breaking news
Jagitial District News
-
తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలు
వేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా జైలు శిక్ష, జరిమానాలు తప్పవని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. ఇటీవల డ్రంకెన్డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారికి పోలీస్స్టేషన్ ఆవరణలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ర్యాష్గా లారీ నడిపిన వ్యక్తికి 20 రోజుల జైలు, రూ.10వేల జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్కుమార్ తీర్పు వెల్లడించారు. అనంతరం డ్రంకెన్డ్రైవ్ తనిఖీల్లో దొరికిన వారితో ట్రాఫిక్ ఆర్ఎస్సై రాజు ఆధ్వర్యంలో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్కు 20 రోజుల జైలు 24 మందికి జరిమానా -
రూ.18.71 కోట్ల సీఎంఆర్ మాయం
సుల్తానాబాద్రూరల్/సుల్తానాబాద్: రైతుల వద్ద కొనుగోలు చేసి సీఎంఆర్(మర ఆడించేందుకు)కు కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న రైస్మిల్లుల పన్నాగాన్ని సివిల్ సప్లయ్, టాస్క్ఫోర్స్ అధికారులు బట్టబయలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని సాయి మహాలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ రైస్మిల్లుల యజమానులు తమకు కేటాయించిన ధాన్యాన్ని 5 లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్సాదేశాల మేరకు అధికారులు గురువారం పట్టుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాథ్ రైస్మిల్లుల్లోని ధాన్యం ప రిశీలించి విచారణ చేపట్టారు. ఆయన మా ట్లాడుతూ, రెండు రైస్మిల్లులకు 2023–2024 సంవత్సరంలో యాసంగి ధాన్యం సీఎంఆర్ కోసం కేటాయించగా సాయి మహాలక్ష్మీ మిల్లులో 61, 65,305 క్వింటాళ్లు, సౌభాగ్యలక్ష్మీ మిల్లులో 10,800 క్వింటాళ్ల ధాన్యంలో వ్యత్యాసం వచ్చిందన్నారు. దీని విలువ(ఎకానమిక్ కాస్ట్) ప్రకారం సుమారు రూ.18.71కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రభు త్వం కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న యజమాని మారుతిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. లారీల్లో ధాన్యం ఎక్కడికి తరలించారనే దానిపైనా లోతుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్వో తెలిపారు. ధాన్యం తరలిస్తున్న ఐదు లారీలను పట్టుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది విచారణ చేపట్టిన జిల్లా సివిల్ సప్లయ్, టాస్క్ఫోర్స్ అధికారులు -
వేర్వేరు కారణాలతో ముగ్గురు రైతుల మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు రైతులు వివిధ కారణాలతో దుర్మరణం చెందారు. ఒకరు గుండెపోటుకు గురైతే.. మరొకరు వ్యవసాయ బావిలో పడగా.. ఇంకొకరు నీటిగుంతలోపడి ప్రాణాలు విడిచారు.బతుకుపోరులో ఆగిన గుండె తంగళ్లపల్లి(సిరిసిల్ల): పశువులను మేతకు తీసుకెళ్లిన రైతు గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ మృతిచెందిన ఘ టన తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో శుక్రవారం చో టుచేసుకుంది. రైతు అనవేని దేవయ్య(55) ఈనెల 6న పశువులను మేపేందు కు గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. ఈక్రమంలోనే గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దేవయ్యను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా స్టంట్ వేశారు. కానీ దేవయ్య కోమాలోకి వెళ్లడంతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయబావిలో పడి.. శంకరపట్నం(మానకొండూర్): లింగాపూర్ గ్రామానికి చెందిన అంతం బాపురెడ్డి(55) బంధువులు వ్యవసాయబావి పూడిక తీస్తుండగా వెళ్లి పక్కనే ఉన్న మరోబావి లో అదుపు తప్పి పడిపోయా డు. క్రేన్ పనులు, సమీపంలో వరి నాటు వేస్తున్న కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో బాపురెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. నీటిగుంతలోపడి.. ఓదెల(పెద్దపల్లి): గుంపుల గ్రామానికి చెందిన రైతు దాసరి మురళి(50) ప్రమాదవశాత్తు గుంతలోపడి మృతిచెందాడు. పంట పొలానికి నీరు పెట్టేందుకు శుక్రవారం మురళి సైకిల్పై వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కనున్న నీటిగుంతలో పడి ఊపిరాడక చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఐఐటీ పాఠాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఇల్లంతకుంట, రేపాక, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్లో భాగంగా మద్రాస్ ఐఐటీతో భాగస్వామ్యం అయ్యాయని ఆయా పాఠశాలల హెచ్ఎంలు పావని, ప్రేమలత, రేవతీదేవి శుక్రవారం తెలిపారు. ఈమేరకు మద్రాస్ ఐఐటీ ఈమెయిల్ ద్వారా తమకు సమాచారం అందినట్లు తెలిపారు. పాఠశాల, ఉన్నతవిద్య మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా ఐఐటీ మద్రాస్ సెంటర్ ఫర్ అవుట్ రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్(కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తమ పాఠశాలలోని విద్యార్థులకు ఆన్లైన్లో మద్రాస్ ఐఐటీ ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ వంటి పది రకాల కోర్సులు 8 వారాల వ్యవధితో నామమాత్రపు రుసుంతో అందించనున్నట్లు వివరించారు. 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో ఆగస్టు నుంచి రెండు నెలలపాటు ఈ కోర్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇల్లంతకుంటలో మూడు హైస్కూళ్లు ఎంపిక -
తండ్రి స్ఫూర్తితో..
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన దాసారపు మో హన్ గత డిసెంబర్లో అనా రోగ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు అతడి నే త్రాలు, దేహాన్ని ‘సిమ్స్’కు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో బాధిత కుటుంబానికి అభినందన పత్రం అందజేశారు. ఈసందర్భంగా మోహన్ చిన్న కూతురు అశ్విని తన మరణానంతరం దేహదానం చేసేందుకు అంగీకారం తెలుపగా, పలువురు ఆమెను అభినందించారు. ఈసందర్భంగా అశ్విని మాట్లాడుతూ, తన తండ్రి చెప్పిన విధంగా మనిషి మరణించిన తర్వాత అవయవాలు మట్టిలో కలిసిపోకుండా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దేహదానం చేసేందుకు ముందుకొచ్చానని పేర్కొన్నారు. -
ధన్యజీవులు
కోల్సిటీ(రామగుండం)/ిసరిసిల్లకల్చరల్: అస్తమిస్తూ వెలుగునిస్తున్నారు. మట్టిలో కలవకుండా మరో ప్రాణాన్ని బతికిస్తున్నారు. ఓ మనిషిగా మరణించి కుటుంబ సభ్యులకు కడుపు కోత పెట్టినా.. మరో వ్యక్తిలో సజీవంగా బతికే ఉంటున్నారు. అవయవదానంతో మరొకరికి పునర్జన్మనివ్వడమే కాకుండా.. వారూ పునర్జన్మను ఎత్తుతున్నారు. వేలల్లో అవయవ దానాలు సదాశయ ఫౌండేషన్ సంస్థ ద్వారా నేత్ర, అవయవ, శరీర, చర్మదానాలతోపాటు, సమాజహితానికి తోడ్పడే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,500 నేత్రదానాలు, 90 వరకు అవయవ, 150 వరకు దేహదానాలు చేయగా, 1,600 వరకు అవయవదానాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. దీంతో సుమారు 50,000 మందికి పైగా మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానాలకు స్వచ్ఛందంగా అంగీకారం తెలుపడం గమనార్హం. అవయవదాతలకు గౌరవం దక్కాలి మరణాంతరం నేత్ర, అవయవ, దేహదానాలు చేస్తున్న దాతలకు గౌరవం కల్పించాలని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు కొంతకాలంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు. అవయవదానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయాలని, అవయవ దానం చేసిన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్న తరహాలోనే తెలంగాణలో కూడా అందించాలని కోరుతున్నారు. ముందుకొచ్చిన ప్రిన్సిపాల్ కుటుంబం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్ అరుదైన త్యాగానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు సతీమణి, తండ్రిని దేహదానానికి ఒప్పించి తమ అభ్యర్థన పత్రాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేశారు. రఘునందన్ స్ఫూర్తిగా మరి కొంత మంది దేహ, అవయవ దానానికి ముందుకు వస్తున్నారు. జిల్లాలో దేహదానానికి సంబంధించిన ఇలాంటి గుర్తింపు తెచ్చుకున్న తొలి కుటుంబం రఘునందన్దే కావడం విశేషం. -
చికిత్స పొందుతూ అంగన్వాడీ టీచర్ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల)/సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లతండాలో ప్రమాదవశాత్తు గాయపడిన అంగన్వాడీ టీచర్ మాజోజు స్వరూప(52) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. మద్దిమల్ల గ్రామానికి చెందిన మాజోజు స్వరూప తండాలోని అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. నిత్యం అక్కడికి వెళ్లి వస్తుంటుంది. ఈనెల 8న విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా బైక్పై ఎక్కించుకున్న వ్యక్తి మార్గమధ్యలో అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో బండి పై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. మృతురాలి కుమారుడు విష్ణుసాగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. అంగన్వాడీ టీచర్ మృతి విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ దహన సంస్కారాల కోసం రూ.20వేల చెక్కును అందజేశారు. అఽఘాయిత్యాలు నిలువరించాలి ఐసీడీఎస్ కార్యకర్తలపై అఽఘాయిత్యాలను ప్రభుత్వం నిలువరించాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత కోరారు. మద్దిమల్లతండా అంగన్వాడీ టీచర్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, కాంగ్రెస్ కార్యకర్త కల్లూరి చందన, అంగన్వాడీ టీచర్లు శాంత, సరోజన, మంజుల, అన్నపూర్ణ, వనజ, శోభ తదితరులు పాల్గొన్నారు. కన్నీరుపెట్టుకున్న అంగన్వాడీలు నిందితుడిని శిక్షించాలని డిమాండ్ -
నలుగురికి మేలు జరగాలని..
కోరుట్లటౌన్: ‘మనం చచ్చినా, బతికినా నలుగురికి మేలు జరగాలి. అదే చిన్ననాటి నుంచి ఆశయం. టీచర్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి పది మందికి సాయం చేయాలనే తపనతో కొనసాగిన. రిటైర్డ్ అయ్యాక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న. ఆఖరికి చనిపోయినా నలుగురికి ఉపయోగపడాలి’. అని అంటున్నాడు కోరుట్లకు చెందిన రిటైర్డ్ టీచర్ వోటారికారి చిన్నరాజన్న. మరణానంతరం అవయవదానం చేయాలన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించి అంగీకారపత్రం తీసుకున్నారు. అవయవదాతలు పునర్జన్మ ఇచ్చినవారవుతారని పేర్కొన్నారు. – చిన్నరాజన్న -
టీచర్ చెప్పిన పాఠం స్ఫూర్తి
సింగరేణి స్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పు అవయవదానంతో ఇతరులకు పునర్జన్మ ఇవ్వొచ్చని బయాలజీ టీచ్చర్ చెప్పిన మాటలు, టీచర్ కూడా అవయవదానానికి అంగీకరించడం నాకు స్ఫూర్తిని చ్చాయి. ఇటీవలే నాకు 18 ఏళ్లు నిండాయి. ఈనెల 4న సింగరేణి స్కూల్ టీచర్ శశికళ సమక్షంలో నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారం తెలుపుతూ సదాశయ ఫౌండేషన్కు రాసి ఇచ్చాను. మా అమ్మ కూడా నా నిర్ణయాన్ని మెచ్చుకుంది. నాతోపాటు అమ్మ కూడా అవయవదానం చేయడానికి అంగీకారం తెలిపింది. – శివగణేశ్, డీఎంఎల్టీ స్టూడెంట్, గోదావరిఖని అమ్మ నేత్రాలను.. రామగుండం మేయర్ పదవిలో ఉన్నప్పుడు అవయదానాలపై చాలా అవగాహన సదస్సుల్లో అతిథిగా పాల్గొన్నాను. మరణించిన వారి నేత్రాలు, అవయవాలను దానం చేసినట్లు సదస్సుల్లో కుటుంబ సభ్యులు చెబుతుంటే చాలా ప్రేరణ కలిగింది. అప్పుడే నా మరణాంతరం అవయవదానం చేస్తానని అంగీకారపత్రాలపై సంతకాలు చేసిన. మా అమ్మ మరణిస్తే ఆమె నేత్రాలను దానం చేయించా. నేత్ర, అవయదానాలకు సెలబ్రెటీలు, అన్నివర్గాల యువత ముందుకు రావాలి. – కొంకటి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు -
చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
కరీంనగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్లోని టవర్సర్కిల్లో వాల్పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికి కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయడమే అన్నారు. పార్టీలకు అతీతంగా ఈనెల 15న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీసీల మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుప్ప ప్రకాశ్, తమ్మన్నగారి సంగన్నచ సిద్దగోని శ్రీనివాస్, వల్లూరి వీరేశ్, నవీన్, సాగర్, రాజేశ్, మేకల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
మట్టిలో కలిసిపోకుండా..
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తుమ్మ రామకృష్ణ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా అతడి కిడ్నీలు, కాలేయం దానం చేశారు. మృతుడి భార్య నిర్మల, కూతురు ప్రవళిక, కుమారుడు పృథ్వీరాజ్, కుటుంబసభ్యుల సమక్షంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. ఓదెల గ్రామానికి చెందిన అయిలు మల్లేశ్ ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందగా, అతడి కళ్లను భార్య రాధిక, కుటుంబసభ్యులు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. అలాగే ఓదెల మండలం అబ్బిడిపల్లె గ్రామస్తులంతా అవయవదానానికి ముందుకొచ్చి జిల్లా కలెక్టర్కు అంగీకారపత్రం అందజేశారు. -
40 సెకండ్లు.. 118 మూలకాలు
● పీరియాడిక్ టేబుల్ కంఠస్థం ● బాలుడి అద్భుత ప్రదర్శన ● మెమోరీ చాంపియన్ అవార్డు సాధన కరీంనగర్కల్చరల్: కరీంనగర్కు చెందిన కనపర్తి మనవేంద్ర రసాయన శాస్త్రంలోని 118 మూలకాల పేర్లు, వాటి అటామిక్, మాస్ నంబర్లను 40 సెకన్లలోనే కంఠస్థంగా చెప్పి శ్రీఅమేజింగ్ మైండ్ ప్రెజంటేషన్ ఇన్ కెమిస్ట్రీశ్రీ రికార్డు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన యూఎస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావడం విశేషం. నగరంలోని ఫిలింభవన్లో శుక్రవారం కనుపర్తి మనవేంద్రను సన్మానించి సర్టిఫికెట్ అందజేశారు. జిల్లా కేంద్రంలోని చేంజ్ మెమొరీ అకాడమీ శిక్షణలో ఉన్న మనవేంద్ర.. వివేకానంద స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. డాక్టర్ వేణుకుమార్ నేతృత్వంలో మెమొరీ ఫైలింగ్ టెక్నిక్స్ ద్వారా శిక్షణ పొందాడు. గతంలోనే ఈ బుడతడు జాతీయస్థాయి మెమొరీ చాంపియన్షిప్ సాధించాడని ట్రైనర్ వేణుకుమార్ గుర్తుచేశారు. ఈ ఘనతకు గుర్తింపుగా శ్రీసూపర్ మెమొరీ చాంప్శ్రీ అవార్డు పొందిన మనవేంద్రను తల్లిదండ్రులు శతి – మురళి అభినందించారు. విద్యార్థి ప్రతిభను వెలికితీస్తున్న డాక్టర్ వేణుకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ట్రైనర్లు తిరుపతి, హరీశ్ కుమార్, అశోక్ సామ్రాట్, నోముల రాజకుమార్, ఈశ్వర్, కిశోర్ పాల్గొన్నారు. -
అమ్మ, అక్క పార్థివదేహాలు
నేత్ర, అవయవదానంతోపాటు దేహదానంపై కాళోజీ నారాయణరావు మరణించినప్పుడు అవగాహన వచ్చింది. దీంతో 2003లో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి నా శరీరాన్ని దానం చేస్తానని రాసి ఇచ్చాను. మా అమ్మ, అక్క కూడా ముందుకు వచ్చారు. అమ్మ 2014లో మరణించగా కరీంనగర్లోని చల్మెడ మెడికల్ కాలేజీకి, అక్క 2023లో మరణిస్తే వరంగల్ మెడికల్ కాలేజీకి వారిద్దరి దేహాలను దానం చేశాం. నా నిర్ణయాన్ని గౌరవించి నా భార్య నిర్మల కూడా దేహదానానికి అంగీకారాన్ని తెలిపింది. – సురేశ్బాబు, ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి, గోదావరిఖని అవగాహన పెరిగింది నేత్ర, అవయ, దేహదానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముందుంది. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. సదాశయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి స్ఫూర్తి నా సోదరుడు అశోక్కుమార్. 2006లో హార్ట్ ఎటాక్తో మరణించగా, ఆయన ఆశయం మేరకు నేత్రదానంతోపాటు, పార్థీవదేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశాం. మాది సంప్రదాయ వైష్ణవ కుటుంబం. మా కుటుంబం సానుకూలంగా ఉన్నా బంధువర్గం నిరాకరించి గొడవకు దిగారు. తమ్ముడి ఆశయం నెరవేర్చడానికి అందరూ అంగీకరించేలా నచ్చజెప్పి చేశాం. – టి.శ్రవణ్కుమార్, జాతీయ అధ్యక్షుడు, సదాశయ ఫౌండేషన్ -
విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి
సారంగాపూర్(జగిత్యాల): పొలాల వద్ద విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే ప్రమాదాలకు తావుండదని సీజీఆర్ఎఫ్ (కన్జుమర్ గ్రీవెన్స్ రీఅడ్రెస్సల్ ఫోరం) చైర్పర్సన్ నారాయణ అన్నారు. శుక్రవారం బీర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బీర్పూర్, సారంగాపూర్, రాయికల్ మండలాల విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నందున పంటల సాగు బాగా ఉందని, రైతులు తమ పొలాల వద్ద కొత్తగా మోటార్లు ఏర్పాటు చేసుకుంటే దానికి అనగుణంగా డీడీలు చెల్లించాలని, దీంతో ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పెంచడానికి అవకాశం ఉంటుందన్నారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లిస్తే మరింత మెరుగైన సరఫరా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. తాను వచ్చిన దారిలో పొల్లాలో పోల్స్ వంగి ఉన్నాయని, వాటిని సరిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ లకావత్ కిషన్, ఫోర్త్ మెంబర్ రాజాగౌడ్, ఎస్ఈ సుదర్శన్, అకౌంట్స్ అధికారి తిరుపతి, డీఈ రాజిరెడ్డి, ఏడీఈ సింధూశర్మ, ఏఈలు శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్, రాజేశం, సిబ్బంది, పాల్గొన్నారు. పరిష్కార వేదికలో లైన్ల షిఫ్టింగ్ 2, కొత్త ట్రాన్స్ఫార్మర్లు 2, మరో 6 దరఖాస్తులు రాగా వాటిని పరిష్కరించారు. -
కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం
● మాజీ మంత్రి జీవన్రెడ్డిజగిత్యాలటౌన్: సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. ఇందిరాభవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈసందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ, రాహుల్గాంధీ ఆలోచన విధానం, డెడికేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు బలహీనవర్గాలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించడం జరిగిందన్నారు. కానీ, బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ప్రకటించలేదన్నారు. దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవడానికి అంబేడ్కర్ రాజ్యాంగమే కారణమన్నారు. నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ఎలిగేటి నర్సయ్య, బొడ్డు లక్ష్మణ్, చందా రాధాకిషన్, ముంజాల రఘువీర్ ఉన్నారు. -
కాళోజీ స్ఫూర్తితో..
కోల్సిటీ(రామగుండం): స్వాతంత్య్ర సమరయోధులు, గొప్ప కవి కాళోజీ నారాయణరావు తన మరణానంతరం శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు. వారే నాకు స్ఫూర్తి. నాతోపాటు నా భార్య కూడా మా మరణాంతరం మెడికల్ కాలేజీలకు మా శరీరాలను దానం చేస్తామని ప్రకటించాం. కాల్చడమో, పూడ్చడమో చేయకుండా వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం పార్థివ దేహాలను దానం చేయడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి. గత నెల 15న మా ఇద్దరి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇంట్లో పెద్ద సభ ఏర్పాటు చేసి, అందరికీ నేత్ర, అవయవ, దేహదానంపై అవగాహన కల్పించాం. – ఎల్.రాజయ్య, రిటైర్డ్ ఎంఈవో, గోదావరిఖని అమ్మ కళ్లను దానం చేశాం ధర్మపురి: మాది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నాగారం. అమ్మ చెలుముల చిన్నలక్ష్మి గుండె సమస్యతో బాధపడుతూ 2016లో మృతి చెందింది. ఆమె కళ్లను సజీవంగా ఉంచడం కోసం మృతిచెందిన కొద్ది నిమిషాల్లోనే లయన్స్క్లబ్ వారికి దానం చేసినం. దేశంలో కళ్లు లేనివారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఉపయోగపడతాయి. అన్ని దానాల కంటే అవయవ దానం గొప్పది. – చిలుముల లక్ష్మణ్ -
ధన్యజీవులు!
● అపురూప త్యాగం దేహదానం ● వైద్య విద్యార్థులకు పాఠ్య పుస్తకం ● అవయవదానంతో పునర్జన్మ ● నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న అవగాహన‘భగవంతుడి కోసం కళ్లు పెకిలించి ఇచ్చిన భక్త కన్నప్ప... గురు దక్షిణ కోసం బొటనవేలిని కోసి ఇచ్చిన ఏకలవ్యుడు... దానంగా తొడకోసిచ్చిన శిబిచక్రవర్తి వీరంతా గొప్పవాళ్లయితే... ప్రస్తుత సమాజంతో లక్షలు, కోట్లున్నా కొనలేని.. కొనడానికి విలువకట్టలేని తమ నేత్రాలు, అవయవాలు, పార్థీవ దేహాలను దానం చేయడానికి ముందుకు వస్తున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కొందరు వ్యక్తులు ధన్యజీవులు’.. పరోపకారమే ఇదమ్ శరీరమ్.. అని సంపూర్తిగా నమ్మి తాము పుట్టిందే పరులకు ఉపకారం చేయడానికనుకొని మనసా.. వాచా.. కర్మ.. అని ఆచరించేవారు జీవించినంత కాలం ఇతరులకు సేవచేయాలని కోరుకోవడం సాధారణమైన విషయం. జీవం పోయిన తర్వాత కూడా ఇతరులకు ఉపయోగపడడమే గొప్ప విషయం.మనం మరణించినా.. బతకవచ్చు. మన కళ్లు ఈలోకాన్ని చూస్తాయి. మన గుండె లబ్డబ్ అంటూ కొట్టుకుంటోంది. మన ఊపిరితిత్తులు శ్వాసను అందిస్తాయి. కిడ్నీలు శుద్ధి చేస్తూనే ఉంటాయి.. ఇదంతా శరీరంలోని అవయవ దానంతోనే సాధ్యమవుతుంది. కేవలం అవగాహన లేక అనేక మరణాలు మట్టిపాలు, నిప్పుపాలు చేస్తున్నారు. ఇంకొకరికి దానం చేస్తే, వారి ఆయుష్షు పెంచవచ్చు. బ్రెయిన్డెడ్తో అవయవ దానం చేస్తే కనీసం ఎనిమిది మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు. నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు పంచవచ్చు. మళ్లీ మన కళ్లు ఈ లోకాన్ని చూడొచ్చు. దేహదానం చేస్తే.. మెడికో స్టూడెంట్స్కు పాఠ్యపుస్తకం కావచ్చు. వారి పరిశోధనకు దోహదపడవచ్చు. ఈ దానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అవగాహన పెరుగుతోంది. దానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.స్ఫూర్తి -
పుష్పాలంకరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వా మివారికి క్షీరాభిషేకం చేసి పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకుడు శ్రీనివాసాచార్యులు లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు త రలివచ్చి స్వామివారలను దర్శించుకున్నారు. సమయపాలన పాటించాలిజగిత్యాల: అధికారులు సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ ఫైల్స్ వెంటనే పరిష్కరించాలన్నారు. ఏవో హకీమ్ తదితరులు ఉన్నారు. నాణ్యమైన విద్య నందించాలి ధర్మపురి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. శుక్రవారం ధర్మపురిలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వర్షంతో గదుల్లోకి నీరు చేరి కొంత ఇబ్బంది అవుతుందని విద్యార్థులు తెలుపగా సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన మాక్ పోలింగ్లో పాల్గొన్ని ఓటు వేశారు. ఇన్చార్జి తహసీల్దార్ సుమన్, ఎంపీడీవో రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి తదితరులున్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలిజగిత్యాల: జనాభా పెరుగుదలతో ఇబ్బందులు తలెత్తుతాయని, కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లకార్డ్స్తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా పెరుగుతుంది కానీ ఆర్థిక వనరులు తరిగిపోతున్నాయని, దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఒకరు లేదా ఇద్దరిని కని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్నారు. వైద్యులు సైతం ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, డాక్టర్ సంతోష్, స్వాతి, చైతన్యరాణి తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు నిర్వహించాలిజగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. ఈనెల 15న నిర్వహించే చలో హైదరాబాద్ బీసీల మహాధర్నా పోస్టర్ను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించి మాట్లాడారు. బీసీల రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పిస్తామని, వారి ఓట్ల ద్వారా గద్దెనెక్కి కాలయాపన చేయాలని, మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ చేయించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు, 9వ షెడ్యూల్డ్లో చేర్చడం ఒక్కటే పరిష్కారం అన్నారు. 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీలకతీతంగా ఈనెల 15న ఇందిరపార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు హాజరుకావాలని కోరారు. నాయకులు కుమార్, దేవి రవీందర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరుదశాబ్దాల ఎస్కేఎన్ఆర్
● ఎందరో ప్రముఖులు చదువుకున్న కళాశాల జగిత్యాల: ఒకప్పుడు జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కాలేజీలో సీటు దొరకాలంటే ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే లెటర్ ఉండాల్సిందే. 1965లో ఏర్పాటైన ఈ కాలేజీ 60వ వసంతంలోకి అడుగిడింది. జ గిత్యాలకు చెందిన ప్రముఖుడు కాసుగంటి లక్ష్మీనా రాయణరావు ధర్మపురి రోడ్లో 32.07 ఎకరాల స్థలాన్ని కొని ప్రభుత్వ కళాశాలకు విరాళంగా ఇచ్చారు. అన్ని కోర్సులు.. సువిశాలమైన ప్రాంతంలో ఉన్న ఈ కళాశాలలో విద్యార్థులకు అన్ని కోర్సులు ఉన్నాయి. బీఏ, బీఎం, బీఎస్సీ, బీకాం, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లిష్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏతో పాటు, జిల్లాలో హెల్ప్లైన్ ఇంజనీరింగ్, పాలిసెట్ హెల్ప్లైన్ సెంటర్ కూడా ఉంది. నిరుద్యోగ అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ సైతం ఏర్పాటు చేశారు. 26 మంది లెక్చరర్స్ బోధన చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ ఎస్కేఎన్ఆర్ కాలేజీలో ప్రస్తుతం 605 మంది చదువుకుంటున్నారు. ఇందులోని డిజిటల్ లైబ్రరీ విద్యార్థులకు ఎంతో ఉపయోకరంగా ఉంది. దీనిలో పురాతన, ప్రస్తుత హైటెక్ యుగానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ఇటీవలే ఈ కళాశాలకు న్యాక్ బీ గ్రేడ్ లభించింది. అలాగే అన్ని వసతులతో కూడిన జిమ్ సైతం ఏర్పాటు చేశారు. 32 ఎకరాల్లో రకరకాల చెట్లతో గ్రీనరి ఏర్పాటు చేయగా, గతంలో రూ.5 లక్షల అవార్డు సైతం ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే రూ.50 లక్షలతో వాకింగ్ట్రాక్, కళాశాల ఎదుట ఓపెన్జిమ్ ఏర్పాటు చేశారు. వేడుకలకు సన్నాహాలు కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తి కావడంతో వేడుకలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎమ్మెల్సీ రమణతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ కాలేజీలోనే చదువుకున్నారు. వేడుకలకు సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హాస్టల్ వసతి ఉంటే.. 32 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కళాశాలలో అటాచ్డ్ హాస్టల్ ఉంటే ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగేది. ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తే కార్పొరేట్ కళాశాలల కన్నా బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి జగిత్యాల: జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాల 60 ఏళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శుక్రవారం కళాశాలను సందర్శించి మాట్లాడారు. పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఉత్సవాలకు సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ప్రిన్సి పాల్ అశోక్ మాట్లాడుతూ, కళాశాలలో హాస్టల్ వసతి, ఆడిటోరియం భవనం, నూతన పోస్ట్గ్రాడ్యుయేషన్ కోర్సులు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రాజు, సాయిమధుకర్, గోవర్ధన్, సురేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అన్ని వసతులు
కళాశాలలో విద్యార్థులకు సరిపడా అన్ని మౌలిక వసతులున్నాయి. కొత్త కోర్సులతో పాటు, డిజిటల్ లైబ్రరీ, దోస్త్, హెల్ప్లైన్, టాస్క్ సెంటర్లు సైతం ఉన్నాయి. అనుభవజ్ఞులైన లెక్చరర్లు ఉన్నారు. 60 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో అభినందనీయం. – అశోక్, ఎస్కేఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ గొప్ప కళాశాల ఒకప్పుడు ఈ కళాశాలలో సీటు దొరకాలంటే ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉండేది. 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కాలేజీలో గ్రీనరే కాకుండా మౌలిక వసతులన్నీ ఉన్నాయి. విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. ఎన్సీసీతో పాటు, లైబ్రరీ, ఇలా ఎన్నో ఉన్నాయి. – సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే గుర్తుకొస్తున్నాయి ఈ కళాశాలలో గతంలో చదువుకున్న రోజులు గుర్తుకువస్తున్నాయి. కాలేజీని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించుకునేలా చూస్తాం. – రమణ, ఎమ్మెల్సీ -
రెండురోజులు భగీరథ నీటి సరఫరా నిలిపివేత
జగిత్యాల: మెట్పల్లి మండలం వెంకట్రావ్పేట గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కారణంగా జిల్లాలో రెండురోజుల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు భగీరథ గ్రిడ్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారి శేఖర్రెడ్డి తెలిపారు. పైప్లైన్ మరమ్మతు కారణంగా ఈనెల 12,13 తేదీల్లో నీటి సరఫరా ఉండదన్నారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గంలోని (వెల్గటూర్, ధర్మారం, ఎండపల్లి మండలాలను మినహాయించి) మున్సిపాలిటీలకు భగీరథ నీటిని నిలిపివేయడం జరుగుతుందని, ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. -
యూరియా అతి వినియోగంపై ఆందోళన
జగిత్యాలఅగ్రికల్చర్: స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సరిగ్గా లేక.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లం. హరితవిప్లవం రావడంతో అధిక దిగుబడినిచ్చే కొత్త విత్తనాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా దిగుబడులు పెరిగాయి. అదే సమయంలో అధిక దిగుబడి ఇచ్చేందుకు రైతులు రసాయన ఎరువులు వేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు దొరికే యూరియాను రైతులు అధికంగా వాడుతున్నట్లు వ్యవసాయశాఖ నివేదికల్లో తేలింది. యూరియా మోతాదును మించి పంటలకు వాడుతున్నారని స్వయంగా కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ.నడ్డా ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఒక్క వానాకాలం సీజన్లో సాగుచేసిన పంటలకే 13,843 టన్నుల యూరియా అవసరం. ఈ మేరకు జిల్లాలో మార్చి వరకు 7607 టన్నుల యూరియా ఉండగా.. ఏప్రిల్లో 4248 టన్నులు, మేలో 1257 టన్నులు, జూన్లో 470 టన్నులు, జూలైలో 261 టన్నులు రావాల్సి ఉండగా.. రాష్ట్రానికి రావాల్సిన యూరియాపై కేంద్రం కోత విధిస్తోంది. దీంతో జిల్లాకు అంతంతమాత్రంగానే యూరియా వచ్చింది. ఇక రానున్న రోజుల్లో దొరుకుతుందో..? లేదో..? అని రైతులు అవసరం లేకున్నా నిల్వ చేసుకుంటున్నారు. ప్రస్తుతం యూరియా దొరకకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏ మొక్కకై నా నత్రజని, భాస్వరం, పొటాష్ అవసరం. నత్రజని యూరియా రూపంలో లభిస్తుంది. భాస్వరం సింగిల్ సూపర్ పాస్పేట్, డైఅమ్మోనియం పాస్పేట్ (డీఏపీ)ను రైతులు వినియోగిస్తారు. దాదాపు 85 శాతం డీఏపీని కెనాడ, రష్యా, అమెరికాతో పాటు జోర్డాన్, మొరాకో వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ముడి పొటాష్ను సైతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అవసరాన్ని మించి వినియోగం శాస్త్రవేత్తల సూచనల ప్రకారం పంటలకు సాధారణంగా 4ః2ః1 నిష్పత్తిలో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలు అందించాల్సి ఉంటుంది. కానీ.. రైతులు ప్రస్తుతం 7.2ః2.9ః1 నిష్పత్తిలో వాడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. రసాయన ఎరువులు అధికంగా వాడే పంజాబ్లో 18.6ః 5.4ః1 నిష్పత్తితో మరింత ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందుకే పంజాబ్లో పర్యావరణంతోపాటు ఆహార పదార్థాలు కూడా కాలుష్యంతో నిండిపోయి క్యాన్సర్ రోగులు పెరిగిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. యూరియా వినియోగం పెరగడం.. పోషకాల సమతుల్యత లోపించడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం, పంటల సాంద్రత పెరగడం, పంటల సరళిలో మార్పులు రావడం, పంట పొలాల్లో కార్బన్ లోపించడం వంటి కారణాలతోనే భూముల్లో జింక్ లోపం ఏర్పడుతోంది. వేపపిండితో మేలు.. యూరియా వాడినప్పుడు విధిగా వేప పిండిని 5ః1 నిష్పత్తిలో అంటే 5 కిలోల యూరియాలో కిలో వేపపిండిని కలిపి వాడితే భూమికి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పంటలకు చీడపీడల ఉధృతి తగ్గుతుంది. యూరియా నీటిలో కొన్నాళ్లపాటు నిలువ ఉండి.. మొక్కలకు అవసరమైన సమయంలో అందిస్తుంది. పచ్చిరొట్ట అయిన జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద వంటి పంటలను వేసిన భూమిలోనే రసాయన ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుంది. వేసవి పంటల అనంతరం పొలంలో గొర్రెలు, మేకలు, పశువుల మంద ద్వారా పోషకాలు అధికంగా లభిస్తాయి. ఆయా పంటల్లో రసాయన ఎరువులను భూసార పరీక్షలకు అనుగుణంగా వాడాలి. నేల, వాతావరణ పరిస్థితులను బట్టి రసాయన ఎరువులను పొదుపుగా వాడటం మంచిది. మోతాదులో వాడాలని కేంద్ర ప్రభుత్వ సూచన సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచన యూరియా కొరత లేకుండా చూడాలి జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలి. యూరియా అధికంగా వాడుతున్నారనే సాకుతో యూరియా కోటాను తగ్గించడం చేయవద్దు. పంటల దశలను బట్టి యూరియా సరఫరా చేయాలి. – బందెల మల్లయ్య, రైతు సంఘం నాయకుడు, చల్గల్ యూరియాను నిల్వ చేయొద్దు జిల్లాలో యూరియా అందుబాటులోనే ఉంది. అవసరం లేకున్నా తీసుకెళ్లి ఇళ్లలో నిల్వ చేయవద్దు. పంటల పెరుగుదలకు అనుగుణంగా యూరియా సరఫరా చేస్తాం. యూరియాతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడాలి. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
సామాజిక రుగ్మతలపై సంధించిన అస్త్రం ‘మథనం’
జగిత్యాల: సమాజంలోని సామాజిక రుగ్మతలపై సంధించిన అస్త్రం మథనం పుస్తకమని సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల అన్నారు. జగిత్యాలకు చెందిన కళాకారుడు ఎములవాడ మహిపాల్ రచించిన మథనం కవితాసంపుటిని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రతిఒక్కరూ చదవాలన్నారు. భవిష్యత్లో మరిన్ని అద్భుతమైన సాహిత్య పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాకారులు విజయ్, క్రాంతి పాల్గొన్నారు. కానిస్టేబుల్పై మహిళ ఫిర్యాదు జగిత్యాలక్రైం: తనను కానిస్టేబుల్ బండపల్లి ప్రసాద్ ప్రేమ వివాహం చేసుకుని మోసం చేయడంతోపాటు మరో యువతితో ఇటీవల కనిపించకుండా పోయాడంటూ సారంగాపూర్ మండలం బీర్పూర్ గ్రామానికి చెందిన కస్తూరి భావన జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. భావన జగిత్యాలలో హాస్టల్లో ఉన్న సమయంలో ఒకసారి డయల్ 100కు కాల్ చేసింది. ఆ సమయంలో పరిచయమైన కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికి చెందిన బండపల్లి ప్రసాద్ అనే కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు తనతో కాపురం చేసి.. కొన్నాళ్లుగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం మల్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో కనిపించకుండాపోయాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. గోదావరి తీర గ్రామాలు అప్రమత్తం ధర్మపురి/సారంగాపూర్: ధర్మపురి, బీర్పూర్ మండలాల్లోని గోదావరి తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ధర్మపురి తహసీల్దార్ సుమన్, బీర్పూర్ ఎస్సై ఎస్.రాజు ఆయా గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీర్పూర్లోని చిన్నకొల్వాయి, రేకులపల్లి, కమ్మునూర్ గ్రామాల్లో పర్యటించిన ఎస్సై.. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతోందని, ఏ క్షణమైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులు తారని, ప్రజలు గోదావరిలోకి పశువులు, గొర్రెలను మేపేందుకు వెళ్లవద్దని సూచించారు. పంటల సాగుపై అవగాహనజగిత్యాలఅగ్రికల్చర్: రావెఫ్ విద్యార్థులు పంటల సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన పెంచుకున్నారు. వ్యవసాయ వర్సిటీ మాజీ ఈఆర్సీ సభ్యుడు శ్రీరామ్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ అగ్రికల్చర్ విద్యార్థులు కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్కు చేరుకున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలతోపాటు సాగు పద్ధతులు తెలుసుకున్నారు. కొండాపూర్ మైసమ్మ చెరువుకు కాలువల ద్వారా నీటి సరఫరాపై వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు వెల్ముల రాంరెడ్డి వివరించారు. మాజీ ప్రిన్సిపాల్ లక్ష్మణ్, విద్యార్థినులు శృతి, ప్రణీత, శ్రావణి, దీప్తి, హరిణి పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: తప్పిన ప్రమాదంమెట్పల్లి: పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు వెళ్తూ.. మెట్పల్లి బస్స్టేషన్లో ఆగింది. ప్రయాణీకులతో జగిత్యాల వైపు బయలుదేరిన బస్సు.. ఔట్ గేట్ నుంచి జాతీయ రహదారి పైకి వెళ్లగానే ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయి ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులు, సిబ్బందికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దెబ్బతిన్న వాహనాన్ని బస్స్టేషన్కు తరలించి నిర్మల్ డిపోకు సమాచారమందించారు. అక్కడి అధికారులు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో బస్సును పంపించారు. -
ప్రాణం తీసిన భూ తగాదా
● వరుసకు అన్నపై తమ్ముడిపై దాడి ● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ధర్మపురి: భూతగాదాలో గొడవ పడి వరుసకు అన్న అయిన రవిపై తమ్ముడు కత్తితో దాడి చేయడంతో మృతిచెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని దోనూర్కు చెందిన గొళ్లెన రవి, నాగరాజు అన్నదమ్ముల కొడుకులు. వారి మధ్య కొంతకాలంగా ఇంటిస్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల రవికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా నిర్మాణం చేపడుతున్నాడు. గురువారం ఇంటి స్థలం విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగగా నాగరాజు రవిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడికి గాయాలు మెట్పల్లిరూరల్: తాటిచెట్టుపై నుంచి కింద పడి గీతకార్మికుడికి గాయాలయ్యాయి. మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన చిలివేరి సత్యనారాయణ తాటిచెట్టుపై కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం మెట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడని బంధువులు తెలిపారు. -
‘ఓటుకు నోటు’ ముద్దాయిని సీఎం చేశారు..
మల్లాపూర్: ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ముద్దాయిని కాంగ్రెస్ పార్టీ సీఎంను చేసిందని, దొంగ చేతికి ఇంటి తాళాలు ఇవ్వడంతో 18 నెలలుగా రేవంత్ రెడ్డి రాష్టాన్ని అధోగతి పాలు చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రంపై అవగాహన లేక కేసీఆర్, కేటీఆర్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని, ప్రతిసారీ సవాల్ చేస్తూ.. పారిపోతున్నారని విమర్శించారు. ఆయన సవాల్ను స్వీకరించిన కేటీఆర్ చర్చకు రమ్మంటే రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తోకముడిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలపై పథకాల మత్తుమందు చల్లి కాంగ్రెస్ అధికారం చేపట్టిందని, పాలన చేతకాక నంబర్వన్గా ఉన్న రాష్ట్రాన్ని ఆగం చేసిందని తెలిపారు. కేటీఆర్, బీఆర్ఎస్ ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తుంటే ఈ–ఫార్ములా, ట్యాపింగ్ కేసులు, కమిషన్ల పేరిట విచారణలతో ప్రభుత్వం కుట్రపూరితంగా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని, గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని తెలిపారు. విద్యార్థులకు భరోసా కల్పించడంలో విఫలం కావడంతో పాటు బాధితులను పరామర్శించి ఆదుకునేవారే కరువయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా హోంమంత్రిగా ఉన్నందునే పోలీసులు ఆక్రమ కేసులతో వేధిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ పోరాటాలతోనే వీటిని ఎదుర్కొంటోందన్నారు. ప్రస్తుత పాలనపై ప్రజల్లో అంగీకారం లేదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్య జాన్సన్నాయక్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దొంగ చేతికి ఇంటి తాళాలు ఇవ్వడంతో రాష్ట్రం ఆధోగతి పాలు పథకాల మత్తు మందు చల్లి కాంగ్రెస్ అధికారం చేపట్టింది ప్రజల తరఫున బీఆర్ఎస్ నిలదీస్తున్నందునే అక్రమ కేసులు, విచారణలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ -
ప్రభంజనం
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం ఈదురుగాలులు వీస్తాయి. 7పట్టణ ప్రాంతాల్లో పెరిగిన జనాభా పట్టణం 1991 2001 2011 కరీంనగర్ 1,48,583 2,05,653 2,61,185 జగిత్యాల 67,591 85,521 96,460 రామగుండం 2,14,384 2,36,600 2,58,644 సిరిసిల్ల 50,048 65,314 77,550 కోరుట్ల 40,080 54,012 66,504సాక్షి,పెద్దపల్లి: దేశ ప్రగతికి, పతనానికి ప్రధాన కారణమైన జనాభా ఇప్పుడు ప్రపంచాన్నే భయపెడుతున్న అతిపెద్ద సమస్య. జనాభా తగ్గుదలపై ప్రభుత్వాలు ఆందోళన చెందుతుండగా, మారిన జీవనశైలితో పిల్లలను కనేందుకు ఆసక్తిచూపని దంపతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ఇకపై వద్దంటూ ఒకప్పుడు ప్రభుత్వాలే ముమ్మరంగా ప్రచారం చేయగా, నేడు వీలైనంత మందిని కనండని ప్రభుత్వాలే వేడుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో జనాభా పెరుగుదల కనిపిస్తుండగా, మరణాలు సంఖ్య గణనీయంగా తగ్గాయి. పెరిగిన జనాభా విద్య, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసపోతుండడంతో పల్లె చిన్నబోతుంది. పంట పొలాలు కనుమరుగై ఆకాశ హార్ామ్యలు వెలుస్తున్నాయి. కరీంగనర్, రామగుండం కార్పొరేషన్తో సహా జిల్లాకేంద్రాలుగా మారిన మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారుతుండటం పట్టణాలకు వలసపోతున్న జనాభాకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నియంత్రణతో అడ్డుకట్ట జనాభా పెరుగుదల అభివృద్ధికి ఆటంకమన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసింది. అయినా 1952 నుంచి 1975 ఎమెర్జెన్సీ కాలం వరకు విపరీతంగా పెరిగింది. ఎమెర్జెన్సీ తర్వాత 1976లో ప్రకటించిన జాతీయ జనాభా విధానం అనుగుణంగా వివాహ వయస్సు పెంచడం, ఆర్థిక ప్రోత్సాహకాలు, మహిళ అక్షరాస్యత పెంపుతో జనాభా తగ్గుదల నమోదైంది. అయితే ఇటీవల కరోనా సమయం అనంతరం జనాభా స్థిరీకరణపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. పట్ణణీకరణే ప్రధాన సమస్య జిల్లాల విస్తరణ, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఉఫాది, సౌకర్యవంతమైన జీవనం కోరుతూ ప్రజలు నగరం బాట పడుతున్నారు. కొత్త జిల్లాలుగా ఏర్పాడిన పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల కేంద్రాల్లోనూ పట్టణీకరణ వేగం పుంజుకుంటోంది. ప్రభుత్వ వైద్యం, విద్యా సదుపాయాలను మెరుగుపరుస్తుండడం, కొత్త కట్టడాల నిర్మాణం పెరుగుతుండడంతో వివిధ వర్గాలకు ఉపాధి లభిస్తోంది. దీంతో ఆయా కేంద్రాల్లో జనాభా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో మున్సిపాలిటీల్లో జనాభా ఒత్తిడి పెరుగుతుంది. ఆయా జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం సవాలుగా మారుతుంది. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వసతుల కల్పనపై ప్రత్యేక చొరవ చూపిస్తేనే సమస్యలు తీరనున్నాయి.పెరిగిన జననాలు జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం–2021 నివేదిక ఆధారంగా 2021లో జిల్లాలో నమోదైన జననాలను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా చూస్తే 43,345 జనాలు ఉండగా, మరణాలు 26,757 నమోదయ్యాయి. మెడికల్ వసతులు పెరగడం కారణంగా తెలుస్తోంది.1)ప్రస్తుతం సమాజంలో పేరేంట్స్ ఎంతమంది పిల్లలు కావాలనకుంటున్నారు?ఎ)ఒక్కరు బి)ఇద్దరు సి)ముగ్గురు అంతకన్నా ఎక్కువ15% 32.0/25.0గరిష్టం/కనిష్టం -
సీఎంకు తెలంగాణపై కమిట్మెంట్ లేదు
● బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలే ప్రజలకు జనతా గ్యారేజ్ ● నాయకులు, కార్యకర్తలను వేధిస్తే ఐక్య పోరాటాలు ● స్థానిక సంస్థల్లో అన్ని స్థానాలూ గెలుచుకుందాం ● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావుమల్లాపూర్: సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ పట్ల కమిట్మెంట్ లేదని, ఆయనలో కంటెంట్ కూడా లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మండలకేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర నాయకులు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యా రు. బీఆర్ఎస్ పాలనలో నంబర్వన్గా ఉన్న రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అవినీతిమయం చేశారని విమర్శించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకుంటున్నారన్నారు. పథకాల లబ్ధిదారులను డబ్బు ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్లోకి చేర్చుకుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేద్దామన్నారు. అధి కార పార్టీ నాయకుల దాడులు, వేధింపులకు దిగితే తామే నిలబడి కోట్లాడుతామని భరోసా ఇచ్చారు. అర్హులకు ఏ పథకం అందకున్నా.. కలెక్టరేట్ను ము ట్టడిద్దామన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఖానా పూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్య జాన్సన్నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, మాజీ వైస్ ఎంపీపీ నాగేష్ పాల్గొన్నారు. గురుకులం పాఠశాలను సందర్శించిన ప్రవీణ్కుమార్మెట్పల్లి: పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ ఎమ్మెల్యేతో కలిసి సందర్శించారు. పాఠశాలలో సమస్యలపై సిబ్బంది, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వివరించగా.. తానే స్వయంగా జనరేటర్ను సమకూరుస్తానని ఎమ్మెల్యే తెలిపారు. -
కొత్త లైన్లు ఏర్పాటు సంతోషం
సారంగాపూర్ అడవిలో చెట్లు పడి కరెంట్ నిలిచిపోయేది. అటు పొలాలకు కరెంట్ లేక.. పంటలకు ఇబ్బంది కలిగేది. ఇళ్లలో దోమల బెడదతో తట్టుకోలేకపోయేవాళ్లం. రాత్రిపూట బయట అడుగుపెట్టడం కష్టంగా ఉండేది. అధికారులు కొత్తగా చేపట్టిన నేరెళ్ల లైన్తో సమస్య లేకుండా తీరుతుంది. – పురుమల్ల నగేష్రెడ్డి, సారంగాపూర్ చాలా ఏళ్ల సమస్య తీరింది మేం 40 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు విద్యుత్ అధికారులు ఇప్పుడు పరిష్కరిస్తున్నారు. కొత్త లైన్లతో ఒక లైన్ నుంచి కరెంట్ రాకున్నా.. మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు పొలాలకు నీరు పెట్టేందుకు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆ సమస్య తీరుతుండడం ఆనందంగా ఉంది. – న్యారబోయిన రాజేశం, సారంగాపూర్ కొత్త లైన్ ప్రారంభిస్తాం నేరెళ్ల నుంచి ఏర్పాటు చేస్తున్న 33 కేవీ విద్యుత్ లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఉన్నతాధికారుల సహకారంతో మరో 15 రోజుల్లో ఈ లైన్ నుంచి విద్యుత్తు సరఫరా ప్రారంభిస్తాం. కొత్త లైన్ల ఏర్పాటుతో సారంగాపూర్, బట్టపల్లి, నాయికపుగూడెం, పోతారం గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉండదు. – ప్రవీణ్, ఏఈ, సారంగాపూర్ -
భగీరథ నీటి సరఫరా నిలిపివేత
● వెంకట్రావ్పేట వద్ద పగిలిన పైపు ● వారం రోజులుగా అక్కడ లీకేజీలు ● మరమ్మతు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యంమెట్పల్లి: పట్టణంలోని వెంకట్రావ్పేట వద్ద జాతీయ రహదారి పక్కనున్న మిషన్ భగీరథ పైపు గురువారం పగిలింది. దీంతో పెద్ద ఎత్తున నీరు వృథాగా పోయింది. వారం క్రితం అక్కడ లీకేజీలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి మరమ్మతు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతూ వస్తున్నారు. తాజాగా పైపు ఒక్కసారిగా పగలడంతో నీరు జాతీయ రహదారి మీదుగా దిగువన ఉన్న ఖాళీ స్థలాల్లోకి భారీగా వచ్చి చేరింది. రోడ్డుపై నీటి ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. నీటి ఉధృతి తగ్గిన తర్వాత రాకపోకలు కొనసాగాయి. సంఘటనా స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ మోహన్, ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. ప్రధాన పైపులైన్ పగలడంతో శుక్రవారం నుంచి జిల్లాకు నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. -
ప్రత్యామ్నాయ లైన్లతో.. విద్యుత్ సమస్యకు చెక్
● నాలుగు గ్రామాలకు తీరనున్న విద్యుత్ సమస్య ● నేరెళ్ల నుంచి రూ.53 లక్షలతో పనులు ● 11 కిలోమీటర్ల 33 కేవీ విద్యుత్తు లైన్ ఏర్పాటు ● లక్ష్మీదేవిపల్లి రోడ్డు వెంట పాత లైన్పునరుద్ధరణ సారంగాపూర్: మండలకేంద్రంతోపాటు.. పోతా రం, బట్టపల్లి, నాయికపుగూడెం గ్రామాలకు 40 ఏళ్లక్రితమే విద్యుత్ సౌకర్యం ఉంది. అయితే చిన్నపాటి వర్షం పడినా.. గాలివీచినా సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. అటవీప్రాంతం కావడంతో విద్యుత్ పునరుద్ధరణకు చాలా సమయం పడుతోంది. దీనిని అధిగమించడానికి విద్యుత్ అధికారులు శ్రీకారం చుట్టారు. నాలుగు గ్రామాల సమస్య తీర్చడానికి ప్రస్తుతం ఉన్న రెండు 33 కేవీ లైన్లకు అదనంగా మరో రెండు లైన్లు వేస్తున్నారు. ● మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. ● సారంగాపూర్, లక్ష్మీదేవిపల్లి, రేచపల్లి గ్రామాల్లో 33 కేవీ సబ్స్టేషన్లు ఉన్నాయి. ● సారంగాపూర్ సబ్స్టేషన్ కింద సారంగాపూర్, నాయికపుగూడెం, పోతారం, బట్టపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ● జగిత్యాల మండలం పొలాస మీదుగా తిప్పన్నపేట, హైదర్పల్లి నుంచి సారంగాపూర్, రేచపల్లి, లక్ష్మీదేవిపల్లి సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ● సారంగాపూర్లోని 33/11 కేవీ సబ్స్టేషన్కు వచ్చే లైన్ మూడు కిలోమీటర్ల మేర పూర్తిగా అటవీప్రాంతంలో ఉంది. ● వానవచ్చినా.. ఈదురుగాలులు వీచినా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అటవీప్రాంతంలో లైన్లు తెగిపోతున్నాయి. ● విద్యుత్ వైర్లపై చెట్లు పడి స్తంభాలు విరిగిపోతున్నాయి. ● విద్యుత్ పునరుద్ధరణకు విద్యుత్ సిబ్బంది రాత్రి పూట ఇబ్బంది పడుతున్నారు. ● ఇలా గంటల తరబడి వర్షంలో శ్రమించాల్సి వస్తోంది. ● ఏటా వర్షాకాలం, వేసవిలో ఈ సమస్య తరచూ ఉత్పన్నమవుతోంది. ప్రత్యామ్నాయ లైన్లతో చెక్ ● సారంగాపూర్, బట్టపల్లి, పోతారం, నాయికపుగూడెం గ్రామాలకు విద్యుత్ సమస్య ఉండకూడదన్న ఆలచోనతో ఆ శాఖ రూ.53లక్షలతో ధర్మపురి మండలం నేరెళ్ల నుంచి సారంగాపూర్ సబ్స్టేషన్కు అదనంగా మరో 33 కేవీ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. ● మూడు నెలల క్రితం పనులు ప్రారంభించింది. ● 11 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న 33 కేవీ లైన్ నేరెళ్ల నుంచి నేరుగా సారంగాపూర్ సబ్స్టేషన్కు చేరుతుంది. ● విద్యుత్ శాఖ కన్స్ట్రక్షన్ డీఈఈ ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతూ.. పూర్తి కావచ్చాయి. ● ఈ నెలఖరులోగా నేరెళ్ల లైన్కు కనెక్షన్ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు.. మూడో లైన్ పునరుద్ధరణ.. ● నేరెళ్ల నుంచి కొత్త లైన్ నిర్మాణం పూర్తికాగా.. లక్ష్మీదేవిపల్లి నుంచి సారంగాపూర్కు రోడ్డు వెంట గతంలో వేసిన పాత లైన్ను పునరుద్ధరిస్తున్నారు. ● దీని ద్వారా సారంగాపూర్ సబ్స్టేషన్కు మూడు లైన్లు సిద్ధమవుతున్నాయి. ● నాలుగు గ్రామాలకు ఏ ఒక్కక్షణం కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇటిక్యాలలో జిల్లా అదనపు మొదటి జడ్జి పూజలు
రాయికల్: గురుపౌర్ణమి సందర్భంగా మండలంలోని ఇటిక్యాలలోగల సాయిబాబా ఆలయ ంలో గురువారం జిల్లా అదనపు మొదటి జడ్జి నారాయణ పూజలు చేశారు. సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ హిమవంతరావు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణంమల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని గురువా రం శ్రీలలిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 116మంది మహిళలు హనుమాన్ చాలీసా, హనుమాన్ పారాయణం నిర్వహించారు. లింగాష్టకం, విష్ణుసహస్రనామస్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రం లలిత సహస్రనామ పారాయణం చేశా రు. లలిత సేవా ట్రస్టు ఫౌండర్ విశ్వనాథుల రమే శ్, డైరెక్టర్ కొట్టె ప్రేమలత, ఉమాలక్ష్మీ, వనజ, పులి రవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మొక్కలు సంరక్షించాలిజగిత్యాలరూరల్: మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని ఎకాలజికల్ సొల్యుషన్స్ సభ్యులు శ్రీనివాస్, ప్రవీణ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో హరితహారం కింద నాటిన మొక్కలను ఐవోఆర్ఏ ఎకనాలజికల్ సొల్యుషన్స్ న్యూఢిల్లీ వారు పరిశీలించారు. పైలెట్ ప్రాజక్ట్ కింద ఎంపిక చేయబడిన గ్రామాల్లో మొక్కల సంరక్షణకు ప్రత్యేక నిధులు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ నరేశ్, ఏపీవో గంగలక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి కిరీటి, టీఏలు సువర్ణ, వెంకటేశ్, శైలజ పాల్గొన్నారు. హోదా మరిచి.. జనంతో కలిసి..వెల్గటూర్:మంత్రి అయినా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మండలకేంద్రానికి గురువారం వచ్చిన ఆయన ఓ హోటల్ వద్ద ఆగారు. అక్కడ అందరితో కలిసి టీ తాగా రు. ప్రజల సమస్యలు అడిగి తెలుసున్నారు. సామాన్యుడిలా జనంతో కలిసి పోయిన మంత్రిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల పొలంబాటమల్లాపూర్: విద్యుత్ అధికారులు గురువారం పొలంబాట పట్టారు. రైతుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని గుండంపల్లిలో ఎన్పీడీసీఎల్ డీఈ మధుసూద న్ పర్యటించారు. ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోయినపుడు సిబ్బందికి సమాచారం ఇవ్వాలని హితవుపలికారు. తీగలు వేలాడకుండా మధ్యమధ్య స్తంభాలు వేస్తామన్నారు. కొత్త కనెక్షన్లను సత్వరం జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏడీఈ మనోహర్, రాఘవపేట ఏఈ సంతోష్, రైతులు పాల్గొన్నారు. మేడిపల్లిలో..మేడిపల్లి: డీఈ గంగారాం ఆధ్వర్యంలో సిబ్బంది భీమారం మండలకేంద్రంలో పొలంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలపై రైతులకు అవగాహన కల్పించారు. మన్నెగూడెం ఏఈ అశోక్, సబ్ ఇంజినీర్ హరిప్రసాద్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు
జగిత్యాల: జగిత్యాల బల్దియాలో రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బల్దియా కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత ఆధ్వర్యంలో గురువా రం అధికారులతో సమీక్షించారు. పట్టణంలో విలీన ప్రాంతాలకు రూ.20 కోట్లు, తాగునీటికి రూ.32 కోట్లు, అమృత్ స్కీం కింద రూ.38 కోట్లు మంజూరయ్యాయని, వాటితో పనులు ఎలా చేపట్టాలో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం, ఎల్ఆర్ఎస్, స్టాంప్ డ్యూటీ, ఇతర పనులపై ఆరా తీశారు. అర్బన్ హౌసింగ్ కాలనీ, డబుల్బెడ్రూం ఇందిరమ్మ కాలనీలో చేపట్టాల్సిన వసతులకు అంచనాలు రూపొందించాలన్నారు. డ్రైనేజీ, పైప్లైన్ల విషయలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, శానిటేషన్ అధికారులు పకడ్బందీగా పనిచేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, ఏఈలు చరణ్, అరుణ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పల్లెదవాఖానాలతో మెరుగైన వైద్యం జగిత్యాలరూరల్: గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆయుష్మాన్ ఆరోగ్య దవాఖానాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య దవాఖానాల నిర్మాణాలు, రూ.25 లక్షల ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో నిర్మించే సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. -
క్రిప్టో పాపాలు కోకొల్లలు!
బాధితులు ముందుకు రావాలి సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కేంద్రంగా వెలుగుచూసిన మెటా క్రిప్టో దందా రోజుకో మలుపు తిరుగుతోంది. వాస్తవానికి ఇందులో జరుగుతున్న మోసాలపై బాధితులు నగరంలోని పలు ఠాణాల్లో ఇప్పటికే ఫిర్యాదులు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో పాపాల పుట్ట ఆలస్యంగా బద్దలవుతోంది. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు.. మెటా ఫండ్ పేరుతో మొదలైన క్రిప్టో దందా.. రెండు నెలలకే మెటా ప్రో అని పేరు మార్చుకుంది. అదేంటంటే సాంకేతిక మార్పులు అని సర్దిచెప్పారు. ఇక మొత్తం వ్యవహారంలో నగరంలోని ఓ టింబర్ డిపో యజమాని, ఓ మొబైల్షాప్ ఓనర్, ఓ మాజీ కార్పొరేటర్ ముగ్గురు రూ.కోట్లలో అమాయక ప్రజల నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. ఇక ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి లోకేశ్ ఏపీకి చెందిన వాడని కొందరు, ఆయన పూర్వీకులు సిద్దిపేటకు చెందిన వారని మరికొందరు బాధితులు చెబుతున్నారు. వీరంతా పథకం ప్రకారం.. అమాయక ప్రజలకు డబ్బులు రెట్టింపు అవుతాయని ఆశ చూపించి..వారి నుంచి రూ.కోట్లు వసూలు చేసి ఇపుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టించుకోని పోలీసులు.. నగరంలోని తీగలగుట్టపల్లి సమీపంలోని ఓ టింబర్ డిపోయజమాని, కోర్టు సమీపంలోని ఓ మొబైల్ షాప్ యజమాని, మాజీ కార్పొరేటర్ ముగ్గురూ ఒకే సామాజికవర్గం. వీరు అంతా కలిసి లోకేశ్ను కరీంనగర్కు పలుమార్లు తీసుకువచ్చి.. టింబర్ డిపోలో సమావేశాలు నిర్వహించి.. కేవలం మూడు నెలల్లో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మబలికి రూ.లక్షలు వసూలు చేశారు. ఒక దశలో ఓ కస్టమర్ కోసం వేములవాడ వెళ్లి మరీ రూ.16 లక్షలు ఒత్తిడి చేసి తీసుకున్నారు. శామీర్పేటలోని రిసార్ట్లో పలు సమావేశాలు పెట్టారు. వాటికి ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, అరబ్షేక్ వేషధారణలో ఉన్నవారిని తీసుకువచ్చి పెట్టుబడులు ఆకర్షించారు. అక్కడి ఆర్భాటాలు, బౌన్సర్ల హడావుడి, హంగామా చూసిన పలువురు బుట్టలోపడి వారు అడిగినంత చెల్లించారు. బదులుగా అందరికీ మొబైల్లో యాప్ వేసిచ్చి డిజిటల్ డాలర్లు ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. సరిగ్గా రెండు నెలల తరువాత బాధితులంతా మోసపోయామని గ్రహించారు. ఈ వ్యవహారంపై టూ టౌన్లో, త్రీ టౌన్లో బాధితులు పిటిషన్లు ఇచ్చినా.. అవి కేసుల దాకా పోలేదు. – గౌస్ ఆలం, కరీంనగర్ సీపీ లోకేశ్ను పదే పదే కరీంనగర్కు తీసుకువచ్చి.. మొబైల్షాప్ యజమాని, టింబర్ డిపో ఓనర్లు రూ.కోట్లల్లో వసూలు చేశారు. ఇందుకోసం జ్యోతి నగర్లోని ఓల్డ్ డీఐజీ కార్యాలయంలో ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నుంచే మెటా క్రిప్టో ఆపరేట్ చేస్తున్నారు. పేరుకు క్రిప్టో కరెన్సీ అని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇది మల్టీ లెవల్ మార్కెటంగ్ తరహాలోనే తమను మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై బాధితులు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. తమకు నిందితులు ఇచ్చిన ఫ్రాంసరీ నోట్లు, చెల్లని చెక్కులు తదితరాలను ‘సాక్షి’కి పంపుతున్నారు. నేరుగా సీపీకే ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై సీపీ గౌస్ ఆలం కూడా సీరియస్గానే ఉన్నారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే... తప్పకుండా కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని భరోసా ఇస్తున్నారు. మెటా ఫండ్తో మొదలై మెటాప్రో అవతారం ఎదురుతిరిగిన బాధితులకు చెల్లని చెక్కులు జారీ ‘సాక్షి’కి చెక్కులు, ప్రామిసరీ నోట్లు పంపుతున్న బాధితులు టింబర్ డిపో, మొబైల్షాప్ యజమానులు, మాజీ కార్పొరేటర్ కీలకం అరబ్షేక్లు, యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లను చూపి పెట్టుబడులు -
దుర్వాసన భరించలేకున్నాం
దుర్వాసన భరించలేకపోతున్నాం. మేం ఇక్కడ కొన్నేళ్లుగా బుక్స్టాల్ నిర్వహిస్తున్నాం. ప్రారంభంలో చాలా మంది వచ్చారు. ఇప్పుడు దుర్గంధం కారణంగా ఎవరూ రావడం లేదు. దోమలు విపరీతంగా ఉంటున్నాయి. అధికారులు స్పందించి మురికికాలువ నీరు బయటకు వెళ్లేలా చూడాలి. – నాగేంద్రప్రసాద్, జగిత్యాల టైలరింగ్ నడుస్తలేదు నేను టైలరింగ్ చేసుకుంటాను. డ్రైనేజీ పక్కనే నా షాపు ఉంది. మురికినీరు షాపులోకే రావడంతో టైలరింగ్ చేసుకోలేకపోతున్నాను. దోమలతోపాటు.. దుర్గంధం రావడంతో షాపులో గంటసేపు కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – లక్ష్మణ్, జగిత్యాల చర్యలు తీసుకుంటున్నాం సమస్య మా దృష్టికి వచ్చిన రెండు రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. డ్రైనేజీ బ్లాక్ కావడంతో నీరు ఎటూ వెళ్లడం లేదు. ఈ సమస్యను ఇటీవలే స్థానికులు మా దృష్టికి తీసుకొచ్చారు. మురికినీరు వెళ్లేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్ -
భక్తులకు సదుపాయాలు కల్పించండి
సారంగాపూర్: ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరున్న దుబ్బరాజన్న ఆలయంలో భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు కృషిచేస్తానని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారని, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ద్వారా ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేయిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అనూష, పాలకవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీగా వెంకటేశ్వర్రావుమెట్పల్లి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసిన రావులపల్లి వెంకటేశ్వర్రావు ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందారు. బుధవారం కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్గా కళాశాలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ చిలకమారి శ్రీనివాస్, సీనియర్ ఉపన్యాసకులు కొక్కుల గంగాధర్ తదితరులున్నారు. లేబర్ కోడ్ల అమలు నిలిపివేయాలిజగిత్యాలటౌన్: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాలు లేని దేశాన్ని పెట్టుబడిదారులకు బహుమతిగా ఇవ్వడమే కేంద్ర ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. లేబర్ కోడ్ల ద్వారా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ను చట్టబద్ధం చేసి రెగ్యులర్ ఉద్యోగుల భద్రతకు ముప్పు తెచ్చిందన్నారు. ఏఐటీయూసీ నాయకులు ఎండీ.ముక్రం, సుతారి రాములు, సీఐటీయూ జిల్లా కన్వీనర్ పుప్పాల శ్రీకాంత్, ఇందూరి సులోచన, కోమటి చంద్రశేఖర్, చింత భూమేశ్వర్, మెయిజ్ భాయ్, ఖాజా మొయినుద్దీన్, లక్ష్మి, సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేశ్, మల్యాల సురేష్ తదితరులు ఉన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిజగిత్యాలరూరల్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో మహిళాశక్తి సంబరాలు నిర్వహించారు. మహిళాసంఘాల్లో చేరని వారుంటే గుర్తించి చేర్పించాలన్నారు. 16నుంచి 18 ఏళ్లలోపున్న బాలికలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులను ప్రత్యేక సంఘాల్లో చేర్పించాలన్నారు. సదరం ధ్రువీకరణ పత్రం ఉన్న దివ్యాంగుల సంఘాన్ని నాలుగు రకాలుగా విభజించాలని సూచించారు. వడ్డీ లేని రుణాలు, మైక్రోఎంటర్ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాడి గేదెల యూనిట్లకు రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఏపీవో ఓదెల గంగాధర్, సీసీ గంగారాం, వీవోఏలు విజయ, పావని, అధ్యక్షురాలు మానస, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
దుర్గంధ భరితం
మురికి కూపం..జగిత్యాల: జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. యావర్రోడ్ నుంచి కొత్తబస్టాండ్, తహసీల్ చౌరస్తా వరకు రెండు కిలోమీటర్లు ఉంటుంది. ఎప్పుడో నిర్మించింది కావడంతో అక్కడక్కడ కూలిపోయింది. అందులోనే ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతరత్రా వస్తువులన్నీ పడేస్తున్నారు. వర్షం పడితే రోడ్డంతా చెరువును తలపిస్తోంది. సమీపంలోని షాపులు, ఇళ్లలోకి మురికినీరు చేరుతోంది. వర్షం తగ్గినా.. మురికినీరు మాత్రం ఎటూవెళ్లలేని పరిస్థితి. కొత్తబస్టాండ్ నుంచి వచ్చే డ్రైనేజీ తహసీల్ చౌరస్తా వద్ద మెయిన్రోడ్ రోడ్డ్ వద్ద మలుపు తిరుగుతుంది. అక్కడ గతంలో పైపులు వేశారు. అవి పూర్తిగా బ్లాక్ కావడంతోనే నీటి ప్రవాహం సరిగా సాగడం లేదంటున్నారు స్థానికులు. ఆ పైపులు తవ్వాలంటే యావర్రోడ్ను మూసివేయాల్సి వస్తుంది. దీంతో అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. మురికినీటిలోనే సావాసం యావర్రోడ్లో దాదాపు 50 నుంచి 70వరకు షాపులు, వెనుకవైపు ఇళ్లు ఉన్నాయి. మురికినీరంతా రోడ్డుపై నుంచి ఇళ్లలోకి చేరుతోంది. వర్షంపడితే బురద కొట్టుకొస్తోంది. బయటకు పంపిద్దామన్నా.. ఎటూ వెళ్లలేని పరిస్థితి. వాసన భరించలేకపోతున్నామని, వంట చేసుకోలేక.. భోజనం తినలేక.. మరోచోటికి వెళ్లలేక అందులోనే కాలం వెల్లదీస్తున్నామని చెబుతున్నారు.ఈ సమస్యపై కలెక్టర్కు ప్రజావాణిలో కాలనీవాసులు, షాపుల నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. వారం గడిచినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. ఈ చిత్రం తహసీల్ చౌరస్తాలోని డ్రైనేజీ. నీరు నిలిచిపోయి సమీపంలోని మూడునాలుగిళ్లలోకి వెళ్తోంది. ఇంటి యజమానులు నీటిని తొలగించాలని చూసినా సాధ్యపడడం లేదు. భరించలేని దుర్గంధం మధ్యే కాలం వెల్లదీస్తున్నారు. ఇంట్లో ఉండరాదు.. బయటకు వెళ్లరాదు ఎక్కడ చూసినా డ్రైనేజీ నీరే.. దుర్వాసన మధ్యే సహవాసం రోగాల పాలవుతున్న ప్రజలు చోద్యం చూస్తున్న అధికారులు ఇది యావర్రోడ్లోని ఓ ఇంటి ఆవరణ లోకి చేరిన మురికినీరు. మురికికాలువలన్నీ బ్లాక్ కావడంతో ఎటూ వెళ్లక ఇక్క డే నిలిచి ఉంటోంది. భారీ వర్షం పడితే నీరు ఇంటి లోపలికి చేరుతోందని ఆ ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని యావర్రోడ్. సమీపంలోని డ్రైనేజీని శుభ్రం చేయకపోవడంతో అక్కడకక్కడ కూలిపోయింది. కాలువ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో సమీపంలోని షాపులు, ఇళ్లలోకి చేరుతోంది. ఆ వాసన భరించలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీని శుభ్రం చేయాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు.ఉండలేకపోతున్నాం నేను బుక్స్టాల్ పెట్టుకున్నాను. వాస్తవానికి యావర్రోడ్డు రద్దీ ప్రాంతం. ప్రజలు చాలామంది రావాలి. కానీ.. దుర్గంధంతో ప్రజలు ఇక్కడికి రావడం లేదు. ఇప్పుడిక్కడ వ్యాపారం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. వర్షం పడితే మురికినీరంతా షాపులోకి వస్తోంది. మా పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. అధికారులు స్పందించాలి. – సతీశ్, జగిత్యాల ఇది జిల్లాకేంద్రంలోని ఓ ఇల్లు. వారి ఇంటి సందులోకి వెళ్లాలన్నా.. బురద తొక్కుకుంటూ.. మురికినీరు దాటాల్సిందే. ఇంట్లో ఉన్నవారు బయటకు వెళ్లాలన్నా మురుగులోంచి నడవాల్సిందే. నీరంతా వంటగది, బెడ్రూంలోకి చేరుతుండడంతో ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఇక్కడ ఎటుజడ్ బజార్ షాపు ఉండేది. పాన్టేలాతోపాటు వివిధ షాపులున్నాయి. ఈ మురికినీరంతా షాపుల్లోకి వెళ్లడంతో భరించలేక మూసివేశారు. అత్యధిక రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మురికినీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్థానికులు రోగాల పాలవుతున్నారు. ఎటైనా ఓ వైపు మురికినీరు తరలించేలా చూడాలని షాపుల యజమానులు కోరుతున్నారు. -
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి
● గోదావరి పుష్కరాలకు ధర్మపురి క్షేత్రాన్ని తీర్చిదిద్దుతా ● రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువుల కొరత రానీయం ● ‘దిశ’ కమిటీ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ జగిత్యాల: జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. గోదావరి పుష్కరాల వరకు ధర్మపురి క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా అభివృద్ధి (దిశ)పై సమీ క్షించారు. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయంపై అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. జిల్లాలో అధిక శాతం మంది వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారని, సా గునీటికి ఇబ్బంది రాకుండా ఇరిగేషన్ అధి కారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఎరువుల కొరత రానీయొద్దని, అధికా రులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎంతో మాట్లాడి నిధులు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. కొత్త డిగ్రీ కళాశాల, స్టడీ సర్కిల్కు నిధులు మంజూరు చేస్తానన్నారు. జగి త్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడు తూ.. కొండగట్టు అంజన్న ఆలయంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ కళా శాలలో సౌకర్యాలు కల్పించాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ.. మ న ఊరు – మన బడి కార్యక్రమానికి సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు మంజూ రు చేయాలని కోరారు. వర్షకాలం నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పట్టణాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వరద డ్యామేజీ పనులను సత్వరమే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ జగిత్యాలలోని డబుల్బెడ్రూం ఇళ్ల వద్ద సౌకర్యాలు కల్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. కొత్తబస్టాండ్ నుంచి పాతబస్టాండ్ వర కు రోడ్డు వెడల్పు చేయాలన్నారు. ఎస్కేఎన్ఆర్ కళాశాల ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వజ్రోత్సవాలు నిర్వహించేలా చూడాలన్నారు. అన్ని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కా ర్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు క లెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు. -
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి
జగిత్యాల: అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, పట్టణ అభివృద్ధికి ఎళ్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో బుధవారం అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బల్ది యాకు రూ.50కోట్లు, డబుల్బెడ్ రూం ఇళ్లకు రూ.20 కోట్లు మంజూరయ్యాయని, రూ.4 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మహిళాసంఘాల ద్వారా రూ.లక్ష రుణం ఇచ్చే అవకాశం ఉందని, దీనిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగభూషణం, కోరుట్ల కాంగ్రెస్ ఇన్చార్జి నర్సింగరావు, అడువాల జ్యోతి, సుధాకర్, శంకర్, అల్లె గంగసాగర్, పద్మజ, ధర్మరాజు, సమిండ్ల శ్రీను పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
అడవిపై గొడ్డలి వేటు
రాయికల్: చెట్లు పెంచాలి.. అడవులను రక్షించా లి.. హరితవనానికి కృషి చేయాలి.. ఇది ప్రభుత్వ విధానం. కానీ.. అందుకు విరుద్ధంగా రాయికల్ రేంజ్లోని కొంత మంది అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అటవీశాఖ అధికారుల ఉదాసీనతతో భారీ చెట్లను నరికి రాత్రి వేళల్లో కలపను తరలిస్తున్నారు. రాయికల్ రేంజ్ పరిధిలో రాయికల్, మల్లాపూర్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 11 వేల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. రాత్రిపూట కలపను అక్రమంగా తరలించేందుకు కొంతమంది స్మగ్లర్లు అటవీశాఖ సిబ్బందిని మచ్చిక చేసుకుంటున్నారు. వారి అండదండలతో ఉదయం పూట చెట్లను నరుకుతూ.. రాత్రి సమయంలో గుట్టుచప్పుడు తరలిస్తున్నారు. పర్యవేక్షణ లోపంతో.. రాయికల్ రేంజ్ పరిధిలోని దావన్పల్లి, వస్తాపూర్, బోర్నపల్లి, చింతలూరు, కొత్తపేట, వీరాపూర్, పోరుమల్ల, అయోధ్య, ఆలూరు అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉదయం చెట్లను నరికేస్తూ కలపను రాత్రులపూట ద్విచక్ర వాహనాల ద్వారా జగిత్యాల, కోరుట్ల, రాయికల్కు తరలిస్తున్నారు. బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, చౌకీదార్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అటవీశాఖలో సిబ్బంది కొరత.. చెక్పోస్టులు లేక రవాణా రాయికల్ రేంజ్ పరిధిలో 15 బీట్లు ఉన్నాయి. ఒక్కో బీట్కు ఒక్కో బీట్ ఆఫీసర్ ఉండాలి. కేవలం ఆరుగురు బీట్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. ఐదుగురు సెక్షన్ ఆఫీసర్లకు నలుగురు మాత్రమే ఉన్నారు. మొబైల్ పార్టీ సెక్షన్ ఆఫీసర్ పోస్టు పూర్తిస్థాయిలో ఖాళీగా ఉంది. కలప రవాణా నియంత్రణ కోసం బోర్నపల్లి, దావన్పల్లి, జగిత్యాలలో చెక్పోస్టులను అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అనుమతులు రాకపోవడంతో అక్రమ రవాణాదారులు ఇదే అదునుగా భావించి గోదావరితీరమైన బోర్నపల్లి నుంచి మల్లాపూర్ మండలానికి నిర్మల్ జిల్లా కడెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించినప్పటికీ అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడం.. కొత్త సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్న వారితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. సిబ్బందిపై పనిభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎఫ్వో స్పందించి కలప అక్రమ రవాణా నియంత్రణకు సరిహద్దుల ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని అటవీ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. కలపను తరలిస్తున్న స్మగ్లర్లు అటవీశాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత రాయికల్ రేంజ్లో కనిపించని చెక్పోస్టులు రాత్రివేళ వాహనాలపై తరలిస్తున్న అక్రమార్కులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అటవీశాఖ అధికారులుఅక్రమ రవాణా చేస్తే చర్యలు అడవిలో చెట్లు నరకడం నేరం. కలపను తరలించడం.. చెట్లు నరికివేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రివేళ పెట్రోలింగ్ చేపట్టి అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తాం. ఎవరైనా కలప రవాణా చేస్తే సమాచారం అందించాలి. పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఉన్నతాధికారుల అనుమతులు రాగానే చెక్పోస్టులు ఏర్పాటు చేస్తాం. – భూమేశ్, ఎఫ్ఆర్వో -
ముగిసిన డీడీఎన్ ఆలయాల ఎంపిక పరిశీలన
కరీంనగర్ కల్చరల్: ప్రతీగ్రామంలో ఒక ఆలయానికి నిత్యం దీపదూపాలు నిర్వహించాలనే ఉద్దేశంతో 2007లో వైఎస్సార్ హయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డీడీఎన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాలకు దూపదీప నైవేద్య పథకం వర్తింపజేసేందుకు దేవాదాయశాఖ మే1న నోటిపికేషన్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 317 దరఖాస్తులు రాగా.. ఎంపిక పరిశీలన ఇటీవలే ముగిసింది. ప్రతి తీ జిల్లాలో దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీతో చర్చించి, సభ్యులతో సంతకాలు చేయించి, ఆమోదం పొందిన తరువాత జాబితాను దేవాదాయశాఖ కమిషన్ కార్యాలయానికి పంపించనున్నారు. ఉమ్మడి జిల్లా దేవాయశాఖ సహాయ కమిషనర్, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సీనియర్ ఈవోలు, రెగ్యులర్ అర్చకుల నుంచి ఒకరు, డీడీఎన్ అర్చకుల నుంచి ఇద్దరు కమిటీగా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ నిర్మాణం చేపట్టి 15ఏళ్లు పూర్తయ్యిందా..? డీడీఎన్ నిబంధనల మేరకు ఉన్నాయా అని పరిశీలించారు. ‘డీడీఎన్ ఆలయాల ఎంపిక పరిశీలన ముగిసింది. ప్రతీ జిల్లాలో దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ సంతకాల స్వీకరణ తరువాత జాబితా దేవాదాయ కమిషనర్కు పంపిస్తాం’ అని దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాక కమిషనర్ నాయిని సుప్రియ వివరించారు. ఉమ్మడి జిల్లాలో డీడీఎన్ దరఖాస్తుల వివరాలు జిల్లా ప్రస్తుత వచ్చిన ఆలయాలు దరఖాస్తులు కరీంనగర్ 256 100 పెద్దపల్లి 153 69 రాజన్న సిరిసిల్ల 167 42 జగిత్యాల 322 106 మొత్తం 898 317 -
శ్మశానవాటికలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారా?
పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్ శివారులోని ప్రభుత్వ స్థలంలో అప్పన్నపేట ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ స్థలం కేటాయింపు వివాదాస్పదమైంది. శ్మశానవాటిక కోసం వినియోగించుకుంటున్న స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడమేమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈమేరకు మంగళవారం చదును పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. అంత్యక్రియల కోసం వినియోగిస్తున్న స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సరికాదన్నారు. పనులను నిలిపివేయించిన గ్రామస్తులు.. ఆ తర్వాత కలెక్టరేట్కు తరలివెళ్లారు. అడిషనల్ కలెక్టర్ వేణును కలిసి వినతిపత్రం అందజేశారు. శ్మశానవాటికలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని వారు కోరారు. రాఘవాపూర్లో గ్రామస్తుల నిరసన స్థలం మార్చాలని అధికారులకు ఫిర్యాదు -
మరోచోట ఏర్పాటు చేయాలి
శ్మశానవాటిక స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పా టు చేయడం సరికాదు. ప్లాంట్ ఏర్పాటు పనుల్లో శవాల ఎముకలు బయటపడ్డాయి. ఇది మా మనోభావాలను దెబ్బతీయడమే. మరోచోట ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. – మర్కు లక్ష్మణ్, బీఆర్ఎస్ నేత ఉన్నతాధికారులు చొరవ చూపాలి శ్మశానవాటిక స్థలాన్ని చదును చేసే పనులు విరమించుకోవాలి. అంత్యక్రియలు జరిపేందుకు వినియోగిస్తున్న స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించాలనే యోచన సరికాదు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి. – తాడిచెట్టి శ్రీకాంత్, రాఘవాపూర్ ప్రభుత్వ స్థలంలోనే ఏర్పాటు కొందరు గ్రామస్తులు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. శ్మశానవాటికలో కాకుండా రెవెన్యూ అధికారులు నిర్ధారించిన హద్దుల్లోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీమాల, జిల్లా సహకారశాఖ అధికారి -
మరణించినా.. నలుగురికి చూపునిచ్చారు
కోల్సిటీ(రామగుండం): రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. వారి నేత్రాలను దానం చేసి, నలుగురికి చూపు ప్రసాదించి ఆదర్శంగా నిలిచాయి వారి కుటుంబాలు. గోదావరిఖని ఓల్డ్ అశోక థియేటర్ సమీపంలోని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కడారి చంద్రయ్య(61), ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. విషాదంలో ఉన్న ఆయన కుటుంబసభ్యులు.. చంద్రయ్య నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి(జీజీహెచ్)లో మంగళవారం ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాదుకు తరలించారు. అలాగే స్థానిక విలేజ్ రామగుండానికి చెందిన అంబాడి రాజశేఖర్(55) ఈనెల 7న రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన దుఃఖంలో కూడా కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలుదానం చేసేందుకు ముందుకు వచ్చారు. జీజీహెచ్లో టెక్నీషియన్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాదుకు తరలించారు. మృతుల కుటుంబాలను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేశ్, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి వాసుతోపాటు రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్లప్ప, కార్యదర్శి సారయ్య, కోశాధికారి రాజేందర్, మాజీ అధ్యక్షుడు పి.మల్లికార్జున్ అభినందించారు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి కళ్లు దానం చేసిన రెండు కుటుంబాలు అభినందించిన సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ -
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం
మేడిపల్లి: మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గోడిశెల గట్టయ్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గట్టయ్యకు ఇద్దరు కొడుకులు. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. భార్యకు లోకజ్థానం తక్కువ. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. ఈ క్రమంలో మనస్తాపంతో ఆదివారం ఉదయ క్రిమిసంహారక మందు తాగాడు. స్థానికులు అతడిని వెంటనే జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరిన ఆయన సాయంత్రం సమయంలో మల్యాల మండలం కొండగట్టు ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కేకలు వేయడంతో స్తానికులు గమనించి మంటలు ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు గట్టయ్యను కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చీర్లవంచలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. చీర్లవంచకు చెందిన గంగు శ్రీనివాస్ (22) మద్యానికి బానిసై ఏ పని చేయక తిరుగుతూ ఉండేవాడు. సోమవారం రాత్రి గ్రామ శివారులోని డంపింగ్ యార్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలు..ఇల్లందకుంట: మండలంలోని మర్రివానిపల్లి గ్రా మానికి చెందిన కాటిపల్లి అమృతమ్మ(70) అ నారోగ్యంతో జీవితంపై విరక్తిచెంది వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇల్లందకు ంట ఎస్సై క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. అ మృతమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో సోమవారం ఇంట్లోంచి బయటకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు మంగళవారం చుట్టుపక్కల వెతుకుతుండగా.. గ్రామశివారులోని ఓ వ్యవసాయబావిలో మృతదేహం లభించింది. త నతల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, జీవి తంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని అమృతమ్మ కొడుకు రవీందర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో నాలుగు సోలార్ పవర్ ప్లాంట్లు పెద్దపల్లిరూరల్: జిల్లాలో పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. మహిళా స్వశక్తి సంఘాలు, రైతులు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సా హం అందించాలని నిర్ణయించారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు ముందుకు రావడంతో నాలుగు చోట్ల ఏర్పాటుకు చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. అందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి హద్దులు నిర్ణయించడంతో పనులు చేపట్టారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట సహకార సంఘం ఆధ్వర్యంలో రాఘవాపూర్లో ఒకటి, మండల కేంద్రమైన కాల్వశ్రీరాంపూర్లో మరోటి, మంథని మండ లం గుంజపడుగులో ఇంకోటి, ధర్మారం మండలం దొంగతుర్తిలోనూ సహకార సంఘం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుగుణంగా స్థలాల చదును పనులు ప్రారంభించారు. రెడ్కో నోడల్ ఏజెన్సీ పర్యవేక్షణలో.. జిల్లాలో ఏర్పాటు సోలార్ పవర్ ప్లాంట్ల పనులు టీజీ రెడ్కో నిర్మాణ సంస్థ పర్యవేక్షణలో జరగనున్నాయి. తక్కువ ఖర్చుతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గల అవకాశాలపై నివేదిక అందించాలని ఇటీవల జరిగిన సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణకు ఒప్పందం చేసుకునేందుకు పకడ్బందీగా మార్గదర్శకాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఒక్కో మెగావాట్ ఉత్పత్తి లక్ష్యం.. పీఎం కుసుమ్ పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ను దాదాపు నాలుగెకరాల స్థలంలో ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోలార్ పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ను ఎన్పీడీసీఎల్కు విక్రయించి ఆదాయాన్ని ఆర్జించనున్నట్టు జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల తెలిపారు. -
గొప్పనేత వైఎస్సార్
● మాజీ మంత్రి జీవన్రెడ్డి జగిత్యాల టౌన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి గొప్ప నేత అని మాజీ మంత్రి జీవన్రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాతో వైఎస్సార్కు ఎనలేని మమకారం ఉందని, అందుకే జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. నాచుపల్లిలో జెఎన్టీయూ, కోరుట్లలో వెటర్నరీ కళాశాల, జగిత్యాలలో పండ్ల మార్కెట్ ఆయన చలవే అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. -
35 ఏళ్లుగా సాయి సేవలో..
● ట్రస్ట్, దాతల సహకారంతో అభివృద్ధి వేములవాడ: పట్టణంలోని మార్కండేయనగర్లో 1990 లో నిర్మించిన సాయిబాబా ఆలయానికి 35 ఏళ్లుగా సేవలందిస్తూ భక్తులు, స్థానికుల మన్ననలు పొందుతున్నా రు. ట్రస్టీలు, దాతల సహకారంతో 35 ఏళ్లు పూర్తిచేసుకు ని రూ.3 కోట్లతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈనెల 10న నిర్వహించే గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ట్రస్టీలు ప్రణాళికలు సిద్ధం చేశారు. 1990లో బాబా గుడి పునాది మార్కండేయనగర్లో 1990లో అప్పటి సర్పంచ్ ప్రతాప చంద్రమౌళి ఆధ్వర్యంలో పాలకమండలి లేఅవుట్ స్థలాన్ని సాయిబాబా సంస్థాన్కు అప్పగించింది. షిరిడీ సాయిబాబా సేవాసంస్థాన్ ట్రస్ట్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా అప్పటి వార్డు సభ్యుడు వారాల దేవయ్యను ఎన్నుకున్నారు. 1993లో ఆలయ నిర్మాణం పూర్తయింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం ఇరుకుగా మారింది. దీంతో దాతల సహకారం, ట్రస్టీల ప్రోత్సాహంతో ఇప్పటివరకు రూ.3 కోట్లు ఖర్చుచేసి 2011లో నూతన భవనం నిర్మించుకున్నారు. ట్రస్టీల సేవానిరతి ఎలాంటి పారితోషికం లేకుండా 35 ఏళ్లుగా ఆలయంలో ఉచితంగా భక్తులకు సేవలందిస్తున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా వారాల దేవయ్య, ట్రస్టీలుగా గంప రాజేందర్, కూర రమేశ్, కోనమ్మగారి నాగరాజు, బండారి కుమార్, రైకనపాట శ్రీనివాస్, గంప గౌరిశంకర్, నాగుల యాదగిరి, ఎంబేరి నర్సయ్య, పీచర రవీందర్రావు, టి. కృష్ణస్వామి, తొగరి వెంకటేశ్ కొనసాగుతున్నారు. ట్రస్టీలు చేస్తున్న సేవలు గుర్తించిన పలు సంస్థలు అవార్డులు ప్రకటించాయి. 2009లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్లో వేములవాడ సాయిబాబా ఆలయం నుంచి వారాల దేవయ్యను ఎంపిక చేశారు. -
మీ సేవ.. మరింత చేరువ
కరీంనగర్ అర్బన్: కాగిత రహిత పాలనగా సేవలందిస్తున్న మీసేవ మరిన్ని సేవలకు వేదికవుతోంది. ఇప్పటికే పలు రకాల ప్రయోజనాలు అందిస్తుండగా రెండు నెలల క్రితం తొమ్మిది రకాల సేవలను పొందుపర్చారు. తాజాగా మరో రెండు రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం స్వాగతించదగ్గ పరిణామం. ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు రెవెన్యూ, పురపాలిక, పంచాయతీరాజ్ తదితర శాఖల సేవలు అందిస్తూ పలు ధ్రువీకరణ పత్రాల జారీతో ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తోంది. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసే వివాహ ధ్రువీకరణ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రాలను మీసేవ ద్వారా పొందే వెసులుబాటు కల్పించింది. పౌరుల పేరు మార్పిడి, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు, లోకల్ క్యాండిడేట్, స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, మైనారిటీ ధ్రువీకరణ, క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్, మార్కెట్ విలువ, ఖాస్రా, పహాణీల వంటి పాత ధ్రువీకరణ పత్రాలు, ఆర్వోఆర్–1(బి) సర్టిఫైడ్ కాపీలు పొందొచ్చు. అప్లికేషన్ కాగితాలతో కార్యాలయాలకు వెళ్లకుండా మీ సేవలోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చని అధికారులు వివరించారు. ● వివాహ ధ్రువపత్రం పొందడం తేలిక వివాహమైన నూతన దంపతులకు వివాహ ధ్రువపత్రం తప్పనిసరి. సదరు ఎలా పొందాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడేవారు. ఏజెంట్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తుండేవారు. బ్రోకర్లు వేలకు వేలు దండుకుని ఇబ్బందులకు గురిచేస్తుండగా పలువురు అన్ని పత్రాలకు తామే బాధ్యులమంటూ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ప్రయాస లేకుండా వివాహ ధ్రువీకరణ పత్రం అవసరం ఉన్నవారు మీ సేవ కేంద్రం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దళారులకు అస్కారం లేకుండా ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. ● కావాల్సినవి ఏంటంటే.. వధూవరులిద్దరి ఆధార్ కార్డులు, ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు తదితర గుర్తింపు పత్రాలు. వయసు రుజువు కోసం పదో తరగతి మెమో. రెండు కుటుంబాలకు చెందిన వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లికి సంబంధించిన రెండు ఫొటోలు. ముగ్గురు సాక్షులకు చెందిన గుర్తింపు పత్రాల జిరాక్స్ ప్రతులు. ● మార్కెట్ విలువ పత్రాలు పొందొచ్చు గృహ నిర్మాణాలు, ఇతర బ్యాంకు రుణాల కోసం వ్యవసాయేతర భూములకు మార్కెట్ విలువ ధ్రువపత్రాలు తప్పనిసరిగా అవసరం. గతంలో వీటిని రిజిస్ట్రేషన్ శాఖలో మ్యానువల్గా అందించేవారు. ఇప్పుడు వాటిని సైతం మీ సేవ ద్వారా అందించనున్నారు. ● త్వరలో ఇసుక బుకింగ్ కూడా.. ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు ‘మీ సేవ’ను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇసుక అవసరమైన వారు మీ–సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకుని తెప్పించుకునే వెసులుబాటు కల్పించనుంది. కొత్తగా మరో రెండు సేవలు -
‘ఎల్లంపల్లి’పైనే ఆశలు
● వరదనీటిని ఒడిసి పట్టుకుంటేనే ప్రయోజనం ● రెండేళ్లుగా నిలిచిపోయిన కాళేశ్వరం ఎత్తిపోతలు రామగుండం: దశాబ్దకాలంగా తాగు, సాగునీటి రంగంతో పాటు పారిశ్రామిక అవసరాలకు క్రమంగా పెరుగుతున్న నీటి వినియోగం మూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా అనతికాలంలోనే నీటి నిల్వలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా రెండేళ్లుగా కాళేశ్వరం జలాలను ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో వివిధ అవసరాలకు ఎల్లంపల్లి జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి చేరే క్రమంలోనే ఎల్లంపల్లికి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపుకునేలా నీటిపారుదలశాఖ అధికారులు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ఎత్తిపోతలతో పని లేకుండానే గతేడాది అధికారులు ప్రత్యేక చొరవతో వరద నీరు సముద్రంలో కలవకుండా ఏడాది మొత్తం అప్రమత్తంగా ముందస్తు ప్రణాళికతో అన్ని అవసరాలను ఎల్లంపల్లితోనే పూర్తి చేసుకోవడం గమనార్హం. ప్రాజెక్టు వివరాలు.. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 148.00 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీలు. నీటి పారుదలశాఖ అధికారులు ఆదివారం తెలిపిన వివరాల మేరకు 8.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా ఇదే రోజు గతేడాది కేవలం 4.80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలతో నింపుకునే రిజర్వాయర్లు ● లోయర్ మానేర్ డ్యాం 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ రిజర్వాయర్ను ఏటా ఎల్లంపల్లి జలాలతో నింపుకోవడం జరుగుతోంది. ● రంగనాయకసాగర్ రిజర్వాయర్ మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ● శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 80.5 టీఎంసీలు నీటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా 9.68 లక్షల ఎకరాలు, సరస్వతీ కెనాల్ 34వేల ఎకరాలు, లక్ష్మి కెనాల్ నుంచి 21వేల ఎకరాలకు సాగునీరందిస్తుంది. వీటితో పాటు ఇతరత్రా తాగునీటి అవసరాలను తీర్చుతుంది. ● మిడ్మానేర్ రిజర్వాయర్కు 27.55 టీఎంసీల సామర్థ్యం ఉంది. ● కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్కు 15 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. ● కొమురవెల్లి మల్లన్నసాగర్ 50 టీఎంసీల వరద నీటిని ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా నింపుకునే సామర్థ్యం కలిగి ఉంది. -
ముగిసిన పోలీస్ డ్యూటీమీట్
కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా జరిగిన రాజన్న జోన్స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ మంగళవారం ఘనంగా ముగిసింది. ఇందులో ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని వరంగల్లో జరగనున్న రాష్ట్రస్థాయి డ్యూటీమీట్కు పంపించనున్నారు. విజేతలకు సీపీ గౌస్ ఆలం పతకాలు అందించారు. సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ విభాగంలోని ఫోరెన్సిక్ సైన్స్ రాతపరీక్షలో గంగాధర ఎస్సై వంశీకృష్ణ బంగారుపతకం సాధించారు. క్రైం ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ చట్టాలు విభాగంలో సిద్దిపేట కమిషనరేట్లోని రాయపోల్ ఎస్సై రఘుపతి, మెడికల్ లీగల్ టెస్ట్లో చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.ప్రదీప్ కుమార్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ పరీక్షలో కామారెడ్డి ఎస్సై ఆంజనేయులు, ఫింగర్ ప్రింట్ సైన్స్లో కరీంనగర్ కమిషనరేట్కు చెందిన ఎస్సై యూనస్, క్రైంసీన్ ఫొటోగ్రఫీ పరీక్షలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఎస్సై ఆంజనేయులు, పోలీస్ పోట్రైట్ పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రసన్న కుమార్ బంగారు పతకం సాధించారు. యాంటీ సాబెటేజ్ చెక్లోని గ్రౌండ్సర్చ్లో కరీంనగర్ కమిషనరేట్కు చెందిన కానిస్టేబుళ్లు వి.సంతోష్, వి.వెంకటేశ్, రూంసెర్చ్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఎం.శ్రవణ్ కుమార్, జి.కిరణ్కుమార్, వెహికల్సెర్చ్లో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, ఎం.శంకర్ బంగారు పతకం సాధించారు. యాక్సెస్ కంట్రోల్లో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఎం.దుర్గాప్రసాద్, కె.సిద్ధిరాములు, డాగ్స్క్వాడ్ కాంపిటీషన్లోని ట్రాకింగ్లో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ జి.శంకర్, నార్కోటిక్ విభాగంలో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ పి.అజయ్, ఎక్స్ప్లోజివ్లో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన డాగ్ హ్యాండ్లర్ పి.వెంకటేశ్ బంగారు పతకం, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్లో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఎస్.సతీశ్కుమార్, ఆఫీస్ ఆటోమేషన్లో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ యూ.భాస్కర్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీలో కరీంనగర్ కమిషనరేట్కు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ కానిస్టేబుల్ జి.సంతోష్ కుమార్ బంగారు పతకం పొందారు. పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో మెదక్ జిల్లాకు చెందిన ఎం.శ్రీధర్గౌడ్, వీడియోగ్రఫీలో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ గౌడ్కు బంగారు పతకాలు వచ్చాయి. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్ పాల్గొన్నారు. విజేతలకు పతకాలు అందించిన సీపీ గౌస్ ఆలం -
కుటుంబాన్ని ఆదుకోండి
నా భర్త రేవల్ల రవీందర్గౌడ్ ఉపాధి కోసం ఇజ్రాయిల్ దేశం వెళ్లాడు. అనా రోగ్యంతో బాధపడుతు న్న ఆయనను ఇటీవల జరిగిన ఇజ్రాయిల్, ఇరా న్ యుద్ధం సందర్బంగా బంకర్లో ఉంచగా సరైన వైద్యం అందక అక్కడే చనిపోయాడు. అప్పులు, పేదరికంతో ఉన్న మా కుటుంబం మరింత కష్టాల్లో పడింది. నా కొడుకు మంజునాథ్ దివ్యాంగుడు (చెవిటి, మూగ) కావడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నా కుమారుడికి ఏదైనా ఉపాధి కల్పించండి. – రేవెల్ల విజయలక్ష్మి, జగిత్యాల ప్లాట్లకు హద్దులు చూపండి 2009లో ఇందిరమ్మ పథకం కింద కొడిమ్యాల శివారులోని సర్వేనంబర్ 411, 412లోగల భూమిని 193 ప్లాట్లుగా చేసి మాకు పట్టాలు ఇచ్చారు. ఇందులో 40ప్లాట్లకు హద్దులు చూపించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని అప్పటి కలెక్టర్ను సంప్రదించగా విచారణ జరిపి మా 40 ప్లాట్లతోపాటు మొత్తం 92 ప్లాట్లకు హద్దులు నిర్ణయించారు. ఆ స్థలంలో కొనుగోలు కేంద్రం నిర్వహించడంతో హద్దులు చెరిపివేయబడ్డాయి. తిరిగి హద్దులు ఏర్పాటు చేయించండి. – కొడిమ్యాల ప్రజలు పరిహారం ఇప్పించండి మాది కొడిమ్యాల మండలం పూడూరు. మా గ్రామం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 563 భూసేకరణలో నష్టపోయిన గౌరాపూర్, నాచుపల్లి, నూకపల్లి, రాజారం, పోతారం గ్రామాల ప్రజలకు పరిహారం మంజూరు చేశారు. పూడూరు బాధితులకు పరిహారం ఇప్పటికీ అందలేదు. జగిత్యాల ఆర్డీవోను సంప్రదిస్తే ఫైల్ నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు. ఆ ఫైల్ను క్లియర్ చేసి పరిహారం ఇప్పించండి. – వెల్ముల రాంరెడ్డి, పూడూరు ఆస్తులు గుంజుకుని అనాథను చేశాడు నా భర్త రామగిరి రాములు. మాకు సంతానం లేక ఆలూరుకు చెందిన సురతాని శంకర్రెడ్డిని దత్తత తీసుకున్నాం. నా భర్త 16ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి శంకర్రెడ్డిని అన్నీ నేనై పెంచాను. నా భర్త పేరిట జగిత్యాల మండలం మోరపల్లిలో ఉన్న ఐదు గుంటల స్థలాన్ని శంకర్రెడ్డి నాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా నా పోషణతోపాటు అన్ని ఖర్చులు భరిస్తానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. నా పోషణ భరించేలా చర్యలు తీసుకోండి. లేకుంటే నా ఆస్తి నాకు తిరిగి ఇప్పించి ఆదుకోండి. – రామగిరి రాజేశ్వరి, ఆలూరు -
ప్రజావాణికి అర్జీల వెల్లువ
● దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్ లత ● వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలుజగిత్యాలటౌన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. వారి నుంచి అదనపు కలెక్టర్ లత అర్జీలు స్వీకరించారు. 39 మంది దరఖాస్తు చేసుకోగా.. వాటిని పరిశీలించిన లత సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్గౌడ్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
జగిత్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. 50శాతం కన్నా తక్కువగా ప్రసవాలు చేయించిన ఆస్పత్రులపై దృష్టి సారించి 90 శాతం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య చాలా తక్కువగా ఉందని, పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో కచ్చితంగా 90 శాతం పెరగాలని ఆదేశించారు. గర్భిణులను గుర్తించి వారికి మోటివేషన్ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, జైపాల్రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు. బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలుజగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రేపు ‘దిశ’ కమిటీ సమావేశంజగిత్యాల: జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం కలెక్టరేట్లో ఈనెల 9న నిర్వహించనున్నట్లు గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరణ్ తెలిపారు. చైర్మన్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జిగా అద్దంకి దయాకర్కరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నియమితులయ్యారు. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేయడంలో భాగంగా ఉమ్మడి జిల్లాలకు పార్టీ ఇన్చార్జిలను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు చెందిన బీసీ సంక్షమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మెదక్ ఉమ్మడి జిల్లాకు, రాష్ట్రసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను వరంగల్ ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జిగా నియమించారు. మళ్లీ బీఆర్ఎస్దే అధికారంకోరుట్ల: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని బిలాల్పూర 21వ వార్డులో 100 మంది మైనార్టీలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేయాలన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్, మాజీ కౌన్సిలర్లు సజ్జు, సత్యం పాల్గొన్నారు. అంతకుముంద అల్లమయ్య గుట్ట వద్ద ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు మెట్పల్లిరూరల్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులాన్ని సోమవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, భోజనం పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని సూచించారు. సీజనల్ వ్యా ధులు ప్రబలే అవకాశం ఉండడంతో పరిసరాలను శుభ్రం చేయించాలన్నారు. -
రైతులకు తీరిన విద్యుత్ కష్టాలు
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లి రైతులకు విద్యుత్ కష్టాలు తీరాయి. ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం.. స్తంభాలు లేకపోవడం.. విద్యుత్ వైర్లు లాగక పోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ‘రైతులకు విద్యుత్ కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’ ఈనెల 7న కథనం ప్రచురించింది. ఆ కథనానికి స్పందించిన ట్రాన్స్కో అధికారులు సోమన్పల్లిలోని మందోట వద్ద కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను తొలగించి కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర క్రితం విద్యుత్ కనెక్షన్లు మంజూరు పొందిన రైతులకు కొత్త స్థంబాలు వేయించారు. విద్యుత్ వైర్లు లాగి రైతులకు విద్యుత్ సరఫరా చేశారు. లూజ్వైర్లను గుర్తించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి లైన్లను సవరించారు. దీంతో సోమన్పల్లి గ్రామ రైతులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
దేవాదాయశాఖలోకి మల్లన్న ఆలయం
● 2021లో దేవాదాయశాఖ నుంచి మినహయింపు ● తాజాగా ఆలయ నిర్వహణను ఆధీనంలోకి తీసుకున్న అధికారులుమెట్పల్లి రూరల్: మెట్పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న స్వామి ఆలయాన్ని దేవాదాయశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు పదేళ్ల క్రితమే దేవాదాయశాఖలో ఆలయం విలీనమైనా.. గ్రామస్తుల అభ్యంతరాలు, విన్నపాలతో అప్పటి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2021 నుంచి మూడేళ్లపాటు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం.. సమయం పూర్తికావడంతో ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇందుకోసం ఈవోతోపాటు 8 మంది సిబ్బందిని ఉన్నతాధికారులు నియమించారు. పదేళ్ల క్రితమే దేవాదాయశాఖలోకి.. పెద్దాపూర్ మల్లన్న స్వామి ఆలయాన్ని పదేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం దేవాదాయశాఖలో విలీనం చేసింది. ఏళ్ల తరబడి గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహణ సాగిన ఈ ఆలయం దేవాదాయశాఖలో విలీనం చేయడంపై గ్రామస్తులు వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వ పెద్దలను కలిసి దేవాదాయశాఖ నుంచి తప్పించాలని విన్నవించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. 2021 తర్వాత దేవాదాయశాఖ నుంచి తప్పించాల్సిందేనని మళ్లీ స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తేవడంతో దేవాదాయశాఖ చట్టం సెక్షన్ 15, 29 ప్రకారం మూడేళ్ల పాటు మినహాయింపు లభించింది. దీంతో మొన్నటి వరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే ఆలయ నిర్వహణ, వ్యవహారాలన్నీ కొనసాగాయి. ప్రస్తుతం మినహాయింపు సమయం ముగియడంతో మల్లన్న స్వామి ఆలయాన్ని సోమవారం అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హుండీ ఆదాయం లెక్కింపు.. మల్లన్న స్వామి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న దేవాదాయశాఖ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన జాతర ద్వారా రూ.18,13,095 సమకూరింది. 66 గ్రాముల మిశ్రమ బంగారం, 7.170 కిలోల మిశ్రమ వెండి వచ్చింది. గ్రాములు వచ్చింది. -
పొదుపు.. అభివృద్ధి
● వీధి వ్యాపారుల సంఘాల ఏర్పాటు ● బ్యాంకు నుంచి లింకేజీ రుణాలు ● చర్యలు తీసుకుంటున్న అధికారులు ● సాధికారత సాధించే దిశగా అడుగులు జగిత్యాల: మున్సిపాలిటీల్లో ఉన్న వీధి వ్యాపారుల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసేందుకు మెప్మా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మహిళాసంఘాలకు మాత్రమే పొదుపు సంఘాలు ఉండేవి. తాజాగా చిరువ్యాపారాలు చేసుకునే పురుషులకు కూడా జాతీయ పట్టణ ఉపాధి పథకం కింద పొదుపు సంఘాలు (కామన్ ఇన్ట్రెస్ట్ గ్రూప్స్) ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళలు మహిళాసంఘాల్లో పొదుపు చేసుకుంటున్నారు. కానీ పురుషులకు ఎలాంటి అవకాశాలు లేవు. తాజాగా వారికి కూడా గ్రూప్స్ ఏర్పాటు చేసి వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పొదుపు సంఘాల ద్వారా వ్యాపారులు ప్రతినెలా పొదుపు చేసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉంది. కొనసాగుతున్న సర్వే.. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ బల్దియాల్లో అనేక మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వీరంతా చిన్నచిన్న వ్యాపారులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. ఇలాంటి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందులోభాగంగా వీధివ్యాపారుల కోసం సర్వే కూడా చేస్తున్నారు. ఈ ఐదు మున్సిపాలిటిల్లో 173 పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా మెప్మా అధికారులు సర్వే చేసి గ్రూప్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్పీల సహాయంతో పట్టణంలో సర్వే చేస్తున్నారు. ఇప్పటికే వీరికి గుర్తింపు కార్డులు కూడా అందించారు. నెల రోజుల్లోపు సంఘాలను ఏర్పాటు చేసి వారికి వ్యాపారాల్లో చేయూతనందించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తోపుడుబండ్లు, సంచారం, నడుచుకుంటూ వెళ్లి వ్యాపారం చేసుకునేవారిని గుర్తించనున్నారు. మహిళాసంఘాల మాదిరిగానే వీరు కూడా ఒక్కో సంఘంలో 10–12 మంది సభ్యులుగా ఉంటారు. వీరందరికీ మొదట బ్యాంకుల్లో ఖాతాలు తీయించి అనంతరం పొదుపు చేయించి లింకేజీ రుణాలు అందిస్తారు. కరోనా సమయంలో వీధి వ్యాపారుల జీవనం రోడ్డున పడటంతో పీఎం స్వనిధి కింద రుణాలు అందజేశారు. మొదట విడత రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేల చొప్పున ఎంపిక చేసి వారికి రుణాలు అందించారు. ఆ కిస్తీలు ఇప్పటికీ చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఆ రుణాలతో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఎంతో తోడ్పటు కలిగింది. కానీ తాజాగా వీటిని నిలిపివేశారు. ప్రస్తుతం ఈ గ్రూపులను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక చేయూతనందించేలా చర్యలు చేపడుతున్నారు. మొదట గ్రూపులను ఏర్పాటు చేసిన అనంతరం వారికి బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించి మరింత పెద్ద వ్యాపారాలు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపిక చేసిన అనంతరం వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇవే కాకుండా పొదుపు సంఘాల్లో చేరిన ప్రతి సభ్యునికి రూ.2 లక్షల బీమా సౌకర్యం సైతం కల్పించనున్నారు. తప్పనున్న వడ్డీ వ్యాపారుల బెడద గతంలో చిరువ్యాపారులు ఎక్కువ శాతం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకునే వారు. నిత్యం అప్పు ఇచ్చిన తర్వాత నిత్యం డైలీ ఫైనాన్స్ కింద వసూలు చేసేవారు. ఇలా వారు చేసిన కష్టమంతా వారికే పోయేది. ప్రభుత్వం ఈ పీఎం స్వనిధితో పాటు, పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడం ద్వారా వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండకపోవడంతో పాటు వ్యాపారాల్లో సాధికారత సాధించే అవకాశం ఉంది. బల్దియా గ్రూపులలక్ష్యం వీధివ్యాపారులు జగిత్యాల 70 6,825 కోరుట్ల 44 4,188 మెట్పల్లి 38 3,713 ధర్మపురి 11 982 రాయికల్ 10 924 మొత్తం 173 16,632 గ్రూపులతో మేలు వీధివ్యాపారులతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేయిస్తున్నాం. వీరికి ఎంతో మేలు జరుగుతుంది. సంఘంలో పొదుపు చేసుకుని అనంతరం బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చు. కుటుంబాలను పోషించవచ్చు. – శ్రీనివాస్, మెప్మా ఏవో -
మామిడిపై అనాసక్తి
● 40 ఏళ్లవి కావడంతో నరికేస్తున్న రైతులు ● మూడేళ్లుగా ధరలు అంతంతే ● ఆదాయం రాకపోవడంతో తొలగింపు జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని చాలా ప్రాంతాల్లోని మామిడి తోటలు 30 నుంచి 40 ఏళ్లవి కావడంతో సరైన దిగుబడి ఇవ్వడం లేదు. మరోవైపు మూడేళ్లుగా వాతావరణంలో మార్పులతో తెగుళ్లు, పురుగుల విజృంభనతో మామిడి అనుకున్న స్థాయిలో రావడం లేదు. సరైన ఆదాయం రాక రైతులు తోటలను తొలగించి ఆయిల్ పాం, వరి వంటి ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు చెట్లను కొంతభాగం కట్ చేసి కాపు కోసం వేచి చూస్తున్నారు. 45 వేల ఎకరాల్లో మామిడి సాగు జిల్లాలో దాదాపు 45 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఎక్కువగా బంగినపల్లి, దశేరి, హిమాయత్ రకాలున్నాయి. ఏటా 1.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఏడాది పొడవునా మామిడి యాజమాన్యంలో భాగంగా కొమ్మల కత్తి రింపు, దుక్కి దున్నడం, ఎరువులు వేయడం, పురుగుమందులు పిచికారీ చేయడం వంటి పనులకు ఎకరాకు రూ.60వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మామిడి సీజన్ ప్రారంభంలో కిలో రూ.60 నుంచి రూ.70 ఉంటున్న ధరలు మా మిడి కాయలు మార్కెట్కు వచ్చే వరకు కిలో రూ. 20 నుంచి రూ.30కి పడిపోతున్నాయి. ఫలితంగా మామిడి సాగుకు రైతులు పెడుతున్న పెట్టుబడికి.. వస్తున్న ఆదాయానికి పొంతన ఉండటం లేదు. ఏపుగా పెరిగి...దిగుబడి తగ్గుతుండటంతో.. మామిడి యాజమాన్యంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేక చెట్లచుట్టూ పక్కనున్న కొమ్మలను కత్తిరించి.. పైకి ఉన్న కొమ్మలను అలాగే వదిలేశారు. పైకి ఉన్న కొమ్మలు విపరీతంగా పెరిగాయి. ఆ కొమ్మలకు మందులు పిచికారీ చేయాలన్న.. కాయలు తెంపాలన్న కష్టంగా మారింది. ఇలాంటి తోటల్లో సూర్యరశ్మి తగలక తెగుళ్లు, పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. మరోవైపు జిల్లాలో భూగర్భజలాలు 2.42 మీటర్ల లోతులోనే ఉండటంతో చాలా ప్రాంతాల్లో మామిడి తోటల నుంచి నీరు బయటకు వెళ్లడం లేదు. తేమ ఎక్కువగా ఉండి పూత రావడం లేదు. వరి క్వింటాల్కు రూ.2,380 ఉండటం.. కేజీవీల్స్తో దున్నించడం, హార్వెస్టర్లతో కోయించడం, ఎకరాకు 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావడం, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే కొనడంతో రైతులు ఎక్కువగా మామిడి తోటలను నరికేసి వరి పంట వైపు దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వ స్పందన అంతంత మాత్రమే పండ్లతోటలు పెంచే రైతులకు ఉద్యానశాఖ ద్వారా ప్రభుత్వం గతంలో అనేక రాయితీలు వర్తింపజేసేవి. మామిడి కొమ్మలు కత్తిరించేందుకు కట్టర్లు, రంపాలు సమకూర్చేవి. ఇప్పుడు పరికరాలు ఏమీ ఇవ్వడం లేదు. సాధారణంగా జగిత్యాల మామిడికి మంచి రుచి, నాణ్యత ఉంటుంది. అపెడా ఆధ్వర్యంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని, మహిళా సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మామిడిని సేకరించి, సూపర్ మార్కెట్ల ద్వారా అ మ్ముతామని ప్రభుత్వం ఏటా చెపుతున్నా.. ఆచరణలోకి రావడం లేదు. దళారులు మామిడి మార్కె ట్లో ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులకు ఆదాయం రాక తోటలను తొలిగించే పరిస్థితి ఏర్పడుతోంది. ఏటా కొమ్మలు కత్తిరిస్తాం జిల్లాలో చాలామంది మామిడి తోటలు నరికేస్తున్నారు. నేను చెట్ల కొమ్మలను ఏటా కట్ చేయిస్తాను. దిగుబడి వచ్చినా రేటు రాకపోవడం మామిడి రైతులకు పెద్ద సమస్యగా ఉంది. ప్రభుత్వం మామిడి కొనుగోళ్లపై ప్రణాళిక తీసుకవచ్చి రైతులకు న్యాయం చేయాలి. – దన్నపునేని వెంకటరమణ, సింగరావుపేట తోటలను నరికేయొద్దు మామిడి తోటలను పూర్తిగా నరికేయొద్దు. కొమ్మలను ప్రూనింగ్ చేస్తే చెట్టు ఎక్కువ దిగుబడి ఇస్తుంది. చాలామంది రైతులు మామిడి తోటలను పెంచుతున్నారు. యాజమాన్య పద్ధతులు పాటించడం లేదు. పూత సమయంలో మందులు పిచికారీ చేస్తున్నారు. – శ్యాం ప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి -
అరుణాచలానికి ఆర్టీసీ బస్సు
కోరుట్ల ఆర్టీసీ డిపోలో ప్రారంభించిన బస్సు కోరుట్ల: తమిళనాడులోని అరుణాచలం దర్శనానికి వెళ్లేందుకు భక్తుల కోసం ఆర్టీసీ కోరుట్ల డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించారు. ఈ బస్సు మంగళవారం కోరుట్ల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి కరీంనగర్, హైదరాబాద్, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా పదో తేదీన అరుణాచలం చేరుకుంటుందని డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. అదేరోజు తిరుగు ప్రయాణమై జోగులాంబ అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి కోరుట్లకు చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ. 3,800 ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నృసింహుడి సన్నిధిలో మంత్రి అడ్లూరి పూజలుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయం పక్షాన ట్రస్టుబోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి అర్చనమల్యాల: తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మండలంలోని లంబాడిపల్లిలోగల శ్రీపద్మావతి సహిత ప్రసన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో కోటి తులసి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులకు మరాటి సత్తయ్య, భక్తులు పాల్గొన్నారు. ఘనంగా మహాలక్ష్మి బోనాలుకోరుట్లరూరల్: మండలంలోని చిన్నమెట్పల్లి గ్రామంలో ఆదివారం మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వీడీసీ చైర్మన్ నాగులపెల్లి జైరెడ్డి, వైస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సంగెపు అశోక్, సభ్యులు పాల్గొన్నారు. -
తాతాల నుంచి ఇక్కడే ఉంటున్నాం
తాతలకాలంగా ఇక్కడే ఉంటున్నాం. వర్షకాలంలో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నాం. వేసవిలో అగ్ని ప్రమాదాలతో గుడిసెలు కాలిపోయి సర్వస్వం కోల్పోయాం. నాలాగా చాలామంది గూడెంలో ఉన్నారు. ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఇవ్వాలి. – పెరుమళ్ల మల్లవ్వ, నాయికపుగూడెం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించాం. ఎల్–1 ఫాం నింపడానికి ఫొటోల కోసం వెళ్తే అటవీ శాఖ అధికారులు రిజర్వ్ ఫారెస్టుగా పేర్కొనడంతో ముందుకు వెళ్లలేకపోతున్నాం. వారికి ఎలా న్యాయం చేయాలనే దానిపై కలెక్టర్ పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటాం. – లచ్చాలు, ఎంపీడీవో -
‘ఇందిరమ్మ’కు దూరమవుతున్న నిరుపేదలు
● ఇళ్ల నిర్మాణాలకు అంగీకరించని అటవీశాఖ ● నాయకపుగూడెం ప్రజల విచిత్ర పరిస్థితి ● ఏళ్లు గడుస్తున్నా పూరి గుడిసెల్లోనే నివాసం ● సొంతింటి కోసం ఎదురుచూస్తున్న 62 కుటుంబాలు ● ప్రజాప్రతినిధులు చొరవ చూపాలంటున్న స్థానికులు సారంగాపూర్: బీర్పూర్ మండలం కండ్లపల్లి పరిధిలోని నాయికపుగూడెం ప్రజల పరిస్థితి విచిత్రంగా మారింది. ఇక్కడి ప్రజలు ఏళ్లతరబడి పూరి గుడిసెల్లోనే నివాసముంటున్నారు. వారి కోసం ప్రభుత్వం విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసింది. రూ.20 లక్షలతో పాఠశాల నిర్మించింది. అంగన్వాడీ కేంద్రం కూడా కొనసాగుతుంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అత్యంత పేదలైన నాయికపుగూడెం గ్రామానికి కూడా ఇళ్లు మంజూరవుతాయని ఎదరుచూశారు. కానీ.. అటవీశాఖ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడంతో సుమారు 62 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. తామేం పాపం చేశామని తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కండ్లపల్లి నాయికపుగూడెం బీర్పూర్ మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కండ్లపల్లి నాయికపుగూడెం ఉంటుంది. ఇ క్కడ 300పైనే జనాభా ఉంటుంది. ప్రాథమిక పాఠశాలకు ఇక్కడ పక్కా భవనం ఉంది. అందులోనే అంగన్వాడీ కేంద్రం కూడా కొనసాగిస్తోంది. రేషన్బియ్యం కోసం కండ్లపల్లికి కాలినడకన వెళ్లాల్సిందే. ఇక్కడ సుమారు 62 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. అత్యంతపేదలైన వీరు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. పథకం కింద రూ.6లక్షలు వస్తే ఇళ్లు నిర్మించుకుంటామని, తమ ఇబ్బందులు తప్పుతాయని గిరిజనులు ఆశగా ఎదురుచూశారు. దీనికి అనుగుణంగా అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించి అందరూ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులని నిర్ధారించారు. అటవీశాఖ అభ్యంతరం 62 గిరిజన కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేసుకుంటామని చెప్పడంతో అధికారులు 62 మంజూరుకు నిర్ణయించారు. అయితే వీరు నివాసం ఉంటున్న భూమి అటవీశాఖ పరిధిలోని రిజర్వ్ఫారెస్ట్ కింద వస్తుందని, ఇక్కడ ఇళ్లు నిర్మాణం చేయడానికి వీలు లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుడి ఫొటో క్యాప్చరింగ్ చేయాల్సి ఉండగా, అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎల్–1 ఫాంలోకి చేర్చలేదు. ఇది గిరిజనుల ఇళ్ల నిర్మాణ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రజాప్రతినిధులను కలిసిన గిరిజనులు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, అటవీశాఖతో మాట్లాడాలని పేర్కొంటూ గిరిజనులు ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీ మంత్రి జీవన్రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. మాజీ సర్పంచ్ మహంకాళి రాజన్న పంచాయతీ రాజ్, గిరిజన శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చొరవ చూపాలని గిరిజనులు కోరుతున్నారు. తాటిపత్రిలు కప్పుతున్నాం వర్షాకాలం వస్తే ఇంటిమీద తాటిపత్రిలు కప్పుతున్నాం. గుడిసెల్లో ఉండడంతో విష పురుగులు, పాముల భయంతో వణికిపోతున్నాం. ప్రభుత్వం మాపై దయచూపాలి. ఇందిరమ్మ ఇళ్లకు అటవీశాఖ నుంచి అనుమతి ఇప్పించాలి. – గోపి రాజవ్వ, నాయికపుగూడెం -
నిధుల గోల్మాల్పై పదేళ్లుగా పోరాటం
● ప్రజావాణిలోనూ దొరకని పరిష్కారం ● రికవరీ కోసం అధికారుల చుట్టూ ఒకేఒక్కడు జగిత్యాలటౌన్: సుమారు పదకొండేళ్ల క్రితం.. 2014లో గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి మేజర్ గ్రామపంచాయతీ(ప్రస్తుతం మున్సిపాలిటీ)లో రూ.పదిలక్షల నిధులు పక్కదారి పట్టాయని, దీనిపై విచారణ చేయాలని అదే పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ అజ్మత్ అలీ అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. పలుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, నామమాత్రంగా విచారణ చేస్తూ.. నిందితులకు అండగా నిలుస్తూ.. కలెక్టర్ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని, కలెక్టర్ చొరవ తీసుకుని నిధుల గోల్మాల్పై చర్యలు తీసుకోవాలని అలీ కోరుతున్నాడు. అలీ కథనం ప్రకారం.. 2014లో గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురిలో నిర్వహించిన వేడుకలకు శానిటేషన్ ఖర్చులకంటూ ప్రభుత్వం రూ.పదిలక్షల సర్పంచ్ పేరిట విడుదల చేసింది. సదరు డీడీని పంచాయతీ బీఆర్జీఎఫ్ ఖాతాలో జమచేసింది. సర్పంచ్ కుమారుడు సంగి రాజశేఖర్ పేరున రూ.5.49లక్షలు, మిగిలిన నిధులు మరో నలుగురి పేరిట డ్రా అయ్యాయి. ఆడిట్ రిపోర్టులో అధికారులు అభ్యంతరకర ఖర్చుగా తేల్చారు. ఆ నిధుల లెక్క తేల్చాలంటూ అజ్మత్అలీ 2015లోనే అప్పటి కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. నాటి నుంచి నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని డీపీవో, ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు. పొసగని లెక్కలు.. సరిపోని రికార్డులు రూ.పది లక్షల వినియోగంపై రికార్డులో పలు అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆడిట్ అధికారుల నివేదిక చెబుతోంది. క్యాష్బుక్లో నమోదు చేసినవిధంగా ఓచర్లు, బిల్లులు, చెల్లింపుల రశీదులు, ఎంబీ రికార్డులు లభ్యం కాలేదంటున్న ఆడిట్ అధికారుల అభ్యంతరాలు నిధులు పక్కదారి పట్టాయనే అజ్మత్అలీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. సంగి రాజశేఖర్ పేరిట రూ.5.49 లక్షలు చెల్లించడం అనుమానాలకు తావిస్తోంది. ఆధారాలు, ఆరోపణలతో అలీ అధికారులకు ఫిర్యాదు చేసినా అప్పుడు ఇప్పుడు అన్నారని, తాజాగా అవినీతే జరగాలేదని అంటున్నారని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
పల్లె ముంగిట వైద్య సేవలు
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ● ఆరవెల్లిలో పల్లె దవాఖానా ప్రారంభంపెగడపల్లి: పల్లె దవాఖానాలతో ప్రజల ముంగిటకు వైద్య సేవలు తీసుకొచ్చామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలంలోని ఆరవెల్లి గ్రామంలో కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఆయూష్మాన్ భారత్ పల్లె దవాఖానా నూతన భవనాన్ని శనివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వైద్యరంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ చేపడుతున్నామని, మందుల కొరత లేకుడా చూస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10లక్షలకు పెంచామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం మద్దులపల్లికి చెందిన దివ్యాంగుడు మనోజ్కుమార్కు స్కూటీ అందించారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీడబ్ల్యూఓ నరేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు గౌడ్, శ్రీనివాస్రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
బైపాస్ పనుల్లో కదలిక!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా ప్రజలంతా ఎప్పుడెప్పుడా అనిఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ విషయంలో శుభవార్త. ఇప్పటికే పూర్తయిన ఈ రైల్వేలైన్ను కాజీపేట– బల్లార్ష ప్రధాన లైన్తో కనెక్ట్ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇంటర్లాకింగ్ పనులు మార్చి నెలాఖరు నాటికి పూర్తి కావాల్సింది. మే నెలాఖరు నాటికి బైపాస్ రైల్వేలైన్ అందుబాటులోకి రావాల్సింది. ఆ సమయంలో కరీంనగర్–తిరుపతి రైలుకు పెద్దపల్లి స్టాప్ కూడా ఎత్తేశారు. ఇక రైలు పెద్దపల్లికి వెళ్లకుండా నేరుగా.. బైపాస్ మీదుగా జమ్మికుంట వైపు వెళ్లేది. కానీ.. అపుడు ఎదురైన పలు సాంకేతిక కారణాలతో పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకున్నట్లు సమాచారం. కానీ... ప్రధాన లైన్కు 1.78 కి.మీల పొడవైన పెద్దపల్లి బైపాస్ లైన్ను కలపడం అంత సులువేం కాదు. ఢిల్లీ మార్గం కావడంతో అనేక రైళ్లను గంటలపాటు నిలపాల్సి ఉంటుంది. చా లా రైళ్లను దారి మళ్లించాల్సి ఉంటుంది. వేలాది కుటుంబా ల ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే అధి కారులు ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రైళ్ల రద్దీ తక్కువ ఉన్న రోజున కనీసం 2 నుంచి 3 గంటల్లో ప్రధాన మార్గాన్ని బైపాస్ మార్గంతో కలిపేలా ప్రణాళికలు రూపొందించారు. దీనిని ఆమోదిస్తూ.. సికింద్రాబాద్లోని దక్షిణమధ్య రైల్వే కేంద్ర కార్యాలయం నుంచి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఈనెల 7వ తేదీ దక్షిణ మధ్య రై ల్వే జీఎం పర్యటన ఉంది. ఆయన పర్యటన అనంతరం బై పాస్ మార్గం అనుసంధానం షెడ్యూల్పై స్పష్టత రానుంది. ఆర్వోబీ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కరీంనగర్ పట్టణంలోని తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించిన ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పుకున్నా.. ఆ మేరకు పురోగతి పనుల్లో కనిపించడం లేదు. ఈ మధ్య పిల్లర్ల పనుల్లో వేగంపెంచారు. ఇపుడున్న రైల్వే గేటు ప్రాంతంలో పిల్లర్లు నిర్మించాల్సిన నేపథ్యంలో రైల్వేగేటును పక్కకు మార్చారు. ఈ క్రమంలో చొప్పదండికి వెళ్లే క్రమంలో కుడివైపునకు తిరిగే క్రమంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. చొప్పదండి నుంచి కరీంనగర్కు వచ్చే దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు అపోలో వరకు, అటు తీగలగుట్టపల్లి అమ్మగుడి వరకు వాహనాలు బారులు తీరి, ట్రాఫిక్ జాములతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజుకు కనీసం 10 నుంచి 15 సార్లు గేట్లు పడటం, ఈ కష్టాలకు వానలు తోడవటంతో స్థానికుల కష్టాలు రెట్టింపయ్యాయి. స్కూలు బస్సులు, చిరువ్యాపారులతోపాటు ముఖ్యంగా అంబులెన్స్లో వచ్చే అత్యవసర రోగులు ఈ మార్గంలో రెట్టింపైన ట్రాఫిక్ కష్టాలతో అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి రైల్వే స్టేషన్కు అవతల నుంచి కిసాన్ నగర్ మీదుగా రైల్వే అండర్పాస్ మార్గం ఉంది. దాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ట్రాఫిక్ పోలీసులు, బల్దియా, ఇతర ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడు నెలల నుంచి సాగుతున్న పనులు రేపు కాజీపేట–బల్లార్ష మార్గంలో జీఎం పర్యటన? ఇంటర్లాకింగ్ పనులకు ఇంకా విడుదల కాని షెడ్యూల్ కొనసాగుతున్న కరీంనగర్ ఆర్వోబీ పనులు నరకం చూస్తున్నామని ప్రజల ఆవేదన -
ఖాదీ ప్రతిష్టాన్పై ‘విజిలెన్స్’
● సంస్థ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు ● వివాదాల నేపథ్యంలో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ● రెండు రోజులుగా వివరాలు సేకరిస్తున్న అధికారులు మెట్పల్లి: ఎంతో ఘన కీర్తి కలిగిన మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సంస్థలో జరుగుతున్న వ్యవహారాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ ముఖ్య నేత కొంతకాలం క్రితం ప్రభుత్వ పెద్దలను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో వారు విచారణ జరిపి నివేదికను అందించాలని విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం ఆ విభాగం అధికారులు రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. భూముల అమ్మకం నుంచి మొదలు.. ● మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్కు పట్టణంలోనే కాకుండా పలు ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నాయి. ● ఇందులో నుంచి పూడూరు, కిసాన్నగర్లో ఉన్న స్థలాలను విక్రయించారు. ● ఆ భూములను తక్కువ ధరకు విక్రయించి.. భారీగా లబ్ధి పొందారని ఆ సమయంలో పాలకవర్గంలోని ముఖ్యులపై ఆరోపణలు వెల్లువవెత్తాయి. ● పూడూరులో స్థానిక ప్రజలు అమ్మిన భూములను వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనుమతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం.. ● పట్టణంలో ఖాదీ ప్రతిష్టాన్కు సుమారు 14ఎకరాల భూమి ఉంది. సంస్థకు ఆదాయం సమకూర్చుకోవడం కోసం కొంత భూమిలో మూడేళ్ల క్రితం సుమారు 200 గదులతో కూడిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ● దీనికి మున్సిపల్ నుంచి అనుమతులు తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్లతో ఆ సమయంలో అధికారులు చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. ● ఆ కాంప్లెక్స్లోని గదులను అద్దెకిచ్చి ప్రయోజనం పొందుతున్న ప్రతిష్టాన్.. మున్సిపల్కు ఏటా ఆస్తి పన్ను కూడా చెల్లించడం లేదు. ● ప్రతిష్టాన్ పాలకవర్గం తీరుపై మున్సిపల్కు రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు. సమీకృత మార్కెట్కు గ ‘లీజు’ ఒప్పందం ● సమీకృత మార్కెట్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలం స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ఖాదీకి చెందిన 20 గుంటల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ● ఇందుకు ప్రతినెలా రూ.1.50లక్షల అద్దె చెల్లింపు.. తర్వాత రెండేళ్లకోసారి పది శాతం పెంపునకు అంగీకరిస్తూ 2021 మార్చి 21న మున్సిపాలకవర్గం తీర్మానం చేసింది. ● ఆ అద్దె చెల్లింపు 2022 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చేలా ఒప్పందం జరిగింది. ● 2021 జూన్లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. ● అయినా అద్దె చెల్లించాలంటూ ఖాదీ సంస్థ మున్సిపాలిటీకి నోటీసులు ఇస్తూ వస్తోంది. ఇప్పటివరకు అద్దె బకాయిలు రూ.అర కోటికి పైగానే ఉన్నట్లు తెలిసింది. ● మున్సిపల్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మార్కెట్ నిర్మాణం పూర్తయి అందులో వ్యాపారాలు మొదలైన తర్వాత వచ్చే ఆదాయంతో అద్దె చెల్లింపు జరిగేలా ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా పాలకవర్గం, అధికారులు నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారి తీసింది. ● ఆ ఒప్పందంతో ఖాదీకి లాభం కాగా.. మున్సిపాలిటీకి భారీగా నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రంగంలోకి విజిలెన్స్ అధికారులు ● ఖాదీ ప్రతిష్టాన్ వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఓ కాంగ్రెస్ నేత చే సిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ● రెండు రోజులుగా విజిలెన్స్ అధికారులు పట్టణానికి వచ్చి ఖాదీ, మున్సిపల్ నుంచి వివిధ కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ● ప్రధానంగా అనుమతి లేకుండా కాంప్లెక్స్ నిర్మించినప్పటికీ చర్యలు చేపట్టకపోవడం, సమీకృత మార్కెట్ లీజు విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించకపోవడం వంటి వాటిపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. ● మొత్తానికి ఖాదీ ప్రతిష్టాన్కు సంబంధించిన వ్యవహారాలపై సాగుతున్న విజిలెన్స్ విచారణతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనన్నది ఆసక్తిగా మారింది. -
ఓటరు నమోదు పారదర్శకంగా చేయాలి
రాయికల్: ఓటరు నమోదు ప్రక్రియను బూత్ లెవల్ అధికారులు పారదర్శకంగా చేయాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బూత్స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆగస్టులో నిర్వహించే ఓటరు నమోదు ప్రక్రియలో నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ వంటి అంశాలపై పూ ర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. బీ ఎల్వోలు పారదర్శకంగా వ్యవహరించాలని, స కా లంలో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీ వి, ట్రైనర్లు రాజశేఖర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గురుకులం విద్యార్థులుమల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక తెలిపారు. గురుకులానికి చెందిన ఎ.హర్షిత్ అండర్–14 లాంగ్జంప్ విభాగంలో, జి.హారిక అండర్–12 లాంగ్జంప్ విభాగంలో ఈనెల 6న హన్మకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్, పీఈటీ, ఉపాధ్యాయులు అభినందించారు. భగీరథ లీకేజీలకు మరమ్మతులపై నిర్లక్ష్యం మెట్పల్లి: పట్టణంలోని వెంకట్రావ్పేట వద్ద జాతీయ రహదారి పక్కన రెండు రోజుల క్రితం భగీరథ పైపులైన్కు లీకేజీలు ఏర్పడి భారీగా నీరు వృథాగా పోతుంది. దీనివల్ల అటు వైపు వెళ్లే వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరుచుగా పైపులైన్కు లీకేజీలు ఏర్పడుతున్నాయి. అధికారులు మరమ్మతులు చేపడుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందని సింగిల్ విండో చైర్మన్ కొమిరెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు. లీకేజీలు ఏర్పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు
కలెక్టర్ సత్యప్రసాద్ ధర్మపురి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. పైఅంతస్తులో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. డెంగీ, మలేరియాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. గోదావరి వరదలతో కలుగుతున్న నష్టాలపై ఆరా తీశారు. ఈ సారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవనం కోసం నివేదికలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్చార్జి తహసీల్దార్ సుమన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. హౌసింగ్ అధికారులతో సమావేశమయ్యారు. లబ్ధిదారులు నిర్ణీత గడువులోపు నిబంధనల మేరకు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. అధికారులు వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ లత, హౌసింగ్ డీఈ భాస్కర్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, డీపీవో మదన్మోహన్ పాల్గొన్నారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా సమగ్ర రైతు సహకార సంస్థ ప్రతినిధులు కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో చేపట్టబోయే ఐఎఫ్సీవో కార్యక్రమాలపై ఆయనకు వివరించారు. ఐఎఫ్సీవో ప్రాజెక్ట్ మేనేజర్ స్వప్నరెడ్డి, మేనేజర్ రమ్యశ్రీ, లహరి, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాముల తనిఖీ జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్లో గల ఈవీఎం గోదాంను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై ప్రతినెలా తనిఖీ ఉంటుందన్నారు. -
ఆధునిక హంగులతో పెద్దాపూర్ ‘గురుకులం’
మెట్పల్లిరూరల్: ఏళ్ల నుంచి సమస్యలతో కొట్టుమిట్టాడిన మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులం పాఠశాల నేడు ఆధునిక హంగులతో కళకళలాడుతోంది. కొంతకాలంగా వివిధ కారణాలతో సమస్యలు ఎదుర్కొన్న పాఠశాల ప్రస్తుతం పూర్తిగా మార్పు చెందింది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వసతులు మెరుగుపర్చారు. భద్రతపై దృష్టి సారించారు. కొత్త భవనంలోని కొన్ని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన గదులను వసతి, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. గతంలో ఇక్కడ జరిగిన ఘటనల దృష్ట్యా భద్రతపై దృష్టిసారించిన అధికారులు.. నిధులు వెచ్చించి పనులు చేయించారు. గురుకులం పరిసరాల్లో సీసీ వేయించారు. చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరిసరాలను ఎప్పటికప్పడు శుభ్రం చేయిస్తున్నారు. సుమారు రూ.60 లక్షలు వెచ్చించి గురుకుల పాఠశాలను బాగు చేయించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
జమ్మికుంట: మున్సిపల్ పరిధి ఫ్లైఒవర్ బ్రిడ్జిపై 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జోడు కుమార్(27) మున్సిపల్ పరిధిలోని అబాది జమ్మికుంటలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వెళ్లి శుక్రవారం అర్ధరాత్రి బైక్పై వస్తున్నాడు. మున్సిపల్ పరిధి కొత్తపల్లి ఫ్లైఒవర్ దిగువకు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న రామన్నపల్లి గ్రామానికి చెందిన పురెల్ల మధుకర్ అనే వ్యక్తి అజాగ్రత్తగా అతివేగంగా బైక్తో ఢీకొట్టాడు. డివైడర్పై పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చికిత్స పొందుతూ మృతిపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన నందయ్య (68) ఒంటరి తనం భరించలేక గతనెల 27న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడని రూరల్ ఎస్సై మల్లేశ్ పేర్కొన్నారు. నీటి సంపులో పడి బాలుడు..వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతాల్ఠాణాలోని లింగంపల్లి రవి–స్వప్న దంపతుల కుమారుడు లింగంపల్లి రిషి(6) శనివారం ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి మృతి చెందాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో రిషి ఇంటి వద్దే ఉన్నాడు. ఈక్రమంలో ఆడుకుంటూ వీరి ఇంటి పక్కన కొత్తగా నిర్మిస్తున్న గుర్రం బాలకిషన్ ఇంటి వద్ద గల నీటి సంపులో పడి మృతిచెందాడు. విద్యుత్షాక్తో రైతు..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన చింతల రమేశ్ (49)అనే రై తు శనివారం పొలంమడికి నీరు పెట్టేందుకు ఉపక్రమిస్తుండగా విద్యుత్షాక్తో అక్కడికక్కడే మరణించాడు. పొలం దున్నేందుకు వీలుగా మడిలో నీరు నింపేందుకు విద్యుత్ మోటారును ఆన్చేసే సమయంలో ఈ ప్రమాదానికి గురైనట్లు రూరల్ఎస్సై మల్లేశ్ పేర్కొన్నారు. మృతుడికి భార్య సంధ్య, కుమారులు ప్రశాంత్, పవన్కుమార్ ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
అప్పుడే బాగుండేది
మేము ఇద్దరం, మా పిల్లలు న లుగురు.. వారి పిల్లలతో కలిసి ఉండేవాళ్లం. మా మనుమలు, మనుమరాండ్లు పెద్దగా అ య్యే వరకు కలిసి ఉన్నాం. ఆ కాలంలో అందరం ఒకే ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్లం. రాత్రి పూట క లిసి భోజనం చేసేవాళ్లం. ఇంట్లో ఎవరికీ కష్టం వచ్చి నా పెద్దమనిషి ముందు ఉండి నడిపించేవారు. రా త్రయితే ఇంటి ముందర మా గల్లీలో ఉన్న వాళ్లంతా చేరి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరూ టీవీ లు చూస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. పక్కింటి వారిని కూడా మాట్లాడించే పరిస్థితులు లేవు. ఆ రోజులే బాగుండేవి. – నిమ్మ మల్లమ్మ, నారాయణపూర్ కలిసిమెలిసి ఉండేవాళ్లం మేము ఐదుగురం అన్నదమ్ములం. అందరం ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా అందరికీ పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగే వరకు కూడా మా పెద్ద ఇంట్లోనే కలిసి ఉన్నాం. రాత్రయితే అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. భోజనం సమయంలో మా ఇంట్లో రోజూ పండుగ వాతావరణం కనిపించేది. ఉద్యోగం, ఉపాధి, పిల్లలు చదువుల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వెళ్లడం.. ఒకే ఊరిలో ఉన్న విడివిడిగా ఉండిపోతున్నాం. అప్పటి రోజులు ప్రేమానురాగాలతో బాగుండేవి. – లద్దునూరి తిరుపతి, నారాయణపూర్ ఎవరి పనిలో వారు బిజీ ఎనుకటి రోజులే బాగుండేవి. ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో కలిసి ఉన్న జ్ఞాపకాలను మర్చిపోలేం. ఉమ్మడి కుటుంబానికి మించిన ఆనందం మరొకటి లేదు. పండుగ వచ్చిందంటే అందరం ఒక చోట చేరితే ఇల్లంతా సందడిగా ఉండేది. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు.. వారి పిల్లలతో రోజులు గడిచిపోయేది. ఇప్పుడు ఎవరికి వారు వేరుగా ఉండడంతో రోజుల తరబడి కలుసుకోవడం లేదు. అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది. – ముంజ ఎల్లయ్య, ఇల్లంతకుంట -
ముఖంపై పౌడర్ చల్లి బంగారం చోరీ
రాయికల్: పట్టణంలోని కేశవనగర్కు చెందిన వెల్మ రాధ ముఖంపై పౌడర్ చల్లి నాలుగున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కేశవనగర్కు చెందిన రాధ మధ్యాహ్నం వేళ ఒంటరిగా ఉంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు గమనించి రాధ వద్దకు వచ్చి ముఖంపై పౌడర్ చల్లారు. ఆ మత్తులో రెండు తులాల కడెం, రెండున్నర తులాల చైన్ ఆగంతులకు ఇచ్చేసింది. కాసేపటికి తేరుకున్న బాధితురాలు లబోదిబోమంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సుదీర్రావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యరామడుగు: దేశరాజ్పల్లి గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం దేశరాజ్పల్లి గ్రామానికి చెందిన బోడిగె నర్సయ్య(60) అనే వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సయ్య కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ వెలిచాలలోని అనాథ ఆశ్రమంలో జీవనం సాగించినట్లు చెప్పారు. ఇటీవల గ్రామానికి వచ్చిన నర్సయ్య అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ శనివారం గ్రామ శివారులో ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. జగిత్యాల వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే గూడ్స్ రైలు సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీ, కొడుకుల ఆదర్శ నిర్ణయం
● మరణానంతరం నేత్ర, అవయవాల దానంకు అంగీకారం ● కూతురు పుట్టిన రోజున స్ఫూర్తిదాయకమైన సందేశం కోల్సిటీ(రామగుండం): ‘అమ్మా... నేను చనిపోయాక నేత్ర, అవయదానం చేయ్యాలని నిర్ణయించుకున్న...’ అని కొడుకు తన మనసులోని మాటను తల్లికి చెబితే... ఇదేం పిచ్చి ఆలోచన అంటూ వద్దని వారించలేదు తల్లి. మంచి నిర్ణయం బిడ్డాని భుజం తట్టింది. నేను కూడా నీలెక్కనే నేత్ర, అవయదానం చేస్తానంటూ తల్లి కూడా ముందుకు వచ్చింది. తనకు పాఠాలు చెప్పిన టీచ్చర్ సమక్షంలో ఆ ఆదర్శ కొడుకు, తన తల్లితో కలిసి అంగీకార పత్రాలను సదాశయ ఫౌండేషన్కు సమర్పించారు. గోదావరిఖని పవర్హౌజ్ కాలనీలో నివాసం ఉంటున్న కాంపెల్లి స్వామి, జయ దంపతుల కుమారుడు శివగణేశ్. డిప్లామోఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ(డీఎంఎల్టీ) కోర్సు చేస్తున్నాడు. మరణానంతరం మనిషి నేత్రాలు, అవయవాలను దానం చేస్తే పలువురికి పునఃర్జన్మ ఇవ్వొచ్చని భావించాడు. విషయాన్ని తనకు చదువు చెప్పిన టీచర్ శశికళకు తెలిపాడు. తన సోదరి ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా శనివారం శివగణేశ్ తన తల్లితో కలిసి నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించారు. వారి నివాసంలోనే అంగీకార పత్రాలపై సంతకాలు చేసి, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్.లింగమూరికి శశికళ టీచర్ సమక్షంలో సమర్పించారు. వారికి ఆర్గాన్ డోనర్కార్డులతోపాటు అభినందన పత్రాలను అందజేశారు. తల్లీ, కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శనీయమని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేశ్ కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎ.ఎల్లప్ప, సారయ్య, కోశాధికారి రాజేందర్ అభినందించారు. -
ఆధునిక హంగులు.. సౌకర్యాలు
● సింగరేణిలో డబుల్, ట్రిపుల్ బెడ్రూం క్వార్టర్లు ● అధికారులకు 143, కార్మికులకు 860 క్వార్టర్లు ● 1,003 క్వార్టర్లకు రూ.450 కోట్లు కేటాయింపు గోదావరిఖని(రామగుండం): సంస్థవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఆధునిక హంగులతో క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జీప్లస్ వన్ పద్ధతిలో అధికారులకు ట్రిపుల్ బెడ్రూం, కార్మికులకు డబుల్ బెడ్రూం నిర్మించనున్నారు. ఈమేరకు సింగరేణి బోర్డు ఆమోదం పొందింది. అధికారులు, ఉద్యోగుల 1,003 క్వార్టర్ల నిర్మాణానికి రూ.450కోట్లు కేటాయించింది. గోదావరిఖని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మణుగూర్ ప్రాంతాల్లో క్వార్టర్లను నిర్మించనుంది. శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కార్మికుల కోసం 50 ఏళ్ల క్రితం టీవన్టైపు, డీ టైపు పేరుతో పైకప్పు సిమెంట్ రేకులతో క్వార్టర్లను నిర్మించింది. సింగిల్ బెడ్రూం, హాలు, కిచెన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పురాతన క్వార్టర్లు కార్మికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఐటీ ఇంజినీర్లు, పలు ప్రాంతాల్లో ఉన్నతస్థాయి విద్యను అభ్యసించిన కార్మికుల పిల్లలు ఇక్కడకు వస్తే ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈక్రమంలో క్వార్టర్ పక్కనున్న స్థలంలో షెడ్డు, అదనపు నిర్మాణం చేపట్టినా ఏమూలకూ సరిపోవడం లేదు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు సంస్థలో నూతన క్వార్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో పలు ఏరియాల్లో పాత క్వార్టర్లను తొలగించి వాటిస్థానంలో నూతనంగా క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఆధునిక పద్ధతిలో విశాలంగా.. సింగరేణిలో అధికారులకు మిలీనియం ఏబ్లాక్ పద్ధతిలో 35 క్వార్టర్లు, మిలీనియం బీబ్లాక్ విధానంలో 108 క్వార్టర్లు ఖరారు చేసింది. ఉద్యోగులు, సూపర్వైజర్ క్యాడర్ కోసం మిలీనియం సీబ్లాక్ పద్ధతిలో 300 క్వార్టర్లు, వర్క్మెన్ల కోసం మిలీనియం డీబ్లాక్ 560 క్వార్టర్లు నిర్మించనున్నారు. గతంలో నిర్మించిన ఎండీటైపు క్వార్టర్ల మాదిరిగా ప్రతీ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. క్వార్టర్ల కోసం యాజమాన్యం టెండర్ ప్రక్రియ సిద్ధం చేసింది. త్వరలో టెండర్ల ద్వారా క్వార్టర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు కేటాయించనున్నారు. ఆధునిక హంగులతో.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, హంగులతో కార్మికులకు డబుల్ బెడ్రూం, అధికారులకు ట్రిపుల్ బెడ్రూంలు నిర్మించేందుకు నిర్ణయించాం. జీప్లస్ వన్ విధానంలో నిర్మాణాలు కొనసాగుతాయి. రూ.450కోట్లు వెచ్చించేందుకు బోర్డు అనుమతి లభించింది. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి ప్రాంతం అధికారులు కార్మికులు వ్యయం (రూ.కోట్లలో) గోదావరిఖని 36 282 133 శ్రీరాంపూర్ 39 410 193 భూపాలపల్లి 22 60 45 మణుగూరు 46 108 79 -
సీనియర్ పాత్రికేయుడి హఠాన్మరణం
సిరిసిల్లటౌన్: సీనియర్ పాత్రికేయుడు గర్దాస్ ప్రసాద్(43) శనివారం తెల్లవారు జామున హఠాన్మరణం చెందారు. వివిధ సంస్థల్లో పదేళ్లుగా పనిచేసిన ఆయన సిరిసిల్ల నియోజకవర్గం టీవీ 9 కంట్రిబ్యూటర్గా నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో ఉదయం గుండెపోటుకు గురికాగా కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనలతో కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రసాద్కు భార్య రేవతి, కూతుళ్లు సంజన(19), సిరిచందన(16), కొడుకు శివేంద్ర(11) ఉన్నారు. సంతాపాలు..ఆర్థిక సాయం ప్రసాద్ మృతిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ సంతాపం ప్రకటించారు. రూ.50వేల ఆర్థికసాయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ రూ.25వేలు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ రూ.10వేలు అందజేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు రూ.50వేల ఆర్థికసాయాన్ని పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు చేతుల మీదుగా అందజేశారు. ప్రెస్క్లబ్లో అధ్యక్షుడు, కార్యదర్శి ఆకుల జయంత్కుమార్, ఆడెపు మహేందర్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, టి.వి.నారాయణ, వూరడి మల్లికార్జున్, ప్రెస్క్లబ్ కార్యవర్గం, పాత్రికేయులు నివాళి అర్పించారు. -
అను‘బంధం’ దూరమై..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అవ్వ..అయ్య..అన్న..తమ్ముడు..వదిన..మరదలు..అక్క..బావ.. పిల్లలు.. ఇలా అందరూ కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాలు పల్లెల్లో గతంలో కనిపించేవి. ఒక్క పూటకు అందరికీ భోజనాలు సరిపోవాలంటే పెద్ద గంజులో అన్నం, కూర వండి కలిసి తినేవారు. ఆ ఇళ్లలో నిత్యం పండుగ వాతావరణం కనిపించేది. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వస్తే అందరూ దగ్గర ఉండి ధైర్యం చెబుతూ వ్యాధి తగ్గే వరకు చుట్టూ తిరుగుతూ ప్రతీ క్షణం బాగోగులు చూసుకునేవారు. కానీ నేడు భార్య, భర్త, పిల్లలు చాలు అంటున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం.. ప్రెషర్ కుక్కర్లో కూరలు వండుకొని ఎవరికీ తీరినప్పుడు వారు తినేసి ఉద్యోగం, ఉపాధిబాట పడుతున్నారు. జ్వరమొచ్చినా.. జలుబు వచ్చినా పరామర్శించే వారు కరువవుతున్నారు. మనోధైర్యం చెప్పేవారు కనిపించడం లేదు. ఫలితంగా చిన్నపాటి సమస్యలకే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం.. అవి కాస్త తీవ్రమైతే ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. పెనవేసుకునే ఉమ్మడి బంధం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు భార్యభర్తల మధ్య పొరపచ్చాలు వస్తే పెద్దలు సర్ది చెప్పేవారు. దీంతో సమస్య అక్కడికక్కడే పరిష్కారమయ్యేది. కానీ నేడు హితబోధ చేసే పెద్దలు దగ్గర ఉండకపోవడంతో దంపతుల మధ్య చిన్నపాటి గొడవలకే మనస్పర్థలకు పోతూ విడిపోవాలనే ఆలోచన లేదంటే లోకం నుంచే వెళ్లిపోవాలనే దురాలోచనతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే బంధాలు.. అనుబంధాలు బలహీనమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్ సిటిజెన్స్ తాము గడిపిన ఉమ్మడి కుటుంబాల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఇప్పటి పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు మారిన పరిస్థితుల్లో చిన్నకుటుంబాలుగా జీవనం రక్తసంబంధీకుల మధ్య అడ్డుగోడలు ఉద్యోగం, ఉపాధి వేటలో ఇతర ప్రాంతాలకు.. గతాలను నెమరువేసుకుంటున్న నాటితరం -
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ
కరీంనగర్: కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడ్డ వారికి అండగా ఉంటూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి పరులు విదేశాల్లో డ్యాన్స్లు చేస్తుంటే మోదీ ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టాలు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరుతో దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని, సమాజం కోసం పోరాడుతున్న వారిని హతమార్చడం అన్యాయమని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాల్సి అవసరముందన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇవ్వాలని ఈనెల 15లోపు జిల్లాలోని అన్ని నియోజక వ ర్గాల శాసన సభ్యులకు వినతిపత్రాలు అందిస్తామ ని తెలిపారు. ఈ సమావేశంలో కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, బ్రామండ్లపెల్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర
కరీంనగర్: రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేవేసేందుకు కుట్ర చేస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్లోని గణేశ్నగర్లో గల బద్దం ఎల్లారెడ్డిభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ బకాయిల విడుదలపై పూటకో మాట మాట్లాడుతూ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామరావు, వెంకటేష్, మచ్చ రమేశ్, జిల్లా ఆఫీస్ బేరర్స్ కేశబోయిన రాము యాదవ్, కనకం సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
జగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్/జగిత్యాలటౌన్: మొక్కలను నాటడంతో పాటు సంరక్షించడం ప్రధానమని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం–2025 సందర్భంగా జగిత్యాల సహకార సంఘంలో శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఏక్ పేడ్ మా కే నామ్ పేరిట సహకారశాఖ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఒకేరోజు 2,500 మొక్కలు నాటామని జిల్లా సహకారాధి కారి మనోజ్కుమార్ తెలిపారు. ఆర్డీవో మధుసూధన్, జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, సంఘ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. రోశయ్యకు నివాళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతిని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వ్యాధులు ప్రబలకుండా చూడాలి ప్రతి మున్సిపాలిటీలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. అమినీబాద్లో శుక్రవారం పర్యటించా రు. కూలర్లు, వాడి పడేసిన పాత టైర్లు, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ గ్లాసులు వంటివి పరిసరాల్లో ఉండకుండా చూడాలని ఆదేశించారు. నీరునిల్వ ఉన్న చోట ఆయిల్బాల్స్ వేయాలన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు. సీఎంఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలి సీఎంఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. రా, బాయిల్డ్ రైస్మిల్లర్లతో సమావేశం అయ్యారు. సీఎంఆర్ చెల్లింపులు ఈనెల 27తో ముగుస్తున్నాయని, నిర్ణీత గడువులోగా మిల్లర్లు చెల్లించాలని ఆదేశించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఎస్వో జితేందర్రెడ్డి పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పురాణిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్చార్జి డీఈవో సత్యనారాయణ, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
దొడ్డి కొమురయ్యకు నివాళి
జగిత్యాలటౌన్: తెలంగాణ ప్రజల తెగువ, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక దొడ్డి కొమురయ్య అని అదనపు కలెక్టర్ బీఎస్.లత కొనియాడారు. దొడ్డి కొమురయ్య వర్ధంతిని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సునీత, మైనార్టీ అధికారి ఆర్ఎస్.చత్రు పాల్గొన్నారు. జగిత్యాలలోని 1వ వార్డులో ఉన్న దొడ్డికొమురయ్య విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు ముసిపట్ల లక్ష్మీనారాయణ తదితరులు నివాళి అర్పించారు. రైతు సేవల్లో సహకార సంఘాలు కీలకం కథలాపూర్/మల్లాపూర్: రైతులకు సేవలందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా సహకార అధికారి మనోజ్కుమార్, జిల్లా ఆడిట్ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా సహకార సంఘాలు అందిస్తున్న సేవలపై శుక్రవారం కథలాపూర్, మల్లాపూర్ జెడ్పీ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించి పంటల పెట్టుబడికి ప్రోత్సాహం ఇస్తున్నామని వివరించారు. రైతులతోపాటు వ్యాపారులకు రుణాలు ఇస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. ఎంఈవోలు శ్రీనివాస్, దామోదర్రెడ్డి, మల్లాపూర్ తహసీల్దార్ రమేశ్గౌడ్, ఎంపీడీవో శశికుమార్రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి మల్యాల: విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించడంతోపాటు, సబ్జెక్టులవారీగా సామర్థ్యాన్ని పరీక్షిస్తూ, వారి భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బొప్పరాతి నారాయణ సూచించారు. మల్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు. అధ్యాపకుల హాజరు రిజిస్టర్లు, కార్యాలయ రికార్డులు పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుతూ భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, వారిలోని సృజనాత్మకతకు పదును పెట్టాలని పేర్కొన్నాఇన్చార్జి ప్రిన్సిపాల్ జి.వాణి, అధ్యాపకులు అత్తినేని శ్రీనివాస్, మహమ్మద్ నవాబ్, వేనపెల్లి సంధ్య, లైబ్రేరియన్ సంపత్కుమార్ పాల్గొన్నారు. మహిళా సంఘాల అభ్యున్నతికి కృషి జగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తోందని డీఆర్డీ ఏ పీడీ రఘువరణ్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో ఇందిర మహిళ శక్తి పెట్రోల్బంక్ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి ఇందిర మహిళా శక్తి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలో జిల్లా మహిళా సమైక్యకు పెట్రోల్బంక్ మంజూరైందన్నారు. సెర్ఫ్ సీఈవో, కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. పెట్రో ల్ బంక్ను పూర్తిగా మహిళా సంఘ సభ్యులే నిర్వహిస్తారని, అందుకోసం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించడం జరిగిందన్నారు. రూరల్ తహసీల్దార్ శ్రీనివా స్, జిల్లా సెర్ఫ్ ఏపీడీ సునీత, పెట్రోల్బంక్ ప్ర తినిధి హర్షవర్దన్, డీపీఎం విజయభారతి, ఏపీఎం గంగాధర్, సీసీ గంగారాం పాల్గొన్నారు. -
నాలా.. ఇలా ఉంటే ఎలా?
● జిల్లాకేంద్రంలో ప్రమాదకరంగా నాలాలు ● సిల్టు తీయరు.. పిచ్చిమొక్కలు తొలగించరు ● ఏ కాలువ నీరు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి ● ఇళ్లలోకి నీరు చేరుతోందని ఆవేదన ● జగిత్యాల ప్రజలకు ముంపు ముప్పు ● తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకోలుజగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రధాన నాలాలు ప్రమాదకరంగా మారాయి. పిచ్చిమొక్కలు పెరగడం, సీల్టు తీయకపోవడంతో వర్షం కురిస్తే డ్రైనేజీ పొంగి మురుగునీరు ఆయా కాలనీల్లోని ఇళ్లలోకి చేరుతోంది. ఏ కాలువ నీరు ఎటు నుంచి వెళ్తోందో తెలియని పరిస్థితి. వర్షాకాలానికి ముందే చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా భారీ వర్షాలు కురిస్తే డ్రైనేజీలు పొంగే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. గంజ్రోడ్ నుంచి వెళ్లే నాలా 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నాలా పరిసరాల్లోని ప్రజలు దుర్గంధం, దోమలు, పందులు, ఈగలతో ఇబ్బంది పడుతున్నారు. చింతకుంట నుంచి వచ్చే అతిపెద్ద నాలా శంకులపల్లి కాలనీ వరకు వెళ్తుంది. పిచ్చిమొక్కలు, తుంగ పెరగడంతో కాలువ కన్పించని పరిస్థితి నెలకొంది. జాంబాగ్ ప్రాంతంలో ఉన్న కాలువ ప్రజల కు ఇబ్బందికరంగా మారింది. వెంకటాద్రినగర్లోని కాలువ పొంగినప్పుడు కాలనీవాసులు వరద తగ్గే వరకు జగిత్యాలకు రాలేని పరిస్థితి నెలకొంది. గంజ్రోడ్, గోవిందుపల్లి, మోతె, చింతకుంట చెరువు సమీపంలో నాలాల వెంట రక్షణగోడ లేకపోవడంతో చిన్నపిల్లలు, మహిళలు అటుగా వెళ్తే అందులో పడే పరిస్థితి నెలకొంది. వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక నిధులతో నాలాల్లో సీల్టుతీసి, మరమ్మతు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇది జిల్లా కేంద్రంలోని చింతకుంట నుంచి వచ్చే ప్రధానమైన నాలా. శంకులపల్లి వరకు ఉంటుంది. పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో పాటు వ్యర్థాలు పడేయడంతో కుంటను తలపిస్తోంది. శంకులపల్లి ప్రాంతంలో పొలాలు ఉండటంతో డ్రెయినేజీ నీరంతా పొలాల్లో పారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చిమొక్కలు తొలగించాలని కాలువ వెంట ఉన్న కాలనీవాసులు కోరుతున్నారు. ఇది గోవిందుపల్లి ప్రాంతంలోని ధరూర్ నుంచి వచ్చే పెద్ద కాలువ. వర్షం వచ్చిందంటే నాలా ఉప్పొంగి పట్టణంలోని వెంకటాద్రినగర్కు రాకపోకలు స్తంభించిపోవాల్సిందే. ఈ కాలువలో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, చిరిగిన పరుపులు, బీరువాలు, పాతవస్తువులన్నీ ఇందులోనే పడేస్తున్నారు. ఫలితంగా వర్షం కురిస్తే నాలా పొంగి ఇళ్లలోకి మురుగునీరు చేరుతోంది. ఇది కూడా గంజ్ నుంచి వెళ్లే ప్రధానమైన నాలా. సిటీ మధ్యలో ఉంటుంది. కొన్ని చోట్ల కాలువకు రక్షణగోడ లేకపోవడంతో వర్షాకాలంలో నాలా పొంగితే ప్రమాదాలు జరిగే అవకాశముంది. సీల్టు తీయకపోవడం, పిచ్చిమొక్కలు అత్యధికంగా ఉండటంతో కాలువ వెంట ఉండేకాలనీవాసులు దోమలతో సావాసం చేస్తున్నారు. ఇది గంజ్రోడ్లోని నాలా. పూర్తిగా సీల్టుతో నిండిపోవడంతో మురికినీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి. కాలువ సిటీమధ్యలో ఉండడంతో వర్షం పడితే డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి నీరు చేరుతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీల్టు తీసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
● ఎస్పీ అశోక్కుమార్ ఇబ్రహీంపట్నం: విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, పోలీసుస్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ అశోక్కుమార్ సిబ్బంది కి సూచించారు. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ను శుక్రవారం తనిఖీ చేశారు. డీఎస్పీ రాములు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ కీట్లను పరిశీలించారు. స్టేషన్లో రికార్డులు, కేసుల నమోదు వివరాలు, క్రైం వివరాలపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. సీఐ అనిల్కుమార్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల ఎస్సైలు అనిల్, రాజు, శ్రీధర్ పాల్గొన్నారు. రోశయ్యకు నివాళి జగిత్యాలక్రైం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రిగా రోశయ్య ఘనత సాధించారని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, వేణు, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ఖాన్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
గోరింట పూసింది
అంజన్నకు వరదపాశం వైభవంగా బోనాలు7జిల్లాకు తేలికపాటి వర్ష సూచనజగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదురోజుల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 29–32 డిగ్రీల సెల్సియస్గా, రాత్రి ఉష్ణోగ్రతలు 25–26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ ఉదయం 79–84శాతం, మధ్యాహ్నం 56–63శాతం నమోదయ్యే అవకాశముందన్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.మల్లాపూర్/మల్యాల: ఆషాఢమాసంలో గోరింటాకు సందడి కనిపిస్తోంది. మహిళకు ఎంతో ఇష్టమైన గోరింటాకును పెట్టుకుంటూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లాపూర్ మోడల్ స్కూల్లో శుక్రవారం గోరింటాకు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీచర్లు, విద్యార్థినులు చేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. మల్యాలలో ఉషోదయ మండల సమాఖ్య ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు నిర్వహించుకున్నారు. స్థానిక సెర్ప్ కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆమని ఆధ్వర్యంలో వీవోఏలు రెండు చేతులకు గోరింటాకు పెట్టుకొని సంబురాలు చేసుకున్నారు.మల్యాల: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మల్యాల మండలం ముత్యంపేటలో రైతులు శుక్రవారం వరదపాశం నిర్వహించారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి బిందెలతో జలాభిషేకం చేశారు. దిగువ కొండగట్టు వద్ద విగ్రహం వద్దకు వెళ్లి, బెల్లంతో కూడిన వరదపాశం నైవేద్యంగా సమర్పించారు. మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, పాక్స్ డైరెక్టర్ సంత ప్రకాశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఇబ్బంది లేకుండా చూస్తాం వ్యర్థాలు తొలగించాలి మున్సిపాలిటీల్లో 100 రోజుల కార్యాచరణలో భాగంగా డ్రైనేజీలు, వాగులు, ప్రభుత్వ భూములలో సీల్టు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నాలాలను శుక్రవారం పరిశీలించారు. గోవిందుపల్లి కాలనీ, గంజ్రోడ్, శంకులపల్లిలో ఉన్న నాలాలను వెంటనే శుభ్రపర్చాలని ఆదేశించారు. ప్రైవేటు భూ ముల యజమానులు తమ భూ ముల్లోని ముళ్లపొదలను తొలగించకపోతే జరిమానాలు విధించి ఆ డబ్బుతో శుభ్రం చేయాలన్నారు. కలెక్టర్ వెంట కమిషనర్ స్పందన, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.ప్రధాన మురుగు కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. 100 రోజుల ప్రణాళికలో భాగంగా నాలాలోని చెత్తాచెదారం తొలగించడం జరిగింది. పూర్తిస్థాయిలో తీయించేలా చర్యలు తీసుకుంటున్నాం. వర్షకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.– స్పందన, మున్సిపల్ కమిషనర్ -
రెండు పోస్టులు.. ఒక్క అధికారి
మల్యాల: ఓ వైపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద బందోబస్తు పర్యవేక్షణ.. మరోవైపు మండలంలోని 19 గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన.. ఇంకో వైపు ఆలయానికి, మండలానికి వచ్చే అధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రొటోకాల్ నిర్వహణ.. పెట్రోలింగ్, ఇతర కేసుల దర్యాప్తుతో పని ఒత్తిడి ఉంటుందని మల్యాల పోలీసుస్టేషన్కు గతంలో ఇద్దరు ఎస్సైలను కేటాయించారు. కొన్నాళ్ల పాటు కొనసాగగా.. తరువాత ఒక్క ఎస్సైతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో సత్వర సేవలు అందక మండల ప్రజలు స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. రెండో ఎస్సై పోస్టు ఉన్నా లేనట్టే అన్నచందంగా మారిందని పేర్కొంటున్నారు. బాధితుల పడిగాపులు.. మండలంలో 19 గ్రామాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఉండడంతో మల్యాల మండల పోలీస్స్టేషన్కు గతంలో ఇద్దరు ఎస్సైలను కేటాయించారు. ఆలయానికి వచ్చే భక్తులు, ప్రముఖుల భద్రత కోసం రెండో ఎస్సైకి విధులు కేటాయించేవారు. మండలంలోని సగం గ్రామాలతోపాటు ప్రొటోకాల్ విధులు నిర్వర్తించేవారు. కొన్నాళ్లు రెండో ఎస్సై కొనసాగగా.. ఐదేళ్లుగా ఒక్క రే ఎస్సై విధులు నిర్వహిస్తున్నారు. సదరు అధికారి జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తుండడంతో ఫిర్యాదుదారులు రోజంతా స్టేషన్ వద్ద ఎస్సై కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాబాస్ దృష్టిసారించాలి మల్యాల పోలీస్స్టేషన్పై జిల్లా పోలీస్బాస్ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు కోరుతున్నారు. పోలీస్స్టేషన్ పరిధిలోని కొండగట్టు ఆలయం, ప్రముఖుల పర్యటనలు, తరచూ జరుగుతున్న నేరాల పర్యవేక్షణతో ఉన్న ఒక్క ఎస్సైకి భా రం పడుతోందని అంటున్నారు. రెండో ఎస్సై పోస్టు ను తక్షణమే భర్తీ చేయాలని కోరుతున్నారు. ‘ప్రస్తు తం సిబ్బంది కొరత ఉంది. కొత్త అధికారులు రాగా నే మల్యాల పోలీసుస్టేషన్కు రెండో ఎస్సైని నియమిస్తాం’ అని ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు. మల్యాల పోలీస్స్టేషన్లో రెండో ఎస్సై లేక ఇబ్బంది గంటల తరబడి పడిగాపులు కాస్తున్న ఫిర్యాదుదారులు ప్రొటోకాల్, ఫీల్డ్ ఎంకై ్వరీలతో ప్రస్తుత ఎస్సై బిజీబిజీ -
అప్పుడే ఎరువుల కొరత..!
● జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దొరకని యూరియా ● మరికొన్ని ప్రాంతాల్లో లభించని డీఏపీ ● ఎరువుల కోసం ఎగబడుతున్న రైతులు జగిత్యాలఅగ్రికల్చర్: పంటల సాగు పూర్తిస్థాయిలో ప్రారంభంకాకుండానే రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. పంటలకు వినియోగించే రసాయన ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఏర్పడితే.. మేడిపల్లి, సారంగాపూర్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో డీఏపీ కొరత రైతాంగాన్ని వేధిస్తోంది. మొక్కజొన్న, వరి సాగు చేస్తున్న రైతులు ఎరువుల కోసం సింగిల్ విండో కేంద్రాలు, ఆగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారు. దీనిని అదునుగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక రేట్లకు విక్రయించే పనిలో పడ్డారు. 4.14 లక్షల ఎకరాల్లో పంటల సాగు జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. వరి 3.10లక్షల ఎకరాలు, మొక్కజొన్న, పసుపు, కంది, పెసర వంటి ఆరుతడి పంటలను లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు మొదటి దశ కింద యూరియా వేయాల్సిన అవసరం ఉంది. యూరియా సింగిల్ విండో కేంద్రాల్లో అందుబాటులో లేదు. ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్నందున తొలిదశ డీఏపీ అవసరం. ఆ ఎరువు కూడా అందుబాటులో లేదు. ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నా.. రైతులు డీఏపీ వాడేందుకే మొగ్గుచూపుతారు. కొరత అంటూ వదంతులు వానాకాలం సీజన్లో జిల్లాకు 40,351 టన్నుల యూరియా, 7,768 టన్నుల డీఏపీ అవసరమని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే యూరియా 7వేల టన్నులు, డీఏపీ వెయ్యి టన్నులు మాత్రమే జిల్లాకు వచ్చింది. దీంతో రానున్న రోజుల్లో ఎరువులు దొరుకుతాయో.. లేదో.. అన్న సంశయంతో రైతులు ఒక్కసారిగా ఎగబడుతున్నారు. గతేడాది జూన్ వరకు 4138.669 టన్నుల యూరియా అమ్ముడుపోగా.. ఈ ఏడాది జూన్ వరకే 7,641.460 టన్నులు అమ్ముడు పోయిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కొంతమంది రైతులు ప్రస్తుతం అవసరం లేకున్నా.. నిల్వ చేసుకుంటున్నారని, ఫలితంగా అక్కడక్కడ కృత్రిమ కొరత ఏర్పడుతోందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతేడాది గొల్లపల్లి మండలంలో 27.315 టన్నులు అమ్మగా.. ఈ ఏడాది ఇప్పటివరకే 284.050 టన్నులు అమ్ముడుపోయింది. మల్లాపూర్, మెట్పల్లి, మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, బీర్పూర్, బుగ్గారం, మల్యాల, పెగడపల్లి మండలాల్లో అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నట్లు తేలింది. కోత పెడుతున్న ప్రభుత్వం రైతులు పంటలకు అవసరం లేకున్నా.. రసాయన ఎరువులు వాడుతున్నారని గుర్తించిన కేంద్రం ఆ మేరకు కోత పెడుతోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలో కొరత ఏర్పడుతోంది. మరోవైపు ఎరువుల భారం రైతులపై పడకుండా సబ్సిడీ ఇస్తోంది. 50 కిలోల డీఏపీ బస్తాకు రూ.1350, యూరియా రూ.300 చొప్పున అందిస్తోంది. డీఏపీకి ఉపయోగించే ముడి పదార్థాలను సౌదీఅరేబియా, చైనా, మొరాకో, రష్యా, జోర్డాన్ నుండి దిగుమతి అవుతోంది. మార్క్ఫెడ్ ద్వారా సొసైటీలకు.. మార్క్ఫెడ్ సంస్థ ద్వారా జిల్లాలోని 51 సొసైటీలకు రసాయన ఎరువులు అందుతాయి. ఎరువుల కంపెనీలు 50శాతం మార్క్ఫెడ్కు.. మరో 50 శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తోంది. అయితే ప్రైవేట్ డీలర్లకు వెళ్లే యూరియా, డీఏపీ ఎక్కడికి పోతుందో అనే దానిపై స్పష్టత లేదు. ప్రైవేట్ వ్యాపారులు రవాణా..హమాలీ ఖర్చులు చూసుకుని ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు అధిక రేటుకు విక్రయిస్తున్నారు. సొసైటీల ద్వారా ప్రభుత్వ ధరకే రసాయన ఎరువులు విక్రయిస్తుండటంతో ఎక్కువ మంది రైతులు ఎగబడుతున్నారు. వచ్చింది 450 బస్తాలు.. ఇచ్చింది 150 మందికి. ఇబ్రహీంపట్నం: మొక్కజొన్న పంటకు మొదటి దశ యూరియా వేయాల్సిన సమయం రావడం.. ఎరువు కొరతగా ఉండడంతో ఇబ్రహీంపట్నంలో రైతులు అయోమయానికి గురవుతున్నారు. గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 450 బస్తాలతో లారీ లోడ్ వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ఉదయమే వచ్చి యూరియా కోసం వచ్చి ఎగబడ్డారు. ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున 150 మంది రైతులకు పంపిణీ చేశారు. సుమారు 70 మంది రైతులు యూరియా దొరక్కపోవడతంఓ వెనుదిరిగి వెళ్లారు. ఈ ఏడాది 50 శాతం యూరియానే కేంద్రం సరఫరా చేస్తుందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రెండు రోజుల్లో మరో 40 టన్నుల యూరియా సొసైటీకి వస్తుందని ఏవో రాజ్కుమార్ తెలిపారు. ఎరువులు సరఫరా చేయాలి నాట్లు వేస్తున్నాం. డీఏపీ దొరకడం లేదు. ప్రైవేట్ వ్యాపారులు అధిక రేటుకు విక్రయిస్తున్నారు. డీఏపీ వేయకుంటే వరి సరిగా కుదురుకోదు. మొక్కజొన్నకు మొదటి దశ కింద యూరియా వేయాల్సి ఉంది. అది కూడా సరిగ్గా దొరకడం లేదు. – చీటేటి జీవన్ రెడ్డి, తొంబర్రావుపేట ఎరువుల కొరత లేదు జిల్లాలో ఎరువుల కొరత లేదు. తప్పుడు సమాచారంతో.. అవసరం లేకున్నా రైతులు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. సీజన్ను బట్టి.. నెలవారీగా జిల్లాకు రసాయన ఎరువులు వస్తాయి. మిర్చి, వరి, మొక్కజొన్నకు యూరియాను మోతాదు మించి వాడుతున్నారు. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
జ్వర బాధితులకు డెంగీ పరీక్షలు నిర్వహించాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ రాయికల్: వర్షాకాలంలో జ్వరంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ వైద్యులను ఆదేశించారు. మండలంలోని బోర్నపల్లి, ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులను పరిశీలించారు. రాయికల్ ఆస్పత్రిని తని ఖీ చేశారు. రోగుల వార్డులోకి వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులంతా సమయపాలన పాటించాలని సూచించారు. పరీక్షల కిట్లు అందుబాటులో లేకపోతే జిల్లాకేంద్రం నుంచి తెప్పించుకోవాలని కోరారు. రాయికల్ ఆస్పత్రిలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూపరిండెంట్కు సూచించారు. ఆయన వెంట వైద్య విధాన పరిషత్ కో–ఆర్డినేటర్ రామకృష్ణ, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, కమిషనర్ మనోహర్గౌడ్, ఆస్పత్రి సూపరిండెంట్ శశికాంత్రెడ్డి పాల్గొన్నారు. టీబీ చికిత్స అందించాలి జగిత్యాల: టీబీ వ్యాధి ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. టీబీ ముక్త్భారత్ అభియాన్లో భాగంగా సీజనల్ వ్యాధులపై కలెక్టరేట్లో సమీక్షించారు. ప్రతిరోజు డ్రైడే పాటించాలని, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉంటే తొలగించాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరదలతో బాహ్యా ప్రపంచానికి సంబంధాలు తెగి పోయే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నా రు. గర్భిణులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రతిరోజూ ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. డీఎంహెచ్వో ప్రమోద్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 296 ఫాగింగ్ మిషన్లు, 336 హ్యాండ్పంపులు ఉన్నాయని, 31 వేల ఆయిల్బాల్స్ తయారు చేశామని, క్లోరినేషన్ చేయిస్తున్నామని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మపై ధరాభారం!
● ఒక్కసారిగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు ● ఇందిరమ్మ పథకం మొదలవగానే పెంచిన వ్యాపారులు ● సగటున ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం ● ప్రభుత్వం విడుదల చేసేది రూ.5 లక్షలు ● ఇంటి నిర్మాణానికి కావాల్సింది కనీసం రూ.10 లక్షలు ● స్థిరంగా కొనసాగుతున్న సిమెంట్, ఇసుక ధరలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇందిరమ్మ ఇంటిపై ధరాఘాతం అశనిపాతంలా మారింది. సామాన్యుడికి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకంపై ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ నిర్మాణ సామగ్రికి అమాంతం డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా నిర్మాణ సామగ్రి ధరలు పెంచేశారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే ఇపుడున్న నిబంధనల ప్రకారం.. 600 నుంచి 800 చదరపు అడుగుల మేర నిర్మించుకునే అవకాశం ఉంది. ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసేందుకు సిద్ధపడటాన్ని దళారులు అదనుగా తీసుకున్నారు. ఫలితంగా ప్రతీ ఇంటి నిర్మాణం మీద అదనపు భారం పడనుంది. ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం... ఇందిరమ్మ ఇంటికి నిర్మాణ సామగ్రి కీలకం. కట్రౌతు ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.1200, కంకర ట్రిప్పుకు రూ.1000, రూ.స్టీలు టన్నుకు రూ.2000, ఇసుక ట్రిప్పుకు రూ.1000, మొరం ట్రిప్పుకు రూ.200 చొప్పున ధరలను అమాంతంగా పెంచేశా రు. ఈ నిర్మాణ సామగ్రి లేకుండా ఏ ఇల్లూ పూర్తికా దు. సగటున చూసుకుంటే ప్రతీ ఇంటిపై తక్కువలో తక్కువ రూ.55 వేల నుంచి రూ.60 వేల పైచిలుకు భారం పడుతోంది. సిమెంట్ ధరలు పెరుగుతాయని అని ప్రచారం ఊపందుకుంది. దీన్ని వ్యాపారులు, అటు వినియోగదారులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పట్లో సిమెంటు ధరలు పెరిగే సూచనలేమీ కనిపించడం లేదు. అయితే, స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిపైనే వ్యాపారులు, దళారులు, మధ్యవర్తులు ధరలు పెంచి ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. కానీ, వాస్తవ పరిస్థితుల కారణంగా ఆ ఖర్చు రూ.10 లక్షల వరకు వెళ్తోంది. జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరైనవి లబ్దిదారుల బేస్మెంట్ స్లాబ్లెవల్ దరఖాస్తుల సంఖ్య సంఖ్య స్థాయి కరీంనగర్ 2,04,504 8,219 8,219 742 129 జగిత్యాల 1,99,965 7,601 7,601 209 30 పెద్దపల్లి 1,63,000 9,421 6,018 542 42 రాజన్నసిరిసిల్ల 1,26,124 7,826 7,826 317 90 మొత్తం 6,93,593 33,067 29,664 1,810 291సామగ్రి గతం ప్రస్తుతం పెరిగింది కట్రౌతు(ట్రిప్పు) రూ. 2,700 రూ. 3,900 రూ.1,200 కంకర(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000 ఐరన్(టన్ను) రూ. 55,000 రూ. 57,000 రూ. 2,000 ఇసుక(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000 మొరం(ట్రిప్పు) రూ. 1,000 రూ. 1,200 రూ. 200 -
పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు
మల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్లో ఎంపీ ల్యాడ్స్ రూ.5లక్షలతో బోర్వెల్ నిర్మాణానికి భూమిపూజ చేసి ప్రోసిడింగ్ అందించారు. సీఎం రేవంత్రెడ్డి పాలనపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ నేరెళ్ల మోహన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీక మొహర్రం కోరుట్ల: మత సామరస్యానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అయిలాపూర్ దర్వాజ వద్ద పీరీలను దర్శించుకున్నారు. మత సామరస్యంతో హిదూ, ముస్లింలు ఈ పండుగను నిర్వహించుకుంటారని తెలిపారు. పులి వేషధారులతో ఫొటోలు దిగారు. కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ, డబ్బా గ్రామాల మధ్య లోలెవల్ వంతెన స్థానంలో కల్వర్టు నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు సురేష్రెడ్డి మంజూరు చేసిన రూ.1.50లక్షల పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఎంపీ నిధులతో తాగునీటి వసతి మెట్పల్లి: పట్టణంలోని 24వార్డులో ఉన్న మసీదు, 17వార్డు కటిక సంఘ భవనాల వద్ద బోర్ల పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాజ్యసభ ఎంపీ నిధులు రూ.3లక్షలు బోర్ల ఏర్పాటుకు కేటాయించారని పేర్కొన్నారు. అంబులెన్స్లో పురుడు పోసిన 108 సిబ్బందిరాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన ఆకుల మౌనికకు పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108కు సమాచారం అందించారు. రాయికల్ అంబులెన్స్ టెక్నీషియన్ రామ్, పైలట్ మల్లారెడ్డి చేరుకుని ఆమెను జగిత్యాలకు తరలించేందుకు సిద్ధపడ్డారు. మార్గంమధ్యలో పురిటినొప్పులు ఎక్కువై అంబులెన్స్లోనే పండంటి మగబిడ్డకు పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డను జగిత్యాలలోని మాతా శిశు కేంద్రానికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో 108 సిబ్బందిని పలువురు అభినందించారు. ఫీజుల దోపిడీని అరికట్టండిజగిత్యాలటౌన్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారాం అన్నారు. ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఫీజుల నియంత్రణకు డీఎస్ఆర్సీ సమావేశం ఏర్పాటు చేయాలని, పాఠశాలల అకౌంట్ ఆడిట్, సొసైటీ ట్రస్టుల ఆడిట్లను ఆర్టీవో స్థాయి జుడిషియల్ అధికారుల ద్వారా చేయించాలని డిమాండ్ చేశారు. ఫీజుల వివరాలను పాఠశాల నోటీసు బోర్డుతోపాటు విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కోరారు. టీచర్లు, సిబ్బంది వేతనాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి సంగెపు ముత్తు, పట్టణ అధ్యక్షుడు దేవుసింగ్రాథోడ్, జిల్లా కార్యదర్శి సాతారపు పద్మ తదితరులు ఉన్నారు. పోచమ్మతల్లికి బోనాలు రాయికల్: పట్టణంలోని కేశవనగర్లో పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో పురవీధుల మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. పోచమ్మతల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. -
గోరింటా పండింది..
జగిత్యాలటౌన్/కోరుట్ల: జిల్లాకేంద్రంలో సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆాసంలో.. కోరుట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గోరింటాకు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వాల్మీకి ఆవాసంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందుతున్న మహిళలు, యువతులు, సేవాభారతి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోందని, మహిళలు ఇన్ఫెక్షన్లకు గురికాకుండా పనిచేస్తుందని తెలిపారు. స్వప్న, రమ, స్రవంతి, స్వరూప, కవోష్ణ, కవిత, వర్షిని, వైష్ణవి, కోరుట్లలో గోరింటాకు ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. -
దుబ్బరాజన్న ఆలయానికి రెనోవేషన్ కమిటీ
సారంగాపూర్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుబ్బరాజన్న ఆలయానికి దేవాదాయశాఖ 11 మంది సభ్యులతో రెనోవేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా కోండ్ర రాంచంద్రారెడ్డి, వాసం శ్రీనివాస్, కొలపాక రవి, పంగ కిష్టయ్య, పిన్నం సత్యనారాయణ, మానుక గంగమ్మ, రంగు శంకర్, మతులాపురం శంకర్, చెట్ల శేఖర్, సూర సత్యనారాయణరెడ్డి, ఉరుమడ్ల పోశాలు నియమితులయ్యారు. ఈ కమిటీ ఏడాది పాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ నియామకానికి కృషిచేసిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాజీ మంత్రి జీవన్రెడ్డికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
అందని ‘ఉపాధి’ కూలి
వస్తాయని చెబుతున్నారు ఏప్రిల్, మే నెలలో చేసిన పపనులకు ఇప్పటివరకు డబ్బులు రాలేదు. పంచాయతీ కార్యదర్శిని పలుమార్లు అడిగితే వస్తాయని చెబుతున్నారు. మండుటెండలను లెక్క చేయక ఉపాధిహామీ పనులకు పోయాం. దూరం ఎంతైన నడిచే వెళ్లాం. పనులు చేసి నెలల తరబడి పైసల కోసం ఎదురు చూస్తున్నాం. – మల్యాల విజయ, కూలీ పెగడపల్లి రెండు నెలల బిల్లు రావాలి రెండు నెలల కూలీ డబ్బులు రావాలి. పనులు చేసినా సకాలంలో వేతనాలు సరైన సమయంలో చెల్లించడం లేదు. ఎండకాలంలో ఉపాధి పనులకు వెళ్లాం. కానీ ఇప్పటి వరకు ఆ పనులకు సంబంధించిన వేతనాలు రాలేదు. పెండింగ్లో ఉన్న కూలీ డబ్బులు చెల్లించాలి. లేకుంటే మాకు పస్తులే. – సాతి మల్లయ్య, పెగడపల్లిపెగడపల్లి: చేసిన పనికి కూలి అందక ఉపాధికూలీలు ఎదురుచూస్తున్నారు. పనులు చేసి రెండు నెలలు దాటినా ఖాతాల్లో నగదు జమ కావడంలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి డబ్బులు జమ చేయాలని కోరుతున్నారు. పేద కూలీలకు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఎండ, వాన లెక్కచేయకుండా ఉపాధిహామీ పథకం పనికి వెళుతున్నారు. వీరికి అందించాల్సిన వేతనాలు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని కూలీలు వాపోతున్నారు. ఉపాధి చట్టం ప్రకారం 14 రోజుల్లో చేసిన పనులకు కూలీ చెల్లించాల్సి ఉంటుంది. నెలల తరబడి కూలీ చెల్లించకపోవడంతో తాము ఆర్థికంగా అవస్థలు పాలవుతు న్నామని అంటున్నారు. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు. జిల్లాలోని 380 గ్రామ పంచాయతీల పరిధిలో పనులను గుర్తిస్తూ ఉపాధిహామీ ద్వారా కూలీలకు పనులు కల్పిస్తూ ఆర్థిక భరోసానిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం కూలీలు 1,38,823 మంది కూలీలు నమో దై ఉన్నారు. మొత్తం 1,67,461 జాబ్ కార్డులుండగా 1,00,723 యాక్టివ్ జాబ్ కార్డులున్నాయి. రెండు నెలలకు సంబంధించి రూ.1,25,26,813 పెండింగ్లో ఉన్నాయి. తమకు రావాల్సిన వేతనాలు చెల్లించి తమను ఆదుకోవాలని ఉపాధిహామి కూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిధులు రాగానే ఖాతాల్లో జమ ఉపాధి పనులు చేసిన ప్రతి కూలికి డబ్బులు వస్తాయి. పనుల్లో పాల్గొన్న ప్రతి కూలీ వివరాలు ఆన్లైన్ చేశాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. రాగానే నేరుగా ఖాతాల్లో జమ చేస్తారు. – రఘువరన్ డీఆర్డీవో రెండు నెలలుగా నిలిచిన బిల్లులు జిల్లాలో రూ.1,25,26,813 బకాయిలు మొత్తం జాబ్ కార్డులు 1,67,461 యాక్టివ్ జాబ్కార్డులు 1,00,723 కూలీలు 1,38,823 -
వారాహిమాతకు లక్ష పుష్పార్చన
కోరుట్ల: పట్టణంలోని త్రిశక్తి మాతా దేవాలయంలో వారాహినవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి బుధవారం లక్ష పుష్పార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు కట్ట నారాయణ, అధ్యక్షుడు గణేశ్, ప్రధాన కార్యదర్శి శంకర్, కోశాధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘సిగాచి’ మృతుల కుటుంబాలకు రూ.కోటి చెల్లించాలిజగిత్యాలటౌన్: హైదరాబాద్ శివారు పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. బుధవారం లేబర్ కమిషనర్కు లేఖ రాశారు. సిగాజి రసాయన పరిశ్రమలో పేలుడు ఘటన భోపాల్ ఘటనను తలపించిందన్నారు. 46మందికి పైగా మృతి చెందడంతోపాటు పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. ఘటనపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంపెనీ యాజమాన్యంపై హత్యానేరం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ హక్కులపై కేంద్రాన్ని నిలదీస్తాంవెల్గటూర్: తెలంగాణ రావాల్సిన నిధులు, హక్కులపై కేంద్రంపై పోరాటం చేస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మండలకేంద్రంలో పలువురు బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కమీషన్ల కోసం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెలిపారు. సమస్య పరిష్కరించాల్సిన బీజేపీ చోద్యం చూస్తూ కూర్చోవడం సరికాదని, దీనిపై పార్లమెంట్లో నిలదీస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గోపిక, నాయకులు తిరుపతి, ఉదయ్, శ్రీకాంత్రావు, సందీప్ రెడ్డి, వెంకటేశ్ ఉన్నారు. -
పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి
జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు చేర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో అలసత్వం వద్దని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన ఉండాలిజగిత్యాలక్రైం: సైబర్ నేరాలు, భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. బుధవారం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల నుంచి సైబర్ జాగృక్త దివాస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, యువతకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో సైబర్ నేరాలను నివారించడమే లక్ష్యంగా విద్యార్థులు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం వాడకుండా తల్లిదండ్రుల జాగ్రత్తలు పాటించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ దిశగా కృషి చేయాలి మల్యాల: టీబీ ముక్త్ భారత్ దిశగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఉప వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ఎన్.శ్రీనివాస్ అన్నారు. మల్యాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ఎన్.శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నమోదైన రోగుల ఆన్లైన్ వివరాల నమోదును పరిశీలించారు. ఆన్లైన్ నమోదు త్వరగా పూర్తి చేసి, ఆరోగ్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ, టీబీ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించాలన్నారు. దీర్ఘకాలికంగా పొడిదగ్గు, జ్వరం, హఠాత్తుగా బరువు తగ్గినట్లయితే టీబీ పరీక్ష చేయించుకోవాలని, కార్యక్రమంలో వైద్యులు మౌనిక, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి రాయికల్: విద్యార్థులు చదువుతున్న సమయంలో శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని భూ భౌతిక శాస్త్రవేత్త లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం రాయికల్ మండలం ఇటిక్యాల ఉన్నత పాఠశాలను సందర్శించి మాట్లాడారు. చిన్నతనం నుంచే శాస్త్ర విజ్ఞానాన్ని అలవర్చుకుంటే ప్రతి అంశంపై ఆలోచించే శక్తి పెరుగుతుందన్నారు. సైన్స్ టీచర్లు చెప్పే పాఠశాలను బట్టి పట్టడం కంటే అర్థం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం సదాశివ్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పేకాటపై సీసీఎస్ పోలీసుల నిఘా
● జిల్లాలో జోరుగా మూడుముక్కలాట ● చేతులు మారుతున్న కోట్ల రూపాయలుజగిత్యాలక్రైం: జిల్లాలో మూడుముక్కలాట జోరుగా సాగుతోంది. పోలీసులు నిఘా పటిష్టం చేసి.. రోజు కోచోట పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి.. వారి నుంచి నగదు సీజ్ చేస్తున్నారు. నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. పేకాటతో వారి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. నిత్యం జూదం కొనసాగుతుండటంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపో యి ఇ బ్బంది పడుతున్నాయి. కొంతమంది ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టి పేకా డుతూ తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడితోటలు, అడవుల్లో అడ్డా పేకాట రాయుళ్లకు మామిడితోటలు, అడవులు అడ్డాలుగా మారాయి. కొందరు నిర్వాహకులు కొంత మంది పేకాటరాయుళ్లను మచ్చిక చేసుకుని వారికి విందు, వసతులు ఏర్పాటు చేసి అక్కడికే పిలిపిస్తూ పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. స్థావరాల వద్ద ఉన్న రహదారులపై రహస్యంగా కాపలా ఏర్పాటు చేసుకుని పోలీసులు వస్తే సమాచారం రాగానే అక్కడి నుంచి పారిపోతున్నా రు. కొంతమంది మహారాష్ట్రలోని అప్పారావుపేట, బోరి, బిరేళీ, గోవా వంటి ప్రాంతాలకు వెళ్లి పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న జూదరులు జిల్లాకేంద్రంతో పాటు పలు మండలాలు, గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో.. మామిడి తోటల్లో, ఫామ్ హౌస్లను వేదిక చేసుకుని పోలీసుల కళ్లు గప్పి పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నారు. పోలీసులు జూదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిఘా పెంచిన సీసీఎస్ పోలీసులు జిల్లావ్యాప్తంగా సీసీఎస్ పోలీసులతో పాటు, స్థానిక పోలీసులు పేకాటపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టుబడిన, నిర్వాహకుల వివరాలు సేకరిస్తూ సాంకేతికతతో సీసీఎస్ పోలీసులు వారిపై దాడులు చేస్తూ పేకాట రాయుళ్లకు అడ్డుకట్ట వేస్తున్నారు. పారిపోతున్న జూదరులు రహస్య ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో, మామిడి తోటల్లో పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు దాడులు చేయగా, చాలామంది జూదరులు పోలీసుల కళ్లుగప్పి పారిపోతున్నారు. పోలీసులు దొరికిన వారి నుంచి కూపీ లాగడంతో పాటు అక్కడున్న వాహనాలను స్వాధీనం చేసుకుని అసలు నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఏడాది కేసులు నిందితులు పట్టుకున్న సొమ్ము(రూ.లలో) 2022 109 536 16,91,045 2023 78 473 18,66,696 2024 89 602 19,40,681 2025 71 447 16,68,520 -
ఖాళీ ప్లాట్లు.. అనేక పాట్లు
జగిత్యాల/మెట్పల్లి: మెట్పల్లి మున్సిపాలిటీలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు పెద్ద సమస్యగా మారాయి. సంబంధిత యజమానులు వాటిని శుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్ల వాటిలో పిచ్చి మొక్కలు దట్టంగా పెరగడమే కాకుండా చాలాచోట్ల వరద నీటి నిల్వతో మురికి గుంటలుగా తయారయ్యాయి. మరోవైపు మున్సిపల్ అధికారులు కూడా వీటి విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య ఉన్న కాలనీలు ఇవే.. ● బల్దియాలోని హన్మాన్నగర్, బీడీ కాలనీ, సాయిరాంకాలనీ, టీచర్స్ కాలనీ, సిద్ధి వినాయనగర్, బాలకృష్ణనగర్, అర్బన్ హౌజింగ్ కాలనీల్లో వందల సంఖ్యలో ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ఇవి ఎన్నో సమస్యలకు దారి తీస్తున్నాయి. ● ప్రధానంగా వాటిల్లో పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి పాములకు ఆవాసంగా మారుతున్నాయి. అవి ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ● అలాగే కొన్ని చోట్ల డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు వాటిల్లోకి వచ్చి చేరుతోంది. దీంతోపాటు వరద నీరు కూడా చేరి నిల్వ ఉండడంతో అవి మురికి కుంటలుగా తయారవుతున్నాయి. ● ఇలాంటి వాటితో దుర్వాసనను వెదజల్లడంతో పాటు దోమల బెడద ఎక్కువై ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు.. ● ఖాళీ ప్లాట్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ అవి మున్సిపల్ అధికారులకు పట్టడం లేదు. ● వాస్తవానికి నిబంధనల ప్రకారం..ఖాళీ ప్లాట్ల యజమానులు వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. పిచ్చి మొక్కలు పెరగకుండా.. చెత్తాచెదారం పేరుకుపోకుండా.. మురుగు నీరు నిలిచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ● ఈ విషయంలో నిర్లక్ష్యం చూపే వారికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వాలి. దీనికి స్పందించకుంటే జరిమానా విధించే అవకాశముంటుంది. ● కానీ అధికారులు అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ● ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. గతేడాది పెద్ద సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. ● కొన్ని రోజులుగా వార్డుల్లో పర్యటిస్తూ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు.. అపరిశుభ్రతకు కారణమవుతున్న ఖాళీ ప్లాట్లను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాకేంద్రంలో.. ● జగిత్యాల.. గ్రేడ్–1 మున్సిపాలిటీ.. 48వార్డులు.. లక్షకు పైగా జనాభా ఉన్నా పారిశుధ్యం మాత్రం అస్తవ్యస్తంగా మారింది. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సిన ఆటోలు, ట్రాక్టర్లు వెళ్లకపోవడంతో చెత్తను ఖాళీ స్థలా ల్లోనే పడేస్తున్నారు. మున్సిపాలిటిలో నాలుగు జోన్లు ఉన్నాయి. వార్డుకో ఆటో, జోన్కు మూడు ట్రాక్టర్లు నడుస్తుంటాయి. 48 వార్డులకు అవి సరిపోవడం లేనట్లు తెలుస్తోంది. కన్పించని డంపర్బిన్స్ ● ప్రధానమైన చోట్ల డంపర్బిన్స్ ఏర్పాటు చేస్తే చెత్త సమస్య ఉండదు. గతంలో ప్రతిచోట డంపర్బిన్స్ పెట్టారు. ప్రస్తుతం వాటన్నిటినీ ఎత్తివేశారు. దీంతో ఖాళీ స్థలాల్లోనే చెత్త పడేస్తున్నారు. పట్టించుకోని మున్సిపల్ అధికారులు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ చిత్రం మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని సిద్ధివినాయకనగర్లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ ప్లాట్లు. వీటిల్లో ఎక్కడికక్కడ దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాముల బెడద ఎక్కువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఖాళీ ప్లాట్లను శుభ్రం చేసే విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్రోడ్లోని గోవిందుపల్లికి వెళ్లే రహదారి. ఖాళీ స్థలం మొత్తం చెత్తతో నిండిపోయింది. బల్దియా ట్రాక్టర్లు, ఆటోలు రాక డ్రైనేజీలు తీయడం లేదు. చెత్త తీసుకెళ్లకపోవడంతో ఖాళీ స్థలంలోనే పడేస్తున్నారు. పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రిపూట ఉండలేకపోతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం మెట్పల్లి బల్దియా పరిధిలోని హన్మాన్నగర్లోనిది. ఈ కాలనీ నూతన గృహాల నిర్మాణంతో విస్తరిస్తోంది. ఇందులోనూ అక్కడక్కడ ఉన్న ఖాళీ ప్లాట్లు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని ప్లాట్లల్లో మొక్కలతో పాటు మురుగునీరు వచ్చి చేరింది. ఈ సమస్యతో పరిసరాలు కంపు కొడుతుండడమే కాకుండా దోమల బెడద ఎక్కువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తబస్టాండ్ సమీపంలోని వాటర్ట్యాంక్ సంది. ఇక్కడ కమిషనర్ క్వార్టర్ కూడా ఉంటుంది. ఈ సమీపంలోనే అత్యధిక చెత్త పడేస్తున్నారు. కాలనీ మొత్తం దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది నర్సింగ్ కళాశాల సమీపంలోని ఖాళీ స్థలం. ఇందులో మట్టి, చెత్తాచెదారం పడేస్తున్నారు. దుర్వాసన వస్తోందని కళాశాల విద్యార్థులు పేర్కొంటున్నారు. ఖాళీ స్థలం కావడంతో ఇష్టానుసారంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తున్నారు. ఇది బైపాస్ ప్రధాన రోడ్. డ్రైనేజీని ఆనుకునే చెత్త వేస్తున్నారు. విరిగిపోయిన కూలర్లు, ఫ్యాన్లు, చెడిపోయిన బెడ్స్, చిని గిన బట్టలు ఇలా అనేక వస్తువులు అక్కడే పడేస్తున్నారు. అటు వైపు వెళ్తేనే దుర్గంధం వెదజల్లుతోంది. మున్సిపల్ అధికారులు స్పందించి అక్కడ చెత్త వేయకుండా చూడటంతోపాటు, డంపర్బిన్ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాలరూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలానికి చెంది న 99మందికి రూ.28.14 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్, 86మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపి ణీ చేశారు. కాంగ్రెస్ రైతుపక్షపాతి ప్రభుత్వమన్నారు. సన్నబియ్యం, కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, మహిళసంఘాలకు ఆర్థిక చేయూత వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, నాయకులు ర వీందర్రెడ్డి, పాలెపు రాజు, ముకుందం, జాన్, మ ల్లారెడ్డి, బోనగిరి నారాయణ, నరేశ్ పాల్గొన్నారు. డేకేర్ ఏర్పాటు చేయండి జగిత్యాల: సీనియర్ సిటిజన్స్ కోసం డేకేర్ ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజన్స్ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఆయన మంత్రి లక్ష్మణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లి కేంద్రం ఏర్పాటు చేసేలా చూస్తానన్నారు. హరి అశోక్కుమార్, విశ్వనాథం, హన్మంతరెడ్డి పాల్గొన్నారు. పట్టణాభివృద్ధికి కృషి జగిత్యాల పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. పలు వార్డుల్లో రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.140 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం
● అడుగడుగునా గుంతలే ● మరమ్మతు చేయించని వైనం ● అను నిత్యం ప్రమాదాలు ● వాహనదారులకు తిప్పలుజగిత్యాల: జిల్లాకేంద్రం.. పైగా గ్రేడ్–1 మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో రోడ్లన్నీ ఛిద్రంగా మారాయి. అడుగు తీసి అడుగు వేయాలన్నా.. వాహనదారులు వెళ్లాలన్నా.. బస్సులు వెళ్లాలన్నా రహదారులన్నీ గుంతలమయంగా ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. జిల్లా కేంద్రం కావడంతో నిత్యం వందలాది మంది పనుల నిమిత్తం వస్తుంటారు. ప్రధాన కూడళ్లు అయిన కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, తహసీల్ చౌరస్తా, టవర్సర్కిల్, బస్టాండ్ ఇన్గేట్, అవుట్గేట్, మున్సిపల్ చౌరస్తా, మోతె చౌరస్తాలో రోడ్లన్నీ అతిదారుణంగా ఉన్నాయి. ప్రతి చోట పెద్దపెద్ద గోతులు ఉండటంతో వాహనదారులు అందులో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలం అందులో నీరు నిలిచి ఏర్పడకపోవడంతో నేరుగా వాహనదారులు వచ్చి అందులో పడుతున్నారు. వాహనాలు దెబ్బతినడంతోపాటు, వాహనదారులు గాయాలపాలవుతున్నా రు. ఉన్నతాధికారులు స్పందించి గుంతలకు మరమ్మతు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని పార్క్ నుంచి కొత్తబస్టాండ్కు వెళ్లే రహదారి. ఇటీవల అటువైపుగా ఉన్న సీసీరోడ్డును పని నిమి త్తం తవ్వి వదిలేశారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది మంది వెళ్తుంటారు. ఇందులో కనీసం రోజుకు 2– 3 ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్తబస్టాండ్కు వెళ్లాలంటే ఇదే రహదారి. కనీసం మరమ్మతు చేపట్టడం లేదు. ఇది పాతబస్టాండ్ చౌరస్తా. ఇక్కడ వందలాది వాహనాలు, ప్రయాణికులు వెళ్తుంటారు. సీసీరోడ్డంతా ఛిద్రంగా మారడంతో పాదచారులకు కష్టతరంగా మారింది. పాఠశాలలు విడిచిన సమయంలో ప్రతిఒక్కరూ ఈ రోడ్డుమీదుగానే వెళ్తుంటారు. కనీసం రోడ్డుకు మరమ్మతులు చేయడం లేదు. ఇది జిల్లాకేంద్రంలోని వాణిజ్య ప్రాంతమైన టవర్సర్కిల్. ఇక్కడకు నిత్యం వందలాది మంది వస్తూపోతుంటారు. ఇక్కడ రోడ్డు మిషన్ భగీరథ పనుల నిమిత్తం రోడ్డంతా తవ్వి పైప్లైన్ వేసి వదిలేశారు. సక్రమంగా కూర్చోకపోవడంతో గుంతలమయంగా మారింది. వాహనదారులు వెళ్లాలన్నా, పాదచారులు నడవాలన్నా ఇబ్బందికరంగా మారింది. ఈ చిత్రం బైపాస్రోడ్లోని మోతె వెళ్లే రహదారిలోగల చౌరస్తా. నిత్యం వందలాది వాహనాలు ఇటువైపు వెళ్తుంటాయి. చౌరస్తా మధ్యలోనే పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వాహన ప్రమాదాలు అనేకంగా జరుగుతున్నాయి. వర్షం పడితే నీరు మొత్తం నిలిచి గుంతలు కనిపించకపోవడంతో అందులో పడి వాహనదారులు గాయాలపాలవుతున్నారు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇది కొత్తబస్టాండ్ చౌరస్తా. ప్రతి వాహనం ఈ రహదారి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. మార్గంమధ్యలోనే పెద్ద గుంత ఉండటం అందరికీ సంకటంగా మారింది. వర్షాకాలం కావడం, గుంతల్లో నీరు నిలవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. చర్యలు చేపడతాం మున్సిపల్ పరిధిలో ఉన్న రోడ్లకు మరమ్మతు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్నిచోట్ల మరమ్మతు చేపట్టాం. మరికొన్ని చోట్ల మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్ ఇది జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ ఇన్గేట్. ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారు వాహనాలపై వెళ్తుంటారు. ఇది ప్రధాన రహదారి కావడం.. పెద్ద గుంత ఉండడంతో వాహనదారులు అదుపుతప్పి అందులో పడిపోతున్నారు. ఒకానొక సమయంలో బస్సులు కుదుపులకు గురవుతున్నాయి. -
స్వశక్తి సంఘాల నిర్వహణ బాధ్యతగా తీసుకోవాలి
జగిత్యాలరూరల్: స్వశక్తి సంఘాల నిర్వహణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పాలమూరు మహా సమైక్య రిసోర్స్ పర్సన్స్ శ్రీలత, సుధారాణి అన్నారు. జిల్లాకేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఇటీవల గ్రామాల్లో ఎంపికై న గ్రామ సంఘం అధ్యక్షులకు మంగళవారం శిక్షణ కల్పించారు. సెర్ప్ ఇందిరాక్రాంతి పథం ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు, 25ఏళ్లలో సాధించిన ప్రగతి అంశాలపై వివరించారు. ప్రస్తుతం చేపట్టిన కార్యక్రమాలతోపాటు సెర్ప్ సిబ్బంది వీవోఏలు విధులు, బాధ్యతలు, గ్రా మ సంఘం బాధ్యతలు, గ్రామ సంఘం ద్వా రా స్వశక్తి సంఘాల పర్యవేక్షణ, పుస్తకాల నిర్వహణ, కట్టుబాట్లు, అమలు, ఉత్తమ గ్రామ సంఘం, మహాసభ అధికారాలపై వివరించారు. ఏపీఎం గంగాధర్, సీసీ విద్యాసాగర్, మండల సమైక్య అధ్యక్షురాలు దేశవేని గంగభవాని, కార్యదర్శి జమున, కోశాధికారి సుమలత, సిబ్బంది పద్మ, సురేందర్, అశోక్ పాల్గొన్నారు. కార్మికుల సమ్మె నోటీసుజగిత్యాల: తమ సమస్యలు పరిష్కరించాలని, తాగ్యాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కా ర్మికులు లేబర్ ఆఫీసర్కు మంగళవారం సమ్మె నోటీస్ అందించారు. నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటిని అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కార్మిక సంఘం నాయకులు అన్నారు. దేశంలోని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 9న సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. నాయకులు సుతారి రాములు, శ్రీకాంత్, ముక్రం, లక్ష్మీ, భూమేశ్వర్ పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ ఇళ్ల’ వేగం పెంచాలి
మెట్పల్లి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి మండలం జగ్గసాగర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులను మంగళవారం పరిశీలించారు. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యవేక్షిస్తూ నిర్మాణాలు గడువులోగా పూర్తయ్యేలా లబ్ధిదారులు, మేసీ్త్రలను అప్రమత్తం చేయాలన్నారు. ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్, గృహ నిర్మాణశాఖ అధికారి వాసం ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మహేశ్వర్రెడ్డి ఉన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు కోరుట్ల: నవోదయ విద్యాలయానికి కేటాయించిన భవనంలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేయనున్న నవోదయ భవనాన్ని పరిశీలించారు. విద్యుత్ సౌకర్యం, తలుపులు, కలర్స్, నీటిసౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఆర్డీవో జివాకర్రెడ్డి, తహసీల్దార్ కృష్ణచైతన్య పాల్గొన్నారు. తాత్కాలిక భవనం ఏర్పాటు చేయాలి మెట్పల్లి:మెట్పల్లిలో శిథిలావస్థలో ఉన్న ఉన్నత పాఠశాల భవనాన్ని రెండు రోజులుగా కూల్చివేస్తున్నారు. ఆ పనులను కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జూనియర్ కళాశాల గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నా.. పక్షం రోజుల్లో తాత్కాలిక భవనాన్ని చూసి అందులోకి తరలించాలన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
జగిత్యాలక్రైం: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, అలాంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చే యాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నేరాలపై సమీ క్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరి ష్కరించాలన్నారు. సీసీ కెమెరాల పనితీరును ప్రతిరోజూ చెక్ చేసుకోవాలన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐ లు శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, రఫీక్ఖాన్, శ్రీని వాస్, సుధాకర్, కరుణాకర్, రాంనర్సింహా రెడ్డి, రవి, సురేశ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, వేణు, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో సిటీ పోలీస్యాక్ట్ అమలుశాంతిభద్రతల నేపథ్యంలో ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రజ లు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నర్సయ్యజగిత్యాలజోన్: జిల్లా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు (సబ్ కోర్టు) అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బిట్ల నర్సయ్యను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన నర్సయ్య 25 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. జిల్లాకు తేలికపాటి వర్ష సూచనజగిత్యాలఅగ్రికల్చర్: రానున్న ఐదురోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు గంటలకు 13 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిజగిత్యాలరూరల్: వర్షాకాలం నేపథ్యంలో సీజ నల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అ న్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించారు. ఇళ్లలో శుభ్రత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగునీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలని, ఎక్కడైనా నిల్వ ఉంటే ఆయిల్బాల్స్ వేయాలని సూచించారు. నీటిని శుద్ధి చేసుకుని తాగాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. మెడికల్ ఆఫీసర్ సౌజ న్య, లావణ్య, ఏఎన్ఎం సుగుణ పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ఓటింగ్లో పాల్గొనాలి జగిత్యాలరూరల్: జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025 ఓటింగ్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని ఎస్బీఎం జిల్లా కో–ఆర్డినేటర్ హరిణి అన్నారు. మంగళవారం ఐకేపీ కార్యాలయంలో గ్రామ సమైక్య అధ్యక్షులు, సిబ్బందికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ ఓటింగ్పై అవగాహన కల్పించారు. పరిశుభ్రత ర్యాంకింగ్లో కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో పరిశుభ్రత గురించి సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటోందని, ఓటింగ్లో స్వచ్ఛందంగా పాల్గొని జిల్లా ప్రథమస్థానంలో ఉండేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో 10 శాతం ప్రజలు ఓటింగ్లో పాల్గొనేలా చూడాలని, యాప్లో అడిగే 13 రకాల ప్రశ్నలకు ఓటింగ్ ద్వారా జవాబు తెలపాలన్నారు. -
జగిత్యాలలో జగన్నాథ రథయాత్ర
జగిత్యాలటౌన్: జిల్లా కేంద్రంలో ఇస్కాన్ మెట్పల్లి ఆధ్వర్యంలో మంగళవారం జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ స్వామివారికి పూజలు చేసి రథాన్ని లాగి భక్తులను ఉత్తేజ పరిచారు. యావర్రోడ్డు, తహసీల్ చౌరస్తా, మోచీబజార్, క్లాక్టవర్, న్యూబస్టాండ్, నటరాజ్ చౌరస్తా మీదుగా రథయాత్ర సాగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంకీర్తన, ప్రవచనం, మహాహారతి నిర్వహించారు. ఇస్కాన్ ప్రతినిధులు కృష్ణప్రాన్జీవన్దాస్, ప్రేమానంద్గోవింద్దాస్, సురనాథ్శ్రీనివాస్దాస్ పాల్గొన్నారు. -
బోధనపై నమ్మకంతో..
వేములవాడ: కథలాపూర్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కిష్టయ్య తన కూతురు మధురిమను వేములవాడలోని బాలికల హైస్కూల్లో చేర్పించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందనే చేర్పించినట్లు కిష్టయ్య పేర్కొన్నారు. జమ్మికుంట: ప్రభుత్వ పాఠశాలలో బోధనపై నమ్మకం కల్పించేందుకు తన కుమారుడిని చేర్పించినట్లు టీచర్ బానోత్ సత్యజోస్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలోని స్కూల్లో సత్యజోస్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జమ్మికుంటలో ఉంటున్నారు. ఏడాది క్రితం బదిలీపై పర్లపల్లి పాఠశాలకు వచ్చారు. తన కొడుకు బానోతు సుశాంత్ను జమ్మికుంట హైస్కూల్లో 9వ తరగతిలో చేర్పించారు. -
నాన్న వెంటే పిల్లలు
కరీంనగర్స్పోర్ట్స్: తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను తీసుకెళ్తున్నారు ఈ తండ్రులు. వీరిని చూసి గ్రామంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను సర్కార్ బడులకు పంపుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం వేములవాడలోని జెడ్పీ హైస్కూల్(బాలికలు)లో విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సంక్షోభానికి ముందు కరీంనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ పిల్లలనూ అక్కడే చదివిపించేవారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో తాను పనిచేస్తున్న స్కూల్కే తన పిల్లలను తీసుకెళ్తున్నారు. పెద్ద కూతురు అనన్య ప్రభాస 8వ తరగతి, చిన్నకూతురు ప్రవస్థి 5వ తరగతి చదువుతున్నారు. -
చికిత్స పొందుతూ వలసజీవి మృతి
● ఈనెల 3న గల్ఫ్ వెళ్లేందుకు ఏర్పాట్లు ● అంతలోనే కుటుంబంలో విషాదం కథలాపూర్: మండలంలోని దుంపేటకు చెందిన పాట్కురి ప్రతాప్రెడ్డి (58) గతనెల 28న మెట్లపై నుంచి పడి గాయపడగా.. చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. ప్రతాప్రెడ్డి ఈనెల 3న మస్కట్ దేశం వెళ్లాల్సి ఉంది. అంతలోనే మృత్యువాతపడటంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం దుంపేటకు చెందిన ప్రతాప్రెడ్డి కొన్నాళ్లుగా మస్కట్ వెళ్లి వస్తున్నాడు. నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చారు. తిరిగి ఈనెల 3న మస్కట్ వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో జూన్ 28న ప్రతాప్రెడ్డి తన ఇంటిపై నుంచి మెట్ల ద్వారా దిగుతుండగా.. జారిపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రతాప్రెడ్డికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ వివరించారు. -
పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి
● ప్రభుత్వ పాఠశాలకు పంతుళ్ల పిల్లలు ● నమ్మకం కల్పిస్తున్న టీచర్లు ● స్ఫూర్తి పొందుతున్న తల్లిదండ్రులు ● సర్కార్ స్కూళ్లలో పెరుగుతున్న ప్రవేశాలు తాము పనిచేస్తున్న సర్కార్ స్కూళ్లపై నమ్మకం పెంపొందించడం.. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా టీచర్లు తమ పిల్లలను తమతో పాటే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ కొలువు చేస్తూ ప్రైవేట్ స్కూళ్లకు పంపడం సరికాదని.. సర్కార్ స్కూళ్లలో చేర్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని.. ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన సాగుతోందంటూ టీచర్లు చాటిచెబుతున్నారు. పిల్లలను తాము పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు. కథలాపూర్(వేములవాడ): మండలంలోని దుంపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న లింగంపేట సతీశ్ తన కొడుకు వరుణ్తేజ్ అదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. కోనరావుపేట: కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన తీపిరి సంజీవ్ స్థానిక మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు. తన కుమారుడు జయసూర్యని కూడా అదే పాఠశాలలో రెండో తరగతి చదివిస్తున్నారు. ప్రతి రోజూ తండ్రీకొడుకులు బైక్పై స్కూల్కు వెళ్లి వస్తున్నారు. -
విద్య వ్యాపారం కాదని..
సారంగాపూర్: ప్రస్తుతం విద్యను వ్యాపారం చేశారని.. కాదని చెప్పేందుకే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిస్తున్నట్లు గొడుగు మధుసూదన్ తెలిపారు. బీర్పూర్ మండలం నర్సింహులపల్లికి చెందిన మధుసూదన్ కండ్లపల్లిలో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్ద కుమార్తె నిత్య 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ఇంటర్మీడియట్లో చేరింది. చిన్న కూతురు శ్రీనిధి నర్సింహులపల్లిలో ని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కండ్లపల్లిలో విధులు నిర్వహిస్తూనే నర్సింహులపల్లిలోని స్కూల్కు వెళ్లి అదనంగా ఒక పీరియడ్ బోధిస్తున్నారు మధుసూదన్. -
బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎస్పీ వారితో నేరుగా మాట్లాడారు. వారి సమస్యల ను తెలుసుకున్నారు. వాటిని తక్షణమే పరి ష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ రేషన్కార్డులు ● అదనపు కలెక్టర్ లత జగిత్యాల: అర్హులందరికీ రేషన్కార్డులు మంజూరు చేస్తామని అదనపు కలెక్టర్ లత అన్నారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 23,400 కొత్త రేషన్కార్డులు, 46,884 మందిని కార్డుల్లో నమోదు చేశామని తెలిపారు. రేషన్కార్డు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. 592 దుకాణాల ద్వారా మూడునెలలకు సంబంధించిన సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు. గత వానాకాలం, యాసంగి సీజన్లో 6,437 ఏసీకేలు బకాయిలు ఉండగా.. రైస్మిల్లర్స్తో సమీక్షించి 14,481 ఏసీకేలు ప్రభుత్వానికి చెల్లించామన్నారు. ధాన్యం దిగుబడి గతంలో కంటే 50వేల టన్నులు అదనంగా వచ్చిందని, రైస్మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసి వారి అకౌంట్లలో జమ చేశామన్నారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, అక్రమ నిల్వ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించాలిఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సోమవారం సమావేశమైంది. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించాలని సూచించారు. అట్రాసిటీ బాధితులకు నిధులు మంజూరు చేస్తున్నామని, అదేస్థాయిలో కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నా రు. అట్రాసిటీ బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.2కోట్ల కోసం ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మా ట్లాడుతూ.. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీలు ఇబ్బంది పడుతున్నారని, మంత్రి సహకారంతో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎీస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉద్యమకారులను గుర్తించాలని దీక్షజగిత్యాలటౌన్: తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ జవ్వాజి శంకర్ కోరారు. ఫోరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట శాంతియుత దీక్ష చేపట్టారు. వీరికి ఉద్యమ జేఏసీ నాయకులు చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్శర్మ మద్దతు తెలిపారు. తెలంగాణ కోసం కవులు, కళాకారులు, ఉద్యమకారులు అహర్నిశలు కృషి చేశారని, వారి అండతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. జవ్వాజి శంకర్ మాట్లాడుతూ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. 250 చదరపు గజాల స్థలం, 25వేల పెన్షన్, హెల్త్కార్డులు అందించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి గాజుల శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ రాగుల రాజు, ప్రధాన కార్యదర్శి భారతపు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొలాస పరిశోధన స్థానం డైరెక్టర్గా హరీశ్కుమార్జగిత్యాలఅగ్రికల్చర్: పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్గా హరీశ్కుమార్ శర్మ నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన శ్రీలతను యాదాద్రిభువనగిరి డాట్ సెంటర్కు బదిలీ చేశారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా పనిచేస్తున్న సైదానాయక్ను హైదరాబాద్లోని రాజేంద్రనగర్కు బదిలీ చేశారు. పరిశోధన స్థానంలో పనిచేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు. -
సర్కార్ బడికి జైకొట్టి
పిల్లల చేయిపట్టి.. బడిపై నమ్మకం కల్పించాలని7దుబాయ్లో ఘనంగా బోనాలురాయికల్: దుబాయ్లోని ఎమిరెట్స్ తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ బోనాల పండుగను మైత్రి ఫర్మ్ అజ్మాలో ఘనంగా నిర్వహించారు. మహిళలు గౌరిదేవీకి పూజలు నిర్వహించిన అనంతరం బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. పోతురాజుల వేషధారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వ్యవస్థాపకులు పీచర్ల కిరణ్కుమార్, అధ్యక్షుడు చీటి జగదీశ్రావు, ఉపాధ్యక్షులు ఎలిగేటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోట్ల రాణి, సంయుక్త కార్యదర్శి శేఖర్గౌడ్, కోశాధికారి తిరుమల్గౌడ్, మహిళ సభ్యులు కస్తూరి మమత, పీచర్ల సారిక, అన్నపూర్ణ, సరోజ, జల, రనీష, స్వప్న, ప్రియ, విపుల, చంద్రలేఖ, లక్ష్మీ, శ్వేత, సుమజ, రమ్య, సంగీత పాల్గొన్నారు. ● తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన టీచర్లు ● స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఉద్యోగులుప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం.. గవర్నమెంట్ టీచర్లపై భరోసా పెంచాలనే పలువురు ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన ఉంటుందని చెప్పేందుకే తాము పనిచేస్తున్న స్కూళ్లకు పిల్లలను తీసుకెళ్తున్నారు. సార్లే.. తమ పిల్లలను ఊరిలోని బడికి తీసుకొస్తుంటే.. మిగతా తల్లిదండ్రులు తమ పిల్లలనూ చేర్పిస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇదే కారణం. తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్న ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు.రుద్రంగి(వేములవాడ): తన ముగ్గురు పిల్లలనూ సర్కార్ స్కూళ్లలోనే చదివిపిస్తున్నారు రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం వీరునితండాకు చెందిన టీచర్ భూక్య తిరుపతి. రుద్రంగి ప్రైమరీ స్కూల్లో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న భూక్య తిరుపతికి భూక్య ప్రీతిజ, భూక్య నిహారిక, భూక్య అయాన్ అద్వైత్ పిల్లలు. నిహారికను గతంలో తాను పనిచేసిన రుద్రంగి ప్రైమరీ స్కూల్కు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మానాలలోని స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి తన కొడుకు అయాన్ అద్వైత్ను అదే పాఠశాలకు వెంట తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూతుళ్లు భూక్య ప్రీతిజ 10వ తరగతి, భూక్య నిహారిక 7వ తరగతి.. గురుకులాల్లో చదువుతున్నారు. కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం దుంపేటకు చెందిన గుండేటి రవికుమార్–పద్మలత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరు మండలంలోని పోసానిపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతుల చిన్నకుమారుడు లౌకిక్ నాలుగో తరగతి వారు పనిచేస్తున్న పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు. నిత్యం తమ వెంటే స్కూల్కు తీసుకెళ్తున్నారు. వీరిని చూసి గ్రామంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పాఠశాలకు పంపడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. తల్లిదండ్రుల బడికి కొడుకు -
‘ఇందిరమ్మ ఇళ్ల’కు రూ.లక్ష రుణం
సారంగాపూర్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి సెర్ప్ ద్వారా రూ.లక్ష రుణం అందించనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. మండలకేంద్రంలో సీఎంఆర్ఎఫ్ రూ.12.48 లక్షలు, కల్యాణలక్ష్మి రూ.31లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణం ఆర్థిక కారణాలతో జాప్యం జరగొద్దన్న ఉద్దేశంతో మహిళా సంఘాల నుంచి రుణం అందిస్తామని, దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పెంబట్ల బీరయ్య ఆలయ నిర్మాణానికి సీజీఎఫ్ కింద రూ.12 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తహసీల్దార్ ఎండి.వాహీదొద్దీన్, ఎంపీడీవో గంగాధర్, ఆర్ఐ వెంకటేశ్, ఎంపీవో సలీం పాల్గొన్నారు. జగన్నాథపూర్ బ్రిడ్జి కోసం కృషి రాయికల్: రాయికల్ మండలం బోర్నపల్లి–జగన్నాథపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి కోసం సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రులను కలిశానని ఎమ్మెల్యే అన్నారు. బ్రిడ్జి మంజూరు కావడంపై జగన్నాథపూర్, బోర్నపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిశారు. రూ.4 కోట్లతో జగన్నాథపూర్లో చెక్డ్యాం నిర్మాణంతో వందలాది ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. గిరిజన, ఆదివాసుల నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, నాయకులు కోల శ్రీనివాస్, పాదం రాజు, కవిత, శ్రీనివాస్, గంగారాం, శంకర్, తులసి, అనిల్, నారాయణ, కాటిపల్లి గంగారెడ్డి, మర్రిపల్లి శ్రీనివాస్, గన్నె రాజిరెడ్డి, చంద్రశేఖర్, అనుపురం శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 20 మందికి సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని సూచించారు. 35వ వార్డులో సీసీరోడ్లకు భూమిపూజ చేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలన్నారు. గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, లక్ష్మణ్, బాలె శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన పాత డీఎంహెచ్వో డాక్టర్ సమీయోద్దీన్, ధర్మపురి నీటిపారుదల శాఖ ఈఈ నారాయణరెడ్డిని సత్కరించారు. డీఎంహెచ్వో ప్రమోద్, చక్రునాయక్, డాక్టర్ శ్రీనివాస్, జైపాల్, రాంచందర్రావు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ -
మసీదుకు స్థలం కేటాయించండి
నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించండి. ఇళ్లు పొందిన ముస్లిం కుటుంబాలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా కాలనీ పరిసరాల్లో మసీదుకు స్థలం కేటాయించండి. – మహ్మద్ అబ్దుల్ భారీ, ముస్లిం సదర్ ప్లాట్లు కబ్జా చేస్తున్నారు మాది వెల్గటూర్ మండలం మొక్కట్రావుపేట. 97 ఇళ్లు ఎల్లంపల్లిలో ముంపునకు గురయ్యా యి. ప్రభుత్వం కొంతమందికి ఆర్అండ్ఆర్ కాలనీలో ప్లాట్లు కేటాయించింది. 2015 నాటికి 18ఏళ్లు నిండిన యువతకు ప్లాట్లు, డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు రాలేదు. ఆర్అండ్ఆర్ కాలనీలో మిగిలిన ప్లాట్లను కొందరు కబ్జా చేస్తూ గుడిసెలు వేస్తున్నారు. వాటిని తొలగించి లబ్ధిదారులమైన మాకు అప్పగించండి. – ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులు, ముక్కట్రావుపేట అసంపూర్తి రోడ్డుతో ప్రమాదాలు మల్యాల బ్లాక్ ఆఫీస్ నుంచి పెగడపెల్లి వరకు ప్రారంభించిన రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కంకర, డస్ట్ పోసి వదిలేశారు. దుమ్ము కొట్టుకొచ్చి ఇళ్లలోకి చేరుతోంది. రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – మల్యాల గ్రామ ప్రజలు -
ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలు
యైటింక్లయిన్కాలనీ: రామగుండం మండలం న్యూమారేడుపాకలోని నర్సింహపురం(ఎంపీపీఎస్) ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు వి.అనిల్కుమార్ తన ఇద్దరు కుమారులను అదే పాఠశాలలో చదివిపిస్తున్నారు. పెద్దకుమారుడు శ్రీహన్ 5వ తరగతి, చిన్నకుమారుడు 2వ తరగతి చదువుతున్నారు. వారిద్దరిని నిత్యం తనతోపాటు బైక్పై ప్రభుత్వ బడికి తీసుకొస్తున్నాడు. తను పనిచేస్తున్న పాఠశాలలోనే ఇద్దరు పిల్లలను చదివిపిస్తూ.. గ్రామంలోని తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచినట్లు టీచర్ అనిల్కుమార్ తెలిపారు. -
నిరుపేద బాలుడి వైద్యానికి రూ.1.13లక్షల సాయం
ధర్మపరి: కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో కొ ట్టుమిట్టాడుతున్న ఓ నిరుపేద బాలుడి వైద్యం కోసం ఫేస్బుక్ మిత్రులు రూ.1.13లక్షలు వి రాళాలుగా అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన మద్దిరాల మనోహర్, సరిత దంపతులకు కుమారుడు, కూతురు సంతానం. మనోహర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆర్నెళ్ల క్రితం కుమారుడు రిత్విక్ క్యాన్స ర్ బారిన పడడంతో వైద్యం చేయించేందుకు ఆర్థికంగా ఇ బ్బంది పడుతున్నా డు. అక్కడి సామాజిక మిత్రుల ద్వారా తెలుసుకున్న ధర్మపురికి చెంది న సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ బాలుడి వైద్య ఖర్చులకు సాయం అందించాలని జూన్ 5న ఫేస్బుక్లో పోస్టు చేశా డు. బాలుడి తల్లి బ్యాంకు ఖాతా ను అందులో పొందుపర్చాడు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల కు చెందిన ఎన్నారైలు, దాతలు స్పందించి సరి త బ్యాంకు ఖాతాకు రూ.1.13 లక్షలు విరా ళాలు పంపించారు. ఆ డబ్బులను బ్యాంకు మే నేజర్ చేతులమీదుగా బాధిత కుంటుబానికి పంపిణీ చేశారు. దాతల విరాళాలతో వైద్య సేవలు కొనసాగుతున్నట్లు రమేశ్ తెలిపారు. -
తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలని..
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్కు చెందిన స్రవంతి కరీంనగర్రూరల్ మండలం చెర్లభూత్కూర్లోని జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వస్థలం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట కాగా కరీంనగర్లో నివాసముంటున్నారు. భర్త శ్రీకాంత్ ల్యాబ్ టెక్నీషీయన్. కూతురు అమూల్య 6వ తరగతి, కుమారుడు సాయిమోక్షిత్ 4వ తరగతి చదువుతున్నారు. గతంలో వీరు కరీంనగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువగా.. ప్రస్తుతం తల్లి వెంటే చెర్లభూత్కూర్ ప్రభుత్వ బడికి వెళ్తున్నారు. గ్రామంలోని తల్లిదండ్రులకు ప్రభుత్వ బడిపై నమ్మకం కల్పించేందుకు తన పిల్లలనూ అక్కడే చదివిపిస్తున్నట్లు టీచర్ స్రవంతి తెలిపారు. -
కనిపించని ‘ఊయల’
● అనాథ శిశువుల కోసం యంత్రాంగం నిర్ణయం ● ఏర్పాట్లలో జిల్లా అధికారులు తీవ్ర జాప్యం ● శిశువు వద్దనుకుంటే ‘ఊయల’లో వదిలి వెళ్లవచ్చుఉమ్మడి జిల్లాలోనే శిశు గృహం జగిత్యాల: అనాథలైనా.. పిల్లలు వద్దనుకునే తల్లులైనా తమ పిల్లలను వేసి వెళ్లడానికి ఆస్పత్రుల వద్ద ఊయల ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ ఊయల కార్యక్రమం కరీంనగర్లో విజయవంతం కావడంతో జగిత్యాలలోనూ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. పేదరికం, ఇతరత్రా కారణాలు, ఆడపిల్ల అనే ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులు శిశువులను చెత్తకుప్పలు, డ్రైనేజీల్లో పడేసి వెళ్లిన ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఊయలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన ఆస్పత్రితోపాటు కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ సామాజిక ఆస్పత్రుల వద్ద ఊయలను ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. పుట్టిన శిశువు వద్దనుకుంటే ఆ ఊయలలో వదిలివెళ్లే అవకాశం ఉంది. అక్కడ సీసీ కెమెరాలుగానీ, నిఘా ఏమీ ఉండదు. శిశువును వదిలి వెళ్లిన వారి సమాచారం కూడా సేకరించరు. అందులో వదిలివెళ్లిన శిశువును మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారు స్వీకరించి వారి ఆలనాపాలన చూసుకునేలా వెసులు బాటు కల్పించారు. ఎవరైనా ముందుకొస్తే నిబంధనల ప్రకారం దత్తత ఇస్తారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోనే శిశు గృహం ఉండటంతో జిల్లాలోని ఆస్పత్రుల వద్ద ఊయల ఏర్పాటు జాప్యమవుతోందని తెలుస్తోంది. శిశువులను చేరదీసిన అనంతరం వారు శిశు గృహాలకు పంపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఊయల ఏర్పాటు చేస్తే ఎవరైనా పిల్లలను వదిలివెళ్తే వారిని చేరదీసి కరీంనగర్కే పంపించాల్సిన పరిస్థితి ఉంది. జిల్లాకేంద్రంలో ఊయల ఏర్పాటు చేసేందుకు మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఓ ఏఎన్ఎంను నియమించనున్నారు. పిల్లలను వదిలి వెళ్లగానే చిన్నారి పూర్తి సంరక్షణ వారే చూసుకుంటారు. ఏదైనా అవసరం ఉంటే టోల్ఫ్రీ నంబరు 1098, 112 నంబర్లకు కాల్చేయవచ్చు. -
హద్దు రాళ్లు తొలగిస్తున్నారు
జిల్లాకేంద్రంలోని ఎల్ఎల్ గార్డెన్ నుంచి ధన్వంతరి ఆలయానికి వెళ్లే దారిలోని సర్వేనంబర్ 1429లోగల 8.05 ఎకరాలకు హద్దురాళ్లను కొందరు తొలగిస్తున్నారు. మా తాత అంగడి భూమయ్య నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి హద్దు రాళ్లు తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి. – అంగడి రాజు, మేడిపల్లి బకాయిలు చెల్లించాలంటున్నరు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతున్న మా పిల్లలను యాజమాన్యాలు అనుమతించడం లేదు. ఫీజు బకాయిలు చెల్లించాలంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సమస్యను ప్రభుత్వానికి నివేదించి మా పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చూడండి. – బీఏఎస్ స్కూల్స్ విద్యార్థుల పేరెంట్స్ ఇంట్లోకి నీరు వస్తోంది యావర్రోడ్డులో డ్రైనేజీ సరిగా లేక చిన్నపాటి వర్షానికే మురుగు నీరు ఇంట్లోకి చేరుతోంది. వర్షం వస్తోందంటేనే భయబ్రాంతులకు గురవుతున్నం. డ్రైనేజీని సరిచేసి ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోండి. – అక్కినపెల్లి కాశీనాథం, యావర్రోడ్డు జగిత్యాల -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
వెల్గటూర్: ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఎండపల్లి మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉమ్మడి వెల్గటూర్ మండలానికి చెందిన 54 మందికి కల్యాణలక్ష్మి, 92 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ గోపిక, వైస్ చైర్మన్ తిరుపతి, సీనియర్ నాయకులు గోపాల్రెడ్డి, రాంరెడ్డి, తహసీల్దార్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాధితుడికి మంత్రి అడ్లూరి పరామర్శ కోరుట్ల: 15 రోజుల క్రితం కోరుట్లలో గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంటు షాక్ తగిలి కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్రెడ్డి రాజేశ్ను ఆదివారం రాత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పరామర్శించారు. విద్యుత్ షాక్ ప్రమాద బాధితుల వైద్యానికి అవుతున్న ఖర్చులను ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామన్నారు. సీఎంరిలీఫ్ ఫండ్ లేదా విద్యుత్ శాఖ నుంచి ఆ డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట ముదిరాజ్ సంఘం నాయకులు ఎడ్ల రమేశ్, బహుజన దళిత గాయకులు లింగంపల్లి నరేశ్, మోర్తాడ్ రాజశేఖర్ ఉన్నారు. -
‘పోల్ ట్యాక్స్’ ఆదాయంపై దృష్టి
● జిల్లాలో సర్వే పూర్తి చేసిన విద్యుత్ శాఖ ● లెక్క తేలిన స్తంభాల సంఖ్య ● పూర్తిస్థాయిలో వసూలుపై అధికారుల దృష్టి ● ఆందోళన చెందుతున్న కేబుల్ ఆపరేటర్లు మెట్పల్లి: ‘మల్లాపూర్, మెట్పల్లి సబ్ డివిజన్ల పరిధిలో విద్యుత్ శాఖ ఇటీవల పోల్ ట్యాక్స్ విధింపు కోసం ప్రత్యేకంగా సర్వే జరిపిందన్లీ ప్రాంతంలో గతంలో సుమారు మూడు వేల స్తంభాలకు మాత్రమే ట్యాక్స్ చెల్లించేవారు ఆపరేటర్లు. సర్వే తర్వాత వాటి సంఖ్య 6,147కు పెరిగింది. ఇలా జిల్లా మొత్తంగా సర్వే పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించింది విద్యుత్శాఖ. దాని ప్రకారం తొందరలోనే పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూలుకు ఏర్పాట్లు చేస్తున్నారు.’ జిల్లాలో కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్ల నుంచి పోల్ ట్యాక్స్ వసూలు చేయడంపై విద్యుత్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటివరకు నామమాత్రంగానే ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్న ఆ శాఖ.. ఇకనుంచి పూర్తి స్థాయిలో వసూలుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పోల్ టూ పోల్ సర్వేను చేపట్టిన అధికారులు.. ఇటీవలే దానిని పూర్తి చేశారు. మరోవైపు విద్యుత్ శాఖ తీరుతో కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. పోల్ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పట్టణాల్లో రూ.20..పల్లెల్లో రూ.15 ● కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు తమ వ్యాపారం కోసం విద్యుత్ స్తంభాలను వినియోగిస్తున్నందుకు ట్యాక్స్ను వసూలు చేయాలని మొదటగా 2005లో ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ● పట్టణాల్లో ఒక్కో స్తంభానికి రూ.20, పల్లెల్లో రూ.15 చొప్పున వసూలు చేయాలని ఆ సమయంలో ప్రకటించిన జీవోలో స్పష్టం చేసింది. ఈ బాధ్యతను విద్యుత్ శాఖకు అప్పగించింది. ● అప్పటి నుంచి ఆ శాఖ అధికారులు ట్యాక్స్ను వసూలు చేస్తూ వస్తున్నారు. ● కొంతకాలంగా స్తంభాలు వినియోగిస్తున్న ఆపరేటర్లతోపాటు ప్రొవైడర్ల సంఖ్య పెరిగింది. ● దీనికి అనుగుణంగా ట్యాక్స్ రాకపోవడంతో విద్యుత్ శాఖకు ఆర్థికంగా నష్టం జరుగుతోందని భావించిన ఉన్నతాధికారులు.. క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి స్తంభాల లెక్క తేల్చాలని ఆదేశించారు. ● ఇటీవల పట్టణాలతోపాటు ప్రతి గామంలో స్థానిక అధికారులు సర్వే చేపట్టి పూర్తి చేశారు. దీనివల్ల ప్రతి సబ్ డివిజన్లో వినియోగిస్తున్న స్తంభాల సంఖ్య భారీగా పెరిగినట్లు తేలింది. పెరగనున్న ఆదాయం.. ● ఇంతకాలం ఆపరేటర్లు, ప్రొవైడర్లు పెద్ద సంఖ్యలో స్తంభాలు వినియోగిస్తూ నామమాత్రంగా ట్యాక్స్ చెల్లిస్తున్నప్పటికీ స్థానిక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ● ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాలతో వినియోగిస్తున్న ప్రతి స్తంభానికి కచ్చితంగా ట్యాక్స్ వసూలు చేసేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ● ఇప్పటికే కొంతమేర ట్యాక్స్ ఆదాయాన్ని పెంచినప్పటికీ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వసూళ్లు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆందోళన చెందుతున్న ఆపరేటర్లు ● ట్యాక్స్ వసూలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన విద్యుత్ శాఖ తీరుతో ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ● కేబుల్ రంగంలోకి కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో స్థానికంగా తమ వ్యాపారం లాభసాటిగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఇలాంటి పరిస్థితుల్లో ట్యాక్స్ చెల్లించడం తమకు ఎంతో భారమవుతోందని, ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా రద్దు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
డ్రైనేజీలు కబ్జా
● రోడ్లపైనే మురికినీటి ప్రవాహం ● కొన్ని చోట్ల అసంపూర్తి నిర్మాణాలు ● ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని గొల్లపల్లికి వెళ్లే రహదారిలోగల శ్మశాన వాటిక వద్ద గల చౌరస్తా. ఇక్కడ పెద్ద నాలా ఉంది. దీనిపై ఇనుప ఊచలతో కప్పువేశారు. అది చెడిపోవడంతో డ్రైనేజీ ఉప్పొంగినప్పుడల్లా నీరు బయటకు వస్తోంది. కొందరు దానిని ఢీకొని అందులో పడుతున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల రూరల్: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలని, వసతి గృహంలో పారిశుధ్య నిర్వహణ పనులు సక్రమంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలని, దోమలు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. సైక్సిక్ మహాసంగ్లో ఉపాధ్యాయుడి ప్రసంగంసారంగాపూర్: గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న హమారా విద్యాలయ్, హమారాతీర్థ్ కార్యశాల కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధిగా బీర్పూర్ మండలం కొల్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వొడ్నాల రాజశేఖర్ పాల్గొన్నారు. పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏబీఆర్ఎస్ఎం (అఖిల భారతీయ సైక్సిక్ మహాసంగ్) జాతీయ అధ్యక్షుడు నారాయణలాల్ గుప్తా, ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కార్యక్రమానికి పాల్గొన్న రాజశేఖర్ ప్రతి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాలని, నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని, విద్యాభివృద్ధికి తల్లిదండ్రులతోపాటు స్థానికుల సహకారం తీసుకోవాలని కోరారు. రాయికల్లో ఐటీడీఏ ఏర్పాటు చేయండిరాయికల్: రాయికల్ మండలంలో ఐటీడీఏగా ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు భూక్య గోవింద్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాజాతి అన్ని రంగాల్లో వెనుకబడిందని, ఏ సమస్య వచ్చినా ప్రతిఒక్కరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు భూక్యా రాకేశ్, గోవింద్నాయక్, మాలోత్ తిరుపతి, నరేందర్, పల్త్యా ప్రభాకర్, భూమానాయక్, శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పసుపుబోర్డు ఏర్పాటు శుభపరిణామంజగిత్యాలటౌన్: రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తూ.. నిజామాబాద్ కేంద్రంగా పసుపుబోర్డు ఏర్పాటు శుభపరిణామమని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. బోర్డు ఏర్పాటుతోనే సరిపెట్టకుండా కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. పచ్చబంగారంగా పేరున్న పసుపు పంటకు రూ.పదివేలకు మించి ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. పెట్టుబడి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రాయితీలు ఇవ్వాలని కోరారు. అమిత్షాకు స్వాగతంజగిత్యాలటౌన్: పసుపు రైతుల దశాబ్దాల కల సాకారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పసుపుబోర్డు కార్యాలయం, లోగో ఆవిష్కరణకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్షా నిజామాబాద్ వచ్చారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి స్వాగతం పలికారు. -
‘విద్యార్థి దత్తత’ అభినందనీయం
● 650 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు ధర్మపురి: నిరుపేద విద్యార్థుల కోసం చేపట్టిన విద్యార్థి దత్తత కార్యక్రమం అభినందనీయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, విద్యార్థి దత్తత కార్యక్రమం కన్వీనర్, గొల్లపల్లి గణేశ్ ఆధ్వర్యంలో మిత్రబృందం కలిసి శనివారం 650 మందికి స్కూల్ బ్యాగులు అందించారు. కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. 2014లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అంచలంచెలుగా ఎదిగి పేద విద్యార్థులకు సేవలందించడం గొప్ప విషయమన్నారు. ఇప్పటివరకు 3,200 మందికి బ్యాగులు అందించారని పేర్కొన్నారు. కన్వీనర్ గణేశ్ను మంత్రి అభినందించారు. డీఈవో రాము, ఎంఈవో సీతామహాలక్ష్మి, హెచ్ఎం మహేందర్, నాయకులు ఎస్.దినేష్ తదితరులున్నారు. -
కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం
● నేను ఆ స్థాయి నుంచే వచ్చా.. ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరుట్ల: పార్టీలో పనిచేసే కార్యకర్తకు ప్రాధాన్యం ఉంటుందని, తాను ఆ స్థాయి నుంచి మంత్రివరకు ఎదిగానని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో ఆయనను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మపురి, కోరుట్లను రెండుకళ్లలా చూసుకుంటానన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో 48 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా చూడాలన్నారు. నర్సింగరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ సత్తా చాటడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, అన్నం అనిల్, సత్యంరావు, తిరుమల గంగాధర్, కొంతం రాజం, పుప్పాల ప్రభాకర్, నాగభూషణం పాల్గొన్నారు. అంతకుముందు ఇటీవల విద్యుత్ షాక్తో మృతిచెందిన అలాల వినోద్, వెల్లుట్ల సాయికుమార్ కుటుంబాలకు మంత్రి ఎమ్మెల్యే సంజయ్తో కలిసి రూ.5 లక్షల చొప్పున అందించారు. ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం బుగ్గారం: మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన 191 మందికి కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి శనివారం ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. 17 మందికి కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్ మాజిద్, ఎంపీడీవో అఫ్జల్మియా, స్థానిక అధికారులు పాల్గొన్నారు. అవినీతిపై విచారణ చేపట్టండి బుగ్గారం పంచాయతీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. గత సర్పంచ్ సస్పెన్షన్పై స్టే ఆర్డర్ను అమలు చేశారని, లోకాయుక్త ఆర్డర్ను ఏడు నెలలు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కలెక్టర్ వ్యక్తిగత విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
వరుణ దేవుడా కరుణించు..
సారంగాపూర్లో బావుల్లో నీరు లేక పొక్లెయిన్తో పూడిక తీయిస్తున్న రైతు వెల్లుల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న రైతులు జలాభిషేకం చేస్తున్న మహిళలు ఎండిపోతున్న వరి నార్లు మెట్పల్లిరూరల్/సారంగాపూర్: వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణ శాఖ సూచనలతో పొలాలను దున్నిన రైతులు.. మృగశిర కార్తెలో మోస్తరు వర్షం కురవడంతో ఆనందించారు. తీరా విత్తనాలు వేసుకున్నప్పటి నుంచి వరుణుడు ముఖం చాటేయడంతో మొలకలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు, మహిళలు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. వెల్లులలో శనివారం సుమారు 50కి పైగా ఆలయాల్లో జలాభిషేకం చేశారు. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు మంగళహారతులతో మేళతాళాల మధ్య గంగజలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయాల్లో అభిషేకాలు జరిపారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో పంటలను కాపాడుకునేందుకు పొక్లెయిన్ సహాయంతో బావుల్లోని పూడిక తీయిస్తున్నారు. -
శ్రీమహాలక్ష్మీ ఆలయంలో కొనసాగుతున్న పారాయణాలు
ధర్మపురి: ధర్మపురి వద్దగల గోదావరి ఒడ్డునున్న శ్రీమహాలక్ష్మీ ఆలయంలో లోక కల్యాణార్థం చేపుడుతున్న పారాయణం శనివారం రెండోరోజుకు చేరింది. ఆలయ వంశీకులు బాల్చందర్, గుండయ్య, నరహరి ఆధ్వర్యంలో మహిళలు శ్రీపాద శ్రీవల్లభ, విష్ణు, లలిత సహస్ర పారాయణాలు కొనసాగించారు. ఈనెల 27 నుంచి జులై 17 వరకు పారాయణాలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రచయిత కేవీ.నరేందర్కు సన్మానంజగిత్యాల: ఉద్యోగులకు సేవతోనే గుర్తింపు అని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు అన్నారు. ఉద్యోగ విరమణ పొందనున్న ప్రముఖ కథా రచయిత, ఉపాధ్యాయుడు కెవి.నరేందర్ను శనివారం సత్కరించారు. కథారచయితగా ఎంతో గుర్తింపు పొందిన నరేందర్ ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన రచనలను మెచ్చుకుని అవార్డు అందించారని తెలిపారు. ఇది జిల్లాకే గర్వకారణమన్నారు. కార్యదర్శి అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానంజగిత్యాల: సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయి అవార్డు కోసం జిల్లాలోని అన్ని కేటగిరిల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. జూలై 13 చివరి తేదీ అని, అర్హత గల ఉపాధ్యాయులు NATIONALAWARDSTOTEACHERS.EDUCATION.GOV.IN లో వివరాలను నిర్ణీత నమూనాలో అప్లై చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సెట్ను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మైనర్ల డ్రైవింగ్పై ప్రత్యేక డ్రైవ్జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. వారం రోజులుగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనాలు నడిపిన 181 మంది మైనర్లకు జరిమానా విధించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆర్నెళ్లలో మైనర్ల డ్రైవింగ్తో ప్రమాదాలు చోటుచేసుకుని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీస్శాఖ అన్ని చర్యలూ తీసుకుంటోంది. సాధారణ ప్రసవాలకు మొగ్గు చూపాలికోరుట్ల రూరల్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఉంటుందని, అన్ని రకాల సేవలకు సిబ్బంది అందుబాటులో ఉన్నారని మాతాశిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. సేవలను అడిగి తెలుసుకున్నారు. 102 సేవలు, రూట్మ్యాప్పై అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో సమీక్షించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీతరాణి, వైద్యులు విజయలక్ష్మీ, సూపర్వైజర్లు ధనుంజయ, రమణ, ఫార్మసీ ఆఫీసర్ ఉదయ్ ప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు. -
జగన్నాథ్పూర్లో 20 శాఖల అధికారులు
రాయికల్: మండలంలోని జగన్నాథ్పూర్లో ఒకేరోజు 20 శాఖల అధికారులు పర్యటించారు. పీఎం ధర్తి జాతీయ ఉత్కర్ష్ అభియాన్లో భాగంగా జిల్లాస్థాయి అధికారులతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. మీసేవ, ఆధార్సేవలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు చేస్తూ అర్హులకు రేషన్కార్డులు, ఆధార్కార్డులు, సర్టిఫికెట్లు, పోస్టల్ ఇన్సూరెన్స్, బ్యాంక్ సేవలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. అర్హులందరికీ కేంద్ర పథకాలు అందించడంతోపాటు వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు. ఆలయ భూముల్లో సాగు చేస్తే చర్యలుకొడిమ్యాల: మండలంలోని నల్లగొండ శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ నాయిని సుప్రియ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ భూములను ఆక్రమించుకున్న రైతులను పిలిపించి మాట్లాడారు. ఆలయ భూముల్లో సాగుచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఆలయ హద్దులు దాటి సాగుచేయొద్దని సూచించారు. అనంతరం గుట్టపై పార్కింగ్ స్థలంలో 200 మొక్కలు నాటారు. కార్యక్రమంలో జగిత్యాల డివిజన్ దేవాదాయ శాఖ ఇన్చార్జి రాజమౌళి, ఎస్సై సందీప్, ఆలయ ఈవో వెంకన్న, మల్లేశం, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెంచిన బస్పాస్ చార్జీలు తగ్గించాలి
జగిత్యాలటౌన్: విద్యార్థుల బస్పాస్ చార్జీలను తగ్గించాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. పెంచిన చార్జీలు తగ్గించాలంటూ ఆర్టీసీ జగిత్యాల డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం ఆందోళన చేశారు. మహాలక్ష్మి పేరిట మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం.. ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సులు నడపకపోవడంతో పురుషులకు సీట్లు దొరికే పరిస్థితి లేదన్నారు. బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ఉచిత ప్రయాణం వృథాగా మారిందన్నారు. పైగా విద్యార్థుల బస్చార్జీలను పెంచడం శోచనీయమన్నారు. అనంతరం డిపో సిబ్బందికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత -
● యువత చేతిలోనే దేశ భవిత ● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ● వివిధ కంపెనీలకు 556 మంది ఎంపిక
కోరుట్ల: కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్మేళా విజయవంతమైంది. మేళాకు 1756 మంది హాజరుకాగా.. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 556 మంది ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏటా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లోని కంపెనీలకు ఎంపికై తే దూరం ఎక్కువని నిరాశకు గురికావొద్దని, వారికి కావాల్సిన ఏర్పాట్లను కంపెనీలతో మాట్లాడి తానే ఏర్పాటు చేయిస్తామని వెల్లడించారు. యువత చదువుతో పాటు జాబ్ స్కిల్స్ కలిగి ఉండాలన్నారు. మేళాలో 75కంపెనీల ప్రతినిధులు స్టాల్స్ ఏర్పాటు చేసి కేటగిరీల వారీగా ఐటీ, ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో అవకాశాలు కల్పించాయి. బీఆర్ఎస్ నాయకులు దారిశెట్టి రాజేశం, చీటి వెంకట్రావ్, తోట నారాయణ, కేతిరెడ్డి భాస్కర్రెడ్డి, సాయిరెడ్డి, అతిక్, వినోద్, సురేందర్, అన్వర్, అంజయ్యలు వివిధ కంపెనీలు ప్రతినిధులు పాల్గొన్నారు. -
వ్యాధుల భయం
● ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న నీరు ● దోమలకు అడ్డా.. కనిపించని స్ప్రే ● ముసురుతున్న రోగాలు ● ఆందోళనలో పట్టణవాసులు జగిత్యాల: fW™éÅÌS hÌêÏ MóS…{§ýl…, A†ò³§ýlª Ð]l¬°Þ´ë-Ísîæ-ÌZ Ð]lÆ>Û-M>ÌS…ÌZ ´ëÇÔ¶æ$-«§ýlÅ… AçÜ¢-Ð]lÅ-çÜ¢…V> Ð]l*Æý‡$-™ø…¨. _¯]l²-´ësìæ Ð]lÆ>Û-ÌSMóS {yðlƇ$$-¯ól-iË$ ´÷…W, Rêä çܦÌêÌZÏ Ð]l¬ÇMìS-±Æý‡$ °Í_, í³_aÐðl¬-MýSP-Ë$ §ýlrt…-V> ò³Æý‡$-VýS$-™èl$-¯é²Æ‡$$. ÐéÅ«§ýl$ Ë¿¶æÄ¶æ$…™ø AÌêÏyýl$™èl$¯é²Æý‡$.న’ ´ëÏr$Ï Mö¯]l$-VøË$ ^ólíÜ {V>Ð]l*-ÌZÏ °Ð]l-íÜ-çÜ$¢¯]l² Ķæ$fÐ]l*-¯]l$-Ë$ D Rêä çܦÌêÌS¯]l$ ç³sìæt…^èl$-MøMýS-´ù-Ð]l-yýl…-™ø çÜÐ]l$çÜÅ Ð]l$Ç…™èl ¡{Ð]l-Ð]l$-Ð]l#-™ø…¨. ѧéÅ-¯]l-VýS-ÆŠæ, MýS–Úë~-¯]l-VýS-ÆŠæ, O»ñæ´ë-‹Ü ÆøyŠæ, VøÑ…-§ýl-ç³-ÍÏ Ð]l…sìæ ÕÐéÆý‡$ M>ÌS-±ÌZÏ D çÜÐ]l$çÜÅ A«¨MýS…-V> MýS°í³-çÜ$¢…¨. Ð]l¬°Þç³ÌŒæ A«¨ M>Æý‡$-Ë$ ¯øsîæ-çÜ$-Ë$ gêÈ ^ólĶæ$-MýS-´ù-Ð]lyýl…, fÇÐ]l*-¯éË$ Ñ«¨…-^èl-MýS-´ù-Ð]lyýl… Ð]lÌSÏ çÜÐ]l$-çÜÅ-Ë$ ç³ÇÚëP Æý‡… M>Ð]lyýl… Ìôæ§ýl° Ý린MýS$-Ë$ BÆøí³-çÜ$¢-¯é²Æý‡$. ఖాళీ స్థలాలతో ఆరోగ్య ఆందోళనలు స్థలాల్లో దట్టంగా పెరిగిన పిచ్చిమొక్కలు, నిలిచిన మురికినీరు విషపూరి, పాములు, దోమలు, ఈగలకు ఆవాసంగా మారాయి. దీంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులు ప్రబలుతున్నాయి. నిబంధనల ప్రకారం, మున్సిపల్ అధికారులు ఈ స్థలాలను శుభ్రం చేసి, యజమానుల నుంచి ఖర్చు వసూలు చేయవచ్చు. అయితే, ఈ విధానం అమలు కావడం లేదు. బ్లీచింగ్ పౌడర్, కెమికల్ స్ప్రే వంటి చర్యలు కూడా బ్లాక్ స్పాట్స్ ఉన్న చోట మాత్రమే చేపడుతున్నారని, డ్రెయినేజీలపై దృష్టి సారించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఫాగింగ్ అందని కాలనీలు వర్షకాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమల సంచారం పెరిగింది. అయితే, కొన్ని ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే ఫాగింగ్ చేస్తుండగా, ఇతర కాలనీల్లో ఈ చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల సంఖ్య అధికమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విష సర్పాలు, పురుగుల భయం ఖాళీ స్థలాల్లో నిలిచిన నీరు, దట్టమైన పిచ్చిమొక్కలు విష సర్పాలు, జెర్రీలు, ఇతర విషపురుగులకు ఆవాసంగా మారాయి. సాయంత్రం వేళల్లో ఇవి ఇళ్లలోకి చొరబడుతుండడంతో కాలనీవాసులు భయా ందోళనకు గురవుతున్నారు. తలుపులు మూసుకోకపోతే ఇబ్బందులు తప్పడం లేదని వారు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీల నిర్మాణంలో లోపాలు మున్సిపాలిటీలో డ్రెయినేజీల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో చిన్న వర్షానికే పొంగిపొర్లుతున్నా యి. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రెయినేజీలు నిండిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. 100 రోజుల పారి శుధ్య ప్రణాళిక అమలవుతున్నప్పటికీ, ఖాళీ స్థలా ల్లోని పిచ్చిమొక్కలు, మురికినీరు సమస్యలను పరి ష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పరిష్కార మార్గాలు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఖాళీ స్థలాల్లోని పిచ్చిమొక్కలను తొలగించడం, డ్రెయినేజీలను సక్రమంగా ఏర్పాటు చేయడం, ఫాగింగ్ను అన్ని కాలనీల్లో నిర్వహించడం, యజమానులకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించడం వంటి చర్యలు చేపట్టాలి. ఇలా చేస్తే జగిత్యాలలో పారిశుధ్య సమస్యలు తగ్గి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది. జగిత్యాల మున్సిపాలిటీ వార్డులు : 48 జనాభా : 1,20,357 సిబ్బంది : 296 నోటీసులు జారీ చేసేలా చర్యలు ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు తొలగించని యజమానులకు నోటీసులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటాం. ఖాళీ స్థలాల్లో బోర్డులు సైతం ఏర్పాటు చేసేలా చూస్తాం. ఒకవేళ వారు స్పందించకపోతే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, టీపీవో ఇది విద్యానగర్కాలనీలోని సీతారామాంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన భూమి. ఇక్కడ ఇంతకు ముందు డంపర్బిన్ ఏర్పాటు చేసే వారు. ప్రస్తుతం డంపర్బిన్ లేకపోవడంతో అక్కడే చెత్త పోస్తున్నారు. దీంతో పాటు పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. వర్షానికి అందులో నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. చుట్టు పక్కల గల భవనాల వారికి రోగాలు వచ్చే అవకాశం ఉంది. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కోరుతున్నారు. -
ప్రహరీ లేక పరేషాన్
● జిల్లాలో 200కు పైగా ప్రహరీలు లేని పాఠశాలలు ● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ్డాగా కొన్ని స్కూళ్లు ● ఆవరణలోకి మూగజీవాలు, విష కీటకాల సంచారం ● భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మల్లాపూర్: సర్కారు బడుల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. విద్యార్థులు ఇబ్బందుల మధ్యే చదువులు కొనసాగిస్తున్నారు. ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రకటనలు గుప్పిస్తున్న సర్కారు ఆ తర్వాత సౌకర్యాలపై పట్టించుకోవడం లేదు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీలు లేక రక్షణ కరువైంది. జిల్లావ్యాప్తంగా 511 ప్రాథమిక, 85 ప్రాథమికొన్నత, 187 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో మొత్తం 783 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి మన ఊరు–మన బడి కింద ప్రహరీలు మంజూరయ్యాయి. కొన్ని ప్రగతిదశలో ఉండగా, మరికొన్నింటిలో పనులు ప్రారంభం కాలేదు. జిల్లాలో 220 ప్రాథమిక, ప్రాథమికొన్నత, జెడ్పీ హైస్కూళ్లకి పూర్తిస్థాయిలో ప్రహరీలు లేవు. మిగిలిన పాఠశాలల్లో పాతగోడలు, మరికొన్ని చోట్ల ఒకవైపు కొంతమేర నిర్మాణాలు చేపట్టి మిగతా వైపు ఆసంపూర్తిగా వదిలేశారు. ప్రహరీలు లేకపోవడంతో ఆవరణలో ఆవులు, గేదెలు, పందులు వస్తున్నాయి. ఇతర మూగ జీవాలు పాఠశాలల్లోకి ప్రవేశించి పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఉదయం పాఠశాలలకు వచ్చే ఉపాద్యాయలు, విద్యార్థులకు పేడ కుప్పలు, చెత్తాచెదారం కనిపిస్తోంది. ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా మారుతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులే తొలగించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్కూళ్ల ఆవరణలో హరితభారం కింద నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. మరికొన్ని పాఠశాలలు రాత్రివేళ మందుబాబులకు, ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డా మారుతున్నాయని ఉపాధ్యాయులు, ప్రజలు అంటున్నారు. విష కీటకాలతో భయాందోళన జిల్లాలోని చాలా పాఠశాలలు ఊరికి చివరన గుట్టలు, అటవీప్రాంతాలను ఆనుకొని ఉండటం, ప్రహరీలు లేకపోవడంతో విషపురుగులు, కీటకాలు వస్తున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులకు లక్షలాది నిధులు విడుదలవుతున్నాయి. అయినా ప్రహరీలు ఎందుకు నిర్మించడం లేదని అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు విడుదల చేసిన (సీడీపీ) నిధులతో పాఠశాలలకు ప్రహరీలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రహరీ నిర్మించాలి హుస్సేన్నగర్ ప్రాథమిక పాఠశాల రహదారికి అనుకొని ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి నిధులు మంజూరు చేయించి ప్రహరీని నిర్మించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అదనపు నిధులు కేటాయించాలి. – సయ్యద్ హైదర్, మాజీ సర్పంచ్, హుస్సేన్నగర్ ఉన్నతాధికారులకు నివేదించాం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. జిల్లాలోని పలు పాఠశాలల్లో ప్రహరీ, ఇతర వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కొన్ని పాఠశాలల్లో పనులు ప్రగతిలో ఉన్నాయి. మరికొన్నింటికి నిధులు మంజూరు కావాల్సి ఉంది. – రాము, జిల్లా విద్యాఽశాఖాధికారి, జగిత్యాల -
జిల్లాకు తేలికపాటి వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో(జూన్ 28 నుంచి జూలై 2 వరకు) అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 31–32 డిగ్రిల సెల్సియస్గా, రాత్రి ఉష్ణోగ్రతలు 24–25 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యే అవకాశం ఉందని అన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 64–74 శాతం, మధ్యాహ్నం 37–53 శాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. వాయువ్య దిశ నుంచి బలమైన ఈదురుగాలులు గంటకు 13–22 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని, అయితే, జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేడు జిల్లాలో మంత్రి పర్యటనజగిత్యాల: జిల్లాలో శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బుగ్గారంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసిడింగ్లు పంపిణీ చేసి అనంతరం కోరుట్లలోని సాయిబాబాను దర్శించుకుని న్యూబస్టాండ్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఇస్కోనిగుట్టలో మొక్కలు పంపిణీ చేసి, కల్లూరు రోడ్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి మెట్పల్లిలోని కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు ఇంటికి వెళ్లనున్నారు. తిరిగి ధర్మపురికి వెళ్లనున్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈగా సుదర్శనంజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ఈగా బి.సుదర్శనం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన సాలీయానాయక్ నిర్మల్ జిల్లాకు బదిలీ కాగా, నిర్మల్ జిల్లా ఎస్ఈగా పనిచేస్తున్న సుదర్శనం జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు సాలీయానాయక్కు వీడ్కోలు, సుదర్శనంకు స్వాగతం పలికారు. విద్యుత్ శాఖ డీఈగా మధుసూదన్మెట్పల్లి: విద్యుత్ శాఖ మెట్పల్లి డివిజన్ ఇంజినీర్గా మధుసూదన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీఈలు మనోహర్, రఘుపతిలతో పాటు డివిజన్ పరిధిలోని ఏఈలు, యూనియన్ నాయకులు రాజవీరు, లక్ష్మణ్, హరిప్రసాద్లు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని వినియోగదారులు, రైతులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు. 91శాతం రేషన్ పంపిణీజగిత్యాలక్రైం: జిల్లాలో రేషన్కార్డు లబ్ధిదారులకు ఇప్పటి వరకు 91 శాతం మందికి సన్నబియ్యం పంపిణీ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3,18,731 రేషన్కార్డులు ఉండగా, ఈనెల 27 వరకు 2,90,517 మందికి రేషన్ దుకాణాల ద్వారా 91శాతం సన్న బియ్యం పంపిణీ చేశామన్నారు. ఈనెల 30 వరకు 100 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఇంకా రేషన్ బియ్యం తీసుకోని కార్డుదారులు ఆందోళన చెందకుండా రేషన్ దుకాణాలకు వెళ్లి బియ్యం తీసుకోవాలని కోరారు. ఎవరైనా లబ్ధిదారులు సన్నబియ్యం అక్రమంగా అమ్మినా, కొనుగోలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘ఈ–పాస్’తోనే ఎరువులు విక్రయించాలిపెగడపల్లి: ఫర్టిలైజర్ దుకాణదారులంతా ఈపాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలోని కిసాన్ ఫర్టిలైజర్స్, సంచర్ల, పెగడపల్లి సహకార సంఘాలను శుక్రవారం సందర్శించి ఎరువుల నిల్వలు, వాటి నాణ్యత, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. డీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని సూచించారు. ప్రతీ దుకాణం వద్ద స్టాక్ వివరాలు తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలం పంటలకు ఎరువుల కొరత లేదని, అవసరం మేరకు సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఆయన వెంట ఏవో శ్రీకాంత్, సింగిల్విండోల సీఈవోలు గోపాల్రెడ్డి, మధూకర్ ఉన్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
కోరుట్ల: విద్యార్థులకు మోనూ ప్రకారం భోజనం అందించాలని, నిర్లక్ష్యం తగదని అదనపు కలెక్టర్ బి.లత అన్నారు. పట్టణంలోని మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ను శుక్రవారం సందర్శించి వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భోజన సామగ్రిని పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య ఉన్నారు. భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు రాయికల్: విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం అల్లీపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు సరఫరా అయ్యే కూరగాయలు, బియ్యం, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఏ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని అన్నారు. అంతేకాకుండా కేజీబీవీలో ఎంపీడీవో చిరంజీవి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యమైన భోజనం అందించాలి జగిత్యాల: విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలలతో పాటు, జగిత్యాలలోని బీసీ కళాశాలలోని హాస్టల్ను సందర్శించి సరుకులను పరిశీలించారు. పరిశుభ్రత ఉండాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడే ఆహారం వండి పెట్టాలని, గడువు ముగిసిన సరుకులను వాడకూడదని ఆదేశించారు. అనంతరం కళాశాలలోని స్టోర్ రూం, సరుకులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో ఆర్థికాభివృద్ధి
రాయికల్: ఆయిల్పామ్ సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని డీహెచ్ఎస్వో శ్యామ్ప్రసాద్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం వీరాపూర్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్న నీలి మహేందర్ క్షేత్రాన్ని సందర్శించారు. ఆయిల్పామ్ మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి దిగుమతి ప్రారంభమై 30ఏళ్ల వరకు ఆదాయం ఇస్తుందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి స్వాతి, రైతులు పాల్గొన్నారు. పశువైద్య కేంద్రం తనిఖీ జగిత్యాల: జగిత్యాల మండలం పొలాసలోని పశు ఉప వైద్య కేంద్రాన్ని పశుసంవర్దక శాఖ ఏడీ బోనగిరి నరేశ్ శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు, బిల్డింగ్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట వెటర్నరి లైవ్స్టాక్ ఆఫీసర్ కందుకూరి పూర్ణచందర్ ఉన్నారు. హాస్టల్ సందర్శన పొలాస గ్రామంలోని బీసీ హాస్టల్ను ప్రత్యేకాధికారి నరేశ్ సందర్శించారు. హాస్టల్లో ఎంత మంది ఉంటున్నారు, పిల్లల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూత
జగిత్యాలరూరల్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని జిల్లా సెర్ఫ్ ఏపీడీ సునీత అన్నారు. శుక్రవారం స్వశక్తి సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న టీ, టిఫిన్, బిర్యానీ సెంటర్, చల్గల్లో పీఎంఎఫ్ఎంజీ ద్వారా ఏర్పాటు చేసిన పిండిగిర్ని, చల్గల్లో వీవోఏల ద్వారా ఉల్లాస్ టాస్ ఆన్లైన్ సర్వేను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇందిర మహిళ శక్తి పథకం ద్వారా సీ్త్రనిధి రుణాలు, బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతీ మహిళా సభ్యురాలు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాన్ఫామ్ డీపీఎం వెంకటేశ్, ఏపీఎం గంగాధర్, సీసీ గంగారాం, వీవోఏలు లౌక్య, విజయ, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
వర్షాలు బాగా కురువాలని..
ఇబ్రహీంపట్నం: వర్షాలు బాగా కురువాలని, పంటలు మంచిగా పండాలని కోరుతూ మండలంలోని అమ్మక్కపేట, కోమటికొండాపూర్, వేములకుర్తి గ్రామాల్లో శుక్రవారం కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూజలు చేశారు. కోమటికొండాపూర్లో గ్రామశివారులోని 2కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది వద్దకు వెళ్ల్లి గోదావరి జలాలను పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామదేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేములకుర్తిలో పోతరాజుల విన్యాసాలతో వలకట్టు డప్పు చప్పుళ్లతో తాతమ్మకు, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఆయా గ్రామాల కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
లాభాలు వస్తాయని నమ్మించి.. రూ.7లక్షలకు టోకరా
సిరిసిల్లక్రైం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపి ఏకంగా రూ.7లక్షలు దండుకున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్లను జిల్లా పోలీసులు గురువారం కటకటాలకు పంపారు. ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపిన వివరాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగర్ జిల్లా పిల్లోనా మండలం సీపూర్కు చెందిన కపిల్శర్మ, అదే ప్రాంతంలోని ఇస్మాయిల్పూర్కు చెందిన పంకజీ కౌశిక్ ఇద్దరు కలిసి సైబర్నేరాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ఓ వెబ్ అప్లికేషన్ లింక్ను రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుగులోతు రమేశ్కు 2024, డిసెంబర్ 8న పంపారు. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టబడి పెడితే అధి క లాభాలు వస్తాయని నమ్మించి రూ.2500 పెట్టుబడిగా పెట్టించారు. మరుసటి రోజు అదనంగా డబ్బులు వచ్చాయి. దీన్ని నమ్మిన రమేశ్ విడతల వారీగా రూ.7లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేశాడు. రెండు రోజుల తర్వాత ఆ డబ్బులు విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. తర్వాత ఆ వెబ్సైట్ కనిపించలేదు. దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన రమేశ్ చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఎస్సై జునైద్, హెడ్ కానిస్టేబుల్ గంగారం, సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ మహేశ్ నిందితుల కోసం గాలించారు. ఈక్రమంలో రాజస్థాన్లోని జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. వెబ్లింక్తో మోసానికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర సైబర్ ముఠా రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్ బీ గీతే -
నృసింహుడి హుండీ ఆదాయం రూ.71.53 లక్షలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.71,53,190 సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. మార్చి 21 నుంచి ఈనెల 26 వరకు (98 రోజులు) వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా నగదుతోపాటు 68 గ్రాములు మిశ్రమ బంగారం, 7.400 కిలోల మిశ్రమ వెండి, 32 విదేశీనోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుప్రజ, ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, స్వచ్ఛంద సేవకులు, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, అర్చకులు తదితరులున్నారు. ఆల్ ఇండియా సెమ్స్ ఒలింపియాడ్లో ప్రతిభసప్తగిరికాలనీ(కరీంనగర్): సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ నేషనల్ సెమ్స్ మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతిభకనబర్చి ఆల్ ఇండియా, స్టేట్ లెవల్ ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. ఎన్.రక్షిత ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, కె.మహిత ఆల్ ఇండియా 4, స్టేట్ లెవల్లో పి.మహిధర్, ఆత్రేయులు 2, మహిత 3, మహి చౌదరి 7 పరీక్షిత్ సారధి, అభిగ్నలు 10వ ర్యాంకులతో పాటు పలువురు విద్యార్థులు జోనల్ ర్యాంకులు సాధించారని తెలిపారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతా రెడ్డి, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, కో ఆర్డినేటర్లు, ఇన్చార్జి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలి
వాతావరణానికి సంబంధించిన ముందస్తు సమాచారం ఉపయోగపడుతోంది. వర్షం వస్తుందనే సమాచారం ఉంటే ఎరువులు వేయడం మానేస్తాం. ధాన్యం ఆరబెడితే వెంటనే కవర్లు కప్పుకుంటున్నాం. పంటలకు సాగు నీటిని ఇవ్వడం బంద్ చేస్తాం. సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇస్తే బాగుంటుంది. – కాటిపెల్లి గంగారెడ్డి, రాయికల్ వారంలో రెండు రోజులు ప్రతి మంగళ, శుక్రవారాల్లో వాతావరణానికి సంబంధించి ప్రత్యేక బులెటిన్ను మీడియాకు విడుదల చేస్తున్నాం. ప్రతిరోజు వాతావరణ కేంద్రంలోని పరిస్థితులను రెండు సార్లు సేకరించి వాతావరణ కేంద్రం వెబ్సైట్లో పొందుపర్చుతాం. ముందస్తు సూచనలు ఇవ్వడం వల్ల రైతులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. – శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస ఆధునాతన టెక్నాలజీతో పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఆధునాతన టెక్నాలజీతో ముందస్తు వాతావరణ సమాచారాన్ని రైతులకు అందిస్తున్నాం. కచ్చితమైన డాటాను రికార్డు చేయడంతో వాతావరణానికి సంబంధించి మెరుగైన సమాచారం వస్తుంది. ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసి, వారికి తగిన సలహాలు ఇస్తున్నాం. – శ్రీలత, పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస -
కొడుకును చూసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి
వేములవాడఅర్బన్: రాజన్న ఆలయ అనుబంధ సంస్కృత పాఠశాలలో చదువుతున్న కుమారుడు సుశాంత్ను చూసేందుకు వచ్చిన తల్లి చందన(32) గుండెపోటుతో మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన చందన–నరేశ్ దంపతుల కుమారుడు సుశాంత్ను వారం క్రితం రాజన్న ఆలయ అనుబంధ సంస్కృత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు. సుశాంత్ను చూడటానికి గురువారం తల్లిదండ్రులు వచ్చారు. అనంతరం చందన పై అంతస్తులో ఉన్న వాష్రూమ్కు వెళ్లి అక్కడే కుప్ప కూలిపోయింది. గమనించిన సిబ్బంది సమాచారంతో వెంటనే చేరుకున్న ఉపాధ్యాయుడు ఆమెకు సీపీఆర్ చేశారు. అక్కడికొచ్చిన ఆర్బీఎస్కే వైద్యుల సైతం ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అనంతరం 108 వాహనంలో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. వేములవాడ సంస్కృత పాఠశాలలో ఘటన -
టీబీ బాధితులు జాగ్రత్తలు పాటించాలి
ధర్మపురి: టీబీ లక్షణాలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం టీబీ బాధితులకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇంపాక్ట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని శ్రీనివాస్ సందర్శించారు. టీబీ లక్షణాలున్నవారు ప్రతినెలా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. వారు తీసుకోవాల్సిన ఆహార అలవాట్లపై వివరించారు. ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. మండల వైద్యాధికారులు శివకుమార్, అస్మాతరుణుం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్, హెచ్ఈవో సతీష్కుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు తదితరులున్నారు. -
గిరిజనుల వికాసానికే పథకాలు
రాయికల్: గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రాజ్కుమార్ తెలిపారు. మండలంలోని దావన్పల్లి గురువారం పీఎంధర్తీఆబాజాన్ జాతీయ ఉత్కర్ష్ అభియాన్పై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లాలో దావన్పల్లి, బోర్నపల్లి గ్రామాలు ఎంపికయ్యాయని, ఒకేరోజు 20 శాఖల అధికారులు వచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని దరఖాస్తులు స్వీకరిస్తారని, అర్హులందరికీ న్యాయం చేస్తామని వెల్లడించారు. -
అడవికి ఆపద
సిరిసిల్ల: జిల్లాలో అటవీ భూములు కబ్జాకు గురవుతున్నా.. ఆఫీస్ల్లోనే అటవీశాఖ అధికారులు రెస్ట్ తీసుకుంటున్నారు. రికార్డుల్లోనే అడవిని రక్షిస్తున్నారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్–2023 ప్రకారం 251 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 2020లో 22.50 శాతం ఉన్న పచ్చదనం ఏకంగా 20.45 శాతానికి పడిపోయినట్లు అటవీశాఖ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వం పోడుభూములకు పట్టాలు ఇస్తుందనే నమ్మకంతో అటవీ శివారు పల్లెల్లో పోడు పేరిట ఫారెస్ట్ను పాడుచేసే పనులు చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో పనిచేసే అటవీశాఖ అధికారులు, సిబ్బంది అండగా నిలుస్తున్నారు. ఎకరానికి రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు దండుకుంటూ అక్రమార్కులకు అధికారులే అండగా నిలుస్తున్నారు. అటవీ భూములను ఆక్రమించడం, సాగుచేయడం నేరమని తెలిసినా కొందరు గొడ్డళ్లు, ట్రాక్టర్లతో అడవికి ఎసరుపెడుతూనే ఉన్నారు. కొత్తపేట, మల్యాల, సనుగుల, రామారావుపల్లి, గోవిందరావుపల్లి, వట్టిమల్ల, గర్జనపల్లి, రంగంపేట శివా రుల్లో సుమారు 251 ఎకరాల్లోని జంగల్ను నరికేశారు. మార్కెట్లో ఆ భూముల విలువ రూ.37.65 కోట్ల మేరకు ఉంటుంది. కళ్లు తెరవకుంటే.. జిల్లా అధికారులు కళ్లు తెరవకుంటే పచ్చని అడవి ఆక్రమణల పాలై పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు వెచ్చించి హరితహారం చేపడుతున్నా నాటే మొక్కల కంటే నరికేస్తున్న చెట్ల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్న వారు ఇప్పటికే ఎకరాల కొద్ది భూములను ఆక్రమించి.. పోడు పేరిట అడవులకు కీడు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను గుర్తించి చర్యలు తీసుకుంటే భవిష్యత్లో అటవీ భూములకు రక్షణ కల్పించినట్లు అవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో పోడుపట్టాలు అటవీ భూముల ఆక్రమణలు ఎలా ఉన్నా.. కొత్తగా అడవికి ఆపద రాకుండా రక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది. స్పందించని అటవీశాఖ అధికారులు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలపై జిల్లా ఇన్చార్జి డీఎఫ్వోను ఫోన్లో ‘సాక్షి’ సంప్రదించగా స్పందించలేదు. కొత్తగా సాగులోకి వచ్చిన అటవీభూముల వివరాలపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆమె ఫోన్ ఎత్తలేదు. ఏది ఏమైనా జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలు నిరాటంకంగా సాగుతున్నాయి.అటవీ స్వరూపం..(అటవీ శాఖ గణాంకాలు) గ్రామాలు: 260అటవీ సమీప గ్రామాలు: 64అటవీ విస్తీర్ణం : 390.85 చదరపు కిలోమీటర్లు మధ్యస్థ దట్టమైన అటవీ ప్రాంతం : 113.26 చదరపు కిలోమీటర్లు బహిరంగ అటవీ ప్రాంతం : 185.07 చదరపు కిలోమీటర్లు పోడు అటవీ ప్రాంతం : 15.32 చదరపు కిలోమీటర్లు అడవి కాని అటవీ ప్రాంతం : 76.06 చదరపు కిలోమీటర్లు అడవుల్లో నీటి వనరులు : 1.14 చదరపు కిలోమీటర్లు పచ్చదనం శాతం : 20.45ఉండాల్సిన పచ్చదనం: 33 శాతం ఇది రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం కొత్తపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు 2015లో నిర్మించిన చెక్డ్యాం. ఈ చెక్డ్యామ్లో నీరు నిల్వ ఉండి.. వన్యప్రాణులకు దాహార్తి తీర్చుతుంది. ఈ చెక్డ్యామ్ పక్కనే ఓ పది ఎకరాలు మైదానంగా అటవీభూమి ఉంది. చెక్డ్యామ్లో నీరు ఉంటే.. ఆ భూమి సాగులోకి రాదు. దీంతో స్థానికుడు ఒకరు చెక్డ్యామ్లో ఇసుక నిండిన భాగాన్ని తవ్వేశాడు. తన ట్రాక్టర్తోనే కోర (కయ్య) కొట్టాడు. గతేడాది కురిసిన వర్షాలకు చెక్డ్యామ్ తెగిపోయింది. నీరు నిల్వ లేకుండా పోయింది. ప్రజాధనం వరదపాలైంది. చెట్లు.. చెక్డ్యామ్లను కూల్చివేస్తూ.. అటవీ భూమికబ్జా ఫారెస్ట్ ప్లాంటేషన్నే దున్నేశారు ఆఫీస్లు దాటని ఫా‘రెస్ట్’ అధికారులు ఈ ఏడాది కొత్తగా 251 ఎకరాల్లో ఫారెస్ట్ ఆక్రమణలు పోడు భూములకు పట్టాల ఆశతో చెట్లను కొట్టేస్తున్నారు ఆ భూమి విలువ రూ.37.65 కోట్లపై మాటే ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడిఇది కొత్తపేట శివారులోనే చెక్డ్యామ్ను కూల్చివేసిన ప్రదేశం. చెక్డ్యామ్ లేకుండా పోవడంతో పది ఎకరాల ఫారెస్ట్ భూమి సాగులోకి వచ్చింది. ట్రాక్టర్ ఉండడంతో ఇటీవల అటవీ భూమిని దున్నేసి పత్తివిత్తనాలు పెట్టాడు. అటవీ భూమిలోనే గుట్టుగా బోరు వేశాడు. నీరు బాగానే పడింది. దూరంగా ఉన్న విద్యుత్ స్తంభం నుంచి వైర్లు లాగి మోటారు పెట్టాడు. సదరు చెక్డ్యామ్ కూల్చిన కొత్తపేట వ్యక్తి పది ఎకరాల ఆసామి అయ్యాడు. ఆ భూమి విలువ ఇప్పుడు మార్కెట్లో రూ.కోటిన్నర. ఇది వీర్నపల్లి మండలం గర్జనపల్లి గిరిజనతండా శివారులో ఇటీవల ఇలా చెట్లను తొలగిస్తున్నారు. ఆ తొలగించిన చెట్ల కొమ్మలు అక్కడే ఎండిపోయిన తరువాత వంట చెరుకుగా వాడుతున్నారు. మరో ఏడాది ఆ భూమిని దున్నుకుని పంటను సాగు చేసుకునేందుకు వీలుగా వా డుకుంటున్నారు. సహజసిద్ధంగా అడవి లో ఎదుగుతున్న చెట్లను ఇలా కొట్టేశారు. వీరంతా వీర్నపల్లి మండలం రంగంపేట వాసులు. హరితహారంలో భాగంగా అటవీశాఖ అధికారులు మొక్కులు నాటేందుకు బుధవారం వెళ్లగా ఆ భూములు తమవి అంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. గిరిజనులకు పోడుపట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు చెందిన తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏళ్లుగా ఆ భూముల్లో పంటలు పండిస్తున్నామని, ఇప్పుడు మొక్కలు నాటితే తమకు బతుకుదెరువు లేదని వాదించారు. ప్రస్తుతం 132 ఎకరాల్లో అటవీశాఖ మొక్కలు నాటకుండా రైతులు పంట వేయకుండా అలాగే ఉంది.. ఇవి ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన వాస్తవాలు. -
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం గొల్లపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.2 లక్షలతో నిర్మించే డ్రైనేజీ, ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో గాయత్రి, ఏఈ రాజమల్లయ్య, మాజీ సర్పంచ్ ప్రకాశ్, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, నాయకులు సదాశివరావు, బాలముకుందం, శంకర్ పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలి జగిత్యాల: అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో అమృత్ 2.0 పథకం కింద రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న రూ.15 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ట్యాంక్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే ‘మత్తు’ నిర్మూలన
జగిత్యాలటౌన్: ప్రజల భాగస్వామ్యంతోనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎస్పీ అశోక్కుమార్తో కలిసి జిల్లాకేంద్రంలోని మున్సిపల్ పార్క్ నుంచి మినీస్టేడియం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు బానిసలై భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దన్నారు. చెడు అలవాట్లను దూరం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్తు నివారణకు యువత ముందుకు రావాలన్నారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ యువత డ్రగ్స్కు బానిస కావద్దన్నారు. మత్తుతో కలిగే పరిణామాలపై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో పోలీస్ కళాబృందాలతో ప్రచారం చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, బీసీ సంక్షేమాధికారి నరేశ్, డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ స్పందన తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ హాజరైన ఎస్పీ అశోక్కుమార్ -
మత్తుతో భవిష్యత్ అంధకారం
మెట్పల్లి: మత్తు పదార్థాలకు అలవాటు పడితే యువత భవిష్యత్ అంధకారం అవుతుందని మెట్పల్లి మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మనోహార్ గార్డెన్లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువుపై దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. డీఎస్పీ రాములు మాట్లాడుతూ మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, వినియోగించినా.. విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ వినోద్కుమార్, ఎస్సై కిరణ్కుమార్, ఎంఈఓ చంద్రశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్రెడ్డి తదితరులున్నారు. సమైక్య సంఘాలతో మహిళల ఆర్థికాభివృద్ధిమల్లాపూర్: సమైక్య సంఘాలతో మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందుతారని సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ భారతి అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికై న గ్రామసంఘాల పదాధికారులు, అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులకు శిక్షణ ఇచ్చారు. మహిళా సంఘాల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తేవాలన్నారు. శిక్షణలో ఏపీఎం రమ, సమాఖ్య అధ్యక్షురాలు సత్తెమ్మ, ఐకేపీ ఏపీఎం దేవరాజ్, సీసీలు, తదితరులు పాల్గొన్నారు. ఆషాఢమాసంలో విశ్వ బ్రాహ్మణుల తొలి బోనాలు గొల్లపల్లి: ఆషాఢమాసం పురస్కరించుకుని మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణులు పోచమ్మ (పోలేరమ్మ) అమ్మవారికి గురువారం తొలిబోనాలు సమర్పించారు. విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీకోటీ భూమయ్య, దేవరకొండ శ్యామ్సుందర్, మారియో, ఎదులాపురం భాస్కరాచార్య, గణేశ్, కరుణాకర్కుమార్, నిరంజన్, రాజన్న, చారి, మహిళలు పాల్గొన్నారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శిగా చంద్రశేఖర్మల్యాల: టీఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శిగా మండలంలోని ముత్యంపేటలోగల కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పర్యవేక్షకులు ఉపాధ్యాయుల చంద్రశేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబ్ చంద్రశేఖర్ను పూలమాలతో సన్మానించారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, సంగెం లక్ష్మణ్రావు, నాగేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, నాయకులు రాగి శ్రీనివాస్, నరసింహస్వామి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. వాహనాలు నడుపుతున్న 35మంది మైనర్ల పట్టివేతమెట్పల్లి: పట్టణంలో ఎస్సై కిరణ్కుమార్ తన సిబ్బందితో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా 35మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారి వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే వారి తల్లిదండ్రుల పై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. మొదటిసారి పట్టుబడిన మైనర్లతోపాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని, రెండోసారి పట్టుబడితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పిల్లలు ‘బడిబాట’
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు చేసిన ప్రచారం ఫలించింది. 2024–25 విద్యా సంవత్సరం కన్నా ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యార్థుల ఎన్రోల్మెంట్లో పురోగతి కనిపించింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పెరుగుదల నమోదవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. జగిత్యాల 39శాతం పెరుగుదలతో తొలిస్థానంలో నిలవగా కరీంనగర్ 32శాతంతో రెండోస్థానం దక్కించుకుంది. ఇక పెద్దపల్లి 19శాతంతో మూడోస్థానంలో నిలవగా సిరిసిల్ల 10శాతంతో నాలుగోస్థానం దక్కించుకుంది. ఈ పురోగతిలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు, ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది తమ పరిధిలో విద్యార్థులను ప్రభుత్వపాఠశాలలో చేర్చాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం కలిసొచ్చింది. చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సొంతఖర్చులు వెచ్చించి మరీ ప్లెక్సీలు, పోస్టర్లు, రీల్స్, వీడియోలు, సోషల్ మీడియా ద్వారా విరివిగా ప్రచారం చేశారు. ఆ ప్రయత్నాల ఫలితాలే ఈ ఏడాది విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగేలా చేశాయి. అగ్రభాగాన జగిత్యాల.. ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జగిత్యాల అగ్రభాగన నిలవడం వెనక పలు కారణాలు ఉన్నాయి. భౌగోళిక విస్తీర్ణంలో జగిత్యాల పెద్దది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం, గ్రామీణ జనాభా అధికంగా ఉండటం వంటి అంశాలు కలిసి వచ్చాయి. కలెక్టర్, డీఈవో, ఎంఈవోలు క్రమశిక్షణతో పనిచేయడం ఎన్రోల్మెంట్ పెరుగుదలకు దోహదం చేసింది. ఇక మిగిలిన జిల్లాలు విస్తీర్ణం, జనాభా పరంగా చిన్నవి కావడంతో ఎన్రోల్మెంట్లోనూ జగిత్యాల తరువాత స్థానంలో నిలిచాయి. కరీంనగర్తోపాటు సిరిసిల్లకు ఇన్చార్జిగా ఉండే డీఈవోను ఇటీవల వివాదాస్పద ప్రవర్తనతో ఉన్నతాధికారులు తప్పించారు. అనంతరం కామారెడ్డి డీఈవోకు సిరిసిల్ల అదనపు బాధ్యతలు ఇచ్చినా.. ఆయన విధుల్లో చేరలేదు. దీంతో జెడ్పీ సీఈవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. టీచర్ల విషయంలో పర్యవేక్షణ కొరవడి ఎన్రోల్మెంట్లో కాస్త వెనకబడింది. సిరిసిల్ల చిన్న జిల్లా కావడం, విస్తీర్ణపరంగా, జనాభాపరంగా చిన్నది కావడం కూడా కారణాలే.ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల వివరాలు జిల్లా గతేడాది ఈ ఏడాది పెరుగుదల (శాతం) జగిత్యాల 3,690 5,147 39కరీంనగర్ 4,831 6,393 32పెద్దపల్లి 3,612 4,295 19సిరిసిల్ల 6,280 6,901 10 ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ఎన్రోల్మెంట్ అత్యధిక విద్యార్థుల నమోదుతో జగిత్యాల టాప్ తక్కువ నమోదుతో సిరిసిల్ల లాస్ట్ గతేడాది కన్నా పెరిగిన విద్యార్థుల నమోదుతల్లిదండ్రులను ఒప్పించాంబాలల బలోపేతం కోసం బడిబాటలో ప్రతీ ఇంటి తలుపుతట్టి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశాం. నాణ్యమైన భోజనం, ప్రత్యేక తరగతుల గురించి వివరించాం. ఖర్చుల భారం తగ్గడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంప్రారంభించారు. – కె.రాము, డీఈవో, జగిత్యాల -
తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లి.. శవమైన తనయుడు
చందుర్తి(వేములవాడ): అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి వైద్యం చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లిన తనయుడు శవమై ఇంటికి రావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన సంఘని లక్ష్మీరాజం ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. పదిహేను రోజుల క్రితం లక్ష్మీరాజం కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో కొడుకు తిరుపతి కరీంనగర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కాలుకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఇన్ఫెక్షన్ కాలు పై భాగానికి పోయిందని తెలపడంతో కొడుకు తిరుపతి మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం ఉదయం బాత్రూమ్కు వెళ్లిన తిరుపతి అక్కడే పడిపోవడంతో తలకు తీవ్రంగా గాయమైంది. తలలోని నరాలు చిట్లిపోయాయని, వెంటనే ఆపరేషన్ చేశారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్పై ఉన్న తిరుపతి గురువారం మృతిచెందాడు. తిరుపతికి భార్య రజిత, ఆరేళ్ల కుమారుడు గణేశ్ ఉన్నారు. మమ్మల్ని చూసుకునే దిక్కెవరూ కొడుకా.. పోషించే కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. అయ్యను దవాఖానాకు తీసుకుపోయి నువ్వే ప్రాణాలు పోగొట్టుకుంటివా బిడ్డా.. అంటూ ఆ తల్లి లింగవ్వ రోదనలు స్థానికులను కలచివేశాయి. తండ్రి ఆరేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న కంటికి రెప్పలా చూసుకుంటివి బిడ్డా.. మాకిప్పుడు ఎవరూ దిక్కంటూ గుండెలవిసేలా రోదించింది. మల్యాలలో మిన్నంటిన రోదనలు -
‘హద్దులు’ తేలేదెప్పుడో..!
● ప్రాజెక్ట్ పనుల్లో సర్వేయర్లు ● శిక్షణలో మరికొంత మంది ● భూ సమస్యలతో అన్నదాతలుజగిత్యాల: భూమి హద్దులు తేలక.. సమస్యలు పరిష్కారంకాక రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా భూమి గెట్లకు సంబంధించిన గొడవలు జరుగుతుంటాయి. క్రయవిక్రయాలు జరిగినా భూముల కొలతల కోసం తహసీల్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకుంటారు. సర్వేయర్లు వచ్చి నక్ష ద్వారా భూ కొలతలు చేసి పంచనామా చేసి రైతులకు అందిస్తారు. కానీ.. జిల్లాలో మూడు నెలలుగా సర్వేయర్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. సర్వేకు దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా పరిష్కారం కాకపోవడంతో దీంతో రైతులకు మధ్య తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. వేధిస్తున్న సర్వేయర్ల కొరత జిల్లాలోని 20 మండలాల్లో 14 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. దీనికితోడు ఇటీవల మూడు ప్రాజెక్ట్లు ప్రారంభమయ్యాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద బీర్పూర్ మండలం కోమనపల్లిలో మ్యాప్ పటాలు తయారు చేస్తుండగా.. భూ భారతి చట్టంలో స్కెచ్లు, మ్యాప్లు వేసేందుకు పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే మున్సిపాలిటీల్లో నక్ష ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగానే అధికారులు పనులు చేస్తున్నారు. ఒక్కో ప్రాజెక్ట్కు నలుగురు సర్వేయర్లను ఎంపిక చేశారు. ఉన్న 14 మందిలో 12 మంది ప్రాజెక్ట్లలో ఉంటుండగా.. మరో ఇద్దరు లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణలో పాల్గొంటున్నారు. ఉన్న డిప్యూటీ ఇన్స్పెక్టర్లను కూడా ఈ ప్రాజెక్ట్లకు ఇన్చార్జిలుగా నియమించారు. దీంతో రైతుల సమస్యలు ఇప్పట్లో తీరేలా లేవు. ప్రస్తుతం ఉన్న 14 మంది వివిధ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నం కావడంతో రైతులకు సంబంధించిన కొలతలు చేపట్టకపోవడం ఇబ్బందిగా మారింది. రానున్న లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికై న వారికి జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో శిక్షణ ఇస్తోంది. లైసెన్స్డ్ సర్వేయర్ల నియమకాలతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. పెండింగ్లోనే దరఖాస్తులు భూ సర్వే కోసం జిల్లాలో 420కి పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. భూ కొలతల కోసం రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. హద్దులు తేలక.. పంచాయితీలు పెరుగుతున్నాయి. అధికారులు స్పందించి కొలతలు చూపించి సమస్యలు తీర్చాలని రైతులు కోరుతున్నారు. ఎండకాలంలోనే మేలు వాస్తవానికి రైతులకు ఎండకాలంలో పనులు తక్కువగా ఉంటాయి. భూముల్లో కూడా ఎలాంటి పంటలూ వేయరు. భూములు బీడుగా ఉండటంతో కొలతలు సులువుగా చేపట్టే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు ఎండకాలంలో సర్వే చేయించేందుకే మొగ్గు చూపుతుంటారు. వర్షకాలం, చలికాలంలో పంటలు వేయడం ద్వారా భూమి కొలతలకు ఎవరూ ముందుకురారు. హద్దులు నిర్ణయించడం కూడా కష్టతరంగా ఉంటుంది. ఎండకాలానికి ముందే దరఖాస్తు చేసుకున్న రైతులు ఇంకా ఎదురుచూసూనే ఉన్నారు. 250 మంది సర్వేయర్లకు శిక్షణ భూ రికార్డుల రూపొందించడంలో భాగంగా జిల్లాలో 250 మంది సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఎస్కేఎన్ఆర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న లైసెన్స్డ్ సర్వేయర్లను కలిసి పలు సూచనలు చేశారు. భూ తదాగాలు లేకుండా కచ్చితమైన భూపటం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఏడీ వెంకట్రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ అశోక్ పాల్గొన్నారు. ప్రాజెక్ట్ పనుల్లో సర్వేయర్లు కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వేయర్లు ప్రాజెక్ట్ పనుల్లో ఉన్నారు. భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్ట్ కింద భూ మ్యాప్లు, మున్సిపాలిటీల్లో నక్షలు రూపొందించే పనుల్లో సర్వేయర్లు ఉన్నారు. ఆ పనులు పూర్తి కాగానే రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – వెంకట్రెడ్డి, ఏడీ -
రైతులకు ‘ముందస్తు’ సూచనలు
● పొలాసలో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రం ● ఐదు రోజుల ముందే అన్నదాతకు సలహాలు ● మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్జగిత్యాలఅగ్రికల్చర్: భూమి దున్నేది మొదలు.. పంట పండించి మార్కెట్లో అమ్మేవరకు వాతావరణ పరిస్థితులు రైతులకు అగ్ని పరీక్షగా మారుతున్నా యి. ఓ ఏడాది రుతుపవనాలు ముందుగా వస్తే.. మరో ఏడాది ఆలస్యంగా వస్తాయి. అయితే పొడి వాతావరణం.. లేకుంటే బెట్ట పరిస్థితులు, వరదలు, తుపాన్లు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ క్రమంలో అన్నదాతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు వాతావరణ సూచనలు, సలహాలు అందించేందుకు జగిత్యాలలోని పొలాసలో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేశారు. భారత వాతావరణ శాస్త్ర విభాగం, వ్యవసాయ పరి శోధన సంస్థ, శాస్త్ర, సాంకేతిక విభాగం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వాతావరణ విభా గాన్ని ప్రారంభించారు. ఈ విభాగం ద్వారా వాతా వరణ పరిస్థితులను ఐదురోజుల ముందుగానే తె లు సుకునే వెసులుబాటు ఉంది. కచ్చితమైన సమాచారం కోసం ఆధునాతన టెక్నాలజీతో రూపొందించిన నాలుగైదు పరికరాలను బిగించారు. ● ప్రతిరోజూ ఉదయం 7.16గంటలకు.. మధ్యాహ్నం 2.16 గంటలకు వాతావరణ కేంద్రం పరిధిలోని సూర్యరశ్మి, గాలిలో తేమ, ఉష్ణోగ్రత, గాలి వేగం, ఏ దిశగా గాలి వీస్తున్నదనే విషయాలను సేకరించి వాతావరణ కేంద్రం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ● పూర్తిగా కంప్యూటరీకరించిన కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు మరికొంత డాటా ఆటోమెటిక్గా భారత వాతావరణ కేంద్రానికి వెళ్తుంది. ● సెలవు లేకుండా 365 రోజులూ ఈ వాతావరణ కేంద్రం పనిచేస్తుంది. ● వర్షం, గాలి వేగం, ఉష్ణోగ్రతల పరికరాలన్ని ఒకేదాంట్లో ఇమిడి ఉంటాయి. ● రానున్న ఐదురోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయాలు ఈ ఆటోమెటిక్ కేంద్రం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ● ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్ను మీడియా, వ్యవసాయ శాఖ అధికారులకు పంపిస్తారు. ● అప్పటి వాతావరణాన్ని బట్టి రైతులు పంటల సాగులో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలు కూడా వివరిస్తారు. ● ఐదు రోజుల్లో వర్షపాతం ఎలా ఉంటుంది.. గాలి వేగం ఎంత.. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి వంటి విషయాలు ఈ బులెటిన్లో ఉంటాయి. ● ముందస్తు వాతావరణ సమాచారం తెలియడం ద్వారా రైతులు అప్రమత్తమై పంట నష్టాన్ని, ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. -
నెరవేరిన దశాబ్దాల కల
● జగన్నాథ్పూర్ వంతెన నిర్మాణానికి రూ.17.5కోట్లుజగిత్యాలటౌన్: రాయికల్ మండలం జగన్నాథ్పూర్ – బోర్నపల్లి మధ్య గోదావరిపై నిర్మించే వంతెన నిర్మాణానికి రూ.17.5కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఆదివాసీలు మాజీమంత్రి జీవన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా పట్టణ పోలీస్స్టేషన్ నుంచి ఇందిరాభవన్ వరకు డోలు చప్పుళ్లతో చేరుకున్నారు. అక్కడ జీవన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి లక్ష్మణ్కుమార్ సహకారంతో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వంతెన పూర్తయితే మల్లాపూర్ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ నాయకులు, జగన్నాథ్పూర్, బోర్నపల్లి ఆదివాసీలు ఉన్నారు. -
రేషన్.. పరేషాన్
● మూడునెలల బియ్యం ఒకేసారి ● లబ్ధిదారులకు తప్పని తిప్పలు ● రేషన్ షాపుల వద్ద బారులు ● ఈనెల 30 వరకే గడువు ● 89 శాతం పంపిణీ పూర్తి రేషన్కార్డులు: 3,18,731బియ్యం కోటా(3నెలలకు): 17,500 టన్నులు రేషన్ తీసుకున్నది: 2,84,237 మంది పూర్తయింది: 89 శాతం పూర్తి చేయాల్సింది: 11 శాతం జగిత్యాల: రేషన్ లబ్ధిదారులకు మూడునెలల బియ్యాన్ని ఒకేనెలలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల నుంచి సరఫరా చేస్తున్నారు. ఈనెల 30లోపు అర్హులందరికీ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 89 శాతం మంది లబ్ధిదారులు మూడునెలలకు సంబంధించిన సరుకులు పొందారు. మిగతా లబ్ధిదారులు కొన్ని దుకాణాల్లో స్టాక్ నిల్వ లేకపోవడం, స్టాక్ రాలేదని మూసివేయడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని రేషన్షాపుల్లో పంపిణీలో జాప్యంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. మొదట బియ్యం పంపిణీ చేసిన సమయంలో ఒక్కో లబ్ధిదారులు ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి రావడం, సర్వర్లు మొరాయించడంతో అవస్థలు పడ్డారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడటంతోపాటు, షాపుల ముందు చెప్పులు, సంచులు, రేషన్కార్డులు లైన్లో పెట్టుకున్నారు. మొదటి 10 రోజులపాటు నానా ఇక్కట్లకు గురయ్యారు. అయినప్పటికీ 89శాతం పంపిణీ పూర్తి చేశారు. ఇంకా 11 శాతం మందికి పంపిణీ చేయాల్సి ఉంది. చివరి దశకు పంపిణీ రేషన్ షాపుల్లో బుధవారం వరకు 89 శాతం లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. జిల్లాలో 3,18,731 రేషన్కార్డులు ఉండగా 2,84,237 మందికి బియ్యం అందించారు. కొన్నిచోట్ల స్టాక్ లేకపోవడంతో లబ్ధిదారులు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల వేలిముద్రలు వేసే చోట సర్వర్ మొరాయించడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. స్టాక్ రాగానే పంపిణీ చేస్తున్నామని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం అందజేస్తున్నామని, ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 89 శాతం పంపిణీ పూర్తి జిల్లాలో రేషన్కార్డు లబ్ధిదారులకు ఇప్పటివరకు 89 శాతం రేషన్ పంపిణీ పూర్తయింది. కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నాం. స్టాక్ లేని చోట్ల మరోరోజు వెంటనే పంపిస్తున్నాం. ఈనెల 30 వరకు పూర్తిస్థాయిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – జితేందర్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
హామీలు నెరవేర్చకుంటే సార్వత్రిక సమ్మె
కోరుట్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల హామీలు నెరవేర్చకుంటే జూలై 9 నుంచి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు దిగనున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షురాలు సాయీశ్వరి తెలిపారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేశ్కు సమ్మె నోటీసు అందించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల సూచన మేరకు అంగన్వాడీ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఐసీడీఎస్ స్థాపించి 50 ఏళ్లు గడుస్తున్నా ఐసీడీఎస్ను శాశ్వతసంస్థగా అంగీకరించటం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపటం సరికాదన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి సమ్మెకు దిగుతున్నట్టు పేర్కొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.10 లక్షలు, రూ.10 వేల పింఛన్, గ్రాట్యూటీ, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
వైద్య కళాశాలలో వసతులు మెరుగుపర్చాలి
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి శివరాంప్రసాద్ బుధవారం సందర్శించారు. వైద్య కళాశాల వసతి గృహంలో ఇబ్బందులు ఉన్నట్లు వార్తలొస్తున్నాయని, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని సూచించారు. కళాశాలలో వసతులు మెరుగుపర్చాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ.. వసతుల కల్పనపై ఇప్పటికే వైద్య శాఖ మంత్రి దామోదర నర్సింహ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వివరించారు. అనంతరం ఎన్ఎంసీ సభ్యులు కలెక్టర్ సత్యప్రసాద్ కలిసి సమీక్షించారు. వారివెంట ప్రిన్సిపల్ ఖాద్రి ఉన్నారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి పనులు నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. పట్టణంలోని 27వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు బుధవారం భూమిపూజ చేశారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, డ్రైనేజీలు, సీసీరోడ్లు నిర్మించేలా చూస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కృష్ణహరి, అడువాల లక్ష్మణ్, శంకర్, సుధాకర్, నాగయ్య, మహేందర్ పాల్గొన్నారు. -
వర్షం పడితే భయమే..
మా కాలనీలో ఉన్న పెద్ద చెరువులోంచి ఏటా వర్షాలు కురిస్తే సమీప ప్రాంతంలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతోపాటు కేశవనగర్ అంతా జలమయం అవుతుంది. పెద్ద చెరువు వద్ద రక్షణ గోడ ఏర్పాటు చేస్తే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుంది. – ఎలిగేటి అనిల్కుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడుచర్యలు తీసుకుంటాం రాయికల్ బల్దియా పరిధిలోని పెద్ద చెరువు నుంచి వరదనీరు కాలనీలను ముంచెత్తి ఇళ్లలోకి చేరుతుందని తెల్సింది. వర్షాలు కురిసినప్పుడు ఇళ్లలోకి నీరు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటాం. పెద్ద చెరువు వద్ద ఎమ్మెల్యే సంజయ్కుమార్ సహకారంతో రక్షణ గోడను ఏర్పాటు చేస్తాం. – మనోహర్గౌడ్, మున్సిపల్ కమిషనర్