breaking news
Jagitial District News
-
ఎన్నికలతో ముగిసి..
ఆటలతో మొదలై..పోలీస్ స్పోర్ట్స్ మీట్తో మొదలైన 2025.. ఎమ్మెల్సీ ఎన్నికలతో వేగం అందుకుని, పంచాయతీ ఎన్నికలతో ప్రశాంతంగా ముగిసింది. దక్షిణకాశీగా పిలిచే వేములవాడలో దర్శనాలు నిలిపివేయడం భక్తులకు తీవ్ర అసౌకర్యం కల్పించినా.. ఆలయాభివృద్ధి కోసం తప్పలేదు. సీబీఐ వామనరావు దంపతుల కేసు.. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై విచారణ ప్రారంభించింది. క్రిప్టో కరెన్సీ పేరిట వెలుగుచూసిన రెండు కుంభకోణాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేశాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ను ‘సిట్’ విచారించింది. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన కోత్వల్ కృష్ణ (43) గుండెపోటుతో మృతిచెందాడు. కృష్ణ జగిత్యాల పట్టణంలోని మార్కండేయనగర్కు చెందిన ఎక్కల్దేవి కృష్ణ వద్ద రూ.70వేలు తీసుకున్నాడు. అనంతరం రెండు ఫోన్నంబర్ల ద్వారా కృష్ణ సెల్ఫోన్కు ఫోన్పే చేయించాడు. ఆ రెండు నంబర్లు సైబర్క్రైంకు సంబంధించినవి కావడంతో ఎక్కల్దేవి కృష్ణ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. బాధితుడు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నవంబర్ 3న కోత్వల్ కృష్ణను అరెస్ట్ చేసి జగిత్యాల స్పెషల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో కృష్ణ సోమవారం ఉదయం ఛాతిలో నొప్పిగా ఉందని జైలు సిబ్బందికి తెలపడంతో జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఎస్కార్ట్ సిబ్బందితో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆయన మృతివార్తను సబ్జైలర్ ఉన్నతాధికారులు, కుటుంబసభ్యులకు తెలిపారు. ఆర్డీవో మదుసూదన్, రెండో అదనపు జుడిషియల్ మేజీస్ట్రేట్ నిఖిష ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో తీవ్రంగా రోధించారు. కృష్ణపై సూర్యపేట, ములుగు, కొత్తగూడెం, హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్లో పలు కేసులు నమోదై ఉన్నాయి. నిర్మల్ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు ఉంది. మొత్తంగా అతడిపై సుమారు 50 కేసుల వరకు ఉన్నట్లు సమాచారం. మృతునిది నిర్మల్ జిల్లా కేంద్రం విచారణ చేపట్టిన ఆర్డీవో మధుసూదన్ కేసు నమోదు చేసిన పట్టణ సీఐ కరుణాకర్ -
ఇక..పురవేఢీ!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాలకవర్గాల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న బల్దియాల్లో ఎన్నికల నగరా మోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణకు కార్యాచరణ చేపట్టింది. మంగళవారం నుంచి వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి, జనవరి 1న పట్టణ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. 5న ఆయా మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ కమిషనర్లు రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జనవరి 10న వార్డుల వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ చేపట్టనున్నట్లు ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. -
వృద్ధురాలిపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి
● చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి జగిత్యాలక్రైం: మతిస్థితిమితం లేని ఓ వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లిలో చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ కథనం ప్రకారం.. హైదర్పల్లికి చెందిన వంగ రాజవ్వ (72) తన మనుమరాలు గోనెపల్లి మమతతో ఆదివారం మధ్యాహ్నం మాట్లాడుతోంది. అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని గోనెపల్లి అనిల్ రాజవ్వను కర్రతో కొట్టాడు. తల, చాతిలో బలమైన గాయాలవడంతో స్థానికులు జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతితంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో సోమవారం విషాదం నింపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సారంపల్లికి చెందిన మహమ్మద్ హమీద్(47)కు సోమవారం చాతిలో మంటగా అనిపించింది. కుటుంబ సభ్యులు బద్దెనపల్లిలోని ఆర్ఎంపీ పర్శరాములు క్లినిక్కు తీసుకెళ్లగా రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఇంజక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే హమీద్ స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హమీద్ను వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హమీద్ అప్పటికే మరణించాడని తెలపడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య షబేరా, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో తన భర్త మరణించాడని మృతుని భార్య షబేరా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు. హుజూరాబాద్రూరల్: మండలంలోని శాలపల్లె ఇంద్రనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సోనవేని కనుకయ్య(74) మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన కనుకయ్య రోడ్డు దాటుతుండగా హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనుకయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. పెళ్లయిన రెండు నెలలకే..● రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన కండ్లి లోకేశ్ (23) బైక్ అదుపుతప్పి కింద పడి మృతిచెందాడు. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. లోకేశ్కు కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన శ్వేతతో రెండు నెలల క్రితం వివాహమైంది. ఆదివారం రాత్రి బైక్పై భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్తున్నాడు. తక్కళ్లపెల్లి శివారులో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో లోకేశ్, శ్వేత తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో లోకేశ్ మృతిచెందాడు. వివాహమైన రెండు నెలలకే లోకేశ్ మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వాహనం అదుపు తప్పి యువకుడి మృతిరాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలూరుకు చెందిన జటోతు భూమేశ్ (19) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూమేశ్ స్నేహితుడైన దినేశ్తో కలిసి ద్విచక్ర వాహనంపై రాయికల్ నుంచి చింతలూరు వైపు వెళ్తున్నారు. భూపతిపూర్ శివారులో వాహనం అదుపుతప్పి రేలింగ్కు ఢీకొనడంతో భూమేశ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దినేశ్ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో భూమేశ్ కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. -
జగిత్యాల
27.0/12.07గరిష్టం/కనిష్టంఅయ్యప్పకు శాస్ర్త్రాపీతిరాయికల్: పట్టణంలోని చెన్నకేశవనాథ ఆలయంలో చండీపరివార్, భక్తుల సహకారంతో అయ్యప్పస్వామికి శాస్ర్త్రాపీతి మహోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు మునుగోటి సత్యనారాయణశర్మ, సాయిశర్మ ధ్వజారోహణం, గణపతి హోమం చేశారు. వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి కొనసాగుతుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. ఉదయం పొగమంచు కురుస్తుంది. ‘ముక్కోటి’కి కొండగట్టు ముస్తాబుమల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం ముక్కో టి ఏకాదశికి ముస్తాబైంది. ఉత్తరద్వారం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి దర్శనాన్ని ఉదయం 5గంటల నుంచే కల్పిస్తారు. మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
సమస్యలు పరిష్కరించండి
జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. యావర్రోడ్ను 60 నుంచి 100 ఫీట్లకు విస్తరించాల్సి ఉందన్నారు. సాగునీటి ఇబ్బందులు లేకుండా కాలువలు మరమ్మతు చేపట్టాలన్నారు. రోళ్లవాగుకు అటవీశాఖ అనుమతులు ఇప్పించి గేట్లు బిగించాలని కోరారు. డీఎంహెచ్వోగా సుజాతజగిత్యాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా సుజాత నియామకం అయ్యారు. ఇక్కడి వైద్యాధికారి శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయన స్థానంలో సుజాత బాధ్యతలు స్వీకరించారు. ఆమె కలెక్టర్ సత్యప్రసాద్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించాలిమల్లాపూర్: గ్రామపంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్కో ఏడీఈ అమరేందర్ అన్నారు. వ్యవసాయ, గృహ, వాణిజ్య విద్యుత్ బకాయిలను నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా చెల్లించి సంస్థ నిర్వహణకు తోడ్పడాలన్నారు. ప్రజలకు మెరుగైన నిరంతర విద్యుత్ సరఫరాకు ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇన్చార్జి ఏఈ సంతోష్, సర్పంచ్ తోట శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మోహన్, కారోబార్ రంజిత్, విద్యుత్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. జీవాల్లో నట్టలు నివారించాలిరాయికల్: గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేయాలని, తద్వారా వాటి మరణాల రేటు తగ్గించుకోవాలని జిల్లా పశువైద్యాధికారి ప్రకాశ్ అన్నారు. మండలంలోని అల్లీపూర్లో జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన మందులతో నట్టలు చనిపోయిన ఆకలి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎంబారి గౌతమి, వెంకట్రెడ్డి, పశువైద్యాధికారి నరేశ్రెడ్డి, ఉపసర్పంచ్ వినయ్, యాదవ రైతులు మనోజ్, భీమయ్య, ఎల్ఎస్ఏ శివకుమార్ పాల్గొన్నారు. ఉత్తమ సహకార సంఘంగా రాయికల్ సొసైటీరాయికల్: రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ సేవలందించినందుకు రాయికల్ సహకార సంఘానికి అవార్డు లభించింది. సంఘం ఆధ్వర్యంలో రై తులకు రుణాలు ఇవ్వడంలో.. ఇచ్చిన రుణా లను రికవరీ చేయడంలో.. డిపాజిట్ల సేకరణ లో.. బ్యాంకింగ్ కార్యకలాపాలల్లో సంఘం మె రుగైన ఫలితాలు సాధించింది. ఈ మేరకు సహకార వారోత్సవాల్లో భాగంగా సోమవారం హై దరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా సీ ఈవో రవీందర్ ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఆయిల్ పాం ఆకులు తొలగించొద్దుజగిత్యాలఅగ్రికల్చర్: ఆయిల్ పాం తోటల్లో మొక్కల ఆకులు తొలగించొద్దని, దిగుబడి తగ్గుతుందని జగిత్యాల నియోజకవర్గ ఉద్యానశాఖాధికారిణి స్వాతి తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్లోని ఆయిల్ పాం తోటలను రైతులతో కలిసి సోమవారం పరిశీలించారు. 30 నెలలు దాటిన తోటల్లో పరాగ సంపర్కం కోసం కీటకాలను వదులుతున్నామని తెలిపారు. భూమిలో బోరాన్ లోపం ఉన్నట్లు తెలుస్తోందని, దీని నివారణకు ప్రతి చెట్టుకు 100 గ్రాముల బోరాన్ వేసుకోవాలని సూచించారు. హెచ్ఈఓ అనిల్, ఆయిల్ పాం కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన భూపంచాయితీ
● కనగర్తిలో ఒకరు మృతి ఓదెల(పెద్దపల్లి): భూ పంచాయితీ ఓ రైతు ప్రాణం తీసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కనగర్తి గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య)ను ఇదే గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పొలం వద్ద పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో తన్ని బురదలో తొక్కి చంపేశాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్, మృతుడి కూతురు వొడ్నాల లావణ్య కథనం ప్రకారం.. కనగర్తిలో ఒంటరిగా ఉంటున్న రాజయ్య వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఆది రాజయ్య భూమి ఆయన పొలాన్ని ఆనుకొని ఉంది. ఇద్దరి భూముల మధ్య గెట్టు(ఒడ్డు) విషయంలో పలుమార్లు గొడవలు, కులపెద్ద మనుషుల సమక్షంలోనూ పంచాయితీలు జరిగాయి. సోమవారం ఉదయం ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) కూలీలతో పొలంలో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో ఒడ్డు వద్దగల హద్దు రాయిని రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పీకేశాడు. దానిని ఎందుకు పీకేశావని ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) అడిగాడు. దీంతో ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) చేతులతో పిడిగుద్దులు గుద్దాడు. కాళ్లతో తన్ని బురదలో తొక్కాడు. దీంతో బురదలో బొర్లపడి ముక్కు మూసుకుపోయి ఊపిరి ఆడక ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కూతురు వొడ్నాల లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ, పొత్కపల్లి, సుల్తానాబాద్ ఎస్సైలు రమేశ్, చంద్రకుమార్ పరిశీలించారు. పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని తన తండ్రిని చంపేశారని మృతుడి కూతుళ్లు బోరున విలపించారు. వరి నాట్ల సమయంలో రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగిసిన ఎస్జీఎఫ్ కరాటే టోర్నీ కోల్సిటీ(రామగుండం): నగరంలోని ఆర్సీవోఏ క్లబ్లో అండర్–17 చేపట్టిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కరాటే టోర్నీ, ఎంపిక పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 240 మంది బాలబాలికలు హాజరయ్యా రు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ నేతృత్వంలో పోటీలు నిర్వహించా రు. దాసరి మల్లేశ్ పర్యవేక్షించారు. ఇన్చార్జి డీఈవో హనుమంతు హాజరై మాట్లాడారు. ప్రతినిధులు కరాటే శ్రీనివాస్, వడ్డేపల్లి సురేశ్, పసునూటి శంక ర్, మంధని నాగరాజు, పసునూటి చందు, శ్రావణ్ కుమార్, సుంకే రాజు, బండి పరమేశ్, పవన్, బోయపోతు రాము, అన్వేశ్ రిఫరీలుగా వ్యవహరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోచ్, మేనేజర్లుగా ముక్తిశ్రీ, సునేహ సుల్తానా పాల్గొన్నారు. 13 బంగారు పతకాలు.. జాతీయ పోటీలకు 13 మంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 13 మంది క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో పుణెలో జరగనున్న జాతీయస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలకు 13 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. బంగారు పతకాలు సాధించినవారిలో సృష్టి టుమానే, శ్రీహర్ష, శ్రీవల్లి, పి.శ్రీజ, బి.సహస్త్ర, పి.సహస్త్ర, శ్రీరాజ్ విఘ్నేశ్, టి.జయసాయిచరణ్, ఆకాశ్, డి.శివహర్షవర్ధన్, డి.దేవాన్ష్ ఉన్నారు. ముగింపు కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్క్లబ్ అధ్యక్షుడు డి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్కుమార్, కోశాధికారి రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు కేఎస్ వాసు, రాష్ట్ర పేట అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొమురోజు శ్రీనివాస్, శోభారాణి, జావిద్, విజయ్, ఖాజాభీ రమేశ్, కనకేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం కరీంనగర్టౌన్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి, పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్ పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక తెలంగాణ చౌక్ నుంచి మహాత్మ జ్యోతిరావు పూలే గ్రౌండ్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా సమానమైన విద్యను అందించేందుకు ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్, గట్టు ఆకాష్, రాకేశ్, సందేశ్, మానస, సంజన, సన్నీ, అక్షయ్ పాల్గొన్నారు. -
భీమేశ్వరుడికి మొక్కులు
వేములవాడ: శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం భీమన్నను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండం మూసివేయడంతో భక్తులు స్నానాలు చేసేందుకు ప్రత్యేక స్నానపు గదులను రాజేశ్వరపురం వసతి గదులు కూల్చివేసిన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవమూర్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా ఫ్లైఓవర్ బ్రిడ్జీలను తాత్కాలికంగా తొలగించనున్నారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలను చేపట్టే పనులపై జాతర సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. -
నాడు తండ్రి.. నేడు తల్లి..
జగిత్యాలక్రైం: ‘విధి ఆ చిన్నారుల పాలిట శాపంగా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులిద్దరూ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో సోమవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం తలమాల గ్రామానికి చెందిన జ్యోతి 15 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోపాల్ను ప్రేమవివాహం చేసుకుని కల్లెడకు వచ్చింది. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. వీరికి అంజలి (13), చిన్ని (6), మురళీ (5) సంతానం. గోపాల్ ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి జ్యోతి ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న జ్యోతి కూడా చనిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో పంచాయతీ సిబ్బందే జ్యోతి తల్లి సోంబాయి, తండ్రి భీమ్ ఆటోలో కల్లెడకు తీసుకొచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో మాజీ సర్పంచ్ అంకతి గంగాధర్, కారోబార్ సురేందర్ కలిసి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి మృతదేహం వద్ద ముగ్గురు చిన్నారులు రోధనలు చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. తన అనేవారు లేని చిన్నారులను స్వచ్ఛంద సంస్థలైనా.. ప్రభుత్వమైనా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనాథలైన ముగ్గురు చిన్నారులు -
జాతీయస్థాయి చెకుముకి పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్ విద్యార్థులు కరీంనగర్ పద్మనగర్లోని ఓ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెక్ముకి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి తెలిపారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పాఠశాలకు చెందిన కే ఓం కార్తికేయ (10వ తరగతి), ఎస్.రీషాల్ (9వ తరగతి), ఓ.శివస్మరణ్రెడ్డి (8వ తరగతి) రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నారు. సోమవారం విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయస్థాయిలో సత్తాచాటాలని ఆకాంక్షించారు. పాఠశాలలో నిపుణులైన వైజ్ఞానిక శాస్త్ర ఉపాధ్యాయులచే విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేస్తున్నామని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
ధర్మపురి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. దూరప్రాంతాల నుంచి కాలినడకన వస్తున్న పేదవిద్యార్థులకు సైకిళ్లు అందించేందుకు ఎన్నారైలు ముందుకొచ్చారు. సామాజిక సేవకుడు, ధర్మపురికి చెందిన రేణిగుంట రమేశ్ ఫేస్బుక్లో చేసిన పోస్ట్కు స్పందించిన వివిధ దేశాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల ఎన్నారైలు, జిల్లా సత్యసాయి అభయహస్తం సభ్యులు, ఇతరులు ఏకంగా రూ.2.71 లక్షలు విరాళాల రూపంలో అందించారు. ఆ మొత్తంతో సుమారు 56 సైకిళ్లు కొనుగోలు చేసి ధర్మపురి, బీర్పూర్ మండలాలకు చెందిన విద్యార్థులకు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాన్ని మంచి కోసం వినియోగిస్తున్న రమేశ్ను అభినందించారు. పదేళ్లుగా ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ.. ప్రతినెలా నిరుపేదలకు సాయం అందిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థితికి చేరుకోవాలని, పోలీస్శాఖ పక్షాన ఇద్దరు పేద విద్యార్థులకు రెండు సైకిళ్లను బహూకరిస్తామని ప్రకటించారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనవంతుగా ఓ సైకిల్ అందిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్సై మహేశ్, ఎంఈవో సీతామహాలక్ష్మి, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులున్నారు. -
ముక్కోటికి ఏర్పాట్లు
ముక్కోటికి ముస్తాబైన ధర్మపురి దేవస్థానం ముస్తాబైన శ్రీరామలింగేశ్వర ఆలయం ధర్మపురి/మల్లాపూర్:ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలను ముస్తాబు చేశారు. భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం, మల్లాపూర్లోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాలను అందంగా అలంకరించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆదేశాల మేరకు నృసింహాలయం లోపల విద్యుత్దీపాలతో అలంకరించారు. ముందు, వెనుక భాగంలో ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు చేశారు. భక్తుల కోసం లడ్డూ, పులిహోర తయారు చేయించారు. ముక్కోటి సందర్భంగా యోగా, ఉగ్ర లక్ష్మీనృసింహుడితోపాటు శ్రీవేంకటేశ్వర స్వాములకు ప్రత్యేక పూజలు చేస్తారు. ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి చేతులమీదుగా ఉత్తరద్వారం తెరుస్తారు. మల్లాపూర్ మండలం వాల్గొండలోని త్రికూటాలయం ఉత్తర ముఖద్వారం కలిగిన అతిపురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. వేకువజామున ఆలయంలోని శివలింగంపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరించడం ఆలయం ప్రత్యేకత. ముక్కోటికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సాంబారి శంకర్, వైస్ చైర్మన్ చిలివేరి లక్ష్మీ తెలిపారు. -
ఆలకించండి.. పరిష్కరించండి
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు జిల్లావ్యాప్తంగా తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన సమస్యలపై సమగ్ర విచారణ జరిపి పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, శిక్షణ డిప్యుటీ కలెక్టర్ హారిణి, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్గౌడ్, జివాకర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బీటీ రోడ్డు వేయండి జిల్లాకేంద్రం నుంచి మోతె బైపాస్ మీదుగా వెల్దుర్తి గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పాడైంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు రావడం లేదు. 2009లో నిర్మించిన రోడ్డుకు మూడేళ్ల క్రితం మరమ్మతు చేశారు. బీటీ రోడ్డుకు ఒప్పందం కూడా అయ్యింది. రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోండి. – వెల్దుర్తి సర్పంచ్, పాలకవర్గం పరిహారం ఇప్పంచండి Ð]l*¨ Möyìl-Ð]l*ÅÌS Ð]l$…yýl-ÌS… ç³Nyýl*Æý‡$. fW™éÅÌS Ò$§ýl$-V> Mø§éyýl Ð]lÆý‡MýS$ °ÇÃçÜ$¢¯]l² gê¡Ä¶æ$ Æý‡çßæ-§éÇ 563ÌZ {V>Ð]l$…-ÌZ° ç³Ë$Ð]l#Æý‡$ Ð]lÅÐ]l-ÝëĶæ$ ¿¶æ*Ð]l¬-Ë$, Câ¶æ$Ï, Rêä´ëÏr$Ï MøÌZµ-™èl$-¯é²Æý‡$. hÌêÏ ç³Ç«¨ÌZ Cç³µ-sìæMóS ç³Ë$ {V>Ð]l*-ÌZÏ ç³ÇàÆý‡… A…¨…-^éÆý‡$. Ð]l* {V>Ð]l*-°MìS Ð]l*{™èl… ç³ÇàÆý‡… A…§ýl-Ìôæ§ýl$. ÒOÌñæ-¯]l…™èl ™èlÓÆý‡-V> ç³ÇàÆý‡… Cí³µ…^ól-Ìê ^èl*yéÍ. త – – పూడూరు గ్రామస్తులు అడ్డుపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి మాది కథలాపూర్ మండలం సిరికొండ. గౌడ సంఘం అభివృద్ధికి మల్యాల శ్రీనివాస్ అడ్డు తగులుతున్నాడు. సర్వేనంబర్ 463లోని 8.32 ఎకరాలను కులస్తులందరి సమ్మతితో విక్రయించి ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మించాం. భూమికి సంబంధించిన డబ్బులను మేం పంచుకున్నామని అంటూ శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ అడ్డుకుంటున్నాడు. పైగా కుల బహిష్కరణ చేశారంటున్నాడు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విచారణ చేపట్టి ఎలాంటి అవకతవకలూ జరగలేదని నిర్దారించారు. ఆ తీర్మానంపై శ్రీనివాస్ కూడా సంతకం చేశాడు. ఇప్పుడు సభ్యులపై అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నాడు. – సిరికొండ గౌడ కులస్తులు, కథలాపూర్ కోతులను నివారించాలి జిల్లాకేంద్రంలోని తొమ్మిదో వార్డు ధరూర్క్యాంపు, హౌజింగ్బోర్డు, వినాయకనగర్, శ్రీనగర్ కాలనీల్లో కోతుల బెడద అధికంగా ఉంది. దాడి చేస్తూ పలువురిని గాయపరుస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కాలనీవాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కోతులను నియంత్రించండి. – గడ్డల లక్ష్మి, బీజేపీ నాయకురాలు -
ముందుకు.. వెనక్కి..!
జగిత్యాల: ఈ ఏడాది జిల్లాలో విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రానికి మంజూరైన మెడికల్ కళాశాల ఈ ఏడాది కూడా ముందకు కదలలేదు. నిధులలేమితో హాస్టల్, లైబ్రరీ వంటివి సంపూర్తిగానే మిగిలిపోయాయి. మూడేళ్లుగా భవన నిర్మాణం కొనసాగుతూనే ఉంది. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో ఉన్న ఓల్డ్ ఆస్పత్రి భవనం శిథిలావస్థలో ఉంది. ఇది జనరల్ ఆస్పత్రికి నిత్యం అనేక మంది పేషెంట్స్ వస్తుంటారు. మరమ్మతు చేపట్టకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ మరో రూ.200 కోట్లతో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి ప్రారంభమైంది. త్వరలోనే పనులు సైతం ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. 50 పడకలతో నిర్మితమైన క్రిటికల్ కేర్ భవనం ఇంకా ప్రారంభోత్సవం కావడం లేదు. క్రిటికల్ కేర్ ప్రారంభమైతే రోగులకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. విద్యకు పెద్దపీట.. జిల్లా కేంద్రానికి కేంద్రీయ విద్యాలయం మంజూరుతోపాటు, ఇటీవల నవోదయ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. పొలాసలో గతంలో ఏర్పాటైన వ్యవసాయ పరిశోధన స్థానానికి అనుబంధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఏర్పాటు చేశారు. ఎంతోమంది విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేస్తున్నారు. కోరుట్లలో ఇప్పటికే వెటర్నరీ కళాశాల ఉండటంతో ఎడ్యుకేషన్ హబ్గా మారింది. ఆలయాల అభివృద్ధి.. జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి నృసింహస్వామి ఆలయాలున్నాయి. గోదావరి ప్రాంతం కావడంతో 2027లో జరిగే పుష్కరాలకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేరోజు లక్ష మంది పుష్కరస్నానాలు ఆచరించేలా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ధర్మపురికి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.200 కోట్లతో అభివృద్ధికి అంచనాలు రూపొందించారు. గత ప్రభుత్వంలో కొండగట్టు, ధర్మపురి, వెల్గటూర్ ఆలయాలకు రూ.100 కోట్ల చొప్పున నిధులు ప్రకటించినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. తాజాగా కొండగట్టుకు టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో రూ.35.19 కోట్లు మంజూరు చేశారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీపై నీలినీడలు జిల్లాలో ప్రధానంగా చెరుకు పంట పండిస్తుంటారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించేందుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చింది. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన రుణభారం వన్టైం సెటిల్మెంట్ కింద రూ.190 కోట్లు తీర్చింది. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 50 వేల ఎకరాల మామిడితోటలు కలిగి ఉండగా.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు మామిడి ఎగుమతి జరుగుతుంది. అలాగే వరి మూడు లక్షల ఎకరాల వరకు సాగవుతుంది. సారంగాపూర్ మండలంలో రోల్లవాగు ఆధునీకరణకు రూ.130 కోట్లు మంజూరయ్యాయి. పనులు పూర్తయినప్పటికీ అటవీశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం వద్ద ఏర్పాటు సదర్మాట్ పూర్తిస్థాయిలోకి వచ్చినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఇది అందుబాటులోకి వస్తే 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే కథలాపూర్ మండలంలో సూరమ్మ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు. ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మండలాల్లో పక్కా భవనాలెప్పుడు..? జిల్లాలో గతంలో 18 మండలాలు ఉండగా కొత్తగా రెండు మండలాలను చేర్చారు. వీటికి పక్కా భవనాలు లేకపోవడంతో కార్యాలయాలకు ఇబ్బందికరంగా మారింది. మున్సిపాలిటీలకు అత్యధిక నిధులు ఇటీవల ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించింది. పనులను జరుగుతున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీకి రూ.60 కోట్లు, రాయికల్కు రూ.15 కోట్లు మంజూరయ్యాయి. మున్సిపాలిటిల్లో మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోవడం లేదు. జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ గతంలో అమలైనప్పటికీ గొడవలతో నిలిచిపోయింది. మళ్లీ అధికారులు ఆ దిశగా ప్రారంభించడం లేదు. ఇరుకు రోడ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యావర్రోడ్ ఇరుకుగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. డబుల్బెడ్రూంలు సిద్ధం రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా జగిత్యాలలోనే 4520 బెడ్రూంలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇటీవల అర్హులైన లబ్ధిదారులకు కేటాయించారు. అందులో వసతులు లేక వెళ్లడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈనెల 31వరకు ఇళ్లలోకి వెళ్లకుంటే వారి పట్టాను రద్దు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కొలువుదీరిన సర్పంచులు జిల్లాలో 385 గ్రామపంచాయతీల్లో సర్పంచులు కొలువుదీరారు. రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కుంటుపడింది. అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల -
ఉపాధ్యాయ సమస్యలకు త్వరలో పరిష్కారం
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలజోన్: ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్లో పీఆర్టీయూటీఎస్–2026 క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నందున, వాటి స్థితిగతులను మార్చేందుకు కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన ఉన్నందున త్వరలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘ నాయకులతో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని వివరించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బోయనపల్లి ఆనందరావు, యాల్ల అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. తపస్ కార్యవర్గ సభ్యులకు అభినందన జిల్లా తపస్ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అభినందించారు. ఉపాధ్యాయ సమస్యలే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మార్చేందుకు సంఘాలు కృషి చేయాలన్నారు. అధ్యక్ష, కార్యదర్శులు బోయినపల్లి ప్రసాద్, కోక్కుల రాజేశ్, నాయకులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, సరస్వతి శిశుమందిర్, శ్రీవాణి జూనియర్ కళాశాలల వ్యవస్థాపకుడు కాసుగంటి సుధాకర్రావు శనివారం అనారోగ్యంతో మృతిచెందగా, ఆదివారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. సొంత జిల్లాలోనే టెట్ నిర్వహించాలిధర్మపురి: టెట్ రాసే వారికి ఇతర జిల్లాల్లో కాకుండా సొంత జిల్లాలోనే సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి రొట్టె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థులు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడడమే కాకుండా, చాలా మంది పరీక్ష సమయానికి చేరుకోలేక పోయిన ఘటనలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల సొంత జిల్లాలోనే పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని కోరారు. -
చేల చుట్టూ.. చీరకట్టు..
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని పలువురు రైతులు యాసంగిలో మొక్కజొన్న సాగు చేస్తుండగా, అడవిపందులు గుంపులుగా పంట చేలపై పడి మొక్కలను కొరికేస్తున్నాయి. ఈనేపథ్యంలో పంట పొలాల చుట్టూ రంగురంగుల చీరలు కడితే అడవిపందులు వచ్చే అవకాశం తక్కువ. దీంతో రైతులు పంట పొలాలను చీరలతో సింగారిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్పల్లి, లక్ష్మీపూర్ గ్రామ రైతులు అంగట్లో ఒక్కో చీరను రూ.20 కొనుగోలు చేసి, చేల చుట్టూ కట్టి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా ఊర్లలో ఏ మొక్కజొన్న తోటను చూసినా చీరలతో సింగారించుకున్నట్లు ఉంటుంది. -
సర్పంచుల గెలుపే కాంగ్రెస్ బలానికి నిదర్శనం
ధర్మపురి: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుల గెలుపే కాంగ్రెస్ పార్టీ బలానికి నిదర్శనమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు ఆదివారం స్థానిక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని పటేల్ విగ్రహం నుంచి గాంధీ, నంది, అంబేడ్కర్ కూడళ్ల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన 108 మంది సర్పంచులు గెలుపొందడంతో నియోజకవర్గంలో పార్టీ బలం ఎంత ఉందో నిరూపించుకున్నామని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్కు ప్రజల నుంచి విశ్వాసం లభించిందని, అది ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు నిజాలు మాట్లాడితే బీఆర్ఎస్ తట్టుకోలేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు మళ్లించడం ద్వారా దళిత, గిరిజన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, సదరు నిధులపై ఆ శాఖ మంత్రిగా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్టంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకెంతో దోహదపడుతున్నాయని, ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని, మిగిలిన రెండు త్వరలో తప్పక అమలు చేస్తామన్నారు. ధర్మపురి లక్ష్మీనృసింహుని దయ, నియోజకవర్గ ప్రజల అండదండలతో ఎమ్మెల్యే, విప్, మంత్రిగా ఎదిగానని, ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చి వాగ్దానాలను నెరవేర్చుతున్నానని, ఐటీఐ కళాశాల, ధర్మపురిలో బస్డిపో తప్పకుండా ఏర్పాటు చేయిస్తానని స్పష్టం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధుల మంజూరుపై సుముఖంగా ఉన్నారని వెల్లడించారు. అనంతరం సర్పంచులను సన్మానించారు. కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, ఏఎంసీ చైర్పర్సన్లు, మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
ఒడిదొడుకుల సాగు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా రైతులకు 2025 ఏడాది కన్నీళ్లు, నష్టాలనే మిగిల్చింది. పంటలకు తెగుళ్లు, పురుగులతో నెట్టుకొస్తున్న రైతులకు, చివరికి అకాల వర్షాలు దెబ్బతీశాయి. దీంతో, పంటలపై వచ్చే ఆదాయం ఏమో కానీ, పెట్టుబడులు కూడా రాలేదు. దీంతో, రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయి భూములు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.యాసంగిలో వరితో పాటు దాదాపు 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న వేయడంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. ఆ సీజన్లో ఏదోలాగా నెట్టుకొచ్చిన రైతులకు, వానాకాలం సీజన్లో యూరియా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. సొసైటీలు, దుకాణాల వద్ద రైతులు రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఒకట్రెండు బస్తాలు పొందె పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో క్యూ లైన్లలో నిలబడే ఓపిక లేక పట్టాదారు పాస్బుక్కులు, చెప్పులను పెట్టి రోజంతా వేచి చూసినా ఒక బస్తా కూడా దొరకలేదు. ఆదాయం రాక అన్నదాతల ఆగమాగం పెరుగుతున్న పంట పెట్టుబడి ఖర్చులు సంప్రదాయ పంటలవైపే జిల్లా రైతులు 2025 ఏడాది రైతులకు అంతంతే.. 2026పైనే ఆశలుదెబ్బతీసిన వర్షాలు జిల్లా రైతులు వరి, మొక్కజొన్న, పసుపు తదితర పంటలను దాదాపు 3.80 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే, మూడునెలల పాటు కురిసి భారీ వర్షాలతో మక్క, పసుపు పంటల్లో నీరు నిలిచి దెబ్బతిన్నాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇసుకను తొలగించేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. యాసంగి మార్చిలో కురిసిన వడగళ్ల వానకు వరిగింజలు రాలిపోయాయి. దాదాపు 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదించిన రైతులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మామిడిపూత, కాయలు రాలిపోయి తీవ్రనష్టం జరిగింది. వానాకాలంలో వరిపంట కోతకు గంటకు రూ 4.వేలు పెట్టి చైన్ హార్వేస్టర్లను ఉపయోగించారు. యూరియా కష్టాలు -
‘పది’కి రెండు నెలలే కీలకం
మల్లాపూర్(కోరుట్ల): పదో తరగతి వార్షిక పరీక్షలకు దాదాపు రెండునెలల సమయం మాత్రమే ఉంది. మార్చి 14 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ టైంటేబుల్ విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజులకో పరీక్ష చొప్పున నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గనుందని విద్యా శాఖ భావిస్తోంది. అయితే విద్యార్థులు ఈ కాస్త సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక ప్రకారం చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ‘సంకల్పం’ పేరుతో ప్రత్యేక తరగతులు పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు జిల్లా విద్యా శాఖ ఇప్పటికే ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ‘సంకల్పం’ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. రోజూ సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ఉన్నత పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఒక టైం టేబుల్ను సిద్ధం చేశారు. ఏ రోజు యే సబ్జెక్టు బోధించాలనేది అందులో పేర్కొన్నారు. జనవరి నుంచి రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. గతేడాది ఉత్తీర్ణత.. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 11,849 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా, 11,636 మంది పాసయ్యారు. జిల్లాలో 98.20 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లాలో 12,370 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరంతా ఉత్తమ మార్కులు సాధించేలా, మిగిలిన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాల్సి ఉంది. ప్రత్యేక శ్రద్ధ సీ– గ్రేడ్ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అలాగే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేయడంతో పాటు, సిలబస్ త్వరగా పూర్తి చేసి పునశ్చరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.జిల్లాలో.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు : 187 కస్తూరిబా విద్యాలయాలు : 14 ప్రభుత్వ పాఠశాలలు : 13 మోడల్ స్కూళ్లు : 13 సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు : 5 తెలంగాణ మైనార్టీ స్కూళ్లు : 5 బీసీ వెల్ఫేర్ స్కూళ్లు : 3 ప్రైవేటు స్కూళ్లు : 103 పదో తరగతి విద్యార్థుల సంఖ్య : 12,370 -
ప్రాణత్యాగాల పార్టీ కాంగ్రెస్
జగిత్యాలటౌన్: ప్రాణ త్యాగాల పార్టీ కాంగ్రెస్ అని జిల్లా అధ్యక్షుడు గాజంగి సదయ్య అన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో పార్టీ జెండా ఎగరేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం కోసం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహాత్మాగాంధీ పేరును చెరిపివేయాలని ప్రధాని మోదీ చూస్తున్నారని, పథకాల పేరు మార్పుతో గాంధీ పేరు చెరిపివేయలేరని అన్నారు. పేదల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకం పేరు మార్చి, నీరుగార్చేందుకు కుట్ర చేస్తున్న మోదీ పాలన నుంచి దేశ ప్రజలను విముక్తి చేసేందుకు మరో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల గుండెల్లోని కాంగ్రెస్ పార్టీని చెరిపివేయలేరన్నారు. కార్యక్రమంలో బండ శంకర్, కొత్త మోహన్, తాటిపర్తి విజయలక్ష్మి, కల్లెపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, రమేశ్రావు, ఎలిగేటి నర్సయ్య, గుగ్గిళ్ల హరీశ్, మున్నా, నేహాల్, రమేశ్బాబు, అనిత, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యంకథలాపూర్(వేములవాడ): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ 129వ కార్యక్రమాన్ని ఆదివారం మండలంలోని సిరికొండ గ్రామంలో బీజేపీ నాయకులతో కలిసి ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ ప్రతీ భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడబోమని ప్రపంచానికి ప్రధాని మోదీ తన నిర్ణయాలతో స్పష్టం చేశారన్నారు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత మోదీకే దక్కిందన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మోదీ దేశంలోని ప్రతీ పౌరుడికి దేశాభివృద్ధి, గొప్పతనం, ఔన్నత్యాన్ని చెప్పారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, మోతే గంగారెడ్డి, వెంకటేశ్వర్రావు, ఎడ్మల వినోద్రెడ్డి, బద్రి సత్యం, బండ అంజయ్య, కాసోజి ప్రతాప్, మహేశ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకంలోనే సమస్యలు
ప్రతి సీజన్లో వరిధాన్యం కొనుగోలుకు 420 కేంద్రాలు, వానాకాలంలో మొక్కజొన్న కొనుగోలుకు 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, ప్రతీ ధాన్యం కుప్పను తూర్పార పట్టమనడం, మిల్లర్లు క్వింటాల్కు 2 కిలోల తరుగు తీయడం, హమాలీలు ఇష్టారీతిన రేట్లు పెంచడంతో ఇబ్బందిపడ్డారు. మొక్కజొన్నను మార్క్ఫెడ్ కొనుగోలు చేసినా నెలన్నర వరకు డబ్బులు చెల్లించకపోవడంతో యాసంగి పెట్టుబడికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పత్తి పంటను 15 వేల ఎకరాల్లో వేసినా సీసీఐ నిబంధనలతో చాలా మంది గ్రామాల్లోనే తక్కువ రేటుకు దళారులకు అమ్ముకున్నారు. -
‘అంజన్న’కు నోటీసులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో దేవాదాయ– అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. కొండగట్టు మీది ప్రాంతం మాత్రమే గుడిదని, ఇటీవల తమ భూముల్లోకి చొచ్చుకువచ్చి దాదాపు ఆరున్నర ఎకరాల భూమిని దేవాదాయశాఖ ఆక్రమించిందని అటవీశాఖ ఆరోపిస్తోంది. ఆ ఆరున్నర ఎకరాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మార్కింగ్ చేయడంతో రెండుశాఖల మధ్య వివాదం మొదలైంది. ఈ ఆరున్నర ఎకరాల భూమి తమదంటే తమదని ఇరుశాఖలు వాదించుకుంటున్నాయి. కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూములను ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుతో తాము తీసుకునే అవకాశం ఉందని దేవాదాయశాఖ అధికారులు చెబు తుండగా.. అనుమతి లేకుండా తమ భూములు ఎలా తీసుకుంటారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. మొత్తానికి అటవీశాఖ అధికారులు పెట్టిన కిరికికి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారేలా కనిపిస్తోంది. వివాదం ఇదీ.. కొండగట్టు ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దేవాదాయశాఖ కొన్ని అభివృద్ధి పనులు చేపట్టింది. గుడి ఉన్న గట్టు ప్రాంతం మినహా కింద ఉన్న భూములు తమకే చెందుతాయని అటవీశాఖ వాదన. గట్టు కింద భక్తుల కోసం 20 గదుల వసతి భవనం, ఈవో కార్యాలయ భవనం, వాహన పూజా మండపం తదితర భవనాలు దశాబ్దకాలం క్రితం నిర్మించారు. అవన్నీ తమ పరిధిలోకి వస్తాయని అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, మార్కింగ్ చేయడంతో విషయం వివాదంగా రూపుదాల్చింది. ఆలయ భూములు సంరక్షించాలని, భూములను ఆలయానికి అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. వై జంక్షన్ వద్ద గేటు ఏర్పాటు సన్నాహాలతో కొండగట్టు ఘాట్రోడ్డు, జేఎన్టీయూ రోడ్డు కలిసే వైజంక్షన్ వద్ద అటవీశాఖ అధికారుల గేటు ఏర్పా టు సన్నాహాలు రెండుశాఖల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా చేశాయి. రెండున్నరేళ్ల క్రితం కొండగట్టు పరి సరాల్లోని అటవీభూముల్లో అర్బన్ పార్కు ప్రతిపాదనలో భాగంగా వైంజక్షన్ వద్ద గేటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గేటుతో వాహనాల పార్కింగ్కు ఇబ్బందిగా మారుతుందని ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామం రెండుశాఖల మధ్య దూరం పెంచింది. కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులు సైతం వైజంక్షన్ సమీపంలో అటవీశాఖ గేటు ఏర్పాటు చేస్తే.. తాము వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల య ఈవో శ్రీకాంత్ రావు కూడా ఆ భూములు ఆలయానికే చెందుతాయని స్పష్టంచేస్తున్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎఫ్వో రవికుమార్ సమక్షంలో అటవీశాఖ, దేవాదాయశాఖ, రెవెన్యూశాఖ ముకుమ్మడిగా హద్దుల ఏర్పాటు కోసం సర్వే చేపట్టారు.గుడికి భూములిచ్చేందుకు సిద్ధం కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రెవెన్యూ భూములు బదిలీ చేశాం. ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ప్రత్యామ్నాయంగా భూముల కేటాయింపు చేసుకునే అవకాశముంది. కలెక్టర్ ఆదేశాలతో కొండగట్టులో అటవీశాఖ, దేవాదాయశాఖ సరిహద్దుల వివాదం పరిష్కరించేందుకు సర్వే చేపట్టాం. అటవీశాఖ హద్దులు గుర్తించాం.– పులి మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల -
జగిత్యాల
29.0/13.07గరిష్టం/కనిష్టంహుండీ లెక్కింపు పెగడపల్లి: పెగడపల్లి శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపు శుక్రవారం జరిగింది. రూ.95వేలు వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఒరుగల శ్రీనివాస్ తెలిపారు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.వాతావరణం జిల్లాలో నేడు వాతావరణం సాధారణంగా ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. మంచు కురుస్తుంది. చలిగాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండ ఉంటుంది.గంగమ్మకు మొక్కులు ధర్మపురి: గోదావరిలో శుక్రవారం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గంగమ్మ, గౌరమ్మలకు తెప్పలు సమర్పించారు. ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకున్నారు.శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
కబ్జా చేసి.. కలిపేసి!
మెట్పల్లిరూరల్: చివరి ఆయకట్టుకు నీరందించే ఎస్సారెస్పీ ఉప కాలువలు కనుమరుగవుతున్నా యి. కొన్నేళ్లుగా తూములకు సరిపడా నీరు అందకపోవడంతో ఉపకాలువలు నిరుపయోగంగా ఉన్నా యి. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు రైతులు పూడ్చివేసి కబ్జా చేస్తున్నారు. ఉపకాలువల భూమిని వ్యవసాయ భూముల్లో కలిపేసుకుంటున్నారు. పంటలు వేసి సాగుచేస్తున్నారు. మెట్పల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో ఎస్సారెస్పీ ఉపకాలువలు కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు కొందరు కాలువను పూడ్చివేయించి తమ భూముల్లో కలిపేసుకోవడం గమనార్హం. 8 ఉపకాలువలు.. 55వేల ఎకరాల ఆయకట్టు మెట్పల్లి ప్రాంతంలో డి– 30, డి–32,డి–32(ఎ),డి–32(బి),డి–33,డి–34,డి–35,డి–36 ఉపకాలువలు ఉన్నాయి. వీటి కిందట 55 వేల ఎకరాలపై ఆయకట్టు ఉంది. మెట్పల్లి, రేగుంట, వెల్లుల, చౌలమద్ది, పెద్దాపూర్, చింతపేట, వేంపేట ప్రాంతాల గుండా ఉప కాలువలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాలువకు ఇరువైపులా భూములను వ్యవసాయ భూముల్లో కలిపేసుకున్నారు. మిగతా చోట్ల కాలువను పూడ్చివేసి భూముల్లో కలుపుకున్నారు. ఎస్సారెస్పీ కాలువల భూములను కలిపేసుకుంటున్న రైతులను చూస్తున్న మిగతా కొందరు సైతం కాలువ భూములను ఆక్రమిస్తున్నారు. దృష్టి సారించని అధికారులు ఎస్సారెస్పీకి భూములు ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలువ భూములను ఆక్రమించినా, పూడ్చివేస్తున్నా అధికారులు దృష్టి సారించకపోవడం వారి పనితీరు విషయంలో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉపకాలువ పూడ్చివేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. అటువైపు కన్నెత్తి చూడడం లేదని కొందరు ‘సాక్షి’ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాజిద్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.ఈ స్థలం మెట్పల్లి మండలం వెల్లుల శివారులోనిది. ఇక్కడ మొన్నటి వరకు ఎస్సారెస్పీ డీ–32(ఎ) ఉపకాలువ ఉండేది. పూడ్చివేయించిన ఓ రైతు పక్కనే ఉన్న తన వ్యవసా య భూమిలో కలిపేశాడు. కొన్నేళ్లుగా తూ ముకు సరిపడా నీరు విడుదలకాకపోవడంతో ఈ ఉపకాలువలోకి నీరు ప్రవహించడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న చాలా మంది రైతులు కాలువను కబ్జా చేశారు. -
ఎకరాకు రూ.లక్ష పెట్టిన
ఎకరాకు రూ.లక్ష చొప్పున, రెండు ఎకరాలకు రూ.2లక్షల పెట్టుబడి పెట్టి పసుపు సాగు చేశాను. అధిక వర్షాలతో దుంపకుళ్లు రోగం సోకింది. దాదా పు ఎకరంలో పంట నష్టం జరిగింది. పసుపు పైకి బాగానే కనబడుతున్నప్పటికీ.. పురుగు ఆశించిన మొక్కకు బలం లేకుండా పోయింది. – మామిడి ధర్మారెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లిపంటలో నీళ్లు నిలిచాయి పసుపు పంట రెండు ఎకరాల్లో సాగు చేసినప్పటికీ అనుకున్న పరిస్థితిలో ఆదాయం వచ్చేలా కనిపించడం లేదు. భూమిలో వర్షానికి నీరు ఆగి, పసుపుకు తెగుళ్లు సోకడంతో దిగుబడులు సగానికి పడిపోనున్నాయి. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – మారు మురళీధర్రెడ్డి, వెల్లుల్ల, మెట్పల్లి దెబ్బతీసిన వర్షాలు ఈ ఏడాది నెల రోజుల పాటు వర్షాలు కురువడంతో పసుపు పంటకు ఇబ్బందిగా మారింది. నీరు బయటకు వెళ్లలేక, పసుపు పంటలోనే రోజుల తరబడి నీరు నిల్వడంతో దుంపకుళ్లు, అడుగు రోగం సోకి, దిగుబడులు వచ్చేటట్లు కనబడటం లేదు. – మెక్కొండ రాంరెడ్డి, అలూర్, రాయికల్ -
ధర్మపురిని నాశనం చేసింది బీఆర్ఎస్సే
కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–2 పేరుతో 1,020 ఎకరాల రైతుల భూములు లాక్కొని, గిరిజనులు, ఒడ్డెర జాతి ప్రజలను బెదిరించి ధర్మపురి నియోజకవర్గాన్ని నాశనం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం కరీంనగర్ ఆర్అండ్బీ అతిథిగృహంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితో కలిసి మాట్లాడారు. 2016లో జీవో నంబరు 71 ప్రకారం ప్రారంభించిన ప్రాజెక్టును ఆరేళ్లపాటు కొనసాగించి, పూర్తి చేయకుండానే అంచనాలను రూ.66కోట్ల నుంచి రూ.136 కోట్లకు పెంచారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా అప్పటి కాంట్రాక్టర్తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఇదేనా బీఆర్ఎస్ పాలకుల అభివృద్ధి మోడల్ అని ప్రశ్నించారు. ధర్మపురిని సస్యశ్యామలం చేస్తామని నాటి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయని, 146 గ్రామాలకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక్కసారి కూడా ఈ అంశంపై ప్రశ్నించలేదని విమర్శించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఆరు నెలల్లోనే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నానని అన్నారు. 80 మంది విద్యార్థులను పొలాస అగ్రికల్చర్ కాలేజీకి పంపించి, రూ.7 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి నాయకత్వంలో చెల్లించామని తెలిపారు. తను రాజీనామా చేయాలా వద్దా అనేది నిర్ణయించేది ధర్మపురి ప్రజలేనని... బీఆర్ఎస్ నేతలు కాదని స్పష్టం చేశారు. మరో మూడు సంవత్సరాల్లో తాను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రజలకు జవాబుదారిగా ఉండాలిధర్మపురి: నూతన సర్పంచులు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరిస్తూ, ప్రజలకు జవాబుదారిగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. బుగ్గారం మండలం సిరికొండ సర్పంచ్ ధర్మరాజుతో పాటు పలువరు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సిరికొండ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని పేర్కొన్నారు. -
నిందితులను అరెస్టు చేయాలి
జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్: టీఆర్నగర్లో ఇటీవల ఓ వర్గంపై దాడిచేసిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ స్తులు ఆందోళన చేపట్టారు. టీఆర్నగర్ గ్రా మానికి చెందిన కొందరు అదే గ్రామానికి చెందినవారిపై నాలుగు రోజుల క్రితం దాడిచేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులు తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితులు శుక్రవారం జగిత్యాల తహసీల్ చౌరస్తాతో పాటు, పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పట్టణ సీఐ కరుణాకర్ హామీ ఇవ్వడంతో శాంతించారు. స్వర్ణోత్సవాల్లో గోపా ప్రతినిధులు జగిత్యాల: హైదరాబాద్లో జరుగుతున్న గౌడ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్వర్ణోత్సవాల్లో జగిత్యాల జిల్లాశాఖ బాధ్యులు పాల్గొన్నారు. జగిత్యాల గోపా జిల్లా అధ్యక్షుడు దుర్గపు రవీందర్గౌడ్, ప్రధాన కార్యదర్శి అంబటి రాజయ్య, కోశాధికారి సత్యనారాయణగౌడ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, గుడాల రాజేశంగౌడ్, సత్తయ్యగౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం కోరుట్ల/జగిత్యాలటౌన్: ప్రజా సమస్యలపై సీసీఐ పోరాటాలు చేస్తోందని జిల్లా కార్యదర్శి చెన్నా విశ్వనాథం అన్నారు. సీపీఐ ఆవిర్భవించి 100ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని సి.ప్రభాకర్ స్మారక భవనం, అల్ల మయ్య గుట్ట ప్రాంతాల్లో సీపీఐ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో సీపీఐ ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. సీనియర్ నాయకుడు మౌలానా, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, ఎండీ ముఖ్రం, రాధ పాల్గొన్నారు. వర్ణ,వర్గ రహిత సమాజమే లక్ష్యం వర్ణ, వర్గ రహిత సమాజమే లక్ష్యంగా సీపీఐ వందేళ్లుగా పోరాటం సాగిస్తోందని పార్టీ జగిత్యాల పట్టణ కార్యదర్శి మాడిశెట్టి కిరణ్ అన్నారు. పట్టణంలోని టవర్సర్కిల్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెన్న మహేశ్, ధర్మన్న, శ్రీగాద దేవదాసు, ఎద్దండి భూమయ్య పాల్గొన్నారు. -
పారిశుధ్యం.. అస్తవ్యస్తం
జగిత్యాల: జిల్లాకేంద్రమైన జగిత్యాలలో లక్షకు పైగా జనాభా ఉంటుంది. నాలుగు జోన్లు ఉన్నాయి. చెత్త సేకరణకు నిత్యం 48 మున్సిపల్ ఆటోలు తిరుగుతుంటాయి. 300లకు పైగా పారిశుధ్య కార్మికులున్నారు. కానీ పట్టణంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడా డ్రెయినేజీలు తీయకపోవడంతో మురికినీరంతా నిలిచి రోడ్లపైకే ప్రవహిస్తోంది. అలాగే డ్రెయినేజీల చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడం లేదు. జిల్లాలోని 48 వార్డుల్లో ఏదో ఒకరోజు పారిశుధ్య కార్మికులు డ్రెయినేజీలు తీస్తూ.. పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారే తప్ప నిత్యం పనులు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో చుట్టూ ఉన్న ఇళ్ల యజమానులు భరించలేకపోతున్నారు. వారికి నోటీసులు ఇచ్చి చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నప్పటికీ బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టణంలోని 48 వార్డులకు 48 ఆటోలుంటే 20కి పైగా మరమ్మతుల్లో ఉన్నాయి. డంపర్బిన్స్ లేవు. ఇటీవలే డోజర్ సైతం చెడిపోయింది. అధికారులు మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫాగింగ్ మచ్చుకు కన్పించడం లేదు. ప్రతిరోజు కాలనీల్లో ఉదయం, సాయంత్రం ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఫాగింగ్ మిషన్లు చెడిపోయినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో మెరుగైన పారిశుధ్యం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.పట్టణంలోని జాంబాగ్ రోడ్డు వద్ద గల బైపాస్రోడ్డు. ఈ కాలువ వెంటే ప్రజలు చెత్త పడేస్తుంటారు. ఈ ప్రాంతంలో ఇంటింటికీ చెత్తవాహనం వెళ్లకపోవడంతో ప్రజలే చెత్తను తీసుకువచ్చి వేస్తున్నారు. ఇక్కడ పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. చెత్తతో రోడ్డు నిండిపోతోంది. సమీపంలోని డంపర్బిన్ను కొద్దిరోజులకే తొలగించారు. దీంతో ఇక్కడి ప్రజలకు చెత్త కష్టాలు తప్పడం లేదు.ఇది కొత్తబస్టాండ్లోని వాటర్ట్యాంక్ ప్రాంతం. ఇక్కడ నిత్యం పారిశుధ్య పనులు చేపట్టాలి. క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. అధికారులు పట్టించుకోకపోవడంతో ట్యాంక్ సమీపంలో పూర్తి చెత్తమయంగా మారింది. అధికారులు స్పందించి శుభ్రం చేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
పచ్చ బంగారం.. దిగుబడి భారం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో పసుపు ప్రధాన పంట. దిగుబడికి తగిన ధర లేక ఇబ్బందులు పడుతు న్న రైతులకు, ఈ ఏడాది తెగుళ్లతో మరింత నష్టం జరిగే అవకాశముంది. ఈసారి కురిసిన అత్యధిక వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితులతో పంట కు తెగుళ్లు వచ్చాయి. పెట్టుబడి కూడా వచ్చే అవకా శం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 35వేల ఎకరాల్లో పసుపు సాగవుతోంది. మల్లాపూర్, ఇబ్ర హీంపట్నం, మెట్పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, జగిత్యాల రూరల్, గొల్లపల్లి, రాయికల్, సా రంగాపూర్ మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. పంట విత్తిన నెల పాటు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఆక్టోబర్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పంటచేలో నీరు నిలిచింది. భూమిలో తేమ శాతంపెరిగి, తెగు ళ్లు, పురుగులకు నిలయంగా మారింది. పసుపు పంటకు రసాయన ఎరువులు కాకుండా పశువుల పేడ, కోళ్ల ఎరువు ఎక్కువగా వేస్తుంటారు. నీటినిల్వతో సేంద్రియ ఎరువుల పోషకాలు పసుపు మొక్కకు అందకుండా పోయాయని రైతులు అంటున్నారు. తీవ్రంగా దుంపకుళ్లు తెగులు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పసుపు పంట ఆకులు పచ్చగా ఉండి, భూమిలో దుంపకుళ్లు రోగం సోకితే, మరికొన్ని ప్రాంతాల్లో ఆకులు ఎండిపోయి భూమిలో దుంప మురిగిపోవడం జరిగింది. పంటకు నవంబర్ నుంచి జనవరి వరకు కొమ్ములు ఊరే దశ. ఈ దశలోనే దుంపకుళ్లు సోకడంతో ఎకరాల కొద్ది నష్టం జరుగుతోంది. దుంపలో పురుగులు చేరి, గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కుళ్లిపోతున్నాయి. దుంపలో పసుపు రంగుకు బదులు మట్టి రంగు ఏర్పడి, పసుపు కాండం వేరు కుళ్లి ఉండి, ఒత్తితే నీరు కారుతోంది. జిల్లాలోనే దాదాపు 15 వేల ఎకరాల్లో దుంపకుళ్లు రోగం సోకినట్లు తెలుస్తోంది. గతేది ఎకరాకు 40 డ్రమ్ములు(25 క్వింటాళ్లు) దిగుబడి వస్తే, ఈ ఏడాది కనీసం 20 డ్రమ్ములు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. దెబ్బతీసిన వర్షాలు వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పంటచేలు నుంచి నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వేసిన ఎరువులను మొక్క తీసుకోకపోవడంతో పాటు పురుగులు, తెగుళ్లకు నిలయంగా మారింది. ఎకరాకు కనీసం రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టగా, పంట అమ్మితే అదీ వచ్చే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. -
ఆకతాయిలకు ముకుతాడు
జగిత్యాలక్రైం: జిల్లాలో కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీంలు ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా షీటీంలు జనసంచారం ఉన్న చోట మఫ్టీలో తిరుగుతూ ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో కాపుకాస్తున్నారు. జగిత్యాల, మెట్పల్లి సబ్ డివిజన్ల పరిధిలో షీటీం బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవగాహన సదస్సు జిల్లావ్యాప్తంగా షీటీం ఇప్పటి వరకు 115 అవగాహన సదస్సులు నిర్వహించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 64 ఫిర్యాదులు రాగా 77 కేసులు నమోదు చేశారు. ఈ పెట్టి కేసులు 41 నమోదు చేశారు. రెడ్హ్యాండెడ్గా 178 మందిని పట్టుకుని 157 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి, మిగతా వారిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ పెద్ద పట్టణాలతో పాటు, మండల కేంద్రాల్లోని బస్టాండ్ కళాశాలలు, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. భద్రతకు ప్రాధాన్యం మహిళలు, విద్యార్థుల రక్షణకు షీటీం బృందాలు నిరంతరం కృషిచేస్తున్నాయి. తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగడాలను వీడియో రికార్డ్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు సైతం నమోదు చేస్తున్నారు. జగిత్యాల, మెట్పల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 20 మండలాల్లో షీ టీం బృందాలు పనిచేస్తున్నాయి. టీంను ఎస్సైస్థాయి అధికారి సమన్వయం చేస్తుండగా.. మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారు. సమాచారం గోప్యం ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నా రు. జిల్లాలో ఆకతాయిలు ఎక్కువగా సంచరించే 185 ప్రాంతాలను గుర్తించారు. జిల్లావ్యాప్తంగా షీ టీం బృందాలు 115 పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సు నిర్వహించగా 9,600 మంది వి ద్యార్థులు హాజరయ్యారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తే డయల్ 100 లేదా 87126 70783కు వాట్సప్ నంబ ర్లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.బస్టాండ్, పాఠశాలలు, కళాశాలలు వద్ద మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జగిత్యాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీసుస్టేషన్లలో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలలు, కళాశాలల వద్ద షీటీం ఫోన్ నంబర్లు తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – అశోక్కుమార్, ఎస్పీ -
వాచ్పేయి సేవలు మరవలేనివి
జగిత్యాలటౌన్/మెట్పల్లి/రాయికల్/పెగడపల్లి/కథలాపూర్/మల్లాపూర్/మల్యాల: దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి దేశానికి చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో వాజ్పేయి చిత్రపటానికి భారత సురక్షా సమితి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పుప్పాల సత్యనారాయణ, అక్కినపెల్లి కాశినాథం, చిట్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఆముద రాజు, సిరికొండ రాజన్న, గాదాసు రాజేందర్, పవన్సింగ్, సాంబారి కళావతి, గడ్డల లక్ష్మి, దూరిశెట్టి మమత తదితరులు పండ్లు పంపిణీ చేశారు. పెగడపల్లిలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం, మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి, గంగుల కొంరెల్లి, చింతకింది అనసూయ, గంగుల లక్ష్మీ,, కూన కుమార్, శ్రీరాం చారి పాల్గొన్నారు. వాజ్పేయి రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యమిచ్చి ఆదర్శంగా నిలిచారని బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి శ్రీనివాస్, కొండ్లెపు శ్రీనివాస్, చెట్లపల్లి సత్యనారాయణ, డాక్టర్ వెంకట్రెడ్డి, మద్దెల లావణ్య, బొడ్ల ఆనంద్, జుంగుల అనిల్ పాల్గొన్నారు. కథలాపూర్లో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు వెంకటేశ్వర్రావు, కొడిపెల్లి గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయికల్లో పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు అల్లె నర్సయ్య, కడార్ల శ్రీనివాస్, శ్రీగద్దె శ్రీనివాస్, దాసరి రవి, గోపి, తోకల శంకర్, కట్కం కిశోర్, మచ్చ శంకర్, తాటిపాముల శేఖర్ పాల్గొన్నారు. మల్లాపూర్లో వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మీ, లవంగ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మల్యాల మండలకేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, సంబురాలు నిర్వహించారు. మల్లేశం, ప్రసాద్, వెంకటస్వామి, గోవర్ధన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక భూముల లెక్క పక్కా..
జగిత్యాల: జిల్లా కేంద్రంలో నేషనల్ జియో ఫేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హబిటేషన్ (నక్ష) సర్వే ప్రారంభమైంది. గతేడాడే సర్వే ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఆగిపోయింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 8 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా.. అందులో జగిత్యాల కూడా ఉంది. భారత గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న కార్యక్రమం ఇది. అర్బన్ ఆస్తులకు సంబంధించిన నక్ష సర్వే రూపొందించడం, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. గతేడాది ఫిబ్రవరిలో హెలికాప్టర్ ద్వారా జగిత్యాల మున్సిపాలిటీ ఏరియల్ ఇమేజ్ సర్వే ప్రారంభించారు. ఇప్పటికే ఇమేజ్లు సేకరించారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాల వివరాలు, రోడ్లు, ఇంటి నంబర్లు, ఇంటి యజమాన్య రిజిస్ట్రేషన్ పత్రాలు, సమాచారం కోసం సర్వే చేస్తున్నారు. వాస్తవానికి నక్ష గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ఏదైనా భూములకు సంబంధించి నక్షను ఏర్పాటు చేస్తారు. దాని మాదిరిగానే పట్టణాల్లోనూ భూముల లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాగు భూములకు మాత్రమే ఉండే నక్ష పట్టణాల్లోనూ పటాలకు రూపకల్పన చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సర్వే ఆఫ్ ఇండియా, మున్సిపాలిటీ, భూమి కొలతలు, దస్త్రాల నిర్వహణ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. నక్షతో రక్షణ జిల్లా కేంద్రం కావడం.. చుట్టూ 6 కిలోమీటర్లు విస్తరించడం, ఇటీవల పలు గ్రామాలను ఇందులో విలీనం చేయడం జరిగిపోయింది. దీంతోపాటు అక్రమాలూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. నక్షతో ప్రతి ఒక్కరి ఆస్తులకు సంబంధించిన హద్దులతో కూడిన పత్రం ఇస్తారు. ఎలాంటి అక్రమణగానీ, గొడవలు ఉండవు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికావు. వీటికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో భూముల రక్షణకు నక్ష ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో చిత్రీకరణ జగిత్యాల మున్సిపాలిటీలో భవనాలను డ్రోన్లతో చిత్రీకరించారు. వీటి సహాయంగానే జిల్లా కేంద్రంలోని ప్రతి భవనం, ఆస్తులను కొలతలు చేయడంతోపాటు, వాటి సరిహద్దులకు బౌండరీలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో పొందుపర్చుతారు. ప్రతి ఒక్క ఆస్తిని అక్షాంశాలు, రేఖాంశాలతో హద్దులు గుర్తించి సంబంధిత ఆస్తులకు గుర్తింపు కార్డులు అందించనున్నారు. వీటితోపాటు, ప్రభుత్వ స్థలాలైన చెరువులు, ఆలయ భూములు పకడ్బందీగా ఉంటాయి. వాటిని ఎవరూ కబ్జా చేసే అవకాశం ఉండదు. విస్తరిస్తున్న పట్టణం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో నుంచి పైలెట్ ప్రాజెక్టులుగా కోరుట్ల, జగిత్యాల బల్దియాలను ల్యాండ్ రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో జగిత్యాల ఎంపిక కావడం గమనార్హం. ఈ మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన గ్రామాల్లోని భవనాలను కూడా ఇందులోనే చేర్చుతారు. 48 వార్డులు.. లక్షకు పైగా జనాభా జగిత్యాల బల్దియా నక్షతో కూడిన పట్టణంగా ఏర్పాటు కానుంది. బల్దియాలో లక్షకు పైగా జనాభా ఉంది. దాదాపు 45 వేల గృహాలుంటాయి. 48వార్డులున్నాయి. వీటన్నింటిని డ్రోన్ల ద్వార చిత్రీకరించి పట్టణ మ్యాప్ రూపొందించి నక్ష ఏర్పాటు చేయనున్నారు. జగిత్యాల వ్యూ -
ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ
ధర్మపురి/మేడిపల్లి/జగిత్యాలరూరల్: ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు పెండ్యాల బాలకృష్ణస్వామి, రాజేశ్ ఆధ్వర్యంలో గణపతి పూజ చేశారు. అలాగే భీమారం మండలంలోని మన్నెగూడెంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. పొలాస శివారులోని అయ్యప్ప ఆలయంలో వేలాది మంది దీక్షాపరులు పడిపూజలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి పాల్గొన్నారు. -
గ్రామాల్లో వసతుల కల్పనకు కృషి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ రాయికల్: గ్రామాల్లో వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. గురువారం అయోధ్య, రామాజీపేట పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వసతుల కల్పనకు కృషి చేస్తానని, ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో రామాజీపేట సర్పంచ్ బెజ్జంకి మోహన్, విజయ్, రాజశేఖర్, మారుతి, శ్రీనివాస్రావు, నందనగిరి లక్ష్మీ, భరత్రెడ్డి పాల్గొన్నారు. పంచాయతీల అభివృద్ధికి పాటుపడండిజగిత్యాలరూరల్: పంచాయతీల అభివృద్ధికి సర్పంచులు నిరంతరం కృషి చేయాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి సర్పంచ్, బొలిశెట్టి రాజేశ్, వార్డుసభ్యులు వసంత గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వసంత వారిని సన్మానించారు. బీఆర్ఎస్ నాయకులు న్యాడెం శంకర్, ఎల్ల రాజన్న, శ్రీకాంత్, దినేశ్, అఫ్సర్ఖాన్, గణేశ్, రాజేందర్ పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల పొలంబాటమెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం పాటిమీదితండాలో విద్యుత్ అధికారులు గురువారం పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. రైతులు వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని, భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. టెక్నికల్ డీఈ అంజయ్య, డీఈ మధుసూదన్, ఏడీఈ రవి, ఏఈ రమేశ్, రైతులు పాల్గొన్నారు. -
నిన్న జగ్గాసాగర్.. నేడు వెల్లుల
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం వెల్లుల గ్రామ రైతులు వ్యవసాయ విద్యుత్ సర్వీస్ చార్జీలు ఒకేరోజు వందశాతం చెల్లించి ఆదర్శంగా నిలిచారు. పదేళ్లుగా వందశాతం బిల్లులను ఒకేసారి చెల్లిస్తున్న రైతులు.. ఈ ఏడాదికి సంబంధించిన చార్జీలను కూడా గురువారం చెల్లించారు. 1,221 పంపుసెట్లకు సంబంధించి రూ.4,18,672ను విద్యుత్ అధికారులకు అందించారు. కార్యక్రమంలో ఏడీఈ రవి, ఏఈ రమేశ్, లైన్ఇన్స్పెక్టర్లు శంకర్, శ్రీదేవి, శేఖర్, లైన్మెన్లు నరహరి, ప్రసాద్, ఏఎల్ఎంలు, రైతులు పాల్గొన్నారు. -
కలవరపెడుతున్న వరుస చోరీలు
జగిత్యాలక్రైం: జిల్లాలో వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. ఇంటికి తాళం వేసి వెళ్లామా.. దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను పరిశీలించి రాత్రివేళల్లో చొరబడుతున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 381 దొంగతనాల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో 187 దొంగతనాల కేసులను పోలీసులు చేధించారు. మధ్యాహ్న సమయంలో 13, రాత్రి సమయంలో 132, ఇతర సమయంలో 224, దారిదోపిడీలు ఒకటి, ఇతరత్రా 11 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రూ.4,18,57,918 విలువైన వస్తువులు చోరీ చేయగా.. రూ.2,92,37,439ను పోలీసులు రికవరీ చేయగలిగారు. తాళం వేసిన ఇళ్లల్లోనే చోరీలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీసీకెమెరాలున్నా... ఆగని దొంగతనాలు నేరాల నియంత్రణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో శ్రీనేనుసైతంశ్రీ కార్యక్రమం ద్వారా పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీకెమెరాలు ఏర్పాటు చేసినా చోరీలు తగ్గడం లేదు. మరోవైపు పోలీస్ శాఖ కూడా నిరంతరం నిఘా పెడుతోంది. బ్లూకోల్ట్స్ బృందాలను నియమించింది. వారు రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్నా.. గస్తీ తిరుగుతున్నా.. దొంగలు మాత్రం తమ పనికానిచ్చేస్తున్నారు. పోలీసులకు చిక్కని దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారు మంకీక్యాప్, చేతులకు గ్లౌస్లు ధరిస్తున్నారు. పైగా వేలిముద్రలు నమోదు కాకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో నిందితులను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. రాత్రివేళల్లో పోలీసుల మఫ్టీలో తిరుగుతూ అనుమానితులను విచారిస్తున్నా.. అసలు దొంగలు మాత్రం పట్టుబడటం లేదు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్ర జలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్తే పోలీసులతోపాటు స్థాని కంగా ఉండే వారికి సమాచా రం ఇవ్వాలి. అలాంటి ఇళ్లవైపు నిఘా పెంచుతాం. ప్ర జలు ఇళ్లల్లో విలువైన వస్తువులు ఉంచి తాళాలు వేసుకుని బయటకు వెళ్లవద్దు. చాలా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. – అశోక్కుమార్, ఎస్పీ -
కూత షురూ..
● అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ● హాజరైన మంత్రి శ్రీధర్బాబు, వివిధ క్రీడల ప్రముఖులు ● ఆకట్టుకున్న మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా కబడ్డీ కూత షురూ అయ్యింది. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు గురువారం రాత్రి నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఒలింపిక్, రాష్ట్ర, జిల్లా కబడ్డీ క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 952 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా జిల్లాల బృందాల ఫ్లాగ్ మార్చ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలిమ్యాచ్ పురుషుల విభాగంలో కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య జరిగింది. -
వ్యవసాయం.. జీవన విధానం
కరీంనగర్: వ్యవసాయం వృత్తి కాదు.. జీవన విధానమని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన కిసాన్ గ్రామీణ మేళాను ప్రారంభించారు. స్టాల్స్ను సందర్శించారు. అధునాతన వ్యవసాయ యంత్రాలు, సీడ్స్, డెయిరీ, ఆర్గానిక్ స్టోర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అందుకోసం రైతులు సంఘటితంగా మారాలన్నారు. తమ భూములను భూసార పరీక్ష చేసుకొని, తగిన మోతాదులో ఎరువులు వాడటం ద్వారా అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. కిసాన్ జాగరణ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని, యువత వ్యవసాయం, ఇతర చేతివృత్తుల పైపు కాకుండా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల వైపు వలసలు వెళ్తున్నారని అన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుకు, వారిని చైతన్యపరచుటకు కిసాన్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు సమగ్ర వ్యవసాయం వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన రైతు రక్షణవేదిక యూట్యూబ్ చానల్ను దత్తాత్రేయ చేతుల మీదుగా ప్రారంభించారు. వరంగల్ మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్రావు, ట్రాన్స్పోర్ట్ చైర్మన్ సమ్మిరెడ్డి, గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు మల్లేశం యాదవ్, మారుతి, బ్రహ్మం, శ్రీకాంత్రెడ్డి, మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షం హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కరీంనగర్లో కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభం -
ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
జగిత్యాల: క్రిస్మస్ పండుగ అత్యంత పవిత్రమైందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయమని, ప్రేమను పంచుకోవడం, సేవభావంతో మానవత్వం కాపాడుకోవడం ఎలా అనేవి క్రీస్తుబోధనలు తెలియజేస్తాయన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. హెచ్ఐవీ బాధితులకు చికిత్స అందించాలిజగిత్యాల: హెచ్ఐవీ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఆర్టీ కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 4,387 మంది మహమ్మారి బారిన పడ్డారని, వారిలో 3900 మంది ఏఆర్టీ చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. 117 మందికి మహమ్మారి వ్యాప్తి చెందిందని, వారికి చికిత్స అందించాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు 15,963 మందికి రక్త పరీక్షలు చేశామన్నారు. సమావేశంలో డాక్టర్ శిరీష, శ్రావణి పాల్గొన్నారు. పెట్రోల్ బంక్ తొలగించండిజగిత్యాలటౌన్: యావర్రోడ్డు విస్తరణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న పెట్రోల్ బంక్ను తొలగించాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు దుమాల గంగారాం అన్నారు. జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా యావర్రోడ్డు విస్తరణకు కట్టుబడి ఉన్నానన్న ఎమ్మెల్యే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ముందుగా మంచాల కృష్ణ పెట్రోల్ పంపు తొలగించాలని సూచించారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తే అన్ని కుల, ప్రజాసంఘాలను కలుపుకుని ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామన్నారు. బెజ్జంకి సతీష్, బొల్లె అనిల్, పొడేటి సునీల్ తదితరులు పాల్గొన్నారు. మల్యాల పీహెచ్సీ తనిఖీమల్యాల: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డీఎంహెచ్వో శ్రీనివాస్ తనిఖీ చేశారు. ల్యాబ్, ఫార్మసీ రిజిస్టర్లను పరిశీలించారు. మాతాశిశు కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. వైద్యురాలు మౌనిక ఆయనను సన్మానించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్, హెచ్ఈఓ రమేశ్, సిబ్బంది సాధిక్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. రోళ్లవాగు కాలువకు మరమ్మతుజగిత్యాలరూరల్: రైతులకు సాగునీరు అందించేందుకు రోల్లవాగు ప్రధాన కాలువకు మరమ్మతు చేపట్టినట్లు డీఈ చక్రూనాయక్ అన్నారు. ఇటీవలి భారీ వర్షాలకు బీర్పూర్ చౌరస్తా వద్ద రోళ్లవాగు ప్రధాన కాలువకు గండిపడగా బుధవారం పూడ్చివేయించి మరమ్మతు చేపట్టారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ సాగునీరు విడుదలవుతుండడంతో ప్రాజెక్ట్ నుంచి రైతులకు సాగునీరు అందించేందుకు సాగునీరు వృథా కాకుండా కాలువలకు మరమ్మతు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఏఈ అనిల్ పాల్గొన్నారు. -
రూ.2.69 కోట్ల పన్నుల వసూలు
● లక్ష్యం రూ.12.38 కోట్లు ● మార్చి 31 చివరి తేదీ జగిత్యాలరూరల్: జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వేళ పన్నులు భారీగా వసూళ్లయ్యాయి. 20 మండలాల్లోని 385 గ్రామపంచాయతీల్లో నవంబర్ నుంచి ఇప్పటివరకు రూ.2,69,19,913 పన్ను వసూలు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థులు, వారిని బలపర్చే వారు కూడా ఇంటి, నీటిపన్నులు చెల్లించాల్సి ఉండటంతో భారీగా పన్నులు వసూలయ్యాయి. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. లక్ష్యం రూ.12.38 కోట్లు జిల్లాలో గ్రామపంచాయతీల్లో పన్ను వసూళ్లకు 2026 మార్చి 31 వరకు రూ.12,38,61,750 లక్ష్యం ఉండగా.. అక్టోబర్ 30 వరకు రూ.1,87,32,110 వసూలు చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రావడం, బకాయి పన్ను చెల్లించిన వారికే పోటీచేసే అవకాశం ఉండటంతోపాటు, బలపర్చే అర్హతలు ఉండటంతో భారీగా పన్నులు చెల్లించారు. భక్తులకు ఇబ్బంది కలగనీయొద్దు ధర్మపురి: ముక్కోటి ఏకాదశికి వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హారిణి సూచించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి కార్యాలయంలో ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షించారు. ముక్కోటికి వేలాది మంది భక్తులు వస్తారని, వారికి వసతులు, ఏర్పాట్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాన్య భక్తులు, ప్రముఖులకు ఇబ్బంది రానీయొద్దన్నారు. ప్రత్యేక క్యూలైన్లు, గోదా వరి తీరం, పట్టణంలోని పలు వీధుల్లో పారిశుధ్యం పరిశీలించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, సీఐ రాంనర్సింహరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, సీని యర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, ధర్మకర్తలు తదితరులున్నారు. -
డబ్బులు ఇప్పించాలని సెల్ టవర్ ఎక్కిన రైతు
● ఎస్ఐ సూచనతో దిగివచ్చిన బాధితుడు ఇల్లంతకుంట(వేములవాడ): అమ్మిన భూమి పైసలు ఇవ్వడం లేదని సెల్ టవర్ ఎక్కగా.. పోలీసులు కల్పించుకోవడంతో దిగారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన రైతు, మాజీ ఉపసర్పంచ్ కర్ల రవి బుధవారం వల్లంపట్ల పొలిమేరలోని సెల్టవర్ ఎక్కాడు. అది చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సెల్టవర్ పై నుంచే తన బాధను ఫోన్లో ఎస్సైకి వివరించగా.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దిగి వచ్చాడు. తన 3.13 ఎకరాల వ్యవసాయ భూమిని రూ.75.47లక్షలకు గ్రామానికి చెందిన మాందాటి కరుణాకర్రెడ్డికి మూడేళ్ల క్రితం అమ్మి రిజిస్ట్రేషన్ చేశానని తెలిపారు. అయితే ఇంకా తనకు వడ్డీతో సహా రూ.43లక్షలు రావాల్సి ఉందని, ఇవ్వడం లేదని తెలిపారు. రెవెన్యూ అధికారి శశికుమార్ రిపోర్ట్ నమోదు చేసి తహసీల్దార్ ఫరూక్కు అందజేశారు. తనకు న్యాయం చేయాల్సిందిగా కర్ల రవి అధికారులను వేడుకున్నాడు. -
గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
ధర్మపురి: అర్హులందరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 140 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు పంపిణీ చేశారు. మొదటి, రెండో 172 మంది లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందించామని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. ఇళ్లు కట్టుకున్న ప్రతి కుటుంబానికీ రూ.5లక్షలు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కన్నం హారిణి, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డులు అస్తవ్యస్తం
జిల్లాలోని మున్సిపాలిటీలు, చెత్త సేకరణ వివరాలురూ. 2.40 లక్షలు రూ. 1.25లక్షలురూ.లక్ష 34.25 టన్నులు3210చెత్తసేకరణ(రోజు)ట్రాక్టర్లుమెట్పల్లికోరుట్లజగిత్యాల ధర్మపురిరాయికల్ -
అమ్మానాన్న ఆశ్రమానికి అవ్వ
జ్యోతినగర్(రామగుండం): కుటుంబసభ్యులు వద్దన్నా..అవ్వకు ప్రభుత్వ అధికారులు ‘అమ్మానాన్న’లో ఆశ్రయం కల్పించారు. దిక్కులేని వారికి ప్రభుత్వమే అండగా ఉందని నిరూపించారు. వివరాలు.. గోదావరిఖని విఠల్నగర్కు చెందిన వృద్ధురాలు మొగిలమ్మ కొద్దిరోజులుగా రామగుండం రాజీవల రహదారి బీ – పవర్హౌస్ బస్స్టాప్ వద్ద అనాథగా ఉంటోంది. భిక్షాటన చేయడంతోపాటు తినడానికి ఎవరైనా ఇస్తేతీసుకుని కాలం గడుపుతోంది. సమాచారం అందుకున్న జిల్లా ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి స్వర్ణలత.. కలెక్టర్ ఆదేశాల మేరకు వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి యత్నించగా.. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. శిశు సంక్షేమాధికారి ఆదేశాలతో వృద్ధురాలిని హైదరాబాదు చౌటుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించారు. నెలరోజుల క్రితం పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో ఓ వయోవృద్ధురాలు(80) కూడా ఇదేస్థితిలో ఉండడంతో ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యస్థితి బాగుపడిన తర్వాత చౌటుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రయానికి పంపించారు. హైదరాబాద్ తరలించిన ఎఫ్ఆర్వో స్వర్ణలత -
రైళ్ల వేగం మరింత పెంపు
● రైలుపట్టాల కింద సిమెంట్ స్లీపర్లు ● పాత సిమెంట్ స్లీపర్ల తొలగింపు ● కాజీపేట – బల్హార్షా సెక్షన్ల మధ్య పనులు ఓదెల(పెద్దపల్లి): కాజీపేట బల్హార్షా సెక్షన్ల మధ్య రైళ్లవేగం మరింత పెంచేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి వరకు రైలుపట్టాల కింద కొత్త సిమెంట్ స్లీపర్లు అమర్చుతున్నారు. ప్రస్తుతం మూడోలైన్ అందుబాటులోకి రావడంతో ఒకేమార్గంలో రెండు రైళ్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నాయి. కాలం చెల్లిన సిమెంట్ స్లీపర్లను తొలగించి రైలు వేగాన్ని తట్టుకునేలా గేజ్పెంచిన ఆధునిక సిమెంట్ స్లీపర్లు వేస్తున్నారు. ఒక్కో రైలు వేగం గంటకు 110 కి.మీ. ఉందని, దానిని గంటకు 130 కి.మీ. వరకు పెంచేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. మూడోలైన్తో గూడ్సురైళ్ల వేగం కూడా పెంచనున్నారు. ఒక రైలు వెనకాల మరోరైలు వెళ్లేందుకు వీలుగా ఆటోమెటిక్ సిగ్నల్స్ సిస్టం ప్రారంభించారు. -
నేటినుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: నేటి నుంచి నాలుగు రోజుల పాటు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం కబడ్డీ కూతతో హోరెత్తనుంది. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పోటీలకు రాష్ట్రంలోని 33జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారు. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు క్రీడాదుస్తులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ అమిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశ్గౌడ్, రాష్ట్ర కబడ్డీ సంఘ ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు, కోచ్లు మల్లేశ్, శ్రీనివాస్, పద్మ అందించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, సీపీ, ప్రముఖులు హాజరుకానున్నారు. -
నానీ లే.. అన్నం పెడతా
● సెప్టిక్ ట్యాంకు తొట్టిలో పడి చిన్నారి మృతి ● సిరిసిల్లలో విషాదం సిరిసిల్లటౌన్: నానీ లే నానీ..ఆకలి అన్నావుగా..అన్నం పెడతా..ఆడుకునేటోన్ని నేను స్ట్రాంగ్ అంటావుగా ఇలా పడిపోయావు..లే నాన్న అంటూ.. ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంటనీరు పెట్టించింది. బడి నుంచి వచ్చి ఆటకని బయటకు వెళ్లిన చిన్నారి సెప్టిక్ట్యాంకు తొట్టిలో పడి మృతిచెందిన సంఘటన బుధవారం సిరిసిల్లలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. మామిడి లావణ్య–శ్రీనివాస్ దంపతులకు నికేశ్(6) కొడుకు. లావణ్య అనారోగ్యంతో పట్టణంలోని సర్దార్నగర్లో తల్లి వద్దే ఉంటూ.. కొడుకును చదివిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదివే నికేశ్ రోజు మాదిరిగానే బడికెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆడుకునేందుకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి తల్లి లావణ్య కొడుకు కోసం ఆ ఏరియా మొత్తం గాలించింది. అదే ప్రాంతంలో కుసుమ శ్రీనివాస్ కొత్త ఇల్లు కడుతున్నాడు. సెప్టిక్ట్యాంకులో ఏదో పడిందని చూస్తుండగా బాలుడు పడిపోయినట్లు గమనించి స్థానికుల సాయంతో బయటకు తీయించారు. లావణ్య అక్కడికి చేరుకొని అచేతన స్థితిలో ఉన్న కొడుకుని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా సెప్టిక్ట్యాంకు తొట్టికి మూత లేకపోవడంతో ఆ ప్రదేశానికి ఆటకు వచ్చిన నికేశ్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. -
రైతులకు న్యూ టెక్నాలజీ అందించాలన్నదే లక్ష్యం
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేసేందుకు వ్యవసాయ వర్సిటీలో సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్, సెంటర్ ఫర్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సెంటర్ ఫర్ సస్టేనబుల్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాం. మానవ రహిత వ్యవసాయం చేసేలా రోబోటిక్స్, డ్రోన్స్, సెన్సార్ వంటి టెక్నాలజీపై పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు ఓ వైపు పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు రైతులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం ఖరీఫ్ సీజన్కు ముందు 1200 గ్రామాల్లో శ్రీరైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలుశ్రీ కార్యక్రమం నిర్వహించాం. పరిశోధన స్థానాల్లో రూపొందించిన విత్తనాలను అభ్యుదయ రైతులకు ఉచితంగా ఇచ్చేలా విత్తన మేళాలు ఏర్పాటు చేశాం. వారు పండించిన విత్తనాలను గ్రామంలోని రైతులందరికీ అందేలా చూస్తున్నాం. గతంలో రైతు పిల్లలకు మాత్రమే వ్యవసాయ విద్యలో రిజర్వేషన్పరంగా సీట్లు ఉండేవి. ఈ ఏడాది నుంచి రైతు కూలీల పిల్లలకు కూడా 180 సీట్లు ఇచ్చాం. గతంలో అగ్రికల్చర్ స్పెషల్ కోటా సీట్ల ఫీజు రూ.10 లక్షలు ఉంటే.. సామాన్యుడికి భారం కాకుడదని రూ.5లక్షలకు తగ్గించాం. ఈ మొత్తం కూడా ఒకేసారి కాకుండా సెమిస్టర్కు రూ.62,500 చొప్పున 8 విడతలుగా చెల్లించేలా నిబంధనలు తెచ్చాం. తెలంగాణ వ్యవసాయ వర్సిటీ వివిధ దేశాలతో పలు ఒప్పందాలు చేసుకుంది. అమెరికాలోని కాన్సాప్ స్టేట్ యూనివర్సిటీ, ఫ్లోరిడా యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీతో ఒప్పందాలు చేసుకున్నాం. దేశీయ సంస్థలైన బిట్స్పిలాని, ఐసీఎఆర్, ఐఐఆర్ఆర్, స్విట్జర్లాండ్కు చెందిన సార్ మ్యాప్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. వ్యవసాయ యూనివర్సిటిలో 2013 నుంచి వైస్ చాన్స్లర్ పోస్టు మినహా మిగతా ఖాళీగా ఉండేవి. నేను బాధ్యతలు తీసుకున్న 100 రోజుల్లో యూనివర్సిటీ ఉన్నతాధికారులు పోస్టులు భర్తీ చేసి పాలన సజావుగా జరిగేలా చూశాను. రిజిస్ట్రార్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్, డీన్ ఆఫ్ రిసెర్చ్, డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్..ఇలా అన్ని పోస్టులను భర్తీ చేశాం. రసాయనాలు తగ్గించేలా సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు చేస్తున్నాం. పురుగుల మందులతో రక రకాల సమస్యలు వస్తున్నాయి. యూరియాపై సబ్సిడీ ఇవ్వడంలో కేంద్రప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. రాష్ట్రంలో డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేని చోట రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాల ద్వారా రైతులకు సాగుపై సలహాలు, సూచనలు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఏడు వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. వీటికి తోడు అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కళాశాల, రెండు ఫుడ్ సైన్స్ కళాశాలలు, ఒక హోం సైన్స్ కళాశాల ఉంది. ఒక వ్యవసాయ కళాశాల స్థాపించేందుకు ఐసీఎఆర్ నిబంధనల ప్రకారం 100 ఎకరాలతోపాటు రూ.150 కోట్లు నిధులు అవసరం. ప్రతి కళాశాలకు 180 మంది సిబ్బంది ఉండాలి. ఇందులో 40 మంది టీచింగ్ సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉంది. డాక్టర్ జానయ్య జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాల్లోకి తీసుకెళ్లేందుకు న్యూ టెక్నాలజీ రూపంలో ముందుకెళ్తున్నామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్య అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి వచ్చిన ఆయన శ్రీసాక్షిశ్రీతో ముచ్చటించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్య -
కొండగట్టు ఆలయ భూములు రక్షించండి
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయ భూములను రక్షించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. శ్రీఆంజనేయస్వామి వారిని బుధవారం దర్శించుకున్నారు. ఆలయ భూముల హద్దులు పరిశీలించారు. వందల ఏళ్ల నాటి ఆలయ భూములను అటవీశాఖ భూములు అనడం సరికాదన్నా రు. మాజీ సీఎం కేసీఆర్ కొండగట్టును యాదాద్రిని మించి అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేశారని పేర్కొన్నారు. కొండగట్టులో దేవాదాయ, అటవీశాఖల మధ్య భూముల వివాదం నెలకొన్నా.. మంత్రి కొండా సురేఖ పట్టించుకోకపోవడంపై సరికాదన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినా బండి సంజ య్ ఆలయ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్రావు, పునుగోటి కృష్ణారావు, బోయినపల్లి మధుసూదన్రావు, బద్దం తిరుపతి రెడ్డి, కొండబత్తిని త్రినాథ్, ఎండీ.అజారొద్దీన్ పాల్గొన్నారు. -
ఒకేరోజు వందశాతం విద్యుత్ బిల్లుల చెల్లింపు
గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలుధర్మపురి: ధనుర్మాసం సందర్భంగా ధర్మపురి గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి గంగమ్మ, గౌరమ్మకు మొక్కులు చెల్లించారు. మంగలిగడ్డ, సంతోషిమాత ఘాట్లు భక్తులతో పులకించిపోయాయి. మెట్పల్లిరూరల్: వ్యవసాయ విద్యుత్ బిల్లులను ఒకేరోజు వందశాతం చెల్లించి ఆదర్శంగా నిలిచారు మెట్పల్లి మండలం జగ్గాసాగర్ రైతులు. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశమైన రైతులు.. వ్యవసాయ బిల్లులు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. 753 వ్యవసాయ మోటార్ల సర్వీస్ చార్జీలను ఒకేరోజు రైతులంతా చెల్లించారు. కనెక్షన్కు రూ.360 చొప్పున రూ.2,71,080 సర్వీస్చార్జీ, రూ.14,440 బకాయిలు చెల్లించారు. రైతులు సమష్టిగా నిర్ణయం తీసుకుని వందశాతం బిల్లు చెల్లించడం అభినందనీయని ఏఈడీ రవి అన్నారు. ఇతర గ్రామాల రైతులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈ రమేశ్, సబ్ ఇంజినీర్ అభినయ్, లైన్మెన్లు లక్ష్మణ్, నరహరి, రాజు, శివ, జలపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నిఘా పెంచాల్సిందే..
కోరుట్ల: గంజాయి.. రెండు, మూడేళ్లుగా పట్టించుకునేవారు లేక కొత్త సంవత్సరం వేడుకల్లో యువతకు చేరవైంది. దీని నియంత్రణకు ఏడాదిగా దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. నూతన సంవత్సర వేడుకలకు వారం మాత్రమే ఉన్న క్రమంలో పోలీసు యంత్రాంగం మరింత పక్కాగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. కోరుట్ల, మెట్పల్లి సర్కిళ్లు కీలకం నాందేడ్, రుద్రంగి, మానాల నుంచి గంజాయి సరాఫరాను అడ్డుకోవడంలో జిల్లా సరిహద్దుల్లో ఉన్న కోరుట్ల, మెట్పల్లి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది. రుద్రంగి, మానాల పరిసర ప్రాంతాల నుంచి గంజాయిని తరలించేవారు కోరుట్ల సర్కిల్లోని కథలాపూర్, మేడిపల్లి మండలాల నుంచి.. మెట్పల్లి సర్కిల్ను ఆనుకుని ఉన్న నిజామాబాద్ జిల్లా సరిహద్దు.. కొమరంభీంఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చే గంజాయిని అడ్డుకోవడానికి మెట్పల్లి సర్కిల్లోని మల్లాపూర్ ఠాణా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ఈ రెండు సర్కిళ్లలో పోలీసుల యంత్రాంగం న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తే ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకల్లో గంజాయికి అడ్డుకట్ట వేయడం పెద్ద సమస్యగా కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. వేడుకల్లో గంజాయి నివారణకు డివిజన్ పరిధిలోని కోరుట్ల, మెట్పల్లి సర్కిల్ పోలీసులతో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చే స్తున్నాం. ఈ ఏడాది డివిజన్ పరిధిలో గంజా యి కట్టడిలో మంచి ఫలితాలు సాధించాం. – రాములు, మెట్పల్లి డీఎస్పీ నాందేడ్, ఆదిలాబాద్ దారుల్లో.. ఏటా న్యూ ఇయర్ వేడుకకు యువతకు గంజాయి చేరవేసి సొమ్ము చేసుకునే సరఫరాదారులు ఈ ఏడాది కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని నాందేడ్, ఉమ్మడి ఆదిలాబాద్లోని కొమరంభీంఆసిఫాబాద్, రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి, మానాల ఏరియాల నుంచి ఎక్కువ మొత్తంలో గంజాయిని జిల్లాకు తరలించే అవకాశాలున్నాయని పోలీసువర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లో మొత్తం 24 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 203 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో సగానికి మించిన గంజాయి సరఫరాదారులు నాందేడ్ పరిసరాల నుంచి జిల్లాకు తెస్తున్నట్లు తేలింది. నాందేడ్ నుంచి రైలు మార్గంలో నిజామాబాద్కు.. అక్కడి నుంచి మోటార్సైకిళ్లు, బస్సుల్లో జగిత్యాల సరిహద్దుల్లోని కమ్మర్పల్లి గండిమనుమాన్ ఏరియా నుంచి గంజాయి జిల్లాలోకి వస్తోంది. ఈసారి కూడా న్యూఇయర్ వేడుకల్లో అదే ప్రాంతాల నుంచి గంజాయిని జిల్లాకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
‘యావర్' చుట్టూ రాజకీయం
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని యావర్రోడ్ ఎన్హెచ్–63ను కొత్తబస్టాండ్ నుంచి ధర్మపురి రోడ్ వరకు తాకుతుంది. ఇది జిల్లాకేంద్రంలోనే ప్రధానమైన వాణిజ్య వ్యాపారాలు గల రోడ్డు. దీనిని విస్తరించాలని గతంలో చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ అక్కడున్న వ్యాపారులు కోర్టులకు వెళ్లడం, ఇతరత్రా కారణాలతో నిలిచిపోయింది. జిల్లాకేంద్రం కావడం.. వాణిజ్య కేంద్రాలు పెరిగిపోవడంతో రోడ్డంతా ఇరుకుగా మారింది. ప్రస్తుతం 80 ఫీట్లుగా ఉన్న ఈ దారిని 100ఫీట్లకు విస్తరిస్తే తప్ప ఇబ్బందులు తప్పేలా లేవు. రోడ్డు ఇరుకుగా మారడంతో ప్రయాణికులు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పైగా ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడిననాటి నుంచి.. జగిత్యాల మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి ఉన్న రోడ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జగిత్యాలకు ప్రధానమైంది యావర్రోడ్డు. జిల్లాకేంద్రం కావడం, లక్షకు పైగా జనాభా ఉండడం.. నిత్యం వివిధ పనుల నిమిత్తం వందలాది మంది జిల్లాకేంద్రానికి వస్తుంటారు. ఉద్యోగాలు, చదువుల నిమిత్తం వేలాది మంది ఉపాధి పొందుతూ ఇక్కడే ఉంటున్నారు. దీంతో ట్రాఫిక్ అత్యధికంగా పెరిగిపోయింది. ఐదేళ్లకోసారి ప్రజాప్రతినిధులు మారుతున్నా జగిత్యాల రూపురేఖలైతే మారడం లేదు. డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు ఈ యావర్రోడ్ ఇరుకుగా ఉండటంతో గతంలో బైపాస్రోడ్ను నిర్మించారు. బైపాస్రోడ్ కూడా పూర్తిగా ట్రాఫిక్గా మారిపోయింది. అత్యధిక స్కూళ్లు, హోటల్స్, వాణిజ్య వ్యాపారాలు ఆ రోడ్డుపై వెలవడంతో అవి ట్రాఫిక్ సమస్యగానే మారింది. విస్తరణ జరిగేనా..? జిల్లాలో అతిపెద్ద సమస్య అయిన యావర్రోడ్డు విస్తరణకు ఎమ్మెల్యే సంజయ్కుమార్ కోసం కృషి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోట 100 ఫీట్ల రోడ్లు చేపట్టారు. మిగతావి కేసులు ఉండటంతో అలాగే ఉండిపోయాయి. ఆక్రమణలు యావర్రోడ్డు 80 ఫీట్లు ఉన్నా.. వ్యాపారులు రోడ్డు ను ఆక్రమించుకున్నారు. ఎలాంటి సెట్బ్యాక్ పా టించకుండా వ్యాపారాలు నిర్వహించడంతో ప్రజల రాకపోకలకూ కష్టంగా మారుతోంది. కనీసం వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. యావర్రోడ్డులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఇటీవల మాజీమంత్రి జీవన్రెడ్డి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. బైపాస్ అంటేనే భయం జిల్లా కేంద్రం కాకముందు ప్రజల వెసులుబాటు కోసం బైపాస్రోడ్ వేశారు. ఆ సమయంలోనే బైపాస్ను 100 ఫీట్లు వేస్తే బాగుండేది. ఆ రోడ్డు ఇప్పుడు ఇరుకుగా మారడం.. జనాభా, ట్రాఫిక్ పెరిగిపోవడం సమస్యగా మారింది. ఇరుకు రోడ్లే.. జిల్లా కేంద్రంలో ప్రదానమైన రోడ్లన్నీ ఇరుకుగానే ఉన్నాయి. 1983లోనే ఉన్న మాస్టర్ ప్లానే అమలు కావడంతో రోడ్లు అభివృద్ధి కావడం లేదు. మా స్టర్ ప్లాన్ అమలు కాకపోవడం, రోడ్లు విస్తరణ కాకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరంగా మా రింది. కనీసం వాహనాలు పార్కింగ్ చేద్దామన్నా స్థలాలు లేని పరిస్థితి. ముఖ్యంగా తహసీల్ చౌరస్తా నుంచి టవర్ నుంచి కొత్తబస్టాండ్, గంజ్ కనీసం ఆటో సై తం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ యావర్రోడ్తో పాటు, బైపాస్రోడ్ల విస్తరణ చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సీఎం దృష్టికి రోడ్డు విస్తరణ యావర్రోడ్డును విస్తరించాలని, ఇందుకు నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే సంజయకుమార్ సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రోడ్డు విస్తరిస్తేనే తాను రాజకీయాల్లో కొనసాగుతాయని కూడా ప్రకటించారు. దీనిపై మాజీమంత్రి జీవన్రెడ్డి స్పందించారు. పదేళ్లుగా ఏం చేశారని, ఇప్పుడు రహదారి విస్తరిస్తేనే రాజకీయాల్లో ఉంటానని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మొత్తంగా జిల్లా రాజకీయం మొత్తం ఈ యావర్ రోడ్డు చుట్టే తిరుగుతోంది. -
కన్నుల పండువగా అయ్యప్ప మహాపడిపూజ
రాయికల్:రాయికల్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నివేదిత కృష్ణారావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, మాతలతో కుంకుమపూజ, స్వాములతో లక్ష పుష్పార్చన, 108 కలశాలతో అయ్యప్ప అభిషేకం చేశారు. శబరిమల సహాయ అర్చకులు ఉన్ని కృష్ణన్ నంబూద్రి ఆధ్వర్యంలో మహాపడిపూజ నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ హిమవంతరావు, మున్సిపల్ కమిషనర్ మనోహర్గౌడ్, పర్యవేక్షకులు ఏలిగేటి రామకృష్ణ, రమేశ్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. -
జిల్లాలో నేరాలు తగ్గుముఖం
జగిత్యాలక్రైం: జిల్లాలో ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని, ఇందుకు పోలీస్శాఖ చేపట్టిన శాంతి భద్రతల రక్షణే కారణమని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. 2025లో నేరాలు, పోలీసుసేవలపై ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. హత్యలు, దోపిడీలు, చైన్స్నాచింగ్, ఆన్లైన్ మోసాల్లో నిందితులను త్వరితగతిన గుర్తించామని, పెండింగ్ కేసుల పరిష్కారంలో పురోగతి సాధించామని తెలిపారు. షీ టీమ్స్, ఏహెచ్టీయూ, భరోసా కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామన్నారు. గతేడాది 5,919 నేరాలు నమోదు కాగా.. ఈ ఏడాది 5,620 నమోదయ్యాయని, ఈ లెక్కన 229 కేసులు తగ్గినట్లయ్యిందన్నారు. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో అత్యధికంగా 770 కేసులు, అత్యల్పంగా బుగ్గారం పోలీస్ స్టేషన్లో 135 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 29 హత్య కేసులు, 381 ప్రాపర్టీ కేసులు నమోదయ్యాయని, 187 కేసులను చేధించి రూ.22,92,37,439 రికవరీ చేశామన్నారు. 104 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదై గతేడాదితో పోలిస్తే 5 కేసులు తగ్గాయన్నారు. 19 కేసుల్లో 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాలో 234 కేసుల్లో 410 మంది నిందితులు, 260 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, గేమింగ్ యాక్ట్ కింద 167 కేసులు నమోదుకాగా.. నిందితుల నుంచి రూ.30,62,036 స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 9,290 కేసులు నమోదయ్యాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేశామన్నారు. 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 86 కేసులు నమోదు చేశామని, 203 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 33మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశామన్నారు. డయల్ 100 కాల్ ద్వారా 30,954 కాల్స్ రాగా.. 130 కేసులు నమోదు చేశామన్నారు. గల్ఫ్ పంపిస్తామని చెప్పి మోసం చేసిన వాటిలో 44 కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్ట్ చేశామన్నారు. అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఏడుగురిపై కేసు పెట్టామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై 21 కేసులు నమోదు చేశామని, 21 మంది నుంచి రూ.2,07,643 విలువైన 318.76 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సంచలన కేసులు.. కోరుట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించామని, 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని రూ.25 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నామని, బర్ నేరాల్లో 1,351 ఫిర్యాదులు రాగా.. రూ.1.72 కోట్లు తిరిగి అందించామని పేర్కొన్నారు. 00 కేసులలో నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టామన్నారు. ఐదు విడతల లోక్అదాలత్ ద్వారా 9,595 కేసులు పరిష్కరించామన్నారు. కొండగట్టు ఆలయం పరిధిలో 383 సీసీ కెమెరాలను జిల్లా కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశామని, గ్రీవెన్స్ డే ద్వారా 720 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారికి న్యాయం చేశామన్నారు. మై ఆటోఈజ్ సేఫ్లో భాగంగా జిల్లాలో 2,093 ఆటోలకు ఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు ఆరీఫ్ అలీఖాన్, కరుణాకర్, రాంనర్సింహారెడ్డి, నీలం రవి, సుధాకర్, రఫీక్ఖాన్, ఆర్ఐలు వేణు, సైదులు పాల్గొన్నారు. -
ఇటుకబట్టీల్లో విచారణ
పెద్దపల్లిరూరల్: గౌరెడ్డిపేట గ్రామశివారులోని ఓ ఇటుకబట్టీలో రెవెన్యూ, పోలీస్, కార్మికశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. కనీస సౌకర్యాలు లేవని జాతీయ మానవహక్కుల సంఘానికి కొంతకాలం ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం విచారణ చేసినట్లు తెలిసింది. ఇటుకబట్టీ నిర్వహణ తీరు పరిశీలించిన కార్మికశాఖ అధికారి హేమలత, రూరల్ ఎస్సై మల్లేశ్, రెవెన్యూ డెప్యూటీ తహసీల్దార్ విజేందర్.. నిర్వహణకు సంబంధించిన రికార్డులు తనిఖీచేసి నివేదిక రూపొందించారు. బుధవారం కలెక్టర్కు నివేదించనున్నట్లు కార్మికశాఖ అధికారి హేమలత తెలిపారు. -
కొత్త పంటల గురించి తెలిసింది
మా ప్రాంతంలో పత్తి, జొన్న, మక్క వేస్తాం. పరిశోధన స్థానంలో సాగుచేసే ఆవాలు, అలిసెంత వంటి కొత్త పంటల గురించి తెలుసుకున్నాం. కొత్త విషయాలు తెలుసుకునేందుకు పొలాస పరిశోధన స్థానంలో జరిగే ప్రతి సదస్సుకు హాజరవుతుంటాను. – గంగుబాయి, ఊట్నూర్, మంచిర్యాల జిల్లా ఇక్కడ శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలను ఆకళింపు చేసుకుని, మా పొలంలో ప్రయోగాలు చేస్తుంటాను. రైతు సదస్సుకు రావడంతో ఎన్నో కొత్త సాగు విషయాలు తెలిశాయి. తోటి రైతులు సాగు చేసే పంటల గురించి తెలుసుకున్నాను. – పవన్కుమార్, భోదన్, నిజమాబాద్ జిల్లా రైతు సదస్సులో ఖర్చు తగ్గించే పద్ధతులు చెప్పారు. యాసంగిలో పంటల్లో ఏ సమస్యలు వస్తాయి..? వాటిని ఎలా ఎదుర్కోనాలనే విషయాలను వివరించారు. వరిని ఎక్కువగా సాగు చేస్తుండటంతో ఇతర పంటలవైపు దృష్టి మళ్లింది. – మహేష్, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా -
కోరుట్లకు నిధులివ్వడంలో సర్కారు నిర్లక్ష్యం
● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి: కోరుట్ల నియోజకవర్గానికి నిధుల మంజూరు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు దామోదర్రావు మంజూరు చేసిన రూ.40లక్షలతో పట్టణంలో నిర్మించే ప్రభుత్వ పాఠశాల భవనం పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైతే పేద, మధ్యతరగతి విద్యార్థులకు మేలు జరుగుతుందని, కాంగ్రెస్ వైఖరితో నిధులు మంజూరుకాక ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయని వెల్లడించారు. నియోజకవర్గంలో అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటికి అవసరమైన నిధులు విడుదల చేయాలని విజ్ఞ ప్తి చేసినప్పటికీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. డీఈఓ రాము, ఎంఈఓ చంద్రశేఖ ర్, బల్దియా కమిషనర్ మోహన్ తదితరులున్నారు. పోలీస్ సిబ్బందికి ఆధునిక జిమ్జగిత్యాలక్రైం: పోలీసులు శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం కోసం ఆధునిక జిమ్ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. ఎస్పీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన జిమ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి శారీరక ఫిట్నెస్ ముఖ్యమన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలందిస్తారని తెలిపారు. అధికారులు ఖాళీ సమయంలో వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు ఆరీఫ్ అలీఖాన్, రఫీక్ఖాన్, కిరణ్కుమార్, సైదులు, వేణు పాల్గొన్నారు. జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలిగొల్లపల్లి: గొర్రెలు, మేకల పెంపకందారులు ప్రభుత్వం అందించే నట్టల నివారణ మందును జీవాలకు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బోనగిరి నరేశ్ అన్నారు. మండలకేంద్రంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ నల్ల నీరజతో కలిసి మంగళవారం ప్రారంభించారు. జీవాల్లో పరాన్నజీవులతో కలిగే నష్టాలను నివారించి, వాటి ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం మందు సరఫరా చేస్తోందన్నారు. ఈనెల 31 వరకు మందులు వేస్తామన్నారు. వెటర్నరీ వైద్యుడు రవీందర్, సిబ్బంది గంగాధర్, రాజశ్రీ, రవి, రమేశ్, నిశాంత్, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. జేఎన్టీయూలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లిలోగల జేఎన్టీయూలో బీటెక్ విద్యార్థులకు ఎక్స్ఎల్ఆర్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం క్యాంపస్ రిక్యూర్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ అవినాష్ సంస్థ విధివిధానాలు, ఉద్యోగ అవకాశాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం వివిధ దశలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. 170 మంది హాజరుకాగా.. 20 మందిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న వారికి వార్షిక వేతనం రూ.4లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుందని, 2026 ఫిబ్రవరిలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందని కళాశాల ప్లేస్మెంట్ అధికారి సతీష్ కుమార్ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న వారిని ప్రిన్సిపల్ నరసింహ అభినందించారు. -
పొగమంచుతో రైళ్ల ఆలస్యం
రామగుండం: ఉత్తరాదిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో న్యూఢిల్లీ, బిహార్, యూపీ రాష్ట్రాల నుంచి వచ్చే పలు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. అయ్యప్ప మాలాధారణ స్వాములు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. న్యూఢిల్లీ నుంచి చైన్నె, త్రివేండ్రం వైపు వెళ్లే సూపర్ఫాస్ట్ రైళ్ల మంగళవారం చాలా ఆలస్యంగా నడిచాయి. మధురై సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(20494) మధ్యాహ్నం 2.53 గంటలకు రామగుండం రావాల్సి ఉంది. కానీ, ఏడు గంటల ఆలస్యంతో రాత్రిపది గంటలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏపీ ఎక్స్ప్రెస్(20806) మధ్యాహ్నం 3.50గంటలకు రావాల్సి ఉండగా ఆరు గంటల ఆలస్యంగా నడుస్తోంది. జీటీ ఎక్స్ప్రెస్(12616) సాయంత్రం 4.10గంటలకు రావాల్సి ఉండగా 4 గంటల ఆలస్యంగా నడుస్తోంది. కేరళ ఎక్స్ప్రెస్(12626) మధా్య్హ్నం 3.23గంటలకు రావాల్సి ఉండగా 11 గంటల ఆలస్యంతో బుధవారం వేకువజామున నాలుగు గంటలకు రామగుండం రానుంది. సంఘమిత్ర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(12296 ) రాత్రి 9.45గంటలకు రావాల్సి ఉండగా రెండు గంటల ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు తెలిపారు. -
ఓటరు జాబితా సవరణ చేపట్టాలి
జగిత్యాల: ఓటరు జాబితా సవరణ మ్యాపింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్స్లో ఓటరు జాబితా మ్యాపింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటరు జాబితా సవరణ, డెమోగ్రఫిక్, సిమిలర్ ఎంట్రీలను నూతన జాబితాను జనవరి 13 నాటికి పూర్తి చేయాలన్నారు. రాబోయే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా బ్లర్ ఫొటోలున్న ఓటరు ఎంట్రీలను ఒకే వ్యక్తికి సంబంధించిన సమాన వివరాలున్న డూప్లికేట్ వివరాలను పరిశీలించి సవరణ చేపట్టాలన్నారు. బీఎల్వో, తహసీల్దార్లు, డీటీలు, సూపర్వైజర్లకు ఓటరు జాబితా తప్పులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన, తహసీల్దార్ పాల్గొన్నారు. -
పదేళ్లు ఏం చేశారు..
జగిత్యాలటౌన్: యావర్రోడ్డు విస్తరిస్తేనే రాజకీయాల్లో కొనసాగుతానంటున్న ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలు హాస్యాస్పదని, పదేళ్లుగా ఏం చేశారో ప్రజలకు చెప్పాలని మాజీమంత్రి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యావర్రోడ్డును ఆనుకుని ఉన్న షాపుల యజమానులను ఒప్పించి 40 ఫీట్ల నుంచి 60ఫీట్లకు.. 2014లో తిరిగి ఎమ్మెల్యే అయ్యాక 100ఫీట్లకు విస్తరించేందుకు మున్సిపాలిటీలో తీర్మానాన్ని ఆమోదింపజేశానని, ప్రజాభిప్రాయ సేకరణ చేయించి 2017లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి నివేదించానని గుర్తు చేశారు. ఆ ఫైల్ను తొక్కిపెట్టిన అప్పటిమంత్రి కేటీఆర్ 2018 ఎన్నికల సందర్భంగా సంజయ్ను గెలిపిస్తే యావర్రోడ్డు విస్తరిస్తామంటూ హామీ ఇచ్చారని, 2023 ఎన్నికల్లో టీడీఆర్ను తెరపైకి తెచ్చారని తెలిపారు. కాలయాపనకు కారణమైన ఎమ్మెల్యే చేసిన పాపం కడుక్కుంటే పోదన్నారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ముందు యావర్రోడ్డులోని అక్రమ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకూ ఉందన్నారు. ఆక్రమణలను అడ్డుకుంటున్న అదృశ్యశక్తి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఆయన వెంట బండ శంకర్, గాజుల రాజేందర్, జున్ను రాజేందర్, సురేందర్ పుప్పాల అశోక్, దుర్గయ్య, ధర రమేష్, మన్సూర్, ఎండీ భారీ, రాదాకిషన్, రఘువీర్గౌడ్ ఉన్నారు. గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు మల్లాపూర్/ఇబ్రహీంపట్నం: గోదావరి పుష్కరాల కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ తెలిపారు. మల్లాపూర్ మండలం వాల్గొండ శ్రీరామలింగేశ్వర స్వామి ఆల య సమీపంలో.. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి వద్ద పుష్కరఘాట్లను స్టేట్ టీం సభ్యులతో మంగళవారం పరిశీలించారు. గతంలో పుష్కరా లకు వచ్చిన భక్తులు, వారి కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. 20 27లో గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ధర్మపురి, వాల్గొండతో పాటు ప్రధాన ఘాట్ల వద్ద శాశ్వత ఏర్పాట్లు చేస్తామన్నారు. రద్దీని నియంత్రించడం, ట్రాఫిక్ నిర్వహణపై దృష్టి సారించామన్నారు. తహసీల్దార్లు రమేశ్గౌడ్, వరప్రసాద్, ఎంపీడీవోలు శ్రీకాంత్, గణేశ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఆనంద్, ఇరిగేషన్ డీఈ దే వా నంద్, రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చై ర్మ న్ సాంబారి శంకర్, దేవదాయశాఖ ఈవో విక్రమ్గౌడ్, సర్పంచు గంగాధర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మా బతుకులు మారవా..?
● సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన ● జీతం చారెడు.. పని బారెడు ● అరకొర వేతనాలతో ఇబ్బందులు కరీంనగర్టౌన్: జిల్లా విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా పథకంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న 1,993 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నా ప్రభుత్వాలు తమపై చిన్నచూపు చూస్తున్నాయని వాపోతున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోమార్లు చర్చలకు పిలిచినా ఫలితం లేకపోయిందని, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే సచివాలయానికి పిలిచి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా నేటికీ నెరవేరకపోవడంతో తమ పరిస్థితి ముందు నొయ్యి.. వెనుక గొయ్యిలా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,993 మంది ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్షా విభాగంలో వివిధ కేటగిరీల్లో 1,993 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 560 మంది, కరీంనగర్లో 560, పెద్దపల్లిలో 428, రాజన్నసిరిసిల్లలో 445 మంది ఉన్నారు. కేజీబీవీల్లో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది, యూఆర్ఎస్ పాఠశాలల్లో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది, డీపీవో కాంట్రాక్ట్ స్టాఫ్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్, ఎంఆర్సీ కంప్యూటర్ ఆపరేటర్స్, భవిత సెంటర్లలో ఐఈఆర్పీలు, సీర్పీలు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఎంఆర్సీ మెసెంజర్లుగా, వాచ్మెన్లుగా, స్కావెంజర్, కుక్స్గా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ భద్రత కరువు విధి నిర్వహణలో పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి, ఇతరకారణాల వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు మరణిస్తే ప్రభుత్వం నేటి వరకు ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని ఆదుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న విధంగా తెలంగాణలో కూడా టీఏ, డీఏలు ఇస్తూ ఉద్యోగ భద్రత, తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మొండిచేయి ఆంధ్రప్రదేశ్లో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణలో కంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, గతంలో ఉన్నత విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం మొండిచేయి చూపుతోందన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ నియామకాలకు సరిపోయే విద్యార్హతలు ఉన్నా వెయిటేజీ ఇవ్వకపోవడంతో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. -
కూతుళ్లు పట్టించుకోవడం లేదని..
జగిత్యాలటౌన్: కనిపెంచిన కూతుళ్లు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మంగళవారం జగిత్యాల ఆర్డీవోను ఆశ్రయించారు. జిల్లాకేంద్రానికి చెందిన గుండ మల్లేశ్వరి, శంకర్ దంపతులకు నలుగురు కూతుళ్లు. వీరిలో పెద్ద కూతురు మాత్రమే తల్లిదండ్రుల సంరక్షణ తీసుకుంది. మిగిలిన వారు తమను పట్టించుకోవడం లేదని, పక్షవాతంతో బాధపడుతున్న తమను ఉన్న ఆస్తిని వారి పేరిట మార్చాలంటూ వేధిస్తున్నారని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్ సహకారంతో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పీసీ హన్మంతరెడ్డి, వి.ప్రకాష్రావు, నాయిని సంజీవరావు ఉన్నారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..?
● హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల ఆందోళనజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద శక్తి మిల్క్ డెయిరీలో కలవేని కిరణ్ (29) ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన కిరణ్ మిత్రుడు రాజేశ్తో కలిసి అన్నపూర్ణ థియేటర్ వద్ద శక్తి మిల్క్ డెయిరీ ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి ఇద్దరు కలిసి దుకాణం మూసి వేర్వేరు గదుల్లో పడుకున్నారు. మంగళవారం ఉదయం లేచేసరికి కిరణ్ దుకాణంలో ఉరేసుకుని కనిపించాడు. దీంతో రాజేశ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కిరణ్కు ఎలాంటి ఇబ్బందులూ లేవని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీస్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతుడి భార్య వీణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్ తెలిపారు. -
ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ను జీపీటీ హుస్నాబాద్ కళాశాల జట్టు కై వసం చేసుకోగా బాలికల విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రభుత్వ మోడల్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు కై వసం చేసుకున్నాయి. అథ్లెటిక్స్ బాలికల విభాగంలోలో కె.కీర్తన (కరీంనగర్), బాలుర విభాగంలో బి.అభిషేక్(కోరుట్ల) చాంపియన్గా నిలిచారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ డి.శోభారాణి ట్రోఫీలు అందించారు. బాలికల విజేత కరీంనగర్, బాలుర చాంపియన్ హుస్నాబాద్ -
కబడ్డీ.. కబడ్డీ
కరీంనగర్స్పోర్ట్స్: కబడ్డీ.. కబడ్డీ.. కూత రేపటినుంచి నగరంలో హోరెత్తనుంది. రాష్ట్రస్థాయి కబడ్డీపోటీలకు కరీంనగర్ వేదికై ంది. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు అంబేద్కర్స్టేడియంలోని హాకీ మైదానంలో 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయి. 17ఏళ్ల తరువాత రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయి. పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారు. పురుషులు, మహిళల విభాగంలో 32 జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి 2 జట్లు హాజరుకానున్నాయి. మొత్తంగా 34 చొప్పున పురుషుల, మహిళల జట్లు ట్రోపీ కోసం పోటీపడనున్నాయి. 952 మంది క్రీడాకారులు, 156 మంది కోచ్, మేనేజర్లు, 100 మంది రెఫరీలు, 40 మంది కబడ్డీ సంఘం ప్రతినిధులు హాజరుకానున్నారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. ఆస్ట్రో టర్ఫ్ కోర్టులపై ఆట అంబేద్కర్ స్టేడియంలోని హాకీ మైదానాన్ని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్లో తొలిసారిగా ఆస్ట్రోటర్ఫ్ కోర్టులపై కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. గతంలో ఇదే స్టేడియంలోని ఇండోర్హాల్లో కబడ్డీ ప్రీమీయర్ లీగ్ నిర్వహించారు. ఈసారి ఆరు కోర్టులు సిద్ధం చేస్తున్నారు. మంత్రులతో ప్రారంభం 17 ఏళ్ల తరువాత కరీంనగర్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్, సీపీ, మున్సిపల్ కమిషనర్ హాజరుకానున్నట్లు కబడ్డీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు తెలిపారు. 28న జరిగే ముగింపు పోటీలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. 8 చొప్పున పూల్లు.. 142 మ్యాచ్లు అంబేద్కర్ స్టేడియంలో నాలుగు రోజులు కబడ్డీ కూత మోగనుంది. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరగనున్నాయి. మహిళలు, పురుషుల జట్లను 8 విభాగాల చొప్పున మొత్తం 16 గ్రూప్లుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. మొత్తంగా 142 మ్యాచ్లు జరుగనున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళలో మ్యాచ్లు జరుగనున్నాయి. రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించడానికి సన్నద్ధం చేస్తున్నారు. ఇక్కడ రాణించిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపికచేసి, 72వ జాతీయస్థాయి సీనియర్స్ పోటీలకు పంపనున్నారు. మహిళల జాతీయ కబడ్డీ పోటీలు హైదరాబాద్లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనుండగా, పురుషుల పోటీలు గుజరాత్లో ఫిబ్రవరి 24 నుంచి 27వరకు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జరిగే 72వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్, పారమిత విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఈ.ప్రసాద్రావు పిలుపునిచ్చారు. మంగళవారం మంకమ్మతోటలోని పారమిత పాఠశాలలో పోటీల వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వేదికగా 17ఏళ్ల అనంతరం కబడ్డీలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అమిత్ కుమార్, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి మల్లేశ్గౌడ్, పారమిత విద్యాసంస్థల డైరెక్టర్ అనుకర్ రావు, కబడ్డీ సంఘం కోశాధికారి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. రేపటి నుంచి కరీంనగర్ వేదికగా రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీలు 33 జిల్లాల నుంచి హాజరుకానన్న క్రీడాకారులు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా కబడ్డీ సంఘం -
కాకతీయ కాలువకు నీటి షెడ్యూల్ విడుదల
జగిత్యాలఅగ్రికల్చర్: ఎస్సారెస్పీ కాకతీయ కాలువకు బుధవారం నుంచి నీరు విడుదల చేయనున్న విషయం తెల్సిందే. ఈ మేరకు షెడ్యూల్ను ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు. ఏడు విడతలుగా వారబంధీ పద్ధతిలో ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 24 నుంచి మార్చి 31 వరకు ప్రతిరోజూ నీరు విడుదల చేస్తారు. మొదటి విభాగంలో డిస్ట్రిబ్యూటరీ కాలువ–5 నుంచి 53 వరకు ఏడు రోజులు, రెండో విభాగంలో డి–54 నుంచి 94 వరకు 8 రోజులు విడుదల చేయనున్నారు. మొదటి విభాగానికి నీరు ఇచ్చినప్పుడు రెండో విభాగానికి నీరు వెళ్లకుండా జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లి వద్ద కాలువ గేట్లు మూస్తారు. రెండో విభాగానికి నీరు ఇచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటరీ గేట్లను మూసివేస్తారు. జిల్లాలో 62 డిస్ట్రిబ్యూటరీలు కాకతీయ ప్రధాన కాల్వ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం నుంచి పెగడపల్లి వరకు 91 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. డి–21 నుంచి డి–83ఎ వరకు 62 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. ఒక్కో డిస్ట్రిబ్యూటరీ ఆయకట్టు ఏరియాను బట్టి కాలువకు ఎడమ వైపు 25, కుడివైపు మరో 25 మైనర్ కాలువలు ఉంటాయి. ఈ మైనర్ కాలువల ద్వారా సాగునీరు పంట పొలాలకు వెళ్తుంది. -
వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చాలి
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చితేనే రైతులకు మనుగడ సాధ్యమని పలువురు వక్తలు అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం జాతీయ రైతు సదస్సు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయంలోనూ ఇతర దేశాలతో పోటీపడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మనం పండించిన పంటల్లో రసాయనాల శాతం అధికంగా ఉండటంతో అమెరికా వంటి చాలా దేశాలు మన ఉత్పత్తులను తిరస్కరిస్తున్నాయని తెలిపారు. సహకార సంఘాలు, ఎఫ్పీఓ సంఘాలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రతి పంటకూ ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. రైతు భూసార పరీక్షలు చేయించుకుని, ఆ మేరకు రసాయన ఎరువులు వాడాలన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్కుమార్ శర్మ మాట్లాడుతూ.. మానవ రహిత వ్యవసాయం చేసేందుకు వర్సిటీ పరిధిలో రోబోటిక్ ల్యాబ్ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ మాట్లాడుతూ.. మార్కెట్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పంటల సరళి మార్చాలన్నారు. వరి పంటల్లో యాజమాన్య పద్ధతులపై శ్రీనివాస్, నూతన వరి రకాలపై సతీష్చంద్ర, యాసంగి పంటల్లో వచ్చే తెగుళ్లపై ఎన్.సుమలత, పంటల్లో యాజమాన్య పద్ధతులపై వై.స్వాతి, రవి, మామిడి పంటపై కె.స్వాతి, రబీలో జింక్లోపంపై సాయినాథ్ వివరించారు. కోతుల బెడదతో వ్యవసాయం చేయలేకపోతున్నామని, రైతులకు అవసరమైన విషయాలపైనే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని రైతులు కోరారు. ఉత్తర తెలంగాణలోని వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు రూపొందించిన వరి, చెరుకు, పత్తి, నువ్వులు, మొక్కజొన్న రకాలను ప్రదర్శనగా పెట్టారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ భారతీనారాయణ్ భట్, పొలాస సర్పంచ్ శంకరయ్య పాల్గొన్నారు.మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్, హాజరైన వివిధ జిల్లాల రైతులు రైతు వ్యాపారిలా ఆలోచించాలి అప్పుడే అన్నదాతలకు మనుగడ పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీయ రైతు సదస్సు పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు, శాస్త్రవేత్తలు ఆకట్టుకున్న వివిధ స్టాళ్లు -
ఒంటరి తనం భరించలేక ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
మేడిపల్లి: మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొండాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి జలందర్ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా, కొద్ది నెలలకే విడాకులయ్యాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న జలందర్ ఇలీవలే గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చాడు. 18 నెలలుగా ఒంటరిగా ఉంటున్న జలందర్ మానసికంగా బాధపడుతున్నాడు. జీవితం మీద విరక్తితో మంగళవారం ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి గొల్లపల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. 14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేతరాయికల్: మండలంలోని ఇటిక్యాల పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్లను మంగళవారం తహసీల్దార్ నాగార్జున మైనింగ్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. కుజదోష నివారణ పూజలు ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మంగళవారం కుజదో ష నివారణ పూజలు చేశారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య కుటుంబ కలహాలు, వాస్తుదోషాలు ఉన్నవారు కుజదోష నివారణ పూజలు చేశారు. జలంధర్(ఫైల్) -
కేసీఆర్.. నోరు అదుపులో పెట్టుకో..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సీఎం రేవంత్రెడ్డిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవారం కరీంనగర్లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మార్పును కోరిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని, జూబ్లీహిల్స్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పును జీర్ణించుకోలేక.. బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనే భయంతో కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లపాటు ఫాంహౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని కేసీఆర్ ఇప్పుడు పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని భావించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారని తెలిపారు. గత పాలనలో రాష్ట్ర బడ్జెట్ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. సీఎంపై వ్యక్తిగతంగా మాట్లాడటం సరికా దని, ఎవరి దయదాక్షిణ్యాలతోనో కుర్చీలో కూర్చోలేదని పేర్కొన్నారు. బయట విమర్శలు చేయడం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సూచించారు. కేటీఆర్కు అహంకారం ఎక్కువగా ఉందని, హరీశ్రావు బాధ్యతలేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బుద్ది తెచ్చుకొని ప్రజలు ఆమోదించే పనులు చేయాలని హితవుపలికారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. -
భార్య ఉపసర్పంచ్.. భర్త వార్డుమెంబర్
కథలాపూర్: మండలంలోని ఇప్పపల్లి పంచాయతీలో భార్యాభర్తలు చెన్నవేని సు జాత, రంజిత్ కుమార్ వార్డుసభ్యులుగా గెలిచారు. వీరిలో సుజాత ఉపసర్పంచ్గా నియామకం అయ్యా రు. సోమవారం ఆమె ఉపసర్పంచ్గా.. ఆమె భర్త రంజిత్కుమార్ వార్డుసభ్యుడిగా ప్రమాణం చేశారు. బోర్నపల్లి సర్పంచ్గా 70 ఏళ్ల రాజవ్వరాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కొడిపల్లి రాజవ్వ సర్పంచ్గా బరిలో నిలిచి గెలుపొందారు. సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సేవ చేయడానికి వయస్సు అడ్డుకాదని, నిరుపేదలకు సేవ చేయడమే తమ పాలకవర్గ లక్ష్యమని తెలిపారు. ప్రమాణం చేసిన రోజే ఉపసర్పంచ్కు రాజీనామాధర్మపురి: ఉపసర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన గంట వ్యవధిలోనే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీవోకు లేక సమర్పించిన ఘటన మండలంలోని కమలాపూర్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి ఎన్నికల్లో రాజూరి శ్రీనివాస్గౌడ్ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఆయనను ఉపసర్పంచ్గా ఎన్నుకున్నారు. అయితే సోమవారం ప్రమాణం చేసిన ఆయన.. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీవో నరేష్కుమార్కు లేఖ సమర్పించారు. -
బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 10 మంది బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నేడు జాతీయ రైతు దినోత్సవంజగిత్యాలఅగ్రికల్చర్: పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం జాతీయ రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు పరిశోధన స్థానం డైరెక్టర్ హరీష్కుమార్ శర్మ తెలిపారు. వివిధ పంటల్లో సాగు వివరాలపై సదస్సులో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. షాపుల నిర్వహణకు వేలంజగిత్యాలరూరల్: దుబ్బరాజేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి కోసం షాపుల నిర్వహణకు వేలం వేశారు. కొబ్బరికాయలు, పూజ సామగ్రి నిర్వహణకు 12 రోజులకు రూ.4 లక్షలు, కొబ్బరిముక్కల సేకరణకు రూ.2.60 లక్షలు, చలువపందిళ్ల నిర్మాణానికి రూ.1.20 లక్షలు, లైటింగ్, సౌండ్ సిస్టమ్కు రూ.84,400, టెంట్లు రూ.78 వేలు, రంగులు, సున్నం వేసేందుకు రూ.1.25 లక్షలు, మహాశివరాత్రి పూల అలంకరణకు రూ.93,940 కేటాయించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు రాజమౌళి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ పొరండ్ల శంకరయ్య, రెనోవేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పైడిపల్లిలో ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం
వెల్గటూర్: పైడిపెల్లి గ్రామంలో నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా ముగిసింది. గ్రామంలో నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. రీపోలింగ్ జరపాలని, ప్రమాణ స్వీకారం ఆపాలని గ్రామస్తుల డిమాండ్ల నేపథ్యంలో ప్రమాణస్వీకారంపై కొంత అయోమయం నెలకొంది. పోలీసుల ప్రత్యేక బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నూతన సర్పంచ్ గంగుల మంగ ప్రమాణ స్వీకారం చేశారు. ఒకే కుటుంబం నుంచి ఉపసర్పంచ్, ఇద్దరు వార్డుసభ్యులుకథలాపూర్: మండలంలోని ఊట్పల్లిలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వార్డుసభ్యులుగా గెలుపొందారు. వీరిలో ఒకరు ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామానికి చెందిన ముదాం శేఖర్ 8వ వార్డుసభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ అయ్యారు. ఆయన పెద్దమ్మ ముదాం రాజమణి రెండో వార్డుసభ్యురాలిగా, శేఖర్ పెద్దనాన్న కుమారుడు ముదాం ప్రమోద్ ఒకటో వార్డు నుంచి గెలుపొందారు. ముదాం రాజమణిముదాం ప్రమోద్, ముదాం శేఖర్రాయికల్: మండలంలోని శ్రీరాంనగర్ పంచాయతీలో సర్పంచ్, వార్డుసభ్యులు, చివరకు కార్యదర్శి కూడా మహిళే కావడం విశేషం. సర్పంచ్గా రాధికగౌడ్, ఒకటో వార్డు సభ్యురాలుగా కూస దేవమ్మ, రెండో వార్డు మెంబర్గా శేర్ కిష్టమ్మ, మూడోవార్డ్ మెంబర్గా కొంపల్లి సుమలత, నాలుగో వార్డు సభ్యురాలుగా కొంపల్లి ప్రియాంక గెలుపొంది సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రమాణం చేశారు. వారితో మహిళాకార్యదర్శి అయిన పుష్పలత ప్రమాణం చేయించారు. -
పర్యాటక అందాలను వెలుగులోకి తెండి
జగిత్యాలటౌన్: జిల్లాలో ఇప్పటివరకు వెలుగుచూడని పర్యాటక అందాలను వెలుగులోకి తెచ్చేలా ఫొటోలు, వీడియోలను వందపదాలకు మించకుండా తయారు చేసి గూగుల్ఫాం లేదా సోషల్ మీడియాలో పొందుపరచాలని కలెక్టర్ సత్యప్రసాద్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు వెలుగులోకి రాని పర్యాటక అందాలను ఆవిష్కరించేందుకు 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. యువత ఫొటో, వీడియోగ్రాఫర్స్, కవులు, రచయితలు పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజలకు పెద్దగా తెలియని జలపాతాలు, పురాతన ఆలయాలు, ట్రెక్కింగ్ పాయింట్లు వంటి వంద కొత్త గమ్యస్థానాలను గుర్తించి వాటి వివరాలతో కాపీ టేబుల్ బుక్ రూపొందించడమే పోటీల లక్ష్యమన్నారు. ప్రకృతి, వైల్డ్లైఫ్, ఆర్ట్అండ్కల్చర్, హెరిటేజ్, వాటర్ బాడీస్, వంటకాలు, ఫాంస్టెస్, రిసార్ట్, స్పిర్చువల్, అడ్వెంచర్ వంటి పది విభాగాల్లో www.ot ur-ir-m.te a nfa na,gov.i nMకు తమ ఎంట్రీలు పంపాలన్నారు. తాము ఎంచుకున్న విభాగానికి సంబంధించి మూడు మంచి ఫొటోలు, 60 సెకండ్ల వీడియో, ఆ ప్రదేశానికి వెళ్లి వచ్చేందుకు రవాణా, బసకు సంబంధించి బడ్జెట్ వివరాలతో కూడిన సమాచారాన్ని తయారు చేసి వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. ఉత్తమ ఎంట్రీలకు మొదటి బహుమతి రూ.50వేలు, రెండో బహుమతి రూ.30వేలు, మూడో బహుమతి రూ.20వేలతోపాటు కన్సోలేషన్ బహుమతులుగా హరిత హోటల్లో ఉచిత బస కల్పిస్తారని తెలిపారు. సంక్రాంతికి విజేతలను ప్రకటిస్తారని తెలిపారు. ఆసక్తి గలవారు జనవరి 6లోపు ఎంట్రీలు పంపాలని సూచించారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, ట్రైనీ డిప్యుటీ కలెక్టర్ హారిణి, యువజన, క్రీడల అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
జగిత్యాల: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. కలెక్టరేట్లో క్లీనికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బేటి బచావో బేటి పడావోపై విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. గర్భవతిగా నమోదైనప్పటి నుంచే ఆశాకార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కౌన్సెలింగ్ చేయాలన్నారు. డీఎంహెచ్వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న మూడు నూతన స్కానింగ్ సెంటర్ల అనుమతుల అంశాన్ని కలెక్టర్కు నివేదించామన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా నిబంధనలు అతిక్రమించిన మూడు స్కానింగ్ సెంటర్లకు హెచ్చరిక నోటీసులు జారీ చేశామన్నారు. మాతాశిశు సంరక్షణాధికారి జైపాల్రెడ్డి మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్ కోసం అమలవుతున్న నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతినెలా ఫాం ఎఫ్లో వివరాలు సమర్పించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ అధికారి సుధీర్, భూమేశ్వర్, శంకర్ పాల్గొన్నారు. -
తాళం వేసిన నాలుగిళ్లలో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం బాలపల్లిలో ఆదివారం రాత్రి తాళం వేసిన నాలుగిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన పడిగెల లచ్చవ్వ ఇంటికి తాళం వేసి కూతురు వద్దకు వెళ్లింది. ఎనగందుల జయలక్ష్మీ, బుర్ర రమ, గాలిపల్లి కవిత తమతమ ఇళ్లకు తాళాలు వేసి హైదరాబాద్ వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్ల తాళాలు పగులగొట్టి బుర్ర రమ ఇంట్లోనుంచి రెండు బంగారు ఉంగరాలు, పడిగెల లచ్చవ్వ ఇంట్లోనుంచి వెండి విగ్రహాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బంగారు ఉంగరాలు, నగదు చోరీ -
బీజేపీ బలోపేతంతో కాంగ్రెస్కు భయం
రాయికల్: క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతంతో భయపడుతున్న కాంగ్రెస్ నాయకులు సర్పంచ్లను బలవంతంగా పార్టీలో చేర్చుకుంటున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతోందని, కాంగ్రెస్కు చెందిన నాయకులు అధిష్టానం ఎదుట తమ పరువు కాపాడుకునేందుకు కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. వక్రబుద్ధిని మానుకోవాలని సూచించారు. కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గెలుపొందిన బీజేపీ అభ్యర్థులను అభినందించారు. రాష్ట్ర నాయకులు మోరపల్లి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్, ప్రధాన కార్యదర్శులు భూమేశ్, సంజీవ్, శ్రీనివాస్, అల్లె నర్సయ్య, కుర్మ నారాయణరెడ్డి, ఏనుగు ముత్యంరెడ్డి, మంగళారపు లక్ష్మీనారాయణ, మచ్చ నారాయణ, సతీశ్, రవి పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సవరణ, మ్యాపింగ్ సమర్థవంతంగా నిర్వహించాలి
జగిత్యాల: ఓటరు జాబితా సవరణ, మ్యాపింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ సమర్థవంతంగా చేపట్టాలని, ఓటరు జాబితాలో ఉన్న డెమోగ్రఫిక్ సిమిలర్ ఎంట్రీలను జాగ్రత్తగా గుర్తించాలన్నారు. ముఖ్యంగా బ్లర్ ఫొటోలు ఉన్న ఓటరు ఎంట్రీలు, ఒకే వ్యక్తికి సంబంధించిన సమాన వివరాలతో ఉన్న డూప్లికేట్ ఎంట్రీలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్ అన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫొటోలు, లోపాలు సరిదిద్దాలన్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం సరిచేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో సూపర్వైజర్లు, బూత్స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి ఓటరు జాబితా రూపొందించాలని ఆదేశించారు. -
యాసంగికి ఎస్సారెస్పీ నీరు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జిల్లా రైతులకు ఎస్సారెస్పీ సాగునీరే ప్రాణాధారం. బా వులు ఉన్నప్పటికీ ప్రాజెక్టు నీళ్లు రాకపోతే ఎండిపోతాయి. ఈ సారి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నందున ఆన్, ఆఫ్ ప ద్ధతి కాకుండా రెగ్యులర్గా సాగునీరు అందించాలి. – పడిగెల రవీందర్ రెడ్డి, రాయికల్ ఎస్సారెస్పీ నీరు ఎప్పుడు విడుదల చేస్తారా..! అని ఎదురు చూస్తున్నాం. ఈనెల 24 నుంచి విడుదల చేయనున్నట్లు తెలిసింది. కాలువ చివరి భూములకు నీరు అందాలంటే ఎప్పటికప్పుడు అధికారులు కాలువలపై మానిటరింగ్ చేయాలి. – గడ్డం గంగారెడ్డి, చల్గల్, జగిత్యాల రూరల్ ప్రస్తుతం ఎస్సారెస్పీ నిండుకుండలా ఉంది. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 949.754 టీఎంసీల ఇన్ఫ్లో రాగా.. 882.040 టీఎంసీల నీటిని బయటకు వదిలారు. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులకు ప్రస్తుతం (80.5 టీఎంసీలకు 80.053 టీఎంసీలు) అంతేమొత్తం నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి కోరుట్ల, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి పట్టణాలకు మిషన్ భగీరథ కింద 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
యావర్రోడ్డు విస్తరిస్తేనే రాజకీయాల్లో కొనసాగుతా..
జగిత్యాల: జిల్లాకేంద్రంలో ప్రధాన సమస్య యావర్రోడ్డు అని, ఆ రోడ్డు విస్తరిస్తేనే రాజకీయాల్లో కొసాగుతానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డిని సోమవారం హైదరాబాద్లో కలిసిన ఆయన నియోజకవర్గ ప్రజల పక్షాన అభినందనలు తెలిపారు. యావర్రోడ్డు 2001కు ముందు 80 ఫీట్ల రహదారిగా ఉండేదని, వ్యాపార సముదాయాలతో.. అతి తక్కువ నివాస ప్రాంతాలతో ఉండేదని, దీనిని విస్తరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీస్టేడియం నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. రూ.204 కోట్లతో నిర్మించనున్న ఆస్పత్రి బిల్డింగ్కు త్వరలో సీఎం, మంత్రులు భూమిపూజ చేస్తారని తెలిపారు. -
జీవాలకు నట్టల నివారణ మందులు
మెట్పల్లిరూరల్: మూగజీవాల సంరక్షణ విషయంలో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును (డీవార్మింగ్) ఉచితంగా పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం.. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. జిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు, 31 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 45 ఉప పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలోని గొర్రెలు, మేకలకు పశువైద్యాధికారులు నివారణ మందులు వేస్తున్నారు. ఈ కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగనుంది. గొర్రెలు,మేకలు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెండేళ్లలో సరఫరా కానీ మందులు.. రెండేళ్లుగా ప్రభుత్వం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును సరఫరా చేయలేదు. దీంతో చాలా మంది రైతులు ప్రైవేట్లో కొనుగోలు చేసి జీవాలకు వేశారు. ప్రస్తుతం ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తోంది. పశుసంవర్ధక శాఖ అధికారులు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేసే పనిలో నిమగ్నమయ్యా రు. మూగజీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వనియోగం చేసుకోవాలని కోరుతున్నారు. తప్పనిసరిగా వేయించాలి జీవాల్లో నట్టల నివారణకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నట్టల నివారణ మందులు వేస్తున్నాం. ఇందుకోసం ముందుగానే జీవాల పేడ నమునాలను సేకరించి పరిశీలించాం. వాటి ఆధారంగా అవసరమైన మందులు వేస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ మనీషాపటేల్, పశువైద్యాధికారి, మెట్పల్లి -
గుల్లపేటలో అద్దె భవనంలో ప్రమాణస్వీకారం
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం గుల్లపేటలో గ్రామపంచాయతీ భవనాన్ని రెండేళ్ల క్రితం శిథిలావస్థలో ఉండటంతో కూల్చివేశారు. అప్పటి నుంచి అద్దె భవనంలోనే కొనసాగుతోంది. చెర్లపల్లి గ్రామ పంచాయతీకి కూడా భవనం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలోనే ఏడేళ్లుగా కార్యాలయం నిర్వహిస్తున్నారు. రెండు గ్రామాల్లో సోమవారం పాలకవర్గాలు అద్దె భవనంలోనే ప్రమాణస్వీకారం చేశారు. దాడిచేసిన వ్యక్తులపై కేసుజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని టీఆర్నగర్కు చెందిన సంపంగి సతీశ్పై దాడిచేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. టీఆర్నగర్కు చెందిన సంపంగి సతీశ్ ఇంటిపై ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో మద్యంమత్తులో ఫిరోజ్, కోటగిరి సుమన్, కొండ నాగేంద్ర, దాగిమల్ల రమేశ్ నానాబూతులు తిట్టి రాళ్లతో కొట్టారు. అడ్డువచ్చిన సతీశ్ తల్లి లక్ష్మీపై కూడా దాడిచేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. -
కొండగట్టులో సరిహద్దు వివాద స్థలం సర్వే
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, అటవీశాఖ భూముల సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం ఆర్డీవో మధుసూదన్, అటవీశాఖ అధికారి రవికుమార్ స్థలాన్ని పరిశీలించారు. కొండగట్టులో అటవీశాఖకు చెందిన ఆరెకరాల భూమి దేవాదాయశాఖ ఆక్రమించారంటూ గతంలో కొండగట్టు ఆలయ అధికారులకు నోటీసులు జారీ చేయగా.. కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో డీఎఫ్ఓ రవికుమార్, ఆర్డీఓ మధుసూదన్ సమక్షంలో డిప్యూటీ సర్వేయర్ విఠల్ వివాద భూముల సర్వే చేపట్టారు. ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, మల్యాల తహసీల్దార్ కె.వసంత, కొడిమ్యాల తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐ తిరుపతి, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. -
సీపీఐ శత జయంతి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ
కోరుట్ల: సీపీఐ శత జయంతి బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి చెన్నా విశ్వనాథం అన్నారు. పట్టణంలోని సీ.ప్రభాకర్ స్మారక భవన్లో సోమవారం బహిరంగ సభ కరపత్రాలు ఆవిష్కరించారు. విశ్వనాథం మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న సీపీఐ ఆవిర్భవించిందని, ఈనెల 31న కోరుట్లలో శత జయంతి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. సభకు పార్టీ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మౌలానా, రాస భూమయ్య, ఎండీ ముఖ్రం, రాధ, అశోక్, రమేశ్, ఎండీ.సమీర్, గని పాల్గొన్నారు. -
విద్యార్థులు కంటి చూపుపై శ్రద్ధ తీసుకోవాలి
జగిత్యాల: విద్యార్థులు సెల్ఫోన్లకు అలవాటు పడటంతో కంటి చూపుపై ప్రభావం పడుతోందని, కళ్లపై శ్రద్ధ తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. సోమవారం గొల్లపల్లి రోడ్లోని మైనార్టీ గురుకులం పాఠశాల విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 41 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. ప్లిలలందరూ ఆకుకూరలు, క్యారెట్, బొప్పాయి తీసుకోవాలని, కళ్లు కా పాడుకోవాలని, సెల్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే వైద్యులు సురేందర్, డాక్టర్ విద్య, ఆప్తలిక్ ఆఫీసర్ తిరుపతి, ప్రిన్సిపల్ సుచరిత పాల్గొన్నారు. -
పల్లెల్లో పాలన షురూ..
జగిత్యాల: పల్లెల్లో కొత్త పాలన ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాల్లోని సర్పంచులు, పాలకవర్గాల సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామపంచాయతీలను రంగురంగులతో తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. సవాళ్లు అనేకం.. కొలువుదీరిన కొత్త పాలకవర్గాలకు అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. రెండేళ్లుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. వీటితోపాటు పంచాయతీల్లో నిధుల సమస్య ప్రధానంగా ఉంది. పారిశుధ్య నిర్వహణలో భాగంగా గత ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్ మంజూరు చేసింది. వాటికి సంబంధించిన కిస్తీలు పూర్తిస్థాయిలో చెల్లించలేదు. వాటిని నడిపించిన చోట కార్యదర్శులే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులేవీ రాలేదు. దీంతో సర్పంచులుగా బాధ్యతల స్వీకరించిన ఆనందంకన్నా.. లోలోపల సమస్యలపైనే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం సెల్ఫోన్ ప్రపంచం కావడంతో సమస్యను ఫొటో తీసి.. సంబంధిత అధికారితోపాటు అవసరమైతే కలెక్టర్ వరకు పంపిస్తున్నారు. ఈ లెక్కన చిన్న సమస్య ఎదురైనా సర్పంచ్ వెంటనే స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. డ్రైనేజీ నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. వీధిదీపాలు లేకపోవడం, సీసీరోడ్లు, కోతులు, కుక్కల సమస్య వేధిస్తోంది. వీటితోపాటు నిధులను కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారులకు తప్పనున్న ఇబ్బందులు ఇన్ని రోజులు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ప్రజల నుంచి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్పంచులు లేకపోవడవం, కార్యదర్శులతో పాటు, స్పెషల్ ఆఫీసర్లు ఉండటంతో సమస్యలు చెప్పుకునేందుకు వీరు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో గ్రామంలోని సమస్య వీరికి తలనొప్పిగా మారింది. కొత్తగా పాలకవర్గం చేరడంతో వీరికి కొంత వెసులుబాటు కలుగుతుంది. ఏదైనా సమస్యలుంటే నేరుగా సర్పంచ్ వద్దకు వెళ్తుంటారు. వీరు అధికారులతో పనులు చేయించాల్సి ఉంటుంది. సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యంవెల్గటూర్: నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రజా సమస్యల పరిష్కరానికే తొలిప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం రోజు ఎండపల్లి మండలం కొత్తపేట సర్పంచ్ జీరెడ్డి మహేందర్రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. నూతన సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేవిధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృపాకర్, తహవీల్దార్ అనిల్, మాజీ సింగిల్ విండో చైర్మెన్ గోపాల్రెడ్డి, పంచాయితీ పాలకవర్గం, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి సమస్యల వెల్లువ
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 34 అర్జీలను పరిశీలించారు. సమస్యలపై విచారణ జరిపి పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హారిణి, కోరుట్ల ఆర్డీవో జివాకర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ‘డబుల్’ అర్జీలకు రశీదులు నో.. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం వచ్చే అర్జిదారులను ప్రజావాణి హాల్లోకి రాకుండా అధికారులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్లో అర్జీలు ఇస్తున్న వారికి మాత్రం రశీదులు ఇవ్వడం లేదు. తమకు ఇళ్లు రావడం లేదని ప్రజావాణికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే కనీసం రశీదు కూడా ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని తమకు ఇళ్లు ఇస్తామని హామి ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఇవ్వడంలేదని వాపోయారు. -
బాధ్యతాయుతంగా పనిచేయండి
మల్లాపూర్: కొత్తగా ఎన్నికై న పాలకవర్గాలు బాధ్యతాయుతంగా పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. మండలంలోని ఆయన స్వగ్రామమైన రాఘవపేటలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో సతీసమేతంగా పాల్గొన్నారు. ఎప్పటికప్పుడూ గ్రామసభలు నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సర్పంచ్ తోట శ్రీనివాస్, ఉపసర్పంచ్ మద్దెల నర్సయ్య, వార్డుసభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బైరి రవికుమార్యాదవ్, దేవారెడ్డి, దేశేట్టి నాగేష్, బోయిని సిద్దయ్య, రాకేష్, అమిన్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టాభూమికి హద్దులు నిర్ణయించండి
మాది కొడిమ్యాల మండలం సూరంపేట. గ్రామ శివారులోని సర్వేనంబర్ 167లో ఎకరం భూమికి 30ఏళ్ల క్రితం మా తండ్రి బానల ఎల్లయ్యకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. ఇదే సర్వే నంబర్లో బానల తిరుపతికి మరో ఎకరం పట్టా ఇచ్చింది. అప్పటినుంచి కాస్తులో ఉన్నాం. 2007లో మా తండ్రి చనిపోవడంతో తల్లి పేరిట విరాసత్ చేశారు. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన కొందరు సదరు భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశాం. ఆక్రమణదారులకు ఎలాంటి హక్కులూ లేవు. మా భూమికి హద్దులు నిర్ణయించి ఆక్రమణదారుల నుంచి కాపాడండి. – బానల నర్సయ్య, సూరంపేట -
భారీ పేలుళ్లతో భయం
మోతె, తిమ్మాపూర్ గ్రామాల మధ్య గ్రానైట్ వ్యాపారి నిత్యం సాయంత్రం వేళల్లో భారీగా బ్లాస్టింగ్లు పెడుతుండటంతో తీవ్ర భయాందోళన చెందుతున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు సాయంత్రం వేళల్లో బ్లాస్టింగ్లకు భయపడి ముందుగానే ఇంటికి చేరుతున్నారు. – చిర్రం భగవంతం, వార్డు మెంబర్, మోతె తిమ్మాపూర్ శివారులోని నల్లగుట్టకు గ్రానైట్ వ్యాపారి ఇష్టారాజ్యంగా గ్రానైట్ తీస్తూ భారీ ట్రక్కుల్లో పరిమితికి మించి ఓవర్లోడ్ పంపిస్తుండడంతో రోడ్లన్నీ ధ్వంసమై భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. తారురోడ్లు కూడా ధ్వంసం అవుతున్నాయి. – దుబ్బాక రమేశ్, వార్డు మెంబర్, తిమ్మాపూర్ జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారులోని నల్లగుట్టకు గ్రానైట్ తీసే వ్యాపారికి అనుమతులున్నాయి. రోడ్ల ధ్వంసంపై వ్యాపారికి సమాచారం ఇచ్చి మరమ్మతు చేయిస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా చూసేలా చర్యలు చేపడతాం. – జైసింగ్, జిల్లా మైనింగ్ అధికారి -
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
ధర్మపురి: నేరెళ్ల బస్టాండ్ సమీపంలో కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని నేరెళ్లకు చెందిన వేముల శివమణి ఆదివారం ద్విచక్రవాహనంపై జగిత్యాల వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా నేరెళ్ల బస్టాండ్ వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శివమణి తలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న జాజాల రమేశ్ వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి.. అక్కడినుంచి కరీంనగర్ తరలించారు. కొండగట్టుకు త్వరలో పవన్ కల్యాణ్?మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో తిరుమల తి రుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 96 గదుల సత్రం నిర్మించేందుకు రూ. 35.19కోట్లు మంజూరైన నేపథ్యంలో ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ము ఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరలో రానున్నట్లు తెలిసింది. జనవరి 3న కొండగట్టుకు రానున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధికారికంగా కార్యక్రమం ఖరారు కాలేదని అధికారులు తెలిపారు. -
అనుమతి కొంత.. తవ్వకాలు ‘కొండ’ంతా
నల్లగుట్ట జగిత్యాలరూరల్: రెండు గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించే నల్లగుట్టపై గ్రానైట్ వ్యాపారి కన్ను పడడంతో గుట్టను నిత్యం ధ్వంసం చేస్తున్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతె, రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని నల్లగుట్టపై ఓ గ్రానైట్ వ్యాపారి కన్నుపడి ప్రభుత్వ అనుమతి తీసుకుని విచ్చలవిడిగా గుట్టను ధ్వంసం చేస్తూ నామరూపం లేకుండా చేస్తున్నారు. నిత్యం భారీ ఎత్తున బ్లాస్టింగ్లు చేయడంతో తిమ్మాపూర్, మోతె గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద ఉండేందుకు జంకుతున్నారు. భారీ పేలుళ్లతో రెండు గ్రామాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అలాగే జగిత్యాల– గొల్లపల్లి ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులు కూడా బ్లాస్టింగ్ జరుగుతున్న సమయంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాన్నారు. సమీప ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాల్లో రాళ్లు పడి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులు ధ్వంసం గ్రానైట్ వ్యాపారి తన భారీ వాహనాల్లో పరిమితికి మించి గ్రానైట్ను తరలిస్తుండటంతో నల్లగుట్టకు వెళ్లే రహదారులు మొత్తం ధ్వంసమై రైతులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అలాగే తిమ్మాపూర్ నుంచి ధరూర్కు వచ్చే బైపాస్రోడ్పై ఓవర్లోడ్ ట్రక్కులు నడవడంతో తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీగా గుంతలు గ్రానైట్ వ్యాపారి గ్రానైట్ను భారీ లోతుగా తీయడంతో మోతె గుట్ట శివారులో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో మేతకు వెళ్లిన పశువులు ప్రమాదవశాత్తు గుంతల్లో పడి మృతిచెందుతున్నా వ్యాపారి మాత్రం తన ఇష్టారాజ్యంగా గ్రానైట్ తీస్తూ నల్లగుట్టను నాశనం చేస్తున్నాడు. -
లోక్ అదాలత్లో 2010 కేసులు పరిష్కారం
జంటలను అభినందిస్తున్న న్యాయమూర్తులుమాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతిజగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఆదివారం జరిగిన లోక్ అదాలత్లో 2010 సివిల్, క్రిమినల్, మోటర్వాహనాల పరిహారం కేసులు పరిష్కారం అయ్యాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి, మొదటి అదనపు జిల్లాజడ్జి సుగళి నారాయణ, సబ్ జడ్జి, న్యాయసేవా సంస్థ కార్యదర్శి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారు తి, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఏకమైన రెండు జంటలు మెట్పల్లి: కాపురంలో ఏర్పడిన కలహాలతో దూరంగా ఉంటున్న రెండు జంటలు లోక్ అదాలత్లో ఏకమయ్యాయి. కోరుట్లకు చెందిన త్రివేణికి యూసుఫ్నగర్కు చెందిన పులి దివాకర్తో వివాహమైంది. మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. మెట్పల్లి మండలం ఆత్మకూర్కు చెందిన కీర్తనకు రుద్రంగి మండలం మానాలకు చెందిన పులి దివాకర్తో వివాహమైంది. వీరికి ఒక పాప. అదనపు కట్నం కోసం దివాకర్ వేధిస్తున్నాడని కీర్తన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టులో విచారణ జరుగుతోంది. లోక్ అదాలత్లో ఈ రెండు జంటలకు మేజిస్ట్రేట్లు నాగేశ్వర్రావు, అరుణ్కుమార్ కౌన్సెలింగ్ ఇచ్చారు. న్యాయవాదుల సమక్షంలో కేసులను ఉపసంహరించుకుని ఏకమయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్రెడ్డి, న్యాయవాదులు ఉన్నారు. జడ్జమ్మా.. నా కేసును పరిష్కరించమ్మా.. ‘జడ్జమ్మా.. నా కేసును పరిష్కరించమ్మా..’ అంటూ ఓ వృద్ధురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతిని వేడుకుంది. జిల్లా కోర్టులో ఆదివారం లోక్ అదాలత్లో కేసులు పరిష్కరిస్తున్నారన్న సమాచారం మేరకు జగిత్యాలరూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు వచ్చింది. తాను చాలా ఏళ్ల క్రితం కోర్టులో కేసు వేశానని, ఇప్పటికి పరిష్కారం కాలేదని, పరిష్కరించాలని కోరింది. న్యాయమూర్తి స్పందించి కేసు పూర్తి వివరాలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. -
సమాజహితమే అందరి లక్ష్యం కావాలి
కోరుట్ల: సమాజహితమే అందరి లక్ష్యం కావాలని కాళోజీ అవార్డు పురస్కార గ్రహీత కవి జయరాజ్ అన్నారు. ఆదివారం ఆయన కోరుట్లలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయనిజం అంటేనే సేవ అని గుర్తు చేశారు. ప్రకృతి ఒడిలో సేదదీరడంతో పాటు ప్రకృతికి హాని చేయకుండా మనుగడ సాగిస్తేనే మనిషి సదీర్ఘ ప్రయాణం కొనసాగుతుందన్నారు. రీజనల్ మీట్ చైర్పర్సన్గా వ్యవహరించిన గుంటుక సురేష్బాబు, ప్రసన్న రాణి దంపతులు హానికారకమైన ప్లాస్టిక్ను సమాజానికి దూరం చేసే క్రమంలో ఆహూతులందరికీ స్టీల్ బాటిల్స్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను స్టీల్ ప్లేట్ అందిస్తామని చెప్పి తమ లయనిజాన్ని చాటుకున్నారన్నారు. ప్రజాకవి జయరాజ్ తాను రాసిన పాటల్లోని ‘వందనాలమ్మా..తల్లీ వందనాలమ్మా’ను పాడటంతో సభికులు బావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ఎల్ఎన్ నాదిపెల్లి వెంకటేశ్వర్రావు, పీఎంజేఎఫ్ లయన్ మోర బద్రేశం, పీఎంజేఎఫ్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటుక చంద్రప్రకాశ్, లయన్ అనంతుల శివప్రసాద్, కార్యదర్శి సింగిరెడ్డి వాసుదేవ రెడ్డి, ట్రెజరర్ వెంకట్, సెక్రటరీ మధు, కో–ఆర్డినేటర్ పోతని ప్రవీన్కుమార్, లయన్స్ గండ్ర అజేందర్రావు, ప్రకాశ్కల్వార్, అల్లాడి ప్రవీన్, చాప కిషోర్, ఉషాకిరన్, మంచాల జగన్, మహేందర్, అన్నం అనిల్, లయన్ మీట్ ట్రెజరర్ కొమ్ముల జలపతిరెడ్డి పాల్గొన్నారు. కాళోజీ అవార్డు పురస్కార గ్రహీత, కవి జయరాజ్ -
జగిత్యాల
24.0/10.0– 8లోసోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 20257గరిష్టం/కనిష్టంఅనుమతి కొంత తవ్వకాలు ‘కొండ’ంతారెండు గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించే నల్లగుట్టపై గ్రానైట్ వ్యాపారి కన్ను పడడంతో గుట్టను నిత్యం ధ్వంసం చేస్తున్నారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. పొగమంచు దట్టంగా కురిసే అవకాశం ఉంది. సాయంత్రం నుంచే చలిగాలులు కొనసాగుతాయి. -
ఇబ్బంది పడొద్దనే..
యూరియా కోసం రైతులు ఇబ్బంది పడొద్దనే యూరియా బుకింగ్ యాప్ రూపొందించాం. ఇంటి నుంచే సులువుగా బుకింగ్ చేసుకుని ఏ దశలో ఎంత యూరియా అవసరమో సులువుగా తీసుకెళ్చొచ్చు. ఈ విధానంతో రైతులు క్యూలో నిలబడే పరిస్థితికి ఆస్కారం ఉండదు. విలువైన సయమం వృథాకాదు. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ పెద్దపల్లి రైతులకు ఎంతో మేలు కలెక్టర్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన యూరియా బుకింగ్ యాప్ వినియోగంతో రైతులకు ఎంతో మేలు కలిగిస్తుంది. జిల్లాలో ఈనెల 1నుంచి 17వరకు ఈ యాప్ ద్వారా 27,110 బస్తాల యూరియా అమ్మకాలు జరిగాయి. యాప్ వినియోగంపై రైతులకు తమ శాఖ అధికారులు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్, డీఏవో, పెద్దపల్లి -
పాఠశాల అభివృద్ధికి కృషి
● హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవిధర్మపురి: పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి అన్నారు. మండలంలోని తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మాణం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట) సంస్థ ఆధ్వర్యంలో నిధులు మంజూరు కాగా ప్రహరీతోపాటు విద్యార్థులకు రక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. వీటిని హైకోర్టు న్యాయమూర్తి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ తదితరులు హాజరై ప్రారంభించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, ఇలాంటి కార్యక్రమంలో ప్లాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ముందుగా న్యాయమూర్తికి ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, సర్పంచ్ నలుమాసు పుష్పలత, ఆట కార్యవర్గ సభ్యులు, నిర్వాహకులు ప్రకాశ్రావు, ఆట ప్రెసిడెంట్ జయంత్ చల్లా, జిల్లా విద్యాధికారి రాము, ఎంఈవో సీతామహాలక్ష్మి, నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఎస్.దినేష్ తదితరులున్నారు. -
నేడు యథావిధిగా ప్రజావాణి
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవా రం నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టరేట్కు వచ్చి అధికారులకు సమర్పించాలని సూచించారు. ‘వాట్సాప్’లో సాగు సమాచారంజగిత్యాలఅగ్రికల్చర్: రైతులు రకరకాల పంటలు సాగు చేస్తున్నప్పటికీ సరైన సలహాలు అందక దిగుబది పొందలేకపోతున్నారు. ఆదాయం రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్గా పనిచేసిన ఎల్.కిషన్ రెడ్డి రైతులకు సూచనలు అందించాలన్న లక్ష్యంతో వాట్సాప్లో సాగు సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నారు. రైతులు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యను తమ ఇంటి నుంచే 85002 23817 నంబర్కు మెసేజ్ పంపిస్తే.. వెంటనే తెలుగులో సరైన సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ అవకాశాన్ని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా రైతులు వినియోగించుకుంటున్నారు. ఉపాధి పథకాన్ని నీరుగార్చే కుట్రజగిత్యాలటౌన్: ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చే కుట్ర చేస్తోందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. ఉపాధి పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ.. ఆదివారం కాంగ్రెస్ శ్రేణులు జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. జీవన్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని తెచ్చిందన్నారు. గాంధీ పేరును తొలగించి శ్రీరాముని పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయం సరికాదన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజుల రాజేందర్, దుర్గయ్య, పుప్పాల అశోక్, శోభరాణి, రాదాకిషన్, గుండా మధు ఉన్నారు. గాయపడిన వ్యక్తికి సీపీఆర్జగిత్యాలజోన్: జగిత్యాల కొత్త బస్టాండ్ ఆవరణలో ఓ ద్విచక్రవాహనదారుడిని ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై రవీందర్రావు, హోంగార్డు చంద్రశేఖర్ గాయపడిన వ్యక్తికి సీపీఆర్ చేసి, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 24న గల్ఫ్ వలసలపై అవగాహన సదస్సుమల్లాపూర్: స్థానిక రైతువేదికలో ఈనెల 24న గల్ఫ్ వలసలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ప్రవాసీ మిత్ర లేబర్ యూని యన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, కార్యదర్శి సాయిండ్ల రాజరెడ్డి, కొశాధికారి నల్లాల జైపాల్, దామోదర్ తెలిపారు. గల్ఫ్ వెళ్లే ముందు మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విదేశాల్లో పనిచేసే సమయంలో ఎదురయ్యే పరిస్థితులు, అక్కడి చట్టాలు, సంస్కృతి, భద్రతా నిబంధనలు, వేతన ఒప్పంద వివరాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో పనిచేసి.. స్వగ్రామాలకు వచ్చిన వారు తమ అనుభవాలను గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని కోరారు. సదస్సులో కొత్తగా ఎంపికై న సర్పంచ్లు, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు గల్ఫ్ వలస నేపథ్యం కలిగిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనాలని కోరారు. -
రాష్ట్రానికే ‘పెద్ద’పల్లి ఆదర్శం
పెద్దపల్లిరూరల్: యూరియా కృత్రిమ కొరత సృిష్టించే అవకాశం లేకుండా.. రైతు తన అవసరాలకు మించి ఎరువును వినియోగించకుండా.. ఇంటి నుంచే బుకింగ్ చేసుకుని దుకాణం నుంచి సులువుగా తీసుకెళ్లేలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శ్రీయూరియా బుకింగ్యాప్శ్రీను అందుబాటులోకి తెచ్చారు. యాప్ను జిల్లాలో 15రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ ప్రయత్నం ఫలించడంతో విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. ఇంటి నుంచే సులువుగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్న ఈ యాప్ను శనివారం నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాల రైతులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఇంటినుంచే బుకింగ్ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆలోచనల్లో నుంచి పుట్టిన యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. యాప్ ద్వారా పట్టా పాసుపుస్తకం నంబరు నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్కు ఓటీపీ వస్తోంది. ఆ నంబరు నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంట వేశారు అనే వివరాలతో పాటు యూరియా ఎంతమేర అవసరమవుతుందనే సమాచారంతో బుకింగ్ ఐడీ వస్తుంది. వాటి ఆధారంగా సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు. ఐదెకరాల భూమికలిగిన రైతులు రెండు విడతల్లో, 20 ఎకరాల లోపుగలవారు మూడు దఫాలుగా, అంతకన్న ఎక్కువ ఉంటే నాలుగు దశల్లో యూరియా తీసుకెళ్లేలా యాప్ను రూపొందించారు. ఈ నెల 20 నుంచి పొరుగు జిల్లాలో.. పెద్దపలి జిల్లా నుంచి మొదలైన యూరియా బుకింగ్ యాప్ నమోదు ప్రక్రియ రాష్ట్రంలోని పొరుగు జిల్లాలకు పాకింది. ఈనెల 20న తొమ్మిది జిల్లాల్లో సాగింది. కొద్దిరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ను రైతులు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. పెద్దపల్లిలో ఈనెల 1నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేశారు. శనివారం నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్నగర్, వికారాబాద్, కరీంనగర్ జిల్లాలోనూ యూరియా బుకింగ్ ప్రక్రియ మొదలైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రానికి ఆదర్శం జిల్లా తొలి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అలగు వర్షిణి పాలనలో అమల్లోకి తెచ్చిన ‘సాండ్టాక్సీ పాలసీ’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ప్రస్తుత కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టం) పద్ధతిని విద్య, వైద్యశాఖల్లో అమలు చేసేలా యాప్ను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ఎరువుల కృత్రిమ కొరత రాకుండా యూరియా బుకింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. -
జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యం
కళాశాల ఆవరణలో విశాలమైన ఆటస్థలం ఉండడంతోపాటు 200 ట్రాక్ అందుబాటులో నిత్యం పీఈటీ సూచనలతో ప్రాక్టీస్ చేస్తున్న. ఇప్పటివరకు3 కిలోమీటర్ల పరుగు పందెం, 1500మీటర్ల పరుగు పందెం పోటీల్లో ఆరుసార్లు రాష్ట్రస్థాయిలో పాల్గొన్న. జాతీయస్థాయి అథ్లెటిక్స్లో రాణించడమే లక్ష్యం. – ఆర్.మనీష, ఇంటర్ ఫస్టియర్ నిత్యం ప్రాక్టీస్తో జాతీయస్థాయికి.. జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటేందుకు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్న. ఎస్జీఎఫ్–19 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాను. నిత్యం ప్రాక్టిస్ చేయడంతోపాటు, పిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక ప్రోత్సహిస్తుండడంతో ఆటల్లో రాణిస్తున్నాం. – హారిక, ఇంటర్ సెకండియర్ ప్రత్యేక శిక్షణతో ప్రతిభకు పదును విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం. విద్యార్థులకు నిత్యం కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగాసానాల్లో ప్రాక్టీస్ చేయిస్తున్నాం. ఆటలతో క్రమశిక్షణ, మానసికస్థైర్యం పెంపొందుతుంది. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ, వారి ప్రతిభకు పదును పెడుతున్నాం. – మధులిక, పీఈటీ, తాటిపల్లి గురుకుల కళాశాల -
.. అను నేను
జగిత్యాల/కోరుట్ల: పల్లె జనాలను మెప్పించి.. ఎన్నికల్లో గెలుపొంది.. వారి మేలు కోసం ఏదైనా చేయాలన్న బాధ్యతతో కొత్త సర్పంచులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుమారు రెండేళ్ల తర్వాత జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకూ బిజీగా ఉన్న అధికార యంత్రాంగం.. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ప్రమాణస్వీకారానికి పూర్తి ఏర్పాట్లు చేసింది. అధికార బాధ్యతలు కొత్తగా పల్లెల్లో ఎన్నికై న చాలామంది ప్రజాప్రతినిధులు ప్రమాణస్వీకారం అనంతరం తమ చేతికొచ్చిన అధికార బాధ్యతలతో గ్రామాల్లో చేపట్టే అభివృద్ధితోపాటు సంక్షేమం లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై తమ అనుయాయులతో ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు. గ్రామాల్లోని కీలక సమస్యలు, పంచాయతీపరంగా చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ఉప సర్పంచ్, వార్డుసభ్యులతో కలిసి ముందుకు వెళ్లి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కొత్త సర్పంచులపై ఉంది. గ్రామ పంచాయతీలను నిధుల లేమి కీలక సమస్యగా వేధిస్తున్నా.. ఎన్నికలు పూర్తి అయిన క్రమంలో త్వరలో నిధులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో తాము ఇచ్చిన హామీలు ఎలాగోలా నెరవేర్చుతామన్న నమ్మకంతో పంచాయతీలకు ఎన్నికై న కొత్త సారథులు ఆశల్లో ఉన్నారు. మౌలిక వసతులే కీలకం.. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు కీలకంగా మారాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి రెండేళ్లుగా నిధులు రాకపోవడంతో సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఇదే కీలకాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటు మంజూరు కాగానే వాటిని సద్వినియోగం చేయడంతోపాటు ఆదాయ వనరులు పెంచుకోవడంపై కొత్త ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, శివారు ప్రాంతాల్లో విద్యుద్ధీకరణ, టాయ్లెట్స్ వంటి అంశాలు కీలక సమస్యలు గా మారాయి. ప్రధానంగా పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరిచి పల్లె ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో కొనసాగిన రాజకీయాలు, గెలుపోటముల, పంతాలు పక్కన పెట్టి పల్లెల్లో ఒక్కతాటిపై నిలిచి గ్రామాభివృద్దికి పాటుపడతారని ఆశపడుతున్న పల్లె జనాల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఎంపికై న కొత్త ప్రజాప్రతినిధులపై ఉంది. రెండేళ్ల తరువాత కొలువుదీరనున్న పాలకవర్గాలు నేడు పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం గ్రామాల్లో కనీస సౌకర్యాలు మృగ్యం సర్పంచులకు సమస్యల చిట్టా స్వాగతం నిధులు లేమితో సతమతం 15వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులు వస్తే పండుగే15వ ఆర్థిక సంఘం నిధులపై కొత్త సర్పంచ్లు ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ నిధులు విడుదల కాలేదు. ప్రతి గ్రామానికి దామాషా ప్రకారం ఒక్కోక్కరికి రూ.900 నుంచి రూ.1400 చొప్పన నిధులు రావాల్సి ఉంది. మూడు వేల జనాభా ఉంటే రూ.27లక్షలు వస్తాయి. రెండేళ్లకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు పైప్రకారం చూస్తే రూ.54 లక్షలు రానున్నాయి. పంచాయతీల్లో జనాభా ఆధారంగా రూ.5లక్షల నుంచి రూ.80లక్షల వరకు నిధులు వచ్చే అవకాశం ఉంది. మార్చి చివరి నాటికి ఆర్థిక సంఘం గడువు ముగిసిపోనుంది. ఈ లెక్కన రెండేళ్లు నిధులు వస్తే కొత్త సర్పంచ్లకు ఊరట కలగనుంది. మొత్తంగా కేంద్రం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు ఎస్ఎఫ్సీ నిధులు వస్తనే పల్లెల అభివృద్ది పట్టాలు ఎక్కనుంది. కొత్త సర్పంచుల్లోనూ జోష్ కలుగనుంది. -
గురుకులం విద్యార్థులు.. ఆటల్లో మెరికలు
మల్యాల: మల్యాల మండలం తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల 2018లో ఇంటర్మీడియేట్ కళాశాలగా అప్గ్రేడ్ అయింది. అప్పటినుంచి అటు పదో తరగతిలో.. ఇటు ఇంటర్లోనూ వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. చదువుతోపాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా, కరాటేలో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ఆటల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మానస నిత్యం పర్యవేక్షిస్తూ చదువులో సబ్జెక్టుల వారీగా వెనకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తూ.. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెంపొందిస్తూ.. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు నిత్యం కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్లో రాణించేందుకు పీఈఓ మధులిక ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తుండడంతో ఏటా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణింపు రాష్ట్రస్థాయిలో సత్తాచాటుతున్న వైనం -
నాన్నా... నాకూ ఆడుకోవాలనుంది
కరీంనగర్: తన తోటి పిల్లలు ఆడుకుంటుంటే ‘నాన్నా.. నాకు కూడా ఆడుకోవాలని ఉంది’.. అన్న ఓ చిన్నారి మాటలు.. ఆ తండ్రి గుండెను పిండేశాయి. ఆ మాటలకు మౌనంగా రోదించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఇది ఒక్క రోజు వేదన కాదు.. ఆ బిడ్డను చూస్తున్న ప్రతిసారి ‘నేనేమీ చేయలేకపోతున్నానే’ అని ఆ తండ్రి ఆవేదన. పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బాలికకు ఆపరేషన్ కోసం రూ.6 లక్షలు అవసరం ఉంది. హమాలీ కార్మికుడైన తండ్రి తన శక్తి మేర చికిత్స చేయిస్తున్నా, దాతల సాయం కోసం ఎదురుచూడడం తప్ప తను అంత ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. వివరాలు.. కరీంనగర్లోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన హమాలీ కార్మికుడు మోతె హరీశ్, శ్రీలత దంపతుల జీవితం నిత్య పోరాటం. రోజూ కష్టపడితే తప్ప కడుపునిండని దుస్థితి. ఈ పేదరికానికి తోడు పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో జన్మించిన తమ పెద్ద కుమార్తె సిరిచందన (14)ను కంటికి రెప్పలా పెంచుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, 12 ఏళ్లు వచ్చే వరకు శస్త్రచికిత్స సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. అయితే తోటి పిల్లలలాగే తాను లేననే బాధతో ఆ చిన్నారి పాఠశాలకు సైతం సరిగా వెళ్లలేకపోతుంది. 12 ఏళ్ల వయసు పూర్తయినా ఆపరేషన్కు కావాల్సిన లక్షల రూపాయల ఖర్చు వారికి అడ్డంకిగా మారింది. ఆపరేషన్కు వైద్యులు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. పేదరికంలో జీవిస్తున్న ఆ కుటుంబానికి అది తలకు మించిన భారమే. అయినా తండ్రి వెనకడుగు వేయలేదు. చిన్నారి చికిత్స కోసం అప్పులు చేస్తూ, సాయం కోసం తలుపు తడుతూ ముందుకు సాగుతున్నాడు. ప్రజాప్రతినిధుల వద్దకూ వెళ్లినా ఇప్పటివరకు ఆశించిన స్పందన ఎక్కడా రాలేదు. రెండేళ్లుగా ‘ఎవరైనా దయగల హృదయులు స్పందిస్తారా?’ అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. తన కూతురు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే చూడాలన్న తండ్రి కల ఇంకా కలగానే ఉంది. చిన్నారి భవిష్యత్తు ఒక శస్త్రచికిత్సపై ఆధారపడి ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి స్పందన ఆమెకు కొత్త జీవితం ఇవ్వగలదు. దాతలు చేసే సాయం బాలిక జీవితాన్ని నిలబెట్టగలదు. స్పందించే దాతలు 99480 55713 నంబర్కు ఫోన్పే/గూగుల్ పే ద్వారా లేదా ఫోన్లోనైన తమను సంప్రదించాలని హరీశ్ వేడుకుంటున్నాడు. బాలికకు పుట్టుకతో వెన్నెముక సమస్య శస్త్ర చికిత్స కోసం చిన్నారి ఎదురుచూపు -
ఆయిల్ పాం విస్తీర్ణం పెంచాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: జిల్లాలో ఆయిల్ పాం సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలని, ఫిబ్రవరి వరకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం ఉద్యాన, వ్యవసాయ, సహకార తదితర శాఖలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పాంపై ఎలాంటి అపోహాలు వద్దని, గెలల కోత ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన రేటుకు కొనుగోలు చేస్తారని వివరించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఉద్యాన అధికారి శ్యామ్ప్రసాద్, వ్యవసాయ అధికారి భాస్కర్ పాల్గొన్నారు. -
సర్పంచ్ అను నేను..
● ఈనెల 22న సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం రాయికల్: ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈనెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం పంచాయతీల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు చేసే ప్రమాణం ఇలా ఉంటుంది. ‘సర్పంచ్/వార్డు సభ్యుడు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం, విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని, భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను..’ అని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాణ పత్రంలో ఉండే అంశాలివే... ● నేను భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తానని ● నా విధులను నిజాయితి, నిస్పక్షపాతంగా భక్తితో నిర్వహిస్తానని ● గ్రామ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని, ● గ్రామపంచాయతీ ఆస్తులు, నిధులను జాగ్రత్తగా వినియోగిస్తాను. ● గ్రామ ప్రజలకు సేవ చేయడానికి అంకితంగా ఉంటానని, దీనికి సాక్షిగా ఈ ప్రమాణపత్రంపై సంతకం చేస్తున్నా. -
అదృష్టంగా భావిస్తున్నా
రామగుండం: అంతర్గాం మండలం విసంపేట సర్పంచ్ దారవేణి సాయికుమార్ వయసు 24ఏళ్లు. తను పుట్టిన ఏడాదిలోపే తల్లి, ఐదేళ్ల క్రితం తండ్రిని కోల్పోయాడు. సోదరుడి పెంపకంతో ప్రయోజకులయ్యారు. ఎంబీఏ (హెచ్ఆర్) పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం సర్పంచ్గా గెలిచాడు. తల్లిదండ్రుల ఆప్యాయతలకు నోచుకోలేదని, అయినా వందలాది మంది గ్రామస్తులు తనపై ప్రేమాభిమానాలు చూపి సర్పంచ్గా ఎన్నుకున్నారని తెలిపారు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్న తనకు ఊహించని విధంగా సర్పంచ్ పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. -
యావర్రోడ్డు విస్తరించి తీరుతా..
జగిత్యాల: తాను రాజకీయాన్నీ రాజకీయంగానే చూస్తానని, ఎవరో ఏదో మాట్లాడారని స్పందించబోనని, జిల్లాకేంద్రంలోని ప్రధానమైన సమస్య యావర్రోడ్డును విస్తరించి తీరుతానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ప్రభుత్వ వైద్యసేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పల్లె దవాఖానాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లాకేంద్రంలో రూ.230కోట్లతో మరో ఆస్పత్రి మంజూరైందన్నారు. మెడికల్ కళాశాల పనులు 80శాతం పూర్తయ్యాయన్నారు. గతంలో బిల్లులు రాకనే కాంట్రాక్టర్ చేతులెత్తేశారని, సీఎం దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్రావు, వెంకటేశ్యాదవ్ పాల్గొన్నారు. -
వడివడిగా ఎస్ఐఆర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లాలోని ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/ ఎన్నికల జాబితా విస్తృత సవరణ) ప్రక్రియ వడివడిగా ముందుకు సాగుతోంది. దేశంలో నిజమైన పౌరులను గుర్తింపే లక్ష్యంగా మొదలైన ఈ ప్రక్రియపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని వర్గాలు సర్వేను స్వాగతిస్తుండగా.. మరికొన్ని వర్గాలు సర్వేపై ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన కేంద్రం.. తెలంగాణలోనూ ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సర్వేపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఎవరు నిజమైన ఓటరు.. ఎవరు కాదు? ఎవరు కొత్త ఓటరు.. ఎంతకాలం నుంచి నివసిస్తున్నారన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఏమిటీ సర్వే? భారత పౌరుల ఓటరు నిర్ధారణకు ప్రారంభించిన సర్వే ఇది. ఇందులో 2002 ఓటరు జాబితా 2025 ఓటరు జాబితాను పక్కపక్కన పెట్టుకుని వివరాలు సరిపోలుస్తూ.. స్థానికంగా ఓటర్లు నివసిస్తున్నారా? లేదా.. ప్రస్తుత డేటాతో పాత డేటా మ్యాచ్అవుతుందా లేదా చూస్తున్నారు. దీన్ని మ్యాపింగ్ అని పిలుస్తున్నారు. 2002, 2025 ఓటర్ల జాబితాలో (రెండింటిలో) పేర్లు ఉన్నవారు మొదటి కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేకుండా 1987కు ముందు జన్మించిన వారు రెండో కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేని , 1987 నుంచి 2004కు మధ్యలో పుట్టిన వారు మూడో కేటగిరీగా, 2004 తరువాత జన్మించిన వారు నాలుగో కేటగిరీగా విభజించారు. ఉదాహరణకు 2002లో దంపతులకు ఓటు ఉందనుకోండి. వారికి పుట్టిన పిల్లలకు, వారి మనవలకు ఓటుపై ఎలాంటి వివాదం ఉండదు. ఇలాంటి ఓట్లను వివాదం లేని గ్రీన్ కేటగిరీలో వేస్తున్నారు. ఇందుకోసం పాత పోలింగ్ స్టేషన్, ఓటు నంబర్లను పోల్చి చూస్తున్నారు. వాటి ఆధారంగా పురుషులు, సీ్త్రలు, ట్రాన్స్జెండర్ల వివరాలను అప్డేట్ చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా ఓటర్ల వివరాలు నియోజకవర్గం ఓట్లు కరీంనగర్ 3,68,166చొప్పదండి 2,35,849మానకొండూరు 2,26,385హుజురాబాద్ 2,52,351రామగుండం 2,19,723మంథని 2,39,699పెద్దపల్లి 2,57,192కోరుట్ల 2,48,270జగిత్యాల 2,39,114ధర్మపురి 2,33,182సిరిసిల్ల 2,23,115వేములవాడ 2,13,284 ఆందోళన ఏమిటి? ఓటర్ల తనిఖీలో భాగంగా 2002లో ఉన్న ఇంటి పెద్దలు 2025లో ఉన్నారా? వారి పిల్లలు, మనవల పేర్లు చూస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, నేటి గ్లోబలైజేషన్ కాలంలో స్థిర నివాసాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవనోపాధి, వలసలు, వివాహా లు తదితరతో పలు కుటుంబాలు రెండు, మూ డు దశాబ్దాల్లో పలు చిరునామాలు మార్చాల్సి వస్తోంది. స్థానచలనంతో ఇళ్లు మారిన వారిలో ఆందోళన మొదలైంది. ఇలాంటి వారి ఓట్ల విషయంలో ఓటర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు అయి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి పేర్లు 2002 జాబితాలో సరిపోల్చే సమయంలో తమ ఓటర్లు మిస్సవుతాయని ఆందోళన చెందుతున్నారు. చాలామంది కూలీలు తమ పాత పోలింగ్ స్టేషన్, ఇంటి నంబరు వివరాలు చెప్పలేకపోతున్నారు. ఉమ్మ డి జిల్లాకు ఉన్న మరో ప్రత్యేకత సింగరేణి గనులు. ఇక్కడ పదవీ విరమణ పొందిన వేలాది మంది కార్మికులు ఉన్నారు. వీరిలో పావు వంతు రెండు పేర్లు కలిగి ఉన్నారు. వీరి ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొంది. ఈ వివరాలపై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నిచంగా అందుబాటులోకి రాలేదు. ఎస్ఐఆర్ సర్వే అనుకున్నంత వేగంగా కాకుండా వడివడిగానే సాగుతోంది. ఇప్పటివరకు కరీంనగర్లో 20 శాతం, పెద్దపల్లిలో 18 శాతం, జగిత్యాలలో 19 శాతం, సిరిసిల్లలో 16శాతం మేర పూర్తయింది. -
అసైన్మెంట్
సమస్యలపై అవగాహనతో.. బోయినపల్లి: మండలంలోని దుండ్రపల్లి గ్రామానికి చెందిన జంగం అంజయ్య లాయర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుగా ఎన్నికయ్యాడు. బీఏ ఎల్ఎల్బీ చేసి 2014 నుంచి లాయర్గా రాణిస్తున్నాడు. వేములవాడ కోర్టులో చురుకై న న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వకీల్గా సమస్యలపై ఉన్న అవగాహనతో రాజకీయాల్లో రాణిస్తానని చెప్పారు. కోనరావుపేట: మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన సింగం శ్రీహరి ఐదేళ్లుగా లాయర్గా కొనసాగుతున్నారు. రోజూ సిరిసిల్లకు వెళ్లి న్యాయవాద వృత్తినే కొనసాగిస్తున్న అతడు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచారు. గ్రామ సమస్యలు పరిష్కరించి, అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. రామగుండం: అంతర్గాం టీటీఎస్ గ్రామ సర్పంచ్గా గెలిచిన అంబోతు రవికుమార్ రాయ్పూర్ ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంతో నెలకు రూ.రెండున్నర లక్షల వేతనం పొందాడు. తనతో పాటు కొంతమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ఉద్యోగం వదిలేశాడు. మండల పరిధిలోని పేద కుటుంబాలకు చెందిన యువతకు తన సొంత ఖర్చుతో గ్రూప్స్, సివిల్స్లో శిక్షణ ఇప్పించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మించాడు. ప్రస్తుతం డైయిరీ ఫామ్ ఏర్పాటు చేసి అందులో పాడి రైతులకు ఉపాధి కల్పిస్తున్నాడు. -
క్రైస్తవుల సంక్షేమానికి కృషి
● మంత్రి అడ్లూరి ధర్మపురి: క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక ఎస్హెచ్ గార్డెన్లో శనివారం ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ లత, జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ముందుగా కేక్కట్ చేసి శభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందన్నారు. క్రిస్మస్ అంటే శాంతి, ప్రేమ, దయ, కరుణకు ప్రతీక అన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్లు తదితరులున్నారు. కొండగట్టుపై వీహెచ్పీ ధర్నామల్యాల: కొండగట్టు అంజన్న ఆలయ భూములు కాపాడాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆలయం ఎదుట దీక్ష చేపట్టారు. అటవీశాఖ చేపట్టిన హద్దుల వివాదం పరిష్కరించి, ఆలయ పరిధిలోని భూములన్ని ఆలయానికే చెందేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీహెచ్పీ నాయకులు రాధాకృష్ణ, మామిడాల రాములు, గాజోజు సంతోష్ కుమార్, యాగండ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పుట్టగొడుగుల పెంపకంపై సదస్సుజగిత్యాలఅగ్రికల్చర్: పుట్టగొడుగుల పెంపకంపై జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో తక్కళ్లపల్లిలో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ఎల్లాగౌడ్ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయంతోపాటు పుట్టగొడుగులు పెంచి ఆదాయం సంపాదించాలన్నారు. పుట్టగొడుగుల పెంపకంతో రైతులకు ఆదాయం వస్తుందన్నారు. ప్రొఫెసర్లు వేణుగోపాల్, తిరుపతి, రాజేంద్రప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. జగిత్యాల బల్దియాలో ఫీల్డ్ సర్వేజగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. సర్వే కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. నేషనల్ జియో స్పెషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హబిటేషన్ (నక్ష)లో భాగంగా సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ గ్రామీ ణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం అమలవుతుందని, అర్బన్ ఆస్తులకు సంబంధించిన నక్ష రూపొందిస్తామని తెలిపారు. గతంలో హెలి కాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించామ ని, మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఇంటి నంబర్లు, ఇంటి యజమానుల రిజిస్ట్రేషన్ పత్రాలు, సమాచార సేకరణకు ఈ సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు. పార్టీ మారలేదంటూ ఎమ్మెల్యే బుకాయింపుజగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారలేదంటూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్లోనే ఉన్నానంటారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్రెడ్డి అధికారంలో లేకున్నా పార్టీ కోసం కష్టపడ్డారని గుర్తు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాలకు వచ్చి మెడికల్ కళాశాలపై మాట్లాడితే ఇక్కడి ఎమ్మెల్యే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు గెలిపిస్తే పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. శీలం ప్రవీణ్, వొల్లం మల్లేశం, ఆనందరావు, గంగాధర్ పాల్గొన్నారు. -
మోడల్ విలేజ్గా..
మా ఆయన విజయ్కుమార్ సైన్యంలో చేరి దేశరక్షణ కోసం సేవలందించారు. ఆయన స్ఫూ ర్తి, ప్రోత్సాహంతో ప్రజా సేవ చేయాలన్న తపనతో సర్పంచ్గా పోటీచేశా. గ్రామస్తులంతా తనకే అండగా నిలవడంతో 1,124 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారు. ఎ మ్మెస్సీ కంప్యూటర్స్ చదివిన. గ్రామాభివృద్ధికి పాటుపడతా. గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతా. పెద్దపల్లి: భోజన్నపేట గ్రా మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఎంకాం, డీఈడీ, బీఈడీ చదువుకున్న. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ వర్తింప జేసేలా అధికారులను కోరుతా. గ్రామంలోని సమస్యలపై అవగాహన పెంచుకుని పరిష్కరిస్తా. ప్రజలకు మెరుగైన సేవలందిస్తా. -
పుట్టిన ఊరుకు సేవ చేయాలని..
బుగ్గారం: మండలంలోని సిరికొండకు చెందిన పంచిత ధర్మరాజుయాదవ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యత మీదపడింది. ఈ క్రమంలో ఉపాధి కోసం గల్ఫ్బాట పట్టాడు. 15 ఏళ్లుగా దుబాయ్, ఖతార్ దేశాల్లో వివిధ కంపెనీల్లో పనిచేశాడు. ఖతార్ కంపెనీలో మంచి స్థాయిలో కుదురుకున్నాక తెలంగాణా ప్రజాసమితి స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ మరణించిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపించడం, జైళ్లలో ఉన్నవారికి న్యాయసహాయం అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టాడు. గ్రామంలోని యువకులకు వీసాలు పంపి గల్ఫ్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. తాను పుట్టిన ఊరుకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచాడు. గ్రామంలోని యువత, మహిళలు, రైతులు పూర్తి మద్దతు తెలుపడంతో సర్పంచ్గా విజయం సాధించాడు. -
లక్ష్యంతో ముందుకు సాగాలి
మల్లాపూర్/ మెట్పల్లిరూరల్: విద్యార్థులు లక్ష్యంతో ముందు కు సాగితే విజయం సొంతమవుతుందని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమా ర్ అన్నారు. మండలకేంద్రంతోపాటు సాతారం జెడ్పీ హైస్కూళ్లను శనివారం సందర్శించారు. చిటా, చెస్ నెట్వర్క్ అందించిన చెస్బోర్డులను విద్యార్థులకు పంపిణీ చేశారు. లక్ష్యం వైపు అడుగులు వేస్తే పాఠశాల, తల్లిదండ్రులు, పుట్టినఊరు పేరు నిలబడుతుందన్నారు. చెస్ నెట్వర్క్ ఫౌండర్లు సుధీర్ కోదాటి, రవి మయిరెడ్డి, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఎంఈవో దామోదర్రెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రమోహన్రెడ్డి, హెచ్ఎం శ్రీహరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. మెట్పల్లి మండలం వెల్లుల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు చెస్కిట్లను పంపిణీ చేశారు. హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, శంకర్గౌడ్ పాల్గొన్నారు. -
అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా
ఇబ్రహీంపట్నం: కేశాపూర్ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో పోటీ చేశా. బీఎస్సీ, ఎంపీఎస్ చదివా. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోనే బీడీలు చేస్తున్న. మా అత్త రాజుబాయ్ ఎంపీటీసీగా గ్రామానికి సేవలందించారు. నాకు సర్పంచ్గా అవకాశం వచ్చినందున గ్రామంలో అవినితీ పాలన లేకుండా, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా. తీరిక సమయంలో బీడీలు చేస్తా. ఓదెల: మండలంలోని శానగొండ సర్పంచ్గా ఎన్నికై న జీల రాజుయాదవ్కు 23ఏళ్లు. శానగొండ అనుబంధ గొల్లపల్లి స్వగ్రామం. డిగ్రీ పూర్తిచేశాడు. గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నాడు. గ్రామస్తులకు నాణ్యమైన వైద్యం, విద్య అందించేలా చూస్తానన్నారు. ప్రజల సహకారంతో సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. -
గదుల నిర్మాణానికి స్థల పరిశీలన
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆల య పరిసరాల్లో 96 గదుల సత్రం నిర్మాణానికి రూ.35.19కోట్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఇంజినీరింగ్ అధికారులు కొండగట్టులో స్థల పరిశీలన చేశారు. ఆలయ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, భవన నిర్మాణంపై చర్చించారు. కొండగట్టులో 96గదుల సత్రం భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసినట్లు ఇంజినీర్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, అధికారులు పాల్గొన్నారు. చలితీవ్రతకు వ్యక్తి మృతి రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని ఏ–పవర్హౌస్ చమన్ పరిసరాల్లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి చలితీవ్రతకు మృతిచెంది ఉంటాడని భాస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకుడు సలీంబేగ్ తెలిపారు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంధ్యారాణి శనివారం ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఉంటే 87126 56525 నంబరుకు ఫోన్చేసి సమాచారం అందించాలని ఎస్సై కోరారు. లారీ ఢీకొని ఒకరు..కోరుట్ల: కోరుట్ల బస్టాండ్ ఇన్గేట్ సమీపంలో రోడ్డు దాటుతుండగా లా రీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై చిరంజీ వి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన దశరథ్ సోనాజి ఉసరె శనివారం బస్టాండ్ ఇన్ గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో దశరథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన ఆయన కొంతకాలంగా కోరుట్లలో ప్లంబింగ్ పని చేస్తున్నాడు. బంధువుల ఫిర్యాదుమేకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడు.. సిరిసిల్లక్రైం: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ అలీ(70) అనేడు వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. పాతబస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తున్న మహబూబ్ అలీని బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మహబూబ్ అలీ మృతి చెందాడని అతని కుమారుడు రషీద్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాపీమేస్త్రీ ఆత్మహత్యసిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రానికి చెందిన తాపీమేస్త్రి చిద్రాల రవీందర్(45) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే వివాహాలు జరగగా, కుటుంబ పోషణకు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతోపాటు మరో కూతురి వివాహం ఎలా చేయాలనే ఆలోచనలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈక్రమంలోనే తాను మేస్త్రిగా పనిచేస్తున్న ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య లత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
● కళాకారులుగా.. ఉద్యోగులుగా.. వివిధ రంగాల్లో రాణించి ● సర్పంచ్లుగా ఎన్నికై న యువత
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి... పాలనలో ప్రత్యేకత చూపాలని భావిస్తున్నారు. మరో వైపు ఓటర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి యువతకు పట్టం కట్టారు. అభిమానం, సామాజిక సేవ, గౌరవం, తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో అవకాశం కల్పించారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు సర్పంచ్ల ప్రత్యేకతపై ఈ వారం సండే స్పెషల్..!! -
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
● బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల: రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కలెక్టర్తో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను జయప్రదం చేయాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ ధరించకపోవడం ద్వారా ఏటా చాలా మంది మరణిస్తున్నారని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్టీసీ, ఎడ్యుకేషన్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ● 900 గ్రాముల వెండి విగ్రహాలు.. ● 10 గ్రాముల బంగారం అపహరణ జగిత్యాలక్రైం: జగిత్యాలలోని కృష్ణానగర్లో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. కృష్ణానగర్కు చెందిన పబ్బ సాగర్ బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇటీవల తన తల్లిని కూడా బెంగళూరు తీసుకెళ్లాడు. శనివారం ఉదయం పని మనిషి వెళ్లేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో స్థానికులు సాగర్కు సమాచారం అందించారు. ఆయన సమాచారం మేరకు పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. ఇద్దరు దొంగలు తాళాలు పగులగొట్టి 900 గ్రాముల వెండి విగ్రహాలు, 10 గ్రాముల బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దొంగలిద్దరూ గ్లౌస్లు, మంకీక్యాప్లు ధరించినట్లు ఇంట్లో ఉన్న సీసీ పుటేజీల్లో రికార్డు అయ్యింది. సాగర్ బెంగళూరు నుంచి వచ్చాక ఇంట్లోని సామగ్రిని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
జప్తుచేసిన సామగ్రికి కోర్టులో వేలం
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని లింగంపేటలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేయగా.. ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు ఆర్డీవో కార్యాలయంలోని సామగ్రిని కో ర్టు ఆదేశాల మేరకు జప్తు చేశారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు శనివారం కోర్టు ఆవరణలో సామగ్రికి వేలం వేశారు. ఆరుగురు వేలంలో పాల్గొనగా.. బుగ్గ సతీశ్ రూ.42 వేలకు దక్కించుకున్నాడు. కోర్టుకు డబ్బులు చెల్లించి సామగ్రి తీసుకెళ్లాడు. జాతీయ నాయకుల ఫొటోలకు రక్తాభిషేకంఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గొస్కె రాజేశం ఆ పార్టీ జాతీయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చిత్రపటాలకు శనివారం రక్తాభిషేకం చేశారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్లో కార్యకర్త నుంచి జిల్లా అధికార ప్రతినిధిస్థాయికి ఎదిగానని, అయినా, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తనకు మద్దతు ఇవ్వకుండా మరోవ్యక్తికి మద్దతు ఇచ్చి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మడక పంచాయతీ ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ చేశారని, 300 కుటుంబాలు కలిగిన తమకు అన్యాయం చేశారని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిని సర్పంచ్ చేశారని రాజేశం పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేశారని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పెద్దలు కాపాడరని ఆరోపించారు. అనంతరం రోడ్డుపై కాలనీవాసులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కరెంట్ షార్ట్సర్క్యూట్తో ఇల్లు కాలిపోయింది. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాలు. ఇందారపు విజయ్ ఇంటిలో రాచమల్ల శివకుమార్ అద్దెకు ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లిన క్రమంలో షార్ట్సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో సర్పంచ్ దండవేన సంధ్యబానేశ్ వెంటనే మంథని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వస్తువులు, బంగారం, నగదు, బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇంటి యజమానికి రూ.15లక్షలు, అద్దెకు ఉండే శివకుమార్కు రూ.5లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయిన శివకుమార్తోపాటు ఓనర్ విజయ్ను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కోరారు. వేలం వేసిన వస్తువులు -
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేయాలి
ధర్మపురి: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మండలంలోని జైనా పీఏసీఎస్ పరిధిలోని దమ్మన్నపేట, రాజారం, నక్కలపేటలోని కొనుగోలు కేంద్రాలను నవంబర్ 21న అడిషనల్ కలెక్టర్ లత సందర్శించారని, ఆ సమయంలో రైతుల నుంచి సన్నరకం కొని దొడ్డు రకం కొన్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టి సీఈవోను మాత్రమే సస్పెండ్ చేసినా అసలు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సన్నాలకు బదులు.. దొడ్డు రకం అని రైతులకు ట్రక్షీట్స్ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై ధర్మారం మండలానికి చెందిన ఓ రైస్మిల్లర్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ జరిపి సీఈవోను సస్పెండ్ చేసి అసలు కారకులను వదిలిపెట్టారని వివరించారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను కోరారు. బీఆర్ఎస్ నాయకులు అయ్యోరి రాజేష్, సంగి శేఖర్, వొడ్నాల మల్లేశం, తరాల కార్తీక్, చిలువేరు శ్యామ్, అయ్యోరి వేణుగోపాల్, బండారి రంజిత్, అశోక్ ఉన్నారు. -
దొంగమల్లన్న ఆదాయం రూ.23లక్షలు
గొల్లపల్లి: గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలోగల దొంగ మల్లన్న స్వామి ఆలయానికి ఈయేడు ఆదాయం భారీగా పెరిగింది. షష్టి వారాల జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను శనివారం అధికారులు లెక్కించారు. హుండీల ద్వారా రూ.23,08,733తో పాటు 7.500గ్రాముల మిశ్రమ బంగారం, 550 గ్రాముల మిశ్రమ వెండి, సేవా టికెట్లు, వివిధ రకాల పూజా కార్యక్రమాల ద్వారా రూ.7,08,720 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. హుండీ లెక్కింపులో జగిత్యాల డివిజన్ పరిశీలకులు రాజమొగిలి, ఫౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య, ఆలయ ఈవో ముద్దం విక్రమ్, పూజారి రాజేందర్, నాయకులు ముత్యాల స్వామి, లంబ లస్మయ్య, మద్దెల జగన్, దేవాదాయ శాఖ సిబ్బంది శివ కేశవ్, రవీందర్, శ్రీ లలితా సేవా ట్రస్ట్ సభ్యులు, లక్ష్మీపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
పైడిపెల్లిలో రీపోలింగ్ నిర్వహించండి
వెల్గటూర్: తాము 50 ఏళ్ల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఆ పోరాటంలో తాము విజయం సాధించినా.. అధికారులు అడ్డుకున్నారని పేర్కొంటూ మండలంలోని పైడిపెల్లి గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఈనెల 17న నిర్వహించిన మూడో విడత ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని, మరోసారి పోలింగ్ నిర్వహించాలని సుమారు మూడు వందల మంది ట్రాక్టర్లలో తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నెల 22న జరగనున్న సర్పంచ్ ప్రమాణస్వీకారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ రోజు గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎంపీవో కృపాకర్కు వినతిపత్రం అందించారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మమత మాట్లాడుతూ గ్రామంలో ఒకే కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోందని, నియంతృత్వాన్ని సహించలేక ప్రజలంతా ఏకతాటిపై నిలబడినా కౌంటింగ్లో గోల్మాల్ చేసి తనను ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ పూర్తి కాకముందే తాను ఓడిపోయినట్లు ధృవీకరించి, బెదిరించి, బలవంతంగా తనతో సంతకం తీసుకున్నారని, తమకు న్యాయం చేయాలని, రీకౌంటింగ్ చేయాలని శాంతియుతంగా తాము నిరసన తెలిపితే పోలీసులు లాఠీచార్జ్ చేశారని కన్నీరుపెట్టుకున్నారు. ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కాల్పులు జరిపిన తర్వాతనే తాము ప్రాణ రక్షణకు రాళ్లు విసిరామని తెలిపారు. తమను కౌంటింగ్ కేంద్రానికి వందమీటర్ల దూరం ఉంచిన అధికారులు.. ప్రముఖ రాజకీయ నాయకుడి సోదరుడిని కౌంటింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారని, ఆయనకు కనీసం గ్రామంలో ఓటు కూడా లేదని తెలిపారు. తమకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ఎలుక రాజు, గాలి హరీశ్, మహిళలు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చిన గ్రామస్తులు ప్రమాణ స్వీకారం ఆపాలని వినతిపత్రం అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ -
క్షీరాభిషేకం, పుష్పాలంకరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం చేసి పూలతో అలంకరించారు. ప్రసూతి సేవలు పెంచాలిపెగడపల్లి(ధర్మపురి): ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసూతి సేవలు పెంచాలని జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్రెడ్డి సూచించారు. శుక్రవారం పెగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. బీపీ, మధుమేహం, క్యాన్సర్ తదితర వాధ్యులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరై మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వైద్యాధికారి నరేశ్, సీహెచ్వో సందీప్, సిబ్బంది పాల్గొన్నారు. కూరగాయల రైతులకు ప్రోత్సాహకంజగిత్యాలఅగ్రికల్చర్: కూరగాయలు సాగు చేసే రైతులకు ఉద్యానశాఖ తరుఫున ప్రోత్సాహకాలు అందిస్తామని జిల్లా ఉద్యానశాఖాధికారి గడ్డం శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో పాలెపు వసంత 10 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తుండగా, శుక్రవారం పంట పొలాలను జిల్లా ఉద్యానశాఖాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, డ్రిప్, మల్చింగ్ పద్ధతిలో బీర, టమాట, కాకర, సోర, దోస వంటి కూరగాయలు సాగు చేస్తుండడం అభినందనీయమన్నారు. కూరగాయలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ఖర్చుల కోసం ఎకరాకు రూ.9,600 సబ్సిడీ ఇస్తున్నట్లు వివరించారు. జగిత్యాల నియోజకవర్గ ఉద్యానశాఖాధికారి కె.స్వాతి, ఉద్యాన విస్తరణ అధికారి అనిల్, రైతులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికకథలాపూర్(వేములవాడ): మండలంలోని గంభీర్పూర్ జెడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థులు మ్యాకల వర్షిత్, మెట్టు గీతాంజలి జాతీయస్థాయి అత్య పత్య పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం సుధాకర్రెడ్డి శుక్రవారం తెలిపారు. చంఢీఘర్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో మన రా ష్ట్ర జట్టు తరుఫున పాల్గొంటారని పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులను అత్య పత్య క్రీడల జిల్లా అధ్యక్షుడు వాసం నవీన్కుమార్, కార్యదర్శి రాజేశ్, రవీందర్ అభినందించారు. నక్షతో భూముల లెక్క పక్కాజగిత్యాల: భూములకు పక్కాగా లెక్కలుండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద జగిత్యాల మున్సిపాలిటీ ఎంపికై ంది. గతంలోనే ఈ కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా జాప్యం జరిగింది. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నక్ష కార్యక్రమంతో భూములకు రక్షగా ఉంటుందని, డ్రోన్లతో చిత్రీకరించి ప్రతి ఒక్క ఆస్తికి అక్షాంశాలు, రేఖాంశాలు గుర్తించడం జరుగుతుందన్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఐ విఠల్ పాల్గొన్నారు. -
కొత్తదనం.. సమస్యల స్వాగతం
జగిత్యాల: పదిహేను రోజుల పాటు రసవత్తరంగా సాగిన గ్రామపోరు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 385 పంచాయతీలు, 3,536 వార్డులకు ఎన్నికలు పూర్తయ్యాయి. చిన్న గ్రామాల్లో రూ.5లక్షల నుంచి 10 లక్షలు, మేజర్ పంచాయతీల్లో రూ.80 లక్షల వరకు ఖర్చు పెట్టి ఎలాగోలా పదవులను దక్కించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోటీ తీవ్రంగా నెలకొంది. అప్పుడు బరిలో ఉన్న అభ్యర్థులు అనుభవపూర్వకంగా చాలా మంది తప్పుకున్నారు. కొందరు ఖర్చులకు భయపడి, మరికొందరు తెచ్చిన అప్పులు తీర్చకపోగా, గత ప్రభుత్వంలో బిల్లులు రాకపోవడంతో చాలా మంది పోటీలో నిలవలేదు. దీంతో చాలా మంది కొత్తవారు బరిలో నిలిచారు. జిల్లాలో 385 సర్పంచ్ స్థానాలకు గాను దాదాపు 90 శాతం కొత్తవారే గెలుచుకున్నారు. కొన్ని చోట్ల గతంలో భర్తలు పోటీ చేసిన స్థానంలో మహిళలకు రిజర్వేషన్ రావడంతో భార్యలను నిలబెట్టి ఐదు శాతం మాత్రం గెలిపించుకున్నారు. పాత స్థానాల్లో నిలబడి గెలిచిన వారు ఐదు శాతం వరకు ఉంటారు. గ్రామాల్లో మార్పు వచ్చేనా.. జిల్లాలోని పంచాయతీల్లో కొంత కొత్త, పాతవారు ఉన్నా తొలిసారి ఎన్నికై నవారే అత్యధికంగా సర్పంచులు ఉన్నారు. 90 శాతం గెలిచిన కొత్తవారిలో ఎక్కువగా యువత, మహిళలున్నారు. గ్రామ బాగోగులు చూడటంతో పాటు, ప్రతీ సమస్యపై స్పందించాల్సిన బాధ్యత సర్పంచులపై ఉంటుంది. రెండు నెలలకోసారి పాలకవర్గం సమావేశం నిర్వహించుకోవడం, గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి కోసం కృషి చేయాల్సి ఉంటుంది. రైతులను సంఘటితం చేస్తూ పంటల సాగుపై అధి కారులతో కలిసి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా గ్రామాల్లో డ్రెయినేజీలు, పారిశుధ్యం ప్రతీ స ర్పంచ్, వార్డు సభ్యులు దృష్టి సారించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పల్లెల్లో ఆదాయ వనరులపై దృష్టి పెట్టి పంచాయతీకి ఆదాయం పెంచుకునేలా ఈ నూతన సర్పంచులు బాధ్యతలు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వచ్చినప్పటికీ అవి జనాభాను బట్టి విడుదలవుతాయి. పాలకవర్గాల తీర్మానంతోనే పనులు చేపట్టాలి. సవాళ్లే అధికం గ్రామ పంచాయతీలను రెండేళ్లుగా నిధుల కొరత వేధిస్తోంది. ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులకు గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పంచాయతీ ఖాతాల్లో నిధులు అందుబాటులో లేవు. రెండుళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది. ముఖ్యంగా కోతులు, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో పాఠశాలలు శిథిలావస్థలో ఉండడం, టాయిలెట్స్ లేకపోవడం, సరైన బెంచీలు, కరెంట్ లేక చాలాచోట్ల ఇబ్బందులున్నాయి. గత ప్రభుత్వంలో మన ఊరు– మన బడి పథకం కింద మరమ్మతులు చేసినా ఆశించిన స్థాయిలో పూర్తి కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి మరమ్మతులు చేపట్టారు. కొత్త సర్పంచులు వాటిపై శ్రద్ధపెట్టి పనులు పూర్తి చేయాల్సిన అవసరముంది. అలాగే గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తదితర సమస్యలపై చర్యలు తీసుకోవాలి. -
మేడారం జాతరకు 700 బస్సులు
కరీంనగర్టౌన్: వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర కోసం రీజియన్ పరిధిలోని డిపోల నుంచి 700 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. శుక్రవారం బస్స్టేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీజియన్ పరిధిలో గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని డిపోల నుంచి జాతర బస్సులు ఉంటాయని తెలిపారు. ఆరు ఆపరేటింగ్ పాయింట్ల వద్ద అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, ఎంపిక చేసిన బస్సులకు అవసరమైన మరమ్మతులు, జాతర విధులు నిర్వర్తించే సిబ్బంది ఎంపిక, భక్తుల సురక్షిత ప్రయాణం తదితర అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్. భూపతి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు నాగభూషణం, వెంకన్న, రవీంద్రనాథ్, విజయమాధురి, ఎం.శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, కె. కల్పన, ఎస్.మనోహర్, దేవరాజు, ప్రకాశ్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల
● స్థానిక సమరంలో సత్తా ● 600 జనరల్ స్థానాల్లో 329 చోట్ల గెలుపు ● ఎస్సీ, ఎస్టీలు కూడా జనరల్ స్థానాల్లో గెలిచిన వైనం ● పల్లెల్లో మారుతున్న రాజకీయ ముఖచిత్రంవిజయబావుటాపెద్దపల్లిజగిత్యాలసిరిసిల్లకరీంనగర్సాక్షి పెద్దపల్లి/జగిత్యాల: ‘బీసీల ఓటు బీసీలకే’ అన్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన కులాల అభ్యర్థులు సత్తా చాటారు. బలహీన వర్గాలకు కేటాయించిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లోనూ విజయాబావుటా ఎగురవేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఆ మేరకు ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఆ రిజర్వేషన్లను రద్దు చేసి 50 శా తం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని కోర్టు సూ చించింది. స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం.. మూ డుదశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. పెరిగిన చైతన్యం, బీసీ నినాదం విస్తరించడంతో జనరల్స్థానాల్లోనూ బీసీలు బరిలో నిలిచి గెలుపొందారు. జనరల్లోనూ పాగా ఉమ్మడి జిల్లాలో బీసీలకు కేటాయించిన 297 స్థానాలతోపాటు అదనంగా 600 జనరల్స్థానాల్లో బీసీలు పోటీచేసి 329 చోట్ల విజయం సాధించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించిన 1,226 పంచాయతీల్లో 51.06 శాతం సీట్లను బీసీలే దక్కించుకున్నట్లు అయ్యింది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో బీసీలు జనరల్స్థానాల్లో గెలుపొందగా, తర్వాతి స్థానాల్లో కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీలు సైతం జనరల్ స్థానాల్లో పోటీచేసి విజయం సాధించడం గమనార్హం. మంథని డివిజన్లోని జనరల్ స్థానాల్లో ఇద్దరు ఎస్సీలు, అంతర్గాం జనరల్లో ఒక ఎస్సీ మహిళ విజయం సాధించగా, పెద్దపల్లిలో ఒకరు, అంతర్గాంలో ఒక ఎస్టీ గెలుపొందారు. గత ఎన్నికలతో పోల్చితే తక్కువే.. ● 2019 పంచాయతీ ఎన్నికల్లో పెద్దపల్లిలోని 263 పంచాయతీల్లో 68 సీట్లు బీసీ స్థానాలతోపాటు, జనరల్స్థానాల్లో మరో 74మంది బీసీలు గెలుపొందారు. మొత్తంగా 142మంది విజయం సాధించారు. ● సిరిసిల్ల జిల్లాలోని 252 పంచాయతీల్లో 56 బీసీ రిజర్వ్ సీట్లతోపాటు జనరల్లో 80 మంది గెలవడంతో మొత్తంగా 136 మంది బీసీలు గెలిచినట్లయ్యింది. ● కరీంనగర్ జిల్లాలోని 313 పంచాయతీల్లో బీసీలకు కేటాయించిన 74 సీట్లతోపాటు జనరల్లో 120 మంది గెలుపొందగా బీసీలకు మొత్తంగా 194 సీట్లు దక్కాయి. ● జగిత్యాల జిల్లాలోని 379 గ్రామ పంచాయతీల్లో 94 బీసీ స్థానాలతోపాటు జనరల్లో బీసీలు 185 చోట్ల విజయం సాధించి మొత్తంగా చూసుకుంటే 279 మంది బీసీలు సర్పంచ్ కిరీటాలు దక్కించుకున్నారు. ● మొత్తంగా ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే.. గతంలో 751 మంది బీసీ సర్పంచులు కుర్చీ దక్కించుకుంటే.. ఈసారి 626 మంది బీసీలే సర్పంచులుగా ఎన్నికయ్యారు. గతంలో పోల్చితే బీసీల ప్రాతినిధ్యం తగ్గినట్లయ్యింది.గతంలో జనరల్ స్థానాల్లో ఓసీలు మాత్రమే పోటీచేయాలనే అపోహ ఉండేది. దీనికితోడు జనరల్లో పోటీ చేయాలంటే ఓసీలకు ఉండే డబ్బు, పలుకుబడితో బీసీలు పోటీపడేవారు కాదు. పెరిగిన రాజకీయ చైతన్యం, బీసీ నినాదంతోపాటు, అధికార వ్యవస్థలపై అవగాహన పెరగడం, బీసీల్లో చదువుకున్న వారిసంఖ్య అధికం కావడం, ఖర్చుకు కూడా వెనుకాడని పరిస్థితులు రావడం, చాలాగ్రామాల్లో కొన్నేళ్లుగా పాతుకుపోయిన పెత్తందారీ వ్యవస్థకు చెక్పెట్టేలానే భావన బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాల్లో రావడంతో చాలాచోట్ల జనరల్ అభ్యర్థులను ఢీకొట్టి బీసీ నేతలు విజయం సాధించారు. ఇదే ఒరవడిని కొనసాగించి వచ్చే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటుతామని ఆ పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.గెలిచినవి మొత్తంజనరల్లో బీసీలుబీసీరిజర్వ్ -
‘పంచాయతీ’ కిక్కు
జగిత్యాలక్రైం: స్థానిక సంస్థలు అంటేనే పల్లెల్లో హంగామా ఉంటుంది. దీనికి తోడు పోటీచేసిన ప్రతీ అభ్యర్థి ఓటరును ప్రలోభ పెట్టేలా మందుతో పాటు, విందులు, నగదు పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో మద్యం లేనిదే గ్రామాల్లో ప్రచారం, సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు జనం రారు. ఈనేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన ప్రతీ అభ్యర్థి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి ఓటర్లకు పంపిణీ చేస్తూ తమ ఓటును వేయించుకునేలా ప్రలోభపెట్టారు. 17 రోజుల్లో రూ.42.67 కోట్ల అమ్మకాలు జిల్లాలో 385 గ్రామపంచాయతీలు, 3,536 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు భారీగా మద్యం కొనుగోలు చేసి ఓటర్లకు పంపకాలు చేపట్టారు. దీంతో కేవలం ఈనెలలో 17 రోజుల్లో రూ.42,67,39,850 అమ్మకాలు జరిగాయి. నవంబర్తో పాటు, డిసెంబర్లో భారీగా మద్యం విక్రయించారు. దీంతో కొత్త దుకాణదారులకు స్థానిక ఎన్నికల సందడితో భారీగా వ్యాపారం జరిగింది. గతేడాది విక్రయాలు.. గత సంవత్సరం 2024 నవంబర్లో లిక్కర్ బాక్స్లు 50,073, బీర్ బాక్స్లు 1,31,761 విక్రయించారు. మొత్తం రూ.36,31,69,739 విక్రయాలు చేపట్టారు. అలాగే డిసెంబర్లో లిక్కర్ బాక్సులు 64,640, బీర్ బాక్స్లు 1,34,653 విక్రయించారు. మొత్తం రూ.50,18,41,471 విలువ గల మద్యం విక్రయించారు. నవంబర్, డిసెంబర్లో 17 రోజుల్లోనే.. ప్రస్తుతం నవంబర్లో జిల్లాలో 54,712 లిక్కర్ బాక్స్లు, 98,759 బీర్ బాక్స్లు విక్రయించారు. వీటి ద్వారా రూ.43,29,58,258 ఆదాయం సమకూరింది. అలాగే డిసెంబర్ 1 నుంచి 17 వరకు 50,700 లిక్కర్ బాక్స్లు, 71,202 బీర్బాక్స్లు విక్రయించగా రూ.42,67,39,850 ఆదాయం సమకూరింది. దీంతో ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. -
ప్రజాపాలనకు నిదర్శనం
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుజగిత్యాల: పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్లో మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేయడం జరిగిందన్నారు. జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలవడం ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో దోచుకోవడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరిట దోచుకున్నారని ఆరోపించారు. రెండేళ్లలో ఏ సీఎం చేయని పనులు సీఎం రేవంత్రెడ్డి చేశారని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికల ప్రక్రియలో అనేక ఇబ్బందులు పెట్టేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాఫీగా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగిందని, ఎలాంటి భయాందోళనకు గురిచేయలేదన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంక్షేమశాఖ మంత్రిగా ఉండి ఒక్క హాస్టల్కు పక్కా భవనం నిర్మించలేదన్నారు. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ధర్మపురిలో బస్డిపో, డివిజన్ కేంద్రం ఇలా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. మాజీ మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడొద్దని హెచ్చరించారు. రోళ్లవాగుపై సీఎం దృష్టికి తీసుకెళ్లి అటవీశాఖ అనుమతితో గేట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.60 కోట్ల ప్రాజెక్ట్ పనిని రూ.160 కోట్లకు పెంచేలా మాజీమంత్రి చూశారని ఆరోపించారు. హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి: నందయ్య కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల ఎమ్మెల్యేపై అనవసరపు ఆరోపణలు చేశారని, హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడింది విద్యాసాగర్రావు కాదా అని ప్రశ్నించారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన కోరుట్లలో చేసిందేమీలేదన్నారు. ఇకనైనా జగిత్యాల ఎమ్మెల్యేపై ఆరోపణలు మానుకోవాలన్నారు. -
ఆస్తి పన్ను కట్టం
కోరుట్ల: ఐదేళ్ల క్రితం కోరుట్లలో విలీనమైన ఎఖీన్పూర్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని నిరసన తెలుపుతూ గ్రామస్తులు మున్సి పల్ పన్ను కట్టేందుకు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం పన్ను వసూలు కోసం విలీన గ్రామానికి మున్సిపల్ ఉద్యోగులు వెళ్లిన సందర్భంగా ఈ విషయమై నిలదీశారు. ఐదేళ్లుగా మున్సిపాల్టీకి ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లి స్తున్నా, అభివృద్ధి కోసం నిధుల కేటాయింపులో వి వక్ష కనిపించిందని గ్రామానికి చెందిన శంకర్ అన్నారు. పంచాయితీగా ఉన్నప్పుడు పన్ను తక్కువగా ఉండేవన్నారు. మున్సిపల్ పరిఽధిలోకి రావడంతో పెద్ద మొత్తంలో పన్ను కడుతున్నామని, అయినా ఎలాంటి ప్రగతి కనిపించడం లేదన్నారు. ఇప్పటికై నా గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణానికి నిధులు కేటాయించాలని, లేకుంటే పన్ను చెల్లింపులో నిరాకరణ కొనసాగిస్తామని యువజన సంఘాల ప్రతినిధి జాగిలం భాస్కర్ తెలిపారు. -
సమన్వయంతో ఎన్నికలు విజయవంతం
జగిత్యాల: అధికారుల సమన్వయంతోనే పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అన్ని శాఖల అధికారులు కలెక్టర్ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి పూర్తయ్యే వరకు మూడు దశల్లో ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి 2027 జూలైలో గోదావరి పుష్కరాలను కుంభమేళాగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి మాస్టర్ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. లక్షలాది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తారని, తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకే రోజు 2 లక్షల మంది పుష్కరఘాట్లకు తరలివచ్చినా ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి జగిత్యాల మున్సిపాల్టీలో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్ను కోరారు. అభివృద్ధి పనుల్లో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, డబుల్బెడ్రూం వద్ద మౌలిక వసతులు కల్పించేలా చూడాలన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి, డీపీవో రఘువరణ్, ఆర్డీవో మధుసూదన్, కన్నెం హారిణి, మోహన్, కలెక్టరేట్ ఏవో హకీం పాల్గొన్నారు. -
బుధవారంపేటను స్వాధీనం చేసుకోవాలి
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ ఓసీపీ–2 విస్తరణలో భాగంగా బుధవారంపేట గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం సర్వేకు వచ్చిన సింగరేణి అధికారులను వారు అడ్డుకున్నారు. సుమారు 15ఏళ్లుగా సింగరేణి సంస్థ తమ గ్రామంపై వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. తమ పంచాయతీ పరిధిలోని మొత్తం వ్యవసాయ భూములు, గ్రామాన్ని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుని మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ద్వారా అన్ని వసతులతో కొత్త గ్రామాన్ని నిర్మించి తగిన న్యాయం చేయకుంటే సింగరేణి సంస్థ నిర్వహించే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని సౌకర్యాలు కల్పిస్తేనే సర్వేకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. అప్పటివరకు అధికారులు, సింగరేణికి సహకరించేది లేదని హెచ్చరించారు. చేసేదిలేక సర్వేకు వెళ్లిన అధికారులు వెనక్కి వచ్చేశారు. -
వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని బిర్లా ఓపెన్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది. ఈమేరకు గురువారం స్కూల్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, యూనివర్సిటీ ప్రతినిధి వినోద్లు ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాధారిత విద్యతో పాటు భవిష్యత్ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో వాక్సెన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కలిసి విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో విద్యాబోధన అందుబాటులోకి వస్తుందన్నారు. వాక్సెన్ యూనివర్సిటీ ప్రతినిధి వినోద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. బిర్లా స్కూల్ అమలు చేస్తున్న విద్యాప్రమాణాలు, వినూత్న కార్యక్రమాలను అభినందించారు. -
పూత ఇంకా రాలేదు
మామిడి తోటలో ఇంకా పూత రాలేదు. పూత వస్తుందనే ఆలోచనలతో తోటలో ఇప్పటికే ఎకరాకు రూ.20వేల వరకు ఖర్చు పెట్టి.. అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించాను. పురుగుమందులు కూడా పిచికారీ చేయించాను. మూడేళ్లుగా పూత లేదు. ఈ సారి ఏమి చేస్తుందో చూడాలి. – సాయిరెడ్డి, సింగరావుపేట, రాయికల్(మం) గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం మామిడి పూతపై ప్రభావాన్ని చూపుతాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతోపాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పూత వచ్చే అవకాశం ఉంది. పూత సమయంలో తోటలో ఎలాంటి పనులు చేయవద్దు. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి -
వకీల్పల్లి
తంగళ్లపల్లి నుంచి అనేక మంది న్యాయవాదులుగా రాణిస్తున్నారు. దోర్నాల లక్ష్మారెడ్డి న్యాయవాద వృత్తిలో ఉంటూనే టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో క్రియాశీల రాజకీయ నాయకుడిగా కొనసాగారు. పాతికేళ్ల క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా సేవలందించారు. ప్రస్తుతం సబ్బని రవీందర్, కోడం సత్యనారాయణ, కోడం సురేశ్, దోర్నాల సంజీవ్రెడ్డి, దోర్నాల జనార్దన్రెడ్డి, కోడి లక్ష్మణ్, సబ్బని రమేశ్ (కరీంనగర్), బండి చైతన్యగౌడ్, ిసీనియర్ న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. ఇటీవల పలువురు జూనియర్ న్యాయవాదులు తక్కళ్ల సారిక, సుహాసిని, వినీత, ఆకుల శ్రీనివాస్, బొల్లారం ప్రదీప్, గజభీంకార్ సృజన, పసుల వంశీ ఇటీవలనే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాణించిన న్యాయవాదులు -
ఏర్పాట్లు బాగున్నాయ్
విధులు నిర్వహించేందుకు ఎలిగేడు మండలం నర్సాపూర్ వచ్చా. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చినం. రాత్రిబస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. – భాగ్యలక్ష్మి, జూనియర్ లెక్చరర్ సంతృప్తిగా ఉంది సామాగ్రితో ముందురోజు మధ్యాహ్నం వరకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాం. ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు కలెగకుండా స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు ఎంతో సంతృప్తినిచ్చాయి. –సామ శిరీష, ఉప్పట్ల, మంథని -
వేడినీళ్లు.. నోరూరించే టిఫిన్లు
పెద్దపల్లిరూరల్: గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సిబ్బంది వసతి, సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నారు. పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విధులను నిర్వహించేందుకు వచ్చిన పోలింగ్ అధికారులు, ఓపీవోలు, మెడికల్, పోలీసు, తదితర సిబ్బందికి అవసరమైన వసతీసౌకర్యాలు మెరుగ్గా కల్పించారు. 85 పంచాయతీల్లో ఎన్నికలు.. జిల్లాలో ఆఖరువిడత పంచాయతీ ఎన్నికల్లో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాల కోసం నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో 128 మంది పోలింగ్ అధికారులు, 166 మంది ఓపీవో తదితర సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను ఆయా కేంద్రాల సమీపంలో కల్పించారు. వణికిస్తున్న చలిలో ఉదయమే స్నానం చేసేందుకు వీలుగా వేడినీటిని కూడా అందించారు. నోరూరించే అల్పాహారం, రుచికరమైన భోజనం అందించినట్లు పలువురు ఎన్నికల సిబ్బంది చెప్పారు. ఏర్పాట్లపై కొందరిని పలుకరించగా.. కడుపునిండా రుచికరమైన భోజనం ఎన్నికల విధుల నిర్వహణ తృప్తినిచ్చింది పోలింగ్, లెక్కింపు కేంద్రాల్లో సౌకర్యాలు భేష్ స్థానిక అధికారుల సహకారంతో సమస్యలు దూరం ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల మనోగతం -
మామిడి పూత.. రైతుల్లో చింత
జగిత్యాలఅగ్రికల్చర్: ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితులు మామిడికి ప్రతికూలంగా మారుతున్నట్లు కనబడుతున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో రావాల్సిన మామిడి పూత ఇప్పటికీ ఇంకా చెట్లపై కనబడటం లేదు. పూత వస్తుందనే ఆలోచనలతో ముందుగానే తెగుళ్లు, పురుగులు ఆశించకుండా మామిడితోటల్లో రైతులు రసాయన ముందులు పిచికారీ చేస్తున్నారు. కొన్ని రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండటం.. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటుండటం మామిడి రైతులకు కొంత ఆందోళనకరంగా మారుతోంది. 37 వేల ఎకరాల్లో మామిడి సాగు జిల్లాలో దాదాపు 37 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మామిడి మార్కెట్ ఉండటం.. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు నేరుగా ఢిల్లీ వంటి నగరాలకు తరలించడం.. తోటలను లీజుకు తీసుకున్న వ్యాపారులు కూడా పెరగడంతో మామిడికి మంచి రేటు వస్తుందని రైతులు ఆశపడ్డారు. ఈ క్రమంలో ఐదేళ్లలో మామిడితోటల విస్తీర్ణం కూడా బాగానే పెరిగింది. అయితే నాలుగేళ్లుగా మామిడికి పూత రాకపోవడం, పూత వచ్చినా నిలవకపోవడం.. విపరీతంగా తేనేమంచు పురుగు ఆశించడంతో రైతుకు ఏ మాత్రం దిగుబడులు రాలేదు. దీంతో కొంతమంది రైతులు ఇప్పటికే మామిడి తోటలను తొలిగించారు. మరికొంత మంది రైతులు ఈ ఏడాది పంట దిగుబడి బట్టి నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. మామిడి పూతకు సమయమిదే మామిడి పూత సాధారణంగా నవంబర్ చివరి నుంచి ప్రారంభమై డిసెంబర్, జనవరి మొదటి వారం వరకు వస్తుంటుంది. మామిడి సాగులో 8 నెలల పాటు చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తైతే.. పూత నుంచి కోత వరకు నాలుగు నెలల పాటు యాజమాన్య పద్ధతులు మరో ఎత్తు. ఇప్పటికే ఎకరాకు రూ.20వేల విలువ గల రసాయన మందులను రైతులు పిచికారీ చేశారు. రెండేళ్లుగా వర్షాలు సెప్టెంబర్, అక్టోబర్ వరకు కురవడంతో భూమి తేమతో కూడి ఉంది. దీనికి తోడు వాతావరణంలో మార్పులు ఏర్పడి పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీగా వ్యత్యాసం ఉండటం కూడా పూతపై ప్రభావం చూపిస్తోంది. పూత విచ్చుకునే దశలో చలి ప్రభావంతో పాటు తుపాన్ల ప్రభావంతో పొడి వాతావరణం ఉండటం లేదు. గతేడాది ఆలస్యంగా పూతరావడం, పూత వచ్చే సమయానికి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేడి వాతావరణంతో పూత సగం రాలిపోయింది. తేమ వాతావరణం ఉండటంతో తేనేమంచు పురుగు కూడా ఆశించింది. అక్కడక్కడ కొంతమేర వచ్చిన పూతలోని రసాన్ని పీల్చుతున్నాయి. దీంతో పూత ఎండిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. ఈ ఏడాది తేమ వాతావరణం ఉండటం వల్ల పూత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఉద్యాన అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ చివరికి వచ్చినా పూత ప్రారంభం కాకపోవడంపై రైతులు ఆందోళన పడుతున్నారు. మూడేళ్లుగా పూత సరిగ్గా రాకపోవడంతో కొంతమంది రైతులు మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టడం లేదు. -
15ఏళ్ల బాలుడికి బ్లడ్ కేన్సర్ నుంచి విముక్తి
కరీంనగర్: కరీంనగర్కు చెందిన 15ఏళ్ల బాలుడు బ్లడ్ కేన్సర్తో బాధపడుతుండగా సోమాజిగూడ యశో ద హాస్పిటల్స్లో అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించినట్లు హెమటో– అంకాలజీ– బీఎంటీ వైద్యుడు కె.అశోక్కుమార్ తెలిపారు. ప్రస్తు తం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. గురువారం కరీంనగ ర్ యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్లోని హెమటాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో లుకేమి యా, లింఫోమాస్, మల్టీపుల్ మైలో మా, అప్లాస్టిక్ అనీమియా, తలసే మియా, సికిల్ సెల్ డిసీజ్ వంటి కేన్సర్, రక్త రుగ్మతలకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో ఇప్పటివరకు 400కు పైగా విజయవంతమైన బీఎంటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి హెమటాలజీ సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. -
తెలుగులో తీర్పుతో గుర్తింపు
1986 నుంచి కరీంనగర్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే 1992లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలో విజయం సాధించారు గొట్టె రవీందర్. ఆదిలాబాద్, సిర్పూర్, వరంగల్లో విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై సీనియర్ ఏపీపీగా నర్సంపేటలో బాధ్యతలు నిర్వహిస్తూ 2004లో తిరిగి జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. కర్నూలు, డోన్లో పనిచేశారు. సీనియర్ సివిల్ జడ్జిగా 2013లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, నాంపెల్లి కోర్టులో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. తెలుగులో తీర్పునిచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. – గొట్టె రవీందర్, విశ్రాంత న్యాయమూర్తి సేవ చేయాలన్న సంకల్పంతో... విద్యార్థి దశ నుంచే నెహ్రూ యువకేంద్రం ద్వారా సామాజిక సేవలపై ఆసక్తి పెరిగింది ఆసాని జయశ్రీకి. టీచర్గా పనిచేసిన తండ్రి రాజారెడ్డి స్వచ్ఛంద సేవలే స్ఫూర్తిగా న్యాయవిద్యను పూర్తి చేశారు. 1996లో న్యాయవాదిగా నమోదై.. మెట్పల్లిలో నాలుగేళ్లపాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం కుటుంబంతోపాటు కరీంనగర్కు షిఫ్ట్ అయ్యారు. స్థానికసంస్థల్లో సర్పంచ్లు, వార్డుసభ్యులకు పలు మార్లు శిక్షణ ఇచ్చారు. జ్యుడీషియల్ శాఖలోకి 2015లో అడుగుపెట్టి పెద్దపల్లి, కరీంనగర్, ప్రస్తుతం సిరిసిల్లలో విధులు నిర్వహిస్తున్నారు. – ఆసాని జయశ్రీ, స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ -
60 ఏళ్ల ప్రాక్టీస్
వైద్య ఉమాశంకర్ ఊరిలో తొలి న్యాయవాది. 1965 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మక్తల్ తహసీల్దార్గా వ్యవహరించిన తండ్రి వీరప్ప తన ఆరేళ్ల వయసులో కన్నుమూశారు. ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు, పురిటిగడ్డను వీడకుండా న్యాయవాద వృత్తిని ఎంచుకుని సివిల్ కేసుల్లో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. నిరంతర శ్రమతో సామాన్యులకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో సాధన చేస్తే మంచి అడ్వకేట్గా మారొచ్చు అనేది ఈ తరానికి ఆయన ఇచ్చే సందేశం. – వైద్య ఉమాశంకర్ ఉద్యమస్ఫూర్తితో.. 1988లో న్యాయవాదిగా నమోదై.. ఆరేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1994 మేలో పీపీగా, జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. నంద్యాలలో తొలి పోస్టింగ్. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ న్యాయమూర్తుల సంఘాన్ని స్థాపించి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉద్యమాలకు నేతృత్వం వహించారు. పదేళ్లపాటు హైకోర్టు ఉమ్మడిగా ఉండాలన్న నిర్ణయంపై.. న్యాయవ్యవస్థ కూడా వేరుపడాలని 2015లో సుప్రీంకోర్టులో రిట్వేశాం. 2016లో 250 మంది న్యాయమూర్తులు కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో సస్పెన్షన్కు గురయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు, అప్పటి గవర్నర్ చొరవతో నెల రోజుల తరువాత సస్పెన్షన్ ఎత్తేశారు. తీవ్రమైన న్యాయ సంక్షోభాన్ని సృష్టించడంతో రెండు నెలల్లో న్యాయవ్యవస్థను విభజించాలంటూ 2018 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 2019లో అమలులోకి వచ్చింది. 2024 జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. – వైద్య వరప్రసాద్, విశ్రాంత న్యాయమూర్తి -
అటవీశాఖ అధికారిపై దాడి
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సెక్షన్ అధి కారి సాంబయ్యపై దాడి జరిగినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రవికుమార్ తెలిపారు. రంగపేట అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా సాంబయ్య అడవిలోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి గొడ్డలితో కన్పించగా సాంబయ్య అతడిని మందలించాడు. దీంతో కోపంతో రాకేశ్ గొడ్డలితో సాంబయ్యపై దాడిచేశాడని, ఘటనలో సాంబయ్య చేతివేళ్లకు గాయాలయ్యాయని తెలిపారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులురాయికల్: రాయికల్ పట్టణంలో ఓ బాల్య వివాహాన్ని 1098 ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో పట్టణానికి చెందిన అబ్బాయి, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి వధూవరుల వయసును పరిశీలించారు. వధువు వయసు తక్కువగా ఉండటంతో మేజర్ అయ్యేంత వరకు వివాహం చేయొద్దని 1098 కౌన్సిలర్ శ్రీనివాస్, సోషల్ వర్కర్ రాణి, గంగాధర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా పడింది. షార్ట్సర్క్యూట్తో సామగ్రి దగ్ధంజగిత్యాలక్రైం:జగిత్యాల పట్టణంలోని చిలుకవాడలో తాళం వేసిన ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలు అంటుకుని సామగ్రి దగ్ధమైంది. చిలుకవాడకు చెందిన దామెర తిరుపతి తన భార్య లక్ష్మీతో కలిసి గురువారం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. సాయంత్రం 7.30 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో చేరుకుని మంటలు ఆర్పేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న సామగ్రి, నిత్యావసర వస్తువులు, బట్టలు కాలిపోయాయి. -
కుట్రపూరిత రాజకీయాలతో వేధింపులు
జగిత్యాల: నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలతో ఈడీ దాడులతో సోనియాగాంధీ, రాహూల్గాంధీని వేధిస్తోందని, ఢిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా బీజేపీకి కనువిప్పు కలగాలని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. గురువారం ఇందిరాభవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన కుటుంబాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా వేధిస్తున్నారని, ఢిల్లీ హైకోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. మహాత్మగాంధీ పేరిట కొనసాగుతున్న ఉపాధి పథకం పేరును మార్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య మాట్లాడుతూ.. భారతీయుల స్వేచ్ఛ, సమానత్వం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారన్నారు. కాంగ్రెస్ నాయకులు కొత్తమోహన్, బండ శంకర్, మాజీ కౌన్సిలర్లు దుర్గయ్య, అనిత పాల్గొన్నారు. -
విద్యే నిజమైన సంపద
కోరుట్ల/మెట్పల్లి: విద్యనే నిజమైన సంపద అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల, మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు సంజయ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని టీ–హబ్ను సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలన్నారు. టి–హబ్, టి–వర్క్స్ కల్పిస్తున్న స్టార్టప్, స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
జగిత్యాల
27.0/10.07గరిష్టం/కనిష్టంఘనంగా మహా లింగార్చనధర్మపురి: శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. రుద్రనమకం, మాన్యసూక్తం, లక్ష్మీసూక్తం, పురుషసూక్తం వంటి పూజలు చేశారు. వాతావరణం పొడి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. పొగమంచు అధికంగా కురుస్తుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. మాస శివరాత్రి పూజలుజగిత్యాలరూరల్: పొలాస శివారులోని సహస్రలింగాల దేవాలయంలో మాస శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు.శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
యువతరానికే పట్టం
జగిత్యాల: గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అలాంటి పల్లెల్లో గతంలో సర్పంచులుగా పోటీ చేయాలంటేనే ప్రతిఒక్కరూ భయాందోళనకు గురయ్యేవారు. గ్రామాల్లో పెత్తనం చేసేవారే ఎక్కువగా పోటీచేసే వారు. పరిస్థితులు మారాయి. యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి సై అంటోంది. గతంతో పోల్చితే ఈ సారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో యువతే ఎక్కువగా బరిలో నిలిచింది. ప్రజలు కూడా వారినే ఆదరించారు. జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులు ఉన్నాయి. ఇందులో దాదాపు 90 శాతం మంది 40 ఏళ్లలోపు వారే బరిలో నిలిచి విజయం సాధించారు. గ్రామీణ ప్రజలు కూడా మార్పు కోరుకుంటూ యువతకు పట్టంకట్టారు. వీరిలో చాలామంది అండర్గ్రాడ్యుయేట్లు 200 మంది వరకు.. గ్రాడ్యుయేట్లు దాదాపు 45మందికి పైగానే ఉన్నారు. పోస్ట్గ్రాడ్యుయేట్లు 12 మంది ఉన్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు.. ప్రైవేటు ఉద్యోగాలు వదిలి పంచాయతీ బరిలో నిలిచి సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు, మద్యం ఏరులై పారినప్పటికీ తామేం తక్కువ కాదంటూ యువత ముందుకొచ్చి మొత్తానికి పోటీలో నెగ్గారు. సమస్యలతోనే స్వాగతం.. గ్రామీణ ప్రాంతాల్లో గత పాలకవర్గం ముగిసి రెండేళ్లయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేకపోయింది. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అయితే గెలిచిన సర్పంచులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామాల్లో రోడ్లు, వైకుంఠదామాలు, మురికికాలువలు అధ్వానంగా మారాయి. పాఠశాలలు, కమ్యునిటీ హాల్స్, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక ఇబ్బందిగా ఉంది. వాస్తవానికి గ్రామాల్లో ప్రధానమైన సమస్య కోతులు, కుక్కల బెడద. ఎక్కడ చూసినా వాటి సంచారం అత్యధికంగా ఉంది. వీటిని నిర్మూలించే బాధ్యత కొత్త సర్పంచులపై ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పెంకుటిళ్లు కోతులతో దాదాపుగా చెడిపోయాయి. వీధికుక్కలు గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. కనిపించిన చిన్నపిల్లలు, వృద్ధులను కాటేస్తున్నాయి. వీటి నివారణకు కొత్త పాలకవర్గం చర్యలు చేపట్టాల్సి ఉంది. పశువైద్యం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరో ప్రధాన సమస్య వీధిలైట్లు. చాలాచోట్ల ఏర్పాటు చేసినప్పటికీ ఎక్క డా వెలగడం లేదు. వీధి దీపాలు బిగించిన వారంవెలుగుతున్నాయి. తర్వాత ఎగిరిపోతున్నాయి. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కాలనీలన్నీ చీకటిమయంగానే మారాయి. గత పాలకవర్గం హయాంలో పనులు చేసినప్పటికీ బిల్లులు రాక అనేకమంది కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్లు రాని వారికి, వృద్ధులకు సంబంధించిన సమస్యలు, మహిళల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ సమస్యలన్నీ కొత్త సర్పంచులకు భారంగా మారనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్ల కొనుగోలు చేశారు. వాటి నెలవారి అద్దెలు బ్యాంకుల్లో కట్టలేక ట్రాక్టర్లు మూలనపడ్డాయి. వాటిని వినియోగంలోకి తేవాల్సి ఉంది. కొత్త పాలకవర్గాలు ఏర్పాటు గ్రామపంచాయతీ మూడు విడతల ఎన్నికలు ముగియగా.. మరో 4–5 రోజుల్లో పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరుడు కావడంతో గ్రామంలోని సమస్యలను చూడాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. మరో 2–3 రోజుల్లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
సంక్షేమ పథకాలతోనే పట్టంగట్టారు
ధర్మపురి: కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ప్రజలు పట్టంగట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్త సర్పంచులను సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో 140 సర్పంచ్ స్థానాలకు 109మందిని గెలిపించారని తెలిపారు. పాలకవర్గం ఏకతాటిపై నిలిచి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, చీపిరిశెట్టి రాజేష్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, నూతన సర్పంచులు కాసారపు బాలాగౌడ్ రాందేని మొగిలి తదితరులున్నారు. -
అక్కడ పులి.. ఇక్కడ అప్రమత్తం
మెట్పల్లిరూరల్: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కామారెడ్డి ప్రాంతంలోని దోమకొండ పాతతాలుకా పరిధిలో గల మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూర్ మండలాల్లో పెద్దపులి సంచరించి మూగజీవాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల అడవుల నుంచి పెద్దపులి సిరికొండ, కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ల పరిధిలోని అటవీ ప్రాంతం ద్వారా జిల్లాలోకి ప్రవేశిస్తుందేమోనన్న అనుమానంతో అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. మెట్పల్లి మండలంలోని రంగారావుపేట, కేసీఆర్తండా, పాటిమీది తండా, అందుబొందుల తండా, ఆత్మనగర్, ఆత్మకూర్ గ్రామాల్లో పంట పొలాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని గురువారం మైకుల ద్వారా చెప్పించారు. ఎక్కడైనా పులి కనిపించినా.. వాటి పాదముద్రలు కనిపించినా.. మూగజీవాలపై దాడులు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నా.. తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాచారం ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న చోటు నుంచి ఇక్కడి అటవీప్రాంతానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరం ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పెద్దపులి రోజుకు సుమారు 50 కిలోమీటర్లు నడిచే అవకాశం ఉంటుందని భావిస్తున్న అధికారులు.. మధ్యలోనే దానికి కావాల్సిన ఆహారం దొరికితే ఆ ప్రాంతంలోనే ఉంటుందా..?లేక ఇటువైపు వస్తదా..? తిరిగి వెనక్కే వెళ్తుందా..? అనేది చూడాల్సి ఉందని, ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. -
వైభవంగా ముగిసిన దొంగ మల్లన్న జాతర
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేటలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో ఏడు వారాలుగా నిర్వహిస్తున్న జాతర ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు రాజేందర్ శాస్త్రోక్తంగా హోమగుండం వద్ద పూజలు నిర్వహించారు. చండీయాగం చేశారు. ముగింపు ఉత్సవాల సందర్భంగా మల్లన్నపేట భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాలు విజయవంతానికి సహకరించిన భక్తులు, అధికారులు, గ్రామస్తులకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి విక్రమ్ పాల్గొన్నారు. -
తూకం వేయడంలేదు
ఎకరంన్నర పంట సాగు చేసిన. పెగ్గెర్లలో కొనుగోలు కేంద్రం ఉంటుందని తెలపడంతో రైతులందరం తీసుకొచ్చి పోసినం. ప్రతిరోజూ ఉదయం వచ్చి ఆరబెడుతున్న. రాత్రివేళ మక్కల కుప్పపై టార్ఫాలిన్ కవర్లు కప్పుతున్న. ఇప్పటికీ తూకం వేస్తలేరు. రైతుల గురించి పట్టించుకోవాలి. – ఎల్లాల నారాయణ, రైతు, పెగ్గెర్ల. కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం మక్కలు పోసిన. రోజు మక్కలు ఆరబెడుతున్నాం. తూకం ఎప్పుడు వేస్తరో చెప్పడంలేదు. సిబ్బందిని అడిగితే రేపు అంటూ ఇలా కాలం వెల్లదీస్తున్నారు. రైతులను తిప్పలు పెట్టకుండా త్వరగా తూకం వేయాలి. నాయకులు చొరవ చూపాలి. – గడ్డం బక్కయ్య, రైతు, పెగ్గెర్ల. -
నెలరోజులుగా కేంద్రాల్లోనే మక్కలు
కథలాపూర్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను విక్రయిద్దామంటే అన్నదాతలకు అష్టకష్టాలు తప్పడంలేదు. కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామశివారులో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతామని రైతులకు సమాచారం ఇవ్వడంతో రైతులు మక్కలు పోశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్ధతు ధర రూ.2,400 వస్తుందని సుమారు నెల రోజుల నుంచి పెగ్గెర్ల, ఊట్పెల్లి గ్రామాల రైతులు పెగ్గెర్ల కొనుగోలు కేంద్రంలో మక్కలు పోసి ఆరబెడుతున్నారు. ఇప్పటికీ తూకం వేయడంలేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు కథలాపూర్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఎప్పటికప్పుడు తూకం వేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. పెగ్గెర్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఇప్పటికి తూకం ప్రారంభించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. నిర్లక్ష్యం ఎవరిదో కానీ తాము కొనుగోలు కేంద్రంలోనే రోజులతరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ● కొత్త సర్పంచులకు సన్మానం ధర్మపురి: పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కొత్త సర్పంచులు, వార్డుసభ్యులను ధర్మపురిలో గురువారం సన్మానించారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, నాయకులు అయ్యోరి రాజేశ్ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి పెగడపల్లి: గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని కొప్పుల అన్నారు. పెగడపల్లిలో మండలంలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్, మాజీ సర్పంచులు రాజేశ్వర్రావు, లక్ష్మన్, నాయకులు రాజశేఖర్గౌడ్, తిరుపతి, అంజి, హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అసలైన ఓటు చోరీ కాంగ్రెస్ పార్టీయే జగిత్యాల: దేశంలో ప్రజాదరణ కోల్పోగానే ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ అసత్యపు ప్రచారం చేస్తోందని బీజేపీ జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి ఓటు చోరీ అంటూ రోడ్లపై తిరుగుతున్నారని, నెహ్రూ కాలం నుంచి అసలైన ఓటు చోరీకి పాల్పడింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొన్ని రాష్ట్రాల్లో ఓటు చోరీ ఎలా జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్యారంటీ, వారంటీ అయిపోయిందని, మతిబ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, కార్యదర్శి తిరుపతి, శ్రీనివాస్, పిల్లి శ్రీనివాస్, దివాకర్, లక్ష్మీనారాయణ, కళావతి, లవన్ పాల్గొన్నారు. -
మారుమోగిన అయ్యప్ప నామ స్మరణం
కోరుట్లరూరల్: గురుస్వాముల భజనలు.. కన్నెస్వాముల శరణు ఘోషతో కోరుట్ల మండలంలోని నాగులపేట నాగులమ్మ ఆలయం మారుమోగింది. ఆలయం ఆవరణలో అయ్యప్ప పడిపూజను గురువారం వైభవంగా నిర్వహించారు. గూడెం గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, గురుస్వాములు చిద్రాల నారాయణ, అంబటి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, భూమయ్య, తాజా సర్పంచులు కేతిరెడ్డి గంగజల, చీటి స్వరూపారాణి, ఎంపీడీఓ రామకృష్ణ, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.


