Jagitial District Latest News
-
రాష్ట్రంలో ప్రజావంచన పాలన
జగిత్యాలటౌన్: రాష్ట్రంలో ప్రజావంచన పాలన సాగుతోందని, ధాన్యం సేకరణపై రైతులు రోడ్డెక్కితేగానీ ప్రభుత్వంలో చలనం రాకపోవడమే ఇందుకు నిదర్శనమని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలను వంచిస్తుంటే చూస్తూ ఉండలేక, రైతు బంధు, రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వాన్ని సమర్థించలేక కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చానని అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోడంతోనే జిల్లాలో కొనుగోళ్లు జరగడం లేదన్నారు. జిల్లాలోని పలుచోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేసి వారం రోజులు గడుస్తున్నా తరలించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు రేవంత్రెడ్డిని నమ్మబోరని తెలిసే రైతాంగ సమస్యలపై రాహుల్గాంధీతో వరంగల్ డిక్లరేషన్లో హామీలు ఇప్పించారని, ఆ హామీలను రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయడం లేదని అన్నారు. రుణమాఫీ సగం ఎగ్గొట్టారని, ప్రభుత్వం 25శాతం ప్రీమియం చెల్లించకపోవడంతో రాష్ట్రంలో పంటల బీమా అమలుకు నోచుకోవడంలేదన్నారు. పూడూరు రైతు ధర్నాతో జిల్లా మంత్రి ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని, సమీక్షతోనే సరిపెట్టకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో 7లక్షల మెట్రిక్ టన్నులకు గాను ఇప్పటికే 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని జగిత్యాల జిల్లాలో మాత్రం ఇప్పటికీ 5శాతం మించి కొనుగోళ్లు కూడా జరగలేదన్నారు. ఉన్నమాటంటే కాంగ్రెస్ నాయకులు ఉలిక్కిపడుతన్నారని అన్నారు. తమపై ప్రతి విమర్శలు మానుకుని ఎఫ్సీఐ నిబంధనల మేరకు కొనుగోళ్లు జరపాలని, కొనుగోలు చేసిన 24గంటల్లో ధాన్యాన్ని తరలించాలని కోరారు. గోదాం సౌకర్యం లేని పక్షంలో ఎక్కడికక్కడ నెట్టింగ్ వేయాలో కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరారు. అంతకు ముందు జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. జీవన్రెడ్డి లేకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండేది కాదన్నారు. అలాంటి జీవన్రెడ్డిపై చోటామోటా నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో హరిచరణ్రావు, గాజుల రాజేందర్, దేవేందర్నాయక్, సాగర్రావు, కల్లెపెల్లి దుర్గయ్య, నేహాల్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ముందుచూపులేని సర్కారు జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి ముందుచూపు లేదని, కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం బట్టపల్లిపోతారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మంగళవారం పరిశీలించారు. నెలరోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా.. ధాన్యం తూకం వేయడం లేదన్నారు. తేమశాతం పడిపోయి ధాన్యం బరువు తగ్గే అవకాశం ఉందని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. హమాలీల కొరత లేకుండా చూసుకుని కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యవసాయాధికారితో ఫోన్లో మాట్లాడారు. నాయకులు సత్యంరావు, రాంచందర్రెడ్డి, మధు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. రైతాంగం రోడ్డెక్కితేగాని ప్రభుత్వానికి సోయి లేదు ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికా లేదు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి -
హనుమాన్ పెద్ద జయంతిని విజయవంతం చేద్దాం
మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బి. సత్య ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈనెల 10 నుంచి 12 వరకు కొండగట్టు శ్రీఆంజనేయస్వామి జయంతి ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం వివిధ శాఖల అధికారులు, పోలీసులతో సమీక్షించారు. భక్తులు పెద్ద ఎత్తు న తరలివచ్చే అవకాశం ఉందని, పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని సూచించారు. కోనేరు, ఆలయ పరి సరాల్లో పరిశుభ్రత, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, తాగునీటి వసతి కల్పించాలని పేర్కొన్నారు. మెట్లదా రిలో లైటింగ్, ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ సదుపాయం, ట్రాఫిక్ నియంత్రణకు ప్ర త్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం నిర్వహణకు అదనపు సిబ్బందిని కేటాయించాలన్నారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఎంపీడీఓ స్వాతి, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. ధాన్యాన్ని త్వరగా మిల్లులకు చేర్చాలిధాన్యం తూకం వేసి త్వరిగతిన మిల్లులకు తరలించా లని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేయాలని, రైతులు ఇబ్బంది రానీయొద్దని సూచించారు. -
మీ హయాంలో జరిగిన హత్యలకు మీదే బాధ్యతా?
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన న్యాయవాదుల జంట హత్యలు, దొంగతనాలు, ఇతర నేరాలకు కేసీఆర్, కేటీఆర్లే బాధ్యులో చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ డిమాండ్ చేశారు. దొంగతనం జరిగిన జువెల్లరీ షాప్ను మంగళవారం సందర్శించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలకు సీఎం రేవంత్రెడ్డికి ముడిపెట్టే నీచస్థితికి కేటీఆర్ దిగజారారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ ఎడిక్ట్ అయి, ఫామ్హౌజ్లో గడుపుతున్న విలాసవంతమైన కేటీఆర్ జీవితాన్ని ప్రజలకు తెలియచేసేందుకు డ్రోన్కెమెరాలతో చిత్రీకరిస్తే రేవంత్ను జైలుకు పంపించారన్నారు. అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి, ఇప్పుడు దొంగలతో సంబంధాలు అంటగడుతున్నారన్నారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన హత్యలు,దోపిడీ, దొంగతనాలకు అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కారణమా..? చెప్పాలన్నారు. జువెల్లరీ దొంగతనం జరిగితే హుటాహుటిన వచ్చిన కేటీఆర్, తమ ప్రభుత్వ హయాంలో నేరెళ్ల, కొండగట్టు బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నారు. దొంగలను పట్టుకొనేందుకు 15 ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని, నేరస్తులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొగోడైతే కాళేశ్వరం కేసులో కేసీఆర్కు సీబీఐ నోటీసులు ఇప్పించాలని లక్ష్మణ్కుమార్ సవాల్ విసిరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, పడిశెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, ఆకుల ఉదయ్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు. -
లాభదాయక పంటలు సాగు చేయాలి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు లాభదాయక పంటలు సాగు చేసి.. మంచి ఆదాయం పొందాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్యానపంటలపై సదస్సు నిర్వహించారు. రైతులు పండించడంతోపాటు మార్కెటింగ్ నైపుణ్యాన్ని అలవర్చుకోవాలన్నారు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్మీడియాను ఉపయోగించుకుని ఉత్పత్తులను అమ్ముకునే స్థాయికి ఎదగాలన్నారు. దొడ్డు రకం ధాన్యం తగ్గించి సన్నాలు సాగు చేయాలని సూచించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వాతి, ప్రత్యేక అధికారి రమేశ్ పాల్గొన్నారు. హిందువుల్లో ఐక్యత పెరగాలి రాయికల్: హిందువుల్లో ఐక్యత పెరిగితేనే ధర్మం చిరకాలం వర్ధిల్లుతుందని ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ్ సాయి మధుకర్ అన్నారు. మంగళవారం రాయికల్ మండలం ఇటిక్యాలలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలో సామూహిక భజన, గోపూజ, హనుమా న్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ గోమాతను పూజించాలని, గోవులో సర్వదేవతలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో స ర్పంచ్ నీరటి శ్రీనివాస్ హిందువులు పాల్గొన్నారు. -
ఏసీబీ సోదాల కలకలం
జగిత్యాల: కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఏసీబీ అధికారుల బృందం చేరుకుంది. డీఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు సిబ్బంది సోదాలు చేపడుతున్నారు. సోదాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. అవినీతి ఆరోపణలపైనేనా..! సంక్షేమ శాఖ కార్యాలయంలో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో అంగన్వాడీ టీచర్లు కొందరు ఆ శాఖ అధికారులపై ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. గతంలో పనిచేసిన అధికారులపైనా ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అధికారుల లావాదేవీలను పరిశీలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ శాఖ పరిధిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు నేరుగానే ఉన్నతాధికారులపైనే ఫిర్యాదు చేశారు. గతంలోనే అధికారులు విచారించారు. తాజాగా ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై డీఎస్పీని వివరణ కోరగా.. తనిఖీల్లో భాగంగానే సోదాలు చేశామన్నారు. నాడు మున్సిపాలిటీ.. నేడు సంక్షేమ శాఖ కార్యాలయం ఇటీవల ఏసీబీ అధికారులు సుమారు 15 మంది మున్సిపల్ కార్యాలయంలో సుమారు 10 గంటలకు పైగానే సోదాలు నిర్వహించారు. ప్రతి శాఖలోని రికార్డులను పరిశీలించి అందులో జరిగిన అవినీతి, అక్రమాలను వెల్లడించారు. రికార్డులను ఉన్నతస్థాయి అధికారులకు పంపించారు. తాజాగా జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల అందులో పనిచేస్తున్న ఓ అధికారిని కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ అవినీతి అక్రమాలు బయటపడితే మరింతమందిపై వేటు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
45.3 డిగ్రీల ఉష్ణోగ్రత
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంగళవారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాయికల్ మండలం అల్లీపూర్లో 45.3, బీర్పూర్ మండలం కొల్వాయి, ఇబ్రహీంపట్నం గోదూరులో 45, ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 44.7, రాయికల్లో 44.6, ధర్మపురి మండలం జైనలో 44.4, కోరుట్ల మండలం అయిలాపూర్, ధర్మపురి మండలం నేరెళ్లలో 44.3, ఎండపల్లి, మెట్పల్లిలో 44.2, మేడిపల్లిలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కథలాపూర్ అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్కథలాపూర్: కథలాపూర్ అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ ఎండీ.ముస్తాక్అలీని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో బీట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో సెక్షన్ ఆఫీసర్కే బీట్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా అటవీశాఖలో వివాదం చోటుచేసుకుంటోంది. ఈ విషయంలోనే ముస్తాక్అలీ అసంతృప్తితో అనుమతి లేకుండా 19 రోజులు సెలవుపై వెళ్లారు. దీనిని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు అలీని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో కుమ్మరి పూర్ణిమ బాధ్యతలు తీసుకున్నారు. ఈమె అటవీ శాఖ జిల్లా మొబైల్ పార్టీలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. క్షయ నివారణకు కృషిచేయాలిగొల్లపల్లి: క్షయ నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డిజిటల్ మొబైల్ ఎక్స్రే మిషన్తో క్షయ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. సుమారు 72 మందికి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రీకాంత్, పర్యవేక్షకులు నరేందర్, ఎస్టీస్ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్స్ వికాస్, రాజీవ్ పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్కోరుట్ల: కోరుట్ల మున్సిపల్ కమిషనర్గా ఎం.శ్రీనివాస్రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఉద్యోగులు కమిషనర్కు స్వాగతం పలికారు. అనంతరం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అధికారులను, సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిజగిత్యాలరూరల్: ఇండియా, ఖతర్ లేబర్ మైగ్రేషన్ కారిడార్లో ఇరుదేశాల్లో సంఘాల సమన్వయంతో కార్మికుల సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలంగాణ ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మంద భీంరెడ్డి తెలిపారు. మంగళవారం ఖతర్ నుంచి ‘సాక్షి’తో మాట్లాడారు. వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బీడబ్ల్యూఐ) ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గ్లోబల్ ఆర్గనైజింగ్ అకాడమీ, ఆసియా పసిఫిక్ అనే సంస్థ ఈనెల 4, 5 తేదీల్లో ఫిలిప్పీన్స్లోని మనీలాలో కార్మిక సంఘాల ప్రతినిధులకు రెండు రోజుల శిక్షణ ఇచ్చిందన్నారు. 10 దేశాల్లో 22 అనుబంధ సంస్థల నుంచి 42 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. ఖతార్లోని తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు పాల్గొని స్వ దేశం, విదేశంలో పనిచేసే రెండు వేర్వేరు సంఘాలు సమన్వయంతో పనిచేస్తే.. వలస కా ర్మికుల సమస్యలను వేగంగా, సులువుగా పరి ష్కరించవచ్చని సూచించినట్లు పేర్కొన్నారు. -
దొంగల బస!
ధర్మపురిలో సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ నెల ఒకటిన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మి లాడ్జిలో బసచేసి, కరీంనగర్లో చోరీ అనంతరం 3వ తేదీన లాడ్జి ఖాళీచేశారు. అంతకన్నా ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ బసచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలాఉంటే దొంగలు వినియోగించిన నల్లరంగు పల్సర్ (220 సీసీ), హెల్మెట్ను ధర్మపురి గోదావరి తీరంలోని ఇటుకబట్టీల సమీపంలో మంగళవారం ఉదయం కనుగొన్నారు. టీఎస్ 08 ఎఫ్జీ 6876 నంబరు ప్లేటుతో ఉన్న ఈ బండిని దుండగులు చోరీ కోసం వినియోగించిందేనని ధ్రువీకరించారు. కానీ.. ఈ బైకుది ఫేక్ నంబరు ప్లేటుగా పోలీసులు తేల్చారు. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి చెందిన కారుదిగా గుర్తించారు. బండి చాసీస్ నంబరు ఆధారంగా ప్రయత్నించినా.. దాన్ని కూడా ముందే ధ్వంసం చేయడంతో బైకులను సెకండ్ హ్యాండ్లో కొన్నారా? లేక ఎత్తుకొచ్చారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రా లేదు. చోరీ కోసం వినియోగించిన మరో బైకు అపాచీ(తెలుపు) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దానికి పెట్టిన నంబరు ప్లేట్ కూడా ఫేక్గానే భావిస్తున్నారు. -
ధాన్యం కొను‘గోల్’కు సర్వం సిద్ధం
బీజేపీ సంబరాలుజగిత్యాలటౌన్: సోమవారం వెలువడిన ఐదు రా ష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో బీజేపీ నాయకులు జగిత్యాల తహసీల్దార్ చౌరస్తాలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మోదీ సంక్షేమ పాలనకు స్వాగతం పలికిన బెంగాల్ ప్రజలు మమత పాలనకు చెరమగీతం పాడారని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మంత్రి లక్ష్మణ్కుమార్జగిత్యాలరూరల్: జిల్లాలో రబీ వరిధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో 439 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.60 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించనున్నారు. జిల్లావ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కావడంతో కొనుగోలు కేంద్రాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాత కొనుగోలు చేస్తారు. తూకం వేసేందుకు ప్రతి సెంటర్కు ఎలక్ట్రానిక్ కాంటా, తేమ శాతాన్ని పరిశీలించేందుకు మీటర్, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లను సిద్ధంగా ఉంచారు. తప్పతాళ్లు లేకుండా క్లీన్ చేసేలా ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేశారు. 76 మిల్లర్లకు ధాన్యం కేటాయింపు ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు 76 రైస్మిల్లులను కేటాయించారు. మిగతా కొన్నింటికి ధాన్యం సేకరణను దృష్టిలో ఉంచుకుని కేటాయింపు చేసే అవకాశాలున్నాయి. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయడంతోపాటు, మిల్లుల్లో కూడా వెంటనే ధాన్యాన్ని అన్లోడ్ చేసేలా మిల్లర్లకు హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తేమశాతం ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చేలా అవగాహన రైతులు పండించిన ధాన్యాన్ని పొలం నుంచి నేరుగా కొనుగోలు కేంద్రానికి కాకుండా ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. నేరుగా రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ధాన్యం ఆరబెట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయని రైతులకు తేమశాతం వచ్చిన ధాన్యాన్నే సెంటర్లోకి తీసుకురావాలని అవగాహన కల్పిస్తున్నారు. -
డంపింగ్ యార్డు తరలించండి
మాది నూకపెల్లి డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ. కాలనీకి అతి సమీపంలోని మున్సిపల్ డంపింగ్యార్డు ఉంది. యార్డుకు తరలిస్తున్న టన్నుల కొద్దీ చెత్తతో దుర్వాసన వస్తోంది. వ్యర్థాలకు నిప్పు పెడుడతుండటంతో ఎగిసి పడుతున్న మంటల కారణంగా విషపూరితమైన పొగ, దుమ్ము, దూలితో రోగాల బారిన పడుతున్నాం. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. డంపింగ్ యార్డు తరలించాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేయడంతో డంపింగ్ యార్డుకు గోడ నిర్మించే పనులు మొదలు పెట్టారు. గోడపెట్టినా దుర్వాసన, పొగతో ఇబ్బందులు తప్పవు. కాలనీవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోడ నిర్మాణం కాకుండా డంపింగ్ యార్డును శాశ్వతంగా తొలగించి, దూర ప్రాంతానికి తరలించండి. -
గంట ముందే స్పాట్కు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నగరంలోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎలాంటి బెరుకూ లేకుండా ఉదయాన్నే భారీ దోపిడీ చేసి, యథేచ్ఛగా పారిపోయిన వైనాన్ని సవాలుగా తీసుకున్నారు. దొంగల సంచారం, కదలికలు, వారి చిరునామా, నేరచరితపై కీలక సమాచారం సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను మహారాష్ట్ర, బిహార్కు పంపినట్లు సమాచారం. మరికొంతమంది పోలీసులు సీసీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. వారి ఫొటోల ఆధారంగా క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఏ) సాయంతో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు పుణే, మరొకరు నందూర్బర్ జిల్లాలతో పాటు బిహార్కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని ‘రివర్స్ మేనర్’(ఎలా వచ్చారు? అన్న విజువల్స్)లో విశ్లేషించినప్పుడు దొంగలంతా దోపిడీకి కేవలం గంట ముందే కరీంనగర్కు వచ్చినట్లు రికార్డు అయ్యింది. అంటే ముందు రోజు ఎక్కడా బస చేసిన దాఖలాలు లేవు. కొంతకాలంగా రెక్కీ నిర్వహించి, పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టే నింపాదిగా వచ్చారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర బ్యాగే పట్టిస్తోంది..? చోరీ సమయంలో నిందితుల్లో ఒకరి బ్యాగు కీలకంగా మారింది. ఆ బ్యాగుపై ‘ఐ లవ్ నందూర్బర్’ అని రాసి ఉంది. నందూర్బర్ ఉత్తర మహారాష్ట్రకు చెందిన జిల్లా. గుజరాత్ సరిహద్దులో ఉంటుంది. నిందితుల్లో మరొకరు పుణే జిల్లాలో నేరచరిత కలి గిన పఠాన్గా గుర్తించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు పారిపోవాలంటే పెద్దపల్లి, మంథని మీదుగా వెళ్లవచ్చు. కానీ.. ఆ మార్గంలో ట్రాఫిక్, చెక్పోస్టులు ఎక్కువ. అందుకనే చోరీ అనంతరం శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, రామడుగు, లక్ష్మీపూ ర్, రుద్రారం, గుండి, పెగడపల్లి, జగిత్యాల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీని పోలీసులు సంపాదించారు. ప్రధాన రహదారుల వెంట వెళ్తే సులువుగా పట్టుబడతామని, పోలీసుల కళ్లు గప్పేందుకు గ్రామీణ రహదారిని ఎంచుకున్నారు. వీరిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర, బిహార్కు బయల్దేరాయి. మరో నాలుగు బృందాలు (ఒక్కో బృందంలో నలుగురు చొప్పున సభ్యులు) కరీంనగర్ నుంచి జగిత్యాల మీదుగా మహారాష్ట్ర, బీహార్, ఇటువైపు హైదరాబాద్ వరకు వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని వడపోస్తున్నారు. నిందితులు వాడిన అపాచీ, పల్సర్ బైకు నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో గుర్తింపు కష్టంగామారింది. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లినట్టే వెళ్లి దారిమార్చి, వాహనాలనూ మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని విస్తృతంగా వాడుతున్నారు. నిందితుల ఫొటోల ఆధారంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ (నాట్గ్రిడ్) సాఫ్ట్వేర్ సాయంతో వారి నేరచరిత, ఎఫ్ఐఆర్, జైలు జీవితం, ఫోన్నంబర్లు తదితర వ్యక్తిగత వివరాలతో సహా కీలక అంశాలను ఇప్పటికే సేకరించారు. బందిపోట్లు, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల డేటాను నాట్గ్రిడ్లో పొందుపరుస్తారు. ఇది తిరిగి సీసీటీఎన్ఎస్తో అనుసంధానంగా ఉంటుంది. ఈ డేటాబేస్ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర జాతీయ దర్యాప్తు సంస్థలు వినియోగిస్తాయి. గతేడాది నుంచి ఈ డేటాబేస్ ఎస్పీ ర్యాంకు ఆఫీసర్లకు ఉగ్రవాద, ఇతర కీలక కేసుల్లో దర్యాప్తు కోసం యాక్సెస్ కల్పించారు. వచ్చిన వారు ఉగ్రవాదులు అయి ఉంటారన్న అంశాన్ని పోలీసులు కొట్టిపారేయకపోవడం గమనార్హం. నిందితులు వచ్చిన మార్గంలోని అన్ని సెల్టవర్ల పరిధిలో అనుమానిత సెల్ఫోన్ సంభాషణల కోసం డంప్ (సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ వివరాలు)ను సీడాట్ పద్ధతిలో జల్లెడ పడుతున్నారు. ఇందులోనూ కొన్ని అనుమానిత నంబర్లను పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ల సంచారం ఆధారంగానే పోలీసులు దొంగలను వెంటాడుతూ వెళ్లారని సమాచారం. చోరీ అనంతరం దొంగలు ఆ నంబర్లను మార్చడం గమనార్హం. -
ధాన్యం నిల్వకు గోదాంలు కేటాయించాలి
జగిత్యాల: జిల్లాలో రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు సిరిసిల్లలోని అపరల్ పార్క్లో ఉన్న గోదాంలు కేటాయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రిని సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరారు. జిల్లాలో గత ఖరీఫ్ సీజన్లో రైతుల వద్ద ప్రభుత్వం సేకరించిన ధాన్యం సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు రైస్మిల్లుల్లో నిలిచిపోయిందన్నారు. మళ్లీ సుమారు 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, గోదాంలు కేటాయించాలని కోరారు. -
45.7 డిగ్రీల ఉష్ణోగ్రత
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సోమవారం 45.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మల్లాపూర్ మండలం రాఘవపేటలో 45.7, ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 45.6, ఎండపల్లి మండలం గుల్లకోట, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్లో 45.5, ధర్మపురి మండలం నేరేళ్లలో 45.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాయికల్ మండలం అల్లీపూర్, బీర్పూర్ మండలం కొల్వాయిలో 44.9, ధర్మపురి మండలం జైనాలో 44.8, మెట్పల్లిలో 44.6, కోరుట్ల మండలం అయిలాపూర్లో 44.5, సారంగాపూర్లో 44.4, మల్లాపూర్లో 44.3, కొడిమ్యాల మండలం పూడూర్లో 44.2, గొల్లపల్లిలో 44.0 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. జయంతి ఉత్సవాలకు రండిమల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 10నుంచి 12వరకు నిర్వహించే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు రా వాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లకు ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వాన పత్రిక అందించారు. ఆలయ ఈవో అంజనారెడ్డి, ఉప ప్రధాన అర్చకులు చి రంజీవ స్వామి, వేద పండితులు పెద్దన్న శర్మ, సూపరిండెంట్ సునీల్కుమార్ పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరణజగిత్యాలక్రైం: జగిత్యాల డీఎస్పీగా నియమితులైన పురుషోత్తంరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ రఘుచందర్ నూతన డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి బాధ్యతలు అప్పగించారు. సహకార సంఘ చైర్మన్లకు నేటి నుంచి బాధ్యతలుజగిత్యాలరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల చైర్మన్ల పదవీ కాలం పూర్తి కావడంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం వారి పదవీ కాలాన్ని కొద్దిరోజులు పొడిగించింది. వెంటనే ప్రభుత్వం వారి పదవీకాలాన్ని రద్దు చేస్తూ ప్రత్యేకాధికారులను నియమించారు. దీంతో సహకార సంఘ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించే వరకు పాత సహకార సంఘాల పాలకవర్గ సభ్యులకే పదవీ బాధ్యతలు అప్పగి ంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంగళవారం జిల్లాలోని 52మంది సంఘాల చైర్మన్లు తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. క్షయతో అప్రమత్తంగా ఉండాలిజగిత్యాల: క్షయవ్యాధితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. సోమవారం గాయత్రి ఓల్డేజ్ హోంలో వృద్ధులకు పరీక్షలు నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు, రాత్రి చెమటలు పట్ట డం, బరువు తగ్గడం, చాతిలో పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆయన వెంట సూపర్వైజర్ శ్రీనివాస్, వికాస్ పాల్గొన్నారు. సజావుగా ధాన్యం కొనుగోళ్లుజగిత్యాల: వరిధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. వరిధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేవని జీవన్రెడ్డి ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశ్నించే గొంతుకగా చెప్పుకునే జీవన్రెడ్డి బీఆర్ఎస్ గొంతుగా మారిపోయాడని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు వ్యవసాయానికి రూ.2.68 కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ రెండేళ్లలో 1.52 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్కుమార్ నిత్యం కలెక్టర్తో సమీక్షలు నిర్వహిస్తూ ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం జరిగిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, ధా న్యం కొనుగోళ్లు త్వరితగతిన జరిగేలా చూస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, శంకర్ పాల్గొన్నారు. -
పెద్ద చెరువులో హక్కులు కల్పించాలి
మెట్పల్లి డివిజన్ కోనరావుపేట కోండ్రిక్యాల పెద్ద చెరువులో చేపలు పట్టుకునే హక్కులు తమకే కల్పించాలని గ్రామానికి చెందిన గంగపుత్రులు కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహం బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తమ హక్కులు కాపాడాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. 44 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోనరావుపేట కోండ్రిక్యాల చెరువును వంద ఎకరాలుగా చూపిస్తూ స్థానికేతరులకు మత్స్య సొసైటీలో సభ్యత్వం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపండి బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామపంచాయితీ కార్యాలయంలో గత పాలకవర్గం, ప్రత్యేక అధికారి పాలనలో జరిగిన నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విచారణ జరపాలని డీపీవో, కలెక్టర్, రాష్టపంచాయతీరాజ్ కమిషనర్లను మేకల అక్షయ్కుమార్ కోరారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. విచారణ జరిపి అవినీతికి పాల్పడిన పాలకవర్గం, ప్రత్యేక అధికారులతో పాటు ఫిర్యాదులపై స్పందించని జిల్లా పంచాయితీ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. -
కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించాలి
కొడిమ్యాల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించడం లేదంటూ రైతులు రోడ్డెక్కారు. కొడిమ్యాల మండలం పూడూరు చౌరస్తాలో సోమవారం జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. 43కిలోలు బదులు 40 కిలోలకే తూకం వేయాలని రోడ్డుపై వడ్లు పోసి నిరసన తెలి పారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఆందోళనతో ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మహిళా రైతులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో స్వల్ప తోపులాట జరిగింది. జీవన్రెడ్డి, రవిశంకర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రేవంత్రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలి అంటూ రైతులు నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చేంతవరకు ఆందోళన విరమించని పట్టుబట్టడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. రైతుల డి మాండ్ మేరకు 40 కిలోలకే తూకం వేసి, ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని రా తపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమి ంచారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు, మండల రైతులు పాల్గొన్నారు. -
మొబైల్ ఫోన్లతో కాలక్షేపం
జగిత్యాలటౌన్: క్షేత్రస్థాయిలో పరిష్కారం దొరకని సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి అధికారులకు ఆటవిడుపుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించాలని, సమయపాలన పాటించాలని కలెక్టర్ పలుమార్లు ఆదేశిస్తున్నా అధికారుల తీరు మారడం లేదు. సోమవారం నిర్వహించిన ప్రజవాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించే పనిలో నిమగ్నం కాగా, అధికారులు మాత్రం తమ మొబైల్ మునిగి తేలడం కనిపించింది. కొందరు రీల్స్ చూస్తుండగా, మరికొందరు ఫోన్లు మాట్లాడుతూ కనిపించారు. ఇంకొందరు ఫోన్లో చాటింగ్ చేస్తూ కనబడ్డారు. -
మహిళా సాధికారతకు కృషి
జగిత్యాలరూరల్: మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాష్ట్రంలో మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ వివిధ రంగాల్లో ప్రభుత్వం మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్ దావ తిరుపతి, ఉప సర్పంచ్ మహేశ్, నాయకులు లక్ష్మీదామోదర్రావు, రవీందర్రెడ్డి, గంగాధర్, ఎంపీడీవో విజయలక్ష్మీ, తహసీల్దార్ రాంమోహన్, ఎంపీవో వాసవి, ఏపీఎం రాజయ్య పాల్గొన్నారు. నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం చేయూత నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన దుబ్బాక పెద్ద నర్సయ్యకి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1.50 లక్షల ఎల్వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, గర్వందుల గంగన్న పాల్గొన్నారు. నష్టాల్లో ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నాం జగిత్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ సంస్థలైన మార్క్ఫెడ్, సివిల్ సప్లయిలు నష్ట్రాల్లో ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో సోమవారం నిర్వహించిన రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష కార్డులు అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, వ్యవసాయ కళాశాల డీన్ సుజాత, శాస్త్రవేత్తలు రవి, రాకేశ్, ఉద్యాన శాఖాధికారిణి స్వాతి, మార్కెట్ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్ నల్ల కవిత, ఉప సర్పంచ్ సత్తిరెడ్డి, ఏఈవో హరీశ్ పాల్గొన్నారు. -
వలస బతుకులు.. ప్రసవ బాధలు
● ఈనెల 2న బిహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన సీతాదేవి (25) తన భర్తతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా గూడూర్ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి దర్భాంగా వెళ్లే భాగ్మతి రైలు ఎక్కారు. టికెట్ లేకుండానే ఎస్–6 బోగీలో కూర్చున్నారు. శనివారం వేకువజామున వరంగల్ రైల్వేస్టేషన్ దాటాక సీతాదేవికి పురిటి నొప్పులు వచ్చి కూర్చున్న చోటనే సుఖప్రసవమై ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రామగుండం: బతుకుదెరువు కోసం బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి నిరక్షరాస్యులైన దంపతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పనులు చేసుకునేందుకు వలస వెళ్తుంటారు. ఇటీవల రైలు ప్రయాణాల్లో గర్భిణులు ప్రసవించడంపై సంబంధిత అధికారుల్లో ఆందోళన నెలకొంది. పలువురు అనారోగ్యంతో సొంతూరు వెళ్లే క్రమంలోనే రైళ్లలో మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. కాగా, వీరందరూ నిరక్షరాస్యులు కావడం గమనార్హం. మూసివేసి ఉన్న ఎమర్జెన్సీ హెల్త్ రూమ్ సూదూర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే కనీసం రైల్వే ప్లాట్ఫాంపై ప్రాథమిక వైద్య సేవలు అందించని దుస్థితిలో రామగుండం రైల్వేశాఖ ఉంది. ప్రాథమిక చికిత్స కోసం అత్యవసర గదిని ఏర్పాటు చేసి బోర్డు తగిలించినా తెరుచుకున్న పాపానా పోలేదు. అమృత్ భారత్ పథకంలో కోట్లాది నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నా.. ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించలేని దుస్థితిలో రైల్వేస్టేషన్ ఉంది. అవగాహన లేమితో నిండు గర్భిణుల రైలు ప్రయాణం రామగుండం రైల్వేస్టేషన్లో రెండు ఘటనలు స్టేషన్లో అత్యవసర వైద్యసేవలు కరువునెలలు నిండిన గర్భిణులు, అస్వస్థతతో ఉన్న వ్యక్తులు రైళ్లలో ప్రయాణం చేయడం సరికాదు. అత్యవసరంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పెద్ద సిటీలలో వైద్య సేవలకు అనుకూలత ఉంటుంది. అటవీ ప్రాంతం సమీపంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే రైలు ప్రయాణాలు చేయాలి. – తిరుపతి, ఇన్చార్జి రైల్వే పోలీస్, రామగుండం -
సమ్మర్ క్యాంపుపై సందిగ్ధం
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో యేటా నిర్వహించే వేసవి క్రీడా శిబిరాలపై ఈసారి సందిగ్ధం నెలకొంది. ఏడేళ్లుగా (కరోనా వైరస్, ఎన్నికల కోడ్ మినహా) నిరంతరంగా కొనసాగుతున్న శిబిరాలు ఈసారి ఉంటాయా? లేదా? అన్న సందేహం కోచ్లు, తల్లిదండ్రులు, చిన్నారులను కలవరపెడుతోంది. 2017 నుంచి వేసవి శిబిరాలను ప్రారంభించిన నగరపాలక సంస్థ 2020, 2021లో కరోనా వైరస్ కారణంగా, 2024లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్వహించలేదు. ఈసారి ఎలాంటి అడ్డంకి లేకున్నా శిబిరాల నిర్వహణపై నగరపాలక సంస్థ మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. శిబిరాలపై ఎలాంటి ప్రకటన లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. భారం అనుకుంటున్నారా? నగరంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు సరైన వేదిక కల్పించాల్సిన బాధ్యత బల్దియాపై ఉందని నగర ప్రజలు గుర్తుచేస్తున్నారు. చిన్నారులకు ఇచ్చే పాలు, గుడ్లు, అరటి పండ్లు, కోచ్లకు ఇచ్చే గౌరవ వేతనాల భారం తప్పించుకోవడానికే శిబిరాలను పక్కన పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రీడలపై ఆసక్తి పెంచే ఈ శిబిరాలు నిలిచిపోతే, యువతలో నైపుణ్యాల అభివృద్ధి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి శిబిరాల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా, వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని కోరుతున్నారు. శిబిరం నిర్వహణపై బల్దియా మౌనం ఉచిత శిక్షణ శిబిరాల సంప్రదాయానికి బ్రేక్? నిరాశలో చిన్నారులు, తల్లిదండ్రులు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహణ ఇలా ఏడాది క్రీడలు కోచ్లు చిన్నారులు గౌరవవేతనం 2017 17 28 1,500 రూ.5,000 2018 20 40 2,500 రూ.5,000 2019 22 45 2,600 రూ.5,000 2022 27 72 3,200 రూ.5,000 2023 28 70 3,000 రూ.8,000 2025 17 35 1,700 ఇవ్వలేదు -
నేటి నుంచి రైతు వారం
కరీంనగర్ అర్బన్/జగిత్యాలఅగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారం నిర్వహిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల కార్యాచరణను రూపొందించగా సోమవారం నుంచి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం సాగు రంగానికి చేసిన సేవలు, విప్లవాత్మక మార్పులు, పంట రుణాలు, గతంలో చేసిన రుణమాఫీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను రైతులకు క్షేత్రస్థాయిలో వివరిస్తారు. అందులో భాగంగా ఈ నెల 4నుంచి 9 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతు వారం నిర్వహించనున్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ విభాగాలైన పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ, ఆత్మ, వ్యవసాయ మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ అధికారులు అన్నదాతకు అవగాహన కల్పించనున్నారు. కాగా, రైతు వేదికలే వేదికగా ప్రతి రోజూ కార్యక్రమాలను నిర్వహిస్తామని అధికారులు వివరించారు. కార్యక్రమాలు ఇలా.. ● 4వ తేదీన: సాగు భూమి ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, వినియోగదారులు కోరుకునే సన్నరకాల సాగు వంటి వివరాలను వివరించనున్నారు. ● 5న: ఉద్యాన పంటల ద్వారా వచ్చే ఆదాయం, ఆయా పంటల అభివృద్ధి, ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు. ● 6న పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలతో పాటు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులకు అందించే సేవలు, మార్కెటింగ్ అవకాశాలు. ● 7న: వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుమ్, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్. ● 8న: వ్యవసాయంలో కీలకమైన పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశువుల సంరక్షణ వంటి వివరాలు. ● 9న: చెరువుల్లో కంప చెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత. వివిధ కార్యక్రమాల రూపకల్పన రైతు వేదికల్లో నిర్వహణ భూసార పరీక్ష ఫలితాల వెల్లడి -
పాఠశాల ఆస్తులు పైలమేనా..!?
జగిత్యాల: పరీక్షలు అయిపోగానే పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటిస్తుంది. ఇది పిల్లలకు ఆనందంగా ఉన్నా.. ఉపాధ్యాయులకు మాత్రం పెద్ద తలనొప్పి వ్యవహారమే. ఏటా నెలపాటు వేసవి సెలవులు రావడంతో బడులన్నీ మూతపడతాయి. గ్రామాల్లో ఉండే కొందరు ఆకతాయిలు పాఠశాలలను టార్గెట్ చేస్తూ.. అందులో ఆటలాడటమే కాకుండా కొందరు మద్యం తాగుతూ.. సీసాలు పగులగొడుతూ.. ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తుంటారు. బడిలో ఉన్న వస్తువులనూ చోరీ చేస్తుంటారు. ప్రస్తుతం ప్రతి బడిలో కంప్యూటర్లు ఉన్నాయి. విలువైన వస్తువులూ తెచ్చిపెట్టారు. వీటిని ఎత్తుకెళ్లినా, ధ్వంసం చేసినా ఇబ్బందే. బడి ప్రారంభంకాగానే వచ్చే ఉపాధ్యాయులకు ఇది ఏటా తలనొప్పిగా మారుతోంది. గతంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల ఆస్తులు అనేకం ధ్వంసం కావడంతోపాటు, పరిసరాలను అస్తవ్యస్తం చేసేవారు కొందరు ఆకతాయిలు. గుర్తుతెలియని వ్యక్తులు కిటికిలు, తాళాలు, తలుపులు ధ్వంసం చేసేవారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పాఠశాలల ఆస్తుల రక్షణకు కొన్ని మార్గదర్శకాలను విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ జారీ చేశారు. ఈసారి బడుల ఆస్తులకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు 22 ఉన్నాయి. ఇందులో అనేక విలువైన వస్తువులున్నాయి. గతంలోనే సీసీ కెమెరాలు అమర్చినప్పటికీ ప్రత్యేకమైన భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. సీసీకెమెరాలు, ప్రధానోపాధ్యాయుడితోపాటు, పీడీ, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు నిరంతరం నిఘా ఉంచాలని, పాఠశాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిపైనే పెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆకతాయిలకు చెక్ పెట్టేదెలా..? ప్రభుత్వ పాఠశాలలు 33కేజీబీవీలు 16ప్రాథమిక పాఠశాలలు 705మోడల్స్కూల్స్ 13భద్రత ఇలా.. చర్యలు తీసుకుంటున్నాం జూన్ వరకు బడులకు సెలవులు ఆస్తులు ధ్వంసం చేస్తున్న ఆకతాయిలు రక్షణకు ప్రభుత్వం మార్గదర్శకాలు బడుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యాశాఖ నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యా యి. నిత్యం పాఠశాలలను విజిట్ చేయడంతో పాటు, పోషకులు, విద్యార్థుల సహకారం తీసుకుంటాం. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. రాము, డీఈవో -
సబ్స్టేషన్ ఆవరణలో మంటలు
కొత్తపల్లి(కరీంనగర్): 220 కె.వీ. దుర్శేడ్ విద్యుత్సబ్స్టేషన్ ఆవరణలోని పోల్ సెంటర్లో ఆదివారం రా త్రి మంటలు చెలరేగాయి. గాలి దుమారం రావడంతో అల్గునూర్, హుజూరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే 32 కె.వీ. లైన్లు ఒకదానికొకటి రాపిడి జరిగి అగ్ని రవ్వలు కిండపడ్డాయి. అక్కడున్న చెత్త, గడ్డి అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై దుర్శేడ్ సబ్స్టేషన్ను ఆఫ్ చేసి ఫైరింజన్కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. దీంతో విద్యుత్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విద్యుత్ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని ట్రాన్స్కో డీఈ భూమయ్య వెల్లడించారు. తాళం వేసిన ఇంట్లో చోరీజగిత్యాల క్రైం: జగిత్యాలలోని వాణీనగర్కు చెందిన విద్యుత్ శాఖ లైన్మన్ రమేశ్ ఇంట్లో గుర్తుతెలియని దొంగలు పడి రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. రమేశ్ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లాడు. ఆదివారం తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. బీరువాలో డబ్బులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అంతా నిమిషాల్లోనే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్క్రైం: ఆదివారం ఉదయం.. నగరం ప్రశాంతంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే జ్యోతినగర్ – విద్యుత్ కార్యాలయం ప్రధాన రహదారి.. సెలవు రోజు కావడంతో సందడి తక్కువగా ఉంది. ఇదే దారిలో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్ను అప్పుడే తెరిచారు. సిబ్బంది లాకర్లలో ఉన్న బంగారాన్ని లెక్కచూసుకుంటూ తీసుకొచ్చి కౌంటర్లు, డిస్ప్లేలో పెడుతున్నారు. ఇంతలో పెళ్లి ఉంది.. బంగారం కావాలంటూ ఓ వ్యక్తి ఉదయం 11 గంటలకు షాపులోకి వచ్చాడు. బంగారం కొన్నట్లు నటించి, ఐదు నిమిషాల తువాత మిగితా నలుగురిని లోనికి రమ్మని సైగలు చేశాడు. 11.06 గంటలకు వారు షాపులోకి ప్రవేశించారు. తుపాకులతో బెదిరించి సిబ్బందిని తాళ్లతో బంధించారు. చేతికి అందిన బంగారాన్ని బ్యాగులో సర్దుకున్నారు. అడ్డువచ్చిన నలుగురిపై కాల్పులు జరిపా రు. సరిగ్గా 11.11 గంటలకు బైకులపై మల్కాపూర్, చింతకుంట మీదుగా సిరిసిల్ల వైపు పారిపోయారు. విషయం నిమిషాల్లో దావనంలలా వ్యాపించడంతో సీపీ గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్రెడ్డి, క్లూస్టీం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల వేలిముద్రలు సేకరించారు. ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్, మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, రూ.కోటిన్నర విలువైన కిలోకు పైగా బంగారం చోరీకి గురైందని సీపీ ఆలం ‘సాక్షి’కి తెలిపారు. దోపిడీ ఘటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధాన రహదారులు దిగ్బంధించి, తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని హై దరాబాద్ నుంచి వచ్చిన క్లూస్టీం సిబ్బంది రాత్రి పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు. బీదర్ లేదా మహారాష్ట్ర వైపు? జ్యోతినగర్లో ఉన్న జ్యువెల్లరీ దుకాణం అయితే చోరీకి అనువుగా ఉంటుందని పక్కాగా రెక్కీ చేశా రు. కస్టమర్లు, జనసంచారం తక్కువగా ఉంటుందని ఆదివారాన్ని ఎంచుకున్నారు. చోరీ అనంతరం పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల రూట్లోకి లేదా జగిత్యా ల రూట్లో పారిపోవచ్చని స్కెచ్ వేసుకున్నారని తెలుస్తోంది. ఇలాంటి దొంగతనాల్లో రైలుమార్గాలు దగ్గర ఉన్న ప్రాంతాలను ఎంచుకొని పారిపోతుంటారు. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లారని, ముందుగానే ప్లాన్ చేసి కామారెడ్డి మీదుగా హైదరాబాద్, బీదర్ లేదా మహారాష్ట వైపు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాస్కులు లేకుండానే దర్జాగా ఎక్కువశాతం దొంగతనాలకు పాల్పడేవారు తమను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్కులు, హెల్మెట్ ధరిస్తుంటారు. పీఏంజే ఘటనలో దొంగలు దర్జాగా, ఎలాంటి భయం లేకుండా చోరీకి పాల్పడడం చూస్తే ఈ ప్రాంతం వారు కాదని తెలుస్తోంది. వారు బైకులపై హెల్మెట్లు, ముఖానికి మాస్క్లేకుండా లేకుండా రావడం, పారిపోవడం చూస్తే ఉగ్రవాదులా..? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం 5 నిమిషాల్లో దోపిడీకి పాల్పడిన ముఠా దుకాణం సిబ్బందిని బెదిరించి వారి చేతులు వెనక్కి కట్టేసి, వాష్ రూంలో భయంతో దాక్కున్న మహిళను కూడా సినీఫక్కీలో బయటకు తీసుకొచ్చి బెదిరించారు. చోరీచేసి బయటకు వస్తున్న క్రమంలో గాలిలోకి కాల్పులు జరుపుతూ బైకుపై వెళ్లిపోయారు. నగలు ఎత్తుకెళ్తున్న ఓ బ్యాగు అక్కడే పడిపోగా.. దోపిడీ ముఠా సభ్యుడు కూడా కిందపడిపోయాడని, తర్వాత కొంతదూరం పరిగెత్తి బైక్ ఎక్కాడని అక్కడ ఉన్న పలువురు చర్చించుకున్నారు. దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే నిందితులు పాత నేరస్తులు లేదా ఉగ్రశిక్షణ పొంది ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మ్యాగ్జిన్.. బులెట్లు స్వాధీనం ఘటనా స్థలంలో ఓ షార్ట్ వెపన్ మ్యాగ్జిన్, మూడు కాలిన తూటాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక్కడ లభ్యమైన మ్యాగ్జిన్, బులెట్లపై ఉన్న క్లూస్ ఆధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారన్న వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీ అనంతరం దొంగలు వెళ్లిన దారితోపాటు వచ్చిన దారి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆదివారం జనసంచారం తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారంటే తప్పకుండా వారం రోజులకుపైగా రెక్కీ నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నారు. నాడు మొరాదాబాద్ దొంగలు 2022 సెప్టెంబరు 5న కరీంనగర్లోని సెవెన్హిల్స్ సమీపంలో సాయివాణి రెడీమిక్స్కు చెందిన రూ.15 లక్షలు చోరీ చేసిన ముఠా కూడా అపాచీ, పల్సర్ బైకులనే వాడింది. ఒకరు చింతకుంట మీదుగా సిరిసిల్ల వెళ్లగా.. మరొకరు తిమ్మాపూర్ మీదుగా పారిపోయి చివరికి సిద్దిపేట వద్ద కలుసుకున్నారు. తరువాత నాంపల్లిలో రైలెక్కి ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ వెళ్లారు. నిందితులు ధరంపాల్, మనీశ్, పింటూ, ఏక్తా అని గుర్తించి పోలీసులు రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నాడు ఆ దొంగల ను టాస్క్ఫోర్స్ సీఐగా ఉన్న సృజన్రెడ్డి అరెస్టు చేసి పట్టుకురావడం గమనార్హం. మొత్తంగా కొ న్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరం ఆదివారం ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పలువురి పరామర్శ ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. గాయపడిన జువెల్లరీస్ సిబ్బంది ముస్తాక్, మధుకర్, రాజేశ్, కమలాసన్ను ఆస్పత్రిలో పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. జువెల్లరీ షాపు ఘటనను గంగుల, పాడి రాజకీయం చేయడం తగదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రరెడ్డి సూచించారు. రెక్కీ చేశాకే పీఎంజే జ్యువెల్స్లో చోరీ ఐదు నిమిషాల్లో ముగించి.. రెండు బైకులపై పరారీ నిందితులు మహారాష్ట్రకు చెందిన ముఠా సభ్యులు? 2022లో మొరాదాబాద్ దొంగల తరహాలోనే దోపిడీ దుండగులు వచ్చిన దారి వెంట సీసీ ఫుటేజీల పరిశీలన -
జగిత్యాల
45.0/25.0సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 202 7గరిష్టం/కనిష్టంగోదావరిలో భక్తుల రద్దీధర్మపురి: గోదావరిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్నానాలు ఆచరించారు. ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ వేడిమి అధికమవుతుంది. ఉక్కపోత పెరుగుతుంది. -
కనికరించని మానవత్వం
● అనారోగ్యంతో యువకుడి మృతి ● తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు శంకరపట్నం: మండలంలోని కేశవపట్నంలో ఆదివారం రాత్రి అనారోగ్యంతో యాకుబ్(35) మరణించగా, కుటుంబసభ్యులు తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కేశవపట్నం గ్రామానికి చెందిన వీరయ్య, రుక్కమ్మకు కొడుకు యాకుబ్, కూతురు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయ్యాయి, యాకుబ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, వీరయ్య, రుక్కమ్మలు రోడ్డు పక్కన టేలాలో చెప్పులు విక్రయించగా, ప్రస్తుతం వ్యాపారం లేక పోవడంతో కేశవపట్నం మేన్ రోడ్డుపై తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటున్నారు. యాకుబ్ రోడ్డుపక్కన గదిలో ఉండగా ఆదివారం రాత్రి చనిపోయాడు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తోపుడు బండిపై యాకుబ్ శవాన్ని తల్లిదండ్రులతో పాటు సోదరి, బావ తీసుకెళ్లారు. సాహిత్యంతో పౌర సమాజం జాగృతంకరీంనగర్కల్చరల్: పండితుల పామరుల హృదయాలను కదిలించగలిగే సాహిత్యంతో పౌర సమాజం జాగృతం అవుతుందని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. ఆదివారం ఫిలింభవన్లో తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం, శాతవాహన లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన ఆదివారం శ్రీకవన గోదారిశ్రీ కవితా సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. తరుగుతున్న మానవీయ విలువలను తన కవిత్వంతో తట్టి లేపడానికి బుర్ర మధుసూదన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమన్నారు. సభాధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి కవి, రచయిత, కాలమిస్టు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, సమాజ సేవకులుగా పలు రంగాల్లో తమదైన విలక్షణ ప్రతిభను చాటుకుంటూ దూసుకుపోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో కవులు అన్నాడి గజేందర్రెడ్డి, డాక్టర్ మచ్చ హరిదాసు, కొత్త అనిల్ కుమార్, బొమ్మకంటి కిషన్, అనిత పాల్గొన్నారు. -
పోటెత్తిన భక్తులు
వేములవాడ: మండుతున్న ఎండలను లెక్క చేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో వేములవాడకు చేరుకుని తమ ఇలవేల్పు రాజన్న, భీమన్నలకు మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీని గమనించిన ఆలయ అధికారులు భక్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తాగునీటి క్యాన్లను అందుబాటులో ఉంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులచే నీటి సరఫరా చేయించారు. భీమన్న సేవలో సుడా చైర్మన్ వేములవాడ భీమన్నను శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి మండపంలో శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, ఆశీర్వచనాలు అందించారు. -
ప్రభుత్వంలో చలనమే లేదు..
జగిత్యాలటౌన్: ఉద్యోగులు, నిరుద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై బీజేపీ అసెంబ్లీ లోపల, వెలుపల ఎంత నిలదీసినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మోదీ సభ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కేంద్రం జిల్లాకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తే స్థలం కేటాయించలేని దుస్థితిలో ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన రేవంత్రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని, కేసీఆర్ను చర్లపెల్లి జైలులో పెడతానని ఇప్పుడు ఫాంహౌజే కేసీఆర్కు జైలులాంటిదనడం వారిద్దరి బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్పై విశ్వాసం కోల్పోయిన రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, తెలంగాణకు దిశానిర్దేశం చేసేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారని తెలిపారు. ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో నిర్వహించే సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నాయకులు సురేందర్రెడ్డి, అనూప్రావు, పూదరి అరుణ, వడ్డెపల్లి శ్రీనివాస్, నలువాల తిరుపతి, సుంకెట దశరథరెడ్డి, భూమి రమణ, జుంబర్తి దివాకర్ ఉన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి -
ప్రశాంతంగా ‘నీట్’
కొడిమ్యాల: జేఎన్టీయూ (నాచుపల్లి)లో ఆదివారం ‘నీట్’ ప్రశాంతంగా ముగిసింది. కళాశాలలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక సెంటర్లో 240 మంది విద్యార్థులకు 234 మంది, మరో సెంటర్లో 196 మందికి 192 మంది హాజరయ్యారు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు లేకపోవడంతో పలువురు విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఒక విద్యార్థిని చెవికమ్మలు తీయమనడంతో తీసే క్రమంలో చెవికమ్మ ఎక్కడో పడిపోవడంతో అసహనం వ్యక్తం చేసింది. సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఐదు గంటలకుపరీక్ష రాసి బయటకు వచ్చే క్రమంలో రద్దీతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. కేంద్రాల తనిఖీ జగిత్యాలటౌన్: జగిత్యాల ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 360మంది విద్యార్థులకు 355మంది హాజరయ్యారు. జిల్లాలో మొత్తంగా 98.11శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్లు కో–ఆర్డినేటర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఎస్కేఎన్ఆర్ పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లత పరిశీలించారు. -
వదలరు.. కదలరు..
జగిత్యాల: ఆ పది మంది ఎస్సైలు జిల్లాను వదలరు.. వారంతా ఒకే బ్యాచ్ వాళ్లు.. పదేళ్ల క్రితం జిల్లాలో పోస్టింగ్ పొంది.. అప్పటి నుంచి ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించుకుని తిష్ట వేశారు. నేతల ప్రాపకం ఉత్తర, దక్షిణ జిమ్మిక్కులతో సదరు ఎస్సైలు జిల్లాను వదలడం లేదన్న వాదనలు ఉన్నాయి. శ్రీవదల బొమ్మాళీ.. వదలశ్రీ అన్న రీతిలో ఆ బ్యాచ్ ఎస్సైలు ఖో ఖో అడినట్లు వాళ్లల్లో వాళ్లే ఒకరి నుంచి ఒకరికి ఖో ఇచ్చుకుని పోస్టింగ్లకు మారిపోవడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం ఒకే బ్యాచ్కు చెందిన పది మంది ఎస్సైలు జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వదలరు.. కదలరు జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పోలీస్ సర్కిళ్లు ఉన్నాయి. వాటి పరిధిలో 22 మంది ఎస్సైలు ఉన్నారు. వీరు కాక.. స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్, సీసీఎస్ వారిని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 30 మంది వరకు ఎస్సైలు ఉన్నారు. వీరిలో కనీసం పదిమంది ఒకే బ్యాచ్కు చెందిన వారు ఉండడం గమనార్హం. సదరు బ్యాచ్ ఎస్సైలు లూప్లైన్లలో పనిచేయడానికి అసలే ఇష్టపడరు. పదేళ్లుగా జగిత్యాల, మల్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి వంటి కీలక ప్రాంతాల్లో ఉంటున్నారు. రెండవ శ్రేణి పోస్టింగ్లుగా చెప్పుకునే రాయికల్, కథలాపూర్, మేడిపల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, జగిత్యాల రూరల్ వంటి పోలీస్స్టేషన్లలోనూ ఒకరి తరువాత ఒకరు వారే ఎక్కువ కాలం పనిచేశారు. ఇతర బ్యాచ్లకు చెందిన ఎస్సైలు ఎవరైనా జిల్లాకు వస్తే వారిని కుదురుకోకుండా చేయడంలోనూ వీరిది అందెవేసిన చేయిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రచారం ఉంది. ఈ అంశం ఇటీవల కాలంలో జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయంగా మారింది. ఉత్తర, దక్షిణల్లో దిట్టలు అధికార పార్టీ నేతల ప్రాపకం పొందడంలో సదరు బ్యాచ్ ఎస్సైలకు వెన్నతో విద్యగా చెప్పుకుంటారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల అధికార పార్టీ కీలక నేతలను ఆకట్టుకుని వారి ఉత్తరాలతో పోలీసు ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకుంటున్నారు. జిల్లాలో ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న కీలక ఠాణాల్లో పోస్టింగ్ల కోసం కొంతమంది ఆ బ్యాచ్ ఎస్సైలు అవసరమైతే శ్రీదక్షిణశ్రీ మంత్రం వేసి మరీ దస్తీలు వేసుకుంటున్న వైనం విస్మయం కలిగిస్తోంది. ఇంతలా జిల్లాను వదలకుండా కొంతమంది ఎస్సైలు ఏకధాటిగా ఇక్కడే పనిచేస్తున్న వైనం ఇటీవల కాలంలో ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాసర జోన్ వ్యాప్తంగా అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఎస్సైలు బదిలీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్న జిల్లాను సదరు బ్యాచ్ ఎస్సైలు వదలడం లేదు. దీని వెనక ఆంతర్యం ఏమిటన్న అంశం ఉన్నతాధికారులకు అంతు చిక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పదేళ్లుగా ఇక్కడే ఓ పోలీస్ బ్యాచ్ జిల్లాలో పది మంది తిష్ట ఉత్తర, దక్షిణ జిమ్మిక్కులు -
ఎందుకో ఇంత వివక్ష..?
కోరుట్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని ఎమ్మెల్యే ఫొటో, జగిత్యాలలో ఎమ్మెల్యే ఫొటోతో ఉన్న ఫ్లెక్సీజగిత్యాల: జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి పట్టణాల్లో ప్రజాపాలన–పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం నిర్వహించారు. జగిత్యాల, ధర్మపురిలో జరిగిన సమావేశాల్లో అధికార యంత్రాంగం స్థానిక మంత్రి, ఎమ్మెల్యేల ఫొటోలను ఫ్లెక్సీల్లో వాడుకున్నారు. కోరుట్లలో మాత్రం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫొటో మాత్రం పెట్టలేదు. జిల్లా అధికారులు అందరికీ ఒకే ప్రోటోకాల్ అనుసరించకుండా ఇలా వివక్ష చూపడంపై కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మానాన్న లేని అభాగ్యులు
● ఏ ‘ఆధార’మూ లేని చిన్నారులు ● చేరదీసిన అమ్మమ్మ, నాన్నమ్మ ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు వీర్నపల్లి(సిరిసిల్ల): ఆ బాలుడు పుట్టు మూగ. కన్నవారి ప్రేమకు నోచుకోలేదు. ఏ ఆధారమూ లేదు. కనీసం ఆధార్ కార్డు కూడా లేని అభాగ్యుడు. వీర్నపల్లి మండలం బంజేరు గ్రామపంచాయతీ పరిధి బీరప్పతండాకు చెందిన బట్టు శంకు పుట్టుకతోనే మూగ. అతడు పుట్టిన ఏడాదికే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. అప్పటి నుంచి తన అమ్మమ్మ బట్టు నానుకు వద్దే పెరుగుతున్నాడు. కనీసం ఆధార్ కార్డు కూడా లేక దివ్యాంగుల పింఛన్, చదువు, ఇతర పథకాలకు దూరమయ్యాడు. మనవడే ప్రాణం భర్త మరణించిన తర్వాత నానుకు అండగా నిలిచేవారు కరువయ్యారు. వృద్ధాప్య పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. కనీసం ఉండడానికి ఇల్లు లేక, చిన్న పూరిగుడిసెలో కాలం వెళ్లదీస్తోంది. మనవడు శంకును సాకడం ఆమెకు భారంగా మారింది. వయసు మళ్లినా కూలీ పనులకు వెళ్తే వచ్చే ఆదాయంతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు ఏదోలా రెక్కలు ముక్కలు చేసుకుంటానని, తర్వాత తన మనవడిని ఎవరు చూసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం స్పందించి బాలుడికి ఆధార్ ఇప్పించి, పింఛన్ సౌకర్యం కల్పించాలని తండావాసులు కోరుతున్నారు. మరో బాలుడిది అదే వ్యథ బీరప్పతండాకే చెందిన మరో బాలుడు బట్టు శివ పరిస్థితి కూడా ఇంతే. అతడి తల్లిదండ్రులు ఎటు వెళ్లారో తెలియదు. నాన్నమ్మ బట్టు సక్కుబాయి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. తల్లిదండ్రుల మమకారానికి దూరమై, తోటి పిల్లలను చూస్తూ ఈ చిన్నారులు పడుతున్న వేదన వర్ణనాతీతం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సదరు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. బీరప్ప తండాలో బట్టు నాను, ఆమె మనవడు శంకు పడుతున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. తక్షణమే ఆ బాలుడికి ఆధార్ నమోదు చేయించి, బట్టు నానుకు పింఛన్ వచ్చేలా కృషి చేస్తాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా చూస్తాం. – బట్టు కృష్ణ, సర్పంచ్, బంజేరు -
ధాన్యం తరలింపులో ఎఫ్సీఐ జాప్యం
● అందుకే రైతులకు కష్టాలు ● ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాలరూరల్: మిల్లుల్లోని ధాన్యాన్ని ఎఫ్సీఐ తరలించడంలో జాప్యంతోనే రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్ కుమార్ అన్నారు. రైస్మిల్లుల గోదాంల నుంచి ధాన్యం తరలించేలా కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, సర్పంచ్లు సతీష్ పాల్గొన్నారు. నిరుపేదల సొంతింటి కల సాకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేదల సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్, సారంగాపూర్ మండలం పెంబట్ల, గణేష్పల్లి, బీర్పూర్ మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరయ్యాయని, ఇప్పటివరకు 2400 ఇళ్లు వివిధ దశలో ఉన్నాయన్నారు. ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, కేడీసీసీబీ మాజీ మెంబర్ రాంచందర్రావు, ఎంపీడీవో సలీం, చిరంజీవి, భీమేష్, సర్పంచ్లు రాధ, శ్రీనివాస్, హరీశ్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. సారంగాపూర్ మండలకేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన మక్కలను కొనే దిక్కులేదన్నారు. రైతులంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. మక్కలు ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రభుత్వం 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామని నిబంధన పెట్టడమేంటని నిలదీశారు. సన్నాలకు రూ.500 బోనస్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎక్కడ కోరుకుంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొని మిల్లులకు తరలించామని పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు తేలు రాజు, సింగిల్ విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేశ్, నాయకులు బైరి మల్లేశ్ పాల్గొన్నారు. టీబీ రోగులకు మెరుగైన వైద్యం ● డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో శ్రీనివాస్ జగిత్యాలరూరల్: టీబీ రోగులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణ శివారులోని టీఆర్నగర్లో బస్తీ దావా ఖానాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలతోపాటు నెల నెలా మందులు కూడా అందిస్తోందన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసుల విస్తృత తనిఖీలుజగిత్యాలక్రైం: కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ షాపులో తుపాకులతో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడగా.. జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రహదారులపై పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి అణువణువునా తనిఖీలు చేపట్టారు. అనుమానిత వాహనాలను సీజ్ చేశారు. అనుమానితులను విచారణ చేపడుతున్నారు. నిందితుల చిత్రాలను పోలీసులు విడుదల చేయడంతో అనుమానితులు కన్పిస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు. -
కల్లు దుకాణాల్లో నియంత్రణ కరువు
జగిత్యాలక్రైం: కల్లు షాపులపై అధికారుల నియంత్రణ కరువైంది. కొద్దిపాటి కల్లులోనే రసాయనాలు కలిపి భారీగా తయారుచేస్తూ సీసాల్లో నింపి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. చిన్నారులకు మద్యం విక్రయించవద్దని ఉన్నా అవేమీ పట్టించుకోకుండా కల్లు షాపుల్లో ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వారు విక్రయించే కల్లుతో ఎంతోమంది చిన్నారులు, పెద్దలు అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్రోడ్లో తండ్రితో కలిసి ఓ నాలుగేళ్ల బాలుడు వచ్చినా నిర్వాహకులు అడ్డుచెప్పలేదు. పైగా అతడికి తండ్రే కల్లు తాగిపించడం గమనార్హం. దీంతో బాలుడే అక్కడే నిద్రమత్తులోకి జారుకున్నాడు. బాలుడు కల్లు తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తండ్రితో కలిసి చిన్నారి కల్లు సేవిస్తున్నా అక్కడి షాపు యజమానులు చూసీచూడనట్లు వ్యవహరించారు. ఇటీవల కల్లు దుకాణాలపై ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణ కూడా కరువవడంతో ప్రజలకు అనారోగ్యం కలిగించే రసాయనాలు కలిపి కల్లు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని షాపుల్లో మత్తు పెంచేందుకు గుల్ఫారామ్ వంటి పదార్థాలు కలుతున్నా వాటిని పరిశీలించే వారే కరువయ్యారన్న ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. తండ్రితో కలిసి కల్లు తాగిన బాలుడు కల్లు నిర్వాహకుల ఇష్టారాజ్యం -
ఉద్యోగం నుంచి బాలల పరిరక్షణ అధికారి తొలగింపు
● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ జగిత్యాల: జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం.హరీశ్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హరీశ్పై మహిళాఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు, విధుల్లో ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలపై సదరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల పనిప్రదేశాల్లో వేధింపుల చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసి పద్ధతి మార్చుకోవాలని ఉన్నతాధికారులు మందలించారు. అయినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఉద్యోగులు మరోసారి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని ఉన్నతాధికారులు తేల్చి నివేదిక అందించారు. పరిశీలించిన కలెక్టర్ డీసీపీవో హరీశ్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్లుజగిత్యాల/మెట్పల్లి: జగిత్యాల మున్సిపల్ కమిషనర్గా సత్యప్రణవ్, మెట్పల్లి కమిషనర్గా శ్రీనివాస్గౌడ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాలలో పనిచేసిన స్పందన బదిలీపై వెళ్లిపోవడంతో గ్రూప్–1 అధికారి సత్యప్రణవ్ కమిషనర్గా నియమితులయ్యారు. అలాగే డీఆర్డీఏ జిల్లా సూపరింటెండెంట్ శ్రీనివాస్గౌడ్ను డిప్యూటేషన్పై మెట్పల్లి కమిషనర్గా నియమించారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను పలు విభాగాల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులకు ఇబ్బందులుజగిత్యాల: గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులకు ఇబ్బందులు అని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం మాట్లాడారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.993కు పెంచడంతో పేదలపై భారం పడుతుందన్నారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం కమర్శియల్ గ్యాస్ ఆరుసార్లు పెంచడం ద్వారా చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీస్టాల్స్ మూతపడి కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయన్నారు. కార్మికుల దినోత్సవం రోజున సిలిండర్ ధరలు పెంచి మోదీ సామాన్యుల నడ్డీ విరిచారన్నారు. ఇప్పటికై నా ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బాధ్యతలు స్వీకరిస్తున్న కమిషనర్ సత్యప్రణవ్ బాధ్యతలు చేపడుతున్న శ్రీనివాస్గౌడ్ -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
జగిత్యాల: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడుతున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజ య్కుమార్ అన్నారు. 99రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, యువతకు క్రీడలు, విద్యుత్, పిల్లల భద్రతలో ముందుకెళ్తున్నామని పేర్కొన్నా రు. వైకుంఠదామాలు, పల్లెప్రకృతి, పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుగా ఇచ్చి ప్రజలు సహకరించాలన్నారు. నియోజకవర్గంలో 78 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతోందని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణా ల్లో అభివృద్ధి పనులను పూర్తిచేయాలన్నారు. సేవల్లో పారదర్శకత, నాణ్యత ఉండేలా చూడాలన్నా రు. ఎస్సీ అభివృద్ధి అధికారి రాజ్కుమార్, ము న్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో ని రోటరీ పార్క్ పక్కన రూ.48 లక్షలతో బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అమృత్ స్కీంలో నిధులున్నాయని, అధికారులు పనులను వేగవంతం చేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, నిమ్మల నాగరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, గట్టు సతీశ్, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అంతస్తుకో రేటు..!?
కోరుట్ల: మున్సిపాలిటీలోని పట్టణ ప్రణాళిక విభాగంలో ‘అవినీతి కంపు’ కామన్ అన్న తీరుగా తయారైంది. మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణ అనుమతికి ఒక్కో ఫైల్ లెక్కన వసూళ్ల తంతు నడుస్తుంటే.. కోరుట్లలో మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు మరో అడుగు ముందుకేశారు. ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్కు కేవలం అమ్యామ్యాలకు కింద రూ.10 వేలతో సరిపెట్టుకోకుండా ఒక్కో అంతస్తుకు ఒక్కో రేటు పెట్టారు. సొంత ఆదాయం మరింత పెంచుకోవచ్చన్న ఆశల్లోకి దిగుతున్నారు. బల్దియాలో వసూళ్ల దందా విచ్చలవిడిగా సాగుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. సొంత ఆదాయంపై దృష్టి.. కోరుట్ల మున్సిపాలిటీలో 33వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో ప్రతినెలా ఎంత తక్కువ అనుకున్నా సుమారు 150 నుంచి 200 ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. వీటిలో దాదాపు సగం ఇళ్ల నిర్మాణం జీప్లస్–1 అనుమతి తీసుకోవడం ఆనవాయితీ. గ్రౌండ్ఫ్లోర్ నిర్మాణానికే రూ.10 వేల మేర అమ్యామ్యాలు తీసుకుని కొంతమంది మున్సిపల్ అధికారులు జేబులు నింపుకుంటున్న విషయం బహిరంగ రహస్యం. మరో అంతస్తు నిర్మాణానికి మరో రూ.5వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడితో సరిపెట్టుకోకుండా ఆపై అంతస్తు నిర్మాణానికి రూ.20వేల నుంచి రూ.30 వేలు వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ లెక్కన మున్సిపాలిటీకి ఇళ్ల నిర్మాణాలపై వస్తున్న ఆదాయం కన్నా సిబ్బందికి ఎక్కువగానే సమకూరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వసూళ్ల దందా మొత్తం మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న కొంతమంది ఆర్కిటెక్టర్లతో నడుస్తున్నట్లు తెలిసింది. కాసులు ఎక్కువ మొత్తంలో సమర్పించి ఇంటి నిర్మాణ ఫైళ్లు అందించే లైసెన్స్డ్ ఆర్కిటెక్టర్ల అనుమతులు తొందరగా వస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. నిబంధనల ప్రకారం వ్యవహరించే ఆర్కిటెక్టర్లకు మొండి చేయి చూపుతూ.. లేనిపోని కారణాలు చెబుతూ కొర్రీలు పెడుతుండటం విశేషం. ఉత్తుత్తి పర్యవేక్షణ స్థానిక సంస్థలను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు కింది స్థాయి మున్సిపల్ అధికారుల తీరుపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కోరుట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇతర అధికారులపైనా లెక్కలేని ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనక కారణాలు ఏమిటన్న అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం పన్నుల వసూళ్ల అంశంపై ప్రతీరోజు సమీక్షలు నిర్వహించే ఉన్నతాధికారులు మున్సిపాలిటీలో అధికారుల కార్యకలాపాలు సక్రమంగా జరగుతున్నాయా..? లేదా..? అన్న అంశంపై దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
మెట్పల్లిరూరల్: రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం జగ్గాసాగర్, ఆత్మకూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన అడిషనల్ కలెక్టర్ లతతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రాల్లోకి ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా ఎందుకు కొనుగోళ్లు చేయడం లేదని, తేమ శాతం వచ్చినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు తిప్పలు తప్పడం లేదని విమర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్లు జగన్గౌడ్, రాజారాం, నాయకులు రాజేందర్, నర్సింహులు, అంజయ్య పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కోరుట్ల రూరల్: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేలా కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
హనుమాన్ పెద్ద జయంతికి రండి
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి పెద్ద జయంతి ఉత్సవాలకు రావాలని దేవా దా య శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అధి కారులు ఆహ్వానపత్రిక అందించారు. ఈనెల 10 నుంచి 12 వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, సునీల్, స్థానాచార్యులు కపీందర్, తేజశర్మ తదితరులు పాల్గొన్నారు. 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో శనివారం 44.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ధర్మపురి మండలం బుద్దేశ్పల్లి, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 44.9, ధర్మపురి మండలం నేరెళ్లలో 44.7, కొడిమ్యాల మండలం పూడూరులో 44.6, రాయికల్ మండలం అల్లీపూర్, ఎండపల్లి మండలం గుల్లకోటలో 44.3, కోరుట్ల మండలం అయిలాపూర్లో 44.2, ఇబ్రహీంపట్నం మండలం గోదూరులో 44డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ‘రైతువారం’ కార్యక్రమాలు ఇలా..జగిత్యాలఅగ్రికల్చర్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతువారం నిర్వహిస్తున్నట్లు డీఏవో భాస్కర్ తెలిపారు. ఈనెల 4 అన్ని రైతువేదికల్లో నేల ఆరోగ్య పరిరక్షణ, ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, 5న ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పాం సాగు విస్తరణ, ప్రత్యామ్నాయ పంటలు, 6న పంట రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్పీవోల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, మార్కెటింగ్ అవకాశాలు, 7న వ్యవసాయ యంత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, వ్యవసాయ యాంత్రీకరణ, 8న పాడి పరిశ్రమ, పశు అభివృద్ధి, పశుసంరక్షణ, చేపల అధిక ఉత్పత్తికి చర్యలు, 9న సన్నరకాల సాగుపై అవగాహన సదస్సులు ఉంటాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు. పంట మార్పిడితో తెగుళ్లకు చెక్జగిత్యాలఅగ్రికల్చర్: పంట మార్పిడితో తెగుళ్లు, పురుగులకు చెక్ పెట్టవచ్చని పొలాస శాస్త్రవేత్త బి.శ్రీనివాస్ అన్నారు. రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శనివారం జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో సమావేశం నిర్వహించారు. ఏ పంటకై నా నీటిని ఎక్కువగా ఉపయోగించరాదని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వస్తుందని తెలిపారు. తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని కోరారు. సర్పంచ్ గంగోత్రి, ఏఈవో రవళి, సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు. నేడు ‘నీట్’..జగిత్యాల: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్– 2026 ఆదివారం జరగనుంది. జగిత్యాలలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, నాచుపల్లి జేఎన్టీయూలో రెండు కేంద్రాలు గుర్తించారు. మొత్తం 796 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుంది. పరీక్ష కేంద్రానికి 1.30 గంటల వరకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. హాల్టికెట్, ఆధార్కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, వాటర్బాటిల్కు అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అనమతించరు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా సిటి కో–ఆర్డినేటర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. డివిజన్ స్థాయిలో ప్రజావాణిజగిత్యాల: జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో ఆర్డీవో ఆధ్వర్యంలో డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ లత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 4 నుంచే ప్రారంభమవుతుందని, డివిజన్లకు సంబంధించి ఆర్డీవో నోడల్ అధికారిగా నియమించాని పేర్కొన్నారు. డివిజన్స్థాయి అధికారులు హాజరై వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జిల్లా స్థాయిలో యథాతథంగా జరుగుతుందని పేర్కొన్నారు. -
ధాన్యం తూకంలో జాప్యం చేయొద్దు
మల్యాల/కొడిమ్యాల: ధాన్యాన్ని తూకం వేయడంతో జాప్యం చేయొద్దని కలెక్టర సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని ముత్యంపేటలో కేంద్రాలను శనివారం సందర్శించారు. తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ తిరుపతి, అధికారులు ఉన్నారు. అనంతరం కొడిమ్యాల మండలకేంద్రంతోపాటు గంగారంతండా, చెప్యాలలోని కేంద్రాలను సందర్శించారు. ధాన్యంలో తేమశాతంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీఎస్వో జితేందర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వామి, తహసీల్దార్ నరేష్, ఏపీఎం మల్లేశం, సర్పంచ్ వినోద్, సీసీలు వీరకుమార్, మరియా, రైతులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
కోరుట్ల: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలు చేరుకోవాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. పట్టణంలో శనివారం నియోజకవర్గస్థాయి ప్రజాపాలన ప్రగతి నివేదిక సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి పట్టణం వరకూ చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను వేగంగా పరిశీలించడంతోపాటు అర్హత ప్రమాణాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భూ సమస్యలు, రేషన్కార్డులు, పింఛన్ల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బాలల భద్రత, డ్రగ్స్రహితంపై ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో జీవాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత, కౌన్సిలర్లు, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సర్పంచులు పాల్గొన్నారు. -
ప్రజాపాలనతో సమస్యల పరిష్కారం
ధర్మపురి: ప్రజాపాలన కార్యక్రమంతో సమస్యలకు పరిష్కారం లభిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురిలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని, గత ప్రభుత్వ హయాంలో అందించని పథకాలను కాంగ్రెస్ అందిస్తోందని తెలిపారు. గోదావరి పుష్కరాలకు రూ.450 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపించామన్నారు. తొలి విడుత రూ.115కోట్లు విడుదలైనట్లు తెలిపారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, డిగ్రీ కళాశాల మంజూరైందని, ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. రెండేళ్లలో 474 మంది రైతులకు రైతుబీమా పథకం ద్వారా రూ.18.7 కోట్లు అందించామని వివరించారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ధర్మపురిని టెంపుల్ సిటీగా మార్చుతాం: కలెక్టర్ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని టెంపుల్ సిటీ, మాస్టర్ ప్లాన్ అమలుకు ఫైనల్ అయిందని, త్వరలోనే సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్.దినేష్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య తదితరులున్నారు. -
తూకం సరే.. తరలింపు ఎప్పుడో?
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట, చింతకుంట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. ధాన్యం తేమశాతం పరీక్షించిన నిర్వాహకులు తూకం వేశారు. తూకం వేసిన బస్తాలను వాహనాల్లో రైస్మిల్లులకు తరలిస్తామంటే రైస్మిల్ యజమానులు వద్దని చెప్పినట్లు రైతుల ద్వారా తెలిసింది. దీంతో తూకం వేసిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయాయి. రెండు గ్రామాల కేంద్రాల బస్తాలను తరలించేందుకు మెట్పల్లి మండలం పెద్దాపూర్ రైస్మిల్ కేటాయించారు. ధాన్యం బస్తాలు ఇప్పుడు తీసుకోమని రైస్మిల్ యజమాని చెప్పడంతో నిర్వాహకులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేరే రైస్మిల్ కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికై నా పౌరసరఫరాల శాఖ అధికారులు చొరవ చూపి ధాన్యం బస్తాలు తరలింపు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
పాతాళానికి గంగ
జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో నీటి వినియోగం పెరిగిపోయి భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతి ఇంటికి బోరుబావి ఉండడం.. ఇష్టారీతిన వినియోగిస్తుండడంతో గంగమ్మ క్రమంగా లోతుకు చేరుతోంది. ఏప్రిల్లో మున్సిపాలిటీ పరిధిలో పరిశీలిస్తే జగిత్యాలలో 8.25మీటర్లు, కోరుట్ల 9.62, మెట్పల్లి లో 6.65, రాయికల్లో 3.21, ధర్మపురిలో 5.96 మీ టర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయింది. నాన్ఆయకట్టు ప్రాంతాల్లో.. నాన్ ఆయకట్టు ప్రాంతాలైన మల్యాల, మేడిపల్లి, కథలాపూర్, కొడిమ్యాల, భీమారం మండలాల్లో భూగర్భజలాలు మరింత పడిపోతున్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో జలాలు భారీగా తగ్గుతున్నాయి. మల్యాల మండలంలో 6.96మీటర్లు, కొడిమ్యాలలో 13.03, కథలాపూర్లో 3.42, మేడిపల్లిలో 6.53, భీమారంలో 4.51మీటర్లకు పడిపోయింది. ఒక్క నెలలోనే 0.52 మీటర్లు.. ఒక్కనెలలోనే నీటిమట్టం 0.52మీటర్లకు పడిపోయింది. మార్చిలో 4.98 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఏప్రిల్ చివరినాటికి 0.52 మీటర్లు పడిపోయి ప్రస్తుతం 5.50 మీటర్లకు చేరుకుంది. గతేడాది ఏప్రిల్తో పోల్చితే 0.07 మీటర్లు తగ్గినట్లయ్యింది. ఏప్రిల్ చివరి నాటికి బీర్పూర్ మండలంలో 2.94 మీటర్ల లోతులో నీరు ఉండగా.. 13.03 మీటర్ల లోతులో కొడిమ్యాల మండలంలో నీరు ఉండటం గమనార్హం. ఆయకట్టు మండలాల్లోను అంతంతే ఆయకట్టు మండలాల్లోనూ నీటిమట్టం పడిపోతూనే ఉంది. బుగ్గారం మండలంలో 5.35 మీటర్లు, ఎండపల్లిలో 7.13, గొల్లపల్లిలో 5.05, జగిత్యాల రూరల్లో 3.22, పెగడపల్లిలో 5.10, సారంగాపూర్లో 6.01, వెల్గటూర్లో 3.19, ఇబ్రహీంపట్నంలో 5.19, మల్లాపూర్లో 6.43 మీటర్లలోతుకు జలం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మేలో మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉన్నందున నీటిని పోదుపుగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.జగిత్యాలఅగ్రికల్చర్: రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. వేసవిలో రోజువారి అవసరాలకు నీటి వినియోగం ఎక్కువ కావడంతో నీటిమట్టం లోతుకు చేరుతోంది. కేవలం ఒక్క ఏప్రిల్ నెలలోనే నీటిమట్టం 0.52 మీటర్లు పడిపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక మే నెలలో మరెంత పడిపోతుందోనని ఆందోళన మొదలైంది. బోర్లు తవ్వాలంటే వాల్టా చట్టం ప్రకారం భూగర్భజల శాఖ అనుమతి తీసుకోవాలి. బోరు యంత్రాలు కూడా భూగర్భశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనుమతి లేకుండా తవ్వితే భారీ జరిమానాలు ఉంటాయి. భూగర్భజలాల పరిరక్షణకు ప్రతిఒక్కరూ ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. – శ్రీకాంత్, భూగర్భజల శాఖాధికారి బోర్లకు అనుమతి తప్పనిసరి -
రూ.82 లక్షలు పక్కదారికి యత్నం
రాయికల్: పట్టణంలోని వైకుంఠధామం అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్ కింద మంజూరు చేసిన రూ.82 లక్షలను పక్కదారి పట్టించేందుకు కాంట్రాక్టర్ యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయికల్ బల్దియాకు టీయూఎఫ్ఐడీసీ నిధుల ద్వారా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా రూ.82 లక్షలు ౖవైకుంఠధామానికి కేటాయించారు. ఆ పనులను పూర్తి చేసేందుకు ఆర్అండ్బీ శాఖ టెండర్ చేయడంలో ఆలస్యమైంది. అదే సమయంలో ప్రభుత్వం ప్రతీ మునిపాలిటీకి శ్మశాన వాటికల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ కింద రూ.కోటి మంజూరు చేసింది. రూ.కోటితో టెండర్ పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్ వైకుంఠధామంలో కాంపౌండ్వాల్, బర్నింగ్షెడ్, టాయిలెట్స్ నిర్మాణం, వుడ్ స్టోరేజీ వంటివి నిర్మించి చేతులు దులుపుకున్నాడు. టీయూఎఫ్ఐడీసీ కింద మంజూరైన రూ.82 లక్షల టెండర్ కాగా.. ఆ నిధులన్నీ వృథాగా ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కాంట్రాక్టర్ శ్మశాన వాటికలో సీసీరోడ్ల నిర్మాణం చేసేందుకు అప్పటి కమిషనర్, చైర్మన్ను కోరగా.. వారు తిరస్కరించారు. అవే నిధులతో పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు మళ్లించాలని సంబంధిత కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకురావడంతో కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ రూ.82 లక్షలను పట్టణంలోని కొన్ని కుల సంఘ భవనాలు, ఇతర అభివృద్ధి పనులు చేసుకోవడానికి పట్టణంలోని ఓ కాంట్రాక్టర్ ఫైల్ తయారుచేసి నూతన పాలకవర్గం ఆమోదం కాకముందే పాత కమిషనర్తో ఆమోదించినట్లుగా ఫైల్ క్రియేట్ చేసి ఈ నిధులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నూతన పాలకమండలి చైర్మన్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై కమిషనర్ కీర్తి నాగరాజును ‘సాక్షి’ వివరణ కోరగా వైకుంఠధామం నిర్మాణం కోసం మంజూరైన నిధులు వాటి అభివృద్ధికి కేటాయిస్తామని, మరే ఇతర పనులకు మళ్లించబోమని తెలిపారు. వైకుంఠధామంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి సుందరీకరణ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
జగిత్యాలకు రాం రాం!
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ అంటే ప్రస్తు తం ప్రతీ నోట వినిపిస్తోంది. అవినీతికి కేరాఫ్ జగిత్యాల మున్సిపాలిటీగా ముద్రపడింది. ఇందులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తరుచూ ఫిర్యాదులు చేయడం, అటు ఏసీబీ అధికారులు, ఇటు విజిలెన్స్ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. ప్రతీ శాఖలో రికార్డులు తనిఖీ చేస్తున్నారు. గతంలో కొందరు అధికారులు చేసిన తప్పిదాల వల్ల జగిత్యాల మున్సి పాలిటీపై ఇప్పటికీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శానిటేషన్ విభాగంలో గతంలో జరిగిన డీజిల్ కుంభకోణంతో పాటు, ము న్సిపల్ ట్రాక్టర్లు మాయమైన సంఘటన తెలిసిందే. అలాగే రెవెన్యూ విభాగంలో అసెస్మెంట్కు సంబంధించి అనేక ఆరోపణలొచ్చాయి. ఓ భూమికేసులో మున్సిపల్ కమిషనర్తో పాటు, ఆర్వో సైతం జైలుకెళ్లారు. ఇ లాంటి అవకతవకలు అనేకం జరుగుతుండటంతో కొందరు సీడీఎంఏకు ఫిర్యాదు చేయడంతో వారు సైతం జగిత్యాలపై నిఘా పెట్టారు. ప్రతీ వి భాగంలో అవకతవకలు జరిగినట్లు వెలువడటంతో జగిత్యాల మున్సిపాలిటీపై దృష్టి సారించారు. ఆస్తిపన్ను విషయంలో సైతం ఓ అధికారి సొంతానికి వాడుకున్నట్లు బయటకు రావడంతో ఆ అధికారిని సస్పెండ్ చేసి డబ్బును రికవరీ చేశారు. ఇలా ఒకటే కాకుండా ప్రతీ విషయంలోనూ అవినీతి ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. మ్యూటేషన్లకు సంబంధించి అక్రమాలు, పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం, కార్మికులకు సంబంధించిన పీఎఫ్ పట్టించుకోకపోవడం, ట్రేడ్ లైసెన్స్లు, ఇంజినీరింగ్ సెక్షన్లో వాటర్ చార్జీలు, టెండర్లు సక్రమంగా లేకపోవడం, ముఖ్యంగా మున్సిపల్ కాంప్లెక్స్లకు సంబంధించి టెండర్లు వేయకపోవడం లాంటివన్నింటినీ ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ప్రతీ విభాగానికి సంబంధించిన అన్ని ఫైల్స్ పట్టుకెళ్లడంతో పాటు, ఇంటి అనుమతులతో పాటు, ఇతరాత్ర వాటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫోన్ నంబర్లు సైతం తీసుకెళ్లి వారికి ఫోన్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఏసీబీ అధికారులు వచ్చి 10గంటల పాటు మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించగా మరో వారం రోజుల వ్యవధిలోనే విజిలెన్స్ అధికారులు వచ్చి 17 టీంలుగా విభజించి భవనాల కొలతల్లో తేడాలున్నాయ ని అన్నింటినీ కొలిచి రికార్డు తీసుకెళ్లారు. ఇలా జగిత్యాల మున్సిపాలిటీలో మొదటి నుంచి అవినీతి ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి. బదిలీపై వచ్చేందుకు జంకుతున్న అధికారులు జగిత్యాల మున్సిపాలిటీకి బదిలీపై వచ్చేందుకు అధికారులు జంకుతున్నారు. సీడీఎంఏ నుంచి జగిత్యాల మున్సిపాలిటీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయితే అక్కడిదక్కడే మార్పులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయి. శానిటరి ఇన్స్పెక్టర్ లేకపోవడం, రెవెన్యూ సెక్షన్లో ఆర్వోలు, ఇన్చార్జిలుగా ఉండటం, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ సెక్షన్లలో అనేకంగా ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్కుమార్ సైతం సీడీఎంఏ కమిషనర్కు పోస్టులు భర్తీ చేయాలని లేఖ సైతం ఇచ్చారు. కానీ జగిత్యాల మున్సిపాలిటీ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారడంతో ఒక్క అధికారి సైత ం ఇక్కడకు రావడానికి భయాందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఎక్కడ మాపైన ఆరోపణలు వస్తాయోనని రావడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అధికారుల్లో గుబులు గతంలో జరిగిన సంఘటనలకు మేమెక్కడ బాధ్యులవమవుతామోనని ప్రస్తుతం పనిచేస్తున్న అధికా రులు భయాందోళనకు గురవుతున్నారు. శానిటేషన్లో నాలుగు ట్రాక్టర్లు మాయమైన సంఘటనపై కమిషనర్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తె లిసిందే. అంతేకాక ఇటు ఏసీబీ అధికారులు, అటు విజిలెన్స్ అధికారులు అన్ని ఫైల్స్ తీసుకెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులు నేరుగా సీడీఎంఏకే ఫైల్స్ పంపించనున్నారు. సంబంధిత అధికారులను బాధ్యలను చేసే అవకాశం ఉండటంతో చే య ని తప్పుకు తాము బాధ్యులమవుతామోనని భయా ందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు చొర వ చూపి మున్సిపాలిటీని గాడిలో పడేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నిత్యం ఫిర్యాదులు, అధికారుల దాడుల నేపథ్యంలో జగిత్యాల కమిషనర్గా పనిచేస్తున్న స్పందన బదిలీపై వెళ్లగా నూతన కమిషనర్గా గ్రూప్–1 ఆఫీసర్ సత్యప్రణవ్ నియమితులయ్యారు.ఇక్కడ కమిషనర్గా చేయాలంటే సవాళ్లతో కూడుకున్నదే. గతంలో అన్ని శాఖలో అవినీతి ఆరోపణలు రావడం, ప్రస్తుతం వాటిపై విచారణ చేస్తుండటంతో కమిషనర్గా వచ్చిన వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నూతనంగా వచ్చిన కమిషనర్ అటు అభివృద్ధి వైపు చూడటంతో పాటు, ఇటు ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గాడిన పడేదెలా..మున్సిపాలిటీకి ఇటీవలే కొత్త పాలకవర్గం ఏర్పడింది. చైర్పర్సన్గా సమిండ్ల వాణి కొనసాగుతున్నారు. పూర్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మున్సిపాలిటీని గాడిన పడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉంది. ముఖ్యంగా రెవెన్యూ, శానిటేషన్, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ సెక్షన్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యం
జగిత్యాల: బాలల భరోసా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన మేడేతో పాటు, బాల భరోసా, నశాముక్త్ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరేళ్లలోపు పిల్లలు అంగవైకల్యానికి గురికాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం బాల భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, డ్రగ్స్ రహిత తెలంగాణ ము ఖ్య మంత్రి లక్ష్యమని తెలిపారు. చిన్నారులకు వివిధ పరీక్షలు చేసి లోపాలు ఉంటే వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ అందించి వైకల్యం రాకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18లక్షల చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మేడే సందర్భంగా కార్మిక శాఖ ద్వారా అందుతున్న పథకాలను జిల్లాలోని అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నశాముక్త్ కార్యక్రమంలో భాగంగా జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పో లీసులు కృషి చేయాలని, ఈగల్ టీం పేరుతో ఒక ఐపీఎస్ అధికారిని నియమించి డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ బాలభరోసా పథ కం ఎంతో గొప్పదని, పిల్లల్లో ఉన్న వైకల్యాలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడం జరుగుతుందన్నారు. శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ అనిత రాంచంద్రన్ మాట్లాడుతూ బాల భరోసా పథకం కింద పిల్లలకు వైద్యం నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన కుటుంబా లకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం మేడే సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సత్కరించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, దివ్యాంగుల శాఖ డైరెక్టర్ శైలజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఐసీడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి పరిశీలించారు. ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు పరిష్కరించాం జగిత్యాలటౌన్: తెలంగాణ ఏర్పాటులో కీలక పా త్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్బంగా శుక్రవారం ఆర్టీసీ డిపోలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి జెండా ఆవిష్కరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేవలం మూడు రోజుల్లోనే వారితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించామన్నారు. -
జయంతిని విజయవంతంగా నిర్వహించాలి
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 10నుంచి 12వరకు నిర్వహించనున్న హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల ను సమష్టిగా విజయవంతంగా నిర్వహించాల ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నా రు. శుక్రవారం ఉత్సవాల పోస్టర్ను ఆలయ ఈవో అంజనారెడ్డి, అర్చకులతో కలిసి ఆవిష్కరించారు. పారిశుధ్య కార్మికుల దినసరి కూలీ పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. మరో ఐదు పా రిశుధ్య కార్మికుల పోస్టులు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో నీలం రవి, సర్పంచ్ దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్గౌడ్, స్థానా చార్యులు కపీందర్, ప్రధాన అర్చకుడు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, ఏఈవో హరిహరనాథ్, సూపరింటెండెంట్ సునీల్ పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమానికి కృషికోరుట్ల: కార్మికుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని కటుకం సంఘయ్య ఫంక్షన్హాల్లో కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లోని వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికులకు తన సొంత నిధులతో లేబర్, ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. అనంతరం బ్యాంకు ఎల్డీఎం రామ్ కార్మికులకు చిరు వ్యాపారాలపై అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు గడ్డం మధు, టేకుల నరేశ్, ఫయీం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.డీసీఆర్బీ సీఐకి డీఎస్పీగా పదోన్నతిజగిత్యాలక్రైం: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో డీసీఆర్బీ సీఐగా పనిచేస్తున్న శ్రీని వాస్కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీనివాస్ శుక్రవారం ఎస్పీ అశోక్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేయగా, శ్రీనివాస్కు పదోన్నతి స్టార్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేస్తూ ఎన్నోఏళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి పదోన్నతి గొప్ప గుర్తింపు అన్నారు. గ్రామపంచాయతీలకు నిధుల కేటాయింపు లేదుజగిత్యాలరూరల్: గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. మే డే దినోత్సవం సందర్భంగా శుక్రవారం జగిత్యాలరూరల్ మండలం చల్గల్ గ్రామపంచాయతీ వద్ద పంచాయతీ కార్మికులను సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి వస్తున్న నిధులు తప్ప జీపీలకు రాష్ట్ర ప్రభుత్వ ం నుంచి నిధులు రావడం లేదన్నారు. దీంతో కార్మికులకు వేతనాలు చెల్లింపు పంచాయతీల పై భారం పడుతుందన్నారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు, సర్పంచ్ రాజేందర్ పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా కార్యవర్గం జగిత్యాల: ప్రభుత్వ వైద్యు ల సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అమరేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ముస్కు జైపాల్రెడ్డి, కోశాధికారిగా నవీన్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తామని తెలిపారు. -
ధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండాలి
జగిత్యాల: యాసంగి సీజన్కు సంబంధించి వరిధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. యాసంగి సీజన్కు సంబంధించి దిగుమతుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, కేంద్రాల వద్ద క్లస్టర్స్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ వందశాతం పూర్తి చేయాలి ఫార్మర్ రిజిస్ట్రేషన్ వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ను జూన్ 2లోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈనెల 4నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే ఫార్మర్స్ వీక్ను విజయవంతం చేయాలని తెలిపారు. రైతులకు మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ లత, రాజాగౌడ్ పాల్గొన్నారు. హరితహారానికి నిధుల లేమిధర్మపురి: పల్లెల్లో పచ్చదనం పంచేందుకు ప్రభుత్వం హరితహారం కింద ఏటా నిధులు వెచ్చిస్తుంది. ఇందులో భాగంగా పల్లెల్లో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి అందులో మొక్కలు పెంచుతోంది. గతేడాది పనులు సవ్యంగా సాగినప్పటికీ ఈఏడాది నత్తనడకన సాగుతున్నాయి. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచి జూన్ వరకు హరితహారం కార్యక్రమానికి అందించాల్సి ఉంటుంది. కానీ.. ఈ ఏడాది మున్సిపాలిటీలలో మొక్కలు పెంపకానికే ఇంకా అడుగులు ముందుకు పడలేదు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 2023 నవంబర్ నాటికి నర్సరీల టెండర్లను పూర్తి చేసుకొని డిసెంబర్లో విత్తనాలు పెట్టి మొక్కలను పెంచి జూన్ వరకు అందించారు. ఈ సారి పనులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. నర్సరీల్లో పాత మొక్కలే దర్శనం మున్సిపాలిటీల్లోని నర్సరీల్లో పాత మొక్కలే దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి మార్చి, ఏప్రిల్, మే నెలలో నీరుపట్టి జూన్ వరకు మొక్కలు పెంచి ప్రజలతోపాటు ఆయా విభాగాలకు అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు నర్సరీల వైపు దృష్టి సారించలేకపోయారు. మొక్కుబడిగా పనులు ఈ ఏడాది హరితహారం పనులు మొక్కుబడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నర్సరీల్లో మొక్కలు లేకపోవడంతో జూన్ వరకు హరితహారం కార్యక్రమం ముందుకుసాగే పరిస్థితి లేదు. నర్సరీల్లో పాత మొక్కలే తప్ప కొత్త మొక్కలు కానరావడం లేదు. నిధుల కొరత, కూలీల కొరత, నీటి సమస్య మొక్కల పెంపకానికి అడ్డంకిగా మారాయి.మొక్కల పెంపకం లక్ష్యాలు (2025–2026) బల్దియా లక్ష్యం పాత మొక్కల నిల్వ ధర్మపురి లక్ష 3800 జగిత్యాల 39,000 1,12,500 కోరుట్ల 1,54,300 75,000 మెట్పెల్లి 1,27,400 56,300 రాయికల్ 89,000 3570 -
ఆధునిక సాగు పద్ధతులతోనే రైతులకు మేలు
గొల్లపల్లి(పెగడపల్లి): రైతులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి, శాసీ్త్రయ దృక్పథంతో వ్యవసాయం చేసినప్పుడే అధిక లాభాలు గడించవచ్చని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు స్వాతి, దీపిక సూచించారు. గురువారం పెగడపల్లి మండలం ఎల్లాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో రైతులకు సలహాలు, సూచనలు అందించారు. మార్కెట్లో ఏ వరి రకాలకు అధిక డిమాండ్ ఉందో గమనించి.. వాటిని సాగు చేయడం ద్వారా గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. నేల ఆరోగ్యం క్షీణించకుండా ఉండాలంటే రసాయనిక ఎరువులు, ముఖ్యంగా యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. భూసార సంరక్షణ కోసం పచ్చిరొట్ట పంటలను సాగు చేయాలని వివరించారు. ఏటా ఒకే పంట వేయకుండా పంట మార్పిడి విధానాన్ని పాటించాలని, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు. వరి కోత అనంతరం మిగిలిన పంట అవశేషాలను కాల్చడం ద్వారా నేలలోని మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోతాయని హెచ్చరించారు. వాటిని కాల్చకుండా నేలలోనే కలియదున్నడం ద్వారా భూమికి సహజ సిద్ధమైన బలం చేకూరుతుందన్నారు. పురుగు, తెగుళ్లు, కలుపు నివారణ మందులను వ్యవసాయ అధికారుల సలహా మేరకు నిర్దేశించిన మోతాదులో మాత్రమే వాడుకుంటూ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సబ్సిడీలను రైతులకు వివరించారు. ఆయిల్ పామ్ సాగుకు ఉన్న ఆవశ్యకతను, ఆ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అక్షయ్ కుమార్, ఎల్లాపూర్, రామభద్రునిపల్లి, రాజరంపల్లె, కీచులాటపల్లి గ్రామాల సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, క్లస్టర్ పరిధిలోని రైతులు పాల్గొన్నారు. -
క్రీడా శిక్షణకు వేళాయే
కథలాపూర్(వేములవాడ): గ్రామీణప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకు క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుంచి 31వరకు క్రీడా పోటీలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల మైదానాల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు పీడీలు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులను 12 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. శిబిరాల నిర్వహణ ఇలా.. అథ్లెటిక్స్: ఎండపల్లి జెడ్పీ హైస్కూల్. బ్యాడ్మింటన్: కొడిమ్యాల జెడ్పీ హైస్కూల్, గొల్లపల్లి మండలం చందోలి జెడ్పీ హైస్కూల్. బాస్కెట్బాల్: రాయికల్ మండలం అల్లీపూర్, సా రంగాపూర్ మండలం కోనాపూర్ జెడ్పీ హైస్కూల్. బాక్సింగ్: జగిత్యాలరూరల్ మండలం జాబితాపూర్ ఉన్నత పాఠశాల. తైక్వాండో: మేడిపెల్లి జెడ్పీ హైస్కూల్. వాలీబాల్: వెల్గటూర్ జెడ్పీ హైస్కూల్, కథలాపూర్ జెడ్పీ హైస్కూల్, కోరుట్ల మండలం అయిలాపూర్ జెడ్పీ హైస్కూల్, మెట్పల్లి మినీ స్టేడియం. కరాటే: జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో శిబిరాలుంటాయి. ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది. నేటి నుంచి వేసవి శిబిరాలు జిల్లాలో 12 కేంద్రాల గుర్తింపు -
‘ఉపాధి’లో కూలీల సంఖ్య పెంచాలి
● డీఆర్డీఏ పీడీ రఘువరణ్ రాయికల్: ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. గురువారం మండలంలోని రాజనగర్లో కందకాల పనులు, వన నర్సరీ, గ్రామైఖ్య సంఘం భవన నిర్మాణాలను పరిశీలించారు. ఉపాధి పని ప్రదేశాల్లో సదుపాయాలు కల్పించాలని, సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం కూలీలు పనులు చేయాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 6 గంటల వరకు పనుల్లోకి రావాలని అన్నారు. ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ భారతపు రాజేశ్, ఏపీవో దివ్య, టెక్నికల్ అసిస్టెంట్లు విజయ్, రాజేందర్, పంచాయతీ కార్యదర్శి వెంకటాచలం, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేందర్ పాల్గొన్నారు. -
కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించండి
జగిత్యాలటౌన్: కేంద్రీయ విద్యాలయానికి జిల్లాకేంద్రంలో స్థలం కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రెస్క్లబ్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. జగిత్యాలతోపాటు నిజామాబాద్, వనపర్తికి కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయని, జగిత్యాలలో స్థలమే కేటాయించలేదన్నారు. ఎందుకు జాప్యం జరుగుతుందో అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అడ్లూరి స్థలం కేటాయింపులో జాప్యంపై స్పందించాలన్నారు. ఈనెల 15లోపు స్థలం గుర్తించాలని, లేకుంటే ఆర్డీవో కార్యాలయం ఎదుట ఽనిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, నాయకులు గంగాధర్, ఆముద రాజు, మ్యాదరి అశోక్, రమేశ్ పాల్గొన్నారు. నిరుపేద వైద్యానికి రూ.1.20లక్షల విరాళం ధర్మపురి: ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నిరుపేద విద్యార్థినికి వైద్య ఖర్చుల కోసం ఫేస్బుక్ మిత్రులు స్పందించి రూ.1.20 లక్షలు విరాళాలు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. మండలంలోని తుమ్మెనాల గ్రామానికి చెందిన లింగమల్ల లక్ష్మణ్, సుమిత్ర దంపతులకు ఇద్దరు కూతుళ్లు. లక్ష్మణ్ గ్రామ పంచాయతీలో కాంట్రాక్టు పద్ధతిన పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. చిన్న కూతురు శ్రీహిత (17) ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఐదు నెలల క్రితం అనారోగ్యానికి గురైంది. వైద్యం కోసం సుమారు రూ. 3లక్షల వరకు అప్పు చేశాడు. ప్రస్తుతం శ్రీహిత కోలుకున్నా.. మరో ఐదు నెలలు మందులు వాడాలని, వివిధ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కూతురు వైద్య ఖర్చులు లక్ష్మణ్కు భారం కాగా వీరి విషయాన్ని తెలుసుకున్న సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ ఏప్రిల్ 3న ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఎన్నారైలు, ఇతర దాతలు స్పందించి లక్ష్మణ్ బ్యాంకు ఖాతాకు రూ.1.20 లక్షలు విరాళంగా అందించారు. ఆ సొమ్మును ఎస్బీఐ అధికారుల చేతుల మీదుగా రమేశ్ పంపిణీ చేయించాడు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ నీచ రాజకీయాలుకోరుట్ల: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని బెల్లంపెల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మహిళా ఆక్రోశ సమ్మేళనం నిర్వహించారు. 76 ఏళ్ల నిరీక్షణ తర్వాత మహిళలకు నారీశక్తి వందన్ అధినియం ద్వారా చట్టసభల్లో సముచిత స్థానం లభించిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో వచ్చిన ఈ చట్టంతోలోక్సభ, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించారన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని పలు పార్టీలు ఈ చట్టాన్ని అడ్డుకోవటం సరికాదన్నారు. మహిళల కోసం కేంద్రం అనేక పథకాలు తీసకొచ్చిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూదరి అరుణ, అనూప్ రావు, జగి త్యాల ఇన్చార్జి బోగ ఽశ్రావణి, ఐఎంఏ మహిళా అధ్యక్షురాలు స్వీతీ అనూప్, నాయకులు పిండేరు భానుప్రియ, వడ్డేపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారా యణ, మెట్పల్లి, జగిత్యాల పట్టణ అధ్యక్షులు నవీణ్, కొక్కు గంగాధర్, కోరుట్ల, మెట్పల్లి మున్సి పల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. సామూహిక నిరాహార దీక్షకు తరలిరండిజగిత్యాల:206 సంఘాలతో ఏర్పడిన టీజీఈజేఏసీ విస్తృత సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న సామూహిక నిరాహార దీక్ష చేపడుతున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు అన్నారు. జూన్ 2లోపు పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు ఒకేసారి చెల్లించాలని, హెల్త్కార్డులు అమలు చేయాలన్నారు. దీక్షలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
ఎల్నినో హెచ్చరికలతో నిద్రలేచిన సీఎం రేవంత్
జగిత్యాలటౌన్: ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే భయంతోనే సీఎం రేవంత్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు అంటూ కొత్త ఎత్తులు వేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. 152 మీటర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని 148 మీటర్లకు ఇరు రాష్ట్రాల మధ్యం ఒప్పందం కుదిరిన విషయం తెలిసి కూడా కాలయాపన కోసమే 150 మీటర్ల ఎత్తు అంటూ కొత్త కుట్రకు తెరతీస్తున్నారని విమర్శించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చి 30నెలలు గడిచి, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు తుమ్మడిహట్టి పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఆయన కుటుంబ ఆర్థిక లబ్ధి కోసమే ఫోర్త్ సిటీ అంటున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం గాలికొదిలేశారని తెలిపారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం.. కేసీఆర్ను దోషిగా చూపెట్టడం తప్ప మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోయి 30నెలలు గడుస్తుంటే రేవంత్రెడ్డి ఇప్పుడు నిద్రలేచాడని అన్నారు. మేడిగడ్డకు మరమ్మతు చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఎందుకు పునరుద్ధరణ చేపట్టలేదని ప్రశ్నించారు. ఎల్నినో హెచ్చరికలతో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడి తెలంగాణ ఎడారిగా మారితే దోషిగా నిలవాల్సి వస్తుందన్న భయంతోనే ఎత్తు పెంపు బాధ్యత కేంద్రమంత్రి కిషన్రెడ్డిదే అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు 152మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ను ఒప్పించాలని కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందంలో కేంద్రమంత్రి పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. కిషన్రెడ్డిని బూచిగా చూపి మరింత కాలయాపనకు రేవంత్ కుట్ర చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. మాయమాటలు మానుకుని రాష్ట్రంలో తాగు, సాగునీటి కష్టాలు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, హరిచరణ్రావు, గాజుల రాజేందర్, దేవేందర్నాయక్, సాగర్రావు, సింగరావు తదితరులు పాల్గొన్నారు. జాప్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు కొత్త డ్రామాలు ప్రజల దృష్టి మరల్చేందుకు ఎత్తు పేరుతో కొత్త పల్లవి రేవంత్కు ఫోర్త్ సిటీపై ఉన్న శ్రద్ధ ప్రజాసంక్షేమంపై లేదు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే రేవంత్దే బాధ్యత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి -
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లికి చెందిన బేతి భూమారెడ్డి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా.. గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఏళ్లుగా రేషన్కార్డుల కోసం ఎదురుచూస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచి త విద్యుత్, సన్నబియ్యం అందిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు ము కుందం, గుంటి రవి, దామోదర్, గంగారెడ్డి, మహే శ్, గంగమల్లయ్య, మల్లేశ్, సురేశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
వామ్మో.. ప్రభుత్వ ఆస్పత్రి
జగిత్యాల: అది జిల్లాకేంద్రంలోని అతిపెద్ద జనరల్ ఆస్పత్రి. ఇక్కడ మెడికల్ కళాశాల అందుబాటులోకి రావడంతో రోగులతో నిత్యం కిటకిటలాడుతోంది. కానీ.. ఇంతపెద్ద జనరల్ ఆస్పత్రిలో రోగులకు కావాల్సిన సౌకర్యాలు మాత్రం కరువయ్యాయి. అత్యవసరమైన మందులు సరిపడా లేవు. ఎవరైనా గుండెనొప్పితోనే.. ప్రమాదం జరిగి కాలో, చెయ్యో విరిగినా తీసేందుకు ఎక్స్రే పనిచేయడం లేదు. ఈసీజీకి సంబంధించి పేపర్ అందుబాటులో లేకపోవడంతో ప్రింట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా రోగులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కూడా ఏమీ చేయలేక మొబైల్ ఫోన్లలో ఫొటో తీసి ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే కొంతమంది వద్ద స్మార్ట్ఫోన్లు లేకపోవడం సమస్యగా మారింది. కొన్నిరోజులుగా ఈ సమస్యలు వేధిస్తున్నా.. అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ కనీసం పట్టించుకోకపోవడం శోచనీయం. రోగులు బయటి ఆస్పత్రుల్లో ఎక్స్రే తీయించుకుంటున్నారు. ఈసీజీనీ అక్కడే చేయించుకుంటున్నారు. మందులను ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొంటున్నారు. నిత్యం వెయ్యిమందికి పైగానే.. ఆస్పత్రికి జిల్లాకేంద్రంతోపాటు, ఇతర జిల్లాలు, మండలాల నుంచి నిత్యం వెయ్యి మందికి పైగానే రోగులు వస్తుంటారు. జ్వరం, ఇతరత్రా రోగాలతో బాధపడుతున్న వారు వచ్చి చికిత్స చేయించుకుంటారు. ఏదైనా ప్రమాదం జరిగినా ఇదే ఆస్పత్రికి తీసుకొస్తుంటారు. అయితే రోగులకు కావాల్సిన మందులు, ఈసీజీ ప్రింట్ అవుట్లు, ఎక్స్రే ఫిల్మ్స్ లేకపోవడంతో వైద్యులు బయట తీయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. చిన్నచిన్న మందులకు కూడా ప్రస్తుతం బడ్జెట్ లేక తెప్పించడం లేదని ఆస్పత్రి వర్గాలే పేర్కొంటున్నాయి. కొరత ఉన్న మందులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం అవసరమయ్యే మందులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా స్పిరిట్, కాటన్, లాబెటలాల్, నెపెంటిన్, లివోప్రిన్, బివీవైకై న్, ఎనామిన్, మెపెంట్రినిన్ వంటివాటితోపాటు పారసెట్మల్, ఇతరత్రా మందులు లేకపోవడంతో అత్యవసర సమయంలో రోగులకు ఇబ్బందిగా మారింది. సిబ్బందికి అవసరమయ్యే గ్లౌస్లు లేవని పేర్కొంటున్నారు. సర్జికల్కు సంబంధించిన సామగ్రిని వెంటనే తెప్పించేలా చూడాలని ఆస్పత్రి వర్గాలే పేర్కొంటున్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పనిచేయని ఎక్స్రే ఈసీజీకి ప్రింట్లు కరువు సరిపడా లేని మందులు పట్టించుకోని అధికారులు -
మెట్పల్లి జూనియర్ సివిల్ జడ్జిగా మాధవి
మెట్పల్లి: పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్గా వినుకొండ మాధవి గురువారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న అరుణ్కుమార్ను రంగారెడ్డి జిల్లా అమనగల్లుకు బదిలీ చేసి.. ఆయన స్థానంలో మాధవిని నియమించారు. ఆమెను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి, పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొండగట్టులో పూజలు మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మెట్పల్లి జూనియర్ సివిల్, ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ వినుకొండ మాధవి కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. నీతి ఆయోగ్ రూపొందించిన దివ్య భారత్ నివేదికలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం స్థానం పొందడంపై ఆలయ ఈవో అంజనారెడ్డి, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. -
అందరి కృషితోనే..
అందరి కృషితో మెరుగైన ఫలితాలు సాధించాం. 98.87 శాతంతో రాష్ట్రంలో రెండోసారి నాల్గో స్థానంలో నిలిచాం. ఉపాధ్యాయుల మార్గదర్శకం, తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణంగా నిలిచింది. – సత్యప్రసాద్, కలెక్టర్ ప్రణాళిక ప్రకారం ముందుకు.. పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాం. కలెక్టర్ చొరవ ప్రత్యేకం. ముఖాముఖీ నిర్వహించారు. సబ్జెక్ట్ల వారిగా సలహాలు ఇచ్చారు. వారిలో భయం పోగొట్టారు. – రాము, డీఈవో -
కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతుల ధర్నా
ఇబ్రహీంపట్నం: లారీల కొరత తీర్చాలని, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చే స్తూ.. రైతులు వ్యవసాయ మార్కెట్యార్డు ముందు రోడ్డుపై బైఠాయించారు. 20వేల బస్తాలు ఐదు రోజుల క్రితం కాంటా అయ్యాయయని, లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిపివేశారని, అకాలవర్షం పడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ వరప్రసాద్, ఎస్సై నవీన్కుమార్ రైతుల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు నల్ల రమేశ్, రైతులు పాల్గొన్నారు. -
మండల టాపర్లుగా రైతు బిడ్డలు
ఇబ్రహీంపట్నం: పది ఫలితాల్లో రైతుబిడ్డలు మండల టాపర్లుగా నిలిచారు. గోధూర్కు చెందిన గిన్నె ప్రణిత 578 మార్కులతో మండల టాపర్గా నిలిచింది. తల్లిదండ్రులు రమ, రాజ్కుమార్ వ్యవసాయ చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. అలాగే తిమ్మాపూర్కు చెందిన బోడ హర్షిణి 569 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు సంగీత, శ్రీనివాస్ వ్యవసాయదారులు. బీడీలు చుట్టే సమయంలో తల్లికి తోడుగా వైష్ణవి చేదోడువాదోడుగా నిలుస్తోంది. గిన్నె ప్రణితబోడ హర్షిణి -
ఆర్వోబీ పనుల ఆలస్యంపై మేయర్ ఆగ్రహం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనుల్లో విపరీత జాప్యం పట్ల మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పనులు పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలో గుంతల రోడ్డు, దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూసేకరణ సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో సాగడంలేదన్నారు. ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టు ప్రత్యేక చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నారు. పనులు ప్రారంభించిన ఒక పక్క త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు కొంత ఇబ్బందులను తొలగించాలన్నారు. కార్యక్రమంలో రైల్వే ఏడీఈఎన్ భిక్షపతి, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సంతోష్, సాదినేని మునిందర్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రాయికల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ మండలం అయోధ్య, పట్టణంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అదనంగా మరో రెండు వేల ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, కౌన్సిలర్లు రాకేశ్, పల్లికొండ గంగాధర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్రావు, నాయకులు కోల శ్రీనివాస్, ఏనుగు మల్లారెడ్డి, గన్నె రాజిరెడ్డి, సురేశ్, వినోద్, నర్సయ్య, ముత్తయ్య, మాజీ సర్పంచ్ జీవన్రెడ్డి, ఉపసర్పంచ్ రాజేశం, మాజీ ఎంపీటీసీ రవి పాల్గొన్నారు. -
‘పది’లో ‘అల్ఫోర్స్’ విద్యార్థుల హవా
కొత్తపల్లి(కరీంనగర్): పదోతరగతి 2025–26 వార్షిక పరీక్షల ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులతో హవా కొనసాగించారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించినవారిని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి అభినందించారు. అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కు చెందిన ఆర్.సాత్విక్ 589/600 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఓ.ఆద్య, టి.రాజు, బి.అక్షిత్ రెడ్డి 588 మార్కులు సాధించినట్లు తెలిపారు. 1,274 మందికి 1,026 మంది 500 మార్కులు, ఆపై సాధించడం అభినందనీయమన్నారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా సాధించగా. 334 మంది విద్యార్థులు 560 మార్కులు పైగా సాధించి సత్తాచాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం..
ఎస్.రిశ్వంత్బి.రిషికజి.అనువంశీకఆర్.అనూష్కబి.చరణ్యమల్లాపూర్: మల్లాపూర్ మండలంలో 436మందికి 436మంది ఉత్తీర్ణులైనట్లు ఎంఈవో దామోదర్రెడ్డి తెలిపారు. మొగిలిపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఆర్.అనుష్క(574/600), జి.అనువంశీక(573/600), బి.రిషిక(572/600), రేగుంట జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని బి.లయశ్రీ(571/600), మల్లాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎస్.రిశ్వంత్(570/600), బి.చరణ్య(568/600) మండల టాపర్లుగా నిలిచారు. -
‘కొప్పుల’ను విమర్శించడం మానుకోవాలి
ధర్మపురి: అభివృద్ధి పనులు చేయకుండా.. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ను విమర్శించడం మానుకోవాలని డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి అన్నారు. ధర్మపురిలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా... ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయారని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ కనిపిస్తున్నాయని, కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ పాలనలోనే ప్రతిపాదనలు వచ్చాయన్నారు. గోదావరి పుష్కరాలకు ఏడాది మాత్రమే సమయం ఉందని, ఎక్కడా పని మొదలు పెట్టలేదని పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, నాయకులు అయ్యోరి రాజేష్, బండారి రంజిత్, చిలువేరు శ్యామ్సుందర్ తదితరులున్నారు. ఇసుక మాఫియాపై సస్పెక్ట్ షీట్లుకరీంనగర్రూరల్: ఇసుక అక్రమ రవాణాదారులపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తున్నట్లు కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. బుధవారం ఇసుక అక్రమ రవాణా చేస్తు పట్టుబడిన నగునూరుకు చెందిన వల్లెపు వెంకటేశ్, ఇరుకుల్లకు చెందిన సంకరి శ్రీనివాస్లను తహసీల్దార్ ఎదుట రూ.లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు వివరించారు. అయినా పలుమార్లు ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన బొమ్మకల్కు చెందిన గాలిపల్లి నరేందర్, నేరెల్ల శ్రీనివాస్పై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 16మంది ఇసుక అక్రమరవాణదారులపై సస్పెక్ట్షీట్లు ఓపెన్ చేయడం జరిగిందని, మరోమారు పట్టుబడినట్లయితే పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని సీఐ నిరంజన్రెడ్డి హెచ్చరించారు. పురుడుపోసిన 108 సిబ్బంది ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని కందికట్కూర్ గ్రామంలో బిహార్కు చెందిన భార్యాభర్తలు పూజభవాని, కరంబీర్ నివాసముంటున్నారు. పూజభవాని నిండు గర్భిణి. మంగళవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారమిచ్చారు. ప్రసవం కోసం వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఆశావర్కర్ సాయంతో 108 సిబ్బంది కూనబోయిన రాజశేఖర్, చెరకు దినేశ్ పురుడుపోయగా, మగబిడ్డ జన్మించాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఖేలో ఇండియా ఫుట్బాల్ విజేతగా కరీంనగర్రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఖే లో ఇండియా అండర్–16 బాలికల ఫుట్బాల్ పోటీలు బుధవారం ముగిశాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన పోటీల్లో కరీంనగర్, రంగారెడ్డి జట్లు ఫైనల్స్కు చేరాయి. కరీంనగర్ జట్టు 1–0 తేడాతో ఛాంపియన్గా, రంగారెడ్డి జట్టు రన్నరప్గా నిలిచాయి. క్రీడలకు సమయం కేటాయించాలి క్రీడల కోసం సమయం కేటాయించాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఖేలో ఇండియా పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో ఉన్నతంగా రాణించాలంటే పట్టుదల ముఖ్యమన్నారు. స్థానిక ఠాగూర్ స్టేడియంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. మందమర్రి జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, స్థానిక ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ డాక్టర్ మధుకుమార్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి పాల్గొన్నారు. -
కథలాపూర్లో 99.08 శాతం ఉత్తీర్ణత
కథలాపూర్: మండలంలో 99.08 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. నక్క వేదాక్షరి 563 మార్కులతో మండల టాపర్గా నిలిచింది. మామిండ్ల లాస్యవర్ధిని 562 మార్కులతో ద్వితీయస్థానంలో నిలిచింది. భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్కు చెందిన కూన శ్రీహిత 560, గంభీర్పూర్ జెడ్పీ హైస్కూల్కు చెందిన పోతు మాధవి 560 మార్కులు సాధించారు. మండలంలో 12 ప్రభుత్వ పాఠశాలల నుంచి 436 మంది పరీక్ష రాయగా 432 మంది ఉత్తీర్ణులయ్యారు. తక్కళ్లపెల్లి, బొమ్మెన, కథలాపూర్ గంభీర్పూర్, పోతారం, తాండ్య్రాల జెడ్పీ హైస్కూల్, మోడల్ స్కూల్, కేజీబీవీ వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. తండ్రి వ్యవసాయ కూలీ.. తల్లి టైలరింగ్ నక్క వేదాక్షరి తండ్రి వీవోఏ, వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి టైలరింగ్ చేస్తోంది. ఒకగానొక్క కూతురు వేదాక్షరి మండల టాపర్గా నిలిచింది.కూన శ్రీహితపోతు మాధవిలాస్యవర్ధిని -
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
జగిత్యాలరూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సత్యప్రసాద్ రైతులకు సూచించారు. రూరల్ మండలం చల్గల్, తాటిపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు. పారదర్శకంగా, వేగంగా కొనుగోలు ప్రక్రియ సాగాలని అధికారులను ఆదేశించారు. వాహనాలను మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, షేడ్నెట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాతావరణం మార్పుల దృష్ట్యా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరన్, తహసీల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు. -
ఇంటర్ బోర్డు నిఘా పెట్టాలి
ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరుతో టీచర్లు, అధ్యాపకులను మానసికంగా వేధించడం మానుకోవాలి. సెలవు దినాల్లోనూ పనులు చేయించుకునే పద్ధతికి స్వస్తి చెప్పాలి. టీచర్లు, అధ్యాపకులను బోధనేతర పనులకు ఉపయోగించుకోవడం సరికాదు. వర్క్షాపుల పేరుతో మానసిక ఇబ్బందులకు గురి చేస్తే స హించేదిలేదు. ఇన్ని చేస్తున్నా చాలా విద్యాసంస్థల్లో జీతాలు కూడా సరిగా ఇవ్వ డం లేదు. ఇలాంటి యాజమాన్యాలపై ఇంటర్బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలి. – కె.రాణాప్రతాప్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి -
బతుకు పోరాటం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘మీ ఇంట్లో పిల్లలు ఎంత మంది. ఏం చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారు.. మా పాఠశాల/కళాశాలలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉంటుంది. ఫలితాలు చూడండంటూ’ పేపర్లు చూపుతున్నారు. సీటు ఇప్పుడు కన్ఫార్మ్ చేసుకుంటే ఫీజులో రాయితీ ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. తల్లిదండ్రుల నంబర్లు తీసుకుని రోజూ నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు. తమకు టార్గెట్లు ఉన్నాయంటూ వేడుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు లేక 45 డిగ్రీల సెల్సియస్ ఎండల్లో ఉదయం, సాయంత్రం యాజమాన్యాలు ఇచ్చిన టార్గెట్ల కోసం కష్టపడుతున్నారు. మండే ఎండలు ఒకవైపు, వీధి కుక్కలు మరోవైపు, పిల్లల కోసం తలుపులు తడితే ఛీత్కరించుకునే ఇంటి యజమానుల మాట లను భరించుకుంటూ బతుకు బండి లాగేందుకు ప్రయాసపడుతున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు టీచర్లు. సెలవులు లేని కొలువు పనిచేసేది పాఠశాలలోనైనా సెలవనే మాట ఉండదు. ఆదివారమైనా.. వేసవి సెలవులైనా, పండుగలైనా.. పాఠశాల కోసం పని చేయాల్సిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. యాజమాన్యం ఇచ్చి న టార్గెట్ చేయించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. అందుకే వేసవి సెలవుల్లోనూ ఇంటింటికి తిరుగుతూ ‘మీ పిల్లలను మా విద్యాసంస్థల్లో చేర్పించండి.. ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తాం’ అంటూ తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. మెడపై అడ్మిషన్ల కత్తి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు భారీగా చేయాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆ సంఖ్యను బట్టే జీతా ల చెల్లింపు.. ఇంక్రిమెంట్లు, ఉద్యోగభద్రత ఉంటుందని చెప్పడంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని, ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహించి దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో 15 వేల మందికిపైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా అందరిదీ అదే పరిస్థితి.ఉద్యోగులతో వెట్టిచాకిరీ... అడ్మిషన్ల టార్గెట్లే కాకుండా.. యాజమాన్యాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 10 నుంచి 12గంటలు పని చేయాలని, శని, ఆదివారం, జాతీయ సెలవు దినాలు, పండుగ రోజుల్లోనూ స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదంటున్నారు. టీటీసీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సులు చేసి ఉపాధి కోసం పని చేస్తున్నామని, ఇక్కడ ఉద్యోగ భద్రత లేకపోగా పని ఒత్తిడి చేస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులు కరీంనగర్ 298 6,254 రాజన్న సిరిసిల్ల 132 1,555 పెద్దపల్లి 192 4,224 జగిత్యాల 292 3,480 -
బాలికల భద్రతకు భరోసా
జగిత్యాల: బాలికల భద్రతకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. జిల్లాకేంద్రంలోని ఐడీవోసీలో బాలల భద్రత, డ్రగ్స్ వద్దని చెప్పండి కార్యక్రమంలో భాగంగా మంగళవా రం స్నేహగ్రూప్ కౌమార బాలికలకు అవగా హన కల్పించారు. బాల్య వివాహాలు, టీనేజ్లో గర్భధారణలు, ఎలో ప్మెంట్ కేసులు, ఆన్లైన్ ప్రేమలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు తదితర విషయాల గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజ్కుమార్, డీఆర్డీవో రఘువరన్, డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి, ఎంప్లాయ్మెంట్ అధికారి సత్తమ్మ పాల్గొన్నారు. భగ్గుమంటున్న భానుడు జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45.8 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 45.8, కోరుట్ల, పెగడపల్లి, కొడిమ్యాల మండలం పూడూర్, ఎండపల్లి మండలం గుల్లకోటలో 45.7, ధర్మపురి మండలం జైనా, బీర్పూర్ మండలం కొల్వాయి, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్లో 45.6, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 45.4, బుగ్గారం మండలం సిరికొండలో 45.3, మెట్పల్లి, రాయికల్, గొల్లపల్లిలో 45.1, కోరుట్ల మండలం అయిలాపూర్, అల్లీపూర్లో 45 డిగ్రీల చొప్పున నమోదైందిరాయికల్ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికరాయికల్: రాయికల్ మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులను మంగళవారం ఎన్నుకున్నారు. ముందుగా చైర్మన్ కట్కం రవి, కమిషనర్ కీర్తి నాగారాజు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సభ్యుల మద్దతుతో కో–ఆప్షన్ సభ్యులుగా మాజీ వార్డు మెంబర్ సుధవేని లత, మాజీ కౌన్సిలర్ వల్లకొండ మహేశ్, మైనార్టీ కోటాలో ఇర్ఫాన్ ఆలీ, ఇంతియాజ్పర్వీన్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తాగునీటి సమస్యపై దృష్టిరాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య, పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చైర్మన్ రవీందర్ తెలిపారు. బల్దియా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన మంగళవారం సాధారణ సమావేశం నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ.. అమృత్–2 పనులు పెండింగ్లో ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని, సీసీ రోడ్లకు మరమ్మతు చేపట్టాలని కోరారు. అనంతరం 25అంశాలను ఆమోదించారు. కమిషనర్ కీర్తి నాగరాజు, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కౌన్సిలర్లు ప్రశాంతి, రాకేష్ నాయక్, మానస, మౌనిక, లతిక, గంగాధర్, మహేశ్వరి, గంగలక్ష్మి, శ్రీధర్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు. అంజన్న సన్నిధిలో దేవాదాయ కమిషనర్ పూజలుమల్యాల:కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి వారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు, ధార్మిక సలహాదారు గోవిందహరి దర్శించుకున్నారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శేషవస్త్రంతో ఈవో అంజనారెడ్డి సన్మానించారు. ఏఈఓ హరిహరనాథ్, సూపరింటెండెంట్ సునీల్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, చిరంజీవ స్వామి, స్థానాచార్యులు కంపీదర్ పాల్గొన్నారు. -
శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మెట్పల్లిరూరల్: జగ్గాసాగర్లో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి(కొండస్వామి) బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బండలింగాపూర్లోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఎదుర్కోలుగా తీసుకొచ్చి కల్యాణం జరిపించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్పంచ్ పుల్ల జగన్గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, ఉపసర్పంచ్ లక్మ చిన్నయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లిరాయికల్: మండలంలోని ఇటిక్యాలలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలతో శోభాయాత్రగా రేణుకాఎల్లమ్మ ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించారు. ఆలయంలో పట్నాలు వేశారు. అన్నప్రసాద వితరణ చేశారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.నృసింహుని సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి: శ్రీలక్షీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి జయంత్యోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. -
కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరిబాబు మెట్పల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు సూచించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉందని, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కేంద్రం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజల్లోకి తీసుకపోవాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూదరి అరుణ, అనూప్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి శ్రీనివాస్, నాయకులు ధర్మపురి వేణు, కొయ్యల లక్ష్మణ్, లోలపు అనిల్ తదితరులున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా నవీన్ బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకులు దొనికెల నవీన్ను నియమించారు. నియామక పత్రాన్ని యాదగిరిబాబు అందించారు. నవీన్ గతంలో ఏబీవీపీ, బీజేవైఎంలో పలు పదవులు నిర్వహించారు. పట్టణంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. -
మక్కల కొనుగోలులో కొర్రీలు
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్లో రైతులు పండించిన మక్కలను కొంటున్న మార్క్ఫెడ్ సంస్థ.. రైతులకు అనేక కొర్రీలు పెడుతోంది. ఫలితంగా కష్టపడి పంట పండించినప్పటికీ అమ్ముకునేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వంతో పోరాడే మార్గం లేకపోవడం.. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి యాసంగి సీజన్లో జిల్లాలో దాదాపు 46,298 ఎకరాల్లో సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన దాదాపు 16 నుంచి 18 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400కాగా.. బహిరంగ మార్కెట్లో క్వింటాల్కు రూ.1800గా ఉంది. రైతుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. గతంలో లేనివిధంగా మార్క్ఫెడ్ లేనిపోని కొర్రీలు పెడుతోంది. ఫలితంగా మద్దతు ధర రైతులకు అందకుండాపోతోంది. తక్కువ ధరకు దళారులకు విక్రయం నిబంధనలు తెలియని రైతులు పంటను కేంద్రంలో పోస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు వచ్చి ఇన్ని నిబంధనలు చెప్పేసరికి నోరెళ్లపెడుతున్నారు. అక్కడ 25 క్వింటాళ్లు విక్రయించి మిగిలిన పంటను దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇలా లేనిపోని నిబంధనలతో చాలా మంది రైతులు ఇప్పటికే క్వింటాల్కు రూ.1800 నుంచి రూ.1900 చొప్పున కోళ్ల ఫారాలు, వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1.50లక్షల క్వింటాళ్ల మక్కలు కొన్నప్పటికీ ఒక్క రైతుకు కూడా రూపాయి జమ చేయలేదు. డబ్బులు రావాలంటే 15 నుంచి నెలరోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. నత్తనడకన కొనుగోళ్లు మక్కల కొనుగోళ్లు నత్తనడకన నడుస్తున్నాయి. రోజు 40 నుంచి 50 లారీల మక్కలు కొంటున్నట్లు అధికారులు చెబుతున్నా అన్ని కేంద్రాల్లో భారీగానే పేరుకుపోతున్నాయి. మార్క్ఫెడ్కు ఊహించని రీతిలో మక్కలు వస్తుండటంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. మక్కలను నిల్వ చేసేందుకు గోదాంలు దొరకకపోవడంతో తూకం వేసిన బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయి. పంట ఎంతొచ్చినా.. కొనేది 25 క్వింటాళ్లే! మొక్కజొన్న ఎకరాన 40 క్వింటాళ్ల దిగుబడి విధి లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతులు మక్కలు పండించినట్లు పోర్టల్లో ఉంటేనే కొనుగోలు25 క్వింటాళ్లే కొనుగోలు మక్కలను మార్క్ఫెడ్కు అమ్మాలంటే ముందుగా పంట సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ పోర్టల్లో నమోదు చేసి ఉండాలి. ఇన్ని ఎకరాల్లో వేసినట్లు ఏఈవోలకు సమాచారం ఇవ్వకపోయినా.. ఒకవేళ ఏఈవో ఏదో కారణంతో నమోదు చేయకపోయినా ప్రస్తుతం అమ్ముకునే పరిస్థితి లేదు. ఎకరాకు ఎన్ని క్వింటాళ్లు పండించినా 25 క్వింటాళ్లే కొంటున్నారు. రైతులు ఇతర రైతుల పేర్లపై నమోదు చేయించుకుని పంటను విక్రయించుకో వాల్సిన దుస్థితి వచ్చింది. పైగా రైతు విక్రయించే సమయంలో వేలిముద్ర తప్పనిసరి చేయడం రైతులను మరింత క్షోభకు గురిచేస్తోంది. -
ఆలయాల అభివృద్ధికి కృషి
ధర్మపురి: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని సోమవారం కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్, దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలి కా రు. గోదావరి పుష్కరాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ధర్మపురితో పా టు భద్రాచలంలోని శ్రీరామచంద్రస్వామి, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర, బాసరలోని సరస్వతీ అమ్మవారి ఆలయాలను అభివృద్ది చేస్తామన్నారు. ధర్మపురిలో మాస్టర్ప్లాన్ అమలు నృసింహస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ అమలు చేయాలని, ఇందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి అధికారులను ఆదేశించారు. 1400 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మపురిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ అన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, ము న్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, దేవస్థానం ఈవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, గడ్డం వివేక్వెంకటస్వామి -
తిప్పలు పెడుతున్నారు
మక్కలు కొంటామంటూనే లేనిపోని నిబంధనలు పెట్టి రైతులను తిప్పలు పెడుతున్నారు. పంట పండించడం ప్రభుత్వ దృష్టిలో తప్పుగా మారింది. 40 క్వింటాళ్లు పండిస్తే 25 క్వింటాళ్లు కొంటామనడం ఎంతవరకు సబబు..? ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి రైతులకు అండగా నిలవాలి. – పన్నాల తిరుపతి రెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకుడుప్రభుత్వ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే మక్కలు కొంటున్నాం. కొనుగోలు చేసిన మక్కలను నిల్వ చేసేందుకు గోదాంలను పరిశీలిస్తున్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తాం. ఎండీ.హబీబ్, జిల్లా మార్క్ఫెడ్ అధికారి -
హిందూ ధర్మ సంరక్షణకు పాటుపడాలి
రాయికల్: హిందూధర్మ పరిరక్షణకు హిందువులంతా ఐకమత్యంగా పాటుపడాలని అభయ హిందూ సేవా ఫౌండర్, భగవద్గీత ప్రచారకులు రాధామనోహర్ దాస్ పిలుపునిచ్చారు. పట్టణంలో మంగళవారం రాత్రి నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచమొత్తం మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని, మన ఆచార సంప్రదాయాలను అలవర్చుకుంటున్నాయని తెలిపారు. అలాంటి దేశాన్ని కొన్ని దుష్టశక్తులు విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని కోరారు. ఆవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్టేనన్నారు. అనంతరం గోపూజ చేశారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భజన సంకీర్తనలతో పట్టణం మారుమోగింది. తెలంగాణ ప్రాంత గ్రామ వికాస ప్రముఖ్ జిన్నా సత్యనారాయణ రెడ్డి, మచ్చ జ్యోత్స్న, హిందూ సమ్మేళన్ అధ్యక్షులు ఎలగందుల రమేశ్, ప్రధాన కార్యదర్శి దాసరి గంగాధర్, భక్తులు పాల్గొన్నారు. ఆవుకు పూజ చేస్తున్న రాధామనోహర్ దాస్ హారతులు ఇస్తున్న మహిళలు ఆవులో సకల దేవతలు భగవద్గీత ప్రచారకులు రాధామనోహర్ దాస్ -
ఎస్పీని కలిసిన మెట్పల్లి సీఐ
జగిత్యాలక్రైం: మెట్పల్లి సీఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సురేశ్బాబు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాలజోన్: కోర్టుల్లో పెండింగ్ కేసులు తగ్గించేందుకు జడ్జిలు కృషి చేస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. జిల్లా మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజకోహిర్కర్ గోదావరిఖని కోర్టుకు బదిలీ కాగా.. ఆమెకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ.. శ్రీనిజ తన మూడేళ్ల పదవి కాలంలో 1076 కేసులు పరిష్కరించారని తెలిపారు. కోర్టు బెంచ్కు న్యాయవాదులు, పోలీసులు సహకరించడంతోనే కేసులు పరిష్కారమయ్యాయని శ్రీనిజ పేర్కొన్నారు. సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ, రెండో అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ఉపాధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి అందె మారుతి పాల్గొన్నారు. అడవి జంతువులకు ప్రాణహాని తలపెట్టొద్దుజగిత్యాలక్రైం: వన్యప్రాణులకు ప్రాణ హాని తలపెడితే క్రి మినల్ కేసులు న మోదు చేస్తామని అటవీ శాఖ అధి కారి రవిప్రసాద్ తెలి పారు. సోమవారం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో రైతు భూక్య రవి తన వరిపంటను రక్షించుకునేందుకు ఈనెల 21న విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడని, విద్యుత్షాక్ తగిలి రెండు అడవి దున్నలు మృతిచెందాయని పేర్కొన్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారని, కొంత భాగం దహనం కాకపోవడంతో అసలు విషయం వెలుగుచూసిందన్నారు. ఈ మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేశామన్నారు. రేచపల్లి బీట్ ఆఫీసర్ గోపాల్, సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్పై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామన్నారు. వన్యప్రాణులను కాపాడాల న్నారు. గ్రామాల్లోకి వస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. రాయికల్: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ఆత్మ చైర్మన్ గంగారెడ్డి అన్నారు. మండలంలోని ఇటిక్యాలలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ సాయిరెడ్డి, ఆర్ఐ దేవదాసు, కార్యదర్శి రాజేశ్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరిస్తున్నాంజగిత్యాలక్రై ం: ఎస్పీ కార్యాలయానికి వస్తున్న బాధితుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించగా.. 14మంది అర్జీలు సమర్పించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడారు. చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. -
మెట్పల్లి కాంగ్రెస్లో సీనియర్ నాయకుల తిరుగుబాటు
మెట్పల్లి: కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు వ్యవహారశైలిపై మెట్పల్లికి చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకులు బహిరంగంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించడం హస్తం గూటిలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగం కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎర్రొల హన్మాండ్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బర్ల సాయన్న, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ యామ రాజయ్య, మాజీ కౌన్సిలర్ ఎండీ.షాకీర్, మాన్కల గంగాధర్, అందె మారుతి, మారంపల్లి శంకర్, ఎలాల సంతోష్రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నర్సింగరావు వైఖరిని వారు తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీలో సీనియర్లను ఏమాత్రం లెక్క చేయడం లేదని, ఆర్థికంగా బలంగా ఉన్న వారిని మాత్రమే చుట్టూ పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నామినేటేడ్ పోస్టుల విషయంలో కాంగ్రెస్ కేడర్ను విస్మరిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను తొందరలోనే అధిష్టానం దృష్టికి తీసుకపోతామని స్పష్టం చేశారు. అసంతృప్తికి కారణాలివే.. ఎదురుదాడికి సిద్ధమవుతున్న జువ్వాడి మద్దతుదారులు -
రాష్ట్రం సాధించిన నేత కేసీఆర్
జగిత్యాల: కుట్రలు, కుతంత్రాలను ఎదురించి ప్రజలందరినీ ఏకం చేసి రాష్ట్రం సాధించిన నేత కేసీఆర్ అని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, దేవేందర్నాయక్, కేసరిబాబు పాల్గొన్నారు. జీవన్రెడ్డి స్వగృహంలో... మాజీమంత్రి జీవన్రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుర్గయ్య, హరిచరణ్రావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రమణ క్యాంప్ కార్యాలయంలో... ఎమ్మెల్సీ ఎల్.రమణ క్యాంప్ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
స్వీయ గణన ప్రారంభం
జగిత్యాల: జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ సోమవారం ప్రారంభమైనట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జనగణన రెండు విడుతలుగా ఉంటుందని, మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన, రెండో విడతలో జనాభా గణన ఉంటుందన్నారు. మే 10 వరకు స్వీయగణనకు అవకాశం ఉందన్నారు. అవగాహన కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇంధన వనరులు నిల్వ ఉంచితే చర్యలు ఇంధన వనరులు నిల్వ ఉంచితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. పెట్రోల్బంక్ యజమానులు, సేల్స్ ఆఫీసర్లతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. పెట్రోల్ కొరత లేకుండా చూడాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బాలల భద్రత, డ్రగ్స్ రహిత పోస్టర్ ఆవిష్కరించారు. మే 2 వరకు వారం పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
మొన్న ఏసీబీ, నేడు విజిలెన్స్..
● 20 మంది బృందంతో రాక ● 7 టీంలతో అసెస్మెంట్ల కొలతలు జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో అటు ఏసీబీ, ఇటు విజిలెన్స్ అధికారులు తనిఖీలతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవలే సుమారు 20 మంది ఏసీబీ అధికారులు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు రికార్డులు పరిశీలించారు. అధికారుల వివరాలు తీసుకుని వెళ్లారు. వాటిపై విచారణ సాగుతోంది. తాజాగా మళ్లీ విజిలెన్స్ అధికారులు సోమవారం ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు తనిఖీ లు చేపట్టారు. గతంలో టౌన్ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజనీరింగ్ సెక్షన్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రికార్డులు తీసుకెళ్లారు. తాజాగా 20 మంది విజిలెన్స్ అధికారులు రాగా.. ఏడు టీంలతో తనిఖీలు చేపట్టారు. భవనాల అసెస్మెంట్ల కొలతలు ఏడు బృందాలు.. 60 మందితో మున్సిపల్ పరిఽ దిలోని పలు ప్రాంతాల్లో పలు భవనాలకు మళ్లీ కొలతలు చేపట్టారు. కొన్ని భవనాల పన్నుల్లో అవకతవకలు జరిగాయని, వారు జాబితా తీసుకుని వచ్చారు. అందులో ఉన్న భవనాలకు వెళ్లి వాటి కొలతలు చేపట్టారు. మున్సిపాలిటిలో ఉన్న వివరాలు, భవన వాస్తవ పరిస్థితుల మధ్య తేడాలను గుర్తించారు. ఆదిలాబాద్లో జోనల్స్థాయి శాస్త్రవేత్తల సమావేశాలుజగిత్యాలఅగ్రికల్చర్: పొలాస జోనల్ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల సమావేశాలను ఆదిలాబాద్లో ఈనెల 28న నిర్వహిస్తున్నారు. వానాకాలం, యాసంగిలో సాగు చేయాల్సిన పంటలు, తెగుళ్లపై చర్చించనున్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్కుమార్ శర్మ అధ్యక్షతన జరగనున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన, విస్తరణ డీన్లు పాల్గొంటారు. -
రూ.కోటి విరాళం
కలియుగ ఇష్టదైవమైన శ్రీపద్మావతి సమేతవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించాం. మాది సామాన్య రైతు కుటుంబం. స్వామివారి ఆశీస్సులతో నా వంతుగా స్వామివారి ఆలయ నిర్మాణానికి రూ.కోటి వెచ్చించిన. ప్రస్తుతం అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. – మరాటి సత్తయ్య, లంబాడిపల్లి దాతలు సహకరిస్తున్నారు దాతల సహకారంతో శ్రీరామ మందిర నిర్మాణం చేపడుతున్నాం. రూ.2కోట్ల అంచనాతో పనులు ప్రారంభించాం. చాలామంది దాతలు ముందుకొస్తున్నారు. వారంరోజుల్లోనే రూ.40లక్షలు విరాళాలు సేకరించాం. నిర్మాణాలకు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తుండడం అభినందనీయం. – జనార్ధన్ రెడ్డి, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ఆలయాలతో ఆధ్యాత్మికత ఆలయాల నిర్మాణంతో హిందూ సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణతోపాటు, ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పూజలతో ప్రజల్లో మానసిక ప్రశాంతతతోపాటు, శాంతియుత జీవన విధానానికి తోడ్పడుతుంది. సామూహిక పూజా కార్యక్రమాలతో ప్రజల్లో ఐక్యత పెంపొందుతుంది. ప్రణీత్ శర్మ, పురోహితులు, మల్యాల -
చెరువులపై ఫోకస్
జగిత్యాల: గతంలో హైదరాబాద్లో చెరువులు, కుంటలు కబ్జాకు గురికావడంతో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు. చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపునకు ఏర్పాటు చేసిన హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో టౌన్ప్లానింగ్, రెవెన్యూ ల్యాండ్ సర్వే అధికారులు, మండల పరిధిలో రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, వాగులు, కుంటలను క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్నారు. కమిటీ పరిశీలన మేరకు.. ప్రభుత్వం ఒక ఫార్మట్ ఏర్పాటు చేసి దాని ఆధారంగా నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువులు, కుంటలు, వాగులను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, వాగులను గుర్తించి వాటి ఫొటోలు తీసి ఎంత విస్తీర్ణం, ఆక్రమణకు ఎంత గురైందో నివేదిక పంపించేలా నమూనా జారీ చేశారు. నమూనా ఫాంలో మండలం, విలేజ్, ట్యాంక్, గుర్తించిన తేదీ, ఎంకై ్వరి చేసిన తేదీలను అధికారులకు పంపించాలి. ఇందులో ఫారెస్ట్, తహసీల్దార్, మండల సర్వేయర్, ఎంపీడీవో, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొంటారు. అధికారులు ఏ మేరకు కబ్జాకు గురయ్యాయో వాటిని వివరంగా తీసుకుని జిల్లా ల్యాండ్ సర్వే అధికారులకు పంపిస్తారు. ఇప్పటికే తహసీల్దార్ల ఆధ్వర్యంలో చెరువులను వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని గుర్తిస్తున్నారు. మున్సిపాలిటీలు, మండలస్థాయిలో ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు హద్దులు గుర్తిస్తున్నారు. హైడ్రా తరహాలో అమలయ్యేనా..? జిల్లా కేంద్రంతో పాటు, వివిధ మండలాలు, గ్రామాల్లోని 740 చెరువులు చాలా వరకు కబ్జాకు గురైనవే ఉన్నాయి. వాటికి హద్దులు లేకపోవడంతో ఇష్టానుసారంగా చెరువుల చుట్టే నిర్మాణాలు చేపట్టారు. కొందరు బఫర్ జోన్ పరిధిలో ఇళ్లు సైతం నిర్మించారు. మున్సిపాలిటీల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సైతం భూములకు అత్యధికంగా రేట్లు పలకడంతో చెరువులకు సంబంధించిన భూములపై ఆక్రమణదారుల కన్నుపడి అవి కుదించుకుపోతున్నాయి. దీంతో వరదలు వచ్చినప్పుడు కాలనీలను నీళ్లు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేయడంతో హైడ్రా తరహాలో అమలైతే చెరువులు మళ్లీ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. హైడ్రా తరహాలో అమలు చేయాలని ప్రజలు సైతం కోరుతున్నారు. -
పెద్దమ్మ తల్లికి బోనం
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలో పెద్దమ్మ తల్లికి ముదిరాజ్ కులస్తులు ఆదివారం బోనాలు చేశారు. ఐదేళ్లకోసారి పెద్దమ్మ తల్లిని అద్దకం కోసం రెండు వారాల క్రితం ఆలయం నుంచి సంఘం భవనానికి తీసుకొచ్చారు. అద్దకం చేసిన తర్వాత పోతరాజుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా గ్రామశివారులోని అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించారు. సర్పంచు బద్దం గోపి, టీజేఎస్ కోరుట్ల ఇన్చార్జి కంతి మోహన్రెడ్డి, మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, ఉపసర్పంచ్ నాంపెల్లి రమేశ్, మెట్పల్లి సీఐ సురేష్బాబు, ఎస్ఐ నవీన్కుమార్, ముదిరాజ్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
స్వీయగణనకు సిద్ధంకండి
మల్లాపూర్: జనగణనకు తొలిఘట్టం ప్రారంభమయింది. కేంద్రప్రభుత్వం ప్రజలకు స్వీయగణనకు అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను మే10వ తేదీ వరకు చేసుకోవచ్చు. ప్రజలే స్వయంగా తమ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. తద్వారా జనగణన కు సమయం ఆదా అవుతుందని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో చేపట్టనున్న జనగణన కోసం అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమవుతోంది. జనగణనలో పాల్గొననున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతోపాటు ఇతర సిబ్బందికి గణనపై పూర్తి అవగాహన ఉండేలా శిక్షణ ఇస్తోంది. ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు తీయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా 2021లో జనగణన సాధ్యపడలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్క చేపట్టాలని భావించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందులో భాగంగా గతంలో మ్యానువల్ పద్ధతిలో ఈ జనాభా లెక్కలను సేకరించగా.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ ఈ సారి డిజిటల్ విధానంలో జనగణన ఉండనుంది. అలాగే ప్రజలే నేరుగా తమ వివరాలను సులువుగా నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. స్వీయ గణనలో నమోదు ఇలా.. ఈ జనగణనలో ప్రజలే నేరుగా పాల్గొనే సౌకర్యం ఉంది. ఇటీవల జరిగిన అధికారుల శిక్షణలో స్వీయ నమోదులోనే తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఉద్యోగి తమకు తెలిసిన 10 నుంచి 15 మందికి స్వీయగణనపై వివరాలు వెల్లడించి నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఈ స్వీయ నమోదులో మొదటగా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన https-://se.census.gov.in లోకి వెళ్లాల్సి ఉంది. మొబైల్స్, కంప్యూటర్ల ద్వారా వివరాల నమోదు వెసులుబాటు కల్పించిన కేంద్రప్రభుత్వం ఈ నెల 26 నుంచి మే 10 వరకు అవకాశం -
విరాళాలతో ఆలయాలు
మల్యాల: మల్యాల మండలంలో ఆధ్యాత్మిక పరిమళాలు విరబూస్తున్నాయి. ఊరూరా ఆలయాల నిర్మాణాలతో ప్రజల్లో భక్తిభావం పెంపొందుతోంది. ఇప్పటికే కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. ఇదేక్రమంలో ఆలయాల నిర్మాణాలకు దాతలు తమ శక్తిని మించి విరాళాలు అందిస్తున్నారు. గ్రామాల్లో ఆలయాల నిర్మాణాల కోసం విశ్రాంత ఉద్యోగులు, నాయకులు చొరవ తీసుకుంటూ నిర్మాణాలకు బాటలు వేస్తున్నారు. రూ.కోటితో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం లంబాడిపల్లి గ్రామంలో అదే గ్రామానికి చెందిన మరాటి సత్తయ్య తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.కోటి వెచ్చించారు. ప్రజలను ఆధ్యాత్మికతవైపు నడిపించేందుకు శ్రీపద్మాసమేత ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టారు. వివిధ గ్రామాల నుండి తరలివస్తున్న భక్తులతో లంబాడిపల్లిలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఇంకా ఆలయ అభివృద్ధికి దాతలు సహకరిస్తున్నారు. ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన మిట్టపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సుమారు రూ.80లక్షలతో అయ్యప్పక్షేత్రం నిర్మించారు. శ్రీదత్తాత్రేయ సాయి ఆలయానికి రూ.50లక్షలు, పోచమ్మ ఆలయానికి రూ.60లక్షలు వెచ్చించారు. మార్కండేయ ఆలయం, శివాలయాల అభివృద్ధికి రూ.30లక్షలు వెచ్చించారు. రామగిరి శ్రీరామ మందిరం రూ.2కోట్లతో నిర్మిస్తున్నారు. మానాల గ్రామంలో నల్లగుట్ట శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు గండ్ర రాఘవేంద్రరావు సుమారు రూ.30లక్షలతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మరో రూ.50లక్షలతో అభివృద్ధి చేస్తున్నారు. తాటిపల్లి శివారులో మల్లెగట్టు మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని సుమారు రూ.25లక్షలతో నిర్మించారు. పోచమ్మ ఆలయాలు, హనుమాన్ ఆలయాల పునరుద్ధరణ చేపడుతున్నారు. ఆలయాల అభివృద్ధికి స్థానికులు విరాళాలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండడంతో ఊరూరా పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం కొనసాగుతోంది. రూ.2కోట్లతో రామమందిర నిర్మాణం.. మండలకేంద్రంలో శ్రీరామమందిర నిర్మానానికి విశ్రాంత ఉద్యోగి ఎల్లాల జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణ కమిటీ ఏర్పాటు చేశారు. దాతల నుండి విరాళాలు సేకరిస్తున్నారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు స్థానికులతో గల్ఫ్లో ఉన్న స్థానికుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న నిర్మాణాలు విరబూస్తున్న ఆధ్యాత్మిక పరిమళాలు -
సత్యనారాయణ వ్రతాలు
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అన్నివర్గాల ప్రజలు వ్రతంలో పాల్గొంటారని, ఐక్యత, సమరసతతోపాటు భక్తి భావాన్ని పెంపొందించేందుకే ఈ వ్రతాలు నిర్వహిస్తున్నామని ఆవాసం కమిటీ అధ్యక్షుడు జిడిగె పురుషోత్తం తెలిపారు. సుమారు 200 జంటలు పాల్గొన్నాయి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంచాలక్ భీమనాతిని శంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, చిత్తారి మధుకర్, సురేష్, అశోక్రావు, అవాస ప్రముఖ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. ఆదివారం సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలో గోపినేని రాజమల్లు, లావణ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్రామగ్రామాన పండుగలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయయని, పట్టణంలో 4500 డబుల్ బెడ్ రూం నిర్మించామని పేర్కొన్నారు. నిరుపేదలకు నూతన రేషన్ కార్డు మంజూరు చేసి సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. సర్పంచ్ చెట్లపల్లి రమ, శంకర్ రెడ్డి, రాజు, మాజీ సర్పంచ్లు రమణరావు, శేఖర్ గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కొండగట్టు నిత్యాన్నదాన సత్రానికి రూ.లక్ష విరాళంమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలోని నిత్యాన్నదాన సత్రానికి హన్మకొండకు చెందిన భక్తులు కె.వినయ్కుమార్, కీర్తన దంపతులు విరాళం ఇచ్చారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారి హరిహరనాథ్కు రూ.లక్ష విరాళం అందించారు. ఆలయ సూపరింటెండెంట్ ఉపాద్యాయుల చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. వాసవీమాత ఆశీస్సులు అందరిపై ఉండాలిజగిత్యాలటౌన్: ధర్మం, అసింహ, సమానత్వం ప్రపంచానికి తెలియజేసిన వాసవీమాత ఆశీస్సులు అందరిపై ఉండాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన వాసనీమాత జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో రవికుమార్, కో–ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పదోన్నతితో బదిలీ చేపట్టాలిరాయికల్: ప్రభుత్వ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం రాయికల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బదిలీ ప్రక్రియను జాప్యం లేకుండా జూలైలో చేపట్టాలని, అర్హులకు పదోన్నతి కల్పించాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి పీఆర్సీ అమలు చేయాలని కోరారు. మే 5న జిల్లాకేంద్రంలో చేపట్టే నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేష్, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లె చిన్నయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అంగడి రవీందర్, కన్వీనర్ ముక్కెర శేఖర్, నాయకులు రాజ్ కిశోర్, రమేశ్, సత్యనారాయణ, నాగభూషణం, సురేష్, మధు మండల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, టీఆర్టీఎఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని గ్రామాల్లో సోమవారం నుంచి మే 23 వరకు రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లాలోని 64 గ్రామాలను ఎంపిక చేశారు. గతేడాది నిర్వహించిన గ్రామాల్లో కాకుండా ఈ ఏడాది కొత్త గ్రామాలను గుర్తించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందం 8 గ్రామాల్లో రైతులతో చర్చావేదికలు నిర్వహించనుంది. ఒక్కో బృందంలో వ్యవసాయ శాస్త్రవేత్తతోపాటు మండల వ్యవసాయ అధికారి, ఏఈవో, వ్యవసాయ విద్యార్థి ఉండనున్నారు. కార్యక్రమాన్ని పరిశీలించేందుకు నోడల్ అధికారిగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అధికారి కె.రాజేశ్ను నియమించారు. డీఏవో భాస్కర్ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించనున్నారు. సాగు విషయాలు తెలియజేసేందుకు.. పంటల సాగులో రైతులు చేస్తున్న తప్పులు, సాగు ఖర్చు తగ్గించుకునే పద్ధతులు, ఎలాంటి పంటలు పండించాలి..? మార్కెటింగ్ వ్యూహాన్ని ఎలా అమలు చేయాలి..? వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇలా సాగు సంబంధిత విషయాలపై రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా వానాకాలంలో దొడ్డురకం ధాన్యం తగ్గించి సన్నాలు పండించాలని రైతులను కోరనున్నారు. రసాయన ఎరువులను వీలైనంతగా తగ్గించి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించేలా చర్చావేదికలు నిర్వహించనున్నారు. పంట మార్పిడితో ఎలాంటి లాభాలు ఉన్నాయో వివరించనున్నారు. సాగు నీటిని ఉపయోగించే పద్ధతులు, భూసార పరీక్షలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. ప్రధానంగా విత్తనోత్పత్తితో కలిగే లాభాలు, విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడే విషయాలపై చర్చించనున్నారు. నేటినుంచి జిల్లాలోని 64 గ్రామాల్లో సమావేశాలు శాస్త్రవేత్తలు, అధికారులతో 8 బృందాల ఏర్పాటు -
పొంచి ఉన్న జలగండం
జగిత్యాల: జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై గాంధీనగర్ సమీపంలో వంతెన నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగా రోడ్డును తవ్వారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రం శివారులోని ధర్మసముద్రం ఫిల్టర్ బెడ్ నుంచి జగిత్యాలలోని మూడు వాటర్ ట్యాంక్లకు వెళ్లే మెయిన్ పైప్లైన్ పగిలిపోయింది. ఫలితంగా పట్టణానికి నీటి సరఫరా బంద్ అయింది. ప్రస్తుతం ధరూర్ క్యాంప్లో ఉన్న మరో ఫిల్టర్బెడ్ నుంచి రెండు ట్యాంక్ల నుంచి మాత్రమే పట్టణానికి నీరు సరఫరా అవుతోంది. మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోవడంతో ధర్మసముద్రం నీటినే ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. ఇందులో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది. మిషన్ భగీరథ మెయిన్ పైప్లైన్కు వెంటనే మరమ్మతు చేయకుంటే.. వేసవి గట్టెక్కడం కష్టతరంగానే మారనుంది. ● వరప్రదాయిని ధర్మసముద్రం జగిత్యాల పట్టణవాసులకు ధర్మసముద్రం చెరువు వరప్రదాయిని. మిషన్ భగీరథ లేకముందు ఈ చెరువు నుంచే అక్కడున్న ఫిల్టర్బెడ్ ద్వారా కొత్తబస్టాండ్, హౌసింగ్బోర్డు కాలనీ, తీన్ఖని, విద్యానగర్ ప్రధాన ట్యాంకులకు నీటిని సరఫరా చేశారు. మిషన్భగీరథ నీరు సరఫరా అవుతుండడంతో చెరువు నీటితో అవసరం లేకుండాపోయింది. ఎప్పుడైనా సమస్య వస్తే ధర్మసముద్రం నీటిని వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ మెయిన్ పైప్లైన్ పగిలిపోవడం.. రోజుల తరబడిగా మరమ్మతు చేయకపోవడంతో నీటి సమస్య తలెత్తుతోంది. పైగా వేసవికాలం కావడం, ఎండలు ముదిరిపోవడంతో సమస్య జఠిలంగా మారుతోంది. ధర్మసముద్రంలో నీటి మట్టం తగ్గిపోతోంది. ఎస్సారెస్పీ డీ–63 కెనాల్ ద్వారా ధర్మసముద్రం చెరువును నింపుతుంటారు. ఆ నీటిని ఫిల్టర్బెడ్ ద్వారా పట్టణానికి సరఫరా చేస్తుంటారు. ఒక్కసారి ధర్మసముద్రం చెరువు నింపితే ఆర్నెళ్లవరకు నీరు సరిపోతుంది. మిషన్భగీరథ పథకం రావడంతో నేరుగా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం నుంచి ధర్మసముద్రం చెరువు వద్దగల ఫిల్టర్బెడ్కు అనుసంధానం చేశారు. అప్పటినుంచి చెరువునీటితో పాటు, మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో భగీరథ పైప్లైన్కు మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, మరికొన్ని ప్రాంతాల్లో పగిలిపోవడం.. తరచూ మరమ్మతుకు వస్తుండడంతో నీరు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు రాదో తెలియకుండా ఉంది. ప్రస్తుతం నిజా మాబాద్ రహదారిపై వంతెన నిర్మాణంలో భాగంగా రోడ్డును తవ్వడంతో పైప్ౖ లెన్ పూర్తిగా చెడిపోయింది. దీంతో ప్రస్తుతం ధర్మసముద్రంలోని నీటిపైనే ఆధారపడాల్సి వస్తుంది. ● విస్తరణ లేక ఇబ్బందులు ధర్మసముద్రం చెరువు క్రమంగా కుచించుకుపోతోంది. కట్ట సరిగా లేక నీరు వృథా అవుతోంది. గతంలో కట్టకు ఇసుక బస్తాలువేసి కాపాడగలిగారు. ధర్మసముద్రాన్ని విస్తరించాలని ప్రణాళిక రూపొందించినా ఇప్పటివరకు ఆచరణలో లేదు. కట్టను 1.5 మీటర్ల ఎత్తు పెంచాలని అధికారులు నిర్ణయించారు. పనులు ముందుకు సాగకపోవడంతో నీరు లీకేజీ అవుతోంది. ● లీకేజీలు అధికమే... పట్టణంలోనూ లీకేజీలు అత్యధికంగా ఉన్నాయి. అండర్గ్రౌండ్లో పాతపైప్లు ఉండటంతో లీకేజీ సమస్య ఏర్పడుతోంది. గతంలో అమృత్ పథకం కింద రూ.35 కోట్లు మున్సిపాలిటీకి మంజూరై టెండర్లు పూర్తయినా పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. ఈ పథకం కింద పైప్లైన్ల లీకేజీతో పాటు, నూతన ట్యాంకులు నిర్మించనున్నారు. ● రోజు విడిచి రోజు ఇస్తే కష్టమే... ఎండలు ముదరడం.. భూగర్భజలాలు అడుగంటడం.. ముందస్తు ప్రణాళిక లేకపోవడం రోజువిడిచిరోజు నీరు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పట్టణానికి 18.6 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ధర్మసముద్రంలో తగ్గుతున్న నీరు మున్సిపాలిటీ: జగిత్యాల జనాభా : లక్షకు పైగా సరఫరా అవుతున్న నీరు : 18.6 మిలియన్ లీటర్లు శిథిలావస్థలో ఫిల్టర్బెడ్ ధర్మసముద్రం వద్దగల రెండు ఫిల్టర్బెడ్లు శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం ధరూర్ క్యాంప్లోని మరో ఫిల్టర్బెడ్కు పైప్లైన్ను అనుసంధానం చేసి అక్కడ నుంచి పట్టణవాసులకు నీటి సరఫరా చేస్తున్నారు. వేసవికాలం కావడం.. ఒకటే ఫిల్టర్బెడ్ నుంచి నీటి సరఫరా అవుతుండడంతో రోజువిడిచి రోజు సరఫరా చేసే పరిస్థితి వచ్చింది. ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. వంతెన నిర్మాణంతో భగీరథ పైప్లైన్లు పగిలిపోయాయి. త్వరలోనే మరమ్మతు చేడపతాం. ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం అక్కడున్న మరో 4ఎంఎల్డీ, హౌసింగ్బోర్డు కాలనీలో ఉన్న 11 ఎంఎల్డీ ఫిల్టర్బెడ్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. – అనిల్, ఏఈ -
బీఆర్ఎస్పై తిరుగుబాటుగానే టీఆర్ఎస్ ఆవిర్భావం
కథలాపూర్(వేములవాడ): బీఆర్ఎస్పై తిరుగుబాటుగానే కొత్తగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన ట్లు భావిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కలిగోటలో విలేకరులతో మాట్లాడారు. కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏనా డూ ప్రజల పక్షాన నిలబడలేదని కవిత అనడం ద్వారా ఇన్నాళ్లు ఎంత ఘోరం జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఫోన్లో మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండాపోయిందనడంపై ఫోన్ ట్యాపింగ్ జరి గినట్లు చెప్పకనే చెప్పారని తెలిపారు. మాజీమంత్రి హరీశ్రావు, ఎంపీ సంతోష్రావు ఇళ్లు బంగారుమయం అయ్యాయనడం ద్వారా ఆ నలుగురే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అప్పట్లో కాంగ్రెస్ చేసిన ఆరోపణకు బలం చేకూరినట్లయ్యిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలకు దగ్గరగా లేవని, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే చేరువలో ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించామన్నారు. పీహెచ్సీ ప్రారంభం ముందుగా అంబారిపేటలో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ప్రారంభించారు. సూరమ్మ ప్రాజెక్టును పరిశీలించారు. పీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆర్డీవో జివాకర్రెడ్డి, డీఎంహెచ్వో సుజాత, డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, వైద్యాధికారి రచన, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, కల్లెడ గంగాధర్, జవ్వాజి రవి, కారపు గంగాధర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మూడురోజుల్లోనే ముగింపు పలికాం
జగిత్యాలఅగ్రికల్చర్: ఆర్టీసీ కార్మికుల సమ్మెను మూడురోజుల్లోనే పరిష్కరించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మె చేస్తే కనీసం చర్చలకు కూడా పిలవలేదన్నారు. ప్రస్తుత సీఎం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పరిష్కరించారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి ఉన్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ.. మార్కెట్లకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్ కమిటి చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేశ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య పాల్గొన్నారు. -
కదిలిన బస్సు
జగిత్యాలటౌన్: ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సులను యథావిధిగా నడిపించనున్నట్లు జేఏసీ నాయకులు శంకర్రెడ్డి, రామయ్య తెలిపారు. సమ్మె విరమించి విధులకు హాజరవుతామని పేర్కొన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, రమేశ్రావు, ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలుఇబ్రహీంపట్నం: రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిస్తున్నామని జిల్లా పట్టు పరిశ్రమ అధికారి లత అన్నారు. మండలంలోని మూలరాంపూర్లో రైతులు ఏర్పాటు చేసుకున్న డ్రిప్ పరికరాలను పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90శాతం, సన్న, చిన్నకారు రైతులకు 80 శాతం, ఇతరులకు 70 శాతం సబ్సిడీపై పరికరాలు సరఫరా చేస్తున్నామని, ఆసక్తి గలవారు ఉద్యాన అధికారులను సంప్రదించాలని సూచించారు. ఉద్యాన అధికారి కే.శ్రీనివాస్, విస్తరణ అధికారి శ్రీలత, ఇంజినీర్ సాయికృష్ణ పాల్గొన్నారు. టీబీ నియంత్రణపై అవగాహన కల్పించాలిమల్యాల: టీబీ నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నూకపల్లిలో క్షయ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల నుంచి తెమడ సేకరించారు. ఊపిరితిత్తుల్లో దుమ్ము, దూళి చేరి క్షయవ్యాధి సోకే ప్రమాదం ఉంటుందని, సకాలంలో పరీక్ష చేయించుకుని తొలిదశలో గుర్తిస్తే నియంత్రించవచ్చని పేర్కొన్నారు. మొబైల్ ఎక్స్రే యంత్రం ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చని అన్నారు. పీహెచ్ఈఎన్ నాగలక్ష్మీ, హెచ్ఈఓ రమేశ్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. దోమలు నివారించాలి జగిత్యాల: దోమల నివారిస్తే మలేరియా రాకుండా అడ్డుకోవచ్చని శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మలేరియా దోమకాటుతో వచ్చే వ్యాధి అన్నారు. జ్వరం వస్తే రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు. ప్రోగ్రాం అధికారి అర్చన, స్రవంతి, శ్రీధర్, మురళీధర్ పాల్గొన్నారు. అధికారుల విచారణజగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన పంచాయతీ కార్యదర్శి అనుమతివ్వడం లేదంటూ లబ్ధిదారు రేగుంట గంగు శుక్రవారం పంచాయతీ కార్యదర్శికి రూ.50 వేలు ఇచ్చేందుకు వెళ్లిన విషయం తెల్సిందే. దీనిని శ్రీఇందిరమ్మ ఇంటికి అనుమతివ్వడం లేదని..శ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీ కథనం ప్రచురించడంతో స్పందించిన ఎంపీడీవో సలీం శనివారం గ్రామానికి వెళ్లి గంగును విచారించారు. పంచాయతీ కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంగుపై ఫిర్యాదు గంగు తన విధులకు ఆటంకం కలిగించిందన్న పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అరిఫోద్దీన్ సారంగాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టినట్లు ఎస్సై గీత తెలిపారు. -
అందరూ ఉత్తీర్ణులయ్యేలా..!
మల్లాపూర్: ఇంటర్లో ఫెయిలయిన విద్యార్థులు తిరిగి ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈనెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈనెల 15 నుంచి ఆయా సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో నేరుగా తరగతులు నిర్వహిస్తుండగా.. మరికొన్ని చోట్ల ఆన్లైన్లో బోధిస్తున్నారు. జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో తరగతుల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసి అందరూ పాస్ అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక ప్రణాళిక ప్రభుత్వ కళాశాలల విద్యార్థులందరూ పాస్ అయ్యేలా ఈ విద్యా సంవత్సరంలో వంద రోజుల ప్రణాళిక అమలు చేశారు. తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహించారు. అయినా కొన్ని కళాశాలల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఇంటర్ ఫస్టియర్లో 6,645 మంది పరీక్ష రాయగా.. 4,174 మంది ఉత్తీర్ణత సాధించారు. 2,471 మంది ఫెయిలయ్యారు. సెకండియర్లో 5,792 మంది పరీక్ష రాయగా.. 4,338 మంది పాస్ అయ్యారు. 1,454 మంది ఫెయిలయ్యారు. ఆయా సబ్జెక్టుల్లోనే.. ఫెయిలయిన విద్యార్థులకు వారు తప్పిన సబ్జెక్టుల్లోనే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15 నుంచి తరగతులను ప్రారంభించారు. విద్యార్థులను కళాశాలకు పిలిచి ప్రత్యక్షంగా బోధిస్తున్నారు. విద్యార్థులు, ఆధ్యాపకులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వారంలో రెండు నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మే 10వ తేదీ వరకు ఈ తరగతులు కొనసాగనున్నాయి. మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇంప్రూమెంట్ రాసే విద్యార్థులకు సైతం ప్రత్యేక తరగతులకు అనుమతిస్తున్నారు. -
భూభారతి సమస్యలు పరిష్కరించాలి
జగిత్యాల: రెవెన్యూ సదస్సుల్లో భూభారతి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నా రు. శనివారం అధికారులతో సమీక్షించారు. సాదా బైనామా, అసైన్డ్ భూములు, డిజిటలైజేషన్ వంటి అంశాలను పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు, డిపాల్టర్ రైస్మిల్లర్లపై ఆర్వోఆర్ చట్టం ప్రకారం తీసుకునే చర్యలు, ఇసుక నిర్వహణ, తడి భూముల నిర్వహణ, సీఏ భూములపై పరిశీలించా లన్నారు. ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. అందుబాటులోకి స్వీయగణన జనగణనలో తొలిసారిగా స్వీయగణన సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. జనగణన ఈనెల 26 నుంచి మే10 వరకు కొనసాగుతుందని, వెబ్సైట్ E.CENU.GOV.IN పోర్టల్ ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను 10–20 నిమిషాల్లో నమోదు చేసుకోవచ్చని, ప్రత్యేకమైన ఐడీ పొందవచ్చన్నారు. ఐడీని భద్రపర్చుకోవాలని, ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు చూపించాలన్నారు. ఉద్యోగులు, సిబ్బంది స్వీయ లెక్కింపులో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. -
వీఎల్టీ రద్దు చేయాలని రాస్తారోకో
కోరుట్ల: పట్టణంలోని గడి బురుజుల స్థలంలో వీఎల్టీలు రద్దు చేయాలని, తైబజార్ వసూలు చేయొద్దని స్థానిక కార్గిల్ చౌరస్తా వద్ద అఖిలపక్షాల ప్రతినిధులు, కూరగాయల వ్యాపారులు శనివారం రాస్తారోకో చేశారు. బురుజుల స్థలంలో అక్రమంగా వేసిన వీఎల్టీ నంబర్లు రద్దు చేయించాలన్నారు. తమకు వసతులు కల్పించి తైబజార్ రద్దు చేయించాలని మహిళా రైతులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత భర్త, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఘటన స్థలానికి చేరుకున్నారు. వీఎల్టీల విషయంలో పూర్తి వివరాలు పరిశీలిస్తామని అక్రమంగా వేసినట్లు గుర్తిస్తే రద్దు చేయిస్తామన్నారు. అవసరమైతే కలెక్టర్తో మాట్లాడుతామన్నారు. కూరగాయల వ్యాపారులకు సౌకర్యాల కల్పనలో చర్యలు తీసుకుంటామన్నారు. అఖిలపక్షాల ప్రతినిధులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ముజాహిద్, చింత భూమేశ్వర్, ముజబుర్ రహ్మన్, మహ్మద్ షేక్ షాహిద్, నగేష్, సుతారి రాములు, మానుక ప్రవీన్కుమార్, శికారి గోపి, కూరగాయల వ్యాపారులు పాల్గొన్నారు. వసతుల కోసం రోడ్డెక్కిన కూరగాయల రైతులు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడి హామీతో విరమణ -
తేలిన ‘పరిషత్’ ఓటర్ల లెక్క
జగిత్యాల: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవలే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు పూర్తయినా ప్రాదేశిక ఎన్నికల్లో జాప్యం జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోని ఓటరు జాబితాతోపాటు, తాజాగా ఓటు నమోదు చేసుకున్న వారిని కలిపి శుక్రవారం ముసాయితా జాబితా ప్రకటించారు. పెరిగిన ఓటర్లు 3,278 2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు ఎన్నికల సంఘం ఆమోదం లభించిన ఓటర్లను ఓటరు జాబితాలో చేర్చి సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ లెక్కన అధికారులు ఓటరు జాబితాను సవరణ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 3,278 మంది ఓటర్లు పెరిగాయి. ఇప్పటికే ఆలస్యం జిల్లా, మండల పరిషత్కు సంబంధించి పదవికాలం జూన్ 2024తో ముగిసింది. రెండేళ్లు కావస్తున్నా.. ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గతంలో సర్పంచ్గా ఓడిపోయిన వారితోపాటు, కొత్తవారు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సందడేసందడి ఈనెల 23 వరకు తుది ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవాలని ఎన్నికల సంఘం పేర్కొనడంతో అధికారులు నిర్వహణలో నిమగ్నమయ్యారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సందడి మొదలైంది. గతంలోనే సర్పంచులతోపాటు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. తాజాగా కొంతమేర రిజర్వేషన్లను మార్చే అవకాశం కనిపిస్తోంది. ఈసారి 3,278 మంది ఓటర్లు పెరిగారు. ఓటరు జాబితా ముసాయిదాను ప్రకటించాం. ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి అన్ని సిద్ధం చేశాం. – గౌతమ్రెడ్డి, జెడ్పీ సీఈవో మండలాలు : 20 పంచాయతీలు 385 గతంలో ఓటర్లు 6,07,263 ప్రస్తుత ఓటర్లు 6,10,541 పెరిగిన ఓటర్లు 3,278 పోలింగ్ కేంద్రాలు 1123 ఎంపీటీసీ స్థానాలు 216 జెడ్పీటీసీ స్థానాలు 20 -
కమ్ముకున్న మేఘం.. రైతుల్లో భయం
వీణవంక: రెండ్రోజులుగా ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఆకాల వర్షాలు పడతాయోనని విత్తనోత్పత్తి రైతులు కలవరపడుతున్నారు. వారం రోజుల్లో ఆడ, మగ వరి కోతలు ప్రారంభం కానుండగా వాతావరణం చల్లబడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తర తెలంగాణలోనే హైబ్రిడ్ సాగులో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. మరో వారం రోజుల్లో పంట కోతలు ప్రారంభిచనున్నారు. కరీంనగర్ జిల్లాలో వీణవంక, జమ్మికుంట, శంకపట్నం, పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్, ఓదెల, ముత్తారం, జగిత్యాల జిల్లాలో పెగడపల్లి, ధర్మారం మండలాల్లో హైబ్రిడ్ సీడ్ను సాగు చేస్తున్నారు. ఈ సారి 1.20లక్షల ఎకరాల్లో వరిసాగులోకి వచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పుతున్నారు. ఆడ వరి కన్నా వారం ముందు మగ వరి కోయాల్సి ఉంటుంది. మగ వరి కోతలు ప్రారంభం కాగా.. ఆడవరి కోతలు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఆడపైరులో బెరుకు తీసే పనిలో రైతులు బిజీగా ఉన్నారు. చిరుజల్లులకే నేలరాలే స్వభావం మగ వడ్లను కంపెనీలు కొనుగోలు చేయవు. ఆడ వడ్లను మాత్రమే దిగుమతి చేసుకుంటాయి. క్వింటాల్కు రూ.7వేల నుంచి రూ.20వేల వరకు కంపెనీలు చెల్లిస్తున్నాయి. మగ వడ్లను రైతులు ప్రైవేట్గా విక్రయించాల్సిందే. ఆడవడ్లకు ఈదురుగాలులు, చిరుజల్లులకే నేలరాలే స్వభావం ఉంటుంది. కంపెనీ ప్రతినిధులు వచ్చి సర్టిఫై చేస్తేనే వరి కోయాల్సి ఉంటుంది. లేకుంటే ధాన్యం రిజెక్ట్ చేసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 28నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో రైతులు దిక్కుతోచన స్థితిలో పడ్డారు. పెట్టుబడి ఎక్కువే సాధారణ వరి సాగు చేస్తే ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేల పెట్టుబడి అవుతుంది. ఆడ, మగ సాగు చేస్తే రూ.40వేల నుంచి రూ.50వేల పెట్టుబడి అవుతుంది. ఎకరం నాటు(హైబ్రిడ్)కు 20మంది కూలీలు అవసరం. సాధారణ వరికి 12మందితో పూర్తి చేస్తారు. వాతావరణం అనుకూలిస్తే హైబ్రిడ్ వరికి రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల మధ్య దిగుబడి వస్తుంది. జిల్లాలోనే వీణవంక మండలం బేతిగల్, మల్లారెడ్డిపల్లి గ్రామాలు దిగుబడిలో మొదటిస్థానంలో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం ఓడేడు గ్రామం సాగులో ఆదర్శంగా నిలస్తుంది. వరుణుడు 15రోజులు గడువు ఇస్తే రైతులు గట్టెక్కనున్నారు. లేకుంటే తీవ్ర నష్టపోయే ప్రమాదముంది. కోతదశలో హైబ్రిడ్(ఆడ, మగ) వరి ఈ సమయంలో వర్షాలు కురిస్తే పైరుకు తీవ్ర నష్టం చిరుజల్లులకే గింజలు నేలరాలే స్వభావం ఆందోళనలో సీడ్ వరి రైతులు జిల్లాలో 1.20లక్షల ఎకరాలలో సాగు మూడేళ్లుగా వరి సాగు వివరాలు(ఎకరాల్లో 2024 68,000 2025లో 85,000 2026లో 1.20,000 ఐదు ఎకరాలలో ఆడ, మగ వరి పంట వేసిన. మగ వరి కోసి రెండు రోజులవుతుంది. ఆడ వరి కోయడానికి కంపెనీ ప్రతినిధులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. రెండు రోజులుగా మబ్బులు కమ్ముకుంటుంటే ప్రాణం వణుకుతోంది. పంట చేతికి వచ్చిన సమయంలో ఆకాల వర్షాలు పడితే కోలుకోలేం. ఇప్పటికే ఎకరాకు రూ.40వేల పెట్టుబడి పెట్టిన. పది రోజులు వరుణుడు కరుణిస్తే గండం నుంచి గట్టెక్కుతా. – శ్రీనివాస్, రైతు, బేతిగల్ -
జడ్జి పోస్టు ముళ్ల కిరీటం
వేములవాడ: జడ్జి పోస్టు ముళ్ల కిరీటంలాంటిదని, ఒక్కో రోజు కేసులు పూర్తిస్థాయి పరిష్కరించేందుకు రాత్రి అవుతుందని, కేసుల్లో బ్యాలెన్స్ చేయడంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుందని సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ పేర్కొన్నారు. వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించి ఖమ్మంకు బదిలీపై వెళ్తున్న జ్యోతిర్మయిని బార్ అసోసియేషన్ హాలులో శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ జాదవ్ మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తారని, ఈక్రమంలో తమపై ఎంతో బాధ్యత ఉంటుందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ మాట్లాడుతూ జడ్జిగా విధులు నిర్వహించిన సమయంలో జూనియర్లకు ఎంతో అవకాశం కల్పించారని, బార్ అండ్ బెంచ్ సత్సంబంధాలతో కొనసాగాయన్నారు. మహిళలకు ఆదర్శం వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే ఆగస్టు 16న వేములవాడ ప్రభుత్వాస్పత్రిలో నార్మల్ డెలివరీతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం పెంచారన్నారు. ఇలా మహిళలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏ ఆడపిల్లకై నా మొదటి డెలివరీ తల్లిగారింట్లో జరుగుతుందని.. అందుకే జడ్జి జ్యోతిర్మయికి వేములవాడ పుట్టినిల్లులాంటిదన్నారు. ఈక్రమంలో తమ సోదరికి వీడ్కోలు పలుకుతున్నట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ జూనియర్ సివిల్ జడ్జికి ఘనంగా వీడ్కోలు కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన జ్యోతిర్మయి వేములవాడను తన పుట్టినిల్లుగా మార్చుకున్నారంటూ పలువురు అడ్వకేట్లు కొనియాడడంతో భావోద్వేగానికిలోనయ్యారు. జడ్జి జ్యోతిర్మయి మాట్లాడుతుండగా కంటతడి పెట్టుకున్నారు. బార్ అసోసియేషన్ హాలులో శనివారం జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆమె తన అనుభవాలను వివరిస్తూ వేములవాడను మరచిపోలేనని, తనను ఇంతగా ఆదరించిన వేములవాడ అడ్వేకేట్ల సేవలు గుర్తుండిపోతాయన్నారు. ఈక్రమంలో పలువురు అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది సైతం భావోద్వేగానికి లోనయ్యారు. -
కొడుకునే చంపాలని చూసిన తల్లి
● చిన్న కొడుకును ప్రేరేపించిన తల్లి ● పెట్రోల్పోసి నిప్పంటించిన వైనం ● చావుబతుకుల్లో పెద్దకుమారుడు ● లక్కేపూర్ గ్రామంలో ఘటన మంథనిరూరల్: కన్న కొడుకునే మరోకొడుకుతో అంతం చేయాలని చూసిందో తల్లి.. అర్ధరాత్రి నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కొత్త రఘుపై అతడి తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. బాధితుడి సోదరి పాలడుగు సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. రఘు తండ్రి 15ఏళ్లక్రితం చనిపోయాడు. తల్లి జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి ప్రవర్తన బాగా లేకపోవడంతో తరచూ పెద్ద తమ్ముడు గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి సైతం గొడవ జరగడంతో తనకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి.. తన చిన్న కొడుకుతో పెద్ద కొడుకును చంపాలని పథకం వేసింది. ఈ క్రమంలో అంతకుముందే తెచ్చుకున్న పెట్రోల్ను నిద్రిస్తున్న రఘుపై పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు అరవడంతో స్థానికులు గమనించి వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విచారణ జరిపి తన పెద్ద తమ్ముడిపై హత్యాయత్నం చేసి చిన్నతమ్ముడు అనిల్, తల్లి జ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని సౌజన్య తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్నట్లు మంథని పోలీసులు తెలిపారు. కొనుగోలు కేంద్రం ప్రారంభంజగిత్యాలరూరల్: బీర్పూర్ మండలకేంద్రంలో మార్క్ఫెడ్, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. కేంద్రం మక్కలను కొనడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాల్కు రూ.2400 చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కేడీసీసీ మాజీ సభ్యులు ముప్పాల రాంచందర్రావు, ఎంపీడీవో భీమేశ్, తహసీల్దార్ సుజాత, సర్పంచ్ హరీశ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ నవీన్రావు, నారపాక రమేశ్, రవి, బీర్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
35 ఏళ్ల అనంతరం స్వగ్రామానికి..
రాయికల్: తుపాకీ పట్టి 35 ఏళ్లుగా మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) రాష్ట్రాల్లో అనంత్ టీంలో సభ్యుడిగా పనిచేసి ఇటీవల లొంగిపోయిన రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన బత్తుల కాశీరాం శనివారం ఉదయం స్వగ్రామానికి చేరాడు. కుటుంబంలో శుభకార్యం ఉండడంతో ఆయన భార్య కారం లక్కీ అలియాస్ అనూజతో కలిసి వచ్చారు. బత్తుల కాశీరాం అలియాస్ ప్రతాప్ అప్పటి పీపుల్స్వార్ సిద్ధాంతాలు నచ్చి భార్య మల్లవ్వతో కలిసి 1990–91లో అజ్ఞాతంలోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య అనారోగ్యంతో మృతిచెందగా.. అదేదళంలో పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన కారం లక్కీ (అనూజ)ను రెండో వివాహం చేసుకున్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగర్లో భాగంగా అనంత్ టీంలో పనిచేస్తున్న సుమారు 14 మందితో లొంగిపోయేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ సీఎంలు, హోంశాఖకు లేఖ రాశారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని గొండియా జిల్లా దారెక్సా పోలీస్స్టేషన్లో 14మందితో ఐదు నెలల క్రితం లొంగిపోయారు. ప్రస్తుతం కాశీరాం గొండియా పోలీస్స్టేషన్లో అక్కడి పోలీసుల సంరక్షణలో ఉన్నారు. రివార్డు ఇస్తే జనజీవన స్రవంతిలోకి.. కాశీరాంపై కేంద్రప్రభుత్వం రూ.35 లక్షల రివార్డు ప్రకటించింది. లొంగిపోయి ఐదునెలలైనా మూడు రాష్ట్రాల్లో ఉన్న కేసుల నేపథ్యంలో ఇంకా పోలీసుల సంరక్షణలోనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. వివిధ కేసులను పరిష్కరించేందుకు అక్కడి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇంకా మూడు నెలలు పట్టే అవకాశం ఉందని కాశీరాం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తనకు రివార్డు అందిస్తే స్వగ్రామానికి వచ్చి కుటుంబసభ్యులతో గడపాలని ఉందని, ఇదే తన చివరి కోరిక అని పేర్కొన్నారు. శుభకార్యం నిమిత్తం స్వగ్రామానికి చేరుకున్న ఆయన వెంట పోలీసుల బందోబస్తు కూడా ఉండడం గమనార్హం. తిరిగి ఈనెల 28న మహారాష్ట్ర వెళ్తానని కాశీరాం తెలిపారు. 35 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చిన కాశీరాంను చూసేందుకు స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ చూస్తుంటే గ్రామంలోనే ఉండాలన్న ఆశ పుడుతోందని ఉద్వేగంగా అన్నారు. కుటుంబసభ్యులను కలిసిన బత్తుల కాశీరం శుభకార్యం నిమిత్తం భార్యతో కలిసి ఇంటికి.. రివార్డు అందించి ఉపాధి చూపాలని వినతి -
సహజ మరణానికి రూ.10 లక్షలు
గోదావరిఖని: సింగరేణి ఉద్యోగులకు బీమాపై ధీమా కల్పించేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది. అత్యధిక బ్యాంకు ఖాతాలు ఉన్న ఎస్బీఐతో ఒప్పందం చేసుకుంది. సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం వర్తించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ప్రమాదాల్లో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చెల్లించే పథకాన్ని అమలు చేస్తోంది. 2021–22 నుంచి ప్రమాద బీమా పథకం అమలవుతోంది. ఎస్బీఐ ప్రమాద బీమా ఉద్యోగులను ఆదుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన పలు ప్రమాదాల్లో మృతి చెందిన 50 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ. 30కోట్ల ప్రమాద బీమా సొమ్ము చెల్లించింది. కార్పొరేట్ సాలరీ ఖాతా కలిగిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు రూ.8,906 ప్రీమియం చెల్లిస్తే భార్యాభర్తలతోపాటు ఇద్దరు పిల్లలకు రూ.50 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ఎస్బీఐ అందిస్తోంది. సాధారణ ఆరోగ్య బీమా ప్రీమియంతో పోల్చితే తక్కువ ఇన్స్టాల్మెంట్తో ఖాతాదారులకు అందిస్తోంది. రిటైర్డ్ కార్మికులకు రూ.30లక్షలు రిటైర్డ్ కార్మికులకు కూడా రూ.30 లక్షల ప్రమాద బీమా పథకాన్ని 70ఏళ్ల వరకు అందిస్తోంది. మృతుడి కుటుంబంలోని పిల్లలు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నవారు చదువుతున్న అబ్బాయికి రూ.8లక్షలు, అమ్మాయికి రూ.10 లక్షలుబ్యాంకు చెల్లిస్తోంది. పెళ్లీడు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షలు చొప్పున చెల్లిస్తోంది. ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే రూ.5లక్షల చెల్లిస్తామని, తమ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉందని, ఇంకా అనేక సౌకర్యాలు ఈ ఒప్పందంలో పొందుపరిచామని సింగరేణి ఉన్నతాధికారులు వెల్లడించారు. సింగరేణి ఉద్యోగులకు బీమా సౌకర్యం ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్న యాజమాన్యం -
‘దేవి పుత్రిక’ అభినందనీయం
● జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ కరీంనగర్: ఆడపిల్ల పుడితే భారమనే వివక్షను వీడి, లక్ష్మిదేవిలా భావించినప్పుడే సమాజంలో లింగనిష్పత్తి తేడాలు తొలగుతాయని జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ అన్నారు. కరీంనగర్లో రోహన్ ఆసుపత్రి ప్రారంభించి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ‘దేవిపుత్రిక’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆడపిల్ల పుడితే నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా సంవత్సరం పాటు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ఎనమల్ల శ్రీదేవి, ఎనమల్ల నరేశ్ ముందుకొచ్చారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్ రావుతో కలిసి ‘దేవిపుత్రిక’ పోస్టర్ ఆవిష్కరించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల విషయంలో ఉన్న వివక్షను తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో శనివారం 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయికల్ మండలం అల్లీపూర్లో అత్యధికంగా 44.1 డిగ్రీలు నమోదు కాగా.. అత్యల్పంగా కొడిమ్యాల మండలం తిర్మలాపూర్లో 41.5 డిగ్రీలుగా నమోదైంది. మల్లాపూర్ మండలం రాఘవపేటలో 44, ధర్మపురి మండలం బుద్దేశ్పల్లి, కొడిమ్యాల మండలం పూడూరులో 43.9, బీర్పూర్ మండలం కొల్వాయిలో 43.8, కోరుట్ల మండలం అయిలాపూర్లో 43.8, ఎండపల్లి మండలం గుల్లకోటలో 43.7, కోరుట్లలో 43.6, బుగ్గారం మండలం సిరికొండ, ధర్మపురి మండలం జైన, ఇబ్రహీంపట్నం గోదూరులో 43.5, మల్లాపూర్లో 43.4, రాయికల్లో 43.3, మేడిపల్లి, పెగడపల్లిలో 43.2, గొల్లపల్లిలో 43 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలుజగిత్యాలక్రైం: బీర్పూర్ మండలకేంద్రంలో ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అదేగ్రామానికి చెందిన చీర్నేని బుచ్చన్నకు తీవ్రగాయాలయ్యాయి. బుచ్చన్న తన ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా.. జన్నారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బుచ్చన్న తలకు తీవ్రగాయాలుకాగా.. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీర్పూర్ ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో, కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసి నింది తుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. హౌసింగ్బోర్డు కాలనీలో ని వాసముంటున్న మనువాడ విష్ణువర్దన్ కొద్దిరోజు ల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చే సి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యా దు మేరకు నిందితుడిని రిమాండ్కు పంపించినట్లు సీఐ తెలిపారు. విజిలెన్స్ విచారణకు కమిషనర్ హాజరు కోరుట్ల: పట్టణంలోని మద్దులచెరువులో గుర్ర పు డెక్క తొలగింపును టెండర్లు పిలవకుండానే చేయడంపై మాజీ కౌన్సిలర్ ఇందూరి సత్యం మున్సిపల్ డీఎంఏకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దీని పై వరంగల్లో శనివారం విజిలెన్స్ విచారణ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్, డీఈ సురేశ్, ఫిర్యాదుదారు సత్యం హాజరయ్యారు. వరంగల్ ఆర్జేడీ ఆధ్వర్యంలో విచారణ సాగింది. టెండర్లలో అక్రమాలపై పూర్తి వివరాలు విజిలెన్స్ అధికారులు అందించామని సత్యం తెలిపారు. ఈతకొడుతుండగా పిట్స్.. యువకుడి మృతి రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో నివాసముండే బుడిగజంగాల కుటుంబానికి చెందిన పస్తం పవన్(18) శనివారం ఈతకొడుతుండగా పిట్స్ రావడంతో నీటమునిగి చనిపోయాడు. మరోఇద్దరు యువకులతో కలిసి చెరువులో ఈదుతుండగా పిట్స్ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు కొన్నేళ్లుగా పిట్స్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పస్తం రాంచందర్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పవన్ ఉన్నాడు. రాంచందర్కు ఉన్న ఏకై క కుమారుడు పవన్ మృత్యువాత పడడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
జనగణన పకడ్బందీగా చేపట్టాలి
జగిత్యాల: జగనణన పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. జిల్లాకేంద్రంలో జనగణనకు సంబంధించిన ఎన్యుమరేటర్లకు శిక్షణ కల్పిస్తున్నారు. జనగణన దేశభవిష్యత్ ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు, ప్రణాళికకు ఉపయోగపడుతుందన్నారు. సందేహాలుంటే సూపర్వైజర్లు, చార్ట్ ఆఫీసర్లు అవగాహన కల్పిస్తారన్నారు. స్వీయగణన చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. పీఆర్టీయూ అధ్యక్షుడు ఆనందరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించేలా చూడాలన్నారు. జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీం, ఫీల్డ్ ట్రైనర్లు మచ్చ రాజశేఖర్, కస్తూరి శ్రీధర్, రాజేందర్, హరికిరణ్, కొక్కుల రాజేశ్, రాజశేఖర్ పాల్గొన్నారు. గ్రామసభల ద్వారా రీసర్వే చేయాలి జగిత్యాలరూరల్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భూ సర్వే, రీసర్వే పనులను వేగవంతం చేయాలని లత అన్నారు. బీర్పూర్ మండలం నేదునూలో భూముల రీసర్వేపై అవగాహన కల్పించారు. ఆర్డీవో మధుసూదన్, బీర్పూర్ తహసీల్దార్, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. -
వసతుల్లేవ్.. వసూళ్ల జోరు
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని గడి బురుజులతో పాటు వేములవాడ రోడ్ వెంట ఐబీరోడ్, గోదాం వద్ద రోజూ కూరగాయల అమ్మకాలు జరుగుతుంటాయి. కోరుట్ల, పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు, వ్యాపారులు ఈ రెండు చోట్ల కూరగాయలు అమ్మి జీవనోపాధి పొందుతున్నారు. ప్రతీ బుధవారం జరిగే అంగడి సైతం రోడ్డుపైనే జరుగుతోంది. ఏళ్ల తరబడి ఇదే దుస్థితి కొనసాగుతున్నా ఏ పాలకవర్గం సరైన వసతులు కల్పించకపోవడం విచారకరం. ఈ రెండు చోట్ల సంతలు స్థిరపడిన క్రమంలో ఆయా ప్రాంతాల్లో సరైన స్థలం ఎంపిక చేసి వ్యాపారులకు షెడ్లు ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చి మున్సిపాల్టీ వారు ఆదాయం పొందవచ్చు. ఈ పరిస్థితిపై దృష్టి పెట్టకుండా పట్టణానికి దూరంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లో జనాలకు అందుబాటులో లేని చోట రూ.6 కోట్లు వెచ్చించి కే వలం కాంట్రాక్టర్ కోసం సమీకృత మార్కెట్ పేరిట ఓ కట్టడం కట్టి వృథాగా వదిలేయడం, గోదాం వద్ద రూ.కోటి వెచ్చించి సగం నిర్మాణం చేసి వదిలేసిన వైనం నేతల నిబద్ధతకు అద్దం పడుతోంది. అడ్డగోలుగా వసూళ్లు రోజూ కూరగాయల అమ్మకాలు జరిగే రెండు చోట్ల కనీసం నీటి వసతి కల్పించలేదు. ఈ వేసవిలో తాగడానికి నీరు అందుబాటులో లేక చుట్టు పక్కల ఇళ్ల వారిని నీళ్లు అడుక్కునే దుస్థితి దాపురించింది. ప్రస్తుతం వివాదస్పదంగా మారిన గడి బురుజుల స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి వసతి కల్పించే అవకాశం ఉంది. ఇక కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చిన మహిళా రైతుల పరిస్థతి దారుణం. పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ నుంచి ఎక్కడా టాయ్లెట్స్ వసతి లేదు. ఇంతటి దుస్థితిలో రైతులు నానా తిప్పలు పడుతుండగా.. తైబజారు పేరిట వసూళ్ల పర్వం మాత్రం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని అనేక మున్సిపాల్టీల్లో రైతుల దీనస్థితిని దృష్టిలో ఉంచుకుని తైబజారు వేలం పాట రద్దు చేయగా ఇక్కడ మాత్రం పాలకులు రూ.16 లక్షల ఆదాయం కోసం తైబజారు వేలం వేసి కూరగాయల రైతులను తీవ్ర వేదనకు గురిచేస్తున్నారు. తైబజారు వసూళ్లకు వచ్చే వాళ్లు నిర్ధారించిన ధరల ప్రకారం కాకుండా అడ్డగోలుగా వసూలు చేయడం, కాదంటే కసురుకోవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. మున్సిపల్ కొత్త పాలకవర్గం కూరగాయల వ్యాపారులపై జాలి చూపి మార్కెట్లలో వసతులు కల్పించి తైబజారు వసూళ్లను రద్దు చేయించాలని రైతులు కోరుతున్నారు. -
దేశాభివృద్ధికి జనగణన కీలకం
కోరుట్ల: జనగణన– 2027 ప్రక్రియలో ఎన్యూమరేటర్లు కచ్చితమైన గణాంకాలు సేకరించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని పీఎం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. జనగణనకు ప్రజల సహకారం తీసుకోవాలన్నారు. కూలీలకు వసతులు కల్పించాలి కథలాపూర్(వేములవాడ): ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఉపాధి కూలీలకు పని ప్రదేశాల వద్ద నీడ, తాగునీటి వసతులు కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడారు. కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీవో జివాకర్రెడ్డి, డీఆర్డీవో రఘువరణ్, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో శంకర్, ఏపీవో కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
నడుం నొప్పి.. కంటి సమస్య
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియ నమోదు సిబ్బందికి కొత్త సమస్యలు తీసుకొస్తోంది. సర్ దరఖాస్తు పత్రంలో 2003నాటి ఎస్ఐఆర్ ప త్రంలో ప్రచురితమైన ఓటరు వ్యక్తిగత వివరాలను అతడు లేదా ఆమె, తాతతండ్రుల పేర్లను కాని ఇవ్వాలి. ఈ మేరకు 2003 నాటి ఓటరు జాబి తాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచారు. ఏ ఓటరుకై నా 2003జాబితాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం కానీ, పోలింగ్ బూత్ కానీ స్పష్టంగా తెలియకపోతే పెద్ద చిక్కే వస్తుంది. దీంతో ఆ ఓట రు వివరాల కోసం ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ల్లో వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఓటరు దీర్ఘకాలంగా ఒకేచోట నివసిస్తున్నా, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం మారిపోయిన వారి వివరాలను వెతకడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఆయా ఓటర్ల వివరాలను 2003 జాబితా ఆధారంగా సేకరించలేక బీఎల్వోలకు కొత్తగా కంటి స మస్యలు, నడుం నొప్పి వస్తోందని వాపోతున్నారు.సర్ అంటే -
మెట్పల్లిలో..
మెట్పల్లి బల్దియాలో నాలుగు పదవుల్లో మూడు ‘చేతి’కే చిక్కగా, ప్రత్యేక ప్రావీణ్యం కోటా కింద బ రిలో నిలిచిన రిటైర్డ్ ఉద్యోగి సీహెచ్.రవీందర్కు సాఽ దారణ మెజార్టీ రాక అతడిని ఎన్నుకోలేదు. మున్సి పల్ సమావేశ మందిరంలో శుక్రవారం చైర్మన్ మై లారపు లింబాద్రి అధ్యక్షతన కోఆప్షన్ సభ్యులను ఎ న్నుకున్నారు. మైనార్టీ కోటా కింద పన్నాల మాధవరెడ్డి, షాద్మనాజ్, మాజీ ప్రజాప్రతినిధుల కోటా కింద గజం లక్ష్మిని సభ్యుల వాయిస్ ఓటు పద్ధతిలో వ చ్చిన మెజార్టీని పరిగణనలోకి తీసుకొని ఎన్నికై నట్లు కమిషనర్ స్పందన ప్రకటించారు. మిగిలిన ప్రత్యేక ప్రావీణ్యం కోటాలో రవీందర్కు అవసరమైన మె జార్టీ రాక అతన్ని ఎన్నుకోలేదని ఆమె తెలిపారు. బీజేపీ సభ్యుల హాజరుతోనే కోరం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సమావేశానికి మొదట ఆరుగురు కాంగ్రెస్, నలుగురు స్వతంత్రులతో పాటు బీజేపీ కౌన్సిలర్ బొడ్ల రమేశ్, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన చెట్లపల్లి మీనా హాజరయ్యారు. బీఆర్ఎస్ సభ్యులు, బీజేపీకి చెందిన కొంత మంది సభ్యులు గైర్హాజరయ్యారు. అయితే అప్పటి వరకు కోరంకు అనుగుణంగా సభ్యుల సంఖ్య లేక ఎన్నిక విషయంలో కొంత సందిగ్ధం ఏర్పడింది. అంతలోనే బీజేపీ కౌన్సిలర్లు అరిగెల అనూష, అరిసె వనజ రావడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్కు మద్దతు మాజీ ప్రజాప్రతినిధుల కోటా కింద మహిళా సభ్యురాలి ఎన్నిక విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ పదవికి కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్ పిప్పెర లత దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆమెకు ఆ పార్టీ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో గత్యంతరం లేక ఆ పార్టీ పెద్దలు బీఆర్ఎస్కు చెందిన మాజీ కౌన్సిలర్ గజం లక్ష్మిని కాంగ్రెస్లో చేరడానికి ఒప్పించి ఎన్నికల్లో గెలిపించారని సమాచారం. హాజరైన బీజేపీ సభ్యులపై పార్టీలో ఆగ్రహం కోఆప్షన్ సమావేశానికి హాజరైన ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లపై ఆ పార్టీకి చెందిన మిగతా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు హాజరు కాకుంటే కోరం లేక ఎన్నిక జరిగే అవకాశముండేది కాదు. దీంతో వీరు ఎన్నిక జరగడానికి పరోక్షంగా దోహదపడ్డారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. చైర్మ న్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన బీజేపీ కౌన్సిలర్ మీనాపై అదే రోజు పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం ఈ ముగ్గురిపైనా కూడా చ ర్యలు తీసుకుంటామని జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు తెలిపారు. మాధవరెడ్డిగజం లక్ష్మి -
3వ రోజుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె
జగిత్యాలటౌన్: సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 3వ రోజుకు చేరింది. వేకువజాము నుంచే జగిత్యాల డిపో ఎదుట ఆందోళనకు దిగిన కార్మికులు నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి సంతాపంగా కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. అనంతరం డిపో నుంచి ప్రారంభమైన ర్యాలీ కొత్తబస్టాండ్ మీదుగా పాత బస్టాండ్ వరకు సాగింది. డిపో వద్ద వంటావార్పు నిర్వహించిన నిరసన తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్ల సమ్మెతో మెజార్టీ బస్సులు డిపోకే పరిమితమవగా అద్దె బస్సులు యథావిధిగా నడిచాయి. సమ్మెకు జీవన్రెడ్డి సంఘీభావం ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కడానికి కారణం సీఎం రేవంత్రెడ్డేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ఆరోపించారు. సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేటికరించే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని విమర్శించారు. శంకర్గౌడ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, సమ్మెకు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కె సునీల్, వి.అరవింద్ మద్దతు తెలిపారు. -
బలహీనవర్గాలకు ద్రోహం చేసిన రేవంత్, పొన్నం
రాయికల్(జగిత్యాల): రాష్ట్రంలోని బలహీనవర్గాలకు ద్రోహం చేసింది సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాయికల్లో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో మైనార్టీలను మినహాయించి 51 శాతం మంది ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ 46 శాతం మందే బలహీనవర్గాలే ఉన్నారని ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. 5 శాతం బలహీనవర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ము న్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ల బదిలీ
జగిత్యాలజోన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్లో పనిచేస్తున్న షీరీనాను రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్, జగిత్యాలలో పనిచేస్తున్న శ్రీనిజ కోహిర్కర్ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మెట్పల్లిలో పనిచేస్తున్న ఎన్.అరుణ్కుమార్ను రంగారెడ్డి జిల్లా అమన్గల్, వేములవాడలో పనిచేస్తున్న కె.జ్యోతిర్మయిని ఖమ్మం, సిరిసిల్లలో పనిచేస్తున్న ఎ.ప్రవీణ్ను ఖమ్మం, గోదావరిఖనిలో పనిచేస్తున్న డి.వెంకటేశ్ను గద్వాలకు బదిలీ చేశారు. అలాగే, ఖమ్మంలో పనిచేస్తున్న వి.మాధవిని మెట్పల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్న యశ్వంత్సింగ్ను కరీంనగర్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పనిచేస్తున్న అపర్ణను పెద్దపల్లి జిల్లా మంథనికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోర్టు బెంచ్కు న్యాయవాదుల సహకారం అవసరంజగిత్యాలజోన్: కోర్టు బెంచ్కు న్యాయవాదుల సహకారం అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జిగా నియమితులైన సునీత రవీందర్రెడ్డికి శుక్రవారం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో మాట్లాడారు. కక్షిదారుల కేసులకు సత్వరం మోక్షం కలిగించేందుకు జడ్జిలతో పాటు న్యాయవాదులు కృషి చేయాలన్నారు. అదనపు జిల్లా జడ్జి సునీత రవీందర్రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదులు, జడ్జిలు సమన్వయంతో పనిచేస్తూ, కేసులకు సత్వర పరిష్కారం లభించేలా చూద్దామని చెప్పారు. మొదటి, రెండవ అదనపు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్లు శ్రీనిజ, నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సత్యం, న్యాయవాదులు పాల్గొన్నారు. మహిళలు వ్యాపారాల్లో రాణించాలిఇబ్రహీంపట్నం(కోరుట్ల): మహిళలు వ్యాపారాల్లో రాణించాలని డీఆర్డీవో పీడీ రఘువరన్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో అమ్మక్కపేట గ్రామానికి చెందిన సమాల్ల మమతకు సీ్త్రనిధి ద్వారా రూ.3లక్షల రుణంతో ఎలక్ట్రికల్ ఆటోను అందజేశారు. పాత ఐకేపీ భవనంలో మండల మహిళా శక్తి కుట్టు కేంద్రం స్కూల్ యూనిఫామ్స్ తయారీ హాబ్ను ప్రారంభించారు. అనంతరం ఫకీర్కొండాపూర్, యామపూర్, ఎర్రాపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. మహిళలు చిన్న వ్యాపారాలే కాకుండా పెద్ద ఇండస్ట్రీయల్ పెట్టి లాభాలను గడించి జీవనోపాధి పొందాలన్నారు. రైతులు తాలుతప్ప లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకవచ్చి సిబ్బందికి సహకరించాలన్నారు. తహసీల్దార్ వరప్రసాద్, ఎపహెం శంకర్, మార్కెట్కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకట్రెడ్డి, సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో విఫలంజగిత్యాలరూరల్: వరిధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని, రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. వారం రోజులుగా వరికోతలు ప్రారంభమైనా ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదన్నారు. గన్నీ బ్యాగులు లేక, హమాలీలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తేలు రాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, నాయకులు ప్రసాద్, రాంచందర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సాతారంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్
మల్లాపూర్(కోరుట్ల): రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికొకటి చొప్పున 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనుండగా, పైలట్ ప్రాజెక్టుగా మల్లాపూర్ మండలం సాతారం హైస్కూల్ను ఎంపిక చేశారు. రూ.16.62 కోట్ల అంచనా వ్యయంతో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నారు. అధికారుల బృందం సందర్శన మండలంలోని సాతారం జెడ్పీ పాఠశాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం శుక్రవారం ఇంజనీరింగ్ అధికారుల బృందం సందర్శించింది. ఏఈలు శశికుమార్, ధనుంజయ్, సర్పంచ్ పోతవేని నారాయణ, పంచాయతీ కార్యదర్శి వినోద్, పాఠశాల హెచ్ఎం శ్రీహరి హైస్కూల్ను పరిశీలించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అవసరమైన కొలతలు తీసుకున్నారు. -
కాంగ్రెస్ ‘చేతి’కే కోఆప్షన్
జగిత్యాల/మెట్పల్లి(కోరుట్ల): జగిత్యాల, మెట్పల్లి మున్సిపల్ కోఆప్షన్ పదవులు కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థులనే వరించాయి. జగిత్యాల బల్దియాలో శుక్రవారం చైర్పర్సన్ సమిండ్ల వాణి అధ్యక్షతన కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పదవుల కోసం 11 మంది దరఖాస్తు చేసుకోగా పోటీ లేకుండానే ఎన్నిక జరిగింది. ఇటీవల ఎమ్మెల్యే, మంత్రి సూచించిన కో ఆప్షన్సభ్యుల విషయంలో కొంత వివాదం చోటుచేసుకున్నా ఎమ్మెల్యే ప్రతిపాదించిన ముగ్గురికి, మంత్రి సూచించిన ఒకరికి పదవి వచ్చింది. జనరల్ విభాగంలో గట్టు సతీశ్, వీరబత్తిని పద్మజ, మైనార్టీ కోటాలో తస్లీమ్ సుల్తానా, అబ్దుల్ ఖదీర్ (ముజ్జు) ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ స్పందన ఆధ్వర్యంలో సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తస్లీమ్సుల్తానా పద్మజమహ్మద్అబ్దుల్ఖదీర్ -
నేడు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక
మెట్పల్లి/జగిత్యాల: మెట్పల్లి మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు మధ్యాహ్నం 3.30గంటలకు మున్సిపల్ సమావేశ మందిరంలో కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నలుగురు కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. మరోవైపు ఎన్నిక ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టడం లేదని 11వార్డుకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. ఈ పిటిషన్పై 24న మధ్యాహ్నం విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎన్నిక జరుగుతుందా..? లేక వాయిదా పడుతుందా..? అన్నది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ తప్పుదోవ పట్టించడం తగదు – బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్వరూప కో–ఆప్షన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం తగదని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప తెలిపారు. పార్టీ కౌన్సిలర్లతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. కో–ఆప్షన్ ఎన్నిక చట్టబద్ధంగా నిర్వహిస్తున్నామని వైస్చైర్మన్ నవీన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కౌన్సిలర్లకు ఇచ్చిన ఎజెండా చట్టబద్ధంగా ఉంటే ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ నుంచి అధికారిక ఉత్తర్వును కమిషనర్ సంతకంతోనే జారీ చేయాల్సి ఉంటుందని, మెట్పల్లిలో కమిషనర్తో నిమిత్తం లేకుండా చైర్మన్ సంతకంతో నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. బొడ్ల రమేశ్, బొడ్ల ఆనంద్, దొనికెల శిరీష, అరిగెల అనూష, కోయల్కర్ స్రవంతి తదితరులున్నారు. జగిత్యాలలో అవకాశం ఎవరికో.. జగిత్యాల మున్సిపాలిటీలో కో–ఆప్షన్ పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు కొద్దిరోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ సూచించిన వ్యక్తులకే పదవులు దక్కే అవకాశాలు న్నాయి. మున్సిపాలిటీలోని రెండు మైనార్టీ, రెండు జనరల్ పదవులున్నాయి. మొత్తం 11 మంది పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి పదవి దక్కేనోనని చర్చ నడుస్తోంది. గట్టు సతీశ్, వీరబత్తిని పద్మజ, అబ్దుల్ ఖాదర్ (ముజ్జు), సుల్తానాకు పదవి దక్కే అవకాశాలున్నాయి. వీరిలో గట్టు సతీశ్ను ఎమ్మెల్యే ప్రతిపాదించగా.. పద్మజను మంత్రి అడ్లూరి సూచించినట్లు తెలిసింది. శుక్రవారం మున్సిపల్ సమావేశంలో సభ్యులను ఎన్నుకోనున్నారు. నేడు సమావేశం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో సభ్యులు సమావేశం కానున్నారు. సభ్యులను ఎన్నుకున్న అనంతరం జనరల్బాడీ సమావేశం జరగనుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
పొరండ్లలో శ్రీఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
● వేడుకల్లో పాల్గొన్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో గురువారం శ్రీఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్, శోభమ్మ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వెల్దుర్తి గ్రామంలోని గట్టు మల్లికార్జునస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆమె వెంట నాయకులు ఆనందరావు, సదాశివరావు, మహిపాల్రెడ్డి, ప్రవీణ్, ప్రకాశ్, తిరుపతి పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఏఎస్పీ చేతన్నితిన్జగిత్యాలక్రైం: ఇటీవల ఏఎస్పీగా బదిలీ అయిన చేతన్నితిన్ గురువారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ అశోక్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్ను కలిశారు. 2022 బ్యాచ్కు చెందిన చేతన్ నితిన్ జనగామ ఏఎస్పీగా పనిచేశారు. -
బురుజు స్థలాలను కాపాడుకుందాం
కోరుట్ల: పట్టణంలోని చారిత్రక కట్టడాలైన గడి బురుజుల స్థలాలను కాపాడుకుందామని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బురుజు స్థలాల పరిరక్షణకు మూడు రోజులుగా చేస్తున్న అఖిలపక్షం, ప్రజాసంఘాల నిరసన దీక్షలకు ఎమ్మెల్యే గురువారం మద్దతు తెలిపారు. స్థలాలపై విధించిన వీఎల్టీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు చెన్నా విశ్వనాథం, పేట భాస్కర్, ఎండీ.ముజాహిద్, చింతా భూమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీ విలీన గెజిట్ బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జీవో గెజిట్ నోటిపికేషన్ విడుదల చేశామని, ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం అపాయింట్మెంట్ ఇస్తే ప్రక్రియ పూర్తవుతుందని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. డిమాండ్లు నెరవేర్చాలని రెండురోజులుగా సమ్మె చేస్తున్న కోరుట్ల, మెట్పల్లి ఆర్టీసీ కార్మికులకు గురువారం సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలు న్యాయమైనవని, ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సీఎం మాటలు కోటలు దాటుతాయని, చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఎండనుంచి కార్మికులు ఉపశమనం పొందేందుకు వారికి గొడుగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
500 మార్కులు సాధిస్తే రూ.ఐదువేల ప్రోత్సాహకం
ధర్మపురి: మండలంలోని దోనూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని పదో తరగతిలో 500 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులకు రూ.ఐదువేల ప్రో త్సాహకం అందించనున్నట్లు సర్పంచ్ దాసరి పురుషోత్తం ప్రకటించారు. స్థానిక పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రోగ్రెస్ కార్డులు అందించారు. అలాగే పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు రూ.516 అందిస్తానని వెల్లడించారు. కార్యక్రమానికి హాజరైన ఎంఈవో సీతామహాలక్ష్మి మాట్లాడుతూ.. సర్పంచ్ పురుషోత్తం మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. ప్రతి తరగతి నుంచి గరిష్ట హాజరు సాధించిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రోజుకు రూ.2, ద్వితీయ బహుమతిగా రూపాయి చొప్పున అందిస్తానని ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ సుమతి, పంచాయతీ కార్యదర్శి ముత్యం పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
జగిత్యాల: భోజనం నాణ్యతలో నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సంజయ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి సందర్శించారు. ఉదయం అల్పాహారం అందించాలని, భోజనం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. మెనూ కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అల్పాహారం, పోషకాహారం ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, సంక్షేమాధికారి రాజ్కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేశ్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి పాల్గొన్నారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతెలో ఉడుత లక్ష్మీనర్సు నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశం చేశారు. సర్పంచ్ మహేశ్, మాజీ ఎంపీటీసీ రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం గొల్లపల్లి: గొల్లపల్లి మండలం చందోలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు, ధాన్యం తూకంలో కోతలు లేకుండా కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలి
మెట్పల్లిరూరల్: హిందూ సనాతనధర్మం, సంస్కృతి, సంప్రదాయాలతోపాటు విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని విశోఖ తీర్థ స్వామిజీ అన్నారు. మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. అనంతరం హిందూ సమ్మేళనంలో మాట్లాడారు. హిందూధర్మం విశిష్టత ను తెలుసుకోవాలని సూచించారు. హిందువులంతా సంఘటితం కావాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ పుల్ల జగన్గౌడ్, ఉపసర్పంచ్ లక్మ చిన్నయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు రాజ్పాల్రెడ్డి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కేంద్రం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు ఇబ్బంది పడకుండా జగిత్యాల నియోజకవర్గంలో 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. చల్గల్ మార్కెట్ యార్డులో గురువారం కేంద్రాన్ని ప్రారంభించారు. రానున్న సీజన్ నుంచి సాగు సమాచారం అందించేందుకు గ్రామాల్లో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. వరి స్థానంలో ఆదాయం వచే పంటల వైపు దృష్టి సారించాలన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, డీఏవో భాస్కర్, డీసీవో మనోజ్కుమార్, డీసీఎస్వో జితేందర్ రెడ్డి, డీఎంవో ప్రకాష్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, పీఏసీఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. సన్నాల సాగు పెంచాలిజగిత్యాలఅగ్రికల్చర్: వచ్చే వానాకాలం సీజన్లో సన్నాల సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. సన్న వరి రకాలసాగు, యూరియా బుకింగ్ యాప్పై గురువారం ఫర్టిలైజర్, విత్తన డీలర్లకు జిల్లాకేంద్రంలో అవగాహన కల్పించారు. సన్నరకాలను సాగు చేస్తే మార్కెటింగ్లో ఇబ్బంది ఉండవన్నారు. సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్న క్రమంలో సాగును ప్రోత్సహించాలని పేర్కొన్నారు. బీపీటీ–5204, జై శ్రీరాం, జేజీఎల్–1798, కేఎన్ఎం– 1638, హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్– 15048 వంటి రకాలు పండించి ఆదాయం పొందాలని రైతులకు సూచించారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రైతులు ఇంటి నుంచే ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖాధికారి లత, ఏడీ టెక్నికల్ రాజులునాయుడు, ఏడీ తిరుపతినాయక్ పాల్గొన్నారు. కొండగట్టులో ఎమ్మెల్సీ వెంకట్ పూజలుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. వారికి అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఈవో అంజనారెడ్డి, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, సూపరింటెండెంట్ ఉపాద్యాయుల చంద్రశేఖర్, తూము శ్రీనివాస్, ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మానాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొత్తగా వివాహమైన వెంకట్ దంపతులకు సత్యంతోపాటు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. రేపు విజిలెన్స్ విచారణకోరుట్ల: కోరుట్ల మద్దుల చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను టెండర్లకు ముందే చేసిన వైనంపై శనివారం వరంగల్లో విజిలెన్స్ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ పనులపై మాజీ కౌన్సిలర్ ఇందూరి సత్యం నెల క్రితం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన డీఎంఏ శ్రీదేవి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. వరంగల్ ఆర్జేడీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. విచారణకు మున్సిపల్ కమిషనర్, డీఈ హాజరుకావాలని వరంగల్ మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. పనులు ముగిసిన తరువాత టెండర్లు ఖరారు చేసిన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. -
కాళేశ్వరం విచారణ పేరిట కాలయాపన
జగిత్యాల/జగిత్యాలటౌన్: ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరిట కాలయాపన తప్ప రెండున్నరేళ్లలో రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. కాళేశ్వరం కట్టకముందు యాసంగిలో నీరులేక పొలాలు బీళ్లుగా మారేవని, ప్రాజెక్టుతో రెండు పంటలకు సరిపడా నీరందుతోందని గుర్తుచేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. నాయకులు అయిల్నేని వెంకటేశ్వర్రావు, ఆనందరావు, ఆవారి శివకేసరిబాబు, శీలం ప్రియాంక, మహిపాల్రెడ్డి, ఒద్ది రాంమోహన్రావు, కచ్చు హరీష్, గుండ మధు, ఎల్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
జగిత్యాల: పంచాయతీరాజ్, ఉపాధిహామీ కింద చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, అంగన్వాడీ భవనాలు, కిచెన్షెడ్స్, టాయిలెట్స్ వెంటనే చేపట్టాలన్నారు. నాణ్యతలో రాజీపడొద్దని, పిల్లలకు అన్ని వసతులూ ఉండాలని సూచించారు. ఉపాధిహామీ పథకం ద్వారా కార్మికులకు వసతులు కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా ప్రతి పని ప్రణాళికబద్ధంగా అమలు కావాలన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. గురుకులాల పోస్టర్ ఆవిష్కరించారు. 2026–27కు గాను డిగ్రీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారని, ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాబ్లు ఉన్నాయన్నారు. ప్రిన్సిపల్ శ్రీలత పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె.. బస్సులు సగమే
కరీంనగర్ రీజియన్ పరిధిలో.. సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్టౌన్: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు బుధవారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగడం ఉమ్మడి జిల్లా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్–1, కరీంనగర్–2, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని మొత్తం 11 డిపోల్లోని ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3,057 మంది ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 99 శాతం మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. కేవలం 40 మంది డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం విధులకు హాజరు కాగా, మిగతా వారంతా సమ్మెలో పాల్గొన్నారు. అన్ని డిపోల వద్ద కార్మికులు నిరసనలకు దిగగా.. ముందు జాగ్రత్త చర్యగా తెల్లవారుజాముకు ముందే పోలీసు బలగాలు మోహరించారు. కరీంనగర్ రీజియన్లో దాదాపు 1,000 బస్సులు అందుబాటులో ఉండగా.. బుధవారం 401 బస్సులను హైదరాబాద్, వరంగల్, వేములవాడ, గోదావరిఖని, మెట్పల్లి, తదితర అన్ని రూట్లలో నడిపారు. 330 అద్దెబస్సులు, వాటి డ్రైవర్లు విధుల్లో పాల్గొన్నారు.జగిత్యాల బస్టాండ్లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ప్రయాణికుల ఇక్కట్లు జిల్లాలో రైల్వే మార్గాలు అంతగా అభివృద్ధి చెందకపోవడంతో సింహభాగం ప్రజారవాణాకు ఆర్టీసీ మీదే ఆధారపడాలి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజారవాణా దాదాపుగా స్తంభించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం డిగ్రీ, ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లు, ట్యాక్సీలు ఽచార్జీలు అమాంతంగా పెంచారు. హైదరాబాద్, వరంగల్ రూట్లలోనూ ట్యాక్సీ డ్రైవర్లు చార్జీలు రూ.500 నుంచి రూ.800 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. మరోవైపు కార్పూలింగ్, కార్ షేరింగ్ యాప్లకు డిమాండ్ పెరిగింది. వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కరీంనగర్ బైపాస్ వద్ద ప్రమాదం జరగడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అనుభవం లేని ప్రైవేటు డ్రైవర్కు బస్సులు ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగింది ఆర్టీసీ ఐకాస నాయకులు ఆరోపించారు.డిపోలు 11ఆర్టీసీ బస్సులు 550అద్దె బస్సులు 330ఎలక్ట్రికల్ బస్సులు 100ఆర్టీసీ డ్రైవర్లు 984ఆర్టీసీ కండక్టర్లు 1,354ఇతర సిబ్బంది 719 (ఆఫీసు, డిపో,వర్క్షాపులు కలిపి) -
గురుకులాల్లో కార్పొరేట్స్థాయి విద్య
వెల్గటూర్: విద్యావ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులతో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగిందని, రోజురోజుకూ ప్రవేశాల సంఖ్య పెరుగుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని స్తంభంపల్లి జ్యోతిబాపూలే గురుకులాన్ని కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి బుధవారం సందర్శించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులు తెస్తోందని, ప్రతినియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తోందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వంటగదుల్లో పరిశుభ్రత పాటించాలని సూచించా రు. డీఈవో రాము, సంక్షేమ అధికారులు కె.రాజ్కుమార్, సునీత, తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో నరేశ్ కుమార్, ఎంఈవో ప్రభాకర్, ప్రిన్సిపాల్ హరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ హర్షం
జగిత్యాలటౌన్: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్పై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు బుధవారం జిల్లాకేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. తహసీల్ చౌరస్తాలో స్వీట్లు పంచిపెట్టారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. కాళేశ్వరంపై రాష్ట్రప్రభుత్వం నియమించిన పీసీ.ఘోష్ కమిషన్ నివేదికను నిలుపుదల చేస్తూ.. హైకోర్టు తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. తెలంగాణకు కల్పతరువు వంటి కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన రేవంత్రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినాన్యాయస్థానాలు చూస్తూ ఊరుకోబోవని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టిన కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతు చేసి రైతులకు సాగు, తాగునీటిని అందించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా
సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఖాళీగా కుర్చీలు రాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. సభ్యుల ఎన్నిక బుధవారం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో సాధారణ సమావేశం అనంతరం సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఎవరూ సకాలంలో హాజరు కాకపోవడంతో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికను వాయిదా వేసినట్లు కమిషనర్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 11.35 గంటల వరకు కమిషనర్, అధికారులు చైర్మన్, వైస్చైర్మన్, కౌన్సిలర్ల రాక కోసం ఎదురుచూశారు. సమయం మించిపోయినప్పటికీ చైర్మన్ కట్కం రవి, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, మిగతా సభ్యులెవరూ హాజరుకాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు. -
చెన్నకేశవునికి పూజలు
రాయికల్: పట్టణంలోని శ్రీచెన్నకేశవనాథ ఆలయ విశిష్టతను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని హైదరాబాద్కు చెందిన మహిళలు బుధవారం ఆలయాన్ని సందర్శించారు. దేశంలోనే రెండో పంచముఖ లింగం విశిష్ఠతపై ఆలయ అర్చకులు సతీశ్శర్మ వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అల్వాల్ ఎస్ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ తోట వినీత, కాకర ప్రేమలత, మహిళ బృందం సభ్యులు పాల్గొన్నారు. బడిబాటలో 40 అడ్మిషన్లుకథలాపూర్: మండలంలోని తక్కళ్లపెల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు బుధవారం బడిబాట నిర్వహించారు. బుధవారం ఒకేరోజు కొత్తగా 40మంది విద్యార్థుల అడ్మిషన్లు వచ్చాయి. పాఠశాలల్లో ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజగంగారాం, హెచ్ఎం లక్ష్మీనర్సయ్య, కార్యదర్శి పూజిత, వార్డుసభ్యులు పాల్గొన్నారు. సర్పంచ్ కుమారుడికి అడ్మిషన్ ఇప్పపెల్లి సర్పంచ్ సంబ నవీన్ తన కుమారుడు నియాన్స్ను స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కిషన్రావుకు అడ్మిషన్ ఫామ్ను అందించారు. టీబీ రహిత సమాజమే లక్ష్యంజగిత్యాలరూరల్: టీబీరహిత సమాజమే లక్ష్యమని, వ్యాధి నిర్ధారణతోనే నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చల్గల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో క్షయ నిర్ధారణ, అవగాహన శిబిరంలో పాల్గొన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళ జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీబీ బాధితులకు ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జున్ను రాజేందర్, మెడికల్ ఆఫీసర్ సౌజన్య, ఎంఎల్హెచ్పీ షామిని, ఉప సర్పంచ్ రుమాన్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్ వికాస్, ఎస్టీఎస్ శ్రీనివాస్, సూపర్వైజర్ సుజాత, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అంజన్న సింహద్వారానికి మరమ్మతుమల్యాల: మండలంలోని ముత్యంపేటలోగల కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ సింహద్వారానికి అధికారులు మరమ్మతు చేస్తున్నారు. వాటిని బుధవారం ఆలయ ఈవో అంజనారెడ్డి పరిశీలించారు. పీఆర్సీ అమలు చేయాలిజగిత్యాల: 51శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్టీయూ భవన్లో బుధవారం మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన 90రోజుల్లో పీఆర్సీ, పెండింగ్ డీఏ విడుదల చేస్తామని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. హెల్త్కార్డులు, సీపీఎస్ రద్దు అంశాలను పరిష్కరించలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 5న ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులు, పెన్షనర్లు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, శివరామకృష్ణ, మేకల ప్రవీణ్, శ్రీనివాస్, నంద్యానాయక్, నరేశ్, తిరుపతి, చారి, మురళీ పాల్గొన్నారు. -
నూతన నియామకం
రాయికల్: అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి జిల్లా అధ్యక్షుడిగా రాయికల్కు చెందిన ఆడెపు రాజమౌళి నియమితులయ్యారు. ఈ మేరకు నేషనల్ చైర్మన్ శిరీన్, జాతీయ అధ్యక్షుడు ఎస్కె.మజీద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన జర్నలిస్టుగా, విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా, రాయికల్ మున్సిపల్ ఉద్యోగిగా అందించిన సేవలకుగాను జాతీయ నాయకత్వం ఈ నియామకం చేపట్టింది. రాజమౌళి మాట్లాడుతూ జిల్లాలో మానవ హక్కులను రక్షించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఒబులాపూర్లో డీఎల్పీవో విచారణ మల్లాపూర్: మండలంలోని మొగిలిపేటకు చెందిన మంగళారపు గంగారాంకు సంబంధించిన ఎకరం భూమిని ఇతరులకు విరాసత్ చేయడంతో బాధితుడు మంగళవారం ఆమరణ దీక్ష చేపట్టాడు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించారు. బుధవారం ఒబులాపూర్కు వెళ్లిన డీఎల్పీవో సుదర్శన్, ఎంపీడీవో జగదీశ్ గ్రామపంచాయతీలో విరాసత్ పట్టాకు కారణమైన ధ్రువీకరణ పత్రం జారీపై విచారణ చేపట్టారు. మంగళారపు (గాండ్ల) రాజేశ్వరి తాత గంగరాం పేరిట బ్యాంక్ పనికోసమని 30ఏళ్ల క్రితం చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం రాసివ్వాలని పంచాయతీ కార్యదర్శి శ్రీని వాస్కు దరఖాస్తు పెట్టుకోగా ఆయన జారీ చేశాడు. ఆ పత్రంతోనే రాజేశ్వరి విరాసత్ పట్టా చేయించుకున్నట్లు విచారణలో తేలిందని, విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. -
న్యాయం కోసం వృద్ధుని పోరాటం
మల్లాపూర్: తనకు తెలియకుండానే తన భూమిని విరాసత్ చేశారని, అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. 72 ఏళ్ల వృద్ధుడు కుటుంబంతో సహా తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆమరణ దీక్షకు దిగాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుని కథనం ప్రకారం మల్లాపూర్లోని మొగిలిపేటకు చెందిన మంగాళరపు గంగారాంకు భార్య గంగు, కుమారుడు ధర్మరాజు, కూతురు బీమ రాజు ఉన్నారు. ఇద్దరికీ వివాహమైంది. గంగారాంకు సంగెంశ్రీరాంపూర్ శివారులో 82/1 సర్వేనంబర్లో 1.27 ఎకరాల భూమి ఉంది. కుమారుడితో కలిసి సాగు చేసుకుంటున్నాడు. ఆ భూమిపై బ్యాంక్లో పంట రుణం తీసుకుని ఏటా రెన్యూవల్ చేస్తున్నాడు. 2025 జనవరిలో లోన్ రెన్యూవల్ కోసం వెళ్లగా.. తన భూమి ఇతరులకు విరాసత్ పట్టా అయిందని బ్యాంక్ అధికారులు తెలపడంతో కంగుతిన్నాడు. రెవెన్యూ అధికారులను నిలదీశాడు. ఒబులాపూర్కు చెందిన గాండ్ల రాజేశ్వరి పేరిట విరాసత్ అయినట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తంచేశాడు. తాను బతికి ఉండగానే తన భూమిని ఇతరులకు విరాసత్ చేశారని తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఆ భూమిని తామే సాగు చేసుకుంటున్నామని చెబుతున్నా అధికారులు కనికరించడం లేదు. గత్యంతరం లేక కుటుంబంతోపాటు ఆమరణ దీక్షకు దిగినట్లు బాధితుడు పేర్కొన్నారు. తాను బతికి ఉండగానే మరణించినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి.. ఎలాంటి విచారణ చేయకుండానే వారసత్వ పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాంచందర్, ఎస్సై అనిల్ రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి వచ్చి వృద్ధుడితో మాట్లాడారు. పట్టా రద్దు కోసం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకుంటే విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించుకున్నారు. బతికుండగానే ఎకరం భూమి ఇతరులకు విరాసత్ తన భూమి తనకు పట్టా చేయాలని ఆమరణ దీక్ష -
చివరిగింజ వరకు కొంటాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కథలాపూర్: కొనుగోలు కేంద్రాల్లో చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గంభీర్పూర్లో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. రైతులు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఏ గ్రేడ్కు రూ.2,389 ఉందన్నారు. సన్నరకానికి బోనస్ రూ.500 ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, ఏపీఎం చిన్నరాజయ్య, కారపు గంగాధర్, హరిప్రసాద్, ప్రకాశ్నాయక్, శేఖర్ పాల్గొన్నారు. ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలి● అడిషనల్ కలెక్టర్ లత జగిత్యాల: ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. కలెక్టరెట్లో బాయిల్డ్ రైస్మిల్లర్లతో మంగళవా రం సమావేశం నిర్వహించారు. యాసంగి సీజన్కు సంబంధించి దిగుమతిలో జాప్యం లేకుండా చూడాలని, లారీల అన్లోడింగ్ వేగవంతం చేయాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం పేరుకుపోకుండా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ సకాలంలో పూర్తి చేయాలన్నారు. అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్రెడ్డి, మేనేజర్ జితేంద్రప్రసాద్, తహసీల్దార్లు పాల్గొన్నారు. శంకరాచార్యుల జయంతి ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలోని జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్యావల్ల సాయి మంత్రోచ్ఛరణలతో శంకరాశారదాంబ అమ్మవారికి మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, అష్ఠోత్తర పూజ, మన్యసూక్తం, పంచోపనిషత్లతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆల య అర్చకులు, భక్తులు తదితరులున్నారు. అంజన్న ఉద్యోగుల అంతర్గత బదిలీలుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ఉద్యోగులకు అంతర్గత బదిలీలు జరి గాయి. సీనియర్ అసిస్టెంట్ ఉపాద్యాయుల చంద్రశేఖర్కు సూపరింటెండెంట్గా పదోన్న తి, ఆలయ పర్యవేక్షకులుగా.. సునీల్కుమార్ ను పీఆర్వోగా.. పవన్కుమార్ను పరిపాలన, అకౌంట్స్, తూము శ్రీనివాస్ను ఆలయ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. చంద్రశేఖర్ను ఆలయ అర్చకులు శాలువాతో సన్మానించారు. భక్తుల సందడి.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. -
రేవంత్ సర్కార్ ఎందుకు పోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు పోవాలో బీఆర్ఎస్ చెప్పాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చూడాలన్నారు. మంగళవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం పోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తన చావు కోరుకున్నారంటూ జగిత్యాల సభలో కేసీఆర్ అనడాన్ని ఖండించారు. ప్రతిపక్షనాయకుడిగా ఆయన్ను గౌరవించామన్నారు. సీఎం రేవంత్ను బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతూ అవమానిస్తున్నారన్నారు. తమ ప్రతి పక్షనాయకులు అప్పటి సీఎం కేసీఆర్ను ఏనాడూ ఏకవచనంతో సంబోధించలేదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ మంత్రులతో కూడా మాట్లాడలేదని, రేవంత్ అందరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు. 2023లో చివరి రైతుబంధు వేసేందుకు కేసీఆర్ ఔటర్రింగ్రోడ్డును అగ్గువకు కుదవపెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. ఎఫ్సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి సీబీఐ విచారణ జరిపించేలా బండి సంజయ్ చూడాలన్నారు. జీవన్రెడ్డి పార్టీ మారడం వల్ల లాభమా, నష్టమా ప్రజలు నిర్ణయిస్తారన్నారు. త్వరలో జగిత్యాలలో సీఎం సభ నిర్వహిస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగేలా బండి సంజయ్ చూడాలి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
కోఆప్షన్లపై గందరగోళం
మెట్పల్లి: మెట్పల్లి మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఈ ఎన్నికకు సంబంధించిన పలు విషయాల్లో అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కౌన్సిలర్లతోపాటు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ముందుగా ఈనెల 23న ఎన్నిక చేపట్టాలని నిర్ణయించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ఎజెండాలో పొందుపరుస్తూ ఆ ప్రతులను కౌన్సిలర్లకు ఆదివారం పంపిణీ చేశా రు. మొత్తం నాలుగు పదవులకు 24మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో ఎవరినీ అనర్హులు గా గుర్తించకుండానే ఎజెండాలో అందరి పేర్లు చే ర్చారు. కౌన్సిలర్లకు ఇచ్చిన ఎజెండా ప్రతులను మరుసటిరోజు వెనక్కి తీసుకున్న అధికారులు.. మార్పులు చేసి మళ్లీ మంగళవారం తిరిగి కౌన్సిలర్లకు అందించారు. అయితే అందులో ఎన్నిక తేదీని 24కు మార్చడంతోపాటు కొందరు అభ్యర్థులు అనర్హులని పేర్కొనడం వివాదానికి దారి తీసింది. నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులను అధికా రులు పరిశీలించి అందులో అనర్హులుంటే వారిని పోటీ నుంచి తప్పించాలి. కానీ అలా చేయకుండానే తొలుత అందరి పేర్లతో కూడిన ఎజెండా ప్రతులను పంపిణీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనర్హుల్లో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడి సతీమణి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న పలువురు అనర్హులను గుర్తించకుండానే కౌన్సిలర్లకు ఎజెండా ప్రతులు తర్వాత వెనక్కి తీసుకుని మరో ఎజెండా అందజేత అందులో నలుగురిని అనర్హులుగా ప్రకటించిన వైనం వివాదాస్పదమైన మెట్పల్లి మున్సిపల్ అధికారుల తీరు -
ఈత సరదా విషాదం కావొద్దు
జగిత్యాలక్రైం: వేసవిలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు, యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు ,కాలువల వద్దకు వెళ్తారని, నీటిలో మునిగి ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో ఈత నేర్చుకోవాలన్నారు. పిల్లలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనం ఇవ్వొద్దని చెప్పారు. మైనర్లకు వాహనం ఇస్తే ప్రమాదం జరిగినా.. వాహనంతో పట్టుబడినా వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు చిన్న నిర్లక్ష్యంతో ప్రాణనష్టం ఎస్పీ అశోక్ కుమార్ -
ఓటరు జాబితా పారదర్శకంగా నిర్వహించాలి
జగిత్యాల: ఓటరు జాబితాను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించారు. కొత్తవారిని ఓటరు జాబితాలో చేర్చడంపై దృష్టి పెట్టాలన్నారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే పోస్టర్ ఆవిష్కరించారు. డీఈవో రాము, సైన్స్ అధికారి రాజశేఖర్, సెక్టోరియల్ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
కోరుట్ల మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు వీరే..
డొద్దూరి సతీష్సంగా మాలతిగుండోజి శ్రీనివాస్అస్మా శాఇస్తాకోరుట్ల: బల్దియాలో నలుగురు కో–ఆప్షన్ సభ్యుల ను ఎన్నుకున్నారు. మంగళవారం ప్రత్యేక సమావేశంలో గుండోజి శ్రీనివాస్, సంగ మాలతి, బొద్దూరి సతీష్, అస్మా శాఇస్తాను ఎన్నుకుని వారికి నియామక పత్రాలను చైర్పర్సన్ తిరుమల వసంత, కమిషనర్ రవీందర్ అందించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. వైస్చైర్మన్, అధికారులు పాల్గొన్నారు. -
హోటళ్లు అపరిశుభ్రం!
జగిత్యాల: అటు ఆహార భద్రత శాఖ అధికారుల పర్యవేక్షణ, ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో పరిశుభ్రతతోపాటు, నాణ్యత లోపిస్తోంది. కనీసం అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. హోటళ్లలో, రోడ్డుపక్కన ఉండే చిన్నచిన్న హోటళ్లలో అపరిశుభ్రత లోపిస్తోంది. హోటళ్ల పక్కనే మురికికాలువలు ఉండటం, ఆ సమీపంలోనే వంటపాత్రలు కడగడం, రోడ్లపై వచ్చే దుమ్ముతో పేరుకుపోతోంది. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెస్టారెంట్లలో అపరిశుభ్రత వంటగదులు, మురికినీటితో వంటపాత్రలు శుభ్రం చేయడం, దుర్వాసన వచ్చే గ్లాసులు, ఇలా ప్రతి హోటల్లో దర్శనం ఇస్తున్నాయి. జిల్లాలో ప్రతి హోటల్లో మాస్టర్లు, సర్వర్లు, పనిచేసే వారు ఆఫ్రాన్లు, గ్లౌసులు మచ్చుకు కూడా కన్పించవు. ఆహారంలో వెంట్రుకలు రావడం, ఇతరత్రా పదార్థాలు రావడంతో పాటు చట్నీ దుర్వాసన రావడం మామూలుగా మారింది. రోజులకు తరబడిన వినియోగించిన నూనెలను మళ్లీమళ్లీ వాడినా పరిపాటిగా మారింది. కోళ్ల వ్యర్థాలు, కళేబరాలు, ఎముకలతో తయారుచేసిన నూనె విక్రయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు లేకనే.. జిల్లా కేంద్రంలో హోటళ్లు, రెస్టారెంట్లలో టిఫిన్ సెంటర్లలో అధికారులు నిత్యం తనిఖీ చేయకపోవడంతో వారు ఆడిందే ఆటగా మారింది. గతంలో తనిఖీ చేసే సమయంలో కుళ్లిన చికెన్, మటన్ ఇతరత్రా పదార్థాలు లభ్యమైతే అప్పటివరకు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే కొత్తబస్టాండ్లోని ఓ హోటల్లో చట్నీలో గడ్డిపురుగు రాగా, గతంలో మూడు మాసాల క్రితం తహసీల్ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్లో ఇడ్లీలో బొద్దింక, చపాతిలో ఫంగస్, ఇడ్లీలో జెర్రీ వచ్చిన సంఘటనలు చోటుచేసుకోగా బాధితుల ఫిర్యాదు మేరకు వచ్చి నామమాత్రంగా సీజ్ చేశారు. మరుసటి రోజు నుంచే ఆ హోటల్ ప్రారంభమైంది. నిబంధనలు గాలికే... నిబంధనల ప్రకారం ఏ రోజు పదార్థాలను ఆ రోజే విక్రయించాలి. ఒకసారి వినియోగించిన నూనెను మరోసారి వాడరాదు. అయినప్పటికీ రోజుల తరబడి అదే నూనెను వాడుతున్నారు. ముఖ్యంగా భోజనాలు, టిఫిన్లు తయారుచేసే ప్రాంతాల్లో వంటగదులు శుభ్రంగా ఉండాలి. కానీ హోటళ్లలో ఒక వైపు ఎలుకలు, మరో వైపు బల్లులు, జెర్రీలు, బొద్దింకలు, పందికొక్కులు సంచరిస్తున్నా పక్కనే పెద్దపెద్ద మురికికాలువల దుర్గందం వెదజల్లుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఒకవేళ హోటళ్లలో మిగిలిన ఆహారం, చట్నీలను ఫ్రిజ్లో నిల్వ ఉంచి మళ్లీ తెల్లవారు దానినే వడ్డిస్తున్నారు. దీంతో అవి తిన్న బాధితులకు ఫుడ్ పాయిజన్ సైతం జరుగుతుంది. ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీలు చేయకపోవడం పరిపాటిగా మారింది. ఫోన్లు ఎత్తని అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లలో ఏదైనా సమస్య ఎదురైతే ఫుడ్సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి తెలపాలన్నా అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. జగిత్యాలలో సంబంధిత అధికారి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అది జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలోగల ఓ పూరీ సెంటర్. అందులో టిఫిన్ చేసేందుకు ఓ వినియోగదారుడు వచ్చాడు. టిఫిన్ చేస్తుండగా.. చట్నీలో పెద్ద గడ్డిపురుగు వచ్చింది. సదరు వ్యక్తి గమనించడంతో ప్రమాదం తప్పింది. ఆ చట్నీ తింటే అనారోగ్యం పాలయ్యేవాడు. విషయాన్ని అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ సమస్య ఆ వినియోగదారుడిదే కాదు.. చాలామందిది. అటు ఆహారభద్రత అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రతి హోటల్లో నాణ్యత, శుభ్రత కొరతవడుతోంది. నామమాత్రంగా అధికారులు తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్లతో సరే..జిల్లా కేంద్రంలో అధికారులు తనిఖీలు చేపట్టగా శుభ్రత లేకపోవడం, ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించడం లేదని తనిఖీల్లో వెల్లడి అవుతున్నా ఏదో నామమాత్రపు కేసులు పెడుతూ జరిమానా విధిస్తూ మామూళ్లతో సరిపెట్టుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆహార కల్తీని నిరోధించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు. -
వడదెబ్బ మృతుల కుటుంబాలకు భరోసా
మల్లాపూర్: రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి. వడదెబ్బతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.4లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. పరిహారం పొందేందుకు కావాల్సిన పత్రాలు.. దరఖాస్తు విధానం అర్హులు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. ఆ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కలెక్టర్ తుది ఆమోదం తెలుపుతారు. కలెక్టర్ ఆమోదం పొందిన వెంటనే పరిహారం మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది. వడదెబ్బ మరణాల విషయంలో జాప్యం లేకుండా త్వరితగతిన సహాయం అందేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మే 11 నుంచి 13 వరకు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈఓ అంజనా రెడ్డి సోమవారం పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో పర్యటించి, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు తాగునీటి వసతి, క్యూలైన్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కపీందర్, లక్ష్మణప్రసాద్, సూపరింటెండెంట్ సునీల్కుమార్ పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణంమెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గోవిందమాంబ సమేత శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం జరిపించారు. ప్రత్యేక పూజలు, యాగాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలిరాయికల్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి సూచించారు. మండలంలోని అల్లీపూర్ జ్యోతిబాపూలే పాఠశాలను సోమవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ స్వప్నకుమారి, ఎంపీడీవో చిరంజీవి, ఇన్చార్జి సెక్రెటరీ శ్రీహరి, 8వ వార్డు మెంబర్ అనుమల్ల రాజ్కుమార్ పాల్గొన్నారు. -
రేపు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక
రాయికల్:రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశంతోపాటు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కీర్తి నాగరాజు సోమవారం తెలిపారు. మొత్తం నాలుగు కోఆప్షన్ స్థానాలు భర్తీ చేయనున్నారు. కౌన్సిలర్లు సకాలంలో హాజరుకావాలని కమిషనర్ పేర్కొన్నారు. హిందువుల్లో ఐక్యత పెరగాలిరాయికల్ హిందువుల్లో ఐక్యత పెరిగితేనే ధర్మం నిలబడుతుందని ప్రముఖ సామాజిక సమరవేత్త కల్యాణి అన్నారు. సోమవారం రాత్రి రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువులు తమ పిల్లలను తప్పనిసరిగా హిందూ ఆచార, సంప్రదాయాలను అలవాటు చేయాలని గుర్తుచేశారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. గోవులను ప్రతిఒక్కరూ పూజించాలని, సకల దేవతలు గోవులో ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
స్వామీ.. కాలినడకన మొక్కులెలా..?
మల్యాల: అంజన్న స్వామి ఆలయానికి మెట్లమీదుగా వెళ్లే దారి అస్తవ్యస్తంగా మారింది. బండరాళ్లు.. పైపుల లీకేజీతో బురదను తలపిస్తోంది. కాలినడకన మెట్లదారి వెంట వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం భక్తులకు గగనంగా మారుతోంది. దీనికితోడు మలమూత్రాలతో దుర్గంధం వెదజల్లుతోంది. దారి వెంట ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, హనుమాన్ పెద్ద జయంతి నాటికి శుద్ధి చేసి, మధ్యమధ్య ఉన్న బండరాళ్లు తొలగించాలని భక్తులు కోరుతున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. మంగళవారం, శనివారాల్లో రద్దీ అధికం. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యల్లో తరలివస్తుంటారు. ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డంతా అస్తవ్యస్తం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధికి కాలినడకన చేరుకునే దారి అస్తవ్యస్తంగా మారడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో బండరాళ్లు ఉండడంతోపాటు పైపులైను లీకేజీతో దారిమొత్తం బురదమయం అవుతోంది. పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో నడిచివెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు మెట్లదారి వెంట నడిచి వెళ్లే భక్తులు బండరాళ్లు, బురదనీటితో ఇబ్బంది పడుతున్నారు. జయంతి ఉత్సవాల్లో వేలాదిమంది ఈ దారిమీదుగానే స్వామి సన్నిధికి చేరుకుంటారు. అధికారులు మెట్లదారిని అభివృద్ధి చేయాలి. – సంకూర్తి తిరుపతి, మద్దుట్ల సర్పంచ్ మెట్లదారి వెంట ఆంజనేయస్వామి వారి సన్నిధికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతాం. భక్తుల మొక్కులు సజావుగా చెల్లించుకునేలా అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తాం. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. – అంజనా రెడ్డి, ఆలయ ఈవో -
ఉద్యోగం ఇప్పించండి
డీఎస్సీ 2004లో 3 ఉర్దూ మీడియం పీఈటీ పోస్టులు నోటిఫై చేశారు. వీటిలో రెండు పోస్టులు అన్రిజర్వ్డ్ ఓపె న్ కేటగిరీ కింద నియామకం చేశారు. ఆ కోటాలో స్థానిక అభ్యర్థులు ఉన్నా ఆంధ్రప్రదేశ్కు చెందిన అభ్యర్థిని మూడో పోస్టుకు ఎంపిక చేశారు. వాస్తవానికి 95శాతం లోకల్ అభ్యర్థులను నియమించాకే నాన్ లోకల్ అభ్యర్థులను ఎంపిక చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఒక పోస్టును నాన్ లోకల్ వ్యక్తికి కేటాయించడంతో నాకు అన్యాయం జరిగింది. ఆ నియామక ప్రక్రియపై విచారణ జరిపి నాకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోండి. – మహ్మద్ జమీల్, జగిత్యాల -
ప్రాజెక్టు మిగులు పనులు పూర్తి చేస్తాం
ధర్మపురి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన ప్రాజెక్టుల పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. పట్టణ శివారులో ఉన్న అక్కపల్లి చెరువును అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. అక్కపల్లి చెరువు, రోళ్లవాగు ఎత్తిపోతల, ఇతర ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని తెలిపారు. సాగునీటి విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతామని అన్నారు. రోళ్లవాగు విషయంలో ధర్మపురి ఎమ్మెల్యే, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ రూ.60కోట్లతో 2016లో పనులు ప్రారంభించి రూ.140 కోట్లకు పెంచారని, అయినప్పటికీ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, కౌన్సిలర్లు చిపిరిశెట్టి రాజేశ్ సంబందిత శాఖ అధికారులు తదితరులున్నారు. -
బీఆర్ఎస్ పార్టీలో జీవన్రెడ్డి ముసలం
జగిత్యాల: బీఆర్ఎస్ పార్టీలో అప్పుడే ముసలం పుట్టిందని, జీవన్రెడ్డి చేరికను మాజీమంత్రి హరీశ్రావు వ్యతిరేకిస్తున్నారని, అందుకే జగిత్యాల సభకు రాకుండా రహస్యంగా ఢిల్లీ వెళ్లారని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సభకు హరీశ్రావు గైర్హాజరు వెనుక మతలబేంటో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలన్నారు. ఇటీవల కేటీఆర్ బుజ్జగించి హరీశ్రావును జీవన్రెడ్డి ఇంటికి తీసుకొచ్చారని, జీవన్రెడ్డిని బీఆర్ఎస్ శ్రేణులు ఐరెన్లెగ్గా పరిగణిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులంతా నారజ్లో ఉన్నారని, అందుకే జీవన్రెడ్డి ఫొటోలు తొలగించారని పేర్కొన్నారు. గతంలో రేవంత్ కావాలి.. కేసీఆర్ పోవాలన్న జీవన్రెడ్డి.. ఇప్పుడు రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలనడం ప్యాకేజీ మాటలన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, టీపీసీసీ సెక్రెటరీ బండ శంకర్, కొత్త మోహన్, మన్సూర్, గడ్డం నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
హార్వెస్టర్ బావిలో పడి డ్రైవర్ దుర్మరణం
పెగడపల్లి: పొలం కోస్తుండగా ప్రమాదవశాత్తు హార్వెస్టర్తోపాటు వ్యవసాయ బావిలో పడి డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని నందగిరిలో ఆదివారం విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాలకాల లింగయ్య, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లకు వివాహమైంది. లింగయ్య జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. నర్సవ్వ బీడీకార్మికురాలు. పెద్ద కుమారుడైన మధు (35) డైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. గ్రామానికి చెందిన దనాల పర్శరాం అనే యజమానికి హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఓ రైతు వరిపంటను కోసేందుకు వెళ్లిన మధు ప్రమాదవశాత్తు హార్వెస్టర్తో పాటు వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఈ ఘటనలో మధు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై కిరణ్కుమార్ ప్రమాదస్థలికి చేరుకుని క్రేన్ సహాయంతో హార్వెస్టర్ను బయటకు తీయించి, గజ ఈతగాళ్ల సహాయంతో మధు మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మధుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య కావ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి అడ్లూరి డ్రైవర్ మధు కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ప్రమాదస్థలికి చేరుకున్న ఆయన మృతుని కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇందిరమ్మ ఇంటితోపాటు కావ్యకు విద్యార్థత ఆధారంగా అంగన్వాడికేంద్రంలో హెల్పర్, లేదా మధ్యాహ్న భోజనం కేర్టేకర్, ఔట్సోర్స్ ఉద్యోగావకాశం కల్పిస్తామని భరోసానిచ్చారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, సర్పంచ్ రజిత ఉన్నారు. నందగిరిలో విషాదం -
నిప్పుల కొలిమి.. జాగ్రత్త సుమీ
కరీంనగర్ అర్బన్: ప్రచండ భానుడి ప్రతాపానికి సకల వర్గాలు సతమతమవుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూతో మానవులతో పాటు జంతువులు, పంటలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో ఇప్పటికే పలువురు వడదెబ్బతో మరణించారు. గతకొన్ని రోజులుగా 40–43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అరెంజ్ అలర్ట్ జోన్లో ఉండగా రానున్న రోజుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సిన పదార్థాలేంటీ వంటి వివరాలను వివరించారు. ఉష్ణోగ్రతలు హెచ్చరిక స్థాయికి చేరినందున రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కూరగాయల తోటలకు ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే నీరు కట్టాలి. టమాట తోటకు నీడ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. షెడ్నెట్ వేసుకుంటే మరీ మంచిది. పండ్ల తోటలకు పెద్దగా ఇబ్బంది లేదు. మామిడికి కోతకు ఒక నెల ముందు నుంచే నీటి సరఫరా నిలిపివేయాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కాయ నాణ్యతగా పెరుగుతుంది. రుచికరంగా ఉంటుంది. తీగజాతి కూరగాయలు, ఆకు కూరలకు ఉదయం, సాయంత్రం వేళలో నీటిని అందించాలి. ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు నీటిని ఇవ్వకూడదు. – పల్లె కమలాకర్రెడ్డి, జిల్లా పట్టుపరిశ్రమ, ఉద్యాన శాఖ అధికారి ఎండల వేళ పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. మూడు పూటలు నీరు అందించాలి. మధ్యాహ్నం వేళలో పశువులపై నీటిని జలకరించాలి. నీడ ఉండే ప్రాంతాల్లోనే పశువులను ఉంచాలి. గ్రామాల్లో ఉండే నీటి తొట్లలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్తో నింపాలి. మూడు భాగాలు ఎండు గడ్డితో పాటు ఒక భాగం పచ్చిగడ్డి వేయాలి. పెంపుడు కుక్కలు అధిక ఉష్ణోగ్రతలకు చిరాకు పడుతుంటాయి. ఆయాసం, ఆకలి ఉంటుంది. ఫుడ్, వాటర్ సకాలంలో ఇవ్వాలి. వాటికి నీడ చల్లగా ఉండేలా చూడాలి. కోళ్ల ఫారాల్లో గన్నీసంచులను చుట్టూ కట్టడంతో పాటు పైన గడ్డి లేదా తుంగను కప్పాలి. రెండు గంటలకోసారి నీటితో తడపాలి. – తుమ్మల కిరణ్కుమార్రెడ్డి, పశు వైద్యులు మండుటెండలో స్వీయ జాగ్రత్తలే రక్ష -
చట్నీలో గడ్డిపురుగు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ ఇడ్లీ సెంటర్లో చట్నీలో గడ్డిపురుగు వచ్చింది. అజయ్ అనే వ్యక్తి పూరి తినేందుకు ఆ హోటల్కు వెళ్లాడు. పూరితోపాటు చట్నీ వేసుకున్న అతడికి గడ్డిపురుగు రావడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే యాజమాన్యానికి చూపించినా.. నిర్లక్ష్య సమాధానం ఇచ్చారని బాధితుడు పేర్కొన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయగా.. ఆయన స్పందించలేదని ఆరోపించాడు. గంజాయి విక్రేతల అరెస్ట్మెట్పల్లి: మెట్పల్లిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. మెట్పల్లికి చెందిన మల్యాల చందు, కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన బాణాల రాజుల కొంతకాలంగా మెదక్ జిల్లా నుంచి గంజాయిని ఇక్కడకు తీసుకొచ్చి అర్బన్ హౌజింగ్ కాలనీలోని ఓ ఇంట్లో చిన్న ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రం ఇంటిపై దాడి చేసి ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి 140గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పీఎంఐకి దరఖాస్తులు ఆహ్వానం రామగుండం: ప్రస్తుత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారు అర్హులు. శిక్షణ(ఇంటర్న్షిప్) సమయంలో ప్రతీ అభ్యర్థికి నెలకు రూ.9,000 అందిస్తారు. శిక్షణకాలం కంపెనీలను బట్టి 6, 9, 12 నెలలు ఉంటుంది. ఆసక్తిగలవారు ((httpr://pmintern ship.mca.gov.in)) లేదా ((myrcheme.gov.in/ rchemer/pmir) పోర్టల్లో వివరాలను నమోదు చేసుకోవాలి. -
హెల్మెట్ ధరించి.. సైకిల్ సవారీ
వేములవాడరూరల్: వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొంత మంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు. కానీ, 70 ఏళ్ల వృద్ధ రైతు హెల్మెట్ ధరించి సైకిల్పై రోజూ మార్కెట్కు వెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వేములవాడ మున్సిపల్ పరిధి కోనాయపల్లికి చెందిన సాయిని నారాయణ 50 ఏళ్ల నుంచి సైకిల్ వాడుతున్నాడు. సైకిల్పై ఇంటి నుంచి బయటకు వచ్చాడంటే హెల్మెట్ ధరిస్తాడు. ఆయన సైకిల్కు చార్జింగ్ బ్యాటరీ ఏర్పాటు చేసుకున్నాడు. తాను పండించిన పంటలను కోనాయపల్లి నుంచి వేములవాడ మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తాడు. 70 ఏళ్ల వయస్సులో కూడా నారాయణ హెల్మెట్ ధరించి సైకిల్పై రావడంతో పలువురు అభినందిస్తున్నారు. -
వృద్ధులు, చిన్నారులు పైలం
వేసవిలో గర్భిణులు జాగ్రత్త తీసుకోవాలి. శరీరం డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఇంట్లోనూ మంచి నీటిలో ఉప్పుచక్కెర వేసుకుని తాగాలి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడొద్దు. వదులైనా కాటన్ దుస్తులను ధరించాలి. లవణాలతో కూడిన నీటిని అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పొట్లాలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తాగాలి. చలువైన వస్తువులు వాడాలి. నీటిని తాగుతూ ఉండాలి. ఏ సమయంలోనూ అజాగ్రత్త వహించకుండా బయటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు నీటిని తాగుతూ ఉండాలి. – సాయిని నరేందర్, ఎండీ పల్మనాలజిస్ట్ వేసవిలో వాహనాల్లో గాలిని తరచూ చెక్ చేసుకోవాలి. నేరుగా ఎండ పడే చోట వాహనాన్ని నిలుపరాదు. నీడ ఉంటే చోటే నిలుపాలి. ఇంజిన్ అత్యధికంగా వేడెక్కితే డ్యాష్బోర్డులోని చెక్ ఇంజిన్, ఓవర్ హీట్ గుర్తులు బ్లింక్ అవుతుంటాయి. అప్రమత్తమై కూలంట్, రెడియేటర్ క్యాప్ సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, ఏసీ కంప్రెసర్, వాటర్ లెవల్స్ తరచూ చెక్ చేస్తుండాలి. ఎండ అత్యధికంగా ఉండే మధ్యాహ్నం సమయంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం ఉత్తమం. వీలైతే అసలు ప్రయాణం చేయకుండా ఉంటేనే మేలు. లాంగ్ టూర్ వెళ్లేవారు 50కిలోమీటర్లకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. కారు, బైక్ వేటిలో ప్రయాణించినా అత్యవసరంలో ఉపయోగపడేలా రకరకాల సైజుల స్క్రూడ్రైవర్లు, రెంచ్లు, జాకీ, టైరు ఐరన్, చేతికి గ్లౌజులు, చీకట్లో ఉపయోగపడే ఫ్లాష్లైట్ వెంట ఉంచుకోవాలి. – రమణ, మెకానిక్ -
ఉద్యాన సాగుకు ఊపిరి
కరీంనగర్ అర్బన్: మూస ధోరణిలో పంటల సాగు కాకుండా ప్రజారోగ్యం, అవసరాల క్రమంలో సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఒకప్పుడు పత్తి, వరి తక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది. మొక్కజొన్న, రాగులు, సజ్జలు, జొన్నలు, అవిసెలు, ఉలవలు, పెసర, కంది, మినుములు, శనగ వంటి పంటలకు ప్రాధాన్యతనిచ్చేవారు. కాలక్రమేణా పత్తి, వరి సాగే సింహభాగం కాగా ఇతర పంటలు కనుమరుగయ్యాయి. ఇక కూరగాయల సాగు అంతంతమాత్రమే. ఇతర రాష్ట్రాలు, జిల్లాలపై ఆధారపడాల్సిన దుస్థితి. దీంతో రవాణా ఖర్చులు, ఏజెంట్ కమీషన్ తదితర కారణాలతో వాటి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సదరు సమస్యకు పరిష్కారంగా కూరగాయలను పెద్దఎత్తున పండించాలని రాష్ట్ర ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలోని వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో పలువురు రైతులను గుర్తించి వలంటీర్లుగా శిక్షణనిస్తోంది. 30 ప్యాక్స్లు.. 30మంది వలంటీర్లు పీఏసీఎస్కు ఒకరి చొప్పున వలంటీర్లను ఎంపిక చేయగా ఇప్పటికే రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఽఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. ఈ నెల 18న జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో మలిదశ శిక్షణనిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని 30 ప్యాక్స్లకు 30 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వారంతా తాము నేర్చుకున్న మెలకువలను రైతులకు వివరించి కూరగాయల రైతులను చైతన్యవంతులను చేయనుండగా బాసటగా నిలువనున్నారు. ఒక్కో వలంటీరు.. వంద ఎకరాలు ఒక్కో వలంటీరు వంద ఎకరాల చొప్పున కూరగాయల పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సదరు లెక్కన 300 ఎకరాలలో కూరగాయలు పండించేలా కృషి చేయనున్నారు. విస్తీర్ణం పెరుగనుంది. తద్వారా విస్తీర్ణం మరింత పెరగనుందన్నది ప్రభుత్వ భావన. ఉచితంగా నారు ఇవ్వనుండగా టమాట, వంకాయ, మిర్చి వంటి వాటిని గరిష్టంగా 5ఎకరాల వరకు ఇవ్వనున్నారు. 50శాతం రాయితీతో ప్లాస్టిక్ మల్చింగ్ ఎకరానికి రూ.8వేల చొప్పున గరిష్టంగా 5 ఎకరాల వరకు ఇవ్వనుండగా 50శాతం రాయితీతో యూనిట్(అర్ధ ఎకరం)కు రూ.50వేల చొప్పున ఇవ్వనున్నారు. శాశ్వత పందిళ్లు వేసుకోలేని వారికి కట్టెలతో స్టేకింగ్ కోసం 50శాతం రాయితీతో ఎకరానికి రూ.4వేలు, నీరుపారుదలకు డ్రిప్ లేదా స్ప్రింక్లర్ రాయితీపై ఇస్తారు. ఇక సాగుకు కావాల్సిన స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లు, పవర్ వీడర్లు తదితర వాటిని 40–50శాతం రాయితీతో ఇవ్వనున్నారు. వర్మీకంపోస్ట్ తయారీకి 50శాతం రాయితీ, పండిన పంటను ప్యాక్ చేయడం, మిగిలిన వాటిని ఉంచడం కోసం ప్యాక్ హౌస్ 50శాతం రాయితీ, అంతేకాకుండా సోలార్ డ్రయర్, పాలీహౌస్, షెడ్నెట్, ఫామ్పాండ్స్ వంటి వాటిని రాయితీపై ఇవ్వనున్నారు. మూడు చోట్ల విత్తనోత్పత్తి వ్యవసాయశాఖ, నాబార్డు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో జిల్లాలోని మూడు సహకార సంఘాల పరిధిలో విత్తనోత్పత్తి చేయనున్నారు. వరితో పాటు పెసర, కంది పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో గట్టుదుద్దెనపల్లి, ఊటూరు, జమ్మికుంట ప్రాంతాల్లో ఒక్కో సంఘం పరిధిలో 10ఎకరాలు సాగు చేయాలని నిర్ణయించారు. ఆదర్శ రైతులను ఎంపిక చేసి వారి ద్వారా సాగు చేయించనున్నారు.ప్రభుత్వమిచ్చే రాయితీని వినియోగించుకుని రైతులు కూరగాయల సాగు చేసుకోవాలి. ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులే విక్రయించుకునేలా గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ సౌకర్యం ఉంటుంది. – పల్లె కమలాకర్రెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి సహకార సంఘాల పరిధిలో వలంటీర్ల నియామకం 30 ప్యాక్స్లలో 300 ఎకరాల్లో సాగుకు రైతుల ఎంపిక సాగుకు ప్రభుత్వ రాయితీ, ప్రోత్సాహం -
నృసింహుడి నవరాత్రి ఉత్సవాలు
● ఈనెల 22 నుంచి 30 వరకు.. ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహుని జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 22 నుంచి 30 వరకు చేపట్టే ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, చలువ పందిళ్లు, లడ్డూప్రసాదాలను సిద్ధం చేశారు. 22న ఉదయం 6 గంటలకు బిందే తీర్థం, 8 గంటలకు పుణ్యవచనం, కలశస్థాపన, సాయంత్రం 5 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, 25న అన్నకూటోత్సవం, 26న సహస్ర కలశాభిషేకం, 27న చందనోత్సవం, 28న పల్లవోత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న స్వామివారల జయంతి ఉత్సవం నిర్వహిస్తారు. -
బోగస్ క్రీడా సంఘాలను నమ్మొద్దు
● తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణలో కిక్ బాక్సింగ్ పేరిట పలువురు క్రీడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, అవి అన్ని బోగస్ క్రీడాసంఘాలని తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. కరీంనగర్లో ఆదివారం మాట్లాడుతూ ఏదైనా క్రీడా సంఘం ఏర్పాటైతే అది తెలంగాణ ఒలంపిక్ సంఘం, జాతీయ ఫెడరేషన్, భారత ప్రభుత్వం గుర్తింపు పొంది ఉండాలన్నారు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ మాత్రమే గుర్తింపు ఉందని ఈ సంఘం ఆధ్వర్యంలోనే ఏటా రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి, జాతీయ పోటీలకు తెలంగాణ జట్లను పంపిస్తున్నట్లు తెలిపారు. కొందరు మోసపూరితంగా సంఘాలను ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులను, పాఠశాలల యాజమాన్యాలను తప్పుదోవపట్టిస్తున్నారని వాటన్నింటని నమ్మవద్దని హితవు పలికారు. తెలంగాణ కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో జారీ చేసిన క్రీడా సర్టిఫికెట్లలకు ట్రిపుల్ఐటీ, ఎంసెట్ తదితర ఉన్నత విద్యకు స్పోర్ట్స్ కోటా వర్తిస్తుందన్నారు. తెలంగాణలో 25 జిల్లాల్లో కిక్ బాక్సింగ్ సంఘాలున్నాయని, ఇవన్ని ఒలంపిక్ సంఘంలో గుర్తింపుపొందాయని తెలిపారు. అనధికార సంస్థలు లేదా టోర్నమెంట్లు నిర్వహిస్తున్న వారు మానుకోవాలని హెచ్చరించారు. బోగస్ లేదా అనధికార సంస్థలు నిర్వహించే ఈవెంట్స్లో పాల్గొంటే అందులో పొందిన సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని సూచించారు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కిక్ బాక్సింగ్ సంఘాల కార్యదర్శులు, కోచ్లు సురభి అన్వేష్, వి.శ్రీనివాస్, సురభి ఇంద్ర, ఎ.సంజీవ్, ఎస్.వినీశ్, కె.వెంకటేశ్ పాల్గొన్నారు. మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టివేతచందుర్తి(వేములవాడ): అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ను ఆదివారం చందుర్తి పోలీసులు పట్టుకున్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ శివారులో అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్ను పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా అక్రమంగా తరలిస్తునట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిసింది. పట్టుకున్న టిప్పర్ను పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. కొద్ది రోజులుగా ఆదివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న ప్రచారంతో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. -
ఆదా ఏదయా..!
కోరుట్ల: తొమ్మిది నెలల క్రితం పట్టణంలోని దెబ్బతిన్న రోడ్లకు టెండర్ పిలవకుండా అర్ధరాత్రి..అపరాత్రి తేడా లేకుండా పారిశుధ్య కార్మికులతో రిపేర్ చేయించి మున్సిపల్ డబ్బులు ఆదా చేస్తున్నామని చెప్పిన అఽధికారులు.. వీధి దీపాలకు విద్యుత్ సరాఫరాలో ఆ అంశాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అంతుచిక్కడం లేదు. వేసవిలో చిన్నపాటి ఆదా అంశం నెలకు రూ.లక్ష ఖర్చు తగ్గిస్తుందనడంలో సందేహం లేదు. అసలే జనరల్ ఫండ్ అరకొరగా ఉన్న సమయంలో మున్సిపల్ అధికారులు విద్యుత్ ఆదా విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. 3 గంటలు ఆదా చేయచ్చు మున్సిపల్ అధికారులు చేస్తున్న పనిపై కాస్త నిబద్ధత చూపితే వేసవిలో ప్రతిరోజూ మూడు గంటల పాటు విద్యుత్ను ఆదా చేయొచ్చు. సాధారణంగా వేసవిలో సాయంత్రం 7.30 గంటల వరకు పొద్దుగూకడం లేదు. అదేవిధంగా ఉదయం 5 గంటలకే తెల్లవారుతుంది. మున్సిపల్ అధికారులు మాత్రం సాయంత్రం 5.30 గంటలకే వీధి దీపాలు ఆన్ చేస్తున్నారు. ఉదయం 6.30 గంటల వరకూ కొనసాగిస్తున్నారు. ఈ లెక్కన ప్రతిరోజూ ఎంత లేదన్నా సుమారు మూడు గంటలపాటు అవసరం లేకున్నా విద్యుత్ను వృథా చేస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు కింది స్థాయి సిబ్బందికి సరైన సూచనలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. అధికారులే ముందు జాగ్రత్తతో ఆదాపై దృష్టి సారించాల్సి ఉండగా.. వేసవిలో సాయంత్రం తొందరగా విద్యుత్ దీపాలు వేసి కరెంటు చార్జీలు వృథా చేస్తున్నారని జనం విమర్శించే వరకు ఎలాంటి పట్టింపు లేని ధోరణితో వ్యవహరించడం గమనార్హం. నెలకు రూ.లక్ష ఆదా.. కోరుట్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో సుమారు 6,200 విద్యుత్ దీపాలు ఉన్నాయి. వీటికి తోడు 42 కూడళ్లలో హైమాస్ట్ లైట్లు ఉన్నాయి. వీటన్నింటికి కలిపి ప్రతినెలా సగటున రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కరెంటు బిల్లు వస్తోంది. మున్సిపాలిటీలో సిబ్బంది జీతాలు మినహాయిస్తే అధిక మొత్తంలో ఖర్చు చేసేది విద్యుత్చార్జీలకే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేసవి కాలం సుమారు నాలుగు నెలలు గడిచేదాకా విద్యుత్ దీపాలు ఆన్ ఆఫ్ చేయడంలో కొద్దిపాటి ఏమరుపాటుతో వ్యవహరిస్తే ప్రతినెలా రూ.లక్ష వరకు విద్యుత్ బిల్లులు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా దుబారాగా విద్యుత్ వినియోగం చేస్తే మున్సిపల్ ఖజానాకు అనవసరంగా గండి పడుతుంది. మున్సిపల్ అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటే విద్యుత్ చార్జీలను ఆదా చేయచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


