జనరలైనా.. తగ్గేదే లే..
● ఆసక్తికరంగా 63వ డివిజన్ పోరు
కరీంనగర్ కార్పొరేషన్: మహిళా రిజర్వేషన్కే ఆ నాయకురాళ్లు పరిమితం కాలేదు. జనరల్ అంటే పురుషులకు కేటాయించినట్లు కాదంటూ, తాము బరిలోకి దిగి ఆ మహిళలు పోరుకు సై అన్నారు. నగరంలోని 63వ డివిజన్ పోరు ఆసక్తికరంగా మారింది. డివిజన్ రిజర్వేషన్ బీసీ జనరల్ అయినప్పటికి మూడు ప్రధాన పార్టీల నుంచి అతివలే బరిలోకి దిగారు. మాజీ కార్పొరేటర్ గందె మాధవి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ కర్రె పావని, బీజేపీ నుంచి దేశ శిల్ప పోటీపడుతున్నారు. డివిజన్ నుంచి మొత్తం నలుగురు పోటీలో ఉండగా.. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీసీ ఉద్యమ నేత కేశిపెద్ది శ్రీధర్రాజు బరిలో నిలిచారు.
జనరలైనా.. తగ్గేదే లే..
జనరలైనా.. తగ్గేదే లే..


