breaking news
Jagitial District Latest News
-
● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల/మెట్పల్లి: బీఆర్ఎస్ హయాంలోనే కోరుట్ల, మెట్పల్లి పట్టణాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం కోరుట్లతోపాటు మెట్పల్లిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. మెట్పల్లి మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తెచ్చామని, ప్రతి వార్డులో వసతులు కల్పించామని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మోజార్టీతో గెలిపించాలన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటవ్.. పక్కన కాంగ్రెస్ అభ్యర్థులెందుకు..?
జగిత్యాల: ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అంటున్నవ్.. పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎందుకు కూర్చోబెట్టుకున్నవ్.. దమ్ముంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించు..’ అని ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఉద్దేశించి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి చూస్తుంటే జాలేస్తోందని, ఒకరోజు కాంగ్రెస్ పార్టీ అని, మరోరోజు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు పొందిన అభ్యర్థులను వెంటపెట్టుకునే దుస్థితి ఎందుకని ప్రశ్నించారు. ఓ వైపు ప్రజలు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు తిట్లపురాణం వింటుంటే తామే వినలేకపోతున్నామని ఎద్దేవా చేశారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్లు స్పీకర్ నడుస్తున్నారని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రావాలిగానీ.. కాంగ్రెస్ ఫ్లెక్సీ పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. జగిత్యాల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, జిల్లాకేంద్రంగా చేశారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు వొల్లం మల్లేశం, కార్యదర్శి ఆనందరావు పాల్గొన్నారు. -
కోరుట్ల చెక్పోస్టు..కాంచీట్
కోరుట్ల: 1957 సంవత్సరం నాటికే కోరుట్ల పట్టణం నగర పంచాయతీ. ఆ రోజుల్లో సరుకుల అమ్మకాలకు చుట్టపక్కల గ్రామాల నుంచి వచ్చేవారికి పట్టణ శివారులో చెక్పోస్టు ఉండేది. ఆ చెక్పోస్ట్ ప్రస్తుత చాకలి అయిలమ్మ విగ్రహం నుంచి లక్ష్మీ టాకీస్ ఏరియా వరకు ఉండేది. ఆ రోజుల్లోనే కొంచెం పెద్ద పట్టణంగా గుర్తింపు ఉన్న కోరుట్లకు పక్క నే ఉన్న గ్రామాల నుంచి కూరగాయలు, మొ క్కజొ న్నలు, వడ్లు వంటి సరుకుల అమ్మకానికి చెక్పోస్టు నుంచే వచ్చేవి. దీనికి కాస్త పక్కన మెయిన్ రోడ్డు వెంట గూనపెంకులతో నగర పంచాయతీ కార్యాలయం ఉండేది. ప్రస్తుతం ఆ పాత కార్యాలయాన్నే పాత మున్సిపాలిటీగా పిలుచుకుంటున్నారు. అర్ధరూపాయి.. అమ్మకానికి చీటీ ఆ కాలంలోనే బల్దియాగా గుర్తింపు పొందిన కోరుట్లకు రావడానికి ప్రధాన రహదారి కాంచీట్ ఏరియా. ఆ కాలంలో అది నిర్మానుష్య ప్రాంతంగా ఉండేది. బల్దియా సిబ్బంది అక్కడే ఉండి కోరుట్లకు స రుకులు అమ్ముకోవడానికి వచ్చే వారి నుంచి రోజు కు అర్ధ రూపాయి తీసుకుని చీటీ ఇచ్చి అనుమతించేవారు. మరుసటి రోజు మళ్లీ సరుకులు అమ్ముకోవడానికి వస్తే మళ్లీ బల్దియా పన్ను వసూలు చేసే వా రు. సరుకుల అమ్మకాలకు కోరుట్లకు వచ్చే వారు కాంచీట్ ఏరియా నుంచి అయిలాపూర్ దర్వాజా మీ దుగా శ్రీవేంకటేశ్వరాలయం, కాల్వగడ్డ ఏరియాలో ఉన్న మార్కెట్ వద్ద సరుకులు అమ్ముకుని వెళ్లేవారు. సైకిల్.. ఎడ్లబండ్లకు బిళ్లలు ప్రస్తుతం కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్తోపాటు ఇతరత్రా చార్జీలను ఆర్టీవో కార్యాలయం అధికారులకు చెల్లిస్తామో.. అదే రీతిలో ఆ కాలంలో కొత్త సైకిల్ కొన్నా.. ఎండ్లబండి చేయించుకున్నా బల్దియా నుంచి సీమెండి బిల్లలు ఇచ్చేవారు. ఇందుకు సైకిళ్లకు రూ.5, ఎడ్లబండికి రూ.7 వసూలు చేసేవారు. ఒక్కసారి వాహనానికి పన్ను చెల్లిస్తే జీవితకాలం అనుమతి ఉండేది. బల్దియా బిళ్ల లేని సైకిల్, ఎడ్లబండి కనిపిస్తే రూ.10వరకు జరిమానా వేసేవారు. ఆ కాలంలో పొలాల్లో, చేలలో పశువులు మేస్తే వాటిని బంధించి ఉంచడానికి కోరుట్లలోని ఆరు ప్రాంతాల్లో బంజరుదొడ్డి ఉండేవి. వాటి విడిపించుకోవాలంటే ఒక్కో ఆవు, బర్రెకు రూ.10 పన్నుగా వసూలు చేసే ఆనవాయితీ ఉండేది. ప్రస్తుతం బల్దియా పరిధిలో ఉన్న ఆ బంజరుదొడ్ల స్థలాలు దాదాపు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బల్దియాకాలం నాటి ముచ్చట్లను సీనియర్ సిటిజన్ గొనె శంకర్ వివరించారు. నాడు సరుకుల రాకపోకల దారి అక్కడే బల్దియా పన్ను వసూలు సైకిళ్లు, ఎడ్లబండ్లకు మున్సిపల్ బిళ్ల్లలు -
● సర్వేల పేరిట కాసుల వసూలు ● అభ్యర్థుల్లో ఆందోళన
కోరుట్ల: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ప్రధాన పార్టీలు సర్వేటీంలను నియమించిన విషయం తెల్సిందే. క్షేత్ర స్థాయిలో అభ్యర్థుల తీరుతెన్నులను పరిశీలించేందుకు పంపించారు. హైదరాబాద్లోని ఏజన్సీల నుంచి సర్వే కోసం వచ్చామని చెప్పి కొంతమంది జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో పర్యటించారు. అభ్యర్థులు అసలే తమకు పార్టీ టికెట్ వస్తుందో..రాదోనని టెన్షన్లో ఉండగా సర్వే టీం మెంబర్లు అభ్యర్థులను కలిసి సర్వే అనుకూలంగా ఇస్తామని, తమను ‘ఎంతోకొంత’ చూసుకోవాలని చెప్పి కాసులు వసూలు చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా పార్టీల టికెట్ కోసం పోటీలో ఉన్న అందరి నుంచి రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇక్కడితో ఆగకుండా ‘మళ్లీ రెండో సర్వే ఉంది.. మీ పరిస్థితి ఏంటో చెబుతాం.. మీరు ఎలా ప్రచారం చేయాలి.. మీ వార్డులో ఎవరు మీకు అనుకూలంగా ఉన్నారు..? ఎవరు ప్రతికూలంగా ఉన్నారనే విషయాలు తేల్చుతాం..’ అంటూ అభ్యర్థుల సెల్పోన్లకు మెసేజ్లు పెట్టి మరోసారి కాసుల వసూలు దిగడానికి సిద్ధమైనట్లు సమాచారం. అభ్యర్థుల టెన్షన్ను ఆసరాగా చేసుకున్న ఇలాంటి వారు ఎవరికివారు ఇలా సొమ్ము చేసుకుంటున్న తీరు కలవరపెడుతోంది. -
జగిత్యాల అభివృద్ధి కోసమే ఆరాటం
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: జగిత్యాల అభివృద్ధి కోసమే తన ఆరాటమని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బుధవారం మోతె పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చొరవతో రూ.62.5 కోట్ల యూఐడీఎఫ్ నిధులు మంజూరయ్యాయని, మున్సిపాలిటీకి రూ.245 కోట్లు వచ్చాయని తెలిపారు. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే పేదలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలన్నారు. యావర్రోడ్డు విస్తరణకు కట్టుబడి ఉన్నానని, సీఎం కూడా హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. మెజార్టీ స్థానాలు గెలుచుకునేలా పనిచేయాలన్నారు. నాయకులు గట్టు సతీశ్, గిరి నాగభూషణం, చంద్రశేఖర్గౌడ్, దామోదర్రావు, చెట్పల్లి సుధాకర్, క్యాదాసు నాగ య్య, తోట మల్లికార్జున్, గంగాధర్ పాల్గొన్నారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి రాయికల్: బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే సూచించారు. పట్టణంలో కాంగ్రెస్ బీఫామ్ పొందిన అభ్యర్థులతో సమావేశమయ్యా రు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రతిఒక్కరూ గెలుపొందేలా చూడాలని పిలుపునిచ్చారు. -
వారే వీరు..గుర్తులే తారుమారు
జగిత్యాల బల్దియాలో వింత పరిస్థితి జగిత్యాల: జిల్లాలో ప్రచార సమరం ప్రారంభమైంది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడం.. బీఫామ్ల లొల్లి కూడా కొలిక్కి రావడంతో టికెట్లు వచ్చిన అభ్యర్థులు కదనరంగంలోకి దిగారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల్లో రెబల్స్ ప్రభావం పెద్దగా లేదు. కానీ.. జగిత్యాలలో మాత్రం వింత పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 50 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ నుంచి అటు జీవన్రెడ్డి, ఇటు ఎమ్మెల్యే సంజయ్కుమార్ వర్గీయులు అన్ని స్థానాలకు నామినేషన్లు వేశారు. అయితే వీరిలో సంజయ్ వర్గంలోని 35 మందికి బీఫామ్లు దక్కాయి. జీవన్రెడ్డి వర్గంలోని 15 మందికి మాత్రమే బీఫామ్లు లభించాయి. అయితే సంజయ్ వర్గం నుంచి బరిలో ఉన్నవారంతా తాజా మాజీ కౌన్సిలర్లు కావడం విశేషం. 35 మందిలో 30 మంది గతంలో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. సంజయ్ కుమార్ కూడా ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచే గెలిచినప్పటికీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వెంట నడిచిన వారు ప్రస్తుతం కూడా ఆయనతోనే ఉన్నారు. తాజాగా వారికే కాంగ్రెస్ నుంచి టికెట్లు కూడా లభించాయి. పాతకాపులే పోటీ చేస్తున్నా.. కేవలం పార్టీ గుర్తులు మాత్రం మారాయి. ఇరువర్గాల మధ్య పోటీ తీవ్రం.. ఎమ్మెల్యే వర్గీయులకు అత్యధికంగా టికెట్లు రావడం.. జీవన్రెడ్డి వర్గీయులు ఒక్కరు కూడా విత్డ్రా చేసుకోకపోవడంతో పోటీ తీవ్రమైంది. ప్రధాన పార్టీల మధ్య పోరు ఉండాల్సింది పోయి కాంగ్రెస్ రెబల్స్ మధ్యనే పోటీ నెలకొంది. మున్సిపాలిటీని సునాయాసంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ బీఫామ్ల గొడవతో ఏ పార్టీ గెలుస్తుందోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడంతో ఆ పార్టీ కాస్త ఢీలా పడినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత కాంగ్రెస్ గొడవను క్యాచ్ చేసుకుని బల్దియాను ఎలాగైనా కై వసం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. ఆచీతూచి వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ ఎక్కడెక్కడ వీక్ ఉందో చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. బీజేపీ కూడా బల్దియాలో పాగా వేసేందుకు ప్రచారంలోకి దిగింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే జగిత్యాల జిల్లా అయ్యిందని, మెడికల్ కళాశాల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలను చెప్పుకుంటూనే కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ జిల్లాలో జగిత్యాలే అతిపెద్ద మున్సిపాలిటీ. ఇక్కడ 50 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డులకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ మినహా ఏ పార్టీలోనూ రెబల్ లేరు. ఒక్క కాంగ్రెస్లోనే రెబెల్స్ మోగిస్తున్నారు. జీవన్రెడ్డి వర్గీయులకు టికెట్లు రాకపోవడంతో బరిలో ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే తన మద్దతు అని జీవన్రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఆయన చరిష్మాతో విజయం సాధిస్తామని, కాంగ్రెస్ జెండామోయకున్నా..టికెట్ దక్కించుకున్న వారిని ఓడిస్తామని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతూ అనుకూలమైన వారందరికీ ప్రచారం చేస్తానని ప్రకటిస్తూ.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ ఎమ్మెల్యే వర్సెస్ జీవన్రెడ్డి పోటీగా మారింది. మొగ్గు ఎటువైపో..? ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ.. గతంలో బీఆర్ఎస్లో ఉన్నవారికి ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున టికెట్లు ఇప్పించుకున్నారు. వీరు కూడా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు జీవన్రెడ్డి వర్గం తామే అసలైన కాంగ్రెస్వాదులమని, తమను గెలిపించి పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో ఇక్కడ ఎన్నికల సమరం రసవత్తరంగా నడుస్తోంది. అభివృద్ధి మంత్రంతో అధికార పార్టీ.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు అధికార పార్టీ అన్నిదారులు వెతుకుతోంది. ఉచిత కరెంట్, మహాలక్ష్మీ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గెలిపించాలని కోరుతోంది. బీజేపీ కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. -
ఒకే ఇంటి నుంచి ఇద్దరు పోటీ
రాయికల్: రాయికల్ బల్దియాలో ఒకే ఇంటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు పోటీ చేస్తున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లుతోపాటు ఆయన తమ్ముడి కుమారుడు మోర రాంమూర్తి బరిలో నిలి చారు. మోర హన్మండ్లు ఏడోవార్డులో బరిలో ఉండగా.. మోర రాంమూర్తి 12వ వార్డులో పోటీలో ఉన్నా రు. హన్మండ్లు రిటైర్డ్ లెక్చరర్ కావడంతోపాటు మొ దటి మున్సిపల్ చైర్మన్గా ప్రజలకు సేవలందించారు. హన్మండ్లు తమ్ముడు, స్వర్గీయ ఆంజనేయులు గతంలో ఎంపీపీగా పనిచేశారు. ఆయన కుమారుడు రాంమూర్తి మొదటిసారి 12వవార్డు నుంచి పోటీలో ఉన్నారు. -
రెండేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు
ధర్మపురి: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురి బల్దియా ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలుచేశామని, మిగిలిన రెండు త్వరలోనే తీరుస్తామని తెలిపారు. 2018 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేస్తానని మాట తప్పారని, యాదాద్రిని అభివృద్ధి చేశారే తప్పా ధర్మపురికి రూపాయి ఇవ్వలేదని తెలిపారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. ముందుగా ఇంటింటా ప్రచారం చేశారు. -
కలెక్టరేట్లో సోషల్ జస్టిస్ డే
జగిత్యాల: అన్నివర్గాల వారికి సమాన అవకాశాలు అందాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం సోషల్ జస్టిస్ డే వేడుకలు నిర్వహించారు. అన్నివర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తోందని, ఇందులో భాగంగా ఈనెల 4న సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహించుకోవాలని నిర్ణయించిందన్నారు. సమసమాజ స్థాపనకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ముందుగా విద్యార్థుల నృత్యాలు, కళాజాత బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, సునీత, చిత్రు, రాజ్కుమార్ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి మున్సిపల్ ఎన్నికల రెండో ర్యాండమైజేషన్ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో ఎన్నికల అబ్జర్వర్ సుదమరావు ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలన్న ఉద్దేశంతో ర్యాండమైజేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల అధి కారి రాము, కలెక్టరేట్ ఏవో హకీం పాల్గొన్నారు. వైద్య సేవలపై ఆరామెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం ఆత్మకూర్లోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నరేందర్ బుధవారం సందర్శించారు. కేంద్రంలోని వైద్య సేవలపై ఆరా తీశారు. సాధారణ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలపై తెలుసుకున్నారు. మాతాశిశు ఆరోగ్య సేవలు, టీకాల నిల్వలు, కోల్డ్చైన్ నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏఎన్ఎంలతో సమావేశమై సలహాలు, సూచనలు ఇచ్చారు. మెట్పల్లి మండల వైద్యాధికారి అంజిత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాల డీన్గా నీరజజగిత్యాలఅగ్రికల్చర్: పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా బోగ నీరజ నియమితులయ్యారు. బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ డీన్గా భారతీనారాయణ్ భట్ పనిచేశారు. నీరజ గతంలో ఉద్యానవర్సిటీలో పనిచేశారు. జేఎన్టీయూ విద్యార్థులకు త్రీడీ వర్క్షాప్కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూలో వన్డే హ్యాండ్ ఆన్ వర్క్షాప్ త్రీడి ప్రింటింగ్, ఆప్టిట్యూడ్ మ్యానుఫ్యాక్చరింగ్ నిర్వహించారు. టీబీఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా రాకేష్ వ్యవహరించారు. బీటెక్ మెకానికల్ సెకండియర్, థర్డియర్, ట్రిపుల్ఈ థర్డియర్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి వివిధ రకాలైన నమూనాలను త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారుచేశారు. అధ్యాపకులు ప్రతిభ కనబరచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరసింహ, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
7న నవోదయ పరీక్ష
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో 9,11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈ నెల 7న జరుగుతుందని ఇన్చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్ల పంపిణీ ఆన్లైన్ ద్వారా చేశామని, డౌన్లోడ్ చేసుకోవాలని, ఇంకా హాల్ టికెట్ రానివారు ఈ నెల 4న చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఏవైనా సందేహాలుంటే 7989693572 నంబర్లో సంప్రదించాలని కోరారు. రూ.1.40 లక్షల నగదు సీజ్సిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సిరిసిల్ల మండలం తంగళ్ళపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్టులో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ 03బీ జెడ్ 9740 నంబర్ గల కారును తనిఖీ చేయగా, అనుమానాస్పద నగదు రూ.1.40 లక్షలను పోలీసులు గుర్తించారు. తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్కు చెందిన డ్రైవర్ నందగిరి నాగరాజు నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్కరీంనగర్క్రైం: ఓ మహిళ కరీంనగర్ బస్టాండ్ సమీపంలో తన బంగారు ఆభరణాలు కలిగిన పర్సు పోగొట్టుకోగా ఆటోడ్రైవర్కు దొరకడంతో వన్టౌన్ పోలీసుస్టేషన్లో అందచేసి నిజాయితీ చాటుకున్నాడు. రామడుగు మండలానికి చెందిన బొజ్జ లక్ష్మి మంగళవారం ఇల్లంతకుంట మండలం జవారీపేటకు వెళ్లేందుకు కరీంనగర్ వచ్చింది. బస్టాండు సమీపంలో 1.5 తులాల బంగారు రింగు, గుండ్లు, నగదు కలిగిన పర్సును పోగొట్టుకుంది. ఆ పర్సు భగత్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ కోలపూరి జగన్కు దొరికింది. బస్టాండులోని పోలీసు అవుట్పోస్టు వద్దకు వచ్చి వన్టౌన్ ఎస్సై రాజన్న ఆధ్వర్యంలో లక్ష్మీకి పర్సు అందజేశాడు. ఆటోడ్రైవర్ జగన్ను పోలీసులు, స్థానికులు అభినందించారు. బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ గ్రామంలో రైతుల చేల వద్ద బావులు, బోరు మోటార్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన కనెక్టింగ్ కేబుల్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పలువురు రైతులు తెలిపారు. సుమారు 20మంది రైతుల కేబుల్ వైర్లు సోమవారం రాత్రి అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు. ఉదయం పొలాలకు వెళ్లిన పలువురు రైతులు వైర్లు కట్ చేసి ఉండటాన్ని గమనించారు. కేబుల్ వైర్లు కాల్చి అందులోని రాగిని తీసి అమ్ముకునేందుకు వైర్లు కట్చేసి తీసుకెళ్లి ఉంటారని గంగారెడ్డి తదితర రైతులు చెబుతున్నారు. ఇలా పలుసార్లు పొలాల వద్ద వైర్లు ఎత్తుకెళ్తున్నారని వాపోయారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణంమెట్పల్లి: పట్టణంలోని ఆరపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. సాయిరాంకాలనీకి చెందిన కేతావత్ ప్రవీణ్ బుల్లెట్ వాహనంపై స్నేహితుడు జలిగం వెంకటేశ్తో కలిసి సోమవారం రాత్రి సమయంలో కోరుట్లకు బయలుదేరాడు. మార్గంమధ్యలో ఆరపేట వద్దకు చేరుకోగానే.. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రవీణ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రవీణ్ భార్య సురేఖ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆన్లైన్లో పెట్టుబడిపెట్టించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: ఆన్లైన్ యూబెట్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాలలోని అంగడిబజార్కు చెందిన కట్కం చంద్రశేఖర్ను పట్టణానికి చెందిన వేముల మల్లికార్జున్ మల్టీలెవల్ మార్కెటింగ్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని యూబిట్ ట్రేడింగ్ యాప్లో క్రిప్టో కరెన్సీ ద్వారా గొలుసుకట్టు వ్యాపారంలో రూ.20 లక్షలు పెట్టించాడు. మల్లికార్జున్తోపాటు, పిల్లి కిషన్, ధరూర్కు చెందిన శివగంగ, యూబెట్ కంపెనీ మేనేజర్ బ్రిజ్ మోహన్, సంజయ్ గుప్తా కంపెనీ నడిపిస్తున్నారని చెప్పారు. ఇటీవల కంపెనీ మూతపడటంతో తన డబ్బులు చెల్లించాలని చంద్రశేఖర్ అడగగా తప్పించుకుతిరుగుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జనవరి ఒకటోతేదీన కేసు నమోదు చేసి మల్లికార్జున్ను ధరూర్ క్యాంప్లోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు. -
సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా..
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన చంద్రుపట్ల రాంరెడ్డి 1970లోనే సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత ఎంపీపీగా పనిచేసి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సర్పంచ్ మొదలు.. ఎమ్మెల్యే వరకు ఆయన అనేక ప్రజాసమస్యలపై పోరాటం చేశారు. ప్రజల్లో తన పేరును పదిలం చేసుకున్నారు. 1970లో రాజకీయాల్లోకి.. 1970లో రాజకీయాల్లోకి వచ్చిన రాంరెడ్డి.. సర్పంచ్గా కొనసాగుతూనే మండల ప్రెసిడెంట్ బాధ్యలు నిర్వహించారు. 1989లో ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుపై విజయం సాధించారు. 1999లో శ్రీధర్బాబుపై ఓటమి చెందారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్లో చేరి చురుకుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా విషయంలో విద్యుత్ అధికారులపై దాడిచేసి గుర్తింపు పొందారు. పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని భావించారు. రాంరెడ్డి కుమారుడు సునీల్రెడ్డి(బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు) కాగా, రెండోకుమారుడు అమెరికాలో స్థరపడ్డారు. గురువారం ముత్తారం మండలం సీతంపేటలోని వ్యవసాయ క్షేత్రంలో రాంరెడ్డి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామన్న మృతిపై స్వగ్రామంతోపాటు నియోజకవర్గంలోని అయన అభిమానులు, బీజేపీ తదితర పార్టీలు, కుటుంభ సభ్యుల్లో విషాదం నింపింది. పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రజాసేవలో రాంరెడ్డి ప్రత్యేక ముద్ర అనారోగ్యంతో మంథని మాజీ ఎమ్మెల్యే కన్నుమూత -
క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం
మల్లాపూర్: వారందరిదీ నిరుపేద కుటుంబాలు. రెక్కాడితేనే డొక్కాడుతుంది. అలాంటి కూలీలు ఉపాధి కోసం మండలంలోని మొగిలిపేటకు చెందిన ఎర్రంశెట్టి గంగాధర్ రైతు పొలంలో పసుపు ఏరడానికి ట్రాక్టర్లో వెళ్లారు. సుమారు 15 మంది కూలీలతో గంగాధర్ తన సొంత ట్రాక్టర్లో బయల్దేరాడు. తోటి కూలీలుతో సరదాగా మాట్లాడుకుంటూ అలసట మర్చిపోయి పొద్దంతా పనులు పూర్తి చేసుకున్నారు. సాయంత్రం సమయంలో గంగాధర్ ట్రాక్టర్లోనే ఇంటికి బయల్దేరారు. మరో 10 నిమిషాల్లో ఇళ్లు చేరేదే. అంతలోనే ట్రాక్టర్ను గంగాధర్ స్పీడ్గా నడపడంతో రోడ్డు పక్కనున్న నీటి గుంతలో పడిపోయింది. ఆ కూలీలను కానరాని లోకాలకు తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంగళారపు లలిత (45), పెద్దిరెడ్డి గంగు(45), సంపంగి సాయమ్మ(38), రొడ్డ వైష్ణవి(13) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అంతా క్షణాల్లోనే జరగడంతో ఏం జరిగిందో కూడా కూలీలకు అర్థం కాలేదు. ఆర్తనాదాల మధ్య స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, పోలీసులు క్షతగాత్రులను ప్రైవేటు వాహనాలు, 108లో మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన సంపంగి సాయమ్మది నిరుపేద కుటుంబం. భర్త ఎల్లయ్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. ఇద్దరు పిల్లలతో కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతోంది. పెద్దిరెడ్డి గంగు భర్త గంగాధర్ ఆర్థిక ఇబ్బందులతో ఐదేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కూలీ పనులు చేసుకుంటూనే ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. రొడ్డ పోశయ్య, అనిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. రెండో కుమార్తె వైష్ణవి స్థానిక ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి చదువుకుంటూనే కుటుంబానికి అండగా నిలవాలని అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తోంది. మంగళారపు లలితకు భర్త ధర్మరాజు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ధర్మరాజు నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకుంటున్నాడు. పెద్ద కూతురుకు వివాహం జరిపించాడు. మిగిలిన కూతుళ్లు, కుమారుడిని చదివించేందుకు లలిత కూలీ పనులకు వెళ్తోంది. మృతదేహాలను ఆస్పత్రికి తరలించడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, నాయకులు, అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్, కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు హామీ ఇచ్చారు. తహశీల్దార్ శ్రీనివాస్, సీఐ అనిల్కుమార్, ఎస్సైలు అనిల్, కిరణ్, నవీన్కుమార్ మృతదేహాలను పరిశీలించారు. పోలీసుల అదుపులో ట్రాక్టర్ యజమాని ప్రమాదానికి కారణమైన ఎర్రంశెట్టి గంగాధర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కూలీ పనులకు వెళ్లి విగతజీవులుగా ఇంటికి తిరిగొస్తూ.. కానరానిలోకాలకు.. నలుగురి మృతి.. మరో ఎనిమిదిమందికి గాయాలు మల్లాపూర్ మండలం మొగిలిపేటలో విషాదం -
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
మెట్పల్లిరూరల్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెట్పల్లి మండలం వేంపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన దండె నర్సింహులు (46) కొన్నేళ్లుగా వేంపేటలో నివాసం ఉంటున్నాడు. పశువుల కాపరిగా ఉంటూ జీవనం సాగిస్తున్న నర్సింహులు.. సోమవారం సాయంత్రం సమయంలో గ్రామ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ తీగ సహాయంతో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సింహులు భార్య నర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్లో జనవరి 22న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనగోని క్రాంతికుమార్ (41) చికిత్స పొందుతూ మంగళవారం కరీంనగర్లో మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన క్రాంతికుమార్ హస్నాబాద్కు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆర్నెళ్ల క్రితం అతని తమ్ముడు మృతిచెందడంతో అప్పటినుంచి మద్యానికి బానిసయ్యాడు. భార్య కోసమని గతనెల 22న హస్నాబాద్ వచ్చాడు. భార్య లేకపోవడంతో తాగిన మైకంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన అత్తింటివారు వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. క్రాంతికుమార్ సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ హెడ్కానిస్టేబుల్ రవీందర్ తెలిపారు. ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన సాత్తూరి సందీప్(31) బైక్ అదుపుతప్పి పంట పొలాల్లో పడి మృతిచెందాడు. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లిలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సందీప్.. రోజూ బైక్పై వెళ్లి వస్తుంటాడు. సోమవారం కూడా బైక్పై వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నాడు. కొలనూర్ శివారులోకి రాగా బైక్ అదుపుతప్పి పంట పొలాల్లో పడి గాయాలకు గురై మృతి చెందాడు. మంగళవారం ఉదయం రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి మొండయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కమాన్పూర్ గ్రామానికి చెందిన గిర్ర దేవేందర్ కుటుంబసభ్యులతో కలిసి రామడుగు మండలం గోలిరామయ్యపల్లికి వెళ్లారు. గమనించిన దొంగలు ఈ నెల 24వ తేదీన రాత్రి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.89వేల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడిచ్చిన ఫిర్యాదుతో సీసీ కెమరాలు, టెక్నాలజీని ఉపయోగించి దొంగల ను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడ్డ క మాన్పూర్ వడ్డెపల్లికి చెందిన సూర సీతారాం, తపాలా స్వామికుమార్, బంజారా కార్తీక్, చింతకుంటకు చెందిన చందా రాజు, కమాన్పూర్ కు చెందిన బోనాల శివను మంగళవారం అరె స్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల ను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సైలు సాంబమూర్తి, తిరుపతిని సీఐ అభినందించారు. -
బీఎల్వోలు విధులు జాగ్రత్తగా నిర్వర్తించాలి
జగిత్యాల: బీఎల్వోలు తమ విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. మంగళవారం బీఎల్వోలతో సమావేశమయ్యారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్వోల కీలకపాత్ర అని, అర్హులందరినీ నమోదు చేయాలని పేర్కొన్నారు. ఫాం 6,7,8 లను సక్రమంగా స్వీకరించాలని, సకాలంలో ప్రాసెస్ చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, మొబైల్ యాప్ల ద్వారా డేటా అప్లోడ్ చేయాలన్నారు. ఎన్నికలకు స్వచ్ఛతకు అందరు సహకరించాలన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్, బీఎల్వోలు పాల్గొన్నారు. -
బర్త్డే పార్టీలో యువకులపై దాడి
కరీంనగర్రూరల్: నడిరోడ్డుపై బర్త్ డే పార్టీ చేసుకోవడమే కాకుండా కారుపైకి ఎక్కి తల్వార్తో కేక్ కట్ చేసి హంగామా చేసి, ఇరువురిపై దాడి చేసి డబ్బులు,సెల్ఫోన్ తీసుకున్న తొమ్మిది మందిని మంగళవారం కరీంనగర్రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు.. తీగలగుట్టపల్లిలోని హన్మాన్నగర్లో గత నెల 31న అర్ధరాత్రి 12గంటలకు నడిరోడ్డుపై ఓ మైనర్ బర్త్ డే పార్టీని యువకులు నిర్వహించారు. కారుపైకి ఎక్కి తల్వార్తో కేక్ ట్ చేయడంతోపాటు టపాసులు కాల్చుతూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేశారు.ఈ సమయంలో టెంట్హౌజ్ సామగ్రిని వాహనం నుంచి దించుతున్న యుగంధర్, చరణ్పై కొందరు యువకులు కర్రలు, బండలతో దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ.2వేలతోపాటు సెల్ఫోన్ తీసుకుని పగులకొట్టారు. స్థానికులు వచ్చి యువకులను అక్కడి నుంచి వెళ్లగొట్టి బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. మరుసటిరోజు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజయ్, విఘ్నేష్, రంజిత్లు మేజర్లు కాగా మిగితా ఆరుగురు మైనర్లున్నారని సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. ముగ్గురిని కరీంనగర్జైలుకు, ఆరుగురు మైనర్లను వరంగల్ జువైనల్హోమ్కు తరలించినట్లు వివరించారు. తొమ్మిది మంది అరెస్టు -
బల్దియాల్లో గులాబీ జెండా ఎగరాలి
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలుగాని హామీలు ఇచ్చి విఫలమైన విషయాన్ని ఇంటింటా వివరించాలన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పటివరకు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావును అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, వొల్లం మల్లేశం పాల్గొన్నారు. -
మెట్పల్లి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్గా రాజారాం
మెట్పల్లి: మెట్పల్లి స్పెషల్ జూడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్గా మెట్పల్లికి చెందిన న్యాయవాది దయ్య రాజారాం నియమితులయ్యారు. ఈ మేరకు లా సెక్రటరీ పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా ఆయన కొంతకాలం ఈ బాధ్యతలు చేపట్టారు. తాజాగా మరోసారి నియామకం కావడంపై పలువురు న్యాయవాదులు ఆయనను అభినందించారు. స్తంభంపల్లిలో ఎడ్లబండ్ల పోటీలువెల్గటూర్: మండలంలోని స్తంభంపల్లిలో స్వయంభూ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. పోటీల్లో జాబితాపూర్కు చెందిన ఆంజనేయస్వామి మొదటిస్థానం, కోట్లపల్లి సాగర్, నేరెళ్ల నరేశ్గౌడ్ ద్వితీయ స్థానంలో నిలవగా.. విజేతలకు మంత్రి బహుమతి ప్రదానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ చింతల రాజయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శైలేందర్రెడ్డి, ఉపసర్పంచ్ ప్రతాప్రావు, నాయకులు పాల్గొన్నారు. గణితం బోధించిన కలెక్టర్ మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం బండలింగాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం సందర్శించారు. విద్యార్థుల హాజరు, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం అమలుపై తెలుసుకున్నారు. బోర్డుపై లెక్కలు రాసి విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, పనుల్లో వేగం పెంచాలన్నారు. ఆర్డీవో శ్రీనివాస్, డీఈవో రాము, తహసీల్దార్ నీత, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఎంపీడీవో సురేశ్, ఎంఈవో చంద్రశేఖర్, ఎంపీవో మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి మెట్పల్లి: రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. అనంతరం మందుల నిల్వ గదిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా కో–ఆర్డినేటర్ రామకృష్ణ తదితరులున్నారు. -
అసంతృప్తుల జ్వాలలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో టికెట్లు ఆశించిన ఆశావహులకు నిరాశ ఎదురవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియడంతో బీఫారాలు అందుకున్న అభ్యర్థులు ప్రచార బరిలో దిగారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కలేదన్న ఆగ్రహంతో పలువురు బహిరంగ నిరసనలకు దిగారు. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆశావహులు రోడ్డెక్కారు. పార్టీ సభ్యత్వాలు, పదవులకు రాజీనామా చేయడం, నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేయడం, నేతల ఇళ్ల ముందు ఆందోళనలు నిర్వహించడం, పరస్పర వాగ్వాదాలకు దిగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు ఆశావహులు పార్టీ పెద్దల ఇళ్లముందు ఆందోళన చేపట్టారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కొందరు స్వతంత్రులుగా.. మరికొందరు పార్టీ రెబల్స్గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ పార్టీలకు రాజీనామా చేసి ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ పరిణామాలు ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పిగా మారాయి. రెబల్స్ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికీ.. చాలాచోట్ల పరిస్థితి అదుపులోకి రావడం లేదు. టికెట్ల వ్యవహారం మరింత మంటలు రాజేస్తుండటంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ పోరు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. రెబల్స్ బెడద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు అందించే సమయంలో హైడ్రామా నెలకొంది. ఒకే డివిజన్కు రెండు బీఫామ్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. పీసీసీ ఆదేశాలకు వ్యతిరేకంగా స్థానిక నాయకులు బీఫామ్లు అందించడం కలకలం రేపింది. తొలుత 50వ డివిజన్ అభ్యర్థిగా కొత్త అనిల్ను హైకమాండ్ ప్రకటించింది. అదే సమయంలో పార్టీ కార్పొరేషన్ ఇన్చార్జి వైద్యుల అంజన్కుమార్ బీఫామ్ను చక్రధర్రావుకు అందించారు. ఈ విషయం తెలిసి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అవాక్కయ్యారు. అనిల్కు కాదని బీఫామ్ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎలాగైనా అనిల్కు న్యాయం చేయాలనే ఆలోచనతో హైకమాండ్ అప్పటికే 57వ డివిజన్ పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయించిన బీఫామ్ అందించారు. ఒక విధంగా అటు నగర, అసెంబ్లీ ఇన్చార్జిలు పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు బందోబస్తు జగిత్యాలక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జీవన్రెడ్డి వర్గానికి బీఫామ్లు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్కుమార్ క్యాంప్ కార్యాలయం వద్ద, జీవన్రెడ్డి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూశారు. -
ప్రచారం షురూ..!
జగిత్యాల: రెండు రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూసిన బీఫామ్లు ప్రతి పార్టీకి చెందిన వారికి రావడంతో కార్యాలయాల్లోనూ అందించారు. పార్టీల్లో టికెట్లు రాని వారిలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల, రాయికల్ కాంగ్రెస్లో అగ్గి రాజుకుంటోంది. మొదటి నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్కుమార్ను సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ మున్సిపల్కు సంబంధించిన బీఫామ్లో ఎమ్మెల్యే సంజయ్కుమార్ వర్గానికే అత్యధికంగా కట్టబెట్టారు. మొదట 30 సీట్లు ఎమ్మెల్యేకు, 20 సీట్లు జీవన్రెడ్డికి కేటాయించారు. చివరి సమయంలో జీవన్రెడ్డికి సంబంధించిన ఐదుగురిని తొలగించి ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారికే బీఫాంలు అందించారు. దీంతో టికెట్లు రాని వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవన్రెడ్డి ఇంటి వద్ద ఆందోళన జీవన్రెడ్డి వర్గీయులకు టికెట్లు రాకపోవడంతో ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ను అనరాని మాటలతో దూషించారు. తమ కడుపు కొట్టాడని, ఎన్నడూ జెండా ఎగురవేయనివారికి టికెట్ అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 30 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా.. ఇందులో చాలామందికి కాంగ్రెస్ బీఫాంలు వచ్చాయి. వీరంతా ఎమ్మెల్యే వైపు ఉన్నారు. తినేపళ్లాన్ని లాకున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాయికల్లో చాలామంది జీవన్రెడ్డి వర్గీయులకు టికెట్లు రాకపోవడంతో పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్ అవమానంతో పోటీ నుంచే వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఉదయం నుంచి హడావుడి జీవన్రెడ్డి ఇంటి వద్ద ఉదయం నుంచే భారీగా కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జాబితా ప్రకటించడం, అందులో చాలామందికి టికెట్లు రాకపోవడంతో ఉదయం నుంచి జీవన్రెడ్డిని కలుస్తున్నారు. అతని ఇంటి ముందే ఎమ్మెల్యే సంజయ్కుమార్పై బూతు పురాణాలు వెళ్లగక్కారు. ఒకానొక దశలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కన్నీటి పర్యంతం కాంగ్రెస్ పార్టీ టికెట్ రాని వారు జీవన్రెడ్డి వద్దకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. టికెట్ రానప్పటికీ అండగా ఉంటానని జీవన్రెడ్డి వారికి సూచించారు. పోటీలో ఉండి గెలుస్తామని సైతం హామీ ఇచ్చారు. ఏదేమైనా అధికార పార్టీ కాంగ్రెస్లో బహిరంగంగానే వివాదాలకు దారితీస్తోంది. ఈ వివాదం ఎన్నికల్లో ఎటు వైపు దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీజేపీలో కూడా.. బీజేపీలోనూ అసంతృప్తి నెలకొంది. 26వ వార్డులో బీజేపీ నుంచి సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమ నామినేషన్ దాఖలు చేయగా బీఫాం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 22వ వార్డులో అర్వ లక్ష్మీ బీజేపీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా టికెట్ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగంగానే ఎంపీ అర్వింద్పై విమర్శలు చేశారు. రెబల్ గుబులు పార్టీల్లో టికెట్లు రాకపోవడంతో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. జీవన్రెడ్డి వర్గీయులు, ఇటు ఎమ్మెల్యే వర్గీయులు తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరిద్దరు పోటీ చేస్తుండడంతో అవకాశాన్ని ఎలాగైనా అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్, బీజేపీలు చూస్తున్నాయి. చైర్మన్ పదవి కోసం పావులు జగిత్యాల చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా అందుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. గతంలో చైర్మన్గా పనిచేసిన అడువాల జ్యోతి పదవిని ఆశిస్తున్నారు. అదే సమయంలో గతంలో ఒక్క ఓటుతో ఓడిపోయిన సమిండ్ల వాణి కూడా చైర్మన్ పదవి కోసం పోటీపడుతున్నారు. తాజాగా లైబ్రరీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్ సతీమణి గొల్లపల్లి మాధవీలత చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇందులో మొదట ప్రకటించిన కాంగ్రెస్ జాబితాలో మాధవిలత పేరు లేదు. ఆ స్థానంలో వీరబత్తిని పద్మజ ఉండేది. వీరంతా చివరి నిమిషంలో బీఫాం సాధించారు. చైర్మన్ పదవి ఆశిస్తున్న ఓ సభ్యుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కోసం నజరానా సైతం ప్రకటించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ అనుకూలించకపోవడంతో పోటీలో దిగినట్లు తెలిసింది. -
కట్టలు తెంచుకున్న ఆగ్రహం
జగిత్యాలటౌన్: దశాబ్దం పాంటు పార్టీ జెండా మోసిన వారిని పక్కనపెట్టి బీఆర్ఎస్లో కొనసాగుతున్న వారికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చారంటూ ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల బల్దియాకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో టికెట్ రాని వారు మంగళవారం మాజీమంత్రి జీవన్రెడ్డిని కలిసి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని తప్పుబట్టారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్న వారికి కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ జెండా మోసినోళ్లకు టికెట్లు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తే నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్కుమార్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీచేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ నాయకుడు తన భుజంపై ఉన్న కాంగ్రెస్ కండువాను కింద పడేశాడు. ఆగ్రహంతో ఎమ్మెల్యే సంజయ్పై బూతు పురాణం అందుకున్నారు. తమ నాయకుడు జీవన్రెడ్డి అని, ఆయన నిర్ణయమే ఫైనల్ అని తేల్చిచెప్పారు. జీవన్రెడ్డి ముందు ఆవేదన జగిత్యాల: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో జగి త్యాల 26వ వార్డు నుంచి వీరబత్తిని పద్మజకు సో మవారం రాత్రి టికెట్ కేటాయించారు. మంగళవా రం చివరి నిమిషంలో గొల్లపల్లి మాధవిలతకు ఇచ్చారు. దీంతో పద్మజ జీవన్రెడ్డి వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. మాధవి ఎమ్మెల్యే వర్గంలో కొనసాగుతున్నారు. టికెట్ రాకపోవడంతో జీవన్రెడ్డి వద్దకు రావడం కొసమెరుపు. అక్కడికే వెళ్లి తేల్చుకోవాలని జీవన్రెడ్డి బదులివ్వడం కొసమెరుపు బీజేపీలోనూ నిరసన జ్వాలలు తాను పేద కార్యకర్తనని, టికెట్ వస్తుందని ఆశించినా అన్యాయం చేసిందంటూ బీజేపీ సీనియర్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 22వ వార్డు మహిళకు కేటాయించడంతో పులి శ్రీధర్ బీజేపీ నుంచి తన తల్లిని నిలబెట్టి గెలిపించుకున్నారు. ఈసారి కూడా 25వ వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈసారి కూడా తన తల్లిని నిలబెట్టేందుకు శ్రీధర్ సిద్ధమైనా టికెట్ దక్కకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి పెట్టిన లత ధర్మపురి: బీజేపీ నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేసిన అభ్యర్థికి బీఫాం రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కంటతడి పెట్టారు ధర్మపురిలోని 8వ వార్డుకు చెందిన దోనకొండ లత. తన భర్త దోనకొండ నరేష్ బీజేపీ సీనియర్ నాయకుడని, దళిత మోర్చ జిల్లా ప్రధానకార్యదర్శి అయినా బీఫాం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు. -
సింహం ధైర్యం..!
ఏనుగు బలం..సాక్షిప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో టికెట్లు దక్కని ఆశావహులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏఐఎఫ్బీ (సింహం గుర్తు), బీఎస్పీ (ఏనుగు గుర్తు) పార్టీలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. సింహం ధైర్యానికి, ఏనుగు బలానికి ప్రతీకగా భావించే ఈ గుర్తులు ఇప్పుడు రాజకీయంగా కూడా బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో అంతర్గత అసంతృప్తి, రెబెల్స్ బెడద ఎక్కువగా ఉన్న వార్డులు, డివిజన్లలో ఈ గుర్తులు ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇస్తున్నాయి. ముందస్తు వ్యూహాలు టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయంగా పోటీ చేసేందుకు ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకుంటున్న నేతలు ఏఐఎఫ్బీ, బీఎస్పీ నాయకత్వాలతో చర్చలు జరిపి, అవసరమైతే తమకు ఆ పార్టీ గుర్తు కేటాయించాలంటూ మాట తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రధాన పార్టీల తరఫున నామినేషన్ దాఖలు చేస్తూనే, ప్రత్యామ్నాయంగా ఏఐఎఫ్బీ, బీఎస్పీ పేర్లతో కూడా నామినేషన్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పరిధిలో ఉన్న రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా చివరి నిమిషాల్లో ‘ఆపద్బాంధవ’ పార్టీలుగా ఏఐఎఫ్బీ, బీఎస్పీలు మారుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు సవాల్ ఏఐఎఫ్బీ, బీఎస్పీ, జనసేనతో పాటు ఇతర చిన్న పార్టీల రంగప్రవేశం కూడా ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఓటు చీలిక, రెబెల్ ప్రభావం, గుర్తుల సెంటిమెంట్స్ కలిసి ప్రధాన పార్టీలకు సవాళ్లను విసురుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ కంటే గుర్తే బలం అన్న నమ్మకం బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సింహం, ఏనుగు గుర్తులపై పోటీ చేసే అభ్యర్థులు ఎంతవరకు ప్రధాన పార్టీలను దెబ్బతీస్తారో, ఎవరి లెక్కలు ఎవరి మీద పనిచేస్తాయో తేలాల్సి ఉంది. సెంటిమెంట్ ఏఐఎఫ్బీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విస్తృతంగా పోటీ చేసి విజయాలు సాధించింది. ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 224 మంది అభ్యర్థులను బరిలో దింపగా, 102 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 జెడ్పీటీసీ, 49 ఎంపీటీసీ స్థానాలను ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 17 స్థానాలను పార్టీ కైవసం చేసుకుంది. చొప్పదండిలో 1, పెద్దపల్లి 1, రామగుండం 9, కరీంనగర్ 3, జగిత్యాల 1, రాయికల్లో 2 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 230 మంది అభ్యర్థులు బరిలో దిగారు. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కరీంనగర్ జిల్లాలో 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్లో 10 స్థానాలు, జమ్మికుంట మున్సిపాలిటీలో 4, హుజూరాబాద్లో 4, చొప్పదండిలో 2 సీట్లల్లో పోటీ చేస్తోంది. మొదటిసారిగా బీఎస్పీకి స్థానిక ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై పోటీ చేసేందుకు అనుమతి లభించింది. ఈసారి సత్తా చాటుతాం. – నల్లాల శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడుప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుస్తాం. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యం, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పన్నాగం రాబోయే ఎన్నికల్లో తేలిపోతుంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పనిచేస్తుంది. ప్రజల మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ను మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతాం – అంబటి జోజిరెడ్డి, ఏఐఎఫ్బీ రాష్ట్ర కన్వీనర్ -
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
జగిత్యాల: ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. సోమవారం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ క్లీనికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్పై జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఆస్పత్రులకు రిజిస్ట్రేషన్ తప్పకుండా ఉండాలని, ఎవరైనా కొత్త డాక్టర్లు వస్తే మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్లకు డివిజన్ల వారీగా కొన్ని ఆస్పత్రులను కేటాయించి తనిఖీ చేయాలని ఆదేశించారు. డీఎస్పీ స్పెషల్ బ్రాంచ్ అధికారి వెంకటరమణ, క్లీనికల్ ఎస్లాబ్లిష్మెంట్ పర్యవేక్షకులు కుతుబుద్దీన్, శంకర్ పాల్గొన్నారు. -
మేజిస్ట్రేట్కు సన్మానం
మెట్పల్లి: మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావును బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఆయన రాసిన ఓ ఆర్టికల్ను సుప్రీంకోర్టు ఉదాహరణగా చూపుతూ ఓ కేసులో జడ్జిమెంట్ వెలువరించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్రెడ్డి మాట్లాడుతూ మేజిస్ట్రేట్ రాసిన లీగల్ రిఫరెన్స్ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడం సాధారణ విషయం కాదన్నారు. కార్యక్రమంలో సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్కుమార్, న్యాయవాదులు ఉన్నారు. వేటకు వెళ్లిన బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామిజగిత్యాలరూరల్: బీర్పూర్ మండలకేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పార్వేట్ ఉత్సవం నిర్వహించారు. స్వామివారు వేటకు వెళ్లారు. కార్యక్రమంలో అర్చకులు వొద్దిపర్తి సంతోష్కుమారాచార్యులు, చిన్న సంతోష్కుమార్, మధుకర్, డింగిరి హేమంత్ పాల్గొన్నారు. బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలుజగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ఏడుగురు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. బాధితులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శేషాద్రినిరెడ్డికి ఎస్పీగా పదోన్నతిజగిత్యాలక్రైం: ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి ఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా పిప్పింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శేషాద్రినిరెడ్డికి స్టార్ చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. ఆమె కూకట్పల్లి–కుత్బుల్లాపూర్ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ అయిన సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. చదువుతోనే ఉన్నత శిఖరాలకు..గొల్లపల్లి: విద్యార్థులు చదువుకుంటేనే ఉన్నత శిఖరాలకు చేరవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణుడు లయన్ బుర్ర మధుసూదన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు గొల్లపల్లి లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, లక్ష్యాన్ని ఏర్పర్చుకుని చేరడానికి ప్రతినిత్యం కష్టపడాలన్నారు. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, లీడ్ ఇండియా ట్రైనింగ్ మేనేజర్ తాడూ రి శ్రీనివాస్, జీఎల్టీ కో–ఆర్డినేటర్ లయన్ ఇనుగుర్తి రమేశ్, అంజనారెడ్డి, ప్రిన్సిపాల్ సుంకరి రవి, లయన్స్ క్లబ్ గొల్లపల్లి అధ్యక్షుడు ముస్కు కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి సాయిని నరహరి, సభ్యులు తాడూరి సత్యం, మల్లారెడ్డి, మోటివే షన్ స్పీకర్ పత్తెం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం
జగిత్యాల: ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమని ఎన్నికల అబ్జర్వర్ కాళీచరణ్ సుదామారావు అన్నారు. సోమవారం ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో పీవో, ఏపీవోలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎన్నికల విధులను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఎన్నికల ముందు రోజు సామగ్రి సేకరించుకుని మరోసారి సరిచూసుకోవాలన్నారు. ఓటరు లిస్ట్, బ్యాలెట్ పేపరు చెక్ చేసుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్స్ ఎలా సీల్ చేయాలి..? చాలెంజ్ ఓటు, టెండర్ ఓటు, బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం వంటి అంశాలపై తెలిసి ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించే బాధ్యత పీవో, ఏపీవోలపైనే ఉంటుందన్నారు. అనంతరం పవర్ పాయింట్ ద్వారా వారికి వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జివాకర్రెడ్డి, రాము పాల్గొన్నారు. -
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా చేపట్టాలి
జగిత్యాల: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తిగా పారదర్శకంగా.. నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణికుముదిని అన్నారు. సోమవారం కలెక్టర్లతో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. శాంతిభద్రతకు భంగం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎన్నిక ప్రక్రియలో భాగంగా కౌన్సిలర్లకు, ఎక్స్అఫిషియో సభ్యులకు ముందుగానే సమాచారం అందించాలని, పోలింగ్, లెక్కింపు ఫలితాల ప్రకటన వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నారు. పరోక్ష విధానం ద్వారా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎక్స్అఫిషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. సెక్షన్ 5, 20 ప్రకారం ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు తాము ఎన్నికై న 30 రోజుల్లోపు ఏదో ఒక మున్సిపాలిటీకి ప్రాతినిథ్యం వహించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
అయోమయం.. గందరగోళం
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో బీఫామ్ల లొల్లి ముదిరింది. సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్కుమార్ మధ్య రోజురోజుకూ గొడవలు ముదురుతున్నాయి. జీవన్రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ జెండాపట్టిన కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతుండగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తున్న సంజయ్కుమార్ తన వర్గీయులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా హైదరాబాద్లో ఈ పంచాయి తీ జరుగుతోంది. అయినా ఇంకా కొలిక్కి రాలేదు. విశ్వసనీయవర్గాల ప్రకారం ఇద్దరికీ చెరి సగం ఇస్తారని తెలిసింది. జీవన్రెడ్డి మాత్రం పార్టీలో పనిచేసిన వారికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. గతంలో సంజయ్ వెంట నడిచినవారు కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకోకుండా.. కండువా కప్పుకోకుండా ఇప్పటికీ ఆయన వెంటే ఉన్నారు. ఇద్దరు వర్గీయులు కాంగ్రెస్ తరుఫునే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడే లొల్లి ముదురుతోంది. ఒకవేళ తన వర్గానికిగానీ.. లేదా సంజయ్ వర్గానికి వస్తే రెబల్తో ఇబ్బందులు ఏర్పడతాయి. దీనిని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయి. రెబల్స్ మధ్య ఓట్లు చీలితే గెలుపు సునాయాసం అవుతుందని భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఎవరికి టికెట్ వచ్చినా వారే ఒకరు ఉండాలని.. మిగతా వర్గం వారి బరిలో ఉండకూడదని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం మేరకే నడుచుకోవాలని, ఏ కొంచం పార్టీకి నష్టం వాటిల్లినా చర్యలు తీసుకుంటామని అధిష్టానం హెచ్చరించినట్లు తెలిసింది. ఎవరికి దక్కేనో..? నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగి యనుండటంతో ఆలోపే అభ్యర్థులకు బీఫామ్లు అందించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కోవార్డు నుంచి అటు జీవన్రెడ్డి వర్గీయులు, ఇటు ఎమ్మెల్యే వర్గీయులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులకే ఆ పార్టీ ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. మిగతా వారు ఉపసంహరించుకోకపోతే ఇండిపెండెంట్లుగా బరిలో నిలబడాల్సి వస్తుంది. ఎవరికి రాకున్నా ఇబ్బందులే.. కాంగ్రెస్ పార్టీలో ఏ వర్గానికి టికెట్లు రాకున్నా ఎన్ని కల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. టికెట్లు కొందరికి రావన్న వార్త వెలువడటంతో మాజీమంత్రి జీవన్రెడ్డి ఇంట్లో 16వ వార్డుకు చెంది న బొల్లి శేఖర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు అడ్డుకోవడంతో పె ను ప్రమాదం తప్పింది. దీంతో ఒక్కసారిగా రాజ కీయం వేడెక్కింది. అధిష్టానం మాత్రం ఇప్పటికీ పేర్లను ప్రకటించలేదు. నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్లకే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు అందించనున్నట్లు తెలిసింది. ప్రతి వార్డులో అటు జీవన్రెడ్డి వర్గీయులు, ఇటు ఎమ్మెల్యే వర్గీయులు ఆ పుకార్లతో నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వర్గానికి వచ్చాయని వారు, ఆ వర్గానికి వచ్చాయని వీరు ఇలా చర్చానీయాంశంగా మారడంతో అసలు ఎవరికి వ స్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా జగిత్యాల మున్సిపాలిటీ హాట్ టాపిక్గా మారింది. రెబల్స్తో గుబులు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ఘట్టం ముగియడంతో అందరి దృస్టి బీఫామ్లపైనే పడింది. బీఫామ్లు ఎవరికి దక్కుతాయో తెలియని దుస్థితి నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులకు బీఫామ్ ఇస్తున్నారు. కాంగ్రెస్లో మాత్రం ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతోంది. ఏ వర్గానికి టికెట్ రాకుంటే ఆ వర్గం నుంచి స్వతంత్రంగానైనా నిలబడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే టికెట్ దక్కిన అభ్యర్థికి ఇబ్బందికరంగా మారనుంది. ప్లాన్ బీ అమలయ్యేనా... ఆయా వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్లాన్ బీ అమలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ టికెట్ రాని పక్షంలో ప్లాన్ బీ అమలు చేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా నిలబడితే రెబల్స్ బెడద తప్పదు. దీంతో బీఆర్ఎస్, బీజేపీకి అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
దయచూపని నిర్మలమ్మ
ఉమ్మడి జిల్లాకు దక్కని ప్రత్యేక హామీలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రప్రభుత్వం ఆదివా రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27లో ఉమ్మడి జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కేటాయింపులపై ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు రానప్పటికీ.. నేడో, రేపో వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్దది. అలాంటి ప్రాజెక్టుకు కేటాయింపులపై ప్రకటన రాలేదు. అదే సమయంలో ప్రతిష్టాత్మక రాఘవాపురం–మణుగూరు, హసన్పర్తి – కరీంనగర్, నిజామాబాద్ – కరీంనగర్ – పెద్దపల్లి డబ్లింగ్, పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ వర్క్స్ కేటాయింపులపై ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. పింక్ బుక్ విడుదల ఈసారి లేకపోవడంతో నిధుల కేటాయింపుపై ఇప్పటివరకు తమకు సమాచారం లేదని, తాము కూడా కేంద్ర రైల్వేమంత్రి విలేకరుల సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి జోన్ల వారీగా నిధుల కేటాయింపులపై వివరాలు త్వరలోనే విడుదలవుతాయని పేర్కొన్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులకు రూ.435 కోట్లు కేటాయించగా.. ఈసారి ఎంత అనేది ఆసక్తిగా మారింది. -
పెన్షనర్లకు మళ్లీ నిరాశే
తొమ్మిదేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. పెన్షనర్లకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వకపోవడం నిరాశ కలి గించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆదాయ పన్ను పరి మి తిని కనీసం రూ.15 లక్షల వరకై నా పెంచలేదు. కుటుంబ పెన్షన్పై రూ.40వేల వరకు మినహాయింపు పెంచడం కొంత ఊరటనిచ్చింది. – హరి అశోక్కుమార్, పెన్షనర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షులు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు ఏ మాత్రం న్యాయంగా లేవు. గతంలోనూ ఇదే తీరులో వ్యవహరించి రాష్ట్రంపై వివక్ష చూపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు ఆశించిన రీతిలో అనుమతులు దక్కలేదు. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై సరైన ఒత్తిడి తేలేకపోయింది. – కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్యే కోరుట్ల -
ఇక ప్రచారపర్వం..
జగిత్యాల: నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారరంగంలోకి దూకారు. ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. సీటు ఆశిస్తున్న వారు ప్రధాన నాయకుల వద్దకు బారులు తీరుతున్నారు. బీఫామ్లు లేకుండానే నామినేషన్లు వేసిన అభ్యర్థులు.. వాటిని సమర్పించేందుకు ఇంకా అవకాశం ఉండటంతో టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకవేళ టికెట్ రాని పక్షంలో ఇండిపెంట్లుగా బరిలో దిగుదామా..? లేదా వేరే పార్టీలోకి మారి బీఫామ్ తెచ్చుకుందామా..? అని సందిగ్ధంలో ఉన్నారు. టికెట్ రాకుంటే.. ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నారు. ఒక్కోవార్డు నుంచి దాదాపు ముగ్గురు, నలుగురు నామినేషన్లు వేశారు. వీరిలో ఎవరిని టికెట్ వరిస్తుందో తెలియని పరిస్థితి. ఒకవేళ టికెట్ దక్కకుంటే మరో పార్టీకి వెళ్తే ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సహకరిస్తారా..? ఓడిపోతే ఎలా..? ఖర్చు తడిసి మోపెడవుతుందని కూడా ఆందోళన చెందుతున్నారు. కొందరు ఎలాగైనా కౌన్సిలర్ పదవిని దక్కించుకోవాలని చూస్తున్నారు. పోటీ ఉన్నచోట ప్రధాన పార్టీల ఆశావహులు మరో అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. ప్రధానపార్టీల నాయకులు గెలుపుగుర్రాల కోసం సర్వే చేయించి ఇప్పటికే జాబితా రూపొందించారు. వారికే టికెట్లు ఇచ్చేలా చూస్తున్నారు. ఒక్కోవార్డు నుంచి దాదాపు నలుగురైదుగురు పోటీలో ఉండటంతో రెబల్స్ బెడద కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రెబల్స్ను బుజ్జగించుకుంటూనే గెలుపుగుర్రాలకు టికెట్లు ఇవ్వాలని ఆశిస్తున్నారు. జగిత్యాల.. కొలిక్కి వచ్చేనా..? జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా ప్రధానంగా జగిత్యాల, రాయికల్దే సమస్యగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్ వైపు చేరారు. ఈ క్రమంలో తాను సూచించిన అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకుడు జీవన్రెడ్డి మాత్రం మొదటి నుంచి జెండా మోసి పార్టీ కోసం కష్టపడిన నాయకులకే టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కనీసం పార్టీ సభ్యత్వం కూడా తీసుకోని వ్యక్తులకు టికెట్లు ఎలా ఇస్తారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి విషయంలో అన్ని పార్టీల్లో ప్రధాన నాయకులు ఉండటం, వారు బీఫాంలు కేటాయించడంలో అక్కడ ఇబ్బంది లేకుండా ఉంది. ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ వైపు ఉండటం, ఒకవైపు కష్టపడిన వారికే ఇవ్వాలని జీవన్రెడ్డి, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెబుతున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్ తన వర్గానికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రధాన నాయకులకే తలనొప్పిగా మారింది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీచేసే ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. ఒక్కోవార్డు నుంచి ముగ్గురునలుగురు టికెట్ల కోసం పట్టుబట్టుతుండడంతో ఎవరికి ఇవ్వాలనే సందిగ్ధంలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే బీఫాంలు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రచారమే.. సమయం ఆశించినంతగా లేకపోవడంతో అభ్యర్తులు ప్రచారపర్వంలో మునిగిపోయారు. తమకే ఓటు వేయాలని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. వ్యక్తిగానే ప్రచారం చేసుకుంటూ గుర్తులు వచ్చాక చెబుతామని, తమ్మను గుర్తుపెట్టుకోవాలని ఓటర్లను కోరుతున్నారు. -
కేసీఆర్కు సిట్ నోటీసులు కక్షసాధింపే..
జగిత్యాలటౌన్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్య అని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ విమర్శించారు. కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధానవీధుల మీదుగా సాగిన బైక్ ర్యాలీలో వందలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. విద్యాసాగర్రావు, రమణ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలకు తెరతీసిందని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం కోరుట్ల: కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడం కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలో భాగమేనని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్ అన్నారు. కేసీఆర్ను విచారణకు పిలవటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన కేసీఆర్ ప్రజాదరణను కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం హామీల అమలుపై నిలదీస్తే ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
సెంటిమెంట్ కోసం బీఆర్ఎస్ డ్రామాలు
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మపురి: మున్సిపల్ ఎన్నికల్లో సెంటిమెంట్ను రగిలించి ఓట్లు దండుకోవడానికి బీఆర్ఎస్ మాజీమంత్రులు కేటీఆర్, హరీష్రావు డ్రామాలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ అన్నారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ను సిట్ విచారణకు పిలిస్తే కాంగ్రెస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన పాపాల్లో ఒకటి కాశేశ్వరం ప్రాజెక్టు అయితే రెండోది ఫోన్ ట్యాపింగ్ అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కల్వకుంట రాజ్యాన్ని తీసుకొస్తామని భావిస్తే ప్రజలు మార్పుకోసం కాంగ్రెస్కు పట్టం కట్టారని అన్నారు. బీఆర్ఎస్ చేసిన పాపాలకు సిట్తోపాటు కాళేశ్వరం విషయంలో సీబీఐ కూడా వస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్పై కన్నబిడ్డ చేసిన ఆరోపణలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.దినేష్, కుంట సుధాకర్, సింహరాజు ప్రసాద్, నరేందర్ తదితరులున్నారు. జగిత్యాలటౌన్:కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్ ముగిసే వరకూ వినతులు స్వీకరణ ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు. మల్యాల: మండలంలోని మానాల గ్రామంలోగల నల్లగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి జాతరలో భాగంగా ఆదివారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య శోభాయాత్ర చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సర్పంచ్ బల్మూరి పాపారావు, ఉప సర్పంచ్ ఎడిపెల్లి జమున, మల్యాల సర్పంచ్ బొట్ల జయప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. జగిత్యాలక్రైం: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి జిల్లాలో ఏటా రెండుసార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేశామని పేర్కొన్నారు. జిల్లాలో 37 మంది బాలకార్మికులను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించామన్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలతో పనిచేయిస్తున్నవారిపై ఐదు కేసులు నమోదు చేశామన్నారు. బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే 100 డయల్కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కొండగట్టు గిరి ప్రదక్షిణమల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామివారికి వందలాదిమంది భక్తులు పూజలు చేసి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జై శ్రీరాం, జైహనుమాన్ అంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. -
పన్నుల వసూలు రూ.కోటి
కోరుట్ల: ఎన్నికల సంగతేమోగానీ.. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మొండి బకాయిలు దండిగా వసూలవుతున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతోపాటు ప్రతిపాదకులు కూడా ఆస్తి పన్ను, నల్లా బిల్లులు చెల్లించాలన్న నిబంధన మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదాయం భారీగా సమకూరింది. అభ్యర్థులు.. ప్రతిపాదకులు జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలో ఎక్కువమొత్తంలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జగిత్యాలలో 50వార్డులు, కోరుట్లలో 33, మెట్పల్లిలో 26 వార్డులకు పెద్ద మొత్తంలో నామినేషన్లు వచ్చాయి. ఈ మూడు మున్సిపాలిటీల్లో బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు ప్రతిపాదకులు ఆస్తిపన్ను, నల్లా బిల్లుల చెల్లించారు. రూ.కోటి వసూలు జగిత్యాల మున్సిపాలిటీలో సుమారు రూ.35,45,000, కోరుట్లలో రూ.33,80,000, మెట్పల్లిలో రూ.19,54,000, రాయికల్లో రూ.7,18,000, ధర్మపురిలో రూ.5,10,000 మేర పన్నులు వసూలయ్యాయి. ఈ మొత్తం దాదాపు రూ.కోటి మేర పన్నులు వసూలు కావడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో వసూలైన పన్నుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులే అధికంగా ఉండటం విశేషం. -
తాగునీటి సమస్యపై డ్రైవ్
కథలాపూర్(వేములవాడ): వేసవికాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి సుమారు 20 రోజులపాటు మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్శాఖ అధికారులు కలిసి అన్ని గ్రామాల్లో పర్యటించి నీటి సమస్యలను గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 385 గ్రామపంచాయతీలున్నాయి. 113 అనుబంధ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు 892 రక్షిత మంచినీటి ట్యాంకులు నిర్మించారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ, వర్షాకాలంలో పైపులైన్ లీకేజీలతో సరిగా నీళ్లు అందని పరిస్థితి. వేసవికాలంలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతోపాటు నీటి అవసరాలు ఎక్కువ కావడంతో ప్రజలకు సరిపడేలా నీరందించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. దీంతో వేసవిలో ప్రజలకు ఇబ్బందులు రావద్దని, నివారణ చర్యలకు పంచాయతీ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడనున్నారు. గ్రామాల్లో పర్యటించి ట్యాంకులను పరిశీలించి పైపులైన్ లీకేజీలు, మరమ్మతులు, వేసవిలో నీటి లభ్యత, బోరుబావుల పరిస్థితి, మిషన్ భగీరథ ద్వారా ట్యాంకుల్లోకి నీళ్లు రాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు సేకరించి నివేదికను తయారు చేస్తారు. నీటి సరఫరా కోసం కొత్త పనులు చేపట్టాల్సి వస్తే నిధులు ఎన్ని అవసరమో ఉన్నతాధికారులకు నివేదిస్తారు. -
మధ్య తరగతికి లాభం లేదు
కేంద్ర బడ్జెట్లో మధ్య తరగతికి ఉపయోగపడే అంశాలు ఏమి లేదు. ఆదాయ పరిమితి యథావిధిగా ఉంచారు. మధ్య తరగతి ప్రజలు వినియోగించే ఉపకరణాలు విషయంలో పెద్దగా మార్పులు లేవు. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే అవస్థలు పడక తప్పదు. – చెన్న విశ్వనాథం, సీపీఐ జిల్లా నాయకులు యువత ఉపాధికి ఎలాంటి ప్రణాళిక లేదు. ధరల నియంత్రణపై ఎలాంటి చర్యలు లేవు. బడ్జెట్ కేవలం అంకెల గా రడీని తలపించింది. యువత, మహిళళ అభివృద్ధికి ఎలా ంటి కేటాయింపులు లేవు. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదు. – టి.విజయలక్ష్మి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు -
‘ఎస్ఐఆర్’ మ్యాపింగ్ పూర్తిచేయాలి
జగిత్యాల: స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్తో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ శాతాం పెంచేందుకు బూత్లెవల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలు నిర్దేశించాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్లెవల్ ఏజెంట్లను నియమించుకుని పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం బుక్ ఏ కాల్ సదుపాయంపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ 69.94 శాతం పూర్తయిందని, వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కేసీఆర్పై వేధింపులకు నిరసనగా ఆందోళనలు
జగిత్యాల: మాజీ సీఎం కేసీఆర్పై రాజకీయ వేధింపులకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు తెలిపారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన మహోన్నత నాయకుడిని ఇబ్బందులకు గురిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి.. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి కుట్రలకు తెరలేపిందన్నారు. రమణ మాట్లాడుతూ సిట్ పేరుతో కేసీఆర్ను వేధిస్తున్నారని, ఇందుకు నిరసనగా ఆదివారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వ వైఖరి మొండి వైఖరిని ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
● ప్రజలతో సత్సంబంధాలు అత్యధికంగా ఉండేవి ప్రత్యక్ష ఎన్నికలే బెటర్ ● జీవన్రెడ్డి నా రాజకీయ గురువు ● మాజీ చైర్మన్ మెట్టబట్టి
జగిత్యాల: గతంలో మున్సిపల్ చైర్మన్కు ప్రత్యక్షంగానే ఎన్నికలు ఉండేవి. ప్రస్తుతం పరోక్షంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్లే డబ్బు ఖర్చు ఎక్కువగా పెరిగిపోయింది. నాడు ఉత్తర తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ నుంచి గెలిచాను. నా రాజకీయ గురువు జీవన్రెడ్డి. మొదటగా 1988లో కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా పోటీచేసి గెలిచాను. అనంతరం నాకు 1995లో చైర్మన్ టికెట్ ఇచ్చి గెలిపించారు. నేరుగా చైర్మన్ కావడంతో ప్రజలతో అత్యధికంగా సంబంధాలు ఉండేవి. ప్రజల సమస్యలు తెలుసుకుని జగిత్యాలలో తాగునీటి ఇబ్బందులు లేకుండా విద్యానగర్లో వాటర్ట్యాంక్ కట్టించా. వీక్లీబజార్లో కాంప్లెక్స్ కట్టించా. చింతకుంటలో శ్మశాన వాటిక కట్టించా. ప్రతి గల్లీలో సీసీరోడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్న. చరిత్రలో నిలిచేలా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాను. కానీ ఇప్పుడు పరోక్ష ఎన్నికలు కావడంతో ఖర్చు అత్యధికంగా పెరిగింది. అందరు కౌన్సిలర్లు కలిసి చైర్మన్ను ఎన్నుకోవడం ద్వారా ఖర్చు పెరుగుతుంది. డబ్బుతో రాజకీయం ముడిపడి ఉంది. అప్పుడు అభివృద్ధి చూసి ఓటు వేసేవారు. ఇప్పుడు డబ్బే ప్రభావం చూపుతోంది. ‘ఇప్పుడు రాజకీయాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. డబ్బు ఉన్న వారికే పదవులు దక్కుతున్నాయి. ఆ రోజుల్లో ప్రతిఒక్కరికీ పదవులు దక్కేవి. ఇప్పటికి.. అప్పటికి చాలా తేడా ఉంది. నాడు సేవభావంతో స్వార్థం లేకుండా పనిచేసేవాళ్లం..’ అన్నారు జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ మెట్టబట్టి. ఆయన 1995–2000 సమయంలో చైర్మన్గా కొనసాగారు. ఆయన ‘సాక్షి’తో తన అభిప్రాయం పంచుకున్నారు. -
● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి: మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు బల్దియాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ధర్మపురి పట్టణంలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. 15వార్డులకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసి ఒక్కో వార్డుకు వైస్ ఇన్చార్జిలను ప్రకటించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ధర్మపురి అభివృద్ధికి కోట్లాది నిధులు విడుదల చేశారని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేదని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెట్టాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు. -
జంతువులపై ప్రేమ పెంచుకోవాలి
జగిత్యాలఅగ్రికల్చర్: జంతువులపై ప్రతిఒక్క రూ ప్రేమ, అనురాగం కలిగి ఉండాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని పురాణిపేట జెడ్పీ హైస్కూల్లో శనివారం నిర్వహించారు. జంతువుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో పక్షోత్సవాలు నిర్వహించామన్నారు. పశువులకు సరైన ఆహారం, తాగునీరు అందించాలన్నారు. అనంతరం చిత్రలేఖనం, వ్యాసరచనలో గెలుపొంది న విద్యార్థులకు బహుమతులు అందించా రు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికా రి బి.ప్రకాశ్, ఏడీ మదన్మోహన్, పశువైద్యాధికారులు గడ్డం నరేష్, డాక్టర్ వాసు, పావని, పాఠశాల హెచ్ఎం తిరుపతి పాల్గొన్నారు. ఘనంగా మల్లికార్జునస్వామి ఉత్సవాలుమల్లాపూర్: రత్నాపూర్ శ్రీమల్లికార్జునస్వామి మహోత్సవాలను శనివారం సంగెంశ్రీరాంపూర్లో ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర చేపట్టారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అర్చకులు కుడకల శివకుమార్, రత్నాపూర్ ఆలయ కమిటీ చైర్మన్ కూచన్పెల్లి శ్రీనివాస్, హిందూ వాహిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలిజగిత్యాలక్రైం: ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలోని తహసీల్చౌరస్తాలో పోలీస్శాఖ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఎక్కువశాతం ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారని, దీనికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. డీఎస్పీ రఘుచందర్, టౌన్ సీఐ కరుణాకర్, డీటీవో శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం, ఎంవీఐలు వెంకన్న, అభిలాష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపికవెల్గటూర్: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ జైనపురం సాయికుమార్ తెలిపారు. వనం అఖిల, బాస శ్రీజలు డిసెంబర్ 12వ తేదీ నుంచి 14వరకు మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ అండర్–19 రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల ఒకటి నుంచి ఐదో తేదీ వరకు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం ఘుమన్విన్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ తెలిపారు. వీరి ఎంపికపై హ్యాండ్బాల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి జిట్టవేణి శ్రీనివాస్, ట్రెజరర్ కలిగేటి శ్రీనివాస్, జెట్టిపల్లి అశోక్, సర్పంచ్ గొల్లపల్లి మల్లేశం, ఉప సర్పంచ్ అరిగెల జయవ్వ, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
● దర్మపురిలో అత్యధికంగా 39 తిరస్కరణ ● జగిత్యాలలో అత్యల్పంగా ఒకటే..
జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. జగిత్యాలలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇక్కడ మొత్తం 50 వార్డులకు 361మంది 533 నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నిర్వహించిన స్క్రూటినీలో 43వ వార్డు కరండ్ల మహేశ్ రెండుసెట్లు దాఖలు చేయడంతో ఒక నామినేషన్ తిరస్కరించినట్లు మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు. మొత్తం 532 నామినేషన్లు ఆమోదం పొందాయన్నారు. బీజేపీ 121, కాంగ్రెస్ 241, బీఆర్ఎస్ 102, ఎంఐఎం 17, ఇతర పార్టీలు 13, స్వతంత్రులు 38 మొత్తం 532 నామినేషన్లు ఆమోదం పొందాయి. ధర్మపురిలో 39.. ధర్మపురి: మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులకు 73 మంది అభ్యర్థులు 113 నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నిర్వహించిన పరిశీలనలో 39 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇంకా 74 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. రాయికల్లో మూడు.. రాయికల్: బల్దియాలోని 12 వార్డులకు 100 మంది నామినేషన్లు వేశారు. శనివారం నిర్వహించిన స్క్రూటినీలో 7వ వార్డు నుంచి ఎలిగేటి అనిల్కుమార్ రెండు, మూడోవార్డు నుంచి ఆత్రం శంకర్ నామినేషన్ను తిరస్కరించినట్లు మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు తెలిపారు. బీజేపీ 18, కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 18, జనసేన 6, స్వతంత్రులు 3, డబుల్ నామినేషన్లు 26 ఉండగా.. మొత్తం 71 మంది బరిలో ఉన్నట్లు తెలిపారు. స్క్రూటినీ ప్రక్రియను జెడ్పీ సీఈవో, బల్దియా స్పెషల్ ఆఫీసర్ గౌతమ్రెడ్డి పరిశీలించారు. మెట్పల్లిలో రెండు.. మెట్పల్లి: మున్సిపాలిటీకి మొత్తం 291 నామినేషన్లు దాఖలు కాగా.. రెండు నామినేషన్లు తిరస్కరించినట్లు కమిషనర్ మోహన్ తెలిపారు. నిబంధనల ప్రకారం వివరాలు పొందుపర్చకపోవడంతో వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు. కోరుట్లలో నిల్.. కోరుట్ల: బల్దియాలోని 33వార్డులకు 190 మంది నామినేషన్లు వేయగా.. అన్నీ ఆమోదం పొందినట్లు కమిషనర్ రవీందర్ తెలిపారు. -
● అన్ని పార్టీలకు అసమ్మతి బెడద ● కాంగ్రెస్కు మరింత ఎక్కువ..
కోరుట్ల: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసిన క్రమంలో అసమ్మతి పోరుపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. బీఫాం అందించే లోపు పార్టీల్లో నెలకొన్న అసమ్మతిని సరిచేసి అభ్యర్థులను గెలుపు బాటలో నిలపాలన్న లక్ష్యంతో పార్టీ నేతలు బుజ్జగింపులు, బేరసారాలకు తెర తీశారు. ఈ క్రమంలోనే తమ పార్టీ అభ్యర్థులు ఎంత మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ఎంత మంది రెబల్స్ ఉన్నారన్న అంశంపై దృష్టి సారించారు. అసమ్మతి పోరు జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో అత్యధికంగా కాంగ్రెస్కు రెబల్స్ బెడద ఉండటం గమనార్హం. అఽధికార పార్టీ టికెట్ కోసం ఒక్కోవార్డులో 5 నుంచి 6 దరఖాస్తులు రావడం, వీటిలో సరైన అభ్యర్థి ఎంపిక చేయడం పార్టీ వర్గాలకు పెద్ద సమస్యగా మారినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ వార్డుల్లో తప్ప మిగిలిన అన్ని వార్డుల్లోనూ కాంగ్రెస్ టిక్కెట్ కోసం పోటాపోటీగా దరఖాస్తులు రావడంతో అసమ్మతి అభ్యర్థులను బుజ్జగించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సారి బీఆర్ఎస్, బీజేపీ టిక్కెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లోనూ ఎక్కువగానే ఉన్నప్పటికీ.. పెద్దగా అసమ్మతి బెడద లేకపోవడం సదరు పార్టీలకు ఊరట ఇస్తుంది. ఈ అసమ్మతి పోరుతో పార్టీ అభ్యర్థుల గెలుపు బాటలో అడ్డంకులు వస్తే ఎలా అన్న సంశయంతో అధికార పార్టీ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. పార్టీ.. నామినేటెడ్ పోస్టులు అధికార కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ను కట్టడి చేయడానికి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల తాయిలాలను కీలక నేతలు ఎర వేస్తున్నారు. కొంత మంది రెబల్స్ మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేస్తామని చెప్పడంతో పాటు రానున్న పార్టీలో కీలకమైన పోస్టులు ఇస్తామని ఊరడిస్తున్నారు. ఇలాంటి పదవులు ఇవ్వడానికి అవకాశం లేని చోట్ల పార్టీ తరఫున ఉన్న అభ్యర్థితో రెబల్స్ను బేరసారాలతో మాట్లాడుకోమని చెప్పి బుజ్జగింపులకు దిగుతున్నట్లు సమాచారం. మొత్తం మీద అధికార కాంగ్రెస్ పార్టీకి అసమ్మతి బెడద పెద్ద తలనొప్పిగా తయారైంది. -
పాడి వర్సెస్ పోలీసులు
హుజూరాబాద్/వీణవంక: వీణవంక సమ్మక్క జాతరలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని గురువారం సాయంత్రం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కౌశిక్రెడ్డి ఏసీపీ మాధవి, సీఐ లక్ష్మినారాయణతో వాగ్వాదానికి దిగారు. చివరికి ఎమ్మెల్యేను శంకరపట్నం, సైదాపూర్కు తరలించా రు. ఎమ్మెల్యే సతీమణి శాలినిని గద్దెలనుంచి తరలించడంపై కంటతడి పెట్టారు. మొక్కులు చెల్లించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. క్యాంపు ఆఫీస్ నుంచే అడ్డగింత వీణవంకలో సమ్మక్క జాతరకు ట్రస్టీగా ఉన్న ఉదయానందరెడ్డి వర్గానికి కౌశిక్రెడ్డి వర్గానికి విభేదాలు సాగుతున్నాయి. కౌశిక్రెడ్డి జాతరకు వెళ్తే గొడవ జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు గురువారం సాయంత్రం క్యాంపు ఆఫీసు వద్దే అడ్డుకున్నారు. పోలీసుల నిర్ణయాన్ని వ్యతిరేకించిన కౌశిక్రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట గల కరీంనగర్– వరంగల్ ప్రధాన రహదారిపై కుటుంబసభ్యులతో కలిసి బైటాయించి పోలీసుల తీరుపై మండిపడ్డాడు. అనంతరం వీణవంక వెళ్లగా జాతర ప్రాంగణంలో పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని శంకరపట్నం, సైదాపూర్ పోలీస్స్టేషన్కు తరలించారు. రాత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. సమ్మక్క జాతరకు ఒక మహిళా సర్పంచ్ చేతి మీదుగా కొబ్బరికాయ కొట్టించాలని, ప్రైవేటు వ్యక్తికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకోవడంతో పాటు, ఇతర వివాదాస్పద కారణాలతో సెక్షన్ 341, 353, 295, 506, 140(3ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు. జాతర వేళ హుజూరాబాద్లో హైడ్రామా వీణవంక సమ్మక్క జాతరకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి -
బీ–ఫామ్ వస్తుందా..!?
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం.. శుక్రవారంతో గడువు ముగియనుండడంతో బీ–ఫామ్ ఎవరికి వస్తుందోనని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. సమయం తక్కువగా ఉండడంతో చాలామంది ఆశావహులు తమ మద్దతుదారులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రధానంగా జగిత్యాల మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహుల్లో బీఫామ్ ఎవరికి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆశావహులు పార్టీ తరఫున అయితే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బీ–ఫామ్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండేలా ఆలోచన చేస్తున్నప్పటికీ.. ఆయా పార్టీల నుంచి టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ముందు నుంచే ప్రధాన పార్టీల నాయకులు గెలుపుగుర్రాలను బరిలో దింపాలని ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. ఎవరు వచ్చినా ముందుగా నామినేషన్ వేయాలని ఆదేశించారు. దీంతో ఒక్కోపార్టీ నుంచే దాదాపు ముగ్గురి నుంచి నలుగురు వరకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమకే టికెట్ వస్తుందంటే తమకేనని పైకి ధీమాగా చెబుతున్నా.. లోలోపల మాత్రం కంగారు పడుతున్నారు. మరోవైపు ఎలాంటి గుర్తు లేకుండానే ప్రచా రం మొదలుపెట్టారు. కొందరైతే ఎమ్మెల్యే మద్దతు తనకుందంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరికొందరు జీవన్రెడ్డి మద్దతు ఉందని, టికెట్లు గ్యారంటీగా వస్తాయని చెప్పుకుంటున్నారు. పార్టీ టికెట్ దక్కుతుందనే ధీమాతో కొందరు నామినేషన్లు దాఖలు చేయడంతో ముఖ్య నేతల ఆశీస్సులున్నాయని, వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. అందరి చూపు జగిత్యాలపైనే.. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం జగిత్యాలపైనే పడింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్లపైనే ఇబ్బందిగా మారింది. మాజీమంత్రి జీవన్రెడ్డి మొదటి నుంచి కార్యకర్తగా ఉంటూ పార్టీ కోసం కష్టపడిన వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్కుమార్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, తన వర్గానికే టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ కాస్త గందరగోళం తయారైంది. ఎవరికి టికెట్ వస్తుందో..? ఎవరికి మొండిచేయి చూపుతారోనని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ కు చెందిన క్యాడర్ అంతా ఎమ్మెల్యే వైపు ఉన్న ట్లు కనిపిస్తున్నా.. పార్టీలో ఎవరూ చేరిన దాఖలు లేవు. మరోవైపు కాంగ్రెస్లో సభ్యత్వం లేని వారికి బీఫామ్లు ఎలా ఇస్తారంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఇరువర్గాల వారికి బీఫామ్లు రాకపోతే పరిస్థితి ఏంటని.. మరోదారి చూసుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేయాలా..? లేదా ఏదైనా పార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకోవాలా..? అని ఆలోచన చేస్తున్నారు. ఆశావహుల్లో టెన్షన్ టెన్షన్ నామినేషన్లు మాత్రం దాఖలు నేటితో చివరి గడువు అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు ఎవరికి ఇవ్వాలో తెలియక సతమతం -
కొండగట్టుకు మహర్దశ
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి భక్తుల వసతి కష్టాలు తీరనున్నాయి. భక్తుల వసతి సముదాయ నిర్మాణంతో స్వామివారి సన్నిధిలో నిద్రించాలనుకునే భక్తుల కోరిక తీరనుంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో టీటీడీ బోర్డు రూ.35.19 కోట్ల కేటాయింపుతో వసతి గదులు అందుబాటులోకి రానున్నాయి. 96గదులు.. టీటీడీ నిధులతో నిర్మించనున్న 96 గదుల భవన సముదాయంతోపాటు రెండువేల మంది దీక్షాపరులు ఒకేసారి మాలవిమరణ చేపట్టేలా మంటపాన్ని నిర్మించనున్నారు. ఘాట్రోడ్డు వెంటే నిర్మాణాలు చేపట్టనున్నారు. దీంతో కొండగట్టుకు వచ్చే లక్షలాదిమంది దీక్షాపరుల సమస్యలు తీరనున్నాయి. షెడ్ల నిర్మాణంతో ఉప శమనం.. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో 11 రోజులు, 21 రోజులు నిద్రిస్తే శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని, సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందనే భక్తుల విశ్వాసం. కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఆలయ అధికారులు నూతనంగా రెండు షెడ్లు నిర్మాణం చేపట్టడంతో ఉపశమనం లభించింది. ఆలయ రాజగోపురానికి ఎదురుగా ఒక షెడ్డు, ఆలయ కార్యాలయం ఎదుట మరో షెడ్డు నిర్మాణంతో భక్తులకు తాత్కాలికంగా వసతి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.35.19కోట్ల టీటీడీ నిధులు 96 గదుల భవన సముదాయం దీక్ష విరమణ మంటపం నిర్మాణం -
‘కొరవట్టు’ కవి సమ్మేళనాలతో విలసిల్లి..
కోరుట్ల: పదకొండో శతాబ్దంలో నాటి జైన, చాళుక్యుల పాలన సమయంలో ‘కొరవట్టు’ కవి సమ్మేళనాలతో విలసిల్లిన గ్రామం నేడు కోరుట్ల మున్సిపాలిటీగా మారింది. ఆనాటి చారిత్రక చిహ్నాలుగా కోట బురుజులు, మెట్లబావి, వేద సంస్కృత పాఠశాల ఇప్పటికీ పూర్వ వైభవాన్ని చాటుతున్నాయి. 1988 వరకు నగర పంచాయతీగా ఉన్న కోరుట్ల ఏడేళ్లపాటు స్పెషలాఫీసర్ల పాలనలో కొనసాగింది. అనంతరం గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఎదిగింది. 1995లో మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. తాజాగా ఐదోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 33 వార్డులు, 65,307 మంది ఓటర్లు ఉన్నారు. చాళుక్యుల పాలన చారిత్రక నేపథ్యం నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా.. కోరుట్ల బల్దియా ప్రాశస్త్యం -
కేటీఆర్ వాహనం తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వాహనాన్ని రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చెక్పోస్టు వద్ద గురువారం అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల నియామవళిలో భాగంగా అధికారులు వాహనాన్ని ఆపగా కేటీఆర్ కారు ఆపి కిందికి దిగి అధికారులకు సహకరించారు. తనిఖీ అనంతరం కేటీఆర్ సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్కు బయలుదేరారు. మగ్గిడి గురుకులం ప్రిన్సిపాల్ సస్పెన్షన్ధర్మపురి: మండలంలోని మగ్గిడి గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ పద్మను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడినట్లు ఎంఈవో సీతామహాలక్ష్మి తెలిపారు. పద్మ సమయపాలన పాటించకపోవడం, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పాలనసరిగా లేదని వచ్చిన ఆరోపణలపై సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులు అడిగేందుకు వెళ్తే నిర్బంధంజగిత్యాలక్రైం: యూట్యూబ్ ఛానల్లో నటించినందుకు డబ్బులు అడిగితే న్యాయవాదిని నిర్బంధించిన ఘటన జగిత్యాలరూరల్ మండలం ఒడ్డెరకాలనీలో గురువారం చోటుచేసుకుంది. ఒడ్డెరకాలనీకి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. అందులో కొడిమ్యాలకు చెందిన ఓ యువతి రోజుకు రూ.1500 చొప్పున మాట్లాడుకుని షార్ట్ఫిల్మ్లో నటించింది. కానీ.. చానల్ నిర్వాహకుడు డబ్బులు ఇవ్వలేదు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో యువతి ఓ న్యాయవాదిని తీసుకుని ఒడ్డెరకాలనీకి వెళ్లి డబ్బులు అడిగింది. దీంతో సదరు నిర్వాహకుడు న్యాయవాదితోపాటు యువతిని కూడా నిర్బంధించాడు. యువతి తప్పించుకుని 100కు డయల్ చేయడంతోపాటు, పలువురికి సమాచారం అందించింది. వెంటనే పోలీసులు ఒడ్డెరకాలనీకి వెళ్లి న్యాయవాదితోపాటు, యువతిని తీసుకుని పోలీస్స్టేషన్కు వచ్చారు. దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో హైదరాబాద్లోని షాద్నగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రరాష్ట్రానికి చెందిన కొందరు గురువారం ఎల్లారెడ్డిపేటకు వచ్చారు. ఈ ముఠా షాద్నగర్లోని ఓ యూనివర్సిటీకి చెందిన పెంపుడు కుక్కలను వాళ్ల పర్మిషన్ లేకుండా తీసుకెళ్లి చంపేశారని తెలిసింది. ఈ సంఘటనపై యూనివర్సిటీ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సెల్ఫోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు వేకువజామున అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. అనంతరం వారిని షాద్నగర్కు తరలించారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
జగిత్యాల/ధర్మపురి: ఎన్నికల నియమావళిని ప్రతిఒక్కరూ పాటించాలని వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ అన్నారు. జగిత్యాలలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఆర్వోలు ప్రతి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అభ్యర్థులు కచ్చితంగా బ్యాంక్ ఖాతా తీసుకోవాలని సూచించారు. పార్టీ పరంగా చేసే వ్యయం అన్నింటిని నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట నోడల్ అధికారి శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ కమిషనర్ స్పందన ఉన్నారు. అనంతరం శ్రీనివాస్ ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆర్వోలు, ఏఆర్వో పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ కాలువలు ధ్వంసం చేస్తే కేసులు
ఇబ్రహీంపట్నం: ఎస్సారెస్పీ కాలువలను ధ్వంసం చేస్తే కేసులు నమోదు చేస్తామని ఇరిగేషన్ ఈఈ సురేష్ రైతులను హెచ్చరించారు. మండలంలోని బర్దీపూర్ శివారులో డిస్ట్రిబ్యూటర్ 24 నుంచి పంట పొలాలకు వెళ్లే ఉపకాలువను కొందరు రైతులు ధ్వంసం చేశారు. ఆ కాలువలను గురువారం పరిశీలించారు. చివరి ఆయకట్టుకు నీరు వెళ్లకుండా కాలువలను పూడ్చితే కఠిన చర్యలు తప్పవన్నారు. ‘గంగనాల’కు నీరొచ్చేలా చూస్తాంఇబ్రహీంపట్నం: సదర్మాట్ ప్రాజెక్టు నుంచి గంగనాల ప్రాజెక్టుకు నిరంతరం నీరు వచ్చేలా చూస్తామని ఎస్ఈ జగదీశ్ తెలిపారు. సదర్మాట్ నుంచి గంగనాలకు వచ్చే నీటి ప్రవాహాన్ని గురువారం పరిశీలించారు. సదర్మాట్ నిర్మాణంలో భాగంగా గోదావరిలో అడ్డుగా రాళ్లు వేయడంతో గంగనాలకు నీరు రాక పంటలు పండించుకోలేకపోతున్నామని ఆయకట్టు రైతులు అధికారులకు విన్నవించారు. అలాగే ఈనెల 16న ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విన్నవించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సదర్మాట్ నుంచి నీరు రాకుండా అడ్డుగా వేసిన బండరాళ్లను ఎస్ఈ పరిశీలించారు. ఓ చోట పరుపుబండ అడ్డుగా ఉండడాన్ని గమనించి బ్లాస్టింగ్ ద్వారా తొలగిస్తామని తెలిపారు. ఆయన వెంట ఈఈ సురేష్, డీఈ మురళీకృష్ణ, ఏఈలు సజీత్, కవిత, చేతన్, రైతులు పాల్గొన్నారు. సరిహద్దుల్లో మూడు చెక్పోస్టులుజగిత్యాలక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖ అలర్ట్ అయ్యింది. జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టేలా మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతోంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న ఎన్నికలకు 6 ఫ్లయింగ్స్క్వాడ్స్, ఐదు స్టాటిస్టిక్స్ సర్వైలైన్స్ టీమ్స్, 50 జోనల్ ఆఫీసర్లను ఉన్నతాధికారులు నియమించారు. అలాగే అభ్యర్థుల వ్యయ ఖర్చులు, ప్రచార సామగ్రి, ర్యాలీలు, సభలు, సమావేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మెట్పల్లి శివారులోని గండి హనుమాన్ దేవాలయం వద్ద, ధర్మపురి మండలం రాయపట్నం వద్ద, కొడిమ్యాల మండలం దొంగలమర్రి వద్ద చెక్పోస్టులు ప్రారంభించి 24 గంటల పాటు తనిఖీలు చేపడుతున్నారు. డబ్బు, మద్యం, ఇతర వస్తువులు తరలించి ఓటర్లను ప్రలోభపెట్టకుండా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఈ విషయమై ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, సిబ్బంది 24 గంటల పాటు తనిఖీలు చేపడతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ తులాభారంరాయికల్: పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే సంజయ్ తన మొక్కు చెల్లించుకున్నారు. సంజయ్ ఎమ్మెల్యేగా గెలిస్తే నిలువెత్తు బంగారం సమర్పిస్తానని మాజీ కో–ఆప్షన్ మహేందర్బాబు స్వామివారికి మొక్కుకున్నారు. ఆ మొక్కు గురువారం తీర్చుకున్నారు. స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, మాజీ వైస్ చైర్మన్ రమాదేవి, నాయకులు పడిగెల రవీందర్రెడ్డి, కోల శ్రీనివాస్, మోర రాంమూర్తి పాల్గొన్నారు. -
కొలువుదీరిన వనదేవతలు
అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులువెల్గటూర్/ధర్మపురి:వనదేవతల జాతర సందర్భంగా గురువారం సమ్మక్క గద్దైపెకి చేరారు. వెల్గటూర్ మండలకేంద్రంతోపాటు రాజారాంపల్లిలో అమ్మవారల దర్శనానికి భక్తులు పోటెత్తారు. మేళతాళాలు, డప్పుచప్పుళ్ల మధ్య కోయపూజారులు అమ్మవారిని తీసుకొచ్చారు. ఆలయ కమిటీ చైర్మెన్ ఏలేటి శైలేందర్రెడ్డి ఆధ్వర్యంలో భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. డీఎంహెచ్వో సుజాత ఆదేశాల మేరకు హెల్త్క్యాంపు ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ధర్మపురి లోని మోరోల్ల వాగు వద్ద అమ్మవార్లను గద్దైపెకి చేర్చారు. రాజారాంపల్లికి చెందిన ఏలేటి దేవేందర్రెడ్డి సమ్మక్క, సారలమ్మ ఉత్సవాల కోసం అమెరికా నుంచి వచ్చారు. -
కాల్వ రాంచంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సింగిల్విండో చైర్మన్గా, సర్పంచ్గా, ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ చైర్మన్గా, ఎమ్మెల్యేగా కాల్వ రాంచంద్రారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాల్వ రాంచంద్రారెడ్డి 33వ వర్ధంతిని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ సింగిల్విండో కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి తదితరులు కాల్వ రాంచంద్రారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు, రైతులు, ఆర్టీసీ ప్రయాణికులు, మల్లికార్జునస్వామి భక్తులకు రాంచంద్రారెడ్డి అనేక సేవలు చేశారన్నారు. 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.కోట్ల విలువైన భూదానం చేసి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన మహనీయుడని గుర్తుచేశారు. తండ్రి బాటలోనే ఆయన తనయుడు, సాక్షి దినపత్రిక డైరెక్టర్ (ఆర్గనైజింగ్ అండ్ మార్కెటింగ్) కాల్వ రాజప్రసాద్రెడ్డి, సోదరులు వెంకటేశ్వర్రెడ్డి, అశోక్రెడ్డి సింగిల్విండో కార్యాలయానికి భూమి విరాళంగా అందించారని ప్రశంసించారు. తద్వారా రైతులు, ప్రజల ఆదారాభిమానాలు, ప్రశంసలు అందుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో సీఈవో కోలేటి శ్రీనివాస్, ఉద్యోగులు యాట శ్రావణ్కుమార్, ముస్కు రాజు, ఆరెల్లి శ్రీనివాస్, రత్నం, ఆశ, విష్ణు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు ఘనంగా మాజీ ఎమ్మెల్యే వర్ధంతి -
తల్లీ.. నీకు వందనం
‘మాది రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక. నా పేరు బొమ్మెన రామవ్వ. నా వయసు 74 ఏళ్లు. నా భర్త చనిపోయాడు. మా ఇద్దరు కొడుకుల్లో ఒక్కరు మరణించారు. ఒక్క కొడుకు ఉన్నాడు. మధ్యమానేరు జలాశయంలో మా ఊరు మునిగిపోయింది. 2010లో మా 14 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు తీసుకున్నారు. పరిహారం ఇవ్వలేదు. కలెక్టరేట్కు, ఆర్డీవో ఆఫీస్కు ఎన్నిసార్లు తిరిగినా పరిహారం సొమ్ము ఇవ్వలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాము. కోర్టులో మాకు సానుకూలంగా తీర్పు వచ్చింది. కానీ పరిహారం చెల్లించలేదు. మరోసారి కోర్టుధిక్కరణ కింద కోర్టును ఆశ్రయించాను. 15 ఏళ్లుగా పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాను’ ఇదీ మధ్యమానేరు నిర్వాసితురాలు రామవ్వ ఆవేదన. సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా పనిచేసి బదిలీపై వెళ్లిన సందీప్కుమార్ ఝా, అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్మిత్తల్ ప్రస్తుతం ఆ విధుల్లో లేరు. వేరే శాఖలో పనిచేస్తున్నారు. కానీ కోర్టు ఆదేశాలను విధుల్లో ఉండగా నిర్లక్ష్యం చేసిన కారణంగా మార్చి 24న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తాము బదిలీ అయ్యామని చెబితే కుదరదని కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన జస్టిస్ శ్రవణ్కుమార్ ధర్మాసనం స్పష్టం చేశారు. 2024 ఆగస్టు 14న విచారణ సందర్భంగా మూడు నెలల్లో పరిహారాన్ని నిర్వాసితురాలికి అందిస్తామని అప్పటి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్మిత్తల్, అప్పటి రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్పష్టం చేశారు. కానీ పరిహారం చెల్లించకుండా.. కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణ కింద బదిలీ అయినా అధికారులతోపాటు ప్రస్తుత సీసీఎల్ఏ లోకేశ్కుమార్, ప్రస్తుత రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరీమా అగ్రవాల్ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు విచారణకు ఎవరూ హాజరుకాకుండా.. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 24న విధిగా అప్పటి అధికారులు నవీన్మిత్తల్, సందీప్కుమార్ ఝా హాజరుకావాలని స్పష్టం చేశారు. ప్రస్తుత కలెక్టర్ గరీమా అగ్రవాల్, సీసీఎల్ఏ లోకేశ్కుమార్కు కోర్టు మినహాయింపు పిటిషన్కు అనుమతించారు. బదిలీ అయినా బాధ్యతల నుంచి తప్పించుకోలేదు ప్రభుత్వ అధికారులు విధుల్లో ఉండగా కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా బదిలీ అయినా కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు బాధ్యత వహించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు బదిలీ అయినా ఇద్దరు ఐఏఎస్లు విధిగా కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అధికారులకు బదిలీలు అతి సాధారణమైనా విధుల్లో ఉండగా వచ్చిన కోర్టు ఆదేశాలును అమలు చేయకుంటే వెంటాడుతాయనే కొత్త కోణం బొమ్మెన రామవ్వ కేసు నిరూపిస్తోంది. 15 ఏళ్లుగా భూ పరిహారం కోసం 74 ఏళ్ల వృద్ధురాలు చేస్తున్నా న్యాయపోరాటం ఐఏఎస్ అధికారవర్గాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. పరిహారం సొమ్ము కోసం పడిగాపులు కాస్తున్న ఆ వృద్ధురాలికి న్యాయపోరాటం ఫలించాలని ఆశిద్దాం. ఏడు పదుల వయసులో అలుపెరగని పోరాటం భూపరిహారం కోసం న్యాయపోరాటం బదిలీ అయిన ఐఏఎస్లకు హైకోర్టు నోటీసులు మార్చి 24న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు బదిలీ అయినా ఐఏఎస్లను వెంటాడుతున్న పరిహారం కేసులు -
ఉడ్తి పతంగ్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మజ్లిస్–ఎ–ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పలుమార్లు సత్తా చాటుకున్న పతంగ్పార్టీ మరోసారి విజయబావుటా ఎగరేసేందుకు సన్నద్ధమవుతోంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తగినన్ని సీట్లు సంపాదించి పురపాలికల్లో కింగ్మేకర్ కావాలని ప్రణాళికలు రచిస్తోంది. తన సుదీర్ఘ రాజకీయ మిత్రపార్టీ అయిన కాంగ్రెస్తో మరోసారి జట్టు కట్టేందుకు లేదా అవగాహనతో ముందుకు వెళ్లేందుకు పావులు కదుపుతోంది. రెండు దశాబ్దాలుగా కరీంనగర్ కార్పొరేషన్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లో ఉనికి చాటుకుంటూ వస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అసెంబ్లీ, బల్దియా ఎన్నికల్లో వీరి పొత్తు అనివార్యం అయ్యేలా చక్రం తిప్పడం ఆ పార్టీకే చెల్లింది. కరీంనగర్లో కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎంఐఎం పార్టీ 2005లో తొమ్మిది కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది. 2014లో రెండు కార్పొరేటర్లకు పరిమితమైంది. 2020లో పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో 10 సీట్లకు పోటీచేసి ఏడు సీట్లు గెలుచుకుంది. ఒక కో–ఆప్షన్ను బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో భాగంగా కై వసం చేసుకుంది. ఎంఐఎం అంటే ఒకప్పటిలా కేవలం ముస్లిం మైనార్టీలకే పరిమితం కాలేదు. హిందువులు మెజారిటీ ఉన్న చోట్ల వారినే నిలబెట్టి గెలిపించుకునేలా వ్యూహాలు రచించిచడం ఆ పార్టీకి కొత్తేమీ కాదు. హైదరాబాద్లో విజయవంతమైన ఈ ఫార్ములా రాష్ట్రంలో అన్ని చోట్లా అమలు పరుస్తోంది. కరీంనగర్లో నలభై డివిజన్లలో కమిటీలను ఏర్పాటు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కలుపుకొని ఈసారి 20 చోట్ల పోటీ చేస్తోంది. ఇందులో కనీసం 15 స్థానాలు గెలుచుకొని కరీంనగర్ కార్పొరేషన్లో కింగ్ మేకర్ పాత్రను పోషిస్తూ.. మూడు లేదా నాలుగు కోఆప్షన్లను కై వసం చేసుకునేలా పావులు కదుపుతోంది. మొన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న ఎంఐఎం నిన్న మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 125 మంది కార్పొరేటర్లను గెలుచుకొని సత్తా చాటింది. అదే ఊపుతో తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, బోధన్లో పాగా వేసేందుకు కసరత్తు చేస్తోంది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో 2020లో జగిత్యాలలో రెండు, కోరుట్లలో రెండు చొప్పున కౌన్సిలర్ స్థానాలను ఎంఐఎం గెలుచుకుంది. మెట్పల్లిలో ఒకటి, పెద్దపల్లిలో రెండు కౌన్సిలర్ సీట్లను కై వసం చేసుకుంది. రామగుండంలో ఎంఐఎం పార్టీ మద్దతుతో పలువురు అభ్యర్థుల విజయం సాధించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒకరిద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లకు అవినీతి బంధుప్రీతి పార్టీ నియమావళి ఉల్లంఘన తదితర కారణాల వల్ల టికెట్ల ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. ఒకప్పుడు ఎంఐఎం పార్టీ టికెట్ కోసం పెద్దగా పోటీ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం రాజకీయ వలసలు, ముస్లిం దళిత సామాజిక వర్గాల్లో వచ్చిన స్పందనతో డిమాండ్ పెరిగిపోయింది. ఎంఐఎం అధినేత ఎంపీ అసద్ ఆదేశాల మేరకు అన్ని డివిజన్లలో మూడు రకాల సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ఎలాగైనా 15 స్థానాల్లో గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతోంది. -
ఆలయ అభివృద్ధిపై శ్రద్ధ..
కొండగట్టు ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాం. మాస్టర్ ప్లాన్ అమలుకు చర్యలు చేపడుతున్నాం. టీటీడీ నిధులతో రూ.35.19కోట్లతో 96గదుల సముదాయం, దీక్ష విరమణ మంటపం నిర్మిస్తున్నాం. వరదకాలువ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తాం. ఆంజనేయస్వామి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం. – మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే కొండగట్టుకు ఏటా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నారు. వారి సంఖ్యకు అనుగుణంగా భవిష్యత్ అవసరాల మేరకు వసతులు కల్పించాలి. భక్తుల కొంగు బంగారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. భక్తులకు వసతి గదుల నిర్మాణం ప్రధానంగా చేపట్టాలి. – యాగండ్ల సుమన్, మల్యాల -
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
● కలెక్టర్ సత్యప్రసాద్జగిత్యాల: నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం జగిత్యాల బల్దియాలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులు పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన, తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు. ఫ్లయింగ్స్క్వాడ్ అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. జోనల్ అధికారులు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలతో సమావేశమయ్యారు. ప్రజలు రూ.50వేల లోపు మాత్రమే తీసుకెళ్లాలని, పైబడి తీసుకెళ్తే ఆధారాలు చూపించాలన్నారు. ప్రలోభాలు, మద్యం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. మద్యం, డబ్బు, లిక్కర్ పట్టుబడితే వీడియో రికార్డింగ్ తప్పనిసరి అన్నారు. కార్యాలయంలో 24/7 టోల్ఫ్రీ నంబరు 9666234383లో సంప్రదించాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, అబ్జర్వర్ శ్రీనివాస్, నోడల్ అధికారులు మనోజ్కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జనరల్ అబ్జర్వర్ను ఖర్టాడే కాళీచరణ్ సుమాదరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
జగిత్యాల
27.0/16.0శుక్రవారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 20267గరిష్టం/కనిష్టంవాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండవేడిగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు వీస్తాయి. పోచమ్మతల్లికి బోనాలురాయికల్: మండలంలోని మూటపల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మతల్లికి బోనాలు సమర్పించారు. సర్పంచ్ సంగెం కీర్తన, గౌడ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు
జగిత్యాలక్రైం: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాలలో నామినేషన్ వేసేందుకు వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు, అభ్యర్థితోపాటు, మరో ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ రాయికల్: రాయికల్ బల్దియాలో పోలింగ్ కేంద్రాలైన జిల్లా పరిషత్ బాలుర, బాలికల సెంటర్లను బుధవారం అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి పరిశీలించారు. ఆమె వెంట ఎస్సై సుధీర్రావు ఉన్నారు. -
టోల్ ఫ్రీనంబర్ 96662 34383
7నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభంజగిత్యాలరూరల్: బీర్పూర్ మండలకేంద్రంలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బీర్పూర్, నర్సింహులపల్లి గ్రామాలమీదుగా దేవస్థానం వరకు స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. ఈవో సంకటాల శ్రీనివాస్, ఆలయ చైర్మన్ చీర్నేని శ్రీనివాస్, సభ్యులు, అర్చకులు, సర్పంచ్ హరీశ్, ఉపసర్పంచ్ జితేందర్, నర్సింహులపల్లి సర్పంచ్ ఎడ్ల సృజన, ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘు పాల్గొన్నారు. జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల్లో సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, అందులో 96662 34383 టోల్ఫ్రీ నంబర్ ప్రారంభించామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కంట్రోల్రూంను బుధవారం పరిశీలించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఏవైనా సమస్యలున్నా.. ఇతరత్రా ఫిర్యాదులను టోల్ ఫ్రీ నంబర్కు తెలపాలని సూచించారు. ఇది 24గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, నోడల్ ఆఫీసర్ రాజ్కుమార్, నరేశ్, భాస్కర్, హకీం ఉన్నారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించండి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్లో వారితో సమావేశమయ్యారు. కోడ్ అమలులో ఉన్నందున పార్టీల రాతలు, వాల్పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగించాలని సూచించారు. నామి నేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద 100మీటర్ల దూరం నిబంధన పాటించాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలకు లోబడి ఖర్చు చేసుకోవాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి మెట్పల్లి: మున్సిపాలిటీల్లో ప్రతి నామినేషన్ స్వీకరణ కేంద్రం వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అన్ని రకాల ఫారాలను అందుబాటులో ఉంచాలని, సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ సజావుగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఆర్డీఓ శ్రీనివాస్, కమిషనర్ మోహన్ ఉన్నారు. నియమావళి పక్కాగా అమలు చేయాలి కోరుట్ల: పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. రాయికల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తిరాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని బల్దియా స్పెషల్ ఆఫీసర్, జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి అన్నారు. నామినేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు. బల్దియాలో 12వార్డులు ఉన్నాయని, వీటి పరిధిలో 13,084 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 6,157 మంది పురుషులు, 6,927 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఒక అభ్యర్థి నాలుగు సెట్ల చొప్పున నామినేషన్లు వేయవచ్చని, ప్రతిపాదకుడు మాత్రం ఒకే నామినేషన్పై సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. ఇతర నామినేషన్లపై సంతకాలు చేస్తే చెల్లదని వివరించారు. అభ్యర్థులు రూ.లక్షలోపు ఎన్నికల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్ కార్యాలయంలోనే నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 24 మంది పీవోలు, 72 మంది ఏపీవోలను నియమించామని పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. జెడ్పీహెచ్ఎస్ బాలుర, బాలికల కాంప్లెక్స్లో 1, 2, 4, 5, 9, 10, 11, 12 వార్డులు, ఇందిరానగర్లోని ఎంపీపీఎస్లో 3, మత్తడివాడ ఉర్దూమీడియంలో 6, ఒడ్డెరకాలనీలో 8, మున్సిపల్ కార్యాలయంలో 7వ వార్డుకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీంలతో ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నట్లు వివరించారు. బీ–ఫామ్ల కోసం ఎదురుచూపులు అత్యధికంగా కాంగ్రెస్ నుంచే.. బల్దియా ఎన్నికల్లో సమస్యల పరిష్కారానికి.. వెల్లడించిన కలెక్టర్ సత్యప్రసాద్ ప్రతిపాదకుడు ఒకేసెట్పై సంతకం చేయాలి రాయికల్ స్పెషల్ ఆఫీసర్ గౌతమ్రెడ్డి -
నామినేషన్ల సందడి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించడంతో సమయం లేక అభ్యర్థులు, పార్టీల నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొదటి రోజు కొంతమంది నామినేషన్లు దాఖలు చేసి, టికెట్లు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల్లోని నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే గెలుపు పక్కా అంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఒక్కో వార్డు/డివిజన్లో పార్టీ టికెట్లు ఆశించే వారు 3 నుంచి నలుగురు ఉండడంతో నేతలకు తలనొప్పిగా మారింది. ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఆయా పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పలువురు ఆశావహులు గాడ్ ఫాదర్లను నమ్ముకొని, టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. సర్వేల ఆధారంగా టికెట్లు ఒక్కోవార్డు/డివిజన్లో ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో పార్టీలన్నీ సర్వే నిర్వహించాయి. షెడ్యూల్ ఖరారు కాగానే కొత్తవారు తెరపైకి రావడంతో సర్వే ఆధారంగా గెలిచే అవకాశం ఎవరికున్నదనే ప్రాతిపదికన టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీల్లోని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అభ్యర్థుల గుణగణాలు, ప్రజల్లో ఆదరణ, పార్టీకి అందిస్తున్న సేవలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధాన పార్టీల్లో మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, నియోజవర్గ ఇన్చార్జి లు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తున్నా రు. కరీంనగర్ కార్పొరేషన్తోపాటు హుజూరా బాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ కాంగ్రెస్ నేత వొడితెల ప్రణవ్ వ్యూహరచన చేస్తున్నారు. రేపు అన్ని పార్టీల అభ్యర్థుల ఖరారు ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు అన్ని పార్టీలు రేపు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది. అదే రోజు బీ– ఫారాలు అప్పగిస్తే వారంతా పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల అధికారులకు దాఖలు చేస్తారు. అయితే మేయర్/చైర్మన్ అభ్యర్థుల ఖరారు మాత్రం పార్టీ లకు సంకటంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా మేయర్/చైర్మన్ అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో రిజర్వేషన్ అనుకూలించే ప్రతీ సీనియర్ నేత పోటీకి దిగుతున్నారు. పోటీకి సిద్ధమైనవారు ప్రచారాలు మొదలు పెట్టారు. ఇంటింటికి తిరిగి తమను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్టీ టికెట్లు తమకే వస్తాయని భావిస్తున్న నాయకులంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. తొలిరోజు మిశ్రమ స్పందన సర్వేల ఆధారంగానే పార్టీల టికెట్లు ఎవరికి ఇవ్వాలనే ఒత్తిడిలో నేతలు జోరుగా ఆశావహుల పైరవీలు రేపు అన్ని పార్టీల అభ్యర్థుల ఖరారు ‘హస్తం’లో ముగ్గురు మంత్రులే కీలకం -
గ్రేడ్–3 మున్సిపాలిటీ నుంచి..
జగిత్యాల పట్టణం వ్యూమున్సిపాలిటీ కార్యాలయంజగిత్యాల: జగిత్యాల.. 1952లో గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పడింది. 1984లో గ్రేడ్–2గా ఆవిర్భవించింది. 2009లో గ్రేడ్–1గా అవతరించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జిల్లాల పునర్విభజనలో భాగంగా జగిత్యాలను జిల్లాగా చేశారు. అప్పటినుంచి జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీగా జగిత్యాల పేరుగాంచింది. ముందుగా 38 వార్డులు ఉండగా.. ప్రస్తుతం 50 వార్డులు, 96,410 మంది ఓటర్లతో విస్తరించింది. 2016లో జిల్లాగా అవతరించిన అనంతరం మెడికల్ కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఎన్హెచ్–63, ఎన్హెచ్–563 జగిత్యాల మీదుగానే వెళ్తాయి. 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ ఇంజినీర్లు నిర్మించిన ఖిల్లా ఇప్పటికీ ఉంది. దాదాపు 20 ఎకరాల్లో విస్తరించిన ఈ కోట నక్షత్రాకారంలో ఉంటుంది. క్లాక్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. అంచెలంచెలుగా ఎదిగిన జగిత్యాల బల్దియా 50వార్డులు.. జిల్లాకేంద్రంగా -
మున్సిపాలిటీని భ్రష్టు పట్టించారు
జగిత్యాలటౌన్: జగిత్యాల మున్సిపాలిటీలో పాలకమండలి ఐదేళ్ల పదవి కాలంలో 16మంది కమిషనర్లు మారడం దేశచరిత్రలోనే తొలిసారి అని, మూడుసార్లు ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణ లు, ఎనిమిది మంది బల్దియా ఉద్యోగులు అవినీతి ఆరోపణలపై జైలుకెళ్లడం స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్ నిర్వాకమేనని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోతున్నానని ఆరోపిస్తూ ఓ బీసీ బిడ్డ మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయడం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఉన్న మాటంటే ఎమ్మెల్యే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాప్రతినిధు ల అనుమతితోనే ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణ జరుగుతాయని సంజయ్ వ్యాఖ్యానించడం ఏమిటని.. ఆయన అనుమతితోనే జగిత్యాలలో విచారణలు జరుగుతున్నాయా..? అని ప్రశ్నించారు. 16మంది కమిషనర్ల బదిలీ వెనుక ఎమ్మెల్యే ఉన్నారని భావించాలా..? అని నిలదీశారు. నోటికాడి పల్లెం ఎత్తుకెళ్లినట్లు పదేళ్లు కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లల్ల కట్టె పెట్టి.. పార్టీకోసం పనిచేసిన వారి శ్రమను దోపిడీ చేసే కుట్ర చేస్తూ అభివృద్ధి జపం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చిన్నపాటి సవరణ చేయలేక మున్సిపల్ చైర్మన్ పీఠంపై కూర్చోవాల్సిన బీసీల హక్కును కాలరాసిన ఘనత ఎమ్మెల్యేకే దక్కిందని వ్యాఖ్యానించారు. నిబంధనల మేరకు పనులు చేయాలంటే తనను అభివృద్ధి నిరోధకుడు అంటున్న సంజయ్.. యావర్రోడ్డుపై ఆక్రమణలు తొలగిస్తానంటే ఎవరు అడ్డుకున్నారని నిలదీశారు. యావర్రోడ్డులోని ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ ఆదేశించినా కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారులను అడ్డుకుంటున్న అదృశ్య శక్తి ఎవరో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిపై చర్చ జరుగుతుంటే జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి పై చర్చ సాగడం ఆయన పదేళ్ల పాలనకు నిలువెత్తు నిదర్శనమన్నారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పెట్రోల్ పంపు స్థలాన్ని బల్దియాకు స్వాధీనం చేయాలని, యావర్రోడ్డులో ఉన్న ఆక్రమణలు తొలగించి సంజయ్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సమావేశంలో నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, దేవేందర్రెడ్డి, మన్సూర్, పిప్పరి అనిత, శీలం సురేందర్, రమేశ్బాబు, రఘువీర్గౌడ్, గుండ మధు, నేహాల్ తదితరులు ఉన్నారు. జగిత్యాలను అవినీతి కేంద్రంగా మార్చారు ఏసీబీ, విజిలెన్స్ విచారణ ఎమ్మెల్యే అనుమతితోనే జరిగాయా..? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సంజయ్ ఉలిక్కిపడుతున్నడు విలేకరుల సమావేశంలో మాజీమంత్రి జీవన్రెడ్డి -
‘సాక్షి’ స్టడీ మెటీరియల్తో ప్రయోజనం
మల్లాపూర్: సాక్షి స్టడీ మెటీరియల్తో పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఎంఈవో కేతిరి దామోదర్రెడ్డి అన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సాక్షి రూపొందించిన గణితం, భౌతికశాస్త్రం స్టడీ మెటీరియల్ను హెచ్ఎం చంద్రమోహన్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ప్రైవే టు పాఠశాలలకు దీటుగా విద్యార్థులు రాణించాలని, నిరుపేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఉచితంగా మెటీరియల్ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్, సురేష్, నర్సయ్య, శివరాం, సజ్జన్న, రాజశేఖర్, రమేశ్, విశ్వ, సాజిద్, విక్రమ్, సాక్షి సిబ్బంది పాల్గొన్నారు. కోరుట్ల బల్దియాపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల: బల్దియాపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని, ఇందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. 27వ వార్డుకు చెందిన అంబటి శ్రీనివాస్తోపాటు పలువురు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం విద్యాసాగర్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కోరుట్లలో జరిగిన అభివృద్ధిని వివ రిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయండి● దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్జగిత్యాల: వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఇప్పటినుంచే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్ తెలిపారు. కలెక్టర్తో బుధవారం కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గోదావరి నది ప్రవహించే జిల్లాల్లో పుష్కరాలకు సంబంధించి పుష్కర ప్రదేశాలను టైర్–1, టైర్–2, టైర్–3గా విభజించాలని, ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలిధర్మపురి: నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను బుధవారం పరిశీలించారు. నామినేషన్ల కోసం చేసిన ఏర్పాట్లు, మీడియాసెంటర్, వసతులపై ఆరా తీశారు. అలాగే మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందమీటర్ల దూరంలో ఉండాలని మార్కింగ్ చేశారు. వాహనాలను లోనికి రాకుండా సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేశ్, ఉదయ్కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులున్నారు. ‘నానో’తో ప్రయోజనంజగిత్యాలఅగ్రికల్చర్: నానో ఎరువులతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని జిల్లా సహకార అధికారి మనోజ్కుమార్ అన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో ఎఫ్పీఓల కార్యదర్శులకు నానో ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. అధిక రసాయన ఎరువులతో భూములు దెబ్బతింటున్నాయన్నారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ ద్రవ రూపంలో ఉండే యూరియాతో పంటలకు మేలు జరుగుతుందన్నారు. -
ఉత్పత్తిలో వెనక !
నూలు లేక..ఇదీ.. వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డులోని నూలుడిపో. సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు అవసరమైన నూలును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లతో ఏర్పాటు చేసింది. పది శాతం డబ్బులు చెల్లించిన మధ్యతరగతి వస్త్రోత్పత్తిదారులకు నూలు ఇవ్వాలి. కానీ మూడు నెలలుగా నూలు లేక నేతన్నలకు ప్రభుత్వం ఇచ్చిన ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తిలో మధ్యతరగతి ఆసాములు వెనకబడ్డారు. ఒక్క జరీ నూలు మాత్రమే ఈ డిపోలో అందుబాటులో ఉంది. చీరల బట్ట ఉత్పత్తికి అవసరమైన వెప్ట్(అడ్డం పోగులు), వార్ప్(నిలువు పోగులు) నూలు అందుబాటులో లేదు. దీంతో చీరల ఉత్పత్తి ముందుకు సాగడం లేదు. ఆర్డర్లు : 1.71 కోట్ల మీటర్లు ఆర్డర్ల విలువ : రూ.60కోట్లు ఆర్డర్లు పొందిన మ్యాక్స్లు : 130 ఉత్పత్తి ప్రారంభించిన మ్యాక్స్లు : 15 సిరిసిల్లలోని సాంచాలు : 24,560 ఉత్పత్తి చేస్తున్న సాంచాలు : 6,950 ఇప్పటికే ఉత్పత్తి అయిన చీరల బట్ట : 25 లక్షల మీటర్లు చీరల బట్ట ఉత్పత్తి గడువు : 2026, జనవరి 31 -
నన్ను ఏకాకి చేశావా చెల్లె..
చందుర్తి(వేములవాడ): ‘ఇన్నాళ్లు మనకు ఎవరూ లేకున్నా.. ఒకరికొకరం తోడునీడగా ఉన్నాం.. కష్టసుఖాలను పంచుకున్నాం.. ఇప్పుడు నన్ను ఏకాకి చేసి వెళ్లిపోయావా చెల్లె.. నేను ఎవరి కోసం బతకాలె..’ అంటూ చెల్లె మృతదేహం వద్ద అక్క రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బండపల్లికి చెందిన తోకల బుచ్చవ్వ– మల్లయ్య దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం. పెద్ద కూతురు లచ్చవ్వ, రెండో కూతురు మల్లవ్వ(53)కు గతంలోనే పలువురితో పెళ్లి కాగా, విడాకులు తీసుకుని తల్లిగారింట్లో ఉంటుండగా, మరో ముగ్గురు వారివారి అత్తవారిళ్లలో ఉంటున్నారు. పెద్ద కూతురు, రెండో కూతురు కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేవారు. తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే మృతిచెందగా, లచ్చవ్వ, మల్లవ్వ ఒకరికొకరు తోడునీడగా జీవనం సాగిస్తున్నారు. వీరికి వారసులు లేరు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో సోమవారం వరినాటు వేసి వచ్చిన మల్లవ్వ మంగళవారం వేకువజామున అస్వస్థతకు గురై అకస్మాత్తుగా మృతిచెందింది. చెల్లె మరణాన్ని తట్టుకోలేని అక్క గుండెలవిసేలా రోదించింది. అన్నీతానై కుటుంబాన్ని పోషించిన లచ్చవ్వ చివరకు చెల్లెకు తలకొరివి పెట్టేందుకు ఓ చేతిలో కుండ, మరో చేతిలో అగ్గి పట్టుకుని ముందు నడవడం చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టారు. బాధితులది నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు విరాళాలు అందించారు. సర్పంచ్ కటకం మల్లేశం, మాజీ ఉపసర్పంచ్ గడ్డం శ్రీనివాస్రెడ్డి పాడే మోసి ప్రగాడ సంతాపం తెలిపారు. ఇన్నాళ్లు ఒకరికొకరు తోడునీడగా ఉన్న అక్కాచెల్లెలు చెల్లె చితికి నిప్పు పెట్టిన అక్క అంత్యక్రియలకు గ్రామస్తుల విరాళం బండపల్లిలో విషాదం -
దుబాయిలో గుండెపోటుతో సిరికొండ వాసి మృతి
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన ముంజ స్కైలాబ్గౌడ్(45) అనే వ్యక్తి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... స్కైలాబ్గౌడ్ గత పదేళ్లుగా దుబాయిలోని అబుదాబి ఏరియాలో ముసాయిదా క్యాంపులో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 26న తాను ఉంటున్న క్యాంపులోనే గుండెపోటు రావడంతో తోటి మిత్రులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందినట్లు అక్కడివారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాం స్వగ్రామానికి పంపించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
2,303
మాంసాహార..జగిత్యాలరూరల్: దేశవ్యాప్తంగా అడవులలో సంచరిస్తున్న జంతువుల గణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జంతుగణన ఈనెల 25తో జిల్లాలో పూర్తయింది. జిల్లాలో ఉన్న 1.25 లక్షల ఎకరాల్లో ఉన్న అడవుల్లో జంతుగణన చేపట్టారు. అటవీసిబ్బ ందితో పాటు, అడవి క్షేత్రస్థాయి అధికారులు 67 బీట్లలో సర్వే నిర్వహించారు. జంతుగణనలో శాఖాహార జంతుగణన, మాంసాహార జంతుగణన రెండు రకాలుగా చేపట్టారు. జిల్లాలో నాలుగు సెక్షన్ల పరిధిలో నాలుగు రోజుల పాటు ప్రక్రియ నిర్వహించారు. 67 బీట్లలో జంతుగణన జిల్లాలో నాలుగు సెక్షన్ల పరిధిలో 67 బీట్లలో జంతుగణన చేపట్టారు. ప్రతీబీట్లో ఇద్దరు చొప్పున 134 మంది సర్వేలో పాల్గొన్నారు. ఈనెల 19 నుంచి 25 వరకు రోజుకు రెండు విడతలుగా జంతువు అడుగులు, మూత్రం, వాసన, పేడతో పాటు, ఇతర ఆధారాలను సేకరించి ఆ జంతుగణన పూర్తి చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో టైగర్ జోన్ ప్రాంతాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసి వాటి కదలికలను సీసీకెమెరాల ఆధారంగా సర్వే చేపట్టారు. 2,303 మాంసాహార, 27,733 శాఖాహార జంతువుల గుర్తింపు జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో ఉన్న అడవుల్లో అధికారులు సిబ్బంది బృందాలుగా ఏర్పడి 2,303 మాంసాహార జంతువులు, 27,733 శాఖాహార జంతువులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో మాంసాహార జంతువులు, శాఖాహార జంతువులను గుర్తించారు. ముఖ్యంగా అధికారులు జంతువులు రాత్రి వేళల్లో, మధ్యాహ్నం వేళల్లో తిరిగే జంతువులను కూడా గుర్తించి వాటి సంచారం చేసే ప్రాంతాలలో ఇద్దరికి ఒక బృందం చొప్పున వీరు అడవుల్లో తిరుగుతూ సర్వే చేపట్టారు.అడవుల్లో సర్వే చేపడుతున్న ఉద్యోగులు, సిబ్బంది -
హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలి
హుజూరాబాద్: హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలనే ఉద్యమం మళ్లీ రాజుకుంది. జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్సు డిపో చౌరస్తాలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం నుంచి భారీ ర్యాలీ తీశారు. శ్రీహుజూరాబాద్ జిల్లా– మన హక్కుశ్రీ అంటూ నినదించారు. అనంతరం కరీంనగర్– వరంగల్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోద్ సదానందం మాట్లాడుతూ అన్ని అర్హతలున్న హుజూరాబాద్ను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్షాళన చేపట్టనున్న నేపథ్యంలో హుజురాబాద్ను జిల్లాగా ప్రకటించాలని, పీవీ నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు రహదారిపై ఆందోళన నిర్వహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టౌన్ సీఐ కరుణాకర్ ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు. వరంగల్– కరీంనగర్ ప్రధాన రహదారిపై నిరసన -
పోలీసు శాఖలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి
జ్యోతినగర్(రామగుండం): తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఎస్సీ రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు విభాగం సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎస్సీల హక్కులు, రిజర్వేషన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. నియామకాలు, పదోన్నతులు, సేవా వ్యవహారాల్లో వివక్షత చూపొద్దని పోలీసు అధికారులకు సూచించారు. బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అన్నారు. ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సిఫారసు చేయడం ద్వారా ప్రమోషన్లలో కొంత ఉపషమనం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్బాబు, రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ, ఏజీపీ(లా అండ్ ఆర్డర్) రమణ, లీగల్ సెల్ అదనపు ఎస్పీ సతీశ్, సీఐడీ ఎస్పీ అనన్య, ఐఎస్డబ్ల్యూ ఎస్పీ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. నేను దళిత మహిళను. కుమారస్వామి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది. ఇప్పుడు ఇబ్బందులకు గురిచేసిండు. అన్యాయంగా నా ఇల్లును రిజిస్ట్రేషన్ చేసుకుని జైలుకు పంపించిండు. అప్పటి ఎస్సై ఉపేందర్ ఆయనకు సహకరించారు. కుమారస్వామి, ఎస్సై ఉపేందర్తోపాటు మరికొందరిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి. – స్వరూప, నస్పూర్, మంచిర్యాల జిల్లా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ ఎన్టీపీసీలో పోలీసు అధికారులతో రాష్ట్రస్థాయి సమీక్ష -
బల్దియా నగారా!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన దరిమిలా కోడ్ అమల్లోకి వచ్చింది. 28వ తేదీ (నేటి) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగనుంది. 31న పరిశీలన, 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదే తేదీన తుదిజాబితా ఖరారు కానుంది. ఫిబ్రవరి 11న ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. 12వ తేదీని రీపోలింగ్ కోసం ముందుజాగ్రత్తగా రిజర్వుచేసి ఉంచారు. ఇప్పటికే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వార్డుల పునర్విభజన, ఓటరు తుదిజాబితా, పోలింగ్ కేంద్రాలు, ఉద్యోగులకు శిక్షణ, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పూర్తిచేశారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొత్తం 17 రోజులపాటు ఎన్నికల వాతావరణం ఏర్పడనుంది. నామినేషన్ కేంద్రాల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలోని 15 పురపాలికల్లో 5 చోట్ల బీసీలు, 4 చోట్ల ఎస్సీలు, 6 చోట్ల అన్రిజర్వ్డ్ (ఓసీ) వర్గాలకు అవకాశం కల్పించారు. కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్కు కేటాయించారు. కరీంనగర్లో జమ్మికుంట ఎస్సీ జనరల్కు, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలను ఎస్సీ మహిళలకు కేటాయించారు. జగిత్యాలలో అత్యధికంగా ఓసీలకు అవకాశం కల్పించారు. జగిత్యాల మున్సిపాలిటీ బీసీ (మహిళ)లకు కేటాయించగా, కోరుట్ల, ధర్మపురి మున్సిపాలిటీలు ఓసీ (మహిళ)లగా నిర్ణయించారు. ఇక రాయికల్, మెట్పల్లి మున్సిపాలిటీలు పూర్తి అన్రిజర్వ్డ్గా ప్రకటించారు. సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ జనరల్ (మహిళ)కు కేటాయించగా, వేములవాడ మాత్రం బీసీ (జనరల్) అవకాశం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్, పెద్దపల్లి, మంథని మున్సిపాలిటీలు బీసీ (జనలర్)లకు కేటాయించగా, సుల్తానాబాద్ పూర్తిస్థాయిలో అన్రిజర్వ్డ్గా డిక్లేర్ చేశారు. కోర్టు దావాలపై ఉత్కంఠ.. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన దావాలపై ఉత్కంఠ నెలకొంది. పలు సామాజికవర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పాటించలేదని ఆరోపిస్తూ దాఖలైన ఆయా పిటిషన్లపై న్యాయస్థానాలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది. తనిఖీలు ముమ్మరం... కోడ్ అమల్లోకి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దరిమిలా కరీంనగర్, రామగుండం కమిషనరేట్ల సీపీలు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీలు తనిఖీలు ప్రారంభించారు. నగదు రవాణాపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలు పాటించాలని స్పష్టంచేస్తున్నారు. ఇటు మేడారం బందోబస్తు, అటు మున్సిపల్ ఎన్నికలను సమన్వయం చేసుకునేందుకు ఆయా జిల్లా పోలీసులు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. ఉదయం నుంచే అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కౌంటర్లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. కోరుట్ల వార్డులు: 33 చైర్మన్ ఆన్ రిజర్వ్ నామినేషన్ కేంద్రాలు: 3 రాయికల్ వార్డులు :12 నామినేషన్ కేంద్రాలు:01 చైర్మన్ రిజర్వేషన్ : జనరల్మెట్పల్లి వార్డులు : 26 నామినేషన్ కేంద్రాల సంఖ్య : 1 చైర్మన్ రిజర్వేషన్ : జనరల్ ధర్మపురి వార్డులు : 15 నామినేషన్ కేంద్రాల సంఖ్య:1 కౌంటర్లు : 5 చైర్మన్ రిజర్వేషన్ : జనరల్ మహిళవార్డులు : 50 నామినేషన్ కేంద్రాల సంఖ్య :2 (కౌంటర్లు 17) చైర్మన్ రిజర్వేషన్ : బీసీ మహిళా -
సందడే సందడి
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫిషన్ రావడం, నామినేషన్లు సైతం నేటి నుంచే ప్రారంభం కావడంతో హడావుడి ప్రారంభమైంది. నామినేషన్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టేబుల్స్, టెంట్లు, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అభ్యర్థుల హడావుడి... నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి వార్డులో 3–4 అభ్యర్థులను ఎంపిక చేశారు. బీఫాంలు ఎవరికి వస్తే వారు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే పలు వార్డుల్లో సర్వే చేయించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా జాబితాను రూపొందించుకున్నారు. నోటిఫికేషన్ వచ్చినప్పటికీ నామినేషన్లకు సమయం ఉంటుంది కావచ్చని భావించినా మూడు రోజులే ఉండటంతో అభ్యర్థులకు కొంత తలనొప్పిగానే మారనుంది. బీఫామ్స్ ఎవరికి వచ్చేనో... జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అటు సీనియర్ నాయకులు మాజీమంత్రి జీవన్రెడ్డి ఇటీవలే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ కాంగ్రెస్ వైపున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్ మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. ఇప్పటికే జీవన్రెడ్డి మొదటి నుంచి జెండా పట్టుకున్న వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, సంజయ్కుమార్ సైతం తమ వర్గానికే ఇవ్వాలని పేర్కొంటున్నట్లు తెలిసింది. ఏదేమైనా వీరి మధ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దామనుకున్న ఆశావహుల మధ్య గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్లో మాత్రం అటు ఎమ్మెల్యే, ఇటు మాజీమంత్రి జీవన్రెడ్డి వర్గీయులు మాత్రం నామినేషన్లు వేసేలా చూస్తున్నారు. బీఫామ్స్ మాత్రం ఎవరికి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
పోదామా.. సమ్మక్క జాతర
గొల్లపల్లి: రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతరకు గద్దెలు సిద్ధమయ్యాయి. అమ్మవార్ల దర్శనానికి జిల్లాలోని గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్, వెల్గటూర్, రాజారాంపల్లి, ధర్మపురి మండలంలోని రామయ్యపల్లి గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. సారలమ్మ రాకతో నేటినుంచి జాతర ప్రారంభం అవుతుంది. 31వ తేదీ వరకు నిర్వహిస్తారు. జాతర కమిటీ, గ్రామపంచాయతీలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. గద్దెలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయం, ఏర్పాట్లు చేస్తున్నారు. చిల్వాకోడూర్కు రద్దీ ఎక్కువ చిల్వాకోడూర్ ఎక్స్రోడ్ సమీపంలో ఎక్కల్దేవి గుట్ట కింద సమ్మక్క సారలమ్మ గద్దెలు, జంపన్న వాగు, విశాలమైన మైదానం ఉండటంతో పాటు, కరీంనగర్, జగిత్యాల, ధర్మారం నుంచి హైవే, గద్దెల సమీపంలోనే బస్టాండ్ ఉండటంతో భక్తుల ప్రయాణానికి సౌకర్యంగా ఉంటుంది. దీంతో ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు. 2024లో భక్తుల సంఖ్య 1.50 లక్షల వరకు రావడంతో ఈ ఏడాది 2 లక్షలకు పైగా భక్తులు రానున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. జాతర తేదీలు గొల్లపల్లి మండలంలోని చిల్వాకోడూర్, వెల్గటూర్, రాజారంపల్లి, ధర్మపురి మండలంలోని రామయ్యపల్లి గ్రామాల్లో నేటి బుధవారం నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు. 28న బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కంకవనం గద్దెకు తెస్తా రు. సాయంత్రం 5 గంటలకు సారలమ్మ గద్దెకు చే రుకుంటారు. 29న గురువారం సాయంత్రం సమ్మ క్క గద్దెకు వస్తుంటారు. 30న శుక్రవారం మొక్కులు చెల్లించుకుంటారు. 31న శనివారం సాయంత్రం దే వతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, ధర్మారం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కలదని సర్పంచ్ దాసరి తిరుపతి, ఉత్సవ కమిటీ ఫౌండర్ చైర్మన్ గందె భాస్కర్, ఉపాధ్యక్షుడు చేని రాములు తెలిపారు. రాజారాంపల్లిలో ఏలేటి వంశీయులు 2011లో ఏర్పాటు చేసిన గద్దెలపై నేటికి జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈసారి కూడా జాతర ఏర్పాట్లు భారీగా నిర్వహిస్తున్నామని చైర్మన్ ఏలేటి శైలేందర్రెడ్డి వివరించారు. -
అదుపు తప్పిన కారు
● ఒకరు మృతి, నలుగురికి గాయాలు ● ఎల్ఎండీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఘటన తిమ్మాపూర్: మండలంలో ఎల్ఎండీ కాలనీలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐదు నిమిషాల్లో బందువుల ఇంటికి చేరతామనగా, వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్కు చెందిన కుటుంబం హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. సోమవారం సాయంత్రం కారులో ఇంటి నుంచి తిమ్మాపూర్లోని వారి బంధువుల ఇంటికి బయల్దేరారు. ఎల్ఎండీ కాలనీ వద్దకు రాగానే లారీని తప్పించే ప్రయత్నంలో కారు కిందకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న కనకమెడల అరుణకుమారి (80) అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, తీవ్ర గాయపడిన నలుగురిని సమీప ఆసుపత్రికి తరలించారు. తిమ్మాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి బోయినపల్లి: మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పెంటి రాంప్రసాద్ (49) అనే ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ గుండెపోటుతో సోమవారం రాత్రి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయంత్రం ఇంటివద్దే ఒక్కసారి కుప్పకూలినట్లు తెలిపారు. రాంప్రసాద్ మృతదేహాన్ని మంగళవారం ఏపీడీ నర్సింహులు, ఎంపీడీవో భీమ జయశీల, ఈజీఎస్ ఏపీవో సబిత, కార్యదర్శి శేఖర్ తదితరులు సందర్శంచి నివాళి అర్పించారు. కుటంబీకులను ఓదార్చి రూ.20 వేలు ఆర్థికసాయంగా అందించారు. మృతుడికి భార్య శ్రీవాణి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. బాధిత కుటంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పోలీసుల అదుపులో గంజాయి విక్రేతజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో హస్నాబాద్ గ్రామ శివారులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. వ్యాపారి.. సిరిసిల్లక్రైం: నమ్మకంగా కిరాణాషాపు నడుపుతూ పలువురి వద్ద రూ.2కోట్లు అప్పుగా తీసుకొని రెండునెలల క్రితం ఉడాయించిన వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాధితులు తమ డబ్బును ఎలాగోలా రాబట్టుకునేందుకు సిరిసిల్లటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది. వ్యాపారికి బాధితులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఓ జాతీయ పార్టీ నాయకుడు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సిరిసిల్ల టౌన్ పోలీసులను వివరణ కోరగా, వ్యాపారిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రమాదవశాత్తు కాలువలో పడి ఒకరు మృతి
ఇబ్రహీంపట్నం: అంత్యక్రియలకు వెళ్లి ప్రమాదవశాత్తు కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. మండలకేంద్రానికి చెందిన జింక గంగాధర్(48) సోమవారం తమ కులానికి చెందిన ఒకరు మృతి చెందడంతో అంత్యక్రియలకు వెళ్లి పక్కనే ఉన్న కాకతీయ కాలువలో నీళ్లు చల్లుకునేందుకు మెట్లు దిగడంతో ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. గ్రామశివారులో మంగళవారం సాయంత్రం మృతదేహం దొరికింది. మృతుడి సోదరుడు జింక శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్సై నవీన్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతిజగిత్యాలక్రైం: బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన దుంపెట వినోద్ (29) అనే యువకుడు మంగళవారం సాయంత్రం ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వినోద్ మంగళవారం ట్రాక్టర్తో పొలం దున్నేందుకు వెళ్లాడు. దున్ని తిరిగి వస్తుండగా సాయంత్రం ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో బోల్తాపడగా వినోద్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బీర్పూర్ ఎస్సై రాజు తెలిపారు. స్వగ్రామం చేరిన మృతదేహంరాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన పడాల గంగారెడ్డి (47) అనే గల్ఫ్ కార్మికుడు ఈనెల 6న సౌదీలో గుండెపోటుతో మృతిచెందగా, మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరింది. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. గల్ఫ్ కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. -
జగిత్యాల
29.0/17.07గరిష్టం/కనిష్టంమల్లన్న అగ్ని గుండాలు కోరుట్లరూరల్: మండలంలోని సంగెంలో మల్లన్న జాతర ఘనంగా నిర్వహించారు. మంగళవారం అగ్ని గుండంలో భక్తులు నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. నాగవెల్లి, మల్లన్న పట్నాలు వేసి ఉత్సవాలు ముగించారు.రేణుక ఎల్లమ్మ పట్నాలు మల్యాల: మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ పట్నాల సందడి మొదలైంది. మంగళవారం ఇంటింటా జోగు నిర్వహించారు. ఫిబ్రవరి 3న బోనాలు, పట్నం, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.వాతావరణం పొడి వాతావరణం ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి సమయంలో చలిగాలులు కొనసాగుతాయి.బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026 -
మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల మహిళలలకు మంజూరైన దాదాపు 100 కుట్టు మిషన్లను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ మైనార్టీ మహిళాశక్తి రేవంతన్నక భరోసా’ కార్యక్రమం చేపట్టిందన్నారు. ముస్లిం మహిళలు కుట్టుమిషన్ల ద్వారా ఇంట్లోనే ఉపాధిపొందే అవకాశం ఉందన్నారు. త్వరలో మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, గంభీరావుపేటలో మైనార్టీల కోసం కమర్షియల్ కాంప్లెక్స్, మజీద్ అభివృద్ధి, అత్యాధునిక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషిచేస్తానని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి కులమత, రాజకీయాలకతీతంగా సేవలందిస్తానన్నారు. సమష్టిగా పనిచేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకుందామన్నారు. సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై పెద్దమ్మ బస్స్టేజీని ఎక్స్ప్రెస్ స్టాప్గా మార్చడానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడడం జరిగిందని, త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి భారతి, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉపసర్పంచ్ కమలాకర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ -
అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న
జగిత్యాల: అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, జగిత్యాల మున్సిపాలిటీకి రూ. 62.5 కోట్లు మంజూరు చేయించానని, కాంగ్రెస్ సీని యర్ నాయకులు తనపై అనవసరపు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం మోతె పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. జగిత్యాలలో సరైన మాస్టర్ ప్లాన్ లేక ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారని, ఇది గత అధి కారులు, పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. ఎల్ఎల్ గా ర్డెన్స్ సమీపంలో కనీసం రోడ్డు లేకపోతే రూ.కోటి పెట్టి భూమిపూజ చేస్తే సీనియర్ నాయకులు పరి శీలించకుండానే సరిగా లేదని విమర్శలు చేసి చివరికి అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంట్రాక్టర్కు రూ.9 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ఎలాంటి సమాచారం లేకుండా విమర్శించడం మానుకోవాలన్నారు. తన పై బురదచల్లే ప్రయత్నం చేస్తూ వారి హోదాను వారే తగ్గించుకుంటున్నారన్నారు. ఇప్పటికీ ఆయనపై గౌరవం ఉందని, ప్రజలు దానిని గమనిస్తున్నారన్నారు. గతంలో రోడ్లు భవనాల మంత్రిగా ఉండి అనంతారం బ్రిడ్జి శంకుస్థాపన చేసి వదిలేశారని ఆరోపించారు. అప్పటి ఎంపీ కవిత సహకారంతో 4,500 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయించి ని ర్మించడం జరిగిందన్నారు. కవిత ఓటమికి తాను కా రణమంటూ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, అనవసర ఆరోపణలు మాని జగిత్యాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. మున్సిపల్ మాజీ చైర్మ న్లు గిరి నాగభూషణం, జ్యోతి, గట్టు సతీశ్, దామోదర్రావు, జిలాని, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని, జిల్లాలోని ఐదు మున్సిపాలిటిల్లో 136 వార్డుల్లో 2,31,627 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం మున్సిపల్కు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 379 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జగిత్యాలలో రెండు నామినేషన్ కేంద్రాలు, రాయికల్, ధర్మపురిలో 1, కోరుట్లలో 3, మెట్పల్లిలో–1 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్వో, ఏఆర్వోలను 112 మందిని నియమించడం జరిగిందని, 6 ప్లయింగ్స్క్వాడ్స్, 5స్టాటిస్టిక్స్ సర్వైలైన్స్ టీమ్స్ , 50 జోనల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. 379 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 455 పీవోలు, 1516 మందిని వోపీవోలను నియమించామన్నారు. ఎస్కేఎన్ఆర్ కళాశాలలోనే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నేటి నుంచి కోడ్ అమలులోకి వస్తుందని, మున్సిపాలిటిల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లను తొలగించాలన్నారు. ఒక వ్యక్తి రూ.50 వేలలోపే నగదు తీసుకెళ్లాలన్నా రు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాల పోలీసు బందోబస్తు చేశామని, ఎన్నికలు విజయవంతం అయ్యేలా పోలీసు సిబ్బందికి అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీపీఆర్వో మధుసూదన్, కలెక్టరేట్ ఏవో హకీం పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి విద్యార్థులు కష్టపడి చదివి మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా నుంచి దక్షిణ భారత సైన్స్ ప్రదర్శనలో ప్రతిభ చూపిన విద్యార్థులు, ఉపాధ్యాయున్ని అభినందించారు. ఇన్స్పైర్ మానక్ పోటీలలో ప్రతిభ కనబర్చిన కోరుట్ల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఎస్.హిమని, మెట్పల్లి జెడ్పీహెచ్ఎస్కు చెందిన వాగ్దేవి, జగిత్యాల కేజీఆర్ ఉన్నత పాఠశాలకు చెందిన నబిర అజీన్కు శుభాకాంక్షలు తెలిపారు. డీఈవో రాము, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ ఉన్నారు. పదో తరగతి పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి పదో తరగతి పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఫౌండేషనల్ లిటరసి అండ్ న్యుమరసిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారిగా పిల్లలు చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగాహారాల్లో సమీక్ష చేసి ప్రాథమిక స్థాయిలో జరిగే సమావేశాల్లో డేటాను విస్తరించుకుని ఉపాధ్యాయులకు లక్ష్యం నిర్దేశించి 40 రోజుల్లో విద్యార్థులు కనీసఅభ్యాసన స్థాయి సాధించేలా చూడాలన్నారు. జాతరకు అన్ని ఏర్పాట్లు మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తులు వనదేవతల దర్శనాలకు వెళ్లి జాగ్రత్తగా రవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం మేడారం మహాజాతరకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: గొల్లపల్లి మండలం వెంగళాపూర్ గ్రామానికి చెందిన బొంకంటి గంగాధర్ (58) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. గంగాధర్ జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈనెల 13న సాయంత్రం 7 గంటల సమయంలో డ్యూటీకి వచ్చేందుకు ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు వస్తుండగా లక్ష్మీపూర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సమీపంలో ఆకస్మాత్తుగా బర్రె అడ్డు వచ్చి గంగాధర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో గంగాధర్ కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడు బొంకంటి నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యచిగురుమామిడి: చిగురుమామిడి మండలం నవాబుపేట్కు చెందిన కక్కెర్ల వివేక్ అనే డిగ్రీ విద్యార్థి కాకతీయ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పృథ్వీధర్గౌడ్ కథనం ప్రకారం.. వివేక్ కరీంనగర్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 24న హాల్ టికెట్ తెచ్చుకునేందుకు కరీంనగర్ వెళ్తున్నానని తల్లి సబితతో చెప్పి వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంగళవారం సైదాపూర్ మండలం సోమారం కాకతీయ కెనాల్ వద్ద వివేక్ మృతదేహాన్ని గుర్తించారు. తన కొడుకు డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్ఫీ వీడియో తీసుకొని.. పురుగుల మందు తాగి..● కుటుంబ సభ్యుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య చిగురుమామిడి: చిగురుమామిడి మండలం రామంచ గ్రా మానికి చెందిన నాగెల్లి వెంకట్రెడ్డి కుటుంబ కలహాలతో సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, ఎల్ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రెడ్డి చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్లో సూపర్మార్కెట్ నిర్వహిస్తున్నాడు. గతేడాది నవంబర్ 7వ తేదీన కరీంనగర్కు చెందిన మనీషాతో వివాహమైంది. సూపర్ మార్కెట్ విషయమై తమ్ముళ్లు శేఖర్రెడ్డి, మహిపాల్రెడ్డి, తల్లిదండ్రులు రాజిరెడ్డి,అనసూర్యతో గొడవలు జరుగుతున్నాయి. తీవ్ర మనస్తాపానికి గురై తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శ్మశానవాటికలో క్రిమిసంహారక మందు తాగుతున్నట్లు భార్య, తన బావలకు ఫోన్చేశాడు. సమాచారం అందుకున్న వారు వెంకట్ రెడ్డిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున చనిపోయాడు. మనీషా ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిరిసిల్లక్రైం: చోరీ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు, రూ.3వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎ.ప్రవీణ్ మంగళవారం తీర్పు చెప్పారు. పట్టణ సీఐ తెలిపిన వివరాలు.. శివనగర్కు చెందిన కొండా రంజిత్ 2020 అక్టోబర్లో చంద్రంపేటకు చెందిన అనగందుల గోపి ఇంట్లో రూ.38 వేల విలువగల కెమెరాను చోరీ చేశాడు. అప్పటి ఎస్సై నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. న్యాయమూర్తి సాక్ష్యాధారాలు పరిశీలించి నిందితుడికి జైలు, జరిమానా విధించారు. -
జగిత్యాల
7మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026అర్హులందరికీ పథకాలుజగిత్యాల: సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్నామని, మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రైతులకు భరోసా, విద్య, వైద్యరంగాల్లో జిల్లా అగ్రగామిగా నిలుస్తోందని కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని, పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. రాయికల్:వేషధారణలో చిన్నారులుమహిళల ఆర్థిక సాధికారత కోసం మహిళలు ఆర్థిక సాధికారత కోసం జిల్లాలో రూ.659.57 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. 2024–25కుగాను వడ్డీమాఫీ కింద 11,825 సంఘాలకు రూ.26కోట్ల వడ్డీమాఫీ అందించామన్నారు. సీ్త్రనిధి ద్వారా రూ.60 కోట్లు ఇచ్చామన్నారు. 1,77,289 మంది మహిళల చీరలు అందించామన్నారు. మహిళాసంఘాల ద్వారా 134 కొనుగోలు కేంద్రాలద్వారా రూ.3.50 కోట్ల విలువైన ధాన్యం సేకరించామన్నారు. రూ.5 కోట్లతో జిల్లా సమైక్య భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం వరం మహాలక్ష్మీ పథకాన్ని 2,78,096 మంది వినియోగించుకున్నారని తెలిపారు. 2,89,725 గ్యాస్ సిలిండర్లను రూ.500కే సరఫరా చేశామన్నారు. 2,09,507 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించామని వివరించారు. 1055 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 11,720 మంది గర్భిణులు, 13,376 మంది పిల్లల కు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ సొంత భవనాలకు రూ.8.28 కోట్లు మంజూరు చేశామన్నారు. దివ్యాంగులకు 66 రిట్రో వాహనాలు, 9 ల్యాప్టాప్లు, 20 బ్యాటరీ ఆపరేటెడ్ వీల్చైర్లు అందించామన్నారు. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వెనుకబడిన సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నామని, ఇటీవల 200 శాతం డైట్ చార్జీలు, 40 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తున్నామని, రూ.400 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కాగా.. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో 25 ఎకరాల చొప్పున భూమి కేటాయించామన్నారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి 25 ఎకరాలు కేటాయించామన్నారు. కోరుట్లలో నవోదయ విద్యాలయం ఏర్పాటైందన్నారు. ధర్మపురికి డిగ్రీ కళాశాల మంజూరైందన్నారు. జిల్లాలో పదో తరగతి చదివే విద్యార్థులకు అల్పాహారం కోసం 186 ఉన్నత పాఠశాలలకు రూ.14,75,730 కేటాయించామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, 11,079 మందికి ఇళ్లు కేటాయించగా.. 6,392 ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. లబ్ధిదారులకు రూ.134.24 కోట్లు చెల్లించామని తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా ద్వారా 2025 వానాకాలానికి 2,25,406 మంది రైతులకు రూ.243.75 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. రైతుబీమా కింద మరణించిన 5,215 రైతు కుటుంబాలకు రూ.260.75 కోట్లు ఆర్థిక చేయూత కల్పించామని పేర్కొన్నారు. వానాకాలం సీజన్లో 436 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,31,786 క్వింటాళ్ల దొడ్డు రకం సేకరించి రూ. 792.39 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నా రు. 50,029 టన్నుల సన్న ధాన్యానికి రూ.119.52 కోట్లతోపాటు, క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ అందించామన్నారు. 45,867 మందికి కొత్త రేషన్కార్డులు ఇచ్చామని, ప్రతినెలా 6,435 టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. పేదలకు మెరుగైన వైద్యం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 1,07,065 మందికి రూ.49.21 కోట్ల విలువైన శస్త్ర చికిత్స చేయించినట్లు వివరించారు. పారదర్శకంగా భూభారతి భూభారతి చట్టం పారదర్శకంగా చేపడుతున్నామని, జిల్లాలోని 20 మండలాలను పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకుని రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 25,672 మంది రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయిల్ పాం సాగుకు రైతులు ముందుకొస్తున్నారని, 3,750 ఎకరాల లక్ష్యంకాగా, ఇప్పటివరకు 514 ఎకరాల్లో మొక్కలు నాటించామని పేర్కొన్నారు. వీరికి నిర్వహణ కింద రూ.48.29లక్షల రాయితీని ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఎస్పీ అశోక్కుమార్, అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, ఎమ్మెల్యే సంజయ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు జగిత్యాలటౌన్: గణతంత్ర వేడుకల్లో భాగంగా చి న్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులం, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఆటపాటలతో ఆలరించారు. -
మామిడికి తేనెమంచు పురుగు
జగిత్యాలఅగ్రికల్చర్: ఈ ఏడాది మామిడి పూతను చూసి మురిసిపోయిన రైతన్నకు ఆదిలోనే తేనె మంచు పురుగుతో కష్టాలు మొదలయ్యాయి. మామిడి పంట ద్వారా ఆదాయం ఏమోగానీ.. ఆ పంటకు రసాయన మందులు పిచికారీ చేసేందుకే రైతులు వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. వాతావరణ మార్పులతో నాలుగేళ్లుగా మామిడి రైతులకు తేనెమంచు పురుగులు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా మామిడి రైతులను దెబ్బతీస్తోంది. ఇప్పటికే చాలామామిడి తోటలను పురుగు ఆశించి, నష్టం వాటిల్లింది. పూతను పీల్చేస్తున్న పురుగు పురుగులు వాతావరణ మార్పులకు లోనై మామిడి పూతను ఆశిస్తాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో జిల్లాలో ఎక్కువగా తేనెమంచు పురుగు ఆశిస్తోంది. ఈ పురుగులు గుంపులుగుంపులుగా మామిడి పూత, పిందైపె చేరి, వాటి నుంచి రసాన్ని పీల్చుతాయి. పూత, పిందె రాలిమాడిపోతుంది. ఈ పురుగులు విసర్జించిన తేనెలాంటి పదార్థంపై మసి కారణమైన శీలింధ్రాలు పెరిగి, ఆకులు, పూత, పిందైపె నల్లని మసి ఏర్పడుతుంది. ఈ పురుగు ఉధృతికి తోటల్లో కలుపు మొక్కలు ఎక్కువగా ఉండటం, వాతావరణం మబ్బుగా ఉండటం, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఉష్ణోగ్రత తక్కువగా ఉండడమే కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. పురుగుతో దాదాపు 20 నుండి 100 శాతం వరకు నష్టం ఏర్పడుతుంది. విపరీతంగా పురుగు మందుల పిచికారీ తేనెమంచు పురుగు కట్టడికి రైతులు విపరీతంగా రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో రైతు కనీసం రెండుమూడు సార్లు పిచికారీ చేసినప్పటికి పూత నిలవడం లేదు. ఒక్క ఎకరం పిచికారీ చేసేందుకు ట్రాక్టర్తో పాటు కూలీలు, రసాయన మందులకు దాదాపు రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. పూతకు ముందే తోటలను లీజుకు తీసుకున్న దళారులు ఇబ్బంది పడుతున్నారు. పూత ఎండిపోవడమే కాక కొన్ని చోట్ల చెట్టంతా నల్లగా మారిపోతోంది. జగిత్యాల, రాయికల్, సారంగాపూర్, మేడిపల్లి, గొల్లపల్లి మండలాల్లోని చాలా మామిడి తోటల్లో తేనెమంచు పురుగు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రైతుల ఆశలు ఆవిరి మామిడి ఏడాదికి ఒకసారి మాత్రమే పంట వస్తుంది. నాలుగేళ్లుగా అంతంతమాత్రంగానే వచ్చిన ఆదాయం.. ఈ ఏడాది కూడా ఆశలు ఆవిరవుతున్నాయి. ఇప్పటికే రైతులు ఎకరాకు కనీసంగా రూ.25వేల వరకు ఖర్చు పెట్టారు. తేనెమంచు పురుగు వదలకపోవడంతో తోటలను తొలగించే ఆలోచనలో రైతులు ఉన్నారు. -
కందుల కొనుగోలుకు ఎదురుచూపు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సాగు చేసిన కంది పంట ఇప్పుడిప్పుడే మార్కెట్కు వస్తోంది. ఓపెన్ మార్కెట్లో సరైన ధర లభించడం లేదు. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడికి.. వస్తున్న ఆదాయానికి పొంతన లేకుండా పోయింది. మార్క్ఫెడ్ ద్వారా కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 15 వేల ఎకరాల్లో సాగు జిల్లాలో 15 వేల ఎకరాల్లో కంది పంటను వేయగా.. ప్రస్తుతం పంటను కోసి ఆరబెడుతున్నారు. కంది పంటకు ప్రభుత్వ మద్దతు ధర రూ.8వేలు ఉండగా.. గ్రామాల్లో దళారులు రూ.7వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా రైతులు ఒక్కో క్వింటాల్కు రూ.వెయ్యి వరకు నష్టపోతున్నారు. రైతులు ఎన్ని క్వింటాళ్లు తెచ్చినా ఎలాంటి నిబంధన విధించకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కందికి అనుకూలమైన వాతావరణం ఈ ఏడాది కంది పంటకు అనుకూలమైన వాతావరణం ఉండటంతోపాటు కంది పంటకు ఒక్కటి రెండు తడులు ఇవ్వడం, రెండు మూడు సార్లు తెగుళ్లు, పురుగుల నివారణకు రసాయన మందులు పిచికారీ చేస్తే పంట ఏపుగా పెరుగుతుంది. రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది పంట కోతకు కూడా హార్వెస్టర్లను ఉపయోగించి కూలీల సమస్య తగ్గించుకుంటున్నారు. మార్క్ఫెడ్ సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు సిద్ధపడుతున్నప్పటికీ.. ఒక్కో రైతు నుంచి 4నుంచి5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన తీసుకరానున్నట్లు సమాచారం. పంట బాగా పండినప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఎలా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాల ప్రారంభం తాత్సారం చేస్తుంటే నిల్వ చేసే స్థోమత లేక రైతులు తక్కువ ధరకు దళారులకు విక్రయించుకునే అవకాశం ఉంది. రైతుల పంటనంతా దళారుల పాలైన తర్వాత కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే, రైతుల పేర్ల మీద దళారులే మార్క్ఫెడ్కు అమ్ముకునే అవకాశం ఉంది. -
ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?
వేములవాడరూరల్: ప్రమాదం జరిగితేనే విద్యుత్ అధికారులు స్పందిస్తారేమోనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల మీదుగా విద్యుత్ లూజ్ వైర్లు వేలాడుతున్నా సెస్ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి గ్రామ ప్రధాన రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా మారాయి. రైతులు పొలాలు దున్నే సమయంలో భయపడుతూనే సాగు పనులు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు పట్టించుకొని లూజ్వైర్లు, వంగిపోయిన స్తంభాలను సరిచేయాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
రెండుసార్లు పిచికారీ
వాతావరణ మార్పులతో కొన్నేళ్లుగా మామిడిలో ఆశించిన ఆదాయం రావడం లేదు. పూత ప్రారంభానికి ముందు.. పూత వచ్చిన తర్వాత కూడా రెండుమూడు సార్లు రసాయన మందులు పిచికారీ చేశాను. వాటికే ఎకరాకు రూ.30 వేలవరకు ఖర్చయ్యింది. అయినా పూత నిలవడం కష్టంగా మారింది. – నక్కల రవీందర్రెడ్డి, అంతర్గాం జిల్లాలోఏటా తేమ శాతం పెరుగుతోంది. వాతావరణంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాలు అక్టోబర్ వరకు కువరడం.. మబ్బులతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు గాలిలో తేమ శాతం పెరుగుతోంది. ఈ ప్రభావం మామిడి పూతపై పురుగుల ఆకర్షణకు కారణమవుతున్నాయి. – హరీశ్కుమార్శర్మ, పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస -
కొండగట్టు అంజన్న సన్నిధిలో మంత్రి అడ్లూరి పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికా రు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారరథానికి ఆయన పూజచేయించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈఓపై మంత్రికి ఫిర్యాదు ఆలయ ఈవో శ్రీకాంత్రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్చకులు మంత్రి అడ్లూరి దృష్టికి తీసుకెళ్లారు. ఈఓ అర్చకులతో దురుసుగా ప్రవరిస్తూ.. మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన మంత్రి దేవాదాయశాఖ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి విచారణ చేపట్టాలని ఆదేశించారని అర్చకులు తెలిపారు. జెండా ఆవిష్కరించిన మంత్రి ధర్మపురి: ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయజెండాను మంత్రి ఆవిష్కరించారు. అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. పథకాలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. రూ.513.10 కోట్ల రుణాల పంపిణీజగిత్యాలఅగ్రికల్చర్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మహిళా గ్రూపులకు రూ.513.10కోట్ల రుణాలను కలెక్టర్ సత్యప్రసాద్ పంపిణీ చేశారు. వడ్డీలేని రుణాల కింద రూ.508 కోట్లు అందించారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకం కింద 5.10కోట్లు పంపిణీ చేశారు. రుణాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. యువత సన్మార్గంలో ముందుకెళ్లాలిమల్లాపూర్: యువత సన్మార్గంలో నడవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని మినీస్టేడియంలో నిర్వహించిన మల్లాపూర్ క్రికెట్ లీగ్ (ఎంపీఎల్) టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ముఖ్య ఆతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మానసిక వికాసానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. జెడ్పీ నిధులు రూ.10లక్షలతో మినీస్టేడియం నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. టోర్నీ విజేత రఫీ రాయల్కు విన్నర్కప్తోపాటు సొంతంగా రూ.30వేలు, రన్నర్ సామ నైట్ రైడర్స్కు కప్తో పాటు రూ.15వేలు అందించారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, ఎంపీఎల్ చైర్మన్, నిర్వాహకులు పాల్గొన్నారు. వేడుకలకు భారీ బందోబస్తుజగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రౌండ్లోకి వెళ్లే విద్యార్థులు, అధికారులు, ప్రజలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వేడుకలు చూసేందుకు జనం భారీగా తరలిరావడంతో డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు. -
నర్సింహునిపేటలో ఇసుక డంపు సీజ్
పెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ను ఆర్ఐ శ్రీనివాస్ సోమవారం సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు 8 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇసుకను తరలించడానికి ప్రయత్నిస్తే వారిపై పీడీ యాక్ట్, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట రామడుగు మండలం కోరుటపల్లి, మోతె, రామడుగు వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని లబ్ధిదారులు, స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ఊరంతా ఒకేసారి జెండావిష్కరణ
మేడిపల్లి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్లో ఒకే సమయానికి జెండా ఆవిష్కరించి ఆదర్శంగా నిలిచారు. ఉదయం 9 గంటలకు గ్రామంలోని అన్ని కుల, యువజన సంఘాలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ, వాణిజ్య సముదాయాల వారు ఒకేచోటకు చేరి వారివారి ఆధ్వర్యంలో ఒకే సమయానికి జండాను ఆవిష్కరించారు. సామూహికంగా జాతీయ గీతాలాపన చేశారు. గ్రామంలో సుమారు నాలుగు వేల మంది జనాభా ఉంటారు. జెండావిష్కరణ సమయంలో కొందరు అతిగా ప్రవర్తిస్తుండడంతో సర్పంచ్ యాగండ్ల సంజన ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గ్రామమంతా ఒకే సమయానికి జెండా ఆవిష్కరించాలని తీర్మానించారు. ఆమె మాటకు కట్టుబడిన గ్రామస్తులందరూ సరే అని సరిగ్గా 9 గంటలకు ఒకేసారి జెండాను ఆవిష్కరించారు. -
మేడారం జాతరలో క్యూఆర్ కోడ్ బ్యాండ్స్
జ్యోతినగర్(రామగుండం): మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో తప్పిపోయిన చిన్నారులను సులభంగా గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక క్యూర్కోడ్ ఉన్న బ్యాండ్స్ రూపొందించింది. వీటిని చిన్నారుల చేతికి కట్టేలా ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసింది. వివరాలిలు.. మేడారం మహాజాతర (జనవరి 28–31, 2026) సందర్భంగా చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ బ్యాండ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. ఎలా పనిచేస్తుందంటే.. పిల్లలు.. ప్రధానంగా 0–8 ఏళ్ల వయసు, వృద్ధుల కోసం పోలీస్ శాఖ క్యూఆర్ కోడ్లతో కూడిన రిస్ట్ బ్యాండ్లు అందిస్తోంది. ఈ క్యూఆర్ కోడ్లో ఆ వ్యక్తి లేదా తల్లిదండ్రులు/సంరక్షకులు వినియోగిస్తున్న మొబైల్ నంబర్, పేరు వంటి ముఖ్య సమాచారాన్ని ముందే నమోదు చేస్తారు. బ్యాండ్ ఎక్కడ పొందాలంటే.. క్యూఆర్ కోడ్ బ్యాండ్లను మేడారం జాతరలోని ప్రధాన ప్రవేశ మార్గాలు, బస్స్టాండ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అందజేస్తుంది. ట్రాకింగ్ విధానం.. చిన్నారులు, వృద్ధులు తప్పిపోతే తల్లితండ్రులు లేదా సంరక్షకులు సెంటర్ పాయింట్కు వెళ్లడం ద్వారా పోలీస్లు ఆ డివైస్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు. స్కాన్ అయిన వెంటనే పూర్తినమోదు వివరాలు(పేర్లు, ఫోన్ నంబరు మొదలైనవి) స్క్రీన్పై కనిపిస్తాయి. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని/పిల్లలను గుర్తించి కుటుంబానికి అప్పగిస్తారు. తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు కోసం పోలీస్ శాఖ యత్నం -
జగిత్యాల
30.0/17.0సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026Iగరిష్టం/కనిష్టంవాతావరణం పొడి వాతావరణం ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి సమయంలో చలిగాలులు కొనసాగుతాయి. నృసింహుని సేవలో జిల్లా జడ్జిలుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆదివారం జిల్లా జడ్జి రత్నపద్మావతి, సిరిసిల్ల జిల్లా జడ్జి నీరజ, అదనపు జిల్లా జడ్జి నారాయణ దర్శించుకున్నారు. -
డిజిటల్ సర్వే
జిల్లాలో ఎంపికై న గ్రామాలివే.. జగిత్యాల: భూవివాదాలు తొలగించేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వే ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని బీర్పూర్ మండలం కోమన్పల్లిని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. నక్షలేని ఈ గ్రామంలో పూర్తిస్థాయిలో సర్వే చేసి భూములకు హద్దులు గుర్తించారు. అలాగే నక్ష ఏర్పాటు చేసి సర్వేనంబర్లను కేటాయించారు. ఇది విజయవంతం కావడంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద మరో 20 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారులు సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ డిజిటల్ సర్వే ద్వారా భూమి వివరాలు స్పష్టంగా నమోదు కావడంతో రైతులకు భవిష్యత్లో ఎలాంటి వివాదా లు లేకుండా పారదర్శకంగా ఉంటుంది. రెవెన్యూ వ్యవస్థలోనూ ఇబ్బంది లేకుండా ఉంటుంది. వివాదాలకు చెక్ డిజిటల్ సర్వే కోసం ముందుగా 70 గ్రామాలను ఎంపిక చేసినప్పటికీ మొదటగా నక్ష లేని 20 గ్రామాలను గుర్తించారు. ఈ గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. ఈ డిజిటలైజేషన్లో భాగంగా గ్రామాల్లోని భూములకు హద్దులు గుర్తించనున్నారు. తద్వారా భూ వివాదాలు చెక్ పడనుంది. గ్రామంలో ఏ సర్వే నంబర్లో ఎలాంటి భూములున్నాయి..? అసైన్డ్ భూములెన్ని..? గ్రామకంఠం, చెరువులు, కుంటలు వీటన్నింటిని పూర్తిస్థాయిలో గుర్తించి సర్వే నంబర్లు ఇస్తారు. ఒక రైతు భూమిలో ఎక్కువ సర్వేనంబర్లు ఉండడం ద్వారా రికార్డులో ఉన్న భూమికి.. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడాలు వచ్చి గొడవలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎలాంటి సమస్యలు లేకుండా నక్ష లేని ఈ గ్రామాల్లో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో గుర్తించి సర్వేనంబర్లను బట్టి మ్యాప్ తయారుచేస్తారు. ఈ సర్వేకు డ్రోన్ కెమెరాలు, అత్యాధునిక కెమెరాలు వినియోగిస్తున్నారు. రైతులకు ఇబ్బంది రాకుండా పట్టాలు అందించనున్నారు. అనేక గ్రామాల్లో భూ సమస్యలు వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు అత్యధికంగా ఉంటాయి. రెవెన్యూ రికార్డుల్లో అనేక తప్పులు నమోదు కావడం.. సర్వే నంబర్ల ప్రకారం మ్యాప్లు లేకపోవడం.. గ్రామాల్లో కనీసం నక్ష లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని ఆసరాగా చేసుకున్న కొందరు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, భూ యజమాని ప్రమేయం లేకుండానే అమ్ముకోవడం వంటివి చోటుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వం సర్వే చేపట్టి మ్యాప్లకు రూపకల్పన ఇవ్వాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్లకు తప్పకుండా మ్యాప్ ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట నక్ష లేని ఈ 20 గ్రామాల్లో పూర్తయిన అనంతరం పూర్తిస్థాయి గ్రామాల్లో చేపట్టనున్నారు. మండలం గ్రామాలు రాయికల్ దావన్పల్లి బీర్పూర్ అన్నారం, డొంకేశ్వర్, మోతినగర్ (గంగసముద్రం, నూతపల్లి), మోతినగర్ (సిరిపురం), నేదునూర్, వచ్చునూర్ మల్లాపూర్ ఇందిరానగర్, రత్నాపూర్, నడికుడ, సంగెంశ్రీరాంపూర్ మెట్పల్లి మేడిపల్లి, బండలింగాపూర్ ఇబ్రహీంపట్నం బర్తీపూర్, కోజన్కొత్తూర్ (కమలనగర్), కేశాపూర్ ధర్మపురి మగ్గిడి, గాదెపల్లి వెల్గటూర్ జగదేవ్పేట భూవివాదాలకు చెక్ కోమన్పల్లిలో విజయవంతం.. జిల్లాలో మరో 20 గ్రామాల ఎంపిక మ్యాప్ల రూపకల్పనకు చర్యలు -
కుల బహిష్కరణ ప్రచారం.. 8 మందిపై కేసు
జమ్మికుంట: కుల బహిష్కరణ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసినవారిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రామకృష్ణ ఆదివారం తెలిపారు. మున్సిపల్ పరిధిలోని కేశవపూర్కు చెందిన బాణాల వెంకటేశ్ తల్లి కమలమ్మ గతేడాది చనిపోయింది. అప్పుడు దినకర్మ సందర్భంగా వెంకటేశ్తో అతడి అక్క మనమ్మ, బావ కర్నే రాములు, అల్లుళ్లు కర్నే వెంకటేశ్, రమేశ్, భాస్కర్, శ్రీకాంత్తో గొడవలు జరిగాయి. కాగా ఈ నెల 23న సంవత్సరికం కార్యక్రమానికి తమన పిలవలేదని వెంకటేశ్ను అతడి బావ, అల్లుళ్లు దూషించారు. అయినా బాధితుడు పట్టించుకోలేదు. దీంతో వెంకటేశ్ను కుల బహిష్కరణ చేస్తున్నట్లు అతడి బావ, అల్లుళ్లు, పెద్దమనుషులు కర్నే గోపాల్, కర్నే నరేందర్, బాణాల లక్ష్మణ్ వీడియో తీసి సోషల్మీడియాలో ప్రచారం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో కిరాణంషాపులో మంటలుమల్యాల: మండలంలోని నూకపల్లి డబుల్బెడ్రూం కాలనీలోని కిరాణ దుకాణంలో షార్ట్ సర్క్యూట్లో మంటలు చెలరేగి సామగ్రి దగ్ధమైంది. కాలనీలోని పాలిక కమలాకర్ తన షాపును శనివారం రాత్రి మూసి ఇంటికెళ్లాడు. కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి కమలాకర్కు సమాచారం అందించారు. ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.2లక్షల విలువైన కిరాణ సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. జిలెటిన్ స్టిక్స్ పట్టివేతవేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లిలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 1200 జిలిటెన్ స్టిక్స్లను పోలీసులు పట్టుకున్నారు. వేములవాడ నుంచి ఆటోలో తరలిస్తున్న జిలిటెన్ స్టిక్స్లను పోలీసులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డాయి. ఈ జిలిటెన్ స్టిక్స్లను వేములవాడ పరిధిలోని నాంపల్లి వార్డుకు చెందిన ఒక వ్యక్తి తరలిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. -
విషజ్వరంతో వ్యక్తి మృతి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బోయిని రాములు(34) వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు. రాములు వారం రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతూ స్థానికంగా ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స పొందాడు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ప్లేట్లెట్స్ 25వేలకు పడిపోయినట్లు తెలిసింది. వారం రోజులుగా జ్వరం తగ్గక వ్యక్తి ప్రాణాలు పోవడంతో గ్రామస్తులు డెంగీ జ్వరం కావచ్చని భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై డీఐవో సంపత్కుమార్ను వివరణ కోరగా రుద్రంగిలో వ్యక్తి మృతికి గల కారణాలను తెలుసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశిస్తామన్నారు. ఉరేసుకుని యువకుని ఆత్మహత్యముస్తాబాద్(సిరిసిల్ల): అప్పుల బాధ భరించలేక.. ఇంట్లో జరుగుతున్న గొడవలకు మనస్తాపం చెంది ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన ఎక్కల్దేవి కుమార్(32) ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లివచ్చిన కుమార్ తండ్రి దేవయ్యతో కలిసి వ్యవసాయం పనులు చేస్తున్నాడు. ఇటీవల కొత్తింటిని నిర్మించేందుకు అప్పులు చేశారు. దీంతో కుమార్కు భార్య కావ్యకు మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా ఇద్దరి మధ్య గొడవలు జరగగా, ఆగ్రహానికి గురైన కుమార్ భార్య కావ్యపై చేయిచేసుకున్నాడు. అప్పుల బాధలు, భార్యను కొట్టిన అనే మనస్తాపానికి గురైన కుమార్ ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్ ఆత్మహత్యతో భార్య, కుమారుడు, కూతురు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుని తండ్రి దేవయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
సజ్జ సాగువైపు రైతుల చూపు
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల జిల్లాలో చాలాప్రాంతాల్లో నువ్వు, మొక్కజొన్న, పెసర, కంది పంటలకు ప్రత్యామ్నాయంగా సజ్జ పంటను సాగు చేస్తూ రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. పంటను విక్రయించేందుకు ప్రైవేట్ కంపెనీలతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. పంటకు అవసరమైన వాతావరణ పరిస్థితులు జిల్లాలో ఉండటంతో విత్తనోత్పత్తిగా పలు కార్పొరేట్ కంపెనీలు ఉత్పత్తి చేయిస్తున్నాయి. ధరలు ఆశాజనకంగా ఉండటంతో.. ప్రైవేట్ కంపెనీలు విత్తనోత్పత్తి చేసిన రైతులకు క్వింటాల్కు రూ.6,450 నుంచి రూ.8,500 వరకు (విత్తనరకాన్ని బట్టి) చెల్లిస్తున్నాయి. కంపెనీలే విత్తనాలు ఇవ్వడం, పంట పండిన తర్వాత బై బ్యాక్ పద్ధతిలో కొనుగోలు చేయడం రైతులకు కలిసివస్తోంది. జిల్లాలో అనువైన వాతావరణ పరిస్థితులు ఉండటంతో ప్రైవేట్ కంపెనీలు ఇప్పటివరకు వరి, ఆవాల పంటలో విత్తనోత్పత్తి చేయించగా.. తాజాగా సజ్జ పంటలోనూ చేయిస్తున్నాయి. అలాగే రైతులు ఎక్కువగా సాగు చేసే వరి, మొక్కజొన్న, పత్తి, కంది, పెసర వంటి పంటలకే ప్రభుత్వ మద్దతు ధర ఉండగా.. మిగతా పంటలకు ప్రభుత్వ మద్దతు ధర లేదు. దీంతో రైతులు ఏదైనా కొత్త పంట సాగు చేస్తే ఆయా పంట ఉత్పత్తులు మార్కెట్కు వచ్చేవరకు ఏ ధర ఉంటుందో తెలియని పరిస్థితి. పంటకు ముందే ఫలానా ధర చెల్లిస్తామని కంపెనీలు ముందుకు రావడంతో రైతులు సజ్జ పంట వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారింది. దీనికితోడు, తక్కువ కాలంలో పెద్దగా ఖర్చు లేకుండా పంట చేతికి అందుతుండటంతో రైతులు సజ్జవైపు దృష్టి పెడుతున్నారు. 15 వేలు ఎకరాల్లో ఆవాల సాగు జిల్లాలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కథలాపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా.. జగిత్యాల, మేడిపల్లి, రాయికల్ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా సజ్జ పంటను సాగు చేశారు. జిల్లా మొత్తంగా దాదాపు 15వేల ఎకరాల్లో సజ్జను సాగు చేశారు. జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో మొక్కజొన్న, వేరుశెనగ వంటి పంటలు వేస్తే అడవి పందులు, కోతులు, రామచిలుకలు తీవ్ర నష్టం చేస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయ పంటగా రైతులు సజ్జ పంటను సాగు చేస్తున్నారు. ఐదారు నీటి తడులు ఇస్తే సరిపోతుండటం.. ఎరువులు వేయాల్సిన అవసరం పెద్దగా లేకపోవడం.. పంట 85–90 రోజుల్లోనే చేతికి వస్తుండటంతో రైతులు మొగ్గుచూపుతున్నారు. రైతులు ఎక్కువగా వానకాలంలో పసుపు, మొక్కజొన్న సాగు చేసిన తోటలతోపాటు తేమ ఎక్కువగా లేని పొలాల్లో సజ్జ సాగు చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీల విత్తనాలు ప్రైవేట్ కంపెనీలే విత్తనాలు కిలోకు రూ.800 చొప్పున సరఫరా చేస్తున్నాయి. ఎకరాకు కిలో విత్తనాలు సరిపోతాయి. ఆడ, మగ విత్తనాలు ఇస్తారు. విత్తనోత్పత్తి కింద సాగు చేసిన రకాల్లో ఎకరాకు 10 నుంచి 14 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. దిగుబడి బాగా వస్తే ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి పంటను సీడ్ కంపెనీలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సరఫరా చేస్తాయి. అక్కడి పాడి గేదెలకు గ్రాసంగా ఉపయోగిస్తున్నారు. ఏదై గ్రామంలో 50 శాతం మంది రైతులకు 10 క్వింటాళ్ల కంటే తక్కువ దిగుబడి వచ్చినప్పటికి, 10 క్వింటాళ్ల వరకు రేటు చెల్లిస్తారు. 10 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తే ఆ మేరకు రేటు చెల్లిస్తారు. పంట కొనుగోలుకు కంపెనీలు ఒప్పందం ఇక్కడ పండిన పంట ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా జిల్లాలో 15 వేల ఎకరాల్లో సాగు -
జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపిక
హుజూరాబాద్/చొప్పదండి: హుజూరాబాద్కు చెందిన నలుగురు విద్యార్థులు ఈ నెల 27 నుంచి 31 వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగే జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల వనపర్తిలో జరిగిన పోటీల్లో నిమ్మటూరి లవణీప్రియ, రిషి, అభినయ్, చరణ్లు ప్రతిభచాటి జాతీయ జట్టులో చోటు సంపాదించారు. అలాగే చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్కు చెందిన తొమ్మిదో తరుగతి విద్యార్థి చరణ్ సైతం జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యాడు. చరణ్ను పాఠశాల డైరెక్టర్ కల్నల్ రాజాదత్త, ప్రిన్సిపాల్ వి.లింగయ్య, ధర్మరాజు, శ్రీనివాస్, ప్రమోద్ రాజు అభినందించారు. -
పల్లెల్లో ‘పంచాయితీ’
కరీంనగర్రూరల్: కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై గ్రామాల్లో వివాదాలు ఏర్పడుతున్నాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తుండగా, తాము ఖర్చు పెట్టిన బిల్లులకు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. నిబంధనల ప్రకారం నిధులు ఉపయోగించాలని కొత్త సర్పంచులు సూచిస్తుండడంతో నిధుల వినియోగంపై అయోమయం నెలకొంది. 2024 ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర నిధులు నిలిచిపోయాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో దాదాపు రెండేళ్ల అనంతరం జిల్లాకు రూ.5,12,57,717 విడుదల కాగా త్వరలో గ్రామపంచాయతీల ఖాతాల్లో జమచేయనున్నారు. నిధుల వినియోగంపై వివాదం కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తోంది. జనాభా ప్రాతిపదికన గ్రామంలోని ప్రతీ వ్యక్తికి నెలకు రూ. 80 నుంచి రూ.90 చొప్పున మూడు నెలలకోసారి నిధులు మంజూరవుతాయి. 18నెలలుగా పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు విడుదల కాలేదు. జిల్లాలో గతంలో పాలకవర్గాలుండగా 7 మండలాల్లోని గ్రామపంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మొదటి విడత మంజూరు కాగా ప్రస్తుతం కొత్తపల్లి, మానకొండూరు, రామడుగు, శంకరపట్నం, తిమ్మాపూర్, సైదాపూర్, వీణవంక మండలాల్లోని పంచాయతీలకు రూ.5,12,57,717 మంజూరయ్యాయి. ప్రస్తుతం మంజూరైన నిధులు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి కావడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచులు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే 2023 ఫిబ్రవరి 1నుంచి పాలకవర్గాలు లేకపోవడంతో అప్పులు చేసి గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించామని తమకే బిల్లులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.2లక్షల వరకు, పెద్ద పంచాయతీల్లో రూ.4 లక్షల వరకు ఖర్చు పెట్టామని, తమ జీతాలను సైతం వినియోగించామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామాభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని కొత్త సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచుల బిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. కాగా గతంలో ఉన్న కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం నిధులు వినియోగించాలని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులపై వివాదం పాత బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచుల డిమాండ్ అభివృద్ధి పనులకు వినియోగిస్తా మంటున్న కొత్త సర్పంచులు -
తలనీలాల టెండర్కు మోక్షమెన్నడో..?
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలు టెండర్ రెండుసార్లు వాయిదా పడి నెలలు గడుస్తున్నా ప్రక్రియ అడుగు ముందుకు పడడం లేదు. ఏడాది క్రితం ఆలయ ఆధ్వర్యంలో పోగు చేసిన తలనీలాలు నిల్వ చేయడంతో ముక్కిపోయి, ధర తగ్గే అవకాశమున్న నేపథ్యంలో టెండర్ ప్రక్రియ పూర్తిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. కొండగట్టు అంజన్న ఆలయానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చాలని తలనీలాలు సమర్పిస్తుంటారు. ఆ తలనీలాల సేకరణకు గతంతో రెండేళ్లకోసారి టెండర్ నిర్వహించేవారు. ప్రస్తుతం ఏడాదికోసారి పిలుస్తున్నారు. దేవాలయం ఆధ్వర్యంలో పోగుచేసిన తలనీలాలకు వేలం నిర్వహించగా.. టెండర్దారులు సిండికేట్ కావడంతో మార్కెట్ ధర కన్నా తక్కువ పలకడంతో ప్రక్రియ వాయిదా వేశారు. మరోసారి టెండర్ పిలవడంలో అధికారులు విఫలం కావడంతో టెండర్ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఏటా తలనీలాల టెండర్ ప్రక్రియలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టెండర్దారులు స్థానికులతో సిండికేట్ కావడంతో బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరకు కోట్ చేస్తుండడంతో తాజాగా హైదరాబాద్ కమిషన్ కార్యాలయంలో నిర్వహించడం పరిపాటిగా మారింది. ఇకనైనా ఏడాది కాలంగా పోగు చేసిన తలనీలాలు త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తలనీలాలు నిల్వతో ధర తగ్గే అవకాశం తలనీలాలకు బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ.12 వేల నుంచి రూ.18 వేలు పలుకుతోంది. ఆలయ ఆధ్వర్యంలో సేకరించిన తలనీలాలు ఏడాదికాలంగా నిల్వ ఉండడంతో ముక్కిపోయి, నాణ్యత తగ్గి, వేలంలో మార్కెట్ ధరకన్నా తక్కువ ధరకు అప్పగించాల్సిన పరిస్థితి నెలకొననుంది. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే పోగు చేసిన తలనీలాలకు టెండర్ ప్రక్రియ వేగవంతం చేసి, ఆలయ ఆదాయానికి గండిపడకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామికి భక్తులు సమర్పించిన తలనీలాల కోసం గతంలో రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ వాయిదా పడ్డాయి. టెండర్ నిర్వహణ కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. అధికారుల ఆదేశాలు మేరకు త్వరలోనే టెండర్ పూర్తి చేస్తాం. – శ్రీకాంత్రావు, కొండగట్టు ఆలయ ఈఓ రెండుసార్లు ప్రక్రియ వాయిదా ఏడాదికాలంగా తలనీలాల నిల్వ నాణ్యత తగిపోయే అవకాశం -
అంజన్న సన్నిధిలో సమాచార కమిషనర్ పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని ఆదివారం రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీని వాస్రావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. తహసీల్దార్ వసంత, ఆర్ఐ తిరుపతి పాల్గొన్నారు. చింతకుంటలో పులి వదంతులుకథలాపూర్(వేములవాడ): మండలంలోని చింతకుంట శివారు అటవీప్రాంతంలో గ్రామస్తులకు పులి కనిపించిందని ప్రచారం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో వారు అటవీప్రాంతంలో పర్యటించారు. పులి సంచరినట్లు చెప్పిన ప్రాంతంలో పరిశీలించారు. అక్కడ కనిపించిన పాదముద్రల ప్రకారం.. నక్కగా నిర్ధారించారు. నక్కలో హైనా రకం అని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ ముస్తాక్ ఆలీ పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పతకానికి ఏఎస్సై● అభినందించిన ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: కేంద్రంప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్(ఎంఎస్ఎం) మెడల్కు స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై ఆనందం ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 12మందికి ఎంఎస్ఎం మెడల్ లభించగా వారిలో ఆనందం ఒకరు. 1989లో కానిస్టేబుల్గా చేరిన ఆనందం.. 2012లో హెడ్కానిస్టేబుల్గా, 2020లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. రాష్ట్ర పోలీస్ సేవ పతకం, 2018లో ఉత్తమ సేవ పతకానికి ఎంపికయ్యారు. 37 ఏళ్లుగా విధుల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న ఆనందంను ఎస్పీ అశోక్కుమార్ అభినందించారు. ప్రకృతి వనరులు కాపాడండి ● మాజీమంత్రి జీవన్రెడ్డి జగిత్యాలటౌన్: ప్రభుత్వం మారినా జిల్లాలోని నర్సింగాపూర్ గుట్టల దోపిడీ మాత్రం ఆగడం లేదని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గుట్టలు ప్రకృతి వరమని, వాటిని కాపాడుకోవాలని సూచించారు. దశాబ్దకాలంగా మట్టి తవ్వకాలతో గుట్టలు కరిగిపోయాయని, కాంగ్రెస్ అధికారంలోకొచ్చినా అక్రమ తవ్వకాలు ఆగడం లేదన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. నాయకులు జున్ను రాజేందర్, శీలం సురేందర్, పుప్పాల అశోక్, చందా రాధాకిషన్, కమటాల శ్రీనివాస్, రఘువీర్గౌడ్, సాయి, జెల్ల రవీందర్ ఉన్నారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులు కొలిక్కి..!
మెట్పల్లి: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్లో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కి వచ్చింది. రెండు పర్యాయాలు చైర్మన్పీఠాన్ని దక్కించుకున్న ఆ పార్టీ.. ఈ ఎన్నికల్లో కూడా మరోమారు కై వసం చేసుకుని హాట్రిక్ సాధించాలనే దిశగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అభ్యర్థుల ఎంపికలో ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీకి ధీటుగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా వార్డుల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలిసింది. పలువురు తాజామాజీలకు మరోసారి ఆ వార్డులపై ప్రత్యేక దృష్టి క్లీన్ ఇమేజ్ ఉన్న వారికే అవకాశం టికెట్ల కేటాయింపులో తాజామాజీలకు ప్రాధాన్యం ఆచీతూచి అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ -
అన్ని మున్సిపాల్టీలూ గెలుచుకుంటాం
కోరుట్ల: జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కోరుట్ల అసెంబ్లీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు రూ.3600 కోట్లు ఖర్చు చేసి పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, పథకాల విషయంలో ప్రజలు సంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. జువ్వాడి నర్సింగరావు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని తెలిపారు. మెట్పల్లిలో వరదకాలువకు నీటి విడుదల, కోరుట్లలో తాగునీటి కొరత తీర్చేందుకు తాళ్లచెరువుకు ఎస్సారెస్పీ నీరు అందిస్తామన్నారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు గెలుచుకునేందుకు అందరూ కృషి చేయాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్లా విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు రానివారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తుందన్నారు. నర్సింగరావు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల నందయ్య, నాయకులు కొమొరెడ్డి విజయ్, సుజిత్రావు, తిరుమల గంగాధర్, అన్నం అనిల్, శీలం వేణు, పుప్పాల ప్రభాకర్, వాకిటి సత్యంరావు, జెట్టి లింగం, ఆడెపు మధు పాల్గొన్నారు. మంత్రి అడ్లూరితో మాజీ వైస్చైర్మన్ లింబాద్రి భేటీమెట్పల్లి: మెట్పల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఆదివారం కోరుట్లలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్కు చెందిన లింబాద్రి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో కోరుట్లలో జరిగిన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం అనంతరం లింబాద్రిని పార్టీ నియోజక ఇన్చార్జి నర్సింగరావు మంత్రితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయించి మాట్లాడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య కూడా ఉన్నారు. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ -
సజ్జకు అనుకూల వాతావరణం
యాసంగిలో సజ్జ విత్తనోత్పత్తికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తక్కువ, ఎక్కువ కాకుండా ఉంటాయి. దీంతో పుప్పొడి రేణువుల్లో పరాపరాగ సంపర్కం బాగా జరిగి పంట దిగుబడి బాగా వస్తుంది. – మిట్టపెల్లి రాజేశ్ రెడ్డి, జగ్గాసాగర్ మంచి ఆదాయం పసుపు, మొక్కజొన్న పంట పూర్తయిన తర్వాత నువ్వు పంటకు ప్రత్యామ్నాయంగా సజ్జ పంటను మా ఊరిలోనే 300 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో ఆదాయం వస్తోంది. – మారు మురళీధర్ రెడ్డి, వెల్లుల -
పొరండ్లలో దొంగల హల్చల్
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం పొరండ్లలో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. సీసీ కెమెరాల్లో కనిపించకుండా వెనుక నుంచి వెళ్లి చోరీలకు పాల్పడ్డారు. గోస్కుల గంగాధర్ కిరాణషాపు తాళాలు పగులగొట్టి రూ.12వేలు, పుట్ట లక్ష్మీ ఇంట్లో నుంచి 30 తులాల మల్లన్న దేవుడి వెండి విగ్రహం, వేములవాడ రాజేశం ఇంట్లో నుంచి 20తులాల వెండి, 10 గ్రాముల బంగారం, రూ.18వేలు ఎత్తుకెళ్లారు. మరో రెండు ఇళ్లలో చొరీకి విఫల యత్నం చేశారు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకొని, వేలిముద్రలు సేకరించారు. మూడిళ్లలో చోరీ జరగడంపై గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. 10 గ్రాముల బంగారం, 50 తులాల వెండి అపహరణ -
మున్సి‘పోల్స్’కు ఏర్పాట్లు
జగిత్యాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహ ణలో అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. నోటిఫికేషన్ రాకముందే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు.. 136 వార్డులున్నాయి. మూడు వార్డులకో ఆర్వో, ఏఆర్వోలు, కౌంటింగ్ స్టాఫ్, జోనల్ ఆఫీసర్లను నియమించారు. మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ బాక్స్ పద్ధతిన నిర్వహించనున్న నేపథ్యంలో మొత్తం 379 జెంబో బ్యాలెట్లు తెప్పించారు. 188 బిగ్సైజ్ బ్యాలెట్లు, అదనంగా మరో 74 సిద్ధం చేశారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కూడా ఎవరికీ ఇబ్బందులు లేకుండా జగిత్యాలలో 2, మెట్పల్లి, రాయికల్, ధర్మపురిలో ఒకొక్కటి, కోరుట్లలో 3 చొప్పున ఏ ర్పాటు చేశారు. జగిత్యాలలో మున్సిపల్ ఆఫీస్ తోపాటు మెప్మా బిల్డింగ్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. రాయికల్, ధర్మపురిలో ఆయా మున్సి పల్ కార్యాలయాల్లో, మెట్పల్లిలో మెప్మా కార్యాల యం, కోరుట్లలో మున్సిపల్ కార్యాలయంతోపాటు ఎంపీడీవో, సీనారె భవన్లో స్వీకరించనున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈసారి కౌంటింగ్ సెంటర్ను జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళా శాలలో ఏర్పాటు చేయనున్నారు. 379 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సిద్ధం చేశారు. జోనల్ ఆఫీసర్లు 50, ఫ్లయింగ్స్క్వాడ్ 6, స్టాటిస్టికల్ సర్వైలైన్స్ టీమ్స్ 5 ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నాయి. కౌంటింగ్కు స్టాఫ్.. ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డులుండగా.. 136 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. 136 మంది సూపర్వైజర్లు, 272 కౌంటింగ్ అసిస్టెంట్లు మొత్తంగా 408 మందిని నియమించారు. మూడు వార్డులకో రిటర్నింగ్ అధికారి గతంలో నామినేషన్ పత్రాలను కమిషనర్లే స్వీకరించేవారు. ప్రస్తుతం కేంద్రాలను పెంచడంతో మూ డు వార్డులకో రిటర్నింగ్ అధికారులను నియమించారు. తద్వారా అభ్యర్థులకు ఇబ్బందులు ఉండవు. ప్రతి రిటర్నింగ్ అధికారికి ఒక ప్రత్యేక కౌంటర్ కేటాయిస్తారు. పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులకు వీరే గుర్తులు కేటాయించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆర్వోలే కీలకంగా వ్యవహరిస్తారు. ధ్రువీకరణ పత్రాలు అందించే బాధ్యత కూడా వీరి కే ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తం వీరి పర్యవేక్షణలోనే జరగనుంది. నామపత్రాల స్వీకరణ, పరిశీ లన, తిరస్కరణ అంతా వీరే చూసుకోనున్నారు. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్వోలు, ఏఆర్వోలు, కమిషనర్లకు శిక్షణ కల్పించారు. ఎన్నికల్లో ఎలా నిర్వహించాలి? ఇబ్బంది లేకుండా ఎలా చూడాలి..? అనే అంశంపై శిక్షణ కల్పించారు. మూడు వార్డులకో ఆర్వో కౌంటింగ్ స్టాఫ్ నియామకం -
టుడే న్యూస్ పేపర్.. టుమారో బెస్ట్ పేపర్!
నేటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ అంటారు.. కానీ, జగిత్యాలలోని గోవిందపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెద్ది శ్రీనివాస్ న్యూస్ పేపర్ కూడా టీచింగ్ టూల్ అని గట్టిగా నమ్ముతారు. జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లిలో పనిచేస్తున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో వచ్చే విజ్ఞానదాయకమైన సమాచారం, శీర్షికలను కత్తిరించి ల్యామినేషన్ చేసి పుస్తకాలుగా మలచి గ్రంథాలయంలో భద్రపరుస్తున్నారు. వాటిలోని అంశాలను విద్యార్థులకు బోధించి విజ్ఞానం పెంపొందింపజేస్తున్నారు. పాఠ్యపుస్తకాలకు తాజా సమాచారాన్ని జోడించి పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచేలా కృషి చేస్తున్నారు. – సాక్షి,కరీంనగర్ డెస్క్ 8లోu -
‘సాక్షి’ స్టడీమెటిరియల్ చదివితే 90 శాతం మార్కులు
ఇబ్రహీంపట్నం: ‘సాక్షి’ అందిస్తున్న ఫిజిక్స్, మ్యాథ్స్ స్టడీమెటిరియల్ చదివితే 90శాతం మార్కులు సాధించవచ్చని ఎంఈవో మధు తెలిపారు. మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ స్టడీమెటిరియల్ ఉచితంగా అందించారు. మండలంలోని 8 హైస్కూల్కు చెందిన 216 మంది విద్యార్థులకు మెటీరియల్ అందించారు. తహసీల్దార్ వరప్రసాద్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు అర్థమయ్యేలా మెటీరియల్ తయారు చేసి ఉచితంగా ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ‘సాక్షి’ యాజమాన్యం ఇంతమంచి మెటిరియల్ను అందించడం అభినందనీయమన్నారు. ఎంపీడీవో గణేశ్ మాట్లాడుతూ.. శ్రద్ధతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చన్నారు. సర్పంచు బద్దం గోపి, ఉపసర్పంచు నాంపెల్లి రమేశ్, హెచ్ఎం రాజన్న, ఉపాధ్యాయులు కవిత, విద్యార్థులు పాల్గొన్నారు. -
అందాల వల!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: చూసేందుకు అందంగా ఉంటారు. చక్కగా రెడీ అయ్యి ఫేస్బుక్, ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతారు. లైక్ కొట్టి.. కామెంట్ పెట్టినవారిలో ప్రొఫైల్స్ ఆధారంగా ప్రముఖులు, వ్యాపారులను ఎంచుకుంటారు. తియ్యగా మాట్లాడి స్నేహం చేస్తారు. తెలివిగా తామున్న చోటికి రప్పించుకుంటారు. సన్నిహితంగా మెదిలి, రహస్యంగా కెమెరాల్లో చిత్రీకరిస్తారు. తరువాత స్నేహం ముసుగు తీసి, డబ్బులివ్వాలని బ్లాక్మెయిల్కు దిగుతారు. డిమాండ్ చేసినంత ఇవ్వకపోతే వీడియోలు బహిర్గతం చేసి పరువు తీస్తామని బెదిరిస్తారు. కొందరు పరువు పోతుందన్న భయంతో అడిగినంత ఇచ్చుకుని సైలెంట్గా తప్పుకుంటుండగా.. మరికొందరు మళ్లీమళ్లీ వారి వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూస్తున్న హనీట్రాప్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కష్టపడకుండా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో కొందరు ముఠాగా ఏర్పడి ఇలాంటి పనులు చేస్తున్నారు. అందమైన మహిళలతో సోషల్ మీడియాలో ప్రత్యేక పేజీలు క్రియేట్ చేసి ఆకర్షిస్తారు. వీరి వీడియోలకు కామెంట్లు పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుంటారు. ఒరిజినల్ ఖాతాల నుంచి కామెంట్లు పెట్టిన వారి నేపథ్యాన్ని వెరిఫై చేసుకుంటారు. డబ్బున్న వారైతే డైరెక్ట్ మెసేజ్ చేసి స్నేహం పేరిట ఎరవేస్తారు. కలుద్దామంటూ ఇంటికి ఆహ్వానిస్తారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బెదిరింపులకు దిగి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. డేటింగ్యాప్స్తో జాగ్రత్త సోషల్ మీడియాతోపాటు డేటింగ్ యాప్స్తో చాలా దారుణాలు జరుగుతున్నాయి. కొందరు వివాహేతర సంబంధాలే లక్ష్యంగా ఈ యాప్స్లోకి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిని త్వరగా బ్లాక్మెయిల్ చేయవచ్చు. స్నేహం చేయడం, కలవడం సులువు. యాప్లో చిక్కిన వారిని వీడియోలు తీసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఇవ్వకపోతే ఏకంగా రేప్ కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడి కొందరు, పరువుకు భయపడి మరికొందరు అడిగినంత చెల్లించుకుని అక్కడ నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి పద్మవ్యూహాల్లో చిక్కడమే బాధితుల చేతిలో ఉంటుంది. వారిని వదలాలా? వద్దా? అన్నది మాత్రం ముఠా చేతిలోనే ఉంటుంది. -
బల్దియాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
రాయికల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఉంటామని సూచించారు. రాయికల్లో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి కార్యకర్త తనకు తెలుసని, సామాన్య ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటూ ప్రాధాన్యం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. మాదిగకుంట అభివృద్ధి, ఫైర్స్టేషన్ పునఃప్రారంభం, ప్రభుత్వ ఆస్పత్రి స్థలాన్ని రక్షించాలని మాజీమంత్రి జీవన్రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి అనేది బాధ్యత నియోజకవర్గ అభివృద్ధి అనేది ఎమ్మెల్యే బాధ్యత అని మాజీమంత్రి జీవన్రెడ్డి తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.70 కోట్లతో బోర్నపల్లి బ్రిడ్జి మంజూరు చేయించానని, పదవులు లేకున్నా మంత్రి సహకారంతో రూ.17కోట్లతో జగన్నాథపూర్–బోర్నపల్లి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి కృషి చేశానని పేర్కొన్నారు. పట్టణంలో తాగునీటి సమస్య ఉన్నప్పుడు బావులు తవ్వించామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, మాజీ జెడ్పీటీసీ గోపి మాధవి, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, యూత్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మండల అధ్యక్షుడు మహేందర్గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడి మహిపాల్రెడ్డి, జిల్లా నాయకులు షాకీర్, రాకేశ్నాయక్, ఎద్దండి భూంరెడ్డి, బత్తిని భూమయ్య పాల్గొన్నారు. కోరుట్లలో అభివృద్ది పనులకు శంకుస్థాపన కోరుట్ల: కోరుట్లలో 646 మహిళాసంఘాలకు రూ.2.62 కోట్ల వడ్డీ రాయితీ చెక్కులను కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్తో కలిసి మంత్రి అడ్లూరి మహిళాసంఘాల సభ్యులకు అందించారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను చేపడుతోందన్నారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో రూ.18.70 కోట్ల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, మున్సిపల్ కమిషనర్ రవీందర్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి మెట్పల్లి: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. పట్టణంలో యూఐడీఎఫ్ నిధులు రూ.18.70కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 325 మ హిళాసంఘాలకు రూ.2.20కోట్ల రుణాలు అందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్ ఉన్నారు. మహిళాసంఘాల అభివృద్ధికి కృషి మహిళా సంఘాలకు త్వరలో సోలార్ ప్రాజెక్టులు అందిస్తామని మంత్రి అన్నారు. పట్టణంలో రూ.7.20 కోట్లతో అభివృద్ధి పనులకు భూ మిపూజ చేశారు. మహిళ సంఘాలకు రూ.11 లక్షల వడ్డీలేని రుణాలను ఎమ్మెల్యే సంజయ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పంపిణీ చేశారు. నిరుపేదలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని తెలి పారు. చీరల పంపిణీ, సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. ఆరుగ్యారంటీ పథకాల్లో నాలుగు అమలు చేశామని, మరికొద్ది రోజుల్లోనే రెండు పథకాలను అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహకారంతో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఇప్పించామని, మురికికాలువలు, సీసీరోడ్లు చేపట్టామని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళాసంఘాలు ఎక్కువగా రుణాలు పొందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, కమిషనర్ నాగరాజు, మెప్మా ఏవో శ్రీనివాస్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
జగిత్యాల: గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని అదనపు కలెక్టర్ లత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్, డీఆర్డీవో, మున్సిపల్ అధికారులు ఏ ర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. ఆహ్వానితులు, విద్యార్థులు, ప్రజలకు అవసరమైన నీటి సదుపాయం కల్పించాలని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పతాకావిష్కరణ అనంతరం పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరణ్, డీపీఆర్వో నరేశ్, మున్సిపల్ కమిషనర్ స్పందన, తహసీల్దార్ రాంమోహన్ఉన్నారు. బాల్య వివాహాలు నిర్మూలించాలిమల్యాల: బాల్య వివాహాలు రూపుమాపేందుకు అందరూ కృషి చేయాలని, బాలిక విద్యను ప్రోత్సహించాలని జిల్లా సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కరంజీయ నిఖిష అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుతోపా టు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్య ప్రాధాన్యతను గుర్తించాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం అనుపమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం జగిత్యాలరూరల్: బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని జగిత్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జి పావని అన్నారు. బీర్పూర్లో బాల్య వివాహాల చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించా రు. పోషకాహారం, పరిశుభ్రత, విద్య ప్రాముఖ్య త, గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై వివరించారు. బీర్పూర్ ఎస్సై రాజు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. పుట్టగొడుగులతో ఆర్థికంగా అభివృద్ధిరాయికల్: పుట్టగొడుగుల ద్వారా రైతులు ఆర్థికంగా వృద్ధి సాధించవచ్చని జిల్లా పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యామ్ప్రసాద్ అన్నారు. పట్టణంలో కుర్మ ప్రభాకర్ పుట్టగొడుగుల పెంపకాన్ని శనివారం పరిశీలించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. 45రోజుల్లోనే పంట చేతికొస్తుందని, ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యాన అధికారి కందుకూరి స్వాతి, మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్ సాయి, ఉద్యాన విస్తీర్ణాధికారి రాజేశ్, తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ పథకాలు అందిస్తాం కథలాపూర్: అర్హుందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని సిరికొండలో 88 మందికి కల్యాణలక్ష్మి, 40 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తోందన్నారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే సూరమ్మ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. తహసీల్దార్ వినోద్, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, ముదాం రవి, నాగం భూమయ్య, బద్దం మ హేందర్రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటే.. మన వజ్రాయుధం
కరీంనగర్ అర్బన్/సిరిసిల్ల కల్చరల్: ఓటు.. బ్రహ్మాస్త్రం.. ప్రభుత్వాలను కూల్చాలన్నా.. నియంతృత్వ విధానాలకు చరమగీతం పాడాలన్నా మీట నొక్కి వ్యవస్థను మార్చొచ్చు. ఏక్ దిన్కా సుల్తాన్ అన్నట్లు ఎన్నికల్లో ‘ఓటు’కున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇంతటి మహత్తర శక్తిని పొందడంలో యువత ఆసక్తి చూపకపోవడం విచారకరం. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు ఉన్న శక్తి ఏపాటిదో స్పష్టౖమైన విషయం విదితమే. ఒక్క ఓటుతో గెలిచినవారుండగా సమాన ఓట్లతో టై కాగా టాస్తో విజేతను నిర్ణయించారు. అందుకే ప్రతి ఓటు విలువైనదే.. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కథనం.. – వివరాలు 8లో..మల్యాల: ఈమె మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన బండారి దుబ్బరాజవ్వ(102). శతాధిక వృద్ధురాలైనా.. కళ్లు కనపడకపోయినా, నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ.. కుటుంబ సభ్యుల సహకారంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ‘ఎన్నిసార్లు ఓటు వేసిన్నో నాకు గుర్తు లేదు. బుద్ధి తెలిసినప్పటి నుంచి ఓటు ఏసేందుకు పని ఇడిసిపెట్టుకొని, పోయిన. మొన్నటి సర్పంచ్ ఓట్లలోనూ నాకు నడువరాకపోయినా ఓటు వేసిన. ఓటు వేయకపోతే జనాభా లెక్కలళ్ల మనం లేనట్టేని మావోళ్లు చెప్పిండ్రు’. అని దుబ్బరాజవ్వ ఓటు ప్రాముఖ్యతను చెప్పి.. నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.జిల్లా మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు కరీంనగర్ 10,64,129 5,23,898 5,40,175 56 రాజన్న సిరిసిల్ల 4,76,187 2,30,294 2,45,849 44 పెద్దపల్లి 7,24,608 3,56,740 3,67,815 53 జగిత్యాల 7,30,959 3,50,778 3,80,143 38 -
బీర్పూర్ నృసింహాలయంలో జిల్లా జడ్జిల పూజలు
జగిత్యాలరూరల్: బీర్పూర్లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జిల్లా జడ్జి రత్నపద్మావతి, అడిషనల్ జిల్లా జడ్జి నారాయణ, కోరుట్ల జూనియర్ జ డ్జి పావని, జగిత్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జ డ్జి లావణ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యా యమూర్తులను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ఆలయ చైర్మన్ శ్రీనివాస్, యశోద, రమేశ్, చిన్న గంగాధర్, అర్చకులు రఘు పాల్గొన్నారు. ఉత్సాహంగా క్రికెట్ పోటీలు జగిత్యాలజోన్: తీర్పులు, వాదనలతో తో బిజీగా ఉండే జడ్జిలు, న్యాయవాదులకు నిర్వహించిన క్రికెట్ పోటీలు శనివారం ఉల్లాసంగా సాగాయి. ఎడీఎం ఎలెవన్ జట్టు, పీడీఎం ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి, మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ లావణ్య, కోరుట్ల జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ జి. పావని బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఆటగాళ్లను ఉత్సాహపర్చారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్రనాథ్, స్పోర్ట్స్ కార్యదర్శి కంచె సురేశ్ పాల్గొన్నారు. -
పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయాలి
కథలాపూర్(కోరుట్ల): చదువులో వెనుకబడిన పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గంభీర్పూర్ జెడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు, మౌలిక వసతులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారి నోట్బుక్కులు పరిశీలించి విద్యార్థులతో పాఠాలు చదివించారు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆటల పోటీలను పరిశీలించి విద్యార్థులతో కాసేపు షటిల్ ఆడి ఉత్సాహపరిచారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జివాకర్రెడ్డి, డీఈవో రాము, తహసీల్దార్ వినోద్, ఎంఈవో శ్రీనివాస్, సర్పంచ్ మనోహర్, హెచ్ఎం సుధాకర్రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి ఉన్నారు. వందశాతం గ్రౌండింగ్ చేయాలిజగిత్యాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను మార్చి 31 వరకు వందశాతం గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్క్ అవుట్ చేయని ఇందిరమ్మ ఇళ్లు పట్టణ, రూరల్ప్రాంతాల్లో కలిపి మొత్తం జిల్లాలో 11,079 పెండింగ్లో ఉన్నాయని, మార్చి 31 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. బేస్మెంట్పనులు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. మరో విడత మంజూరు కానున్న నేపథ్యంలో గతంలోనివి పూర్తిచేసేలా చూడాలన్నారు. అలాగే లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు. -
చైర్మన్గిరి.. పార్టీల గురి
జగిత్యాల: మున్సిపాలిటీలపై ఎలాగైనా జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జిల్లాలో ఐదు బల్దియాలు ఉండగా, పెద్ద మున్సిపాలిటీ అయిన జగిత్యాల చైర్మన్ పదవీ మళ్లీ బీసీ మహిళకే కేటాయించడంతో రోజురోజుకు ఆశావహులు పెరుగుతున్నారు. ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాతో పాటు, రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎక్కడి నుంచి పోటీ చేయాలి, చైర్పర్సన్ పీఠం కై వసం చేసుకోవాలంటే ఎన్ని సీట్లు కావాలి, ఎవరికి ఎవరు మద్దతివ్వాలన్న దానిపై ప్రధాన పార్టీల్లో చర్చ జరుగుతోంది. జగిత్యాలలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. 26 స్థానాలు సాధించిన పార్టీకి చైర్పర్సన్ సీటు దక్కే అవకాశం ఉంటుంది. సర్వేల ఆధారంగా.. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎలాంటి ఒత్తిళ్లు, పైరవీలకు తావు లేకుండా సర్వేల ఆధారంగానే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తామని పేర్కొనడంతో పాటు, ఇప్పటికే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డుల్లో సర్వే సైతం చేయించాయి. జిల్లా కేంద్రంలో ప్రధాన పార్టీలు ముఖ్య కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి ఎలాగైనా జెండా ఎగురవేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కాగా, జగిత్యాల చైర్పర్సన్గా పనిచేసిన బీసీ సామాజికవర్గానికి చెందిన అడువాల జ్యోతితో పా టు, మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన సమిండ్ల వాణి చైర్పర్సన్ పీఠం కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా, మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి ప్ర ముఖ వైద్యురాలు ఒడ్నాల రజిత సైతం చైర్పర్సన్ పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. అలాగే మరికొంత మంది వివిధ పార్టీల నుంచి ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
ఇంటర్లో డిజిటల్ పాఠాలు
కథలాపూర్(వేములవాడ): ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్పీ) బోర్డుల ద్వారా ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధించనున్నారు. పేద విద్యార్థులు ప్రతిష్టాత్మక కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ చాటేలా ఇంటర్మీడియట్ విద్యాశాఖ శ్రీఫిజిక్స్ వాలాశ్రీతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సైన్స్, గణితం సబ్జెక్టులపై డిజిటల్ పాఠాల బోధనను అందుబాటులోకి తెచ్చారు. ఉన్నత పాఠశాలల్లో మూడు చొప్పున ఐఎఫ్పీ బోర్డులు ఉండటంతో వాటిని విద్యార్థులకు చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇవి లేక విద్యార్థులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దీన్ని గ్రహించిన ఇంటర్బోర్డు.. జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాలుగు చొప్పున ఐఎఫ్పీ బోర్డులను సరఫరా చేసింది. వీటిని కళాశాలల్లో బిగించే పనులు కొనసాగుతున్నాయి. కొన్నిరోజుల్లోనే ఐఎఫ్పీ బోర్డుల ద్వారా పాఠాలు బోధించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు ప్రయోజనాలెన్నో.. జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో ఫస్టియర్, సెకండీయర్లో 5,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతోపాటు డిజిటల్ రూపంలో స్క్రీన్పై చూపిస్తూ బోధిస్తే విద్యార్థులు అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని, పాఠం కూడా విద్యార్థులకు త్వరగా అవగతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది నుంచే నీట్, ఎప్సెట్, ఇతర పోటీ పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు ఇంటర్ బోర్డు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. వీరికి అనుభవజ్ఞులైన లెక్చరర్లతో వీడియో పాఠాలు బోధించే అవకాశం కలుగుతుంది. ఇవి రెండు రకాలుగా ఉపయోగపడుతాయి. ప్రత్యేక పెన్తో ప్యానెల్ బోర్డుపై రాసే అవకాశం ఉండగా.. స్క్రీన్పై చూపిస్తూ బోధన చేయవచ్చు. -
జగిత్యాల
29.0/16.0Iగరిష్టం/కనిష్టంగోదావరిలో పుణ్యస్నానాలుఇబ్రహీంపట్నం: వసంత పంచమి సందర్భంగా శుక్రవారం మండలంలోని ఎర్దండి గోదావరి వ ద్ద భక్తుల సందడి నెలకొంది. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓటు ప్రాముఖ్యతపై అవగాహనకోరుట్లరూరల్: మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్స వం నిర్వహించారు. ఆర్డీవో జీవాకర్రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య ఓటు ప్రాముఖ్యతపై వివరించారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. పాక్షికంగా మేఘావృతమై కనిపిస్తుంది. సాయంత్రం చలిగాలులు వీస్తాయి. శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026 -
వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ
రాయికల్(జగిత్యాల): సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో రాయికల్ మండలం కుమ్మరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్రాజ్ బోధనోపకరణ విభాగంలో రూపొందించిన సైన్స్కిట్కు ద్వితీయస్థానం లభించింది. ఎంపీ రఘునందన్రావు, రాష్ట్ర విద్య పరిశోధన సంస్థ డైరెక్టర్ రమేశ్, డీఈవో వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్నారు. అభయ్రాజ్ను డీఈవో రాము, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, ఎంఈవో రాఘవులు అభినందించారు. -
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
మెట్పల్లి(కోరుట్ల): పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సీనియర్ సివిల్ మెజిస్ట్రేట్ నాగేశ్వర్రావు పేర్కొన్నారు. గణ తంత్ర వేడుకలను పురస్కరించుకొని స్థానిక మినీ స్టేడియంలో శుక్రవారం న్యాయవాదుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. దీ నిని మెజిస్ట్రేట్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు వ్యక్తుల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, ఏటా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం అభినందనీ యమన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ మెజిస్ట్రేట్ అరుణ్కుమార్, అధ్యక్షుడు కంతి మోహన్రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. పీహెచ్సీ తనిఖీకథలాపూర్(కోరుట్ల): మండలంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్యాధికారి సుజాత తనిఖీ చేశారు. పీహెచ్సీలోని ఫార్మసీ, ల్యాబ్, పేషెంట్ గదులను పరిశీలించారు. పీహెచ్సీకి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ఆరోగ్య సలహాలు అందించాలన్నారు. పీహెచ్సీ పరిధిలోని గర్భిణుల సంఖ్య, ప్రసవాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, డీపీవో రవీందర్, వైద్యాధికారి సింధూజ, సిబ్బంది ఉన్నారు. సకాలంలో టీకాలు వేయాలికథలాపూర్(కోరుట్ల): పశువులకు సకాలంలో టీకాలు వేసి పాడిపరిశ్రమ అభివృద్ధికి పశు వైద్యసిబ్బంది సహకరించాలని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి ప్రకాశ్ పేర్కొన్నారు. శుక్రవారం కథలాపూర్లోని పశు వైద్యశాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. గ్రా మాల్లో ఇటీవల నిర్వహించిన గాలికుంటు వ్యాఽ ది నివారణ టీకాల శిబిరాల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట పశువైద్యాధికారి ది వ్య శ్రీ, సిబ్బంది రాజుకుమార్, రసూల్ ఉన్నారు. సమర్థవంతంగా జంతుగణనజగిత్యాలరూరల్: జంతుగణన సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్ అన్నారు. శుక్రవారం సారంగాపూర్, లక్ష్మీదేవిపల్లి అడవుల్లో చేపడుతున్న జంతుగణనను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడవుల్లో శాఖాహార, మాంసాహార జంతువులను పేడ, కాలిగుర్తులతో క్షుణ్ణంగా గుర్తించాలన్నారు. రానున్న వేసవికాలంలో జంతవులను రక్షించేందుకు నీటి సౌకర్యం కల్పించాలని, ప్రజల సహకారంతో అడవులు, వన్యప్రాణులను కాపాడాలన్నారు. ఎఫ్ఆర్వో పద్మారావు, డెప్యూటీ రేంజర్ రవికుమార్, ఎఫ్బీవోలు రవీంద్రనాయక్, ప్రేమ్కుమార్, గోపాల్ పాల్గొన్నారు. ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ అందజేతజగిత్యాల: జిల్లా కేంద్రంలోని ధరూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం పదో తరగతికి సంబంధించి ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ, శ్రీసాక్షిశ్రీ ఆధ్వర్యంలో బుక్స్ అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. -
వెల్లివిరిసిన వసంతం
వేడుకల్లో భక్తులు ధర్మపురిలో స్వామివారల ఊరేగింపుకోరుట్లలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన, అనుబంధ ఆలయాల్లో శుక్రవారం వంసత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్థులైన యోగ, ఉగ్ర లక్ష్మీనృసింహస్వామి, వేంకటేశ్వరస్వాములను ఊరేగింపుగా తీసుకెళ్లి భోగ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కోరుట్ల పరిధిలోని సరస్వతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అక్షరాభ్యాసాలు చేశారు. పట్టణంలోని అయ్యప్ప, జ్ఞాన సరస్వతి, సంగెంలోని సరస్వతిదేవీ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. శివ మార్కండేయ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. – ధర్మపురి/కోరుట్ల/కోరుట్లరూరల్ -
‘ప్రజా బాట’.. సమస్యలకు టాటా
జగిత్యాలఅగ్రికల్చర్: గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజా బాట(పొలం బాట) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా విద్యుత్ సమస్యలు గుర్తించి, ఒకట్రెండు రోజుల్లోనే పరిష్కరిస్తున్నారు. జిల్లాలో 203 ప్రజా బాట కార్యక్రమాలు జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 203 ప్రజా బాట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఏఈలు, లైన్మెన్లు, హెల్పర్లు గ్రామాన్ని సందర్శించి రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు లేవనెత్తే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా మోటార్ల వద్ద తీసుకునే జాగ్రత్తలు వివరిస్తున్నారు. కొత్త స్తంభాలు.. మరమ్మతులు విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండి, వైర్లు కిందికి వేలాడుతున్న తీగల మధ్య కొత్తగా 1,349 స్తంభాలు ఏర్పాటు చేశారు. అలాగే, ఈదురుగాలులకు వంగి, రైతులకు ఇబ్బందిగా మారిన 303 స్తంభాలను సరిచేశారు. స్తంభాల మధ్య వేలాడుతున్న 1,874 లూజ్ లైన్లను గట్టిగా బిగించారు. తక్కువ ఎత్తులో ఉన్న 142 ట్రాన్స్ఫార్మర్ల గద్దెలను ఎక్కువ ఎత్తుకు పెంచారు. ప్రమాదకరంగా ఉన్న 1,412 డబుల్ ఫీడింగ్, లో–లెవల్ లైన్ క్రాసింగ్లను సరిచేశారు. ఎక్కువ ఎత్తులో ఉండే హార్వేస్టర్ వాహనాలు వెళ్లేచోట ప్రమాదాలు జరుగకుండా 9.1 మీటర్ల ఎతైన స్తంభాలు వేశారు. జిల్లాలో చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో వాటికి సరైన ఎర్తింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. జీరో విద్యుత్ ప్రమాదాల కోసం.. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా గ్రామాల్లో రైతులు, విద్యుత్ సిబ్బంది చేత చైతన్య ర్యాలీ నిర్వహిస్తున్నారు. విద్యుత్ మోటార్లు, స్టార్టర్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోటార్లకు కెపాసిటర్లు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ప్రయోగత్మకంగా వివరిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా డీఈ(టెక్నికల్) అధికారులను ప్రత్యేక సేఫ్టీ అధికారులుగా నియమించి వినియోగదారులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు. ఏ సమస్య ఉన్నా 1912 టోల్ఫ్రీ.. విద్యుత్కు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఉన్నతాధికారులకు తెలిపేందుకు జిల్లాస్థాయిలో 1912 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. రైతులు స్వతహాగా ట్రాన్స్ఫార్మర్ల ప్యూజులు వేయడం, ట్రాన్స్ఫార్మర్ ఆఫ్, ఆన్ చేయవద్దని, ఏ సమస్య ఉన్నా విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా.. జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం. ఆ మేరకు గ్రామాల్లో ప్రజా బాట కార్యక్రమం నిర్వహించి విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తున్నాం. విద్యు త్ ప్రమాదాలపై అవగాహన పెంచుతున్నాం. విద్యుత్ సమస్యలు మా దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. – బి.సుదర్శనం, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ, జగిత్యాల -
అన్ని గ్రామాల్లో భూముల రీ సర్వే
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): రైతులు అధికారుల వెంట ఉండి భూములను సర్వే చేయించుకోవాలని అదనపు కలెక్టర్ లత సూచించారు. శుక్రవారం మండలంలోని బర్థీపూర్లో భూ భారతి రీసర్వేపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లాలోని 326 గ్రామాల్లో సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. బర్థీపూర్ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడి నుంచి రీ సర్వే చేపట్టినట్లు వివరించారు. సర్వే సమయంలో చుట్టుపక్కల వారు కూడా ఉంటే ఎలాంటి తగాదాలు ఉండవన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది, కోడిగుడ్డు పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని ఎర్దండి గోదావరి వద్ద పుష్కర్ఘాట్లను పరిశీలించారు. తహసీల్దార్ వరప్రసాద్, డీఐ దేవరావు, ఏడీ కృష్ణప్రసాద్, సర్వేయర్ భార్గవి, ఆర్ఐ రమేశ్, సర్పంచు అమృత తదితరులు పాల్గొన్నారు. -
కోరుట్ల బల్దియాపై బీజేపీ జెండా ఎగరేద్దాం
కోరుట్ల: కోరుట్ల మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అనూప్రావు సహ పలువురు నాయకులు శుక్రవారం బీజేపీలో చేరగా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరడంతో కోరుట్లలో పార్టీకి బలం మరింత పెరిగిందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, అలాగే ఎంపీ అరవింద్ కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మచ్చ శేఖర్, అల్లాడి ప్రవీణ్, తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, రేగుంట మహీంద్ర బీజేపీలో చేరారు. రాష్ట్ర నాయకురాలు బోగ శ్రావణి, చిట్నేని రఘు, రశ్రీనివాస్, నరేందర్రెడ్డి, స్వీతీ అనూప్, రుద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాలి
జగిత్యాల: నిబంధనలకు లోబడి ఎన్నికల విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో ఆర్వోలు, ఏఆర్వోలకు గురువారం శిక్షణ ఇచ్చారు. ఆర్వో, ఏఆర్వో ప్రతి అంశాన్ని తెలుసుకుని ముందుకెళ్లాలన్నారు. మున్సిపల్ ఎన్నికల విధులు చాలా కీలకమైనవన్నారు. ఎన్నికలకు ముందురోజు సామగ్రి సేకరించడం, పూర్తి సామగ్రి ఉందో లేదో సరిచూసుకోవడం, ఓటరు లిస్ట్, బ్యాలెట్ పేపర్ చెక్ చేసుకోవడం, చాలెంజ్ ఓటు, టెండర్ ఓటు, బ్యాలెట్ పేపర్స్ ఇవ్వడం, పీవో డెయిరీ నింపడం, అన్ని ఫాంలు ఎలా నింపాలి, ఎజెంట్స్ సిగ్నేచర్స్ ఎక్కడ తీసుకోవాలో అన్ని తెలిసి ఉండాలన్నారు. పోలింగ్ అయిన తర్వాత బ్యాలెట్ సీలింగ్, ఓటు కౌంటింగ్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ నిర్వహణ, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు ముందుకెళ్లాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవోలు శ్రీనివాస్, దివాకర్రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
ముక్తీశ్వర ఎత్తిపోతల ప్రారంభం
● రూ.81 లక్షలతో మరమ్మతు పూర్తి ● మంత్రి లక్ష్మణ్ కుమార్వెల్గటూర్: మండలంలోని ముత్తునూర్లో కొద్దికాలంగా నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రారంభించారు. మోటార్లను ఆన్ చేసి మూడు గ్రామాలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముత్తునూర్లోని ముక్తీశ్వర ఎత్తిపోతలకు రూ.81లక్షలతో మరమ్మతు చేయించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, గోదావరిపై ఆధారపడిన ముత్తునూర్, ఆరేపల్లి, జైన, రాజారాం, మండపేట, రాయపట్నం, తిమ్మాపూర్ తదితర గ్రామాల రైతులకు నీటి ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. కాంట్రాక్టర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, తక్షణ మరమ్మతు చేపడతామని తెలిపారు. ఏఎంసీ చైర్మెన్ గోపిక, వైస్ చైర్మెన్ తిరుపతి, నాయకులు శైలేందర్రెడ్డి, మంజుల, మురళి, ప్రతాప్రావు, రమేశ్, నరేష్, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. -
అగ్రకులాల ఆధిపత్యాన్ని కూల్చేస్తాం..
ఆరోపణలకు అభివృద్ధితోనే బదులిస్తా ● ఎమ్మెల్యే సంజయ్కుమార్రాయికల్: ఎమ్మెల్యేగా తనపై వస్తున్న ఆరోపణలకు అభివృద్ధితోనే బదులిస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. పట్టణంలో గురువారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాయికల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని, గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న రూ.3 కోట్ల బిల్లులను సీఎం సహకారంతో చెల్లించామని, తాజాగా రూ.4 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. మున్సిపల్ పార్క్, డివైడర్లు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, స్మార్ట్వాటర్ వంటి అభివృద్ధి పనులకు రూ.7.20 కోట్లు కేటాయించామని, వాటికి ఈనెల 24న మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ భూమిపూజ చేయనున్నారని వివరించారు. కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట నాయకులు మోర హన్మండ్లు, గండ్ర రమాదేవి, ఏనుగు మల్లారెడ్డి, కోల శ్రీనివాస్, రవీందర్రావు, గన్నె రాజిరెడ్డి, రాంమూర్తి, మ్యాకల కాంతారావు ఉన్నారు. గొల్లపల్లి: అగ్రకులాల రాజ్యాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ బలగంతో కూల్చేస్తామని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్ అన్నారు. లక్ష కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా గురువారం రాత్రి మండలకేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. వందకు 90 శాతం అణ గారిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాన్ని అప్పజెప్పేవరకూ పోరాటం చేస్తామన్నారు. 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను పది శాతం కూడా లేని అగ్రకులాలు బానిసలుగా మార్చుకుని రాజ్యమేలుతున్నారని పేర్కొన్నారు. పీడిత జాతుల విముక్తి కోసం నాయకత్వం వహించాలని, రాజ్యాంగ ఆయుధాల తో యుద్ధం చేస్తే బానిసల భూకంపం వస్తుందని, అప్పుడే సింహాసనం చేజిక్కుతుందని పేర్కొన్నారు. గొల్లపల్లిలో రెడ్డి, వెల్మల ఆధిపత్యాన్ని నశింపజేసేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. పట్టాలు ఇవ్వకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాంనిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయకపోతే బాధితులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని విశారదన్ మహారాజ్ అన్నారు. మండలకేంద్రంలోని నల్లగుట్ట వడ్డెరకాలనీని సందర్శించారు. కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 25ఏళ్లుగా 20 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నా నేటికీ ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు. అధికారులు వెంటనే స్పందించి పేదలకు తగిన న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్ప ష్టం చేశారు. జేఏసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా ఇన్చార్జి శివ, అధ్యక్షుడు మనాల కిషన్, నాయకులు శ్రీనివాస్ చారి, అశోక్, తిరుపతి, లక్ష్మణ్, జాని, మధుసూదన్ పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారన్ మహారాజ్ -
డీఎం దృష్టికి తీసుకెళ్లా
సంగెం నుంచి నాగులపేట హైస్కూల్కు వెళ్లే విద్యార్థులు బస్సు లేక ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి వచ్చింది. పాఠశాల సమయంలో బస్సు నడపాలని కోరుట్ల ఆర్టీసీ డీఎంకు చెప్పాను. కంకరరోడ్డు విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. నిధులు విడుదల కా కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేశాడు. నిధుల విడుదలకు ప్రయత్నం చేస్తాం. – కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే కాలినడకన వెళ్తున్నాం రాజారాంతండాలో హైస్కూల్ లేదు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతకుంట జెడ్పీ హైస్కూ ల్లో ఏడో తరగతి చదువుతున్న. బస్సు సౌకర్యం లేక ప్రతీరోజు కాలినడకన.. లేకుంటే బైక్లపై లిఫ్ట్ ఎక్కి పాఠశాలకు పోతున్నాం. ఒక్కోసారి పాఠశాలకు చేరుకోవడం ఆలస్యం అవుతోంది. బస్సు సౌకర్యం కల్పించాలి. – లకావత్ దివ్య, ఏడో తరగతి, రాజారాంతండా -
29.0/16.0
7‘టెస్టీ’ అనారోగ్యం వీకెండ్ వస్తే... బయట బిర్యానీ ఆర్డర్ పెట్టాలి. ఇంటిలో పిల్లాడికి తినాలనిపిస్తే ఏ పిజ్జానో, ఫ్రెంచ్ ఫ్రైసో తీసుకురావాలి. కుటుంబమంతా బయటకు వెళ్తే దర్జాగా హోటల్లో కూర్చుని రంగురంగుల పదార్థాలు రుచి చూడాలి. గరిష్టం/కనిష్టంవాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. పాక్షికంగా మేఘావృతమై కనిపిస్తుంది. ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుంది. సాయంత్రం చలిగాలులు వీస్తాయి. -
చదువుకోవాలంటే నడవాల్సిందే..
కోరుట్లరూరల్/కథలాపూర్/పెగడపల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సమయానికి బస్సులు లేక.. సరిపడా రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు బడిబాట కార్యక్రమం పేరిట విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ వారికి సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. కథలాపూర్ మండలం రాజారాంతండా విద్యార్థులు హైస్కూల్ చదువుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతకుంటకు వెళ్లాల్సిందే. వీరికి బస్సు సౌకర్యం లేక కాలినడకన, బైక్లపై లిఫ్ట్ అడిగి పాఠశాల చేరుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని ఏళ్లుగా విన్నవించినా పట్టించుకునేవారు కరవయ్యారని గ్రామస్తులు మండిపడుతున్నారు. కోరుట్ల నుంచి కథలాపూర్ వరకు ఉదయం, సాయంత్రం విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని దుంపేట, పోసానిపేట గ్రామాల విద్యార్థులు కోరుతున్నారు. కోరుట్ల మండలం సంగెం విద్యార్థులు కంకరరోడ్డుపైనే నడుచుకుంటూ నాగులపేట హైస్కూల్కు వెళ్తున్నారు. సంగెంలో ఐదో తరగతి వరకే ఉంది. తర్వాతి చదువులకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగులపేటకు వెళ్తుంటారు. సంగెం నుంచి ప్రతిరోజూ సుమారు 50 మంది విద్యార్థులు కాలినడకన వెళ్తూ ఇబ్బంది పడుతున్నారు. పెగడపల్లి మండలంలో ఏడు ఉన్నత పాఠశాలలున్నాయి. మోడల్ స్కూల్ విద్యార్థులకు సమాయానుకూలంగా బస్సులు రాకపోవడంతో ఆటోలు, టాటా ఏసీ వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. నందగిరి, అయితిపల్లి, కీచులాటపల్లి, రాజరాంపల్లి, సుద్దపల్లి, బతికపల్లి, లింగాపూర్, నంచర్ల నుంచి బస్ సౌకర్యం ఉన్నా సమయానికి రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. జిల్లాలోని పాఠశాల, విద్యార్థుల వివరాలు సమయానికి రావు.. సరిపడా ఉండవు నడిచి వెళ్లలేక విద్యార్థుల అవస్థలు కొన్ని గ్రామాల్లో కిలోమీటర్ల మేర నడకే.. ఆటోల్లో ఇబ్బంది పడుతూ పాఠశాలలకు.. -
టికెట్లు ఎవరి ‘చేతి’కో..!
● పలు వార్డుల్లో తీవ్ర పోటీ ● తలనొప్పిగా ఎంపిక వ్యవహారం● 12వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ ముఖీమ్ను ఇప్పటికే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ప్రకటించారు. ఆ వార్డు నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షాకీర్ రెండుసార్లు, ఒకసారి అతని సతీమణి కౌన్సిలర్లుగా గెలుపొందారు. ఈ వార్డుకు సంబంధించి పార్టీలో తమకు ఎదురులేదని, నాలుగోసారి కూడా టికెట్ తమకే వస్తుందని ధీమాతో ఉన్న షాకీర్కు జువ్వాడి షాక్ ఇచ్చారు. అతనిపై ఆగ్రహంతో ఉన్న ఆయన సర్వేతో సంబంధం లేకుండా నేరుగా ముఖీమ్ పేరు ప్రకటించారు. మరోవైపు షాకీర్.. పార్టీ పెద్దల వద్ద ఉన్న పలుకుబడితో టికెట్ తమకే వస్తుందని వార్డులో ప్రచారం చేస్తున్నాడు. అయితే ఈ వార్డు ఈ సారి కూడా మహిళకే రిజర్వ్ కావడంతో టికెట్ ముఖీమ్ కుటుంబానికా..? లేక షాకీర్ కుటుంబానికి దక్కుతుందా..? అన్నది ఆసక్తిగా మారింది. మెట్పల్లి: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రేపోమాపో విడుదలయ్యే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థల ఎంపికలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మేరకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడానికి కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో వార్డుల్లో పార్టీ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. టికెట్ రాని పక్షంలో స్వతంత్రులు గానైనా పోటీ చేయాలనే ఆలోచనలో నాయకులు ఉండడం ఆ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశముంది. ● 11 వార్డు నుంచి మాజీ సర్పంచ్ కొమొరెడ్డి లింగారెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ కొమొరెడ్డి తిరుపతిరెడ్డి, కొమొరెడ్డి శేషులు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు బంధువులు కావడం విశేషం. టికెట్ కోసం ఎవరి దారిలో వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ● 15వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్గా గెలిచిన పిప్పెర లత ఆమె భర్త రాజేశ్ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఈ ఎన్నికల్లో హస్తం టికెట్ తమకే ఖాయమని ధీమాలో ఉన్న వారికి పద్మశాలీ సేవా సంఘం పట్టణ అధ్యక్షుడు ధ్యావనపల్లి రాజారాం ఇటీవల కాంగ్రెస్లో చేరడంతో పోటీ ఏర్పడింది. టికెట్ హామీతోనే రాజారాం హస్తం గూటికి చేరారనే ప్రచారం జరుగుతోంది. ● 22వ వార్డు నుంచి పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగంకు అక్కడ రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో 21వార్డు నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ఈ వార్డులో అప్పటికే యూత్ కాంగ్రెస్ నాయకుడు ఖాజా అజీం బరిలో ఉంటానని ప్రచారం చేస్తున్నాడు. గత ఎన్నికల్లో ఇదే వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం లింగం రావడంతో టికెట్పై ఆయనకు టెన్షన్ పట్టుకుంది. ● 25వార్డు నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన మర్రి సహాదేవ్ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో అతని సతీమణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఉమారాణిని పోటీలో నిలుపుతున్నాడు. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న పార్టీ పట్టణ కార్యదర్శి తుమ్మనపల్లి రాంప్రసాద్ టికెట్ తమకే ఇవ్వాలని పట్టుబట్టుతున్నాడు. అక్కడ ముఖీమ్ కుటుంబానికా..? షాకీర్కా కుటుంబానికా..? -
భూ భారతి సర్వే సమర్థవంతంగా చేపట్టాలి
● అదనపు కలెక్టర్ బీఎస్.లతజగిత్యాలరూరల్: భూభారతి సర్వే సమర్థవంతంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. గురువారం బీర్పూర్ మండలం వచ్చునూర్లో భూభారతి భూసర్వే, రీసర్వేపై అవగాహన కల్పించారు. సర్వేలో లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ సుజాత, అసిస్టెంట్ డైరెక్టర్ భూముల కొలతలు, రికార్డ్స్ అధికారి కిషన్ప్రసాద్, విఠల్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీనివాస్, జీపీవో సత్యం, సుధాకర్, సర్పంచు రంగు లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి జగిత్యాల: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. వేడుకలపై అధికారులతో సమావేశమయ్యారు. గ్రౌండ్ సిద్ధం చేయాలని, పతాకావిష్కరణ, వేదిక, సిట్టింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. వైద్య బృందాలతో శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ ప్రగతి సందేశాన్ని వివరంగా అందించాలన్నారు. తాగునీరు, శానిటేషన్ చేపట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ ఏర్పాటు చేసేలా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో మధుసూదన్, ఏవో హకీం, డీఆర్డీవో రఘువరణ్ పాల్గొన్నారు. కాలువ పనులకు నిర్వాసితులు సహకరించాలికథలాపూర్:సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనులకు భూనిర్వాసితులు సహకరించాలని ఆర్డీవో జివాకర్రెడ్డి కోరారు. గురువారం మండలంలోని గంభీర్పూర్లో రైతులతో సమావేశమయ్యారు. గ్రామ పరిధిలో 50 ఎకరాలు కాలువ పనులకు అవసరమన్నారు. భూ ములు కోల్పోతున్నవారికి ప్రభుత్వ నిబంధన ల ప్రకారం పరిహారం ఇస్తామన్నారు. రైతులు సహకరిస్తే పనులు త్వరగా ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్, ఆర్ఐ రవీందర్, సర్పంచ్ మనోహర్, రైతులు పాల్గొన్నారు. రాయికల్ బల్దియాను అభివృద్ధి చేసిందే బీఆర్ఎస్ ● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత రాయికల్: రాయికల్ బల్దియాను అభివృద్ధి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలో ముఖ్యకార్యకర్తలతో గురువారం సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీని మున్సిపల్గా మార్చి రూ.25 కోట్లు మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో శూన్యమని ఆరోపించారు. అభివృద్ధి కోసమే పార్టీ మారిన ఎమ్మెల్యే మైతాపూర్ బ్రిడ్జి, ఇటిక్యాల బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం లేని సంజయ్కి గాంధీభవన్లో ఏం పని అని ప్రశ్నించారు. ఎన్నికల్లో రాయికల్ బల్దియాపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్కుమార్, ఉపాధ్యక్షుడు వాసం రాజేందర్, కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ ఉదయశ్రీ, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, మాజీ కౌన్సిలర్లు శ్రీరాముల సత్యనారాయణ, మహేశ్గౌడ్, మహేందర్, బాబా, ప్రశాంత్ పాల్గొన్నారు. 24న నృసింహుడి బ్రహ్మోత్సవాలపై సమావేశంజగిత్యాలరూరల్: బీర్పూర్ మండలకేంద్రంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల (జాతర) ఏర్పాట్లపై ఈనెల 24న సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణం, ఫిబ్రవరి ఒకటిన సాయంత్రం 6 గంటలకు డోలోత్సవం, తెప్పోత్సవం, 2న మధ్యాహ్నం 3 గంటలకు పార్వెట ఉత్సవం, 6న మధ్యాహ్నం 3.30 గంటలకు రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అధ్యక్షతన జాతర సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
హక్కులపై అవగాహన పెంచుకోవాలి
మల్యాల/కొడిమ్యాల: విద్యార్థులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని టీజీఎస్సీపీసీఆర్ (తెలంగాణ రాష్ట్ర కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) చైర్పర్సన్ సీతా దయాకర్రెడ్డి అన్నారు. మల్యాలలోని జెడ్పీ బాలికల ఉన్నత, కస్తూరిబా, కొడిమ్యాల మండలం సంద్రాలపల్లిలోని కస్తూరిబా విద్యాలయాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలోనే జీవిత లక్ష్యం ఏర్పరుచుకోవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిర్ధేశించుకున్న లక్ష్య సాధనకు నిరంతరం కష్టపడి చదవాలని సూచించారు. ముందుగా కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు వచన్ కుమార్, అపర్ణ, ప్రేమలత అగర్వాల్, డీఈఓ రాము, కొడిమ్యాల సెక్టోరియల్ ఆఫీసర్ మహేశ్, ఎంఈఓ శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజు, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ హరీశ్, పాఠశాల ప్రిన్సిపల్ లావణ్య పాల్గొన్నారు. జగిత్యాల: అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అధికారులతో సమావేశమయ్యారు. బాలల హక్కుల పరిరక్షణ, నాణ్యమైన విద్యనందించడం, సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించడానికే పర్యటించామని పేర్కొన్నారు. -
ఎన్నికలకు సమాయత్తం
జగిత్యాల: పుర ఎన్నికలకు అధికారులు సర్వంసిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు ఇప్పటికే తుది ఓటరు జాబితా విడుదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావడం.. రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అధికారయంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును జిల్లాకేంద్రంలోనే చేపట్టనున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి కావాల్సిన విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి, టాయిలెట్స్, దివ్యాంగుల కోసం ర్యాంప్లు తదితర మౌలిక వసతులు కల్పించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఫొటోలతో కూడిన జాబితాను తయారుచేస్తున్నారు. బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఐదు మున్సిపాలిటీల పరిధిలో 136 వార్డులు ఉన్నాయి. వాటికి సంబంధించిన బ్యాలెట్ బాక్స్లను సిద్ధంగా ఉంచుకున్నారు. అదనంగా 20శాతం బాక్సులను తెప్పించుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే మిగిలిన ప్రక్రియ కోసం సిద్ధంగా ఉన్నారు. జగిత్యాలలోనే కౌంటింగ్ జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) డిగ్రీ కళాశాలలోనే ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎలక్షన్ అయిన ఒకరోజు తర్వాత కౌంటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. గతంలో ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి జగిత్యాలలోని వీఆర్కే కళాశాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం అది నిర్వహణ లేకపోవడంతో ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో కౌంటింగ్హాల్, భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్రూమ్లు, వచ్చిపోయే మార్గాలను పరిశీలించి ప్రతిపాదనను ఎన్నికల కమిషన్కు పంపించారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే కౌంటింగ్ ప్రక్రియకు కళాశాలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఇబ్బందులు లేకుండా ఉంటుందా..? లేదా..? అని అన్ని అంశాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసే వీలు.. పార్కింగ్ అంశాలపై పూర్తిస్థాయిలో పరిశీలన చేశారు. కళాశాల 32ఎకరాల్లో ఉండడం.. చుట్టూ ప్రహరీ కలిగి ఉండటంతో కౌంటింగ్కు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఐదు మున్సిపాలిటీలు కావడంతో ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంటుంది. చుట్టూ 100 మీటర్ల మేర పరిశీలన చేశారు. అంతేకాకుండా వచ్చిపోయే మార్గాలను గుర్తించారు. కళాశాలకు సుదూర ప్రాంతాల్లో భారీకేడ్లు ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ బాక్స్లు, ఇతర సామగ్రి సిబ్బందికి అందించేందుకు సంబంధిత కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఐదు మున్సిపాలిటీల కౌంటింగ్కు కేటాయించాలని ఎన్నికల కమిషన్కు ప్రతిపాదించామని తెలిపారు. బల్దియా వార్డులు ఓటర్లు పోలింగ్కేంద్రాలు ధర్మపురి 15 14,222 24 జగిత్యాల 50 96,410 149 రాయికల్ 12 13,195 24 కోరుట్ల 33 63,741 94 మెట్పల్లి 26 46,371 64 మొత్తం 136 2,33,939 355 -
మట్టి తవ్వకాలపై ఆర్డీవో విచారణ
కథలాపూర్: మండలంలోని పోసానిపేటలో కోరుట్ల ఆర్డీవో జివాకర్రెడ్డి పర్యటించారు. గ్రామ శివారులోని గానె గుట్టను తవ్వి మట్టిని కథలాపూర్లోని విద్యుత్ సబ్స్టేషన్ పనులకు తరలించడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్య క్తం చేశారు. దీంతో వివాదం నెలకొంది. అయి తే మట్టి తరలించేందుకు అనుమతి ఉందని ఆర్డీవో గ్రామస్తులకు వివరించారు. గుట్ట వెను క వైపు కాకుండా ముందు భాగంలో తవ్వకాలు చేపట్టాలని గ్రామస్తులు ఆయనకు విన్నవించా రు. కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్, ఆర్ఐ రవీందర్, ట్రాన్స్కో అధికారులు ఉన్నారు. రాయికల్ మున్సిపల్ కమిషనర్గా నాగరాజురాయికల్: రాయికల్ మున్సి పల్ కమిషనర్ మనోహర్గౌడ్ కరీంనగర్ జిల్లా చొప్పదండి బల్దియాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చొప్పదండి మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజును ఇక్కడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండిమెట్పల్లి: ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఉద్యోగులు పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ మేరకు గవర్నర్కు పంపడానికి సిద్ధం చేసిన కార్డులను బుధవారం ప్రదర్శించారు. పలువురు మాట్లాడుతూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి గతంలో గవర్నర్ ఆమోదం తెలిపారని, ఇప్పటికీ ఆ ప్రక్రియను పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారని, విలీనంతో ఉద్యోగులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. విలీనానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్కు పోస్ట్కార్డులు పంపిస్తున్నామని వివరించారు. బొమ్మెన ప్రాజెక్టు పరిశీలనకథలాపూర్: మండలంలోని పోసానిపేట శివారులో బొమ్మెన ప్రాజెక్టును జిల్లా క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ అధికారి శ్రీనాథ్ బుధవారం పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి నిల్వ, మత్తడి మరమ్మతు పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఆయన వెంట అధికారులు రాజు, రాజేందర్ ఉన్నారు. జగ్గని ఒర్రెకు మార్గం చూపండిమల్యాల: మండలకేంద్రంలోని జగ్గని ఒర్రె సమస్యకు పరిష్కారం చూపాలని, పాలకుల నిర్లక్ష్యంతోనే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జేఏసీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా ఆయన బుధవారం జగ్గని ఒర్రెను స్థానికులతో కలిసి సందర్శించారు. ముందుగా శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కటికవాడ ప్రజలు తమ సమస్యలను వివరించారు. రైతులు, మహిళలతో మాట్లాడారు. తక్షణమే జగ్గని ఒర్రె సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మల్యాల, ముత్యంపేట గ్రామాల్లోని చెరువులు నింపేందుకు వరదకాలువకు తూము ఏర్పాటు చేయాలని కోరారు. కటిక కులస్తులకు ప్రభుత్వం ఉచితంగా ఫ్రిడ్జ్లు అందించాలన్నారు. జిల్లా ఇన్చార్జి దువ్వాక శివా, జిల్లా అధ్యక్షుడు మానాల కిషన్, ఉపేంద్ర, స్థానికులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ధర్మపురి: పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ధర్మపురిలో రూ.264కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వ్యవసాయశాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మన్కుమార్తో కలిసి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం భట్టి మాట్లాడుతూ విద్య, వైద్యరంగాలకు పెద్దపీట వేస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. మండలంలోని నేరెల్ల సమీపంలో సుమారు 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మిస్తామన్నారు. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టిందని, రెండేళ్లుగా వడ్డీలు చెల్లించడానికి సరిపోతోందని అన్నారు. గోదావరి తీరంలో రూ.17కోట్లతో సీనరేజ్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. అలాగే పట్టణంలో రూ.10కోట్లతో నిర్మించనున్న డిగ్రీ కళాశాల, రూ.రెండు కోట్లతో నిర్మించనున్న ఎస్పీ వసతి గృహానికి భూమిపూజ చేశారు. పట్టణంతోపాటు దొంతాపూర్లో రూ.2.58కోట్ల చొప్పున వెచ్చించి ఏర్పాటు చేసిన విద్యుత్సబ్స్టేషన్లను ప్రారంభించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభాలు వచ్చే పంటలు పండింంచాలని తెలిపారు. ధర్మపురికి మూడు సొసైటీలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మున్సిపల్ పరిధి లోని 142 మహిళాసంఘాలకు రూ.48.22లక్షల వడ్డీలేని రుణాలు అందించారు. ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, మక్కాన్సింగ్, విజయరమణారావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సత్యప్రసాద్, నృసింహాలయ చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ తదితరులున్నారు. ముందుగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, తుమ్మల, అడ్లూరికార్యక్రమానికి హాజరైన ప్రజలు -
వర్సిటీలో ఎడతెగని హాజరు వివాదం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థుల హాజరువివాదం రోజురోజుకూ ముదురుతోంది. హాజరు విషయంలో వర్సిటీ వీసీ ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షలకు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆందోళన చెందుతున్నారు. హాజరు విషయంలో తమకు కాస్త మినహాయింపు ఇవ్వాలని, లైబ్రరీని 24 గంటల అందుబాటు విషయంలో వీసీ తమ వినతిని ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బుధవారం మరోసారి విద్యార్థులు హాజరు శాతం విషయంలో తమకు మినహాయింపు కల్పించాలని కోరుతూ రోడ్డెక్కారు. ఇటీవల న్యాయ విద్యార్థుల హాజరు విషయంలో వీసీ ఆదేశాలు అమలు చేయడంతో పలువురు ఇంటర్నల్స్ రాసే అవకాశం కో ల్పోయారు. దీనిపై వందలాది మంది విద్యార్థులు వర్సిటీలో భారీ ఎత్తున ధర్నా చేసిన విషయం విది తమే. తాజాగా సెమిస్టర్ పరీక్షలకు తమను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ నిరసనకు దిగారు. నిబంధనల పేరిట కఠినం వర్సిటీలో చదువుతున్న విద్యార్థుల్లో అధికశాతం బీసీ, ఎస్సీ సామాజికవర్గాల వారే. అందులోనూ ఆయా కుటుంబాల్లో యూనివర్సిటీ స్థాయి ఉన్నత విద్యనభ్యసిస్తున్న తొలితరం వారే కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులపై నిబంధనల పేరుతో మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్పుపై ఆధారపడి చదువుతున్న వారే. వీరంతా తిరిగి పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. తమను హాజరుశాతం పేరుతో ఇంటర్నల్స్, సెమిస్టర్స్ రాసే అవకాశం కోల్పోయేలా వీసీ తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పరిధిలో అనేక డిగ్రీ, పీజీ, ఎంబీఏ కాలేజీలున్నాయి. వీటిలో ఎక్కడా సరిగా తరగతులు జరగడం లేదు. ప్రైవేటు కాలేజీలకు వర్తించని నిబంధనలు పేద విద్యార్థులమైన తమకు మాత్రం ఎందుకు వర్తింప జేస్తున్నారని వర్సిటీ అధికారులను నిలదీస్తున్నారు. అదే సమయంలో వర్సిటీలో పోలీసుల జోక్యం కొంతకాలంగా పెరిగిపోయిందని వాపోతున్నారు. ప్రతిరోజూ వీసీ పోలీసు బలగాలను పిలిపించి వర్సిటీ ప్రాంగణంలో మోహరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ విషయంలో వెనక్కి తగ్గిన వీసీ వర్సిటీలో జరుగుతున్న ఉద్యమాల విషయంలో ఓ మహిళా ప్రొఫెసర్పై వీసీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. కేవలం నెల రోజుల్లోనే ఆమెను నాలుగు బాధ్యతల నుంచి తప్పించడం వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. బాధ్యతల నుంచి తప్పించే క్రమంలో రెండుసార్లు ఆర్డర్లు సెలవు దినాల్లో వెలువడటం గమనార్హం. తనపై వరుసగా వెలువడుతున్న ఈ ఆర్డర్ల విషయంపై తీవ్రంగా కలత చెందిన మహిళా ప్రొఫెసర్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ లోపు విషయం తెలుసుకున్న ఉమ్మడిజిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీకి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందునే ఆమెను తప్పించాల్సి వచ్చిందని వీసీ వివరణ ఇచ్చుకున్నారు. వర్సిటీలో కక్ష సాధింపు చర్యలు తగవని మంత్రి హితవు పలకడంతో మహిళా ప్రొఫెసర్ విషయంలో వీసీ వెనక్కి తగ్గి నాలుగోసారి వెలువరించిన ఆర్డర్ను బుధవారం అమలు కాకుండా నిలుపుదల చేశారు. ఈ విషయమై వీసీ ఉమేశ్కుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదని, ప్రచారం సత్యదూరమని ఖండించారు. విద్యార్థుల హాజరు విషయంలో 40 శాతం కన్నా తక్కువ ఉన్న వారిని మాత్రమే అనుమతించలేదు అని స్పష్టం చేశారు. -
‘ఉపాధి’ ముందుకా.. వెనక్కా..!
జగిత్యాలరూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు కూలీలకు100 రోజులపాటు పని చూపించి వేతనం అందిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకం పేరు మార్చి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వికాస్ భారత్ రోజ్గార్ అవాజిక మిషన్ గ్రామీణ పథకం (వీబీజీరాంజీ)గా అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానం చేసి పంపించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపించడంతో రాష్ట్రంలో అమలవుతుందా..? లేదా..? అనేది సందిగ్ధంలో పడింది. కొత్త పథకంలో 125 పనిదినాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని రా ష్ట్రాల్లో వీబీజీరాంజీ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా కూలీ లకు 125 రోజులపాటు పనిదినాలు కల్పించనుంది. పథకం రాష్ట్రంలో అమలైతే ప్రతి కూలీకి గతంలో కంటే 25 పనిదినాలు పెరగనున్నాయి. ఈ లెక్కన కూలీలకు ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. 52 లక్షల మొక్కల టార్గెట్ జిల్లాలో ఉపాధి పథకం ద్వారా 2026–27 సంవత్సరానికిగాను 385 నర్సరీల్లో 52 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యం పెట్టుకున్నారు. లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలు పెంచి వాటిని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలతో పాటు రహదారుల వెంట ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చేతినిండా పని గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పథకం అమలులోకొస్తే చేతినిండా పని దొరకనుంది. మొక్కల సంరక్షణ, గుంతలు తీయడం, కాలువల ఆధునీకరణ, రహదారుల నిర్మాణం, ఇతర పనులతో కూలీలు 125 రోజుల పాటు పని అందుకోనున్నారు. జిల్లాలో మండలాలు: 20 జాబ్కార్డులు: 1.68 లక్షలు కూలీలు: 1.39 లక్షలు గుర్తింపు పొందిన పనులు : 14 వేలు కేటాయించిన నిధులు : రూ.66.75 కోట్లు నర్సరీలు : 385 -
క్లీన్ స్వీప్ చేయాలి
● మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ● గాంధీభవన్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను క్లీన్స్వీప్ చేయాలని ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సమక్షంలో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించారు. ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. బీజేపీ ఎప్పటిలాగే మతం పేరిట రాజకీయం చేయాలని చూస్తోందన్నారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దన్నారు. నేతలందరూ పూర్తి సమన్వయంతో కష్టపడి పనిచేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, షబ్బీర్అలీ, మాజీమంత్రులు జీవన్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ నాయకుల అరెస్టు
ధర్మపురి: వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక సందర్భంగా స్థానిక సమస్యలపై బీజేపీ నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లారు. దీంతో అక్కడున్న పోలీసులు సభా వేధిక వద్దకు రానీయకుండా అడ్డుకుని అరెస్టు చేశారు. ప్రజాసమస్యలను విన్నవించడానికి వెళ్తే అరెస్టు చేయడమేంటని నాయకులు గాజు భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. సభలో షార్టు సర్యూట్ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు వచ్చే అరగంట ముందు సభా ప్రాంగనంలో ఏర్పాటు చేసిన స్పీకర్లు షార్ట్సర్క్యూట్ అయ్యాయి. పొగలు వ్యాపించడంతో సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరో స్పీకర్ను అమర్చారు. దీంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. -
లక్ష్మీపూర్ ఎఫ్పీవో పరిశీలన
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థను కొమురంభీంఆసిఫాబాద్ జిల్లాలోని 20 మండలాల రైతులు మంగళవారం సందర్శించారు. లక్ష్మీపూర్ రైతులు ఫార్మర్స్ ప్రొడ్యూషర్ ఆర్గనైజేషన్గా ఏర్పడి చేపడుతున్న అభివృద్ధి, పంట లను పరిశీలించారు. ఎఫ్పీవో చైర్మన్ పన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 750 మంది సభ్యులతో ఎఫ్పీవో నడుస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి సేకరిస్తున్నామని తెలిపారు. జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యదర్శి పెండ్లి సంపత్కుమార్, అగ్రికల్చర్ ప్రతినిధి సుధీర్, కో–ఆర్డినేటర్లు రాజు, మాధవి, సీఈఓ తిరుపతి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు ఎస్సైలు బదిలీ జగిత్యాలక్రైం: జిల్లాలోని ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ను మల్లాపూర్ ఎస్సైగా, మల్లాపూర్ ఎస్సై రాజును జగిత్యాల సీసీఎస్కు, కథలాపూర్ ఎస్సై నవీన్కుమార్ను ఇబ్రహీంపట్నం ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల పట్టణ ఎస్సై రవికిరణ్ను కథలాపూర్ ఎస్సైగా అటాచ్ చేశారు. రాయికల్ తహసీల్దార్కు మెమోరాయికల్: రాయికల్ తహసీల్దార్ నాగార్జునకు మెమో జారీ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగార్జున అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవడంపై మెమో జారీ చేస్తూ.. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి కూలీల సంఖ్య పెంచాలిజగిత్యాలరూరల్: ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. సారంగాపూర్, లచ్చక్కపేటలో ఉపాధి హామీ పనులు, నర్సరీలను పరిశీలించారు. గ్రామీణప్రాంతాల్లో కూలీలకు ఏటా 125 పనిదినాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కూలీందరూ ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకంలో నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సలీం, ఏపీవో శ్రీలత, సర్పంచులు పాల్గొన్నారు. -
కౌంటింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలి
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు కౌంటింగ్ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎస్పీ అశోక్కుమార్తో కలిసి ఎస్కేఎన్ఆర్లోని కౌంటింగ్ హాల్ను పరిశీలించారు. ఎస్పీ అశోక్కుమార్ మాట్లాడుతూ అవాంఛ నీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌ డ్, ఆర్డీవో మధుసూదన్, బల్దియా కమిషనర్ స్పందన, ప్రిన్సిపల్ అశోక్కుమార్ పాల్గొన్నారు. రైతులు మార్కెట్కు పచ్చి పసుపు తీసుకురావొద్దుఇబ్రహీంపట్నం: రైతులు పచ్చి పసుపును తీసుకురావద్దని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని డబ్బా, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. పచ్చి పసుపును మార్కెట్కు తీసుకొస్తే నష్టపోతారని తెలిపారు. ఎండిన తరువాత పాలిష్ చేసి తీసుకొస్తే వ్యాపారుల మధ్య పోటీ పెరిగి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. మార్కెట్ యార్డులో పచ్చి పసుపు విక్రయానికి అనుమతి లేదన్నారు. కార్యక్రమంలో రైతులు దేశెట్టి జీవన్, బైన నడ్పి మల్లయ్య, బుక్య బన్సి లాల్, జగన్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతులు పంటలను ఎగుమతి చేయాలి
రాయికల్: రైతులు తాము పండించిన పంటలను నేరుగా ఎగుమతి చేసుకుంటే ఆర్థికంగా వృద్ధి సాధించవచ్చని పలువురు శాస్త్రవేత్తలు అన్నారు. రాయికల్ మండలం అల్లీపూర్లో మంగళవారం వ్యవసాయ ఎగుమతులు, అవకాశాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన డెవలప్మెంట్ మేనేజర్ ఖాదర్ మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలను ఎగుమతి చేయడం ద్వారా వచ్చే ఆదా యంపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు స్వాతి, సుమలత, రవి వరి, మామిడిలో సంభవించే వ్యాధులు, నివారణ చర్యలపై వివరించారు. ఏవో ముక్తేశ్వర్, ఏఈవో సతీశ్, సర్పంచ్ ఎంబారి గౌతమి, ఉపసర్పంచ్ వినయ్ పాల్గొన్నారు. -
వైద్యసేవలన్నీ అందుబాటులోకి..
జగిత్యాల: జిల్లాలో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. రూ.235 కోట్లతో నిర్మించనున్న 450 పడకల ఆస్పత్రి భవనానికి సోమవారం శంకుస్థాపన చేశారు. క్రిటికల్ కేర్, మెడిసిన్ స్టోర్ సెంటర్ను ప్రారంభించారు. రూ.23.5 కోట్లతో క్రిటికల్ కేర్, రూ.3 కోట్లతో మెడిసిన్ స్టోర్ ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి క్రిటికల్ కేర్లో అత్యవసర వైద్యసేవలు అందుతాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహ సహకారంతో సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రానున్న బడ్జెట్లో ప్రత్యేక మెడికల్ బిల్లు పెట్టేలా కృషి చేస్తామన్నారు. వైద్యశాలకు కావాల్సిన డాక్టర్లు, సౌకర్యాలు, పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం వైద్యులకే ఉంటుందని, పేదలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ 450 పడకల ఆస్పత్రి, క్రిటికల్ కేర్ ప్రారంభించండం అభినందనీయమన్నారు. గుండె, నరాలు, ప్లాస్టిక్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో లభ్యమవుతుందన్నారు. జగిత్యాలకు అంబులెన్స్, ఎంఆర్ఐ స్కాన్, వైద్య విద్యార్థులకు మూడు బస్సులు ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సునీల్కుమార్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వృద్ధులకు అండగా ఉంటాం వయోవృద్ధులకు అండగా ఉంటామని మంత్రి అడ్లూరి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణమ్డేకేర్ సెంటర్ను ప్రారంభించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, నరేశ్, రాజ్కుమార్, నాగభూషణం, జ్యోతి పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సెకెండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ సెకెండ్ ఏఎన్ఎంల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మధురిమ మంత్రికి వినతిపత్రం అందించారు. నాయకులు రజితబాయి, శారద, రజిత, సౌజన్య, యమున, సరోజ, శిరీష, శైలజ, జయప్రద, జ్యోతి, ఉజ్వల, స్రవంతి, మహేశ్వరి, మధులత పాల్గొన్నారు. -
మున్సిపల్ స్టార్స్
● మున్సిపల్ నుంచి చట్టసభలకు ప్రస్థానం ● శాసనసభలో అడుగిడిన గంగుల, సోమారపు, కోరుకంటి ● కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగిన బండి సంజయ్సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వం రేపోమాపో అధికారికంగా నోటిఫికేషన్ జారీ కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. వీరిలో సీనియర్లతో పాటు యువ నాయకులున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒకప్పుడు కౌన్సిలర్గా, కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పలువురు నేడు ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులుగా ఎదిగిన తీరు తోటి రాజకీయ సహచరులకు, రాబోయేతరానికి స్ఫూర్తి నింపింది. పాత జిల్లాలో అనేక మంది స్థానిక సంస్థల నుంచి పోటీ చేసి శాసనసభ, పార్లమెంటు ఉభయ సభల్లో అడుగు పెట్టారు. అలాంటి వారిలో సీనియర్ రాజకీయ నాయకులతోపాటు ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై కథనం. -
మహిళా ఓటర్లే కీలకం
జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మహిళల ఓట్లే అత్యధికంగా ఉన్నాయి. గెలుపోటముల్లో వీరి ప్రభావమే అత్యధికంగా ఉంటుంది. ఏ బల్దియాలో చూసినా సుమారు మూడు వేల నుంచి నాలుగువేల మంది ఎక్కువగా మహిళలే ఓటర్లుగా ఉన్నారు. దీంతో అన్ని పార్టీల నాయకులు వారిని తమవైపు తిప్పుకొనేందుకు ఇప్పటినుంచే ప్రయతాలు ప్రారంభించారు. ఈ సారి మహిళలకు రిజర్వేషన్ సగం మేర కేటాయించడంతో కొందరు నాయకులు కలిసివచ్చే స్థానాల్లో వారి సతులనే బరిలోకి దింపుతున్నారు. ఎలాగైనా మహిళల ఓట్లను ఆకర్షించేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఓటర్ తుది జాబితా విడుదల కావడం.. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇక కచ్చితంగా పోటీలో నిలబడే వ్యక్తులు వార్డుల్లో ప్రచారం మొదలు పెట్టారు. పార్టీలను పక్కకు పెట్టి ఎక్కువగా సొంత ప్రచారమే చేపడుతున్నారు. టికెట్లు వస్తాయో లేవో.. రాని రాకపోని.. అన్న ఉద్దేశంతో పోటీకై తే నిలబడాలనే ఉద్దేశంతో ప్రచారం మొదలుపెట్టారు. అవ్వ.. అన్న.. తమను ఆశీర్వదించాలి అని.. తమకే ఓటు వేయాలంటూ ముందుకెళ్తున్నారు. రిజర్వేషన్లు ఖరారుకావడంతో ఆశావహులంతా గల్లీగల్లీన తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలుకరిస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. నోటిఫికేషన్ వచ్చిన అనంతరమే టికెట్లు ప్రకటించనున్న నేపథ్యంలో అభ్యర్థిగానే ప్రచారం చేసుకుంటున్నారు. వార్డుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలసమస్యలతోపాటు, ఏ సమస్యనైనా పరిష్కరిస్తామంటున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు స్పష్టంగా రావడంతో ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా రంగంలోకి దిగేందుకు ప్రలోభాలకు సిద్ధమవుతున్నారు. సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. సొంత ఖర్చులతో.. కాలనీల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. ప్రతి కాలనీల్లో తిరుగుతూ అవ్వ.. అక్క.. చెల్లె అంటూ పలుకరిస్తున్నారు. ఫలితంగా కాలనీల్లో అప్పుడే సందడి మొదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థులు పార్టీలకు సంబంధం లేకుండానే ప్రచారమైతే చేపడుతున్నారు. టికెట్లు వచ్చినా రాకున్నా పోటీలో ఉంటామని పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలు అభ్యర్థులపై ఇప్పటికే సర్వే చేయించినట్లు తెలిసింది. అభ్యర్థి వార్డులో మంచి పేరు కలిగి ఉండటంతో పాటు, ఆర్థికంగా కలిగిన వారికే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. మహిళా సంఘాలను పలుకరిస్తూ.. ఐదు మున్సిపాలిటీల్లో పోటీలో ఉన్న ఆశావహులు మహిళ ఓట్లు సాధించాలన్న ఉద్దేశంతో మహిళాసంఘాలను కలుస్తూ వారికి కావాల్సిన పనులు చేస్తూ ముందుకెళ్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సతులతో ప్రచారం చేయిస్తూ.. వారితోనైనా మహిళ ఓట్లు పడతాయని ఆశిస్తున్నారు. మహిళ సంఘాలు గంపగుత్తగా ఓట్లు పడే అవకాశం ఉండటంతో ఆ గ్రూపులో ఉన్న సభ్యులందరినీ కలుస్తున్నారు. మహిళాసంఘాలకు కావాల్సిన రుణా లు, ఇతరత్రా పనులు చేసి పెడుతున్నారు. కొన్ని వార్డుల్లో మహిళాసంఘాల్లో ఉన్న వారే పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. బల్దియా మొత్తంఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు జగిత్యాల 96,411 46,794 49,596 21 కోరుట్ల 63,741 30,709 33,030 2 మెట్పల్లి 46,371 22,360 24,010 1 ధర్మపురి 14,222 6,826 7,393 3 రాయికల్ 13,195 6,209 6,986 0 మొత్తం 2,33,940 1,12,898 1,21,015 27 -
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
జగిత్యాల: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో 938 మహిళా సంఘాలకు రూ.2,98,40,444 రుణాలు పంపిణీ చేశారు. బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్బంక్లు, అద్దె బస్సులు, ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. స్వయం ఉపాధి అవకాశం కల్పించడం, చిరువ్యాపారాలు, కుటీర పరిశ్రమల ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ వడ్డీలేని రుణాలతో మహిళలు స్వశక్తితో ఎదిగి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగవచ్చన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు. -
పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి..
జగిత్యాల: పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాలలో రూ.235 కోట్లతో 450 పడకల ఆస్పత్రికి మంత్రి లక్ష్మణ్కుమార్ మంగళవారం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పరిశీలించారు. రూ.23.5 కోట్లతో క్రిటికెల్ కేర్, రూ.3 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నిర్మించారు. డయాలసిస్, ఆపరేషన్ థియేటర్లు, ప్రసూతి శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చాయన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సునీల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఈఈ విశ్వప్రసాద్, డీఈ రాజిరెడ్డి, ఆర్ఎంవోలు శ్రీపత్, నరేశ్, గీతిక, స్వరూప, సందీప్ రావు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీజగిత్యాలరూరల్: బీర్పూర్ మండలకేంద్రంలోని రైతువేదికలో అదే మండలానికి చెందిన 30 మందికి కల్యాణలక్ష్మీ కింద మంజూరైన రూ.30.3 లక్షల విలువైన చెక్కులు, ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నాయకులు ముప్పాల రాంచందర్రావు, సర్పంచులు రాజ్గోపాల్రావు పాల్గొన్నారు. అనంతరం మోతె పార్టీ కార్యాలయంలో 134 మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికవెల్గటూర్: ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన జైనపురం త్రిష జాతీయస్థా యి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ సాయికిరణ్ తెలిపారు. ధర్మారం మోడల్స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న త్రిష.. నవంబర్లో నారాయణపేట జిల్లాలో జరిగిన 69వ ఎస్జీఎఫ్ పోటీల్లో అండర్–17 విభాగంలో ప్రతిభ కనబరిచింది. ఈనెల 19 నుంచి 23 వరకు గుజరాత్లోని సోమనాథ్లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. త్రిషను హ్యాండ్బాల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్, జెట్టిపల్లి అశోక్, సర్పంచ్ గొల్లపల్లి మల్లేశం, ఉప సర్పంచ్ జయవ్వ తదితరులు అభినందించారు. వడ్డీలేని రుణాల పంపిణీ పూర్తి చేయాలిజగిత్యాల: వడ్డీలేని రుణాలను పంపిణీ పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం కలెక్టర్లతో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పట్టణప్రాంతాల్లో వడ్డీలేని రుణాలు పూర్తి చేయాలని, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటిల్లో వడ్డీలేని రుణాలు పంపిణీ పూర్తయ్యిందన్నారు. అర్హులందరికీ చీరలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పాల్గొన్నారు. -
ఒకే రోజు నలుగురు మృతి
చందుర్తి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం వివిధ కారణాలతో నలుగురు మృతిచెందారు. మండల కేంద్రానికి చెందిన మర్రి మల్లేశం గ్రామంలోనే ఎయిర్ కంప్రెషర్ నడుపుతూ జీవించేవారు. పదిహేను రోజుల క్రితం బీపీ, షుగరు లెవల్స్ పెరిగాయి. కరీంనగర్లో వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని అక్కడి నుంచి హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రూ.లక్షలు ఖర్చు పెట్టిన ఆరోగ్యం కుదటపడకం పోవడంతోపాటు మృతిచెందాడు. మరో రెండు గంటల వ్యవధిలోనే అదే గ్రామానికి చెందిన బుర్ర లక్ష్మీదేవి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటన జరిగిన మూడు గంటల వ్యవధిలోనే అదే గ్రామానికి చెందిన ఏనుగు రాజయ్య పక్షవాతం వ్యాధి తగ్గకపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వేములవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. రాజయ్య భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై రమేశ్ తెలిపారు. మరొకరు చిలుక భాస్కర్(72) అనారోగ్యంతో రాత్రి చనిపోయాడు. -
కాంగ్రెస్ జెండా మోసినోళ్లకే టికెట్లు, బీ ఫాంలు
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ బీ ఫాంలు ఇవ్వడానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎవరని, అభివృద్ధి, సంక్షేమం కోసం సహకరిస్తామంటే ఆహ్వానిస్తామని, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటానంటే సహించేది లేదని మాజీమంత్రి జీవన్రెడ్డి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని ఎల్ఎల్ గార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ఏ పార్టీలో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యే సంజయ్ రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు టికెట్ కోసం దరఖాస్తులంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీ ఫాం ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎవరని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో సీఎంను కలవడం సహజమని, తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి సీఎంను కలిశానని గుర్తు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల హక్కులను కాపాడటం తన బాధ్యత అని, పదేళ్లపాటు పార్టీ జెండా మోసినోల్లకే టికెట్ దక్కేలా చూస్తానని భరోసా ఇచ్చారు. తాను ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లలేదని, ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్టక్షన్ కంపెనీకి సింగిల్ టెండర్తో పనులు ఇవ్వడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. రెండేళ్లు గడుస్తున్నా సమీకృత మార్కెట్ను పూర్తి చేయకపోవడమేనా అభివృద్ధి అంటే అని నిలదీశారు. యావర్రోడ్డు విస్తరణ పనులు అడ్డుకుంటున్నదే ఎమ్మెల్యే అని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలన్నదే తన డిమాండ్ అని స్పష్టం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో అన్ని స్థానాలూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, బింగి రవి, ధర రమేశ్, గుంటి జగదీశ్వర్, మహ్మద్ భారీ, బొల్లి శేఖర్, నక్క జీవన్, రియాజ్ పాల్గొన్నారు. -
నకిలీ ఎరువులు ఇచ్చారని ఆందోళన
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆరుగాలం కష్టపడి నాటువేసిన వరిపంటలో ఎదుగుదల లేదని.. నకిలీ ఎరువులతోనే పంటను నష్టపోతున్నామని ఆరోపిస్తూ ఫర్టిలైజర్ దుకాణం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్లో శ్రీలక్ష్మీ ఫర్టిలైజర్ ఎదుట కొండాపూర్, ఆవునూర్ రైతులు సోమవారం ధర్నా చేశారు. రైతులు మాట్లాడుతూ నలభై రోజుల క్రితం 200లకు పైగా దుక్కి బస్తాలను కొనుగోలు చేశామన్నారు. వరినాటుకు ముందు పొలంలో దుక్కి చల్లామని, నెలరోజులైనా వరి ఎదుగలేదని రాకేశ్రెడ్డి, నిమ్మ రాజిరెడ్డి, దేవిరెడ్డి, భాస్కర్రెడ్డి, రాజు, కిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బస్తాను రూ.1350కి కొనుగోలు చేశామన్నారు. తమ రెక్కల కష్టం పోయిందని, పంటనష్టంతో ఎకరానికి రూ.50వేల నష్టం జరిగిందన్నారు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మండల వ్యవసాయాధికారి అనూష, ఎస్సై గణేశ్ ఆవునూర్ చేరుకుని రైతులను శాంతింపజేశారు. నాసిరకం ఎరువులు అమ్మడంతోనే తమకు నష్టం జరిగిందని రైతులు తెలిపారు. ఎరువును ల్యాబ్కు పంపించి పరీక్షిస్తామని, నకిలీ అని తేలితే చర్యలు తీసుకుంటామని ఏవో హామీ ఇచ్చారు. రైతుల ఆందోళనతో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం ఆవునూర్లో విచారణ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తామని చెప్పారు. కాగా ఫర్టిలైజర్ దుకాణం డీలర్ ఒక్కో రైతుకు రూ.800 చొప్పున చెల్లించడంతో రైతులు వెనుదిరిగారు. ఆవునూర్లో విచారణ చేపట్టిన అధికారులు షాప్లో విక్రయాలు నిలిపివేయాలని ఆదేశం -
గ్రామాల్లో ఆదర్శ పాలన అందించాలి
జగిత్యాలరూరల్: గ్రామాల్లో ఆదర్శ పాలన అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సర్పంచులకు సూచించారు. సర్పంచుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నూకపల్లిలోని న్యాక్ సెంటర్లో సోమవారం ప్రారంభించారు. ఐదేళ్లలో గ్రామాల్లో సొంత మార్క్ ఉండేలా.. పేరు చిరస్థాయిగా నిలిచేలా పనిచేయాలన్నారు. పాలనలో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, పన్నులతో గ్రామానికి అవసరమైన పనులు చేయాలని సూచించారు. పన్నుల వసూలు, ఇతర ఆదాయ మార్గాలు, బడ్జెట్ రూప కల్పన, పాలన వ్యవహారాలు, పారిశుధ్య నిర్వహణ, గ్రీన్బడ్జెట్ అంశాలపై శిక్షణ తీసుకోవాలన్నారు. ఉపాధి హామీలో మార్పులను గమనించాలని, నూతన నిర్మాణాలు, లేఔట్లకు అనుమతుల మంజూరుకు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు తప్పనిసరిగా ఎంబీ రికార్డు నమోదు చేయాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం సర్పంచులు 14 రకాల రిజిస్టర్లు, గ్రామసభలు నిర్వహించాలని, అన్నిరకాల నిబంధనలు పాటించాలని వివరించారు. నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, క్రీడామైదానాలనుఉపయోగంలోకి తేవాలన్నారు. కార్యక్రఓమంలో డీపీవో మదన్ మోహన్, డిప్యూటీ సీవో నరేశ్, శిక్షణ డీపీవో రేవంత్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, టీవోటీలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కాపర్ చోరీ కేసులో ఒకరి అరెస్ట్
● 100 కిలోల రాగితీగ స్వాధీనం ● ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్ జ్యోతినగర్(రామగుండం): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్వైర్ చోరీ చేస్తున్న కేసులో గుర్రాల చంటిని ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్ అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అరెస్ట్ వివరాలను ఎస్సై వెల్లడించారు. ఎన్టీపీసీ, అంతర్గాం, కమాన్పూర్, గోదావరిఖని టూ టౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తున్న ఘటనలపై తాము విచారణ చేపట్టామని అన్నారు. ఈమేరకు సంజయ్గాంధీ నగర్కు చెందిన పాత నేరస్తుడు గుర్రాల చంటిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా 10 కేసుల్లో నిందితుడిగా తేలిందని వివరించారు. నిందితుడి నుంచి 100 కేజీల రాగితీగ స్వాధీనం చేసుకున్నామని తెలిపార. చంటిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. కేసు ఛేదించడంలో ముఖ్యపాత్ర పోషించిన కానిస్టేబుళ్లు జగ్గు శ్రీను, అంజి, రమేశ్ను ఎస్సై అభినందించారు. ఏకాగ్రతతో బస్సులు నడపాలి జగిత్యాలటౌన్: ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తే చాలావరకు ప్రమాదాలు నివారించవచ్చునని జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్ కల్పన అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం జగిత్యాల డిపోలో సురక్షిత ప్రయాణంపై ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బందికి అవగాహన కల్పించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, చిన్న నిర్లక్ష్యం కుటుంబాలను రోడ్డున పడేస్తుందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్ చేసిన సిబ్బందిని అభినందించారు. ఎంవీఐ ప్రమీల, వెంకన్న, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎంపైనే ఆశలు
ధర్మపురి: పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో కోట్లాది నిధులతో ప్రారంభించిన పలు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ పనులకు మోక్షం మాత్రం కలగడం లేదు. ఈనెల 21న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనుండడంతో పనులకు మోక్షం కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురికి దక్షిణకాశీగా పేరుంది. ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో చాలావరకు పూర్తయినప్పటికీ ఉపయోగంలోకి రాకుండా పోయాయి. ఈనెల 21న ఉపముఖ్యమంత్రి రాక.. ధర్మపురి పుణ్యక్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రానున్నందను ఈ సమస్యలన్నిటినీ ఆయనకు వివరిచేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సిద్ధమవుతున్నారు. అలాగే మంత్రి చొరవతో కోట్లాది నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. మండలంలోని తుమ్మెనాల గ్రామ సమీపంలో రూ.200 కోట్లతో చేపట్టనున్న యంగ్ ఇంటిగ్రేటెడ్ నిర్మాణం, గోదావరిలో మురుగునీరు కలకుండా రూ.17కోట్లతో సీనరేజ్ ప్లాంటు ఏర్పాటు వంటి పనులు ఉన్నాయి. అధ్వానంగా గోదావరి ప్రధాన మార్గం ధర్మపురిలో నిరుపయోగంగా మాతాశిశు ఆస్పత్రి -
సాక్షి సంతకం పెట్టినందుకు..
మాది బీర్పూర్ మండలకేంద్రం. ఓ భూమి విక్రయం సందర్భంగా రిజిస్ట్రేషన్లో సాక్షి సంతకం పెట్టినందుకు 2024 మార్చిలో పది మంది ఇంట్లోకి చొరబడి నాతోపాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. చుట్టుపక్కల వారు వచ్చి అడ్డుకోవడంతో వెళ్లిపోయారు. గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశాను. అలాగే 2024 మే 26న బీర్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అదే నెల 28న నాపై దాడికి పాల్పడ్డారు. నా కొడుకును కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. చంపుతామని బెదిరిస్తున్న వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని మూడేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. – సాతర్ల వెంకటి, బీర్పూర్ ప్రభుత్వ భూమి కబ్జా.. కొడిమ్యాల మండలకేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయం సమీపంలో సర్వేనంబర్ 903లోని 6గుంటల ప్రభుత్వ భూమిని తప్పుడు సర్వేనంబర్ 874తో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సృష్టించి ఓ వ్యక్తి కబ్జా చేశాడు. విషయమై విచారణ జరిపి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడండి. తప్పుడు రిజిస్ట్రేషన్తో ప్రభుత్వ భూమి కాజేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి. సీహెచ్.సురేశ్, కొడిమ్యాల -
ఇటుకబట్టీతో పంట నష్టపోతున్నాం
మేం మల్యాల మండలం పోతారం, గొల్లపల్లె రైతులం. రాజారం శివారులో వ్యవసాయం చేసుకుంటున్నాం. పొలాల పక్కన మూడెకరాల మే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కొందరు ఇటుకబట్టీ నిర్వహిస్తున్నారు. ఒర్రె నుంచి నీరు వెళ్లే అవకాశం లేక పొలాల్లోనే నిలిచిపోతుంది. బూడిద, కాలుష్యంతో పంటలు పండటం లేదు. పర్యావరణానికి ముప్పుగా మారిన బట్టీని తొలగించండి. ఒర్రె తిరిగి పారేలా చర్యలు తీసుకోండి. – పోతారం, గొల్లపల్లి రైతులు వార్డు రిజర్వేషన్లు సవరించండి మాది మెట్పల్లి. వార్డుల రిజర్వేషన్లలో రొటేషన్, జనాభా ప్రాతిపదికన చేపట్టలేదు. ఎస్సీ కులస్తులకు అన్యాయం జరిగింది. పొరపాట్లను సరిచేయండి. ఎన్నికల నోటిఫికేషన్కు ఇంకా సమయం ఉన్నందున రొటేషన్, జనాభా ప్రాతిపదికన శాసీ్త్రయ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించి ఎస్సీ సామాజికవర్గానికి న్యాయం చేయండి. – ఏ పురుషోత్తం, మాజీ కౌన్సిలర్, మెట్పల్లి


