Jagitial District News
-
నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
● ఎస్పీ అశోక్కుమార్సారంగాపూర్(జగిత్యాల): నేరాల నియంత్రణే ల క్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ అశోక్కుమా ర్ సూచించారు. శుక్రవారం సారంగాపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 1993లో మండలంలోని బట్టపల్లి–నేరెళ్ల గ్రామాల మధ్య జరి గిన నక్సల్స్ మందుపాతరలో ప్రాణాలు కోల్పోయి న కానిస్టేబుల్ రాజయ్య విగ్రహానికి పూలమాల వే సి నివాళి అర్పించారు. అనంతరం పోలీసులతో ని ర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోలీస్స్టేష న్కు వచ్చే బాధితులకు భరోసా కల్పిస్తూ సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పా త నేరస్తులపై నిఘా పెంచాలని, నేరాలు ఎక్కువ జ రిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఆధునిక టెక్నాలజీపై అవగాహన ఉండాలని, గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి పెట్టి గ్రామాలను తరచూ సందర్శించాలని పేర్కొన్నా రు. ఠాణాలోని రికార్డు, రైటర్ రూంలు పరిశీలించి ఎస్సైతో పాటు, సిబ్బంది పనితీరుపై అభినందించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రఘుచందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీని వాస్, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సైలు దత్తాద్రి, కుమారస్వామి, సదాకర్, సుధీర్రావు, సిబ్బంది ఉన్నారు. -
జీవనోపాధి మెరుగుపరిచేందుకే ‘ఉన్నతి’
మెట్పల్లిరూరల్(కోరుట్ల): ఉపాధి కూలీల కుటుంబాల్లో జీవనోపాధి మెరుగుపరిచేందుకే కేంద్ర ప్రభుత్వం ఉన్నతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని డీఆర్డీవో పీడీ రఘువరన్ అన్నారు. మెట్పల్లి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉపాధి కోసం చిరుధాన్యాలతో ఆహారపదార్థాల తయారీ శిక్షణ పూర్తిచేసుకున్న మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన 35 మంది కూలీలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. శిక్షణ సమయంలో వీరికి ఉచితంగా వసతి, భోజన సౌకర్యం కల్పిస్తూ పారితోషికం అందజేసినట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో మహేశ్వర్రెడ్డి, జేడీఎం ఈజీఎం విజయభారతి, ఏపీవో కొమురయ్య, ఏపీఎం విమోచన, ఎస్బీఐ ఆర్ఎస్ ఈటీఐ శిక్షకురాలు స్వప్న, ఈజీఎం సిబ్బంది అపర్ణ, భూమేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సర్దుబాటు
● మెరుగైన విద్య కోసం.. విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. ● చర్యలు తీసుకుంటున్న అధికారులుజగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల విద్య మెరుగుపడిందని చెప్పొచ్చు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే నాలుగో స్థానం సాధించింది. మొదటి స్థానం చేరుకునేందుకు విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న చోట టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పూర్తిస్థాయి అడ్మిషన్లు అయ్యాక పిల్లల సంఖ్యను బట్టి మళ్లీ సర్దుబాటు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ సర్దుబాటును కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. చాలాచోట్ల విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో లేకుండా ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే సర్దుబాటు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. పరస్పర బదిలీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వొద్దన్న ఆదేశాలున్నాయి. ఉత్తర్వులు ఇలా.. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే అవకాశముంది. 10 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలకు ఒకరు, 60లోపు ఉంటే ఇద్దరు, 90 లోపు ఉంటే ముగ్గురు, 120లోపు ఉంటే నలుగురు, 150 వరకు ఐదుగురు, 200లోపు విద్యార్థులుంటే ఆరుగురు, 200 దాటిన తర్వాత ప్రతి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బడిబాటతో విద్యార్థుల సంఖ్య పెరిగేనా..? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు కసరత్తు చేస్తున్నారు. మెరుగైన ఫలితాలు రావడంతో ఈసారి విద్యార్థుల సంఖ్య అత్యధికంగా పెరిగే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందని అవగాహన కల్పిస్తున్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయులుస్కూల్ అసిస్టెంట్లు సోషల్ 300ఫిజికల్ డైరెక్టర్స్ 112మొత్తం 3,612మ్యాథ్స్ 354ఫిజిక్స్ 281బయాలజి 275తెలుగు 309హిందీ 237ఇంగ్లిష్ 290పీజీ హెచ్ఎంలు 175ఎస్జీటీ (తెలుగు) 1,230ఎస్జీటీ (ఉర్దూ) 49మెరుగైన విద్య అందించాలనే.. విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపడుతున్నాం. గతంలోనూ ఇలాగే చేపట్టాం. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉన్నారు. విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ అనంతరం సర్దుబాటు చేపడతాం. – రాము, డీఈవో -
రైలు రగడ!
● తిరుపతి ప్రత్యేక రైలుపై రాజకీయ దుమారం ● వానాకాలంలో ఏసీ కోచ్లతో తిరుపతికి రైలు ● కానరాని జనరల్, స్లీపర్ కోచ్లు ● అధికస్టాపులు, ప్రయాణ సమయంపై ప్రయాణికుల పెదవి విరుపు ● వర్షాకాలంలో ఏసీ రైలుకు ఆదరణ ఉండేనా?సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తాజాగా దక్షిణ మధ్య రైల్వే తిరుపతి– కరీంనగర్ మార్గంలో వేసిన ప్రత్యేక రైలు 012761, 012762 ప్రారంభానికి ముందే రాజకీయ రంగు పులుముకుంది. ఈ ప్రత్యేక రైలు తమ వల్ల వచ్చిందని బీజేపీ, కాదు తామే తెచ్చామని కాంగ్రెస్ పార్టీలు ఘనతను చాటుకుంటున్నాయి. ఈ విషయంలో ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్గాల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ రైలు విషయంలో రాజకీయాలు కాసేపు పక్కనబెడితే సదుపాయాలపై ప్రయాణికులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ రైలు జూలైలో ప్రతీ ఆదివారం రాత్రి 7.45 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి.. సోమవారం ఉదయం 10గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్లో బయల్దేరి, మంగళవారం ఉదయం 8.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జూలైలో తిరుపతి భక్తుల కోసం మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల అసంతృప్తి ఈ ప్రత్యేక వీక్లీ హంసఫర్ 02761/62 ఏసీ రైలుకు 16 స్టాపులు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైలులో కేవలం 3వ శ్రేణి శీతల బోగీలే. స్లీపర్, జనరల్ బోగీలు లేవు. జూలైలో జోరుగా వానలు కురుస్తాయి. వర్షాకాలంలో థర్డ్ ఏసీ ప్రయాణానికి తక్కువగా మొగ్గు చూపుతారు. పైగా రిజర్వేషన్ చార్జీలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతికి నడుస్తోన్న రెగ్యులర్ బై వీక్లీ 12762/61 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు కేవలం 12స్టాప్లే. ఇందులో 3వ శ్రేణి, 2 వ శ్రేణి ఏసీ బోగీలతో పాటు, సాధారణ బోగీలు, స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి. బైవీక్లీ రైలు కన్నా హంసఫర్ రైలు ప్రయాణం దాదాపు 3 గంటలు అధికంగా ఉండటం గమనార్హం. 02762 ఏసీ ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్ ధర రూ.1355. కరీంనగర్ నుంచి తిరుపతి రెగ్యులర్ బై వీక్లీ 12762 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్ ధర రూ.1100. రెండింటి మధ్య వ్యత్యాసం రూ.255. ఏదైనా రెగ్యులర్ రైలు వెనుక నుంచి వస్తుంది అంటే ప్రత్యేక రైళ్లను ఒక చోట ఆపి వాటిని పంపిస్తారు. ప్రత్యేక రైళ్లు సమయ పాలన పాటించడం అరుదనే చెప్పాలి. విఫల ప్రయోగంగా జూలైలో ఏసీ రైలు వేయడం అందులోనూ మొత్తం బోగీలు థర్డ్ ఏసీ వేయడంపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఏళ్లుగా తిరుపతి రైలును రెగ్యులర్ చేయమంటే.. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య లేదని సమాధానమిస్తున్నారు. తీరా వర్షాకలంలో ఏసీ రైలు వేయడం, జనరల్ స్లీపర్ లేకుండా థర్డ్ ఏసీ వేయడంతో ఆక్యుపెన్సీ రేషియో భారీగా పడిపోతుందని, దీన్ని సాకుగా చూపి భవిష్యత్తులో తిరుపతి రైలును రెగ్యులర్గా చూపించరేమోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
● విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు ● చిన్నపాటి గొడవలతో దూరం
జగిత్యాలక్రైం: ప్రస్తుత సమాజంలో బంధాలు బహుదూరమైపోతున్నాయి. ఒకప్పుడు అమ్మానాన్న, అన్న, తమ్ముడు, చెల్లె, బావ, అక్క, బావ, వదినె, మరుదలు, చిన్నమ్మ, చిన్నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న.. ఇలా బంధుత్వాలు బలంగా ఉండేవి. ఒకరికి ఏదైనా ఆపద వచ్చినా అందరూ మేమున్నామంటూ ధైర్యం చెబుతూ ఆదుకునేవారు. ఆత్మీయులు మృతిచెందితే ఆ కుటుంబానికి వెన్నంటి ఉండి వారిని ఓదార్చి మనోధైర్యం నింపేవారు. కానీ, ప్రస్తుతం ఆస్తిపాస్తులు, చిన్నపాటి గొడవలతో హత్యలకు పూనుకుంటున్నారు. ఆత్మీయులు దూరం ఒకప్పుడు ఎవరైనా అనారోగ్యంతో మృతిచెందినా, ప్రమాదాల్లో గాయపడినా వారి బంధువులు ఆ కుటుంబానికి ధైర్యంగా నిలబడేవారు. ప్రస్తుతం హత్యలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కుటుంబాన్ని నెట్టుకొచ్చే వ్యక్తి, పిల్లల లాలనను చూసే తల్లి లేకపోవడం, కొంత మంది చిన్నారులు తల్లిదండ్రులకు దూరమవుతూ మనోవేదనకు గురవుతున్నారు. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులు దూరమవడం పిల్లల భవిష్యత్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే చిన్నపాటి కుటుంబ తగాదాలతో కుటుంబాన్నే వద్దనుకుని తన జీవితం తనదని అందరినీ వదిలివెళ్లి రహస్య జీవితాలు గడుపుతుండగా, వారి రక్తసంబంధీకుల మనోవేదన అంతా ఇంత కాదు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అని వేదనతో రోజులు గడుపుతున్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
జగిత్యాలరూరల్/మల్యాల: భూ సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి, ధర్మారం, మల్యాల మండలం రామన్నపేట గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. కాగా మల్యాల మండలం రామన్నపేట, నూకపల్లి గ్రామాల మధ్య సర్వే నంబర్ల వివాదం చెలరేగుతోందని, రామన్నపేట పరిధిలోని సర్వే నంబర్ల గెజిట్ పత్రం తమకు అందజేయాలని కోరుతూ వెల్మ లక్ష్మారెడ్డి తదితరులు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ శ్రీనివాస్, డీటీలు అరుణ్కుమార్, నీత, ఆర్ఐలు భూమయ్య, శంషోద్దీన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాల: నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 9వ వార్డులో రూ.11 లక్షలతో నిర్మించే డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, హనుమాన్వాడ, పోచమ్మవాడ, శంకులపల్లిలో నీటి కొరత లేకుండా ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇటీవల రూ.50 కోట్లు మంజూరు కాగా, ఏయే పనులు కేటాయించాలో జీవోలో సైతం ఇవ్వడం జరిగిందని, మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ చైర్పర్సన్ జ్యోతి, గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆహ్వానం జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించే క్రీడా పోటీల ప్రారంభానికి హాజరుకావాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్కు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే పెద్దమ్మతల్లి బోనాల జాతర సందర్భంగా వీధిదీపాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు ముదిరాజ్ సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. వెంటనే కమిషనర్తో మాట్లాడి పనులు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ పంబాల రాము, అధ్యక్షుడు నీలం పెద్దులు, ఉపాధ్యక్షుడు రాజేశ్, ప్రధాన కార్యదర్శి కట్ట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
జగిత్యాల/మల్లాపూర్: పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం చేపట్టగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పనితీరును పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేయాలి ప్రభుత్వ బడులల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండలం హుస్సెన్నగర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అలాగే మండలంలోని మొగిలిపేట ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. సర్కార్ బడులపై విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా ఉపాధ్యాయుడు రాజేందర్ తన పిల్లలను పాఠశాలలో చేర్పించడం అభినందనీయమని కొనియాడారు. ప్రజల్లో నాటుకపోయిన అపోహాలను తొలగించేందుకు ఉపాధ్యాయులు తమ పిల్లలను తాము పనిచేసే చోటనే చేర్పించడం వంటి చర్యలు దోహదపడుతాయన్నారు. ఇటీవల ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమాల్లో జిల్లా సెక్టోరియల్ అధికారి మహేశ్, ఎంఈవో దామెదర్రెడ్డి, హెచ్ఎంలు భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడుల మనుగడ
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 240 యూనిట్ల టాయిలెట్స్, 98 కిచెన్షెడ్స్ను కలెక్టర్ సత్యప్రసాద్ మంజూరు చేయగా ఎస్టీయూ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులు సైతం బాధ్యతగా విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ఆదేశించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ ఉన్నారు. యూరియా దొరుకుతుందో.. లేదోనని..మెట్పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి విశాల సహకార సంఘం పరిధిలోని వెల్లుల గ్రామానికి గురువారం ఒక లారీ లోడ్ యూరియా, శుక్రవారం ఉదయం రెండు లారీల లోడ్ యూరియా వచ్చింది. అయితే వాటిని గోదాంలో భద్రపరుస్తుండగా విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమకు యూరియా బస్తాలు అందుతాయో లేదోనని ఆందోళనకు గురై, తమకు యూరియా ఇవ్వాలని సహకార సిబ్బందిని కోరారు. రైతుల వినతిని పరిగణనలోకి తీసుకున్న సిబ్బంది క్యూలో ఉండాలని పంపిణీ చేస్తామని సూచించారు. దీంతో రైతులు వెంట తెచ్చుకున్న ఆధార్, పాస్బుక్ జిరాక్స్లు వరుసలో ఉంచి యూరియా కోసం వేచి చూశారు. ఇదిలా ఉండగా పలువురు రైతులు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కొరత ఎన్నడు లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆరోపించారు. ఈ విషయంపై సహకార సంఘం చైర్మన్ కొమిరెడ్డి తిరుపతిరెడ్డిని అడుగగా, యూరియా కొరత అవాస్తవమని చెప్పారు. లారీల్లో వచ్చిన యూరియా బస్తాలను గోదాంలో భద్రపరుస్తుండగా రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారని, దీంతో ముందుగానే పంపిణీ చేయాల్సి వచ్చిందన్నారు. క్షీరాభిషేకం.. పుష్పాలంకరణధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలతో అలంకరించారు. అర్చకుడు శ్రీనివాసచార్యులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘కొప్పుల ఒక ప్రస్థానం’ పుస్తకావిష్కరణజగిత్యాల: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై రూపొందించిన ‘కొప్పుల ఒక ప్రస్థానం’ పుస్తకాన్ని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక కార్మికుడి ప్రస్థానం నుంచి అనేక పోరాటాలు, విజయాలు, రాజకీయ, సామాజిక అంశాలపై పుస్తకం రూపొందించడం అభినందనీయమన్నారు. మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ బాపురెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
డబుల్బెడ్రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలి
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: డబుల్బెడ్రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. డ్రెయినేజీ, విద్యుత్, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. స్కూల్ కమ్యునిటీ హాల్, అంగన్వాడీ కేంద్రం, హెల్త్ సెంటర్కు స్థలం గుర్తించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన, హౌసింగ్ డీఈ ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా 17వ వార్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సీసీరోడ్లు, డ్రైనేజీలను నాణ్యతగా చేపట్టాలన్నారు. ఎమ్మెల్యేను డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులు కలిశారు. నూకపల్లి జ్ఞాన విజ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వేణుగోపాల్రావు, దివాకర్రావు, సత్తయ్య పాల్గొన్నారు. -
హైకోర్టు జడ్జిని అందించిన జోగిన్పెల్లి స్కూల్
కోరుట్ల రూరల్: మండలంలోని జోగిన్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివిన గ్రామానికి చెందిన ఏనుగు సంతోష్ రెడ్డి హైకోర్టు జడ్జిగా ఎదిగారు. రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. జిల్లా డిప్యూటీ సీఈఓ పల్లికొండ నరేశ్, పిల్లల వైద్య నిపుణుడు బూరుగు నారాయణ, శ్రీరాంసాగర్ చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఏనుగు రాజరెడ్డి ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది ప్రభుత్వ ఉపాద్యాయులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, బ్యాంకు అధికారులుగా ఎదిగారు. వందలాది మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తూ పాఠశాల పేరును నిలబెడుతున్నారు. -
ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు
జగిత్యాల: ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు ఇంటర్ బోర్డు పరిశీలకులు వెంకటేశ్వర్రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించి పోస్టర్ ఆవిష్కరించారు. కళాశాలల్లో లెక్చరర్లు అడ్మిషన్ల లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఇంటర్ బోర్డు కమాండ్ సెంటర్ నుంచి ప్రతి అధ్యాపకుడి బోధన తీరును పరిశీలిస్తామని వెల్లడించారు. అధ్యాపకులు 90రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు బోధించాలని పేర్కొన్నారు. కళాశాలలో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, క్రీడల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఎఫ్ఆర్సీ అమలు చేస్తామన్నారు. కేర్ టేకర్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ, ప్రిన్సిపల్ అలియా మక్సూద్, కె.నాగభూషణం, జూనియర్ లెక్చరర్ల సంఘం 475 అధ్యక్షుడు కె.తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. -
మూడేళ్ల అనంతరం తెరుచుకున్న పాఠశాలలు
జగిత్యాల: ఆ పాఠశాలలో మూడేళ్లుగా ఒక్క విద్యార్థి కూడా లేడు. దీంతోపాటు పలు కారణాలతో బడులను మూసివేశారు. జిల్లాలో మూతపడిన పాఠశాలలు 61 వరకు ఉన్నాయి. ఇందులో మూడేళ్లుగా చేరికలే లేవు. ఈ ఏడాది నిర్వహించిన బడిబాటలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు వెల్గటూర్ మండలం వెంకట్రావ్పేట, కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు చేరడంతో ఆ పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. మూడేళ్ల తర్వాత పాఠశాలలు తెరుచుకోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల కృషి ఫలితమే పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే మళ్లీ తెరుచుకున్నాయని డీఈవో రాము తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో వసతులతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా చూడాలని, కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతుందని చెప్పారు. -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ‘తుమ్మల’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావును నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ల ఇన్చార్జీ బాధ్యతల్లో ఎలాంటి మార్పు జరగలేదు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జీ మంత్రిగా శ్రీధర్బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రిగా పొన్నం ప్రభాకర్లను కొనసాగించారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్కుమార్ను నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రిగా నియమించారు. ● ‘అడ్లూరి’కి నల్గొండ జిల్లా బాధ్యతలు -
బీర్పూర్లో తెరుచుకోని నాలుగు పాఠశాలలు
● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ సారంగాపూర్: బీర్పూర్ మండలంలోని నాలుగు పాఠశాలలు గురువారం పలు కారణాలతో తెరుచుకోలేదు. దీంతో మండల విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. రంగసాగర్ ప్రాథమిక పాఠశాల గ్రామానికి దూరంగా ఉందంటూ అక్కడి విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆ విద్యార్థులను ఆటోలో బీర్పూర్ ప్రాథమిక పాఠశాలకు తరలించారు. రంగసాగర్ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్పై రేకులపల్లి పాఠశాలకు పంపించారు. మంగేళ ఎస్సీ కాలనీ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో అక్కడి విద్యార్థులను అదే గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు పంపించారు. తుంగూర్ కొత్తపేట పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉన్నా.. అక్కడ ఉపాధ్యాయుడు లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలకు పంపించారు. ఈ స్కూల్లో ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. గంగసముద్రం పాఠశాల ఏడాదికాలంగా మూతపడడంతో గంగసముద్రం, సిరుపురం గ్రామాల విద్యార్థులను బీర్పూర్ ఎంపీపీఎస్ పాఠశాలకు తరలించామని ఎంఈవో నాగభూషణం తెలిపారు. -
బడి గంటలు మోగిన వేళ..
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చాలాచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తాయి. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏసీబీ అధికారులు సోదాలు చేసి న ఇరిగేషన్ అధికారి శ్రీధర్ ఇరిగేషన్ క్యాడ్ డివిజన్– 8 ఈఈగా పనిచేస్తున్నారు.8లోu శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2025రాయికల్: పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. మొదటిరోజు పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఆసక్తి చూపలేదు. స్వయంగా ఉపాధ్యాయులే విద్యార్థుల వద్దకు వెళ్లి తమ వాహనాల్లో తీసుకెళ్లడం కనిపించింది. పాఠశాలకు వచ్చిన చిన్నారులు ఏడ్వడంతో ఉపాధ్యాయులు బుజ్జగించాల్సి వచ్చింది. న్యూస్రీల్ -
రాజీకొస్తేనే మనశ్శాంతి
జగిత్యాలజోన్: జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఉన్న కేసులను ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని, తద్వారా కక్షిదారులు మనశ్శాంతి పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో రాజీకి వీలున్న సివిల్, క్రిమినల్ కేసుల్లోని 3,559 కక్షిదారులకు నోటీసులు పంపించామన్నారు. అన్ని కోర్టులో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు పోలీసులు, న్యాయవాదులతో చర్చించామని తెలిపారు. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 845 క్రిమినల్ కేసులు రాజీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. మోటార్ వాహనాలు, డ్రంకెన్డ్రైవ్, పిటీ కేసులతోపాటు కోర్టు వరకూ రాని ఫ్రీలిటిగేషన్ కేసులు పరిష్కరిస్తామని వివరించారు. ప్రతి కోర్టులో లోక్ అదాలత్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని, లోక్ అదాలత్నాడే కాకుండా.. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరిస్తామని వెల్లడించారు. లోక్ అదాలత్లో కేసు పరిష్కరించుకుంటే కోర్టు ఫీజు వాపస్ ఇస్తారని, తీర్పులపై అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. లోక్ అదాలత్కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కోర్టులోని న్యాయ సేవాసంస్థ కార్యదర్శిని సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో సబ్ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి మల్లిక్ వెంకట సుబ్రహ్మాణ్యశర్మ పాల్గొన్నారు. -
60 ఏళ్లుగా విద్యనందిస్తున్న పాఠశాల
● ఎంతో మందిని తీర్చిదిద్దిన పాఠశాలజగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ తర్వాత అంతటి పేరుగాంచింది న్యూ హైస్కూల్. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రభుత్వ పాఠశాలలో చాలామంది ప్రముఖులు చదువుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త మంచాల కృష్ణ, హైకోర్టు జడ్జి సంతోష్రెడ్డి, అమూల్ డైయిరీ రాంమోహన్రావు.. ఇలా చాలామంది ఈ పాఠశాలలో చదువుకున్న వారే. జిల్లా కేంద్రంలోని తీన్ఖని ప్రాంతంలో ఉన్న ఈ హైస్కూల్లో ప్రస్తుతం 300కు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల అదనపు తరగతి గదులు కూడా నిర్మించారు. -
ఫిట్నెస్ లేకుంటే వాహనాలు సీజ్
జగిత్యాలక్రైం: వాహనాలకు ఫిట్నెస్ లేకుంటే సీజ్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి భద్రునాయక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, ధర్మపురి రోడ్, గొల్లపల్లి రోడ్లో వాహనాల తనిఖీ చేపట్టారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు. వాహనదారులు వాహన ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. ఎంవీఐ ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు. ప్రణాళికతో చదివి లక్ష్యం చేరాలిమెట్పల్లి: ప్రణాళిక ప్రకారం చదివితే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరవచ్చని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని గ్రంథాలయాన్ని గురువారం సందర్శించారు. పోటీ పరీక్షలకు ప్రిపెర్ అవుతున్న అభ్యర్థులతో కాసేపు ముచ్చటించారు.అభ్యర్థులు భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. గ్రంథాలయంలో సౌకర్యాలపై ఆరా తీశారు. అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కొండగట్టుకు అంతరాయం లేని విద్యుత్మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయానికి విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశామని సాలియా నాయక్ అన్నారు. కొండగట్టు సబ్స్టేషన్ నుంచి 5ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన గురువారం ప్రారంభించారు. ట్రాన్స్ఫార్మర్తో అధిక లోడ్ భారం తగ్గుతుందని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అవుతుందని వివరించారు. డీఈఈ రాజిరెడ్డి, రవీందర్, ఏడీఈ మహేందర్, రాజు, దయానంద్, రహీం, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యవెల్గటూర్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన సాధ్యమని డీఈవో కె.రాము అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి, వెంకటాపూర్లో విద్యార్థులు లేక మూతబడిన ప్రాథమిక పాఠశాలలను గురువారం పునఃప్రారంభించారు. వెంకటాపూర్లో ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, సమగ్ర శిక్ష జిల్లా సెక్టోరియల్ అధికారులు సత్యనారాయణ, రాజేశ్, ఎంఈవో ప్రభాకర్, హెచ్ఎంలు సందయ్య, అరుణ, సంపత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ–పాస్తోనే ఎరువులు విక్రయించాలిమల్యాల: రైతులకు రసాయన ఎరువులను ఈ–పాస్ ద్వారానే విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి వి.భాస్కర్ అన్నారు. గురువారం ఏవో కె.చంద్రదీపక్తో కలిసి పలు ఎరువుల దుకాణాలను పరిశీలించారు. డీలర్లు రశీదులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాలతో భూసారం పెరుగుతుందని పేర్కొన్నారు. ముత్యంపేటలో జీలుగ, జనుము సాగు చేసిన రైతుల పొలాలను సందర్శించారు. దున్నేటప్పుడు సింగిల్ సూపర్ పాస్పేట్ను ఎకరానికి 50కిలోలు వేయాలని సూచించారు. వారి వెంట ఏఈఓ కారుణ్యకుమార్, రైతులు పాల్గొన్నారు. -
ఆదర్శం ఈ ఉపాధ్యాయుడు● పనిచేస్తున్న పాఠశాలలోనే కుమారుడిని చేర్పించిన రాజేందర్
మల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటూ ప్రచారం చేయడమే కాదు.. దానిని అనుసరించారు మండలంలోని మొగిలిపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బబ్బురి రాజేందర్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు సరిగా చెప్పరనే దురాభిప్రాయాన్ని తొలగించేందుకు తన కుమారుడిని ఆయన పనిచేస్తున్న పాఠశాలలోనే గురువారం చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ధర్మపురి నుంచే మొక్కలు నాటుతాంధర్మపురి: ధర్మపురి నియోజకవర్గం నుంచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఇటీవల మరణించిన వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకుని వాశ్విన్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ ఆధ్వర్యంలో ఏటా లక్ష మొక్కలు నాటాలని సంకల్పించారు. ఇందుల భాగంగా మంత్రి లక్ష్మణ్కుమార్ మొదట తన అధికారిక నివాసంలో మొదటి మొక్కను నాటారు. -
2024–25 వానాకాలం సీజన్ సీఎమ్మార్(మెట్రిక్ టన్నుల్లో)
జిల్లా ఇచ్చిన ధాన్యం ఇవ్వాల్సినబియ్యం ఇచ్చింది శాతం పెద్దపల్లి 2,97,379 1,99,750 1,80,487 90 కరీంనగర్ 2,60,679 1,75,589 1,43,946 82 జగిత్యాల 3,08,271 2,08,277 1,19,642 57 సిరిసిల్ల 2,11,572 1,42,327 61,364 43 సాక్షి, పెద్దపల్లి: రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ (సీఎమ్మార్– మర ఆడించి) చేసి బియ్యంగా ఇవ్వడంలో ఇన్నాళ్లూ జాప్యం చేస్తూ వచ్చిన రైస్ మిల్లర్లు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దిగొస్తున్నారు. సీఎమ్మార్పై ప్రత్యేకంగా దృష్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గ్యారెంటీ బాండ్లు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయింపులు చేస్తుండడంతో మిల్లర్లు దారికొస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఇటీవల సన్నబియాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుండడంతో రీసైక్లింగ్ దందాకు చెక్పెట్టినట్లు అయ్యింది. దీంతో పెద్దపల్లి జిల్లా 90శాతంతో రాష్ట్రంలో రెండోస్థానంలో ఉండగా, కరీంనగర్ నాలుగో స్థానంలో నిలిచాయి. అయితే, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సీఎమ్మార్ డెలివరీ చేయడంలో వెనకబడ్డాయి. బ్యాంక్ గ్యారెంటీ షరతు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం మిల్లర్లకు ఇస్తోంది. మిల్లర్లు ఒక క్వింటాల్ వడ్లు తీసుకుంటే 68 కిలోల బాయిల్డ్రైస్, 67 కిలోల రారైస్ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అవసరమైన రేషన్బియ్యం కోటా తీసుకొని మిగిలిన బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్సీఐకి అప్పగించాలి. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఇప్పటిదాకా తమ ఆర్థికాభివృద్ధికి వినియోగించుకునేవారు. బియ్యం అప్పగించకుండానే ధాన్యాన్ని విక్రయించి ఆ డబ్బతో వ్యాపారాలు నిర్వహించేవారు. రూ.కోట్ల విలువైన ధాన్యం రైస్మిల్లర్లుకు వరంగా మారినా అధికారులు పటిచుకోలేదన్న ఆరోపణలున్నాయి. దీంతోనే మిల్లర్లు సీఎమ్మార్ ఇవ్వడంలో జాప్యం చేసేవారు. ప్రస్తుతం టాస్క్ఫోర్స్, రెవెన్యూ, సివిల్ సప్లయీస్, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టడం, కేసులు నమోదు చేయడంతోపాటు ఆస్తుల జప్తుకూ వెనుకాడడం లేదు. దీంతోపాటు, సీమ్మార్ డిఫాల్ట్ను నివారించడానికి బాండ్లు ఇచ్చినవారికే ధాన్యం కేటాయింపులు చేశారు. సర్కారు ధాన్యాన్ని ఇప్పటికే విక్రయించిన మిల్లర్లు ఇప్పుడు బయట వడ్లు సేకరించి మరీ మిల్లింగ్ చేసి సర్కారుకు బియ్యం ఇస్తున్నారు. దీంతో సీఎమ్మార్ డెలివరీ వేగవంతమైంది. రికార్డు నమోదు రైస్మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యం ప్రకారం సీఎమ్మార్ను త్వరగా పూర్తి చేయాలి. గత వానాకాలం మిల్లింగ్ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా తీసుకున్న చర్యలతో సీఎమ్మార్ను వేగంగా సేకరించగలిగాం. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా రెండో స్థానంలో ఉంది. – శ్రీకాంత్రెడ్డి, డీఏం, జిల్లా పౌర సరఫరాలు -
అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా..
జగిత్యాలటౌన్: కార్యకర్తల కృషి, ఆశీర్వాదంతోనే తనకు మంత్రి పదవి దక్కిందని, అందరిలో ఒకడిలా ఉంటూ అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మొదటిసారి జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయనకు మాజీమంత్రి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ముందుగా మంత్రి రాజీవ్గాంధీ, ఇందిరాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సన్మాన సభలో మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతిఒక్కరూ నిజాయితీతో పనిచేయాలని సూచించారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన జీవన్రెడ్డి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. జీవన్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా.. విప్గా లక్ష్మణ్కుమార్ సమర్థవంతంగా పనిచేశారని, మంత్రిగా మరిన్ని సేవలు అందించాలని కోరారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదిగి కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. మంత్రి కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, బండ శంకర్, కొత్త మోహన్, తాటిపర్తి విజయలక్ష్మి, గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని మంత్రి తెలిపారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. పురోహితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. ఉద్యోగ, కుల సంఘాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని సన్మానించారు. అందరి కృషి, ఆశీర్వాదంతోనే మంత్రి పదవి సన్మాన సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
భయంగా ఉన్నా.. ఆనందమే
– జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత స్కూల్కు వెళ్తున్న తొలిరోజుల్లో కొద్దిగా భయం ఉనిపించినా.. ఆ ఆనందమే వేరు. కొత్తబుక్స్, డ్రెస్లు కొనిస్తారు. నేను జగిత్యాల రూరల్ మండలం గోపులాపూర్ జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్నాను. అమ్మ రాజమణి, నాన్న నారాయణ ప్రతిరోజూ స్కూల్లో దింపేవారు. ఇష్టంగానే పాఠశాలకు వెళ్లేదానిని. ఆ రోజులను మరిచిపోలేం. ప్రతిఒక్కరూ స్కూల్కు వెళ్లి ఉన్నతస్థాయికి చేరి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. -
‘రోల్లవాగు’ అనుమతికి మరింత సమయం
సారంగాపూర్: రోల్లవాగు ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురువుతున్న అటవీభూములకు అటవీశాఖతోపాటు కేంద్రం పర్యావరణ అనుమతి రావాల్సి ఉందని, ఇందుకు సమయం పడుతుందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సువర్ణ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి బీర్పూర్ శివారులోని ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అటవీశాఖ భూములు 800ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని ఇంజినీరింగ్, అటవీశాఖ అధికారులు వివరించారు. ప్రాజెక్టు సమీపంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ ఫారెస్ట్ అభయారణ్యం ఉందని, ఇందుకు పర్యావరణ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. వారి వెంట చీఫ్ కన్జర్వేటర్ శర్వానంద్, డీఎఫ్వో రవిప్రసాద్, ఈఈ నారాయణరెడ్డి, డీఈ చక్రూనాయక్ తదితరులు ఉన్నారు. సువర్ణను కలిసిన కలెక్టర్ జగిత్యాల: రోల్లవాగు పరిశీలనకు వచ్చిన సువర్ణను జగిత్యాలలోని గెస్ట్హౌస్లో కలెక్టర్ సత్యప్రసాద్ కలిశారు. ప్రాజెక్ట్ గురించి చర్చించారు. -
పాఠశాలలో ఎన్నో నేర్చుకున్నం
పైడిమడుగు ఉన్నత పాఠశాలలో 6, 7 తరగతులు చదువుకున్నా. ఆ రెండేళ్లు అనేక జీవిత పాఠాలు నేర్చుకున్నాను. ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థుల పట్ల చూపిన శ్రద్ధ ఇప్పుడు ఎంతోమందిని ఉన్నత స్థానాల్లో నిలిపింది. – కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే, పూర్వ విద్యార్థి క్రమశిక్షణతోనే ఈ స్థాయికి పైడిమడుగులో 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఉపాధ్యాయులు చిన్ననాటి నుంచే చక్కని క్రమశిక్షణ అలవాటు చేశారు. అదే స్ఫూర్తి, పట్టుదలతో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాను. ఎంతోమందికి విద్య నేర్పే అవకాశం వచ్చింది. మా ఊరు పాఠశాలను ఎ్పటికీ మరిచిపోను. – పిన్నంశెట్టి శ్రీనివాస్, రిటైర్డ్ ఎంఈఓ -
నాన్నతో వెళ్లేవాడిని
– మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల నా చదువంతా గంగాధరలోసాగింది. స్కూల్కు నాన్న మల్లయ్యనే తీసుకెళ్లేవారు. ఆనందంగా ఉండేది. ఆ ఉత్సాహం వేరేగా ఉంటుంది. ఉపాధ్యాయులు ఎంతో ప్రేమగా చదువు చెప్పేవారు. నాన్ననే రోజూ తీసుకెళ్లేవారు. ఉపాధ్యాయుల చొరవతో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోంది. డిజిటల్ బోర్డులు, కంప్యూటర్స్, ల్యాబ్స్ ఎన్నో వచ్చాయి. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలి. చదువుతోనే భవిష్యత్. -
అడగండి... అడుగేయండి
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే ముందు తల్లిదండ్రులు ఆచితూచీ అడుగేయాల్సిన అవసరం ఉంది. ఆ స్కూల్ ఎలాంటిది? గతంలో స్కూల్ విద్యార్థులు సాధించిన ఫలితాలు ఎలా ఉన్నాయి? ఫీజుల వివరాలు, తల్లిదండ్రులతో యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుంది? అనే వివరాలు గమనించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేది పాఠశాలే కాబట్టి.. ఆలోచించి అడుగేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. జిల్లాలో 120 గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. నేటి నుంచి పాఠశాలలు పునర్ప్రారంభం కానుండడంతో ఇప్పటికే జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. హంగు ఆర్భాటాలతో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉపాధ్యాయులను ఇళ్లకు పంపిస్తూ పిల్లలను తమ బడిలో చేర్పించాలని కోరుతున్నారు. అనుమతులు ఉన్నాయా.. ప్రైవేటు పాఠశాల తమ వివరాలను విద్యాశాఖ కార్యాలయంలో నమోదు చేసుకొని ఉంటుంది. వారికి నిర్ధిష్ట సంఖ్య, నమోదైన సంవత్సరంతో కూడిన పత్రాన్ని ఇస్తారు. దీన్ని పరిశీలించాకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలి. కొన్ని పాఠశాలలు 1–7, 8–10 తరగతుల వరకు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నోటీస్ బోర్డుపై ఇవి ఉన్నాయా..? మీరు చేర్పించబోయే ప్రైవేటు పాఠశాలలోని బోధన సిబ్బంది అర్హతలు ఎలా ఉన్నాయో గమనించాలి. అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారా? అనేది ఆరా తీయాలి. బీఈడీ, డీఈడీ వంటి విద్యార్హతలు గల వారితో విద్యాబోధన చేస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ఉపాధ్యాయుల వివరాలు, అర్హతలను ప్రభుత్వ పాఠశాలలో మాదిరిగా ప్రైవేటు పాఠశాల నోటీస్ బోర్డుపై ప్రదర్శించారో.. లేదో చూడాలి. ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయి? ఫీజుల్లో పారదర్శకత ఉందా.. అడిగి తెలుసుకోవాలి. వసతులపై దృష్టి పెట్టండి మెరుగైన ఫలితాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి పఠనాసక్తి కలిగించే ఎలాంటి అంశాలు అమలు చేస్తున్నారో అడగాలి. స్కూల్లో లైబ్రరీ, ప్లేగ్రౌండ్, టాయిలెట్స్.. తాగునీటి వసతుల గురించి తెలుసుకోవాలి. ఇన్నోవేటీవ్ అంశాలపై.. పాఠశాలలో ఇన్నోవేటివ్ అంశాలు నేర్పిస్తున్నారా.. కొత్త విషయాలను విద్యార్థులకు తెలిసేలా తరగతులు నిర్వహిస్తున్నారా.. తెలుసుకోవాలి. గతంలో వైజ్ఞానిక ప్రదర్శనలు.. ఇన్స్పైర్ మానక్, సైన్స్మేళాల్లో భాగస్వామ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని, ప్రతిభ చాటే వారిని ఎలా ప్రోత్సాహం ఎలా ఉందో ఆరా తీయాలి. అలాంటి పాఠశాలలను తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవాలి. -
ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా చేస్తా
● 50 పడకల ఆసుపత్రి, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మిస్తా ● విద్యార్థినుల ఉన్నత విద్యకు సదుపాయాలు ● ధర్మపురి పుణ్యక్షేత్ర అభివృద్ధికి మాస్టర్ప్లాన్ ● ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: తనకు రాజకీయ జన్మనిచ్చిన ధర్మపురిని నియోకవర్గాన్ని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో పునర్జన్మనిచ్చిన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి రుణాన్ని తాను ఏనాడూ తీర్చుకోలేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నియోజకవర్గపరంగా మీ ప్రాధాన్యాలేంటి? అడ్లూరి: ధర్మపురి ప్రజలను, లక్ష్మీ నరసింహ స్వామిని జీవితంలో మర్చిపోను. ప్రజలు ఎమ్మెల్యేగా జన్మనిస్తే.. రోడ్డు ప్రమాదంలో స్వామి నన్ను కాపాడి పునర్జన్మనిచ్చారు. ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడినా నా అనుచరులు నా కోసమే పనిచేశారు. వారిరుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. మంత్రిగా నియోజకవర్గంలో సాగునీటికి తొలి ప్రాధాన్యం ఇస్తా. విద్య, వైద్యం, సదుపాయాలకు పెద్దపీట వేస్తా. ఇక్కడి విద్యార్థినులు డిగ్రీ, పీజీ కళాశాలలు లేక జగిత్యాల, కరీంనగర్ వెళ్తున్నారు. ధర్మపురిలో డిగ్రీ, పీజీ కళాశాలలతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయిస్తా. చారిత్రక ధర్మపురి పుణ్యక్షేత్రానికి చీకటిపడితే రవాణా సౌకర్యం లేదు. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. 50పడకల ఆసుపత్రి నిర్మిస్తా. ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా మారుస్తా. మంత్రిగా భవిష్యత్ ప్రణాళికలు? అడ్లూరి: తొలిసారి ఎమ్మెల్యే, ఆపై విప్.. ఇప్పుడు మంత్రి పదవి. పార్టీలో సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందనడానికి నాకు దక్కిన పదవులే నిదర్శనం. మంత్రి అయ్యాక మరింత బాధ్యత పెరిగింది. నాకు ప్రభుత్వం కేటాయించిన ఏ శాఖ కేటాయించినా 100శాతం న్యాయం చేస్తా. ప్రజా ఆకాంక్షల మేరకు పనిచేస్తా. ప్రతీ 30రోజులకు నా శాఖలోని పనులపై సమీక్ష చేపడతా. మీరు మంత్రి కావడంలో కుటుంబ పాత్ర? అడ్లూరి: నా భార్య కాంతకుమారి ప్రభుత్వ లెక్చరర్. నా రాజకీయ జీవితంలో ఆమె పాత్ర చాలా కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థికంగా ఇబ్బందులున్నా.. తన ఉద్యోగాన్ని, కెరీర్ను త్యాగం చేసి నాకు అండగా నిలిచింది. 2018లో ఓడిన సమయంలో నాలో ధైర్యం నింపింది. నా పిల్లలు కూడా వెంట నిలిచారు. వారి సహకారం మాటల్లో వర్ణించలేనిది. -
మక్క విత్తనాల సబ్సిడీకి మంగళం
● ఓపెన్ మార్కెట్లోనే హైబ్రిడ్ విత్తనాల కొనుగోలు ● కంపెనీలను బట్టి 4 కిలోల బస్తాకు రూ.1500 నుంచి రూ.2500 వరకు ● సబ్సిడీ లేక జిల్లా రైతులకు రూ.4కోట్ల మేర నష్టంజగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్లో జిల్లాలో అత్యధికంగా సాగు చేసే మొక్కజొన్న విత్తనాలకు ప్రభుత్వం మంగళం పాడింది. వరి విత్తనాల మా దిరిగా రైతులు తమ పంట నుండి వచ్చే మొక్కజొ న్న విత్తనాలు వాడుకుంటే దిగుబడులు రావు. దీంతో మక్క సాగు చేసే రైతులు ప్రైవేట్ కంపెనీల హై బ్రిడ్ విత్తనాలపైనే ఆధారపడుతున్నారు. దీంతో ఆ యా కంపెనీలు చెప్పిన ధరకు రైతులు ఓపెన్ మా ర్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పంటలోమూడు నెలల తర్వాత వచ్చే దిగుబడి ఏ మోగాని, విత్తనాల ఖర్చే తడిసి మోపెడవుతోంది. మొక్కజొన్నలపై కనీసం 33శాతం సబ్సిడీ లేక రైతులపై దాదాపురూ.4కోట్లఅదనపుభారంపడుతోంది. వైఎస్సార్ హయాంలో 33 శాతం సబ్సిడీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రైవేట్ కంపెనీలు విత్తనాలపై 33 శాతం సబ్సిడీ ఇచ్చేది. దీంతో రైతులు తమకు నచ్చిన కంపెనీ విత్తనాలు కొనుగోలు చేసి సబ్సిడీ పొందేవారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో సబ్సిడీ రద్దు అయ్యింది. దీనివల్ల జిల్లా రైతులపై అధిక భారం పడనుంది. జిల్లా మొత్తంగా దాదాపు 60 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారు. రైతులు ఎకరాకు 4 కిలోల విత్తనాలు వాడుతారు. దీన్ని బట్టి జిల్లాకు 2.40 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. 4 కిలోల బస్తాకే రూ.1500 నుంచి రూ.2500 రైతుల డిమాండ్ను ఆసరా చేసుకుని.. ప్రైవేట్ కంపెనీలు తమ విత్తనాలకు వివిధ పేర్లు పెట్టి నచ్చిన ధరకు అమ్ముతున్నాయి. విత్తన ధరలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో కంపెనీలు తమ ఉత్పత్తి ధర, లాభాలు చేసుకుంటూ అమ్మకాలు సాగిస్తున్నాయి. రైతులు క్వింటాల్ మొక్కజొన్నలను రూ.1800 నుంచి రూ.2000కు విక్రయిస్తే విత్తన కంపెనీలు మాత్రం కంపెనీ డిమాండ్ను బట్టి 4 కిలోల బస్తాను రూ.1500 నుంచి రూ.2500 వరకు విక్రయిస్తున్నాయి. కంపెనీలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ.. తమ విత్తనాలను సాగు చేస్తే ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, మొక్కజొన్న ఆకులు ఎక్కువగా రావడంతో రామచిలుకలు రావని, పంటకు తెగుళ్లు ఆశించవంటూ రైతులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాయి. సబ్సిడీ రాక.. మొక్కజొన్న విత్తనాలపై సబ్సిడీ లేకపోవడంతో జిల్లా రైతులకు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. సగటున మొక్కజొన్న 4 కిలోల విత్తనాల సంచిని రూ.2000 వరకు కంపెనీలు విక్రయిస్తే.. ఆ సంచిపై 33 శాతం సబ్సిడీ ఉంటే రూ.660 సబ్సిడీ రైతులకు దక్కేది. కేవలం రైతులు సంచికి రూ.1340 చెల్లిస్తే సరిపోయేది. సబ్సిడీ ఎత్తివేయడంతో జిల్లా రైతులపై దాదాపు రూ.4 కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. -
భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
ఇబ్రహీంపట్నం: రైతులు భూములు కొన్న వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అడిషినల్ కలెక్టర్ లత అన్నారు. మండలంలోని వర్షకొండ, బర్థీపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. దరఖాస్తులు ఎలా స్వీకరిస్తున్నారు..? ఎన్ని వచ్చాయి..? పరిశీలించారు. భూములు కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెనుకడుగు వేయొద్దన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టా లేకుంటే పాత రికార్డులు పరిశీలించి.. పొరుగు ఉన్న రైతు వాగ్మూలంతో పట్టా చేస్తామన్నారు. విరాసత్ 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. వ్యవసాయ భూమిలో ఇళ్లు, బడి అని రికార్డుల్లో పడిన రైతులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వ్యవసాయ భూమిగా నమోదు చేస్తామన్నారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వరప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐలు రేవంత్రెడ్డి, రమేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన మెట్పల్లి: పట్టణంలోని 8,19వ వార్డుల్లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను అడిషనల్ కలెక్టర్ లత పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించవద్దని సూచించారు. కమిషనర్ మోహన్, డీఈ నాగేశ్వర్రావు, ఏఈ తిరుపతి, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఉన్నారు. -
మంచి విద్య
నిజాం కాలం నుంచి..జగిత్యాల: జిల్లా కేంద్రం నడిబొడ్డున.. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్ హైస్కూల్) ఉమ్మడి జిల్లాలోనే ప్రథమ స్కూల్ అని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ స్కూల్లో చదువుకున్న ఎంతోమంది గొప్పవారయ్యారు. రెండెకరాల స్థలంలో ఉన్న ఈ స్కూల్ ఇప్పటికీ కొనసాగుతోంది. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో 350 మంది చదువుకుంటున్నారు. క్రమశిక్షణ గల స్కూల్గా పేరుగాంచింది. మాజీమంత్రులు జీవన్రెడ్డి, రాజేశంగౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే సంజయ్కుమార్ తండ్రి హన్మంతరా వు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రా వు, ఎంపీ సంతోష్, డాక్టర్ జగన్నాథరావు వంటి ఎందరో ఈ పాఠశాలలో చదువుకున్నారు. ఈ పాఠశాలలో మంచి విద్య విద్యార్థులకు అందున్నాం. నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారు. మంచి ల్యా బ్ విద్యార్థులకు మౌలి క వసతులు కలిగి ఉన్నాయి. పురాతనమైన ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నేను ఉండటం ఆనందంగా ఉంది. – ఆనందరావు, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు -
ఆపిల్ బేర్ సాగు.. లాభాలు బాగు
● ప్రత్యామ్నాయ పంటల వైపు అన్నదాతల చూపు ● తోటి రైతులకు ఆదర్శం..సారంగాపూర్: జిల్లా వ్యవసాయ ఆధారితం. సాగునీటి సౌకర్యం ఉండడంతో ఇక్కడి రైతులు ఎక్కువగా వరి పండిస్తుంటారు. తర్వాతి స్థానంలో మొక్కజొన్న, పత్తి వంటివి ఉన్నాయి. కొన్నాళ్లుగా రైతులు పంట మార్పిడి వైపు దృష్టి సారిస్తున్నారు. తమకున్న పొలంలో కొద్దిపాటి విస్తీర్ణంలో గంగనేరడి (ఆపిల్బేర్) పళ్ల సాగు చేపడుతున్నారు. ఈ పంట ను ఐదు, పది గుంటల్లో సాగుచేసినా ఊహించని లాభాలు వస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాశ్మీర్ ఆపిల్గా పిలిచే ఈ గంగనేరడి పండులో అధిక పోషకాలు ఉంటాయంటున్నారు వ్యవసాయ అధికారులు. ఎక్కువ కేలరీలు ఉన్నా.. ఫ్యాట్ అతితక్కువగా ఉండి కార్బొహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, విటమిన్ కే వంటివి పుష్కలంగా ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. 20 ఎకరాల్లో సాగు సారంగాపూర్ మండలంలో ఇప్పటికే 20 ఎకరాల్లో ఆపిల్బేర్ సాగుచేస్తున్నారు. మరింత మంది రైతులు సాగు చేయడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవిపల్లిలో ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. దీనికి ఉపాధి హామీ కింద ప్రోత్సాహం అందుతుండడంతో రైతులు ముందుకొస్తున్నారు. మొక్క ఖరీదు, గుంత తీయడం, నాటడం, మూడేళ్ల వరకు నిర్వహణ ఖర్చులు రైతులకు అందుతున్నాయి. మొక్కలను ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూర్ నుంచి తెప్పిస్తున్నారు. ఎనిమిది నెలల్లో మొదటి పంట చేతికి వస్తుంది. మొదటి ఏడాది 5 నుంచి 10 కిలోలు దిగుబడి ఇస్తుందని, మూడో సంవత్సరం వరకు 50 కిలోల నుంచి 70 కిలోల పంట చేతికొస్తుందని రైతులు అంటున్నారు. మూడో ఏడాది నుంచి ఎకరాకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు. ఫ్రూనింగ్ తప్పనిసరి ఆపిల్బేర్ పంట కాలం ముగిసిన వెంటనే మే, జూన్లో కొమ్మలను కత్తిరించాలని, తద్వారా కొత్తగా ఆకులు, కొమ్మలు వచ్చి దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతులు చెబుతున్నారు. -
గొర్రెలకాపరులకు పరిహారం అందిస్తాం
ధర్మారం(ధర్మపురి): విద్యుత్ షాక్తో మరణించిన గొర్రెలకు పరిహారం అందిస్తామని, బాధితులు ఆందోళన చెందవద్దని మంత్రి లక్ష్మణ్కుమార్ భరోసా ఇచ్చారు. చామనపల్లిలో విద్యుదాఘాతంతో 52 గొర్రెలు మరణించగా మంత్రి లక్ష్మణ్కుమార్ బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి గొర్రెలకాపరులను పరామర్శించారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో ప్రమాదవశాత్తు లారీపై నుంచి కిందపడి మరణించిన హమాలీ మెడవేని రాజేశం భార్య రాజేశ్వరికి రూ.5లక్షల సాయం చెక్కు అందజేసి మాట్లాడారు. ఇచ్చిన మాటప్రకారం సింగిల్విండో ద్వారా రూ.3 లక్షలు, కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా రూ.2లక్షలను బాధిత కుటుంబానికి అందించామన్నారు. చామనపల్లిలో మృత్యువాతపడ్డ ఒక్కో గొర్రెకు రూ.7వేల చొప్పున విద్యుత్ శాఖ ద్వారా పరిహారం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ధర్మారం, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్పర్సన్లు రూప్లానాయక్, ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్, డీసీవో శ్రీమాల, డీఎంవో ప్రమీణ్రెడ్డి, మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, మాజీ వైస్చైర్మన్ కాడే సూర్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అశోద అజయ్, నాయకులు ఓరం చిరంజీవి, ఎండీ అష్ష్యు, ఎల్లయ్య, ఈదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ గొర్రెల కాపరుల కుటుంబాలకు పరామర్శ -
పోషణతో కూడిన విద్య అందించడమే లక్ష్యం
ధర్మపురి: అంగన్వాడీ కేంద్రాల్లో పోషణతో కూడిన విద్య అందించడమే లక్ష్యమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. అమ్మమాట – అంగన్వాడీబాటలో భాగంగా మండలంలోని దొంతా పూర్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల నమోదు, ప్రీస్కూల్ హాజరు పెంచడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆట పాటలతో విద్యనందించనున్నట్లు వెల్లడించా రు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించి వసతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూదన్, జిల్లా సంక్షేమాధికారి నరేశ్, సిడిపివో వాణిశ్రీ, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లున్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంమేడిపల్లి: ఆరోగ్య తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భీమారం మండలకేంద్రంలో రూ.1.43 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. 97 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 27మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మేడిపల్లి మండలం వల్లంపల్లిలో కాకతీయ కెనాల్పై రూ.2.50కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. భీమారం మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోందని, ప్రజల కోరిక మేరకు వారు సూచించిన ప్రదేశంలోనే ఆసుపత్రి నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, చేపూరి నాగరాజు, బద్దం రాజేందర్ రెడ్డి, నీరటి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. భూవివాదంలో ఒకరి ఆత్మహత్యాయత్నం మెట్పల్లిరూరల్: తాను కొనుగోలు చేసిన భూమిని ఇతరులకు విక్రయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెట్పల్లి మండలం చౌలమద్దిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన వనతడుపుల నాగేశ్వరవరప్రసాద్ కొన్నేళ్ల క్రితం చౌలమద్ది శివారులోగల భూమి కొన్నాడు. డబ్బులు చెల్లించినా.. ఆ భూమిని ఓ కుల సంఘం పెద్దమనుషులు తనకు కాకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారు. తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగినా ఇవ్వకపోవడంతో విసుగు చెందిన నాగేశ్వరవరప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వద్ద ఓ నోట్ లభ్యమైంది. మెట్పల్లి సీఐ అనిల్, ఎస్సై కిరణ్కుమార్ బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. -
సబ్సిడీ ఇవ్వాలి
మక్కలకు కనీసం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి. దీనివల్ల రైతులకు కొంతలో కొంత మేలు జరుగుతుంది. నేను ఐదు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే.. విత్తనాల ఖర్చే రూ.10 వేలు అవుతోంది. సబ్సిడీ ఇస్తే నాలాంటి రైతులకు కొంత ఖర్చు తగ్గుతుంది. – సత్యనారాయణ రెడ్డి, సారంగాపూర్ ఎలాంటి సబ్సిడీ లేదు ప్రస్తుతం మొక్కజొన్న విత్తనాలపై ఎలాంటి సబ్సిడీ లేదు. ప్రభుత్వం తరుపున విత్తనాలు అందించడం లేదు. ప్రైవేట్ కంపెనీలు ఓపెన్ మార్కెట్లో మొక్కజొన్న విత్తనాలు అమ్ముకుంటున్నాయి. నమ్మకమైన, నాణ్యమైన సంస్థ నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచిస్తున్నాం. లేకుంటే రైతులు నష్టపోయే ప్రమాదముంది. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
ఆర్ట్లో నైపుణ్యం సాధించా
ఎంటెక్ పూర్తి చేశా. ప్రస్తుతం జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నా. ఆర్ట్, డ్రాయింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. కోర్సులో భాగంగా చాలా రకాల వాటిని తయారు చేశా. కలెక్టర్ కూడా ఇంప్రెస్ అయ్యారు. – హెచ్.రోజా, కరీంనగర్ క్రాఫ్ట్ వర్క్ నేర్చుకున్నా కరీంనగర్లో జరిగిన టీటీసీసీ లో ప్రతిరోజు క్లాసులకు హాజ రయ్యా. క్రాఫ్ట్ వర్క్ బాగా నే ర్చుకున్నా. పూల బుట్టి, ఆకులతో పలు రకాల వస్తువులు తయారు చేశా. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశా. ఇలాంటి కోర్సులు మాకు ఉపాధినిచ్చే విధంగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరు కోర్సు చేయాలి. – ఎల్.లక్ష్మి, ఇందారం, మంచిర్యాల టైలరింగ్లో శిక్షణ.. బీకామ్ డిగ్రీ చేశా. గతంలో శిశు గృహ తదితర సంస్థల్లో పని చేశా. కోర్సు పూర్తి చేసి స్కూళ్లలో చిన్నారులకు నేర్పించాలనుకుంటున్నా. టైలరింగ్లో అల్లికలు తదితర వాటిని బాగా నేర్చుకున్నా. ట్రైనర్స్ బాగా చెప్పారు. ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే శిక్షణ ఇది. – ఇ.సంధ్య, గాలిపెల్లి, సిరిసిల్ల -
దొంగను పోలీసులకు పట్టించిన రైతులు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని మోతె బైపాస్ రోడ్డులో వ్యవసాయ మోటార్లు, విద్యుత్ వైర్లను ఎత్తుకెళ్తున్న దొంగను రైతులు పట్టుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన యువకులు ఆదాబ్, సయ్యద్, సాహెబ్ కొద్దికాలంగా మోతె శివారులోని మోటార్లు, విద్యుత్ వైర్లు, స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు నిఘా పెట్టారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద సలాకలు, మోటార్ వైర్లు దొంగలించి తీసుకెళ్తుండగా రైతులు వెంటపడ్డారు. ఇద్దరు దొంగలు పారిపోయారు. ఒక దొంగను పట్టుకున్న రైతులు పోలీసులకు అప్పగించారు. ఏడాదికాలంగా దాదాపు 30 నుంచి 40 విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు దొంగలు ఎత్తుకెళ్లారని, గతంలో కూడా దొంగలను పోలీసులకు పట్టిస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
లోకల్ కోర్టుల ద్వారా విద్యుత్ సమస్యలు పరిష్కారం
మెట్పల్లి: అపరిష్కృతంగా మిగిలిపోయిన విద్యుత్ సమస్యలకు లోకల్ కోర్టుల ద్వారా పరిష్కారం లభిస్తోందని రెండో సీజీఆర్ఎఫ్ నిజామాబాద్ లోకల్ కోర్టు చైర్మన్ నారాయణ అన్నారు. మెట్పల్లి పట్టణంలో బుధవారం లోకల్ కోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని తెలిపిన ఆయన.. విద్యుత్ అధికారులు, సిబ్బంది మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. విద్యుత్ ఆదా కోసం రైతులు కెపాసిటర్లు బిగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది సెల్ఫోన్ నంబర్లను గోడలపై రాయించాలని ఆదేశించారు. సీజీఆర్ఎఫ్ మెంబర్ టెక్నికల్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ కిషన్, ఎస్ఈ సాలియానాయక్, మెట్పల్లి డీఈ గంగారాం, ఏడీఈలు మనోహర్, రఘుపతి, ఏఈలు రవి, ప్రదీప్, శివకుమార్, శ్రీనివాస్, అజయ్ పాల్గొన్నారు. నేడు విద్యుత్ కట్ ప్రాంతాలుజగిత్యాలజోన్: జిల్లాకేంద్రంలోని టౌన్–3 సెక్షన్ పరిధిలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎన్పీడీసీఎల్ డీఈ రాజిరెడ్డి తెలిపారు. గాంధీనగర్ 11 కేవీ విద్యుత్ ఫీడర్పై చెట్లకొమ్మలు తొలగించాల్సి ఉందని, తీన్ఖీని చౌరస్తా, పెద్ద మసీదు, కటికెవాడ, మంచినీళ్ల బావి, ఇస్లాంపుర, గాంధీనగర్, తెనుగువాడ, దగ్గులమ్మ గుడి, ఉస్మాన్పురా, మహబూబ్పుర, రహమత్పురా, జెండామహిళా, ప్యారాబాయ్, గోరేమియా, ఖిలాగడ్డ, తులసీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు గమనించాలని సూచించారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలిమల్యాల: ప్రతి ఒక్కరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ సూచించారు. మల్యాల మండలం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. టీబీ, హెచ్ఐవీ, డయాబెటిస్, బీపీ తదితర పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ వహించాలన్నారు. చెత్తాచెదారం, మురికినీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, వైద్యులు మౌనిక, సౌజన్య, ఎంఎల్హెచ్పీ సుష్మిత, ప్రకాశ్, రమేశ్, సాజిద్ పాల్గొన్నారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలుజగిత్యాల: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేశామని డీఈవో రాము అన్నారు. జగిత్యాలలోని పలు పాఠశాలలను బుధవారం పరిశీలించారు. వాష్రూమ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని, తాగునీటి వసతి కల్పించామని తెలిపారు. తొలిరోజే విద్యార్థులకు నోట్బుక్లు, టెక్ట్బుక్లు ఇస్తామన్నారు. మధ్యాహ్న భోజనంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామసభలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ధర్మపురి: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని డీఈవో అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని కమలాపూర్, నక్కలపేట పాఠశాలలను సందర్శించారు. వసతులు, సౌకర్యాలు, డిజిటల్ బోధన, ఇంగ్లిష్ విద్యపై పిల్లలు, తల్లిదండ్రులకు వివరించారు. ఎంఈవో సీతామహాలక్ష్మి, ఉపాధ్యాయులు మ్యాన పవన్కుమార్, ఆసిఫ్, ప్రీతి, సంపూర్ణ తదితరులున్నారు. -
ప్రభుత్వ పాఠశాలలోనే చదువు
–సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే జగిత్యాలలోని వీక్లీబజార్లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఉపాధ్యాయులందరూ బాధ్యతగా పాఠాలు చెప్పేవారు. ఆ అనుభూతి వేరు. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చు. స్కూల్లో స్నేహితులతో కలిసి అనేక క్రీడలు ఆడేవాడిని. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంది. డాక్టర్ అయ్యాను. ప్రజలకు సేవ చేస్తూ ఎమ్మెల్యేగా గెలుపొందాను. ఈ తరం విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. -
రైతుల్లో సాగు విధానం మారాలి
రైతులు వరి సాగునే ప్రధానంగా ఎంచుకుంటున్నారు. ఆపిల్బేర్ సాగును కొన్ని గుంటల్లో సాగుచేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి. మొక్కలను నాటిన మొదటి ఏడాది నుంచే కాత మొదలవుతుంది. ఈ విషయాన్ని రైతులు తెలుసుకోవాలి. – భ్యూ ప్రభాకర్, లక్ష్మీదేవిపల్లి సాగు చేసే రైతులకు ప్రోత్సాహం ఆపిల్బేర్ పంట సాగుచేయాలనుకునే రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నాం. మొక్కలను ఖమ్మం, గుంటూర్ నుంచి తెప్పిస్తున్నాం. వివరాలకు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహమీ ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలి. – గంగాధర్, ఎంపీడీవో -
సాంకేతిక శిక్షణ.. భవిష్యత్తుకు నిచ్చెన
● ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు ● టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్లలో 42 రోజులపాటు.. ● పూర్తి చేసిన 89 మంది పురుషులు, 680 మంది మహిళలు నప్తగిరికాలనీ(కరీంనగర్): తమ చిన్ననాటి కలలను ఇప్పుడు సాకారం చేసుకుంటున్నాముని కొందరు.. నేర్చుకుంటున్న కళను ఇంకా మెరుగుపర్చుకుందామని మరికొందరు.. స్కూల్లో పిల్లలకు పెట్టే టాస్క్లో మేము సైతం సాయం చేద్దామని ఇంకొందరు.. ఉపాధి కోసమని.. ఉద్యోగం సాధించాలని.. పది మందికి ఉపాధి కల్పించాలని ఇలా ఎవరికి వారు తమ ఆశయాలు, లక్ష్యం సార్థకం చేసుకునేందుకు సిద్ధమయ్యారు నారీమణులు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ కళలకు వయస్సుతో సంబంధం లేదని కరీంనగర్ మంకమ్మతోటలోని ధన్గర్వాడీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ కోర్సు(టీటీసీసీ)లో ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. 42 రోజులపాటు సాగిన కోర్సు బుధవారంతో పూర్తయింది. ఈక్రమంలో శిక్షణ పొందిన మహిళల అనుభవాలు, భవిష్యత్ కార్యాచరణపై సాక్షి ప్రత్యేక కథనం. 42 రోజుల శిక్షణ ధన్గర్వాడీ పాఠశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, మంచిర్యాల, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల నుంచి 89 మంది పురుషులు, 680 మంది మహిళలు మొత్తం 769 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ పొందారు. మే 1న కోర్సు ప్రారంభించగా.. జూన్ 11తో ముగిసింది. టైలరింగ్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్లలో 42 రోజులపాటు శిక్షణ పొందారు. 469 మంది డ్రాయింగ్లో, 360 మంది టైలరింగ్, క్రాఫ్ట్లలో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ కోర్సు డైరెక్టర్ బొట్ల రామస్వామి పర్యవేక్షణలో టీటీసీసీ శిక్షణ కార్యక్రమాలు పకడ్బందీగా పూర్తయ్యాయి. -
ఎల్లమ్మ తల్లికి బోనాలు
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అమ్మవారికి బెల్లం, పుట్నాలు, కల్లు, కోళ్లు నైవేద్యంగా సమర్పించారు. తమను సల్లంగా చూడు తల్లి అంటూ వేడుకున్నారు. అనంతరం సహంపక్తి భోజనాలు చేశారు. భక్తుల ద్వారా ఆలయానికి రూ.82,887 ఆదాయం, 10 గ్రాముల మిశ్రమ వెండి, 9 అమెరికా డాలర్స్ వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. -
సమస్యల ఒడి
ఇది కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్లోగల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల. అదనపు తరగతి గదులకు స్లాబ్ వరకు నిర్మాణం చేపట్టి వదిలేశారు. ఇందులో కూర్చోవాలంటే విద్యార్థులకు ఇబ్బందికరంగానే ఉంటుంది. త్వరితగతిన పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.● స్వాగతం పలుకుతున్న ఇబ్బందులు ● టాయిలెట్స్కు మరమ్మతు కరువు ● పారిశుధ్యమూ అంతంతే.. ● రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభంమన ఊరు మన బడి కింద ఎంపికై న పాఠశాలలు : 277విద్యార్థుల సంఖ్య : 57,552బడ్జెట్ : రూ.1.19కోట్లు పూర్తయిన స్కూళ్లు : 48మంజూరైన కాంపోనెంట్స్ : 1087పూర్తయిన కాంపోనెంట్స్ : 446చదువుల బడి.. ఇది మల్యాల మండలకేంద్రంలోని ఒడ్డెరకాలనీలోని మండల పరిషత్ పాఠశాలలో గల టాయిలెట్స్. ఈ టాయిలెట్స్ చుట్టూ చెట్లపొదలతో నిండిపోయాయి. పారిశుధ్యం చేయించాల్సిన అవసరం ఉంది. స్కూల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో పారిశుధ్యం చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.జగిత్యాల: జిల్లాలో పాఠశాలలు ఈనెల 12 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రకాల చర్యలు సైతం చేపట్టింది. ఇటీవలే ఎమ్మార్సీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కల్పించింది. ఈసారి పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా 4వ స్థానం సాధించడంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతోంది. అయితే మౌలిక వసతులే ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మన ఊరు మన బడి పథకం కింద రూ.1.19 కోట్లు మంజూరయ్యాయి. ఈ పథకం కింద జిల్లాలో 277 స్కూళ్లు ఎంపికై నప్పటికీ 48 స్కూళ్లు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. అలాగే టాయిలెట్స్, కలర్స్, బెంచీలు, కిచెన్షెడ్స్ (కాంపోనెంట్స్) తదితర 1087 మంజూరు కాగా.. 446 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే అమ్మ ఆదర్శ పథకం కింద 517 ఎంపిక కాగా.. 282 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా మరమ్మతు చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బడిబాట ప్రారంభం ఈనెల ప్రారంభం నుంచే జిల్లాలో బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నా ణ్యమైన విద్య అందుతోందని, ప్రతిఒక్కరూ పాఠశాలలకు రావాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లలను గుర్తిస్తున్నారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. పాఠ్య పుస్తకాలు రాక జిల్లాకు 3,80,760 పుస్తకాలు అవసరం కాగా.. ఇప్పటి వరకు 3,50,920 పుస్తకాలు మాత్రమే వచ్చాయి. వాటిని ఆయా స్కూళ్లకు పంపిణీ చేశా రు. అలాగే జిల్లాలో మొత్తం 57,552 మంది విద్యార్థులు ఉండగా.. 83 శాతం మందికి యూనిఫామ్స్ అందించారు. ఇంకా 17 శాతం వరకు విద్యార్థులకు యూనిఫామ్స్ అందించాల్సి ఉంది. పారిశుధ్యం అంతంతే.. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో అమ్మ ఆదర్శ పథ కం కింద స్కాంవెంజర్లను ఏర్పాటు చేసుకున్నప్పటి కీ కొన్నిచోట్ల పారిశుధ్యం అంతంతగానే ఉంది. టా యిలెట్స్ పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోయా యి. పాఠశాలల ఎదుట ఏపుగా ముళ్లపొదలు నిండిపోయాయి. అధికారులు స్పందించి పారిశుధ్యం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎఫ్ఆర్ఎస్ అమలు గతంలో ఉపాధ్యాయుల హాజరు నమోదు చేసేందుకు బయోమెట్రిక్ ఏర్పాటు చేసినప్పటికీ అది ఆశించిన మేరకు ఫలితం ఇవ్వలేదు. దీంతో దానిని ఎత్తివేశారు. విద్యార్థులకు ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేస్తున్నారు. తాజాగా.. ఉపాధ్యాయులకూ ఈ విధానం తీసుకురావాలని భావించిన ఉన్నతాధికారులు.. ఈ ఏడాది నుంచే అమలవుతుందని చెబుతున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు స్కూల్కు వెళ్లకపోవడం, అటెండెన్స్ వేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ తప్పనిసరి అయ్యింది. ఈ విధానం ద్వారా పూర్తిస్థాయిలో పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.ఈ చిత్రం కోరుట్ల పట్టణంలోని కటికెవాడలోగల ప్రాథమిక ఉన్నత పాఠశాల. గది కూలిపోయి శిథిలావస్థకు చేరింది. ఇప్పటివరకు మరమ్మతు చేయించలేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుంది. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించాం. విద్యార్థులకు మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులకు అన్ని అంశాలపై శిక్షణ ఇచ్చాం. ప్రతిరోజు ఉపాధ్యాయులు ఎలా చెబుతున్నారని పర్యవేక్షిస్తాం. మంచి ఫలితాలు తీసుకుచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – రాము, డీఈవో -
రాయికల్ బల్దియా అభివృద్ధికి రూ.15 కోట్లు
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ రాయికల్: రాయికల్ బల్దియా అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, యువజన సంఘాల నాయకులు రాంమూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిధులకు త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యేను కలిసిన గౌడ సంఘం నాయకులు జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్కు చెందిన గౌడ యువజన సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. సంఘం భవనానికి గతంలో నిధులు మంజూరయ్యాయని, బోర్వెల్, ప్రహరీకి కూడా సహకరించాలని కోరారు. నాయకులు వెంకటరాజం, జలేందర్, ధర్మరాజు, నాగరాజు, సత్తయ్య, గణేశ్, కృష్ణ పాల్గొన్నారు. శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలి జగిత్యాల: నూకపల్లి వద్దగల డబుల్బెడ్రూం ఇందిరమ్మ కాలనీలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డబుల్బెడ్రూం ఇళ్లలో వసతుల కల్పనకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నరేందర్, రమేశ్, స్వామి, విజయ్, ఖలీల్, శ్రీను పాల్గొన్నారు. ఓల్డ్పెన్షన్ స్కీం వర్తింపజేసేలా చూడాలి తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఓల్డ్పెన్షన్ స్కీం వర్తింపజేసేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. నూకపల్లిలోని శ్రీజ్ఞానద్యాన విజ్ఞాన సరస్వతి ఆలయ కమిటీ సభ్యులు కలిసి 11వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. -
‘సాక్షి’పై దాడి అప్రజాస్వామికం
● ఏపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి ● కొమ్మినేని అరెస్టు గర్హనీయం ● జర్నలిస్టుల సంఘాల నిరసనకరీంనగర్: ఏపీలో ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానళ్ల కార్యాలయాలపై టీడీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు అప్రజాస్వామికమని, మీడియా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్దమని టీయుడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్, ‘సాక్షి’ దినపత్రిక ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్చార్జి భాషబోయిన అనిల్కుమార్ పేర్కొన్నారు. ఏపీలో ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ మంగళవారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపులను తీవ్రంగా ఖండించారు. ఇటీవల ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి మీద కేసులు బనాయించడం, తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం, సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్ప డటం భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఉందని మండిపడ్డారు. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చేలా ఉన్న ఏపీ ప్రభుత్వ చర్యలను దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఏపీ సర్కారు పత్రికా కార్యాలయాలపై, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగిస్తే అదేస్థాయిలో నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులు ఎలగందుల రవీందర్, బల్మూరి విజయసింహారావు, ఈద మధుకర్రెడ్డి, ఏలేటి శైలేందర్రెడ్డి, జీఎస్ ఆనంద్తో పాటు సీనియర్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలి
● డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మెట్పల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు అయ్యేలా చూడాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలతో సమావేశమయ్యారు. 100 శా తం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అయ్యేలా గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు పండ్లు అందించారు. మెట్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లను తనిఖీ చేశారు. జిల్లా మాతా శిశుప్రొగ్రాం అధికారి జైపాల్రెడ్డి, మెట్పల్లి మండల వైద్యాధికారి అంజిత్రెడ్డి పాల్గొన్నారు. వికసిత్ కృషి సంకల్ప్ ద్వారా రైతులకు అవగాహన సారంగాపూర్: కేంద్ర ప్రభుత్వ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ద్వారా రైతులకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాల యం శాస్త్రవేత్త పద్మజ తెలిపారు. బీర్పూర్ మండలం చిత్రవేణిగూడెంలో రైతులకు అవగా హన కల్పించారు. పంటల ఉత్పత్తిని పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానం, పంట మార్పిడి, యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. ఎ రువుల వినియోగం, చీడపీడలు, తెగుళ్ల ని వారణకు రైతులు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలన్నారు. ఏడీఏ తిరుపతి, ప్రదీప్రెడ్డి, ఏఈవోలు పాల్గొన్నారు. అంగన్వాడీకేంద్రాల్లోనే పోషకాహారం మల్యాల: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందిస్తూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్తుతున్నారని, ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యా బోధిస్తున్నామని మ ల్యాల సీడీపీఓ వీరలక్ష్మి అన్నారు. మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం అమ్మమాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి కార్యక్రమం ప్రాధాన్యతను తల్లులు, ఆరోగ్యలక్ష్మీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ టీచర్లకు వివరించారు. సూపర్వైజర్ శారద, అంగన్వాడీ టీచర్లు స్వప్న, రాణి, తల్లులు పాల్గొన్నారు. తాండ్య్రాలకు బస్సు సౌకర్యం కల్పించాలి కథలాపూర్: మండలంలోని తాండ్య్రాల గ్రామానికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరుట్ల ఆర్టీసీ అధికారులకు మహిళలు వినతిపత్రం ఇచ్చారు. తాండ్య్రాల మీదుగా గంభీర్పూర్కు బస్సు వెళ్తున్నప్పటికీ అందులో ప్రయాణికుల రద్దీ ఉండటంతో తాండ్య్రాలలో బస్సులు ఆపడంలేదన్నారు. మహిళలు ఫుట్ బోర్డు ప్రయాణిం చేయాల్సి వస్తుందన్నారు. అధికారులు చొరవ చూపి ప్రత్యేకం బస్సు సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలిజగిత్యాలరూరల్:జిల్లాలోని మహిళా సంఘాల బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఐకేపీ ఏపీడీ చరణ్దాస్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల పదాధికారులకు శిక్షణ కల్పించారు. అన్ని మండలాల్లో కొత్తగా ఎన్నికై న మహిళా సంఘాల సభ్యులకు రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విధులు, బాధ్యతలు, సంఘాల నిర్వహణ, కట్టుబాట్లు, ఆర్థిక లావాదేవీలపై శిక్షణ ఉంటుందన్నారు. ప్రభుత్వం ద్వారా అందే సేవలను సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా శాఖల సమన్వయంతో స్వశక్తి సంఘాల పర్యవేక్షణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. -
ముదురుతున్న ఫ్లెక్సీల రగడ
జగిత్యాల: డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్కు మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. అయితే ఫ్లెక్సీల ఏర్పాటు గందరగోళంగా మారింది. అడ్లూరికి శుభాకాంక్షలు తెలుపుతూ.. జిల్లాకేంద్రంలో మాజీమంత్రి జీవన్రెడ్డి వర్గీయులు, ఎమ్మెల్యే సంజయ్కుమార్ వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జీవన్రెడ్డి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలో ‘ఒరిజినల్ కాంగ్రెస్’ అని రా యడం చర్చనీయాంశంగా మారింది. ఇది కాస్త సోషల్ మీడియాలో రగులుతోంది. మరికొందరు ఎమ్మెల్యే ఫొటోతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాకు మంత్రి పదవి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతున్నా.. జిల్లాకేంద్రంలో మాత్రం ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుటుండడం విశేషం. పోటాపోటీగా జీవన్, సంజయ్ వర్గీయుల ఫ్లెక్సీలు ఏర్పాటు జిల్లాకేంద్రంలో వేడెక్కిన రాజకీయం -
వార్డుల విభజన శాసీ్త్రయంగా చేయండి
జగిత్యాలటౌన్: జగిత్యాల బల్దియాలో వార్డుల పెంపు ప్రక్రియను శాసీ్త్రయంగా చేపట్టాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఇందిరాభవన్ నుంచి కాంగ్రెస్ నాయకులతో కలిసి బల్దియా కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. బల్దియా కమిషనర్ స్పందనకు లేఖ అందించారు. 48 వార్డులున్న బల్దియాలో 50 వార్డులకు విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ముసాయిదా రూపకల్పనలో అధికారులు గందరగోళానికి తెరతీశారని పేర్కొన్నారు. నూకపల్లి అర్బన్ కాలనీని 49, 50 వార్డులుగా విభజిస్తే స్థానికులకు సౌకర్యాలు అందుతాయన్నారు. అర్బన్కాలనీలో ఇళ్లు కేటాయించిన 3500 కుటుంబాల సభ్యులు సుమారు ఏడు వేల మందిని 11వ వార్డులో చేర్చుతూ ముసాయిదా రూపొందించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్లు తాటిపర్తి విజయలక్ష్మి, జీఆర్ దేశాయ్, నాయకులు ఉన్నారు. -
మ్యాపుల్లో సమస్తం
సర్వే సమగ్రం..జగిత్యాల: గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు అధికం. రకరకాల సమస్యలతో రైతులు అనేక ఇబ్బంది పడుతుంటారు. రెవెన్యూ రికార్డు (పహాణి)ల్లో తప్పులు నమోదు కావడం.. సర్వే నంబర్ల వారీగా మ్యాప్లు లేకపోవడం.. కొన్ని గ్రామాల్లో కనీసం నక్షలు లేకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. వీటిని ఆసరా చేసుకుంటున్న కొందరు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం.. మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రిజిస్ట్రేషన్లకు తప్పకుండా మ్యాప్ ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. నక్షలు లేని గ్రామాల్లో సర్వే చేపట్టి మ్యాప్లకు రూపకల్పన ఇవ్వాలనే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని బీర్పూర్ మండలం కోమనపల్లిని ఎంపిక చేశారు. ఈ గ్రామంలో నక్ష లేకపోవడంతో పహాణీల్లో ఉన్న నంబర్ల ఆధారంగా సర్వే చేపట్టి మ్యాప్లు రూపొందిస్తారు. సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ, రెవెన్యూ ఆధ్వర్యంలో ప్రైవేటు ఏజెన్సీ మార్వెల్ జియో ఫేషియల్ సొల్యుషన్స్ ప్రైవేటు లిమిటెడ్తో కలిసి సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఆ గ్రామంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామసభ ఏర్పాటు చేశారు. కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ నుంచి ఆదేశాలు రావడంతో సర్వే మొదలుపెట్టారు. గ్రామంలో పూర్తి సర్వే చేసిన అనంతరం పహాణీల్లో ఉన్న సర్వే నంబర్ల ప్రకారం మ్యాప్లను జారీ చేస్తారు. వారం రోజుల్లో పూర్తి బీర్పూర్ మండలం కోమనపల్లిలో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న భూ సర్వే వారం రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే రెండుసార్లు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ బీఎస్.లత ఆధ్వర్యంలో వారికి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించి సర్వే గురించి వివరించారు. వారం రోజుల్లోపు సర్వే పూర్తి చేసి వారి సర్వే ప్రకారం నక్ష పటాలు అందించనున్నారు. ఇది విజయవంతం అయితే మరిన్ని గ్రామాల్లోనూ సర్వే చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మరికొన్ని గ్రామాల్లో.. జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బీర్పూర్ మండలం కోమనపల్లిలో చేపడుతున్న సమగ్ర సర్వేతో మ్యాప్ల రూపకల్పన మరికొన్ని గ్రామాల్లో చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లాలో ఎలాంటి మ్యాప్లు లేకుండా.. నక్షలు లేకుండా జిల్లాలో 16 గ్రామాలు ఉండగా ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద కోమనపల్లిలో సర్వే చేపడుతున్నారు. కోమన్పల్లిలో 624 ఎకరాలు కోమన్పల్లి గ్రామ పంచాయతీ కింద డొంకేశ్వరం, అన్నారం శివారు గ్రామాలుగా ఉన్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 1983–84లో బీర్పూర్ మండలం కోమన్పల్లి శివారుల్లో ముంపు బాధితులకు పునరావాసం కల్పించి.. ప్రభుత్వ భూములు అందించి వాటిని వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా మార్చింది. బాధితులందరికీ భూములపై హక్కులు కల్పిస్తూ.. వారికి డీ–1 సర్టిఫికెట్లను అందించింది. శ్రీరాంసాగర్ నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడి పరిస్థితులను చాలామంది తట్టుకోలేక ప్రభుత్వం వారికి కేటాయించిన భూములను స్థానిక రైతులకు అమ్ముకున్నారు. ప్రభుత్వం అందించిన డీ–1 సర్టిఫికెట్లను భూములు కొనుగోలు చేసిన వారికి అందించి తిరిగి వెళ్లిపోయారు. భూముల వివాదాలకు చెక్ పైలెట్ ప్రాజెక్ట్గా కోమనపల్లి ఎంపిక విజయవంతమైతే మరిన్ని గ్రామాల్లో అమలు వివాదాలకు చెక్ సర్వేలో భాగంగా గ్రామంలోని భూములకు హద్దులు గుర్తిస్తారు. ఇందులో ఏ సర్వేనంబర్లు ఎందులో ఉన్నాయి..? అసైన్డ్ భూములు, గ్రామకంఠం భూములు ఎన్ని ఉన్నాయి..? అన్నది చూసి అనంతరం సర్వే చేపడతారు. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లకు అధికారులు బై నంబర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇందులో కొన్ని గొడవలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక రైతుకు చెందిన భూమిలో ఎక్కువ సర్వేనంబర్లు ఉండటంతో రికార్డుల్లో ఉన్న భూమికి.. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి అనేక తేడాలు ఉండటంతో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. భూ విస్తరణ ఒకలా.. కాగితాల్లో మరొలా ఉండటంతో సమస్యలు తలెత్తేవి. ఇప్పుడు అలాంటివి లేకుండా మ్యాప్లు తయారుచేసి ఇస్తారు. అనంతరం ఎవరైనా క్రయవిక్రయాలు చేసుకున్నా మ్యాప్ల ద్వారానే ఇస్తారు. ఈ సర్వేకు డ్రోన్ కెమెరాలు, అత్యాధునిక కెమెరాలతో సర్వే చేపడతారు. -
సమస్యల పరిష్కారానికే ‘రైతు మిత్ర’
జగిత్యాలఅగ్రికల్చర్: సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే రైతుమిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం రైతు మిత్ర కార్యక్రమాన్ని రైతులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో నేరుగా సమావేశమై ఎలాంటి విత్తనాలు వాడాలి..? ఎలాంటి ఎ రువులు ఎంచుకోవాలి..? చీడపీడలకు ఎలాంటి మందులు కొట్టాలి..? అనే దానిపై సమగ్ర స మాచారం తెలుసుకోవచ్చని వివరించారు. ప్రతి సో మవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు జగిత్యాల, ధర్మపురి, మెట్పల్లి ఏడీఏ కార్యాలయాల్లో రైతుమిత్ర కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ తిరుపతి నాయక్, పొలాస శాస్త్రవేత్తలు శ్రీనివాస్, రజనీకాంత్, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ కోర్సులపై సందేహాలా?
● నేడు జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విష్ణువర్ధన్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం7తేదీ : 10–06–2025 సమయం: మంగళవారం : ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకురామగిరి: మీరు ఇంజినీరింగ్ కోర్సులు చదవాలనుకుంటున్నారా? ఏ కోర్సులో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది? కొత్త కోర్సులు ఏమిటి? వాటితో ప్రయోజనాలు ఏమిటి? మీకు ఇష్టమైన కోర్సుల ఎంపిక, కొత్త కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు.. తదితర అంశాల్లో ఏమైనా సందేహాలు ఉంటే ‘సాక్షి’ మీకోసం మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విష్ణువర్ధన్తో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. ఫోన్లో ఆయనతో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి.సంప్రదించాల్సిన ఫోన్ నంబరు 94935 48242 -
రెండే కోర్సులు.. అనేక సమస్యలు
మెట్పల్లి: ప్రభుత్వ నిర్లక్ష్యంతో మెట్పల్లి ప్రాంతంలో పేద విద్యార్దులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలలో తగిన కోర్సులు లేకపోవడం.. డిగ్రీ పూర్తయిన తర్వాత చదువు కొనసాగించడానికి పీజీ కళాశాల లేకపోవడంతో వందలాది మంది అర్ధాంతరంగా మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇంటర్ వరకు విద్యను అందించే విషయంలో చూపుతున్న శ్రద్ధ.. ఉన్నత విద్యపై చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. తద్వారా పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం ఆ రెండు కోర్సులే.. ● పట్టణ శివారులోని వెంకట్రావుపేటలో ఉన్న డిగ్రీ కళాశాలలో కేవలం బీకాం (కంప్యూటర్స్), బీఏ కోర్సులు మాత్రమే ఉన్నాయి. ● సైన్స్, మాథ్స్ కోర్సులు అందుబాటులో లేకపోవడం చాలామందిని అసంతృప్తికి గురి చేస్తోంది. ● కళాశాలలో మెట్పల్లితోపాటు మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటారు. ● వీటిలో మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు పలు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ● ఏటా వీటిలో నుంచి సుమారు 500 మంది విద్యార్థులు ఇంటర్ విద్యను పూర్తి చేస్తున్నారు. ● వీరిలో పేద కుటుంబాల విద్యార్థులకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్, మ్యాథ్స్ కోర్సులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ● చాలామంది ఈ కోర్సులు లేకపోవడం వల్ల చదువులను అర్ధాంతరంగా మానేస్తున్నారు. సౌకర్యాలు అంతంతే.. ● ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్న భవనం జూనియర్ కళాశాలకు చెందినది. ● కొన్నేళ్ల క్రితమే నిర్మించిన ఈ భవనంలో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ● ప్రధానంగా తరగతులు నిర్వహించే గదులకు ప్లాస్టరింగ్ చేయకుండానే వదిలేశారు. ● కిటీకీలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి తలుపులు బిగించలేదు. ● వర్షాకాలంలో భవనంపై నీరు నిలిచి గదులు ఉరుస్తున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● చుట్టూ ప్రహరీ లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. పీజీ కళాశాల ఊసే లేదు.. ● విద్యాపరంగా నియోజకవర్గంలో పీజీ కళాశాల ఏర్పాటు అవసరముంది. ● గతంలో కోరుట్లలో కొన్ని కోర్సులతో పీజీ కళాశాల ఉన్నప్పటికీ కొంతకాలం తర్వాత దానిని తీసివేశారు. ● ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం డిగ్రీలో పలు కోర్సులను అందుబాటులో ఉంచడంతోపాటు పీజీ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మెట్పల్లి డిగ్రీ కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం ఇబ్బంది పడుతున్న సిబ్బంది, విద్యార్థులు రూ.53లక్షలతో ప్రతిపాదనలు పంపాం కళాశాలలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 53లక్షలతో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. కొన్ని సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిధులు మంజూరైతే అవి పరిష్కారమవుతాయి. – వెంకన్న, ఇన్చార్జీ ప్రిన్సిపాల్ -
సీఎంను కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
జగిత్యాల: రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ సోమవారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. నేడు ధర్మపురికి మంత్రి రాక ధర్మపురి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మంగళవారం ధర్మపురికి రానున్నారు. ఉదయం 11 గంటలకు పత్తిపాక క్రాస్ రోడ్డు నుంచి ధర్మారం, వెల్గటూర్, రాయపట్నం మీదుగా ధర్మపురి చేరుకుంటారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. అక్కడి నుండి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలికథలాపూర్: భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని తాండ్య్రాల, గంభీర్పూర్ గ్రామాల్లో భూ భారతి గ్రామభలను సోమవారం పర్యవేక్షించారు. రైతు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పహాణీలు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కోరుట్ల ఆర్డీవో జీవాకర్రెడ్డి, తహసీల్దార్ వినోద్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నాగేశ్ పాల్గొన్నారు. దుబ్బరాజన్న సన్నిధిలో భక్తజనంసారంగాపూర్: దుబ్బరాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో రా జన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఆలయ ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త శంకరయ్య, ఆలయ సిబ్బంది భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపులకు అన్యాయంకథలాపూర్: కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేపట్టిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అన్యాయం జరిగిందని సంఘం జిల్లా అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో సంఘం జిల్లా ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రిగా అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మున్నూరు కాపుల సంఖ్య 49లక్షలు ఉంటుందని, అయినప్పటికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పునరాలోచించి విప్ ఆది శ్రీనివాస్ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు మల్లారెడ్డి, తిరుపతి, సుధాకర్, రాజేశ్, గంగాధర్, లింగారెడ్డి, గంగారెడ్డి పాల్గొన్నారు. -
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి
రాయికల్: ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో మండల అధ్యక్షుడిగా ఎలగందుల వీరేశం, ప్రధాన కార్యదర్శిగా నరేందర్, కోశాధికారిగా జక్క రంజిత్, కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడంతోపాటు, సామాజిక, సేవ రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బుడికె శ్రీకాంత్, పట్టణ వర్తక సంఘం అధ్యక్షుడు ఎలగందుల సత్యనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్త సురేశ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు జిల్లా లావణ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు. -
అడ్లూరి లక్ష్మణ్ అనే నేను..
● ఉమ్మడి జిల్లాకు మరో మంత్రి పదవి ● అడ్లూరి లక్ష్మణ్ను వరించిన అవకాశం ● విధేయతకు దక్కిన ప్రాధాన్యం ● మూడుకు చేరిన మంత్రుల సంఖ్య ● పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ముగ్గురు మంత్రులు ● కవ్వంపల్లికి విప్ ఇచ్చే అవకాశంధర్మపురికి అచ్చొచ్చిన మంత్రి పదవి తెలంగాణ ఏర్పాటు నుంచి జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి మంత్రివర్గంలో చోటు లభిస్తోంది. 2014లో గెలిచిన కొప్పుల చీఫ్విప్గా కేబినెట్ హోదా అందుకోగా, 2018లో సంక్షేమశాఖ మంత్రిగా వ్యవహరించారు. 2023లో గెలిచిన అడ్లూరి మొదట ప్రభుత్వ విప్గా, తాజాగా మంత్రిపదవి చేపట్టారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిపదవుల్లో పెద్దపీట దక్కింది. ఎన్న డూ లేని విధంగా ముగ్గురు మంత్రి పదవులను దక్కించుకోగా, గడ్డం వివేక్ సైతం ఉమ్మడి జిల్లాతో అనుబంధం కలిగి ఉన్నవారే. దీంతో మొత్తంగా రాష్ట్ర కేబినెట్లో జిల్లావాసులకు సముచిత స్థానం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు గానూ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయగా, దానికి తగ్గట్టుగా మంత్రి పదవులు దక్కాయనే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లానుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా కొనసాగుతుండగా, తాజాగా ధర్మపురి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అడ్లూరి లక్ష్మణ్ అదివారం రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా, అందులో ముగ్గురికి మంత్రి పదవులు దక్కటంతో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కాంగ్రెస అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన తొలిమంత్రివర్గ విస్తరణలో బ్రహ్మణ సామాజికవర్గానికి చెందిన శ్రీధర్బాబు, బీసీగౌడ్ నుంచి పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవులు దక్కాయి. మాదిగ సామాజికవర్గానికి చెందిన అడ్లూరి, ము న్నూరు కాపు అయిన ఆది శ్రీనివాస్లకు ప్రభుత్వ విప్లుగా అవకాశం కల్పించారు. ఆదివారం రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అడ్లూరికి మంత్రిపదవి లభించింది. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చివరి నిమిషంలో కేబినెట్లో చోటు దక్కకపోయినా.. ప్రభుత్వ విప్ ఇచ్చే అవకా శాలున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యే.. కేబినెట్లోకి సుదీర్ఘకాలంగా పార్టీలోనే కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్కుమార్కు మంత్రి పదవిరావడం విధేయతకు పట్టం కట్టినట్లయింది. కార్మిక క్షేత్రమైన గోదావరిఖని నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన అడ్లూరి ఎన్ఎస్యూలో స్టూడెంట్ లీడర్గా, యూత్ కాంగ్రెస్లో, జెడ్పీటీసీ, జెడ్పీచైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా వివిధ హాదాల్లో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రభుత్వ విప్గా కొనసాగగా, తాజాగా కేబినెట్లో చోటు సంపాదించారు. అడ్లూరి లక్ష్మణ్ నేపథ్యం 1982 నుంచి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పని చేశారు. 1986 నుంచి 94 వరకు ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2010–12 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా పని చేశారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2013–14వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పని చేశారు. 2018లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్గా ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయనకు కేబినెట్లో బెర్త్ కల్పించింది. -
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. భూభారతి అవగాహన సదస్సులను అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నందున, అధికారులు అవగాహన సదస్సుల్లో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణికి ఎవరూ రాకూడదని పేర్కొన్నారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యే సంజయ్జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. జిల్లాకేంద్రమైన జగిత్యాలలో విలీనమైన ప్రాంతాలకు రూ.20 కోట్లు, స్పెషల్ గ్రాంట్ కింద రూ.50 కోట్లు మున్సిపాలిటీకి కేటాయించారు. అలాగే రూ.15 కోట్లు రాయికల్ మున్సిపాలిటీకి మంజూరు చేసినందుకు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే గోపినాథ్ మృతి తీరని లోటుజగిత్యాల: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. అనేక లోటుపాట్లు ఎదుర్కొంటూ అంచలంచెలుగా ఎదిగారని, ఆయన మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చేప మందు పంపిణీజగిత్యాల: మృగశిరకార్తె పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ధన్వంతరి ఆలయంలో చేప మందును ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో తౌటు రాంచంద్రం, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఘనంగా స్వాతి నక్షత్రం పూజధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ దేవాలయం శ్రీఉగ్రనృసింహస్వామి దేవాలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పూజలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు వంశీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారిని రంగురంగుల పూలతో చూడముచ్చటగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి విప్ భూమిపూజ
మేడిపల్లి: పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రంతో పాటు, కట్లకుంటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. 67మందికి రూ.22.77 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఇంటిస్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, బొంగోని రాజగౌడ్, చేపూరి నాగరాజు, రావు శ్రీనివాస్రావు, సాయిని గంగారెడ్డి, బద్దం రాజేందర్ రెడ్డి, నీరటి మల్లేశం, పుప్పాల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి అడ్లూరికి అభినందనల వెల్లువ
ధర్మపురి: మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ధర్మపురికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శ్రీలక్ష్మినృసింహస్వామి ఫొటో, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, వావిలాల జగదీశ్వర్, లింగాల హరీశ్ ఉన్నారు. అభినందించిన ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల: మంత్రి అడ్లూరిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అడ్లూరి కాంగ్రెస్ యూత్ నాయకుడిగా, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా పదవులు చేపట్టి మంత్రి అవడం గొప్ప విషయమన్నారు. టీపీసీసీ సెక్రటరి బండ శంకర్, నాయకులు పాల్గొన్నారు. ముందుగా లక్ష్మణ్కుమార్ను మాజీమంత్రి జీవన్రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
జూన్ ఫీవర్
సాగు ఖర్చూ తడిసి మోపెడు.. ఉమ్మడి జిల్లాలో సుమారు 6,10,102 మంది రైతులు దాదాపు 12,82,207 ఎకరాల్లో వానాకాలం పంటలు పండిస్తారని అధికారులు అంచనా వేశారు. తొలకరితో పెట్టుబడి సమయం అసన్నమైంది. భూములను చదునుచేసి, దుక్కిదున్ని, విత్తనాలు, ఎరువులకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెరిగిన యాంత్రీకరణ, ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల కొరత రైతులను ఏటా వేధిస్తూనే ఉన్నాయి. దీనికితోడు అకాల వర్షాలు, చీడపీడలతో దిగుబడి తగ్గి అన్నదాతలు అప్పుల్లో ఊబీలో చిక్కుకుంటున్నారు. సాగులో ఖర్చు తగ్గించుకునేందుకు విత్తనాలు సొంతగా తయారు చేసుకోవడం, ఆధునిక సాంకేతికను వినియోగించుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయినా, పిల్లల చదువులు, వ్యవసాయ పెట్టుబడులు, సీజనల్ వ్యాధులతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. సాక్షి, పెద్దపల్లి: వేసవి సెలవుల్లో ఆటాపాలతో ఆనందంగా గడిపిన విద్యార్థులు.. పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. ఇదేసమయంలో తొలకరితో ఎరువులు, విత్తనాల కొనుగోలు తదితర ఖర్చులతో సామాన్యులు ‘వామ్మో.. జూన్’ అని ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు వానలతో మారుతున్న వాతావరణ పరిస్థితులతో సీజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం.. ఇలా అన్ని రకాల ఖర్చులు ఈనెలలో రానుండటంతో ఎలా గడపాలో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. జూన్ నెల పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు పుట్టిస్తోంది. పెన్సిల్ నుంచి పుస్తకాల వరకూ మోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 938 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో సుమారు 2,26,829 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం అంటేనే ఫీజులు, పుస్తకాలు, నోట్బుక్సులతోపాటు, వాటిని భద్రపరుచుకునేందుకు బ్యాగులు, లంచ్ బాక్స్లు, పెన్నులు, పెన్సిళ్లు, టైబెల్టులు, యూనిఫామ్స్.. ఇలా ఒక్కటేమిటి.. రకరకాల వస్తువులు ఆయా పాఠశాల్లోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. దీంతో యాజమాన్యాలు చెప్పిన ధర చెల్లించలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇంటర్ కళాశాలల్లో సైతం ఏసీ క్యాంపస్లు, నాణ్యమైన విద్యాబోధన పేరిట రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తుండడంతో ఆర్థికభారమైనా.. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం అప్పు లు తెచ్చిమరీ చెల్లిస్తున్నారు. స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల పేరిట నర్సరీ చదువులకే రూ.30వేలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నా.. పర్యవేక్షణ, నియంత్రణ మచ్చుకై నా కనిపించడం లేదు. భయపెడుతున్న వైరల్ ఫీవర్ ఒకసీజన్ నుంచి మరోసీజన్లోకి ప్రవేశించేటప్పుడు వాతావారణం చల్లబడి వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాల తీవ్రత ఉంటుంది. దోమల బెడత పెరిగి ప్రతీ పదిమందిలో నలుగురికి జ్వరం, గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో వైద్యం కోసం తరచూ ఆస్పత్రులకు వెళ్లేపరిస్థితి నెలకొని ఉంటోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో ఏటా జూన్, జూలైలో జ్వరాలతో ఆస్పత్రుల పాలై జేబులు గుల్లచేసుకునే వారు అధికంగానే ఉన్నారు. ఓపీ, టెస్టుల పేరిట ఆస్పత్రుల యాజమాన్యాలు పిండిపిప్పి చేస్తుండటంతో ఈవానాకాల అంటేనే జనాలు భయపడుతున్నారు. వ్యాధుల బారిన పడిన తర్వాత వైద్యఖర్చులకు భయపడడం కన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో డబ్బు ఆదాతోపాటు టెన్షన్ ఉండదని నిపుణులు అంటున్నారు. చదువుల ఫీజులు.. సాగు పెట్టుబడులు.. సీజనల్ వ్యాధులు అన్ని ఖర్చులూ ఒకే నెలలో రావడంతో సర్వత్రా ఆందోళన ఆర్థికభారంతో హడలెత్తిపోతున్న సామాన్య ప్రజలు పెట్టుబడులు పెరిగాయ్ వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతంది. పెరిగిన ఖర్చులతో సాగు చేయడం కష్టంగా మారింది. ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల రేట్లు పెరుగుదలలో పోటీపడుతున్నాయి. సాగు సీజన్ వచ్చిందంటే హడలెత్తిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. – మహేశ్గౌడ్, రైతు జూన్ అంటేనే భయం నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు యూకేజీ, మరొకరు సెకండ్ క్లాస్. జూన్ వచ్చిందంటే అడ్మిషన్లు, పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు ప్రైవేట్ పాఠశాలలు ఏటా ఫీజులు పెంచుతూ మరింత ఆర్థిక భారం మోపుతున్నాయి. – రాదాసు శైలజ, గృహిణి -
యాసంగిలో ‘పంట పండింది’
● రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి ● వాతావరణ పరిస్థితులే అంటున్న శాస్త్రవేత్తలు జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్లో జిల్లాలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అయ్యింది. రాష్ట్రస్థాయిలో జిల్లా మూడోస్థానంలో నిలిచింది. వరి సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు జిల్లాలో ఉండటంతో సగటున రైతులు ఎకరాకు 23 క్వింటాళ్ల దిగుబడి సాధించినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడం.. బావులు, బోర్లు, కుంటలు, చెరువులకు తోడు ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల కావడంతో వరి సాగు అధికంగా చేపట్టి మంచి దిగుబడి తీశారు. మరోవైపు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం పెద్దగా లేకపోవడం.. తేమ శాతం పెరగకపోవడం రైతులకు కలిసి వచ్చింది. పంట చివరి దశలో అకాలవర్షాలు కురిసినప్పటికీ పెద్దగా నష్టం జరగలేదు. జగిత్యాల రూరల్, గొల్లపల్లి, రాయికల్, సారంగాపూర్ వంటి మండలాల్లో కొంతమంది రైతులు ఎకరాకు 28 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి తీశారు. 69లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి మూడు లక్షల ఎకరాల్లో పంట సాగు చేసిన రైతులు 69 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి చేశారు. 367 కొనుగోలు కేంద్రాల ద్వారా 46.36 లక్షల క్వింటాళ్ల సన్న, దొడ్డు రకాలు కొన్నారు. ప్రైవేట్ సీడ్ కంపెనీలు విత్తనోత్పత్తి చేయించి.. మరో రెండు లక్షల క్వింటాళ్లు కొన్నాయి. కేంద్రాల ప్రారంభానికి ముందు అకాల వర్షాలు కురవడంతో అప్పటికే కోతలు పూర్తి చేసిన రైతులు దాదాపు 20లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు అమ్ముకున్నట్లు సమాచారం. ఒక్కో రైస్మిల్లరు తమ ఆర్థిక స్థితిని బట్టి దాదాపు 20వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రూ.1600 కోట్ల పంట.. పెరిగిన ఖర్చు జిల్లాలో సాగు నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో వానాకాలం, యాసంగి సీజన్లలో వరి పండిస్తారు. వానాకాలంతో పోల్చితే యాసంగిలో దిగుబడి ఎక్కువగా ఉంటాయి. ఈ యాసంగిలో రైతులు వరి పండించి రూ.1600కోట్ల ధాన్యం విక్రయించారు. మరోవైపు ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి. నాట్ల సమయంలో ఒక్కో మహిళా కూలీకి రూ.500 నుంచి రూ.600, మగ మనిషికి రూ.800 నుంచి రూ.వెయ్యికి చేరాయి. ట్రాక్టర్తో దున్నడానికి ఎకరాకు రూ.5 నుంచి రూ.6వేలు అవుతోంది. రసాయన, క్రిమిసంహారక మందులకు ఎకరాకు రూ.పదివేల వరకు అవుతోంది. హార్వెస్టర్కు రూ.3వేలు చెల్లించాల్సి వస్తోంది. అన్ని ఖర్చులు పోను మిగిలిన ఆదాయంతోనే రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పు చెల్లించడం.. పిల్లలను చదివించడం.. వైద్యఖర్చులు భరించాల్సి వస్తోంది. దీనికి ఏటా అప్పు చేయాల్సి వస్తోంది. పంట పండుతున్నా తిరిగి అప్పు చేయాల్సి రావడంతో కొందరు భూములను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. దిగుబడి వస్తోంది ప్రతి సీజన్లో రెండుమూడెకరాల్లో వరి సాగు చేస్తాను. మంచి దిగుబది వస్తోంది. ఖర్చులు పెరగడం, మద్దతు ధర అంతంతే ఉండటంతో పెద్దగా లాభం ఉండటం లేదు. ఇతర పంటల వైపు మళ్లలేక వరి సాగు చేస్తున్నాను. – మహేందర్ రెడ్డి, తొంబర్రావుపేట అనువైన వాతావరణం జిల్లాలో వరి సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులున్నాయి. ఇతర జిల్లాలతో పోల్చితే ఒకట్రెండు క్వింటాళ్లు ఎక్కువ పండుతుంది. కొన్ని కంపెనీలు విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. ఖర్చులు తగ్గించడంపై రైతులు దృష్టి పెట్టాలి. – శ్రీలత, వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ -
మళ్లీ మొదటికేనా !?
కోరుట్ల: ధరణి పోర్టల్ లోటుపాట్లు సరిదిద్ది.. త్వరితగతిన భూ సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన భూ భారతి సదస్సులకు లెక్కలేని దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయికి వెళ్లి భూముల సర్వే, మ్యాప్ అటాచ్తో సరిహద్దుల నిర్ణయం వంటి అంశాలను నిర్ణయించనున్నారు. ఈ క్రమంలో అధికారుల కాలయాపన, అవినీతి తంతు వెంటాడే అవకాశం ఉండడంతో సమస్య మళ్లీ మొదటికి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పలు తెప్పలు.. భూభారతి సదస్సులు మొదలై ఐదు రోజులు గడుస్తున్న క్రమంలో కోరుట్ల, మెట్పల్లి రెవెన్యూ డివిజన్లలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది విరాసత్, కోర్టు కేసులు, సాదాబైనామాలు, గ్రామకంఠం, ఆబాది వంటి భూ సమస్యలను వేర్వేరుగా నమోదు చేసి వాటి పరిష్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భూ భారతి ప్రకారం 60 నుంచి 90 రోజుల్లోగా సమస్యను బట్టి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాలి. ప్రస్తుతం ఐదు రోజులుగా సాగుతున్న సదస్సుల్లో దరఖాస్తులు వందల సంఖ్యలో వస్తున్నాయి. నాలుగు రోజుల్లో కోరుట్ల, మెట్పల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఆరు మండలాల్లో 1800 దరఖాస్తులపైనే వచ్చాయి. మరో పది రోజుల గడువు ఉన్న క్రమంలో ఈ సంఖ్య 3వేల వరకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా ఆన్లైన్ చేస్తున్న రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారు. ఈ క్రమంలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు భూభారతి పోర్టల్లో సర్వే మ్యాప్ తప్పనిసరి. ప్రస్తుతం సర్వేయర్ల కొరత ఉన్న క్రమంలో మ్యాప్లను అనుసంధానించడంలోనూ ఆలస్యం జరిగే అవకాశం ఉందన్న వాదనలు వినవస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు సదరు భూముల వద్దకు వెళ్లి విచారణ చేసి భూభారతిలో భూమి హక్కుల నమోదు చేయడానికి నిర్ణీత కాల పరిమితి ఉన్నప్పటికీ ఆ లోపు ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు పరిష్కారం వీలవుతుందా..? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. ఈ జాప్యం కారణంగా రెవెన్యూ సిబ్బంది చేతులుచాచే సంస్కృతికి ఎక్కడ తెరలేపుతారో అన్న అనుమానాలు దరఖాస్తుదారులను వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భూభారతి చట్టం అమలుకు ఉన్నత స్థాయి అధికారులు మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు భూభారతి దరఖాస్తుల సర్వే తీరు -
స్లాటర్హౌస్ తనిఖీ
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని స్లాటర్ హౌస్ వద్ద పశువైద్యాధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. నిబంధనల ప్రకారమే పశువులను వధించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ సహాయ సంచాలకులు మదన్మోహన్, మున్సిపల్ పర్యవేక్షణ అధికారి కిరణ్రెడ్డి, వెటర్నరీ లైవ్స్టాక్ ఆఫీసర్ కందుకూరి పూర్ణచందర్, వెటర్నరీ అసిస్టెంట్ రవి పాల్గొన్నారు. దుబాయ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలుదుబాయ్లో ఆవిర్భావ వేడుకల్లో ఈటీసీఏ సభ్యులు రాయికల్: ఎమిరెట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో అజ్మాన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్కుమార్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్, కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతాచారి, యాదయ్య, సాయికుమార్ యాదవ్, నిషాంత్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి అమరుల త్యాగమే తెలంగాణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈటీసీఏ సభ్యుల పోరాటాన్ని వివరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు మామిడి శ్రీనివాస్, కోర్ కమిటీ సభ్యులు చీటి జగదీశ్రావు, అలిగేటి శ్రీనివాస్, కోట్ల రాణి, శేఖర్గౌడ్, తిరుమల్రావు పాల్గొన్నారు. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు చెల్లించాలి ● ఉద్యోగులను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ● ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక విస్మరిస్తోందని, వారికి పెండింగ్ డీఏలు చెల్లించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఉద్యోగులకు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలి ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని కవితను ఉద్యమకారులు కోరారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈనెల 14, 15న నిర్వహించే మహా చండీయాగంకు హాజరు కావాలని కోరారు. ఇటుకబట్టీలకు చెరువు మట్టి తరలింపు● తీర్మానం కాపీని మార్చిన వ్యాపారులు గ్రామపంచాయతీలో చేసిన తీర్మానం కాపీ సారంగాపూర్: మండలకేంద్రంలోని చింతల చెరువు మట్టిని ఇటుకబట్టీలకు తరలిస్తున్నారు. దీనిపై రైతులు శనివారం మాజీమంత్రి జీవన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. చెరువు మట్టిని రైతులు పొలాల్లో పోయించుకునేందుకు ఈనెల 5న గ్రామసభలో తీర్మానించారు. కొంతమంది ఇటుకబట్టీల వ్యాపారులు పొలాలతోపాటు ఇటుకబట్టీలకు తరలించాలంటూ కొన్ని పదాలు చేర్చారు. శనివారం జగిత్యాల ప్రాంతంలో నిర్వహించే బట్టీలకు మట్టిని తరలించేందుకు టిప్పర్లను తెప్పించారు. దీంతో రైతులు విషయాన్ని జీవన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇటుక బట్టీలకు మట్టి తరలింపును తక్షణమే ఆపాలని సూచించారు. ఈ విషయమై గ్రామ ప్రత్యేకాధికారి వివరణ ఇస్తూ.. గ్రామసభలో రైతులు మట్టి తరలించడానికి మాత్రమే తీర్మానం చేశామని, బట్టీలకు తరలించాలని నిర్వాహకులు చేర్చారని, దీనిపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. -
రారండోయ్.. సర్కారు బడికి
● ఊరూరా జయశంకర్ బడిబాట ● ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఇంటింటా ప్రచారం ● వినూత్న తరహాలో ఆకర్షించే కార్యక్రమాలు ● పిల్లలు సర్కారు బడిలో చేరాలని పిలుపుఇంగ్లిష్ మీడియం చదువులు.. ఉచితంగా ఏకరూప దుస్తులు.. షూలు.. చదువుకునేందుకు పాఠ్యపుస్తకాలు.. ఆకలేస్తే మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారం.. విశాలమైన డిజిటల్ తరగతి గదులు.. క్రీడా మైదానాలు.. సకల సౌకర్యాలు.. అన్నింటికీ మించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ఇంకెందుకు ఆలస్యం.. రారండోయ్ సర్కారు బడికి అంటూ.. ఊరూరా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రూ.లక్షలు పోసి ప్రైవేటులో చదివించే కన్నా.. అన్నీ ఉచితంగా అందిస్తున్న సర్కారు బడిలో చేరాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వినూత్నంగా ప్రచారం చేస్తూ.. పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై సండే స్పెషల్..ఇదే మా ఓపెన్ చాలెంజ్..● మా పిల్లల కన్నా ‘ప్రైవేటు’ వాళ్లు బాగా చదివితే రూ.500 నజరానా ● పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి స్కూల్ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం ధర్మారం: ‘ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మా పిల్లల కన్నా బాగా చదవగలరా..? అలా ఒక్క విద్యార్థి చదివినా రూ.500 నజరానా ఇస్తాం’.. అంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నారు. బడిబాటలో భాగంగా ఇంటింటా తిరుగుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీమోహనాచార్యులు, ఉపాధ్యాయులు కలిసి ఫిబ్రవరి 21నుంచే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు బడికి పంపించాలని కోరుతున్నారు. తమ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థుల కన్నా ప్రైవేటులో చదివేవారు ప్రతిభ కనబరిస్తే.. రూ.500నగదు బహుమతి అందిస్తాని చాలెంజ్ చేస్తున్నారు. పాఠశాల ప్రత్యేకతలను వివరిస్తూ.. ఇంటింటా కరపత్రాలు పంచుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలో 36 మంది విద్యార్థులుండగా.. బడిబాటలో భాగంగా 14మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్ఎం తెలిపారు. గ్రామంలోని ప్రతీ విద్యార్థి సర్కారు బడికి వచ్చేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు.– వివరాలు 10లోu -
ఒబులాపూర్లో చిరుత సంచారం
● గొర్రెను చంపినట్లు అనుమానాలు మల్యాల: మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు. శనివారం గ్రామానికి చెందిన గుగ్గిళ్ల తిరుపతి అనే గొర్రెల కాపరి తన గొర్రెల మందను సమీప అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లగా.. ఓ గొర్రైపె చిరుత దాడి చేసి చంపిందని బాధితుడు తెలిపారు. గొర్రెలకాపరి అరవడంతో పారిపోయిందని పేర్కొన్నాడు. గ్రామాన్ని ఆనుకొని ఉన్న గుట్టల ప్రాంతంలో చిరుత సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మృతి చెందిన గొర్రెతో తిరుపతి -
కేబినెట్లోకి ఎవరో?
● ఉమ్మడి జిల్లా నుంచి ఒకరికి అవకాశం ● కవ్వంపల్లి, ఆది, అడ్లూరిలో ఒకరికి చోటు? ● ఉత్కంఠలో ఆశావహులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎప్పుడెప్పుడా... అని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్ విస్తరణ ఆదివారం జరుగనుంది. కేబినెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రి పదవి దక్కడం ఖాయమనే సమాచారం ఉంది. ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరికి చోటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గురించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఆలోచన చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టే భాగంగా అధిష్టానం ఉమ్మడి జిల్లాలో ఒకరికి మంత్రి పదవీ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ విప్గా కొనసాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్నూరు సామాజికవర్గం కోటాలో మంత్రివర్గంలో బెర్తు ఖాయమనే ఊహగానాలు వినబడుతున్నాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్, జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కేబినెట్లో చోటు ఖాయమని వారి అనుచరులు ధీమాగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు వ్యవహరిస్తుండగా ప్రస్తుత మంత్రివర్గంలో ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరిని తీసుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా పార్టీ అధిష్టానం సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు కొత్తగా ఎన్నికై న నేతలు, సీనియర్ నేతలను సామాజిక వర్గం అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కరీంనగర్ నుంచి కేబినెట్లో ఒకరిని మంత్రిగా నియమించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఆదివారం జరిగే కేబినెట్ విస్తరణలో జిల్లా నుంచి ఈ ముగ్గురిలో ఒకరికి చోటు దక్కి ఉత్కంఠకు తెరపడనుంది. -
పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
జగిత్యాలరూరల్ః మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాల ని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘుచరణ్ అన్నారు. శుక్రవారం జగిత్యాలరూరల్ ఐకేపీ కార్యాలయంలో జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల మహిళా స్వయం సహాయక సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణాలు ఇస్తూ ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తోందన్నారు. అలీవ్ మహిళా శక్తి రాష్ట్ర ప్రాజెక్టు అధికారి పద్మావతి అన్నపూర్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ఐకేపీ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏఎల్ఈఏపీ ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాంప్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శా ఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల సహకారంతో ఒకరోజు గ్రామీణమహిళలకు అవగా హన కల్పించి ఔత్సాహిక మహిళలకు 15 రోజు లు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖాధికారి యాదగిరి, ఏపీడీ చరణ్దా స్, డీపీఎం భారతి, మల్లేషం, జిల్లా ఏపీఎం చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది లేరు.. రసాయనాలు లేవు
● జిల్లాలో భూసార పరీక్షలకు మంగళం ● పరీక్షలు నిలిచిపోవడంతో రైతులకు అందని సేవలు భూసార పరీక్షలు జరగడం లేదు జిల్లాలో భూసార పరీక్షలు జరగడం లేదు. భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు చే సి సిబ్బందిని నియమించాలి. – క్యాతం సాయిరెడ్డి, సింగరావుపేట, రాయికల్(మం)ప్రభుత్వానికి నివేదిక పంపించాం జిల్లాలో భూసార పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. గతంలోని రెండు భూసార పరీక్షా కేంద్రాలు పనిచేయడం లేదు. ఎవరైన రైతులు మట్టి నమూనాలు తీసుకవస్తే, భూ సార పరీక్షా కోసం కరీంనగర్కు లేదా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి పంపిస్తున్నాం. త్వరలో మిని భూసార పరీక్షా కేంద్రాలను బలోపేతం చేస్తాం. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి జగిత్యాలఅగ్రికల్చర్: పంటల సాగులో రైతులు విలువైన రసాయన ఎరువులను ఇష్టారాజ్యంగా వేస్తుండటంతో వ్యవసాయభూములు పనికి రాకుండా పోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. భూసార పరీక్షల అధారంగా రసాయన ఎరువులు వేస్తే, రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా భూములు చెడిపోవని, పర్యావరణం దెబ్బతినదని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే, జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించే పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో మూడేళ్లుగా రైతులు భూసార పరీక్షలకు నోచుకోవడం లేదు. జిల్లాలో భూసార పరీక్షా కేంద్రాలు లేనట్లే.. జిల్లాలో జగిత్యాల, మెట్పల్లిలో మార్కెట్యార్డులో భూసార పరీక్షా కేంద్రాలు ఉండేవి. పరీక్షా కేంద్రాలకు అవసరమైన రసాయనాల కోసం ఏడాదికి రూ.20–30 వేలు ఆయా మార్కెట్ యార్డుల నుంచి ఇచ్చేవారు. ఈ కేంద్రాల్లో పరీక్షలు చేసేందుకు వ్యవసాయాధికారులతో పాటు వ్యవసాయ సిబ్బంది ఉండేవారు. కాని, కొంతకాలంగా ఈ భూసార పరీక్షా కేంద్రాల్లో సిబ్బంది లేకపోవడంతో పాటు జగిత్యాలలోని భూసార పరీక్షా కేంద్రాన్ని సమీకృత మార్కెట్ నిర్మాణంలో భాగంగా కూల్చివేశారు. అలాగే, మెట్పల్లిలోని భూసార పరీక్షా కేంద్రం పత్తా లేకుండా పోయింది. దీంతో, భూసార పరీక్షలు నిలిచిపోవడంతో, రైతులకు అందించే సేవలు అందకుండా పోయాయి. మినీ భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినా.. అగ్రికల్చర్ క్లస్టర్ల వారీగా ఏఈవోలను నియమించిన తర్వాత మినీ భూసార పరీక్షా కేంద్రాలను అయా క్లస్టర్లలో ఏర్పాటు చేశారు. రైతు వేదికలు కాక ముందు గ్రామ పంచాయతీ లేదా ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసినప్పటికీ వాటితో పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీనికి తోడు మినీ భూసార పరీక్షా కేంద్రాలకు భూసార కిట్లు ఇచ్చినప్పటికీ అందులోని రసాయనాలు పనిచేయకపోవడంతో అవి సైతం మూలన పడ్డాయి. అయితే, గ్రామాల నుంచి రైతులు తీసుకవచ్చే మట్టి నమూనాలను కరీంనగర్కు పంపించేవారు. వాటి ఫలితాలు రైతులు పంటలు వేసిన తర్వాత ఎప్పుడో వచ్చేవి. అవి సైతం రైతులకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయాయి. అవసరమైన రైతులు పొలాసకు.. ఉద్యాన పంటలను పెద్ద మొత్తంలో సాగు చేసే జిల్లా రైతులు మాత్రం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం లేదంటే పొలాస వ్యవసాయ కళాశాలకు తీసుకెళ్లి మట్టి పరీక్షలు చేయించుకుంటున్నా రు. చల్గల్ ఫాంలో భూసార పరీక్షా కేంద్రం ఉన్న ట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికీ ఏ రైతుకు తెలియని పరిస్థితి ఉంది. పొలాస శాస్త్రవేత్తలు మాత్రం వారి నిబంధనల మేరకు కేవలం దత్తత గ్రామ రైతులకు ఉచితంగా పరీక్షలు చేస్తుండగా, మిగతా రైతులకు రూ.150 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో, చిన్న, సన్న కారు రైతులు కాకుండా కేవలం అవసరమైన రైతులు మాత్రమే భూసార పరీక్షలు చేయించుకుంటున్నారు. -
అతివలు తోడుగా..
జగిత్యాల: మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తూ ఆరోగ్యమిత్ర పథకాన్ని అమలు చేస్తోంది. మహిళా సంఘాల మద్దతుతో పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు అభివృద్ధిలో సైతం వారు పాలుపంచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కార్పొరేషన్లో ఆరోగ్యమిత్ర పథకం సత్ఫలితాలివ్వడంతో మున్సిపాలిటీలో సైతం ఏర్పాటు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. సభ్యుల ఎంపిక మున్సిపాలిటీల్లో ముందుగా సభ్యులను అమృత్ మిత్రులుగా ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో చేపట్టే పనులను వీరు పర్యవేక్షిస్తుంటారు. సుమారు రూ.2 లక్షల నుంచి రూ.0 లక్షల వరకు ప్రాజెక్ట్ను ఎంపిక చేసుకుని దానిని చేసేలా చర్యలు తీసుకుంటారు. వీరు ఏటా సుమారు రూ.30 లక్షల నిధులు వెచ్చిస్తుంటారు. మహిళా సంఘాలకు సైతం ఎవరు మంచి పనులు చేస్తుంటే వారికి గ్రేడింగ్స్ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసే నిధులతో చేపట్టే పనులను సైతం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. వీరు నీటి సరఫరా, తాగునీటి పరిశుభ్రత, పైప్లైన్ లీకేజీలు, పారిశుధ్య పనులు, పర్యవేక్షణ, మొక్కలు నాటడం తదితర పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే పట్టణంలో వాల్పేయింటింగ్స్, పచ్చదనం పరిశుభ్రత, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ తెలిపేలా పెయింటింగ్లు వేసి ప్రజల్లో చైతన్యం తెచ్చేలా వీరు చర్యలు తీసుకోవాలి. అమృత మిత్రులకు పారితోషికం సైతం అందజేస్తారు. అమృత మిత్రుల ఎంపిక మున్సిపాలిటీల్లో స్వయం సహాయక సంఘాలు అమృత్ 2.0 నిధులు విడుదల చేసేందుకు అమృత్ మిత్రులను ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా పట్టణంలోని జనాభా, స్వయం సహాయక సంఘాలు, సభ్యుల సంఖ్యతో పాటు, పేదలు నివసించే ప్రాంతాలను గుర్తించి అక్కడి వారినే అమృత్ సంఘాలుగా గుర్తిస్తారు. ప్రతీ ఒక్క మహిళా సంఘాల గ్రూపునకు అకౌంట్ ఉండాల్సి ఉంటుంది. కనీసం 8వ తరగతి వరకు అర్హత ఉన్న వారినే ఎంపిక చేస్తారు. ఎంపికై న తర్వాత మున్సిపాలిటీ ప్రతీ పనిని పర్యవేక్షిస్తుంటారు. మున్సిపాలిటీల్లో సుందరీకరణ ఆరోగ్య మిత్ర పథకం అమలు మహిళా సంఘాల భాగస్వామ్యంచెరువుల చుట్టూ మొక్కలు నాటడం ముందుగా పర్యవరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అమృత్ 2.0 పథకం కింద ఎంపికై న చెరువులను ఈనెల 21 నుంచి 23 వరకు పరిశీలించనున్నారు. చెరువులు ఎలా ఉన్నాయి, చెరువుల వద్ద ఎలాంటి సమస్యలున్నాయో పరిశీలిస్తారు. అనంతరం జూన్ 5 నుంచి ఆగస్టు 30 వరకు చెరువుల చుట్టూ మొక్కలు నాటనున్నారు. ఇలా ప్రతీ మున్సిపాలిటీలో చేపడతారు. మహిళల భాగస్వామ్యంతో పట్టణాల సుందరీకరణ అవుతుందనే ఉద్దేశంతో వారికి మంచి అవకాశాలు కల్పించింది. జిల్లాలో మొత్తం మున్సిపాలిటీలు 5పట్టణ మహిళా సమైక్య సంఘాలు 5మెప్మా రిసోర్స్పర్సన్లు 173స్వయం సహాయక మహిళ సంఘాలు 5,361మహిళా సంఘాల సభ్యులు 58,076 -
రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి
రాయికల్: రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. శుక్రవారం రాయికల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.12 ఏళ్ల పాటు సాగు చేస్తునన రైతులు పట్టా పొందేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. ఏళ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని భూపంచాయితీలు భూభారతిలో పరిష్కార దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. అనంతరం రామాజీపేట గ్రామంలో గంగమ్మతల్లి కల్యాణంలో మాజీ మంత్రి జీవన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపిరాజరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోయ్యడి మహిపాల్రెడ్డి, నాయకులు దివాకర్రెడ్డి బాపురపు నర్స య్య, తలారి రాజేశ్, షాకీర్, పొన్నం శ్రీకాంత్, గుమ్మడి సంతోశ్ పాల్గొన్నారు. -
బక్రీద్ పండుగకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ అశోక్కుమార్జగిత్యాలక్రైం: జిల్లాలో బక్రీద్ పండుగకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, మసీదులు, మార్కెట్ ప్రాంతాలు, టవర్ సర్కిల్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పోలీసు పికెటింగ్లను పరిశీలించారు. శనివారం నిర్వహించే బక్రీద్ పండుగను అందరూ కలిసి మెలిసి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతీ చెక్పోస్టు వద్ద పోలీసు సిబ్బందితో 24 గంటల వాహనాల తనిఖీ చేపట్టి పశువుల అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వందతులను నమ్మొద్దని, వాటిని సంబంధిత అధికారుల దృస్టికి తీసుకరావాలని సూచించారు. ఎస్పీ వెంట ఎస్బీ సీఐ అరీఫ్ అలీఖాన్, టౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్ పాల్గొన్నారు. పదోన్నతి బాధ్యతలు పెంచుతుంది పోలీస్శాఖలో పదోన్నతి మరింత బాధ్యతలు పెంచుతుందని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పోందిన మహ్మద్ ఆరీఫ్కు పదోన్నతి స్టార్ సింహాన్ని అలకరించారు. ప్రజల్లో పోలీస్శాఖపై గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలన్నారు. -
నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సిందే
9సాక్షి ప్రతినిధి, కరీంనగర్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు రావాలంటే.. తప్పకుండా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సిందేనని కరీంనగర్ పార్లమెంటరీ నాయకులు అధిష్టానానికి స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో కరీంనగర్ పార్లమెంటరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లా నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా నేతలందరి నోట దాదాపుగా ఒకే డిమాండ్ వినిపించింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. డీసీసీ, కార్పొరేషన్ చైర్మన్లు సహా ఎలాంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంపై కిందిస్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వెల్లడించారు. వెంటనే పోస్టులు భర్తీ చేయకపోతే.. పార్టీకి క్షేత్రస్థాయిలో జరిగే నష్టాలను వివరించారు. పదవులు భర్తీ చేయలేకపోతే.. గ్రామాల్లో సమాధానం చెప్పే పరిస్థితి కూ డా ఉండదని కుండబద్ధలు కొట్టారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న మీనాక్షి.. త్వరలోనే పదవుల భర్తీ ఉంటుందని, కష్టపడి పనిచేసిన వారందరికీ సముచితస్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అధిష్టానం ఇచ్చే ప్రొఫార్మా ప్రకారం.. పేర్లు పంపాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ల విలీనం తథ్యం పథకాల అమలులో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, సన్నబియ్యం, ఇందిరమ్మ పథకాల అమలు తీరును మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ ధర్మం పేరుతో చేస్తున్న చర్యలను ఎక్కడికక్కడ ప్రజలకు వివరించాలన్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ బీజేపీ వ్యవహరించిన తీరును, దాని వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ ఏనాటికై నా బీజేపీలో విలీనం కావాల్సిందేనని, ఆ పార్టీల మైత్రిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇక తాము ఎన్నికల ముందు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, తమకు న్యాయం జరగాలని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే.మహేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తదితరులు గుర్తుచేశారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రణవ్బాబు, మాజీ మంత్రి జీవ న్రెడ్డి, సీనియర్ నేత కటకం మృత్యుంజయం, సు డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షికి స్పష్టం చేసిన కరీంనగర్ పార్లమెంటరీ నేతలు త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన మీనాక్షి నటరాజన్ బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీని ఎండగట్టాలని పిలుపు -
14న జాతీయ లోక్ అదాలత్
జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని న్యాయమూర్తులు, పోలీసులు, న్యాయసేవా సంస్థ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజీ చేసుకోదగిన కేసులను లోక్అదాలత్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్పై కక్షిదారులకు అవగాహన కల్పించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చొరవ చూడాలని తెలిపారు. సమావేశంలో ఎస్పీ అశోక్కుమార్, జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ, సీనియర్ సివిల్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మాణ శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, డీఎస్పీలు రాములు, రఘుచందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మల్లికార్జున్, రజనీ, ఏజీపీ ఓంప్రకాశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ కటుకం చంద్రమోహన్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.‘భూభారతి’ని సద్వినియోగం చేసుకోవాలిమల్యాల: రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ బీఎస్. లత అన్నారు. మల్యాల మండలం మానాల గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును సందర్శించి రైతుల నుంచి స్వీకరించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు తమ భూముల సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వసంత, ఆర్ఐ రాణి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మెరుగైన విద్య అందించడమే లక్ష్యం మెట్పల్లిరూరల్: బడి ఈడు పిల్లలందరికీ మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోందని జిల్లా విద్యాధికారి రామునాయక్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెట్పల్లి మండలం వేంపేటలో గ్రామసభ నిర్వహించి వీధులో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మౌలిక వసతుల గురించి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయురాలు నాగరాజకుమారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్, ప్రవీణ్, శేఖర్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఒకే పంటపై అధారపడొద్దుజగిత్యాలఅగ్రికల్చర్: రైతులు ఎప్పడు ఒకే పంటపై ఆధారపడొద్దని వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ డాక్టర్ శ్రీలత అన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం దత్తత గ్రామమైన రాయికల్ మండలం అల్లీపూర్లో శుక్రవారం రైతులకు వానాకాలం సాగులో మెలకువలపై అవగాహన కల్పించారు. విభిన్న పంటలు సాగు చేయడం వల్ల ఒక పంటకు ఆదాయం రాకున్నా మరో పంటకు వస్తుందన్నారు. పంట మార్పిడి వల్ల తెగుళ్లు, పురుగుల విజృంభన ఉండదని తెలిపారు. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడాలని సూచించారు. దత్తత గ్రామ ఇన్చార్జి డాక్టర్ రజనీదేవి, శాస్త్రవేత్తలు రజనీకాంత్, శ్రీనివాస్, రవి, స్వాతి, ఏఈవో సృజన, ఎఫ్ఈఓ చైర్మన్ అత్తినేని శంకర్, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
జగిత్యాల
న్యూస్రీల్ఘనంగా గంగమాతకు బోనాలు మల్లాపూర్: మండలంలోని వేంపల్లిలో శుక్రవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీగంగామాతకు బోనాలు సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు నెత్తిన బోనాలతో వెళ్లారు. గ్రామపురవీధుల వెంట గంగపుత్రులు గొల్లెంతో చేసిన విన్యాసాలు అలరించాయి. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్, గంగపుత్ర సంఘం నాయకుడు గుమ్ముల లింగారెడ్డి, గంగపుత్ర సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025 -
చెరువు నీటిని తరలిస్తే చర్యలు
పెగడపల్లి: చెరువులోని నీటిని అక్రంగా తరలిస్తే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కాళేశ్వరం లింక్–2 కింద చేపట్టిన పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్న స్థలం పక్కన ఉన్న జంగంకుంట చెరువులోని నీటితో పనులకు ఆటంకం కలుగుతుందని పనులు చేస్తున్న మెగా కంపెనీ వారు చెరువులోని నీటిని అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక రైతులు గురువారం కలెక్టర్ సత్యప్రసాద్, పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం చెరువును స్థానిక రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు కేవలం రూ.7నుంచి 9 లక్షలు చెల్లించి రైతులకు ఆర్థికంగా నష్టం చేశారని, చొప్పదండి నియోజకవర్గంలో భూరిజిస్ట్రేషన్ విలువ పెంచి ఇదే ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.22 లక్షలు చెల్లించినట్లు గుర్తు చేశారు. లక్షల విలువ చేసే భూములను రైతులు త్యాగం చేయడం వల్లనే ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్న విషయాన్ని మరిచిపోకుండా పనులు జరపాలే తప్ప రైతులకు నష్టం చేసేలా వ్యవహరిస్తే ఊరుకునేంది లేదని హెచ్చరించారు. చెరువు ఆధారంగా సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళన చెందొద్దని, అవసరమైన చెరువును నీటితో నింపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ వెంట ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఇరిగేషన్ డీఈ నర్సింగారావు, తహసీల్దార్ రవీందర్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, భరత్రెడ్డి, పవన్రెడ్డి, రవి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బడిబాటను విజయవంతం చేయాలి
జగిత్యాల: జిల్లాలో బడిబాటను విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బడిబాటపై కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో బడిబాటపై అవగాహన కల్పించి, చిన్నారులను చేర్పించేలా చూడాలన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు ఇంటింటా సర్వే చేసి గుర్తించినప్పుడే బడిబాట విజయవంతం అవుతుందన్నారు. త్వరలో పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మౌలిక వసతులు, తరగతి గదుల్లో శుభ్రం చేపించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈవో రాము, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలి జిల్లాలోని మున్సిపాలిటీల్లో లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలని, పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని, 100 రోజుల ప్రణాళికను పక్కగా అమలు చేయాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కమిషనర్లు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ల తనిఖీ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవాం తనిఖీ చేశారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, నాయకులు బండ శంకర్, సత్యనారాయణ పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికే ‘భూభారతి’ మల్లాపూర్/రాయికల్: భూ సమస్యలతో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు సత్వర పరిష్కారం చూపేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండలంలోని సాతారం, రాయికల్ మండలం మండలంలోని వీరాపూర్, ధావన్పెల్లి గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సదస్సుల నిర్వహణ, సమస్యలపై రైతులు అందిస్తున్న దరఖాస్తుల తీరును పరిశీలించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. భూ రికార్డుల ఆధారంగా వివాదాలు లేకుండా సర్వే చేసి భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సదస్సుల్లో ఆర్డీవోలు శ్రీనివాస్, మదుసూదన్, తహసీల్దార్లు రమేశ్గౌడ్, నాగార్జున, ఆర్ఐ రాజేశ్, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, పంచాయతీ కార్యదర్శి వినోద్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
ఫిట్గా ఉన్నాయా?
జగిత్యాలక్రైం: వేసవి సెలవుల అనంతరం మరోవారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవే టు పాఠశాలల విద్యార్థులను వాహనాల్లో ఇంటి నుంచి తీసుకెళ్లి సాయంత్రం దింపేస్తుంటారు. చి న్నారులను తీసుకెళ్లే వాహనాలు ఫిట్గా ఉండాలనే ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యాసంస్థల ప్రారంభానికి ముందు రవాణాశాఖ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అన్ని సరిగా ఉంటే రోడ్డెక్కేందుకు అనుమతి పత్రం జారీ చేస్తారు. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వాహనాల ఫిట్నెస్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకు చెందిన వాహనాలు 507 ఉండగా.. బుధవారం వరకు 201 వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. మరో 306 వాహనాలు ఫిట్నెస్ పరీక్షలకు రావాల్సి ఉందని రవా ణాశాఖ అధికారులు వెల్లడించారు. 15 ఏళ్లు దాటిన బస్సులకు ఫిట్నెస్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఫిట్నెస్ తప్పనిసరి గడువులోపు ప్రైవేటు పాఠశాలల బస్సులకు పాఠశాల యాజమాన్యాలు విధిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో ఉన్న జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఇప్పటి వరకు 201 వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. గతేడాది ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్ గడువు ముగిసింది. పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండటంతో ఫిట్నెస్ ఉంటేనే వాహనాలను రోడ్లపై తిప్పాలని, అతిక్రమిస్తే సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవీ నిబంధనలు పాఠశాల బస్సు 15ఏళ్ల కాలపరిమితి దాట కూడదు. విద్యాసంస్థల వాహనాలు పసుపు రంగులోనే ఉండాలి. డ్రైవర్కు హెవీ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. వయస్సు 60ఏళ్లలోపు ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. బస్సుపై కుడి ఎడమ వైపు పాఠశాల పేరు, చిరునామా స్పష్టంగా రాయాలి. వాహనం ఆగితే బ్లింక్ అయ్యేలా పైభాగంలో నాలుగు వైపులా అంబర్ లైట్లు ఉండాలి. బస్సులో ప్రథమ చికిత్స పెట్టె, మంటలను ఆర్పే వ్యవస్థ ఉండాలి. కిటికీలకు అడ్డంగా మూడు కడ్డీలు ఉండాలి. నేల నుంచి 325 మిమీ ఎత్తులో మెట్లు, ఎక్కేందుకు హ్యాండ్ రెయిలింగ్ ఉండాలి. అత్యవసర ద్వారం, బస్సు డ్రైవర్, అటెండర్ ఫోన్ నంబర్లు విధిగా ఉండాలి. డ్రైవర్కు బీపీ, షుగర్, కంటి పరీక్షలను చేయించాలి. సీరియల్ నంబర్తో కూడిన ఫిర్యాదుల పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలి. టీఎస్ స్కూల్ యాప్ ద్వారా విద్యా సంస్థ పేరు, డ్రైవర్, అటెండర్ పేరు వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి స్కూల్యాప్లో పొందుపర్చాలి. ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలపై రవాణాశాఖ దృష్టి కొనసాగుతున్న వాహన సామర్థ్య పరీక్షలు రోడ్డెక్కాలంటే ఫిట్నెస్ తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు జిల్లాలో 507 ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలునిబంధనలు పాటించాలి పాఠశాలలు, కళాశాలల యజమానులు నిబంధనలు పాటించాలి. బస్సులకు విధిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. ఫిట్నెస్ లేకుండా పాఠశాల బస్సులు రోడ్లపై తిరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కాలం చెల్లిన బస్సులను రోడ్లపై తిప్పరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతాం. – భద్రునాయక్, జిల్లా రవాణాశాఖ అధికారి -
పట్టణాల అభివృద్ధికి నిధులు
జగిత్యాల/రాయికల్: జగిత్యాల మున్సిపాలిటీకి రూ.70 కోట్లు, రాయికల్ బల్దియాకు రూ.15 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో పట్టణాల అభివృద్ధికి నాంది పలుకుతోంది. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలకు నిధులు కేటా యించారు. జగిత్యాలకు రూ.20 కోట్లతో పాటు స్పెషల్ గ్రాంట్ కింద మరో రూ.50 కోట్లు కేటా యించారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. దీంతో జగిత్యాలకు రూ.70 కోట్లు, రాయికల్కు సీడీఎంఏ నుంచి రూ.15 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. రోడ్లు, మురికికాలువలు, డివైడర్లు, పార్క్లు, వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో జగిత్యాల మున్సిపాలిటీలో మోతె, తిప్పన్నపేట, శంకులపల్లి, హస్నాబాద్, ధరూర్, గోవిందుపల్లి విలీనమయ్యాయి. తాజాగా నూకపల్లి డబుల్బెడ్రూం కాలనీని కలుపుతూ గెజిట్ విడుదల చేశారు. వాటి అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా లింగం చెరువు వద్ద మొక్కలు నాటారు. నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.85కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. విలీన గ్రామాల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో త్వరలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కృషిచేస్తున్నానని, తాగునీటి కోసం ప్రత్యేకంగా రూ.36 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ కౌన్సిలర్ శ్రీలత, సత్యం పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపాలిటీకి రూ.70 కోట్లు రాయికల్ బల్దియాకు రూ.15 కోట్లు మంజూరు -
లారీలు ఢీ.. ఒకరు మృతి
హుజూరాబాద్: ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్న తుమ్మన్నపల్లి గ్రామం మీదుగా వెళ్తున్న వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరగగా.. ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామానికి చెందిన దాచేపల్లి కృష్ణకిషోర్(44) లారీని ఎదురుగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. కృష్ణకిశోర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టమ్మీద క్షతగాత్రుడికి బయటికి తీసి చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. లారీ క్లీనర్ మస్తాన్, మరో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు లారీలు బ్రిడ్జిపై ఢీకొనగా.. అటు వరంగల్, ఇటు కరీంనగర్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సీఐ కరుణాకర్నడిగి తెలుసుకున్నారు. -
పెళ్లికి వెళ్తూ.. మృత్యు ఒడికి
సాక్షి పెద్దపల్లి: పెళ్లి ఇంటికి చేరుకోవాల్సిన దంపతులను లారీ రూపంలో వచ్చిన మత్యువు కబళించింది. జీవితంలోనే కాదు... మరణంలోనూ తమ బంధం విడదీయరానిదంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధురాలిని తప్పించబోయి, దంపతుల బైక్ను లారీ ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. ప్రమాదంలో దంపతులు మతిచెందగా, మూడేళ్లు కూతురు తీవ్రగాయల పాలైంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై శ్రావణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా పాలకూర్తి మండలానికి చెందిన డ్రైవర్గా పనిచేస్తున్న గుంటిపల్లి రాము(30) భార్య అనూష(27), కూతురు సహాస్ర(03)లు కలిసి హూజూరాబాద్లోని బంధువుల పెళ్లికి వెళ్లాడానికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ క్రమంలో సుగ్లాంపల్లి వద్దకు రాగానే పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీకి వృద్ధురాలు అడ్డుగా రావడంతో లారీ డ్రైవర్ ఆమెను తప్పించబోయాడు. దీంతో లారీ డివైడర్ ఎక్కి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్య అనూష అక్కడిక్కడే మృతిచెందగా, భర్త సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు.. కూతురుకు తీవ్రగాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐలు సుబ్బారెడ్డి, అనిల్లు అసుపత్రికి వచ్చి వివరాలను ఆడిగి తెలుసుకున్నారు. బసంత్నగర్లో విషాదం పాలకుర్తి: మరో రెండు రోజుల్లో బావమరిది వివాహం. ఎంతో సంబరంగా బయలుదేరిన భార్యాభర్తలు మార్గమధ్యంలో మృత్యువు కబలించడంతో బసంత్నగర్లో విషాదం నెలకొంది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సహస్ర చావుబతుకులమధ్య వరంగల్ ఎంజీఎంలో పోరాడుతోంది. బసంత్నగర్లోని రాంనగర్కు చెందిన గుంటుపల్లి రాము స్థానికంగా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రి కుమారస్వామి చనిపోగా, తల్లి పద్మ కాయాకష్టం చేసి కొడుకు రాము, బిడ్డ రమ్యను ఎంతో అల్లారుముద్దుగా పెంచింది. కొడుకు, కోడలు చనిపోయిన వార్త విన్న తల్లి పద్మ రోదనలు అక్కడున్నవారిని కంటతడిపెట్టించాయి. ● రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి ● వృద్ధురాలిని తప్పించబోయి దంపతులపైకి దూసుకెళ్లిన లారీ ● తీవ్ర గాయాలతో బయటపడిన మూడేళ్ల చిన్నారి -
ఎస్సెస్సీ బోర్డు తప్పిదం.. విద్యార్థినికి అన్యాయం
రామగిరి(మంథని): ఎస్సెస్సీ బోర్డు అధికారుల తప్పిదంతో విద్యార్థినికి అన్యాయం జరిగింది. రామగిరి మండలం బేగంపేటకు చెందిన సిరిపురం వర్షిత సెంటినరికాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదివింది. వార్షిక పరీక్షల్లో 567 మార్కులు సాధించింది. చదువులో మొదటి స్థానంలో ఉండే వర్షిత తనకు వచ్చిన మార్కుల పట్ల సంతృప్తి చెందక బోర్డు అధికారులకు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. బోర్డు ఆదేశాలతో మరోసారి పరిశీలించగా అసలు తప్పిదం బయటపడింది. పార్ట్–బీ పేపర్ కౌంట్ చేయలేదని గుర్తించి ఇప్పుడు 20 మార్కులు కలిపి మొత్తం 587 మార్కులుగా బోర్డు నుంచి మార్కుల మెమో అందజేశారు. రీ వెరిఫికేషన్లో 20 మార్కుల పెంపుతో వర్షిత జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. అధికారుల తప్పిదం వల్ల తమ బిడ్డకు తీవ్ర అన్యాయం జరిగిందని వెంటనే బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రీ వెరిఫికేషన్లో 20 మార్కులు పెంపు -
రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా చామనపల్లి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్రస్ధాయిలో ఉత్తమ పంచాయతీగా అవార్డు సాధించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం హైదరాబాద్లోని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్బోర్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్రావు ఉత్తమ పంచాయతీ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. రాష్ట్రస్ధాయిలో ఈ అవార్డు కోసం మూడు గ్రామపంచాయతీలు ఎంపిక చేయగా చామనపల్లి పంచాయతీకి మొదటి స్థానం లభించింది. సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, స్వచ్ఛత, పర్యావరణం, పచ్చదనం. సెగ్రేషన్షెడ్, కంపోస్టు ఎరువుల తయారీ, విటమిన్ గార్డెన్, ప్లాంటేషన్, కమ్యూనిటీ సోక్ పిట్స్ తదితర అంశాల్లో చామనపల్లి పంచాయతీ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి మొదటిస్ధానంలో నిలిచింది. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీవో సీహెచ్.జగన్మోహన్రెడ్డి, కార్యదర్శి మహేందర్రావు, పంచాయతీ సిబ్బందిని మంత్రి సురేఖ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, టీఎస్ పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు. -
‘లక్కీ’ లాటరీ మోసాలపై స్పందించండి
● నివేదిక ఇవ్వాలని సీపీకి హెచ్ఆర్సీ ఆదేశాలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: లక్కీలాటరీ మోసాలపై ఎట్టకేలకు మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) స్పందించింది. కరీంనగర్ వేదికగా పలుకంపెనీలు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాలలోని మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని లక్కీ లాటరీలు నడిపి ప్రజలను మోసం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని 2022 అక్టోబరులో ‘లక్కీ లాటరీ మోసాలు’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఉచిత బహుమతులు, నగదు బహుమతులు ఇస్తామంటూ పేదలకు ఆశచూపించి వారి నుంచి రూ.కోట్లు కాజేసి పరారయ్యారు. ఈ విషయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కరీంనగర్కు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించాడు. దీంతో జరిగిన ఘటనపై ఈనెల 24వ తేదీలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కరీంనగర్ సీపీకి హెచ్ఆర్సీ ఆదేశించింది. రాజన్న గోశాలలో మరో రెండు కోడెలు మృతివేములవాడఅర్బన్: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్లోని గోశాలలో గురువారం అనారోగ్యంతో మరో రెండు కోడెలు మృతిచెందినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి ప్రకటనలో తెలిపారు. అకాలవర్షాలు, అనారోగ్య పరిస్థితులతో గోశాలలో ఇప్పటి వరకు 28 కోడెలు మృతి చెందినట్లు వివరించారు. గోశాలలో ఉన్న 1,300 కోడెలలో ప్రస్తుతం 12 కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. వీటికి వెటర్నరీ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దాణాపూర్ ఎక్స్ప్రెస్ నుంచి కిందపడిన యువకుడుఓదెల(పెద్దపల్లి): సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలునుంచి కిందపడిన యువకుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాలు.. గురువారం గోదావరిఖనికి చెందిన కంకణాల సంతోష్ రామగుండం వచ్చేందుకు కాజీపేట్లో దాణాపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి డోర్ వద్ద కూర్చున్నాడు. పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కిందపడగా తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. బ్లూకోల్ట్ పోలీసులు శంకర్, శివశంకర్ వెంటనే స్పందించి పట్టాల మధ్య ఉన్న సంతోష్ను బయటకు తీసుకువచ్చి అంబులెన్స్లో సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు..
మెట్పల్లి: పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో గురువారం రాత్రి ఇసుక ట్రాక్టర్ ఢీకొని బండలింగాపూర్కు చెందిన గుగ్గిళ్ల రవి మృతి చెందాడు. రవి ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై మెట్పల్లికి వచ్చి తిరిగి బండలింగాపూర్కు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో పట్టణ శివారుకు చేరుకోగానే, ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని రోదించారు. -
ట్రాక్టర్ బోల్తాపడి యువరైతు..
మల్లాపూర్: వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి యువ రైతు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట శివారులో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెదలి ప్రవీణ్(30)కు భార్య రమ్య, ఇద్దరు కొడుకులున్నారు. గ్రామశివారులోని తన వ్యవసాయ భూమిని చదును చేసేందుకు పెద్ద కుమారుడు శ్రీహాన్తో కలిసి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన శ్రీహాన్ను స్థానికులు మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. -
అప్పుల బాధతో ఆత్మహత్య
మల్యాల: అప్పుల బాధ భరించలేక ఇంటి నుండి వెళ్లిపోయిన వ్యక్తి వ్యవసాయ బావిలో శవమై తేలాడు. మల్యాల ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. నూకపల్లి డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసముంటున్న నాగరాజు (39) రూ.4లక్షల అప్పు కావడంతో, తీర్చే మార్గం కానరాక, బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గురువారం రాత్రి మల్యాల గ్రామ శివారులోని వ్యవసాయబావిలో శవమై తేలాడు. అప్పుల వాళ్లు ఎవరూ బాధ పెట్టవద్దని సూసైడ్ నోట్ రాసి, బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీమెట్పల్లి: పట్టణంలోని దుబ్బవాడలో బెజ్జారపు తార ఇంట్లో దొంగతనం జరిగింది. ఎస్ఐ కిరణ్కుమార్ కథనం ప్రకారం.. తార బుధవారం ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లింది. తిరిగి గురువారం రాగా, తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా..ఇంట్లో దాచి ఉంచిన తులం బంగారు పుస్తెల తాడు, మూడు గ్రాముల బంగారు విగ్రహాం చోరికి గురైనట్లు గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మందులు అందుబాటులో ఉంచాలి
సారంగాపూర్: వర్షాకాలంలో వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని, పీహెచ్సీలు, సీహెచ్సీల్లో వైరల్ ఫీవర్, డెంగీ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఇన్పేషెంట్లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ల్యాబ్ రికార్డులు, ఫార్మసీ వివరాలు పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యకేంద్రంలో కాలంచెల్లిన మందులుంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో వైరల్ఫీవర్, డెంగీ వ్యాధుల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం రంగపేట, బీర్పూర్ మండలం నర్సింహులపల్లె గ్రామంలో నిర్వహించిన భూభారతి సభలో పాల్గొని గ్రామసభలో వచ్చిన సాదాభైనామా, అసైన్మెంట్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, విరాసత్ దరఖాస్తులను పరిశీలించారు. ప్రజలు అందించే ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా చూస్తామని తెలిపారు. ఆర్డీవో మధుసూదన్, మాతాశిశు సంరక్షణాధికారి జయపాల్రెడ్డి, ఎంపీడీవో చౌడారపు గంగాధర్, ఎంపీవో సలీం, మండల వైద్యాధికారి రాధ, తహసీల్దార్లు వహీదొద్దీన్, సుజాత పాల్గొన్నారు. తాత్కాలిక భవనాల పరిశీలన కోరుట్ల రూరల్: కోరుట్లలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు అనుమతులు మంజూరైన విషయం తెలిసిందే. పాఠశాల ఏర్పాటు చేసేందుకు కోరుట్లలోని మహిళా డిగ్రీ కళాశాల భవనాలను కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్ల కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో జీవాకర్రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య ఉన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలి జగిత్యాల: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీస్కూళ్లు, టాయిలెట్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్ల పనులు వేగవంతం చేయాలన్నారు. డీఆర్డీవో రఘువరణ్, పంచాయతీరాజ్ ఈఈ లక్ష్మణ్రావు పాల్గొన్నారు. డెంగీ, వైరల్ ఫీవర్లతో అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ సత్యప్రసాద్ సారంగాపూర్ పీహెచ్సీ తనిఖీ -
రక్తమోడిన రహదారులు
● ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు ● ఆరుగురు మృతి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రహదారులు గురువారం రక్తమోడాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. జగిత్యాల జిల్లా మల్యాల పరిధిలోని ముత్యంపేట వద్ద పెళ్లికారును డీసీఎం ఢీకొనడంతో చిన్నారి మృతి చెందగా.. పెళ్లి కుమారుడు సహా.. ఆరుగురు గాయపడ్డారు. ఇదే జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట శివారులో ట్రాక్టర్ బోల్తాపడి తండ్రి మృతి చెందగా.. కొడుకు గాయపడ్డాడు. మెట్పల్లిలోని వెల్లుల్ల రోడ్డులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి వద్ద లారీ ఢీకొనడంతో దంపతులు చనిపోయారు. చిన్నారి గాయపడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని తుమ్మనపల్లి వద్ద రెండు లారీలు ఢీకొని ఒక డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. –వివరాలు 10లోu -
నేటి నుంచి బడిబాట
● జిల్లా విద్యాశాఖ అధికారి రాముజగిత్యాల: నేటి నుంచి ఈనెల 11 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డీఈవో రాము తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ల ఆధ్వర్యంలో నేటి నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామసభతో ప్రారంభించుకుని 11న ముగించడం జరుగుతుందని, బడిబాట రిజిష్టర్ ఏర్పాటు చేసి అందులో వివరాలు నమోదు చేయాలన్నారు. సంబంధిత ఎక్సెల్లోని స్పెడ్షీట్లో వివరాలు ఎంటర్ చేయాలన్నా రు. ఉల్లాస్లో డ్రాపౌ ట్స్, నిరక్షరాస్యులను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచా రం ఇవ్వాలని, టెక్ట్స్ బుక్స్, నోట్బుక్స్, ఏకరూప దుస్తులు అందజేయాలని ఆదేశించారు. బడిబాటకు సంబంధించిన డాటాను రోజువా రీగా అప్డేట్ చేయాలన్నారు. అందరి సహకారంతో బడిబాటను విజయవంతం చేసి 12న పండగ వాతావరణంలో తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జగిత్యాలజోన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ, ప్లాస్టిక్ వస్తువులు మానవ మనుగడకు పెను భూతంగా మారాయని తెలిపారు. పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచకపోవడంతోనే, అతివృష్టి, అనావృష్టి, అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు సంభవిస్తున్నాయని అ న్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నా రాయణ, సబ్ జడ్జి శర్మ, ఏజీపీ ఓంప్రకాశ్, పీపీ మల్లికార్జున్, జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ చీఫ్ కటుకం చంద్రమోహన్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ అసిస్టెంట్ చీఫ్ విజయ్కుమార్ పాల్గొన్నారు. అందరూ మొక్కలు నాటాలిమెట్పల్లి: పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని సీనియర్ సివిల్ మెజిస్ట్రేట్ నాగేశ్వర్రావు పేర్కొన్నారు. పర్యావరణ దినో త్సవాన్ని పురస్కరించుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జూని యర్ సివిల్ మెజిస్ట్రేట్ అరుణ్కుమార్తో కలిసి మొక్కలు నాటారు. ఎన్నో రకాల అనర్థాల వల్ల పర్యావరణం దెబ్బతింటోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాల్సిన అవసరముందన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవి ప్రసాద్, ఎఫ్ఆర్వో షౌకత్ అలీ, డిప్యూటీ ఎఫ్ఆర్వోలు సురేశ్ కుమార్, చైతన్యశ్రీ, న్యాయవాదులు తొగిటి రాజశేఖర్, పసునూరి శ్రీనివాస్, రాందాస్ పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండాలిజగిత్యాలజోన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి వెంకట సుబ్రహ్మణ్య శర్మ సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి లక్ష్యం ఏర్పర్చుకుని, సాధించే వరకు కృషి చేయాలని అన్నారు. చాలామంది సమయం వృథా చేయడంతో అనుకున్న లక్ష్యాలను అందుకోలేక పోతున్నారన్నారు. విద్యార్థి దశలో కష్టపడితే జీవితాంతం సుఖంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. బాలసదన్లో అందుతున్న సౌకర్యాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ చీఫ్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు సతీశ్, విజయ్కుమార్లు పాల్గొన్నారు. హైకోర్టుకు తరలిన జగిత్యాల న్యాయవాదులుజగిత్యాలజోన్: జగిత్యాల బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాదులు తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం హైకోర్టు కు వెళ్లి జడ్జీలను కలిశారు. కోర్టులో క్యాంటీన్, ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ, ఎస్సీ అదనపు కోర్టుల ఏర్పాటు వంటి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్రెడ్డి, కార్యవర్గ సభ్యులు రాంచందర్, రమేశ్ పాల్గొన్నారు. -
తండ్రిని హతమార్చిన తనయుడు
రాయికల్: రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో తొట్ల ఎర్రయ్య(65)ను కన్న కొడుకే గొడ్డలితో దారుణంగా హతమార్చిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో తొట్ల ఎర్రయ్య కొడుకు మల్లేశ్తో కలిసి జీవిస్తున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోగా.. మల్లేశ్ మానసిక పరిస్థితి సరిగా లేదు. కొడుకు ఆలన పాలన తండ్రి ఎర్రయ్య చూసుకుంటున్నాడు. మానసిక స్థితి సరిగా లేని మల్లేశ్ బుధవారం అర్ధరాత్రి తన తండ్రిపై గొడ్డలితో తీవ్రంగా దాడిచేయగా అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి సందర్శించారు. సంఘ నాయకుడు నాగుల గంగ మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కోరుట్లకు ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు
కోరుట్ల: కోరుట్ల మున్సిపాలిటీకి టీజీపీసీబీ ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు అందించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురువారం ఈ అవార్డును మున్సిపల్ కమిషనర్ అందె మారుతీ ప్రసాద్కు అందజేసింది. మంత్రి కొండా సురేఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గుగ్లావత్ రవి అవార్డును అందించారు. మున్సిపల్ కమిషనర్ అందె మారుతీ ప్రసాద్ మాట్లాడుతూ.. పట్టణంలో చెత్తసేకరణ, వెహికిల్ ట్రాకింగ్ సిస్టం, తడి,పొడి చెత్తతో ఎరువు తయారీ, డీఆర్సీసీ సెంటర్ ద్వారా తడి, పొడి చెత్త వేరు చేయటం, పర్యావరణానికి హాని కలుగకుండా ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిందని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్న పట్టణ ప్రజలకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. -
‘గిరి’ గ్రామాలకు మహర్దశ
రాయికల్:(జగిత్యాల): కేంద్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధికి పీవీటీజీ స్కీం తీసుకొచ్చింది. జిల్లాలోని రాయికల్ మండలం బోర్నపల్లి, దావన్పల్లి గ్రామాలను ఈ స్కీం కింద ఎంపిక చేసింది. ఈ గ్రామాలను ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం దతత్త తీసుకొని, ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ రెండు గ్రామాల్లో రాష్ట్రం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నిధులతో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఈ నెల 15నుంచి ప్రత్యేక గ్రామసభలు పీవీటీజీ స్కీం కింద ఎంపికై న బోర్నపల్లి, దావన్పల్లి గ్రామాల్లో కేంద్ర 15 శాఖల అధికారులు ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేకం గ్రామసభలు నిర్వహిస్తారు. అర్హులైన గిరిజనులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ పథకాలు వర్తించేలా నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపిస్తారు. గ్రామంలో అంగన్వాడీకేంద్రాల్లో ఎంత మంది చిన్నారులు ఉన్నారు..? ఎందరికి ఆధార్కార్డులు, రేషన్కార్డులు, కిసాన్కార్డులు, జన్ధన్ అకౌంట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయని ఆరా తీస్తారు. కేంద్రం నుంచి ఎంత మంది లబ్ధి పొందుతున్నారనే అంశాలు క్షుణ్ణంగా సేకరించి, నివేదిక తయారు చేయనున్నారు. జిల్లాలోని ఈ రెండు గ్రామాలకు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి ద్వారా ఐదేళ్ల పాటు ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో రోడ్లు, అంగన్వాడీ భవనాలు, ఆసుపత్రి భవనాలు, హాస్టళ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. పీవీటీజీ స్కీంలో బోర్నపల్లి, దావన్పల్లి ఎంపిక కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఈనెల 15 నుంచి 30వరకు ప్రత్యేక గ్రామసభలు -
ఉద్యమనేతల మాటముచ్చట
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటాల నేపథ్యం వారిది. ఒకరు పాటతో చైతన్యం కలిగిస్తే.. మరొకరు బోధనలతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపారు. బడుగు, బలహీనవర్గాల తరఫున నేనున్నానంటూ పిడికిలి ఎత్తిన నేత మరొకరు.. వీరందరూ గురువారం ఒక్కచోట చేరారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కుమారుడు అభిలాశ్–శివాని వివాహం జరిగింది. ఈ పెళ్లికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీలు కోదండరాం, నెల్లికంటి సత్యం, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జనశక్తి అగ్రనేత అమర్, విమలక్క, మాజీ ఎమ్మెల్యే చలపతిరావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు పెళ్లి మండపంలో కలుసుకున్నారు. కుశలప్రశ్నలు వేసుకుంటూ గడిపారు. -
ఇప్పుడే విత్తనాలు వేయొద్దు
జగిత్యాల అగ్రికల్చర్: ‘నైరుతి రుతుపవనాలు జిల్లాలో ప్రవేశించినప్పటికీ.. పూర్తిస్థాయిలో వర్షాలు కురియడం లేదు. ఈ క్రమంలో జూన్ 15 వరకు విత్తనాలు వేయవద్దు. జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలు పొలంలో చల్లుకోవచ్చు. వాటికి వ్యవసాయ బావుల ద్వారా సాగునీరు అందించాలి. ప్రైవేట్ కంపెనీల విత్తనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జిల్లాలోని అన్ని సొసైటీల్లో రసాయన ఎరువులు అందుబాటులో ఉంచుతాం’. అని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ పేర్కొన్నారు. వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్న క్రమంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో బుధవారం ఫోన్ ఇన్ నిర్వహించగా.. విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు ఫోన్ చేయగా.. వారు అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు డీఏవో వివరంగా సమాధానం ఇచ్చారు. జూన్ 15 తరువాత విత్తుకుంటే ఉత్తమం అన్ని సొసైటీల్లో అందుబాటులో రసాయన ఎరువులు ప్రైవేట్ కంపెనీల విత్తనాల విషయంలో జర జాగ్రత్త జిల్లా వ్యవసాధికారి భాస్కర్ ‘సాక్షి’ ఫోన్ ఇన్కు విశేష స్పందన -
పరిషత్ సమరానికి సిద్ధం!
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు ● చర్యలు ప్రారంభించిన ఆయా జిల్లాల అధికారులు ● చకచకా ఓటర్ల తుది జాబితా, మార్పులు– చేర్పులు ● సిద్ధమవుతున్న పోలింగ్ స్టేషన్ల రూట్మ్యాప్లు ● ఈనెల 15 లేదా నెలాఖరున నోటిఫికేషన్ ?సాక్షిప్రతినిధి,కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. లోకల్బాడీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల సంకేతాలు వెలువడిన దరిమిలా.. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. ఈమేరకు కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని జెడ్పీ సిబ్బంది ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఓటర్ల తుది జాబితాను మే 30వ తేదీన హైదరాబాద్కు పంపారు. ఇది పంపే ముందు.. ఇటీవల 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను చేర్చడం విశేషం. ఆ తరువాత అందులో కొన్ని సవరణలు చేసి తిరిగి 31వ తేదీన మరోసారి ఓటర్ల జాబితాను హైదరాబాద్కు పంపారు. జోరుగా ఏర్పాట్లు.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారని సమాచారం. ఈ నెల15న లేదా నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఆ లోపు జిల్లా అధికారులు పూర్తిగా సంసిద్ధులు కావాలన్న ఆలోచనలో భాగంగానే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల ఖరారు చేశారు. పోలింగ్ స్టేషన్ల రూట్ మ్యాపింగ్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలలోని పోలింగ్ స్టేషన్లను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు అనుగుణంగా సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ ప్రక్రియపై వారాంతానికి స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఇదే పనిలో తలమునకలయ్యారు. ఈనెలలో ఏక్షణమైనా ఎన్నికలు జరుగవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలతో అంతా సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులు సైతం ఉత్సాహంగా ఉన్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారంతా ఇక రంగంలోకి దిగేందుకు సిద్ధమతున్నారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలుజిల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు స్థానాలు కరీంనగర్ 170 15 జగిత్యాల 216 20 పెద్దపల్లి 140 13 రాజన్నసిరిసిల్ల 123 12 మొత్తం 649 60 -
భూ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి
ధర్మపురి: భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. మండలంలోని దోనూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు ముఖ్య అథితిగా హాజరయ్యారు. ప్రతీ దరఖాస్తును నమోదు చేసుకోవాలని అధికారులకు అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపా రు. బుగ్గా రం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, డిప్యూటీ తహసీల్దార్ సుమన్ పాల్గొన్నారు. ఆరుతడి పద్ధతులు పాటించాలికథలాపూర్: రైతులు వరిసాగులో ఆరుతడి పద్ధతులు పాటించాలని, తద్వారా నీటిని పొదుపు చేసినట్లవుతుందని కరీంనగర్ ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ మదన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కథలాపూర్ రైతు వేదికలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పంటల్లో సూక్ష్మ నీటిపారుదల, సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను పాటించి అధిక దిగుబడులు పొందాలన్నారు. యూరియా తక్కువగా వాడాలని, అవసరం మేరకు రసాయనాలు వినియోగించాలన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తే రైతులు రశీదులను భద్రపరచాలన్నారు. రైతులకు పంటల సాగుకు సూచనలిచ్చే కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్, ఏవో యోగితా, ఏఈవోలు సంధ్య, సుష్మా, శేఖర్, హరీశ్, మౌనిక పాల్గొన్నారు. సెర్ప్ కార్యక్రమాలు వేగవంతం చేయాలి జగిత్యాలరూరల్: జిల్లాలోని మహిళా స్వయంశక్తి సంఘాల కార్యక్రమాలు వేగవంతం చేయాలని జిల్లా సెర్ప్ ఏపీడీ చరణ్దాస్ అన్నారు. ఐకేపీ భవన్లో బుధవారం వీవోఏలతో సవీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు అందివ్వడం ద్వారా ఆదాయాభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహిళలు కోటీశ్వరులు అయ్యే లా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళాశక్తి కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. ప్రతీ సభ్యురాలికి ఇన్సూరె న్సు సౌకర్యం పొందేలా చూడాలని, గ్రామ, మండల సమాఖ్యల అడిట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉల్లాస్ సర్వే చేయాలని, కొనుగోలు కేంద్రాలు ముగిసినందున డాటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీవో వాస వి, మెడికల్ ఆఫీసర్ సౌజన్య, సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ రాంనారాయణ, ఏపీఎం గంగాధర్, సీసీలు గంగారాం, రవీందర్, మరియా, అసిస్టెంట్ మేనేజర్లు రాణి, సాహిత్య పాల్గొన్నారు. మాట్లాడుతున్న చరణ్దాస్ -
ఏటీసీ పనులు త్వరగా పూర్తి చేయాలి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ పేర్కొన్నారు. జగిత్యాలలోని టీఆర్నగర్లో రూ.29 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఏటీసీ సెంటర్ను ఆయన పరిశీలించారు. జగిత్యాల–కరీంనగర్ రహదారికి సుమారు 800 మీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఏటీసీ సెంటర్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఏటీసీ సెంటర్ వల్ల యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జ్యోతి, నాగభూషణం ఉన్నారు. అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలి అభివృద్ధి పనులను వెనువెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డులో రూ.30లక్షలతో చేపడుతున్న డ్రెయినేజీ పనులను ప్రా రంభించారు. కమిషనర్ స్పందన, మాజీ చై ర్మన్లు జ్యోతి, గిరి నాగభూషణం పాల్గొన్నారు. ధ్యానమందిరం కొనసాగించాలి ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యానమందిరం కొనసాగించాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల బ్రాహ్మణవీధిలో ధ్యానమందిరాన్ని బుధవారం ప్రా రంభించారు. ధ్యాన మందిరం ఈశాన్యభాగంలో శిథిలావస్థకు చేరుకుందని, తొలగించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమాకాంత్శర్మ, భారవిశర్మ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారం
కథలాపూర్: సొంతింటి కల నెరవేర్చాలని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కథలాపూర్లో ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం 306 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు అందించారు. 56మందికి రూ.21.21 లక్షల సీఎమ్మార్ఎఫ్ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత పైలట్ ప్రాజెక్టు కింద పోసానిపేట గ్రామంలో 117మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుందన్నారు. నాలుగు దశలుగా బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జివాకర్రెడ్డి, శ్రీనివాస్, జిల్లా గృహానిర్మాణశాఖ అధికారి మారుతి, ఎంపీడీవో శంకర్, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్పర్సన్ పులి శిరీష, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు పాల్గొన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
అరటిసాగు పెంచేలా చూడాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో అరటిసాగును పెంచాలని, ప్రభుత్వం ద్వారా రైతులకు సాయం అందేలా చూస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో బుధవారం రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అరటిసాగును పెంచితే రైతులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ట్రేడర్స్ మాట్లాడుతూ.. అరటిని కొనడానికి సిద్ధంగా ఉన్నామని, రైతులు నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తే ఎన్ని టన్నులైనా కొంటామని తెలి పారు. మహారాష్ట్రంలోని జల్గమ్ గ్రామంలో నాణ్యౖ మెన అరటిని పండిస్తున్నారని, విదేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. జిల్లా ఉద్యానవన అధికారి శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ అరటి పండించేందుకు రైతులను గుర్తిస్తామని, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉద్యానవనశాఖ ద్వారా ఎకరానికి రూ.16,800 సబ్సిడీ అందజేస్తామన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రమే లక్ష్యం వెల్గటూర్: భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే భూ భారతి చట్టం లక్ష్యమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం వెల్గటూర్, ఎండపల్లి మండలంలోని మొక్కట్రావుపేట, గొడిశెలపేట గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు ఆర్డీవో మధుసూదన్, వెల్గటూర్, ఎండపల్లి తహసీల్దార్లు శేఖర్, అనిల్ పాల్గొన్నారు. -
రుణం .. దైన్యం
జగిత్యాల: మున్సిపాలిటీల పరిధిలో ఫుట్పాత్లపై చిరువ్యాపారం చేసుకునేవారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. చిరువ్యాపారులకు ఈ పథకం వరంగా మారింది. తొలి విడతలో రూ.10వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50వేల వరకు రుణాలు అందజేసింది. మొదటి విడత రుణం చెల్లించినవారికి రెండో విడతలో, మూడో విడతలో రుణాలు అందించారు. నాలుగో విడతకు వచ్చేసరికి ఆత్మ నిర్భర్ నిధి పథకాన్ని సర్కారు నిలిపివేసింది. వెబ్సైట్ను సైతం మూసివేసింది. దీంతో రుణాలు వస్తాయో లేదో అన్న ఆందోళనలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన చిరువ్యాపారులున్నారు.కరోనా సమయంలో ఆదుకున్న పథకంకరోనా సమయంలో చిరువ్యాపారులకు కోలుకో లేని దెబ్బ తగిలింది. వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ పథకాన్ని మున్సిపాలిటీల్లో అమలు చేశారు. మొదట రూ.10వేలు రుణంగా అందించారు. రుణం పొందిన వ్యాపారి సక్రమంగా కిస్తీలు చెల్లిస్తే రెండో విడతలో రూ.20 వేలు, మళ్లీ సక్రమంగా చెల్లిస్తే మూడో విడతలో రూ.50 వేలు రుణం అందించడం జరిగింది. ప్రస్తుతం ఈ పథకం ప్రారంభమై ఐదేళ్లు పూర్తి కావడంతో రుణాల మంజూరును తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.రుణభారం తగ్గింపుఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రుణాలు అందించడంతో వడ్డీ భారం చిరువ్యాపారులకు ఎంతో తగ్గింది. సకాలంలో కిస్తీలు చెల్లించడంతో బ్యాంకులు సైతం రుణాలు ఎప్పటికప్పుడు అందజేయడంతో వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థిక సాధికారత సాధించారు. నాలుగో విడతలో రుణాలు ఇస్తారనుకున్నప్పటికీ సైట్ మూసివేయడంతో ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో జగిత్యాలతో పాటు, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలున్నాయి. 15,307 మంది వీధి వ్యాపారులుండగా, 1,036 మంది రుణాలు అందుకున్నారు. ప్రస్తుతం పథకం ఆగిపోవడంతో రుణాలు మళ్లీ వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.క్రెడిట్కార్డులు ఇచ్చే యోచనజిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న వీధి వ్యాపారులకు నాలుగో విడతలో ఆత్మ నిర్భర్ పథకం కింద క్రెడిట్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని మెప్మా అధికారులు తెలిపారు. రుణంగా అయినా ఇవ్వొచ్చు లేదా క్రెడిట్ కార్డులైనా ఇవ్వవచ్చని తెలిపారు. రూ. లక్ష వరకు లిమిట్తో ఇచ్చే ఈ క్రెడిట్కార్డులను చిరువ్యాపారులు వినియోగించుకోవచ్చునని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రాలేదని మెప్మా అధికారులు తెలిపారు. -
సదస్సులు.. ప్రోత్సాహకాలు
ఆయిల్పాం సాగు పెంచేందుకుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆయిల్పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో ప్రభుత్వం జగిత్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి తోడు మండు వేసవిలో సైతం ఎస్సారెస్పీ, చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల ద్వారా సాగు నీరు అందే అవకాశం ఉండడంతో ఆయిల్పాం వైపు రైతుల దృష్టి మళ్లించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. దీంతో, ఉద్యాన, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను చైతన్యం చేసేందుకు ఇటీవల మోబైల్ వ్యాన్లను సైతం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,431 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయగా, ఈ ఏడాది 3,750 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయిల్పాం వైపు మళ్లేలా.. జిల్లాలో ప్రతీ సీజన్లో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. వరి నాట్ల సమయంలో కూలీలతో ఇబ్బందులు, పంట కొనుగోలు, మిల్లులకు తరలించడం, రైస్మిల్లర్ల తిరకాసులు, రవాణా సమస్యలు, బియ్యం విషయంలో ఎఫ్సీఐ కఠిన నిబంధనలతో రానున్న రోజుల్లో వరిని తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వరిని నాలుగైదు ఎకరాల్లో సాగు చేసే రైతుల్లో కనీసం ఒక ఎకరం ఆయిల్పాం సాగు చేయించాలని జిల్లా యంత్రాంగం ధృడ సంకల్పంతో ఉంది. ఈ మేరకు ఆయిల్పాం సమావేశాల్లో కలెక్టర్ సత్యప్రసాద్ స్వయంగా పాల్గొంటూ వరి వల్ల కలిగే ఇబ్బందులు, ఆయిల్పాం సాగుతో లాభాల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సాగు విస్తీర్ణంపై ప్రత్యేక దృష్టి జిల్లాలో ఆయిల్పాం ఉత్పత్తులు సేకరించేందుకు లోహియా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు పంట సాగును అత్యధిక విస్తీర్ణంలో చేపట్టేందుకు జిల్లా యంత్రాంగంతో కలిసి లోహియా కంపెనీ విస్రృత ప్రచారం చేస్తోంది. సాగు చేస్తామని ఉద్యానశాఖకు దరఖాస్తు చేసుకున్న రైతులకు జిల్లాలోని గొల్లపల్లి మండలం అబ్బాపూర్లో ఏర్పాటు చేసిన నర్సరీ ద్వారాదా ఆయిల్పాం మొక్కలు సరఫరా చేస్తున్నారు. తాజాగా బుగ్గారం మండలం యశ్వంత్రావుపేటలో ఆయిల్పాం రిఫైనరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు 22 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన లోహియా కంపెనీ, సెప్టెంబర్ 4న శంకుస్థాపన చేసేందుకు కూడా సంసిద్ధమైంది. ప్రభుత్వ సబ్సిడీలు.. ఇప్పటికే ఆయిల్పాం సాగు చేసే రైతులకు రూ. 213 ఉండే మొక్కకు రూ.193 సబ్సిడీ ఇచ్చి, రైతుకు కేవలం రూ.20 కే అందిస్తున్నారు. పరిమితులు లే కుండా 12.50 ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్ ఇస్తున్నారు. మొక్కలు నాటిన తర్వాత అంతరపంటల సాగుకు ఎకరాకు రూ.4,200 చొప్పున నా లుగేళ్ల పాటు ఇస్తారు. అయితే, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుండటంతో రైతులు ఇప్పుడిప్పుడే సాగు వైపు ఆలోచనలు చేస్తున్నారు. ఆయిల్పాం గెల వచ్చేవరకు ఏ రేటు ఉంటుందో, ఎన్ని టన్నుల దిగుబడి వస్తుందో, కంపెనీ వారు కొనకపోతే ఎలా.. ఇ లా రకరకాల సందేహాలు వెలిబుచ్చుతూ, కొందరు రైతులు ఈపంట సాగుకు దూరంగా ఉంటున్నారు. కంపెనీ ప్రోత్సాహకాలు కంపెనీ ప్రారంభించే ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ నడవాలంటే కనీసం రోజుకు 160–200 మెట్రిక్ టన్ను ల ఆయిల్పాం గెలలు అవసరం. ఫ్యాక్టరీ రోజూ 8 గంటల పాటు నడిపిస్తే గంటకు 20 మె.ట గెలలు కావాలి. దీంతో ఫ్యాక్టరీ జిల్లాలోనే ఏర్పాటు చేస్తున్నందున ఆయిల్పాం సాగును విపరీతంగా పెంచాలని అధికారులు, కంపెనీ ప్రతినిధులు ప్ర యత్నిస్తున్నారు. ప్రభుత్వంతోపాటు కంపెనీ సైతం రైతులను ప్రోత్సహించే పనిలో పడింది. తాజాగా ఆగస్టు 31 వరకు ఆయిల్పాం మొక్కలు నాటిన రైతులకు బంపర్ లక్కీ డ్రా నిర్వహించేందుకు కంపెనీ సిద్ధమైంది. మొదటి బహుమతి ఒక్కరికి రూ.2 లక్షల విలువ గల బుల్లెట్ బండి, రెండో బహుమతి ఒక స్కూటీ, మూడో బహుమతి ఫ్రిడ్జ్, నాల్గో బహుమతిగా పది మందికి ఎయిర్ కూలర్, ఐదో బహుమతి 25 మందికి డిజిటల్ వాచీ, ఆరో బహుమతి 50 మందికి కుక్కర్ను ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ప్రత్యేక దృష్టిసారించిన అధికార యంత్రాంగం -
25 ఎకరాల్లో సాగు చేశా
గతంలో వరి సాగు చేశా. ఆదాయం అంతంతే వచ్చేది. ఆయిల్పాం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో 25 ఎకరాల్లో సాగు చేస్తున్న. మొక్కలు నాటి రెండేళ్లవుతుంది. మరో ఏడాదిలో గెలలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ధరలు రైతులకు ఆశాజనకంగా ఉన్నాయి. – రాజశేఖర్రావు, పెగడపల్లి రైతులను ప్రోత్సహిస్తున్నాం ఆయిల్పాం సాగు చేసే రైతులకు ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగు చేసిన తోటలను, అక్కడి రైతులు, ఫ్యాక్టరీ నిర్వహణను చూపించాం. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నెలకోసారి కంపెనీతో కలిసి రైతులకు సదస్సులు నిర్వహిస్తున్నాం. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి, జగిత్యాల -
రూ.15 వేలు డిమాండ్ చేశారు
మాది రాయికల్ మండలం సింగరావుపేట. 1.025 ఎకరాల భూమిని జగిత్యాలకు చెందిన ఉస్మాన్కు అమ్మాను. నా సర్వే నంబరులో ఎక్కువ భూమి ఉందని, రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించా. రూ.15 వేలకు బేరం కుదుర్చుకుని రూ.10 వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. – గాజర్ల రవి, బాధితుడు లంచం అడిగితే ఏసీబీని సంప్రదించండి ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ఫ్రీ నంబరు 1064 లేదా 94404 46106 నంబర్లను సంప్రదించాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అవినీతి నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. – విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ -
ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన
జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదం కేసును మల్యాల సీఐ నీరుగార్చుతున్నారని, వాహనదారునికి వత్తాసు పలుకుతున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు మంగళవారం జగిత్యాల ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు.. మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన అల్లెపు నరేశ్ ఏప్రిల్ 28న రాజారం వద్ద లారీ ఢీకొని మృతిచెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి లారీని స్టేషన్కు తరలించారు.లారీకి ఇన్సూరెన్స్ ఉందని, పరిహారం వస్తుందని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. దీంతో చివరికి లారీని వదిలిపెట్టి ప్రస్తుతం లారీకి ఇన్సూరెన్స్ లేదని మల్యాల సీఐ కేసును నీరుగార్చుతున్నారని, తమను నిత్యం పోలీస్స్టేషన్కు రమ్మని రోజుకో కారణం చెబుతూ అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో నరేశ్ తండ్రి అల్లెపు బాలయ్య, తల్లి శారదతో పాటు పలువురు బంధువులు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. -
మంత్రిగా బండికి ఏడాది
● జూన్ 9న ప్రమాణస్వీకారం చేసిన సంజయ్ ● సంబరాలకు సిద్ధమవుతున్న కమలనాథులు ● ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేసిన ఎంపీ ఆఫీస్సాక్షిప్రతినిధి,కరీంనగర్: కేంద్ర సహాయమంత్రిగా బండి సంజయ్ ఏడాది పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదికాలంలో బండి సంజయ్ చేసిన పనులు, చూపిన చొరవను వివరిస్తూ పార్టీ జిల్లా నాయకులు ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేశా రు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బండి సంజయ్ విజయం సాధించారు. జూన్ 9న ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్లో కేంద్ర సహా యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా ఏడాది పూర్తికానుండడంతో అభిమానులు, పార్టీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అభివృద్ధి పనులపై దృష్టి జాతీయ ఉపాధిహామీ పథకం కింద ప్రతీ మండలానికి రూ.2కోట్లు ఖర్చు చేసి ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లు నిర్మించారు. సగటున ఒక్కో గ్రామానికి రూ.5లక్షలు అంతర్గత రోడ్లకు వెచ్చించారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా కరీంనగర్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.33కోట్లకుపైగా ఖర్చు చేశారు. పెండింగ్లో ఉన్న కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.2వేల కోట్లతో మరో రెండు వారాల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రైల్వేపై ప్రత్యేక శ్రద్ధ ఇటీవల కరీంనగర్ రైల్వేస్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటితోపాటు కరీంనగర్, జమ్మికుంట ఆర్వోబీ నిర్మాణంలో జాప్యమవుతున్న విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశమై వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు నాటికి జమ్మికుంట ఆర్వోబీ పనులు పూర్తికాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కరీంనగర్–తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో ఇబ్బందులను అధిగమించేందుకు రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి.. పనుల వేగవంతం చేయించడంలో సఫలీకృతులయ్యారు. వారానికోసారి నడిచే కరీంనగర్–తిరుపతి రైలును వారానికి రెండుసార్లు నడిచేలా కృషి చేశారు. అదే రైలును ఇకపై వారానికి 4 సార్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈమేరకు రైల్వేశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. మరిన్ని పనులివే.. ● సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బండి సంజయ్ వినతికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ● సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో నవోదయ స్కూళ్ల మంజూరులో చొరవచూపారు. ● వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను టూరిజం సర్క్యూట్గా మార్చాలన్న ప్రతిపాదలపై త్వరలోనే కేంద్రం ప్రకటన చేయనుంది. ● శాతవాహన వర్సిటీ పరిధిలో లా కళాశాల మంజూరుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ను కలిసి మంజూరు చేయించారు. ● అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ పార్క్, స్పోర్ట్స్ రీక్రియేషన్ సౌకర్యాలు కల్పించాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉంటున్న కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు బండి సంజయ్ కృషి మరువలేనిది. ● కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రూ.5కోట్ల సీఎస్సార్ నిధులను రాబట్టారు. వాటితో వేములవాడ, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలను అందించారు. ● ఈ ఏడాది 10వ తరగతి చదివే 6 వేల మంది బాలికలకు ప్రత్యేకంగా సైకిళ్లను అందించేందుకు ఆర్డర్ ఇచ్చారు. వీటిని త్వరలోనే విద్యార్థులకు అందజేయనున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది. ● ఈ ఏడాది మార్చిలో థాయిలాండ్ లో సైబర్ కేఫ్ లో చిక్కుకున్న 540 మంది భారతీయులను సాక్షి కథనాలతో స్పందించిన బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని కాపాడారు. రెండు ప్రత్యేక విమానాల్లో వారిని ఇండియాకు తరలించారు. -
పోలీసులంటే గౌరవం ఉండాలి
హుజూరాబాద్: ప్రజలకు పోలీసులంటే గౌరవం ఉండాలే తప్ప భయం కాదని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇన్చార్జి తిప్పారపు సంపత్ అన్నారు. ఇటీవల ఎస్సై భార్గవ్ దళిత యువకుడు మహేందర్ను తీవ్రంగా కొట్టిన వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సై భార్గవ్ ప్రవర్తన ఒక నియంతలా ఉందన్నారు. దళితుడిని అసభ్య పదజాలతో దూషిస్తూ కొట్టడం ఏంటన్నారు. ఈ ఘటనపై పలుసార్లు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, రవి కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సైక్లింగ్తో ఆరోగ్యవంతమైన సమాజంమల్లాపూర్(కోరుట్ల): రోజూ సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సైక్లింగ్ క్లబ్ ఫౌండర్ వాల్గొట్ కిషన్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి సైక్లింగ్తో మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చేరుకుని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైక్లింగ్తో షుగర్, రక్తపోటు, ఊబకాయాన్ని నివారించవచ్చన్నారు. ‘సైకిల్ తొక్కండి.. ఆరోగ్యంగా ఉండండి’ అనే నినాదంతో ప్రజలందరూ నిత్యం సైక్లింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో గోల్కోండ రమేశ్, ఏలేటి ప్రీతంరెడ్డి, గంధం రఘు తదితరులు పాల్గొన్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదం హుజూరాబాద్: హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులో కరీంనగర్ – వరంగల్ రహదారిపై మంగళవారం ఆయిల్ ట్యాంకర్ ట్రాలీ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ట్రాలీ బోల్తాపడడంతో రోడ్డుపై సిలిండర్లు చెల్లాచెదురగా పడిపోయాయి. కాగా కొన్ని సిలిండర్ల నుంచి గ్యాస్ లీకై ంది. అయినా అవి పేలకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కాగా ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలగర్భంలో రామగుండం బీ–థర్మల్
రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యంగల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టీఎస్–బీ) కాలగర్భంలో కలిసి పోయి బుధవరాం నాటికి ఏడాది పూర్తవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలివిద్యుత్ కేంద్రంగా పేరు గాంచిన ఆర్టీపీఎస్.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు పంచింది. ఈక్రమంలోనే విద్యుత్ ఉత్పత్తి, పీఎల్ఎఫ్లో అనేక సరికొత్త రికార్డులు నెలకొల్పింది. స్థానికంగా బొగ్గు, నీరు, రవాణా వ్యవస్థకు అనువైన పరిస్థితులు ఉండడంతో రామగుండం ప్రాంతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయంగా మారింది. దీంతో దేశంలోనే ఆధునిక విద్యుత్ కేంద్రాలతో పోటీ పడుతూ, అతి తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి చేసిన ఘనత బి–థర్మల్ కేంద్రానికే దక్కింది. రూ.14.8 కోట్ల వ్యయంతో 1965 జూలై 19న విద్యుత్ కేంద్రం స్థాపనకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 10, 2007 నుంచి నిరాటకంగా 159 రోజులపాటు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. దానిని తిరగరాస్తూ 20 ఫిబ్రవరి 2017 తర్వాత ఒకరోజు ఎక్కువగా 160 రోజులు సాధించి రికార్డులు బద్ధలు కొట్టింది. 159 రోజుల్లో 92.64 పీఎల్ఎఫ్తో 221.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సైతం ఆధునిక విద్యుత్ కేంద్రాలతో పోటీపడుతూ ఉత్పత్తి, పీఎల్ఎఫ్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించింది. విద్యుత్ కేంద్రం మూతపడి నేటితో ఏడాది -
ఏసీబీ వలలో ఇన్చార్జి తహసీల్దార్
రాయికల్(జగిత్యాల): భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.15 వేల లంచం బేరం కుదుర్చుకుని రూ.10 వేల డబ్బులను రాయికల్ ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ మధ్యవర్తితో తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ విజయ్కుమార్ వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగరావుపేట గ్రామానికి చెందిన గాజర్ల రవి తన 1.025 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం వారం క్రితం ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్ను సంప్రదించగా రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. మధ్యవర్తిగా ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ సంప్రదింపులతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పక్కా ప్రణాళికతో మంగళవారం తహసీల్ కార్యాలయంలో రూ.10 వేలు మధ్యవర్తి ముజాఫర్ ద్వారా ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, ముజాఫర్ను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు తిరుపతి, కిరణ్రెడ్డి పాల్గొన్నారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.15 వేల బేరం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తితో లంచం -
పోటెత్తిన భక్తులు
మల్యాల(చొప్పదండి): కొండగట్టు అంజన్న సన్నిధికి మంగళవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీకాంత్రావు, అశోక్, సుధాకర్రెడ్డి, రవి, రాములు చర్యలు చేపట్టారు. వేలాదిమంది తరలిరావడంతో కోనేటి నీరు మురికిగా మారగా, భక్తులు షవర్ల వద్ద స్నానమాచరించారు. ప్రతీ శని, మంగళవారాలు కోనేటిలోకి నీరు నిరంతరాయంగా విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు. -
నేటి నుంచి పలు రైళ్లు రద్దు
రామగుండం: కాజీపేట–బల్హర్షా సెక్షన్లోని పలు రైల్వేస్టేషన్ల పరిధిలో ఇంటర్ లాకింగ్ సిస్టం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ డీఆర్యూసీసీ మాజీ ప్రతినిధి క్యాతం వెంకటరమణ తెలిపారు. రద్దయిన రైళ్లు ● రైలు నంబరు : 67771/67772 : సిర్పూర్ – కరీంనగర్ : ఈనెల 20వ తేదీ వరకు ● రైలు నంబరు : 67773/67774 : కరీంనగర్–బోధన్ : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 17003/17004 : కాజీపేట–సిర్పూర్ కాగజ్నగర్–బల్హర్షా : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 17035/17036 : కాజీపేట–బల్హర్షా : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 12757/12758 : సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 12511 : గోరఖ్పూర్–రఫ్తిసాగర్ : ఈనెల 5, 6, 8, 12, 13, 15, 19 తేదీల్లో ● రైలు నంబరు : 12512 : రఫ్తిసాగర్–గోరఖ్పూర్ : 4, 8, 10, 11, 15, 17, 18 తేదీల్లో రద్దు ● రైలు నంబరు : 12521 : భరౌణీ–ఎర్నాకులం : ఈనెల 9వ తేదీన రద్దు ● రైలు నంబరు : 12522 : ఎర్నాకులం–భరౌణి : ఈనెల 6, 13వ తేదీల్లో రద్దు ● రైలు నంబరు : 12591 : గోరఖ్పూర్–యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ఈనెల 7, 14వ తేదీలలో రద్దు చేశారు. ● రైలు నంబరు : 12592 : యశ్వంత్పూర్–గోరఖ్పూర్ : ఈనెల 9, 16వ తేదీల్లో రద్దు -
బడిబాట విజయవంతం చేయాలి
జగిత్యాల: జిల్లాలో ఈనెల 6 నుంచి 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అన్నా రు. ఎస్సెస్సీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంగళవారం పొన్నాల గార్డెన్స్లో పీఆర్టీయూ జి ల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనందరావు, యాళ్ల అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడు తూ, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ బాధ్యత ఉపాధ్యాయులదేనని, ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో డైట్ కాలేజీతో పాటు విద్యాధికారి పోస్టులు మంజూరవుతాయనిపేర్కొన్నారు. పీఆర్టీయూ నాయకులు గుండు లక్ష్మణ్, దామోదర్రెడ్డి, రాము, మహేందర్రెడ్డి పాల్గొన్నారు. బయాలజీ, ఫిజిక్స్ మార్కులు వేర్వేరుగా ఉండేలా చూడాలి8,9,10వ తరగతుల బయాలజి, ఫిజిక్స్ సబ్జెక్ట్లకు 100 మార్కులు వేర్వేరుగా ఉండేలా చూ డాలని, 6,7వ తరగతుల్లో జీవశాస్త్రం, భౌతికశాస్త్రం అంశాలకు వేర్వేరు ఉపాధ్యాయులు ఉండేలా చూ డాలని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డికి బయాలజికల్ సైన్స్ ఫోరం నాయకులు వినతిపత్రం అందజేశారు. రెండు వేరుగా లేకపోవడవంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో బయాలజికల్ సై న్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజ్గోపాల్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆ నందరావు, కార్యదర్శి అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. -
పైసలున్నా.. పనుల్లో జాప్యం
మెట్పల్లి(కోరుట్ల): ప్రజలకు వైద్యం అందించే చోట మెరుగైన వసతులు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం హెల్త్ సబ్ సెంటర్లకు సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రెండేళ్ల క్రితం నిధులు సైతం మంజూరు చేసింది. అయితే, జిల్లాలో ఇప్పటి వరకు కొన్ని చోట్ల మాత్రమే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చాలా చోట్ల స్థలాల సమస్యతో పాటు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాల వల్ల పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. 95 భవనాలు.. రూ.19 కోట్లు.. ● జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో కలుపుకొని మొత్తం 95 చోట్ల ఉన్న హెల్త్ సబ్సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ పేరుతో సొంత భవనాలు మంజూరు చేసింది. ● ఒక్కో సెంటర్ నిర్మాణానికి నేషనల్ హెల్త్ మిషన్, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.19 కోట్లు కేటాయించింది. పనుల పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. ● అయితే ఇందులో ఇప్పటి వరకు కేవలం 11చోట్ల మాత్రమే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ● 23 చోట్ల వివిధ దశల్లో పనులు సాగుతుండగా, మిగతా 61 చోట్ల ఇంత వరకు అసలు పనులే ప్రారంభించకపోవడం గమనార్హం. జాప్యానికి కారణాలు.. ● నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడానికి కొన్ని చోట్ల స్థలాల సమస్య ఉంటే.. మరికొన్ని చోట్ల ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ప్రభుత్వం ఇచ్చే నిధులతో గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలిసింది. ● మెట్పల్లి పట్టణానికి ఆరు మంజూరు కాగా, ఇప్పటి వరకు స్థలాల ఎంపిక జరగలేదు. ఇక్కడ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ● స్థానిక వ్యవసాయ మార్కెట్, మండల పరిషత్లో రెండు నిర్మించడానికి ఆయా శాఖలు మొదట అంగీకరించాయి. కానీ, భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత స్థలాలు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నాయి. ● అలాగే మినీ స్టేడియం స్థలంలో ఒకటి నిర్మించాలని తలపెట్టగా, అక్కడ కూడా ఆటంకాలు ఎదురుకావడంతో విరమించుకున్నారు. కాంట్రాక్టర్లకు నోటీసులు ● స్థలాలు ఉన్న చోట పనులు మొదలు పెట్టని కాంట్రాక్టర్లకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. వెంటనే పనులు ప్రారంభించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించినట్లు సమాచారం. జిల్లాలో మొత్తం భవనాలకు సంబంధించిన పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ, చాలా చోట్ల అధికారులు తగిన చొరవ తీసుకోకపోవడం వల్లే పనులు పెండింగ్లో ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు కొన్ని ప్రాంతాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. అలాంటి వారికి వెంటనే మొదలుపెట్టాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. మరికొన్ని చోట్ల స్థలాల సమస్య ఉంది. దీనిని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ సమస్య పరిష్కారం కాగానే పనులు ప్రారంభిస్తాం. – లక్ష్మణ్రావు, పంచాయతీరాజ్ ఈఈ హెల్త్ సబ్సెంటర్లకు గ్రహణం రెండేళ్ల క్రితం జిల్లాకు 95 మంజూరు ఇప్పటి వరకు కేవలం 11 భవనాలు మాత్రమే పూర్తి స్థల సమస్యతో చాలా చోట్ల ప్రారంభం కాని పనులు ‘పట్టణంలో ఆరు చోట్ల హెల్త్ సబ్ సెంటర్లకు సొంత భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిధులు మంజూరు చేసింది. కానీ, ఇందులో ఇప్పటి వరకు ఒక్క చోట కూడా భవన నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. స్థానికంగా వాటికి అనువైన ప్రభుత్వ స్థలాలు లేకపోవడం వల్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్య ఒక్క మెట్పల్లిలోనే కాదు.. జిల్లాలో చాలా చోట్ల ఉండడం సంబంధిత అధికారులకు తలనొప్పిగా మారింది.’జిల్లాకు మంజూరైన భవనాలు 95ఇప్పటి వరకు పూర్తయినవి 11వివిధ దశల్లో ఉన్నవి 23పనులు ప్రారంభం కానివి 61 -
పంటల విస్తీర్ణాన్ని బట్టి ఎరువులు అందజేయాలి
మెట్పల్లి(కోరుట్ల): పంటల విస్తీర్ణాన్ని బట్టి రైతులకు ఎరువులు అందజేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. పట్టణంలోని విశాల సహకార సంఘ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాలకవర్గం, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతీ రైతు ఆధార్ కార్డు, పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను తీసుకోవడంతో పాటు వారి వేసే పంట విస్తీర్ణాన్ని బట్టి మాత్రమే ఎరువులు అందజేయాలన్నారు. అలాగే పీవో మిషన్ ఆధారంగా విక్రయాలు జరపాలన్నారు. కలెక్టర్ వెంట సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, సీనియర్ ఇన్స్పెక్టర్ నిజాం ఉన్నారు. భూసమస్యల పరిష్కారానికే భూభారతి.. మెట్పల్లిరూరల్/ఇబ్రహీంపట్నం: భూసమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి గ్రామసభలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం మెట్పల్లి మండలం పెద్దాపూర్, ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్కొండాపూర్, ఎర్రాపూర్ గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించగా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. దరఖాస్తులను క్షుణంగా పరిశీలించాలని అ ధికారులకు సూచించారు. ఫకీర్కొండాపూర్ సదస్సులో 65 మంది, ఎర్రాపూర్లో 19 మంది రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమాల్లో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు శ్రీనివాస్, వరప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐలు కాంతయ్య, రమేశ్, రేవంత్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
నాణ్యమైన విత్తనాలతో లాభాలు
కోరుట్ల రూరల్/మల్లాపూర్/మేడిపల్లి/ఇబ్రహీంపట్నం/కథలాపూర్: నాణ్యమైన విత్తనంతో వ్యవసాయంలో అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అన్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్ రైతువేదికలో ప్రాంతీయ పరిశోధనా స్థానం పొలాస శాస్త్రవేత్త పద్మజ, మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతువేదిక లో పొలాస ప్రాంతీయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త సౌజన్య, మేడిపల్లి వ్యవసాయ శాస్త్రవేత్త రవి, కథలాపూర్లో తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త పద్మజ రైతులకు మంగళవారం ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఇబ్రహీంపట్నంలో రైతులకు విత్తనాల మినీ కిట్లను ఏవో రాజ్కుమార్ పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల ఏవోలు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ సాకారం
గొల్లపల్లి(ధర్మపురి): తెలంగాణ ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమేనని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీరాములపల్లె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. అంబేడ్కర్ ముందుచూపుతో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని వివరించారు. దేశంలోని అన్ని వర్గాలవారికి సమన్యాయం, సమాన అవకాశాలు చేకూర్చేలా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, మహామేధావి అయిన ఆ మహనీయునికి భారతరత్న ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
పట్టణానికి నలువైపులా మార్కెట్లు
జగిత్యాల: ప్రజల సౌకర్యార్థం పట్టణానికి నలువైపులా మార్కెట్లు ఏర్పాటు చేశామని, పట్టణాభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 2,18,17వ వార్డుల్లో రూ.20 లక్షలతో చేపట్టే బీటీరోడ్లకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిపించినందుకు పట్టణాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని నిధులు జగిత్యాలకు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన బోగ రాజేశ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా రూ.2.50 లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమాల్లో కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జ్యోతి, మాజీ కౌన్సిలర్లు లత, నవీన్, గిరి నాగభూషణం, చెట్పల్లి సుధాకర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
జగిత్యాలరూరల్: రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. భూభారతి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 104 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ సమస్యలతో బాధపడుతున్న రైతులు రెవెన్యూ సదస్సుల్లో తమ దరఖాస్తులు ఇస్తే క్షేత్రస్థాయిలోనే వాటిని పరిశీలించి వారి వివరాలను భూభారతిలో పొందుపర్చడం జరుగుతుందన్నారు. జగిత్యాల రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐలు భూమయ్య, శంషోద్దీన్ పాల్గొన్నారు. కుజదోష నివారణ పూజలుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆల య ప్రాంగణంలోని యాగశాలలో మంగళవా రం కుజదోష నివారణ పూజలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ కలహాలు, వాస్తుదో షాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కుజదోష నివారణకు పూజలు చేశారు. అనంతరం స్వామివారలకు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలుజగిత్యాలటౌన్: ఆదర్శ మారుతీ సుజుకి నెక్సా జగిత్యాలలో రెసిడెంట్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలకు ఈనెల 6న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి బింగి సత్యమ్మ మంగళవారం తెలిపారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, డిప్లొమా పూర్తి చేసినవారు అర్హులని, ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంపికై న అభ్యర్థులు జగిత్యాల, మెట్పల్లిలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ యువతీయువకులు 6న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని రెండో అంతస్తులో రూం నంబర్ 218లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 63095 23434 నంబర్లో సంప్రదించాలని సూచించారు. అటవీ భూమి స్వాధీనంసారంగాపూర్(జగిత్యాల): బీర్పూర్ మండలం రంగసాగర్ గ్రామ శివారుల్లోని అటవీప్రాంతంలో కొంత మంది అటవీశాఖకు చెందిన భూమిని ఆక్రమించి, సాగుచేస్తుండగా అటవీశాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు అటవీభూమిని చదును చేసి అందులో మామిడి చెట్లను నాటుతుండగా సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని మామిడి చెట్లను తొలగించి చదును చేసిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి అటవీభూమిలో షెడ్డు నిర్మించగా అధికారులు సిబ్బందితో కలిసి ధ్వంసం చేసి తొలగించారు. ఈ విషయంపై అటవీశాఖ ధర్మపురి రేంజర్ శ్రీనాథ్ మాట్లాడుతూ, ఇటీవల రంగసాగర్ గ్రామానికి చెందిన సాగర్ అటవీభూములను సాగుచేస్తే కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని, అటవీభూములను సాగుచేసినా, చదును చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, చదును చేయడానికి వినియోగించే యంత్రాలను సీజ్ చేస్తామని తెలిపారు. -
‘చిట్టీల’ రాయుళ్లు!
● శాతవాహన వర్సిటీలో భారీగా చూచిరాతలు ● డిబార్ అవుతున్న వారిలో కరోనా టైంలో ‘పది’ పాసైన వారే ఎక్కువ ● డిగ్రీ విద్యార్థుల్లో వింత ధోరణి ● మొదటి నుంచి ఆరో సెమిస్టర్ వరకు ఇదే తీరు ● పర్యవేక్షణ పెరగడంతో భారీగా పట్టుబడుతున్న విద్యార్థులు ● సోషల్ మీడియా వ్యసనం, చదవలేక పోవడం వల్ల అడ్డదారులు ● డిబార్ అయిన విద్యార్థికి మద్దతుగా ఉత్తరాది మంత్రి ఫోన్!సాక్షిప్రతినిధి,కరీంనగర్: కుదురుగా పది నిమిషాలు కూర్చుని పరీక్ష రాయలేరు. పరీక్ష మొదలవగానే.. వెంటనే జేబులో దాచిన మైక్రో జిరాక్స్లు తీయడం, కాపీ చేయడం.. ఇదీ.. శాతవాహన వర్సిటీలో డిగ్రీ విద్యార్థుల తీరు. వాస్తవానికి మునుపెన్నడూ లేని స్థాయిలో విద్యార్థులు చిట్టీలు కొడుతూ పట్టుబడి డిబార్ అవుతున్నారు. గతవారంలో ఒకేరోజు 35 మంది డిబార్ అవడం వర్సిటీ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. వాస్తవానికి విద్యార్థులు ఇలా చిట్టీలు రాయడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్న ఆశయంతో యూనివర్సిటీ అధికారులు ఈసారి సిబ్బందిని పెంచి ఆకస్మిక తనిఖీలు చేయిస్తుండటంతో భారీగా చిట్టీల రాయుళ్లు పట్టుబడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా విద్యార్థులు డిబార్ కావడంపై వర్సిటీ వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారుతోంది. జూన్ 2 వరకు వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న 171 మంది డిబార్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనాలో సమయంలో వారేనా? ఈ విషయంపై ఆరా తీసినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి ఇప్పుడు డిబార్ అవుతున్న విద్యార్థులంతా కరోనా విపత్తు సమయంలో 10వ తరగతి పాస్ అయినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. 2020 మార్చిలో ఆకస్మికంగా కరోనా విపత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించలేకపోయింది. ఫలితంగా ఎలాంటి పరీక్షలు లేకుండా విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2021లోనూ పరీక్షలు లేకుండా పది పాసయ్యారు. 2022లో మాత్రం పది పరీక్షలు నిర్వహించినా.. గతంలో ఉన్న 11 పేపర్లను ఆరుకు కుదించి తేలిగ్గా ప్రశ్నలు ఇచ్చారు. 2023లో పది పరీక్షరాసిన పిల్లలు కాస్త నయంగానీ, 2020, 2021లో అసలు పరీక్షలు, పాఠాలు లేకుండా పాసైన విద్యార్థుల ప్రతిభాపాటవాలపై ఇప్పుడు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియా మరో కారణం 2020, 2021లో పది పాసైన వారి ప్రతిభాపాటవాలపై ఇప్పుడు ప్రొఫెసర్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిబార్ అవుతున్న వారిలో అధికంగా వారే ఉండటం, వారంతా సోషల్ మీడియా ప్రభావంతో కాపీయింగ్ పాల్పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. సులువుగా పరీక్షలు పాసవడానికి అలవాటు పడినవారు, ఆ కోణంలో వెళ్తున్నారని అంటున్నారు. కాపీ కొడితే పట్టుబడ్డారంటూ సోషల్మీడియా రీల్స్ చూసి వీరు కూడా పాటించి దొరికిపోతున్నారని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ ప్రొఫెసర్ తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. డిబార్ అయిన విద్యార్థులంతా రాజకీయ నాయకులతో వారిని వదిలేయాలంటూ వర్సిటీ అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారు. వారిలో ఓ విద్యార్థిని వదిలేయాలంటూ ఉత్తరాదికి చెందిన ఓ పెద్ద మంత్రి ఏకంగా వర్సిటీకి ఫోన్ చేయడంతో విస్తుపోవడం అధికారుల వంతైంది.శాతవాహన యూనివర్సిటీవారిలోనే డిబార్ సంఖ్య అధికం 2020లో పది పాసైనవారు ఇప్పుడు 6వ సెమిస్టర్, 2021లో పది పాసైనవారు 4వ సెమిస్టర్, 2022లో పది పాసైన వారు 2వ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారు. ప్రతీ విద్యాసంవత్సరంలోనూ 1,3,5వ సెమిస్టర్లకు ఒకసారి, 2,4,6వ సెమిస్టర్లకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. 2023–24లో 1,3,5వ సెమిస్టర్లలో 26 మంది డిబార్ అయ్యారు. అదే 2023–24 విద్యా సంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో 60 మంది డిబార్కు గురయ్యారు. 2024–25లో 1,3,5వ సెమిస్టర్లలో కేవలం 31 మంది డిబార్ కాగా, 2024–25 విద్యాసంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో ఏకంగా 140 మంది డిబార్ అయ్యారంటే.. పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో మే 28న ఒకేరోజు 34 మంది డిబార్కావడం గమనార్హం. అందులోనూ కరీంనగర్ నడిబొడ్డున తెలంగాణచౌక్ను ఆనుకుని ఉన్న కాలేజీ నుంచి ఏకంగా 13 మంది విద్యార్థులు ఉండటం విశేషం. ఇప్పుడు డిబార్ అయిన విద్యార్థుల్లో అధికంగా 2020, 2021లో పదో తరగతి పాసైన వారే అధికంగా ఉండటం గమనించదగ్గ అంశం. శాతవాహన యూనివర్సిటీ కింద సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో మొత్తం 120 డిగ్రీ కాలేజీలు, 28 పీజీ, 23 బీఈడీ, 7 ఎంబీఏ, ఒక ఎంఈడీ, ఒక బీపీఈడీ, ఒక లా కాలేజీలు తదితరాలు ఉన్నాయి. ఇటీవల వర్సిటీకి అదనంగా లా, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా మంజూరయ్యాయి. ఇంతటి ప్రతిష్టాత్మక వర్సిటీలో ఇలాంటి విపరీత ధోరణి ఇదే తొలిసారి అని పలువురు వాపోతున్నారు. -
కేసీఆర్తోనే తెలంగాణ సాధ్యమైంది
జగిత్యాల: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని, అన్ని వర్గాలను ఏకం చేసి రాష్ట్రం సాధించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. సోమవారం కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. ప్రస్తుతం దుర్మార్గమైన పాలన నడుస్తుందని, కాంగ్రెస్ గుండాలు సీఎం ఫొటో లేదని క్యాంప్ కార్యాలయాలు, తెలంగాణ తల్లి విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ, రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేపట్టి కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందుకెళ్లి తెలంగాణ సాధించారన్నారు. నాయకులు రమణారావు, ఆనందరావు, దేవేందర్రావు, శ్రీనివాస్రావు, శివకేసరిబాబు, శీలం ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● రైతులకు రుణవిముక్తి ● యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్జగిత్యాల: ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ సంకల్పమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందన్నారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. రైతులకు అండగా.. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే 25,35,964 మంది రైతులకు రూ.20,610 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా జిల్లాలో 428 కేంద్రాలను ఏర్పాటు చేసి 4,50,369 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు 82,962 మంది రైతులకు రూ.1,045 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. మహిళల ఆర్థిక సాధికారతకు.. మహిళల ఆర్థిక సాధికారతకు జిల్లాలో 7,596 స్వయం సహాయక సంఘాలకు రూ.766.66 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3,11,64,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, రూ.500లకే గ్యాస్ సిలిండర్లను 2,89,725 మంది లబ్ధిదారులకు సరఫరా చేసినట్లు తెలిపారు. విద్యారంగానికి పెద్దపీట జిల్లాలో విద్యారంగానికి పెద్దపీట వేయడం జరిగిందని నిరుద్యోగ యువతకు కావాల్సిన పుస్తకాలను సైతం అందించడం జరుగుతుందన్నారు. జగిత్యా ల నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పకడ్బందీగా భూ భారతి భూభారతి చట్టం రానున్న నేపథ్యంలో జిల్లాలో 119 మంది గ్రామ పాలన అధికారుల ఎంపికకు రా త పరీక్ష నిర్వహించడం జరిగిందని, త్వరలోనే గ్రా మాల్లోకి వస్తారన్నారు. అలాగే 279 మంది లైసె న్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రా జెక్ట్గా తీసుకుని సదస్సులు ఏర్పాటు చేశామని, త్వ రలోఅన్ని మండలాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే భూభారతి పోర్టల్ ద్వారా 199 దరఖాస్తులు పరిష్కరించినట్లు వివరించారు. కొత్తరేషన్కార్డులు.. జిల్లాలో 11,641 రేషన్కార్డులు కొత్తవి ఇవ్వడంతోపాటు, కార్డుల్లో లేని కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసి వారికి సైతం బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 19,611 మందికి రూ.46.20 కోట్ల విలువ చేసే శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించినట్లు వెల్లడించారు. జిల్లాలో 200 లోపు యూనిట్లు వాడే విద్యుత్ వినియోగదారులకు జీరోబిల్లులు జారీ చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, పారదర్శకంగా కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, మాజీ మంత్రి జీవన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జ్యోతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోనే బంగారు భవిష్యత్
జగిత్యాల: చదువుతోనే బంగారు భవిష్యత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. సేవ భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసాన్ని సోమవారం సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత ఆశయాలను ఎంచుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. బాల్యం నుంచే రాజ్యాంగ వ్యవస్థలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్న ఆవాసం నిర్వాహకులను అభినందించారు. అనంతరం సెకెండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కరుణాకర్ మనుమరాలు యష్ణశ్రీ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు న్యాయమూర్తి చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో ఆవాసం నిర్వాహకులు బీమనాతి శంకర్, మదన్మోహన్రావు, కై లాసం, అశోక్రావు, సంపూర్ణచారి, మధుకర్, మల్లేశం పాల్గొన్నారు. -
ఆలయాలు .. సంస్కృతికి నిలయాలు
మల్లాపూర్(కోరుట్ల): ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలని కోరుట్ల ఆర్డీవో జివాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రం శివారులోని సోమేశ్వర కొండపైన శ్రీకనక సోమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోనే ప్రాచీన పుణ్యక్షేత్రమైన కనక సోమేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆర్డీవోకు ఆలయ కమిటీ చైర్మన్ సంగ గంగరాజం, సభ్యులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి శాలువతో సత్కరించారు. అలాగే ఇటీవల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్గౌడ్ను సత్కరించారు. ఆర్ఐ రాజేశ్, ఆలయ కమిటీ వైస్చైర్మన్ ఇల్లెందుల తుక్కారాం తదితరులు పాల్గొన్నారు. -
రేపు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ఇన్
Iజగిత్యాలఅగ్రికల్చర్: వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో పంటల సాగుకు సంసిద్ధం కావచ్చా.. ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది. వరినారు పోసేందుకు అనుకూలమైన సమయమా.. విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలు ఎలా గుర్తుపట్టాలన్నదానిపై జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. రైతులు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. తేదీ : 04.06.2025 బుధవారం సమయం: ఉదయం 10 నుంచి 11 గంటల వరకుడయల్ చేయాల్సిన నంబర్ : 89777 45435 -
శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి
● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అశోక్కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాంతియుత వాతావరణంతోనే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకేరకమైన సేవలందించడం జరుగుతుందన్నారు. అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేసి జిల్లా ప్రజ లకు మరింత మెరుగైన సేవలందించాలని సూ చించారు. అనంతరం తెలంగాణ అమరువీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, వేణు, సీఐలు ఆరీఫ్ అలీ ఖాన్, వేణుగోపాల్, కృష్ణారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్
జగిత్యాలక్రైం: జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 1 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాలప్రజలు సహకరించాలని కోరారు. ఎమ్మార్పీకే విత్తనాలు విక్రయించాలి జగిత్యాలరూరల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వందన, శైల సీడ్ ప్రాసెస్ యూనిట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు విక్రయించే విత్తనాలు నాణ్యతగా ఉండాలన్నారు. దుకాణదారులు రైతులకు విత్తనాలు విక్రయించేటప్పుడు ఎలాంటి కల్తీ లేకుండా చూడాలని, ఎమ్మార్పీకి మించి అమ్మవద్దన్నారు. కార్యక్రమంలో ఏడీఏ తిరుపతినాయక్, ఏవో వినీల పాల్గొన్నారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలి జగిత్యాల: హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపేన్ ఈనెల 3 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్వహించడం జ రుగుతుందని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ తెలిపారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. రాష్ట్ర ఏయిడ్స్ నియంత్రణ సంఘం, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మొదటి దశలో 95 శాతం మంది ఆరోగ్యస్థితిని తెలుసుకుని రెండో దశలో చికి త్స అందించి, మూడో దశలో వైరల్ లోడ్ అణ చివేసేలా చూస్తామన్నారు. జిల్లాలో 3,48 1 మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులున్నారని అంచనా ఉందని, వీరిలో 2,730 మందిని పరీక్షించి ఏఆర్టీ ద్వారా చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ప్రాధాన్యత గల ప్రాంతాల్లో ప్రమాదకరమైన జనాభాపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ పాల్గొని హెల్త్ క్యాంపేయిన్ను విజయవంతం చేయాలన్నారు. ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలుజగిత్యాలరూరల్: జిల్లాలోని పాఠశాల బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి భద్రునాయక్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపై తిరిగితే సీజ్ చేయడంతో పాటు, కఠిన చర్యలు చేపడతామన్నారు. అలాగే కాలపరిమితి ముగిసిన వాహనాల వివరాలు వెంటనే రవాణా శాఖకు తెలియజేయాలన్నారు. ఎంవీఐలు అభిలాష్, వెంకన్న, ప్రమీల పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజగిత్యాల: ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం కింద ఉపకార వేతనాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఆర్ఎస్ చిత్రు తెలిపారు. WWW. TELANGANAEPASS. CGG. GOV. IN లో ఈ నెల 30లోపు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడ, జర్మనీ, సౌత్కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్లో ఉన్నత విద్య చదువుతున్న అర్హత గల మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
మున్సిపల్ అభివృద్ధి అందరి బాధ్యత
జగిత్యాల: మున్సిపల్ అభివృద్ధి అందరి బాధ్యతని, పచ్చదనం– పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ స్పందన అన్నారు. డైరెక్టర్ ఆఫ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా తొలిరోజు సోమవారం పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు తమవంతుగా పచ్చదనం పరిశుభ్రత ప్రారంభించాలని, 100 రోజుల కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, ఇందులో ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. అనంతరం మహిళ సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులను పాతబస్టాండ్లో మేళా నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి పాతబస్టాండ్లో ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఏవో శ్రీనివాస్, సునీత తదితరులు పాల్గొన్నారు. -
నేడు ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నామని ప్రజలు గమనించాలని సూచించారు. జగిత్యాల సమగ్రాభివృద్ధే లక్ష్యం● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలటౌన్: జగిత్యాల పట్టణ సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని, సీఎం రేవంత్రెడ్డి సహకారంతో పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే డా.సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 29వ వార్డులో ఈద్గా ప్రాంతంలో రూ.15లక్షలలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పట్టణంలో రహదారులు, పార్కులు, మార్కెట్లు, ఓపెన్ జిమ్లు, డివైడర్లు, విద్య, వైద్యం విషయంలో జగిత్యాలను అగ్రస్థానంలో నిలబెట్టానని వివరించారు. గాంధీనగర్ నుంచి చల్గల్ వరకు రూ.18కోట్లతో బ్లాక్ స్వాట్ రోడ్డు మంజూరు చేయడం జరిగిందన్నారు. 29వ వార్డులో దా దాపు రూ. కోటి 50లక్షలతో పనులు చేశామని తెలిపారు. 1కిమీ వరకు పనులు చేపట్టామని, త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం కేంద్ర మంత్రులను కలవనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని అన్నారు. రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బల్దియా కమిషనర్ స్పందన, డిఈ వరుణ్, ఏఈ శరణ్, మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడిలోనే చేర్పిస్తాంకథలాపూర్(వేములవాడ): తమ ఊరి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తామని కథలాపూర్ మండలం చింతకుంట గ్రామస్తులు ఆదివారం తీర్మానించారు. గ్రామంలోని నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాఠశాల ఆవరణలో సమావేశమయ్యారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులు కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందించేందుకు అన్ని వసతులు సమకూర్చుతామని మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు హామీ ఇచ్చారు. దీంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామంటూ నాయకులు, మహిళలు తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య, ఉమ్మడి కరీంనగర్ డీసీసీ మాజీ కార్యదర్శి చెదలు సత్యనారాయణ, హెచ్ఎంలు రవి, సుధాకర్, నాయకులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ధర్మపురి: జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. గతేడాది రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న జర్నలిస్టు బాబుకుమార్కు తెలంగాణ మీడియా అకాడమీ వెల్ఫేర్ స్కీం కింద మంజూరైన రూ.లక్ష విలువగల చెక్కును ఆదివారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా పని చేస్తూ వార్తల సేకరణకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న జర్నలిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని, అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు స్థలాలు మంజూరు చేసి ఇళ్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని డిమాండ్ చేశారు. అప్పుడు సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్.. తన శాఖలో అనేక అవకతవకలు జరిగాయని, వాటిని కూడా ప్రజలముందుంచుతామని అన్నారు. రూ.వంద కోట్లతో ధర్మపురికి ఇంటిగ్రేటెడ్ వసతి గృహాన్ని మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.పురోహితుల సన్మానంఆలయాల్లో పని చేస్తున్న పురోహితులకు కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఆదివారం ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆవరణలో విప్ లక్ష్మణ్కుమార్ను సన్మానించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు ఎస్.దినేశ్, కుంట సుధాకర్ తదితరులున్నారు. -
రోళ్లవాగు ఆయకట్టుకు నీరందిస్తాం
● మాజీ మంత్రి జీవన్రెడ్డి సారంగాపూర్(జగిత్యాల): రోళ్లవాగు ప్రాజెక్టు దిగువన ఖరీఫ్ పంటలకు పూర్తిస్థాయిలో నీరందిస్తామని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. ఆదివారం బీర్పూర్ శివారుల్లోని రోళ్లవాగు ప్రాజెక్టు పనులను అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2015–16 సంవత్సరంలో రోళ్లవాగు ఆధునీకరణ పనులు ప్రారంభించినా ఇంజినీరింగ్, అటవీశాఖల మధ్య సమన్వయంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగి ప్రాజెక్టు వ్యయం రూ.60 కోట్ల నుంచి రూ.152 కోట్లకు చేరిందన్నారు. అయినా పనులు పూర్తి కాలేదని, అటవీశాఖ అనుమతులను కూడా సాధించలేకపోయారని విమర్శించారు. తాను సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ప్రాజెక్టుకు అదనంగా మరో రూ.20 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రోళ్లవాగుకు మూడు షటర్స్ బిగించి, 0.25 టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా అధికారులు షటర్స్ బిగింపు పనులు ప్రారంభించినట్లు వివరించారు. అటవీశాఖ అనుమతులు వచ్చే వరకు ఆ శాఖ భూములకు నీరు చేరకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని పంటలు ఎండకుండా నీరందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట విండో చైర్మన్ పొల్సాని నవీన్రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, పార్టీ మండల అధ్యక్షుడు చెర్పూరి సుభాష్, గుడిసె జితేందర్, ఆడెపు తిరుపతి, రంగు లక్ష్మణ్, పంజాల అఖిల్, బర్ల లక్ష్మీనారాయణ, చెట్ల శేఖర్, ఏనుగు జోగిరెడ్డి, కమ్మునూర్ శ్రీను తదితరులు ఉన్నారు. -
జెండా పండుగ అతిథులు వీరే
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ పండుగకు జిల్లా కేంద్రాల్లో జరిగే ఉత్సవాలకు అతిథులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, జగిత్యాలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, పెద్దపల్లికి రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, రాజన్న సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు జెండా ఆవిష్కరించనున్నారు. -
పీసీసీలో మనోళ్లకు చోటు
● పీఏసీ కమిటీలో దుద్దిళ్ల, పొన్నం, ఆది ● కేబినెట్లో చోటు కోసం ఉమ్మడి నేతల ఆరాటంసాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన వివిధ పీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రికి చోటు దక్కింది. పీసీసీ కమిటీల్లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లను నియమించారు. ఇటీవల కొంతకాలంగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డికి సలహా కమిటీలో అవకాశం కల్పించారు. డీలిమిటేషన్ కమిటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలను సభ్యులుగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, అందులో నలుగురికి పీసీసీ కమిటీల్లో అవకాశం లభించింది. మంత్రి వర్గంలో ఆది.. మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు మరో బెర్తు ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నా రు. మున్నూరు కాపు సామాజికవర్గం కోణంలో ఆయనకు బెర్తు ఖాయమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. మాదిగ సామాజిక వర్గం తరఫున తమకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని మరో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కోరుతున్నారు. మరోవైపు తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరిన విషయం విధితమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు కేబినెట్లో ఉన్నారు. వీరికి తోడుగా మరో ఒక్క బెర్తు మాత్రమే ఖరారయ్యే అవకాశాలు ఉండటంతో ఈ ఒక్క మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. -
జగిత్యాల
న్యూస్రీల్జిల్లాకు తేలికపాటి వర్ష సూచనజగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదురోజుల్లో అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధనస్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో జిల్లాలో అక్కడక్కడ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 36నుంచి 37 డిగ్రీల సెల్సియస్గా, రాత్రి ఉష్ణోగ్రత 26–28 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 59075 శాతం, మధ్యాహ్నం 26–51శాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. Iశనివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2025 -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● డీఈవో శ్రీరామ్ మొండయ్యకరీంనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మక విద్య లభిస్తుందని, పాఠశాలల బలోపేతానికి ఎస్జీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆరు రోజుల పాటు బడిబాట ప్రచార రథాన్ని నిర్వహించడం అభినందనీయమని డీఈవో శ్రీరామ్ మొండయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు కోసం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల ఉమ్మడి జిల్లా ప్రచార రథాన్ని డీఈవో శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జూన్ 5 వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి మాట్లాడుతూ, న్యాయపరంగా రావాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తామని, ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యార్థులు తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విజయేందర్రెడ్డి, మంజుల హరిప్రియ, రమణారెడ్డి, సత్యం, కిషన్, సుధాకర్రావు, గాయత్రి, రోహిణిదేవి, సాగర్, మాధవ్, రామన్, వెంకటేశ్, అరవింద్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
సేవ.. స్వచ్ఛంద తోవ
● రాజన్న సేవలో మహిళలు ● ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరు ● గోశాలలోని గడ్డి ఆరబెట్టేందుకు తరలివచ్చిన అతివలు వేములవాడ: రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు రాజన్న సేవలో తరిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. హుండీ లెక్కింపు.. ఉత్సవాల సమయాల్లో ఆలయంలో వివిధ సేవల్లో రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన తిప్పాపూర్ గోశాలలోని గడ్డిని ఆరబెట్టేందుకు సైతం శుక్రవారం భారీగా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారు. పశువులకు సేవా చేయడంలో ఉన్న సంతృప్తి వేరేదాంట్లో రాదని వారు పేర్కొంటున్నారు. దాదాపు 63 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి కోడెలకు ఉపయోగపడే గడ్డిని ఆరబెట్టే పనుల్లో నిమగ్నమై.. ఆదర్శంగా నిలిచారు. -
బైక్.. టిప్పర్.. బస్సు ఢీ
● ముగ్గురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపుమల్యాల(చొప్పదండి): ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని, హఠాత్తుగా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న సంఘటనలో ముగ్గురు గాయపడిన సంఘటన మ ల్యాల మండలంలోని రాజారం గ్రా మ శివారులో చోటుచేసుకుంది. శుక్రవారం జగిత్యాల నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న టిప్పర్ రాజారం శివారులో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు నీరజ్తోపాటు మరో ఇద్దరు గాయపడగా, 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. బైక్ను ఢీకొన్న లారీ డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో వెనక ఉన్న ఆర్టీసీ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఈ సంఘటనలో బస్సు అద్దాలు పగిలి, ముందుభాగం దెబ్బతిన్నది. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు
జగిత్యాల: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ లత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతిశాఖకు చెందిన అధికారులు, సిబ్బంది వేడుకలకు హాజరు కావాలని, వారికి సంబంధించిన ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఏఎన్ఎం ఆధ్వర్యంలో వైద్య బృందాలతో శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానపత్రాలు అందేలా చూడాలన్నారు. మెప్మా ఆధ్వర్యంలో స్వశక్తి సంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలని, ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించి అందించాలన్నారు. అదనపు ఎస్పీ భీంరావు ఉన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు రాయికల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందవద్దని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని ఐకేపీ కేంద్రం నిర్వాహకులకు సూచించారు. మైతాపూర్ గ్రా మంలోని శివమణి రైస్మిల్లును సందర్శించి కొ నుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని త్వ రితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్ వెంట ఉన్నారు.● అదనపు కలెక్టర్ బీఎస్.లత -
ఒడ్డెలింగాపూర్ను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలి
రాయికల్: ఒడ్డెలింగాపూర్ను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలని రాష్ట్ర తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మాట్లాడుతూ, ఆదివాసీల పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని, విద్య, వైద్య సౌకర్యాలను కల్పించాలని, ఒడ్డెలింగాపూర్ను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలని కోరారు. దీంతో గిరిజనులకు, ఎస్టీలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఆయన వెంట నాయకులు ఆత్రం రవీందర్, పరంచ శంకర్ ఉన్నారు. సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు సారంగాపూర్: సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని పొలాస పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి. రవి, ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ కె. స్వాతి అన్నారు. శుక్రవారం మండలంలోని పెంబట్ల గ్రామంలో రైతుముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనిక ఎరువులతోపాటు, పురుగు మందులు వాడడం పూర్తిగా తగ్గి స్తేనే నేలతో పాటు, పర్యావరణం కాపాడుకోని పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రదీప్ రెడ్డి, ఏఈవో అంజనేయులు, రైతులు పాల్గొన్నారు. -
‘బంటియా’ ఫర్నీచర్ షోరూం ప్రారంభం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎదురుగా నూతనంగా ఏ ర్పాటు చేసిన బంటియా ఫర్నీచర్ షోరూంను శు క్రవారం బంటియా మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ బంటియాతో కలిసి సుడా చైర్మన్ కె.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేందర్ బంటియా మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు పొందిన బంటియా ఫర్నీచర్స్ ఇప్పుడు కరీంనగర్లో తన అతిపెద్ద షోరూంను గ్రాండ్గా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి దిగుమతి చేసిన తాజా, నాణ్యమైన ఫర్నిచర్ ఉత్పత్తులను అందిస్తున్నామని అన్నారు. రూ.99,999కి పైగా కొనుగోలు చేసే కస్టమర్లకు హోండా యాక్టివా 6జీ ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రత్యేక బహుమతులు, డిసౌంట్లు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ ఆధారిత రీకై ్లనర్లు రూ.99,999లకు లభిస్తాయన్నారు. క్రేవింగ్ సోఫాలు రూ. 66,000 నుంచి ప్రారంభమవుతాయని, ప్యాకేజీలు, జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రోళ్లవాగు పనులు ప్రారంభం
సారంగాపూర్: సుదీర్ఘకాలం తరువాత రోళ్లవాగు ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు కట్ట(బండ్)పై 1,275 మీటర్ల పొడవుతో పారపెట్ వాల్(పిట్టగోడ) నిర్మాణం చేపట్టారు. పనులు సత్వరమే పూర్తి చేసి, పంటలకు నీరందించాలని రైతుల డిమాండ్ మేరకు పనులు ప్రారంభం కావడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. పారపెట్ వాల్ నిర్మాణంతో పాటు మూడు తూములకు గేట్లు బిగించాలని కోరుతున్నారు. గేట్లు బిగింపు జరగకపోతే ప్రాజెక్టులోకి వచ్చే వర్షపునీరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీ–53, 12 ఎల్ కాలువ నీరు గోదావరిలో కలుస్తుందని చెబుతున్నారు. రూ.153.81కోట్లతో ప్రాజెక్టు బీర్పూర్ శివారులో 2015–16 సంవత్సరంలో రూ.60 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. పలు సాంకేతిక కారణాలతో ఆలస్యం అయ్యా యి. దీంతో వ్యయం భారీగా పెరిగి రూ.136.81 కోట్లకు చేరింది. ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయి. ఏడాదికాలంగా నిధుల లేమితో మిగితా పనులకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు అటవీశాఖ అనుమతులు ఆలస్యమయ్యాయి. ప్రభుత్వం ప్రాజె క్టు పనులు పూర్తి చేయడానికి ఇటీవల రూ.17కోట్లు విడుదల చేసింది. దీంతో రోళ్లవాగు వ్యయం రూ.153.81కోట్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తయితే బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని 15వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టులో అటవీశాఖకు భూములు ముంపునకు గురికావడంతో పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. త్వరలో అటవీశాఖ నుంచి పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి పంటలకు నీటి విడుదల చేసేందుకు మూడు స్లూయిస్(తూములు)ఏర్పాటు చేశారు. వీటికి గేట్లు బిగించాల్సి ఉంది. ప్రాజెక్టుకు 1,500మీటర్ల పొడవుతో మూడు కట్టల(బండ్) నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో 1,275 మీట ర్ల కట్ట పూర్తి కాగా, 1275 మీటర్ల పొడవుతో పారపెట్ వాల్ పనులు చేపడుతున్నారు. ఈ ఖరీఫ్లో రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈ ఛక్రూనాయక్ వెల్లడించారు. 1,275 మీటర్ల పారాపెట్ వాల్ నిర్మాణం ప్రాజెక్టు పనులకు గతంలో రూ.136.81 కోట్లు ఖర్చు ఇటీవల మరో రూ.17 కోట్లు విడుదల -
ధాన్యం వెంటనే తరలించండి
సారంగాపూర్: వర్షాలు పడుతున్నందున తూకం వేసిన ధాన్యం వెంటవెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బీర్పూర్ మండలం కందెనకుంట, చర్లపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం తూకం వేసిన వెంటనే మిల్లులకు లారీల్లో తరలించాలని, లారీలు ఎప్పటికప్పుడు కేంద్రాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, ఇతర అధికారులను ఆదేశించారు. కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, రెండు రోజుల్లో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్ హమీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీవో మదుసూధన్, తహసీల్దార్ సుజాత ఉన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
మహిళల రక్షణకు భరోసా కేంద్రం
జగిత్యాల: మహిళల రక్షణకు భరోసాకేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని డీఈవో రాము పేర్కొన్నారు. ఓల్డ్ హైస్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భరోసా సెంటర్ బృందం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల కోసం భరోసా బృందం పనిచేస్తుందని, బాలికలు, మహిళలను వేధింపులకు గురిచేస్తే ఫోక్సో చట్టం ప్రకారం కేసు చేయడం జరుగుతుందని, మహిళలు భరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే ఫోన్ చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. భరోసా సెంటర్ సభ్యులు సుజాత, సునీత పాల్గొన్నారు. జీలుగ విత్తనాల కొరత లేదు జగిత్యాలఅగ్రికల్చర్/కోరుట్ల: జిల్లాలో జీలుగ విత్తనాల కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. జిల్లాలోని కోరుట్ల మండలంలో జీలుగ విత్తనాలు లేవన్నది వాస్తవం కాదని అన్నారు. కోరుట్లకు బుధవారం 666 బస్తాల జీలుగ వచ్చిందని, గురువారం 251 బస్తాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కోరుట్లలో 415 బస్తాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు ఏడీఏ రమేశ్, ఏవో నాగమణి కోరుట్లలో జీలుగ విక్రయించే కేంద్రాలను శుక్రవారం పరిశీలించారని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి జగిత్యాల: నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు అరుణ అన్నారు. జిల్లా కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం ఎన్నికై నెల రోజులు కావస్తున్నా పాత కార్యవర్గం సంఘం భవనాన్ని అప్పగించకపోవడంతో అందరి సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోని నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉమ్మడి నారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ రాజేందర్, ట్రెజరర్ నారాయణ పాల్గొన్నారు. వెంకటేశ్వరుడికి క్షీరాభిషేకం ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకంను ఘనంగా నిర్వహించారు. అనంతరం రంగురంగుల పూలతో అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు మంత్రోచ్ఛవాలతో ప్రత్యేక పూజలు జరిపి, ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. దరఖాస్తులకు ఆహ్వానం జగిత్యాల: జిల్లాలోని మినీ గురుకులం ఒడ్డెలింగాపూర్, మల్లాపూర్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇంగ్లిష్ మీడియంలో ఖాళీగా ఉన్న సీట్లకు గిరిజన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారి వెంకన్న తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో 1వ తరగతిలో 60, 2వ తరగతిలో 12, 3వ తరగతిలో 1, 5వ తరగతిలో 25 సీట్లకు ప్రవేశాలున్నాయని, ఆసక్తి గల గిరిజన విద్యార్థులు జూన్ 6లోపు దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 96521 41962 సంప్రదించాలని సూచించారు. -
జగిత్యాల మున్సిపాలిటీకే అధిక నిధులు
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి రాని నిధులు జగిత్యాల మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగిందని, జగిత్యాల పట్టణాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో రూ.5 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు, 25వ వార్డులో రూ.8 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 4,520 డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మించగా పేదల సొంతింటి కల సాకారమైందన్నారు. పట్టణంలో 18 వేల ఇళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వడంతో పాటు, ఉచిత బస్సు సౌకర్యం, సన్నబియ్యం పంపిణీ, రాజీవ్ యువ వికాసం అందజేయడం జరుగుతోందన్నారు. బీట్బజార్ మార్కెట్ త్వరలోనే ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టడం వల్ల రానున్న వర్షకాలంలో వార్డులన్నీ జలమయం అయ్యే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కూతురు రాజేశ్, కూసరి అనిల్, నర్సమ్మ, గంగమల్లు, రాజకుమార్, డీఈ వరుణ్, ఏఈలు చరణ్, అనిల్ పాల్గొన్నారు. -
బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
మల్లాపూర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలకేంద్రం శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మాట్ల చిన్నపెద్దులు(61)కు భార్య సత్తమ్మ, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం గతంలో గల్ఫ్ వెళ్లి వచ్చి కుమార్తె వివాహం జరిపించాడు. ఎనిమిదేళ్లుగా స్వగ్రామంలోనే ఉంటూ ట్రాక్టర్ నడిపించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన శనిగారపు రమేశ్కు చెందిన వ్యవసాయ భూమిలో చిన్నపెద్దులు ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్నాడు. రివర్స్ వెళ్లే క్రమంలో ట్రాక్టర్ వ్యవసాయబావిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. నీటమునిగి చిన్నపెద్దులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి భార్య సత్తెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని గంగారం శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కూనారం గ్రామానికి చెందిన ఎండీ అక్రం(27) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలో మెకానిక్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న అక్రం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఆటోట్రాలీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అక్రం అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ పేర్కొన్నారు. మృతుడికి భార్య సమీరాబేగం, తల్లి దండ్రులు రేష్మ బేగం అక్బర్ పాషా ఉన్నారు. -
పొగాకు నిర్మూలిద్దాం
● విచ్చలవిడిగా తంబాకు, గుట్కా వినియోగం ● బహిరంగంగానే ధూమపానం ● పెరుగుతున్న సిగరేట్లు కాల్చే వారి సంఖ్య ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంకరీంనగర్టౌన్: యువత ఎంజాయ్ చేస్తున్నామనే భావనలో ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. సిగరేట్ కాలినట్లే తమ ఆరోగ్యం కాలిపోతుందనే విషయం గమనించలేకపోతున్నారు. జిల్లాలో యుక్తవయస్సు వచ్చిన విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సిగరేట్, బీడీ, తంబాకు, జర్ధా, గుట్కా వంటి మత్తు పొగాకు మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదాగా మొదలు పెట్టి చివరకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులపై నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటి వల్ల వివిధ రకాల రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నా తినేవారిలో మార్పు రావడం లేదు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కథనం.బహిరంగ ధూమపానం నేరం ధూమపానం నష్టాన్ని గుర్తించిన పాలకులు 2003లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని చట్టం తీసుకువచ్చారు. చట్ట ప్రకారం ప్రయాణ ప్రాంగణాలు, పార్కులు, రోడ్లపై, సినిమా థియేటర్లు, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే చట్టరీత్యా చర్యలతో పాటు జరిమానా విధించాలి. కానీ, జిల్లాలో అలాంటి కేసులు నమోదు కావడం లేదు. సిగరేట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని ప్యాకెట్లపై ముద్రించి వదిలేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై మరింత కఠిన నియంత్రణలు విధించాలని, విద్యాసంస్థల పరిసరాల్లో గుట్కా, సిగరెట్ అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని ఆరోగ్య కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం
కొత్తపల్లి(కరీంనగర్): టీపీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైందని ఎస్ఈ మేక రమేశ్బాబు అన్నారు. విద్యుత్ భవన్లోని ఎస్ఈ చాంబర్లో శుక్రవారం ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. గత సంవత్సరం నవంబర్ నెల నుంచి వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని.. అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంతో విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించామన్నారు. లోడ్ పెరిగే అవకాశమున్నచోట్ల రాచర్ల తిమ్మాపూర్, మొయినకుంట, జేపీనగర్, బోనాల, మల్లారం, రేణిగుంట ప్రాంతాల్లో 5 ఎంవీఏ, కరీంనగర్ టౌన్ బ్యాంక్ కాలనీలో 12.5 ఎంవీఏ కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పామని, కరీంనగర్ టౌన్ ఉజ్వల పార్క్, వాటర్ వర్క్స్, ఎస్ఆర్ఆర్, నవపేట్, వీర్నపల్లి ప్రాంతాల్లో 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏ, సప్తగిరికాలనీ సాయినగర్(ఖాజీపూర్–2)లో 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏ, కోర్కల్, వట్టములలో 3.15 నుంచి 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం వరకు పెంచామని వివరించారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కాజిపూర్(బాబుపేట్), చిగురుమామిడి, సిరిసిల్ల జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లోడ్ సామర్థ్యం పెంచడంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివారించగలిగామని చెప్పారు. ఇప్పటివరకు 325 కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతోపాటు 355 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో అల్గునూరు, చిగురుమామిడి, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర ప్రాంతాల్లో ఓవర్ లోడ్ తగ్గించామని, గత నవంబర్ నెల నుంచి నిరంతరాయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ వేసవికాల ముందస్తు కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేశామని తెలిపారు. -
పొగాకుతో గుండెకు ముప్పు
పాన్, గుట్కా, తంబాకు, సిగరెట్లలో నికోటిన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలను సంకుచితం చేస్తాయి. దీంతో రక్తప్రసరణ తగ్గి గుండైపె ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంగా వీటిని వినియోగించే వారిలో గుండెపోటు, పక్షవాతం, హైపర్టెన్షన్ వంటి తీవ్రమైన కార్డియోవాస్కులర్ సమస్యలు వస్తాయి. పొగాకు వల్ల శరీరంలో శ్రీకోలెస్ట్రాల్శ్రీ స్థాయి పెరిగి, నాళాల్లో శ్రీబ్లాక్శ్రీ ఏర్పడుతుంది. ఇది గుండెకు రక్తసరఫరాను తగ్గించి ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మితాహారం, వ్యాయామం పాటించడం ఎంతో అవసరం. – డాక్టర్ అనీశ్పబ్బ, కార్డియాలజిస్టు -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును శుక్రవారం ఆలయ అధికారి శ్రీకాంత్, పర్యవేక్షణాధికారి రాజమౌలి ఆధ్వర్యంలో చేపట్టారు. 24 రోజులకుగాను హుండీ ఆదాయం రూ.1,00,95,392 సమకూరిందని, 44 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. భక్తులు హుండీలో వేసిన మిశ్రమ బంగారం, వెండికి సీలువేసి,తిరిగి హుండీలో వేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ, స్థానాచార్యుడు కపీందర్, పర్యవేక్షకుడు సునీల్కుమార్, ఎన్.చంద్రశేఖర్, హరిహరనాథ్, ఆలయ సిబ్బంది, ఏఎస్సై శ్రీనివాస్, శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యమల్యాల: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి కృష్ణ(38) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. వైద్య చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసినా, వ్యాధి నయం కాకపోవడంతోపాటు జీవితంపై విరక్తి చెందిన తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. బావిలో పడి వృద్ధుడు మృతిసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన లంక ముత్తయ్య(70) సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు.. ముత్తయ్యకు కొడుకు, కూతురు ఉండగా కూతురు నర్సయ్యపల్లిలో ఉంటోంది. అనారోగ్యంతోపాటు మతిస్థిమితం సరిగా లేని ముత్తయ్య నెలరోజుల క్రితం కూతురు ఇంటికి వచ్చాడు. ఈనెల 18న ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. ఈక్రమంలో అతడు ఇంటికి వెళ్లకపోవడంతో బంధువులు ఇళ్లలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం నర్సయ్యపల్లి శివారులోని వ్యవసాయ బావిలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనబడడంతో ముత్తయ్యగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు వేళాయె శాతవాహనలో న్యాయ విద్య
వివరాలు 8లోఇళ్ల నిర్మాణాల అనుమతులకు బిల్డ్ నౌ● ఏఐ ఆధారిత వ్యవస్థతో.. ● కొత్త విధానం ప్రారంభంజగిత్యాల: భవనాల నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు ఆధునాతన సాంకేతికతతో రూపొందించిన బిల్డ్ నౌ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. గత నెలలోనే మెట్రో నగరంలో ఏఐ సాంకేతికతతో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తాజాగా మున్సిపాలిటీల్లోనూ అమలవుతోంది. కృత్రిమ మేథా సాంకేతికతతో ఇంటి నిర్మాణ అనుమతులు పొందడంలో సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ ఉండేది. ఇంటి అనుమతులు పొందడంలో ఇబ్బందులు ఉన్నాయన్న నేపథ్యంలో ఆ విధానాన్ని రద్దు చేసి బిల్డ్ నౌ తీసుకొచ్చింది. ఏఐ ఆధారిత వ్యవస్థతో బ్లాక్ చైన్, రియాల్టీ, ఆటోమేషన్ వంటివి తీసుకొచ్చారు. ఇందులో ఇంటి నిర్మాణ స్థలం, లేఅవుట్ సరిహద్దులను తెలుసుకునేందుకు జీపీఎస్ ఆధారిత పటాలను పొందుపర్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా మన ఇంటి నిర్మాణ దరఖాస్తు ఏ స్టేజీలో ఉందని వాట్సాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఏవైనా తప్పుడు దరఖాస్తులు చేసుకున్నా మళ్లీ సవరించుకునే అవకాశం కల్పించారు. భవన నిర్మాణాలకు సంబంధించి పరిశీలనకు వెళ్తే ఏఐ ఆధారంగా రెండు నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. వీడియో ద్వారా వీక్షించే అవకాశం ఉంది. ఇందులో హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంది. అనుమతి 15 రోజుల్లోనే... 500 చదరపు మీటర్లలోపు భవనం నిర్మాణం చేపడితే 15 రోజుల్లోనే అనుమతులు జారీ చేయనున్నారు. 500కు పైగా ఉంటే 21 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు ఈ మేరకు గురువారం నుంచి బిల్డ్ నౌ ద్వారానే అనుమతులు జారీ చేస్తున్నారు. ఏఐ సాంకేతికతతో ఏఐ సాంకేతికతతో బిల్డ్నౌ విధానంలో ఇంటి అనుమతులు ఇవ్వనున్నాం. పాత టీఎస్ బీపాస్ రద్దు అయింది. ప్రస్తుతం జిల్లాలో ఈ కొత్త బిల్డ్నౌ ద్వారానే అనుమతులు లభించనున్నాయి. – శ్రీనివాస్, టీపీవో -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలని.. అనర్హులకు ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు వానాకాలం పంటలసాగు సన్నద్ధతపై కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఖరీఫ్ సీజన్లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను భాగస్వామ్యం చేస్తాం. ఎస్సారెస్పీ సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీసిల్టేషన్ ఆధునిక పద్ధతుల్లో పూర్తిచేసి పూర్వపు సామర్థ్యం తీసుకొస్తాం. కడెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తాం. కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా.. ఇందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో ముందుకు వెళ్తా. సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తాం. పాలకుర్తి ఎత్తిపోతల పథకం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.● రోళ్లవాగు ప్రాజెక్టు అటవీ అనుమతులు వచ్చేలా ఉన్నతాధికారులతో జగిత్యాల కలెక్టర్ నిరంతరం సంప్రదింపులు చేయాలని మంత్రి సూచించారు. నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలుచేస్తుందన్నారు. కలెక్టర్లు మరోవారం కొనుగోలు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైనమేర ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధం చేసుకోవాలని.. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు వాడాలన్నారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణలోని 84 శాతం జనాభాకు ఉచితంగా ఆరుకిలోల సన్నబియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది విప్లవాత్మక పథకమని.. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రం మనదే అని తెలిపారు.ఇళ్ల స్థలాలపై ఆందోళన వద్దు..మీడియా మిత్రులకు ఎస్సారెస్పీ సమీపంలో అందుబాటులో ఉన్న భూములు పంపిణీకి ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కరీంనగర్ మీడియా మిత్రులు ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో చర్చించి త్వరలో పట్టాలు అందించే కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతుల నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. భూ భారతి చట్టంతో పట్టాదారులకు ఎటువంటి నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో రైస్ మిల్లులవద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. మలకపేట, సూరమ్మ, మోతె నారాయణపూర్, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టుల పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోకి భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలు వస్తాయని.. ఆయా జిల్లా కలెక్టర్లను సైతం సమీక్ష సమావేశాలకు ఆహ్వానించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయ రమణా రావు, డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, సత్య ప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ జె.అరుణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.