breaking news
Jagitial District News
-
– వివరాలు 8లోu
ఆస్తమా, బీపీ పోయాయి కరీంనగర్స్పోర్ట్స్: సర్వరోగ నివారణి యోగా అనే దానికి నేనే నిదర్శనం. యోగాసనాలు చేయకముందు బీపీ, ఆస్తమాతో బాధపడ్డాను. ఇక్కడ డేకేర్ సెంటర్కు వచ్చినప్పటి నుంచి అన్ని నయమయ్యాయి. ఇప్పుడు చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను. – కె.అరుణ యోగాతో నయమైంది కరీంనగర్స్పోర్ట్స్: 2013 నుంచి 2016 వరకు అనారోగ్యంతో బాధపడ్డాను. యోగా చేయాలని పలువురు చెప్పడంతో ప్రతీ రోజు సాధన చేస్తున్నాను. ప్రస్తుతం ఎలాంటి రోగాలు లేకుండా చాలా సంతోషంగా గడుపుతున్నాను. – కె.వందన -
ఓవర్ టు సీడీఎంఏ
● జగిత్యాలలో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి ● 33 అభ్యంతరాల స్వీకరణ ● 12 ఆమోదం.. 21 తిరస్కరణ ● 50 వార్డులతో సీడీఎంఏకు రిపోర్టుజగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ అనంతరం చుట్టుపక్కల ఉన్న మోతె, లింగంపేట, తిప్పన్నపేట, ధరూర్, తిమ్మాపూర్తో పాటు మరికొన్ని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. 38వార్డులతో ఉన్న పట్టణం 48 వార్డులకు పెరిగింది. జనాభా పెరగడం, నూకపల్లి అర్బన్ కాలనీని మున్సిపాలిటీలో కలపడంతో మరో రెండు వార్డులు అనివార్యమయ్యాయి. ఈ మేరకు మున్సిపల్ అధికారులు డీలిమిటేషన్ ప్రక్రి య చేపట్టారు. ఈనెల 3న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, 4న అభ్యంతరాలు స్వీకరించారు. 12వ తేదీ నుంచి 16 వరకు వచ్చిన అభ్యంతరాలపై విచారణ చేపట్టారు. శుక్రవారం ఫైనల్ రిపోర్ట్ను సీడీఎంఏకు పంపించారు. అభ్యంతరాల వెల్లువ డీలిమిటేషన్లో అభ్యంతరాలు వెల్లువలా వచ్చా యి. పొన్నాల గార్డెన్స్ వెనుకాల ఉన్న వారు లింగంపేటలో కలపాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిలిమిటేషన్ చేపట్టగా ఆ నివాసాలు 25వ వార్డులోనే ఉన్నాయి. దీంతో వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోతె గ్రామంలోని కొన్ని ఇళ్లు జగిత్యాల మున్సిపాలిటీలో చూపిస్తున్నాయి. వారు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మోతె గ్రామంలోని కొన్ని ఇళ్లను మున్సిపాలిటీ నుంచి తొలగించగా వారికి లైన్ క్లియర్ అయింది. మొత్తంగా 33 దరఖాస్తులు వచ్చినప్పటికీ అధికారులు మాత్రం 12 దరఖాస్తులకు ఆమోదం చేశారు. వార్డుకు 1,700 ఓట్లు? జగిత్యాల మున్సిపాలిటీలో 94,320 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుకు 1700కు పైగా ఓట్లు ఉండేలా డీలిమిటేషన్ చేపట్టారు. 88 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4నుంచి 5వార్డులు వచ్చేలా చూశారు. అయితే చాలా మంది ప్రజలు డీలిమిటేషన్ ప్రక్రియపై అసంతృప్తిగానే ఉన్నారు. రెండు రోజుల్లో ఫైనల్ నోటిఫికేషన్ సైతం సీడీఎంఏ నుంచి వచ్చే అవకాశాలున్నాయి. ఇక 50 వార్డులు జగిత్యాల మున్సిపాలిటీ ఇక 50 వార్డులుగా కొనసాగనుంది. జిల్లా కేంద్రం కాకముందు 38వార్డులు ఉన్నప్పటికీ అప్పుడు మరికొన్ని గ్రామాలను విలీనం చేయడంతో ఆ సంఖ్య 48 వార్డులకు పెరిగింది. తాజాగా నూకపల్లి అర్బన్ కాలనీని మున్సిపాలిటీలో కలపడంతో మరో రెండు వార్డులు పెంచడం జరిగింది. రానున్న ఎన్నికల్లో 50 స్థానాలకు ఆశావహులు పోటీ చేయనున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను అధికారులు 19 రోజుల్లో పూర్తి చేశారు. మున్సిపాలిటీలో వార్డులకు సీరియల్ నంబరు నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో బౌండరీలను ఏర్పాటు చేసి చేశారు.ప్రక్రియ పూర్తి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేపట్టడం జరిగింది. అభ్యంతరాలను సైతం స్వీకరించి ప్రజలకు అనుగుణంగానే చేపట్టడం జరిగింది. త్వరలోనే అప్రూవ్ వచ్చే అవకాశాలున్నాయి. 48 వార్డులుండగా మరో రెండు వార్డులు పెరగనున్నాయి. – శ్రీనివాస్, టౌన్ప్లానింగ్ అధికారి, జగిత్యాల -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
జగిత్యాల: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 41వ వార్డులో రూ.25లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని పనుల్లో ఇష్టానుసారంగా చేస్తున్నారని, అధికారులు పనులను పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ఉన్నారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి కథలాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్రెడ్డి తెలిపారు. కథలాపూర్లో బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం నిధులతో కథలాపూర్ మోడల్స్కూల్లో కిచెన్షెడ్ నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. సిరికొండ, ఇప్పపెల్లి, దుంపేట, చింతకుంట, అంబారిపేట తండాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ షెడ్ల కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ ఈ నిధులను మంజూరు చేశారన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు సత్యనారాయణ, వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్, మహేశ్, రవి, సత్యం, రాజేశ్, శివ, శ్రీహరి పాల్గొన్నారు. ఈ పాస్ ద్వారానే అమ్మకాలుకోరుట్ల రూరల్: ఈ పాస్ ద్వారానే యూరియా అమ్మకాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. కోరుట్ల మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. యూరియా లారీ వచ్చిన వెంటనే గోదాముల్లో దింపి రైతు భూమి వివరాల ప్రకారం యూరియా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ దండ రమేశ్, ఏవోలు నాగమణి, లావణ్య, రాజ్కుమార్, దీపిక పాల్గొన్నారు. దరఖాస్తులకు ఆహ్వానంజగిత్యాల: సివిల్ సర్వీసెస్ పరీక్ష (ప్రీలిమ్స్, మెయిన్స్) 2025–26 కోసం ఉచిత లాంగ్టర్మ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థుల సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జూలై 8 వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, జూలై 25 నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. 150 మంది అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనుండగా, 100 మందిని జూలై 12న నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారని, మరో 50 మంది అభ్యర్థులను ఇంతకుముందు యూపీఎస్సీ ద్వారా నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని నేరుగా తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఉచిత రవాణా, భోజన, లాడ్జింగ్ కోసం నెలకు రూ.5 వేలు, బుక్ఫండ్ కోసం రూ.5 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వివరాలకు 0878–2268686 నంబరులో సంప్రదించాలన్నారు. సమ్మె నోటీసు అందజేతజగిత్యాలరూరల్: గ్రామపంచాయతీ కార్మిక సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటి చంద్రశేఖర్ అన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే ఒక రోజు సమ్మెలో పంచాయతీ కార్మికులు పాల్గొంటారని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్కు సమ్మె నోటీసు అందజేశారు. జిల్లా కార్యదర్శి మల్లేశం, న్యాతరి మల్లవ్వ, మండల అధ్యక్షుడు రాజేందర్, రాజన్న, రాజు పాల్గొన్నారు. -
పరిహారం.. పరిహాసం!
● విద్యుత్ షాక్ బాఽఽధితుల దయనీయ పరిస్థితి ● ప్రాణాలు పోయినా పట్టింపు కరువు ● గాయపడిన వారిని ఆదుకునేదెవరు ● ప్రయివేటులో అడ్డగోలు ఖర్చులుఈమె పేరు పూజిత. పక్కన ఆమె కుమారుడు సాత్విక్(6). ఏడాదిన్నర క్రితం కోరుట్ల కల్లూర్రోడ్డులో హైటెన్షన్ వైర్లు తగిలి సాత్విక్తో పాటు మరో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యారు. సాత్విక్ ఒళ్లంతా కాలిపోయి అవిటివాడిగా మారాడు. ఒళ్లు కాలి వికారంగా మారడంతో బడికి సైతం వెళ్లడం లేదు. చికిత్స కోసం రూ.2 లక్షలకు మించి సదరు పేద కుటుంబం ఖర్చు చేసింది. విద్యుత్శాఖ నుంచి ఒక్క రూపాయి పరిహారం రాలేదు. ఈమె పేరు శైలజ. ఐదు రోజుల క్రితం గణపతి విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో ఎల్టీ వైర్లు తగిలి గాయపడ్డ నితిన్ భార్య. నితిన్ కరీంనగర్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మూడు రోజులకే దాదాపు రూ.1.50 లక్షల వరకు ఖర్చయ్యింది. ఇంకా ఎన్ని రోజులు చికిత్స తీసుకోవాలో..ఎంత ఖర్చు వస్తుందో..తెలియడం లేదని ఆసుపత్రిలో ఉన్న శైలజ ఆవేదన వ్యక్తం చేస్తోంది. విద్యుత్శాఖ ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడం దయనీయం. -
మాదక ద్రవ్యాలను నిరోధించాలి
● వ్యతిరేక వారోత్సవాలు విజయ వంతం చేయాలి ● అదనపు కలెక్టర్ లతజగిత్యాల: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని మహిళ సంక్షేమశాఖ, పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ లత సూచించారు. కలెక్టరేట్లో వివిధశాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 21న క్రీడలపోటీలు, యోగా డే, జిల్లాస్థాయి డ్రగ్ ఫ్రీ క్రీడలు, 22న అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. 23న మొక్కలు నాటే కార్యక్రమం, 24న డిజిటల్ ఎంగేజ్మెంట్ సామాజిక మాద్యమాల ద్వారా ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. 25న పోస్టర్లు, కళాప్రదర్శనల పోటీలు నిర్వహించాలని, 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేడుకల ర్యాలీ, స్లోగన్స్, సంతకాల సేకరణ, స్టాల్స్, ఫొటో ప్రదర్శన, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి నరేశ్, డీఎంహెచ్వో ప్రమోద్, సునీల్కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మంజూల, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. బెస్ట్ అవైలేబుల్ స్కూళ్ల లక్కీడ్రా 2025–26 సంవత్సరానికి గాను జిల్లాలో గల బెస్ట్అవైలేబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ లత ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించారు. 1వ తరగతిలో 93 మంది దరఖాస్తు చేసుకోగా, 75 మందిని తీసుకోవడం జరిగిందని, 5వ తరగతిలో 120 మంది దరఖాస్తు చేసుకోగా, 76 సీట్లు లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్కులాల అధికారి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్యం సాధించాలి
● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలని ఎస్పీ అశోక్కుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లాస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరంతరం విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కంప్యూటర్, ఫోరెన్సిక్, ఫింగర్ప్రింట్, హ్యాండ్లింగ్, పోలీస్ జాగిలాల విభాగంలో ట్రాకింగ్, ఎక్స్ప్లోజివ్, ఫొటో, వీడియోగ్రఫీలో పోటీలు ఉంటాయన్నారు. సాంకేతిక పరి జ్ఞానం, కేసుల దర్యాఫ్తులో మెలకువలు నేర్చుకునేందుకు డ్యూటీ మీట్ దోహద పడుతుందన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర, జాతీయస్థాయిలో జరిగే డ్యూటీ మీట్కు ఎంపిక చేస్తామని తెలిపారు. అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు శ్రీనివాస్, రఫీ ఖాన్, శ్రీధర్, సుధాకర్, కరుణాకర్ పాల్గొన్నారు. -
భూ సేకరణలో వేగం పెంచాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: జిల్లాలో వివిధస్థాయిలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్ట్లకు సంబంధించి భూ సేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయ భూసేకరణ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్లకు సంబంధించిన పెండింగ్ పనులతో పాటు, ఇతర ప్రాజెక్ట్ల కింద మిగిలిన భూసేకరణ పనులను చేపట్టాలన్నారు. భారీ వర్షాలు కురియకముందే అన్ని కాలువలకు మరమతులు చేయించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ భవనాలు, మరుగుదొడ్లు లాంటి పనులు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్శాఖ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, జిల్లా ఇరిగేషన్ అధికారి రమేశ్ పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించాలి డబుల్బెడ్రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. నూకపల్లి అర్బన్ కాలనీలో డబుల్బెడ్రూం ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు స్థలం పరిశీలించారు. త్వరలోనే లబ్ధిదారుల కోసం ఒక అంగన్వాడీ కేంద్రంతో పాటు, పీహెచ్సీ కేంద్రం సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆర్డీవో మధుసూదన్, గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలిసీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం వైద్యశాఖ, మున్సిపల్ అధికారులతో కలిసి లింగంపేటలో పర్యటించారు. రాబోయే మూడు నెలల పాటు పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా చూడాలన్నారు. జూన్ 25 నాటికి జిల్లాలోని అన్ని మండలాల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ పాల్గొన్నారు. -
తిరోగమనంలో తెలంగాణ
మల్లాపూర్: మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పాలనా వైఫల్యంతో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. మల్లాపూర్ మండలం గొర్రెపల్లిలో శుక్రవారం పర్యటించారు. నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అమలైన పథకాల్లో కోతపెడుతూ ప్రజలను, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోందన్నారు. సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ను దూషించడమే పనిగా పెట్టుకున్నాడన్నారు. 18నెలల పాలనతోనే తెలంగాణ పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి నిలబడి కొట్లాడుతానని, విద్య, ఉద్యోగ అవకాశాల కల్పనకు పనిచేస్తానన్నారు. గ్రామాల్లో పథకాలు మంజూరు చేయిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసిందని, ఒక్క రూపాయి ఇవ్వొద్దన్నారు. అనంతరం మొగిలిపేటలో రూ.5లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేశ్గౌడ్, ఎంపీడీవో శశికుమార్రెడ్డి, పీఆర్ డీఈ వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంతో కొట్లాడుతా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ -
ప్రజారోగ్యంపై వైద్యసిబ్బంది దృష్టిసారించాలి
కథలాపూర్: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజారోగ్యంపై వైద్యసిబ్బంది దృష్టిసారించాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ అన్నారు. గురువారం కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారులతోపాటు వైద్యసిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం వివరాలు తెలుసుకునేందుకు వైద్యసిబ్బంది ఇంటింటా సర్వే చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పోగ్రామింగ్ ఆఫీసర్లు శ్రీనివాస్, రవీందర్, సత్యనారాయణ, వైద్యాధికారులు సింధూజ, రచన, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదం జరిగినప్పుడే హడావుడి
కోరుట్ల: ఈ రెండు సందర్భాల్లోనూ ట్రాన్స్కో అధికారులు సంఘటన జరిగిన సమయంలో చూపిన హడావుడి ఆ తరువాత చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాపాయ స్థితి ఉంటేనే ట్రాన్స్కో అధికారులు పరిష్కారంపై దృష్టి పెడతారా..? అన్న అనుమానంతో జనం ఆందోళన చెందుతున్నారు. హడావుడితో సరి.. ఏడాదిన్నర క్రితం కరెంటు షాక్తో ఇద్దరు చిన్నారులు గాయపడిన వెంటనే ట్రాన్స్కో అధికారులు వారంపాటు హడావుడి చేశారు. ముప్పై ఏళ్లుగా ఇళ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లను తొలగిస్తామని ప్రకటించారు. సదరు హైటెన్షన్ వైర్ల తొలగింపు కోసం రూ.50 లక్షలు కేటాయించాలని మున్సిపల్ అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. ఆ నిధులు రాకపోవడంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. బీమునిదుబ్బ, ప్రకాశం రోడ్ ఏరియాలను కలుపుతూ సుమారు 150 ఇళ్లపై నుంచి హైటెన్షన్ వైర్లు యధాతథంగా ఉన్నాయి. ఇప్పటికీ అ ప్రాంతజనం వర్షాకాలం వస్తే చాలు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తాత్కాలిక మరమ్మతులు ఆదివారం కరెంట్ షాక్కు కారణమైన వల్లంపల్లి 33 కేవీ లైన్ వేలాడుతున్న విషయాన్ని ఇదివరకు స్థాని కులు చాలామంది ట్రాన్స్కో అఽధికారుల దృష్టికి తీసుకెళ్నిట్లు సమాచారం. ఆ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ 33 కేవీలైన్ స్తంభాలు మార్చి 11 మీటర్ల ఎత్తు ఉన్న స్తంభాలు వేయాలని ట్రాన్స్కో అధికారులకు విన్నవించినట్లు తెల్సింది. ఈ వినతులకు స్పందించి ట్రాన్స్కో అధికారులు అప్పుడే టవర్లు వేసి సరిదిద్దే ప్రయత్నం చేయగా.. స్థానికులు అభ్యంతరాలు చెప్పినట్లు తెలిసింది. అయితే ట్రాన్స్కో అధికారులు టవర్ల ఏర్పాటులో చొరవ చూపకపోవడంతో 33 కేవీ లైన్లు అలాగే ఉండిపోయాయి. ప్రమాదం జరగగానే ట్రాన్స్కో అధికారులు హడావుడిగా మంగళవారం ప్రమాదస్థలంలో కొత్త స్తంభం వేసి లైన్ ఎత్తు పెంచారు. అనంతరం గతంలో ప్రమాదం చోటు చేసుకున్న కల్లూర్ రోడ్ ఏరియాలోని హైటెన్షన్ వైర్లను పరిశీలించి పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపామని స్థానికులకు చెప్ప డం గమనార్హం. ఇటీవల కరెంట్ ప్రమాదం జరిగిన చోట టవర్లు ఏర్పాటు చేస్తామని, పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా విద్యుత్ వైర్లు వేలాడు తూ, ప్రమాదకరంగా ఉంటే వెంటనే తమ సిబ్బంది దృష్టికి తేవాలని ట్రాన్స్కో ఏడీఈ రఘుపతి తెలిపా రు. కల్లూర్రోడ్లోనూ ప్రమాదకరంగా ఇళ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లు సరిచేసేందుకు త్వరలో 11 మీటర్ల ఎత్తు ఉన్న స్తంభాలు వేయిస్తామన్నారు. ఆ తర్వాత మర్చిపోతున్న విద్యుత్ అధికారులు తాజాగా కోరుట్ల ప్రమాద స్థలంలో కొత్త స్తంభాలు ఏడాదిన్నర క్రితం కోరుట్లలోని భీమునిదుబ్బ కల్లూర్రోడ్లో గాలిపటం ఎగరేస్తున్న ఇద్దరు చిన్నారులు 33 కేవీ లైన్ విద్యుత్షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి అవిటివాడయ్యాడు. మరో చిన్నారి తీవ్ర గాయాలతో ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఐదు రోజుల క్రితం కోరుట్ల–మెట్పల్లి జాతీయ రహదారి వెంబడి 33 కేవీ లైన్ స్తంభం తక్కువ ఎత్తులో ఉండటంతో తయారీలో ఉన్న గణపతి విగ్రహాన్ని తరలిస్తున్న పది మందికి షాక్ తగిలింది. వీరిలో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఆరుగురు తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ఎన్నికలొస్తున్నాయనే రైతుభరోసా
కోరుట్ల: ఎన్నికలొస్తున్నాయనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా విడుదల చేసిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేసేందుకు రైతుభరోసా ఇచ్చారని పేర్కొన్నారు. సీఎంకు రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టులపైనా అవగాహన లేదన్నారు. ఎంపీ అర్వింద్ బనకచర్లను జనకచర్ల అనడం ఆయనకున్న పరిజ్ఞానానికి అద్దం పడుతోందన్నారు. ప్రజలకు అన్ని విషయాల్లో మేలు చేసింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 28న కోరుట్ల యువతకు ఉపాధి కల్పన కోసం కటుకం సంగయ్య ఫంక్షన్హాల్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జాబ్మేళా పోస్టర్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు దారిశెట్టి రాజేశ్, చీటి వెంకట్రావ్, కేతిరెడ్డి భాస్కర్రెడ్డి, అతిక్, వంతడుపుల అంజయ్య, మోహన్రెడ్డి, రాజమురళి, సురేందర్లు పాల్గొన్నారు. -
బల్దియా స్థలాలు కబ్జా
జగిత్యాల: జిల్లా కేంద్రంలో మున్సిపల్ అనుమతి లేకుండా ఎవరైనా ఇల్లు నిర్మించుకున్నా.. సెట్బ్యాక్ లేకున్నా.. ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేస్తున్నారు. కానీ మున్సిపల్ స్థలాలు యథేచ్ఛగా కబ్జా చేసుకుంటే మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. నిర్మాణాలను ఎలా కూల్చివేస్తున్నారో స్థలాలను ఆక్రమించుకున్న వారిని కూడా వెళ్లగొట్టి స్వాధీనం చేసుకోవాలని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దుకాణాలను అద్దెకు తీసుకుని.. దాని ఎదుట మరో దుకాణం పెట్టి.. రేకుల షెడ్డుతో కబ్జా చేస్తున్నారు. ఇది అంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ జిల్లాకేంద్రంలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు భారీగా వెలిశాయి. ఇటీవల వ్యాపారాలు పెరగడంతో ఎలాంటి సదుపాయాలు లేకుండా భవనాలు నిర్మించడం, ఫుట్పాత్లను ఆక్రమించడం.. డ్రైనేజీలపై కప్పులు వేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉద్యానవనాన్ని ఆనుకుని ఉన్న స్థలం కోట్లాది రూపాయల విలువైనది. ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా బల్దియాకు అత్యధిక ఆదాయం చేకూరేది. కానీ మున్సిపల్ అధికారులు ఊసే ఎత్తడం లేదు. ఇలా అనేక చోట్ల అక్రమాలు అత్యధికంగా ఉన్నాయి. ఆదాయానికి భారీగండి ప్రభుత్వ స్థలాల్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. అధికారులు పాకలవర్గాలు పట్టించుకోకపోవడంతో ఆ ఆదాయానికి గండి పడుతోంది. గతంలో అంగడిబజార్లో ఉన్న ఖాళీ స్థలలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఒక్కో షాపు రూ.4 నుంచి రూ.5 లక్షలతో టెండర్లు దక్కించుకున్నారు. కోట్లాది రూపాయల విలువ గల స్థలాల్లోని అక్రమణలను తొలగిస్తే జిల్లాకు ఆదాయం అధిక సంఖ్యలో లభిస్తుంది. కొన్ని చోట్ల షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించినప్పటికీ ఆశించిన మేర నిర్మాణం చేపట్టలేదు. మున్సిపల్కు కొంత మేరే చెల్లింపులు మున్సిపల్ స్థలాల్లో అక్రమంగా షెడ్లు వేసుకుని అందులో వ్యాపారం నిర్వహించుకోగా.. మున్సిపల్కు ఎంతో కొంత మాత్రమే ఫీజు చెల్లిస్తున్నట్లు తెలిసింది. బల్దియా అధికారులు సైతం ఫీజులు తీసుకుని మిన్నుకుంటున్నారు. వారు మాత్రం మున్సిపల్కు నామమాత్రంగా ఫీజులు తీసుకుని అద్దెలు తీసుకుంటున్నారు. విలువైన స్థలాల్లో అక్రమణలను తొలగించి షాపింగ్కాంప్లెక్స్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. షెటర్ల ముందు షెడ్లు.. షెటర్లను అద్దెకు తీసుకున్న వారు వాటిని ఆనుకుని మరో షెటరంతా రేకులషెడ్డు వేసి సామాను ముందు పెట్టడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రజలు నడిచేందుకు ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో టవర్సర్కిల్, తహసీల్ చౌరస్తా, కొత్తబస్టాండ్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో అధికంగా వాణిజ్య సముదాయాలున్నాయి. ఇటీవల నూతనంగా షాపింగ్మాల్స్ వెలువగా వారు సైతం ఎలాంటి ట్రాఫిక్కు సంబంధించినవి ఏర్పాటు చేసుకోకపోవడంతో వాహనాలు పెట్టుకునేందుకు ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని కోరుట్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. విలువైన స్థలాల్లో ఆక్రమణలు కాంప్లెక్స్ నిర్మిస్తే అధిక ఆదాయం చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులుఈ చిత్రంలో కన్పిస్తున్నది జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ ఎదురుగా ఉన్న ఉద్యానవనానికి సంబంధించిన అత్యంత విలువైన స్థలం. ఈ స్థలంలో పండ్ల దుకాణాలు, హోటళ్లు, టీస్టాల్స్, దుకాణాలు అక్రమంగా వెలిశాయి. ఇంత విలువైన స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మున్సిపాలిటీకి ఆదాయం రావడంతోపాటు అభివృద్ధి కూడా జరుగుతుందని స్థానికులు అంటున్నారు. -
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి
జగిత్యాల/సారంగాపూర్: విద్యార్థులు టీవీలు, సెల్ఫోన్లు, వీడియోగేమ్లకు దూరంగా ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని, పిల్లలు చదువుతోపాటు క్రీడలకు సమయం కేటాయించాలని డీఈవో రాము అన్నారు. గురువారం బీర్పూర్ మండలంకేంద్రం, కొల్వాయి, తుంగూర్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. కోనాపూర్లో బాస్కెట్బాల్ కోర్టును ప్రారంభించారు. జిల్లా కో–ఆర్డినేటర్ రాజేశ్, ఎంఈవోలు నాగభూషణం, కిశోర్, హెచ్ఎంలు భాస్కర్రెడ్డి, సత్యరాజ్, శంకరయ్య, వేణు, పెటా జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఉన్నారు. విద్యార్థుల్లో భవిష్యత్ నైపుణ్యాలు పెంచేందుకు అటల్ టింకరింగ్ మెకథాన్ బూట్ క్యాంప్ శిక్షణ ఉపయోగపడుతుందని డీఈవో అన్నారు. జిల్లాకేంద్రంలోని పురాతన పాఠశాలలో విద్యార్థులకు బూట్ క్యాంప్ శిక్షణ నిర్వహించారు. ఏఐ, ఎంఎల్, కోడింగ్, త్రీడీ ప్రిటింగ్ నేర్చుకోవాలన్నారు. ఉల్లాస్యాప్లో నమోదు చేయాలి నిరక్షరాస్యులను ఉల్లాస్యాప్లో నమోదు చేయాలని డీఈవో అన్నారు. ధరూర్ క్యాంప్లోని టీచర్స్ భవన్లో జాతీయ సాక్షరాభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఉల్లాస్యాప్ ఉపయోగపడుతుందన్నారు. 14 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులు, 60ఏళ్ల లోపు వారిని గుర్తించి ఇందులో చేర్చాలన్నారు. వయోజన విద్యాధికారి ప్రతాప్రావు, సార్వత్రిక సమన్వయకర్త నాగేశ్వర్రావు, డీఆర్డీఏ డీపీఎం మల్లేశ్, మెప్మా పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. 21న యోగా దినోత్సవంఈనెల 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈవో తెలిపారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఆరోగ్య భారత్ నిర్మాణ్లో భాగంగా హెచ్ఎంలు వేడుకలు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో ఉదయం 6.30 నుంచి 7.45వరకు పిల్లలకు యోగాపై అవగాహన కల్పించాలన్నారు. -
రాహుల్గాంధీ జన్మదిన వేడుకలు
జగిత్యాల/జగిత్యాలటౌన్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ జన్మదిన వేడుకలను జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరుపుకున్నా రు. రాహుల్గాంధీ జైబాపు, జైభీం, జైసంవిధాన్ నినాదంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, నాయకులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల: భవిష్యత్ ఆశాజ్యోతి రాహూల్గాంధీ అని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్ ఉన్నారు. -
పశువుల మందుల్లేవ్..
రాయికల్: సహజంగానే వర్షకాలంలో గొర్రెలు, మేకలు వివిధ వ్యాధుల బారిన పడతాయి. వాటిని కాపాడుకునేందుకు పెంపకందారులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఇలాంటి వారికి ప్రభుత్వమే పశువుల మందులను అందించాల్సి ఉంటుంది. అయితే కనీసం నట్టల నివారణ మందును కూడా ప్రభుత్వం నుంచి పంపిణీ కాలేదు. ఏడు నెలలుగా ఇదే దుస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి మందులు లేకపోవడంతో పెంపకందారులు ప్రైవేటు మందుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. వర్షకాలంలో పశువుల్లో చిటుకు రోగం, నీలి నాలుక, ఫూట్రాట్ వ్యాధి, గా లికుంటు, కుంటుపట్టడం వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. ఈ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే మందులు ఏ డు నెలలుగా సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా నట్టల నివారణ మందుల కోసం ప్రై వేటు దుకాణాలను ఆశ్రయించి వేలాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలినా లుక నియంత్రణకు వేసే బ్లూటంగ్, హెచ్ఎఫ్ డీ క్యూ, గొంతువాపు టీకాలు, పీపీఆర్, ఎల్ఎఫ్జీ వంటి వ్యాక్సిన్లు సరైన సమయంలో సరఫరా కా కపోవడం గమనార్హం. సరఫరా అయిన వ్యాక్సి న్లు కూడా సంబంధిత వైద్యాధికారులు బయట విక్రయిస్తూ అందినంతా దోచుకుంటున్నారు. ఏడు నెలలుగా సరఫరా కాని మందులు ప్రతి నాలుగు నెలలకోసారి పాడి రైతులకు ప్రభుత్వం మందులను సరఫరా చేయాల్సి ఉండగా.. ఏడు నెలల నుంచి మందులు రావడం లేదు. గొర్రెలు, మేకల కోసం ప్రభుత్వం నట్టల నివారణ మందు, జ్వరం, నీలినాలుక, యాంటిబయటిక్స్, వ్యాక్సిన్లు సరఫరా చేసే అవకాశం ఉంది. పాడి గేదెలకు లంపిస్కిన్ కోసం ప్రభుత్వం ఉచితంగా టీకాలు పంపిణీ చేయాల్సి ఉండగా గతంలో సరైన సమయంలో పంపిణీ చేయకపోవడంతో చాలా ఆవులు, గేదెల్లో ఈ వ్యాధితో మృత్యువాతపడ్డాయి. ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉండగా.. ఇప్పటివరకు బడ్జెట్ కూడా విడుదల కాకపోవడంతో పశువైద్య ఆస్పత్రిలో కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేవు. రిజిస్టర్ లేకపోవడంతో పశువైద్యాధికారులు తమ జేబులోంచి ఖర్చు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వర్షకాలం పూర్తయ్యేలోపు పశువులకు సంబంధించిన మందులను సరఫరా చేయాలని, సకాలంలో వ్యాక్సిన్లు వేయాలని కోరారు.జిల్లాలో పశువులు2,74,934 గొర్రెలు, మేకలు 50,753 గేదెలు 19,000 ఆవులు సరఫరా కాని నట్టల నివారణ మందులు ఏడు నెలలుగా నిలిచిపోయిన వైనం ప్రైవేటు దుకాణాల్లోనే కొనుగోలు నష్టపోతున్న పశువుల పెంపకందారులు -
జూనియర్ కళాశాల ప్రారంభం
మేడిపల్లి: మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించారు. పోరుమల్లలో మడేలేశ్వర స్వామి బోనాల జాతరలో పాల్గొన్నారు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన విద్యార్థులకు కళాశాల అందుబాటులోకొచ్చిందన్నారు. కళాశాల అభివృద్ధికి మాజీ సర్పంచ్ బొంగోని రాజగౌడ్ రూ.1.01 లక్షలను విరాళంగా అందించారు. మున్ముందు కూడా సహకరిస్తానని పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు ముందుగా పూర్తి చేసుకున్నవారికి మొదటి బహుమతిగా రూ.50వేలు, రెండో బహుమతిగా రూ.40 వేలు, మూడో బహూమతిగా రూ.25వేల అందిస్తానని ప్రకటించారు. వైద్యాధికారుల పోస్టులకు ఆహ్వానంజగిత్యాల: జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్టు ప్రతిపాదికన నాలుగు వైద్యాధికారుల పోస్టుల భర్తీకి ఎంబీబీఎస్, తెలంగా ణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ తెలి పారు. రూ.500 డీడీని మెడికల్ హెల్త్ ఆఫీస్ పేరిట తీసి దరఖాస్తులను jagtial. telangna.gov.in వెబ్సైట్ నుంచి తీసుకుని విద్యార్హతల పత్రాలతో ఈనెల 26 వరకు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న, గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించబోమని తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.190.62 కోట్ల జమజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని 2,10,145 మంది రైతులకు రైతుభరోసా కింద గురువారం వరకు రూ.190.62 కోట్లు జమ అయ్యాయి. జిల్లాలో మొత్తం 2,48,550 మంది రైతులు ఉండగా.. వారికి రూ.251.14 కోట్లు జమ కావాల్సి ఉంది. 18న 1,79,818 మందికి రూ.120.67కోట్లు, 19న 30,327 మందికి రూ.69.95కోట్ల చొప్పున జమ అయ్యాయి. నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్జగిత్యాలక్రైం: జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లేని, నంబరు ప్లేట్ లేని 306 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేపట్టాయన్నారు. కొందరు ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు ఫ్యాన్సీ నంబర్లు, తప్పుడు నంబర్లను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నంబరు ప్లేట్ ఏర్పాటు చేసినా.. వాహనాలు రోడ్డుపై తిప్పినా చీటింగ్ కేసు నమోదు చేస్తామన్నారు. అర్చకుల సమస్యలపై వినతిజగిత్యాలరూరల్: ఆలయ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్రెడ్డికి వీర శైవ అర్చక సమైక్య అధ్యక్షుడు గుంటి జగదీశ్వర్ వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఉమా మహేశ్వర్ ఉన్నారు. జగన్నాథ రథయాత్రలో పాల్గొనండిజగిత్యాలటౌన్: జూలై ఒకటిన నిర్వహించే జగన్నాథ రథయాత్రలో పాల్గొనాలని ఇస్కాన్ ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కోరారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అంచారు. కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు నరహరిదాస్, ప్రేమనందగోవిందదాస్, మున్సిపల్ మాజీ చైర్మన్లు అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నట్టల మందు ఇవ్వడం లేదు
వర్షకాలం ప్రారంభమైనప్పటికీ నట్టల మందు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదు. ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జ్వరం, ఇతర మందులు ప్రభుత్వ పశువైద్య కేంద్రాల్లో ఉండటం లేదు. – నవీన్, రాయికల్, రైతు బడ్జెట్ రాగానే పంపిణీ ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాగానే సీజనల్ వ్యాధి మందులు పంపిణీ చేస్తాం. ప్రస్తుతం వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దు. ప్రభుత్వ వైద్యులు వ్యాక్సిన్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – వేణుగోపాల్, జిల్లా పశువైద్యాధికారి -
ఏసీబీ దూకుడు..!
● వరుస కేసులతో హడలెత్తిస్తున్న అనిశా ● సుప్తావస్త వీడి దాడులు మొదలుపెట్టిన వైనం ● ఏసీబీ డీజీ అక్షింతలతో చురుగ్గా కేసుల నమోదు ● కాళేశ్వరం ఇంజినీర్ల నుంచి క్లర్కుల దాకా నిఘా ● రెండు నెలలుగా ఏసీబీకి పెరిగిన ఫిర్యాదులుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: అవినీతి నిరోధక శాఖ నిద్రలేచింది. ఇంతకాలం సుప్తావస్థలో ఉన్న డిపార్ట్మెంట్.. ఏసీబీ డీ జీగా విజయ్కుమార్ బాధ్యతలు చేపట్టాక చురుగ్గా కదులుతోంది. ఇటీవల కాళేశ్వరం ఇంజినీర్ నూనె శ్రీధర్ ఇంటిపై దాడులు చేసి రూ.100 కోట్ల వరకు ఆస్తులు గుర్తించి తన మార్క్ చాటుకుంది. తాజాగా కరీంనగర్ జెడ్పీ కార్యాలయంలోనూ బిల్లుల కోసం లంచం డిమాండ్ చేసిన ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను ఏసీబీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దాడులతో ఏసీబీ తిరిగి పూర్వపు తరహాలో దాడులు చేస్తోందన్న సంకేతాలు ఇచ్చింది. వాస్తవానికి మూడేళ్లుగా కరీంనగర్ ఏసీబీ విభాగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎలాంటి కేసులు నమోదు కాకున్నా.. ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడం తెలిసిందే. అదే సమయంలో స్థానికంగా కరీంనగర్ బల్దియా, రెవెన్యూ విభాగాల్లో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా.. సదరెం వంటి స్కాంల విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. ఏసీబీ పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ల నుంచి క్లర్కుల దాకా ఎవరినీ వదలడం లేదు. ఏసీబీ డీజీ రాకతో.. 2020, 2021లో కరోనా కారణంగా దూకుడు తగ్గిందనుకున్నా.. 2022, 2023, 2024లో చరుకుదనం తగ్గడంలో ఆంతర్యం ఏమిటో అర్థంకాలేదు. గతేడాది ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరీంనగర్ ఏసీబీలో కాస్త కదలిక వచ్చింది. 2024 నవంబరులో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ (పీవోపీ) సందర్భంగా కరీంనగర్కు వచ్చిన విజయ్కుమార్.. ఇక్కడి ఏసీబీ అధికారులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో ఏసీబీ నమోదు చేసిన కేసులు చూసి కంగుతిన్నారని సమాచారం. అసలేం చేస్తున్నారు..? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవినీతి లేనేలేదా..? అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అప్పటికపుడు నిద్రలేచిన అధికారులు వేట మొదలుపెట్టారు. అప్పటి నుంచి కేసుల విషయంలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే పలువురు ఇంజినీర్లు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఇటీవల ఏసీబీకి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వారి ఆస్తుల జాబితా తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.రెవెన్యూ విభాగంలోనే అధికం 2019 నుంచి 2025 వరకు ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో ఎప్పటిలాగే రెవెన్యూ విభాగం ముందు వరసలో ఉంది. ఏటా నమోదయ్యే కేసుల్లో ఈ శాఖకు సంబంధించినవే ఉండటం గమనార్హం. 2019లో ఆరు, 2022లో ఆరు, 2023లో నాలుగు, 2024లో ఐదు, 2025లో మూడు కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 2020, 2021లో కరోనాతో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది. ఫలితంగా రెవెన్యూకు సంబంధించి ఆ రెండేళ్లలో ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. ప్రస్తుతం సిబ్బంది కొరత వేధిస్తున్నా.. కేసుల వేటలో వేగం పెంచడం శుభపరిణామం.ఫిర్యాదులు పెరిగాయిరెండు నెలలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఫిర్యాదులు పెరిగాయి. కేసులు విషయంలో దూకుడుగా ఉన్నాం. 1064 టోల్ఫ్రీ నంబరు, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ వేదికగా బాధితులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరికీ డబ్బులు చెల్లించాల్సి న అవసరం లేదు. అధికారులు లంచం అడిగితే వెంటనే మా ఫోన్ నంబర్ 91543 88954కు ఫిర్యాదు చేయండి. – విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ -
కొండగట్టు అంజన్నకు జ్యేష్టాభిషేకం
మల్యాల:వర్షాలు సకాలంలో.. సమృద్ధిగా కురిసి.. పంటలు పండాలని ఏటా కొండగట్టు ఆంజనేయస్వామి వారి జన్మనక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్రం సందర్భంగా బుధవారం జ్యేష్టాభిషేకం నిర్వహించారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో ప్రతిష్టించి, వాసుదేవ పుణ్యహవచనం గావించారు. 108 కలశాల్లోని సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పట్టువస్త్రాలతో అలంకరించారు. ఈఓ శ్రీకాంత్రావు, స్థానాచార్యులు కపీంద్ర, ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్రస్వామి, రామకృష్ణ, రఘు, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, పి.రాంచంద్రస్వామి, ముఖ్య అర్చకులు తిరుకోవెల లక్ష్మణ్, చిన్న జితేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
తప్పెవరిది.. శిక్ష ఎవరికి..?
జగిత్యాలఅగ్రికల్చర్/కోరుట్లరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనావాసాల్లోనే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అయితే వాటికి ఎలాంటి రక్షణ ఏర్పాటు చేయలేదు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి స్తంభాలకు అల్లుకున్నాయి. ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. చాలాచోట్ల విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. మూడు రోజుల క్రితం కోరుట్లలో వేలాడుతున్న వైర్లు తాకి ఇద్దరు కూలీలు చనిపోయిన విషయం తెల్సిందే. మరో ఎనిమిది మంది వరకు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడే కాకుండా.. సంఘటన చోటుచేసుకోకముందే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
బల్దియాకు రూ.1.80 లక్షల పన్ను చెల్లింపు
ధర్మపురి: ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం బల్దియాకు బకాయి పడిన రూ.1,80,614 బుధవారం చెల్లించింది. బకాయి పడిన పన్ను చెల్లించాలని మార్కెట్ కార్యాలయానికి ఇటీవల బల్దియా నోటీసులు జారీ చేసింది. దీంతో స్పందించిన ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, ఇన్చార్జి కార్యదర్శి వెంకటనర్సయ్య రూ.1,80,614 విలువైన చెక్కును మున్సిపల్ సిబ్బందికి అందించారు. కాకతీయ కాలువ గండ్లు పూడుస్తాంఇబ్రహీంపట్నం: ఎస్సారెస్పీ కాకతీయ కాలువకు పడిన గండ్లను పూడ్చివేస్తామని ప్రాజెక్టు ఈఈ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా సరిహద్దు ఉప్లూర్ నుంచి కాకతీయ కాలువకు పడిన గండ్లను సిబ్బందితో కలిసి బుధవారం పరిశీలించారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసేలోగా కాంట్రాక్టర్లతో పనులను వేగవంతంగా పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. కాకతీయ కాలువకు ఇరువైపులా కొంతమంది రైతుల భూములు కబ్జా చేస్తున్నారని, వాటిని పరిశీలించాలని కాలువ హద్దులు దాటి భూములు కబ్జా చేసే రైతులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఈ దేవనందం, ఏఈ సజీత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో వైద్య కళాశాల భవిష్యత్ ప్రశ్నార్థకంజగిత్యాల: కాంగ్రెస్ పాలనలో జిల్లాలోని వైద్య కళాశాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వైద్య కళాశాలను ప్రారంభిస్తే.. సీఎం రేవంత్రెడ్డి పాలనలో ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జగిత్యాల వైద్య కళాశాలకు నోటీసులు రావడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో జిల్లాకు వైద్య కళాశాల సాధించుకున్నామని, పాలన వదిలేసి ప్రతికార చర్యలతోనే ఈ దుస్థితి నెలకొందన్నారు. ఆమె వెంట నాయకులు మహిపాల్రెడ్డి, మహేశ్ పాల్గొన్నారు. వరదలపై అప్రమత్తంగా ఉండండి మెట్పల్లి/కోరుట్ల: రానున్న వర్షకాలంలో వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సూచించారు. కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ సమావేశ మందిరాల్లో సిబ్బందితో బుధవారం సమావేశమయ్యారు. అధికారులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందుల కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వేంపేట రోడ్డులో ఉన్న రైల్వేవంతెన కింద ప్రతి సీజన్లో వరద నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి దృష్టి సారించాలన్నారు. బల్దియా కమిషనర్ మోహన్, డీఈ నాగేశ్వర్రావు, పలు విభాగాల సిబ్బంది ఉన్నారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన 41మందికి రూ.10.05లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. కోరుట్లలో.. కోరుట్లటౌన్: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందించారు. కోరుట్ల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ చైతన్య ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క బహూకరించారు. -
నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం చేయూత
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలరూరల్: నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బుధవారం సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన సట్టల వివేక్ వెన్నుపూస సమస్యతో బాధపడుతుండగా శస్త్ర చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.1.75 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొలపాక లక్ష్మీరాజం, నాయకులు మర్రిపల్లి రాజేశం, గంగరాజం, శ్రావణ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే చొరవ జిల్లాకేంద్రంలోని మార్కెట్ ప్రాంతానికి చెందిన రెవేల్ల రవిగౌడ్ (50) ఇజ్రాయిల్లో గుండెపోటుతో మృతిచెందగా.. ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎమ్మెల్యే చొరవ చూపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావును కలిసి ఆయన ద్వారా ఇజ్రాయిల్లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. జర్నలిస్ట్ల సమస్యలు పరిష్కరిస్తా జగిత్యాల: జర్నలిస్ట్ల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే అన్నారు. జిల్లాకేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్లో వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహాసభ నిర్వహించగా.. ఎమ్మెల్యే హాజరయ్యారు. వారికి ఐడీ కార్డులు అందించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జ్యోతి, రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, నాగయ్య పాల్గొన్నారు. నాణ్యత లేకుంటే చర్యలు అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. జిల్లాకేంద్రంలోని 31వ వార్డులో టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టిన సీసీరోడ్డు పనులను బుధవారం పరిశీలించారు. నాణ్యత లేకుండా పనులు చేయొద్దని, అధికారులు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. -
చీకట్లో దొంగల మర్రి జంక్షన్
కొడిమ్యాల: కొండగట్టు నుంచి కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారి మార్గంలో.. కొడిమ్యాల మండలం నాచుపల్లి సమీపంలోని దొంగలమర్రి జంక్షన్ వద్ద చీకట్లు అలుముకున్నాయి. వీధి దీపాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నా రు. గతంలో ఈ ప్రాంతం దొంగతనాలు, దోపిడీల కు అడ్డగా ఉండేది. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్పీ అనంతశర్మ అక్కడ చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం.. వీధి దీపాలు పెట్టడంతో భయం తగ్గినా.. కొద్దిరోజులుగా చీకటి కారణంగా మళ్లీ ఆ జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని స్థానికులు అంటున్నారు. వా హనదారులు, ఈ ప్రాంతాన్ని దాటేటప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తక్షణమే అక్కడ లైట్లను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. -
కస్తూరిబా పాఠశాల తనిఖీ
మేడిపల్లి: కలెక్టర్ సత్యప్రసాద్ మండలంలో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. మండలకేంద్రంలోని కస్తురిబా పాఠశాలను సందర్శించి.. వసతులు తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనం, పప్పుదినుసులు, ఇతర వస్తువుల నాణ్యతను తెలుసుకున్నారు. విద్యార్థినులతో కలిసి ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు విన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం కట్లకుంట గ్రామంలో భూ భారతి సదస్సులో పాల్గొన్నారు. భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీంచారు. ఆయన వెంట కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ మునీందర్, ఎంపీడీవో పద్మజ, అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన జెడ్పీ అధికారులు
కరీంనగర్క్రైం: జిల్లా పరిషత్లో అద్దె వాహనాలకు బిల్లు చెల్లింపు విషయంలో లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. జిల్లా పరిషత్లో ఓ వ్యక్తి తన వాహనాన్ని అద్దెకు పెట్టాడు. 10నెలలు బిల్లు ఇవ్వాల్సి ఉండగా కొన్ని రోజుల క్రితం 4నెలల బిల్లు చెల్లించారు. మిగితా 6 నెలల బిల్లు ఇవ్వాలంటే రూ.8వేల లంచం ఇవ్వాలని పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్లో డబ్బులు తీసుకుంటుండగా ఇంజినీర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
విద్యుత్షాక్తో యువకుడి మృతి
జగిత్యాలక్రైం(సారంగాపూర్): సారంగాపూర్ మండలం పోతారంలో కొత్త ఇంట్లో వైరింగ్ చేస్తుండగా నారపాక బల్తగిరి (25) విద్యుత్షాక్ తగిలి మృతిచెందాడు. బీర్పూర్ మండలం ఇందిరనగర్కు చెందిన నారపాక బల్తగిరి ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం సారంగాపూర్ మండలం పోతారానికి చెందిన బైరి రమేశ్ ఇంట్లో విద్యుత్ వైరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సారంగాపూర్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్ధర్మపురి: తనకు దొరికిన తులం బంగారం చైన్ను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. ధర్మపురికి చెందిన నూగూరి నగేష్ ఆటో డ్రైవర్. మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపంలో అతడికి తులం బంగారు చైన్ దొరికింది. దానిని ధర్మపురి పోలీస్స్టేషన్కు వెళ్లి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్కుమార్కు అందించాడు. అప్పటికే గొలుసు పోయిందని బాధితులు వెదుకుతుండగా వారిని విచారణ చేపట్టిన పోలీసులు వారికి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ నగేష్ను శాలువాతో సన్మానించారు. -
మెడికవర్లో అరుదైన శస్త్రచికిత్స
కరీంనగర్టౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణ్కుమార్ అనే యువకుడికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ దిలీప్రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ వారిస్ ఉస్మాని(తాహా) తెలిపారు. ఆసుపత్రిలో మంగళవారం మాట్లాడుతూ.. శ్రీకరీంనగర్కు చెందిన శ్రావణ్కుమార్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్తే కన్నుపై దెబ్బ తగిలిందని కుట్లు వేశారు. కడుపులో తీవ్ర గాయమై, రక్తం లీక్ అవుతుందని తెలపడంతో పలు ఆస్పత్రులకు తీసుకెళ్తే తమతో కాదన్నారు. చివరకు ప్రాణాపాయస్థితిలో మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శ్రావణ్కుమార్కు సీటీస్కాన్ చేయడంతో కడుపులో బ్లంట్ ఇంజ్యూరీ అబ్డామెన్ (తీవ్ర రక్తస్రావం) అవుతున్నట్లు గుర్తించాం. బైక్ హ్యాండిల్ కడుపులో బలంగా గుచ్చుకోవడంతో రక్తస్రావంతో పాటు లివర్, ఫ్రాంకియాస్, స్ల్పీన్ దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేసి లివర్కు చికిత్స చేశాం. తప్పని పరిస్థితుల్లో ఫ్రాంకియాస్ కొంతభాగం, స్ల్పీన్ (ఫ్లీహం) మొత్తం తొలగించడం జరిగిందనిశ్రీ అని వెల్లడించారు. ప్రస్తుతం శ్రావణ్కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ పాల్గొన్నారు. -
బహ్రెయిన్లో 9 మంది అరెస్ట్
● సాయం కోసం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు జగిత్యాలక్రైం: ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్ దేశం వెళ్లిన కార్మికులు చేయని తప్పునకు అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. బహ్రెయిన్లో ఆల్ మోయ్యాద్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్న 9 మంది తెలంగాణ కార్మికులను ఇంధనం దుర్వినియోగం కేసులో ఇటీవల అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన బొమ్మడి సుదర్శన్ బహ్రెయిన్లో డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయనతోపాటు మరో 8 మందిని ఈనెల 4న అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి న్యాయ సహాయం అందించాలని సుదర్శన్ కుమారుడు నితిన్ మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లోని ప్రవాసి ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, గుగ్గిళ్ల రవిగౌడ్, నంగి దేవేందర్రెడ్డి, బొజ్జ అమరేందర్రెడ్డితో కలిసి వినతిపత్రం సమర్పించారు. స్టైఫండ్ చెల్లించాలంటూ ధర్నాకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ మెడికల్ కళాశాల హౌజ్సర్జన్లు స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు హౌజ్సర్జన్లు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రతి హౌజ్సర్జన్కు నెలకు రూ.25వేల స్టైఫండ్ చెల్లిస్తోందన్నారు. కళాశాల యాజమాన్యం ఎవరికీ స్టైఫండ్ ఇవ్వడం లేదని ఆరోపించారు. హైదరాబాద్లోని పలు మెడికల్ కళాశాలలు స్టైఫండ్ చెల్లిస్తున్నాయని తెలిపారు. ఆస్పత్రిలో హౌజ్సర్జన్లు, పీజీ వైద్యులు పనిచేస్తున్నప్పటికీ.. ఎలాంటి స్టైఫండ్ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టైఫండ్ చెల్లించేవరకు ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు. -
బండమీది బడి.. చదువుల ఒడి
● ఈ బడిలో చదివి ఉన్నతస్థానాల్లో నిలిచిన పలువురు ● ఎంతో మందికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చిన రుద్రంగి పాఠశాలరుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలోని బండమీది బడిగా ప్రఖ్యాతి పొందిన రుద్రంగి జెడ్పీ హైస్కూల్కు బహుచరిత్ర ఉంది. సుమారు 70 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉజ్వల భవిష్యత్తును పొందారు. ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తూ బండమీది బడి చదువుల ఒడిగా విలసిల్లుతుంది. ప్రస్తుత ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బండమీది బడిలోనే హైస్కూల్ విద్యను అభ్యసించారు. అలాగే ప్రస్తుతం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అంబటి నర్సయ్య, హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్డ్ అయిన రుద్రంగికి చెందిన ఓలిమినేని నిరంజన్రావు ఈ బడిలో విద్యను అభ్యసించినవారే. ఉన్నత స్థానాల్లో మరికొందరు.. హన్మాజీపేట గ్రామానికి చెందిన గడ్డం జలపతిరెడ్డి రాష్ట్ర ఎస్టీవోగా చేసి రిటైర్డ్ అయ్యారు. రుద్రంగికి చెందిన మర్రిపల్లి చందన చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మెంబర్గా ప్రస్తుతం హైదరాబాద్లో చేస్తున్నారు. దేశవేని శంకర్ ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్గా చేస్తుండగా, రుద్రంగికి చెందిన కత్తి మల్లయ్య ఆడిటర్గా పనిచేశారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన ఉప్పులూటి గోవిందరావు అసిస్టెంట్ ఇంజినీర్గా, చందుర్తి మండల కేంద్రనికి చెందిన దామోదర్ వరంగల్లో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. రుద్రంగికి చెందిన ఆకుల రవి ఇటీవల స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. వెంకటేశం బ్యాంకు మేనేజర్గా చేసి ఉద్యోగ విరమణ పొందారు. రుద్రంగికి చెందిన మర్రిపల్లి చక్రవర్తి సేఫ్టీ కన్సల్టెంట్గా చేస్తున్నారు. ఇంకా ఎంతో మంది రుద్రంగి జెడ్పీ హైస్కూల్లో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. చదివిన బడిలోనే టీచర్గా.. బండమీది బడిలో ఉన్నత విద్యను అభ్యసించిన రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గడప వేణుకుమార్ చదివిన బడిలోనే టీచర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. చదివిన బడిలోనే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే అవకాశం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు.రుద్రంగి బడిలో నాణ్యమైన విద్య రుద్రంగి జెడ్పీ హైస్కూల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను రుద్రంగి జెడ్పీ హైస్కూల్లో చేర్పించాలి. – సమ్మిరెడ్డి, హెచ్ఎం, రుద్రంగి జెడ్పీ హైస్కూల్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి రుద్రంగికి చెందిన ఓలిమినేని నిరంజన్రావు రుద్రంగి బండమీది బడి విద్యార్థి. ఇక్కడ ఓనమాలు నేర్చిన ఆయన ఉన్నత చదువులు చదివి హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు.ఏసీపీగా నర్సయ్య బండమీద బడి విద్యార్థి పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రానికే చెందిన అంబటి నర్సయ్య తన ప్రాథమిక, ఉన్నత, ఇంటర్, పోస్టు గ్రాడ్యుయేషన్ చదువులు అంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే కొనసాగించి పోలీస్ శాఖలో ఎస్సైగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రుద్రంగి హైస్కూల్ విద్యార్థి ప్రభుత్వ విప్గా.. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగి. రుద్రంగి బండ మీది బడిలోనే తన హైస్కూల్ విద్యను అభ్యసించారు. చదువుకున్న బడితో పాటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే అవకాశం లభించడం ఎంతో గర్వ కారణంగా ఉందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని, విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు. -
విధుల నుంచి అన్యాయంగా తొలగించారు
● గురుకులం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడంతో మంగళవారం పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. పర్మినెంట్ ఉద్యోగులు రావడంతో తమను విధుల నుంచి తొలగించడంతో రోడ్డునపడ్డామని ల్యాబ్ అసిస్టెంట్ నిర్మల, కుకింగ్ మాస్టర్ బాలు, ఏఎన్ఎం సుజాత, మరోకరు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తొలగించడాన్ని నిరసిస్తూ పాఠశాల ముందు బైఠాయించారు. 20 ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న తమను అన్యాయంగా తొలగించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో పని చేస్తున్న 73 మందిని తొలగించగా, అందులో వీరు కూడా ఉన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అన్యాయంగా తొలగించారని గిరిజన గురుకులం నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్సింగ్ అన్నారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఆందోళన చేస్తున్న వారికి గిరిజన సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమాకాంత్ అక్కడికి వెళ్లి పాఠశాల ప్రిన్సిపాల్, ఔట్సోర్సింగ్ సిబ్బందితో మాట్లాడి శాంతింపజేశారు. ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ సిబ్బంది మాట్లాడుతూ, పాఠశాలలో 20ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా తాము విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. ఉన్నఫలంగా తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డునపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని కోరారు. -
అల్ఫోర్స్ ఇ– టెక్నో విద్యార్థినికి గిన్నీస్బుక్లో చోటు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో 5వ తరగతి చదువుతున్న బుక్క దీత్య శ్రీగిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్శ్రీలో చోటు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో సుమారు 2,400 మందికి పైగా కళాకారులతో కలిసి పాల్గొని ప్రతిష్ఠాత్మక గిన్నీస్బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కై వసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమన్నారు. విద్యార్థినిని మంగళవారం స్థానిక పాఠశాలలో ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు. అపోలో రీచ్లో నూతనంగా గ్యాస్ట్రో, లివర్ చికిత్సలుకరీంనగర్టౌన్: నగరంలోని అపోలో రీచ్ హాస్పిటల్లో నూతనంగా గ్యాస్ట్రోఎంటరాలజీ, లివర్ డిసీజ్ విభాగం ఏర్పాటు చేసినట్లు ఏవో డాక్టర్ నాగసతీశ్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన గ్యాస్ట్రో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. అత్యాధునిక ఎండోస్కోపీ పరికరాలతో జీర్ణ, ప్రేగు, లివర్ సంబంధిత రోగాలకు సమగ్ర చికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. ఇజ్రాయిల్లో గుండెపోటుతో జగిత్యాల వాసి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాలలోని 36వ వార్డుకు చెందిన రేవెల్ల రవిగౌడ్ (45) ఇటీవల ఇజ్రాయిల్ దేశంలో గుండెపోటుతో మరణించాడు. మంగళవారం జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి రవిగౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇజ్రాయిల్ దేశంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు జాప్యం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పిస్తామని హామీ ఇచ్చారు. -
ఆధార్ నవీకరణకు మరో ఏడాది పెంపు
కరీంనగర్ అర్బన్: ఆధార్ కార్డుల నవీకరణకు కేంద్రం మరో ఏడాది వరకు గడువు పొడిగించింది. 2026 జూన్ 30 వరకు ఆధార్ కార్డులను నవీకరించుకోవడానికి అవకాశమిచ్చింది. ఆ తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే కార్డు సస్పెండ్ చేస్తారు. ఒకసారి ఆధార్ కార్డు సస్పెండైతే దానిని పునరుద్ధరించుకోవడానికి వివిధ ధ్రువపత్రాలు పెట్టి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్డుల నవీకరణకు కొందరు ఉత్సాహం చూపుతుండగా అవగాహన లేనివారు మాత్రం దూరంగా ఉంటున్నారు. మరికొందరు మొబైల్ లో శ్రీమై ఆధార్శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలను నవీకరించుకుంటున్నారు. అన్నింటికీ ఆధారం పదేళ్ల క్రితం కార్డులు పొందినవారందరూ నవీకరించుకోవాలని యూఐడీఐ నుంచి కార్డుదారులకు మొబైల్కు సంక్షిప్త సందేశాలు అందుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2011– 12మధ్య ప్రాంతంలో 9 లక్షల మంది ఆధార్ కార్డులు తీయించారు. అప్పుడు ఊరూరా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధార్ నమోదు చేయించారు. పదేళ్ల చెల్లుబాటు అయ్యేలా నిబంధనలు విధించారు. ప్రతీ పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ ను నవీకరించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆధార్ కార్డు అన్నిటికీ కీలకంగా మారింది. బ్యాంకు ఖాతాలు తెరవడం, విద్యార్థుల ప్రవేశాలు, పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్, సీఎం ఆర్థికసాయం, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు కూడా ఆధార్ ను తప్పనిసరి చేశారు. ఆధార్ అప్ డేట్ లేకుంటే కొందరికి రేషన్, పింఛన్లు కూడా ఆగిపోతున్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్నప్పటికీ కొందరు అప్డేట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెండు మార్లు గడువు పొడిగించిన కేంద్రం మరో ఏడాది వరకు ఆధార్ నవీకరణ గడువు పెంచింది. ఏమేం కావాలంటే.. ఆధార్కార్డు నవీకరణకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపుపత్రం తీసుకెళ్లాలి. చదువుకున్నవారు పదోతరగతి మార్కుల మెమో తీసుకెళ్తే సరి. ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, మ్యారేజ్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్తే ఆధార్ నవీకరణ పూర్తి చేసుకోవచ్చు. జిల్లాలో పాత జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు మరో లక్ష వరకు జనాభా పెరిగే అవకాశం ఉంది. వీరికి అనుగుణంగా ఆధార్ కేంద్రాలు పెంచాల్సిన అవసరం ఉంది. ● పదేళ్లకోసారి అప్డేట్ తప్పనిసరి -
పేదల రక్తం తాగుతున్న బీజేపీ సర్కార్
● కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు సిరిసిల్లటౌన్: పెంచిన నిత్యవసరాల ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతారావు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించాలంటూ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళా నేతలతో ధర్నా చేపట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదల నడ్డి విరిచేలా నిత్యవసర సరుకుల ధరలు పెంచడం సమంజసం కాదన్నారు. బీజేపీ పాలనలో సంక్షేమం కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకుముందు జై బాపు.. జై భీమ్.. జై సంవిదాన్.. కార్యక్రమం సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తా నుంచి నేతన్న విగ్రహం వరకు వందలాది మహిళా కార్యకర్తలతో ర్యాలీ తీశారు. సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సిరిసిల్లలో డబుల్బెడ్ రూం లబ్ధిదారుల వద్దకు వెళ్లి భూమి పూజ నిర్వహించారు. రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని, మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, సీనియర్ నాయకురాలు మడుపు శ్రీదేవి, జనరల్ సెక్రటరీ కోడం అరుణ, రోజా, సరిత, బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి, టౌన్ ప్రెసిడెంట్ స్వరూప, ముసుకు పద్మ, రుక్మిణి, లహరి, హారిక, వనిత, రాజ్యలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
సంగీతమే ఆయన ప్రాణం
● రాణిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ● మూడుసార్లు బంగారు పతకాలు ● 26 ఏళ్లుగా కచేరీలుజగిత్యాలరూరల్: అతడికి చిన్నప్పటి నుంచే చదువుతోపాటు సంగీతం అంటే ఎంతో ఇష్టం. తన సంగీతంతో జాతీయ, రాష్ట్రస్థాయిలో పలువురి మన్ననలు పొంది అవార్డులు కూడా అందుకున్నారు. ధర్మపురికి చెందిన గుండి జగదీశ్వర్శర్మ మేడిపల్లి మండలం వల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రేడియో, టీవీ గాయకుడిగా పలు సంగీత కచేరీలు నిర్వహిస్తూ మన్ననలు పొందారు. పలు టీవీ సీరియల్స్కు సంగీతం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, మాదవపెద్ది సురేశ్, ఆర్పీ పట్నాయక్తో కలిసి పలు సంగీత కచేరీల్లో పాల్గొన్నారు. 26ఏళ్లలో 1,596 కచేరీలు నిర్వహించారు. ఇందులో 120 బెస్ట్ సింగర్ అవార్డులు అందుకున్నారు. దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరున మూడుసార్లు, గంటసాల పేరున రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. ఆయన సంగీత సేవలకు ఢిల్లీ యూనివర్సిటీ డాక్టరేట్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందించింది. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి శతకం, వినాయక భక్తి గీతాలు, రాముని భక్తిగీతాలు, ఆంజనేయస్వామి భక్తి గీతాలు పాడి తన సంగీతాన్ని పలువురికి వినిపించారు. -
వైద్య కళాశాల నిలిచేనా!?
● వసతులపై ఎన్ఎంసీ అసంతృప్తి ● అసంపూర్తిగా కళాశాల భవనాలు ● 27 ఎకరాల్లో కళాశాల నిర్మాణానికి నిర్ణయం ● గదులు, హాస్టల్కు రూ.115 కోట్లు మంజూరు ● బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపేసిన కాంట్రాక్టర్ జగిత్యాల: జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాలపై జాతీయ వైద్య కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం కళాశాలలో మూడో బ్యాచ్ కొనసాగుతోంది. నాలుగో బ్యాచ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాతీయ వైద్య కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇబ్బందికరంగా మారింది. కళాశాలలో వసతులు లేవని, విద్యార్థులకు సరిపడా రోగులు, ప్రాక్టికల్స్కు అవసరమైన మృతదేహాలు లేవంటూ పెదవి విరవడంతో కళా శాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జగి త్యాలకు 2020లో వైద్య కళాశాల మంజూరైంది. దీనికి ధరూర్ క్యాంప్లో 27 ఎకరాల స్థలాన్ని కేటా యించారు. ప్రస్తుతం క్యాంపులో ఉన్న ఆగ్రోస్ గోదాముల్లో తరగతి గదులను ఏర్పాటు చేశారు. రూ.14 కోట్ల వ్యయంతో రెనోవేషన్ చేపట్టి తరగతి గదుల్లో వసతులు కల్పించారు. మొదటి సంవత్సరం ఎన్ఎంసీ (జాతీయ మెడికల్ కమిషన్) సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే యూజీఎంఎస్ఆర్ 2023 నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కళాశాలలో వసతులు, అధ్యాపకులు, విద్యార్థులకు సంబంధించిన బయోమెట్రిక్ హాజరు, ప్రాక్టీస్కు సంబంధించిన మృతదేహాలు, ఇతర పరికరాలు, సీసీ టీవీలన్నింటిని ఎన్ఎంసీ పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో కొత్తగా ఏర్పడిన 27 క ళా శాలల్లో ఎన్ఎంసీకి అనుగుణంగా వసతులు లేవని తేలింది. ఇందులో మన వైద్య కళాశాల కూడా ఉంది. విద్యార్థులకూ ఇబ్బందులే 2022లో తరగతులు ప్రారంభం కాగా.. ప్రస్తుతం మూడో సంవత్సరం బ్యాచ్ కొనసాగుతోంది. మరి కొద్ది రోజుల్లో నాలుగో సంవత్సరం బ్యాచ్ ప్రారంభం కానుంది. భవన నిర్మాణాలకు సంబంధించి పనులు పూర్తి కాకపోవడంతో గోదాముల్లోని గదుల్లోనే బోధన కొనసాగుతోంది. హాస్టల్లో వసతులు అంతంతగానే ఉన్నాయి. ప్రస్తుతం బాయ్ హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్ మాత్రం నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే సంబంధించి కళాశాలకు నోటీసులు జారీ చేశారు. వైద్య కళాశాల అధికారులు ఇక్కడున్న సదుపాయాల గురించి వివరణ ఇచ్చి న ట్లు తెలిసింది. జిల్లాకేంద్రంలో 300 కు పైగా బెడ్స్ ఆస్పత్రి పాతబ స్టాండ్ వద్ద ఉండగా.. మాతాశిశు సంక్షేమ కేంద్రం ధరూర్ క్యాంప్లో ఉంది. వీ టికి సంబంధించిన వైద్యులు ఉన్నప్పటికీ వసతుల్లోనే కొంత అ సంతృప్తి వ్యక్తమవుతోంది. మరోసారి జాతీయ వైద్య కమిషన్ తనిఖీ చేయనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసేలా చ ర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ కమిషన్ సంతృప్తి చెందకపోతే వైద్య కళాశాల మనుగడ ఇబ్బందిగా మారుతుంది. ఇబ్బందులు లేవువైద్య కళాశాలలో అన్ని వసతులున్నాయి. సిబ్బంది కూడా ఉన్నారు. భవన నిర్మాణాలు త్వరలో పూర్తి కానున్నాయి. ఎన్ఎంసీ వారికి రిపోర్టులు ఇచ్చాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. – ఖాద్రి, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎక్కడి పనులు అక్కడే.. 27 ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాల భవనం, హాస్టల్ నిర్మాణానికి రూ.115 కోట్లు మంజూరయ్యా యి. ఇప్పటివరకు రూ.65కోట్ల పనులు చేపట్టగా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. కళాశాల భవనం స్లాబ్, గోడలు మాత్రమే పూర్తయ్యాయి. అలాగే బాయ్స్, గర్ల్స్ హాస్టల్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ క్రమంలో వైద్య విధాన కమిషన్ పరిశీలించి వసతులు లేవ ని, ఇబ్బందులున్నాయని పేర్కొనడం గమనార్హం. -
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి
ధర్మపురి: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వా మి ని మంత్రి అడ్లూ రి లక్ష్మణ్కుమార్ మెట్లమార్గం ద్వా రా కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. ఆలయ ఈవో లక్ష్మణ్కుమార్కు స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలిరాయికల్: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను తక్షణమే స్పందించాలని ఎస్పీ అశోక్కుమార్ సూచించారు. మంగళవారం రాయికల్ పోలీ స్స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్, డ యల్ 100కు వెంటనే స్పందించాలని, సంఘటన స్థలానికి వెంటనే చేరుకోవాలని సూచించా రు. విజిబుల్ పోలిసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని, పాత నేరస్తులపై నిఘా పెంచాలన్నా రు. ఆయన వెంట ఎస్సై సుధీర్రావు ఉన్నారు. మల్లాపూర్ పోలీస్స్టేషన్లో.. మల్లాపూర్: స్థానిక పోలీస్స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. గస్తీ, పెట్రోలింగ్, విజుబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిమల్యాల: సీజనల్ వ్యాధులపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆరో గ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఉపకేంద్రాల రికార్డులు పరిశీలించారు. మెరుగైన సేవలు అందించాలని, రికార్డులను ఎప్పటిప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ సమీయోద్దీన్, డీపీఓ రవీందర్, వైద్యురాలు మౌనిక, అయిల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బీసీ బిల్లుకు చట్టబద్దత కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలి జగిత్యాలటౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో విడుదల చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముసిపట్ల లక్ష్మీనారాయణ సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ను కేంద్రం ఆమోదించకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్ సాధనకు ఈనెల 18న సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. సంఘం నాయకులు తిరుపురం రాంచందర్, రాపర్తి రవి, గుంటి గంగారాం పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలిజగిత్యాలటౌన్: రానున్న స్థానిక సంస్థల్లో పార్టీ గెలుపునకు బాటలు వేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుగుణరెడ్డి తెలిపా రు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా సమీ క్షా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిందన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభారాణి, గోపి మాధవి, అల్లాల సరిత, సరళ, పిప్పరి అనిత, మమత పాల్గొన్నారు. -
ఏడాదిలో ఎన్నో కేసులు..
జగిత్యాలక్రైం: జిల్లా ఎస్పీగా అశోక్కుమార్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయ్యింది. గతేడాది జూన్ 18న బాధ్యతలు స్వీకరించిన ఆయన.. జిల్లాపై తన మార్క్ను చూపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూశారు. పోలీసు అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కేసుల నమోదు, వాటి చేధనకు దిశానిర్దేశం చేస్తున్నారు. సైబర్ నేరాల్లో నష్టపోయినవారికి బాసటగా నిలుస్తున్నారు. షీటీంలను పటిష్టం చేసి, ఆడపిల్లలు, మహిళలకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సైబర్ నేరస్తుల వలలో పడి మెట్పల్లికి చెందిన ఓ వైద్యుడు రూ.15 కోట్లు పోగొట్టుకోగా.. కేసు నమోదు చేసి డబ్బులు రికవరీ చేయించి నిందితులను అరెస్ట్ చేయించారు. నిందితులకు లై డిటెక్టర్ రెండు హత్య కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు లై డిటెక్టర్ వినియోగించారు. బీర్పూర్ శివారు రోల్లవాగు వద్ద 2024 జూన్ 14న గుర్తుతెలియని వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చివేశారు. ఆ కేసును లై డిటెక్టర్ ద్వారా అతని భార్య అంకం అరుణ, కొడుకు అంకం సాయికుమార్ను నిందితులుగా నిర్ధారించారు. రాయికల్ మండల కేంద్రానికి చెందిన కోల జలను 2023 ఆగస్టు 29న గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయగా లై డిటెక్టర్ ద్వారా మృతురాలి మరిది శ్రీనివాస్, అతని భార్య సంధ్య హత్య చేసినట్లు నిర్ధారించి రిమాండ్కు తరలించారు. కిడ్నాప్ కేసులను చాకచక్యంగా.. మెట్పల్లిలో 2024 ఆగస్టు 13న రెండేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయగా.. పోలీసులు 16 గంటల్లోనే నలుగురు కిడ్నాపర్లను పట్టుకున్నారు. బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉద్యోగాల పేరుతో జిల్లాకు చెందిన పలువురిని కంబోడియాకు తరలించి సైబర్ క్రైం ఊబిలో దింపిన నలుగురు నిందితులను అరెస్ట్ చేయించారు ఎస్పీ అశోక్కుమార్. రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ రోడ్డు ప్రమాదాల నివారణకు ‘సురక్షిత ప్రయాణం’ అనే కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే 43 బ్లాక్స్పాట్లను గుర్తించి.. వివిధ శాఖల సమన్వయంతో ప్రమాదాలు నివారించగలిగారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలపై శ్రీపోలీసు పాఠశాల యువ పౌరుల కోసం భద్రతశ్రీ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి వారం ఒక ప్రభుత్వ పాఠశాలకు ఎస్పీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ రాత్రి సమయాల్లో పర్యవేక్షిస్తూ.. తనదైన పాత్ర పోషిస్తున్నారు. కొండగట్టులో నిర్వహించిన హనుమాన్ చిన్న, పెద్ద జయంతి ఉత్సవాలను పకడ్బందీగా చేపట్టారు. వినాయక చవితి, రంజాన్ తదితర ఉత్సవాల్లో భద్రత ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా నిర్వహించుకునేలా కృషి చేశారు. సైబర్ క్రైం నిరోధానికి చర్యలు సెల్ఫోన్ల రికవరీకి ప్రాధాన్యత జిల్లాపై ఎస్పీ అశోక్కుమార్ ముద్ర ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ఏడాది -
రైతు ఖాతాల్లోకి ‘రైతు భరోసా’
● జిల్లాలో అర్హులు 2.48 లక్షలు ● ఎకరాకు రూ.6వేల చొప్పున జమ ● 1,79,820 మంది రైతుల ఖాతాలో రూ.120 కోట్లు జగిత్యాలఅగ్రికల్చర్: రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఎకరాకు రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 1,79,820 మంది రైతులకు రూ.120,67,49,510 వారివారి ఖాతాల్లో జమయ్యాయి. వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో 2,48,550 మంది రైతులు ఇప్పటి వరకు అర్హత సాధించారు. వీరి వివరాలను ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపించింది. గుట్టలు, చెరువులు, వాణిజ్య అవసరాలకు వినియోగించే భూములు మినహాయించి రైతులందరికీ పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంది. జిల్లా రైతులకు రూ.251.14 కోట్లు జిల్లా రైతులకు వారివారి బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా కింద రూ.251,14,131,31 జమ కానున్నాయి. గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని 2018లో ప్రారంభించగా.. ఆ సమయంలో 1,91,459 మంది రైతులు రూ.164. 47కోట్లు మాత్రమే పొందారు. భూ రికార్డులు సరి చేసుకోవడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా అందించడం వంటివి చేయడంతో ప్రస్తుతం వారి సంఖ్య 2.48 లక్షలకు చేరింది. ఆయా రైతులకు అందే పెట్టుబడి సాయం కూడా రూ.251.14 కోట్లకు పెరిగింది. -
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
● 2021లో జననాల కన్నా మరణాలు అధికం ● ఆ మరణాల్లో పురుషులే ఎక్కువ ● మృతులంతా 65 ఏళ్ల నుంచి 69 ఏళ్ల వారే ● ఐరాస ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ డేటాలో వెల్లడి ● 2022లో తిరిగి పుంజుకున్న జననాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ప్రపంచదేశాలను గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విషాదాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నిలువుదోపిడీ చేసి వేలాది మందిని బలితీసుకున్న ఆ వైరస్ వదిలిన ఆనవాళ్లు ఇప్పట్లో చెరిగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన పాపులేషన్ రిపోర్ట్ సమర్పించిన ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ (సీఆర్ఎస్) డేటా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో జననాల కన్నా అత్యధిక మరణాలు చోటు చేసుకున్న 49 జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్లోని సిరిసిల్ల జిల్లా కూడా ఒకటి. కోవిడ్ అనంతరం ప్రజల ఆరోగ్యాలు, జీవనశైలిలో మార్పులు రావడం, సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభించడంతో ఆ ఏడాది మరణాలు అధికంగా సంభవించాయి. సీఆర్ఎస్ డేటా ప్రకారం.. 2021లో నమోదైన జనన మరణాలను పరిశీలిస్తే.. 5,130 మరణాలకు 5,028 జననాలు చోటు చేసుకున్నాయి. ఆ మరణాలు కేవలం సిరిసిల్ల జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,34,425 మరణాలు రికార్డయ్యాయి. అందులో 1,35,725 మంది పురుషులు కాగా, 98,700 మంది మహిళలు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం.. మహిళల కన్నా పురుషులు 40శాతం మంది అధికంగా మరణించారు. ఆ ఏడాది చోటు చేసుకున్న మరణాల్లో పట్టణ ప్రాంతాల్లో 61,553 పురుషులు, 46,674 మంది మహిళలు మరణించగా.. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 1,06,327 మరణాలు సంభవించాయి. పురుషుల్లోనే మరణాలు అధికం డేటా ప్రకారం 65 నుంచి 69 ఏళ్ల వయసు వారిలో మరణాల రేటు అధికంగా ఉంది. ఈ వయసులో ఉన్న వారిలో 85,945 మరణాలు రికార్డయ్యాయి. ఇక 70 ఏళ్ల పైబడిన వారిలో 51,516 మరణాలు నమోదయ్యాయి. 55 నుంచి 64 ఏళ్ల 42,349 మంది మరణాలు, 45– 54 వయసు గ్రూపులో 12,184 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడానికి కోవిడ్ ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో జీవన విధానంలో మార్పులు, బీపీ, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వీరి మరణాలకు కారణమై ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరణాల రికార్డులో తెలంగాణ ముందంజలో ఉంది. 75శాతం మేరకు మరణాలు అప్పటికప్పుడే రిపోర్టు అవుతున్నాయి. మిగిలినవి తరువాత రిపోర్టు అవుతున్నాయి. సీఆర్ఎస్ డేటా ప్రకారం.. 2022లో రాజన్న సిరిసిల్లలో 3,220 మరణాలు నమోదవగా, 7,647 జననాలు నమోదయ్యాయి. ఏడాది తరువాత కోవిడ్ ప్రభావం తగ్గిపోవడంతో మరణాలు కూడా తగ్గుముఖం పట్టి ఉంటాయని భావిస్తున్నారు. -
పెట్టుబడికి ఉపయోగం
రైతుభరోసా డబ్బులు ఆపదలో ఆదుకుంటున్నాయి. వానాకాలం సీజన్ ఖర్చులకు ఉపయోగపడతాయి. కూలీలు, రసాయన ఎరువుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో రైతుభరోసా డబ్బులు ఆదుకుంటున్నాయి. ఇతరులను అప్పు అడిగే ఇబ్బంది తప్పింది. – గణపతి, దొంతాపూర్, ధర్మపురి(మం) ఖాతాల్లో జమవుతున్నాయి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వానికి పంపించాం. ఈ సీజన్లో 2.48 లక్షల మందికి రూ.251 కోట్ల వర కు రైతుభరోసా అందనుంది. తొలి రోజు జిల్లా రైతులకు రూ.76 కోట్లు జమయ్యాయి. కొత్తగా ప ట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతుల, బ్యాంకు వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపిస్తున్నాం. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
వెల్లుల ఎల్లమ్మకు బోనాలు
మెట్పల్లిరూరల్/కోరుట్లరూరల్: మెట్పల్లి మండలం వెల్లుల, కోరుట్లలోని చిన్నమెట్పల్లి గ్రా మాల్లోని ఎల్లమ్మ తల్లి ఆలయాలకు భక్తులు పో టెత్తారు. మంగళవారం కావడంతో అమ్మవారికి బెల్లం, పుట్నాలు, కల్లు సమర్పించారు. కోళ్లు, పొ ట్టేళ్లను బలిచ్చారు. సల్లంగా చూడు ఎల్లమ్మ తల్లి అంటూ వేడుకున్నారు. వెల్లులలో భక్తుల ఏర్పాట్లను దేవాదాయశాఖ, పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఆలయానికి రూ.83,339తోపాటు 15 గ్రాముల వెండి సమకూరినట్లు అధికారులు తెలిపారు. చిన్నమెట్పల్లిలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ఉద్యోగం ఇప్పించండి
నేను 2011 జనవరి 18 నుంచి 2015 డిసెంబర్ 31వరకు ఆర్డబ్ల్యూఎస్ లో మండల కో–ఆర్డినేటర్గా విధులు నిర్వర్తించా ను 2016లో విధుల నుంచి తొలగించారు. జీవనా ధారం కోల్పోయిన నేను హైకోర్టును ఆశ్రయించగా విధుల్లోకి తీసుకోవాలని, ప్రస్తు తం ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నీటి పారుదల శాఖ లోని లస్కర్, హెల్పర్ ఉద్యోగాలకు దరఖా స్తు చేసుకున్నాను. నా కుటుంబ పరిస్థితులు, విద్యార్హతలు, హైకోర్టు ఆదేశాల ప్రకారం నాకు ఉద్యోగం కల్పించి ఆదుకోండి. – కట్ల స్వామి, కొడిమ్యాల -
సాదాబైనామాలే ఎక్కువ
● పైలెట్ ప్రాజెక్టులోనూ ఇవే దరఖాస్తులు ● సివిల్ తగాదాల విషయంలోనూ ఇదే తీరు ● సర్వే నంబర్ల మిస్సింగ్పైనా భారీగా అప్లికేషన్లు ● పీవోటీ కేసులు సిరిసిల్లలో అధికం ● సాదాబైనామాల్లో జగిత్యాల టాప్సాక్షి ప్రతినిధి, కరీంనగర్: భూ భారతి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న ప్రతి మండలంలోనూ సాదాబైనామా దరఖాస్తులే ఎక్కువగా వచ్చాయి. తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల రెగ్యులరైజేషన్ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2016, 2020లో రెండు దఫాలుగా సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్2 లోపు సాదాబైనామాలకే వర్తిస్తుందనే షరతు విధించారు. తొలుత 2016లో 11.19 లక్షల అప్లికేషన్లు వస్తే 6.15 లక్షల అప్లికేషన్లను పరిష్కరించి, సరైన ఆధారాలు లేవని 3లక్షల అప్లికేషన్లను తిరస్కరించారు. మరో 2.04 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయాయి. 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు మరో సారి సాదాబైనామా అప్లికేషన్లను స్వీకరించారు. ఆ సమయంలో మరో 7.20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. పాతవాటితో కలిపితే మొత్తం అప్లికేషన్ల సంఖ్య 9.24 లక్షలకు చేరింది. అయితే వాటిని అప్పటి ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. ధరణి చట్టంలోనూ సాదాబైనామా ద్వారా పాస్బుక్కులు మంజూరు చేసే అవకాశం లేకపోవడంతో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి స్టే విధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తెచ్చిన భూభారతి చట్టం ద్వారా పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి వెసులుబాటు కల్పించింది. అయితే హైకోర్టు స్టే ఎత్తివేస్తేనే పాత అర్జీలు పరిష్కారం కానున్నాయి. ఇటీవల నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో పాతవాటితోపాటు కొత్త దరఖాస్తులు కూడా వస్తున్నాయి. కొత్త దరఖాస్తులను పరిష్కరించే వెసులుబాటు భూ భారతి చట్టంలో లేదు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాపరంగా పరిశీలిస్తే సాదాబైనామా కోసం వచ్చిన దరఖాస్తుల్లో జగిత్యాలలోనే అధికంగా ఉన్నాయి. అదే సమయంలో సిరిసిల్లలో పీవోటీ (ప్రీవెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. పెద్దపల్లి జిల్లాలో పీవోటీ కేసులు అత్యల్పంగా ఉన్నాయి. పీఓటీ కేసులు ఎక్కువే.. నిబంధనల ప్రకారం అసైన్డ్ ల్యాండ్స్ అమ్మకాలు, కొనుగోళ్లు నిషేధం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతర పేదలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్(ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) యాక్ట్– 1977 తీసుకొచ్చింది. చాలామంది పేదలు తమ అవసరాల కోసం అసైన్డ్ ల్యాండ్స్ను అమ్ముకున్నారు. కొనుగోలుదారులు కూడా అసైన్డ్ ల్యాండ్ పొందగలిగిన పేదవారే అయితే రీఅసైన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం పలుమార్లు కల్పించింది. రాష్ట్రంలో చివరిసారిగా 2017లో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఇలాంటి అవకాశం కల్పిస్తే చాలామంది వినియోగించుకున్నారు. 2017 తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు చేసినవారికి ఈ వెసులుబాటు వర్తించదు. కానీ.. ఇటీవల నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో 2017 తర్వాత అసైన్డ్ ల్యాండ్ కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి రీఅసైన్మెంట్ కోసం అర్జీలు వస్తున్నాయి. మొత్తం అర్జీల్లో 15 నుంచి 20 శాతం వరకు ఇవే ఉంటున్నాయి. దీన్ని బట్టి ఒక్కో మండలంలో వందల సంఖ్యలో అసైన్డ్ ల్యాండ్స్ చేతులు మారినట్లు తెలుస్తోంది. అలాగే కొందరు తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ, ఫారెస్ట్ భూ ములకు పట్టాలివ్వాలని దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఇలాంటివారికి కొత్తగా భూమి అసైన్ చేయాలంటే ఎమ్మెల్యేల అధ్యక్షతన ల్యాండ్ అసైన్మెంట్ కమిటీలు నియమించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా సాదాబైనామా సర్వే నంబరు మిస్సింగ్ పీవోటీ పెద్దపల్లి 4569 2149 30కరీంనగర్ 2204 1162 40సిరిసిల్ల 1523 1180 948జగిత్యాల 6360 3192 76 సివిల్, మిస్సింగ్ సర్వే నంబర్లు కుటుంబ సభ్యుల మధ్య భూమి వాటాల పంపకాల్లో వచ్చిన తేడాలు, ఒకరి భూమిని మరొకరు పట్టా చేయించుకోవడం, ఒకరి భూమిపై మరొకరు కబ్జాలో ఉండడం, భూమి హక్కుపై వారసత్వం విషయంలో వివాదం, ధరణిలో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డబుల్ రిజిస్ట్రేషన్లు వంటి అనేక సివిల్ వివాదాలపై అప్లికేషన్లు వచ్చాయి. ఇలాంటి వివాదాల పరిష్కారం కూడా తహసీల్దార్ల చేతుల్లో లేదు. వీటి పరిష్కారానికి రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కోర్టులే పిటిషన్లను విచారించి హక్కుదారులను తేల్చాల్సి ఉంటుంది. భూ వివాదాలకు సంబంధించి మరో ప్రధాన సమస్య.. మిస్సింగ్ సర్వేలకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి. -
కుంట కట్ట నిర్మించి ఆదుకోండి
కొడిమ్యాల మండలంలోని కొండాపూర్ శివారులోని బూరుగుకుంట చెరువు మత్తడి, కట్టను కొందరు ధ్వంసం చేశారు. కట్ట కిందిభాగంలో ఉన్న మా పొలాలు మునిగే అవకాశం ఉంది. ఈ విషయమై గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా.. ఇరిగేషన్ అధికారులు కట్టకు మరమ్మతు చేసేందుకు ప్రయత్నించారు. కట్ట ధ్వంసం చేసిన వ్యక్తి పురుగుల మందు తాగుతానంటూ అడ్డుకున్నాడు. ఎస్సై, డీఎస్పీ, ఆర్డీవో, ఇరిగేషన్ ఈఈలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కట్టతోపాటు మత్తడికి మరమ్మతు చేసి పంట పొలాలతోపాటు మా ప్రాణాలను కాపాడండి. లేకుంటే పురుగుల మందు తాగి ప్రాణాలు వదలడం తప్ప మాకు వేరే మార్గం లేదు. – కొడిమ్యాల రైతులు -
35.0/25.0
గరిష్టం/కనిష్టం7రాజన్నకు సందడి వేములవాడ: రాజన్నను సోమవారం 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.35లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. 8లోu -
కలెక్టర్ పాలన @ ఏడాది
● అధికారుల సమన్వయంతో ముందుకెళ్తూ జిల్లా అభివృద్ధి ● అన్ని రంగాల్లో ముందుంచిన కలెక్టర్ ● ఏడాది పాలన పూర్తి చేసుకున్న సత్యప్రసాద్జగిత్యాల: ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తూ.. వాటిని పారదర్శకంగా అమలు చే స్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచు తూ ముందుకెళ్తున్నారు కలెక్టర్ సత్యప్రసాద్. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాదిలోనే ఆయన జి ల్లాపై తన మార్క్ చూపించారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా ఆవిర్భవించిన తొలి మూడేళ్లు పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో హ్యాట్రిక్ సాధించిన విషయం తెల్సిందే. కరోనా అనంతరం మళ్లీ అట్టడుగు స్థానంలోకి పడిపోయింది. ఈ క్రమంలో కలెక్టర్ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాలని విద్యార్థులతో ముఖాముఖి, ఫోన్ఇన్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సబ్జెక్ట్లలో నిష్ణాతులను నియమించి అనుకున్నది సాధించారు. మ న్ననలు పొందారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్లో క్లబ్లు ఏర్పాటు చేయగా జిల్లా ముందంజలో ఉండటంతో కేంద్రమంత్రులతో అవార్డు అందుకున్నారు. రోగులకు మెరుగైన సేవలందించాలన్న ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీలు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేస్తూ వచ్చారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను సరెండర్ చేసి పాలనను గాడిలో పెట్టారు. హాస్టళ్లలో మెరుగైన విద్య అందాలన్న ఉద్దేశంతో హాస్టల్లో నిద్ర చేయడం, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కొండగట్టు అంజన్న జయంతి వేడుకల్లో ఎండనకా.. వాననకా స్వామివారి సన్నిధిలో ఉంటూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతోపాటు, 200 మందికి బుక్స్ సైతం అందించారు. ఇందులో 60 శాతం మంది ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయం. అందులో ఆరుగురు గ్రూప్–1 సాధించగా వారికి ల్యాప్టాప్లు అందించారు. రైతులకు అండగా.. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యటిస్తూ అన్ని చర్యలు చేపట్టారు. వారికి గన్నీ బ్యాగ్స్ గానీ, లోడింగ్, అన్లోడింగ్ చేసుకునేలా చూశారు. సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించేలా చూశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు. పకడ్బందీగా భూభారతి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో రాష్ట్రంలోనే బుగ్గారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా అక్కడ పూర్తిస్థాయిలో నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేశారు. మళ్లీ జిల్లా మొత్తం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ప్రతి రంగంలో కలెక్టర్ అన్ని చర్యలు తీసుకుంటూ తన మార్క్ను ప్రదర్శిస్తున్నారు. అందరి సహకారంతో.. అధికారులందరి సమష్ట కృషితో సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చుతూ జిల్లాను ముందు వరుసలో ఉంచుతున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది అయిన సందర్భంగా ఆయనను సోమవారం పలువురు అభినందించారు. జిల్లా ముందంజలో ఉండేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, డీపీవో మదన్మోహన్ తదితరులు ఉన్నారు. -
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ
● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ● సమస్యలు పరిష్కరించాలని ఆదేశంజగిత్యాలటౌన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 59 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్గౌడ్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
కుంకుమ పూజలో ఎమ్మెల్సీ కవిత
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని నవదుర్గా శక్తిపీఠం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన కుంకుమపూజల్లో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో కలిసి అమ్మవారి కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఆమెకు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. అమ్మవారి కృపతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అర్చకులు విషుశర్మ, జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత, నాయకులు గట్టు సతీష్ తదితరులు ఉన్నారు. -
విద్య, వైద్యానికి పెద్దపీట
కథలాపూర్: అన్ని వర్గాలకు విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని గంభీర్పూర్, దూలూర్, సిరికొండలో రూ.36 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రాలు, భూషణరావుపేటలో రూ.20 లక్షలతో పల్లె దవాఖానాకు భూమిపూజ చేశారు. సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, ఈ వర్షకాలంలో నీరు నిల్వ చేస్తామని పేర్కొన్నారు. గురుకులం విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచామన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, జిల్లా సంక్షేమశాఖ అధికారి నరేశ్, సీడీపీవో మణెమ్మ, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీడీవో శంకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు పాల్గొన్నారు. వంశీని సన్మానించిన విప్ ఆది కోరుట్ల: కోరుట్లలో ఆదివారం విద్యుత్ ప్రమాదానికి గురైన వారిని ప్రాణాలకు తెగించి కాపాడిన అలాల వంశీని విప్, కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు సన్మానించారు. వంశీ తెగువతో చాలా మంది ప్రాణాలు దక్కాయన్నారు. జైలుకు వెళ్లేందుకు కేటీఆర్ తహతహాలాడుతున్నట్లు కనిపిస్తోందని, అందుకే తరచూ తనను జైలుకు పంపిస్తారని తనకు తానే చెప్పుకుంటున్నారని విప్ అన్నారు. సోమవారం రాత్రి కోరుట్లలో మాట్లాడారు. -
అడుగుకో గుంత.. తప్పని చింత
● మరమ్మతుకు నోచుకోని మున్సిపల్ రహదారులు ● వాహనదారులకు నరకం ● తరుచూ ప్రమాదాలు ● కాలినడకకూ తిప్పలే..● ఇది కొత్తబస్టాండ్ చౌరస్తా నుంచి బస్టాండ్కు వెళ్లే రహదారి. ఇక్కడ పెద్ద గొయ్యి ఉండటంతో వాహనాలు అందులో పడి దెబ్బతింటున్నాయి. నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు అటుగా మలగడంతో అందులో పడుతున్నాయి. మొరమైనా పోయిస్తే లొందలో పడకుండా ఉంటాయని ప్రజలు అంటున్నారు. బల్దియాలో రోడ్లు ఇలా.. సీసీరోడ్లు 124 బీటీరోడ్డు 19 డబ్ల్యూబీఎం 18 కచ్చ 56 -
సేవతోనే ప్రజల్లో గుర్తింపు
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలరూరల్: సేవాకార్యక్రమాల ద్వారానే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాలరూరల్ మండం అంతర్గాంలో జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో వైద్యులు సేవాభావంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వైద్యులు దేవుడితో సమానమని ప్రజలు భావిస్తారని అన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో దేశంలో దాదాపు 7వేల గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని రంగాలతోపాటు వైద్య రంగంలోనూ అనేక మార్పులు వచ్చాయని, వాటికి తగినట్లు వైద్యులు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. రోగం వచ్చాక చికిత్స కన్నా రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ హేమంత్, కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కోటగిరి సునీల్, సీనియర్ వైద్యులు పద్మిని, నాగరాజు, రాజశేఖర్, స్వరూప, రజిత, విజయ్, గీతిక, శ్రీధర్, శ్రీనివాస్, నవీన్, శ్రావణ్, పూర్ణ చంద్ర, సాయికిరణ్, అర్జున్, ధీరజ్ పాల్గొన్నారు. -
భారమవుతున్న బంధాలు
● ప్రజావాణికి పండుటాకులు ● బుక్కెడు బువ్వ.. కాసింత ఆదరణ కోసం ● పిల్లలు కనికరించడం లేదంటూ కలెక్టర్కు వేడుకోలు ● ఈమె జగిత్యాల పట్టణానికి చెందిన చెట్టె మల్లు. భర్త చనిపోవడంతో ఏకాకిగా మిగిలిపోయింది. ఆస్తిని లాక్కున్న కుమారులు తనకు అన్నం పెట్టడం లేదంటూ ప్రజావాణి గడపతొక్కింది. తనకు ఆస్తి తిరిగి ఇప్పించి అనాథశరణాలయంలో చోటు కల్పిస్తే.. ఆస్తినంతా ప్రభుత్వానికి రాసిస్తానంటూ ప్రజావాణిలో కలెక్టర్ను వేడుకుంది. ఈమెకు ముగ్గురు కొడుకులు. ఒక కూతురు ఉన్నారు. తన ఆస్తి మొత్తం పట్టా చేసుకుని తన బాగోగులు చూడటం లేదని, కనీసం అన్నంపెట్టి మందులు ఇప్పిస్తలేరని ఆవేదనభరితంగా తెలిపింది. తన కొడుకులు రాయించుకున్న ఆస్తి తన ఇప్పించాలని వేడుకుంది. జగిత్యాలటౌన్: కని.. అల్లారుముద్దుగా పెంచి.. విద్యాబుద్ధులు నేర్పి.. వారే సరస్వమని భావించిన తల్లిదండ్రులు.. వారు ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడిన అనంతరం వారి బాగోగులు మర్చిపోతున్నారు. దీంతో వృద్ధులు చివరి మజిలీలో తమకు న్యాయం చేయాలని ‘ప్రజావాణి’ తలుపు తడుతున్నారు. ఇది మాయమైపోతున్న మానవ సంబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. అన్నీ తామై పెంచామని, వారిని వృద్ధిలోకి తెచ్చామని, అలాంటి తమకు జీవిత చరమాంకంలో కనీసం అన్నం పెట్టి ఆశ్రయం కల్పించడం లేదంటూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అన్నమో రామచంద్రా అంటూ కలెక్టర్కు గోడు వెల్లబోసుకుంటున్నారు. తమ ఆస్తిని అనుభవిస్తూ.. తమను పట్టించుకోకుండా.. బుక్కెడు బువ్వ పెట్టకుండా వేధిస్తున్న తమ వారసుల నుంచి ఆస్తిని తిరిగి ఇప్పించాలని, తమ బాగోగులు చూసే ఏర్పాటు చేస్తే ఆస్తులు ప్రభుత్వానికి రాసిస్తామంటూ విన్నవించుకుంటున్నారు. అయితే ప్రజావాణికి ఫిర్యాదు చేస్తున్న వారికి జరుగుతున్న న్యాయం అంతంత మాత్రమే. -
సర్కార్ రీచ్లో ఇసుక అక్రమ రవాణా
● చలానా కట్టి తీసుకెళ్లేవారే లేరట..! ● అక్రమ రవాణాదారులకు మాత్రం అడ్డా.. ● రెవెన్యూ తీరుపై సందేహాలు కోరుట్ల: నాలుగు గ్రామాల నదీ పరివాహాక ప్రాంతం.. సుమారు 10 కిలోమీటర్ల ఏరియా.. పెద్ద ఎత్తున నాణ్యమైన ఇసుక నిల్వలు. వాగులో 10 ఫీట్ల లోతు తవ్వినా ఇసుక తగ్గని వైనం. ఇదీ.. కోరుట్ల–కథలాపూర్ మండలాల సరిహద్దుల్లోని నాగులపేట–సిరికొండ–తక్కల్లపల్లి గ్రామాల వాగు తీర ప్రాంత పరిస్థితి. ఇక్కడ పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు పేరుకుపోయిఉన్నాయి. ఈ ఏరియాను ప్రభుత్వ ఇసుక రీచ్గా రెవెన్యూ అఽధికారులు గుర్తించారు. అదేం చోద్యమోగానీ ఈ రీచ్ నుంచి ప్రభుత్వానికి చలానా చెల్లించి ఇసుక తీసుకెళ్లేవారే లేరని రెవెన్యూ అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే అదే ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణాదారులు మాత్రం దర్జాగా రవాణా చేయడమే వింత. చలానా కట్టేవారే లేరట.. కోరుట్ల మండలం నాగులపేట, కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి, సిరికొండ, బొమ్మెన గ్రామాల సరిహద్దుల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర నది పరీవాహక ప్రాంతం ఉంది. ఈ పరీవాహక ప్రాంతంలో కిలోమీటర్ల మేర ఇసుక పేరుకుపోయింది. ఏటా వర్షాలు కురిసి తగ్గిన అనంతరం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక మేట వేస్తుంది. ఈ పరిస్థితిని గుర్తించిన రెవెన్యూ అఽధికారులు ఇక్కడ ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తే ఎంతో కొంత ఆదాయం వస్తుందని భావించారు. సుమారు తొమ్మిది నెలల క్రితం నాగులపేట–కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి శివారులోని వాగు ఏరియాను ఇసుక రీచ్గా ప్రకటించారు. అప్పటి నుంచి ఇక్కడ నుంచి సర్కార్కు చలానాలు కట్టి ఇసుక తీసుకెళ్లేవారు అంతంత మాత్రంగానే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఇసుక నాణ్యత సరిగా లేకపోవడం ఓ కారణమని అధికారులు చెబుతుండగా.. రవాణాకు ఈ ప్రాంతం నుంచి సరైన రహదారులు లేవన్న వాదనలు ఉన్నాయి. ఇదంతా బాగానే ఉందిగానీ ఇక్కడి నుంచి మూడు జిల్లాలకు పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా రవాణా కావడమే విడ్డూరంగా ఉంది. మూడు జిల్లాలకు అక్రమ రవాణా.. ఈ రీచ్లో సర్కార్కు చలానా కట్టేవారే దిక్కు లేకపోగా మూడు జిల్లాలకు మాత్రం అక్రమంగా ఇసుక రవాణా అవుతోంది. కోరుట్ల–కథలాపూర్ సరిహద్దుల్లో ఉన్న ఈ ఇసుక రీచ్ నుంచి కథలాపూర్ వరద కాలువ పక్క నుంచి.. పెగ్గెర్ల, ఇబ్రహీంపట్నం బండలింగాపూర్ శివారు మీదుగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, ఆర్మూర్ ఏరియాలకు ఇసుక టిప్పర్లలో అక్రమంగా తరలుతోంది. కథలాపూర్ మండలం బొమ్మన–తక్కళ్లపల్లి గ్రామాల పరిధిలోని వాగు నుంచి కోరుట్ల మండలం మోహన్రావుపేట మీదుగా జగిత్యాల, కథలాపూర్ వయా సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మీదుగా వేములవాడ ఏరియాకు తరలుతోంది. ఇసుక అక్రమ రవాణాదారులు పెద్ద మొత్తంలో టిప్పర్లతో తరలిస్తున్నా.. రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం వెనక తిరకాసు ఏమిటన్న అంశం ఎవరికీ అంతుచిక్కడం లేదు. అఽధికార యంత్రాంగం నిక్కచ్చిగా వ్యవహరిస్తే సర్కార్ రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగిపోయి ఎంతో కొంత ఆదాయం సమకూరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా అధికార యంత్రాంగం దృష్టి సారించి సర్కార్ ఖజానాకు లబ్ధి చేకూరేలా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. చలానా ఎవరూ కట్టడం లేదు నాగులపేట–తక్కల్లపల్లి–సిరికొండ సరిహద్దుల్లో అధికారికంగా ఇసుక రీచ్ ఉన్నప్పటికీ ఎవరూ అక్కడి నుంచి చలానా కట్టి ఇసుక తీసుకెళ్లడం లేదు. ఇసుక అక్రమ రవాణా విషయం మా దృష్టికి రాలేదు. – వినోద్, తహసీల్దార్, కథలాపూర్ -
ప్రజావాణి యథాతథం
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేటి నుండి యథాతథంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన చేశారు. భూ భారతి అవగాహన సదస్సుల నిర్వహణ కారణంగా నిలిపివేసిన ప్రజావాణిని ఈనెల 16నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చునని సూచించారు. రైతువేదికలకు పరికరాలువెల్లుల్లలోని రైతు వేదిక జగిత్యాలఅగ్రికల్చర్: రైతు వేదికలకు దృశ్య శ్రవణ పరికరాలు (వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించిన) మంజూరయ్యాయి. జిల్లాలో 52 రైతువేదికలు ఉన్నాయి. ఇందులో 19 వేదికల్లో ఇప్పటికే పరికరాలు ఏర్పాటు చేశారు. తాజాగా 33 రైతువేదికలకు పరికరాలు వచ్చాయి. ఈ పరికరాలతో రైతులు నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. సాగుకు సంబంధించిన వివరాలను తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పరికరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించనున్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాలోని ఏదో ఒక రైతు వేదికలో హాజరుకానున్నారు. కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ తెలిపారు. నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు ఆచరించి.. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకున్నారు. -
గుంతలు పూడ్చాలి
ప్రధాన రహదారిపై అనేక గుంతలు పడ్డాయి. ప్యాచ్వర్క్లు, గుంతలను మట్టితో పూడ్చడం ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వర్షం నీరు నిలిచిపోవడంతో రహదారులే కన్పిస్తున్నాయి. అందులో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. – కార్తీక్, జగిత్యాల తారురోడ్డు వేయాలి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఈ ప్రధాన రహదారుల్లో పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షకాలంలో ఈ గుంతలను గుర్తించి ప్యాచ్ వర్క్లు చేయిస్తే ప్రమాదాలు జరగవు. – కల్యాణ్ చక్రవర్తి, జగిత్యాల -
నాన్న ఫిట్టర్.. కొడుకు ఐఎఫ్ఎస్
గోదావరిఖని: నాన్న పోత్సాహంతో ఐఎఫ్ఎస్లో 40వ ర్యాంకు సాఽ దించాను. సొంతంగా సివిల్కు ప్రిపేరై రెండో ప్రయత్నంలో విజ యం సాధించా. ఐఎఫ్ఎస్ సాధించడంలో సింగరేణిలో ఈపీ ఫిట్టర్గా పనిచేస్తున్న మా నాన్న నర్సింహారెడ్డి పోత్సాహం ఎంతగానో ఉంది. గ్రూప్–2లో డీఎస్పీ ఉద్యోగం లభించగా, ఐఎఫ్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నా. – ఐఎఫ్ఎస్ అభ్యర్థి అవినాశ్రెడ్డి, గోదావరిఖని తండ్రి హమాలీ.. కొడుకు జడ్జి జగిత్యాల: ఇంటిపెద్ద హమాలీగా పనిచేస్తూ కొడుకును ఉన్నతస్థానాల్లో నిలబెట్టి ఆదర్శంగా నిలిచాడు. జగిత్యాల మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన కనకయ్య–యాదవ్వ దంపతులది పేద కుటుంబం. అదే గ్రామంలో అద్దెకుంటూ కనకయ్య జగిత్యాలలో హమాలీగా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తె భవాని పెళ్లి కాగా, భార్గవి ప్రైవేటు టీచర్. తండ్రి కూలీ పని చేసుకుంటూ నరేశ్ను హైదరాబాద్లో చదివించాడు. నరేశ్ పట్టుదలతో చదివి ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. కుమారుని చదువు కోసం కనుకయ్య హమాలీ పనిచేస్తూ రాత్రనక పగలనక కష్టపడి జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్నతస్థానంలో నిలబెట్టాడు. తండ్రి తన కోసం ఎంతో కష్టపడి తనను ఈ స్థానంలో నిలబెట్టినందుకు ఎంతో గర్వంగా ఉందని నరేశ్ పేర్కొన్నారు. -
2,426 కేసుల పరిష్కారం
జగిత్యాలజోన్: లోక్ అదాలత్లో భాగంగా జిల్లాలోని వివిధ కోర్టుల్లో 2,426 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి తెలిపారు. జిల్లాకేంద్రంలో లోక్అదా లత్ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. 50 సివిల్ కేసులు, 2,324 క్రిమినల్ కేసులు, 52 ప్రిలిటిగెంట్ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నా రు. 20 మోటార్ వాహనాల కేసుల్లో రూ.1.45 కోట్ల పరిహారం ఇప్పించినట్లు తెలిపారు. లోక్అదాలత్ తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమన్నారు. కేసులతో ఇబ్బంది పడే బదులు రాజీ చేసుకోవడం మేలన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.లావణ్య, మొదటి అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ చీఫ్ చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సతీష్, విజయ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి మారుతి ఉన్నారు. -
ఇల్లు పూర్తి చేయండి.. రూ.10,116 అందుకోండి
కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గం పరిధిలో ఇందిరమ్మ ఇంటిని మొదట పూర్తి చేసిన వారికి రూ.10,116 ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ప్రకటించారు. కోరుట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో సుమారు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, 62 గ్రామాల్లో భూమిపూజ పూర్తి చేశామని, చాలా ఇళ్లు పునాదుల స్థాయిలో ఉన్నాయని, అయితే ఎవరైతే ఇంటి నిర్మాణాన్ని ముందుగా పూర్తి చేసుకుంటారో వారికి తాను స్వయంగా రూ.10.116 కానుకగా ఇస్తానని ప్రకటించారు. ఇది రెండు మున్సిపాల్టీలు, రెండు మండలాల్లోని లబ్ధిదారులకు వర్తిస్తుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అన్నం అనిల్, కోరుట్ల పట్టణ, మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజం ఉన్నారు. -
వామ్మో బడి ఫీజులు
● ఆందోళనలో తల్లిదండ్రులు ● ఏటేటా పెరుగుతున్న ఖర్చులు ● ఎల్కేజీకే తడిసిమోపెడుజగిత్యాల: పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉన్నప్పటికీ కొందరు ప్రైవేటు పాఠశాలలనే ఆశ్రయిస్తుంటారు. దీనిని ప్రైవేటు యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతుండడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఇంగ్లిష్మీడియంలో లేకపోవడంతో అధిక ఫీజులు చెల్లించయినా తమ పిల్లలను ప్రైవేట్కే పంపిస్తున్నారు. ఎల్కేజీకే ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సి వస్తోంది. వీటికితోడు బుక్కులు, టై, షూస్, యూనిఫాం ఖర్చులు అదనం. మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళన ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చూసి మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఒక స్కూల్ ఫీజే కాకుండా పుస్తకాలు, పిల్లలకు యూనిఫాంలతోపాటు, టై, బెల్ట్, షూలు కూడా యాజమాన్యాలే విక్రయిస్తూ వాటికి కూడా సపరేట్గా వసూలు చేస్తున్నారు. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వారికి ఫీజులు కట్టాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. కొంత మంది అప్పు చేసి మరీ చదివిస్తున్నారు. ఆటో, కారు డ్రైవర్ మొదలు.. ప్రైవేటు ఉద్యోగుల పిల్లలు కూడా ఎక్కువగా ప్రైవేటు పాఠశాల ల వైపే మొగ్గు చూ పుతున్నారు. పిల్లల భవిష్యత్ కోసం అంటూ తల్లిదండ్రులు కూడా ఎంత ఫీజులైనా భరించి చెల్లిస్తున్నారు. ఆకర్షణీయమైన పేర్లతో.. జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను ఆకట్టుకునేలా వివిధ సిలబస్ అంటూ మభ్యపెడుతున్నారు. కొన్ని స్కూళ్లకు ఎలాంటి అనుమతులు లేకున్నా ఈ టెక్నో, ఐఐటీ అని, డీజీ ఇలా తోకపేర్లు తగిలిస్తూ.. అత్యధిక ఫీజు వసూలు చేస్తున్నారు. ఆకర్షణీయమైన రూపంలో ప్రింట్ చేసిన బ్రోచర్లతో ఉపాధ్యాయులను ఇంటింటికీ పంపిస్తూ.. ప్రచారం చేస్తూ స్కూళ్లలో జాయిన్ చేసుకుంటున్నారు. వసతులు అంతంతే.. జిల్లాలోని కొన్ని పాఠశాలలో వసతులు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. కొందరు సిటీ మధ్యలో ఏర్పాటు చేయగా.. కొందరు శివారు ప్రాంతాల్లో ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాలలు కొనసాగిస్తున్నారు. ఇరుకు ఇరుకు గదుల్లోనే క్లాసులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లలో ఏకంగా సెల్లార్లోనే పాఠాలు బోధిస్తున్నారంటే వారి తీరును అర్థం చేసుకోవచ్చు. ఫైర్ సేఫ్టీగానీ, ప్లే గ్రౌండ్స్గానీ, ఇతరత్రా వసతులు ఏమీ ఉండకున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నియంత్రణ ఎక్కడ?ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు ఉత్తర్వులు జారీ చేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
జగిత్యాల: క్రీడల్లో గెలుపోటములు సహజమని, వి ద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో ఉండాలని ఎమ్మె ల్యే సంజయ్కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జి ల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్ స్టేడియం అభివృద్ధికి మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారని, ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రటరి రాంగోపాల్రెడ్డి, అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి రాంమోహన్రావు, జాయింట్ సెక్రటరీ రమణ పాల్గొన్నారు. నిధులు మంజూరు చేయాలి జిల్లా కేంద్రంలోని 12వ వార్డులోని ఉప్పరిపేటలో సీసీరోడ్డు, విద్యుత్ స్తంభాలకు, డ్రెయినేజీలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్కు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. సంఘభవనానికి నిధుల మంజూరుకు వినతిజగిత్యాలరూరల్: మండలంలోని బాలపల్లిలో ము న్నూరుకాపు సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్కు గ్రామ మున్నూరుకాపు సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ బస్సు పునరుద్ధరించాలని వినతిరాయికల్: మండలంలోని చెర్లకొండాపూర్ గ్రామానికి జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని కోరుతూ శనివారం మాజీ సర్పంచ్ అల్లకొండ సుదర్శన్, మున్సిపల్ మాజీ కో–ఆప్షన్ మెంబర్ మహేందర్బాబు, మాజీ కౌన్సిలర్ మ్యా కల కాంతరావు ఎమ్మెల్యే సంజయ్కుమార్కు వినతిపత్రం సమర్పించారు● ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
ఘనంగా సంకటహర చతుర్థి
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం మహాగణపతి ఆలయంలో శనివారం సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్శర్మ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ‘కేటీఆర్పై రాజకీయ కక్ష’ జగిత్యాలరూరల్: మాజీమంత్రి కేటీఆర్పై ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్ష సా ధిస్తోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం గుల్లపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని కే టీఆర్పై కేసు పెట్టి ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఫార్ములా ఈ రేసును కేటీఆర్ హైదరాబాద్కు తీసుకొచ్చి బ్రాండ్ ఇమేజ్ పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వం స్కామ్లు చేసిందని చెప్పుకుంటూ ప్రజలను వంచిస్తోందన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన రేవంత్రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆనందరావు, కల్లెడ సింగిల్ విండో చైర్మన్ సందీప్రావు, మాజీ సర్పంచ్ తిరుపతి, యూత్ నాయకులు హరీశ్, మహేశ్, బాలె చందు పాల్గొన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారిద్దాంజగిత్యాల: గర్భాశయ క్యాన్సర్ నివారణకు కృషి చేద్దామని ఐఎంఏ అధ్యక్షుడు గూడూరి హేమంత్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో గైనకాలజీ అసోసియేషన్ వారు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ప్రతినెలా రెండో శనివారం శిబిరం ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. డాక్టర్ పద్మిని మాట్లాడుతూ.. క్యాన్సర్ మరణాలు పెరుగుతున్న తరుణంలో ప్రతిఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి సుధీర్కుమార్, వడ్డెపల్లి సాయి, నవీన్, పూర్ణచంద్ర, శ్రీలత పాల్గొన్నారు. ఐఐటీ కాన్పూర్లో సీటు సాధించిన యువకుడుజగిత్యాల: ప్రతిష్టాత్మక కాన్పూర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో జగిత్యాల సాయికిరణ్ అనే యువకుడు సీటు సాధించాడు. పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన రాధాకృష్ణ, ఆకుల శ్రీలత దంపతుల కుమారుడు సాయికిరణ్. మొదటి నుంచే చదువులో చురుకుగా ఉన్న సాయికిరణ్ పదో తరగతిలో 10 జీపీఏ సాధించాడు. ఇంటర్లో 96.6 శాతం సాధించి ఎంసెట్లో 208 ర్యాంక్ సాధించాడు. జేఈఈ మెయిన్స్లో ఓబీసీలో 144 ర్యాంక్, జేఈఈ అడ్వాన్స్లో ఓబీసీలో 112 ర్యాంక్ సాధించాడు. అతనికి ఇండియాలోనే టాప్ కాలేజ్ అయిన ఐఐటీ కాన్పూర్లో సీటు రాగా పలువురు అభినందించారు. -
సొంతింటి కలను నెరవేర్చుతున్నాం
ధర్మపురి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి 699 మందికి ప్రొసీడింగ్స్ అందించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇల్లు నిర్మించుకోవాలన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని వారికి మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణాన్ని ప్రభుత్వం అందిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులు 45 రోజుల్లోగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, లేకుంటే రద్దు చేసి అర్హులకు ఇస్తామని తెలిపారు. అనంతరం పట్టణంలోని పలు చోట్ల ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి ముగ్గు పోసి ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ తదితరులున్నారు. ధర్మపురిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా ధర్మపురి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి అడ్లూరి అన్నారు. శ్రీలక్ష్మినరసింహ ఫంక్షన్ హాల్లో అభివృద్ధి పనులపై శనివారం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పెండింగ్లో ఉన్న తాగు, సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాగు, సాగునీరు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, రోడ్ల భవనాలు, సివిల్ సప్లై, వ్యవసాయం, వసతి గృహాల శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్ పనుల ప్రగతికి కార్యాచరణ రూపొందించాలన్నారు. -
నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
● ఎస్పీ అశోక్కుమార్సారంగాపూర్(జగిత్యాల): నేరాల నియంత్రణే ల క్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ అశోక్కుమా ర్ సూచించారు. శుక్రవారం సారంగాపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 1993లో మండలంలోని బట్టపల్లి–నేరెళ్ల గ్రామాల మధ్య జరి గిన నక్సల్స్ మందుపాతరలో ప్రాణాలు కోల్పోయి న కానిస్టేబుల్ రాజయ్య విగ్రహానికి పూలమాల వే సి నివాళి అర్పించారు. అనంతరం పోలీసులతో ని ర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోలీస్స్టేష న్కు వచ్చే బాధితులకు భరోసా కల్పిస్తూ సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పా త నేరస్తులపై నిఘా పెంచాలని, నేరాలు ఎక్కువ జ రిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఆధునిక టెక్నాలజీపై అవగాహన ఉండాలని, గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి పెట్టి గ్రామాలను తరచూ సందర్శించాలని పేర్కొన్నా రు. ఠాణాలోని రికార్డు, రైటర్ రూంలు పరిశీలించి ఎస్సైతో పాటు, సిబ్బంది పనితీరుపై అభినందించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రఘుచందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీని వాస్, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సైలు దత్తాద్రి, కుమారస్వామి, సదాకర్, సుధీర్రావు, సిబ్బంది ఉన్నారు. -
జీవనోపాధి మెరుగుపరిచేందుకే ‘ఉన్నతి’
మెట్పల్లిరూరల్(కోరుట్ల): ఉపాధి కూలీల కుటుంబాల్లో జీవనోపాధి మెరుగుపరిచేందుకే కేంద్ర ప్రభుత్వం ఉన్నతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని డీఆర్డీవో పీడీ రఘువరన్ అన్నారు. మెట్పల్లి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉపాధి కోసం చిరుధాన్యాలతో ఆహారపదార్థాల తయారీ శిక్షణ పూర్తిచేసుకున్న మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన 35 మంది కూలీలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. శిక్షణ సమయంలో వీరికి ఉచితంగా వసతి, భోజన సౌకర్యం కల్పిస్తూ పారితోషికం అందజేసినట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో మహేశ్వర్రెడ్డి, జేడీఎం ఈజీఎం విజయభారతి, ఏపీవో కొమురయ్య, ఏపీఎం విమోచన, ఎస్బీఐ ఆర్ఎస్ ఈటీఐ శిక్షకురాలు స్వప్న, ఈజీఎం సిబ్బంది అపర్ణ, భూమేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సర్దుబాటు
● మెరుగైన విద్య కోసం.. విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. ● చర్యలు తీసుకుంటున్న అధికారులుజగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల విద్య మెరుగుపడిందని చెప్పొచ్చు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే నాలుగో స్థానం సాధించింది. మొదటి స్థానం చేరుకునేందుకు విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న చోట టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పూర్తిస్థాయి అడ్మిషన్లు అయ్యాక పిల్లల సంఖ్యను బట్టి మళ్లీ సర్దుబాటు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ సర్దుబాటును కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. చాలాచోట్ల విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో లేకుండా ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే సర్దుబాటు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. పరస్పర బదిలీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వొద్దన్న ఆదేశాలున్నాయి. ఉత్తర్వులు ఇలా.. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే అవకాశముంది. 10 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలకు ఒకరు, 60లోపు ఉంటే ఇద్దరు, 90 లోపు ఉంటే ముగ్గురు, 120లోపు ఉంటే నలుగురు, 150 వరకు ఐదుగురు, 200లోపు విద్యార్థులుంటే ఆరుగురు, 200 దాటిన తర్వాత ప్రతి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బడిబాటతో విద్యార్థుల సంఖ్య పెరిగేనా..? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు కసరత్తు చేస్తున్నారు. మెరుగైన ఫలితాలు రావడంతో ఈసారి విద్యార్థుల సంఖ్య అత్యధికంగా పెరిగే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందని అవగాహన కల్పిస్తున్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయులుస్కూల్ అసిస్టెంట్లు సోషల్ 300ఫిజికల్ డైరెక్టర్స్ 112మొత్తం 3,612మ్యాథ్స్ 354ఫిజిక్స్ 281బయాలజి 275తెలుగు 309హిందీ 237ఇంగ్లిష్ 290పీజీ హెచ్ఎంలు 175ఎస్జీటీ (తెలుగు) 1,230ఎస్జీటీ (ఉర్దూ) 49మెరుగైన విద్య అందించాలనే.. విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపడుతున్నాం. గతంలోనూ ఇలాగే చేపట్టాం. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉన్నారు. విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ అనంతరం సర్దుబాటు చేపడతాం. – రాము, డీఈవో -
రైలు రగడ!
● తిరుపతి ప్రత్యేక రైలుపై రాజకీయ దుమారం ● వానాకాలంలో ఏసీ కోచ్లతో తిరుపతికి రైలు ● కానరాని జనరల్, స్లీపర్ కోచ్లు ● అధికస్టాపులు, ప్రయాణ సమయంపై ప్రయాణికుల పెదవి విరుపు ● వర్షాకాలంలో ఏసీ రైలుకు ఆదరణ ఉండేనా?సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తాజాగా దక్షిణ మధ్య రైల్వే తిరుపతి– కరీంనగర్ మార్గంలో వేసిన ప్రత్యేక రైలు 012761, 012762 ప్రారంభానికి ముందే రాజకీయ రంగు పులుముకుంది. ఈ ప్రత్యేక రైలు తమ వల్ల వచ్చిందని బీజేపీ, కాదు తామే తెచ్చామని కాంగ్రెస్ పార్టీలు ఘనతను చాటుకుంటున్నాయి. ఈ విషయంలో ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్గాల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ రైలు విషయంలో రాజకీయాలు కాసేపు పక్కనబెడితే సదుపాయాలపై ప్రయాణికులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ రైలు జూలైలో ప్రతీ ఆదివారం రాత్రి 7.45 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి.. సోమవారం ఉదయం 10గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్లో బయల్దేరి, మంగళవారం ఉదయం 8.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జూలైలో తిరుపతి భక్తుల కోసం మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల అసంతృప్తి ఈ ప్రత్యేక వీక్లీ హంసఫర్ 02761/62 ఏసీ రైలుకు 16 స్టాపులు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైలులో కేవలం 3వ శ్రేణి శీతల బోగీలే. స్లీపర్, జనరల్ బోగీలు లేవు. జూలైలో జోరుగా వానలు కురుస్తాయి. వర్షాకాలంలో థర్డ్ ఏసీ ప్రయాణానికి తక్కువగా మొగ్గు చూపుతారు. పైగా రిజర్వేషన్ చార్జీలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతికి నడుస్తోన్న రెగ్యులర్ బై వీక్లీ 12762/61 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు కేవలం 12స్టాప్లే. ఇందులో 3వ శ్రేణి, 2 వ శ్రేణి ఏసీ బోగీలతో పాటు, సాధారణ బోగీలు, స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి. బైవీక్లీ రైలు కన్నా హంసఫర్ రైలు ప్రయాణం దాదాపు 3 గంటలు అధికంగా ఉండటం గమనార్హం. 02762 ఏసీ ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్ ధర రూ.1355. కరీంనగర్ నుంచి తిరుపతి రెగ్యులర్ బై వీక్లీ 12762 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్ ధర రూ.1100. రెండింటి మధ్య వ్యత్యాసం రూ.255. ఏదైనా రెగ్యులర్ రైలు వెనుక నుంచి వస్తుంది అంటే ప్రత్యేక రైళ్లను ఒక చోట ఆపి వాటిని పంపిస్తారు. ప్రత్యేక రైళ్లు సమయ పాలన పాటించడం అరుదనే చెప్పాలి. విఫల ప్రయోగంగా జూలైలో ఏసీ రైలు వేయడం అందులోనూ మొత్తం బోగీలు థర్డ్ ఏసీ వేయడంపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఏళ్లుగా తిరుపతి రైలును రెగ్యులర్ చేయమంటే.. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య లేదని సమాధానమిస్తున్నారు. తీరా వర్షాకలంలో ఏసీ రైలు వేయడం, జనరల్ స్లీపర్ లేకుండా థర్డ్ ఏసీ వేయడంతో ఆక్యుపెన్సీ రేషియో భారీగా పడిపోతుందని, దీన్ని సాకుగా చూపి భవిష్యత్తులో తిరుపతి రైలును రెగ్యులర్గా చూపించరేమోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
● విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు ● చిన్నపాటి గొడవలతో దూరం
జగిత్యాలక్రైం: ప్రస్తుత సమాజంలో బంధాలు బహుదూరమైపోతున్నాయి. ఒకప్పుడు అమ్మానాన్న, అన్న, తమ్ముడు, చెల్లె, బావ, అక్క, బావ, వదినె, మరుదలు, చిన్నమ్మ, చిన్నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న.. ఇలా బంధుత్వాలు బలంగా ఉండేవి. ఒకరికి ఏదైనా ఆపద వచ్చినా అందరూ మేమున్నామంటూ ధైర్యం చెబుతూ ఆదుకునేవారు. ఆత్మీయులు మృతిచెందితే ఆ కుటుంబానికి వెన్నంటి ఉండి వారిని ఓదార్చి మనోధైర్యం నింపేవారు. కానీ, ప్రస్తుతం ఆస్తిపాస్తులు, చిన్నపాటి గొడవలతో హత్యలకు పూనుకుంటున్నారు. ఆత్మీయులు దూరం ఒకప్పుడు ఎవరైనా అనారోగ్యంతో మృతిచెందినా, ప్రమాదాల్లో గాయపడినా వారి బంధువులు ఆ కుటుంబానికి ధైర్యంగా నిలబడేవారు. ప్రస్తుతం హత్యలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కుటుంబాన్ని నెట్టుకొచ్చే వ్యక్తి, పిల్లల లాలనను చూసే తల్లి లేకపోవడం, కొంత మంది చిన్నారులు తల్లిదండ్రులకు దూరమవుతూ మనోవేదనకు గురవుతున్నారు. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులు దూరమవడం పిల్లల భవిష్యత్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే చిన్నపాటి కుటుంబ తగాదాలతో కుటుంబాన్నే వద్దనుకుని తన జీవితం తనదని అందరినీ వదిలివెళ్లి రహస్య జీవితాలు గడుపుతుండగా, వారి రక్తసంబంధీకుల మనోవేదన అంతా ఇంత కాదు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అని వేదనతో రోజులు గడుపుతున్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
జగిత్యాలరూరల్/మల్యాల: భూ సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి, ధర్మారం, మల్యాల మండలం రామన్నపేట గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. కాగా మల్యాల మండలం రామన్నపేట, నూకపల్లి గ్రామాల మధ్య సర్వే నంబర్ల వివాదం చెలరేగుతోందని, రామన్నపేట పరిధిలోని సర్వే నంబర్ల గెజిట్ పత్రం తమకు అందజేయాలని కోరుతూ వెల్మ లక్ష్మారెడ్డి తదితరులు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ శ్రీనివాస్, డీటీలు అరుణ్కుమార్, నీత, ఆర్ఐలు భూమయ్య, శంషోద్దీన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాల: నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 9వ వార్డులో రూ.11 లక్షలతో నిర్మించే డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, హనుమాన్వాడ, పోచమ్మవాడ, శంకులపల్లిలో నీటి కొరత లేకుండా ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇటీవల రూ.50 కోట్లు మంజూరు కాగా, ఏయే పనులు కేటాయించాలో జీవోలో సైతం ఇవ్వడం జరిగిందని, మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ చైర్పర్సన్ జ్యోతి, గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆహ్వానం జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించే క్రీడా పోటీల ప్రారంభానికి హాజరుకావాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్కు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే పెద్దమ్మతల్లి బోనాల జాతర సందర్భంగా వీధిదీపాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు ముదిరాజ్ సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. వెంటనే కమిషనర్తో మాట్లాడి పనులు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ పంబాల రాము, అధ్యక్షుడు నీలం పెద్దులు, ఉపాధ్యక్షుడు రాజేశ్, ప్రధాన కార్యదర్శి కట్ట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
జగిత్యాల/మల్లాపూర్: పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం చేపట్టగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పనితీరును పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేయాలి ప్రభుత్వ బడులల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండలం హుస్సెన్నగర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అలాగే మండలంలోని మొగిలిపేట ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. సర్కార్ బడులపై విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా ఉపాధ్యాయుడు రాజేందర్ తన పిల్లలను పాఠశాలలో చేర్పించడం అభినందనీయమని కొనియాడారు. ప్రజల్లో నాటుకపోయిన అపోహాలను తొలగించేందుకు ఉపాధ్యాయులు తమ పిల్లలను తాము పనిచేసే చోటనే చేర్పించడం వంటి చర్యలు దోహదపడుతాయన్నారు. ఇటీవల ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమాల్లో జిల్లా సెక్టోరియల్ అధికారి మహేశ్, ఎంఈవో దామెదర్రెడ్డి, హెచ్ఎంలు భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడుల మనుగడ
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 240 యూనిట్ల టాయిలెట్స్, 98 కిచెన్షెడ్స్ను కలెక్టర్ సత్యప్రసాద్ మంజూరు చేయగా ఎస్టీయూ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులు సైతం బాధ్యతగా విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ఆదేశించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ ఉన్నారు. యూరియా దొరుకుతుందో.. లేదోనని..మెట్పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి విశాల సహకార సంఘం పరిధిలోని వెల్లుల గ్రామానికి గురువారం ఒక లారీ లోడ్ యూరియా, శుక్రవారం ఉదయం రెండు లారీల లోడ్ యూరియా వచ్చింది. అయితే వాటిని గోదాంలో భద్రపరుస్తుండగా విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమకు యూరియా బస్తాలు అందుతాయో లేదోనని ఆందోళనకు గురై, తమకు యూరియా ఇవ్వాలని సహకార సిబ్బందిని కోరారు. రైతుల వినతిని పరిగణనలోకి తీసుకున్న సిబ్బంది క్యూలో ఉండాలని పంపిణీ చేస్తామని సూచించారు. దీంతో రైతులు వెంట తెచ్చుకున్న ఆధార్, పాస్బుక్ జిరాక్స్లు వరుసలో ఉంచి యూరియా కోసం వేచి చూశారు. ఇదిలా ఉండగా పలువురు రైతులు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కొరత ఎన్నడు లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆరోపించారు. ఈ విషయంపై సహకార సంఘం చైర్మన్ కొమిరెడ్డి తిరుపతిరెడ్డిని అడుగగా, యూరియా కొరత అవాస్తవమని చెప్పారు. లారీల్లో వచ్చిన యూరియా బస్తాలను గోదాంలో భద్రపరుస్తుండగా రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారని, దీంతో ముందుగానే పంపిణీ చేయాల్సి వచ్చిందన్నారు. క్షీరాభిషేకం.. పుష్పాలంకరణధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలతో అలంకరించారు. అర్చకుడు శ్రీనివాసచార్యులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘కొప్పుల ఒక ప్రస్థానం’ పుస్తకావిష్కరణజగిత్యాల: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై రూపొందించిన ‘కొప్పుల ఒక ప్రస్థానం’ పుస్తకాన్ని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక కార్మికుడి ప్రస్థానం నుంచి అనేక పోరాటాలు, విజయాలు, రాజకీయ, సామాజిక అంశాలపై పుస్తకం రూపొందించడం అభినందనీయమన్నారు. మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ బాపురెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
డబుల్బెడ్రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలి
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: డబుల్బెడ్రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. డ్రెయినేజీ, విద్యుత్, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. స్కూల్ కమ్యునిటీ హాల్, అంగన్వాడీ కేంద్రం, హెల్త్ సెంటర్కు స్థలం గుర్తించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన, హౌసింగ్ డీఈ ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా 17వ వార్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సీసీరోడ్లు, డ్రైనేజీలను నాణ్యతగా చేపట్టాలన్నారు. ఎమ్మెల్యేను డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులు కలిశారు. నూకపల్లి జ్ఞాన విజ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వేణుగోపాల్రావు, దివాకర్రావు, సత్తయ్య పాల్గొన్నారు. -
హైకోర్టు జడ్జిని అందించిన జోగిన్పెల్లి స్కూల్
కోరుట్ల రూరల్: మండలంలోని జోగిన్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివిన గ్రామానికి చెందిన ఏనుగు సంతోష్ రెడ్డి హైకోర్టు జడ్జిగా ఎదిగారు. రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. జిల్లా డిప్యూటీ సీఈఓ పల్లికొండ నరేశ్, పిల్లల వైద్య నిపుణుడు బూరుగు నారాయణ, శ్రీరాంసాగర్ చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఏనుగు రాజరెడ్డి ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది ప్రభుత్వ ఉపాద్యాయులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, బ్యాంకు అధికారులుగా ఎదిగారు. వందలాది మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తూ పాఠశాల పేరును నిలబెడుతున్నారు. -
ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు
జగిత్యాల: ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు ఇంటర్ బోర్డు పరిశీలకులు వెంకటేశ్వర్రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించి పోస్టర్ ఆవిష్కరించారు. కళాశాలల్లో లెక్చరర్లు అడ్మిషన్ల లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఇంటర్ బోర్డు కమాండ్ సెంటర్ నుంచి ప్రతి అధ్యాపకుడి బోధన తీరును పరిశీలిస్తామని వెల్లడించారు. అధ్యాపకులు 90రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు బోధించాలని పేర్కొన్నారు. కళాశాలలో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, క్రీడల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఎఫ్ఆర్సీ అమలు చేస్తామన్నారు. కేర్ టేకర్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ, ప్రిన్సిపల్ అలియా మక్సూద్, కె.నాగభూషణం, జూనియర్ లెక్చరర్ల సంఘం 475 అధ్యక్షుడు కె.తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. -
మూడేళ్ల అనంతరం తెరుచుకున్న పాఠశాలలు
జగిత్యాల: ఆ పాఠశాలలో మూడేళ్లుగా ఒక్క విద్యార్థి కూడా లేడు. దీంతోపాటు పలు కారణాలతో బడులను మూసివేశారు. జిల్లాలో మూతపడిన పాఠశాలలు 61 వరకు ఉన్నాయి. ఇందులో మూడేళ్లుగా చేరికలే లేవు. ఈ ఏడాది నిర్వహించిన బడిబాటలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు వెల్గటూర్ మండలం వెంకట్రావ్పేట, కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు చేరడంతో ఆ పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. మూడేళ్ల తర్వాత పాఠశాలలు తెరుచుకోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల కృషి ఫలితమే పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే మళ్లీ తెరుచుకున్నాయని డీఈవో రాము తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో వసతులతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా చూడాలని, కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతుందని చెప్పారు. -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ‘తుమ్మల’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావును నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ల ఇన్చార్జీ బాధ్యతల్లో ఎలాంటి మార్పు జరగలేదు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జీ మంత్రిగా శ్రీధర్బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రిగా పొన్నం ప్రభాకర్లను కొనసాగించారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్కుమార్ను నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రిగా నియమించారు. ● ‘అడ్లూరి’కి నల్గొండ జిల్లా బాధ్యతలు -
బీర్పూర్లో తెరుచుకోని నాలుగు పాఠశాలలు
● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ సారంగాపూర్: బీర్పూర్ మండలంలోని నాలుగు పాఠశాలలు గురువారం పలు కారణాలతో తెరుచుకోలేదు. దీంతో మండల విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. రంగసాగర్ ప్రాథమిక పాఠశాల గ్రామానికి దూరంగా ఉందంటూ అక్కడి విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆ విద్యార్థులను ఆటోలో బీర్పూర్ ప్రాథమిక పాఠశాలకు తరలించారు. రంగసాగర్ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్పై రేకులపల్లి పాఠశాలకు పంపించారు. మంగేళ ఎస్సీ కాలనీ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో అక్కడి విద్యార్థులను అదే గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు పంపించారు. తుంగూర్ కొత్తపేట పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉన్నా.. అక్కడ ఉపాధ్యాయుడు లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలకు పంపించారు. ఈ స్కూల్లో ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. గంగసముద్రం పాఠశాల ఏడాదికాలంగా మూతపడడంతో గంగసముద్రం, సిరుపురం గ్రామాల విద్యార్థులను బీర్పూర్ ఎంపీపీఎస్ పాఠశాలకు తరలించామని ఎంఈవో నాగభూషణం తెలిపారు. -
బడి గంటలు మోగిన వేళ..
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చాలాచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తాయి. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏసీబీ అధికారులు సోదాలు చేసి న ఇరిగేషన్ అధికారి శ్రీధర్ ఇరిగేషన్ క్యాడ్ డివిజన్– 8 ఈఈగా పనిచేస్తున్నారు.8లోu శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2025రాయికల్: పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. మొదటిరోజు పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఆసక్తి చూపలేదు. స్వయంగా ఉపాధ్యాయులే విద్యార్థుల వద్దకు వెళ్లి తమ వాహనాల్లో తీసుకెళ్లడం కనిపించింది. పాఠశాలకు వచ్చిన చిన్నారులు ఏడ్వడంతో ఉపాధ్యాయులు బుజ్జగించాల్సి వచ్చింది. న్యూస్రీల్ -
రాజీకొస్తేనే మనశ్శాంతి
జగిత్యాలజోన్: జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఉన్న కేసులను ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని, తద్వారా కక్షిదారులు మనశ్శాంతి పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో రాజీకి వీలున్న సివిల్, క్రిమినల్ కేసుల్లోని 3,559 కక్షిదారులకు నోటీసులు పంపించామన్నారు. అన్ని కోర్టులో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు పోలీసులు, న్యాయవాదులతో చర్చించామని తెలిపారు. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 845 క్రిమినల్ కేసులు రాజీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. మోటార్ వాహనాలు, డ్రంకెన్డ్రైవ్, పిటీ కేసులతోపాటు కోర్టు వరకూ రాని ఫ్రీలిటిగేషన్ కేసులు పరిష్కరిస్తామని వివరించారు. ప్రతి కోర్టులో లోక్ అదాలత్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని, లోక్ అదాలత్నాడే కాకుండా.. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరిస్తామని వెల్లడించారు. లోక్ అదాలత్లో కేసు పరిష్కరించుకుంటే కోర్టు ఫీజు వాపస్ ఇస్తారని, తీర్పులపై అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. లోక్ అదాలత్కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కోర్టులోని న్యాయ సేవాసంస్థ కార్యదర్శిని సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో సబ్ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి మల్లిక్ వెంకట సుబ్రహ్మాణ్యశర్మ పాల్గొన్నారు. -
60 ఏళ్లుగా విద్యనందిస్తున్న పాఠశాల
● ఎంతో మందిని తీర్చిదిద్దిన పాఠశాలజగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ తర్వాత అంతటి పేరుగాంచింది న్యూ హైస్కూల్. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రభుత్వ పాఠశాలలో చాలామంది ప్రముఖులు చదువుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త మంచాల కృష్ణ, హైకోర్టు జడ్జి సంతోష్రెడ్డి, అమూల్ డైయిరీ రాంమోహన్రావు.. ఇలా చాలామంది ఈ పాఠశాలలో చదువుకున్న వారే. జిల్లా కేంద్రంలోని తీన్ఖని ప్రాంతంలో ఉన్న ఈ హైస్కూల్లో ప్రస్తుతం 300కు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల అదనపు తరగతి గదులు కూడా నిర్మించారు. -
ఫిట్నెస్ లేకుంటే వాహనాలు సీజ్
జగిత్యాలక్రైం: వాహనాలకు ఫిట్నెస్ లేకుంటే సీజ్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి భద్రునాయక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, ధర్మపురి రోడ్, గొల్లపల్లి రోడ్లో వాహనాల తనిఖీ చేపట్టారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు. వాహనదారులు వాహన ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. ఎంవీఐ ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు. ప్రణాళికతో చదివి లక్ష్యం చేరాలిమెట్పల్లి: ప్రణాళిక ప్రకారం చదివితే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరవచ్చని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని గ్రంథాలయాన్ని గురువారం సందర్శించారు. పోటీ పరీక్షలకు ప్రిపెర్ అవుతున్న అభ్యర్థులతో కాసేపు ముచ్చటించారు.అభ్యర్థులు భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. గ్రంథాలయంలో సౌకర్యాలపై ఆరా తీశారు. అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కొండగట్టుకు అంతరాయం లేని విద్యుత్మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయానికి విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశామని సాలియా నాయక్ అన్నారు. కొండగట్టు సబ్స్టేషన్ నుంచి 5ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన గురువారం ప్రారంభించారు. ట్రాన్స్ఫార్మర్తో అధిక లోడ్ భారం తగ్గుతుందని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అవుతుందని వివరించారు. డీఈఈ రాజిరెడ్డి, రవీందర్, ఏడీఈ మహేందర్, రాజు, దయానంద్, రహీం, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యవెల్గటూర్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన సాధ్యమని డీఈవో కె.రాము అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి, వెంకటాపూర్లో విద్యార్థులు లేక మూతబడిన ప్రాథమిక పాఠశాలలను గురువారం పునఃప్రారంభించారు. వెంకటాపూర్లో ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, సమగ్ర శిక్ష జిల్లా సెక్టోరియల్ అధికారులు సత్యనారాయణ, రాజేశ్, ఎంఈవో ప్రభాకర్, హెచ్ఎంలు సందయ్య, అరుణ, సంపత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ–పాస్తోనే ఎరువులు విక్రయించాలిమల్యాల: రైతులకు రసాయన ఎరువులను ఈ–పాస్ ద్వారానే విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి వి.భాస్కర్ అన్నారు. గురువారం ఏవో కె.చంద్రదీపక్తో కలిసి పలు ఎరువుల దుకాణాలను పరిశీలించారు. డీలర్లు రశీదులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాలతో భూసారం పెరుగుతుందని పేర్కొన్నారు. ముత్యంపేటలో జీలుగ, జనుము సాగు చేసిన రైతుల పొలాలను సందర్శించారు. దున్నేటప్పుడు సింగిల్ సూపర్ పాస్పేట్ను ఎకరానికి 50కిలోలు వేయాలని సూచించారు. వారి వెంట ఏఈఓ కారుణ్యకుమార్, రైతులు పాల్గొన్నారు. -
ఆదర్శం ఈ ఉపాధ్యాయుడు● పనిచేస్తున్న పాఠశాలలోనే కుమారుడిని చేర్పించిన రాజేందర్
మల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటూ ప్రచారం చేయడమే కాదు.. దానిని అనుసరించారు మండలంలోని మొగిలిపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బబ్బురి రాజేందర్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు సరిగా చెప్పరనే దురాభిప్రాయాన్ని తొలగించేందుకు తన కుమారుడిని ఆయన పనిచేస్తున్న పాఠశాలలోనే గురువారం చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ధర్మపురి నుంచే మొక్కలు నాటుతాంధర్మపురి: ధర్మపురి నియోజకవర్గం నుంచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఇటీవల మరణించిన వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకుని వాశ్విన్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ ఆధ్వర్యంలో ఏటా లక్ష మొక్కలు నాటాలని సంకల్పించారు. ఇందుల భాగంగా మంత్రి లక్ష్మణ్కుమార్ మొదట తన అధికారిక నివాసంలో మొదటి మొక్కను నాటారు. -
2024–25 వానాకాలం సీజన్ సీఎమ్మార్(మెట్రిక్ టన్నుల్లో)
జిల్లా ఇచ్చిన ధాన్యం ఇవ్వాల్సినబియ్యం ఇచ్చింది శాతం పెద్దపల్లి 2,97,379 1,99,750 1,80,487 90 కరీంనగర్ 2,60,679 1,75,589 1,43,946 82 జగిత్యాల 3,08,271 2,08,277 1,19,642 57 సిరిసిల్ల 2,11,572 1,42,327 61,364 43 సాక్షి, పెద్దపల్లి: రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ (సీఎమ్మార్– మర ఆడించి) చేసి బియ్యంగా ఇవ్వడంలో ఇన్నాళ్లూ జాప్యం చేస్తూ వచ్చిన రైస్ మిల్లర్లు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దిగొస్తున్నారు. సీఎమ్మార్పై ప్రత్యేకంగా దృష్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గ్యారెంటీ బాండ్లు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయింపులు చేస్తుండడంతో మిల్లర్లు దారికొస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఇటీవల సన్నబియాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుండడంతో రీసైక్లింగ్ దందాకు చెక్పెట్టినట్లు అయ్యింది. దీంతో పెద్దపల్లి జిల్లా 90శాతంతో రాష్ట్రంలో రెండోస్థానంలో ఉండగా, కరీంనగర్ నాలుగో స్థానంలో నిలిచాయి. అయితే, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సీఎమ్మార్ డెలివరీ చేయడంలో వెనకబడ్డాయి. బ్యాంక్ గ్యారెంటీ షరతు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం మిల్లర్లకు ఇస్తోంది. మిల్లర్లు ఒక క్వింటాల్ వడ్లు తీసుకుంటే 68 కిలోల బాయిల్డ్రైస్, 67 కిలోల రారైస్ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అవసరమైన రేషన్బియ్యం కోటా తీసుకొని మిగిలిన బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్సీఐకి అప్పగించాలి. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఇప్పటిదాకా తమ ఆర్థికాభివృద్ధికి వినియోగించుకునేవారు. బియ్యం అప్పగించకుండానే ధాన్యాన్ని విక్రయించి ఆ డబ్బతో వ్యాపారాలు నిర్వహించేవారు. రూ.కోట్ల విలువైన ధాన్యం రైస్మిల్లర్లుకు వరంగా మారినా అధికారులు పటిచుకోలేదన్న ఆరోపణలున్నాయి. దీంతోనే మిల్లర్లు సీఎమ్మార్ ఇవ్వడంలో జాప్యం చేసేవారు. ప్రస్తుతం టాస్క్ఫోర్స్, రెవెన్యూ, సివిల్ సప్లయీస్, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టడం, కేసులు నమోదు చేయడంతోపాటు ఆస్తుల జప్తుకూ వెనుకాడడం లేదు. దీంతోపాటు, సీమ్మార్ డిఫాల్ట్ను నివారించడానికి బాండ్లు ఇచ్చినవారికే ధాన్యం కేటాయింపులు చేశారు. సర్కారు ధాన్యాన్ని ఇప్పటికే విక్రయించిన మిల్లర్లు ఇప్పుడు బయట వడ్లు సేకరించి మరీ మిల్లింగ్ చేసి సర్కారుకు బియ్యం ఇస్తున్నారు. దీంతో సీఎమ్మార్ డెలివరీ వేగవంతమైంది. రికార్డు నమోదు రైస్మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యం ప్రకారం సీఎమ్మార్ను త్వరగా పూర్తి చేయాలి. గత వానాకాలం మిల్లింగ్ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా తీసుకున్న చర్యలతో సీఎమ్మార్ను వేగంగా సేకరించగలిగాం. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా రెండో స్థానంలో ఉంది. – శ్రీకాంత్రెడ్డి, డీఏం, జిల్లా పౌర సరఫరాలు -
అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా..
జగిత్యాలటౌన్: కార్యకర్తల కృషి, ఆశీర్వాదంతోనే తనకు మంత్రి పదవి దక్కిందని, అందరిలో ఒకడిలా ఉంటూ అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మొదటిసారి జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయనకు మాజీమంత్రి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ముందుగా మంత్రి రాజీవ్గాంధీ, ఇందిరాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సన్మాన సభలో మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతిఒక్కరూ నిజాయితీతో పనిచేయాలని సూచించారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన జీవన్రెడ్డి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. జీవన్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా.. విప్గా లక్ష్మణ్కుమార్ సమర్థవంతంగా పనిచేశారని, మంత్రిగా మరిన్ని సేవలు అందించాలని కోరారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదిగి కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. మంత్రి కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, బండ శంకర్, కొత్త మోహన్, తాటిపర్తి విజయలక్ష్మి, గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని మంత్రి తెలిపారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. పురోహితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. ఉద్యోగ, కుల సంఘాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని సన్మానించారు. అందరి కృషి, ఆశీర్వాదంతోనే మంత్రి పదవి సన్మాన సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
భయంగా ఉన్నా.. ఆనందమే
– జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత స్కూల్కు వెళ్తున్న తొలిరోజుల్లో కొద్దిగా భయం ఉనిపించినా.. ఆ ఆనందమే వేరు. కొత్తబుక్స్, డ్రెస్లు కొనిస్తారు. నేను జగిత్యాల రూరల్ మండలం గోపులాపూర్ జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్నాను. అమ్మ రాజమణి, నాన్న నారాయణ ప్రతిరోజూ స్కూల్లో దింపేవారు. ఇష్టంగానే పాఠశాలకు వెళ్లేదానిని. ఆ రోజులను మరిచిపోలేం. ప్రతిఒక్కరూ స్కూల్కు వెళ్లి ఉన్నతస్థాయికి చేరి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. -
‘రోల్లవాగు’ అనుమతికి మరింత సమయం
సారంగాపూర్: రోల్లవాగు ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురువుతున్న అటవీభూములకు అటవీశాఖతోపాటు కేంద్రం పర్యావరణ అనుమతి రావాల్సి ఉందని, ఇందుకు సమయం పడుతుందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సువర్ణ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి బీర్పూర్ శివారులోని ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అటవీశాఖ భూములు 800ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని ఇంజినీరింగ్, అటవీశాఖ అధికారులు వివరించారు. ప్రాజెక్టు సమీపంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ ఫారెస్ట్ అభయారణ్యం ఉందని, ఇందుకు పర్యావరణ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. వారి వెంట చీఫ్ కన్జర్వేటర్ శర్వానంద్, డీఎఫ్వో రవిప్రసాద్, ఈఈ నారాయణరెడ్డి, డీఈ చక్రూనాయక్ తదితరులు ఉన్నారు. సువర్ణను కలిసిన కలెక్టర్ జగిత్యాల: రోల్లవాగు పరిశీలనకు వచ్చిన సువర్ణను జగిత్యాలలోని గెస్ట్హౌస్లో కలెక్టర్ సత్యప్రసాద్ కలిశారు. ప్రాజెక్ట్ గురించి చర్చించారు. -
పాఠశాలలో ఎన్నో నేర్చుకున్నం
పైడిమడుగు ఉన్నత పాఠశాలలో 6, 7 తరగతులు చదువుకున్నా. ఆ రెండేళ్లు అనేక జీవిత పాఠాలు నేర్చుకున్నాను. ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థుల పట్ల చూపిన శ్రద్ధ ఇప్పుడు ఎంతోమందిని ఉన్నత స్థానాల్లో నిలిపింది. – కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే, పూర్వ విద్యార్థి క్రమశిక్షణతోనే ఈ స్థాయికి పైడిమడుగులో 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఉపాధ్యాయులు చిన్ననాటి నుంచే చక్కని క్రమశిక్షణ అలవాటు చేశారు. అదే స్ఫూర్తి, పట్టుదలతో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాను. ఎంతోమందికి విద్య నేర్పే అవకాశం వచ్చింది. మా ఊరు పాఠశాలను ఎ్పటికీ మరిచిపోను. – పిన్నంశెట్టి శ్రీనివాస్, రిటైర్డ్ ఎంఈఓ -
నాన్నతో వెళ్లేవాడిని
– మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల నా చదువంతా గంగాధరలోసాగింది. స్కూల్కు నాన్న మల్లయ్యనే తీసుకెళ్లేవారు. ఆనందంగా ఉండేది. ఆ ఉత్సాహం వేరేగా ఉంటుంది. ఉపాధ్యాయులు ఎంతో ప్రేమగా చదువు చెప్పేవారు. నాన్ననే రోజూ తీసుకెళ్లేవారు. ఉపాధ్యాయుల చొరవతో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోంది. డిజిటల్ బోర్డులు, కంప్యూటర్స్, ల్యాబ్స్ ఎన్నో వచ్చాయి. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలి. చదువుతోనే భవిష్యత్. -
అడగండి... అడుగేయండి
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే ముందు తల్లిదండ్రులు ఆచితూచీ అడుగేయాల్సిన అవసరం ఉంది. ఆ స్కూల్ ఎలాంటిది? గతంలో స్కూల్ విద్యార్థులు సాధించిన ఫలితాలు ఎలా ఉన్నాయి? ఫీజుల వివరాలు, తల్లిదండ్రులతో యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుంది? అనే వివరాలు గమనించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేది పాఠశాలే కాబట్టి.. ఆలోచించి అడుగేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. జిల్లాలో 120 గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. నేటి నుంచి పాఠశాలలు పునర్ప్రారంభం కానుండడంతో ఇప్పటికే జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. హంగు ఆర్భాటాలతో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉపాధ్యాయులను ఇళ్లకు పంపిస్తూ పిల్లలను తమ బడిలో చేర్పించాలని కోరుతున్నారు. అనుమతులు ఉన్నాయా.. ప్రైవేటు పాఠశాల తమ వివరాలను విద్యాశాఖ కార్యాలయంలో నమోదు చేసుకొని ఉంటుంది. వారికి నిర్ధిష్ట సంఖ్య, నమోదైన సంవత్సరంతో కూడిన పత్రాన్ని ఇస్తారు. దీన్ని పరిశీలించాకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలి. కొన్ని పాఠశాలలు 1–7, 8–10 తరగతుల వరకు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నోటీస్ బోర్డుపై ఇవి ఉన్నాయా..? మీరు చేర్పించబోయే ప్రైవేటు పాఠశాలలోని బోధన సిబ్బంది అర్హతలు ఎలా ఉన్నాయో గమనించాలి. అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారా? అనేది ఆరా తీయాలి. బీఈడీ, డీఈడీ వంటి విద్యార్హతలు గల వారితో విద్యాబోధన చేస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ఉపాధ్యాయుల వివరాలు, అర్హతలను ప్రభుత్వ పాఠశాలలో మాదిరిగా ప్రైవేటు పాఠశాల నోటీస్ బోర్డుపై ప్రదర్శించారో.. లేదో చూడాలి. ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయి? ఫీజుల్లో పారదర్శకత ఉందా.. అడిగి తెలుసుకోవాలి. వసతులపై దృష్టి పెట్టండి మెరుగైన ఫలితాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి పఠనాసక్తి కలిగించే ఎలాంటి అంశాలు అమలు చేస్తున్నారో అడగాలి. స్కూల్లో లైబ్రరీ, ప్లేగ్రౌండ్, టాయిలెట్స్.. తాగునీటి వసతుల గురించి తెలుసుకోవాలి. ఇన్నోవేటీవ్ అంశాలపై.. పాఠశాలలో ఇన్నోవేటివ్ అంశాలు నేర్పిస్తున్నారా.. కొత్త విషయాలను విద్యార్థులకు తెలిసేలా తరగతులు నిర్వహిస్తున్నారా.. తెలుసుకోవాలి. గతంలో వైజ్ఞానిక ప్రదర్శనలు.. ఇన్స్పైర్ మానక్, సైన్స్మేళాల్లో భాగస్వామ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని, ప్రతిభ చాటే వారిని ఎలా ప్రోత్సాహం ఎలా ఉందో ఆరా తీయాలి. అలాంటి పాఠశాలలను తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవాలి. -
ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా చేస్తా
● 50 పడకల ఆసుపత్రి, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మిస్తా ● విద్యార్థినుల ఉన్నత విద్యకు సదుపాయాలు ● ధర్మపురి పుణ్యక్షేత్ర అభివృద్ధికి మాస్టర్ప్లాన్ ● ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: తనకు రాజకీయ జన్మనిచ్చిన ధర్మపురిని నియోకవర్గాన్ని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో పునర్జన్మనిచ్చిన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి రుణాన్ని తాను ఏనాడూ తీర్చుకోలేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నియోజకవర్గపరంగా మీ ప్రాధాన్యాలేంటి? అడ్లూరి: ధర్మపురి ప్రజలను, లక్ష్మీ నరసింహ స్వామిని జీవితంలో మర్చిపోను. ప్రజలు ఎమ్మెల్యేగా జన్మనిస్తే.. రోడ్డు ప్రమాదంలో స్వామి నన్ను కాపాడి పునర్జన్మనిచ్చారు. ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడినా నా అనుచరులు నా కోసమే పనిచేశారు. వారిరుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. మంత్రిగా నియోజకవర్గంలో సాగునీటికి తొలి ప్రాధాన్యం ఇస్తా. విద్య, వైద్యం, సదుపాయాలకు పెద్దపీట వేస్తా. ఇక్కడి విద్యార్థినులు డిగ్రీ, పీజీ కళాశాలలు లేక జగిత్యాల, కరీంనగర్ వెళ్తున్నారు. ధర్మపురిలో డిగ్రీ, పీజీ కళాశాలలతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయిస్తా. చారిత్రక ధర్మపురి పుణ్యక్షేత్రానికి చీకటిపడితే రవాణా సౌకర్యం లేదు. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. 50పడకల ఆసుపత్రి నిర్మిస్తా. ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా మారుస్తా. మంత్రిగా భవిష్యత్ ప్రణాళికలు? అడ్లూరి: తొలిసారి ఎమ్మెల్యే, ఆపై విప్.. ఇప్పుడు మంత్రి పదవి. పార్టీలో సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందనడానికి నాకు దక్కిన పదవులే నిదర్శనం. మంత్రి అయ్యాక మరింత బాధ్యత పెరిగింది. నాకు ప్రభుత్వం కేటాయించిన ఏ శాఖ కేటాయించినా 100శాతం న్యాయం చేస్తా. ప్రజా ఆకాంక్షల మేరకు పనిచేస్తా. ప్రతీ 30రోజులకు నా శాఖలోని పనులపై సమీక్ష చేపడతా. మీరు మంత్రి కావడంలో కుటుంబ పాత్ర? అడ్లూరి: నా భార్య కాంతకుమారి ప్రభుత్వ లెక్చరర్. నా రాజకీయ జీవితంలో ఆమె పాత్ర చాలా కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థికంగా ఇబ్బందులున్నా.. తన ఉద్యోగాన్ని, కెరీర్ను త్యాగం చేసి నాకు అండగా నిలిచింది. 2018లో ఓడిన సమయంలో నాలో ధైర్యం నింపింది. నా పిల్లలు కూడా వెంట నిలిచారు. వారి సహకారం మాటల్లో వర్ణించలేనిది. -
మక్క విత్తనాల సబ్సిడీకి మంగళం
● ఓపెన్ మార్కెట్లోనే హైబ్రిడ్ విత్తనాల కొనుగోలు ● కంపెనీలను బట్టి 4 కిలోల బస్తాకు రూ.1500 నుంచి రూ.2500 వరకు ● సబ్సిడీ లేక జిల్లా రైతులకు రూ.4కోట్ల మేర నష్టంజగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్లో జిల్లాలో అత్యధికంగా సాగు చేసే మొక్కజొన్న విత్తనాలకు ప్రభుత్వం మంగళం పాడింది. వరి విత్తనాల మా దిరిగా రైతులు తమ పంట నుండి వచ్చే మొక్కజొ న్న విత్తనాలు వాడుకుంటే దిగుబడులు రావు. దీంతో మక్క సాగు చేసే రైతులు ప్రైవేట్ కంపెనీల హై బ్రిడ్ విత్తనాలపైనే ఆధారపడుతున్నారు. దీంతో ఆ యా కంపెనీలు చెప్పిన ధరకు రైతులు ఓపెన్ మా ర్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పంటలోమూడు నెలల తర్వాత వచ్చే దిగుబడి ఏ మోగాని, విత్తనాల ఖర్చే తడిసి మోపెడవుతోంది. మొక్కజొన్నలపై కనీసం 33శాతం సబ్సిడీ లేక రైతులపై దాదాపురూ.4కోట్లఅదనపుభారంపడుతోంది. వైఎస్సార్ హయాంలో 33 శాతం సబ్సిడీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రైవేట్ కంపెనీలు విత్తనాలపై 33 శాతం సబ్సిడీ ఇచ్చేది. దీంతో రైతులు తమకు నచ్చిన కంపెనీ విత్తనాలు కొనుగోలు చేసి సబ్సిడీ పొందేవారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో సబ్సిడీ రద్దు అయ్యింది. దీనివల్ల జిల్లా రైతులపై అధిక భారం పడనుంది. జిల్లా మొత్తంగా దాదాపు 60 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారు. రైతులు ఎకరాకు 4 కిలోల విత్తనాలు వాడుతారు. దీన్ని బట్టి జిల్లాకు 2.40 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. 4 కిలోల బస్తాకే రూ.1500 నుంచి రూ.2500 రైతుల డిమాండ్ను ఆసరా చేసుకుని.. ప్రైవేట్ కంపెనీలు తమ విత్తనాలకు వివిధ పేర్లు పెట్టి నచ్చిన ధరకు అమ్ముతున్నాయి. విత్తన ధరలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో కంపెనీలు తమ ఉత్పత్తి ధర, లాభాలు చేసుకుంటూ అమ్మకాలు సాగిస్తున్నాయి. రైతులు క్వింటాల్ మొక్కజొన్నలను రూ.1800 నుంచి రూ.2000కు విక్రయిస్తే విత్తన కంపెనీలు మాత్రం కంపెనీ డిమాండ్ను బట్టి 4 కిలోల బస్తాను రూ.1500 నుంచి రూ.2500 వరకు విక్రయిస్తున్నాయి. కంపెనీలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ.. తమ విత్తనాలను సాగు చేస్తే ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, మొక్కజొన్న ఆకులు ఎక్కువగా రావడంతో రామచిలుకలు రావని, పంటకు తెగుళ్లు ఆశించవంటూ రైతులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాయి. సబ్సిడీ రాక.. మొక్కజొన్న విత్తనాలపై సబ్సిడీ లేకపోవడంతో జిల్లా రైతులకు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. సగటున మొక్కజొన్న 4 కిలోల విత్తనాల సంచిని రూ.2000 వరకు కంపెనీలు విక్రయిస్తే.. ఆ సంచిపై 33 శాతం సబ్సిడీ ఉంటే రూ.660 సబ్సిడీ రైతులకు దక్కేది. కేవలం రైతులు సంచికి రూ.1340 చెల్లిస్తే సరిపోయేది. సబ్సిడీ ఎత్తివేయడంతో జిల్లా రైతులపై దాదాపు రూ.4 కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. -
భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
ఇబ్రహీంపట్నం: రైతులు భూములు కొన్న వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అడిషినల్ కలెక్టర్ లత అన్నారు. మండలంలోని వర్షకొండ, బర్థీపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. దరఖాస్తులు ఎలా స్వీకరిస్తున్నారు..? ఎన్ని వచ్చాయి..? పరిశీలించారు. భూములు కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెనుకడుగు వేయొద్దన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టా లేకుంటే పాత రికార్డులు పరిశీలించి.. పొరుగు ఉన్న రైతు వాగ్మూలంతో పట్టా చేస్తామన్నారు. విరాసత్ 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. వ్యవసాయ భూమిలో ఇళ్లు, బడి అని రికార్డుల్లో పడిన రైతులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వ్యవసాయ భూమిగా నమోదు చేస్తామన్నారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వరప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐలు రేవంత్రెడ్డి, రమేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన మెట్పల్లి: పట్టణంలోని 8,19వ వార్డుల్లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను అడిషనల్ కలెక్టర్ లత పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించవద్దని సూచించారు. కమిషనర్ మోహన్, డీఈ నాగేశ్వర్రావు, ఏఈ తిరుపతి, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఉన్నారు. -
మంచి విద్య
నిజాం కాలం నుంచి..జగిత్యాల: జిల్లా కేంద్రం నడిబొడ్డున.. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్ హైస్కూల్) ఉమ్మడి జిల్లాలోనే ప్రథమ స్కూల్ అని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ స్కూల్లో చదువుకున్న ఎంతోమంది గొప్పవారయ్యారు. రెండెకరాల స్థలంలో ఉన్న ఈ స్కూల్ ఇప్పటికీ కొనసాగుతోంది. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో 350 మంది చదువుకుంటున్నారు. క్రమశిక్షణ గల స్కూల్గా పేరుగాంచింది. మాజీమంత్రులు జీవన్రెడ్డి, రాజేశంగౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే సంజయ్కుమార్ తండ్రి హన్మంతరా వు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రా వు, ఎంపీ సంతోష్, డాక్టర్ జగన్నాథరావు వంటి ఎందరో ఈ పాఠశాలలో చదువుకున్నారు. ఈ పాఠశాలలో మంచి విద్య విద్యార్థులకు అందున్నాం. నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారు. మంచి ల్యా బ్ విద్యార్థులకు మౌలి క వసతులు కలిగి ఉన్నాయి. పురాతనమైన ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నేను ఉండటం ఆనందంగా ఉంది. – ఆనందరావు, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు -
ఆపిల్ బేర్ సాగు.. లాభాలు బాగు
● ప్రత్యామ్నాయ పంటల వైపు అన్నదాతల చూపు ● తోటి రైతులకు ఆదర్శం..సారంగాపూర్: జిల్లా వ్యవసాయ ఆధారితం. సాగునీటి సౌకర్యం ఉండడంతో ఇక్కడి రైతులు ఎక్కువగా వరి పండిస్తుంటారు. తర్వాతి స్థానంలో మొక్కజొన్న, పత్తి వంటివి ఉన్నాయి. కొన్నాళ్లుగా రైతులు పంట మార్పిడి వైపు దృష్టి సారిస్తున్నారు. తమకున్న పొలంలో కొద్దిపాటి విస్తీర్ణంలో గంగనేరడి (ఆపిల్బేర్) పళ్ల సాగు చేపడుతున్నారు. ఈ పంట ను ఐదు, పది గుంటల్లో సాగుచేసినా ఊహించని లాభాలు వస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాశ్మీర్ ఆపిల్గా పిలిచే ఈ గంగనేరడి పండులో అధిక పోషకాలు ఉంటాయంటున్నారు వ్యవసాయ అధికారులు. ఎక్కువ కేలరీలు ఉన్నా.. ఫ్యాట్ అతితక్కువగా ఉండి కార్బొహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, విటమిన్ కే వంటివి పుష్కలంగా ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. 20 ఎకరాల్లో సాగు సారంగాపూర్ మండలంలో ఇప్పటికే 20 ఎకరాల్లో ఆపిల్బేర్ సాగుచేస్తున్నారు. మరింత మంది రైతులు సాగు చేయడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవిపల్లిలో ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. దీనికి ఉపాధి హామీ కింద ప్రోత్సాహం అందుతుండడంతో రైతులు ముందుకొస్తున్నారు. మొక్క ఖరీదు, గుంత తీయడం, నాటడం, మూడేళ్ల వరకు నిర్వహణ ఖర్చులు రైతులకు అందుతున్నాయి. మొక్కలను ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూర్ నుంచి తెప్పిస్తున్నారు. ఎనిమిది నెలల్లో మొదటి పంట చేతికి వస్తుంది. మొదటి ఏడాది 5 నుంచి 10 కిలోలు దిగుబడి ఇస్తుందని, మూడో సంవత్సరం వరకు 50 కిలోల నుంచి 70 కిలోల పంట చేతికొస్తుందని రైతులు అంటున్నారు. మూడో ఏడాది నుంచి ఎకరాకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు. ఫ్రూనింగ్ తప్పనిసరి ఆపిల్బేర్ పంట కాలం ముగిసిన వెంటనే మే, జూన్లో కొమ్మలను కత్తిరించాలని, తద్వారా కొత్తగా ఆకులు, కొమ్మలు వచ్చి దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతులు చెబుతున్నారు. -
గొర్రెలకాపరులకు పరిహారం అందిస్తాం
ధర్మారం(ధర్మపురి): విద్యుత్ షాక్తో మరణించిన గొర్రెలకు పరిహారం అందిస్తామని, బాధితులు ఆందోళన చెందవద్దని మంత్రి లక్ష్మణ్కుమార్ భరోసా ఇచ్చారు. చామనపల్లిలో విద్యుదాఘాతంతో 52 గొర్రెలు మరణించగా మంత్రి లక్ష్మణ్కుమార్ బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి గొర్రెలకాపరులను పరామర్శించారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో ప్రమాదవశాత్తు లారీపై నుంచి కిందపడి మరణించిన హమాలీ మెడవేని రాజేశం భార్య రాజేశ్వరికి రూ.5లక్షల సాయం చెక్కు అందజేసి మాట్లాడారు. ఇచ్చిన మాటప్రకారం సింగిల్విండో ద్వారా రూ.3 లక్షలు, కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా రూ.2లక్షలను బాధిత కుటుంబానికి అందించామన్నారు. చామనపల్లిలో మృత్యువాతపడ్డ ఒక్కో గొర్రెకు రూ.7వేల చొప్పున విద్యుత్ శాఖ ద్వారా పరిహారం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ధర్మారం, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్పర్సన్లు రూప్లానాయక్, ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్, డీసీవో శ్రీమాల, డీఎంవో ప్రమీణ్రెడ్డి, మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, మాజీ వైస్చైర్మన్ కాడే సూర్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అశోద అజయ్, నాయకులు ఓరం చిరంజీవి, ఎండీ అష్ష్యు, ఎల్లయ్య, ఈదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ గొర్రెల కాపరుల కుటుంబాలకు పరామర్శ -
పోషణతో కూడిన విద్య అందించడమే లక్ష్యం
ధర్మపురి: అంగన్వాడీ కేంద్రాల్లో పోషణతో కూడిన విద్య అందించడమే లక్ష్యమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. అమ్మమాట – అంగన్వాడీబాటలో భాగంగా మండలంలోని దొంతా పూర్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల నమోదు, ప్రీస్కూల్ హాజరు పెంచడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆట పాటలతో విద్యనందించనున్నట్లు వెల్లడించా రు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించి వసతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూదన్, జిల్లా సంక్షేమాధికారి నరేశ్, సిడిపివో వాణిశ్రీ, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లున్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంమేడిపల్లి: ఆరోగ్య తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భీమారం మండలకేంద్రంలో రూ.1.43 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. 97 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 27మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మేడిపల్లి మండలం వల్లంపల్లిలో కాకతీయ కెనాల్పై రూ.2.50కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. భీమారం మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోందని, ప్రజల కోరిక మేరకు వారు సూచించిన ప్రదేశంలోనే ఆసుపత్రి నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, చేపూరి నాగరాజు, బద్దం రాజేందర్ రెడ్డి, నీరటి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. భూవివాదంలో ఒకరి ఆత్మహత్యాయత్నం మెట్పల్లిరూరల్: తాను కొనుగోలు చేసిన భూమిని ఇతరులకు విక్రయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెట్పల్లి మండలం చౌలమద్దిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన వనతడుపుల నాగేశ్వరవరప్రసాద్ కొన్నేళ్ల క్రితం చౌలమద్ది శివారులోగల భూమి కొన్నాడు. డబ్బులు చెల్లించినా.. ఆ భూమిని ఓ కుల సంఘం పెద్దమనుషులు తనకు కాకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారు. తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగినా ఇవ్వకపోవడంతో విసుగు చెందిన నాగేశ్వరవరప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వద్ద ఓ నోట్ లభ్యమైంది. మెట్పల్లి సీఐ అనిల్, ఎస్సై కిరణ్కుమార్ బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. -
సబ్సిడీ ఇవ్వాలి
మక్కలకు కనీసం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి. దీనివల్ల రైతులకు కొంతలో కొంత మేలు జరుగుతుంది. నేను ఐదు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే.. విత్తనాల ఖర్చే రూ.10 వేలు అవుతోంది. సబ్సిడీ ఇస్తే నాలాంటి రైతులకు కొంత ఖర్చు తగ్గుతుంది. – సత్యనారాయణ రెడ్డి, సారంగాపూర్ ఎలాంటి సబ్సిడీ లేదు ప్రస్తుతం మొక్కజొన్న విత్తనాలపై ఎలాంటి సబ్సిడీ లేదు. ప్రభుత్వం తరుపున విత్తనాలు అందించడం లేదు. ప్రైవేట్ కంపెనీలు ఓపెన్ మార్కెట్లో మొక్కజొన్న విత్తనాలు అమ్ముకుంటున్నాయి. నమ్మకమైన, నాణ్యమైన సంస్థ నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచిస్తున్నాం. లేకుంటే రైతులు నష్టపోయే ప్రమాదముంది. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
ఆర్ట్లో నైపుణ్యం సాధించా
ఎంటెక్ పూర్తి చేశా. ప్రస్తుతం జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నా. ఆర్ట్, డ్రాయింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. కోర్సులో భాగంగా చాలా రకాల వాటిని తయారు చేశా. కలెక్టర్ కూడా ఇంప్రెస్ అయ్యారు. – హెచ్.రోజా, కరీంనగర్ క్రాఫ్ట్ వర్క్ నేర్చుకున్నా కరీంనగర్లో జరిగిన టీటీసీసీ లో ప్రతిరోజు క్లాసులకు హాజ రయ్యా. క్రాఫ్ట్ వర్క్ బాగా నే ర్చుకున్నా. పూల బుట్టి, ఆకులతో పలు రకాల వస్తువులు తయారు చేశా. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశా. ఇలాంటి కోర్సులు మాకు ఉపాధినిచ్చే విధంగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరు కోర్సు చేయాలి. – ఎల్.లక్ష్మి, ఇందారం, మంచిర్యాల టైలరింగ్లో శిక్షణ.. బీకామ్ డిగ్రీ చేశా. గతంలో శిశు గృహ తదితర సంస్థల్లో పని చేశా. కోర్సు పూర్తి చేసి స్కూళ్లలో చిన్నారులకు నేర్పించాలనుకుంటున్నా. టైలరింగ్లో అల్లికలు తదితర వాటిని బాగా నేర్చుకున్నా. ట్రైనర్స్ బాగా చెప్పారు. ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే శిక్షణ ఇది. – ఇ.సంధ్య, గాలిపెల్లి, సిరిసిల్ల -
దొంగను పోలీసులకు పట్టించిన రైతులు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని మోతె బైపాస్ రోడ్డులో వ్యవసాయ మోటార్లు, విద్యుత్ వైర్లను ఎత్తుకెళ్తున్న దొంగను రైతులు పట్టుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన యువకులు ఆదాబ్, సయ్యద్, సాహెబ్ కొద్దికాలంగా మోతె శివారులోని మోటార్లు, విద్యుత్ వైర్లు, స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు నిఘా పెట్టారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద సలాకలు, మోటార్ వైర్లు దొంగలించి తీసుకెళ్తుండగా రైతులు వెంటపడ్డారు. ఇద్దరు దొంగలు పారిపోయారు. ఒక దొంగను పట్టుకున్న రైతులు పోలీసులకు అప్పగించారు. ఏడాదికాలంగా దాదాపు 30 నుంచి 40 విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు దొంగలు ఎత్తుకెళ్లారని, గతంలో కూడా దొంగలను పోలీసులకు పట్టిస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
లోకల్ కోర్టుల ద్వారా విద్యుత్ సమస్యలు పరిష్కారం
మెట్పల్లి: అపరిష్కృతంగా మిగిలిపోయిన విద్యుత్ సమస్యలకు లోకల్ కోర్టుల ద్వారా పరిష్కారం లభిస్తోందని రెండో సీజీఆర్ఎఫ్ నిజామాబాద్ లోకల్ కోర్టు చైర్మన్ నారాయణ అన్నారు. మెట్పల్లి పట్టణంలో బుధవారం లోకల్ కోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని తెలిపిన ఆయన.. విద్యుత్ అధికారులు, సిబ్బంది మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. విద్యుత్ ఆదా కోసం రైతులు కెపాసిటర్లు బిగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది సెల్ఫోన్ నంబర్లను గోడలపై రాయించాలని ఆదేశించారు. సీజీఆర్ఎఫ్ మెంబర్ టెక్నికల్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ కిషన్, ఎస్ఈ సాలియానాయక్, మెట్పల్లి డీఈ గంగారాం, ఏడీఈలు మనోహర్, రఘుపతి, ఏఈలు రవి, ప్రదీప్, శివకుమార్, శ్రీనివాస్, అజయ్ పాల్గొన్నారు. నేడు విద్యుత్ కట్ ప్రాంతాలుజగిత్యాలజోన్: జిల్లాకేంద్రంలోని టౌన్–3 సెక్షన్ పరిధిలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎన్పీడీసీఎల్ డీఈ రాజిరెడ్డి తెలిపారు. గాంధీనగర్ 11 కేవీ విద్యుత్ ఫీడర్పై చెట్లకొమ్మలు తొలగించాల్సి ఉందని, తీన్ఖీని చౌరస్తా, పెద్ద మసీదు, కటికెవాడ, మంచినీళ్ల బావి, ఇస్లాంపుర, గాంధీనగర్, తెనుగువాడ, దగ్గులమ్మ గుడి, ఉస్మాన్పురా, మహబూబ్పుర, రహమత్పురా, జెండామహిళా, ప్యారాబాయ్, గోరేమియా, ఖిలాగడ్డ, తులసీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు గమనించాలని సూచించారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలిమల్యాల: ప్రతి ఒక్కరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ సూచించారు. మల్యాల మండలం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. టీబీ, హెచ్ఐవీ, డయాబెటిస్, బీపీ తదితర పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ వహించాలన్నారు. చెత్తాచెదారం, మురికినీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, వైద్యులు మౌనిక, సౌజన్య, ఎంఎల్హెచ్పీ సుష్మిత, ప్రకాశ్, రమేశ్, సాజిద్ పాల్గొన్నారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలుజగిత్యాల: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేశామని డీఈవో రాము అన్నారు. జగిత్యాలలోని పలు పాఠశాలలను బుధవారం పరిశీలించారు. వాష్రూమ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని, తాగునీటి వసతి కల్పించామని తెలిపారు. తొలిరోజే విద్యార్థులకు నోట్బుక్లు, టెక్ట్బుక్లు ఇస్తామన్నారు. మధ్యాహ్న భోజనంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామసభలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ధర్మపురి: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని డీఈవో అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని కమలాపూర్, నక్కలపేట పాఠశాలలను సందర్శించారు. వసతులు, సౌకర్యాలు, డిజిటల్ బోధన, ఇంగ్లిష్ విద్యపై పిల్లలు, తల్లిదండ్రులకు వివరించారు. ఎంఈవో సీతామహాలక్ష్మి, ఉపాధ్యాయులు మ్యాన పవన్కుమార్, ఆసిఫ్, ప్రీతి, సంపూర్ణ తదితరులున్నారు. -
ప్రభుత్వ పాఠశాలలోనే చదువు
–సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే జగిత్యాలలోని వీక్లీబజార్లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఉపాధ్యాయులందరూ బాధ్యతగా పాఠాలు చెప్పేవారు. ఆ అనుభూతి వేరు. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చు. స్కూల్లో స్నేహితులతో కలిసి అనేక క్రీడలు ఆడేవాడిని. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంది. డాక్టర్ అయ్యాను. ప్రజలకు సేవ చేస్తూ ఎమ్మెల్యేగా గెలుపొందాను. ఈ తరం విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. -
రైతుల్లో సాగు విధానం మారాలి
రైతులు వరి సాగునే ప్రధానంగా ఎంచుకుంటున్నారు. ఆపిల్బేర్ సాగును కొన్ని గుంటల్లో సాగుచేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి. మొక్కలను నాటిన మొదటి ఏడాది నుంచే కాత మొదలవుతుంది. ఈ విషయాన్ని రైతులు తెలుసుకోవాలి. – భ్యూ ప్రభాకర్, లక్ష్మీదేవిపల్లి సాగు చేసే రైతులకు ప్రోత్సాహం ఆపిల్బేర్ పంట సాగుచేయాలనుకునే రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నాం. మొక్కలను ఖమ్మం, గుంటూర్ నుంచి తెప్పిస్తున్నాం. వివరాలకు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహమీ ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలి. – గంగాధర్, ఎంపీడీవో -
సాంకేతిక శిక్షణ.. భవిష్యత్తుకు నిచ్చెన
● ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు ● టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్లలో 42 రోజులపాటు.. ● పూర్తి చేసిన 89 మంది పురుషులు, 680 మంది మహిళలు నప్తగిరికాలనీ(కరీంనగర్): తమ చిన్ననాటి కలలను ఇప్పుడు సాకారం చేసుకుంటున్నాముని కొందరు.. నేర్చుకుంటున్న కళను ఇంకా మెరుగుపర్చుకుందామని మరికొందరు.. స్కూల్లో పిల్లలకు పెట్టే టాస్క్లో మేము సైతం సాయం చేద్దామని ఇంకొందరు.. ఉపాధి కోసమని.. ఉద్యోగం సాధించాలని.. పది మందికి ఉపాధి కల్పించాలని ఇలా ఎవరికి వారు తమ ఆశయాలు, లక్ష్యం సార్థకం చేసుకునేందుకు సిద్ధమయ్యారు నారీమణులు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ కళలకు వయస్సుతో సంబంధం లేదని కరీంనగర్ మంకమ్మతోటలోని ధన్గర్వాడీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ కోర్సు(టీటీసీసీ)లో ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. 42 రోజులపాటు సాగిన కోర్సు బుధవారంతో పూర్తయింది. ఈక్రమంలో శిక్షణ పొందిన మహిళల అనుభవాలు, భవిష్యత్ కార్యాచరణపై సాక్షి ప్రత్యేక కథనం. 42 రోజుల శిక్షణ ధన్గర్వాడీ పాఠశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, మంచిర్యాల, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల నుంచి 89 మంది పురుషులు, 680 మంది మహిళలు మొత్తం 769 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ పొందారు. మే 1న కోర్సు ప్రారంభించగా.. జూన్ 11తో ముగిసింది. టైలరింగ్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్లలో 42 రోజులపాటు శిక్షణ పొందారు. 469 మంది డ్రాయింగ్లో, 360 మంది టైలరింగ్, క్రాఫ్ట్లలో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ కోర్సు డైరెక్టర్ బొట్ల రామస్వామి పర్యవేక్షణలో టీటీసీసీ శిక్షణ కార్యక్రమాలు పకడ్బందీగా పూర్తయ్యాయి. -
ఎల్లమ్మ తల్లికి బోనాలు
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అమ్మవారికి బెల్లం, పుట్నాలు, కల్లు, కోళ్లు నైవేద్యంగా సమర్పించారు. తమను సల్లంగా చూడు తల్లి అంటూ వేడుకున్నారు. అనంతరం సహంపక్తి భోజనాలు చేశారు. భక్తుల ద్వారా ఆలయానికి రూ.82,887 ఆదాయం, 10 గ్రాముల మిశ్రమ వెండి, 9 అమెరికా డాలర్స్ వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. -
సమస్యల ఒడి
ఇది కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్లోగల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల. అదనపు తరగతి గదులకు స్లాబ్ వరకు నిర్మాణం చేపట్టి వదిలేశారు. ఇందులో కూర్చోవాలంటే విద్యార్థులకు ఇబ్బందికరంగానే ఉంటుంది. త్వరితగతిన పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.● స్వాగతం పలుకుతున్న ఇబ్బందులు ● టాయిలెట్స్కు మరమ్మతు కరువు ● పారిశుధ్యమూ అంతంతే.. ● రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభంమన ఊరు మన బడి కింద ఎంపికై న పాఠశాలలు : 277విద్యార్థుల సంఖ్య : 57,552బడ్జెట్ : రూ.1.19కోట్లు పూర్తయిన స్కూళ్లు : 48మంజూరైన కాంపోనెంట్స్ : 1087పూర్తయిన కాంపోనెంట్స్ : 446చదువుల బడి.. ఇది మల్యాల మండలకేంద్రంలోని ఒడ్డెరకాలనీలోని మండల పరిషత్ పాఠశాలలో గల టాయిలెట్స్. ఈ టాయిలెట్స్ చుట్టూ చెట్లపొదలతో నిండిపోయాయి. పారిశుధ్యం చేయించాల్సిన అవసరం ఉంది. స్కూల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో పారిశుధ్యం చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.జగిత్యాల: జిల్లాలో పాఠశాలలు ఈనెల 12 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రకాల చర్యలు సైతం చేపట్టింది. ఇటీవలే ఎమ్మార్సీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కల్పించింది. ఈసారి పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా 4వ స్థానం సాధించడంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతోంది. అయితే మౌలిక వసతులే ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మన ఊరు మన బడి పథకం కింద రూ.1.19 కోట్లు మంజూరయ్యాయి. ఈ పథకం కింద జిల్లాలో 277 స్కూళ్లు ఎంపికై నప్పటికీ 48 స్కూళ్లు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. అలాగే టాయిలెట్స్, కలర్స్, బెంచీలు, కిచెన్షెడ్స్ (కాంపోనెంట్స్) తదితర 1087 మంజూరు కాగా.. 446 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే అమ్మ ఆదర్శ పథకం కింద 517 ఎంపిక కాగా.. 282 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా మరమ్మతు చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బడిబాట ప్రారంభం ఈనెల ప్రారంభం నుంచే జిల్లాలో బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నా ణ్యమైన విద్య అందుతోందని, ప్రతిఒక్కరూ పాఠశాలలకు రావాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లలను గుర్తిస్తున్నారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. పాఠ్య పుస్తకాలు రాక జిల్లాకు 3,80,760 పుస్తకాలు అవసరం కాగా.. ఇప్పటి వరకు 3,50,920 పుస్తకాలు మాత్రమే వచ్చాయి. వాటిని ఆయా స్కూళ్లకు పంపిణీ చేశా రు. అలాగే జిల్లాలో మొత్తం 57,552 మంది విద్యార్థులు ఉండగా.. 83 శాతం మందికి యూనిఫామ్స్ అందించారు. ఇంకా 17 శాతం వరకు విద్యార్థులకు యూనిఫామ్స్ అందించాల్సి ఉంది. పారిశుధ్యం అంతంతే.. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో అమ్మ ఆదర్శ పథ కం కింద స్కాంవెంజర్లను ఏర్పాటు చేసుకున్నప్పటి కీ కొన్నిచోట్ల పారిశుధ్యం అంతంతగానే ఉంది. టా యిలెట్స్ పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోయా యి. పాఠశాలల ఎదుట ఏపుగా ముళ్లపొదలు నిండిపోయాయి. అధికారులు స్పందించి పారిశుధ్యం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎఫ్ఆర్ఎస్ అమలు గతంలో ఉపాధ్యాయుల హాజరు నమోదు చేసేందుకు బయోమెట్రిక్ ఏర్పాటు చేసినప్పటికీ అది ఆశించిన మేరకు ఫలితం ఇవ్వలేదు. దీంతో దానిని ఎత్తివేశారు. విద్యార్థులకు ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేస్తున్నారు. తాజాగా.. ఉపాధ్యాయులకూ ఈ విధానం తీసుకురావాలని భావించిన ఉన్నతాధికారులు.. ఈ ఏడాది నుంచే అమలవుతుందని చెబుతున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు స్కూల్కు వెళ్లకపోవడం, అటెండెన్స్ వేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ తప్పనిసరి అయ్యింది. ఈ విధానం ద్వారా పూర్తిస్థాయిలో పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.ఈ చిత్రం కోరుట్ల పట్టణంలోని కటికెవాడలోగల ప్రాథమిక ఉన్నత పాఠశాల. గది కూలిపోయి శిథిలావస్థకు చేరింది. ఇప్పటివరకు మరమ్మతు చేయించలేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుంది. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించాం. విద్యార్థులకు మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులకు అన్ని అంశాలపై శిక్షణ ఇచ్చాం. ప్రతిరోజు ఉపాధ్యాయులు ఎలా చెబుతున్నారని పర్యవేక్షిస్తాం. మంచి ఫలితాలు తీసుకుచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – రాము, డీఈవో -
రాయికల్ బల్దియా అభివృద్ధికి రూ.15 కోట్లు
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ రాయికల్: రాయికల్ బల్దియా అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, యువజన సంఘాల నాయకులు రాంమూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిధులకు త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యేను కలిసిన గౌడ సంఘం నాయకులు జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్కు చెందిన గౌడ యువజన సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. సంఘం భవనానికి గతంలో నిధులు మంజూరయ్యాయని, బోర్వెల్, ప్రహరీకి కూడా సహకరించాలని కోరారు. నాయకులు వెంకటరాజం, జలేందర్, ధర్మరాజు, నాగరాజు, సత్తయ్య, గణేశ్, కృష్ణ పాల్గొన్నారు. శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలి జగిత్యాల: నూకపల్లి వద్దగల డబుల్బెడ్రూం ఇందిరమ్మ కాలనీలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డబుల్బెడ్రూం ఇళ్లలో వసతుల కల్పనకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నరేందర్, రమేశ్, స్వామి, విజయ్, ఖలీల్, శ్రీను పాల్గొన్నారు. ఓల్డ్పెన్షన్ స్కీం వర్తింపజేసేలా చూడాలి తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఓల్డ్పెన్షన్ స్కీం వర్తింపజేసేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. నూకపల్లిలోని శ్రీజ్ఞానద్యాన విజ్ఞాన సరస్వతి ఆలయ కమిటీ సభ్యులు కలిసి 11వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. -
‘సాక్షి’పై దాడి అప్రజాస్వామికం
● ఏపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి ● కొమ్మినేని అరెస్టు గర్హనీయం ● జర్నలిస్టుల సంఘాల నిరసనకరీంనగర్: ఏపీలో ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానళ్ల కార్యాలయాలపై టీడీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు అప్రజాస్వామికమని, మీడియా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్దమని టీయుడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్, ‘సాక్షి’ దినపత్రిక ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్చార్జి భాషబోయిన అనిల్కుమార్ పేర్కొన్నారు. ఏపీలో ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ మంగళవారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపులను తీవ్రంగా ఖండించారు. ఇటీవల ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి మీద కేసులు బనాయించడం, తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం, సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్ప డటం భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఉందని మండిపడ్డారు. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చేలా ఉన్న ఏపీ ప్రభుత్వ చర్యలను దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఏపీ సర్కారు పత్రికా కార్యాలయాలపై, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగిస్తే అదేస్థాయిలో నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులు ఎలగందుల రవీందర్, బల్మూరి విజయసింహారావు, ఈద మధుకర్రెడ్డి, ఏలేటి శైలేందర్రెడ్డి, జీఎస్ ఆనంద్తో పాటు సీనియర్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలి
● డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మెట్పల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు అయ్యేలా చూడాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలతో సమావేశమయ్యారు. 100 శా తం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అయ్యేలా గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు పండ్లు అందించారు. మెట్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లను తనిఖీ చేశారు. జిల్లా మాతా శిశుప్రొగ్రాం అధికారి జైపాల్రెడ్డి, మెట్పల్లి మండల వైద్యాధికారి అంజిత్రెడ్డి పాల్గొన్నారు. వికసిత్ కృషి సంకల్ప్ ద్వారా రైతులకు అవగాహన సారంగాపూర్: కేంద్ర ప్రభుత్వ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ద్వారా రైతులకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాల యం శాస్త్రవేత్త పద్మజ తెలిపారు. బీర్పూర్ మండలం చిత్రవేణిగూడెంలో రైతులకు అవగా హన కల్పించారు. పంటల ఉత్పత్తిని పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానం, పంట మార్పిడి, యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. ఎ రువుల వినియోగం, చీడపీడలు, తెగుళ్ల ని వారణకు రైతులు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలన్నారు. ఏడీఏ తిరుపతి, ప్రదీప్రెడ్డి, ఏఈవోలు పాల్గొన్నారు. అంగన్వాడీకేంద్రాల్లోనే పోషకాహారం మల్యాల: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందిస్తూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్తుతున్నారని, ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యా బోధిస్తున్నామని మ ల్యాల సీడీపీఓ వీరలక్ష్మి అన్నారు. మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం అమ్మమాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి కార్యక్రమం ప్రాధాన్యతను తల్లులు, ఆరోగ్యలక్ష్మీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ టీచర్లకు వివరించారు. సూపర్వైజర్ శారద, అంగన్వాడీ టీచర్లు స్వప్న, రాణి, తల్లులు పాల్గొన్నారు. తాండ్య్రాలకు బస్సు సౌకర్యం కల్పించాలి కథలాపూర్: మండలంలోని తాండ్య్రాల గ్రామానికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరుట్ల ఆర్టీసీ అధికారులకు మహిళలు వినతిపత్రం ఇచ్చారు. తాండ్య్రాల మీదుగా గంభీర్పూర్కు బస్సు వెళ్తున్నప్పటికీ అందులో ప్రయాణికుల రద్దీ ఉండటంతో తాండ్య్రాలలో బస్సులు ఆపడంలేదన్నారు. మహిళలు ఫుట్ బోర్డు ప్రయాణిం చేయాల్సి వస్తుందన్నారు. అధికారులు చొరవ చూపి ప్రత్యేకం బస్సు సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలిజగిత్యాలరూరల్:జిల్లాలోని మహిళా సంఘాల బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఐకేపీ ఏపీడీ చరణ్దాస్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల పదాధికారులకు శిక్షణ కల్పించారు. అన్ని మండలాల్లో కొత్తగా ఎన్నికై న మహిళా సంఘాల సభ్యులకు రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విధులు, బాధ్యతలు, సంఘాల నిర్వహణ, కట్టుబాట్లు, ఆర్థిక లావాదేవీలపై శిక్షణ ఉంటుందన్నారు. ప్రభుత్వం ద్వారా అందే సేవలను సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా శాఖల సమన్వయంతో స్వశక్తి సంఘాల పర్యవేక్షణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. -
ముదురుతున్న ఫ్లెక్సీల రగడ
జగిత్యాల: డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్కు మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. అయితే ఫ్లెక్సీల ఏర్పాటు గందరగోళంగా మారింది. అడ్లూరికి శుభాకాంక్షలు తెలుపుతూ.. జిల్లాకేంద్రంలో మాజీమంత్రి జీవన్రెడ్డి వర్గీయులు, ఎమ్మెల్యే సంజయ్కుమార్ వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జీవన్రెడ్డి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలో ‘ఒరిజినల్ కాంగ్రెస్’ అని రా యడం చర్చనీయాంశంగా మారింది. ఇది కాస్త సోషల్ మీడియాలో రగులుతోంది. మరికొందరు ఎమ్మెల్యే ఫొటోతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాకు మంత్రి పదవి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతున్నా.. జిల్లాకేంద్రంలో మాత్రం ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుటుండడం విశేషం. పోటాపోటీగా జీవన్, సంజయ్ వర్గీయుల ఫ్లెక్సీలు ఏర్పాటు జిల్లాకేంద్రంలో వేడెక్కిన రాజకీయం -
వార్డుల విభజన శాసీ్త్రయంగా చేయండి
జగిత్యాలటౌన్: జగిత్యాల బల్దియాలో వార్డుల పెంపు ప్రక్రియను శాసీ్త్రయంగా చేపట్టాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఇందిరాభవన్ నుంచి కాంగ్రెస్ నాయకులతో కలిసి బల్దియా కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. బల్దియా కమిషనర్ స్పందనకు లేఖ అందించారు. 48 వార్డులున్న బల్దియాలో 50 వార్డులకు విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ముసాయిదా రూపకల్పనలో అధికారులు గందరగోళానికి తెరతీశారని పేర్కొన్నారు. నూకపల్లి అర్బన్ కాలనీని 49, 50 వార్డులుగా విభజిస్తే స్థానికులకు సౌకర్యాలు అందుతాయన్నారు. అర్బన్కాలనీలో ఇళ్లు కేటాయించిన 3500 కుటుంబాల సభ్యులు సుమారు ఏడు వేల మందిని 11వ వార్డులో చేర్చుతూ ముసాయిదా రూపొందించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్లు తాటిపర్తి విజయలక్ష్మి, జీఆర్ దేశాయ్, నాయకులు ఉన్నారు. -
మ్యాపుల్లో సమస్తం
సర్వే సమగ్రం..జగిత్యాల: గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు అధికం. రకరకాల సమస్యలతో రైతులు అనేక ఇబ్బంది పడుతుంటారు. రెవెన్యూ రికార్డు (పహాణి)ల్లో తప్పులు నమోదు కావడం.. సర్వే నంబర్ల వారీగా మ్యాప్లు లేకపోవడం.. కొన్ని గ్రామాల్లో కనీసం నక్షలు లేకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. వీటిని ఆసరా చేసుకుంటున్న కొందరు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం.. మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రిజిస్ట్రేషన్లకు తప్పకుండా మ్యాప్ ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. నక్షలు లేని గ్రామాల్లో సర్వే చేపట్టి మ్యాప్లకు రూపకల్పన ఇవ్వాలనే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని బీర్పూర్ మండలం కోమనపల్లిని ఎంపిక చేశారు. ఈ గ్రామంలో నక్ష లేకపోవడంతో పహాణీల్లో ఉన్న నంబర్ల ఆధారంగా సర్వే చేపట్టి మ్యాప్లు రూపొందిస్తారు. సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ, రెవెన్యూ ఆధ్వర్యంలో ప్రైవేటు ఏజెన్సీ మార్వెల్ జియో ఫేషియల్ సొల్యుషన్స్ ప్రైవేటు లిమిటెడ్తో కలిసి సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఆ గ్రామంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామసభ ఏర్పాటు చేశారు. కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ నుంచి ఆదేశాలు రావడంతో సర్వే మొదలుపెట్టారు. గ్రామంలో పూర్తి సర్వే చేసిన అనంతరం పహాణీల్లో ఉన్న సర్వే నంబర్ల ప్రకారం మ్యాప్లను జారీ చేస్తారు. వారం రోజుల్లో పూర్తి బీర్పూర్ మండలం కోమనపల్లిలో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న భూ సర్వే వారం రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే రెండుసార్లు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ బీఎస్.లత ఆధ్వర్యంలో వారికి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించి సర్వే గురించి వివరించారు. వారం రోజుల్లోపు సర్వే పూర్తి చేసి వారి సర్వే ప్రకారం నక్ష పటాలు అందించనున్నారు. ఇది విజయవంతం అయితే మరిన్ని గ్రామాల్లోనూ సర్వే చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మరికొన్ని గ్రామాల్లో.. జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బీర్పూర్ మండలం కోమనపల్లిలో చేపడుతున్న సమగ్ర సర్వేతో మ్యాప్ల రూపకల్పన మరికొన్ని గ్రామాల్లో చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లాలో ఎలాంటి మ్యాప్లు లేకుండా.. నక్షలు లేకుండా జిల్లాలో 16 గ్రామాలు ఉండగా ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద కోమనపల్లిలో సర్వే చేపడుతున్నారు. కోమన్పల్లిలో 624 ఎకరాలు కోమన్పల్లి గ్రామ పంచాయతీ కింద డొంకేశ్వరం, అన్నారం శివారు గ్రామాలుగా ఉన్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 1983–84లో బీర్పూర్ మండలం కోమన్పల్లి శివారుల్లో ముంపు బాధితులకు పునరావాసం కల్పించి.. ప్రభుత్వ భూములు అందించి వాటిని వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా మార్చింది. బాధితులందరికీ భూములపై హక్కులు కల్పిస్తూ.. వారికి డీ–1 సర్టిఫికెట్లను అందించింది. శ్రీరాంసాగర్ నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడి పరిస్థితులను చాలామంది తట్టుకోలేక ప్రభుత్వం వారికి కేటాయించిన భూములను స్థానిక రైతులకు అమ్ముకున్నారు. ప్రభుత్వం అందించిన డీ–1 సర్టిఫికెట్లను భూములు కొనుగోలు చేసిన వారికి అందించి తిరిగి వెళ్లిపోయారు. భూముల వివాదాలకు చెక్ పైలెట్ ప్రాజెక్ట్గా కోమనపల్లి ఎంపిక విజయవంతమైతే మరిన్ని గ్రామాల్లో అమలు వివాదాలకు చెక్ సర్వేలో భాగంగా గ్రామంలోని భూములకు హద్దులు గుర్తిస్తారు. ఇందులో ఏ సర్వేనంబర్లు ఎందులో ఉన్నాయి..? అసైన్డ్ భూములు, గ్రామకంఠం భూములు ఎన్ని ఉన్నాయి..? అన్నది చూసి అనంతరం సర్వే చేపడతారు. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లకు అధికారులు బై నంబర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇందులో కొన్ని గొడవలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక రైతుకు చెందిన భూమిలో ఎక్కువ సర్వేనంబర్లు ఉండటంతో రికార్డుల్లో ఉన్న భూమికి.. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి అనేక తేడాలు ఉండటంతో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. భూ విస్తరణ ఒకలా.. కాగితాల్లో మరొలా ఉండటంతో సమస్యలు తలెత్తేవి. ఇప్పుడు అలాంటివి లేకుండా మ్యాప్లు తయారుచేసి ఇస్తారు. అనంతరం ఎవరైనా క్రయవిక్రయాలు చేసుకున్నా మ్యాప్ల ద్వారానే ఇస్తారు. ఈ సర్వేకు డ్రోన్ కెమెరాలు, అత్యాధునిక కెమెరాలతో సర్వే చేపడతారు. -
సమస్యల పరిష్కారానికే ‘రైతు మిత్ర’
జగిత్యాలఅగ్రికల్చర్: సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే రైతుమిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం రైతు మిత్ర కార్యక్రమాన్ని రైతులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో నేరుగా సమావేశమై ఎలాంటి విత్తనాలు వాడాలి..? ఎలాంటి ఎ రువులు ఎంచుకోవాలి..? చీడపీడలకు ఎలాంటి మందులు కొట్టాలి..? అనే దానిపై సమగ్ర స మాచారం తెలుసుకోవచ్చని వివరించారు. ప్రతి సో మవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు జగిత్యాల, ధర్మపురి, మెట్పల్లి ఏడీఏ కార్యాలయాల్లో రైతుమిత్ర కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ తిరుపతి నాయక్, పొలాస శాస్త్రవేత్తలు శ్రీనివాస్, రజనీకాంత్, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ కోర్సులపై సందేహాలా?
● నేడు జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విష్ణువర్ధన్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం7తేదీ : 10–06–2025 సమయం: మంగళవారం : ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకురామగిరి: మీరు ఇంజినీరింగ్ కోర్సులు చదవాలనుకుంటున్నారా? ఏ కోర్సులో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది? కొత్త కోర్సులు ఏమిటి? వాటితో ప్రయోజనాలు ఏమిటి? మీకు ఇష్టమైన కోర్సుల ఎంపిక, కొత్త కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు.. తదితర అంశాల్లో ఏమైనా సందేహాలు ఉంటే ‘సాక్షి’ మీకోసం మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విష్ణువర్ధన్తో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. ఫోన్లో ఆయనతో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి.సంప్రదించాల్సిన ఫోన్ నంబరు 94935 48242 -
రెండే కోర్సులు.. అనేక సమస్యలు
మెట్పల్లి: ప్రభుత్వ నిర్లక్ష్యంతో మెట్పల్లి ప్రాంతంలో పేద విద్యార్దులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలలో తగిన కోర్సులు లేకపోవడం.. డిగ్రీ పూర్తయిన తర్వాత చదువు కొనసాగించడానికి పీజీ కళాశాల లేకపోవడంతో వందలాది మంది అర్ధాంతరంగా మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇంటర్ వరకు విద్యను అందించే విషయంలో చూపుతున్న శ్రద్ధ.. ఉన్నత విద్యపై చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. తద్వారా పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం ఆ రెండు కోర్సులే.. ● పట్టణ శివారులోని వెంకట్రావుపేటలో ఉన్న డిగ్రీ కళాశాలలో కేవలం బీకాం (కంప్యూటర్స్), బీఏ కోర్సులు మాత్రమే ఉన్నాయి. ● సైన్స్, మాథ్స్ కోర్సులు అందుబాటులో లేకపోవడం చాలామందిని అసంతృప్తికి గురి చేస్తోంది. ● కళాశాలలో మెట్పల్లితోపాటు మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటారు. ● వీటిలో మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు పలు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ● ఏటా వీటిలో నుంచి సుమారు 500 మంది విద్యార్థులు ఇంటర్ విద్యను పూర్తి చేస్తున్నారు. ● వీరిలో పేద కుటుంబాల విద్యార్థులకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్, మ్యాథ్స్ కోర్సులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ● చాలామంది ఈ కోర్సులు లేకపోవడం వల్ల చదువులను అర్ధాంతరంగా మానేస్తున్నారు. సౌకర్యాలు అంతంతే.. ● ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్న భవనం జూనియర్ కళాశాలకు చెందినది. ● కొన్నేళ్ల క్రితమే నిర్మించిన ఈ భవనంలో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ● ప్రధానంగా తరగతులు నిర్వహించే గదులకు ప్లాస్టరింగ్ చేయకుండానే వదిలేశారు. ● కిటీకీలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి తలుపులు బిగించలేదు. ● వర్షాకాలంలో భవనంపై నీరు నిలిచి గదులు ఉరుస్తున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● చుట్టూ ప్రహరీ లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. పీజీ కళాశాల ఊసే లేదు.. ● విద్యాపరంగా నియోజకవర్గంలో పీజీ కళాశాల ఏర్పాటు అవసరముంది. ● గతంలో కోరుట్లలో కొన్ని కోర్సులతో పీజీ కళాశాల ఉన్నప్పటికీ కొంతకాలం తర్వాత దానిని తీసివేశారు. ● ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం డిగ్రీలో పలు కోర్సులను అందుబాటులో ఉంచడంతోపాటు పీజీ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మెట్పల్లి డిగ్రీ కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం ఇబ్బంది పడుతున్న సిబ్బంది, విద్యార్థులు రూ.53లక్షలతో ప్రతిపాదనలు పంపాం కళాశాలలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 53లక్షలతో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. కొన్ని సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిధులు మంజూరైతే అవి పరిష్కారమవుతాయి. – వెంకన్న, ఇన్చార్జీ ప్రిన్సిపాల్ -
సీఎంను కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
జగిత్యాల: రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ సోమవారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. నేడు ధర్మపురికి మంత్రి రాక ధర్మపురి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మంగళవారం ధర్మపురికి రానున్నారు. ఉదయం 11 గంటలకు పత్తిపాక క్రాస్ రోడ్డు నుంచి ధర్మారం, వెల్గటూర్, రాయపట్నం మీదుగా ధర్మపురి చేరుకుంటారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. అక్కడి నుండి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలికథలాపూర్: భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని తాండ్య్రాల, గంభీర్పూర్ గ్రామాల్లో భూ భారతి గ్రామభలను సోమవారం పర్యవేక్షించారు. రైతు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పహాణీలు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కోరుట్ల ఆర్డీవో జీవాకర్రెడ్డి, తహసీల్దార్ వినోద్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నాగేశ్ పాల్గొన్నారు. దుబ్బరాజన్న సన్నిధిలో భక్తజనంసారంగాపూర్: దుబ్బరాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో రా జన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఆలయ ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త శంకరయ్య, ఆలయ సిబ్బంది భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపులకు అన్యాయంకథలాపూర్: కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేపట్టిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అన్యాయం జరిగిందని సంఘం జిల్లా అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో సంఘం జిల్లా ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రిగా అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మున్నూరు కాపుల సంఖ్య 49లక్షలు ఉంటుందని, అయినప్పటికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పునరాలోచించి విప్ ఆది శ్రీనివాస్ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు మల్లారెడ్డి, తిరుపతి, సుధాకర్, రాజేశ్, గంగాధర్, లింగారెడ్డి, గంగారెడ్డి పాల్గొన్నారు. -
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి
రాయికల్: ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో మండల అధ్యక్షుడిగా ఎలగందుల వీరేశం, ప్రధాన కార్యదర్శిగా నరేందర్, కోశాధికారిగా జక్క రంజిత్, కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడంతోపాటు, సామాజిక, సేవ రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బుడికె శ్రీకాంత్, పట్టణ వర్తక సంఘం అధ్యక్షుడు ఎలగందుల సత్యనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్త సురేశ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు జిల్లా లావణ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు. -
అడ్లూరి లక్ష్మణ్ అనే నేను..
● ఉమ్మడి జిల్లాకు మరో మంత్రి పదవి ● అడ్లూరి లక్ష్మణ్ను వరించిన అవకాశం ● విధేయతకు దక్కిన ప్రాధాన్యం ● మూడుకు చేరిన మంత్రుల సంఖ్య ● పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ముగ్గురు మంత్రులు ● కవ్వంపల్లికి విప్ ఇచ్చే అవకాశంధర్మపురికి అచ్చొచ్చిన మంత్రి పదవి తెలంగాణ ఏర్పాటు నుంచి జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి మంత్రివర్గంలో చోటు లభిస్తోంది. 2014లో గెలిచిన కొప్పుల చీఫ్విప్గా కేబినెట్ హోదా అందుకోగా, 2018లో సంక్షేమశాఖ మంత్రిగా వ్యవహరించారు. 2023లో గెలిచిన అడ్లూరి మొదట ప్రభుత్వ విప్గా, తాజాగా మంత్రిపదవి చేపట్టారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిపదవుల్లో పెద్దపీట దక్కింది. ఎన్న డూ లేని విధంగా ముగ్గురు మంత్రి పదవులను దక్కించుకోగా, గడ్డం వివేక్ సైతం ఉమ్మడి జిల్లాతో అనుబంధం కలిగి ఉన్నవారే. దీంతో మొత్తంగా రాష్ట్ర కేబినెట్లో జిల్లావాసులకు సముచిత స్థానం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు గానూ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయగా, దానికి తగ్గట్టుగా మంత్రి పదవులు దక్కాయనే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లానుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా కొనసాగుతుండగా, తాజాగా ధర్మపురి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అడ్లూరి లక్ష్మణ్ అదివారం రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా, అందులో ముగ్గురికి మంత్రి పదవులు దక్కటంతో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కాంగ్రెస అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన తొలిమంత్రివర్గ విస్తరణలో బ్రహ్మణ సామాజికవర్గానికి చెందిన శ్రీధర్బాబు, బీసీగౌడ్ నుంచి పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవులు దక్కాయి. మాదిగ సామాజికవర్గానికి చెందిన అడ్లూరి, ము న్నూరు కాపు అయిన ఆది శ్రీనివాస్లకు ప్రభుత్వ విప్లుగా అవకాశం కల్పించారు. ఆదివారం రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అడ్లూరికి మంత్రిపదవి లభించింది. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చివరి నిమిషంలో కేబినెట్లో చోటు దక్కకపోయినా.. ప్రభుత్వ విప్ ఇచ్చే అవకా శాలున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యే.. కేబినెట్లోకి సుదీర్ఘకాలంగా పార్టీలోనే కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్కుమార్కు మంత్రి పదవిరావడం విధేయతకు పట్టం కట్టినట్లయింది. కార్మిక క్షేత్రమైన గోదావరిఖని నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన అడ్లూరి ఎన్ఎస్యూలో స్టూడెంట్ లీడర్గా, యూత్ కాంగ్రెస్లో, జెడ్పీటీసీ, జెడ్పీచైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా వివిధ హాదాల్లో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రభుత్వ విప్గా కొనసాగగా, తాజాగా కేబినెట్లో చోటు సంపాదించారు. అడ్లూరి లక్ష్మణ్ నేపథ్యం 1982 నుంచి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పని చేశారు. 1986 నుంచి 94 వరకు ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2010–12 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా పని చేశారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2013–14వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పని చేశారు. 2018లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్గా ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయనకు కేబినెట్లో బెర్త్ కల్పించింది. -
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. భూభారతి అవగాహన సదస్సులను అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నందున, అధికారులు అవగాహన సదస్సుల్లో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణికి ఎవరూ రాకూడదని పేర్కొన్నారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యే సంజయ్జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. జిల్లాకేంద్రమైన జగిత్యాలలో విలీనమైన ప్రాంతాలకు రూ.20 కోట్లు, స్పెషల్ గ్రాంట్ కింద రూ.50 కోట్లు మున్సిపాలిటీకి కేటాయించారు. అలాగే రూ.15 కోట్లు రాయికల్ మున్సిపాలిటీకి మంజూరు చేసినందుకు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే గోపినాథ్ మృతి తీరని లోటుజగిత్యాల: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. అనేక లోటుపాట్లు ఎదుర్కొంటూ అంచలంచెలుగా ఎదిగారని, ఆయన మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చేప మందు పంపిణీజగిత్యాల: మృగశిరకార్తె పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ధన్వంతరి ఆలయంలో చేప మందును ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో తౌటు రాంచంద్రం, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఘనంగా స్వాతి నక్షత్రం పూజధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ దేవాలయం శ్రీఉగ్రనృసింహస్వామి దేవాలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పూజలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు వంశీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారిని రంగురంగుల పూలతో చూడముచ్చటగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి విప్ భూమిపూజ
మేడిపల్లి: పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రంతో పాటు, కట్లకుంటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. 67మందికి రూ.22.77 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఇంటిస్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, బొంగోని రాజగౌడ్, చేపూరి నాగరాజు, రావు శ్రీనివాస్రావు, సాయిని గంగారెడ్డి, బద్దం రాజేందర్ రెడ్డి, నీరటి మల్లేశం, పుప్పాల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి అడ్లూరికి అభినందనల వెల్లువ
ధర్మపురి: మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ధర్మపురికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శ్రీలక్ష్మినృసింహస్వామి ఫొటో, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, వావిలాల జగదీశ్వర్, లింగాల హరీశ్ ఉన్నారు. అభినందించిన ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల: మంత్రి అడ్లూరిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అడ్లూరి కాంగ్రెస్ యూత్ నాయకుడిగా, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా పదవులు చేపట్టి మంత్రి అవడం గొప్ప విషయమన్నారు. టీపీసీసీ సెక్రటరి బండ శంకర్, నాయకులు పాల్గొన్నారు. ముందుగా లక్ష్మణ్కుమార్ను మాజీమంత్రి జీవన్రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
జూన్ ఫీవర్
సాగు ఖర్చూ తడిసి మోపెడు.. ఉమ్మడి జిల్లాలో సుమారు 6,10,102 మంది రైతులు దాదాపు 12,82,207 ఎకరాల్లో వానాకాలం పంటలు పండిస్తారని అధికారులు అంచనా వేశారు. తొలకరితో పెట్టుబడి సమయం అసన్నమైంది. భూములను చదునుచేసి, దుక్కిదున్ని, విత్తనాలు, ఎరువులకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెరిగిన యాంత్రీకరణ, ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల కొరత రైతులను ఏటా వేధిస్తూనే ఉన్నాయి. దీనికితోడు అకాల వర్షాలు, చీడపీడలతో దిగుబడి తగ్గి అన్నదాతలు అప్పుల్లో ఊబీలో చిక్కుకుంటున్నారు. సాగులో ఖర్చు తగ్గించుకునేందుకు విత్తనాలు సొంతగా తయారు చేసుకోవడం, ఆధునిక సాంకేతికను వినియోగించుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయినా, పిల్లల చదువులు, వ్యవసాయ పెట్టుబడులు, సీజనల్ వ్యాధులతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. సాక్షి, పెద్దపల్లి: వేసవి సెలవుల్లో ఆటాపాలతో ఆనందంగా గడిపిన విద్యార్థులు.. పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. ఇదేసమయంలో తొలకరితో ఎరువులు, విత్తనాల కొనుగోలు తదితర ఖర్చులతో సామాన్యులు ‘వామ్మో.. జూన్’ అని ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు వానలతో మారుతున్న వాతావరణ పరిస్థితులతో సీజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం.. ఇలా అన్ని రకాల ఖర్చులు ఈనెలలో రానుండటంతో ఎలా గడపాలో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. జూన్ నెల పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు పుట్టిస్తోంది. పెన్సిల్ నుంచి పుస్తకాల వరకూ మోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 938 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో సుమారు 2,26,829 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం అంటేనే ఫీజులు, పుస్తకాలు, నోట్బుక్సులతోపాటు, వాటిని భద్రపరుచుకునేందుకు బ్యాగులు, లంచ్ బాక్స్లు, పెన్నులు, పెన్సిళ్లు, టైబెల్టులు, యూనిఫామ్స్.. ఇలా ఒక్కటేమిటి.. రకరకాల వస్తువులు ఆయా పాఠశాల్లోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. దీంతో యాజమాన్యాలు చెప్పిన ధర చెల్లించలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇంటర్ కళాశాలల్లో సైతం ఏసీ క్యాంపస్లు, నాణ్యమైన విద్యాబోధన పేరిట రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తుండడంతో ఆర్థికభారమైనా.. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం అప్పు లు తెచ్చిమరీ చెల్లిస్తున్నారు. స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల పేరిట నర్సరీ చదువులకే రూ.30వేలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నా.. పర్యవేక్షణ, నియంత్రణ మచ్చుకై నా కనిపించడం లేదు. భయపెడుతున్న వైరల్ ఫీవర్ ఒకసీజన్ నుంచి మరోసీజన్లోకి ప్రవేశించేటప్పుడు వాతావారణం చల్లబడి వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాల తీవ్రత ఉంటుంది. దోమల బెడత పెరిగి ప్రతీ పదిమందిలో నలుగురికి జ్వరం, గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో వైద్యం కోసం తరచూ ఆస్పత్రులకు వెళ్లేపరిస్థితి నెలకొని ఉంటోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో ఏటా జూన్, జూలైలో జ్వరాలతో ఆస్పత్రుల పాలై జేబులు గుల్లచేసుకునే వారు అధికంగానే ఉన్నారు. ఓపీ, టెస్టుల పేరిట ఆస్పత్రుల యాజమాన్యాలు పిండిపిప్పి చేస్తుండటంతో ఈవానాకాల అంటేనే జనాలు భయపడుతున్నారు. వ్యాధుల బారిన పడిన తర్వాత వైద్యఖర్చులకు భయపడడం కన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో డబ్బు ఆదాతోపాటు టెన్షన్ ఉండదని నిపుణులు అంటున్నారు. చదువుల ఫీజులు.. సాగు పెట్టుబడులు.. సీజనల్ వ్యాధులు అన్ని ఖర్చులూ ఒకే నెలలో రావడంతో సర్వత్రా ఆందోళన ఆర్థికభారంతో హడలెత్తిపోతున్న సామాన్య ప్రజలు పెట్టుబడులు పెరిగాయ్ వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతంది. పెరిగిన ఖర్చులతో సాగు చేయడం కష్టంగా మారింది. ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల రేట్లు పెరుగుదలలో పోటీపడుతున్నాయి. సాగు సీజన్ వచ్చిందంటే హడలెత్తిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. – మహేశ్గౌడ్, రైతు జూన్ అంటేనే భయం నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు యూకేజీ, మరొకరు సెకండ్ క్లాస్. జూన్ వచ్చిందంటే అడ్మిషన్లు, పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు ప్రైవేట్ పాఠశాలలు ఏటా ఫీజులు పెంచుతూ మరింత ఆర్థిక భారం మోపుతున్నాయి. – రాదాసు శైలజ, గృహిణి -
యాసంగిలో ‘పంట పండింది’
● రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి ● వాతావరణ పరిస్థితులే అంటున్న శాస్త్రవేత్తలు జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్లో జిల్లాలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అయ్యింది. రాష్ట్రస్థాయిలో జిల్లా మూడోస్థానంలో నిలిచింది. వరి సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు జిల్లాలో ఉండటంతో సగటున రైతులు ఎకరాకు 23 క్వింటాళ్ల దిగుబడి సాధించినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడం.. బావులు, బోర్లు, కుంటలు, చెరువులకు తోడు ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల కావడంతో వరి సాగు అధికంగా చేపట్టి మంచి దిగుబడి తీశారు. మరోవైపు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం పెద్దగా లేకపోవడం.. తేమ శాతం పెరగకపోవడం రైతులకు కలిసి వచ్చింది. పంట చివరి దశలో అకాలవర్షాలు కురిసినప్పటికీ పెద్దగా నష్టం జరగలేదు. జగిత్యాల రూరల్, గొల్లపల్లి, రాయికల్, సారంగాపూర్ వంటి మండలాల్లో కొంతమంది రైతులు ఎకరాకు 28 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి తీశారు. 69లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి మూడు లక్షల ఎకరాల్లో పంట సాగు చేసిన రైతులు 69 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి చేశారు. 367 కొనుగోలు కేంద్రాల ద్వారా 46.36 లక్షల క్వింటాళ్ల సన్న, దొడ్డు రకాలు కొన్నారు. ప్రైవేట్ సీడ్ కంపెనీలు విత్తనోత్పత్తి చేయించి.. మరో రెండు లక్షల క్వింటాళ్లు కొన్నాయి. కేంద్రాల ప్రారంభానికి ముందు అకాల వర్షాలు కురవడంతో అప్పటికే కోతలు పూర్తి చేసిన రైతులు దాదాపు 20లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు అమ్ముకున్నట్లు సమాచారం. ఒక్కో రైస్మిల్లరు తమ ఆర్థిక స్థితిని బట్టి దాదాపు 20వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రూ.1600 కోట్ల పంట.. పెరిగిన ఖర్చు జిల్లాలో సాగు నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో వానాకాలం, యాసంగి సీజన్లలో వరి పండిస్తారు. వానాకాలంతో పోల్చితే యాసంగిలో దిగుబడి ఎక్కువగా ఉంటాయి. ఈ యాసంగిలో రైతులు వరి పండించి రూ.1600కోట్ల ధాన్యం విక్రయించారు. మరోవైపు ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి. నాట్ల సమయంలో ఒక్కో మహిళా కూలీకి రూ.500 నుంచి రూ.600, మగ మనిషికి రూ.800 నుంచి రూ.వెయ్యికి చేరాయి. ట్రాక్టర్తో దున్నడానికి ఎకరాకు రూ.5 నుంచి రూ.6వేలు అవుతోంది. రసాయన, క్రిమిసంహారక మందులకు ఎకరాకు రూ.పదివేల వరకు అవుతోంది. హార్వెస్టర్కు రూ.3వేలు చెల్లించాల్సి వస్తోంది. అన్ని ఖర్చులు పోను మిగిలిన ఆదాయంతోనే రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పు చెల్లించడం.. పిల్లలను చదివించడం.. వైద్యఖర్చులు భరించాల్సి వస్తోంది. దీనికి ఏటా అప్పు చేయాల్సి వస్తోంది. పంట పండుతున్నా తిరిగి అప్పు చేయాల్సి రావడంతో కొందరు భూములను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. దిగుబడి వస్తోంది ప్రతి సీజన్లో రెండుమూడెకరాల్లో వరి సాగు చేస్తాను. మంచి దిగుబది వస్తోంది. ఖర్చులు పెరగడం, మద్దతు ధర అంతంతే ఉండటంతో పెద్దగా లాభం ఉండటం లేదు. ఇతర పంటల వైపు మళ్లలేక వరి సాగు చేస్తున్నాను. – మహేందర్ రెడ్డి, తొంబర్రావుపేట అనువైన వాతావరణం జిల్లాలో వరి సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులున్నాయి. ఇతర జిల్లాలతో పోల్చితే ఒకట్రెండు క్వింటాళ్లు ఎక్కువ పండుతుంది. కొన్ని కంపెనీలు విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. ఖర్చులు తగ్గించడంపై రైతులు దృష్టి పెట్టాలి. – శ్రీలత, వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ -
మళ్లీ మొదటికేనా !?
కోరుట్ల: ధరణి పోర్టల్ లోటుపాట్లు సరిదిద్ది.. త్వరితగతిన భూ సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన భూ భారతి సదస్సులకు లెక్కలేని దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయికి వెళ్లి భూముల సర్వే, మ్యాప్ అటాచ్తో సరిహద్దుల నిర్ణయం వంటి అంశాలను నిర్ణయించనున్నారు. ఈ క్రమంలో అధికారుల కాలయాపన, అవినీతి తంతు వెంటాడే అవకాశం ఉండడంతో సమస్య మళ్లీ మొదటికి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పలు తెప్పలు.. భూభారతి సదస్సులు మొదలై ఐదు రోజులు గడుస్తున్న క్రమంలో కోరుట్ల, మెట్పల్లి రెవెన్యూ డివిజన్లలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది విరాసత్, కోర్టు కేసులు, సాదాబైనామాలు, గ్రామకంఠం, ఆబాది వంటి భూ సమస్యలను వేర్వేరుగా నమోదు చేసి వాటి పరిష్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భూ భారతి ప్రకారం 60 నుంచి 90 రోజుల్లోగా సమస్యను బట్టి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాలి. ప్రస్తుతం ఐదు రోజులుగా సాగుతున్న సదస్సుల్లో దరఖాస్తులు వందల సంఖ్యలో వస్తున్నాయి. నాలుగు రోజుల్లో కోరుట్ల, మెట్పల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఆరు మండలాల్లో 1800 దరఖాస్తులపైనే వచ్చాయి. మరో పది రోజుల గడువు ఉన్న క్రమంలో ఈ సంఖ్య 3వేల వరకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా ఆన్లైన్ చేస్తున్న రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారు. ఈ క్రమంలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు భూభారతి పోర్టల్లో సర్వే మ్యాప్ తప్పనిసరి. ప్రస్తుతం సర్వేయర్ల కొరత ఉన్న క్రమంలో మ్యాప్లను అనుసంధానించడంలోనూ ఆలస్యం జరిగే అవకాశం ఉందన్న వాదనలు వినవస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు సదరు భూముల వద్దకు వెళ్లి విచారణ చేసి భూభారతిలో భూమి హక్కుల నమోదు చేయడానికి నిర్ణీత కాల పరిమితి ఉన్నప్పటికీ ఆ లోపు ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు పరిష్కారం వీలవుతుందా..? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. ఈ జాప్యం కారణంగా రెవెన్యూ సిబ్బంది చేతులుచాచే సంస్కృతికి ఎక్కడ తెరలేపుతారో అన్న అనుమానాలు దరఖాస్తుదారులను వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భూభారతి చట్టం అమలుకు ఉన్నత స్థాయి అధికారులు మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు భూభారతి దరఖాస్తుల సర్వే తీరు -
స్లాటర్హౌస్ తనిఖీ
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని స్లాటర్ హౌస్ వద్ద పశువైద్యాధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. నిబంధనల ప్రకారమే పశువులను వధించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ సహాయ సంచాలకులు మదన్మోహన్, మున్సిపల్ పర్యవేక్షణ అధికారి కిరణ్రెడ్డి, వెటర్నరీ లైవ్స్టాక్ ఆఫీసర్ కందుకూరి పూర్ణచందర్, వెటర్నరీ అసిస్టెంట్ రవి పాల్గొన్నారు. దుబాయ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలుదుబాయ్లో ఆవిర్భావ వేడుకల్లో ఈటీసీఏ సభ్యులు రాయికల్: ఎమిరెట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో అజ్మాన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్కుమార్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్, కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతాచారి, యాదయ్య, సాయికుమార్ యాదవ్, నిషాంత్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి అమరుల త్యాగమే తెలంగాణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈటీసీఏ సభ్యుల పోరాటాన్ని వివరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు మామిడి శ్రీనివాస్, కోర్ కమిటీ సభ్యులు చీటి జగదీశ్రావు, అలిగేటి శ్రీనివాస్, కోట్ల రాణి, శేఖర్గౌడ్, తిరుమల్రావు పాల్గొన్నారు. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు చెల్లించాలి ● ఉద్యోగులను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ● ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక విస్మరిస్తోందని, వారికి పెండింగ్ డీఏలు చెల్లించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఉద్యోగులకు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలి ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని కవితను ఉద్యమకారులు కోరారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈనెల 14, 15న నిర్వహించే మహా చండీయాగంకు హాజరు కావాలని కోరారు. ఇటుకబట్టీలకు చెరువు మట్టి తరలింపు● తీర్మానం కాపీని మార్చిన వ్యాపారులు గ్రామపంచాయతీలో చేసిన తీర్మానం కాపీ సారంగాపూర్: మండలకేంద్రంలోని చింతల చెరువు మట్టిని ఇటుకబట్టీలకు తరలిస్తున్నారు. దీనిపై రైతులు శనివారం మాజీమంత్రి జీవన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. చెరువు మట్టిని రైతులు పొలాల్లో పోయించుకునేందుకు ఈనెల 5న గ్రామసభలో తీర్మానించారు. కొంతమంది ఇటుకబట్టీల వ్యాపారులు పొలాలతోపాటు ఇటుకబట్టీలకు తరలించాలంటూ కొన్ని పదాలు చేర్చారు. శనివారం జగిత్యాల ప్రాంతంలో నిర్వహించే బట్టీలకు మట్టిని తరలించేందుకు టిప్పర్లను తెప్పించారు. దీంతో రైతులు విషయాన్ని జీవన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇటుక బట్టీలకు మట్టి తరలింపును తక్షణమే ఆపాలని సూచించారు. ఈ విషయమై గ్రామ ప్రత్యేకాధికారి వివరణ ఇస్తూ.. గ్రామసభలో రైతులు మట్టి తరలించడానికి మాత్రమే తీర్మానం చేశామని, బట్టీలకు తరలించాలని నిర్వాహకులు చేర్చారని, దీనిపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. -
రారండోయ్.. సర్కారు బడికి
● ఊరూరా జయశంకర్ బడిబాట ● ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఇంటింటా ప్రచారం ● వినూత్న తరహాలో ఆకర్షించే కార్యక్రమాలు ● పిల్లలు సర్కారు బడిలో చేరాలని పిలుపుఇంగ్లిష్ మీడియం చదువులు.. ఉచితంగా ఏకరూప దుస్తులు.. షూలు.. చదువుకునేందుకు పాఠ్యపుస్తకాలు.. ఆకలేస్తే మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారం.. విశాలమైన డిజిటల్ తరగతి గదులు.. క్రీడా మైదానాలు.. సకల సౌకర్యాలు.. అన్నింటికీ మించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ఇంకెందుకు ఆలస్యం.. రారండోయ్ సర్కారు బడికి అంటూ.. ఊరూరా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రూ.లక్షలు పోసి ప్రైవేటులో చదివించే కన్నా.. అన్నీ ఉచితంగా అందిస్తున్న సర్కారు బడిలో చేరాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వినూత్నంగా ప్రచారం చేస్తూ.. పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై సండే స్పెషల్..ఇదే మా ఓపెన్ చాలెంజ్..● మా పిల్లల కన్నా ‘ప్రైవేటు’ వాళ్లు బాగా చదివితే రూ.500 నజరానా ● పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి స్కూల్ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం ధర్మారం: ‘ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మా పిల్లల కన్నా బాగా చదవగలరా..? అలా ఒక్క విద్యార్థి చదివినా రూ.500 నజరానా ఇస్తాం’.. అంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నారు. బడిబాటలో భాగంగా ఇంటింటా తిరుగుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీమోహనాచార్యులు, ఉపాధ్యాయులు కలిసి ఫిబ్రవరి 21నుంచే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు బడికి పంపించాలని కోరుతున్నారు. తమ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థుల కన్నా ప్రైవేటులో చదివేవారు ప్రతిభ కనబరిస్తే.. రూ.500నగదు బహుమతి అందిస్తాని చాలెంజ్ చేస్తున్నారు. పాఠశాల ప్రత్యేకతలను వివరిస్తూ.. ఇంటింటా కరపత్రాలు పంచుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలో 36 మంది విద్యార్థులుండగా.. బడిబాటలో భాగంగా 14మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్ఎం తెలిపారు. గ్రామంలోని ప్రతీ విద్యార్థి సర్కారు బడికి వచ్చేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు.– వివరాలు 10లోu -
ఒబులాపూర్లో చిరుత సంచారం
● గొర్రెను చంపినట్లు అనుమానాలు మల్యాల: మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు. శనివారం గ్రామానికి చెందిన గుగ్గిళ్ల తిరుపతి అనే గొర్రెల కాపరి తన గొర్రెల మందను సమీప అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లగా.. ఓ గొర్రైపె చిరుత దాడి చేసి చంపిందని బాధితుడు తెలిపారు. గొర్రెలకాపరి అరవడంతో పారిపోయిందని పేర్కొన్నాడు. గ్రామాన్ని ఆనుకొని ఉన్న గుట్టల ప్రాంతంలో చిరుత సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మృతి చెందిన గొర్రెతో తిరుపతి -
కేబినెట్లోకి ఎవరో?
● ఉమ్మడి జిల్లా నుంచి ఒకరికి అవకాశం ● కవ్వంపల్లి, ఆది, అడ్లూరిలో ఒకరికి చోటు? ● ఉత్కంఠలో ఆశావహులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎప్పుడెప్పుడా... అని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్ విస్తరణ ఆదివారం జరుగనుంది. కేబినెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రి పదవి దక్కడం ఖాయమనే సమాచారం ఉంది. ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరికి చోటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గురించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఆలోచన చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టే భాగంగా అధిష్టానం ఉమ్మడి జిల్లాలో ఒకరికి మంత్రి పదవీ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ విప్గా కొనసాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్నూరు సామాజికవర్గం కోటాలో మంత్రివర్గంలో బెర్తు ఖాయమనే ఊహగానాలు వినబడుతున్నాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్, జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కేబినెట్లో చోటు ఖాయమని వారి అనుచరులు ధీమాగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు వ్యవహరిస్తుండగా ప్రస్తుత మంత్రివర్గంలో ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరిని తీసుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా పార్టీ అధిష్టానం సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు కొత్తగా ఎన్నికై న నేతలు, సీనియర్ నేతలను సామాజిక వర్గం అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కరీంనగర్ నుంచి కేబినెట్లో ఒకరిని మంత్రిగా నియమించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఆదివారం జరిగే కేబినెట్ విస్తరణలో జిల్లా నుంచి ఈ ముగ్గురిలో ఒకరికి చోటు దక్కి ఉత్కంఠకు తెరపడనుంది. -
పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
జగిత్యాలరూరల్ః మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాల ని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘుచరణ్ అన్నారు. శుక్రవారం జగిత్యాలరూరల్ ఐకేపీ కార్యాలయంలో జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల మహిళా స్వయం సహాయక సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణాలు ఇస్తూ ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తోందన్నారు. అలీవ్ మహిళా శక్తి రాష్ట్ర ప్రాజెక్టు అధికారి పద్మావతి అన్నపూర్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ఐకేపీ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏఎల్ఈఏపీ ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాంప్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శా ఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల సహకారంతో ఒకరోజు గ్రామీణమహిళలకు అవగా హన కల్పించి ఔత్సాహిక మహిళలకు 15 రోజు లు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖాధికారి యాదగిరి, ఏపీడీ చరణ్దా స్, డీపీఎం భారతి, మల్లేషం, జిల్లా ఏపీఎం చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది లేరు.. రసాయనాలు లేవు
● జిల్లాలో భూసార పరీక్షలకు మంగళం ● పరీక్షలు నిలిచిపోవడంతో రైతులకు అందని సేవలు భూసార పరీక్షలు జరగడం లేదు జిల్లాలో భూసార పరీక్షలు జరగడం లేదు. భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు చే సి సిబ్బందిని నియమించాలి. – క్యాతం సాయిరెడ్డి, సింగరావుపేట, రాయికల్(మం)ప్రభుత్వానికి నివేదిక పంపించాం జిల్లాలో భూసార పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. గతంలోని రెండు భూసార పరీక్షా కేంద్రాలు పనిచేయడం లేదు. ఎవరైన రైతులు మట్టి నమూనాలు తీసుకవస్తే, భూ సార పరీక్షా కోసం కరీంనగర్కు లేదా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి పంపిస్తున్నాం. త్వరలో మిని భూసార పరీక్షా కేంద్రాలను బలోపేతం చేస్తాం. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి జగిత్యాలఅగ్రికల్చర్: పంటల సాగులో రైతులు విలువైన రసాయన ఎరువులను ఇష్టారాజ్యంగా వేస్తుండటంతో వ్యవసాయభూములు పనికి రాకుండా పోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. భూసార పరీక్షల అధారంగా రసాయన ఎరువులు వేస్తే, రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా భూములు చెడిపోవని, పర్యావరణం దెబ్బతినదని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే, జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించే పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో మూడేళ్లుగా రైతులు భూసార పరీక్షలకు నోచుకోవడం లేదు. జిల్లాలో భూసార పరీక్షా కేంద్రాలు లేనట్లే.. జిల్లాలో జగిత్యాల, మెట్పల్లిలో మార్కెట్యార్డులో భూసార పరీక్షా కేంద్రాలు ఉండేవి. పరీక్షా కేంద్రాలకు అవసరమైన రసాయనాల కోసం ఏడాదికి రూ.20–30 వేలు ఆయా మార్కెట్ యార్డుల నుంచి ఇచ్చేవారు. ఈ కేంద్రాల్లో పరీక్షలు చేసేందుకు వ్యవసాయాధికారులతో పాటు వ్యవసాయ సిబ్బంది ఉండేవారు. కాని, కొంతకాలంగా ఈ భూసార పరీక్షా కేంద్రాల్లో సిబ్బంది లేకపోవడంతో పాటు జగిత్యాలలోని భూసార పరీక్షా కేంద్రాన్ని సమీకృత మార్కెట్ నిర్మాణంలో భాగంగా కూల్చివేశారు. అలాగే, మెట్పల్లిలోని భూసార పరీక్షా కేంద్రం పత్తా లేకుండా పోయింది. దీంతో, భూసార పరీక్షలు నిలిచిపోవడంతో, రైతులకు అందించే సేవలు అందకుండా పోయాయి. మినీ భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినా.. అగ్రికల్చర్ క్లస్టర్ల వారీగా ఏఈవోలను నియమించిన తర్వాత మినీ భూసార పరీక్షా కేంద్రాలను అయా క్లస్టర్లలో ఏర్పాటు చేశారు. రైతు వేదికలు కాక ముందు గ్రామ పంచాయతీ లేదా ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసినప్పటికీ వాటితో పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీనికి తోడు మినీ భూసార పరీక్షా కేంద్రాలకు భూసార కిట్లు ఇచ్చినప్పటికీ అందులోని రసాయనాలు పనిచేయకపోవడంతో అవి సైతం మూలన పడ్డాయి. అయితే, గ్రామాల నుంచి రైతులు తీసుకవచ్చే మట్టి నమూనాలను కరీంనగర్కు పంపించేవారు. వాటి ఫలితాలు రైతులు పంటలు వేసిన తర్వాత ఎప్పుడో వచ్చేవి. అవి సైతం రైతులకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయాయి. అవసరమైన రైతులు పొలాసకు.. ఉద్యాన పంటలను పెద్ద మొత్తంలో సాగు చేసే జిల్లా రైతులు మాత్రం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం లేదంటే పొలాస వ్యవసాయ కళాశాలకు తీసుకెళ్లి మట్టి పరీక్షలు చేయించుకుంటున్నా రు. చల్గల్ ఫాంలో భూసార పరీక్షా కేంద్రం ఉన్న ట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికీ ఏ రైతుకు తెలియని పరిస్థితి ఉంది. పొలాస శాస్త్రవేత్తలు మాత్రం వారి నిబంధనల మేరకు కేవలం దత్తత గ్రామ రైతులకు ఉచితంగా పరీక్షలు చేస్తుండగా, మిగతా రైతులకు రూ.150 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో, చిన్న, సన్న కారు రైతులు కాకుండా కేవలం అవసరమైన రైతులు మాత్రమే భూసార పరీక్షలు చేయించుకుంటున్నారు. -
అతివలు తోడుగా..
జగిత్యాల: మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తూ ఆరోగ్యమిత్ర పథకాన్ని అమలు చేస్తోంది. మహిళా సంఘాల మద్దతుతో పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు అభివృద్ధిలో సైతం వారు పాలుపంచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కార్పొరేషన్లో ఆరోగ్యమిత్ర పథకం సత్ఫలితాలివ్వడంతో మున్సిపాలిటీలో సైతం ఏర్పాటు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. సభ్యుల ఎంపిక మున్సిపాలిటీల్లో ముందుగా సభ్యులను అమృత్ మిత్రులుగా ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో చేపట్టే పనులను వీరు పర్యవేక్షిస్తుంటారు. సుమారు రూ.2 లక్షల నుంచి రూ.0 లక్షల వరకు ప్రాజెక్ట్ను ఎంపిక చేసుకుని దానిని చేసేలా చర్యలు తీసుకుంటారు. వీరు ఏటా సుమారు రూ.30 లక్షల నిధులు వెచ్చిస్తుంటారు. మహిళా సంఘాలకు సైతం ఎవరు మంచి పనులు చేస్తుంటే వారికి గ్రేడింగ్స్ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసే నిధులతో చేపట్టే పనులను సైతం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. వీరు నీటి సరఫరా, తాగునీటి పరిశుభ్రత, పైప్లైన్ లీకేజీలు, పారిశుధ్య పనులు, పర్యవేక్షణ, మొక్కలు నాటడం తదితర పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే పట్టణంలో వాల్పేయింటింగ్స్, పచ్చదనం పరిశుభ్రత, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ తెలిపేలా పెయింటింగ్లు వేసి ప్రజల్లో చైతన్యం తెచ్చేలా వీరు చర్యలు తీసుకోవాలి. అమృత మిత్రులకు పారితోషికం సైతం అందజేస్తారు. అమృత మిత్రుల ఎంపిక మున్సిపాలిటీల్లో స్వయం సహాయక సంఘాలు అమృత్ 2.0 నిధులు విడుదల చేసేందుకు అమృత్ మిత్రులను ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా పట్టణంలోని జనాభా, స్వయం సహాయక సంఘాలు, సభ్యుల సంఖ్యతో పాటు, పేదలు నివసించే ప్రాంతాలను గుర్తించి అక్కడి వారినే అమృత్ సంఘాలుగా గుర్తిస్తారు. ప్రతీ ఒక్క మహిళా సంఘాల గ్రూపునకు అకౌంట్ ఉండాల్సి ఉంటుంది. కనీసం 8వ తరగతి వరకు అర్హత ఉన్న వారినే ఎంపిక చేస్తారు. ఎంపికై న తర్వాత మున్సిపాలిటీ ప్రతీ పనిని పర్యవేక్షిస్తుంటారు. మున్సిపాలిటీల్లో సుందరీకరణ ఆరోగ్య మిత్ర పథకం అమలు మహిళా సంఘాల భాగస్వామ్యంచెరువుల చుట్టూ మొక్కలు నాటడం ముందుగా పర్యవరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అమృత్ 2.0 పథకం కింద ఎంపికై న చెరువులను ఈనెల 21 నుంచి 23 వరకు పరిశీలించనున్నారు. చెరువులు ఎలా ఉన్నాయి, చెరువుల వద్ద ఎలాంటి సమస్యలున్నాయో పరిశీలిస్తారు. అనంతరం జూన్ 5 నుంచి ఆగస్టు 30 వరకు చెరువుల చుట్టూ మొక్కలు నాటనున్నారు. ఇలా ప్రతీ మున్సిపాలిటీలో చేపడతారు. మహిళల భాగస్వామ్యంతో పట్టణాల సుందరీకరణ అవుతుందనే ఉద్దేశంతో వారికి మంచి అవకాశాలు కల్పించింది. జిల్లాలో మొత్తం మున్సిపాలిటీలు 5పట్టణ మహిళా సమైక్య సంఘాలు 5మెప్మా రిసోర్స్పర్సన్లు 173స్వయం సహాయక మహిళ సంఘాలు 5,361మహిళా సంఘాల సభ్యులు 58,076 -
రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి
రాయికల్: రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. శుక్రవారం రాయికల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.12 ఏళ్ల పాటు సాగు చేస్తునన రైతులు పట్టా పొందేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. ఏళ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని భూపంచాయితీలు భూభారతిలో పరిష్కార దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. అనంతరం రామాజీపేట గ్రామంలో గంగమ్మతల్లి కల్యాణంలో మాజీ మంత్రి జీవన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపిరాజరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోయ్యడి మహిపాల్రెడ్డి, నాయకులు దివాకర్రెడ్డి బాపురపు నర్స య్య, తలారి రాజేశ్, షాకీర్, పొన్నం శ్రీకాంత్, గుమ్మడి సంతోశ్ పాల్గొన్నారు. -
బక్రీద్ పండుగకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ అశోక్కుమార్జగిత్యాలక్రైం: జిల్లాలో బక్రీద్ పండుగకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, మసీదులు, మార్కెట్ ప్రాంతాలు, టవర్ సర్కిల్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పోలీసు పికెటింగ్లను పరిశీలించారు. శనివారం నిర్వహించే బక్రీద్ పండుగను అందరూ కలిసి మెలిసి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతీ చెక్పోస్టు వద్ద పోలీసు సిబ్బందితో 24 గంటల వాహనాల తనిఖీ చేపట్టి పశువుల అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వందతులను నమ్మొద్దని, వాటిని సంబంధిత అధికారుల దృస్టికి తీసుకరావాలని సూచించారు. ఎస్పీ వెంట ఎస్బీ సీఐ అరీఫ్ అలీఖాన్, టౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్ పాల్గొన్నారు. పదోన్నతి బాధ్యతలు పెంచుతుంది పోలీస్శాఖలో పదోన్నతి మరింత బాధ్యతలు పెంచుతుందని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పోందిన మహ్మద్ ఆరీఫ్కు పదోన్నతి స్టార్ సింహాన్ని అలకరించారు. ప్రజల్లో పోలీస్శాఖపై గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలన్నారు. -
నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సిందే
9సాక్షి ప్రతినిధి, కరీంనగర్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు రావాలంటే.. తప్పకుండా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సిందేనని కరీంనగర్ పార్లమెంటరీ నాయకులు అధిష్టానానికి స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో కరీంనగర్ పార్లమెంటరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లా నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా నేతలందరి నోట దాదాపుగా ఒకే డిమాండ్ వినిపించింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. డీసీసీ, కార్పొరేషన్ చైర్మన్లు సహా ఎలాంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంపై కిందిస్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వెల్లడించారు. వెంటనే పోస్టులు భర్తీ చేయకపోతే.. పార్టీకి క్షేత్రస్థాయిలో జరిగే నష్టాలను వివరించారు. పదవులు భర్తీ చేయలేకపోతే.. గ్రామాల్లో సమాధానం చెప్పే పరిస్థితి కూ డా ఉండదని కుండబద్ధలు కొట్టారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న మీనాక్షి.. త్వరలోనే పదవుల భర్తీ ఉంటుందని, కష్టపడి పనిచేసిన వారందరికీ సముచితస్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అధిష్టానం ఇచ్చే ప్రొఫార్మా ప్రకారం.. పేర్లు పంపాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ల విలీనం తథ్యం పథకాల అమలులో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, సన్నబియ్యం, ఇందిరమ్మ పథకాల అమలు తీరును మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ ధర్మం పేరుతో చేస్తున్న చర్యలను ఎక్కడికక్కడ ప్రజలకు వివరించాలన్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ బీజేపీ వ్యవహరించిన తీరును, దాని వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ ఏనాటికై నా బీజేపీలో విలీనం కావాల్సిందేనని, ఆ పార్టీల మైత్రిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇక తాము ఎన్నికల ముందు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, తమకు న్యాయం జరగాలని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే.మహేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తదితరులు గుర్తుచేశారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రణవ్బాబు, మాజీ మంత్రి జీవ న్రెడ్డి, సీనియర్ నేత కటకం మృత్యుంజయం, సు డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షికి స్పష్టం చేసిన కరీంనగర్ పార్లమెంటరీ నేతలు త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన మీనాక్షి నటరాజన్ బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీని ఎండగట్టాలని పిలుపు -
14న జాతీయ లోక్ అదాలత్
జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని న్యాయమూర్తులు, పోలీసులు, న్యాయసేవా సంస్థ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజీ చేసుకోదగిన కేసులను లోక్అదాలత్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్పై కక్షిదారులకు అవగాహన కల్పించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చొరవ చూడాలని తెలిపారు. సమావేశంలో ఎస్పీ అశోక్కుమార్, జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ, సీనియర్ సివిల్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మాణ శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, డీఎస్పీలు రాములు, రఘుచందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మల్లికార్జున్, రజనీ, ఏజీపీ ఓంప్రకాశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ కటుకం చంద్రమోహన్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.‘భూభారతి’ని సద్వినియోగం చేసుకోవాలిమల్యాల: రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ బీఎస్. లత అన్నారు. మల్యాల మండలం మానాల గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును సందర్శించి రైతుల నుంచి స్వీకరించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు తమ భూముల సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వసంత, ఆర్ఐ రాణి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మెరుగైన విద్య అందించడమే లక్ష్యం మెట్పల్లిరూరల్: బడి ఈడు పిల్లలందరికీ మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోందని జిల్లా విద్యాధికారి రామునాయక్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెట్పల్లి మండలం వేంపేటలో గ్రామసభ నిర్వహించి వీధులో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మౌలిక వసతుల గురించి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయురాలు నాగరాజకుమారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్, ప్రవీణ్, శేఖర్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఒకే పంటపై అధారపడొద్దుజగిత్యాలఅగ్రికల్చర్: రైతులు ఎప్పడు ఒకే పంటపై ఆధారపడొద్దని వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ డాక్టర్ శ్రీలత అన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం దత్తత గ్రామమైన రాయికల్ మండలం అల్లీపూర్లో శుక్రవారం రైతులకు వానాకాలం సాగులో మెలకువలపై అవగాహన కల్పించారు. విభిన్న పంటలు సాగు చేయడం వల్ల ఒక పంటకు ఆదాయం రాకున్నా మరో పంటకు వస్తుందన్నారు. పంట మార్పిడి వల్ల తెగుళ్లు, పురుగుల విజృంభన ఉండదని తెలిపారు. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడాలని సూచించారు. దత్తత గ్రామ ఇన్చార్జి డాక్టర్ రజనీదేవి, శాస్త్రవేత్తలు రజనీకాంత్, శ్రీనివాస్, రవి, స్వాతి, ఏఈవో సృజన, ఎఫ్ఈఓ చైర్మన్ అత్తినేని శంకర్, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
జగిత్యాల
న్యూస్రీల్ఘనంగా గంగమాతకు బోనాలు మల్లాపూర్: మండలంలోని వేంపల్లిలో శుక్రవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీగంగామాతకు బోనాలు సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు నెత్తిన బోనాలతో వెళ్లారు. గ్రామపురవీధుల వెంట గంగపుత్రులు గొల్లెంతో చేసిన విన్యాసాలు అలరించాయి. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్, గంగపుత్ర సంఘం నాయకుడు గుమ్ముల లింగారెడ్డి, గంగపుత్ర సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025 -
చెరువు నీటిని తరలిస్తే చర్యలు
పెగడపల్లి: చెరువులోని నీటిని అక్రంగా తరలిస్తే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కాళేశ్వరం లింక్–2 కింద చేపట్టిన పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్న స్థలం పక్కన ఉన్న జంగంకుంట చెరువులోని నీటితో పనులకు ఆటంకం కలుగుతుందని పనులు చేస్తున్న మెగా కంపెనీ వారు చెరువులోని నీటిని అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక రైతులు గురువారం కలెక్టర్ సత్యప్రసాద్, పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం చెరువును స్థానిక రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు కేవలం రూ.7నుంచి 9 లక్షలు చెల్లించి రైతులకు ఆర్థికంగా నష్టం చేశారని, చొప్పదండి నియోజకవర్గంలో భూరిజిస్ట్రేషన్ విలువ పెంచి ఇదే ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.22 లక్షలు చెల్లించినట్లు గుర్తు చేశారు. లక్షల విలువ చేసే భూములను రైతులు త్యాగం చేయడం వల్లనే ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్న విషయాన్ని మరిచిపోకుండా పనులు జరపాలే తప్ప రైతులకు నష్టం చేసేలా వ్యవహరిస్తే ఊరుకునేంది లేదని హెచ్చరించారు. చెరువు ఆధారంగా సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళన చెందొద్దని, అవసరమైన చెరువును నీటితో నింపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ వెంట ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఇరిగేషన్ డీఈ నర్సింగారావు, తహసీల్దార్ రవీందర్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, భరత్రెడ్డి, పవన్రెడ్డి, రవి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బడిబాటను విజయవంతం చేయాలి
జగిత్యాల: జిల్లాలో బడిబాటను విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బడిబాటపై కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో బడిబాటపై అవగాహన కల్పించి, చిన్నారులను చేర్పించేలా చూడాలన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు ఇంటింటా సర్వే చేసి గుర్తించినప్పుడే బడిబాట విజయవంతం అవుతుందన్నారు. త్వరలో పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మౌలిక వసతులు, తరగతి గదుల్లో శుభ్రం చేపించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈవో రాము, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలి జిల్లాలోని మున్సిపాలిటీల్లో లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలని, పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని, 100 రోజుల ప్రణాళికను పక్కగా అమలు చేయాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కమిషనర్లు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ల తనిఖీ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవాం తనిఖీ చేశారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, నాయకులు బండ శంకర్, సత్యనారాయణ పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికే ‘భూభారతి’ మల్లాపూర్/రాయికల్: భూ సమస్యలతో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు సత్వర పరిష్కారం చూపేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండలంలోని సాతారం, రాయికల్ మండలం మండలంలోని వీరాపూర్, ధావన్పెల్లి గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సదస్సుల నిర్వహణ, సమస్యలపై రైతులు అందిస్తున్న దరఖాస్తుల తీరును పరిశీలించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. భూ రికార్డుల ఆధారంగా వివాదాలు లేకుండా సర్వే చేసి భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సదస్సుల్లో ఆర్డీవోలు శ్రీనివాస్, మదుసూదన్, తహసీల్దార్లు రమేశ్గౌడ్, నాగార్జున, ఆర్ఐ రాజేశ్, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, పంచాయతీ కార్యదర్శి వినోద్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
ఫిట్గా ఉన్నాయా?
జగిత్యాలక్రైం: వేసవి సెలవుల అనంతరం మరోవారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవే టు పాఠశాలల విద్యార్థులను వాహనాల్లో ఇంటి నుంచి తీసుకెళ్లి సాయంత్రం దింపేస్తుంటారు. చి న్నారులను తీసుకెళ్లే వాహనాలు ఫిట్గా ఉండాలనే ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యాసంస్థల ప్రారంభానికి ముందు రవాణాశాఖ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అన్ని సరిగా ఉంటే రోడ్డెక్కేందుకు అనుమతి పత్రం జారీ చేస్తారు. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వాహనాల ఫిట్నెస్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకు చెందిన వాహనాలు 507 ఉండగా.. బుధవారం వరకు 201 వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. మరో 306 వాహనాలు ఫిట్నెస్ పరీక్షలకు రావాల్సి ఉందని రవా ణాశాఖ అధికారులు వెల్లడించారు. 15 ఏళ్లు దాటిన బస్సులకు ఫిట్నెస్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఫిట్నెస్ తప్పనిసరి గడువులోపు ప్రైవేటు పాఠశాలల బస్సులకు పాఠశాల యాజమాన్యాలు విధిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో ఉన్న జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఇప్పటి వరకు 201 వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. గతేడాది ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్ గడువు ముగిసింది. పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండటంతో ఫిట్నెస్ ఉంటేనే వాహనాలను రోడ్లపై తిప్పాలని, అతిక్రమిస్తే సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవీ నిబంధనలు పాఠశాల బస్సు 15ఏళ్ల కాలపరిమితి దాట కూడదు. విద్యాసంస్థల వాహనాలు పసుపు రంగులోనే ఉండాలి. డ్రైవర్కు హెవీ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. వయస్సు 60ఏళ్లలోపు ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. బస్సుపై కుడి ఎడమ వైపు పాఠశాల పేరు, చిరునామా స్పష్టంగా రాయాలి. వాహనం ఆగితే బ్లింక్ అయ్యేలా పైభాగంలో నాలుగు వైపులా అంబర్ లైట్లు ఉండాలి. బస్సులో ప్రథమ చికిత్స పెట్టె, మంటలను ఆర్పే వ్యవస్థ ఉండాలి. కిటికీలకు అడ్డంగా మూడు కడ్డీలు ఉండాలి. నేల నుంచి 325 మిమీ ఎత్తులో మెట్లు, ఎక్కేందుకు హ్యాండ్ రెయిలింగ్ ఉండాలి. అత్యవసర ద్వారం, బస్సు డ్రైవర్, అటెండర్ ఫోన్ నంబర్లు విధిగా ఉండాలి. డ్రైవర్కు బీపీ, షుగర్, కంటి పరీక్షలను చేయించాలి. సీరియల్ నంబర్తో కూడిన ఫిర్యాదుల పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలి. టీఎస్ స్కూల్ యాప్ ద్వారా విద్యా సంస్థ పేరు, డ్రైవర్, అటెండర్ పేరు వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి స్కూల్యాప్లో పొందుపర్చాలి. ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలపై రవాణాశాఖ దృష్టి కొనసాగుతున్న వాహన సామర్థ్య పరీక్షలు రోడ్డెక్కాలంటే ఫిట్నెస్ తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు జిల్లాలో 507 ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలునిబంధనలు పాటించాలి పాఠశాలలు, కళాశాలల యజమానులు నిబంధనలు పాటించాలి. బస్సులకు విధిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. ఫిట్నెస్ లేకుండా పాఠశాల బస్సులు రోడ్లపై తిరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కాలం చెల్లిన బస్సులను రోడ్లపై తిప్పరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతాం. – భద్రునాయక్, జిల్లా రవాణాశాఖ అధికారి -
లారీలు ఢీ.. ఒకరు మృతి
హుజూరాబాద్: ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్న తుమ్మన్నపల్లి గ్రామం మీదుగా వెళ్తున్న వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరగగా.. ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామానికి చెందిన దాచేపల్లి కృష్ణకిషోర్(44) లారీని ఎదురుగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. కృష్ణకిశోర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టమ్మీద క్షతగాత్రుడికి బయటికి తీసి చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. లారీ క్లీనర్ మస్తాన్, మరో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు లారీలు బ్రిడ్జిపై ఢీకొనగా.. అటు వరంగల్, ఇటు కరీంనగర్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సీఐ కరుణాకర్నడిగి తెలుసుకున్నారు. -
పెళ్లికి వెళ్తూ.. మృత్యు ఒడికి
సాక్షి పెద్దపల్లి: పెళ్లి ఇంటికి చేరుకోవాల్సిన దంపతులను లారీ రూపంలో వచ్చిన మత్యువు కబళించింది. జీవితంలోనే కాదు... మరణంలోనూ తమ బంధం విడదీయరానిదంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధురాలిని తప్పించబోయి, దంపతుల బైక్ను లారీ ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. ప్రమాదంలో దంపతులు మతిచెందగా, మూడేళ్లు కూతురు తీవ్రగాయల పాలైంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై శ్రావణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా పాలకూర్తి మండలానికి చెందిన డ్రైవర్గా పనిచేస్తున్న గుంటిపల్లి రాము(30) భార్య అనూష(27), కూతురు సహాస్ర(03)లు కలిసి హూజూరాబాద్లోని బంధువుల పెళ్లికి వెళ్లాడానికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ క్రమంలో సుగ్లాంపల్లి వద్దకు రాగానే పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీకి వృద్ధురాలు అడ్డుగా రావడంతో లారీ డ్రైవర్ ఆమెను తప్పించబోయాడు. దీంతో లారీ డివైడర్ ఎక్కి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్య అనూష అక్కడిక్కడే మృతిచెందగా, భర్త సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు.. కూతురుకు తీవ్రగాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐలు సుబ్బారెడ్డి, అనిల్లు అసుపత్రికి వచ్చి వివరాలను ఆడిగి తెలుసుకున్నారు. బసంత్నగర్లో విషాదం పాలకుర్తి: మరో రెండు రోజుల్లో బావమరిది వివాహం. ఎంతో సంబరంగా బయలుదేరిన భార్యాభర్తలు మార్గమధ్యంలో మృత్యువు కబలించడంతో బసంత్నగర్లో విషాదం నెలకొంది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సహస్ర చావుబతుకులమధ్య వరంగల్ ఎంజీఎంలో పోరాడుతోంది. బసంత్నగర్లోని రాంనగర్కు చెందిన గుంటుపల్లి రాము స్థానికంగా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రి కుమారస్వామి చనిపోగా, తల్లి పద్మ కాయాకష్టం చేసి కొడుకు రాము, బిడ్డ రమ్యను ఎంతో అల్లారుముద్దుగా పెంచింది. కొడుకు, కోడలు చనిపోయిన వార్త విన్న తల్లి పద్మ రోదనలు అక్కడున్నవారిని కంటతడిపెట్టించాయి. ● రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి ● వృద్ధురాలిని తప్పించబోయి దంపతులపైకి దూసుకెళ్లిన లారీ ● తీవ్ర గాయాలతో బయటపడిన మూడేళ్ల చిన్నారి -
ఎస్సెస్సీ బోర్డు తప్పిదం.. విద్యార్థినికి అన్యాయం
రామగిరి(మంథని): ఎస్సెస్సీ బోర్డు అధికారుల తప్పిదంతో విద్యార్థినికి అన్యాయం జరిగింది. రామగిరి మండలం బేగంపేటకు చెందిన సిరిపురం వర్షిత సెంటినరికాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదివింది. వార్షిక పరీక్షల్లో 567 మార్కులు సాధించింది. చదువులో మొదటి స్థానంలో ఉండే వర్షిత తనకు వచ్చిన మార్కుల పట్ల సంతృప్తి చెందక బోర్డు అధికారులకు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. బోర్డు ఆదేశాలతో మరోసారి పరిశీలించగా అసలు తప్పిదం బయటపడింది. పార్ట్–బీ పేపర్ కౌంట్ చేయలేదని గుర్తించి ఇప్పుడు 20 మార్కులు కలిపి మొత్తం 587 మార్కులుగా బోర్డు నుంచి మార్కుల మెమో అందజేశారు. రీ వెరిఫికేషన్లో 20 మార్కుల పెంపుతో వర్షిత జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. అధికారుల తప్పిదం వల్ల తమ బిడ్డకు తీవ్ర అన్యాయం జరిగిందని వెంటనే బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రీ వెరిఫికేషన్లో 20 మార్కులు పెంపు -
రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా చామనపల్లి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్రస్ధాయిలో ఉత్తమ పంచాయతీగా అవార్డు సాధించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం హైదరాబాద్లోని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్బోర్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్రావు ఉత్తమ పంచాయతీ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. రాష్ట్రస్ధాయిలో ఈ అవార్డు కోసం మూడు గ్రామపంచాయతీలు ఎంపిక చేయగా చామనపల్లి పంచాయతీకి మొదటి స్థానం లభించింది. సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, స్వచ్ఛత, పర్యావరణం, పచ్చదనం. సెగ్రేషన్షెడ్, కంపోస్టు ఎరువుల తయారీ, విటమిన్ గార్డెన్, ప్లాంటేషన్, కమ్యూనిటీ సోక్ పిట్స్ తదితర అంశాల్లో చామనపల్లి పంచాయతీ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి మొదటిస్ధానంలో నిలిచింది. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీవో సీహెచ్.జగన్మోహన్రెడ్డి, కార్యదర్శి మహేందర్రావు, పంచాయతీ సిబ్బందిని మంత్రి సురేఖ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, టీఎస్ పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు..
మెట్పల్లి: పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో గురువారం రాత్రి ఇసుక ట్రాక్టర్ ఢీకొని బండలింగాపూర్కు చెందిన గుగ్గిళ్ల రవి మృతి చెందాడు. రవి ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై మెట్పల్లికి వచ్చి తిరిగి బండలింగాపూర్కు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో పట్టణ శివారుకు చేరుకోగానే, ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని రోదించారు. -
ట్రాక్టర్ బోల్తాపడి యువరైతు..
మల్లాపూర్: వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి యువ రైతు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట శివారులో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెదలి ప్రవీణ్(30)కు భార్య రమ్య, ఇద్దరు కొడుకులున్నారు. గ్రామశివారులోని తన వ్యవసాయ భూమిని చదును చేసేందుకు పెద్ద కుమారుడు శ్రీహాన్తో కలిసి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన శ్రీహాన్ను స్థానికులు మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. -
అప్పుల బాధతో ఆత్మహత్య
మల్యాల: అప్పుల బాధ భరించలేక ఇంటి నుండి వెళ్లిపోయిన వ్యక్తి వ్యవసాయ బావిలో శవమై తేలాడు. మల్యాల ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. నూకపల్లి డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసముంటున్న నాగరాజు (39) రూ.4లక్షల అప్పు కావడంతో, తీర్చే మార్గం కానరాక, బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గురువారం రాత్రి మల్యాల గ్రామ శివారులోని వ్యవసాయబావిలో శవమై తేలాడు. అప్పుల వాళ్లు ఎవరూ బాధ పెట్టవద్దని సూసైడ్ నోట్ రాసి, బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీమెట్పల్లి: పట్టణంలోని దుబ్బవాడలో బెజ్జారపు తార ఇంట్లో దొంగతనం జరిగింది. ఎస్ఐ కిరణ్కుమార్ కథనం ప్రకారం.. తార బుధవారం ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లింది. తిరిగి గురువారం రాగా, తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా..ఇంట్లో దాచి ఉంచిన తులం బంగారు పుస్తెల తాడు, మూడు గ్రాముల బంగారు విగ్రహాం చోరికి గురైనట్లు గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
రక్తమోడిన రహదారులు
● ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు ● ఆరుగురు మృతి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రహదారులు గురువారం రక్తమోడాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. జగిత్యాల జిల్లా మల్యాల పరిధిలోని ముత్యంపేట వద్ద పెళ్లికారును డీసీఎం ఢీకొనడంతో చిన్నారి మృతి చెందగా.. పెళ్లి కుమారుడు సహా.. ఆరుగురు గాయపడ్డారు. ఇదే జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట శివారులో ట్రాక్టర్ బోల్తాపడి తండ్రి మృతి చెందగా.. కొడుకు గాయపడ్డాడు. మెట్పల్లిలోని వెల్లుల్ల రోడ్డులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి వద్ద లారీ ఢీకొనడంతో దంపతులు చనిపోయారు. చిన్నారి గాయపడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని తుమ్మనపల్లి వద్ద రెండు లారీలు ఢీకొని ఒక డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. –వివరాలు 10లోu -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జగిత్యాలజోన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ, ప్లాస్టిక్ వస్తువులు మానవ మనుగడకు పెను భూతంగా మారాయని తెలిపారు. పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచకపోవడంతోనే, అతివృష్టి, అనావృష్టి, అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు సంభవిస్తున్నాయని అ న్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నా రాయణ, సబ్ జడ్జి శర్మ, ఏజీపీ ఓంప్రకాశ్, పీపీ మల్లికార్జున్, జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ చీఫ్ కటుకం చంద్రమోహన్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ అసిస్టెంట్ చీఫ్ విజయ్కుమార్ పాల్గొన్నారు. అందరూ మొక్కలు నాటాలిమెట్పల్లి: పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని సీనియర్ సివిల్ మెజిస్ట్రేట్ నాగేశ్వర్రావు పేర్కొన్నారు. పర్యావరణ దినో త్సవాన్ని పురస్కరించుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జూని యర్ సివిల్ మెజిస్ట్రేట్ అరుణ్కుమార్తో కలిసి మొక్కలు నాటారు. ఎన్నో రకాల అనర్థాల వల్ల పర్యావరణం దెబ్బతింటోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాల్సిన అవసరముందన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవి ప్రసాద్, ఎఫ్ఆర్వో షౌకత్ అలీ, డిప్యూటీ ఎఫ్ఆర్వోలు సురేశ్ కుమార్, చైతన్యశ్రీ, న్యాయవాదులు తొగిటి రాజశేఖర్, పసునూరి శ్రీనివాస్, రాందాస్ పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండాలిజగిత్యాలజోన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి వెంకట సుబ్రహ్మణ్య శర్మ సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి లక్ష్యం ఏర్పర్చుకుని, సాధించే వరకు కృషి చేయాలని అన్నారు. చాలామంది సమయం వృథా చేయడంతో అనుకున్న లక్ష్యాలను అందుకోలేక పోతున్నారన్నారు. విద్యార్థి దశలో కష్టపడితే జీవితాంతం సుఖంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. బాలసదన్లో అందుతున్న సౌకర్యాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ చీఫ్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు సతీశ్, విజయ్కుమార్లు పాల్గొన్నారు. హైకోర్టుకు తరలిన జగిత్యాల న్యాయవాదులుజగిత్యాలజోన్: జగిత్యాల బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాదులు తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం హైకోర్టు కు వెళ్లి జడ్జీలను కలిశారు. కోర్టులో క్యాంటీన్, ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ, ఎస్సీ అదనపు కోర్టుల ఏర్పాటు వంటి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్రెడ్డి, కార్యవర్గ సభ్యులు రాంచందర్, రమేశ్ పాల్గొన్నారు. -
తండ్రిని హతమార్చిన తనయుడు
రాయికల్: రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో తొట్ల ఎర్రయ్య(65)ను కన్న కొడుకే గొడ్డలితో దారుణంగా హతమార్చిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో తొట్ల ఎర్రయ్య కొడుకు మల్లేశ్తో కలిసి జీవిస్తున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోగా.. మల్లేశ్ మానసిక పరిస్థితి సరిగా లేదు. కొడుకు ఆలన పాలన తండ్రి ఎర్రయ్య చూసుకుంటున్నాడు. మానసిక స్థితి సరిగా లేని మల్లేశ్ బుధవారం అర్ధరాత్రి తన తండ్రిపై గొడ్డలితో తీవ్రంగా దాడిచేయగా అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి సందర్శించారు. సంఘ నాయకుడు నాగుల గంగ మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కోరుట్లకు ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు
కోరుట్ల: కోరుట్ల మున్సిపాలిటీకి టీజీపీసీబీ ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు అందించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురువారం ఈ అవార్డును మున్సిపల్ కమిషనర్ అందె మారుతీ ప్రసాద్కు అందజేసింది. మంత్రి కొండా సురేఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గుగ్లావత్ రవి అవార్డును అందించారు. మున్సిపల్ కమిషనర్ అందె మారుతీ ప్రసాద్ మాట్లాడుతూ.. పట్టణంలో చెత్తసేకరణ, వెహికిల్ ట్రాకింగ్ సిస్టం, తడి,పొడి చెత్తతో ఎరువు తయారీ, డీఆర్సీసీ సెంటర్ ద్వారా తడి, పొడి చెత్త వేరు చేయటం, పర్యావరణానికి హాని కలుగకుండా ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిందని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్న పట్టణ ప్రజలకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. -
‘గిరి’ గ్రామాలకు మహర్దశ
రాయికల్:(జగిత్యాల): కేంద్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధికి పీవీటీజీ స్కీం తీసుకొచ్చింది. జిల్లాలోని రాయికల్ మండలం బోర్నపల్లి, దావన్పల్లి గ్రామాలను ఈ స్కీం కింద ఎంపిక చేసింది. ఈ గ్రామాలను ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం దతత్త తీసుకొని, ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ రెండు గ్రామాల్లో రాష్ట్రం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నిధులతో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఈ నెల 15నుంచి ప్రత్యేక గ్రామసభలు పీవీటీజీ స్కీం కింద ఎంపికై న బోర్నపల్లి, దావన్పల్లి గ్రామాల్లో కేంద్ర 15 శాఖల అధికారులు ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేకం గ్రామసభలు నిర్వహిస్తారు. అర్హులైన గిరిజనులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ పథకాలు వర్తించేలా నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపిస్తారు. గ్రామంలో అంగన్వాడీకేంద్రాల్లో ఎంత మంది చిన్నారులు ఉన్నారు..? ఎందరికి ఆధార్కార్డులు, రేషన్కార్డులు, కిసాన్కార్డులు, జన్ధన్ అకౌంట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయని ఆరా తీస్తారు. కేంద్రం నుంచి ఎంత మంది లబ్ధి పొందుతున్నారనే అంశాలు క్షుణ్ణంగా సేకరించి, నివేదిక తయారు చేయనున్నారు. జిల్లాలోని ఈ రెండు గ్రామాలకు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి ద్వారా ఐదేళ్ల పాటు ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో రోడ్లు, అంగన్వాడీ భవనాలు, ఆసుపత్రి భవనాలు, హాస్టళ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. పీవీటీజీ స్కీంలో బోర్నపల్లి, దావన్పల్లి ఎంపిక కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఈనెల 15 నుంచి 30వరకు ప్రత్యేక గ్రామసభలు