం విశేషం. మైదానాల్లో పండుగ లాగా నాలుగంచెల విధానంలో జరగనున్న క్రీడల జాతర ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్ చివరి వారం వరకు ఉల్లాసభరితమైన వాతావరణంలో ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. ముందస్తు ప్రణాళికపై హర్షం ఎస్జీఎఫ్ క్రీడా క్యాలెండర్ విడుదలపై పీఈటీలు, క్రీడాకారులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, వారిని మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయడానికి తగినంత సమయం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల పునఃప్రారంభం అయినప్పటి నుంచే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి వీలు కలుగుతుంది. ముందస్తు ప్రణాళిక గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ఒక గొప్ప వరం. 4 స్థాయిల్లో.. ఎస్జీఎఫ్ క్రీడా ప్రయాణం గ్రామీణస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీల వరకు ఒక క్రమపద్ధతిలో 4 స్థాయిల్లో సాగనున్నాయి. పాఠశాల స్థాయిలో.. ఆగస్టు మొదటి, రెండో వారాల్లో ప్రతీ పాఠశాలలో అంతర్గత పోటీలు నిర్వహిస్తారు. తరగతి గదుల నుంచి మైదానంలోకి అడుగుపెట్టే చిన్నారుల కోలాహలంతో ఎస్జీఎఫ్ జాతర మొదలవుతుంది. జోనల్ స్థాయిలో.. ఆగస్టు మూడో వారంలో ఇంటర్ మండల్ పోటీలు ఉత్సాహంగా సాగుతాయి. పోటీల్లో భాగంగా జిల్లా జట్లకు సంబంధించిన అత్యుత్తమ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుంది. జిల్లాస్థాయిలో.. సెప్టెంబర్ రెండో వారంలో జిల్లా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రతిభను కూడా కలుపుకుంటూ కేవలం ఒకే ఒక్క వారంలో ఈ ప్రతిష్టాత్మక పోటీలను పూర్తి చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో.. సెప్టెంబర్ 4వ వారంలో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. 10 జిల్లాల స్పోర్ట్స్ జోన్ల నుంచి వచ్చిన మేటి క్రీడాకారుల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు ఎంపికలు కూడా జరుగుతాయి. ఈ ఏడాది రాష్ట్రస్థాయి పోటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ప్రత్యేక సహకారంతో నిర్వహించనున్నారు. ఉరకలెత్తనున్న విద్యార్థుల క్రీడాప్రతిభ ఆగస్టు నుంచే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు 2026–27 షెడ్యూల్ విడుదల -
ప్రభుత్వ ఆస్పత్రిపైనే నమ్మకం
కోల్సిటీ: ప్రభుత్వ వైద్య సేవలపై విశ్వాసానికి నిదర్శనంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని పీడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పులిపాక శిరీష తొలికాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శిరీష ప్రసవం కోసం తాను పనిచేస్తున్న జీజీహెచ్నే ఎంచుకోవడం విశేషం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవల నాణ్యతపై ఆమెకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనంగా నిలిచింది. గైనకాలజీ విభాగాధిపతి అరుణ, అనెస్తీషియా భాను పర్యవేక్షణలో శిరీషకు సిజేరియన్తో ప్రసవం చేశారు. తల్లీశిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిరీష భర్త డాక్టర్ తాడమల్ల విక్రమ్ గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్గా సేవలందిస్తున్నారు. మెడికల్ సూపరింటెండెంట్ హిమబిందు సింగ్, ఆర్ఎంవో కృపాభాయి.. శిరీష దంపతులను అభినందించారు. తను పనిచేసే జీజీహెచ్లోనే డాక్టర్ శిరీష ప్రసవం అభినందించిన మెడికల్ సూపరింటెండెంట్ -
గురువులకు వందనం
మిషన్ 100కు రాష్ట్రపతి అవార్డు సిరిసిల్లటౌన్: వారంతా ప్రభుత్వ టీచర్లు. స్కూల్కు వచ్చామా.. వెళ్లామా.. అని కాకుండా స్కూల్ అభివృద్ధికి ఏం చేశాం.. విద్యార్థుల సర్వోన్నతికి ఎలా పనిచేశామని ప్రశ్నించుకున్న గురువులు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే కాదు.. ఆ విద్యార్థుల విజ్ఞానాభివృద్ధిలో తమ పాత్రను నూరు శాతం నిర్వర్తిస్తున్నారు. గ్రామస్తుల పిల్లలనే కాకుండా తమ పిల్లలను సైతం అదే పాఠశాలలో చదివిపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మసకబారిపోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను వెలికితీసి.. వెలుగులోకి తెచ్చి.. బడిని బతికించిన ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం. సిరిసిల్లటౌన్: పాతికేళ్ల ఉపాధ్యాయ జీవితంలో అంకితభావం, వినూత్న ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ బడిని బలోపేతం చేశారు సంపత్కుమార్. గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేట హైస్కూల్ సైన్స్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన రూపొందించిన మిషన్ 100 కార్యక్రమం ద్వారా పాఠశాలలో పదేళ్లకు పైగా వరుసగా 100 శాతం ఎస్ఎస్సీ ఉత్తీర్ణత సాధించారు. శాసీ్త్రయ దృక్ఫథం పెంచి విద్యార్థులు 20 జాతీయ అవార్డులు, 8 అంతర్జాతీయ అవార్డులు, 25 ఇన్స్పైర్ అవార్డులు సాధించారు. జపాన్ సకురా సైన్స్ ప్రోగ్రామ్, ఫైన్–2023, నేషనల్ టెక్నాలజీ వీక్ 2023లో ప్రధాని మోదీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది. 2022లో జాతీయ ఉత్తమ అవార్డు, 2020లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2024లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. -
విద్యుత్ పునరుద్ధరణకు ‘హైపర్’
● ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఉత్తర విద్యుత్ పంపిణీ వ్యవస్థ(ఎన్పీడీసీఎల్) సేవలు విస్తృతం చే స్తోంది. అనేక సేవలకు శ్రీకారం చేపట్టిన విద్యుత్ సంస్థ.. మరిన్ని సేవలందించేందుకు కొత్త ఆలోచనతో ముందుకు సాగుతోంది. 1912కు డయల్ చేస్తే ఎమర్జెన్సీ రిస్టోర్ టీం అక్కడకు చేరుకొని విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టనుంది. అదేవిధంగా 8712481489 వాట్సాప్ బాట్ ద్వారా సమస్యను వివరించే అవకాశాన్ని సంస్థ కల్పించింది. అదే తరహాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నప్పుడు త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు హైపర్ యాక్షన్ ప్లాన్ను విద్యుత్ సంస్థ అమలు చేయనుంది. అంతరాయాలు తగ్గించేందుకు.. హైపర్ యాక్షన్ ప్లాన్తో వర్షాకాలంలో వినియోగదారులకు అంతరాయం చాలావరకు తగ్గుతుంది. స్మార్ట్ టెక్నాలజీ–ఏఐ డ్రోన్ల అప్లికేషన్ సాంకేతికత వాడకంలో ఎన్పీడీసీఎల్ మరో అడుగు ముందుకేసి ఎస్సీఏడీఏ, జీఐఎస్, ఓఎంఎస్ డేటా వ్యవస్థలను కృత్రిమ మేధ(ఏఐ)తో అనుసంధానించింది. భవిష్యత్తులో ఫీడర్లలో రాబోయే సాంకేతిక లోపాలను 1 నుంచి 3 వారాల ముందే ఏఐ గుర్తి స్తుంది. వాతావరణ మార్పులను బట్టి విద్యుత్ డిమాండ్ ఎలా ఉండబోతుందో ముందే ఊహించి సరఫరాను మేనేజ్ చేస్తుంది. మనుషులు వెళ్లలేని అటవీ ప్రాంతాలు లేదా ఇరుకై న ప్రదేశాల్లో లైన్ల పర్యవేక్షణ, నష్టాల గుర్తింపు కో సం డ్రోన్ల వాడకం.. ప్రతీ సర్కిల్లో జీపీఆర్ఎస్ ఎ మర్జెన్సీ ప్రత్యేక వాహనాలు రంగంలోకి దించుతా రు. ఇందులో ఎమర్జెన్సీ రీస్టోర్ టీం మరమ్మతుకు అవసరమైన అన్ని రకాల సామగ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వీటికి జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ఉండడం వల్ల కంట్రోల్ రూమ్ నుంచి లొకేషన్ను నేరుగా మ్యాప్ చేసి సిబ్బందిని అతి తక్కువ సమయంలో సంబంధిత ప్రదేశానికి పంపుతారు. – రాపెల్లి రవీందర్, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ హైపర్ అంటే.. హెచ్: హెడ్ క్వార్టర్లో అప్రమత్తంగా ఉండడం, ప్రత్యేక సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ, బాధ్యతల కేటాయింపు. ఏ: ముందస్తు సమీకరణ, సమస్యలు రాకముందే క్షేత్రస్థాయికి కావాల్సిన సామగ్రి సిద్ధంచేయడం. ఐ: వేగవంతమైన సమాచారం. విద్యుత్ ఎక్కడ నిలిచిపోయినా కచ్చితమైన సమాచారాన్ని వేగంగా సేకరించి సంబంధిత టీమ్లకు చేరవేయడం. పీ: పటిష్ట వ్యూహం అమలుపర్చడం. సమాచారమందిన వెంటనే సిబ్బంది, సామగ్రి తరలించడం ఈ: యుద్ధప్రాతిపదికన, ఫీల్డ్లో పనులనువేగంగా, భద్రతా ప్రమాణాలతో పూర్తి చేయడం. ఆర్: ఫైనల్ రిస్టోరేషన్, నిర్దేశిత సమయంలోపు వినియోగదారులకు విద్యుత్ పునరుద్ధరణ. -
సెలవులకే సెలవు
సిరిసిల్లటౌన్: శతాబ్ది చరిత్ర గల సిరిసిల్లలోని ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా సకినాల శ్రీనివాస్ 2018లో బాధ్యతలు స్వీకరించారు. తాను విద్యాభ్యాసం చేసిన పాఠశాలలో అప్పటికి కేవలం 60 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. జిల్లాకు ఎంతోమంది మేధావులను అందించిన తన బడి పరిస్థితికి చలించారు. పూర్వ విద్యార్థులతో ముఖాముఖీ అయ్యారు. దాతల సాయంతో డిజిటల్ బోధన అందేలా కృషి చేశారు. 2020లో కరోనా రావడంతో ఢీలా పడలేదు. తల్లిదండ్రులను చైతన్యపరిచి ఆన్లైన్లోనే అడ్మిషన్లు చేస్తూ తరగతులు నిర్వహించారు. దీంతో చాలా మంది తల్లిదండ్రుల దృష్టి హైస్కూల్పై పడింది. 2024, 2025లో ఏ ఒక్క రోజు సెలవు తీసుకోలేదు. 60 మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో నేడు 303 మంది చదువుకుంటున్నారు. 2024నుంచి 2026 వరకు వరుసగా పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు వస్తున్నాయి. గతేడాది కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. -
కోలుకుంటున్న బాధితులు
సిరిసిల్లటౌన్: పానీపూరి తిని అస్వస్థతకు గురైన 25 మంది సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం పానీపూరి తిన్న పిల్లలు, పెద్దలు మంగళవారం ఉదయం నుంచి అస్వస్థకు గురయ్యారు. స్థానికంగా వైద్యం చేయించుకున్న ఆరోగ్యం కుదుట పడకపోవడంతో జిల్లా ఆస్పత్రికి క్యూ కట్టారు. వీరికి కలెక్టర్ పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతోంది. వైద్య అందుతున్న తీరును జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రైడ్ బుధవారం పర్యవేక్షించారు. 25 మందికి అస్వస్థత రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్నగర్లో ఓ వ్యక్తి మూడేళ్లుగా పానీపూరి బండితో వచ్చి వ్యాపారం చేస్తున్నాడు. గత సోమవారం కూడా ఎప్పటిలాగే కాలనీల్లో తిరిగి పానీపూరి విక్రయించాడు. చాలా మంది తినగా 22 మంది పిల్లలు, ముగ్గురు పెద్దలకు ఆహారం వికటించింది. మంగళవారం ఉదయం నుంచి ఒక్కొక్కరిగా వాంతులు, విరోచనాలు,, తీవ్రజ్వరం, తలనొప్పితో జిల్లా ఆస్పత్రికి వరుస పట్టారు. రాత్రి 9.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 25 మంది చేరారు. వారు తిన్న ఆహారం, నీరు కలుషితంతోనే ఫుడ్పాయిజన్ అయి ఉంటుందని వైద్యాధికారులు చెబుతున్నారు. నిరంతర పర్యవేక్షణలో చికిత్స ఒకేసారి 25 మంది ఫుడ్పాయిజన్తో ఆస్పత్రికి రావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాలతో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్బాబు ఆస్పత్రికి వచ్చి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నా రు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించి వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశా రు. బాధితులను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్ట ణాధ్యక్షుడు జిందం చక్రపాణి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జాలుగం ప్రవీణ్ పరామర్శించారు. బాధితులు కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందిస్తామని డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. కేసీఆర్నగర్లో ప్రత్యేక వైద్య శిబిరం తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేసీఆర్ నగర్లో పానీపూరి తిని చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన నేపథ్యంలో బుధవారం అక్కడ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఆశకార్యకర్తలు, వైద్య సిబ్బంది కాలనీలో ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. అవసరమైన వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులను పంపిణీ చేశారు. డీఎంహెచ్వో డాక్టర్ ఏంజెల్ ఆల్ఫ్రెడ్, డాక్టర్ నాగేంద్రబాబు, వైద్యాధికారి డాక్టర్ స్నేహ పరిస్థితిని సమీక్షించారు. హెచ్ఈవో బాలయ్య, హెచ్ఎస్ ప్రమీల, సతీశ్కుమార్, ఎంఎల్హెచ్పీ ఆరీఫ్, నవీన్, సంతోష్ పాల్గొన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను క పానీపూరి విక్రేతపై కేసు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. పానీపూరి విక్రేత ఇంటి వద్ద బండిని పరిశీలించారు. ఫుడ్పాయిజన్ అయ్యేందుకు అవకాశం ఉండటంతో సెక్షన్ 56 కింద విక్రేత మోహన్లాల్పై కేసు నమోదు చేశారు. పానీపూరి తిని 25 మందికి అస్వస్థత జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కోలుకుంటున్న చిన్నారులు పి.రిషికేష్(7), నక్క లాస్య(7), దాసరి అనూశ్రీ(4), కుసుమ సాన్విత(10), సబ్బని భావేష్(5), సాయిప్రియ(10), హిమశ్రీ(7), రాజగిరి గణేశ్(12), వైష్ణవి(12), నరేందర్(12), అమన్(13), సద్దాం హుస్సేన్(8), అభిజ్ఞ(3), మహన్య(10), మారుతి(13), సాయిప్రియ(10), రిషివర్ధన్(12), లక్షిత(5), విగ్నేష్(9), సాన్విత(10)ల ఆరోగ్యం నిలకడగా ఉంది. నిరంతరం వైద్యం అందిస్తున్నట్లు ఆర్ఎంవోలు డాక్టర్ సుమన్ మోహన్రావు, డాక్టర్ ప్రవీణ్ పేర్కొన్నారు. -
ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డగింత
పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం బుధవారం ప్రైవేట్ పాఠశాలల బస్సులను అడ్డుకుంది. సర్పంచ్ బండి శ్రీనివాస్గౌడ్, వార్డుసభ్యులు మాట్లాడుతూ, తమ గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సులు రావద్దని, విద్యార్థులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యలేని కారణంగా మూసివేసే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రభుత్వ పాఠశాలను బతికించుకునేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరా రు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓడ్నాల జ్యోతి–రాజు, వార్డు సభ్యులు సంకరి కుమార్, జూపాక వెంకటేశ్, సంతపూరి లింగమూర్తి, నెరువట్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. పోక్సోకేసులో 20 ఏళ్లు.. హత్యకేసులో జీవిత ఖైదు ● రెండు కేసుల్లో ఒకే నిందితుడికి శిక్ష సిరిసిల్ల: జిల్లాలో రెండు కేసుల్లో ఒకే నిందితుడికి శిక్ష విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికు చెందిన బండపల్లి నవీన్ అనే చందుర్తి మండలం మూడపల్లికి చెందిన మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అప్పటి వేములవాడ డీఎస్పీ వెంకటరమణ దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించి కోర్టులో చార్జిషీట్ వేశారు. వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్లో నమోదైన అదే మైనర్ బాలిక హత్యకేసులో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి టౌన్ సీఐ వెంకటేశ్ కేసు నమోదు చేసి, బండపల్లి నవీన్ను అరెస్ట్ చేశారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీందర్ నాయుడు, చందుర్తి, వేములవాడ కోర్టు కానిస్టేబుళ్లు లతీఫ్, మహేందర్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పొక్సోకోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ నేరం రుజువు కావడంతో నవీన్కు పొక్సో కేసులో 20 ఏళ్లు జైలు, రూ.7వేల జరిమాన, హత్యకేసులో జీవిత ఖైదుతో పాటు రూ.5వేలు విధిస్తూ తీర్పునిచ్చారు. రెండు కేసుల్లో నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన పోలీస్ అధికారులను, ఎస్పీ మహేశ్ బిగితే సిబ్బంది అభినందించారు. -
ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ బడిలోనే..
సర్పంచ్ కుమారుడికి అడ్మిషన్ ఇచ్చి పాఠ్యపుస్తకాలు అందిస్తున్న సర్పంచ్, ఉపాధ్యాయులు కథలాపూర్(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ జెడ్పీ హైస్కూల్లో స్థానిక సర్పంచ్, వార్డు సభ్యుడి పిల్లలు అడ్మిషన్లు బుధవారం తీసుకున్నారు. సర్పంచ్ గుంటుక మనోహర్ కుమారుడు పృథ్వీరాజ్ జెడ్పీ హైస్కూల్లో ఏడో తరగతిలో చేరాడు. వార్డుసభ్యుడు ఓలపు కొండగట్టు కూతురు అనుశ్రీ ఆరో తరగతిలో అడ్మిషన్ తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందుతుందని చేర్పించినట్లు వారు పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు అందించినట్లు హెచ్ఎం సుధాకర్రెడ్డి తెలిపారు. -
వ్యక్తి అదృశ్యం
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని సాయిరాంనగర్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ అదృశ్యమైనట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. సాయిరాంనగర్కు చెందిన శ్రీకాంత్ సాయిబాబా బైపాస్రోడ్లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తాడు. బుధవారం ఉదయం టిఫిన్ సెంటర్కు వెళ్తున్నానని బయటికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో అతని భార్య జ్యోతిర్మయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆటో చోరీ నిందితుడి అరెస్ట్కోరుట్ల రూరల్: పట్టణ శివారులోని రైల్వేస్టేషన్ పార్కింగ్ ప్రదేశం నుంచి ఈ నెల 15న ప్యాసింజర్ ఆటోను చోరీ చేసిన నిందితుడిని బుధవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 15న మొహమ్మద్ అజర్ తన ప్యాసింజర్ ఆటోను రైల్వే స్టేషన్లో పెట్టి కరీంనగర్ వెళ్లాడు. 16న వచ్చే సరికి ఆటో కనిపించలేదు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బుధవారం పట్టణంలోని వేములవాడ రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నర్సింగి గ్రామానికి చెందిన ఖాలిద్ బిన్ మహమ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆటో దొంగిలించి అల్లమయ్య గుట్ట వద్ద దాచిపెట్టినట్టు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామని ఎస్సై పేర్కొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ కోరుట్ల రూరల్: మండలంలోని అయిలాపూర్ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని బుధవారం సాయంత్రం పట్టుకున్నామని ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం అయిలాపూర్ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్సై తన బృందంతో దాడులు నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులను పట్టుకుని, రూ.12280 నగదు, 6 సెల్ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నాట్టు తెలిపారు. పెచ్చులూడిన ఆర్టీసీ బస్టాండ్ పైకప్పు పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పైకప్పు పెచ్చులూ ఊడిపడ్డాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు, ఇతురులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మహిళ బలవన్మరణంవెల్గటూర్: ఆర్థిక ఇబ్బందులతో మహిళ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మడ్డి ఇందిర (43) భర్త ఉపాధికోసం ముంబాయి వెళ్లాడు. గ్రామంలో కొంత వరకు అప్పు చేశారు. కుటుంబ ఆదాయం కన్నా అప్పులు పెరిగిపోయి, వాటిని తీర్చే మార్గం తెలియక రోజూ బాధపడుతుండేది. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ నిద్ర లేవక ముందు చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి సోదరుడు బైరి వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. -
అవినీతిపై కలెక్టర్ ఆగ్రహం
మెట్పల్లి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మెట్పల్లి మున్సి పల్ టౌన్ ప్లానింగ్ అధికారి రా జేంద్రప్రసాద్పై కలెక్టర్ సత్యప్రసాద్ కొరఢా ఝులిపించారు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధుల్లో చేరినప్పటి నుంచి అవినీతికి పాల్పడుతున్నాయని కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యంగా జగ్గుల లావణ్య అనే మహిళ ఆయన అవినీతికి సంబంధించిన ఆధారాలను అందజేసింది. పరిశీలించిన కలెక్టర్ టీపీవోను సస్పెండ్ చేయగా, ఇదే విభాగంలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లింబయ్యను విధుల నుంచి తప్పించారు. అక్రమాలు అన్నీ ఇన్నీ కావు నిజామాబాద్ మున్సిపాలిటీలో టీపీఎస్గా ఉన్న రాజేంద్రప్రసాద్ మూడేళ్ల క్రితం టీపీఓగా పదోన్నతి పొంది మెట్పల్లికి బదిలీపై వచ్చారు. కొంతకాలం పాటు వారంలో మూడు రోజుల చొప్పున రెండు చోట్ల విధులు నిర్వహిస్తూ వచ్చిన ఆయన్ను, పూర్తిగా మెట్పల్లికి కేటాయించారు. వచ్చిన ప్రారంభం నుంచే అక్రమాలకు తెరలేపారు. నిర్మాణాలకు అనుమతులు ఉన్నా, లేకపోయినా ఆయనకు ముడుపులు ఇవ్వాల్సిందే. లేకుంటే నిబంధనల పేరుతో నిర్మాణదారులను ముప్పుతిప్పలు పెడుతారనే ప్రచారం ఉంది. పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించాడన్నది బహిరంగ రహస్యం. టీపీఎస్ తీరుతో ఈ మూడేళ్లలో మున్సిపల్కు రావాల్సిన రూ.లక్షల ఆదాయానికి గండి పడగా, అతను మాత్రం లంచాల రూపంలో దండిగా సమకూర్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అందోళనలు.. ఫిర్యాదులు అక్రమాలకు పాల్పడుతున్న రాజేంద్రప్రసాద్పై చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణానికి చెందిన జగ్గుల లావణ్య అనే మహిళ తన ఇంటిపైన ఓ అంతస్తు నిర్మాణం కోసం టీపీఎస్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లింబయ్యలు రూ.2లక్షల లంచం తీసుకొని నకిలీ అనుమతి పత్రాలు ఇచ్చారని కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసింది. ఫోన్ పే ద్వారా వారికి చెల్లించిన నగదుకు సంబంధించిన ఆధారాలను అందజేసింది. పరి శీలించిన కలెక్టర్ ఇద్దరిపై వేటు వేస్తూ ని ర్ణయం తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు మెట్పల్లి విడిచి వెళ్లొదన్ని ఆదేశించారు. తీ వ్ర ఆరో పణలు ఎదుర్కొంటున్న రాజేంద్ర ప్రసాద్ను బదిలీ చేయించుకొని వెళ్లిపోవాలని చైర్మన్ లింబాద్రి ఇప్పటికే సూచించారు. ఆయన ఆ ప్రయత్నాల్లో ఉండగానే సస్పెన్షన్కు గురి కావడం గమనార్హం. కొన్ని ఉదాహరణలు పట్టణంలోని కళానగర్లో ఓ ఉద్యోగి అనుమతులు తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టాడు. స్థానికుల ఫిర్యాదుతో సెట్ బ్యాక్ లేదని ఇబ్బందులకు గురి చేసి అతని నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు తెలిసింది. వెల్లుల్ల రోడ్లో ఓ పాత భవనంపైన అంతస్తు నిర్మాణం చేపట్టారు. అనుమతి లేదని బెదిరింపులకు పాల్పడి రూ.70వేలు తీసుకున్నట్లు సమాచారం. నిజామాబాద్ రోడ్డులో జాతీయ రహాదారి పక్కన స్లాబులతో నిర్మించిన భవనం ఉంది. దానిని వ్యాపార అవసరాల కోసం ఒకరు కొనుగోలు చేసి ఇతర పనులు మొదలుపెట్టగా, అనుమతులు లేవనే సాకుతో రూ.3లక్షల వరకు జేబులో వేసుకున్నట్లు తెలిసింది. లేఔట్ నిబంధనలు పాటించకుండానే పలువురు రియల్ వ్యాపారులు వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. వారిని కూడా బెదిరింపులకు గురిచేసి రూ.లక్షలు వెనకేసుకున్నట్లు సమాచారం. -
కంపుకొడుతున్న ‘కాల్వలు’
జగిత్యాల: జిల్లా కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకుపోతున్నాయి. రోజూ కాకున్నా వారానికోసారి పూడిక తీసినా డ్రైనేజీలు శుభ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా టవర్సర్కిల్, తహసీల్ చౌరస్తా, ప్రధాన కూడళ్లలో మురుగుకాల్వలపై కప్పులు ఉండటంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది. తినుబండారాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి మురుగునీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి. వ్యర్థాలు పేరుకుపోవడంతో అక్కడక్కడా పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చిన్నపాటి వానలకే మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. అధికారులు స్పందించి డ్రైయినేజీలపై పూర్తిస్థాయిలో కప్పులు వేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, రోజూ సిల్ట్ తీసేలా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు. వర్షాకాలం.. వ్యాధుల భయం జగిత్యాలలో శానిటేషన్ అస్తవ్యస్తంగా మారడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇష్టానుసారంగా రోడ్లపై, డ్రైనేజీల్లో చెత్తాచెదారం పడేస్తుండడంతో ఈగలు, దోమలు పెరిగి స్థానికులు వ్యాధుల బారిన పడే అవకాశముంది. ఇప్పటికై నా అధికారులు శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.‘ఇది బైపాస్రోడ్లోని సాయిబాబా ఆలయం ముందు గల డ్రైనేజీ. వర్షకాలం పూర్తిగా నిండిపోతుంది. ఇక్కడ చౌరస్తా ఉండడంతో చిన్నపాటి వర్షం కురిస్తే రోడ్డుపై వరద పొంగిపొర్లుతోంది. స్థానిక కాలనీవాసులకు విపరీతమైన దుర్గంధం వెదజల్లుతోంది. ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులు బాగు చేపిస్తామంటారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి మురికినీరు సాఫీగా వెళ్లేలా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు’. -
కేవీ ఏర్పాటుపై రాజకీయం తగదు
జగిత్యాల: కేంద్రీయ విద్యాలయంపై ఎంపీ అర్వింద్ తీరు మారడం లేదని, కావాలనే రాజ కీయం చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాలలో మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలం కేటాయింపునకు కలెక్టర్ సర్వే చేయించి డిప్యూటీ కమిషనర్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు 10రోజుల క్రితం పంపించారన్నారు. జగిత్యాల కేంద్రీయ విద్యాలయానికి పాత ఎస్పీ కార్యాలయాన్ని కేటాయించి, కొన్ని కొన్ని మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సైతం విశేష కృషి చేస్తున్నారన్నారు. ఎంపీ అర్వింద్ ఇప్పటికై నా కేంద్రీయ విద్యాలయంపై రాజకీయాలు మానుకోవాలన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్లు నాగభూషణం, జ్యోతి, లక్ష్మణ్, బండ శంకర్, సతీశ్, మన్సూర్, చాంద్పాషా, కొత్త మోహన్, అబ్దుల్ ఖాదర్, బాలముకుందం పాల్గొన్నారు. సంజయ్.. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోండిజగిత్యాలటౌన్: జగిత్యాల ఎమ్మెల్యే సంజ య్కుమార్కు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని, ధైర్యంగా ప్రజల్లో తిరగాలని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బోగ శ్రావణి సవాల్ విసిరారు. బుధవారం జగిత్యాలలో మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. యావర్రోడ్డు విస్తరణకు గతంలోనే వంద ఫీట్లకు మ్యాపింగ్తో పాటు గెజిట్ పాస్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. యావర్రోడ్డు మెజర్మెంట్ ఎప్పుడో అయిపోయి సంబంధిత ఏజెన్సీకి చెల్లింపులు జరిగాయని గుర్తు చేశారు. రాయికల్ మండలంలో జరిగిన అధికా రిక కార్యక్రమానికి ఎంపీ హాజరవగా, కనీస మర్యాద పాటించకుండా పెయిడ్ బ్యాచ్తో రెచ్చగొట్టే ధోరణిలో నినాదాలు చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, పార్టీ కోశాధికారి సుంకెట దశరథరెడ్డి, ఆముద రాజు, సిరిపురపు శ్రీనివాస్, గట్టెపెల్లి జ్ఞానేశ్వర్, మమత, రమేశ్, సాయికుమార్ పాల్గొన్నారు. నిధులు మంజూరు చేయండికోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో సాగునీటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రాష్ట్ర ఇరిగేషన్శాఖ ఈఎన్సీ రమేశ్ను కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని ఇరిగేషన్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. మెట్పల్లిలో కోర్టు భవనానికి ఇరిగేషన్శాఖ ఆధీనంలో ఉన్న స్థలాన్ని కేటాయించాలని, కోరుట్ల నియెజకవర్గంలో చెరువులు, కుంటల మరమ్మతుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇబ్రహీంపట్నం గంగనాల ప్రాజెక్టు శాశ్వత మరమ్మతుకు రూ.1.23 కోట్లు మంజూరు చేయాలన్నారు. మల్లాపూర్ మండలం రేగుంట మాటు కాలువ పునరుద్ధరణ, నియోజకవర్గంలో దెబ్బతిన్న కాకతీయ ప్రధాన కాలువ, ఉపకాలువల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఫిట్నెస్ లేని వాహనాలు సీజ్చేస్తాంజగిత్యాలక్రైం: ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తామని ఎంవీఐ రామారావు అన్నారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని రాజీవ్గాంధీ చౌరస్తా, బైపాస్రోడ్ వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రతీ వాహనానికి ఫిట్నెస్తో పాటు, ఇన్సూరెన్స్ ఉండాలని, ప్రతి డ్రైవర్కు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల బస్సులు ఉండాలన్నారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న రెండు ఆటోలను సీజ్ చేయడంతో పాటు, అనుమతులు లేని రెండు పాఠశాల వాహనాలను సీజ్ చేసి జగిత్యాల ఆర్టీసీ డిపోకు తరలించినట్లు తెలిపారు. అసిస్టెంట్ ఎంవీఐలు సాయిచరణ్, రియాజ్ పాల్గొన్నారు. -
జగిత్యాల
40.0/29.07గరిష్టం/కనిష్టంఆలయాల్లో భక్తుల రద్దీ ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు.వాతావరణం జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.అంజన్నకు ఎమ్మెల్యే పూజలు మల్యాల: కొండగట్టు అంజన్నను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు పూలమాల వేసి స్వాగతం పలికారు.గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026 -
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
● అదనపు కలెక్టర్ బీఎస్ లత జగిత్యాల: నీట్ రీ ఎగ్జామ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ లత తెలిపారు. పరీక్షపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా మూడు కేంద్రాల్లో 807మంది పరీక్షకు హాజరు అవుతారన్నారు. ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్మపురి రోడ్డు, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల నాచుపల్లిలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, దివ్యాంగులకు 2 నుంచి 6.20 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొత్త అడ్మిట్ కార్డు తీసుకురావాలని, పాతవి చెల్లవని తెలిపారు. కేంద్రంలో ఇచ్చిన పెన్తోనే పరీక్ష రాయాలని, ప్రతి అభ్యర్థి పరీక్ష కేంద్రానికి రెండు అడ్మిట్కార్డులు తీసుకుని రావాలని, ఒకటి పరీక్ష కేంద్రంలో ఇవ్వడంతో పాటు, రెండోది తీసుకెళ్లొచ్చన్నారు. రైస్మిల్లర్లు బకాయిలు చెల్లించాలి యాసంగి 2025–26 సీజన్ను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, రైస్మిల్లర్లు బకాయిలు త్వరితగతిన చెల్లించాలని అదనపు కలెక్టర్ లత అ న్నారు. 2025–26 సీజన్కు సంబంధించి సీఎంఆర్ డెలివరిని ఆలస్యం లేకుండా అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ పకడ్బందీగా చేపట్టాలి స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ పకడ్బందిగా చేపట్టాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. బుధవారం అర్బన్, రూరల్ బూత్ లెవల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఎల్వోలు, సూపర్వైజర్ల విధులు తెలుసుకోవాలని, ఈ యాప్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలన్నారు. ప్రతి కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా చూడాలన్నారు. ఎన్యుమరేషన్ ఫామ్ను ఇంటింటికీ పంపిణీ చేయాలని, ఒక ఇంటిని మూడుసార్లు సందర్శించాలని సూచించారు. -
ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇల్లు
వెల్గటూర్/ధర్మపురి: ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేర్చుతున్నామని, ప్రతీ ఊరిలో ఇందిరమ ఇళ్ల నిర్మాణం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉమ్మడి వెల్గటూర్ మండలంలో పర్యటించారు. ఎండపల్లి మండలం కొండాపూర్లో తొమ్మిది ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్గటూర్ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నలుగురికి కల్యాణ లక్ష్మి, 91 మందికి రూ.31.03లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. జగదేవుపేట గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం దగ్ధమైన ఈత వనాన్ని పరిశీలించారు. వెల్గటూర్, ఎండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శైలేందర్రెడ్డి, శేఖర్ యాదవ్, తహసీల్దార్ శేఖర్ పాల్గొన్నారు. తెలంగాణ బడి వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహించే దిశగా రూపొందించిన తెలంగాణ బడి వెబ్సైట్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రారంభించారు. ధర్మపురికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు గొల్లపెల్లి గణేశ్ తీర్చిదిద్దిన వెబ్సైట్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించిన డిజిటల్ పాఠాలు, ఫార్మేటివ్ అసెస్మెంట్ పేపర్లు, ఇంటరాక్టివ్ క్విజ్లు, వ్యాకరణాంశాలను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంచామన్నారు. -
55 మంది నుంచి 110కి
కథలాపూర్: కథలాపూర్ మండలం చింతకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 55మంది విద్యార్థులే ఉన్నారు. బడికి జీవం పోయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు, గ్రామస్తులు సమావేశమై ఇంటింటా ప్రచారం చేశారు. దీంతో విద్యార్థుల సంఖ్య 110కి చేరింది. పాఠశాల పునఃప్రారంభమైనా.. కొందరు పిల్లలు రాకపోవడంతో సర్పంచ్ నాగం భూమయ్య, హెచ్ఎం సుధాకర్ విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లారు. తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను బైక్లపై పాఠశాలకు తీసుకొచ్చారు. పిల్లలు పాఠశాలకు చేరుకునేలా ఆటో సౌకర్యం కల్పిస్తామని సర్పంచ్ భూమయ్య తెలిపారు. -
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో జిల్లా ముందంజ
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఇంటింటికీ సంక్షేమం.. అభివృద్ధి ప్రతి గ్రామంలో కొనసాగిందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి 6 నుంచి 385 గ్రామాలు, 100కు పైగా మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించామని, పెండింగ్లో ఉన్న 10వేల దరఖాస్తులను పరిష్కరించామని, సీజనల్ వ్యాధులు, క్షయ, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. పోలీస్ శాఖ సమన్వయంతో అరైవ్ అలైవ్, రహదారి భద్రత చేపట్టామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ, 1500 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేశామన్నారు. మత్తు పదార్థాఆల నివారణపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. 45 రోజుల్లో 85,616 మంది రైతుల నుంచి 5,19,156 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,233 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించామన్నారు. కేంద్రీయ విద్యాలయంతోపాటు, యంగ్ ఇండియా స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ముందడుగు పడిందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 18 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకొచ్చాయన్నారు. ఈ ఏడాది45 లక్షల మొక్కలు నాటి వచ్చే రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. జగిత్యాలవాసికి దక్షిణాఫ్రికాలో అరుదైన గౌరవంమల్యాల: ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లి.. అక్కడి తెలుగు ప్రజలకు సేవలందిస్తూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న జగిత్యాలవాసి గుర్రాల నాగరాజుకు అక్కడ వింటర్ హీరోగా గౌరవం లభించింది. దక్షిణాఫ్రికాలోని హాల్ సంస్థ సామాజిక సేవలో సేవలందిస్తున్న ఎనిమిది మందిని ఎంపిక చేయగా.. జగిత్యాలకు చెందిన నాగరాజు ఎంపికయ్యారు. నాగరాజు 18ఏళ్లుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కరోనాకాలంలో వేలాదిమందికి ఆహారం అందించారు. నాగరాజును జిల్లాకు చెందిన పలువురు ఫోన్లో అభినందించారు. ఎల్లమ్మకు బోనాలుగొల్లపల్లి: మండలంలోని రాఘవపట్నంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లికి బోనాలు చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. సర్పంచ్ భవాని, గౌడ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు తిరుపతి, మాజీ సర్పంచ్ తిరుపతి, మాజీ ఎంపీటీసీ రాజేందర్, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. -
వరిసాగుకు ఎల్నినో!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వానాకాలం ప్రారంభమైందంటే ఉమ్మడి కరీంనగర్లో రైతులు వరి నారుమడులు సిద్ధం చేయడంలో బిజీగా ఉంటారు. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరి స్థితుల నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎల్నినో కారణంగా ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షాలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ అంచనాలు రైతుల్లో ఆందోళన పెంచుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సాగునీటి లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతుండడంతో వ్యవసాయశాఖ అధికారులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నారు. కొ న్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి ప్రధాన పంటగా మారింది. యాసంగిలో రాష్ట్రం రికార్డుస్థాయిలో వరి ఉత్పత్తి సాధించగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అధికంగా సాగైంది. ప్రస్తుత వానాకాలంలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజ న్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు ఆలస్యమైతే లేదా తక్కువగా కురిస్తే వరిసాగు ప్రమాదంలో పడే అవకాశం ఉండటంతో, నారుమడులు వేయడంపై రైతులు సందిగ్ధంలో ఉన్నారు. స్వల్పకాలిక వరి రకాలపై కానరాని ఆసక్తి వర్షాభావ సూచనలు, నీటి లభ్యతపై అనిశ్చితి, సాగు ఖర్చుల పెరుగుదలతో ఈసారి వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, వరిపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి, కంది, పెసర, నువ్వులు వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయడం మేలని చెబుతున్నారు. వరివేస్తే 120రోజుల్లోపు పండే స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రచా రం చేస్తున్నప్పటికీ రైతుల్లో ఆశించిన స్పందన కని పించడం లేదు. అధిక దిగుబడి ఆశతో చాలా మంది దీర్ఘకాలిక వరి రకాలకే మొగ్గుచూపుతున్నారు. దీంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాల్లో క్షీణత అధికారులు ఆందోళన చెందుతున్నట్లుగా లోటు వర్షపాతం నమోదైతే.. ఆ ప్రభావం తప్పకుండా భూగర్భ జలాలపై ఉంటుంది. అదే సమయంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి ఇప్పట్లో నీరు అందించే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ, ఉమ్మడి జిల్లాకు సాగు, తాగు నీటికి ప్రాణాధారంగా భావించే ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ కాలువల నుంచి వచ్చే వరదపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రాష్ట్రంతోపాటు ఎగువన కూడా లోటు వర్షపాతం నమోదైతే కాలువల ద్వారా వచ్చే నీరు కూడా తగ్గిపోయే ప్రమాదముంది. వరద కాలువలు, ఎస్సారెస్పీ కాలువలు నిండుగా ఉన్నప్పుడు చుట్టుపక్కల భూగర్భ జలాలు సంతృప్తస్థాయిలో ఉంటాయి. కాలువల్లో నీరు తగ్గితే.. వీటి పరివాహక ప్రాంతాలతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ భూగర్భజలాలు పడిపోతాయని వ్యవసాయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (లక్షల ఎకరాల్లో)ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో సాగు వివరాలు -
మూత‘బడి’ని బతికించారు
మల్లాపూర్: కలిసికట్టుగా నడిచారు. మూతబడిన పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి పునర్జీవం పోశారు. మండలంలోని వెంకట్రావ్పేట ప్రాథమిక పాఠశాలను మూడేళ్ల క్రితం విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేశారు. సర్పంచ్ వెంకటేశ్, పంచాయతీ పాలకవర్గం, స్థానిక ప్రజాప్రతినిధులు పిల్లల తల్లిదండ్రులతో సమావేశమై బడి పునఃప్రారంభ ఆవశ్యకతను వివరించారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై రప్పించారు. బడిబాటలో 22మందిని చేర్పించారు. మంగళవారం ఎంఈవో కేతిరి దామోదర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడపుల పుష్పలతతో కలిసి పాఠశాలను పునఃప్రారంభించారు. రాజరాంపల్లితండా పాఠశాల.. పెగడపల్లి: పెగడపల్లి మండలంలోని రాజరాంపల్లితండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేని కారణంగా నాలుగేళ్ల క్రితం మూతబడింది. సర్పంచ్ ఇస్లావత్ రమేశ్ నాయక్ చొరవ చూపి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడి ఉపాధ్యాయులను రప్పించారు. కొందరు విద్యార్థులు పాఠశాలలో చేరగా ఆ పాఠశాలను మంగళవారం అధికారులు ప్రారంభించారు. పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, పెన్నులు అందించారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఎంపీడీవో ప్రేమ్సాగర్, తహసీల్దార్ నిజామొద్దీన్, ఎంఈవో సులోచన, ఆర్ఐ జమున, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నక్షతో భూ రక్ష
● భూముల లెక్కలు పక్కాగా.. ● క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం ● డ్రోన్లతో చిత్రీకరణ పూర్తి..జగిత్యాల: నక్ష.. గ్రామీణ ప్రాంతాల్లో అతి ముఖ్యమైంది. భూములకు హద్దులు, దారులు, ఇతరత్రాకు నక్ష ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో మాదిరిగానే పట్టణాల్లోనూ భూముల లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఇటీవల నక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సాగు భూములక మాత్రమే ఉండే నక్ష పట్టణాల్లోనూ పటాలను రూపకల్పన చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మున్సిపాలిటీలు ఎంపికకాగా.. అందులో జగిత్యాల కూడా ఒకటి. సర్వే ఆఫ్ ఇండియా, మున్సిపాలిటీ, భూమి కొలతలు, దస్త్రాల నిర్వహణ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మొదట హెలికాప్టర్, డ్రోన్ల ద్వారా పట్టణం మొత్తం వ్యూ చిత్రీకరించారు. ప్రస్తుతం సర్వేయర్ల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించే పనులు మొదలయ్యాయి. ఇది పూర్తయ్యాక ఆర్వోఆర్ పట్టా ఇవ్వనున్నారు. డ్రోన్లతో చిత్రీకరణ పూర్తి జగిత్యాల మున్సిపాలిటీలోని అన్ని భవనాలను డ్రోన్లతో చిత్రీకరించారు. ప్రస్తుతం గ్రౌండ్ట్రూతింగ్ పనులను సర్వేయర్లు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రతి భవనం, ఆస్తులను కొలతలు చేయడంతో పాటు, వాటికి బౌండరీలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో పొందుపర్చుతారు. ప్రతి ఒక్క ఆస్తిని అక్షాంశాలు, రేఖాంశాలతో హద్దులు గుర్తించి సంబంధిత ఆస్తులకు ఆర్వోఆర్లో చేర్చి గుర్తింపు కార్డులు అందించనున్నారు. వీటితో పాటు, ప్రభుత్వ స్థలాలైన చెరువులు, ఆలయాలకు సంబంధించిన భూములను పొందుపర్చనున్నారు. తద్వారా వాటిని ఎవరూ కబ్జా చేసే అవకాశం ఉండదు. ఈ నక్షతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా ఎంతో ఉపయోగపడతాయి. విస్తరిస్తున్న పట్టణం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కోరుట్ల, జగిత్యాల ల్యాండ్రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. పైలెట్ ప్రాజెక్ట్ కింద జగిత్యాల ఎంపికవడంతో మేలు జరగనుంది. పైగా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయవచ్చు. భూముల లెక్కలు పక్కాగా ఉండేందుకు నక్షలు ఆధారంగా ఉంటాయి. 50 వార్డులు.. లక్షకు పైగా జనాభా జిల్లా కేంద్రమైన జగిత్యాల ఇక నుంచి నక్షతో కూడిన పట్టణంగా ఏర్పాటు కానుంది. ఇక్కడ ఎలాంటి కబ్జాలకు పాల్పడకుండా ఉంటుంది. మున్సిపాలిటీలో 50 వార్డులు, లక్షకు పైగా జనాభా ఉంది. దాదాపు 35 వేలకు పైగా గృహాలుంటాయి. వీటన్నింటిని డ్రోన్ల ద్వారా చిత్రీకరించి పట్టణ మ్యాప్ రూపొందించారు. గ్రామాల విలీనంతో.. జగిత్యాల.. జిల్లాకేంద్రం కావడం, చుట్టూ 6 కిలో మీటర్ల మేర విస్తరించడం.. ఇటీవల కొన్ని గ్రామాలు బల్దియాలో విలీనం అయ్యాయి. దీంతోపాటు అక్రమాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో భూముల రక్షణ కోసం నక్ష ఏర్పాటు చేస్తున్నారు. నక్ష ద్వారా సమగ్ర సర్వే చేపట్టి భూములకు రక్షణ కల్పించనున్నారు. ఇది ప్రజల సొంత భూములతోపాటు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ఎంతో ఉపయోగపడనుంది. -
భూములను ఏ‘మారు’స్తున్నారు..!
మెట్పల్లి: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కొందరు డాక్యుమెంట్ రైటర్లు బరి తెగిస్తున్నారు. డబ్బుల కోసం నకిలీ పత్రాలు సృష్టిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా అవినీతి జరుగుతోందనే ఉద్దేశంతో ప్రభుత్వం దీనిని నియంత్రించడానికి డిజిటల్ క్యూ మేనేజ్మెంట్, స్లాట్ బుకింగ్ వంటి విధానాలను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల ప్రజలు రైటర్లతో నిమిత్తం లేకుండానే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. కానీ ఆన్లైన్ విధానంపై అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది రైటర్లనే ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధిక సంపాదన కోసం వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు. మెట్పల్లిలో బయటపడిన రాకేశ్ అనే డాక్యుమెంట్ రైటర్ వ్యవహారమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. అక్రమాలు అనేకం.. ఆ ఉద్యోగి పాత్రపై పోలీసుల ఆరా నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం ఎనిమిది గుంటల భూమి రిజిస్ట్రేషన్ విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం. అలాగే డాక్యుమెంట్ రైటర్ రాకేశ్ ఏర్పాటు చేసుకున్న షెడ్డు మా కార్యాలయం పరిధిలో లేదు. అతడు ఇతరుల ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసుకున్నాడు. దాని విషయంలో మేం జోక్యం చేసుకోలేం. – వెంకటేశ్, సబ్ రిజిస్ట్రార్, మెట్పల్లి ఇది మెట్పల్లి పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. కార్యాలయంలోకి ప్రవేశించే చోట కుడి వైపు కనిపిస్తున్నది పాకాల రాకేశ్ అనే డాక్యుమెంట్ రైటర్ ఏర్పాటు చేసుకున్న షెడ్డు. ఇక్కడ కొంతకాలంగా రిజిస్ట్రేషన్కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాడు. స్థానిక తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతోపాటు నకిలీప్రతాలు సృష్టించి.. తద్వారా ఓ భూమిని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో పోలీసులు రెండురోజుల క్రితం అరెస్ట్ చేసిన నలుగురిలో ఈ రాకేశ్ ఒకడు. నిబంధనల ప్రకారం.. రైటర్లను కార్యాలయంలోకి అనుమతించకూడదు. కానీ రాకేశ్ ఏకంగా కార్యాలయం ఆవరణలోనే దర్జాగా షెడ్డు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అఽధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
ధర్మాజీపేటలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
● పనికిమాలిన రాజకీయాలు చేయొద్దు : ఎంపీ ధర్మపురి అర్వింద్ ● సంస్కారం తెలియని ఎంపీ : ఎమ్మెల్యే సంజయ్కుమార్రాయికల్: మండలం ధర్మాజీపేటలో ఆయుష్మాన్ భారత్ ఆస్పత్రి ప్రారంభం ఎంపీ ధర్మపురి అర్వింద్ వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్గా మారింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఎంపీ, ఎమ్మెల్యే కలిసి ఆస్పత్రిని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎంపీ రెండు గంటలపాటు ఆలస్యంగా చేరుకున్నారు. అంతసేపు ఎమ్మెల్యే నాయకులతో కలిసి వేచిచూశారు. ఎంపీ వచ్చాక ఆస్పత్రిని ప్రారంభించారు. అదే సమయంలో అక్కడున్న బీజేపీ కార్యకర్తలు జైశ్రీరామ్, భారత్మాతాకీ జై, జై ధర్మపురి అంటూ నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు జైకాంగ్రెస్, జై సంజయన్న అంటూ నినదించారు. కొద్దిసేపటికి సభ ప్రాంగణానికి వచ్చిన ఎంపీ మూడు నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు. పనికిమాలిన రాజకీయాలు చేయొద్దు కేంద్రం నిధులతోనే ఆస్పత్రిని ప్రారంభించామని, తన వద్ద పనికిమాలిన రాజకీయాలు చేయొద్దని, ఫ్లెక్సీలకయ్యే ఖర్చును ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని ఎంపీ అర్వింద్ అన్నారు. ఎక్కడా లేని విచిత్ర రాజకీయం జగిత్యాల నియోజకవర్గంలో ఉందని, ఏ పార్టీ నాయకుడు ఎందులో ఉంటారో ఎవరికీ తెలియదని అన్నారు. అర్వింద్ వ్యాఖ్యలు సరికాదు ఎంపీ రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా వేచి చూశానని, తీరా వచ్చాక సభ మర్యాద లేకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. బీజేపీ నాయకులు నినాదాలు చేస్తే తమ కార్యకర్తలూ నినాదాలు ఇచ్చారని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజాసేవే ముఖ్యమని, ఎంపీ అర్వింధ్ కేంద్రం నిధులతో ఎన్ని ఆస్పత్రులు ప్రారంభించారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఇప్పటివరకు 14 పల్లె దవాఖానాలు మంజూరు చేయించానని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ దినేశ్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచ్ గంగారెడ్డి, డీఎంహెచ్వో సుజాత, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీవో సుష్మ పాల్గొన్నారు. -
ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపర్చాలి
జగిత్యాల: ఆస్పత్రుల్లో క్లీనికల్ సేవలు మెరుగుపర్చాలని, వెంటనే వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డెవలప్మెంట్ సొసైటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, సమస్యలుంటే దృష్టికి తేవాలని సూచించారు. జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, సంజయ్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ ద్వారా అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయాలన్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
చెన్నకేశవనాథునికి జూనియర్ సివిల్ జడ్జి పూజలు
రాయికల్: పట్టణంలోని చెన్నకేశవనాథ ఆలయంలో కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జి కె.పావ ని సోమవారం పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెతో అభిషేకాలు చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మచ్చ శ్రీధర్ ఆమెను సన్మానించారు. అర్చకులు సతీశ్శర్మ ఉన్నారు. ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తాంజగిత్యాలక్రైం: ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తామని అసిస్టెంట్ ఎంవీఐలు సాయిచరణ్, రియాజ్ అన్నారు. పట్టణంలోని కొత్తబస్టాండ్, రాజీవ్గాంధీచౌరస్తా, గొల్లపల్లి రోడ్లో సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రతి వాహనానికి ఫిట్నెస్తోపాటు, ఇన్సూరెన్స్ ఉండాలని, ప్రతి డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సులు ఉండాలని, పరిమితికి మించి విద్యార్థులను తరలించొద్దని సూచించారు. అనుమతులు లేని ఓ వాహనాన్ని సీజ్ చేసి జగిత్యాల ఆర్టీసీ డిపోకు తరలించామని పేర్కొన్నారు. జేఎన్టీయూలో 17మంది విద్యార్థులకు ఉద్యోగాలుకొడిమ్యాల: జేఎన్టీయూ (నాచుపల్లి) విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్రతిభ చాటారు. ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో నాలుగుదశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఐటీ, సీఎస్సీ, ఈసీఈ విభాగాలకు చెందిన 17మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి వార్షిక వేతనం రూ.నాలుగు లక్షల వరకు ఉంటుందని ప్రిన్సిపల్ నరసింహ తెలిపారు. ప్లేస్మెంట్ అధికారి సతీష్ కుమార్, ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. వృద్ధులను గౌరవిద్దాం జగిత్యాలజోన్: వృద్ధులను గౌరవించడం సామాజిక బాధ్యత అని జిల్లా సబ్ జడ్జి, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి నాగేశ్వర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో సోమవారం వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. వృద్ధులు ఒంటరితనానికి గురి కాకుండా కుటుంబసభ్యులే చూడాలన్నారు. వారికి హాని కలిగేలా చేస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నా రు. ఇటీవల వృద్ధులు కోర్టులు, పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. వృద్ధులకు అన్యాయం జరిగితే న్యాయసేవా సంస్థను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రిటైర్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖరబూజ రవీందర్, మెట్ట మ ల్లికార్జున్ ప్రధాన కార్యదర్శులు కొలిచాల రవీందర్, కంటే అంజయ్య, కోశాధికారులు గుండేటి గంగాధర్, వేల్పుల ప్రతాప్ పాల్గొన్నారు. పాఠశాలల్లో మెరుగైన విద్యకు ప్రభుత్వం కృషిమెట్పల్లి: పాఠశాలల్లో మెరుగైన విద్య అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు తెలిపారు. పట్టణంలోని శివాజీనగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మించిన టాయిలెట్స్ను ప్రారంభించారు. పది ఫలితాలు, అథ్లెటిక్స్లో ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఈ ఏడాది నుంచి అల్పాహారం కూడా అందించాలని నిర్ణయించిందన్నారు. మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్చైర్మన్ ఓంకారి నవీన్, ఎంఈవో కనకతార, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు రైసుద్దీన్ తదితరులున్నారు. -
నష్టపరిహారం చెల్లించాలి
మాది అంతర్గాం. జగిత్యాల – కరీంనగర్ జాతీయ రహదారి – 563 నిర్మాణంలో మా ఇళ్లు, భూములు కోల్పోతున్నాం. అతి తక్కువగా నష్టపరిహారం ఇవ్వజూపుతున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆస్తికి మూడింతలు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుని న్యాయం చేయండి. – అంతర్గాం భూ బాధితులు అక్రమ నిర్మాణం కూల్చేయండి రాయికల్ మండలం మైతాపూర్లోని రెండో వార్డులో శివనీతి రాజిరెడ్డి పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మిస్తున్నాడు. నాలాను ఆక్రమించి ర్యాంపు నిర్మిస్తున్నాడు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. రాజిరెడ్డి కుమారుడు శ్రీకాంత్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఈ విషయమై తగిన విచారణ జరిపి అక్రమ నిర్మాణాన్ని తొలగించండి. – దమ్మ లక్ష్మి, మైతాపూర్ -
ఓట్ల తొలగింపునకు బీజేపీ కుట్ర
ధర్మపురి: కేంద్రప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగించే కుట్ర పన్నుతోందని, బూత్లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణ (సర్)పై పట్టణంలో నియోజకవర్గస్థాయి బూత్ లెవల్ ఏజెంట్లకు సోమవారం అవగాహన కల్పించారు. నియోజకవర్గంలోని 269 పోలింగ్ కేంద్రాల్లో 2.37 లక్షల మంది ఓటర్లున్నారని, వాటిలో కొన్ని తొలగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, ఇసుక రవాణాలో తాను అక్రమాలకు పాల్పడ్డానని మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే 48 గంటల్లో మంత్రి పదవికి రాజనామా చేస్తానని సవాల్ చేశారు. జీవన్రెడ్డిలా పార్టీలు మార్చే నైజం తనది కాదని, ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్లోనే కొనసాగుతానని అన్నారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు లభించిందని మంత్రి తెలిపారు. కొన్నేళ్లుగా తక్కువ వేతనంతో పని చేస్తున్న 15 మంది స్వీపర్లకు రూ.12వేలకు పెంచుతూ దేవాదాయశాఖ నుంచి ఉత్తర్వులు రాగా.. మంత్రి అందించారు. ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని, 13 రూట్లలో కొత్తగా బస్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. బస్టాండ్లో అదనపు సౌకర్యాలపై కరీంనగర్ ఈడీ సోలామన్, ఆర్ఎం రాజు, జగిత్యాల డీఎంతో కలిసి పరిశీలించారు. ధర్మపురిలో బస్డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రుద్ర సంతోష్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు పాల్గొన్నారు. -
తొలిరోజు అంతంతే..!
జగిత్యాల: ఈనెల 12నే పునఃప్రారంభం కావాల్సిన పాఠశాలలు ఉష్ణోగ్రతల నేపథ్యంలో 15 వరకు పొడిగించారు. అయితే సోమవారం అమావాస్య కావడంతో ఆ ప్రభావం ప్రభుత్వ పాఠశాలలపై తీవ్రంగా పడింది. విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా కేవలం 10.35 శాతం పిల్లలే బడికి హాజరయ్యారు. ఉపాధ్యాయులు ఉదయమే స్కూల్కు వెళ్లి విద్యార్థులకు స్వాగతం పలికేలా కొబ్బరి ఆకుల తోరణాలు, బెలూన్స్తో స్వాగత ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛభారత్ కింద గదులను శుభ్రం చేశారు. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో హాజరైనా విద్యార్థులు రాకపోవడం గమనార్హం. నంచర్లలో పూలతో స్వాగతం పెగడపల్లి: మండలంలోని నంచర్ల, నందగిరి తెనుగువాడ, నామాపూర్ గ్రామాల్లోని పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు సర్పంచులు రజిత, వనజ, రజిత, అరుణ పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. మండలవ్యాప్తంగా 6 యూపీఎస్, 26 ప్రాథమిక, 6 హైస్కూళ్లు ఉన్నాయి. 2144 మంది విద్యార్థులకు 223 మంది హాజరైనట్లు ఎంఈవో సులోచన తెలిపారు. మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలంలోని అన్ని పా ఠశాలలు విద్యార్థులు రాకపోవడంతో బోసిపోయాయి. మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీగా ఉండకుండా అడ్మిషన్లు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు మండలంలోని కోనరావుపేట పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. చేరిన విద్యార్థులకు రూ.2 వేలు అందిస్తామని ప్రకటించింది. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లతో కలిసి ఇంటింటికీ తిరుగు తూ ప్రైవేటుకు ధీ టుగా ప్రభుత్వ పా ఠశాలలో ఉత్తమ బోధన, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, పుస్తకాలు, యూనిఫాం అందుతోందని సర్పంచ్ గంగారెడ్డి, ఉపసర్పంచ్ పరంధాములు, వార్డు సభ్యులు కోరుతుండడం గమనార్హం. అమావాస్యతో హాజరు శాతం తగ్గిందిపాఠశాలలు 836విద్యార్థులు 46,608హాజరైంది 4822 శాతం 10.35అమావాస్య కావడంతో విద్యార్థులు హాజరు కాలేదు. 10.35 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఇప్పటికే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేశాం. పుస్తకాలు, నోట్బుక్స్ అందజేశాం. త్వరలోనే పిల్లలందరికీ యూనిఫామ్స్ అందిస్తాం. – రాము, డీఈవో -
కొడుకు ప్రాణాలు కాపాడండి
జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్కు చెందిన గర్వందుల రమ్యతో 2021లో నాకు వివాహమైంది. 2023లో బాబు జన్మించాడు. అతడు ఎదుగుదల వ్యాధి (వాస్క్యులర్ సిండ్రోమ్)తో బాధపడుతున్నాడు. ఏడాది బాబును వదిలి భార్య పుట్టింటికి వెళ్లింది. బాబును చూసుకునే వారు లేక హైదరాబాద్లో ఉద్యోగం వదిలేసి వచ్చాను. నా కొడుక్కి వైద్యం చేయించి ప్రాణాలు కాపాడండి. – ముంజ సురేష్గౌడ్, గంభీర్పూర్, కథలాపూర్ మండలం యావర్రోడ్డులో అక్రమాలు తొలగించండి జగిత్యాల పట్టణంలోని యావర్రోడ్డును వంద ఫీట్లకు విస్తరించడంతోపాటు యావర్రోడ్డు వెంట ఎలాంటి సెట్బ్యాక్ నిబంధనలు పాటించకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేలా చర్యలు తీసుకోగలరు. – బీఆర్ఎస్ నాయకులు -
అందని వైద్యం
ఆదివారం.. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆదివారం వైద్యం అందడం లేదు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు రోగులు వస్తున్నా.. పట్టించుకునేవారు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొన్ని ఆస్పత్రులకు ఏకంగా వైద్యాధికారుల గదులకు తాళం వేస్తున్నారు. మరికొన్నిచోట్ల హెల్త్ అసిస్టెంట్లు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి గడప తొక్కుతున్న పేదలకు ప్రభుత్వం వైద్యం అందకపోగా.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలను ఆదివారం సాక్షి విజిట్ చేయగా అనేక అంశాలు వెలుగుచూశాయి. -
ప్రశ్నించేవారికి పనులతోనే జవాబు
జగిత్యాలరూరల్: తనను ప్రశ్నిస్తున్నవారికి అభివృద్ధి పనులతోనే జవాబు చెబుతామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బీర్పూర్ మండలం తుంగూర్లో సముద్రంరోడ్ నుంచి దొంతాపూర్ రోడ్డు వరకు రూ.1.80 కోట్లతో నిర్మించే పనులను ఆదివారం పరిశీలించారు. ప్రజలకు అవసరమైన రవాణా సౌకర్యం కల్పించడంతోపాటు రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. కొల్వాయి, చిన్న కొల్వాయి రోడ్డాం, సారంగాపూర్ నుంచి బీర్పూర్ ఘాట్ రోడ్డు, కమ్మునూర్–మంగెల, వడ్డెరకాలనీ రోడ్డు, బట్టపల్లి రోడ్లకు నిధులు మంజూరయ్యాయన్నారు. సర్పంచ్ రాజగోపాల్రావు, నాయకులు రాంచందర్రావు, బుచ్చన్న, తిరుపతి, శ్రీనివాస్, రాజమల్లయ్య, లక్ష్మినర్సింహారావు, లక్ష్మిరాజం పాల్గొన్నారు. -
ఆ అనుభూతే వేరు..!
● నాటి జ్ఞాపకాలు మధురమైనవి ● చదువుతోనే మంచి భవిష్యత్ జగిత్యాల: పాఠశాలకు తొలిరోజు వెళ్లడం ఎంతో అనుభూతినిస్తుంది. మరిచిపోలేని మధురక్షణం. నాన్నకానీ, అమ్మకానీ స్కూల్కు తీసుకెళ్తున్నప్పుడు కొంత భయం ఉంటుంది. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖులు ‘సాక్షి’తో వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. పాఠశాలకు మొదటి రోజు వెళ్లడం ఉత్సాహంగా ఉండేది. ఎక్కువగా అమ్మ నిర్మల స్కూల్కు తీసుకెళ్లేది. విజయనగరంలో ఒకటి నుంచి 4వ తరగతి వరకు.. విశాఖపట్నంలో ఎస్ఎఫ్ఎస్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. సెలవుల అనంతరం వెళ్తే కొత్త బుక్కులు, కొత్త యూనిఫాం.. ఆ మధుజ్ఞాపకం మరిచిపోలేనిది. విద్యతోనే అభివృద్ధి. ప్రతిఒక్కరూ చదువులో రాణించాలి. – సత్యప్రసాద్, కలెక్టర్ నా చదువంతా గంగాధరలో కొనసాగింది. స్కూల్కు నాన్న మల్లయ్యనే తీసుకెళ్లేవారు. తొలిరోజు స్కూల్కు వెళ్లడమంటే ఆ ఉత్సాహమే వేరు. గురువులు ఎంతో ప్రేమగా చదువు చెప్పేవారు. ఉపాధ్యాయుల చొరవతోనే ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోంది. డిజిటల్ బోర్డులు, కంప్యూటర్స్, ల్యాబ్స్ ఎన్నో వచ్చాయి. – మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల జగిత్యాలలోని వీక్లీబజార్ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నాను. ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతగా చెప్పేవారు. ఆ అనుభూతి వేరు. స్కూల్లో స్నేహితులతో కలిసి అనేక ఆటలు ఆడేవాడిని. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని డాక్టర్ అయ్యాను. ప్రజలకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అయ్యాను. – ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
మధ్యాహ్నం నుంచి అత్యవసర సేవలే..
కొడిమ్యాల: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ‘సాక్షి’ ఉదయం 10:30కు విజిట్ చేసింది. స్టాఫ్నర్స్, అటెండర్ మాత్రమే ఉన్నారు. కొడిమ్యాల చెందిన సురుగు మల్లవ్వ (64)ను కోతి కరవడంతో స్టాఫ్నర్స్ చికిత్స చేసి పంపించారు. 12.30గంటల ప్రాంతంలో స్టాఫ్నర్స్ ఇంటికి వెళ్లిపోయారు. వైద్యాధికారి నరేశ్ వారాంతపు సెలవులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. స్టాఫ్నర్స్ ఒంటిగంట వరకే అందుబాటులో ఉంటారని, అత్యవసరమైతే తిరిగి విధులకు హాజరవుతుందని పేర్కొన్నారు. 12.40 గంటలకు అటెండర్ ఆస్పత్రికి గేటు వేసి భోజనానికి వెళ్లాడు. -
అబుదాబిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
రాయికల్: అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫస్ట్ సెక్రటరీ జార్జీ జార్జ్, తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాశ్ హాజరయ్యారు. డప్పుచప్పుళ్లు, జానపద నృత్యాలు, చిన్నారుల ఆటపాటతో ఆడిటోరియం మారుమోగింది. ఎందరో త్యాగఫలమే రాష్ట్రమని, అభివృద్ధికి ప్రతిఒక్కరూ ముందుండాలని ఆకాంక్షించారు. ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశ్రీనివాస్రావు, ప్రతినిధులు పీజీ థామస్, లిమ్సన్, దివాకర్, వివేక్, రమేశ్, వినాయక్, సంజయ్, కిరణ్కుమార్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. లైవ్ అథెంటికేషన్ కోసం హైదరాబాద్కు..మెట్పల్లి: పట్టణానికి చెందిన మానసిక వికలాంగులైన ఇద్దరు సోదరులు సంతు, సాయిలు హైదరాబాద్లోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్నారు. వీరికి చేయూత పథకం కింద వికలాంగుల పెన్షన్ అందుతోంది. ప్రభుత్వం లబ్ధిదారుల పెన్షన్లను కొనసాగించడం కోసం ఇటీవల లైవ్ అథెంటికేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇద్దరు అక్కడి నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ ప్రత్యేక చొరవ చూపి ఉద్యోగి రాకేశ్ను ఆదివారం వారు ఉంటున్న హాస్టల్కు తీసుకవెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరి నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. రక్తదానం చేయండిజగిత్యాల: ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని డిప్యూటీ డీఎంఅండ్హెచో శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ ఆస్పత్రిలో రెడ్క్రాస్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానంతో ఎందరో ప్రాణాలు నిలుస్తాయన్నారు. రక్తదానం చేసిన యువకులకు ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో టీవీ.సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. కొండగట్టులో ఏలూరు మేయర్ భర్త పూజలుమల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ భర్త ముజబర్ రహమాన్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఆగ్రహించిన మహిళలు శనివారం రాత్రి రోడ్డుపై బండరాళ్లు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా జగిత్యాల నుంచి రాయికల్, రాయికల్ నుంచి జగిత్యాల వచ్చే ఆర్టీసి బస్సులు చల్గల్ బస్టాండ్ వద్ద బస్సులు ఆపడం లేదని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న రూరల్ ఏఎస్సై సత్తయ్య సంఘట స్థలానికి చేరుకుని బస్సులు ఆపేలా చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో బండరాళ్లు తీశారు. -
పిల్లలూ.. బ్యాగులు సర్దుకోండి..!
జగిత్యాల: వేసవి సెలవులు ముగిశాయి. ఇన్ని రోజులు ఆటపాటలతో గడిపిన పిల్లలు బడిబాట పట్టే సమయం ఆసన్నమైంది. నేటినుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలలను సిద్ధం చేసి ఉంచారు. తొలిరోజే అమావాస్య కావడంతో పిల్లల హాజరుశాతం అంతంతమాత్రంగానే ఉండనుంది. పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేకరకాల చర్యలు చేపట్టింది. ఇటీవలే ఎమ్మార్సీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మన ఊరు మన బడి పథకం కింద జిల్లాకు రూ.1.19కోట్లు మంజూరు కాగా.. మరమ్మతులు, వివిధ కార్యక్రమాల కోసం 277 స్కూళ్లను ఎంపిక చేశారు. కానీ.. 48స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, పాఠశాలలకు కలర్లు, బెంచీలు, కిచెన్షెడ్స్ వంటివి 1087 పనులు మంజూరు కాగా.. కేవలం 450 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా కొన్నిచోట్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బడిబాటతో పెరిగిన విద్యార్థుల సంఖ్య ఈనెల 4 నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యాశాఖ అధికారులు అదనంగా రెండు వేల మందికి కొత్తగా అడ్మిషన్లు ఇవ్వగలిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందంటూ ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలలకు రప్పిస్తున్నారు. పారిశుధ్యం అస్తవ్యస్తం పాఠశాలల్లో గతంలో అమ్మ ఆదర్శ పథకం కింద స్కావెంజర్లను నియమించారు. కొన్నిచోట్ల నియామకం లేక పారిశుధ్యం అంతంతగానే ఉంది. టాయిలెట్స్ పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. అధికారులు స్పందించి పారిశుధ్యం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుంది. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించాం. విద్యార్థులకు మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. – రాము, డీఈవో -
బైక్ పైనుంచి పడి మహిళకు గాయాలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదవాశాత్తు బైక్పై నుంచి ఓ మహిళ కిందపడగా.. తలకు తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా కమల్కోటి గ్రామానికి చెందిన సాయవ్వ శనివారం ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు కొండగట్టుకు బయల్దేరింది. ఘాట్రోడ్డు వద్ద బైక్ పైనుంచి అదుపుతప్పి కింద పడింది. సాయవ్వ తలకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది జ్యోతి, శ్రీనివాస్ బాధితురాలికి ప్రథమ చికిత్స చేసి, జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ప్రభుత్వ బడుల్లో చేర్పిద్దాం
మన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో,ప్రత్యేక గుర్తింపు స్కూల్లో కాకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేర్పిద్దాం..గురుకుల,నవోదయ , మోడల్ పాఠశాలలో చేర్పించి ఉన్నత స్థాయిలో నిలబెడదాం...ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి లక్షలు లక్షలు ధారపోసేకన్నా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పది మంది పిల్లలను చేర్పిద్దాం.. ఇద్దరిది ఒకే స్థాయి విద్యా అయినప్పుడు డబ్బులు ఎందుకు వృథా చేయాలి అవకాశాలను ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు అనేది తల్లిదండ్రులు ఆలోచించాలి. మోటే శివకుమార్ గ్రామం: కాకునూరు, మండలం: కేశంపేట. జిల్లా: రంగారెడ్డి -
రక్తదాతలూ.. ప్రాణదాతలే..
కోల్సిటీ(రామగుండం): కుటుంబ సభ్యులు, బంధువులే రక్తదానానికి వెనకడుగు వేస్తున్న ఈరోజుల్లో తామున్నామని రక్తదాతలు ముందుకు వస్తున్నారు. బాధితులతో సంబంధం లేకున్నా రక్తదానం చేసి రక్తసంబంధీకులవుతున్నారు. రక్తంలోని వివిధ గ్రూపులను కనుగొన్న నోబెల్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త కార్ల్ లాండ్ స్టీనర్ జయంతి సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 14న ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’ నిర్వహిస్తోంది. సామాజిక మాధ్యమాలే వేదిక అత్యవసర సమయంలో రక్తదానం చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యువకులు, సేవా సంస్థలు బృందాలుగా ఏర్పడ్డారు. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా రక్తదాతలను అనుసంధానిస్తూ అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారు. ఒక్కసందేశంతోనే రక్తదాతలు స్పందించి ప్రాణాలు కాపాడుతున్నారు. 300 మి.లీ. చొప్పున సేకరణ ఒక్కో వ్యక్తి శరీరంలో సగటున ఐదు లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవ్యక్తి ప్రతీ మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. ఈ సమయంలో 300 మి.లీ. రక్తం మాత్రమే సేకరిస్తారు. సేకరించిన రక్తం కొన్నిగంటల్లోనే తిరిగి శరీరంలో ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. ఒక యూనిట్.. మూడు ప్రాణాలకు జీవం రక్తంలో ఎర్ర రక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా అనే మూడు భాగాలు ఉంటాయి. రక్తదానం చేసిన ఒక యూనిట్ రక్తాన్ని వివిధ భాగాలుగా విడదీసి అవసరాన్ని బట్టి వినియోగిస్తారు. అందుకే ఒక్క రక్తదానం ద్వారా మూడు ప్రాణాలకు జీవం పోసే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. బరువు కనీసం 45 కిలోలు ఉండాలి 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉండాలి నిమిషానికి 60 నుంచి 100సార్లు నాడి కొట్టుకోవాలి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 12.5గ్రాములకు పైగా ఉండాలి ఆరోగ్యంగా ఉండి, వైద్యుల సూచనల మేరకు రక్తదానం చేయాలి. ఒకయూనిట్.. మూడు ప్రాణాలకు జీవం నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం -
12 మంది రక్తదానం చేశారు
పన్నేండేళ్ల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న. మా ఊరోళ్లు బాబుకు గుండె ఆపరేషన్ కోసం కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 12 యూనిట్ల రక్తం సిద్ధం చేసుకోవాలని చెప్పారు. వాళ్లు నాకు ఫోన్చేశారు. వాళ్లెవరో నాయకు తెలియదు కానీ, మా గ్రామస్తులని తెలియంతో నాతోపాటు నా మిత్రులు 12 మందిమి కలిసి రక్తదానం చేశాం. ఈ సంఘటన నన్ను ప్రేరేపించింది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు రక్తదానం చేశా. – పబ్బాల శ్రీనివాస్, సూపరింటెండెంట్, రామగుండం -
పశ్చాత్తాపం
రంగాపురం అనే గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు వుండేవాళ్ళు. ఇద్దరూ కలిసి బట్టల వ్యాపారం చేసేవాళ్లు. వ్యాపారానికి కావల్సిన పైకం ఒకరికొకరు సర్దుకునేవారు. వ్యాపారం అలా సాఫీగా సాగిపోతూ వచ్చింది. కొద్దిరోజులు జరిగిన పిమ్మట రాము వ్యాపారంలో ఎక్కువ లాభాలు గడిస్తూ వచ్చాడు. అది సోముకు మింగుడు పడలేదు. ఎలాగైనా రాము చేసే వ్యాపారాన్ని దెబ్బతీయాలని పన్నాగం పన్నాడు. ఒకరోజు ఇదరూ కలిసి వ్యాపార నిమిత్తం పల్లెలకు బయలుదేరి వెళ్ళారు. తిరిగి ఇంటికి వచ్చేపాటికి సాయంత్రం కావొచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఊరిలో జనాలు రాము బట్టలు నిల్వ చేసిన గోడౌన్ వద్దకు పరుగులు తీస్తున్నారు. తీరా వెళ్లి చూస్తే బట్టలు మొత్తం బూడిదైపోయాయి. ఎవరో అగ్గి పెట్టారు. జరిగిన నష్టానికి రాము చింతించాడు. సోము ఓదార్చాడు. కొంతకాలం వ్యాపారానికి దూరమైనాడు రాము. కొన్నాళ్లు జరిగిన తర్వాత సోము అనారోగ్యంతో మంచాన పడ్డాడు. తన వ్యాపారం ఆగిపోయింది. డబ్బుతో చాలా ఇబ్బంది పడ్డాడు. అది గ్రహించిన రాము సోముకు ఆర్థిక సహాయం అందించి అనారోగ్యం నయం చేయించాడు. సోము మళ్లీ యథాప్రకారం వ్యాపారం మొదలు పెట్టాడు. మరొక రోజు రాము ఇంటికి ఒక సంచి పట్టుకుని సోము వెళ్ళాడు. వెళ్లీ వెళ్లగానే సోము ఉన్నఫళంగా రాము కాళ్ళ మీద పడి బోరున విలపించాడు ‘ నన్ను క్షమించు మిత్రమా.. నీలో ఇంత మంచితనం వుందని గ్రహించలేకపోయాను. నువ్వు బాగుపడుతుంటే ఓర్వలేక పోయాను. మీ బట్టల నిల్వ వుంచిన గోడౌనుకు నేనే అగ్గి పెట్టించాను. నీ ఎదుగుదలను ఆపాలనుకున్నాను కానీ ఆపలేకపోయాను నీ మంచి మనసే నాకు ప్రాణబిక్ష పెట్టింది.. చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు ఐనా నేను వినలేదు ఫలితం అనుభవించాను ’ అంటూ పశ్చాత్తాపం చెంది. రాముకు నష్ట పరిహారం చెల్లించాడు సోము ‘మంచికి మంచి, చెడుకి చెడు ఉన్నాయి కాబట్టే మానవత్వం ఇంకా బతికుంది ’ అని సోముని క్షమించాడు రాము. – నరెద్దుల రాజారెడ్డి -
18మందితో కమిటీ
మా గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం 18 మందితో కలిసి కమిటీని ఎన్నుకున్నాం. వీరందరి సహకారంతో గ్రామంలో 1250 ప్లేట్లు, 600 గ్లాసులు సమకూర్చుకున్నాం. ఎక్కడ శుభకార్యం జరిగినా ఉచితంగా వాటిని అందజేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నాం. – సామల్ల వేణు, ఇటిక్యాల కూలీలు విస్తార్లు కుడుతున్నారు ఉపాధి కూలీలు పనులు ముగిసిన అనంతరం విస్తరాకులు కుట్టి.. అందులోనే భోజనం చేస్తున్నాం. మిగిలిన వాటిని దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఉపాధి డబ్బులతోపాటు, విస్తరాకులు కుట్టడం ద్వారా కూడా ఉపాధి కూలీలకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. – మెక్కొండ రాంరెడ్డి, ఆలూరు స్టీల్ ప్లేట్లు వినియోగించాలి ఇటిక్యాల, ఆలూరు గ్రామాలతోపాటు అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ నివారణపై సమరశంఖం పూరించాలి. స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వినియోగించడం వల్ల కొంతమేరకు క్యాన్సర్ వంటి వ్యాధులను నియంత్రించవచ్చు. యువత, మహిళలు ముందుకు రావాల్సిన అవసరముంది. – చిరంజీవి, ఎంపీడీవో -
ప్లాస్టిక్కు బైబై.. స్టీల్ ప్లేట్లకు జై
● ఇటిక్యాలలో యువత కొత్త నిర్ణయం ● ఏ శుభకార్యమైనా ప్లాస్టిక్ ప్లేట్లు నిషేధం ● విస్తరాకుల తయారీలో ఉపాధి కూలీలురాయికల్: పాలిథిన్ ప్లేట్ల వాడకంతో అనారోగ్యంతోపాటు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామంలోని 18 మంది యువకులు గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ప్లాస్టిక్ ప్లేట్లను వినియోగించద్దని తీర్మానించారు. నెల క్రితం సొంత డబ్బులు వెచ్చించి 1250 స్టీల్ ప్లేట్లు, 600 గ్లాసులు కొనుగోలు చేశారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా వారికి ఉచితంగా వీటిని అందిస్తున్నారు. ఇప్పటివరకు లక్షకు పైగా ప్లాస్టిక్ ప్లేట్లను వినియోగించకుండా చూడగలిగారు. రాయికల్ మండలంలో ఇటిక్యాల మేజర్ గ్రామపంచాయతీ. ఇక్కడ సుమారు ఎనమిది వేల మంది జనాభా, 1800 గృహాలు, 25 నుంచి 30 వరకు కుల సంఘాలు ఉన్నాయి. ఏ శుభకార్యం జరిగినా.. ప్రజలందరూ ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులే వినియోగించేవారు. ఇది పర్యావరణానికి పెనుముప్పుగా మారిందని గమనించిన 18 మంది యువకులు ప్లాస్టిక్ ప్లేట్లను ఎలాగైనా నిర్మూలించాలని సంకల్పించారు. ప్రజలకు ఏదైనా ఉచితంగా ఇస్తేనే వారిలో మార్పు సాధ్యమని భావించి.. సొంత డబ్బులు వెచ్చించి సుమారు 1250 వరకు స్టీల్ ప్లేట్లు, 600 గ్లాసులు కొన్నారు. గ్రామంలో జరిగే ఏ శుభకార్యామైనా వీటిని ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ఈ ప్లేట్లు, గ్లాసులనే వినియోగిస్తున్నారు. దీనికి గ్రామంలోని కొందరు దాతలు కూడా ముందుకు వచ్చి ప్లేట్లను వితరణ చేస్తుండడం గమనార్హం. ఆదర్శం.. ఆలూరు ఉపాధికూలీలు విస్తరాకుల్లోనే భోజనం చేయాలన్న అధికారుల సూచనను మండలంలోని ఆలూరు గ్రామస్తులు విధిగా పాటిస్తున్నారు. ఉపాధి పనుల వద్ద పని ముగిసిన అనంతరం వందమంది సుమారు అరగంటపాటు మోదుగు ఆకులు సేకరించి విస్తార్లు కుడుతున్నారు. అందులోనే భోజనం చేస్తున్నారు. మిగిలిన విస్తార్లను దుకాణాల్లో విక్రయిస్తున్నారు.ఇటిక్యాలలో స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తున్న యువకులుఆలూరులో విస్తారాకుల తయారీలో ఉపాధిహామీ కూలీలు -
పిల్లలు మీరూ పంపండి...
వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా... -
మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత
● ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాల: మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ఐఎంఏ చేపట్టిన యాంటీ డ్రగ్ 3 కే రన్ మంచి కార్యక్రమమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జూన్ 26 న నిర్వహించనున్న యాంటీ డ్రగ్ 3కే రన్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను లక్ష్యంగా చేసుకుని సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల వ్యసనం దేశభద్రతకు తీవ్రమైన ముప్పుగా మారిందన్నారు. యువతలో అవగాహన పెంపొందించేందుకు ఐఎంఏ చేస్తున్న సేవలు అమోఘమని చెప్పారు. 3కే రన్ను విజయవంతం చేయాలని కోరారు. ఐఎంఏ కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత నిర్మాణమే ప్రధాన లక్ష్యమని, యువత మేల్కొని డ్రగ్స్ బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆరోగ్యవంతమైన భవిష్యత్ కోసం దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కోశాధికారి సుధీర్కుమార్, వడ్లూరి శ్రావణ్కుమార్, విజయ్ పాల్గొన్నారు. -
వేసవి వీడ్కోలు
వేసవి సెలవులు మధుర జ్ఞాపకాలు, ఆటలతో నిండిన ఆనంద క్షణాలు. బంధువులతో నవ్వులు పంచుకున్నాం, ప్రతి రోజును హాయిగా గడిపేశాం. ఇప్పుడు మళ్లీ పాఠశాల పిలుపు, కొత్త పుస్తకాలతో జ్ఞాన వెలుగు. కొత్త తరగతి, కొత్త ఆశయం, విజయానికి ఇది కొత్త ప్రారంభం. కొత్త జీవితం, కొత్త యుగం, లక్ష్యాల వైపు వేస్తాం అడుగులు దృఢం. క్రమశిక్షణతో ముందుకు సాగుదాం, కొత్త కమిట్మెంట్తో కలలను చేరుదాం. వేసవి జ్ఞాపకాలను హృదయంలో ఉంచుకొని, కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ఆహ్వానిద్దాం! – దూపాటి హరిప్రసాద్ షాపూర్ నగర్, హైదరాబాద్ -
సంఘాలతో మహిళల ఆర్థికాభివృద్ధి
మల్లాపూర్: గ్రామాల్లో వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేయడమే ధ్యేయమని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. మండలంలోని గుండంపల్లిలో రూ.10లక్షలతో చేపట్టే సీసీ రోడ్డుకు శనివారం భూమిపూజ చేశారు. సిరిపూర్లో మహిళాసంఘానికి రూ.3లక్షల ప్రోసిడింగ్ పత్రాలు అందజేశారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సర్పంచ్లు దప్పుల పద్మ, పెంట సౌజన్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య, నాయకులు పాల్గొన్నారు. అనంతరం రాఘవపేట, ముత్యంపేట, నడికుడ, గుండంపల్లి, కుస్తాపూర్ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు రూ.4.27 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పథకాలను వినియోగించుకోవాలిమెట్పల్లి: ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అర్హులందరూ విని యోగించుకోవాలని నర్సింగరావు అన్నారు. 47 మందికి మంజూరైన రూ.17.72లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. గంగపుత్ర సంఘం భవనానికి రూ.3లక్షల ప్రొసీడింగ్ కాపీ అందించారు. మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మాజీ జెడ్పీటీసీ ఎలాల జలపతిరెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు రైసుద్దీన్ నాయకులు పాల్గొన్నారు. వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు -
పిల్లల్లారా..రారండి..
చల్లని మమతల చినుకుల్లారా... వెచ్చని సమతల బుడుగుల్లారా పదర పదర పదరా... బడులకు కదం తొక్కి పదరా... అక్షరమే అందాల హారం విద్యయే జీవిత సారం పదర పదర పదరా... బడులకు కదం తొక్కి పదరా...గురువు మాటలే గంగాజలం చదువు బాటలే బంగారు ఫలం పదర పదర పదరా... బడులకు కదం తొక్కి పదరా... ఆటపాటల హరివిల్లులై ఆశల తోటలో చిరుజల్లులై పదర పదర పదరా... బడులకు కదం తొక్కి పదరా...పుస్తకమే ప్రగతికి రూపం పాఠశాలే జగతికి దీపం పదర పదర పదరా... బడులకు కదం తొక్కి పదరా... నేటి బాలలే రేపటి భవిత దేశ ప్రగతికి వెలుగుల జనత పదర పదర పదరా... బడులకు కదం తొక్కి పదరా..డాక్టర్ కటుకోఝ్వల రమేశ్ కవి, రచయిత, ఖమ్మం జిల్లా -
ఇందిరమ్మ చీరలు బల్దియా వాహనంలో..
జగిత్యాల: జిల్లాకేంద్రంలో ఇందిరమ్మ చీరల తరలింపు వివాదాస్పదంగా మారింది. మెప్మా కార్యాలయం నుంచి వివిధ వార్డులకు చీరలను పంపిణీ చేసేందుకు మున్సిపల్కు సంబంధించిన చెత్త వాహనాన్ని వినియోగించడం.. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం కింద పంపిణీ చేసే చీరలను చెత్త తరలించే వాహనాల్లో తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని మండిపడుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ వివరణ కోరగా.. ఇందిరమ్మ చీరలను ఆటోలో తీసుకుని వెళ్లాలని సూచించామని, కొందరు మున్సిపల్ వాహనంలో తీసుకెళ్లారని దృష్టికి వచ్చిందని, విచారణ చేపడతామని చెప్పారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు -
నాన్నకు జేజేలు
కన్నవారి ఉన్నతికోసం తపించేవాడు నాన్నంటే కలనైనా బిడ్డలకోసం యోచించేవాడు నాన్నంటే బడబాలనం తనలోవున్నా చల్లనిసంద్రంలా వుంటాడు బాధలెన్నో తనలోవున్నా దాచేసేవాడు నాన్నంటే తనపిల్లల సౌఖ్యం కోసం కొండనైనా పిండిచేస్తాడు పిల్లల సంతోషమే స్వర్గమనీ తలచేవాడు నాన్నంటే నీ భవితకై నిరంతర తపన నిను శిఖరానికి చేర్చేనిచ్చెన నీ కోసం తన ఆయువునైనా ఇచ్చేవాడు నాన్నంటే ఇంటికోసం సర్వస్వము ధారపోసే త్యాగధనుడు కొవ్వొత్తిలా ఓ దేవా! వెలుగునిచ్చి కరిగేవాడు నాన్నంటే – బూర దేవానందం కవి, రచయిత, సిరిసిల్ల -
కో–ఆప్షన్ ఎన్నిక ఎప్పుడో..?
కథలాపూర్: గ్రామ పంచాయతీ ఎన్నికలు గతేడాది డిసెంబర్లో ముగిశాయి. పాలకవర్గాలు కొలువుదీరి ఆరు నెలలు గడుస్తున్నా.. కో–ఆప్షన్ సభ్యుల నియామకం జరగకపోవడంతో పదవులు ఆశిస్తున్న ఆశావహులు నిరాశలో ఉన్నారు. వాస్తవానికి పాలకవర్గం కొలువుదీరిన 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. పంచాయతీ ఎన్నికల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు జరగాయి. బల్దియాల్లో కో– ఆప్షన్ సభ్యులను గతంలోనే నియమించారు. కానీ.. పంచాయతీల్లో జాప్యం చేస్తుండడంపై పలువురు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీకి ముగ్గురు కో– ఆప్షన్ సభ్యులు జిల్లాలో 385 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పాలకవర్గాలకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి కో–ఆప్షన్ సభ్యులకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రతి పంచాయతీలో ముగ్గరు చొప్పున సభ్యులను నియమించాలి. వారికి వార్డుసభ్యులతో సమాన హోదా ఉంటుంది. ముగ్గురిలో ఒకరు రిటైర్డ్ ఉద్యోగి లేదా అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్, మరొకరు గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు, ఇంకొకరు పంచాయతీలకు స్థలం ఇచ్చిన దాతలు లేదా భారీగా విరాళాలు ఇచ్చిన దాతలు, గ్రామాభివృద్ధికి దోహదపడే ఎన్ఆర్ఐలను నియమించాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలో 385 గ్రామపంచాయతీలకు గాను 1,155 మంది సభ్యులకు అవకాశం ఉంది. సభ్యుల అధికారాలు ఇవే.. కో–ఆప్షన్ సభ్యులకు పంచాయతీ సమావేశాల్లో పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చే హక్కు ఉంటుంది. వీరికి వార్డుసభ్యులతో సమానంగా ప్రోటోకాల్, గౌరవం దక్కుతుంది. సమావేశాల్లో చర్చించి అవకాశం ఉన్నప్పటికీ తీర్మానాల ఆమోదంలో మాత్రం ఓటు హక్కు ఉండదు. కేవలం పంచాయతీకి సలహాదారులుగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపకల్పనలో వీరి పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రభుత్వం దృష్టిసారించి గ్రామపంచాయతీ కో–ఆప్షన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై డీపీవో మదన్మోహన్ మాట్లాడుతూ.. ఎన్నిక విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. ఎదురుచూస్తున్న ఆశావాహులు జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు 1,155 మందికి అవకాశం -
నృసింహుని సన్నిధిలో దేవాదాయ కమిషనర్ పూజలు
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు పూజలు చేశారు. ముందుగా ఆయన కు ఆలయం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, దేవస్థానం సిబ్బంది తదితరులున్నారు. లండన్లో తెలంగాణ డేరాయికల్: లండన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను శనివారం నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే (టాక్) బతుకమ్మలతో ప్రదర్శన, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారత హైకమిషన్ పెరియ స్వామికుమరన్ టాక్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. టాక్ అధ్యక్షుడు కడుగుల రత్నాకర్, వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, కమ్యునిటీ అఫైర్స్ చైర్పర్సన్ ముప్పాళ్ల గణేశ్, ప్రతినిధులు నవీన్, సురేశ్, సుప్రజ, నవ్య, తన్మయ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి● డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ గొల్లపల్లి: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాపల్లెలో సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ నివారణ చర్యల్లో భాగంగా పర్యటించారు. పరిసరాలను పరిశీలించారు. డెంగీ ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. రక్తదానం ప్రాముఖ్యతను అధికా రులు, ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఏఎంవో సత్యనారాయణ, ఏఎన్ఎంలు దేవేంద్ర, పుష్పలత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్లను తరచూ తనిఖీ చేయాలిధర్మపురి: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి పోలీస్స్టేషన్ను తరచూ తనిఖీలు చేయాలని ఎస్పీ అశోక్కుమార్ సీఐ రాంనర్సింహారెడ్డిని ఆదేశించారు. శనివారం ధర్మపురి పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో వేగం పెరగాలన్నారు. సైబర్ మోసాలు, వివిధ సామాజిక అంశాలు, ట్రాఫిక్ నియమాలపై, అవగాహన కల్పించాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు గ్రామాల్లో ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు వివరించాలన్నారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, ఎస్సైలు మహేష్, రవీందర్, సిబ్బంది తదితరులున్నారు. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోండి● కలెక్టర్కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచన మల్యాల: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. మండలంలోని తక్కళ్లపల్లికి చెందిన గొల్లపల్లి తిరుపతి, కొడిమ్యాల మండలం నమిలకొండకు చెందిన సయ్యద్ సలీం, మెట్పల్లి మండలం గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫీక్ దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెల్సిందే. వారి మృతదేహాలను స్వగ్రామానికి తరలించేందుకు దుబాయ్ వెళ్లిన సత్యం.. తిరిగి వచ్చారు. శనివారం కలెక్టర్కు ఫోన్ చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. -
వామ్మో.. ఫీజులు
జగిత్యాల: పాఠశాలలు మరో రెండు రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే తల్లిదండ్రులు పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బుక్స్, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారు. విద్యార్థుల తల్లి దండ్రులు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తుండడంతో ప్రైవేటు యాజమాన్యాలు వారి ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆ ఫీజులను చూసి భయాందోళనకు గురవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉన్నప్పటికీ అంతస్థాయిలో లేద న్న భావన ప్రజల్లో ఉంది. దీంతో ప్రభుత్వ పాఠశాలకు పంపించేందుకు కొంత విముఖత చూపుతున్నారు. చేసేదేమీలేక అధిక ఫీజులు చెల్లించి అయినా ప్రైవేటులో చదివిపించేందుకే మొగ్గుచూపుతున్నారు. ఫీజుల నియంత్రణ లేకపోవడంతో మధ్య, పేద తరగతి ప్రజలను ఆసరాగా చేసుకుని ప్రైవేటు యజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైమరీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుకు కూడా తడిసిమోపెడవుతోంది. ఫస్ట్క్లాస్ నుంచి 10వ తరగతి వరకు రూ.లక్షల్లో ఫీజు అవుతోంది. మధ్యతరగతి కుటుంబాలపై భారం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చూసి మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఒక స్కూల్ ఫీజే కాకుండా పుస్తకాలు, పిల్లలకు యూనిఫాంతోపాటు, టై, బెల్ట్, షూలు కూడా యాజమాన్యాలే విక్రయిస్తూ వాటికి సపరేట్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వారికి ఫీజులు కట్టాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది అప్పు చేసి మరీ చదివిస్తున్నారు. ఆటో, కారు, ప్రైవేటు కంపెనీల్లో చేసే ఉద్యోగుల పిల్లలను ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులతో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంత ఫీజులైనాగానీ ఆర్థిక ఒత్తిడిని భరించి కడుతున్నారు. పిల్లలకు మంచి చదువు అందిస్తే వారి భవిష్యత్ బాగుంటుందనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఆకర్షణీయమైన పేర్లతో.. జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను ఆకట్టుకునేలా వివిధ సిలబస్లు అంటూ వారి మభ్యపెడుతున్నాయి. కొన్ని స్కూళ్లకు అనుమతి లేకున్నా ఈ టెక్నో, ఐఐటీ, డీజీ అని తోకలు తగిలిస్తూ పిల్లల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ పాఠశాలల్లో చెప్పే ఉపాధ్యాయులను ఆకర్షణీయ రూపంలో ప్రింట్ చేసిన బ్రోచర్లతో ఇంటింటికీ తిప్పుతూ ప్రచారం చేయిస్తున్నారు. స్కూళ్లలో జాయిన్ చేసుకుంటున్నారు. మొదట వారికి చదువు బాగుంటుందని, రకరకాలుగా వారిని మభ్య పెడుతూ స్కూళ్లలో జాయిన్ చేసుకుంటున్నారు. ఫీజు కడితేనే హాల్టికెట్స్ మొదట నెలరోజులపాటు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయరు. అనంతరం ఎఫ్–1, 2, 3, 4 పరీక్షలంటూ వారికి ఫీజు కడితేనే హాల్టికెట్లు అంటూ ఒత్తిడి తెస్తున్నారు. పిల్లలు హాల్టికెట్స్ ఇవ్వ డం లేదంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో డబ్బులున్నా లేకున్నా ప్రైవే టు పాఠశాల యాజమాన్యాలకు చెల్లిస్తుంటారు. వసతులు అంతంతే.. ప్రైవేటు పాఠశాలల్లో వసతులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. కొందరు సిటీ మధ్యలో ఏర్పా టు చేయగా.. కొందరు శివారులో స్కూళ్లను ఏర్పా టు చేస్తున్నప్పటికీ పెద్దపెద్ద ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటూ క్లాస్రూమ్లను నిర్వహిస్తున్నారు. అందులో పిల్లలను ఇరుకు గదుల్లోనే క్లాసులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లయితే ఏకంగా సెల్లార్లోనే నిర్వహిస్తున్నారు. పేరున్న స్కూళ్లని ఈవిధంగానే చేపడుతున్నారు. ఫైర్ సేఫ్టీ గానీ, ప్లేగ్రౌండ్స్గానీ ఇక్కడ ఉండవు. వీటిపై విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. నిర్దేశించిన ధరలకంటే ఎక్కువ ధరలు నిర్ణయించి అందినంతా దోచుకుంటున్నారు. నిబంధనలు ఎక్కడ..? ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో ప్రకారం ప్రైవేటు బడిల్లో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీఏర్పాటు చేయడంతోపాటు, వసూలు చేసిన ఫీజులో 5 శాతం స్కూల్ యాజమాన్యం కింద.. 15శాతం పాఠశాల నిర్వహణ, 15 శాతం స్కూల్డెవలప్మెంట్, 15శాతం సిబ్బంది ప్రయోజనాలు, 50 శాతం వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు స్పందించి ఫీజులు తగ్గించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఏటేటా పెంచుతున్న యాజమాన్యాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న పాఠశాలలు వ్యాపారమయంగా మార్చిన విద్య -
ఇద్దరు దొంగల అరెస్ట్
జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలకేంద్రంలోని రామాలయంలో గత నెల 25న దొంగతనం చేసిన వ్యక్తితో పాటు, అతనికి సహకరించిన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గీత తెలిపారు. రామాలయం నుంచి 15తులాల రెండు వెండి కిరీటాలు గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు విచారణలో సారంగాపూర్కు చెందిన తునికి గంగచారిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రామాలయంతోపాటు, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి రెండు వెండి కిరీటాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. వాటిని జగిత్యాలలోని కట్ట లక్ష్మణచారి వద్ద ముక్కలుగా చేసి.. పూదెల గణేశ్ వద్ద కరిగించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకున్నట్లు చెప్పాడు. గంగచారితోపాటు, కట్ట లక్ష్మణచారిని అరెస్ట్ చేసి వారి నుంచి 13 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
దుబాయ్లో బొంకూర్ వాసి అదృశ్యం
జగిత్యాలక్రైం: గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన వెల్పుగొండ మల్లేశ్ దుబాయ్లో అదృశ్యమైనట్లు ఇక్కడి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. మల్లేశ్ దుబాయ్ వెళ్లివస్తున్నాడు. 8 నెలల క్రితం వెళ్లిన ఆయన ఈనెల 9 నుంచి కనిపించడం లేదంటూ తోటి కార్మికులు ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మల్లేశ్ ఏమయ్యాడోనని కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. లారీ ఢీకొని కార్మికుడి దుర్మరణం పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన కార్మికుడు దుర్గం మల్లయ్య(55) శనివారం లారీ ఢీకొని మృతిచెందాడు. స్థానికులు, బసంత్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. మల్లయ్య బసంత్నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో పర్మినెంట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున బైక్పై ఉదయం షిఫ్టు విధులకు వెళ్తున్నాడు. ఈక్రమంలో ధర్మారం క్రాస్రోడ్డు పుట్నూర్ వైపువెళ్తున్న వాహనం ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోద చేసుకున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ పర్మినెంట్ కార్మికసంఘం అధ్యక్షుడు మల్క రామస్వామి, ప్రధాన కార్యదర్శి రమేశ్ మౌర్య తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. మృతుడి కుటుంబానికి సానూభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిబుగ్గారం: బుగ్గారం మండలం చిన్నాపూర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన తీగల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు అంజన్న దర్శనం ముగించుకుని కారులో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. చిన్నాపూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మబ్బు పుష్పలతకు (48) తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే జగిత్యాలకు.. అక్కడి నుంచి కరీంనగర్ తరలిస్తుండగా మృతిచెందింది. తీగల రాజేందర్ ఫిర్యాదు మేరకు ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన మాదాసు ప్రదీప్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. -
రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లే
జగిత్యాలజోన్: సివిల్, క్రిమినల్ కేసుల్లో రాజీపడితే ఇద్దరూ గెలిచినట్టేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 17,396 కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయన్నారు. మార్చిలో జరిగిన మొదటి జాతీయ లోక్ అదాలత్లో 3,033 కేసులు పరిష్కరించామని, ఈనెల 20న జరిగే లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం జూన్ 20 వరకు వేచి చూడకుండా, ప్రతీ రోజు లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టులపై భారం తగ్గించేందుకు, అత్యధిక కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేలా పోలీసులు, న్యాయవాదులు, ఇన్సూరెన్సు సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి నాగేశ్వర్రావు మాట్లాడుతూ, సామరస్యంగా కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ను ఉపయోగించుకోవాలని సూచించారు. కక్షిదారులు సత్వర న్యాయం పొందేందుకు చక్కని అవకాశమన్నారు. -
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి
జగిత్యాల: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు ఉచితంగా జ్యూట్ బ్యాగుల పంపిణీ చేసి మాట్లాడారు. వీధి వ్యాపారులు ప్లాస్టిక్ను పూర్తిగా నియంత్రించి కాలుష్య నియంత్రణ మండలి అందిస్తున్న క్లాత్, జ్యూట్ బ్యాగులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫుట్పాత్లు ఆక్రమించి షెడ్లు వేయకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కాలుష్య నియంత్రణ మండలి నోడల్ ఆఫీసర్ మహేశ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, చందు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కొత్త సబ్స్టేషన్లు కథలాపూర్(వేములవాడ): నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అదనంగా కొత్తగా సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శనం పేర్కొన్నారు. శుక్రవారం కథలాపూర్ మండలం సిరికొండలో 33/11 కేవీ, కథలాపూర్లో 220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులు పరిశీలించారు. సిరికొండ సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ తరలింపు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ నెల 30 లోగా పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఆయన వెంట డీఈలు మధుసూదన్, గంగారాం, ఏడీఈ రఘుపతి, ఏఈలు దివాకర్రావు, శ్రీనివాస్, రహీం, నవీన్కుమార్ ఉన్నారు. -
గాలివాన బీభత్సం
రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు గాలికి ఎగిరిపోయిన ఇంటి పైకప్పు వెల్గటూర్(ధర్మపురి): మండలంలో శుక్రవారం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం బీభీత్సం సృష్టించింది. ఈదురుగాలులకు గుల్లకోటలో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. చాలా సేపటి వరకు రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. ఇంటి రేకులు లేచి పోయి రోడ్డుపై పడ్డాయి. రాజక్కపల్లిలో రంగు సత్తయ్య ఇంటి పైకప్పు పూర్తిగా ఎగిరిపోయింది. ఇంట్లో ఉన్న సామగ్రి, నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. -
ముందుచూపు ‘కరువు’
కోరుట్ల: వేసవి నీటి ఎద్దడిని సరిగా అంచనా వేయడంలో మున్సిపల్ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగా పట్టణంలోని సగం వార్డుల్లో నీటి సమస్య తీవ్రతరంగా మారింది. ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో పట్టణంలోని చాలా చోట్ల బోర్లలో నీరు ఇంకిపోయింది. నెల రోజుల ముందు నుంచి భూగర్భజలాలు పడిపోతున్నా, వేడి తీవ్రత తగ్గని పరిస్థితులు ఉన్నా అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పెద్దగా పట్టింపు చూపలేదు. నీటి ట్యాంకర్ల కోసం కేవలం రూ. 5 లక్షలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. అంతంత మాత్రంగా భగీరథ జిల్లాలోని ముప్పావు వంతు గ్రామాలు, మున్సిపాల్టీలకు కో రుట్ల సెగ్మెంట్లోని ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రా మంలోని భగీరథ ప్లాంట్ ప్రధాన నీటి వనరుగా ఉంది. ఈ వేసవిలో డబ్బా వాటర్ గ్రిడ్కు శ్రీరాంసాగర్ నుంచి నీరు రా వడం క్రమేపీ తగ్గిపోయింది. దీంతో భగీరథ నల్లాల నుంచి నీటి సరాఫరా డీలా పడింది. రోజూ రావాల్సిన భగీరథ నీరు రోజు విడిచి రోజు వస్తుంది. సాధారణంగా మిషన్ భగీరథ నీటిని సాధారణ అవసరాలకు వాడుకుంటున్న జనం తాగునీటి కోసం బోర్లు, వాటర్ ప్లాంట్లను ఉపయోగిస్తున్నారు. చాలా చోట్ల బోర్లు ఎండిపోయాయి. ఫలితంగా నీటి సమస్య వేసవి ముగిసే సమయంలో తీవ్రతరంగా మారింది. దీనికి తోడు కోరుట్ల పట్టణంలో ఇప్పటి వరకు రెండుమూడు వాన జల్లులు మాత్రమే కురియడం సమస్యను మరింత పెంచింది. ముదురుతున్న సమస్య కోరుట్ల పట్టణంలో మొత్తం 33 వార్డులు ఉండగా తీవ్రమైన నీటి ఎద్దడి ఎనిమిది వార్డుల్లో ఉంది. మరో నాలుగు వార్డుల్లో వారం రోజులుగా నీటి సమస్య ముదురుతోంది. మిగిలిన వార్డుల్లోనూ నీటి సమస్య ఉన్నా పూర్తి స్థాయి తీవ్ర రూపం దాల్చలేదు. ఇంత తీవ్రమైన నీటి ఎద్దడిని ఊహించని అధికారులు మున్సిపాల్టీకి ఉన్న మూడు ట్యాంకర్లకు తోడు మరో మూడు ట్యాంకర్లను కాంట్రాక్టు కింద తీసుకున్నారు. ఆరు ట్యాంకర్లను నింపుకోవడానికి నీటి వనరులు లేకపోవడం మరో సమస్యగా మారింది. దాదాపు 12 వార్డుల్లో నీటి ఎద్దడి ఉండగా ఆరు ట్యాంకర్లు సరిపోవడం లేదు. కొన్ని వార్డుల్లో భగీరథ రాని రోజుల్లో వాటర్ ట్యాంకర్లు పంపుతుండగా మరికొన్ని వార్డుల్లో ఒకే రోజు పది వాటర్ ట్యాంకర్లు పంపినా నీటి ఎద్దడి తీరని దుస్థితి నెలకొంది. 12,13,14,15,2,1వ వార్డుల్లో నీటి ఎద్దడి ఫలితంగా తాగడానికి నీటి కొనుగోలు చేసి వాడుతున్నారు. కోరుట్ల వాగుకి సమీపంలో ఉన్న వార్డుల వారు బట్టలు ఉతుక్కోవడానికి వాగులోకి వెళ్తున్నారు. అక్కడ మురికి నీరు ఉండటంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుని జనం పాట్లు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
‘సర్’పై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
కోరుట్ల: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ‘సర్’పై బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. ప్రతీ బీఎల్ఏ వద్ద పీసీసీ అందజేసిన కిట్లు ఉండాలన్నారు. ఇప్పటికే ప లు రాష్ట్రాల్లో ఎన్నిక ల సంఘం అధికారులు నిర్వహించిన సర్ కార్యక్రమాల్లో లక్షలాది మంది ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. బీఎల్ఏలు శ్రద్ధ వహించి అర్హులైన వారి ఓట్లు రద్దు కాకుండా చూడాలన్నారు. అనంతరం సర్ పరిశీలకుడు రుద్ర సంతోష్ లైవ్ డెమోద్వారా అవగాహన కల్పించారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి సందయ్య, పీసీసీ జాయింట్ సెక్రటరీ బండ శంకర్, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల అధ్యక్షులు తిరుమల గంగాధర్గౌడ్, రైసొద్దీన్, మండల అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించాలి..
ఫిట్నెస్ ఉండాలిజగిత్యాలక్రైం: జిల్లాలో ఈనెల 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులను తరలించే బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి ఫిట్నెస్ పరీక్షలు చేయించుకొని ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది. కాగా, జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సంబంధించి 534 బస్సులు ఉండగా, ఇప్పటి వరకు 446 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. మరో 90 బస్సులు ఫిట్నెస్ చేసేందుకు పెండింగ్లో ఉన్నాయి. అలాగే 15 ఏళ్లు దాటిన బస్సులకు ఫిట్నెస్ ఇచ్చేందుకు రవాణా శాఖ అధికారులు నిరాకరించారు. ఫిట్నెస్ తప్పనిసరి గడువులోపు ప్రైవేటు స్కూళ్ల బస్సులకు యాజమాన్యాలు విధిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఇప్పటి వరకు ఆయా ప్రాంతాలకు చెందిన 446 పైగా బస్సులు ఫిట్నెస్ పరీక్షకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలలు ప్రారంభం కానుండటంతో ఫిట్నెస్ ఉంటేనే బస్సులు రోడ్లపై తిప్పాలని, నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఇలా.. -
ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్తో పర్యావరణానికి మేలు
కోరుట్లరూరల్: ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ప్రాసెసింగ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపడుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. మండలంలోని అయిలాపూర్లో రూ.40 లక్షలతో నిర్మించనున్న ప్లాస్టిక్ వేస్ట్ మెనేజ్మెంట్ ప్లాంట్కు గురువారం శంకుస్థాపన చేశారు. ప్లాంట్ ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సర్పంచ్ ద్యావనపెల్లి రామకృష్ణ, ఎంపీడీవో ఒదెల రామకృష్ణ, ఉపసర్పంచ్ సౌమ్యక్రాంతి, ఏఈ సుచరిత్, అధికారులు పాల్గొన్నారు. విద్యారంగ అభివృద్ధికి సహకారం కోరుట్ల: విద్యారంగం అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. పాఠశాలలు, కళాశాలల్లో వసతులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వసతుల కల్పన, సమస్యలను తన దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ -
కాలువలు ఇలా.. నీరు పారేదెలా?
పెగడపల్లి: ఎస్సారెస్పీ కాలువలు ఏళ్ల తరబడిగా మరమ్మతుకు నోచుకోవడంలేదు. కాలువల్లో చెట్ల పొదలు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. పలుచోట్ల డ్రాప్లు కూలిపోయాయి. ఎస్సారెస్సీ నుంచి నీరు విడుదలవుతుంటే రైతుల్లో ఒకవైపు హర్షం వ్యక్తమవుతుండగా.. మరోవైపు పూడికమట్టి, పెరిగిన చెట్ల పొదలతో చివరి ఆయకట్టుకు నీరు చేరక ఆందోళన చెందుతున్నారు. కాకతీయ ప్రధాన కాల్వకు అనుబంధంగా ఉన్న డీ–83ఏ కాలువ ద్వారా ఉప కాల్వలకు నీరు సరఫరా అవుతోంది. ఈ కాల్వల ద్వారా పెగడపల్లి మండలంలో పది వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మండలం పూర్తిగా వ్యవసాయంపై ఆధారితం కావడంతో ఎస్సారెస్సీతోపాటు బావులు, చెరువులు, కుంటల ఆధారంగా రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఇక్కడి భూముల సాగుకు ప్రధాన నీటివనరు కాకతీయ కాలువ. కాలువల ద్వారా పంట పొలాలకు నీరు పారించుకుందామనుకుంటున్న సమయంలో అవి సక్రమంగా లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు చెబుతున్నారు. మండలంలోని డీ–83ఏ ప్రధాన కాల్వ కింద 74, 75, 76, 77, 78, 79, 80, 81 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. డీ 76, 77 కింద 1ఎల్, 2ఆర్, 3ఎల్, 4ఆర్ ఉప కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా పెగడపల్లి, మద్దులపల్లి, బతికపల్లి, ఎల్లాపూర్, నంచర్ల, ల్యాగలమర్రి తదితర గ్రామాలకు నీరు అందుతోంది. అయితే వాటికి ఏళ్లతరబడి మరమ్మతుల్లేక అధ్వానంగా మారాయని రైతులు చెబుతున్నారు. నీటి విడుదలకు ముందుగానే మరమ్మతు చేస్తే బాగుంటుందని అంటున్నారు. -
ప్రతిపాదనల్లోనే అంజన్న ప్రసాదం పెంపు
మల్యాల: భక్తుల కొంగుబంగారమై కొండగట్టు అంజన్న భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అందించే ఉచిత అన్నదానం రెట్టింపు చేయాలనే ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అంజన్న అన్నప్రసాదం అందడం గగనంగా మారుతోంది. కొండగట్టుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నా.. కనీసం రెండు వందల మందికి కూడా సత్రంలో భోజనం అందడం లేదు. ఆలయ ఆదాయం పెరుగుతున్నా.. అధికారులు మాత్రం స్పందన లేకుండాపోతోంది. స్థానికులకే భోజనం.. వాస్తవానికి కొండగట్టుకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించాల్సి ఉంది. అయితే స్థానికులే అధికంగా వినియోగించుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఉచిత అన్నదానం టోకెన్లు జారీ చేసే సమయంపై దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవగాహన లేకపోవడంతో వారికి భోజనం అందడంలేదు. మరోవైపు స్థానికులు టోకెన్లు ఇచ్చే సమయానికి వెళ్లి భోజనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సత్రంలో 100మందికి అన్నదాన టోకెన్లు ఇస్తున్నారు. మంగళవారం, శనివారం మాత్రం 200మందికి టోకెన్లు ఇస్తున్నారు. అన్నదానం టోకెన్లు ఎక్కడ జారీ చేస్తారో..? ఎప్పుడు జారీ చేస్తారో తెలియక చాలామంది భక్తులు అన్నదానానికి దూరమవుతున్నారు. విరాళాల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తుల నుంచి విరాళాలు స్వీకరించేందుకు అధికారులు ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు. విరాళాల స్వీకరణపై చూపించే శ్రద్ధ భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై చూపడం లేదనే విమర్శలున్నాయి. ఆలయానికి ప్రతిరోజూ సుమారు 2వేల నుండి 5 వేలమంది వరకు.. మంగళవారం, శనివారాల్లో సుమారు 5వేల నుండి 20వేల మందికిపైగా భక్తులు వస్తుంటారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఉచిత అన్నదానం టోకెన్లను నిత్యం 100 నుంచి 200కు.. మంగళవారం, శనివారం 200 నుంచి 400కు పెంచాలనే డిమాండ్ ఏళ్ల తరబడి వినిపిస్తున్నా అధికారులు ఆ దిశగా చొరవ చూపడం లేదు. రెండేళ్ల క్రితం ప్రతి పాదనలు చేసినప్పటికి నేటికీ ఆచరణలోకి రాలేదు. కొండగట్టు ఆలయంనిత్యాన్నదాన సత్రంలో భోజనం చేస్తున్న భక్తులు దూరప్రాంత భక్తులకు అందని అన్న ప్రసాదం కేవలం వందమందికే సరిపెడుతున్న వైనం తీవ్ర ఇబ్బంది పడుతున్న మిగిలిన భక్తులు చొరవ చూపని అధికారులు -
జగిత్యాల
42.0/30.0శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 20267గరిష్టం/కనిష్టంపోచమ్మతల్లికి బోనాలురాయికల్: మండలంలోని కుమ్మరిపల్లి, తాట్లవా యి, అల్లీపూర్ గ్రామాల్లో గురువారం గ్రామస్తులు పోచమ్మతల్లికి బోనాలు చేశారు. మహిళలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు కొనసాగుతాయి. -
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
మల్యాల: బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. స్థానిక పోలీస్స్టేషన్ను గురువారం తనిఖీ నిర్వహించారు. కేసుల వివరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తులో పురోగతి, సిబ్బంది హాజరును సమీక్షించారు. స్టేషన్ పరిధిలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకో వాలని, రాత్రివేళల్లో నిఘా ముమ్మరం చేయాలని, యువత మాదకద్రవ్యాల బారినపడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. మల్యాల సీఐ రవి, ఎస్సై నరేశ్ ఉన్నారు. కేసీఆర్తోనే తెలంగాణకు భవిష్యత్గంగాధర: కేసీఆర్తోనే తెలంగాణకు భవిష్యత్ అని, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని బూర్గుపల్లిలో బీఆర్ఎస్ సభ్యత్వ సదస్సును నిర్వహించగా ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఎస్ఐఆర్ నేపథ్యంలో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సుంకె రవిశంకర్, ఏనుగు రవీందర్ రెడ్డి, చిలుక రవిందర్, తిరుపతిరావు, శేఖర్, వినయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు తగవుజగిత్యాల: ధాన్యం కొనుగోళ్లపై కొందరు నాయకుల ఆరోపణలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో రూ.107 కోట్లకు పైగా అవినీతి జరిగిందని మాజీమంత్రి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడటం కంటే ఆధారాలు బయటపెట్టాలన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్పై విమర్శలు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి పెరిగిందని, అయినా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. -
గ్రామ సమీపంలో కోళ్లఫారం వద్దు
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం కోనరావుపేటలో కోళ్లఫారం ఏర్పాటు విషయంలో వివాదం చోటుచేసుకుంది. గ్రామానికి కొద్దిదూరంలోనే పెద్దాపూర్కు చెందిన ఓ వ్యక్తి కోళ్లఫారం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధం కాగా.. పనులు నిలిపివేయాలని సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్తులు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో మెట్పల్లి ఎంపీవో ప్రదీప్కుమార్, ఆర్ఐ సంధ్యారాణి గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోళ్ల ఫారం నిర్మించొద్దని, సహకరించినట్లయితే ఆందోళనకు దిగుతామని విచారణ అధికారులతో తేల్చిచెప్పారు. గ్రామానికి సమీపంలో ఫారం ఏర్పాటు చేస్తే ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అదే ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల, శ్రీరాజరాజేశ్వర ఆలయం, కళ్యాణ మండపం ఉందని పేర్కొన్నారు. సర్పంచ్ మారు గంగారెడ్డి, ఉపసర్పంచ్ పరందాములు, కార్యదర్శి రాణాప్రతాప్, వీడీసీ సభ్యులు ఉన్నారు. మెట్పల్లి మండలం కోనరావుపేట గ్రామస్తుల అభ్యంతరం ప్రజావాణిలో ఫిర్యాదు.. విచారణ చేపట్టిన అధికారులు -
ఇక నో ట్రాఫికర్
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని యావర్రోడ్డు ఎన్హెచ్–63 కొత్తబస్టాండ్ రోడ్ నుంచి ధర్మపురి రోడ్ వరకు ఉంటుంది. ఇది ప్రధానంగా వాణిజ్యం, వ్యాపారాలు జరిగే ప్రాంతం. జగిత్యాల జిల్లాకేంద్రం కావడం.. పట్టణ జనాభా పెరగడం.. వ్యాపారాలు విస్తరించడంతో రోడ్డు ఇరుకుగా మారింది. ఈ క్రమంలో రోడ్డు విస్తరణ అనివార్యమైంది. అలాంటి రోడ్డును విస్తరించాలని గతంలో చాలాసార్లు అధికారులు, నాయకులు ప్రయత్నించినప్పటికీ అక్కడున్న వ్యాపారులు కోర్టులకు వెళ్లడం, అడ్డుకోవడం, ఇతరత్రా కారణలతో ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం 80 ఫీట్లు ఉన్న ఈ దారిని 100 ఫీట్లకు విస్తరిస్తే తప్ప ఇబ్బందులు తొలగేలా లేవు. జగిత్యాల మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచే ఇక్కడ ఇరుకై న రోడ్లు ఉన్నాయి. ఉద్యోగాలు, చదువుల నిమిత్తం వేలాది మంది వచ్చి ఇక్కడే స్థిరపడడంతో పట్టణం భారీగా విస్తరించింది. ప్రభుత్వ కార్యాలయాలున్న చోట విస్తరణ ఐదేళ్లకోమారు ప్రజాప్రతినిధులు మారుతున్నా.. జగిత్యాల రూపురేఖలు మారడం లేదు. డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు యావర్రోడ్డు ఇరుకుగా ఉండటంతో గతంలో బైపాస్రోడ్ నిర్మించారు. ఆ బైపాస్రోడ్ కూడా పూర్తి ట్రాఫిక్గా మారిపోయింది. బైపాస్రోడ్ గతంలో 100 ఫీట్లు కాకుండా కేవలం 60 ఫీట్లు మాత్రమే వేయడంతో ఆ రోడ్డు ప్రస్తుతం ఇరుకుగా మారింది. అత్యధికంగా స్కూళ్లు, హోటల్స్, వాణిజ్య వ్యాపారాలు ఈ రోడ్డుపైనే వెలవడంతో ట్రాఫిక్ సమస్యగా మారింది. ఎమ్మెల్యే సంజయ్కుమార్ చర్యలు తీసుకుని యావర్రోడ్డుపై ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోట 100 ఫీట్ల వెడల్పు చేశారు. మిగతా ప్రాంతాల్లో కేసులు ఉండటంతో అలాగే ఉండిపోయాయి. ఆక్రమణలు ఎక్కువే... యావర్రోడ్డు 80 ఫీట్లు ఉండగా.. వ్యాపారులు రోడ్లను ఆక్రమించుకుని ఎలాంటి సెట్బ్యాక్ పాటించకుండా వ్యాపారాలు నిర్వహించడంతో ప్రజల రాకపోకలకు కష్టతరంగా మారుతోంది. కనీసం వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద విస్తరణ చేపట్టగా ఆ ఖాళీ స్థలాల్లో అత్యధిక హోటల్స్ వెలిశాయి. దీంతో అక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇటీవలే కొందరు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణలను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ఆక్రమణలను తొలగించాలని, యావర్రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్ కమిషనర్ను కోరారు. యావర్రోడ్డును విస్తరించాలని, ఇందుకు నిధులు కేటాయించాలని గతంలో సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాకు రాగా వినతిపత్రం అందింశారు. సానుకూలంగా స్పందించిన సీఎం రోడ్డు విస్తరణ చేస్తామని హామీ ఇచ్చారు కూడా. ఆక్రమణల తొలగింపులపై ఆరోపణలు జిల్లాకేంద్రంలో యావర్రోడ్డుపైనే కాకుండా చాలా చోట్ల రోడ్లను ఆక్రమించుకుంటున్నారు. ఇటీవలే కొందరివి మాత్రమే తొలగించగా వారంతా అధికారులపై ఆగ్రహంగా ఉన్నారు. ఆక్రమణలు మొత్తం తొలగించాలని, కొందరివే తొలగించి పొట్టపై కొట్టొద్దని అంటున్నారు. దీనికి ముమ్మాటికీ రాజకీయ ఒత్తిళ్లే కారణమని పేర్కొంటున్నారు. అన్ని ఇరుకై న రోడ్లే... జిల్లా కేంద్రంలో ప్రధానమైన రోడ్లన్నీ ఇరుకుగానే ఉన్నాయి. 1983లో ఉన్న మాస్టర్ ప్లాన్ అమలు కావడంతో రోడ్లు అభివృద్ధి కావడం లేదు. మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడం, రోడ్డు విస్తరణ కాపోవడంతో జిల్లాలో ఇరుకై న రోడ్లతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరంగా మారింది. కనీసం పార్కింగ్ చేద్దామన్నా స్థలం లేని పరిస్థితి. ముఖ్యంగా పాతబస్టాండ్ ప్రభుత్వ ఆస్పత్రి ఉండటంతో బస్సు తిరగలేని, ఆటోలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. యావర్రోడ్డు విస్తరణకు అడుగులు ఫైల్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అక్రమాలు తొలగించాలని కమిషనర్ను కోరిన ఎమ్మెల్యే విస్తరణకు గతంలోనే హామీ ఇచ్చిన సీఎంఆక్రమణలు తొలగించండియావర్రోడ్లో ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సత్యప్రణవ్కు ఎమ్మెల్యే సంజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి వినతిపత్రం అందించారు. మిషన్ కాంపౌండ్ నుంచి కొత్తబస్టాండ్, మంచాల కృష్ణ పెట్రోల్బంక్ వరకు విస్తరించేందుకు యజమానుల పత్రాలు పరిశీలించి ఫైల్ సిద్ధం చేయాలని కోరారు. వ్యాపారులు రోడ్లను ఆక్రమించి పర్మినెంట్ షెడ్లు వేసుకున్న వాటిని తొలగించాలన్నారు. తోపుడుబండ్ల వ్యాపారాలను ముట్టుకోవద్దన్నారు. బీట్ చౌరస్తాలో నిర్మించిన సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లలో మటన్, కూరగాయలు పెట్టుకుని అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘అడ్వాన్స్డ్’లో విద్యార్థినుల ప్రతిభ
రాయికల్/మల్లాపూర్: ఇంటర్బోర్డు గురువారం విడుదల చేసిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో మల్లాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థిని మానాల రేవతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఏప్రిల్ 12న విడుదలైన ఫలితాల్లో 465 మార్కులతో స్టేట్ 5వ ర్యాంక్లో నిలిచింది. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ భూమేష్ మాథ్స్–1 ఇంప్రూవ్మెంట్ రాయించడంతో మరో నాలుగు మార్కులు సాధించింది. మండల కేంద్రానికి చెందిన మానాల ప్రవీణ్కుమార్, ఉదయశ్రీ దంపతుల కూతురు రేవతి. ఉదయశ్రీ బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. రాయికల్ మండలం ఇటిక్యాల మోడల్స్కూల్కు చెందిన మామిడాల వైభవి 468/470 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది. బైపీసీలో రిషిత కుమారి 426/440 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ పూదరి నర్సయ్య తెలిపారు. ఫస్టియర్లో 470కి 469 మార్కులు సాధించిన రేవతి రేవతి తల్లి బీడీ కార్మికురాలు.. అల్లీపూర్ విద్యార్థినుల ప్రతిభ -
మరమ్మతు చేయాలి
నీటి విడుదలకు ముందు కాలువలు మరమ్మతు చేస్తే బాగుంటుంది. కాలువల ద్వారా నీళ్లు వస్తుంటే సంతోషం ఉన్నా.. చివరి భూములకు అందడం కష్టంగా ఉంది. – పల్లె మోహన్రెడ్డి, నామాపూర్ పూడిక పేరుకుపోయింది కాలువల్లో మట్టి నిండింది. చెట్లపొదలు విపరీతంగా పెరిగాయి. పంటకు నీరందడం కష్టంగానే ఉంది. కొన్ని చోట్ల డ్రాపులు కూలిపోయాయి. అధికారులు కాలువలను బాగు చేయించాలి. – మారం కొమురయ్య, ల్యాగలమర్రి -
లోక్అదాలత్కు న్యాయవాదులు సహకరించాలి
జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 20న నిర్వహించే లోక్ అదాలత్కు న్యాయవాదులు సహకరించాలని జిల్లా జడ్జి సి.రత్నపద్మావతి సూచించారు. జిల్లాకోర్టులోని బార్ అసోసియేషన్లో గురువారం న్యాయవాదులతో సమావేశమయ్యారు. కక్షిదారులకు లోక్ అదాలత్ సమాచారం అందించి, కేసులు రాజీ చేసుకునేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు కేసులు పరిష్కరిస్తున్నా.. కొత్త కేసులతో కోర్టులపై అధికభారం పడుతోందన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత, సబ్ జడ్జి నాగేశ్వర్రావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయయమూర్తి సి.రత్న పద్మావతి -
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు చివరిదశలో ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం బీర్పూర్ మండలకేంద్రంతో పాటు నరసింహులపల్లిలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమయ్యేలా చూడాలని పేర్కొన్నారు. మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో భీమేశ్ ఉన్నారు. వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ సత్యప్రసాద్ -
పరిహారం.. పరిహాసం
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహుని ఆలయానికి ఏటేటా భక్తులు పెరుగుతున్నారు. పురాతన ఆలయానికి నెలవైన ఇక్కడ నాటికాలంలోనే ప్రజలు ఆలయం చుట్టూ ఇళ్లు నిర్మించుకుని ఇప్పటికీ నివాసముంటున్నారు. క్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతుండడం.. పురాతన ఇళ్లు అలాగే ఉండడం.. రద్దీ పెరిగిన సమయంలో ఇబ్బందులు ఎదురవడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. దీంతో ఆలయ విస్తరణ అంశం ఎప్పటినుంచో తెరపైకి వస్తోంది. ఆలయాన్ని విస్తరించాలంటే చుట్టూరా ఉన్న ఇళ్లను తొలగించాల్సి వస్తుంది. అయితే బాధిత కుటుబాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం పరిహాసంగా మారింది. తాతముత్తాల కాలంలో నిర్మించిన ఇళ్ల కాపాడుకుంటూ వస్తున్నామని, ఇప్పుడు తొలగించాల్సిందేనంటూ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని బాధితులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం నుంచి గజానికి కేవలం రెండు వేలు మాత్రమే చెల్లిస్తారని వస్తున్న వదంతులు బాధితులను కలవరపెడుతున్నాయి. మార్కెట్ ధర చెల్లించకుంటే ఇళ్లు ఖాళీ చేయబోమని చెబుతున్నారు. విస్తరణ ఇలా.. నృసింహుని ఆలయానికి పెరుగుతున్న భక్తులకు సరిపడా వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా నందీచౌక్ నుంచి ఆలయం వరకు.. మంగలిగడ్డ నుంచి బ్రాహ్మణ సంఘంవరకు నిత్యం భక్తులతోపాటు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమస్యను అధిగమించాలంటే విస్తరణ తప్పనిసరిగా మారింది. వాహనాల పార్కింగ్, వాటి రాకపోకలకు ఇరువైపులా విశాలమైన రోడ్డు, భక్తులు సేద తీర్చుకోవడానికి వసతి గృహాలు, ప్రత్యేక నీడ, నీటి వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలంటే ఆలయానికి సమీపంలో ఉన్న సుమారు 17 మంది ఇళ్లను తొలగించాల్సి వస్తోంది. ఏడున్నర ఎకరాలు అవసరం ఆలయ విస్తరణకు మొత్తం ఏడున్నర ఎకరాలను ప్రభుత్వం సేకరించనున్నట్లు అధికారుల లెక్కల ద్వారా తెలిసింది. ఇందులో సుమారు 17మంది ఇ ళ్లు కోల్పోతారని గుర్తించారు. ఉత్తరం వైపున 1.03 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇందులో సు మారు 17 మంది ఇళ్లు ఉన్నాయి. అలాగే బ్రాహ్మణ సంఘం పక్కనున్న 2.4 ఎకరాలు, (శ్రీమఠం స్థలం), గోదావరి తీరాన మంగలిగడ్డ ఏరియాలో 4.16 ఎకరాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఏళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియ ఆలయ అభివృద్ధికి సమీపంలోని భూములు సేకరించాల్సి ఉందని, అందులో ఉన్న నిర్మాణాలను ఖాళీ చేయాలని, నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచే చెబుతూ వస్తున్నారు. అప్పటి మంత్రి కొప్పులఈశ్వర్ భూ నిర్వాసితులతో పలుమార్లు అవగాహ న సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం సరిపోదంటూ బాధితులు తమ అసంతృప్తిని వెలుబుచ్చుతూ వస్తున్నారు. తాజాగా 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భక్తుల తాకిడిని తట్టుకోవాలంటే ఆలయ విస్తరణ తప్పనిసరి అని అధికారులు గుర్తించారు. బాధితులతో మంత్రి సమీక్షలు ఆలయ అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ బాధితులతో పలుమార్లు చర్చలు జరిపారు. నిర్వాసితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఆలయ పరిసరాల్లో.. ఆలయ అభివృద్ధికి దోహదపడే భూములు, ఇళ్లను ఎవరూ అమ్మవద్దని, కొనవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏడున్నర ఎకరాలను బ్లాక్ లిస్టులో పెట్టారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
పాఠశాలల్లో వసతులపై.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం.. విద్యావలంటీర్ల నియామకంపై.. మూత్రశాలలు, మరుగుదొడ్లపై.. మెరుగైన ఫలితాల కోసం.. ప్రీప్రైమరీపై.. జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, కార్పొరేట్కు ధీటుగా విద్య అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని డీఈవో రాము తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులకు ఇప్పటికే అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. ఖాళీలు ఉన్న చోట సర్దుబాటు చేశామన్నారు. ఈనెల 15 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. -
మంత్రి కాగానే సమస్యలు మాయమయ్యాయా..
జగిత్యాలటౌన్: ప్రపంచంలోనే పేరు మోసిన నేరస్తుడు హిట్లర్ అని, ఆయనే తనకు ఆదర్శమన్న సీఎం రేవంత్రెడ్డికీ హిట్లర్ పట్టిన గతే పడుతుందని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేయాలంటే హిట్లర్లా అణిచివేతకు పాల్పడుతున్న రేవంత్కు అదే గతి తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ కండువా కప్పుకోగానే తాను మాటమార్చారంటున్న మంత్రి అడ్లూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తానెప్పుడు ప్రజాపక్షమేనని, అడ్లూరి మంత్రి కాగానే సమస్యలన్నీ మాయమైపోయినట్లు వాస్తవాలకు భిన్నంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ధాన్యం సేకరణలో వాస్తవాలు ఒకలా ఉంటే మంత్రి మరోలా మాట్లాడుతున్నారని, మిల్లర్ల దోపిడీతో జిల్లా రైతులు రూ.125 కోట్లు నష్టపోయారని, ఇందులో నాయకులు, అధికారుల వాటా ఎంతో అడ్లూరి చెప్పాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు రశీదు ఇచ్చిన ధాఖలాలు లేవని, ధర్మకాంట, ట్రక్షీట్ మధ్య వ్యత్యాసం ఎందుకుందో చెప్పాలని, మిల్లర్ల దోపిడీకి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. మంత్రికి రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ట్రక్షీట్ ప్రకారం చెల్లింపులు జరిగేలా చూడాలని హితవు పలికారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన 3వేల ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంప్ ఏమైందో చెప్పాలన్నారు. ఆ ఇసుకకు సంబంధించిన రూ.30లక్షలు ప్రభుత్వ ఖజానాకు జమచేశారా..? లేక ఎవరి జేబుల్లోకి వెళ్లాయో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వీటిపై మంత్రి, కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు సురేందర్, పుప్పాల అశోక్, వెంకటేశ్వర్రావు, దుర్గయ్య, నేహాల్, అబ్దుల్ భారీ, చందా రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
వాహనాలన్నీ మూలకే..
జగిత్యాల: జిల్లాకేంద్రమైన జగిత్యాల మున్సిపాలిటీ ఇంజినీరింగ్ సెక్షన్లో డీఈతోసహా అందరూ బదిలీ కావడంతో శానిటేషన్ విభాగంలో టెండర్లు పిలిచేందుకు జాప్యం జరుగుతోంది. ఇది కార్మికులకు కష్టతరంగా మారింది. జిల్లా కేంద్రంలో లక్షకు పైగా జనాభా ఉంది. ఇక్కడ ప్రతిరోజూ చెత్తను తొలగించాల్సిందే. నాలుగు జోన్లలో కార్మికులు నిత్యం ఆటోలు, ట్రాక్టర్లలో చెత్తను సేకరిస్తుంటారు. 36వ డివిజన్తోపాటు.. మరికొన్ని వార్డుల్లో ఆటోలు, ట్రాక్టర్లు చెడిపోవడంతో ఆ జోన్లో పనిచేస్తున్న కార్మికులకు చెత్త సేకరణ కష్టతరంగా మారింది. చేసేదేమీలేక ఒక పెద్ద సంచితో కార్మికులు ఇంటింటికీ వెళ్తూ.. చెత్త సేకరించాల్సి వస్తోంది. అతిపెద్ద మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో జేసీబీ, ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్తోపాటు చాలావరకు ఆటోలు మరమ్మతుల్లోనే ఉంటున్నాయి. ఇటీవలే టిప్పర్లు, జేసీబీలను రూ.1.5లక్షలతో మరమ్మతు చేయించినా.. మళ్లీ మొరాయిస్తున్నాయి. ఫలితంగా శానిటేషన్ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ డంపింగ్యార్డులను తలపిస్తున్నాయి. కాలనీల్లో చెత్త సేకరణ లేకపోవడంతో ప్రజలు రోడ్లపైనే చెత్తను పారబోస్తున్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో జగిత్యాల మున్సిపాలిటీ అధ్వానంగా మారింది. ఒకవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మున్సిపాలిటీలో పనులన్నీ పెండింగ్లో ఉండడం గమనార్హం. చెత్త సేకరణలో కార్మికులకు ఇబ్బందులు ట్రాక్టర్లు, ఆటోలు మరమ్మతుల్లో ఉండటంతో చెత్త సేకరణలో కార్మికులకు ఇబ్బందికరంగా మారింది. అసలే వారికి చీపుర్లు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు షూస్ ఇవ్వకపోవడంతో కార్మికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆటోల్లో తిరుగుతూ ఎలాగోలా చెత్త సేకరణ చేస్తున్నప్పటికీ వాహనాలు మరమ్మతుకు రావడంతో ఏమీ చేయలేక చివరకు చెత్త సేకరణకు సంచులతో బయల్దేరాల్సి వస్తోంది. తరుచూ మరమ్మతులే.. జిల్లా కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతోంది. చెత్తాచెదారం తరలించేందుకు.. రహదారులు శుభ్రం చేసేందుకు.. డ్రైనేజీల్లో పూడిక తీసేందుకు.. ఫాగింగ్ చేసేందుకు ఎక్కువగా వాహనాలనే వినియోగిస్తుంటారు. కొనుగోలు, మరమ్మతుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నా మళ్లీమళ్లీ మరమ్మతుకు రావడం గమనార్హం. ఫలితంగా చెత్తసేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకవైపు తడి, పొడి చెత్త వేరు చేయాలని, ఇంటి ఎదుటకు వచ్చిన మున్సిపల్ వాహనాలకే చెత్త అందించాలని పేర్కొంటున్నా వాహనాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. బల్దియాలో 50 వార్డులు ఉండగా.. దాదాపు 300 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. చెత్త సేకరణ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో రూ.50 లక్షల వ్యయంతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేశారు. అది ఒక్కసారి కూడా పనిచేయలేదు. రూ.50 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. అధికారులు మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. బదిలీలతో టెండర్లలో జాప్యం శానిటేషన్కు సంబంధించి వాహనాల మరమ్మతులు చేయించాలంటే ఇంజినీరింగ్ సెక్షన్ అధికారులు మాత్రమే టెండర్లు వేయాల్సి ఉంటుంది. కానీ ఆ విభాగంలోని అధికారులందరూ బదిలీపై వెల్లిపోయారు. డీఈతోపాటు, ఇద్దరు ఏఈలు బదిలీ కావడంతో ఆ శాఖ ఖాళీగా ఉంది. డీఈ స్థానంలో మరో డీఈకి పోస్టింగ్ ఇచ్చినా ఆయన ఇప్పటి వరకు జాయిన్ కాలేదు. ఏఈలను పూర్తిగానే ఇవ్వలేదు. దీంతో టెండర్లలో జాప్యం జరుగుతోంది. అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మరమ్మతుల కోసం టెండర్లు వేయకపోతే వాహనాలన్నీ మూలకే ఉండే పరిస్థితి నెలకొంది. మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని వాహనాల మరమ్మతుకు సంబంధించి టెండర్లు వేసి అటు శానిటేషన్ మెరుగుపర్చడంతోపాటు, బల్దియా కార్మికులకు సైతం ఇబ్బందులు లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వార్డులు 50 ట్రాక్టర్లు 45 ఆటోలు 11 ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్1 స్వీపింగ్ మిషన్ 1 ఫాగింగ్ మిషన్లు 2 జేసీబీ 1 -
కోటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు
వెల్గటూర్: కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామి ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. మూడు నెలల 20 రోజులకు రూ.1,88,799 వచ్చినట్లు ఈవో కాంతారెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ పరిశీలకులు ఎం.రాజమౌళి, చైర్మన్ పూదరి రమేష్, సర్పంచ్ కోటయ్య, ధర్మకర్తలు గుమ్ముల వెంకటేష్, రవి, రాయకోటయ్య, శ్రీవల్లి సేవా సమితి మహిళలు, అర్చకులు సంజీవ్ శర్మ, నాగరాజు, అన్వేష్, కార్తీక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మాదిగకుంట పనులు ప్రారంభించండి రాయికల్: పట్టణంలోని మాదిగకుంటలో మురికి నీరు నిల్వ లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ మున్సిపల్ కమిషనర్ మనోహర్గౌడ్ను ఆదేశించారు. ‘కలెక్టర్ ఆదేశించినా కదలని పనులు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి అడిషనల్ కలెక్టర్ స్పందించారు. కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు చేపట్టేలా చూడాలని, వర్షాలు పడితే నీరంతా కుంటలోకి చేరే అవకాశం ఉందని తెలిపారు. కొండగట్టులో జూ. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పూజలుమల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. ఎన్టీఆర్ తల్లి నందమూరి షాలిని, అత్త నార్నే మల్లీశ్వరికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. మల్లీశ్వరి హనుమాన్ దీక్ష తీసుకున్న సందర్భంగా కుటుంబంతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాంట్రాక్టర్గా.. వర్క్ ఇన్స్పెక్టర్ మెట్పల్లి: మున్సిపాలిటీలో ఆయనో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇంజినీరింగ్ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఆ విభాగం పరిధిలో చేపట్టే పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఆ పనితోపాటు కొంతకాలంగా ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్ల పేరిట గుట్టుగా అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నాడు. నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు కాంట్రాక్ట్ పనులను సొంతంగాగానీ, బినామీ పేర్ల మీదగానీ చేయరాదు. కానీ సదరు ఉద్యోగి బినామీ పేర్ల మీద రూ.లక్షలాది పనులను దక్కించుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆయన బినామీ బాగోతాన్ని ఇటీవల గుర్తించిన స్థానిక కాంట్రాక్టర్ల సంఘం నాయకులు మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రిని కలిసి ఫిర్యాదు చేశారు. అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించా లని, లేకుంటే తాము పనులను చేయబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మున్సిపల్లో చర్చనీయాంశంగా మారింది. చమురు ధరలు తగ్గించండిజగిత్యాలటౌన్: కేంద్రప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం ఆధ్వర్యంలో నాయకులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. విశ్వనాథం మాట్లాడుతూ చమురు ధరల పెంపుతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజల కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు. నాయకులు ఇరుగురాళ్ల భూమేశ్వర్, సుతారి రాములు, ఎండీ.ముఖ్రం, మునుగూరి హన్మంతు, వెన్న మహేష్, కొక్కుల శాంత, ఎన్నం రాధ, ఎండీ.ఉస్మాన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ధ్యేయం
జగిత్యాల: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, జిల్లాలో రికార్డు స్థాయిలో వరి, మక్కలు కొనుగోలు చేసి 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు 5.12లక్షల టన్నుల ధాన్యం రాగా.. 436 కేంద్రాల ద్వారా 5.08 లక్షల టన్నులు కొన్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ధాన్యంలో కోత పెడుతున్నట్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు 81,954 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసి రూ.1,075 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. రికార్డు స్థాయిలో 47వేల టన్నుల మక్కలు కొన్నామన్నారు. ధాన్యం క్వింటాల్కు 10 కిలోల కోత పెట్టారని జీవన్రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తమన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ గతంలో కన్న ఈసారి ధాన్యం, మక్కల దిగుబడి ఎక్కువగా వచ్చిందన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, అడిషనల్ కలెక్టర్లు బిఎస్.లత, రాజాగౌడ్ ఉన్నారు. -
నాన్నమ్మ ఊరికి
సెలవులు వచ్చేశాయి పుస్తకాలు అటకెక్కాయి! నాన్నమ్మ ఊరికి వెళ్లాం తాతతో చేనుకు వెళ్లాం వరి పంటను చూశాం చెట్లకు నీళ్లు పెట్టాం నాన్నమ్మ అప్పచ్చులు పెట్టింది తాత జున్ను తెచ్చాడు పేరిన నెయ్యి ఇడ్లీ తిన్నాం తాత పక్కలో పడుకున్నాం! అత్త వాళ్లింటికి వెళ్లాం మామతో మెట్రో ఎక్కాం చిన్ని బన్నీలతో ఆడాం ప్లానెటోరియం చూశాం అత్త ఇచ్చిన లడ్డూ తిన్నాం మామతో చెస్ ఆడాం పార్కుల్లో పరుగులు తీశాం సర్కస్ చూసి ఆనందించాండాక్టర్ కందేపి రాణీప్రసాద్ రచయిత్రి, మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల -
నిజమైన దేశభక్తి
రవి, ఆనంద్ ఇద్దరూ తొమ్మిదో తరగతి చదువుతున్న స్నేహితులు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ‘నేటి సమాజంలో దేశభక్తి’ అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. రవికి సైన్యం అంటే చాలా ఇష్టం. ‘శత్రువుల గుండెల్లో నిద్రపోయే సైనికుడే అసలైన దేశభక్తుడు. ప్రాణత్యాగం చేయడమే దేశభక్తి’ అని తన ప్రసంగంతో అందరినీ ఉద్వేగానికి గురిచేశాడు. అందరూ రవికి మొదటి బహుమతి ఖాయమన్నారు. ఆనంద్ కూడా రవిని అభినందించాడు. తర్వాత తనవంతుగా పోటీలో పాల్గొన్నాడు. ‘అందరినీ సమానంగా చూస్తూ, దేశంలో ప్రశాంత వాతావరణం ఉండడానికి కృషి చేస్తూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడమే నిజమైన దేశభక్తి’ అని ప్రసంగించాడు. పాఠశాల సమయం ముగిసింది. రవి, ఆనంద్ ఇంటికి బయలుదేరారు. పాఠశాల బయట మున్సిపాలిటీ వారు తీసిన గుంత సరిగ్గా పూడ్చకపోవడంతో మురికి నీరు చేరి ప్రమాదకరంగా ఉంది. అది గమనించని మూడో తరగతి చదివే చిన్న పిల్లవాడు సైకిల్తో ఆ గుంతలో పడిపోయాడు. మోకాలికి దెబ్బ తగిలి ఏడుస్తున్నాడు. రవి తన సైనిక ఆశయాల గురించి, తన ప్రసంగం గురించి ఆనంద్తో గొప్పగా చెప్పుకుంటూ ఆ పిల్లవాడిని చూసినా పట్టించుకోలేదు. ‘అబ్బా.. ఇలాంటి గుంతలు మన దేశంలో సాధారణం. అందుకే మన దేశం వెనుకబడి ఉంది’ అని విమర్శిస్తూ ముందుకు సాగాడు. ఆనంద్ ఆగిపోయాడు. పరుగున వెళ్లి ఆ పిల్లాడిని పైకి లేపి, తన దగ్గర ఉన్న రుమాలుతో రక్తాన్ని తుడిచి, పాఠశాలలో ప్రథమ చికిత్స డబ్బాతెచ్చి.. ప్రథమ చికిత్స చేశాడు. మళ్లీ ఎవరూ ఆ గుంతలో పడకూడదని పక్కనే ఉన్న ఒక ఎర్రని బట్టను కర్రకు చుట్టి పాతాడు. అదంతా చూస్తున్న రవి, ‘ఆనంద్, అనవసరంగా సమయం వృథా చేస్తున్నావు.. పద వెళ్దాం. నేను ట్యూషన్కు వెళ్లాలి’ అని విసుక్కున్నాడు. ‘అయిపోయింది పదా’ అంటూ ఆనంద్ కదిలాడు. ఇద్దరూ వెళ్లిపోయారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున బహుమతుల ప్రదానం జరుగుతుంది. శ్రీవక్తృత్వ పోటీలో రవి ప్రసంగం చాలా బాగుంది. ఆనంద్ కూడా చాలా బాగా ప్రసంగించాడు. ఆ ప్రసంగంలోని ఆశయాన్ని నిజజీవితంలో పాటించిన ఆనంద్కు ‘బెస్ట్ స్టూడెంట్’ అవార్డు ఇస్తున్నాను.. అన్నారు ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థులందరూ చప్పట్లు కొట్టారు. ఆయన శాంతంగా ‘దేశభక్తి అంటే కేవలం చెప్పడం కాదు, లేదా సరిహద్దుకు వెళ్లినప్పుడే చూపించేది కాదు. మన రాజ్యాంగం మనకు హక్కులతోపాటు కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. నిన్న దారిలో దెబ్బ తగిలిన పిల్లవాడికి సాయం చేయడం, మరో వ్యక్తి ప్రమాదంలో పడకుండా గుంత దగ్గర హెచ్చరిక ఏర్పాటు చేయడం.. ఇవే నిజమైన పౌరబాధ్యతలు. ఒక సైనికుడు దేశాన్ని బయటి శత్రువుల నుంచి రక్షిస్తే, ఆనంద్ లాంటి పౌరులు దేశాన్ని లోపల ఉండి రక్షిస్తున్నారు. తోటి మనిషికి సాయపడలేని దేశభక్తి వృథా.. అని బహుమతిని ఆనంద్కు ప్రదానం చేశాడు. రవికి తన తప్పు తెలిసొచ్చింది. నిజమైన దేశభక్తి అనేది తుపాకీ పట్టినప్పుడే కాదు, తోటి వారికి సహాయపడినప్పుడు కూడా కనిపిస్తుందని గ్రహించి, ఆనంద్ను ఆలింగనం చేసుకున్నాడు. – ఆవుల చక్రపాణి యాదవ్ గ్రామం : కన్నమడకల ఓర్వకల్లు పోస్ట్ కర్నూలు(జిల్లా) ఆంధ్రప్రదేశ్ -
చేపల వేటకు వెళ్తే ప్రాణమే పోయింది
● విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి రాయికల్: మండలంలోని ఇటిక్యాలకు చెందిన పల్లపు శేఖర్(35) చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలోని ఒడ్డెరకాలనీకి చెందిన శేఖర్ చేపలు పట్టేందుకు వెళ్లి వస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను గమనించక కాలు వేశాడు. విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. శేఖర్కు భార్య, కూతురు ఉన్నారు. వెల్గటూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని ముత్తునూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగ పోశయ్య (40) బుధవారం ఉదయం తన వ్యవసాయ బావిలోని మోటార్ తీయడానికి వెళ్లాడు. మోటార్ తీసే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. క్షయ వ్యాధిపై జాగ్రత్తలు తీసుకోవాలిజగిత్యాల: క్షయ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వారాలు మించి దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం వంటి సమస్యలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ఉదయించే కిరణాలు
ఉదయించే కిరణాలు బాలలు బడికి వెలుగులు బాలలు చదువుల తల్లి బిడ్డలు చిరునవ్వుతో చిందులేస్తుండే బాలలు సంతోషానికి మారుపేరు బాలలు!! ప్రగతికి బాటలు బాలలు భరతమాత ముద్దుబిడ్డలు ఎదుగుతున్న పిల్లలు భావితరానికి వెలుగు దివ్వెలు!! బాలలు బంగారు కిరణాలు అవనిలో వెలిసిన చిరుమొగ్గలు స్వచ్ఛమైన మనసుకు చిరునామా బంగారు భవితకు పునాదులు చిరునవ్వుకు చిరునామా బాలలు!!దేవులపల్లి రమేశ్, కవి, రచయిత ఎంజేపీ తెలుగు అతిధి ఉపాధ్యాయుడు గ్రామం : నంగునూర్, సిద్దిపేట(జిల్లా) -
రోగులకు ఇబ్బంది రానీయొద్దు
కోరుట్ల/కోరుట్లరూరల్/మల్లాపూర్: పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధశారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రి అభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. రోగులకు తాగునీటి కోసం బోర్ మోటార్ బిగించాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత, సూపరింటెండెంట్ సునీతారాణి, వైద్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఈతచెట్లు కాపాడుకునేందుకు బోర్లకు ఎమ్మెల్యే మంజూరు పత్రాలు అందించారు. ఐలాపూర్లో మూడు బోర్లకు రూ.6లక్షలు, మోహన్రావుపేటలో రెండు బోర్లకు రూ.4 లక్షలు, యూసుఫ్నగర్కు ఒక బోరుకు రూ.2 లక్షల మంజూరు పత్రాలను గౌడ సంఘ నాయకులకు అందించారు. మల్లాపూర్లో కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ మల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. తహసీల్దార్ రాంచందర్, సర్పంచ్లు చిట్యాల లక్ష్మణ్, తోట శ్రీనివాస్, గొండ రాజేందర్, ఏలేటి వెంకట్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాఘవపేట, పాతదాంరాజుపల్లి, గొర్రెపల్లిలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. -
టెక్స్టైల్ పార్కులో భారీ అగ్నిప్రమాదం
● రూ.40 లక్షల ఆస్తి నష్టం తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్కులో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పార్కులోని శ్రీసిరి టెక్స్టైల్స్శ్రీ పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో యజమాని వాసం రేఖకు చెందిన 7 ర్యాపియర్ లూమ్స్(మరమగ్గాలు)తోపాటు సుమారు రూ.40 లక్షల విలువైన వస్త్రం కాలి బూడిదైంది. మంటలకు షెడ్ కూడా దెబ్బతింది. ఫైర్స్టేషన్ అధికారులు, తంగళ్లపల్లి పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెడీ టు తహసీల్దార్
కరీంనగర్ అర్బన్: రెవెన్యూశాఖను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే భూ భారతి పేరుతో సంస్కరణలు చేపట్టగా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నపుడు, పరిపాలనా జోక్యం అవసరమైనపుడు, పట్టణ, వేగంగా అభివృద్ధి చెందుతున్న మండలాల్లో అదనపు పనిభారం ఉన్నప్పుడు, ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల అమలు, ఎన్నికలు, విపత్తు నిర్వహణ, తహసీల్దార్ల పనితీరు సరిగా లేకుంటే.. తదితర సమయాల్లో తాత్కలిక తహసీల్దార్లుగా నియమించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు నాయబ్ తహసీల్దార్లను కేటాయించగా, ఇతర జిల్లాలకు పలువురు బదిలీ అయ్యారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన క్రమంలో తహసీల్దార్లుగా నియమించనున్నారు. 18 మంది ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాకు వస్తుండగా 18మంది ఉమ్మడి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. బదిలీలు ఇలా.. ● జగిత్యాల నుంచి పరాంకుశం శ్రీకాంత్, ఖాజా సమి అహ్మద్ నిజామాబాద్ బదిలీ అయ్యారు. కుకట్ల ఉమాపతి, రాజ్మహ్మద్ ఆదిలాబాద్కు, గడ్డమీది శ్రీనివాస్ నిర్మల్కు బదిలీ అయ్యారు. ●జగిత్యాలకు నిజామాబాద్ నుంచి వైఎస్ ప్రవీణ్ కుమార్, వై.గంగాధర్, బి.రాజశేఖర్, నిర్మల్ నుంచి జి.శ్రావణి, రహమన్ బదిలీపై వచ్చారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పుట్టపాక లీలా రాణి కామారెడ్డికి, గొడుగు రజిత కరీంనగర్కు, బి.శ్రవణ్కుమార్ సిద్దిపేట, కె.సురేశ్ కుమార్, నిమ్మ భూపేశ్ మెదక్కు బదిలీ అయ్యారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెదక్ నుంచి ఎల్.నవీన్కుమార్, ఎన్.శ్రీకాంత్, ఎ.స్వప్న, కామారెడ్డి నుంచి జి.రవికుమార్ బదిలీపై వచ్చారు. ● కరీంనగర్ నుంచి పుప్పాల సాయికృష్ణ కామారెడ్డికి, పెద్దాపురం కళావతి, జి.కిరణ్కుమార్ సిద్దిపేట, బి.లావుడ్య ప్రేమలత మెదక్, కొండ్ర సుమలత రాజన్న సిరిసిల్లకు బదిలీ అయ్యారు. ● కరీంనగర్కు సతీశ్కుమార్, గందె శ్రీనివాస్, ఎస్.నవీన్కుమార్ సిద్దిపేట నుంచి, ఆడెపు రవి కామారెడ్డి నుంచి బదిలీపై వచ్చారు. ● పెద్దపల్లి జిల్లా నుంచి ఆర్.రాముడు, ఎస్.ఈశ్వర్ మంచిర్యాలకు, ఎం. తిరుపతి ములుగు, కె.ధీరజ్కుమార్, ఎన్.విజయ్ జెఎస్ భూపాలపల్లికి బదిలీ అయ్యారు. ● పెద్దపల్లికి జి.హరిత మంచిర్యాల నుంచి, పతంగి భాస్కర్, అజీముద్దీన్ జెఎస్ భూపాలపల్లి నుంచి, సిద్దం పోచయ్య, ఎ.రాములు కేబీ.ఆసిఫాబాద్ నుంచి బదిలీపై వచ్చారు. -
వాన – బాలగేయం
చినుకు చినుకు వాన వచ్చే చల్ల చల్ల గాలితో టపటపమని చప్పుడుతో నేల తడిసె హాయితో బెకబెకమంటూ కప్ప గెంతుతాది గంతులు చెట్టు చేమ ఆకులన్నీ కడిగినట్టు మెరిసెను కాగితాల పడవలేసి కాలవలో వదిలితే కెరటాల మీద తేలి కిలకిలమని నవ్వుతాది గొడుగులేసి పిల్లలంతా గుంపులుగా తిరిగితే జల్లు తాకి ముద్దు పెట్టి సందడి చేస్తాదిరా నేలమ్మకు దాహమంతా వానదేవుడు తీరుస్తాడు పంటలన్నీ పచ్చగా పొలమంతా నవ్వుతాది వాన వెలిసి ఆకాశంలో హరివిల్లు వస్తే చాలు బాల్యమంతా రంగులతో పండగల్లే ఉంటాది మంథని మరమరాలు బాలగేయాలు సంపుటి నుంచి డాక్టర్ కోట లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
కారు ఢీకొని ప్రైవేట్ లెక్చరర్ మృతి
కోరుట్లరూరల్: హెల్మెట్ ధరించినా.. లాక్ చేయకపోవడంతో ఓ ప్రైవేట్ లెక్చరర్ ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని సంగెం గ్రామానికి చెందిన పోతుగంటి శ్రీనివాస్ (47) మెట్పల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. బుధవారం కళాశాలకు వెళ్లి కోరుట్ల వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. కోరుట్ల శివారులోని పెద్దగుండు సమీపంలోకి రాగానే మెట్పల్లి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ బైక్పైనుంచి ఎగిరిపడ్డాడు. శ్రీనివాస్ హెల్మెట్ ధరించినప్పటికీ లాక్ వేసుకోకపోవటంతో హెల్మెట్ ఎగిరిపోయింది. శ్రీనివాస్ తల వెనక భాగంలో బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్ ఢీకొని వృద్ధుడు..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఎల్లారెడ్డిపే ట మండలం రాజన్నపేటలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన నమిలికొండ నర్సయ్య(55) జీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి దేవునిగుట్టతండాకు చెందిన భూక్య నవీన్ బైక్పై వచ్చి ఢీకొనడంతో నర్సయ్య అక్కడికక్కడే కింద పడిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులకు తె లిపి ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ హాస్పిటల్లో తరలించారు. ఈ ప్రమాదంలో నర్సయ్య మెడ భాగం, పక్కటెముకలు, ఒక కాలు విరిగి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కో సం బుధవారం కరీంనగర్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు శివకుమార్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్ కోరారు. హెల్మెట్ లాక్ చేయక తలకు బలమైన గాయం అక్కడికక్కడే దుర్మరణం -
పిల్లలతో కనెక్ట్ అవ్వండి..
బిడ్డ మీ పక్కనే కూర్చుని ఉండవచ్చు కాని వారి చేతిలో ఉన్న ఫోన్ మిమ్మల్ని ఆమడ దూరంలో ఉంచుతోంది. వారు ‘ఆన్లైన్’ అవ్వకముందే, మీరు వారితో ‘కనెక్ట్’ అవ్వండి. లేదంటే ఆ రంగుల ప్రపంచం మీ ప్రేమని బలితీసుకుంటుంది.. ప్రేమ విఫలమైందో, బైక్ కొనివ్వలేదో, కఠినావేశంలో ప్రాణాలు తీసుకునే స్థితికి మన పిల్లలు చేరుతున్నారంటే... అది వారి బలహీనత మాత్రమే కాదు.. మనం వారితో గడిపే సమయం తగ్గిందనడానికి నిదర్శనం. బిడ్డలకు ఆస్తిని ఇవ్వకపోయినా పర్వాలేదు.. వారి బాధను పంచుకునే ‘అమ్మ ఒడిని’, ‘నాన్న భుజాన్ని’ తోడుగా ఇవ్వండి. మోటె శివకుమార్ గ్రామం : కాకునూరు, రంగారెడ్డి (జిల్లా) -
జగిత్యాల
36.0/24.07గరిష్టం/కనిష్టంఎల్లమ్మ తల్లికి బోనాలుపెగడపల్లి: మండలంలోని అయితిపల్లిలో పోచమ్మ, ఎల్లమ్మ తల్లికి గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాలు చేశారు. ఎల్లమ్మ తల్లికి పట్నాలు వేసి నైవేద్యాలు సమర్పించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలై న్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026 -
కదలరు..వదలరు
మెట్పల్లి: మెట్పల్లి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్యుల తీరుపై జోరుగా చర్చ సాగుతోంది. పదిహేనేళ్ల క్రితం విధుల్లో చేరిన వారు అప్పటినుంచి ఇక్కడే కొనసాగుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఇదే ఆసుపత్రికి ఎంతోమంది వైద్యులు వచ్చి.. కొన్నాళ్లకు బదిలీపై వె ళ్లిపోతున్నారు. కానీ కొందరు మాత్రం ఇక్కడి నుంచి కదలడం లేదు. ఒకవేళ బదిలీ చేసినా డిప్యూటేషన్ ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వైద్య శాఖలో బదిలీల ప్రక్రియ సాగుతోంది. ఉన్నతాధికారులు వీరి విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశమైంది. ప్రైవేట్ దందా వల్లనే.. ఉన్నతాధికారుల అండతోనే.. -
● రోగాలకు నిలయం మాదిగకుంట ● టెండర్ పూర్తయినా పట్టని అధికారులు
పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో 803 సర్వే నంబరులో 2.39 ఎకరాల్లడ్కీ కుంట విస్తరించి ఉంది. కొంతమంది ఆక్రమణదారులు కబ్జాకు గురి చేయగా ఇరిగేషన్ అధికారులు స్పందించి ఉన్న భూ మిని అన్యాక్రాంతం కాకుండా కుంట చుట్టూ హద్దురాళ్లు పెట్టారు. ప్రస్తుతం అందులో కలుషిత నీరు చేరి పిచ్చిమొక్కలు పెరిగాయి. మరోవైపు రూ. కో ట్లు విలువ చేసే భూమి నిరుపయోగంగా మారుతోంది. ఏటా వర్షకాలంలో పట్టణంలో ఇదే పెద్ద సమస్యగా మారింది. ఇందులో ఉన్న వ్యర్థాల వద్దకు కు క్కలు, పందులు చేరి స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడి పనులు అక్కడే పట్టణ ప్రగతి, పారిశుధ్య కార్యక్రమంలొ భాగంగా స్వయంగా కలెక్టర్ సత్యప్రసాద్ కుంటను పరిశీలించి మురికినీటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ విషయమై మాజీమంత్రి జీవన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి లేఖ కూడా రాశారు. మాదిగకుంటలోని మురికినీటిని తొలగించేందుకు.. డ్రైనేజీ వ్యవస్థకు నిధులు మంజూరు చేయాలని కోరారు. టెండర్ పూర్తయినా.. కుంటలోని మురికి నీటిని తొలగించేందుకు రూ.1.50 కోట్లతో డ్రైనేజీ నిర్మాణానికి జనవరిలో టెండర్ నిర్వహించారు. ఇందులో కట్టెకోల శ్రీకర్ టెండర్ దక్కించుకున్నారు. ఆరునెలలు గడుస్తున్నప్పటికీ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. సంబంధిత కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకొచ్చి కిలోమీటరు మేర డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని బల్దియా ప్రజలు మున్సిపల్ పాలకవర్గసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రత్యేక శిక్షణ కల్పించాం
ఇప్పటికీ విద్యార్థులకు సంబంధించిన క్లాత్ రాలేదు. ఒకట్రెండు రోజుల్లో వస్తుంది. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాలకు కుట్టుమిషన్పై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. తొందరగానే విద్యార్థులకు అందించేలా మహిళ సంఘాలతో చర్యలు తీసుకుంటున్నాం. – రఘువరణ్, డీఆర్డీఏ పీడీ రాగానే అందజేస్తాం విద్యార్థులకు సంబంధించిన ఏకరూప దుస్తులు రాగానే అందజేస్తాం. క్లాత్ రావడంలో జాప్యం జరిగింది. ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. స్టిచ్చింగ్ చేయించి విద్యార్థులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. – రాము, డీఈవో -
ఏటా ముంపు.. కానరాని కనువిప్పు
గత వర్షాకాలంలో వెంకటాద్రినగర్లో వరద బీభత్సంకోరుట్లలోని ప్రకాశం, ముత్యాలవాడలను ముంచెత్తిన వరద (ఫైల్) జిల్లాకేంద్రంలో 50 వార్డులు ఉన్నాయి. లక్ష జనాభాతో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా గోవిందుపల్లి, వెంకటాద్రినగర్, ఇందిరనగర్, దగ్గులమ్మ, చిలుకవాడ, టాకాసంది, కృష్ణానగర్లోని కొన్ని ప్రాంతాలు వర్షం పడిందంటే వరదలతో ముంచేస్తుంటాయి. గోవిందుపల్లి వెంకటాద్రినగర్ మధ్య ధరూర్ వాగుపై కొన్నేళ్ల క్రితం నిర్మించిన లోలెవల్ వంతెన వరద నీరు వస్తే అటువైపు ప్రజలకు.. ఇటువైపు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోతాయి. వారికి పాలు, మెడిసిన్, ఇతరత్రా సామగ్రి దొరకాలంటే ఇబ్బందికరంగా మారుతుంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ రాకపోకలకు అంతరాయం ఏర్పడతాయి. వరద ఉధృతిని తగ్గించేందుకు యావర్రోడ్లో డైవర్షన్ రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. కోరుట్లలో అదే పరిస్థితి... కోరుట్ల మున్సిపాలిటీలో గత ఏడాది ముఖ్యమైన కాలనీల్లో దాదాపు 80 ఇళ్లు ముంపు నీటికి గురయ్యాయి. పగటి వేళ కావడంతో ప్రజలు అప్రమత్తమై బయటపడ్డారు. రాత్రి వేళ ముంపునీరు వచ్చి ఉంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. ప్రకాశం రోడ్, కల్లూరురోడ్, అయిలాపూర్, ముత్యాలవాడ ప్రాంతాల్లో ముంపుతో జనం సతమతమవుతున్నారు. భరోసా ఏదీ? వరదలు వచ్చిన సందర్భంలో శాశ్వత పరిష్కారాానికి అధికారులు చర్యలు చేపట్టడం లేదు. వరదలు వచ్చిన అనంతరం పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారే తప్ప పరిష్కారం మాత్రం పట్టించుకోవడం లేదు. చిన్నపాటి వర్షానికే కాలనీలన్నీ జలమయం అవుతుంటే కనీసం ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ధర్మపురి గోదావరి పరీవాహక ప్రాంతంలో వానాకాలంలో బిక్కుబిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం అంటేనే హడలిపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే తప్ప చేసేదేమీలేదు. భారీ వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రణాళికలు రూపొందించాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపడతాం. – సత్యప్రసాద్, కలెక్టర్ లోతట్టు ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటాం -
యూరియా అందుబాటులో ఉంచండి
● కలెక్టర్కు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వినతి కోరుట్లరూరల్: రైతులకు సరిపడా యూరియా ను అందుబాటులో ఉంచాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కలెక్టర్ బి.సత్యప్రసాద్ను కోరారు. కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వర్షాకాలం వ్యవసాయ పనులు ప్రారంభం అవుతున్నాయని, సాగుకు సరిపడా యూరియా, డీఏపీ, ఇతరత్రా ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల విక్రయ కేంద్రాల్లో నిల్వ ఉండేలా వ్యవసాయ యంత్రాగాన్ని సమాయత్తం చేయాలని సూచించారు. దీనిపై ముందస్తు ప్రణాళికతో వెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. సాధారణ ప్రసవాలకు మొగ్గు చూపాలిజగిత్యాలరూరల్: గర్భిణులు సాధారణ ప్రసవాలకు మొగ్గు చూపాలని డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి అన్నారు. మంగళవారం సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ నిర్వహించారు. ఆరోగ్యకేంద్రాలు, సీహెచ్సీ, పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రతినెలా 9న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాధారెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కుర్దుస్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పవర్ లిఫ్టింగ్లో ధర్మపురి వాసికి బంగారు పతకంధర్మపురి: ధర్మపురికి చెందిన రంగు విరంచి స్పప్నిక పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం సాధించింది. స్వప్నిక సోమవారం చైన్నెలో జరిగిన పవ ర్ లిఫ్టింగ్లో ఆలిండియా చాంపియన్ షిప్ పోటీల్లో విజ యం సాధించింది. జేఎన్టీయూ తరఫున పోటీలో పాల్గొని 84 కిలోల విభాగంలో పోటీ పడి స్కౌట్లో 275 కిలోలు, బ్రేంచ్ఫ్రెస్లో 125, డెడ్ లిఫ్ట్లో 190 మొత్తం 590 కిలోల బరువు ఎత్తి బంగారు పతకం సాధించింది. -
కలెక్టర్ ఆదేశించినా.. కదలని పనులు
రాయికల్: బల్దియాలో ప్రధాన సమస్యగా మారింది ఒకటో వార్డులోని మాదిగకుంట. పట్టణంలోని మురికినీరంతా చేరేది ఈ కుంటలోకే. వర్షాకాలంలో 12వార్డుల మురికినీరంతా ఈ కుంటలోకి వచ్చి చేరడం ద్వారా దోమలు స్వైరవిహారం చేస్తుంటాయి. ఏటా ప్రజలు మలేరియా, డెంగి వంటి వ్యాధుల బారిన పడి వైద్య ఖర్చులకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ కుంటలోని మురికినీటిని తొలగించి పట్టణ ప్రజలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ ఏడాది మార్చి 10న స్వయంగా పరిశీలించి యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అప్పటి మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, ఆర్డీవో, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. -
దుబాయ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
రాయికల్: ఎమిరెట్స్ తెలంగాణ సంస్కృతి, సంక్షేమ సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో దుబాయ్లోని అజ్మాన్లోగల హ్యాబిటెట్ స్కూల్ ఆడిటోరియంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనకు పోరాడిన ఉద్యమకారుల త్యాగఫలమే తెలంగాణ అన్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్కుమార్ మాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి గల్ఫ్ సంక్షేమానికి అడుగులు వేయడం అభినందనీయమన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫౌండర్ కిరణ్కుమార్, మాజీ అధ్యక్షుడు రాదారపు సత్యం, ఉపాధ్యక్షుడు అలిగేటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ శేఖర్గౌడ్, కోశాధికారి తిరుమల్రావు, కల్చరల్ సెక్రటరీ వినోద్కుమార్, తెలుగు సంఘాల అధ్యక్షుడు రాజశ్రీనివాస్రావు, సమియోద్దీన్, కట్కం రవి, నర్సింహ, ఎస్వీఎస్.రెడ్డి పాల్గొన్నారు. -
డంపింగ్యార్డుపై రాజకీయం వద్దు
ధర్మపురి: ప్రభుత్వ స్థలంలో డంపింగ్యార్డు వద్దంటూ కొందరు రాజకీయం చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. మండలంలోని తిమ్మాపూర్ – మద్దునూర్ గ్రామాల మధ్య సర్వేనంబర్ 266లోగల ప్రభుత్వ స్థలాన్ని డంపింగ్యార్డు కోసం కేటాయిస్తే కొందరు గ్రామస్తులను రెచ్చగొడుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 2021లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్థలా న్ని కేటాయించిందని గుర్తు చేశారు. డంపింగ్యార్డుతో తిమ్మాపూర్ గ్రామస్తులకు వచ్చే నష్టమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలుముల లక్ష్మణ్, వేముల రాజేష్, కౌన్సిలర్లు, సర్పంచ్ బాలాగౌడ్, నాయకులు సుముక్ రఫియోద్దిన్ తదితరులున్నారు. ఎంవీ నర్సింహారెడ్డి మృతిజగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఎస్కేఎల్ఎన్రావు బీఈడీ కళాశాల కరస్పాండెంట్, ప్రముఖ రచయిత ఎంవీ.నర్సింహారెడ్డి (85) సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతిపట్ల పలువురు పట్టణ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
జగిత్యాలరూరల్: విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం పోచంపేట, లక్ష్మీదేవిపల్లిలో రూ.10లక్షలతో నిర్మించే మహిళా సంఘ భవనాలకు ఆదివారం భూమిపూజ చేశారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుని మధ్యలో నిలిపివేసినవారికి తిరిగి చేపడితే నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్లాస్టిక్ నిషేధం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు శేఖర్, జగదీష్, ఉప సర్పంచ్లు ఉపేందర్, సుజాత, ఎంపీడీవో సలీం, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు మల్లారెడ్డి, నర్సింహారెడ్డి, నాయకులు సొల్లు సురేందర్, రమేష్, రాజు, శంకర్ రెడ్డి, భాస్కర్, శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, శేఖర్గౌడ్ పాల్గొన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో రూ.20లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి, రూ.10 లక్షలతో నిర్మించే మహిళాసంఘం భవనానికి భూమిపూజ చేశారు. రూ.235 కోట్లతో కొత్త ఆస్పత్రి నిర్మాణం చేపడతామన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, సర్పంచ్ నోముల రమ్య, ఉప సర్పంచ్ బాలు, నాయకులు దామోదర్ రావు, రవీందర్ రెడ్డి, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ హకీం, డీఈ మిలిన్, ఎంపీవో రవిబాబు, ఏఈ విజయ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
రూ.రెండు లక్షలకు మించి ఇవ్వడం లేదు
భూమి ఎంతున్నా రూ.2లక్షలకు మించి బ్యాంకులు రుణం ఇవ్వడం లేదు. ఎక్కువ కావాలంటే భూమిని మార్టిగేజ్ చేయమంటున్నారు. సక్రమంగా రుణం చెల్లిస్తున్న రైతులకు అధిక మొత్తంలో పంట రుణం ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. ఆ మేరకు బ్యాంకర్లపై ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి. – వేముల విక్రం రెడ్డి, ధర్మపురి(మం) స్కేల్ ఆఫ్ పైనాన్స్ మేరకే.. వానాకాలం సీజన్కు అన్ని బ్యాంకుల్లో పంట రుణాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే కొందరు పాత రుణాలు చెల్లించి.. తిరిగి తీసుకుంటున్నారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు పంట రుణం ఇస్తాం. సక్రమంగా రుణం చెల్లించే వారికి స్కేల్ ఆఫ్ పైనాన్స్ మేరకు ఎక్కువ మొత్తంలో పంట రుణం ఇస్తున్నాం. – రాంకుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్, జగిత్యాల -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో జైపాల్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఏరియా ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శించారు. వర్షాకాలంలో డెంగీ, మలేరియా వైరల్ జ్వరాలు, అతిసారం వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, శుభ్రమైన నీటిని మా త్రమే తాగడం ద్వారా వ్యాధులను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు కడార్ల వేణుకుమార్, సర్పంచ్ గంగోత్రి, మాజీ ఎంపీటీసీ పరుశురాం పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో లోపాలు లేకుండా చూడాలిఇబ్రహీంపట్నం: ఓటర్ల జాబితాలో లోపాలు లేకుండా చూడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు కార్యకర్తలకు సూచించారు. మండలకేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనూప్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వోడ్డెపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, మండల ఇన్చార్జి ఏలేటి నరేందర్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పంతంగి వెంకటేశ్యాదవ్, రణదీర్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. సత్యానంద మహర్షి బోధనలు అనుసరణీయంకోరుట్ల: భగవాన్ సత్యానంద మహర్షి బోధనలు, సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమని ఆధ్యాత్మిక గురువులు ప్రవచించారు. పట్టణంలో మూడురోజులపాటు నిర్వహించిన భగవాన్ శ్రీసత్యానంద మహర్షి 500 సంచార సత్సంగ్ మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, గురుస్మరణ, ధ్యాన కార్యక్రమాలు సత్సంగాలు, శాంతి మంత్రాలు నిర్వహించారు. కార్యక్రమంలో భగవాన్ శ్రీసత్యానంద మహర్షి భక్తమండలి, కోరుట్ల 500 సంచార సత్సంగ మహోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీ ● అడ్డగోలు కోతలపై మిల్లర్ను ప్రశ్నించిన రైతు ● ‘బిచ్చగాడివా.. గరీబోనివా’ అంటూ నోరుపారేసుకున్న మిల్లర్ మెట్పల్లిరూరల్: ధాన్యం కొనుగోళ్లలో రైతులు దోపిడీకీ గురువుతున్నారు. నాణ్యత పేరుతో మిల్లర్లు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మెట్పల్లి మండలం కొండ్రికర్లలోని ఓ రైస్మిల్లర్ ధాన్యంలో తాలు, తప్ప పేరుతో నిలువు దోపిడీకి గురిచేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కొండ్రికర్లకు చెందిన ఆకుల శ్రీనివాస్ 1,308 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించగా.. దానిని మహాలక్ష్మీ రైస్మిల్కు తరలించారు. మిల్లు యజమాని గంగారెడ్డి 65 బస్తాల ధాన్యం కోత విధించాడు. దీంతో శ్రీనివాస్ మిల్లుకు చేరుకుని అంతమొత్తం కోత విధించడం సరికాదన్నాడు. దీంతో గంగారెడ్డి ‘నువ్వు బిచ్చగాడివా..గరిబోనివా’ అంటూ దుర్భషలాడాడని రైతు శ్రీనివాస్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన ఆయన ముందుగా రైస్మిల్లర్తో మాట్లాడారు. అయినప్పటికీ గంగారెడ్డి వినలేదు. శ్రీనివాస్ మరోమారు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆదివారం మిల్లుకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. రైతుకు అన్యాయం చేస్తే సహించేదిలేదంటూ విషయాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి రైస్మిల్లర్ జవాబు ఇస్తూ.. జిల్లా అంతటా ఇలానే జరుగుతోందని చెప్పడం గమనార్హం. -
ముగిసిన కస్టడీ.. వీడని మిస్టరీ
కరీంనగర్క్రైం: పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు సుభోద్సింగ్, రఘునాథ్ కర్మాకర్, రవీష్కుమార్ను నాలుగు రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకోగా.. బంగారం ఆచూకీ మిస్టరీగానే మిగిలింది. ఇదే సమయంలో పరారీలో ఉన్న మరో నిందితుడిని బిహార్లో అరెస్టు చేయడం కేసు దర్యాప్తునకు బలం చేకూర్చింది. కరీంనగర్ పోలీసు కమిషనరేట్లో ఆదివారం సీపీ గౌస్ఆలం కేసు దర్యాప్తు, పురోగతి అంశాలను వివరించారు. వెలిచాల వద్ద తుపాకులు స్వాధీనం నిందితులు వెలిచాల బైపాస్ రోడ్డుకు సమీపంలో చెట్ల పొదల్లో రెండు తుపాకులు దాచినట్లు అంగీకరించారని, వాటిని స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు. దోపిడీ అనంతరం ధర్మపురి వైపు వెళ్లి బగ్గారం అటవీ ప్రాంతంలో మొబైల్ పడేసినట్లు చెప్పడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వస్తువులు కేసు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారనున్నాయని, ఫోన్లోని కాల్ డేటా, లొకేషన్, ఇతర డిజిటల్ ఆధారాలు నిందితుల నెట్వర్క్ను బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బంగారం ఆచూకీపై గందరగోళం దోపిడీకి గురైన సొత్తు ఆచూకీ విషయంలో నిందితులు సహకరించడం లేదని సీపీ స్పష్టం చేశారు ఆభరణాలు ఎక్కడ దాచారు..? ఎవరికి విక్రయించారు..? ఎవరి ద్వారా తరలించారు..? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి..? వంటి అంశాలను నిందితులు వివరించడం లేదని అన్నారు. విచారణలో పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇవ్వడంతో పాటు పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మాట మార్చిన రఘునాథ్ కర్మాకర్ కేసు దర్యాప్తులో రఘునాథ్ కర్మాకర్ వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. గతంలో గుండాల అటవీ ప్రాంతంలో దోపిడీ సొత్తును దాచిపెట్టినట్లు తెలిపిన నిందితుడు, ప్రస్తుతం ఆ సమాచారం సరైంది కాదని చెబుతున్నాడు. దీంతో నిందితులు ఉద్దేశపూర్వకంగానే నిజాన్ని దాచిపెడుతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కస్టడీ కోరనున్న పోలీసులు నిందితుల నాలుగు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. దర్యాప్తునకు అవసరమైన పూర్తి సమాచారం లభించకపోవడంతో మరికొన్ని రోజులు కస్టడీకి కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నట్లు సీపీ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు అమర్సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ ఆమరేంద్ర సింగ్ను బిహార్లోని సలింపూర్ ప్రాంతంలో జూన్ 4న అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఆదివారం కరీంనగర్కు తీసుకొచ్చినట్లు సమాచారం. -
ఏడాదిలోపు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి
గొల్లపల్లి: ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతామని, ఏడాదిలోగా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఆదివారం మండలంలో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. చిల్వకోడూరు పెద్దచెరువు తూ ముకు రూ.7.65లక్షలతో మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.వెయ్యి కోట్లు అవసరం అవుతాయని, మంజూరుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అంగీకరించారని తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మండలకేంద్రంలో పోచమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపెల్లి గంగ న్న, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, నాయకులు నిశాంత్రెడ్డి, దాసరి తిరుపతి పాల్గొన్నారు. -
జగిత్యాల
40.0/34.09గరిష్టం/కనిష్టంసత్యభామ చెరువులో ‘బర్డ్వాచ్’్చజగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో బోర్నపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలోని సత్యభామగా పిలిచే చెరువు ఉంది. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు కొనసాగుతాయి. నృసింహుని సన్నిధిలో రద్దీధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. అధికమాసం బహుళషష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో స్నానాలు ఆచరించారు. ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026 -
కరువు ఏర్పడితే రేవంత్ వైఫల్యమే
జగిత్యాలటౌన్: పోలవరానికి లోపాయికారిగా సహకరించి తెలంగాణను ఏడారిగా మార్చే కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పిల్లర్లు కుంగితే మరమ్మతు చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిగ్గుపడాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చి 30నెలలు గడుస్తున్నా సాగునీటి ప్రాజెక్టులకు కనీసం డిజైన్లు రూపొందించలేని దుస్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందన్నారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు తుమ్మిడిహట్టి పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లిన సీఎం తుమ్మిడిహట్టిని ఎందుకు సందర్శించలేదో చెప్పాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయి కరువు బారిన పడే ప్రమాదం పొంచిఉందని, అలాంటి దుస్థితే వస్తే ముమ్మాటికీ రేవంత్ వైఫల్యమేనన్నారు. తన కుటుంబ లబ్ధికోసం ఫ్యూచర్ సిటీ అంటున్న సీఎం.. ప్రజల భవిష్యత్తును గాలికొదిలేశారని విమర్శించారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేరుగా మాట్లాడలేని సీఎం 152మీటర్ల వద్ద ప్రాజెక్టు నిర్మిస్తాననడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కాంగ్రెస్లో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటారో ఎవరికీ తెలియదని, 2034 వరకు తానే సీఎం అంటున్న రేవంత్ మాటలు హాస్యాస్పదమన్నారు. ఏడాదికి లక్ష చొప్పున ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 17వేలేనన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు లేవని, రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, రేవంత్ చేతిలో మోసపోని వర్గం లేదంటే అతిశయోక్తి కాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు గోదావరి జలాలతో ముడిపడి ఉందని గుర్తించిన కేసీఆర్ గోదావరి జలాల్లో హక్కును కోల్పోకూడదనే లక్ష్యంతో కాళేశ్వరం, మేడిగడ్డ వంటి ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కేసీఆర్ అవసరం ఉందని ప్రజలు గుర్తించారని, రేవంత్ ఎన్ని కుట్రలు చేసినా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు హరిచరణ్రావు, గాజుల రాజేందర్, జున్ను రాజేందర్, పుప్పాల అశోక్, దుర్గయ్య, ధర రమేష్, రఘువీర్, గుండ మధు, నేహాల్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
జగిత్యాల: నేషనల్ ఎల్జిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ లత తెలిపారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. ఆమె ఎస్పీ అశోక్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈనెల 21న నిర్వహించే పరీక్షకు నాచుపల్లి జేఎన్టీయూలో రెండు, ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాలలో ఒక సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 807 మంది పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని, దివ్యాంగులకు మధ్యాహ్నం 2నుంచి 6.15 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అర్హులందరికీ పథకాలుజగిత్యాలరూరల్: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని అదనపు కలెక్టర్ రా జాగౌడ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాసలో ప్రజాపాలన – ప్రగతి ప్రణా ళిక గ్రామసభలో మాట్లాడారు. పథకాల అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించా లన్నారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. యువ త సన్మార్గంలో పయనించి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. రూరల్ సీఐ సుదాకర్, ఎస్సై ఉమాసాగర్, తహసీల్దార్ హకీం, ఎంపీడీవో రాజేశ్వరి, సర్పంచ్ మిల్కూరి శంకరయ్య పాల్గొన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరామల్లాపూర్: విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ సమస్య లేకుండా చూస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం అన్నారు. మండలంలోని మొగిలిపేట 33/11 కేవీ సబ్స్టేషన్లో ఏర్పాటు చేసిన ఇంటర్ లింకింగ్ లైన్ను శనివారం ప్రారంభించారు. జగిత్యాల సర్కిల్ పరిధిలో 118 సబ్ స్టేషన్లు ఉన్నాయని, అందులో 36 స్టేషన్లలో ఇంటర్ లింకింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. తద్వారా వినియోగదారులు, రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించే అవకాశం ఏర్పడిందన్నారు. ఆయన వెంట ట్రాన్స్కో డీఈలు మధుసూదన్, గంగరాం, ఏడీఈ అమరేందర్, రాఘవపేట ఏఈ సంతోష్, సబ్ ఇంజినీర్లు, సిబ్బంది ఉన్నారు. బ్రెయిన్ ట్యూమర్పై అవగాహన అవసరంజగిత్యాల: బ్రెయిన్ ట్యూమర్ వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికై నా వస్తుందని, దానిపై అవగాహన అవసరమని న్యూరో సర్జన్ రాజీవ్రెడ్డి అన్నారు. కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. చాలా సందర్భాల్లో ఇవి నాన్ కాన్సరస్లా ఉంటుందని, మొదట్లో లక్షణాలు గుర్తించకుండా ఆలస్యం చేస్తే ఇబ్బంది తప్పదన్నారు. మొదట్లోనే గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుందన్నారు. నిరంతరం తలనొప్పి, తలతిరగడం, చూపు మసకబారడం వంటి లక్షణాలుంటే వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, చంద్రశేఖర్, సాయితేజ పాల్గొన్నారు. అంజన్న సన్నిధిలో ప్రముఖుల పూజలు మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని శనివారం కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా, మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. శేషవస్త్రంతో సన్మానించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, చంద్రశేఖర్, అశోక్, ఏఎస్సై రమణా రెడ్డి పాల్గొన్నారు. -
పచ్చిరొట్టకు తగ్గిన సబ్సిడీ
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు భూసారం పెంచేందుకు తొలకరి కురవగానే జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలు చల్లుతుంటారు. ఈ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తుంది. అయితే గతేడాది 60శాతం ఉన్న సబ్సిడీని ఈ ఏడాది 50శాతానికి కుదించింది. పైగా విత్తనాల ధర కూడా గతేడాదితో పోల్చితే బాగా పెరిగింది. ఓ వైపు సబ్సిడీ తగ్గింపు.. మరోవైపు రేట్లు పెరగడంతో రైతులు పెదవి విరుస్తున్నారు. 13,400 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు జిల్లాకు 13,400 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటివరకు 12,491 క్వింటాళ్లు మాత్రమే చేరాయి. ఇందులో 827 క్వింటాళ్ల జనుము, 11,674 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు రాగా.. సింగిల్విండోలు, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నారు. వరిధాన్యం, మక్కల డబ్బులు ఇంకా రైతుల ఖాతాల్లో జమకాకపోవడంతో పచ్చిరొట్ట విత్తనాలు కొనేందుకు రైతులు వేచిచూస్తున్నారు. రెట్టింపయిన ధరలు గతేడాదితో పోల్చితే పచ్చిరొట్ట విత్తనాల ధరలు బాగా పెరిగాయి. జీలుగ కిలోకు రూ.142.50 ఉండగా.. అందులో రూ.71.25 సబ్సిడీ ఇచ్చారు. రైతు కిలోకు రూ.71.25 చెల్లించాల్సి వచ్చేది. ఈ ఏడాది కిలో 163.50కి పెంచారు. ఈ లెక్కన కిలోకు రూ.21 పెరిగింది. ఇది 30 కిలోల బస్తాపై ఏకంగా రూ.630 అదనపు భారం పడుతోంది. గతేడాది జనుము కిలోకు రూ.125.50 ఉండగా.. ఈ ఏడాది రూ.155.50కి పెంచారు. ఈ లెక్కన కిలోకు రూ.30 పెరిగి.. 40కిలోల బస్తాపై రూ.1200 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన రేట్ల ప్రకారం 30 కిలోల జీలుగ బస్తాకు రూ.2452.5, జనుము 40 కిలోల బస్తాకు రూ.3,110గా నిర్ణయించారు. -
ప్రధాన ఆస్పత్రిలో నీటి కటకట
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు వస్తుంటారు. కొద్దిరోజులుగా పైప్లైన్లు లీకేజీ కావడంతో మంచినీరు రాక రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి నిత్యం చికిత్స కోసం జిల్లాతోపాటు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలవారు వస్తుంటారు. ఆస్పత్రిలో నీటి సరఫరా నిలిచిపోవడంతో వారంతా అల్లాడిపోతున్నారు. వాష్రూమ్లలో నీరు రాక కంపు కొడుతున్నాయి. నల్లాలు పనిచేయక గుక్కెడు నీటి కోసం రోగుల బాధలు వర్ణణాతీతంగా మారింది. వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకపోవడంతో తాగునీటిని బయట నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. తాగడానికి కొనుగోలు చేసుకుంటున్నప్పటికీ మలవిసర్జన, స్నానాలకు బాత్రూమ్లలో నీరు రాకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. బెడ్పై నుంచి లేవలేని రోగులు, బెడ్పైనే ఉన్న రోగులకు తప్పనిసరిగా నీటి అవసరం ఉంటుంది. ప్రతి జనరల్ వార్డులో అత్యధిక రోగులుంటారు. బాత్రూమ్లలో నీరు రాకపోవడంతో మౌళిక వసతులకు ఇబ్బందికరంగా మారింది. డయాలసిస్కూ అదే పరిస్థితి ఇదే ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ కూడా ఉంది. వాస్తవానికి ఈ కేంద్రానికి అత్యధికమైన నీరు అవసరం ఉంటుంది. దీనికి సపరేట్ ప్లాంట్ ఉందని, నీరు వస్తోందని అధికారులు చెబుతున్నా.. ఒకవేళ పరిస్థితి చేయిదాటితే పేషెంట్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతుంది. ప్రజాప్రతినిధులూ.. జర చూడండి జిల్లాకే ఈ ఆస్పత్రి గుండెకాయ లాంటిది. ఇటీవల మెడికల్ కళాశాల కావడంతో నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. దాదాపు వెయ్యికి పైగా అవుట్ పేషెంట్స్ ఉంటారు. వీరిలో 300కు పైగా ఇన్పేషెంట్స్ ఉంటారు. ఇలాంటి ఆస్పత్రిలో నీటి సరఫరా నిలిచిపోయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం పట్టించుకోకవడం శోచనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చెడిపోయిన పైప్లైన్ ఆస్పత్రికి వచ్చే మున్సిపల్ పైప్లైన్ చెడిపోవడంతోనే నీరు సరిగా రావడం లేదని వైద్యాధికారులు అంటున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. కనీసం మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా సంపుల్లో నీరు నింపితే రోగులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజలకు, ఆస్పత్రికి వచ్చిన రోగులకు మంచినీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. ఒకవైపు ఎండలు.. ఉక్కపోత ఆస్పత్రిలో ఎలాంటి వసతులు లేకపోవడం.. మరోవైపు ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. దాహంతో అల్లాడుతున్నారు. కొంతకాలంగా ఇదే పరిస్థితి ఉన్నా.. పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పటికై నా స్పందించి వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జనరల్ ఆస్పత్రిలో నీరు రాని ట్యాప్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం మున్సిపల్ ద్వారా వచ్చే నీటి పైప్ మరమ్మతులతో మంచినీటి సౌకర్యం నిలిచిపోయింది. మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా తెప్పించి సంప్లో పోయించేలా చర్యలు తీసుకుంటున్నాం. రోగులు, వారి బంధువులు బయట కొనుగోలు చేయకుండా ఉన్న నీటిని వినియోగించుకోవాలి. – విజయ్, ఆర్ఎంవో -
గోదావరిలో మురుగునీరు కలవకుండా చర్యలు
ధర్మపురి: గోదావరిలో మురుగు నీరు కలవకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శనివారం మార్నింగ్ వాక్ ద్వారా పుష్కరఘాట్లు, వివిధ వార్డుల్లోని డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. పుష్కరాలకు నిత్యం వేలాది మంది భక్తులు రానున్నందున వారికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గోదావరిలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడతామన్నారు. నది పవిత్రతను కాపాడాలని మున్సిపల్ శాఖకు సూచించారు. ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణవెల్గటూర్: ఎండపల్లి మండలం కొత్తపేటలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఛత్రపతి గొప్ప యోధుడని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పత్తిపాక రిజర్వాయర్, అక్కపల్లి ఎత్తిపోతల పథకం, రోళ్లవాగు పూర్తి చేస్తామని వివరించారు. సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గెల్లు చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సంగ రమేశ్, ఎండపల్లి ప్యాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
సబ్సిడీ పెంచి.. రేటు తగ్గించాలి
ఒక్క రైతు సాధారణంగా ఒకటి, రెండు పచ్చిరొట్ట విత్తనాల బస్తాలు భూమిలో చల్లుతారు. గతేడాదితో పోల్చితే రైతుపై దాదాపు రూ.2వేల వరకు అదనపు భారం పడుతోంది. పండించే పంటకు విత్తనాల మాదిరిగా రేట్లు పెరగడం లేదు. ప్రభుత్వం ఆలోచించి సబ్సిడీ పెంచి.. రేటు తగ్గించాలి. – మారు మురళీధర్ రెడ్డి, వెల్లుల్ల, మెట్పల్లి అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు జిల్లాకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు తెప్పిస్తున్నాం. ఇక్కడి రైతులు వరి సాగు ఎక్కువగా చేస్తుంటారు. అందుకే పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సింగిల్ విండో కేంద్రాలు, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నాం. – వడ్డేపల్లి భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొని విద్యార్థి..
గోదావరిఖని(రామగుండం): Ý린MýS VýS…V>¯]l-VýSÆŠ‡ çÜÒ$ç³…-ÌZ BW E¯]l² yîlïÜG… Ðéů]l$¯]l$ ÉîlMö° V>…«©-¯]l-VýS-ÆŠ‡MýS$ ^ðl…¨¯]l ѧéÅ-Ǧ f…VýS ÝëMóS-™Œæ-(17) Ð]l$–†^ðl…§éyýl$. ç³§ø ™èlÆý‡-VýS† ´ëOòܯ]l ÝëMóS™Œæ ÐólçÜÑ òÜÌS-Ð]l#-Ë$ M>Ð]l-yýl…-™ø C…sìæ Ð]l§ólª E…r$-¯é²yýl$. Ôèæ°ÐéÆý‡… ÐólMýS$-Ð]l-gêÐ]l¬¯]l 2 VýS…rÌSMýS$ ¨Ó^èl-{MýS-Ðéçßæ-¯]l…Oò³ Ððlâ¶æ$¢…yýl-V> Æøyýl$z ç³MýSP¯]l °Íí³¯]l ÐéůŒSMýS$ GÌê…sìæ C…yìl-MóS-rÆý‡$Ï ÌôæMýS-´ù-Ð]l-yýl…-™ø Ððl¯]lMýS ¯]l$…_ ÉîlMö¯é²yýl$. ¡{Ð]l-V>Ķæ*-ÌS-™ø AMýSP-yìl-MýS-MýSPyól Ð]l$–†^ðl…§éyýl$. Ð]l$–™èl$yìl ™èl…{yìl À„ýS-糆 íœÆ>ŧýl$ Ðól$Æý‡MýS$ MóSçÜ$ §ýlÆ>Åç³#¢ ^ólçÜ$¢-¯]l²r$Ï ïÜI C…{§ýl-õܯéÆð‡yìlz õ³ÆöP-¯é²Æý‡$. JMýSP-V>¯öMýSP Möyýl$MýS$ Æøyýl$z {ç³Ð]l*-§ýl…-ÌZ Ð]l$–†^ðl…§ýl-yýl…-™ø MýS$r$…º çÜ¿¶æ$Å-Ë$ MýS±²Æý‡$-Ð]l¬-±²Æý‡$-V> ÑÌS-í³-çÜ$¢-¯é²Æý‡$. ˘ నేత్రదానం కోల్సిటీ(రామగుండం): రోడ్డు ప్ర మాదంలో అకాల మరణం చెందిన సాకేత్ నేత్రదానం ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. దుఃఖంలోనూ కొడుకు నేత్రాలను దానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు కుటుంబ సభ్యులు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్నాయక్ బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. అనంతరం సాకేత్ కార్నియాలను సేకరించిన హైదరాబాద్కు తరలించారు.


