breaking news
Jagitial District Latest News
-
బెంచీలు కూడా లేవు
గురుకులంలో గదుల కొరత ఉండడంతో నేలపైనే చదువుకుంటున్నాం. బెంచీలు 7, 9వ తరగతుల్లోనే ఉన్నాయి. విద్యార్థులు ఉదయం బెంచీలు వేయడం.. సాయంత్రం పడుకునే సమయంలో బెంచీలు తీస్తున్నాం. పాములు, తేళ్లతో భయపడుతున్నాం. – మనోహర్, 9వ తరగతి పాఠశాల ప్రారంభం నుంచే సమస్యలు గురుకులం పాఠశాల ఏర్పడినప్పటి నుంచి తరగతి గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రధాన సమస్య. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తరగతి గదుల కొరత మినహాయించి భోజనం, చదువు విషయంలో మాత్రం సమస్య లేదు. – స్వప్న, ప్రిన్సిపాల్ చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులు -
మహాత్మా మన్నించు..!
రాయికల్: నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబా పూలే గురుకులంలో సమస్యలు తాండవిస్తున్నాయి. రాయికల్ మండలం అల్లీపూర్లోని పాఠశాలలో 5 నుంచి 10వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో 335 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పిల్లలందరూ ఒకే రూమ్లో చదువుకోవడం.. అదే రూమ్లో పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉన్నా.. 11 గదులు మాత్రమే ఉన్నాయి. ఎవరైనా జ్వరం బారిన పడినా.. వారికి వేరే గది సౌకర్యం లేక అదే గదిలో ఓ మూలన పడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యల తాండవం -
త్యాగాల స్ఫూర్తి.. పోరాటాల ఘనకీర్తి
జగిత్యాల: నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది.. ప్రజాస్వామ్య భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన చారిత్రాత్మక రోజు సెప్టెంబర్ 17 అని మైనార్టీ వెల్ఫేర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి చేరవేయడమే అందరి బాధ్యత అన్నారు. ప్రజాప్రభుత్వంలో సంక్షేమం, మహిళ సాధికారత, విద్య, వైద్యం, ఉపాధి సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పురాతన ఆలయాల అభివృద్ధిలో భాగంగా ధర్మపురిలోని ఉగ్రనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. 3,53,682 మందికి స్మార్ట్ రేషన్కార్డులు అందించామని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు 2,14,076 మందికి ప్రతినెలా సుమారు రూ.46.26 కోట్ల పెన్షన్ అందిస్తున్నామన్నారు. కొత్త పింఛన్ల 15,432 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.285.68 కోట్ల వడ్డీలేని రుణాలు అందించామన్నారు. సీ్త్రనిధి ద్వారా రూ.27.30 కోట్లు ఇచ్చామన్నారు. జిల్లాలోని 380 గ్రామపంచాయతీల్లోని నర్సరీల్లో 52 లక్షల మొక్కలు పెంచుతున్నామని, ఇప్పటివరకు 8.66 లక్షల మొక్కలు నాటించామని వెల్లడించారు. మహాలక్ష్మీ పథకం కింద ఇప్పటివరకు 77.72 కోట్ల మంది మహిళలు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. 14,10,844 గ్యాస్ సిలిండర్లను రూ.500కే సరఫరా చేశామన్నారు. 200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 18,310 వీధివ్యాపారులను గుర్తించి 13,202 మందికి బ్యాంకుల ద్వారా రూ.36 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. 1,065 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 1186 మంది గర్భిణులు, బాలింతలు, 29,587 చిన్నారులు, 13,123 మంది పిల్లలకు పోషకాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 2,522 ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయని, లబ్ధిదారులకు రూ.246.93కోట్లు చెల్లించామని తెలిపారు. వివిధ కారణాలతో మరణించిన 5707 మంది కుటుంబాలకు రూ.285 కోట్లు చేయూత అందించామన్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసి రూ.200 కోట్లు మంజూరు చేశామన్నారు. మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట.. మైనార్టీ సంక్షేమం ద్వారా మైనార్టీ మహిళలకు 598 కుట్టుమిషన్లు అందించామన్నారు. 150 మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్, 15 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షలు, ఇందిరమ్మ మైనార్టీ యోజన కింద 76 మందికి రూ.38 లక్షలు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 102 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 6 బస్తీ దవాఖానాలు, 17 పీహెచ్సీలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 3 సీహెచ్సీలు, మాత శిశు కేంద్రం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ద్వారా సేవలు అందుతున్నాయన్నారు. ఎస్ఎఫ్సీ నిధుల నుంచి పారిశుధ్య కార్మికులు, 385 గ్రామాల సర్పంచులకు ప్రతినెలా ఒకటిన గౌరవ వేతనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 1,08,566 మంది నిర్మాణ కార్మికులు నమోదు చేసుకోగా.. వివిధ పథకాల ద్వారా 16,659 కార్మికులకు రూ.62.04 కోట్ల ప్రయోజనం కల్పించామన్నారు. నక్ష లేని 20 గ్రామాలను ఎంపిక చేసి సర్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వందశాతం సబ్సిడీపై 763 చెరువుల్లో 1.69 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటిలో అభివృద్ధి పనులు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జ రుగుతున్నాయని మంత్రి వివరించారు. ఆర్థిక సంఘం నుంచి రూ.13.20 కోట్లు మంజూరు కాగా.. పారిశుధ్య వాహనాల కొనుగోలు, ఎస్డబ్ల్యూఎం నీ టి సరఫరా పనులు చేపట్టామన్నారు. అమృత్ 2.0 కింద రూ.38.48 కోట్లు మంజూరు కాగా.. పనులు జరుగుతున్నాయన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎస్పీ అశోక్కుమార్, అ డిషనల్ కలెక్టర్లు రాజాగౌడ్, లత, ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ రాంమోహన్, ఏవో కి షన్, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు బండ శంకర్, సతీశ్, ప్రశాంత్, బాలముకుందం, రాజ్కుమార్ పాల్గొన్నారు. ముందుగా మంత్రికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి స్వాగతం పలికారు. -
కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం
జగిత్యాలరూరల్/జగిత్యాల టౌన్: కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్దేనన్నారు. సారంగాపూర్ మండలం మ్యాడారంతండా, ధర్మనాయక్తండాల్లో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పాల్గొన్నారు. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు ఇవ్వలేదని పేర్కొన్నారు. యూరియా, విద్యుత్ కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన రెసిడెన్షియల్ స్కూళ్లను రద్దు చేసి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. సర్పంచులు భారతి, సంతోష్, ఆకుల రమేష్, భాస్కర్ నాయక్, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణకు విముక్తి కలిగించిన ఘనత కేసీఆర్దే ఆంధ్ర నాయకుల కబంధహస్తాల నుండి తెలంగాణకు విముక్తి కలిగించిన ఘనత కేసీఆర్దేనని జీవన్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్లో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పదవులను త్యాగం చేసి, ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రగతి పథంలో జిల్లా
జగిత్యాల: జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వైద్యం, విద్య అన్ని రంగాల్లో అందరి సమన్వయంతో ముందుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి పాల్గొన్నారు. జాతి సమైక్యతతో ముందుకు సాగాలిజగిత్యాలక్రైం: జాతి సమైక్యతతో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు పురుషోత్తంరెడ్డి, రాములు, ఏవో శ్రీనివాస్, సీఐలు ఆరీఫ్అలీఖాన్, సుధాకర్, కరుణాకర్, రాజ్కుమార్, లక్ష్మీనారాయణ, ఆర్ఐలు వేణు, ఎస్సైలు పాల్గొన్నారు. రైస్ మిల్లులో సివిల్ సప్లై తనిఖీలుకోరుట్ల: కోరుట్లలోని యెఖీన్పూర్ పరిధిలోగల శ్రీసాయి రైస్మిల్లును సివిల్ సప్లై అధికారులు తనిఖీ చేసినట్లు సమాచారం. తనిఖీల్లో సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.9 కోట్ల ధాన్యం స్టాక్లో తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెల్సింది. ఈ విషయమై సివిల్ సప్లై అధికారులను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా స్పందించలేదు. -
సాంకేతిక పరిజ్ఞానం అవసరం
కోరుట్ల: పోటీ ప్రపంచంలో విద్యతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, సృజనాత్మకత అవసరమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కోరుట్ల, మెట్పల్లి డిగ్రీ కళాశాలల విద్యార్థులు గురువారం హైదరాబాద్లోని టీహబ్ను సందర్శించారు. టీ హబ్లో స్టార్టప్ సంస్థలకు అందిస్తున్న మెంటరింగ్, మార్గదర్శకత్వం, వ్యాపార అభివృద్ధి వంటి అంశాలను విద్యార్థులు తెలుసుకున్నారు. టీ వర్క్స్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ఫొటో టైపింగ్, డిజైన్, ఉత్పత్తుల తయారీ ప్రక్రియ పరి శీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువు తర్వాత ఉద్యోగం సాధించడంతోపాటు ఆలోచనలు ఆవిష్కరణగా మార్చుకోవాలని ఆకాంక్షించారు. సేవా సంకల్ప అభియాన్ విజయవంతం చేయాలిమెట్పల్లి: ప్రధాని మోదీ సుపరిపాలనను పురస్కరించుకుని అక్టోబర్ 17వరకు నిర్వహించే సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీకోదండ రామాలయంలో గురువారం సేవా సంకల్ప ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అంతకుముందు ఉదయం పాత బస్టాండ్ వద్ద తెలంగాణ విమోచన వేడుక నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు దొనికెల నవీన్, నాయకులు పాల్గొన్నారు. -
రక్తదానం మహాదానం
జగిత్యాల: రక్తదానం గొప్పదని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. స్వర్ణకార సంఘం వార్షికోత్సవం సందర్భంగా విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సంఘం కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. 75 సార్లు రక్తదానం చేసిన రవి అనే వ్యక్తిని సత్కరించారు. ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలిరాయికల్: ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, జీవో నంబరు 25ను సవరించాలని, పాతపెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్గౌడ్, నాయకులు ఆంజనేయులు, పుర్రె శ్రీనివాస్, రాజిరెడ్డి, రవీందర్, గంగరాజం పాల్గొన్నారు. -
ఆటల వేదికపై అదరహో..
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడి యం గురువారం సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. జిల్లా పాఠశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14 బాలి కల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. గెలు పే లక్ష్యంగా మైదానంలోకి దిగిన బాలికలు ముందస్తుగా ఎక్సర్సైజ్లు చేస్తూ మ్యాచ్కు సిద్ధమయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే పీఈ టీలు, పీడీలు క్రీడాకారిణులకు సూచనలిస్తూ.. వ్యూహాలను వివరిస్తూ కనిపించారు. కబడ్డీ కోర్టులో ప్రత్యర్థి జట్టు రైడర్ను బోల్తా కొట్టిస్తూ బాలికలు చేసిన టాకిల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచాయి. మ్యాచ్ ఆడేటప్పుడు ఆభరణాలు పెట్టుకోకూడదని ఆంపైర్లు స్పష్టం చేయడంతో.. ఒక క్రీడాకారిణి కాలి పట్టీలను తోటి క్రీడాకారిణి సహాయంతో తీసి నిబంధనలను గౌరవించింది. అటు వాలీబాల్ కోర్టులో బంతిని ప్రత్యర్థి కోర్టులోకి పంపేందుకు బాలికలు అద్భుతమైన సర్వీస్లతో పాయింట్ల వర్షం కురిపించారు. భానుడి ప్రతాపానికి మైదానం వేడెక్కినా బాలికల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. కొందరు గొడుగుల ఆసరా తీసుకోగా.. మరికొందరు మైదానంలోనే నీళ్లు తాగుతూ సేదతీరారు. -
మృతదేహం గుర్తింపు
రామగుండం: రైల్వేస్టేషన్ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట డ్రైనేజీలో రైల్వే పోలీసులు గుర్తించిన మృతదేహం రైల్వేస్టేషన్ ఏరియా శివాజీనగర్ కాలనీకి చెందిన గుంజపడుగు శ్యాం(35)గా గుర్తించినట్లు జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి తెలిపారు. మృతదేహానికి గురువారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మూడేళ్లలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి శివాజీనగర్లో నివాసముండే గుంజపడుగు నారాయణ–రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు శంకర్, శ్యాం. నారాయణ కుటుంబపోషణ నిమిత్తం సింగరేణి కాంట్రాక్టర్ వద్ద క్రేన్ ఆపరేటర్గా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తుంటాడు. ఈనేపథ్యంలో పెద్ద కుమారుడు శంకర్ స్థానికంగా సెలూన్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండగా 2023 సెప్టెంబర్లో రాజీవ్ రహదారిపై నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో మద్యం మత్తులో డివైడర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి భార్య అనూష, రవితేజ, విశ్వతేజ కుమారులున్నారు. ఆ తర్వాత ఏడాదిన్నర వ్యవధిలోనే 2025 జనవరిలో నారాయణ భార్య రాజేశ్వరి క్యాన్సర్తో కన్నుమూసింది. చిన్న కుమారుడు శ్యాం(35) నాలుగు రోజుల క్రితం తన బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో భాగ్యనగర్ రైలు ఎక్కి రామగుండం వస్తున్న క్రమంలో రైల్వేస్టేషన్ దాటిపోయిన తర్వాత రైలు నుంచి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్ పక్కనున్న డ్రైనేజీలో పడి మృతిచెందగా మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మూడేళ్ల వ్యవధిలో తన కళ్ల ముందే ఇద్దరు కుమారులు, భార్య ఏకంగా ముగ్గురు కుటుంబసభ్యులను కోల్పోవడంతో గుంజపడుగు నారాయణ ఒంటరి వాడయ్యాడు. . కాగా నారాయణ దుస్థితిని చూస్తూ కాలనీవాసులు కంటతడి పెడుతున్నారు. -
కన్నవాడే కడతేర్చాడు
● వేధింపులు భరించలేక కొడుకును హత్య చేసిన తండ్రి ● జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెరకాలనీలో విషాదంజగిత్యాలక్రైం: కని.. పెంచిన తల్లిదండ్రులను పెళ్లీడుకొచ్చిన కొడుకు నిత్యం వేధింపులకు గురిచేయడంతో భరించలేక కన్న తండ్రే తన కొడుకును కడతేర్చిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెరకాలనీలో చోటుచేసుకుంది. ఒడ్డెరకాలనీకి చెందిన సూర రాజయ్య, చిలుకమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సూర వెంకటేశ్ (22) చదువు మానేసి జులాయిగా తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇటీవల అతిగా మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం కూడా తండ్రిని వేధించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజయ్య గొడ్డలితో కొడుకు తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ను అంబులెన్స్లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రూరల్ సీఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వేధింపులు భరించలేకే కొడుకును తండ్రి హత్య చేయడంతో ఒడ్డెరకాలనీలో విషాదం చోటుచేసుకుంది. -
కాగితాల్లోనే ప్రత్యామ్నాయ ఘాట్రోడ్డు
కొండగట్టు అంజన్న భక్తులకు భద్రత కరువు ● ఐదేళ్ల క్రితం రూ.100 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు ● అడుగు ముందుకు పడని వైనం మల్యాల: కొండగట్టు ఘాట్రోడ్డుపై సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్లిన బస్సు ఎనిమిదేళ్ల క్రితం బోల్తాపడి 61మంది మృతి చెందిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే ప్రత్యామ్నాయ ఘాట్రోడ్డు నిర్మాణం తెరపైకి వచ్చింది. మెట్లదారి వెంట ప్రత్యామ్నాయ ఘాట్రోడ్డు ఏర్పాటుకు ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు చేసినా.. నేటికీ అడుగు ముందుకు పడడం లేదు. మండలంలోని ముత్యంపేట శివారు కొండగట్టు ఘాట్రోడ్డు ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాదిమంది భక్తులు వాహనాల్లో శ్రీఆంజనేయస్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. బస్సు ప్రమాదం జరిగిన అనంతరం మూల మలుపుతోపాటు మరో రెండుచోట్ల కేవలం సేఫ్టీవాల్ ఏర్పాటు చేశారు. నేటికీ దారి ఘాట్రోడ్డు దారి పొడవునా ప్రమాదకరంగా ఉంది. ఘాట్రోడ్డు మూడు దశాబ్దాల క్రితం నిర్మించారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం బస్సు ప్రమాదంతో రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదన్న విషయం వెలుగుచూసింది. ఘాట్రోడ్డు వెంట భారీ వాహనాల రాకపోకలకు అనువుగా లేదంటూ రోడ్డు భద్రత అధికారి ఆదేశాల మేరకు మూసివేశారు. ప్రత్యామ్నాయ రోడ్డు వేయాలని సూచించారు. మూడేళ్ల క్రితం స్థానికుల విన్నపాల మేరకు ఘాట్రోడ్డుపై చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఘాట్రోడ్డు వెంట తరచూ ప్రమాదాలు ఘాట్రోడ్డు వెంట వెళ్లే చిన్న వాహనాలను అనుమతించడంతో ప్రయాణికులు ఆటోల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం ఘాట్రోడ్డు వెళ్తున్న లారీ బ్రేక్లు పడకపోవడంతో మెట్లదారిపై బోల్తాపడి 10మంది ప్రాణాలు కోల్పోయారు. కొండగట్టుకు వచ్చే భక్తుల ఆటోలు, వాహనాలపై అధికారుల నిఘా కొరవడడంతో కాలం చెల్లిన వాహనాలతో ఘాట్రోడ్డు వెంట తరచూ ప్రమాదాలు జరుతున్నాయి. అంజన్న భక్తుల భద్రత దృష్ట్యా ఐదేళ్ల క్రితం ప్రత్యామ్నాయ ఘాట్రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. మెట్లదారి వెంట సుమారు 4కిలోమీటర్ల మేర సుమారు రూ.100కోట్ల వ్యయంతో ఘాట్రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు. అయినప్పటికీ కాగితాలు దాటకపోవడంతో భక్తులు ఇప్పటికీ ప్రమాదాల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
అవమానంతో వ్యక్తి ఆత్మహత్యకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన బిజిలి రాజయ్య(45) అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపిన వివరాలు.. రాజయ్య రెండేళ్లక్రితం కుమార్తె వివాహం కోసం గర్రెపల్లికి చెందిన బిజిలి మల్లయ్య వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. చెల్లించడంలో ఆలస్యం కావడంతో రెండురోజులక్రితం పందులను తీసుకెళ్లాడు. పందులకు రూ.35వేల ధర నిర్ణయించి మిగిలిన రూ.65వేలు నాలుగు నెలల్లో చెల్లించాలని కుల పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నప్పటికీ, వాయిదా ప్రకారం డబ్బులివ్వకుంటే ఇంటికి తాళం వేస్తానని మల్లయ్య బెదిరించడంతో రాజయ్య మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రమా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వివాహిత అదృశ్యం.. కేసు నమోదురామడుగు: దత్తోజీపల్లి గ్రామానికి చెందిన తోట్ల మమత(30) అనే వివాహిత అదృశ్యమైంది. మమత బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త నరేశ్ గురువారం రామడుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. గంజాయి రవాణా కేసులో నిందితుడికి మూడేళ్ల జైలుగోదావరిఖనిటౌన్: గంజాయి రవాణా, విక్రయానికి పాల్పడిన ఫైవింక్లయిన్కు చెందిన నిందితుడు షేక్ కాజా గౌసుద్దీన్కు మూడేళ్ల కఠిన కారాగా శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి కె.సునీత గురువారం తీర్పు వెలువరించారు. 2021లో గోదావరిఖని ఫైవింక్లయిన్ చౌరస్తా వద్ద వన్టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తగూడెం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,900 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని అప్పటి వన్టౌన్ సీఐ రమేశ్బాబు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఏ1 నిందితుడు చనిపోవడంతో ఏ2 నిందితుడు షేక్ కాజా గౌసుద్దీన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో జిల్లా న్యాయమూర్తి నిందితునికి మూడేళ్ల ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమాన విధించారు. -
అస్తిత్వ పోరాట ప్రతీక తెలంగాణ
● డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్యజగిత్యాలటౌన్: సాయుధ పోరాటం నుంచి రైతాంగ పోరాటం వరకు మరువలేని చరిత్ర తెలంగాణ సొంతమని, అస్తిత్వ పోరాటానికి ప్రతీకగా నిలుస్తుందని డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య అన్నారు. జగిత్యాల తహసీల్ చౌరస్తాలో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి, పీసీసీ సెక్రటరీ బండ శంకర్, పీసీసీ సేవాదళ్ సెక్రటరీ ముకేష్ ఖన్నా, చాంద్పాషా, బీరం రాజేశ్, చెట్టే భార్గవ్, బాల ముకుందం పాల్గొన్నారు. -
కాపర్ వైర్ దొంగల ముఠా అరెస్టు
● ముగ్గురి రిమాండ్.. పరారీలో ఒకరు ● 39 కిలోల కాపర్ వైరు, మొబైల్ ఫోన్, ఆటో స్వాధీనం ● వివరాలు వెల్లడించిన సీఐ మాదాసు రాజ్కుమార్రాయికల్: సెప్టెంబర్ నెల రాగానే కుండపోత వర్షాలు కురవాలి. వాతావరణం చల్లగా ఉండాలి. కానీ.. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవలేదు. అసలు ఇది వర్షకాలమో.. ఎండకాలమో తెలియని పరిస్థితి నెలకొంది. గురువారం మధ్యాహ్నం భానుడు ఉగ్రరూపం దాల్చడంతో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోతతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడ్డారు. రోడ్లు, బస్టాండ్లు నిర్మానుష్యంగా కన్పించాయి. మల్యాల: కొద్ది నెలలుగా ట్రాన్స్ఫార్మర్లు పగులగొట్టి కాపర్ వైరు చోరీ చేస్తున్న దొంగలముఠాను మల్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ రాజ్కుమార్, ఎస్సై ఎస్.సందీప్కుమార్ దొంగల ముఠా వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన తపాల బాబు, మంచిర్యాల వికాస్నగర్కు చెందిన కోట శ్రీను, పల్లపు సురేశ్, సూర సురేశ్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్వైరు దొంగిలిస్తున్నారు. వైర్ను ముద్దగా చేసి.. విక్రయించి.. వచ్చిన డబ్బును పంచుకునేవారు. ఇలా మల్యాల, వెల్గటూర్, ధర్మపురి, గొల్లపల్లి, బుగ్గారం మండలాల్లోని వివిధ గ్రామాల్లో మొత్తం తొమ్మిది దొంగతనాలకు పాల్పడ్డారు. 10 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్వైరును చోరీ చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు నిందితులపై నిఘా వేయగా.. గురువారం కొండగట్టు వద్ద కోట శ్రీను, పల్లపు సురేశ్, సూర సురేశ్ అనుమానాస్పదంగా తిరుతుగుతుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి ప్యాసింజర్ ఆటో, మొబైల్ ఫోన్, ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టే ప్రత్యేక పరికరం, 39 కిలోల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. ఏ–1 నిందితుడు తపాలా బాబు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు చేధించడంలో కృషి చేసిన ఎస్సై సందీప్కుమార్, కానిస్టేబుల్ రాజేందర్, ఆంజనేయులు, విక్రాంత్ను ఎస్పీ అశోక్కుమార్ అభినందించారు. -
యువతి ఆత్మహత్యపై విచారణ వేగవంతం
● సింగరేణి అధికారుల నిర్లక్ష్యంపై దృష్టి ● పూర్వపరాల కోసం రంగంలోకి దిగిన ఏసీపీగోదావరిఖని: ప్రేమ పేరుతో వేధింపులకు గురైన యువతి తాండ్ర అక్షితరాణి ఆత్మహత్య సంఘట నపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. లాంగ్లీవ్లో వెళ్లి వచ్చి బాధ్యతలు స్వీకరించిన గోదావరిఖని ఏసీపీ రమేశ్ గురువారం అమ్మాయి బంధువులను తన కార్యాలయానికి పిలిచి కేసులో పూర్వపరాలను తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈకేసులో పాలిటెక్నిక్ కళా శాల లెక్చరల్ జెట్టి నవీన్ పాత్ర, జీడీకే–2వ గని ఓవర్మెన్ అనిల్కుమార్ ఏమి చేశాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. జనవరిలో జీడీకే–2వ గనిలో 15రోజుల పాటు శిక్షణకు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న ఓవర్మెన్ రవికుమార్ తనపై అత్యాచారం చేశాడని పేర్కొంటూ ఆర్జీవన్ సింగరేణి అధికారులకు అక్షితరాణి చేసిన ఫిర్యాదుపై ఆర్జీవన్ యాజమాన్యం కమిటీ వేసి పూర్వపరాలు పరిశీలించింది. కమిటి అన్ని విషయాలు పరిశీలించిన తర్వా త జరిగిన అన్యాయంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలని లిఖిత పూర్వకంగా సూచించినట్లు యువతికి యాజమాన్యం పేర్కొంటోంది. మళ్లీ ఈఅంశం సెప్టెంబర్లో తెరపైకి వచ్చింది. బొమ్మకంటి రవికుమార్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాననే సూసైడ్ లేఖ సెల్ఫోన్లో ఫొటో లభించడంతో ఆ కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. సెల్ఫోన్లో ఫొటో కాకుండా అసలు కాపీ ఎక్కడుందని పోలీసులు ఆరా తీస్తున్నారు. లభించిన సాఫ్ట్ కాపీని కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపించి నిజాలు తేల్చే పనిలో పోలీసులున్నారు. సూ సైడ్ నోట్ ఎప్పుడు రాసింది? ఎప్పుడు బయటకు వచ్చింది? అనే విషయాలపై దృష్టిసారించారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యంపై దృష్టి బాధిత యువతి ఫిర్యాదు చేసినా సింగరేణి అధికారులు ఎందుకు చర్య తీసుకోలేదని, దీనిపై సింగరేణి అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తమకు పిర్యాదు చేసిన వెంటనే ఈవిషయాన్ని పోలీసుశాఖకు ఎందుకు తెలియజేయలేదనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఆత్మహత్యకు దారి తీసిన సంఘటనలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
నాలుగేళ్లు సహజీవనం.. పెళ్లికి నిరాకరణ
మంచిర్యాలక్రైం: భర్త సరిగా చూసుకోవడం లేదని ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తకు విడాకులు ఇప్పించిన అతడు నాలుగేళ్లు ఆమెతో సహజీనం చేశాడు. ఆమె గర్భం దాల్చగా.. ఆడపిల్లల అని తెలిసి అబార్షన్ చేయించాడు. తీరా పెళ్లికి నిరాకరించడంతో అటు భర్త, కన్నవారికి దూరమై.. ఇద్దరు పిల్లలతో ఎలా జీవించాలో తెలియక ఈనెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పెల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తితో వివాహ మైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. అతడు విదేశానికి వెళ్లేవాడు. ఇద్దరు మధ్య గొడవల కారణంగా విడిపోయారు. ఈ క్రమంలో బాధిత వివాహిత స్నేహితురాలి స్నేహితుడు మందమర్రికి చెందిన మహేష్తో కలిసి మందమర్రి పాలచెట్టు ప్రాంతానికి చెందిన షారుఖ్పాష పరిచయమయ్యాడు. ఈ ముగ్గురు కలిసి తరచూ బాధిత మహిళ ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో షారుఖ్పాషకు బాధిత మహిళతో సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఆమెతో భర్తకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాడు. కలిసి జీవనం సదరు వివాహితను పెళ్లి చేసుకుంటానని, ఇద్దరు కూతుళ్లను చూసుకుంటానని షారుఖ్పాష నమ్మించి రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని క్యాతనపల్లిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొంతకాలం సహజీవనం చేశారు. ఈ విషయం అతడి తల్లిదండ్రులకు కూడా తెలియడంతో నాలుగేళ్లుగా కలిసే ఉంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆమెకు అబార్షన్ చేయించగా.. మూడోసారి మంచిర్యాల బస్టాండ్ సమీపంలోని ఓ స్కానింగ్ సెంటర్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో మళ్లీ అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు పెద్ద మనుషులను పిలిపించి షారుఖ్ఖాన్పై ఆమె ఒత్తిడి తేగా నిరాకరించాడు. దీంతో ఆ మహిళ దోమలమందు, జ్వరం గోలీలు వేసుకుని ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ విషయమై సీఐ ప్రమోద్రావు స్పందిస్తూ బాధితురాలి ఫిర్యాదు మేరకు షారుఖ్పాషపై కేసు నమోదు చేసి రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్కు బదిలీ చేసినట్లు తెలిపారు. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించిన ప్రియుడు వివాహిత మహిళ ఆత్మహత్యాయత్నం -
రాష్ట్రంలో రౌడీ పాలన
జగిత్యాలటౌన్: రాష్ట్రంలో రౌడీపాలన సాగుతోందని, రేవంత్ రెడ్డి స్క్రీన్ప్లే, డైరెక్షన్లోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నేరంతో సంబంధం లేకపోయినా అరెస్టు చేయడం.. సీసీ కెమెరాలు ఉండగానే కాంగ్రెస్ గుండాలు పోలీసులు గదిలోకి వెళ్లి దాడి చేయడాన్ని ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్ఓను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లో దాడి చేయడం పరోక్షంగా కేటీఆర్పై దాడి చేసినట్లేనని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన గూండాలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కేసీఆర్ హయాంలో ఎస్టీ రిజర్వేషన్లు పదిశాతానికి పెంచారని గుర్తు చేశారు. రిజర్వేషన్ కల్పించిన కేసీఆర్ చిత్రపటాలకు ఈనెల 17న ప్రతీ తండాలో క్షీరాభిషేకం చేయాలని పిలుపు నిచ్చారు.గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే రేవంత్ రెడ్డి గిరిజనుల హక్కులను కాలరాస్తూ బడ్జెట్ను కాగితాలకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గూండా రాజకీయాలకు రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఆయనవెంట నాయకులు కల్లపల్లి దుర్గయ్య, దేవేందర్ నాయక్, కొల్ముల రమణ, అబ్దుల్ బారీ, వెంకటేశ్వరరావు, వొల్లం మల్లేశం, జున్ను రాజేందర్, ఆనంద్రావు, గుండా మధు ఉన్నారు. రేవంత్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్లోనే దాడులు పోలీస్స్టేషన్లో జరిగిన దాడులను ఖండిస్తున్నాం మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి -
పర్యావరణ హితం.. లక్ష్మీపూర్ ఆదర్శం
గొల్లపల్లి: పచ్చని పల్లె.. సరికొత్త సంకల్పంతో సరిహద్దులు దాటి ఆదర్శంగా నిలిచింది. రసాయన రంగుల హంగులు వద్దు.. మట్టి గణపతులకే తమ ఓటు అంటూ ఐక్యత చాటింది. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం వినాయక చవితి వేడుకల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఊరంతా ఒక్కటై పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. 12 మండపాల్లో అన్నీ మట్టి విగ్రహాలే గ్రామంలో ఈ ఏడాది నెలకొల్పిన 12 గణేష్ మండపాల్లో మట్టితో తయారు చేసిన ప్రతిమలనే ప్రతిష్ఠించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలతో నీటి వనరులు కలుషితం అవుతున్నాయని గుర్తించిన గ్రామ పంచాయతీ.. ముందస్తుగానే మట్టి వినాయకులనే పూజిద్దామని గ్రామస్తులకు పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు మండపాల నిర్వాహకులు, యువత, గ్రామ పెద్దలు స్వచ్ఛందంగా తలూపారు. గ్రామానికి దక్కిన గౌరవం గ్రామస్తుల నిర్ణయంపై సర్పంచ్ కాసం రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం పూజల మార్పు మాత్రమే కాదు.. రేపటి తరం కోసం ఊరు తీసుకున్న గొప్ప బాధ్యతాయుతమైన నిర్ణయమన్నారు. భవిష్యత్తు తరాలకు ఇదొక చక్కటి మార్గదర్శకమన్నారు. మీ సహకారం – మన గ్రామానికి గౌరవం అనే భావనతో ఊరి గౌరవాన్ని నిలబెట్టిన యువత, మండప నిర్వాహకులు, గ్రామపెద్దలకు కతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీపూర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మండల ప్రజలు, అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. 12 మండపాల్లోనూ కొలువుదీరిన మట్టి వినాయకులే పంచాయతీ పిలుపునకు జైకొట్టిన గ్రామస్తులు, యువత సర్పంచ్ కాసం రాజశేఖర్ హర్షం -
ప్రమాదరహిత ఘాట్రోడ్డుకు ప్రతిపాదనలు
మల్యాల:కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే దారిలో మరో ఘాట్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శ్రీఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్రోడ్డును ఆర్అండ్బీ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. వైజంక్షన్ వద్ద, గతంలో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుత ఘాట్రోడ్డు ప్రమాదకరంగా ఉందని, మరో రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డిని కలిసి విన్నవించగా.. నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలో టీటీడీ నిధులతో భవనాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ హరిచందర్, డీఈఈ సత్యనారాయణ, సర్పంచ్ దారం ఆదిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కొండగట్టు ఘాట్రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే సత్యం -
కాలం చెల్లిన లైసెన్స్తో..
కోరుట్ల: కాలంచెల్లిన లైసెన్స్తో టెండర్ వేసిన ఓ కాంట్రాక్టర్కు పనులు ఖరారు చేసిన వైనం కోరుట్ల మున్సిపాలిటీలో కలకలం రేపుతోంది. మున్సిపల్ అధికారుల పొరపాటుతో జరిగిందా..? కావాలని చేశారా..? అనే విషయం అంతుచిక్కడం లేదు. ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్కు మరో కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయగా ఆయన విచారణకు ఆదేశించారు. అయినప్పటికీ బల్దియా అధికారుల తీరు మారలేదు. విచారణలో నిర్లక్ష్యం చూపడమే కాకుండా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులు ఇచ్చి బెదరగొడుతున్న తీరు విస్మయం గొలుపుతోంది. లైసెన్స్ కాపీని దిద్దారా..? మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి కేటాయించిన రూ. 25 లక్షల విలువైన ఐదుచోట్ల సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణానికి ఏప్రిల్లో ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించారు. పనుల కోసం ఇరువురు కాంట్రాక్టర్లు టెండర్ వేశారు. వీరిలో ఓ కాంట్రాక్టర్ తాను వేసిన కాంట్రాక్టు లైసెన్స్లో ఉన్న కాలపరిమితి తేదీని దిద్దినట్లు ఆన్లైన్లో స్పష్టంగా కనిపించినప్పటికి ఇంజినీరింగ్ అధికారులు సదరు వ్యక్తికే టెండర్లు ఖరారు చేశారు. వాస్తవానికి సదరు కాంట్రాక్టర్ లైసెన్స్ కాలపరిమితి 2026 ఫిబ్రవరిలో ముగిసింది. లైసెన్స్లో ఉన్న తేదీని 2026 ఆగస్టు వరకు పరిమితి ఉన్నట్లు దిద్ది తప్పుడు లైసెన్స్లో ఆన్లైన్లో నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని టెండర్ ప్రక్రియలో పాల్గొన్న మరో కాంట్రాక్టర్ గుర్తించి తప్పుడు లైసెన్స్తో కాంట్రాక్టు ఎలా ఖరారు చేశారని ఆగస్టులో మున్సిపల్ ఇంజినీరింగ్ అఽధికారులకు ఫిర్యాదు చేశారు. దానిని మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో వారంక్రితం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నోటీసుల గోల్మాల్ కాలం చెల్లిన లైసెన్స్తో టెండర్లు ఖరారు చేసిన వైనంపై ఫిర్యాదు చేస్తే అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్నే నోటీసులతో ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. తప్పుడు లైసెన్స్పై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్ మున్సిపాలిటీలో చేస్తున్న ఇతర పనులు సకాలంలో పూర్తి చేయడం లేదని, బ్లాక్లిస్ట్లో పెడతామని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పనులు చేయడానికి కాలపరిమితి ఉన్నప్పటికీ కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నారని సదరు కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. కలెక్టర్కు ఫిర్యాదు అనంతరం మున్సిపల్ అధికారులు తప్పుడు లైసెన్స్ ఆన్లైన్లో పెట్టి టెండరు దాఖలు చేసిన కాంట్రాక్టర్ను వివరణ కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, డీఈ అరుణ్కుమార్ ధ్రువీకరించారు. -
నృసింహుని సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయం తరఫున ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలు అందించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, సూపరింటెండెంట్ అలువాలు శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది తదితరులున్నారు. విద్యార్థులు కంటి పరీక్షలు చేయించుకోవాలిజగిత్యాల:విద్యార్థులందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అంధత్వ నివారణ అధికారి రాజేందర్రెడ్డి అన్నారు. జాతీయ అంధత్వ నివారణ రాష్ట్రీయ బాల స్వస్థ్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా రెండు టీంలను ఏర్పాటు చేశామని, 6 నుంచి 10 చదువుతున్న విద్యార్థులు 41,930 మందికి పరీక్షలు చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి● డీఏవో భాస్కర్ కథలాపూర్: రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా రైతులకు అవగాహన కల్పించా రు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులను తింటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. 125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం కిట్లను పంపిణీ చేశారు. సమావేశంలో ఏవోలు యోగితా, శ్రీనివాస్, ఏఈవోలు హరీశ్, రాఘవేంద్ర, సుష్మాశ్రీ, సంధ్యరాణి, మౌనిక, రైతులు పాల్గొన్నారు. -
కేసీఆర్ పాలనే బాగుండే..!
ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద చాయ్ హోటల్లో కల్వకుంట్ల సంజయ్ కార్యకర్తలతో కలిసి చాయ్ తాగుతూ సరదా గా ముచ్చట పెట్టారు. రాజకీయ పరిణామాలు, వి ద్యుత్ సరఫరా, యాప్ ద్వారా ఎరువులపై ప్రజలు ఏమంటున్నారని కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నా రు. విద్యుత్ కోతలు విధిస్తున్నారని, పంటలకు సాగునీరు అందడం లేదని, కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా అయ్యింద ని, ప్రజలు ఆయననే గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. యాప్తో రైతులకు యూరియా దొరకడం లేదని, ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్కు ఓటేస్తే చెప్పుతో కొట్టుకోవాలని అంటున్నారని వివరించారు. -
ఇయ్యాల్టి నుంచి జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 70వ జిల్లాస్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అండర్–14, 17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బన్సిలాల్ తెలిపారు. ఈ టోర్నమెంట్ ద్వారా ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనే కరీంనగర్ జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. హాజరయ్యే క్రీడాకారులు ఎల్జిబిలిటీ ఫాంతో రిపోర్ట్ చేయాలని సూచించారు. 16న అండర్– 17 బాలికలకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్,– 17న అండర్– 14 బాలికలకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, 18న అండర్– 17 బాలురకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, 19న అండర్ 14 బాలురకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారు. -
విధుల్లోనే మున్సిపల్ కార్మికుడి మృతి
జగిత్యాల: బల్దియాలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న చాంద్ఖాన్ గుండెపోటుతో మృతిచెందాడు. ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్లిన చాంద్ఖాన్ ఆటో తీసుకుని 47వ వార్డులో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాడు. తన వెంట ఉన్న కార్మికుడు రాజయ్యతో అస్వస్థతగా ఉందని, కూర్చుంటానని చెప్పి ఆటోలోకి వెళ్లాడు. ఆ వెంటనే కుప్పకూలిపోయాడు. విషయాన్ని రాజన్న ఆయన కుటుంబ సభ్యులకు తెలపగా.. వారు ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. పాలకేంద్రాల్లో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలుజగిత్యాల: జిల్లా కేంద్రంలోని పాలకేంద్రాల్లో ఫుడ్సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాలల్లో కల్తీ జరుగుతోందనే ఫిర్యాదు మేరకు ఫుడ్సేఫ్టీ అధికారి అనూష ఆధ్వర్యంలో సోదాలు చేశారు. వెన్నశాతం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోందని, పూర్తిస్థాయిలో శాంపిల్స్ సేకరిస్తున్నామని, అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు. -
జగన్ కుటుంబానికి అండగా ఉంటాం
వెల్గటూర్: పార్టీ కార్యక్రమాలకు అప్పు చేసి.. బలవన్మరణానికి పాల్పడిన బీఆర్ఎస్ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగన్ కుటుంబాన్ని మంత్రి సోమవారం పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. రూ.50వేలు ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో జగన్ భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని, పిల్లల చదువు విషయంలోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మంత్రికి కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. పేదల పక్షపాతిగా ప్రభుత్వం● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా పనిచేస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన చింతకుంట రాజనర్సయ్య ఇటీవల విద్యుత్షాక్తో మరణించగా.. ఆయన కుటుంబాని కి విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన రూ.50 వేల చెక్కు, రూ.4.50 లక్షల బాండ్ను ఆయన భార్య లక్ష్మీకి అందించారు. బుడిగజంగాల కాలనీకి చెంది న సిరిగిరి ఎల్లవ్వ విద్యుత్షాక్తో మృతిచెందగా ఆమె భర్త వెంకటయ్యకు రూ.50 వేల చెక్కు, రూ. 4.50 లక్షల బాండ్ను అందించారు. నిరుపేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, కో–ఆప్షన్ సభ్యులు గట్టు సతీశ్, కౌన్సిలర్ తిరుమలయ్య, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, బాలముకుందం, రవీందర్రెడ్డి, రౌతు గంగాధర్, ములాసపు మహేశ్, లైశెట్టి విజయ్ పాల్గొన్నారు. -
ఆధార్ నమోదు వేగవంతం చేయాలి
జగిత్యాల: జిల్లాలో 13,15,376 మంది ఆధార్ నమోదు నవీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల వయస్సున్న వారు 49,419 మంది, 6 నుంచి15 ఏళ్లవారు 2,34,451, అలాగే 18 ఏళ్లు పైబడిన వారు 10,31,512 మంది ఉన్నారని, వయసుల వారీగా ఆధార్ నమోదు పరిశీలించాలన్నారు. ఆరేళ్లు నిండిన చిన్నారులకు బయోమెట్రిక్ చేయాలన్నారు. వైద్య ఆరోగ్యం, విద్య, మహిళా శిశు సంక్షే మ శాఖ, ఆధార్ కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అదనపు కలెక్టర్ లత, రాజాగౌడ్, డీఎంహెచ్వో సుజాత పాల్గొన్నారు. అటవీ భూములు పరిరక్షించాలి జిల్లాలో అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. అటవీ సంరక్షణ కమిటీతో మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలో మొత్తం 53,734,77 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉందని, ఐదు రేంజ్లు, 22 సెక్షన్లు, 67 బీట్లు, 253 కంపార్ట్మెంట్ల పరిధిలో ఉందని, రెవెన్యూ రికార్డుల్లోని 22ఏ 1 పహాణి వివరాలు సరిపోల్చి రీకన్సిలియేషన్ చేయాలన్నారు. 22ఏ పహాణీ రికార్డుల్లో 57,842, 25 ఎకరాలు మరో విభాగంలో 75,198,14 ఎకరాలు నమోదైందని, ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అటవీ భూములపై హక్కులు కోరుతున్న గిరిజనులకు చట్టబద్ధమైన విధానంలో పరిష్కరించాలన్నారు. 20 ఏళ్లలో రెవెన్యూ అధికారుల ద్వారా 5,016,99 ఎకరాలు అనధికారికంగా పట్టాలు మంజూరైనట్లు తెలిపారు. అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో భూ వివాదాలు లేకుండా చూడాలన్నారు. కోరుట్ల డివిజన్లో 91.28 ఎకరాలు వివాదంలో ఉన్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కలప అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉన్న
మాది రాయికల్ పట్టణంలోని పోచమ్మవాడ. మూడు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో రాయికల్ ఆస్పత్రికి వచ్చాను. ఇక్కడ వైద్య సౌకర్యాలు బాగానే ఉన్నప్పటికీ వైరల్ జ్వరాలతో ఆస్పత్రి అంతా నిండిపోయింది. – శాంత, రాయికల్ ఆస్పత్రిలో మెరుగైన సేవలు రాయికల్ ఆస్పత్రికి వైరల్ ఫీవర్స్తో చాలా మంది రోగులు అడ్మిట్ అవుతున్నారు. 24 గంటల పాటు, నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నాం. మందుల కొరత వంటి సమస్య ఏమీ లేదు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్యసేవలు పొందాలి. – శశికాంత్రెడ్డి, సూపరింటెండెంట్ ఫాగింగ్ చేయిస్తున్నాం రాయికల్ మున్సిపాలిటీలో దోమల నివారణకు ప్రతి వార్డులో ఫాగింగ్ చేయిస్తున్నాం. పారిశుధ్య కార్మికులతో మురికికాలువల్లో చెత్తాచెదారం తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నాం. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. – మనోహర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ -
దగ్గు.. జలుబు.. జ్వరం
రాయికల్: వాతావరణంలో వచ్చిన మార్పులతో రాయికల్పట్టణంతోపాటు, మండలంలోని 32 గ్రామాల్లో చిన్నారులు జ్వరాల బారిన పడుతున్నారు. యువత ఒళ్లు నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 250 నుంచి 300 వరకు వైద్య పరీక్షల నిమిత్తం వస్తున్నారు. వీరిలో 120 మందికి సీబీపీ టెస్ట్లు చేస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతోపాటు, గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండటంతో వైరల్ ఫీవర్లు వ్యాపిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ప్రబలుతున్న జ్వరాలు మండలంలోని మూటపల్లి, రామాజీపేట, వస్తాపూర్, మైతాపూర్, భూపతిపూర్ తదితర గ్రామాల్లో చిన్నారులు జబులు, జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత కీళ్ల నొప్పులతో సతమతం అవుతున్నారు. వీరిలో చాలామంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉండటంతో రాయికల్ ఆస్పత్రిలోని బెడ్లన్నీ రోగులతో నిండిపోయాయి. వైరల్ ఫీవర్స్ సోకిన రోగులను ఇన్పేషెంట్స్గా గుర్తించి 2–3 రోజుల పాటు వైద్యసేవలు అందిస్తున్నారు. గ్రామాలు, పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి వైరల్ ఫీవర్స్ రాకుండా చర్యలు చేపట్టాలని పట్టణ, మండల ప్రజలు కోరుతున్నారు. -
గల్ఫ్ ఏజెంట్పై ఎస్పీకి ఫిర్యాదు
జగిత్యాల క్రైం: గల్ఫ్ పంపిస్తానని డబ్బులు తీసుకుని జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్ మోసం చేశాడని బాధితులు మంగళవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పట్టణంలో గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న వ్యక్తి ఐదుగురి నుంచి రూ.2.37లక్షలు తీసుకుని మస్కట్ పంపించాడని, అక్కడ పనిలేక వాపస్ వచ్చామని, తమకు నష్టం చేసిన ఏజెంట్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిపై విచారణజగిత్యాల: కథలాపూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ.. ఓ ఉపాధ్యాయురాలిని వేధించి సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడిని ఫిర్యాదుల కమిటీ ఆధ్వర్యంలో పోష్ యాక్ట్ 2013 ప్రకారం మంగళవారం విచారించారు. తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఓ ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన విషయం తెల్సిందే. నివేదిక ఆధారంగా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈనెల 15న వ్యక్తిగతంగా హాజరై తన వాదనలు, ఆధారాలు సమర్పించాలని ఫిర్యాదుల కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు అతడిని కమిటీ విచారణ చేపట్టింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్కు పంపించామని కమిటీ సభ్యులు తెలిపారు. 46.654 టీఎంసీలకు ఎస్సారెస్పీ నీటి మట్టంజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుతోంది. ప్రస్తు తం నీటిమట్టం 1080.60 అడుగులు, నిల్వ సా మర్థ్యం 46.654 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1688 క్యూసెక్కులు చేరుతోంది. బాలికను వేధించిన యువకుడి రిమాండ్ శంకరపట్నం: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురిచేసిన నిందితుడిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రేకుర్తికి చెందిన నగూర్ రవి బాలికను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడంతో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి హుజూరాబాద్ కోర్టులో ప్రవేశపెట్టామని, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు. -
భార్యతో విడాకులై.. మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
చొప్పదండి: రెండు పెళ్లిల్లు జరిగినా విడాకులు కావడంతో మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఆర్నకొండలో జరిగింది. ఎస్సై నరేశ్రెడ్డి కథనం ప్రకారం.. ఆర్నకొండకు చెందిన గంగాధర గంగయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నాగరాజు (33) కారు డ్రైవర్గా పని చేస్తుండేవాడు. 2016లో వివాహం చేయగా కొద్ది రోజులకే భార్యతో విడాకులయ్యాయి. అనంతరం మరో వివాహం జరిపించగా గతేడాది రెండో భార్యతో కూడా విడాకులయ్యాయి. దీంతో మద్యానికి బానిసైన నాగరాజు ఈ నెల 13న స్నేహితులతో మద్యం తాగడానికి వెళ్లగా రాత్రి అతడి తమ్ముడు అనిల్ ఇంటికి తీసుకువచ్చాడు. తిరిగి ఉదయం లేచి చూసేసరికి తన గదిలోని ఫ్యాన్కు ఉరేసుకొని మృతిచెంది ఉన్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పీజీ సీటు రాలేదని వైద్యుడి.. కరీంనగర్రూరల్: తీగలగుట్టపల్లికి చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ గౌతమ్ (39) పీజీలో సీటు రాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. గౌతమ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి కాంట్రాక్టు పద్ధతిలో ధర్మారం మండలం నందిమేడారం పీహెచ్సీలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. నెల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రెండు పర్యాయాలు పీజీ సీటు కోసం ప్రవేశపరీక్ష రాసినా మెరిట్ మార్కులు రాక సీటు లభించలేదు. కొంతకాలంగా మనోవేదనతో ఉన్న గౌతమ్ ఆదివారం రాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. క్వారీలో ప్రమాదంలో ఒకరు మృతి గంగాధర: మండలంలోని సర్వారెడ్డిపల్లి సమీపంలోని గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో సుదధగోని అంజయ్య(40) మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన అంజయ్య పీఎస్ఆర్ గ్రానైట్ క్వారీలో స్టోన్ కటింగ్ మిషన్ హెల్పర్గా పని చేస్తున్నారు. సోమవారం వేకువజామున బయటకు వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు బండరాయి జారి తలపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కూలీ పనికి వెళ్తూ అనంత లోకాలకు.. చొప్పదండి: పట్టణంలోని13వ వార్డుకు చెందిన బైర రాజ్కుమార్ (32) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజ్కుమార్ కరీంనగర్లో కూలీ పని చేస్తుంటాడు. మంగళవారం ఉదయం తన సోదరి నగునూరు ఆసుపత్రిలో నర్సింగ్ చదువుతున్న బైర నిఖిత, ఆమె స్నేహితురాలు పిట్టల ఉషశ్రీలను బైక్పై తీసుకొని ఆసుపత్రిలో దించి పనికి పోవడానికి బయలుదేరాడు. రుక్మాపూర్ శివారులోని చాకుంట ఎక్స్రోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న పెద్ద ట్రాలీ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రాజ్కుమార్, నిఖిత, ఉషశ్రీకి గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాజ్కుమార్ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్రెడ్డి తెలిపారు. భార్య గర్భిణి చొప్పదండిలోని జ్యోతినగర్కు చెందిన రాజ్కుమార్కు ఏడేళ్ళ క్రితం వివాహం అయింది. ఇప్పటికే ఆరేళ్ల పాప ఉండగా, మృతుడి భార్య కవిత తొమ్మిది నెలల గర్భిణి. రోడ్డు ప్రమాదంలో అన్న మృతిచెంది, చెల్లి గాయాల పాలవడం స్థానికంగా విషాదం నింపింది. టీ తాగేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు.. కరీంనగర్రూరల్: కొడుకు ఫంక్షన్ కోసం సంతోషంగా ఇంటికి వచ్చిన తండ్రిని ప్రైవేట్ బస్సు బలితీసుకుంది. సౌదీ అరేబియా వెళ్లేందుకు కుటుంబసభ్యులతో సంతోషంగా ఎయిర్పోర్టుకు బయలుదేరుతున్న క్రమంలో టీ తాగేందుకు హోటల్కు వెళ్లిన ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబంలో తీరని విషాదం నింపింది. వివరాలు.. కరీంనగర్లోని సిటిజన్స్కాలనీకి చెందిన మొహియుద్దీన్ కుమారుడు మహ్మద్ అజీమోద్దిన్(26) ఉపాధినిమిత్తం నాలుగేళ్లుగా సౌదీ అరేబియా వెళ్లివస్తున్నాడు. నాలుగునెలలక్రితం అజీమ్ భార్య డెలీవరీ కావడంతో బాబు పుట్టాడనే సమాచారంతో కరీంనగర్కు వచ్చేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. 15 రోజులక్రితం కుమారుడికి హఫీఖా ఫంక్షన్ చేసేందుకు సెలవుపై వచ్చాడు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపిన అజీమ్ తిరిగి సౌదీ వెళ్లేందుకు ఈ నెల 14న కారులో శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరాడు. మార్గమధ్యలో కారు ఆపి కుటుంబసభ్యులకు టీ తీసుకవచ్చేందుకు హోటల్కు వెళ్లాడు. ఈ క్రమంలో కంటెయినర్ వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పిన ఓ ప్రైవేట్ బస్సు హోటల్లోకి దూసుకెళ్లిన ఘటనలో తీవ్రంగా గాయపడిన అజీమ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్లముందే అజీమ్ మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మంగళవారం అంత్యక్రియలను నిర్వహించారు. నాగరాజు (ఫైల్) -
బస్సుకు చుట్టుకున్న విద్యుత్వైర్లు
హన్మకొండ చౌరస్తా: మూల మలుపు తిరుగుతున్న ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు చుట్టుకోవడం.. డ్రైవర్ అలానే ముందుకు వెళ్లడంతో చెట్ల కొమ్మలు విరిగిపడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడే ఉన్న పలువురు అప్రమత్తంగా ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హనుమకొండ వస్తోంది. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ మూలమలుపు వద్దకు చేరుకోగానే పక్కనే ఉన్న వృక్షం పక్కనుంచి వెళ్లిన విద్యుత్ వైర్లు బస్సుకు చుట్టుకున్నాయి. గమనించని బస్సు డ్రైవర్ వేగంగా నడపడంతో భారీ వృక్షం కొమ్మలు విరిగి రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన ఆటోలు, ద్విచక్రవాహనాలపై పడ్డాయి. దీంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని లేదా గాయాలు కాకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అతివేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అక్కడున్న పలువురు ఆరోపించారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బస్సుపై పడిన కొమ్మలను తొలగించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. చెట్టుకొమ్మలు విరిగిపడి పలు వాహనాలు ధ్వసం -
ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
వెల్గటూర్: కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. పురాతన ఆలయ గోపురాలను జేసీబీ సహాయంతో కూల్చివేస్తున్నారు. పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ. 4.50కోట్లు, రాజగోపురానికి రూ.కోటి మంజూరు చేసింది. పుష్కరాల వరకు పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆలయ కమి టీ చైర్మన్ పూదరి రమేశ్ తెలిపారు. ఈవో కాంతారెడ్డి, ధర్మకర్తలు, అర్చకులు ఽపాల్గొన్నారు. జేఎన్టీయూలో ఇంజినీరింగ్ డే కొడిమ్యాల: జేఎన్టీయూ (నాచుపల్లి) ఇంజినీరింగ్ కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజినీర్స్ వేడుకలను మంగళవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ నరసింహ మాట్లాడుతూ దేశం సాంకేతికత పురోగతిలో ఇంజినీర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. నిజాంకాలంలో నిర్మించిన డ్యాముల నిర్వహణలో ఇంజినీరింగ్ నైపుణ్యాలను విద్యార్థులకు వివరించారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య మానవ ప్రమేయం లే కుండా నీటి ఒత్తిడి ఆధారంగా ఆటోమేటిక్గా తెరచుకునే డ్యామ్ గేట్లకు ఆనాడే రూపకల్పన చేశారని కొనియాడారు. వివిధ విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలిజగిత్యాలక్రైం: ప్రజలకు ఎస్పీ అశోక్కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. గణేశ్ మండపా ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు శాఖకు సహకరించా లని కోరారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ తరుఫున ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. విదేశీ ఉద్యోగాలకు ఎన్రోల్మెంట్ డ్రైవ్జగిత్యాల: టామ్కామ్ ఆధ్వర్యంలో ఈనెల 16న ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్తమ్మ తెలి పారు. జర్మనీ, మలేషియా, ఖతర్, ఇజ్రాయిల్, ఆస్ట్రియా, ఐర్లాండ్, సౌదీ, మర్సిస్, యునైటెడ్ ఎమిరెడ్స్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలకు అర్హులు డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. వివరాల కోసం టామ్కామ్ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. నిధులు మంజూరు చేయండికోరుట్ల: నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విన్నవించారు. హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రోడ్లు, వంతెనలకు రూ.78కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని జువ్వాడి పేర్కొన్నారు. ఒడ్డెలింగాపూర్ ఆస్పత్రి తనిఖీరాయికల్: మండలంలోని ఒడ్డెలింగాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జేసీబీ సహాయంతో పిచ్చిమొక్కలు తొలగించారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ సతీశ్ పాల్గొన్నారు. -
కుట్టుమిషన్లకు కులధ్రువీకరణ కొర్రీ..!
రాయికల్: బీసీలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించే పథకానికి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మంది లబ్ధిదారులకు మిషన్లు అందించేందుకు ఈనెల 15వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించింది. దీనికి కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు అవసరం కాగా.. ఆయా దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురికావడంతో మహిళలను ఆందోళనకు గురిచేస్తోంది. ధ్రువీకరణ పత్రాల్లో జాప్యం ప్రస్తుతం ఆదర్శ వివాహాలు పెరిగిన నేపథ్యంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీ అంశంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహిళలు పుట్టింటి నుంచే ధ్రువీకరణ పత్రాలను ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో తీసుకోవాలని రెవెన్యూ అధికారులు అంటున్నారు. పుట్టింటి పత్రాన్ని జతచేసి దరఖాస్తు చేసుకుంటే అత్తింటి పేరుతో ధ్రువీకరణ పత్రం జారీ చేస్తామని మరికొంత మంది సూచిస్తుండడంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. ఆధార్నంబర్లో అత్తింటి వారి వివరాలు ఉన్నవారే మండలంలో దరఖాస్తు చేసుకోవాలని అక్కడి అధికారులు చెబుతున్నట్లు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటింటా అందిస్తూ..
సిరిసిల్లటౌన్/పెద్దపల్లి/మెట్పల్లి/ధర్మపురి: సిరిసిల్ల బల్దియా, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏటా ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది సైతం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సిరిసిల్లలోని చింతోజు భాస్కర్ మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పదేళ్లుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. 24వ వార్డులో మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీనిధి పరస్పర సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. పదిహేనేళ్లుగా వార్డులోని 350 ఇళ్లకు మట్టి వినాయకులను అందిస్తున్నారు. శివనగర్ రాజరాజేశ్వరస్వామి ఆలయం వేదికగా ఏడాదికి 2 వేల వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు. ● పెద్దపల్లికి చెందిన దేవసాని పద్మ కుటుంబం పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ● మెట్పల్లి లయన్స్క్లబ్ సభ్యులు మట్టి గణపతులను పూజించాలని ప్రచారం చేస్తున్నారు. 2009లో మెట్పల్లిలో లయన్స్క్లబ్ ఏర్పాటు చేశారు. ఏటా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు అధ్యక్షుడు శ్రీనివాస్రావు తెలిపారు. ● ధర్మపురికి చెందిన గాజు భాస్కర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో 500 మందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు వద్దని.. మట్టి విగ్రహాలను పూజిద్దామని ప్రచారం చేస్తున్నారు. -
నిరుపేద కుటుంబానికి ఎన్ఆర్ఐ దంపతుల అండ
రూ.2.98 లక్షలతో గృహ నిర్మాణం ధర్మపురి: భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో కలిసి పూరిగుడిసెలో నివాసముంటున్న పేద మహిళ కుటుంబానికి ఎన్ఆర్ఐ దంపతులు అండగా నిలిచారు. మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి లక్ష్మి భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి లక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి గుడిసెలో నివాసముంటోంది. అమెరికాలో ఉంటున్న జగిత్యాలకు చెందిన సత్యసాయి అభయహస్తం సభ్యులు ఎన్ఆర్ఐ దంపతులు నూనె శివకుమార్, శ్రీదేవీ దంపతులు తమవంతుగా ఓ పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని భావించారు. ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణుకుంట రమేశ్ను రెండునెలల క్రితం ఫోన్ ద్వారా సంప్రదించి విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో రమేశ్ లక్ష్మి కుటుంబం గురించి వివరించగా.. సదరు ఎన్ఆర్ఐ దంపతులు ముందుకొచ్చి రూ.2.98లక్షలతో మూడు గదులతో ఇల్లు నిర్మించారు. ఆదివా రం నూతన గృహ ప్రవేశానికి శివకుమార్ సోదరుడు నూనె వెంకటరాజేంద్రకుమార్ తమ భార్య రజినీతో కలిసి వచ్చారు. సొంత గూడు కల్పించినందుకు లక్ష్మి కుటుంబం ఎన్ఆర్ఐ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. దాతల సాయంతో ఇప్పటిరవకు 28 మంది పేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని రమేశ్ తెలిపాడు. కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి తిరుపతి, జగిత్యాలకు చెందిన సత్యసాయి అభయహస్తం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి
రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి. ఎప్పుడో వివాహమైన తర్వాత ఇప్పుడు కుట్టుమిషన్ల కోసం పుట్టింటికి వెళ్లి సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా అక్కడ రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. – తలారి నాగమణి, సర్పంచ్, మైతాపూర్ ఆధారాలు సమర్పిస్తే జారీ ఆదర్శ వివాహాలు పెరిగిన నేపథ్యంలో భర్త కులం ఆధారంగా భార్యకు కుల ధ్రువీకరణపత్రం జారీ చేయడం సాధ్యం కాదు. అనర్హులు లబ్ధిపొందే అవకాశం ఉంది. కొంతమంది ఈ సర్టిఫికెట్లను ఇతరత్రా ఉపయోగాలకు వాడుకునే అవకాశం ఉంది. అన్ని వివరాలు పరిశీలించిన అనంతరం ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం. – నాగార్జున, తహసీల్దార్, రాయికల్ -
ఎస్సారెస్పీకి 3,935 క్యూసెక్కుల ఇన్ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం వరకు 3,935 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. అలాగే 1892 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 1080.50 అడుగులు 46.355 టీఎంసీలుగా ఉంది. జాతీయ స్థాయి యోగా పోటీలకు గురుకులం విద్యార్థినిమల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థిని కమలిని జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మానస తెలిపారు. ఈనెల 11, 12న కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచిందని, రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని పేర్కొన్నారు. అక్టోబర్ 3న రాజస్థాన్లోని జైపూర్లో జరగనున్న పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కమలినిని ప్రిన్సిపాల్తోపాటు పీఈటీ మధులిక అభినందించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ సస్పెన్షన్జగిత్యాలజోన్: బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఓ అంగన్వాడీ టీచర్ పట్ల గంగాధర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు రాష్ట్ర కమిటీకి నివేదిక పంపించారు. పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ విచారణ చేపట్టి క్రమశిక్షణ కమిటీకి అందించారు. దీంతో వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని గంగాధర్కు నోటీసులు జారీ అయ్యాయి. అప్పటి వరకు గంగాధర్ను తాత్కలికంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. బాధితురాలిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల ఫోన్లో పరామర్శించిన విషయం తెల్సిందే. సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లాకు కాంస్య పతకంకరీంనగర్స్పోర్ట్స్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జగిత్యాల జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం సాధించినట్లు సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెన్ను వెంకటేష్ తెలిపారు. ఆదివారం సిద్దిపేట జట్టుతో పోటీపడిన జగిత్యాల జట్టు 3–0 తేడాతో గెలుపొందినట్లు పేర్కొన్నారు. జిల్లా జట్టు విజయంపై కోచ్ గౌతమ్, పీడీలు ప్రశాంత్, రాజేశ్ హర్షం వ్యక్తం చేశారు. రైతుల భూములతో కాంగ్రెస్ దందారాయికల్: 22ఏ పేరిట పట్టాలు ఉన్న రైతుల భూములపై కాంగ్రెస్ దందా చేస్తోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలో ఆదివారం ఆమె విలేకరులతో మా ట్లాడారు. రేవంత్ రెడ్డి అధికారంలోకొచ్చి మూ డేళ్లు గడుస్తున్నప్పటికీ హామీలు అమలు చేయ డం లేదని, దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. రైతుల భూములపై సీఎంతోపాటు మంత్రి పొంగులేటి కన్ను పడిందని, ఇద్దరు కలిసి 22ఏ కొత్త భూ దందాకు తెరలేపారని పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోనే 16వేల ఎకరాల భూములను నిషేధిత భూమి కింద చేర్చారని తెలిపారు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, నాయకులు తురగ శ్రీధర్రెడ్డి, గోపి రాజిరెడ్డి, బత్తిని నాగరాజు, సత్యంగౌడ్, రమాపతిరావు, చాంద్పాషా ఉన్నారు. -
ప్రజా రవాణా మరింత చేరువ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘టీజీఎస్ ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మేనేజ్మెంట్ పనిచేస్తోంది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నాం. ఇప్పుటివరకు 6.91 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి ద్వారా ప్రయాణించారు. రూ.308.84 కోట్ల వరకు లబ్ధి పొందారు. ఈ పథకం గొప్ప మైలురాయి సాధించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ పాలసీ పరిధిలోనిది. రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో 997బస్సులు రోజుకు 3లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. తద్వారా రూ.2.5కోట్ల ఆదాయం సమకూరుతోంది’ అని ఆర్టీసీ కరీంనగర్ ఆర్ఎం రాజు వివరించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వివరించారు. -
జగిత్యాల
న్యూస్రీల్7గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలుధర్మపురి: ఆదివారం సెలవు దినం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీలక్ష్మినృసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. సోమవారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
రైలుకింద పడి తండ్రీకొడుకులు ఆత్మహత్య
బీసీ గురుకులం నుంచి ఇంటికి విద్యార్థిహుజూరాబాద్: పట్టణంలోని బోర్నపల్లి రోడ్డులో ఉన్న వీణవంక మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులం నుంచి ఆదివారం ఆరో తరగతి విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపింది. వీణవంక మండలంలోని గన్ముక్కులకు చెందిన బొంగోని స్నితన్ నెలరోజుల క్రితం గురుకులంలో చేరాడు. హాస్టల్ వాతావరణానికి అలవాటు పడలేక ఆదివారం ఉద యం 5.30 గంటలకు పాఠశాల నుంచి బయటకు వెళ్లి, వాహనదారులను లిఫ్ట్ అడుగుతూ స్వగ్రామానికి బయలుదేరాడు. విద్యార్థి కనిపించకపోవడంతో సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా, వీణవంక వద్ద బాలుడు కనిపించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాలకు సరైన ప్రహరీ గోడ లేకపోవడంతోనే విద్యార్థి బయటకు వెళ్లగలిగాడని ప్రిన్సిపాల్ సంపత్ తెలిపారు.వెల్గటూర్/మంచిర్యాల కై ం: ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు.. కేసు ట్రయల్కు రావడంతో తమకు ఎలాగైనా శిక్ష తప్పదని భావించారు. ఈ క్రమంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేశ్ (52), అతని కుమారుడు నాగరాజు (32) ఇద్దరూ కలిసి 2024లో గుల్లకోట గ్రామానికి చెంది.. జయశంకర్భూపాలపల్లిలో వీఆర్వోగా పనిచేసిన మల్లేశ్ తోడళ్లుడు రమేశ్ను హత్యచేశారు. ఈ కేసులో ఇద్దరూ భూపాలపల్లికి జైలుకు వెళ్లారు. భర్త, కుమారుడు జైలుకు వెళ్లడంతో మల్లేశ్ భార్య సువర్ణ అనారోగ్యానికి గురై అదే ఏడాది మృతి చెందింది. జైలు నుంచి బయటకు వచ్చిన తండ్రీకొడుకులను ఎవరూ ఆదరించడం లేదు. కొద్దిరోజులుగా వారు హైదరాబాద్లోని ఓ హోటల్లో పనిచేసుకుంటున్నారు. మరోవైపు హత్యకేసు ట్రయల్కు వచ్చింది. తమకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన తండ్రీకొడుకులు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో నివాసముంటున్న మల్లేశ్ సోదరుడు శ్రీనివాస్ ఇంటికి శుక్రవారం వచ్చారు. శనివారం ఇంటి నుంచి బయలుదేరిన వారు ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో కేరళ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని జీఆర్పీ ఎస్సై తెలిపారు. -
లోక్ అదాలత్లో సత్వర న్యాయం
● జిల్లా న్యాయమూర్తి రత్నపద్మావతి ● రూ.2.34కోట్లకు పైగా పరిహారం చెల్లింపు జగిత్యాలక్రైం: లోక్అదాలత్తో సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు 19 పరిష్కరించి రూ.2.34 కోట్లకు పైగా పరిహారాన్ని బాధితులకు అందించాలని సూచించారు. అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత, సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు, రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నికీషా, డీఎల్ఎస్ఏ కార్యదర్శి సరిత పాల్గొన్నారు. మెట్పల్లిలో 338 కేసులు పరిష్కారం మెట్పల్లి: పట్టణంలోని కోర్టులో 338 కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు. పంతాలకు పోతే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి, ఏపీపీ ప్రణయ్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దయ్య రాజారాం తదితరులున్నారు. ధర్మపురిలో 479 కేసులు.. ధర్మపురి: పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి యేగి జానకీ ఆధ్వర్యంలో 479 కేసులు పరిష్కారం అయ్యాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బందెల రమేశ్, ఉపాధ్యక్షు డు మామిడాల శ్రీకాంత్, లోక్ అదాలత్ సభ్యులు గడ్డం సత్యనారాయణరెడ్డి, రౌతు రాజేశ్, ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, జాజాల రమేశ్, కార్తిక్, కలమడుగు కీర్తి తదితరులున్నారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు తక్కళ్లపల్లి విద్యార్థికథలాపూర్: మండలం తక్కళ్లపల్లి జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న రామగిరి ఘనదీశ్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం లక్ష్మీనర్సయ్య శనివారం తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగే పోటీల్లో ఘనదీశ్ జిల్లా తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు. ఘనదీశ్ను సర్పంచ్ రాజగంగారాం, పీఈటీ రాజేశ్, ఉపాధ్యాయులు అభినందించారు. తారకేశ్వరస్వామికి ఉత్తర నక్షత్ర పూజలుకథలాపూర్: అయ్యప్పస్వామి జన్మనక్షత్రం సందర్భంగా మండలంలోని చింతకుంటలోగల శ్రీతారకేశ్వరస్వామి ఆలయంలో ఉత్తర నక్షత్రం పూజలను శనివారం ఘనంగా నిర్వహించారు. అయ్యప్పస్వామికి అభిషేకం చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. రక్తదానం గొప్పదికోరుట్ల: రక్తదానం ప్రాణదానంతో సమానమని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలో శ్రీనివాస సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. 30 మంది రక్తదానం చేశారు. తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేయడం అభినందనీయమని నిర్వాహకులు అన్నారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ అధ్యక్షుడు ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి, కోరుట్ల ఐఎంఏ అధ్యక్షుడు వేముల రవికిరణ్, శ్రీనివాసుల సేవా సంస్థ కోరుట్లఽ బాధ్యుడు శ్రీరాముల శ్రీనివాస్, వనపర్తి చంద్రమోహన్, నీలి శ్రీనివాస్, హెల్త్ ఎడ్యూకేటర్ ధనుంజయ, కోరుట్ల ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేతజగిత్యాలరూరల్: టపట్టణంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ గంగారాం తెలిపారు. మోతె ఉప కేంద్రం పరిధిలోని మోతె, వెల్దుర్తి, గొల్లపల్లి, పట్టణంలోని మహాలక్ష్మీనగర్, చిలుకవాడ, తహసీల్ చౌరస్తా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, వినియోగదారులు సహకరించాలని కోరారు. -
జగిత్యాల
32.0/21.07గరిష్టం/కనిష్టంసర్వజన్ వినాయకుని ఆగమనంరాయికల్: పట్టణంలో సర్వజన్ వినాయకుడికి స్వాగతం పలికారు. మాజీమంత్రి జీవన్రెడ్డి గణనాథుడిని దర్శించుకున్నారు. నాందేడ్కు చెందిన యువత డోలు ప్రదర్శన ఆకట్టుకుంది.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. నృసింహునికి మొక్కులుధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు. ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
మట్టి కొరత.. ఇత్తడి విగ్రహం
కోరుట్లటౌన్: కోరుట్లలోని గాంధీరోడ్డులో గల పద్మశాలీ సంఘం భవనంలో 52 ఏళ్లుగా ఇత్తడి గణపతి ప్రతి ష్టాపన ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇత్తడి గణపతిని దర్శించుకునేందుకు కోరుట్లతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. సుమారు 52ఏళ్ల క్రితం మట్టి దొరకని కరువు పరిస్థితుల్లో విగ్రహం తయారీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అప్పటి పద్మశాలీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మద్రాసు నుంచి ఇద్దరు శిల్పులను కోరుట్లకు రప్పించి పంచలోహాలతో గణపతి విగ్రహాన్ని తయారు చేయించారు. అప్పటి నుంచి నేటి వరకు అదే విగ్రహానికి పూజలు చేస్తున్నారు. నవరాత్రులు ముగిసిన అనంతరం ఇత్తడి గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవిత్ర జలాలను విగ్రహంపై చల్లి తిరిగి పద్మశాలీ సంఘం భవనానికి తీసుకువచ్చి భద్రపరుస్తారు. -
63 ఫీట్ల ఎకో గణేశుడు
హైదరాబాద్ తర్వాత పెద్దపల్లికి గుర్తింపు వచ్చేలా భారీ మట్టిగణపతిని ఏర్పాటు చేస్తున్నాం. నవరాత్రోత్సవాల్లో ప్రముఖుల ప్రవచనాలు, లక్షపుష్పార్చన, మహాహారతి, సహస్రదీపాలంకరణ ఇలా రోజుకో ప్రత్యేక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. – శివంగారి సతీశ్, ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈసారి 63అడుగుల పంచముఖ గణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు శివంగారి సతీశ్ ఆధ్వర్యంలో ఏటా భారీ ఎకో గణేశుడు పూజలందుకుంటున్నాడు. 31ఏళ్లుగా ఉత్సవాలను నిర్వహిస్తుండగా.. ఎనిమిదేళ్లుగా భారీ మట్టి గణపతులను ఏర్పాటు చేస్తున్నారు. 36 ఫీట్ల ఎత్తుతో మొదలై ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటున్నాడు. ఖైరతాబాద్ తర్వాతిస్థానంలో పెద్దపల్లిలోనే భారీ గణేశుడు కొలువుదీరేలా నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. -
ఊరంతా ఒకే దేవుడు
మంథని రూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉంటారు. అందరు కలిసికట్టుగా ఒకే మాటపై నిలబడతారు. అందరికి ఏదోఒక కుటుంబ బంధం ఉంటుంది. ప్రతీ పండుగను కలిసి చేసుకుంటారు. 30ఏళ్లుగా గ్రామస్తులు ఒక్కతాటిపై నిలిచి ఊరు మొత్తంలో ఒకే గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. గ్రామ నడిబొడ్డున ప్రతిమను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి ఊరంతా కలిసి గోదావరినదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1990లో నలుగురు వ్యక్తులు కలిసి గణనాథుడిని ప్రతిష్టించాలని ఆలోచన చేశారు. తాటా కులతో మండపం వేశారు. అదే ఆనవాయితీతో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. -
ఎనౖభై ఏళ్ల వేడుక
సిరిసిల్లటౌన్: 80ఏళ్ల గణపయ్య ఉత్సవాలకు సిరిసిల్ల ముస్తామైంది. స్వాతంత్య్రానికి ముందే స్థానిక గాంధీచౌక్లో అప్పటి పుర ప్రముఖులు రుద్ర శంకరయ్య, మడూరి అంబాజి, భీమనాఽథిని నారాయణ, కుడిక్యాల రాజా రాం, ఎలగొండ నారాయణ మొదటి గణపతిని నెలకొల్పారు. ప్రస్తుతం మార్కండేయ భవనంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 80వ వార్షికోత్సవం జరుపుతుండగా అధ్యక్షుడిగా దూడం శంకర్ ఉన్నారు. ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో 1948 నుంచి నవరాత్రులకు అంకురార్పణ చేశారు. పెద్దబజారు హన్మాన్ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎనభై ఏళ్లక్రితం పట్టణ ప్రముఖులు వినాయక ఉత్సవ సంఘం నెలకొల్పారు. వారి ఆదర్శంలోనే మేము వేడుకలు జరుపుతున్నాం. ప్రతి ఏడాది ఏకదంతుడికి నిత్య కై ంకర్యాలు, అన్నదానాలు ఇదే విధంగా నిర్వహిస్తాం. – డి.శంకర్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
● డ్రైవర్పై కేసు నమోదు జగిత్యాలక్రైం:అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన తిరుమల గంగాధర్ (60) ఆర్టీసీ బస్సు ఢీకొని మృతిచెందా డు. టీషాపు నిర్వహించే గంగాధర్ శని వారం సైకిల్పై పాల ప్యాకెట్లు తీసుకు ని టీస్టాల్కు వెళ్తుండగా జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై మెట్పల్లి డిపో బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గంగాధర్ను స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలింగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు అభిషేక్ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. -
మంథనిలో శతాబ్దపు ఉత్సవాలు
మంథని: మంత్రపురిలో 110 ఏళ్లుగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక బ్రాహ్మణ సామాజికవర్గం వంటలు చేసేందుకు నాగ్పూర్కు వెళ్లేవారు. అక్కడి సాంప్రదాయాన్ని మంథనికి తీసుకొచ్చి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. నాగ్పూర్, మంథని మినహా దేశంలో ఎక్కడా సిద్ధి..బుద్ధి(భార్యలు) విగ్రహాలతో గణేశ్ దర్శనం లభించదు. మంథని పెంజేరుకట్ట హనుమాన్ ఆలయంలో సిద్ధి, బుద్ధి గణపతి ఉత్సవాలను 1916 నుంచి నిర్వహిస్తున్నారు. మోతారాం గారి రాజేశ్వర్రావు, టక్కేగారి మల్లన్న, మంథని లింగయ్య ఆధ్వర్యంలో ఆనాడు ఉత్సవాలు జరిగేవి. నడివీధిలో 1918 నుంచి నిర్వహిస్తున్నారు. మందాట వీదిలో గత 65 ఏళ్లుగా అఖండ గండదీపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. -
మోటార్లకు మీటర్లు పెడితే సహించబోం
జగిత్యాలరూరల్: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియను సీఎం రేవంత్రెడ్డి రహస్యంగా ప్రారంభించారని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అన్నారు. గతంలో కేంద్రప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తే కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించిందని, ఇప్పుడు ప్రధాని మోదీకి తలొగ్గిన సీఎం రేవంత్ మీటర్ల బిగింపు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చామని, దానిని కేసీఆర్ 24 గంటలు చేశారని గుర్తుచేశారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, సింగరేణిలో జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్లు ఆరంభించారని పేర్కొన్నారు. ఎల్నినో కారణంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారని, ఎల్నినోకు విద్యుత్ ఉత్పత్తికి ఏం సంబంధమని ప్రశ్నించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపునకు ఎల్నినో అడ్డుకాదన్నారు. ఎన్డీఎస్ఏ అధికారులు కూడా అన్నారం, సుందిళ్ల చెక్కుచెదరలేదని తెలిపారని పేర్కొన్నారు. తనకు ఎద్దు లేదు.. ఎవుసం లేదని, తాను రియల్ ఎస్టేట్ బ్రోకర్నని సీఎం రేవంత్ స్వయంగా అసెంబ్లీలోనే చెప్పుకున్నారని, వ్యవసాయం దండగని చంద్రబాబు గతంలో అన్నారని, ఇప్పుడు రేవంత్ కూడా అదే చెబుతున్నారని విమర్శించారు. ఆయన వెంట నాయకులు సత్యంరావు, ఆకుల రమేశ్, తేలు రాజు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
టెండర్కే పరిమితం
మంత్రి తొలి సంతకం.. రాయికల్: మండలంలోని జగన్నాథపూర్– బోర్నపల్లి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి రూ.17.50 కోట్లు మంజూరు చేస్తూ 2025 జూన్ 21న గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తొలి సంతకం చేశారు. రెండుసార్లు టెండర్లు అయినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో బ్రిడ్జి పనులకు మోక్షం కలగడం లేదు. దీంతో గిరిజనులు రాకపోకలకు ఇ బ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్నాథపూర్ గ్రామం రాయికల్ మండలంలో ఉన్నా.. అక్కడికి మల్లాపూర్ మండలం వీవీరావుపేట నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్నాథపూర్– బోర్నపల్లి మధ్య వాగు ఉండడంతో హైలెవల్ వంతెన కోసం దశాబ్దాలుగా సర్వేలు చేసినా మోక్షం కలగడం లేదు. తగ్గనున్న దూరభారం జగన్నాథపూర్ గ్రామానికి వెళ్లాలన్నా, అక్క డి గిరిజనులు రాయికల్కు రావాలన్నా సుమారు 15 కి.మీ రావాల్సిందే. మల్లాపూర్ మండలం వీవీ రావుపేట నుంచి రాయికల్ మండలం కొత్తపేట, మూటపల్లి, రామాజీపేట మీదుగా రాయికల్ చేరుకుంటారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే జగన్నాథపూర్ నుంచి కేవలం అరకిలో మీటరు దూరంలో ఉన్న బోర్నపల్లికి 20 నిమిషాల్లో చేరుకొని, అక్కడి నుంచి బస్సు, ఆటోల ద్వారా రాయికల్, బోర్నపల్లి నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న నిర్మల్ జిల్లా కడెంకు తక్కువ సమయంలో వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామ ప్రొఫైల్ జనాభా 840ఓటర్లు 670వార్డులు 8దూర భారం తగ్గుతుంది వంతెన నిర్మాణానికి మంత్రి నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు ముందుకు రాక పనులు ప్రారంభం కాదు. మా గిరిజనుల కల హైలెవల్ బ్రిడ్జి. ఈ నిర్మాణం పూర్తయితే దూరభారం తగ్గుతుంది. – పరంచ శంకర్, సర్పంచ్, జగన్నాథపూర్ -
నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి
జగిత్యాలక్రైం: నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం సారంగాపూర్ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రజా ఫిర్యాదులలో జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తేనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని, ప్రజలకు భద్రతాభావం కల్పించడంలో విజిబుల్ పోలీసింగ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలని సూచించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ వెంట ఎస్సై గీత, సిబ్బంది ఉన్నారు. -
సతుల పాలన.. పతుల పెత్తనం
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న టీచర్లను కౌన్సిలర్ల భర్తలు వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. త మ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి విధుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకో వడం, ప్రశ్నించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స తుల స్థానంలో పతులే పెత ్తనం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహా రంపై తరుచూ ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు వెళ్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే సి బ్బందికి ప్ర శాంతమైన వాతావరణం కల్పించాలని, విధుల్లో అనధికారిక జోక్యాన్ని అరికట్టాలని కోరుతున్నారు. ఆందోళనలో టీచర్లు అంగన్వాడీ కేంద్రాల్లో మహిళ కౌన్సిలర్ల భర్తల తీరుతో అంగన్వాడీ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. పలువురిపై ఫిర్యాదులు రావడం జిల్లాలో చర్చనీ యాంశంగా మారింది. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. విధులు సక్రమంగా నిర్వహించ డం లేదని ఉన్నతాధికారులకు కంప్లెంట్ చేయడం, వారు చెప్పింది వినకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొంటున్నారు. టీచర్లకు అనేక విధులు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడం, హాజరు నమోదు, ఫ్రీస్కూల్ విద్య, గర్భిణిలు, బాలింతలకు సేవలందించడం వంటి బాధ్యతలు, ఇటీవల ఎన్నికల సంఘానికి సంబంధించి సర్ కార్యక్రమం సైతం వారిపై భారంగా ఉంది. కష్టతరం అయినప్పటికీ వారు పనులు చేస్తుండగా, పలువురు మహిళా కౌన్సిలర్ల తీరుతో భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల జోక్యం అవసరం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి భ్రదతతో పాటు, ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మహిళ కౌన్సిలర్ల భర్తలు అధికారిక హోదా లేకున్నా ప్రభుత్వ సిబ్బంది విధుల్లో జోక్యం చేసుకోకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటున్నారు.జోక్యం చేసుకోవడం సరికాదుమహిళ కౌన్సిలర్ల భర్తలు అంగన్వాడీ కేంద్రాల విషయంలో జోక్యం చేసుకోవడం తగదు. ఏవైనా లోపాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. అంగన్వాడీ టీచర్ల విధులకు ఆటంకం కలిగించవద్దు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. – భాస్కర్, డీడబ్ల్యూవో -
ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐటీహబ్ ఏర్పా టు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రస్తావించారు. ఉత్తర తెలంగాణలో జగిత్యాల ముఖ్యమైన ప్రాంతమని, ఐటీహబ్ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగిత్యాలలో జేఎన్టీయూ కళాశాల, బాసర ఐఐటీ వచ్చాయని పేర్కొన్నారు. వెంటనే ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్బాబును కోరారు. పారదర్శకంగా సర్ ప్రక్రియధర్మపురి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ధర్మపురి మున్సిపల్ పరిధిలో సర్ ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. అర్హత గల ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని ఆదేశించారు. అనంతరం 2027లో రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురి గోదావరి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. తల్లిని పోషించకుంటే భూ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాంమెట్పల్లి: తన పేరిట ఉన్న భూమిని కొడుకులు రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత పోషణ పట్టించుకోవడం లేదని మెట్పల్లి పట్టణం ఆరపేటకు చెందిన చౌట్పల్లి సత్తెమ్మ గత సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై మంగళవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘కొడుకులు పోషించడం లేదు’ శీర్షికతో వార్త ప్రచురితం కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గమనించిన సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం సత్తెమ్మ కుటుంబ సభ్యులతో ఆర్డీవో నర్సింహారావు మాట్లాడారు. ఆమెను పోషించకుంటే తీసుకున్న భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి తిరిగి తన పేరిట చేయిస్తానని హెచ్చరించారు. అయి తే సత్తెమ్మ పోషణ కోసం ఏటా రూ.50వేల చొ ప్పున ఆమె ఖాతాలో జమ చేయడంతో పాటు ఖర్చుల కింద ప్రతి నెలా రూ.వెయ్యి చెల్లించడానికి ఇద్దరు కుమారుల కుటుంబాలు ఆర్డీవో సూచన మేరకు అంగీకరించినట్లు తెలిసింది. చెత్త వాహనాల్లో విగ్రహాలు.. బీజేపీ ఆందోళనజగిత్యాల: కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాకు 200 మట్టి వినాయక విగ్రహాలను కలెక్టరేట్కు తీసుకొచ్చారు. వీటిని మున్సిపాలిటీతో పాటు, వివిధ గ్రామాలకు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం మెట్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 105 విగ్రహాలను చెత్త వాహనంలో తరలించేందుకు సిద్ధమవుతుండగా, బీజేపీ నాయకులు గమనించి ఆందోళన చేపట్టారు. వెంటనే అదనపు కలెక్టర్ రాజాగౌడ్ స్పందించి వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మెట్పల్లి మున్సిపల్ కమిషనర్కు మెమో జారీ చేసినట్లు తెలిసింది. పూజారులతో శుద్ధి చేయించి ఇతర వాహనాల్లో విగ్రహాలను తరలించారు. అసభ్య ప్రవర్తనపై ఎంపీ ఆగ్రహంజగిత్యాల/కోరుట్ల: జిల్లాకేంద్రంలో ఓ అంగన్వాడీ టీచర్తో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు టీచర్తో ఫోన్లో మాట్లాడి తాను క్షమాపణలు చెపుతున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై వివరాలు సేకరించి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు, జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఎంపీ పేర్కొన్నారు. -
మంత్రి దృష్టికి తీసుకెళ్లా
జగన్నాథపూర్– బోర్నపల్లి గ్రామాల మధ్య హైలెవల్ వంతెన నిర్మాణం కోసం మంత్రి దృష్టికి మరోసారి తీసుకెళ్లాను. అవసరమైతే కేంద్ర మంత్రిని కలిసి నిధుల విడుదలకు కృషిచేయడంతో పాటు, పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతాం. – ఎమ్మెల్యే సంజయ్కుమార్ బ్రిడ్జి కోసం ఎంతో కష్టపడ్డా జగన్నాథపూర్–బోర్నపల్లి మధ్య బ్రిడ్జి కోసం నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రులు, అప్పటి సీఎం కేసీఆర్ను కలిశా. కాంగ్రెస్లో ఉన్న సమయంలో మంత్రి అడ్లూరిని కలిసి తొలి సంతకం ఈ ఫైల్పైనే చేయించా. రెండుసార్లు టెండర్లు జరిగినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం బాధాకరం.– జీవన్రెడ్డి, మాజీ మంత్రి -
జగిత్యాల
27.0/25.07గరిష్టం/కనిష్టంవేతన కోతలు విధించొద్దు జగిత్యాల: అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన మెమోను రద్దు చేయాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ రమణ డిమాండ్ చేశారు. నృసింహునికి మొక్కులు ధర్మపురి: శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రధాన, అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
విద్యుత్ డిమాండ్ పెరిగింది
జగిత్యాలరూరల్: విద్యుత్ కోతలతో రైతులు, పారిశ్రామిక వేత్తలు, గృహ అవసరాల వినియోగదారులు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు అల్లాడిపోతున్నారు. ఇటు వర్షాలు లేక, అప్రకటిత విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయపాలన లేకుండా కరెంట్ తీసేస్తుండడంతో పంటలకు సాగునీరు అందక చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు అందని త్రీఫేజ్ జిల్లాలో రైతులకు 12 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, కనీసం 9 గంటలు కూడా అందడం లేదు. దీంతో సాగుచేసిన వరి పొలాలు, ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయి. చేతికందే సమయంలో కళ్ల ముందే పంటలు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు, లోవోల్టేజీతో విద్యుత్ సరఫరా అవుతుండటంతో రోజుకు వందలాది వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయి. రోజుకు 4.93 మిలియన్ యూనిట్ల అవసరం జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, కమర్షియల్ వినియోగదారులకు రోజూ 4.93 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా, ప్రస్తుతం అధికారులు 3.11 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నారు. దీంతో సమయపాలన లేకుండా విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. రాత్రివేళ ఒక గంట, మధ్యాహ్నం సమయంలో 2 గంటల పాటు అధికారులు విద్యుత్ కోత విధిస్తున్నారు. సోలార్ ద్వారా 59 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్ట్లు ఐదు ఉండగా, వాటి ద్వారా మధ్యాహ్నం సమయంలో 59 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో ఆ విద్యుత్ను మధ్యాహ్న సమయంలో సరఫరా చేస్తున్నారు. దీంతో కొంత వెసులుబాటు ఉన్నా, పూర్తిస్థాయిలో విద్యుత్ సరిపోక అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పడ లేదు. లోవోల్టేజీతో సాంకేతిక సమస్యలు.. జిల్లాలో అవసరం మేరకు విద్యుత్ సరఫరా లేక లోవోల్టేజీతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యుత్ సబ్స్టేషన్లలో ఫ్యూజ్లు కాలిపోవడం, జంపర్లు తెగిపోవడంతో పాటు, ఇతర సమస్యలు తలెత్తుండటంతో సరఫరా నిలిచిపోతోంది. జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు గృహ కనెక్షన్లు 3,43,086కమర్షియల్ 44,589పరిశ్రమలు 2,988కుటీర కనెక్షన్లు 1,434వ్యవసాయ కనెక్షన్లు 1,41,464స్ట్రీట్లైట్స్, వాటర్ సరఫరా 6,217ఆలయాలు, స్కూళ్లు 2,377తాత్కాలిక కనెక్షన్లు 253‘జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన సామల్ల గంగారాం ఎకరం విస్తీర్ణంలో వరిపంట సాగుచేశాడు. ఇటీవల వర్షాలు లేకపోవడంతో పాటు, విద్యుత్ కోతలతో 20 గుంటల వరిపంట పూర్తిగా ఎండిపోయింది. ఇలా ఇతనొక్కడే కాదు.. జిల్లాలోని పలువురు రైతుల పంటలు నీరులేక ఎండిపోతున్నాయి.’ ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరి గింది. దీంతో రైతులకు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. – సుదర్శనం, ఎస్ఈ -
నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల నిరసన
మెట్పల్లి(కోరుట్ల): కొందరు ప్రజాప్రతినిధులు తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ శుక్రవారం మున్సిపల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ కౌన్సిలర్ బత్తుల నరేశ్ రోజువారీ పరిపాలనలో జోక్యం చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు పెట్టిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఈ నెల 4న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికీ కేసు నమోదు కాలేదు. అయితే ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన కమిషనర్, ఇతర ఉద్యోగులు నిరసన తెలపడం కోసం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న చైర్మన్ లింబాద్రి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుతో తామంతా ఆత్మవిశ్వాసం కోల్పోయి నైరాశ్యంలో ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలోనే నిరసన తెలపాలని నిర్ణయించామని, చైర్మన్ హామీతో విరమించామని పేర్కొన్నారు. -
కొండగట్టు అభివృద్ధి పనులకు మోక్షం
● రూ.35.19 కోట్లతో దీక్షా విరమణ మండపం, సత్రం ● 2వేల మంది ఒకేసారి దీక్షవిరమించేలా నిర్మాణం కరీంనగర కార్పొరేషన్: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి సంబంధించిన అభివృద్ధి పనులకుమోక్షం లభించింది. అంజన్న భక్తుల చిరకాల కోరికై న మాల విరమణ మండపం,సత్రం గదుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని గురువారం డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండిఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు. రూ.35.19 కోట్లతో మండపం, సత్రం నిర్మాణం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో రూ.35.19కోట్ల నిధులతో చేపట్టనున్న మండపం, సత్రం నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో దీక్షా విరమణ మండపం, భక్తుల కోసం 96 గదుల సత్రం నిర్మాణాలకు రూ. 35.19 కోట్ల నిధులు మంజూరై శంకుస్థాపన జరిగినప్పటికీ.. సాంకేతిక కారణాలతో పనులు నిలిచిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి పనులు ప్రారంభించేలా చూడాలని అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే పెండిగ్ పనులకు ఆమోదం తెలిపారు. కాగా రూ.35.19 కోట్లతో మాలదారులు రెండు వేల మంది ఒకే సారి దీక్ష విరమణ చేసుకొనేందుకు వీలుగా మండపం నిర్మాణం చేపట్టనున్నారు. భక్తుల సౌకర్యార్థం 96గదుల సత్రం, అతిథిగృహం నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలతో ఏటా లక్షలాదిగా వచ్చే హనుమాన్ మాలాధారులకు, అంజన్న భక్తులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం తెలిపారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. -
పోరాట యోధురాలు ఐలమ్మ
● కలెక్టర్ సత్యప్రసాద్జగిత్యాల: రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ త్యాగాలు మరువలేనివని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆమె త్యాగాలను గుర్తిస్తూ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారకంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మట్టి విగ్రహాలనే పూజించాలి.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులనే పూజించాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లోని కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పీవోపీ విగ్రహాలతో జలాశయాలు, చెరువులు, కుంటలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రెండువేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ సైంటిస్ట్ మహేశ్, తదితరులు ఉన్నారు. రీ సర్వే పారదర్శంగా నిర్వహించాలి గ్రామాల్లో భూ రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. భూ రీసర్వేలో అధికారులకు ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో నక్షా పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. -
కలలోనూ వెంటాడుతోంది
నా పేరు గోల్కొండ విజయ(58). మాది డబ్బు తిమ్మాయపల్లి గ్రామం. నా కూతురు సుమలత గర్భవతి కావడంతో ఆ రోజు హాస్పిటల్లో చూయించుకునేందుకు పయనమయ్యాం. క్షణాల్లో బస్సు బోల్తాపడడంతో జనాలు నాపై పడడంతో చేతులు, పక్కటెముకలు విరిగిగాయి. వెన్నుపూసకు గాయమై కదలలేని పరిస్థితుల్లో ఉన్న. నాపై నుంచి శవాలను తీసుకువెళ్తున్న దృశ్యం ఇంకా కళ్లలో మెదులుతోంది. ప్రమాదంలో నా బిడ్డను కోల్పోయా. నేను హాస్పిటల్లో ఆరు నెలలు ఉన్నా. ఇంటికి వచ్చేవరకు నా బిడ్డ చనిపోయిన విషయం నాకు చెప్పలేదు. ఇప్పటికీ ఆ ప్రమాదం కలలోనూ వెంటాడుతోంది. శరీరంలో పలుచోట్ల రాడ్లు వేసి ఆపరేషన్ చేయడంతో ఏ పని చేయలేకపోతున్నాను. నిలబడ్డానికి కూడా చేతనైత లేదు. పెద్ద సార్లు దయ తలచి నాకు పింఛన్ ఇప్పించాలని విన్నపం. – విజయ, తిమ్మాయపల్లి -
నేనేం పాపం చేశానమ్మా?
మల్యాల: ముక్కుపచ్చలారని పసివాడు.. రాత్రి హాయిగా తల్లి ఒడిలోనే నిద్రపోయాడు. వేకువజామునే అమ్మ నిద్ర లేపింది. ఎందుకు లేపిందో తెలియని ఆ పసివాడు అమ్మ చేయిపట్టుకుని ఆమె వెంటే నడిచాడు. ఎటు తీసుకెళ్తుందో తెలియని ఆ చిన్నారి అడుగులు చివరకు కాటివరకు తీసుకెళ్తాయని ఊహించలేకపోయాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. కొడుకును బావిలో తోయడం.. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. తాను చనిపోతే తన కొడుకును ఎవరు చూస్తారనుకుందో..? కొడుకు ప్రాణం తీసేందుకు ఆ తల్లి మనసుకు ఎన్ని గాయాలయ్యాయో..? తెలియదుగానీ.. ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని బావిలో తోసిందనే వార్తతో ప్రజల కళ్లు వరదలై పారాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన గుండేటి కవిత, దశరథం భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు నిఖిలేష్ (12), శశాంక్(7) కుమారులు సంతానం. కవిత బీడీలు చుడుతూ.. బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. దశరథం ఉపాధి కోసం ముంబాయి వెళ్లాడు. అప్పటినుంచి కవిత మామ పండిత్, ఇద్దరు కుమారులతో కలిసి గుడిపేట వెళ్లే దారిలో ఉన్న సొంతింట్లో ఉంటోంది. ● అన్నా.. నేను చనిపోతున్నా కవిత కుటుంబ పోషణకు కొందరి వద్ద అప్పు చేసినట్లు తెల్సింది. ఆ అప్పులకు వడ్డీ చెల్లించే క్రమంలో మరింత అప్పు చేయాల్సి వచ్చింది. అలా అప్పు రూ.20లక్షల వరకు చేరినట్లు సమాచారం. అప్పు ఇచ్చిన వారు చెల్లించాలని కోరుతుండడం.. భర్త డబ్బులు పంపించకపోవడంతో కొన్నాళ్లుగా మనస్తాపం చెందుతోంది. గురువారం వేకువజామున 3.40 గంటలకు కవిత తన సోదరుడు కొమురయ్యకు ఫోన్ చేసి ‘అన్నా నేను చనిపోతున్నా..’ అని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అనంతరం చిన్న కుమారుడు శశాంక్ను వెంటబెట్టుకుని వెళ్లింది. (ఈ చిత్రాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.) నేరుగా గుడిపేట వెళ్లే మార్గంలో ఉన్న వ్యవసాయ బావిలో శశాంక్ను తోసి.. తానూ దూకినట్లు తెలుస్తోంది. కవిత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో కంగారుపడిన కొమురయ్య సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బావుల్లో వెదికాడు. ముత్యంపేట మీదుగా గుడిపేట వెళ్లే మార్గంలో వెదుకుతుండగా.. ఓ వ్యవసాయ బావి వద్ద తల్లీకొడుకుల చెప్పులు, సెల్ఫోన్ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఫైరింజన్, గజ ఈతగాళ్లతో బావిలో గాలిస్తుండగా.. ఉదయమే కవిత మృతదేహం నీటిలో తేలింది. శశాంక్ కోసం రాత్రి వరకూ గాలిస్తూనే ఉన్నా.. ఆచూకీ దొరకలేదు. ● కన్నీమున్నీరైన కుటుంబ సభ్యులు..స్థానికులు కొడుకును బావిలో వేసి.. తల్లి ఆత్మహత్య చేసుకుందన్న వార్త తెలియడంతో గుడిపేట, ముత్యంపేట, మల్యాలకు చెందిన వందలాదిమంది బావి వద్దకు చేరుకున్నారు. కవిత మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కొడుకును బావి లో ఎందుకు తోసిందో.. అంటూ కన్నీరు పెట్టుకున్నారు. శశాంక్ తరచూ అనారోగ్యం బారిన పడు తుండడంతో తాను చనిపోతే అతడిని ఎవరూ చూ సుకోరని భావించి బావిలో తోసినట్లు తెలుస్తోంది. రోదిస్తున్న బంధువులుశశాంక్ కోసం గాలిస్తున్న గ్రామస్తులు కొడుకును నిద్రలేపి తీసుకెళ్లిన తల్లి ముందుగా బావిలో తోసి తానూ దూకి.. తల్లి మృతదేహం లభ్యం.. చిన్నారి కోసం గజఈతగాళ్ల గాలింపు మిస్టరీగా తల్లీకొడుకుల ఘటన -
తొలిదశలో గుర్తిస్తే చికిత్స అందించొచ్చు
కరీంనగర్: క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని హైదరాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అంకాలజిస్టు డాక్టర్ అన్వేశ్, డాక్టర్ నీలేశ్, డాక్టర్ స్నేహ తెలిపారు. కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి 126 మంది హాజరై పరీక్షలు చేయించుకోగా, 16 మందికి పాజిటివ్గా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. క్యాన్సర్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ నెల రెండో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో ఉచిత స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు మాట్లాడుతూ కరీంనగర్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం -
కరెంట్ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
మేడిపల్లి: విద్యుత్ కోతలతో అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంటూ గురువారం కిసాన్మోర్చా ఆధ్వర్యంలో మండలకేంద్రంలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, ప్రధాన కార్యదర్శి కారండ్ల మధుకర్ హాజరయ్యారు. అధికారంలోకి రాకముందు రైతుల కోసం అనే హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అరిగోసపెడుతోందని విమర్శించారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. 24 గంటలు కరెంటు ఇవ్వాలని, లేకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు కలుగజేసుకుని ధర్నా విరమింపజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల సురేష్, రాష్ట్ర నాయకులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి, అన్నాడి జలపతిరెడ్డి, ఎస్ఎన్.రెడ్డి, క్యాతం దశరథరెడ్డి, నాయకులు రెబ్బస్ మల్లయ్య, తొగరి లక్ష్మిపతి, చంద రమేశ్, గోస్కి మధు తదితరులు పాల్గొన్నారు. రాయికల్లో..రాయికల్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ పట్టణంలోని సబ్స్టేషన్ వద్ద జగిత్యాల వెళ్లే రహదారిపై రైతులు గురువారం ధర్నాకు దిగారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విద్యుత్ కోతలతో పొలాలకు నీరు అందడం లేదని, వర్షాలు లేక.. సకాలంలో విద్యు త్ రాక ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై సుధీర్రావు, సబ్ ఇంజినీర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బీఆర్ఎస్ నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. -
రామగుండం గ్రిడ్ ఫెయిల్యూర్.. చీకట్లో దక్షిణ భారతం
ఎన్టీపీసీ పవర్ప్లాంట్కొండగట్టు ప్రమాద దృశ్యం (ఫైల్)2001, సెప్టెంబరు 11న అమెరికాలో ని ట్విన్ టవర్స్పై ఉగ్రదాడులు జరిగాయి. సరిగ్గా అదే రోజు ప్రస్తుత పెద్దపల్ల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సదరన్ గ్రిడ్ ఫెయిల్యూర్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిమ్మచీకట్లోకి జారిపోయింది. దీని ప్రభావం తమిళనాడు, కర్ణాటక, కేరళపైనా పడింది. ఫలితంగా రాష్ట్రమంతా కరెంటు లేదు. రైల్వే, కమ్యూనికేషన్స్, ఆపరేషన్లు కష్టంగా మారాయి. సాధారణ శస్త్రచికిత్సలు వాయిదాపడ్డాయి. అత్యవసరమైనచోట జనరేటర్లతో సర్దుకున్నారు. పత్రిక కార్యాలయాలు, టీవీ మీడియా ఆఫీసులు కరెంటు కష్టాలు చవిచూశాయి. బహుళ అంతస్తులు, అపార్ట్మెంట్ ప్రజలు లిఫ్టులు పనిచేయక ఇబ్బందులు పడ్డారు. మరునాడు రాత్రికి గ్రిడ్ పునరుద్ధరించారు. అప్పటి వరకూ అమెరికాపై దాడులు జరిగిన సంగతి దక్షిణ భారతవాసులకు తెలియకపోవడం గమనార్హం. ప్రపంచానికి నిరంతరం వెలుగులు పంచే రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్లో దాదాపు రెండు రోజులపాటు విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోవడం అదే తొలిసారి, చివరిసారి. సెప్టెంబరు 11న అమెరికాలో ఉగ్రదాడులు.. మనవద్ద కరెంటు పోవడంతో ప్రజల ఆందోళనతో అనేక పుకార్లు షికార్లు చేశాయి.25 ఏళ్ల క్రితం జరిగిన ఘటన మాకు ఇప్పటికీ షాకింగే. కరెంటు ఎందుకుపోయిందో తెలియదు. ఎప్పుడు వస్తుందంటే అధికారులు చెప్పలేమన్నారు. ఏదో పెద్ద సమస్య అని అర్థమైంది. షెడ్యూల్ ప్రకారం.. ఎమర్జెన్సీ ఆపరేషన్లను అవాయిడ్ చేయలేదు. కొన్ని జనరేటర్లు పెట్టి చేసేశాం, మరికొందరు వైద్యులు చీకటి ఉన్నా.. టార్చ్లైట్లు పెట్టి ఆపరేషన్లు పూర్తి చేశారు. కొన్నింటిని వాయిదా వేశాం. నా సర్వీసులో గోదావరిఖనిలో రెండు రోజులపాటు కరెంటు పోయిన సందర్భం అదే. అమెరికాపై ఉగ్రదాడి జరిగి వందలాదిమంది మరణించిన రోజు కావడంతో సెప్టెంబరు 11ను అంత తేలిగ్గా మర్చిపోలేం. – డాక్టర్ నిరంజన్, గోదావరిఖని 2018 సెప్టెంబరు 11.. అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో రాష్ట్రంలో ఎలక్షన్ వేడి మొదలైంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (జగిత్యాల– శనివారంపేట సర్వీసు) కొండగట్టు వద్ద సామర్థ్యానికి మించి దాదాపు 100 మందికిపైగా ప్రయాణికులతో గుట్ట ఘాట్ రోడ్డు దిగుతోంది. ఆఖరు మలుపు వద్ద అదుపుతప్పి మట్టి కోసం తీసిన 12 అడుగుల గొయ్యిలో పడింది. చాలామంది ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక, అంతర్గత గాయాలు, రక్తస్రావంతో 60మందికిపైగా మరణించారు. దేశంలోని ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలోనూ ఇంతటి ప్రాణనష్టం జరగలేదు. హిమాచల్ప్రదేశ్, డార్జిలింగ్ వంటి ఎత్తయిన పర్వతాలు, లోయలున్న ప్రాంతాల్లో బస్సు పడిన ఘటనల్లోనూ ఈ స్థాయిలో ప్రాణనష్టం సంభవించకపోవడం గమనార్హం. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం అందినా.. వారి కుటుంబాలు రోడ్డు ప్రమాదం రూపంలో తగిలిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోవడం లేదు. -
21 నుంచి ఎస్జీఎఫ్ సంబురం
కరీంనగర్స్పోర్ట్స్: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 షెడ్యూల్ విడుదలైంది. గురువారం కరీంనగర్ డీఐఈవో సత్యనారాంజనేయ, అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్ క్రీడా తేదీలను ప్రకటించారు. ఈ నెల 21 నుంచి అక్టోబర్ చివరి వరకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఎంపికల పోటీలు జరగనున్నాయి. అక్టోబర్ 31 వరకు 29 క్రీడాంశాల్లో ఈ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి క్రీడల తేదీల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఉమ్మడి జిల్లా ఎంపిక తేదీల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని ఎ్స్జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికై నవారు తల్లిదండ్రులు లేదా ప్రిన్సిపాల్ సమక్షంలో హామీపత్రాన్ని సమర్పించాలన్నారు. వివరాలకు 9652637637 నంబర్ను సంప్రదించాలని సూచించారు. క్రీడా పోటీలు.. తేదీలు ఇవే.. సెప్టెంబర్ 21,22 తేదీల్లో కరీంనగర్ రేకుర్తిలోని సాన్వీ కళాశాలలో బాలబాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. 23,24న రేకుర్తి ఢిల్లీ డిఫెన్స్ కాలేజీలో బాలబాలికలకు వాలీబాల్ పోటీలు ఉంటాయన్నారు. 25,26న నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఖోఖో పోటీలు నిర్వహిస్తారు. 27న ఢిల్లీ డిఫెన్స్ కాలేజీలో హ్యాండ్బాల్ పోటీలు, 28న జీనియర్ అకాడమీ కరీంనగర్లో చెస్ పోటీలు ఉంటాయన్నారు. 29న స్పోర్ట్స్ స్కూల్లో వుషు, రెజ్లింగ్, జిమ్నాస్టిక్ పోటీలు, 30న అంబేడ్కర్ స్టేడియంలో బాలురకు క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు బాస్కెట్బాల్, రగ్బీ, కరాటే, బాక్సింగ్, తైక్వాండో, తాంగ్తా పోటీలు నిర్వహిస్తారు. 2న జగిత్యాలలోని పొన్నాల గార్డెన్లో బాలబాలికలకు కురాషా, గట్కా, మల్లాకంబ్, ఫెన్సింగ్ పోటీలు, 3న ఇదే వేదికపై కలరిపయట్టు, వెయిట్లిఫ్టింగ్, స్కేటింగ్, సాఫ్ట్బాల్ పోటీలు నిర్వహించనున్నారు. 5న గోదావరిఖనిలోని జేఎన్ స్టేడియంలో బాలబాలికలకు బేస్బాల్, ఫుట్బాల్ పోటీలు ఉంటాయి. 6న తిమ్మాపూర్లోని శ్రీచైతన్య కాలేజీలో ఆర్చరీ పోటీలు, 7న అంబేడ్కర్ స్టేడియంలో బాలికలకు క్రికెట్ పోటీలు, బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహిస్తారు. 8న స్టోర్ట్స్ స్కూల్ కరీంనగర్లో బాలికలకు అథ్లెటిక్ పోటీలు, బాలబాలికలకు స్విమ్మింగ్ పోటీలు ఉంటాయి. ఇక్కడే 9న బాలురకు అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తారు. 26న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు హాకీ పోటీలు, 28న కరీంనగర్ రేకుర్తిలోని ఎస్వీజేసీ మైదానంలో నెట్బాల్ పోటీలు, 30న అంబేడ్కర్ స్టేడియంలో సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇదే రోజు నగరంలోని కేహెచ్ఆర్ అకాడమీలో బాలబాలికలకు టేబుల్ టెన్నీస్ పోటీలు ఉంటాయి. 31న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తారు. టెన్నిస్, సాఫ్ట్ టెన్నిస్, స్క్వాష్, షూటింగ్, జూడో, సెపక్ తక్రా క్రీడల తేదీలు, వేదికలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. షెడ్యూల్ విడుదల చేసిన డీఐఈవో -
నేటి నుంచి రాష్ట్రస్థాయి యోగా పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న 13వ రాష్ట్రస్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్షిప్ ఏర్పాట్లను అసోసియేషన్ చైర్మన్ రవీందర్సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డిలు పరిశీలించారు. 25జిల్లాల నుంచి 900 మంది బాల బాలికలు పాల్గొననున్నట్లు తెలిపారు. పోటీలను ఉదయం 11గంటలకు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మేడిపల్లి సత్యం, ఆల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డి, రాష్ట్ర యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు జాల మనోహర్ ప్రారంభిస్తారని తెలిపారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు అల్లీపూర్ విద్యార్థులు
రాయికల్: మండలంలోని అల్లీపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న వేదశ్రీ, సీహెచ్ అశ్రిత రాష్ట్రస్థాయి యోగా పో టీలకు ఎంపికై నట్లు పీడీ కృష్ణ ప్రసాద్ తెలి పారు. ఈనెల 11, 12 తేదీల్లో కరీంనగర్లోని అల్ఫోర్ జూనియర్ కళాశాలలో యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థినుల ను సర్పంచ్ ఎంబారీ గౌతమి, హెచ్ఎం పోరండ్ల కిరణ్, ఉపాధ్యాయులు అభినందించారు. వేదశ్రీఅశ్రిత -
న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేయండి
జగిత్యాలక్రైం: జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని పోర్ట్పోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుకాయారాను న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్ గోవర్ధన్ రెడ్డికి కూడా వినతిపత్రం అందించారు. డీఎల్ఎస్ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకట మల్లిక్ సుబ్రమణ్యం శర్మను కలిసి అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, రాచకొండ శ్రీరాములు, న్యాయవాదులు పాల్గొన్నారు. చెరువుల డిమార్కింగ్ పూర్తి చేయాలిజగిత్యాల: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని 276 చెరువుల డిమార్కింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు ఈనెల 30లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి చెరువుకు హద్దులు, విస్తీర్ణం, భౌగోళిక స్థితి పక్కాగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు.ఇరిగేషన్, ఫిషరీస్, రెవెన్యూ, ఫారెస్ట్, అగ్రికల్చర్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డిమార్కింగ్ అనంతరం నివేదిక సమర్పించాలన్నారు. ఆత్మహత్యలు నివారించాలిజగిత్యాల: మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి సమస్యలను ముందుగా గుర్తిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చని డీఎంహెచ్వో సుజాత అన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వైద్యశాఖ, మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మనశ్శాంతి లేమితో బాధపడుతున్న వారిని ఒంటరిగా వదిలేయొద్దని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆరోగ్య నిపుణుల సహాయం పొందేలా ప్రోత్సహించాలని సూచించారు. సహాయం కోసం టెలిమానస్ 14416 టోల్ఫ్రీ నంబర్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యాధికారులు రాజేందర్రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుభాష్, తదితరులు ఉన్నారు. అమృత్ పనులు వేగవంతం చేయాలిరాయికల్: పట్టణంలో అమృత్ పనులను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ సూచించారు. గురువారం సంబంధిత పనులను పరిశీలించారు. పథకం ద్వారా పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందుతుందన్నారు. అనంతరం పురాతన చెన్నకేశవనాథ ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెంట బల్దియా కమిషనర్ మనోహర్గౌడ్ ఉన్నారు. సామూహిక సెలవుల్లో ఈ–కంప్యూటర్ ఆపరేటర్లు -
కోరుట్లలో త్వరలో ఈఎస్ఐ సేవలు
కోరుట్ల: పట్టణంలో త్వరలో ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి రానున్నాయని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. తనతండ్రి, మాజీమంత్రి జువ్వాడి నర్సిగరావు హయాంలోనే కోరుట్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, వెటర్నరీ విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్, ఫిల్టర్బెడ్, మున్సిపల్ కార్యాలయ భవనం, 5వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటవుతోందని తెలిపారు. ఈఎస్ఐ కార్డు ఉన్న వారికి ఉచితంగా సేవలు అందుతాయన్నారు. సాధారణ వైద్య పరీక్షలు, కంటి, దంత, ఈఎన్టీ, చర్మవ్యాధులకు చికిత్స అందించి ఉచితంగా మందులు ఇస్తారని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గానికి ఇప్పటివరకూ రూ.7.51 కోట్లు సీఎం సహాయనిధి డబ్బులు అందించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తేవాలన్నారు. నియోజకవర్గంలోని ఆర్అండ్బి రోడ్ల అభివృద్ధికి రూ.80కోట్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరామన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, మంత్రి వివేక్కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత, వైస్ చైర్మన్ మిద్, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, పన్నాల అంజిరెడ్డి, నాయకులు కొంతం రాజం, సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
కొడుకు, అమ్మ చనిపోయారు
ఆ దుర్ఘటన జరిగిన రోజు మా బాబు అరుణ్ సాయి(5)కి జ్వరం రావడంతో మా అమ్మ భాగ్యమ్మ(45)తో కలిసి హాస్పిటల్కు బస్సులో బయల్దేరాం. కిక్కిరిసిన బస్సు అదుపుతప్పడంతో అందరూ అరవడం మాత్రమే గుర్తుంది. లేచేసరికి హాస్పిటల్లో బెడ్పై ఉన్నాను. ఈ ప్రమాదంలో నా కొడుకు అరుణ్సాయి, మా అమ్మ భాగ్యమ్మను కోల్పోయాను. ఆ విషయం రెండు రోజుల వరకు నాకు చెప్పలేదు. నా కొడుకు వయసు ఉన్న స్కూల్కి వెళ్లే పిల్లలను చూస్తే ప్రాణం విలవిల్లాడుతోంది. చేతికి పలుచోట్ల రాడ్లు పడడంతో ఏ పని చేయలేకపోతున్నాను. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ప్రభుత్వం దయ తలసి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాను. – కొండ శైలజ, హిమ్మత్రావుపేట -
నవరాత్రి ఉత్సవాలకు బందోబస్తు
● జాతీయ లోక్ అదాలత్పై అవగాహన కల్పించాలి ● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ అశోక్కుమార్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే న్యాయమూర్తులను కలిసి పరిష్కరించాలన్నారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్, నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలని సూచించారు. ఈనెల 12న జరిగే జాతీయ మెగా లోక్అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈనెల 14న జరిగే గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. డయల్ 112కు వచ్చే కాల్స్ను స్వీకరించాలని పేర్కొన్నారు. వినాయక మండపాల వద్ద సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గణేశ్ శోభాయాత్రలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలన్నారు. డీజేలకు అనుమతి లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే యజమానులు, మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. తరచూ గొడవ పాల్పడేవారిని తహసీల్దార్ల ముందు బైండోవర్ చేయాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. వివిధ కేసుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చేతన్నితిన్, డీఎస్పీ రాములు, సీఐలు సుధాకర్, కరుణాకర్, సురేష్బాబు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రాజ్కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సైదులు, వేణు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. అడవులను సంరక్షించాలి అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు పోలీస్, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. పోలీస్, అటవీశాఖల అధికారులతో మాట్లాడారు. భూముల ఆక్రమణ, కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల వేటగాళ్లను ఉపేక్షించొద్దన్నారు. -
రచయిత కేవీ నరేందర్కు పురస్కారం
జగిత్యాల: జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత కేవీ.నరేందర్ను 2015 సంవత్సరం ఉత్తమ నవలా రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం నిపుణుల కమిటీ ఎంపిక చేసినట్లు వైస్ చాన్స్లర్ వెలుదండా నిత్యానందరావు ప్రకటించారు. బర్రె నవలకుగాను పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుండి 12 మంది రచయితలకు ఒక విభాగం కింద పురస్కారం ఇస్తుండగా.. నవలా విభా గంలో నరేందర్కు అవార్డు ప్రకటించారు. ఈ నెల 26న నాంపల్లి ప్రాంగణంలోని ఎన్టీరామారావు కళామందిర్లో రూ.30,116 తోపాటు పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరుకు చెందిన నరేందర్ ఇప్పటికే 35 అవార్డులు అందుకున్నారు. నవలా రచయితగా ఇది మొదటి పురస్కారం అందుకుంటున్నారు. బండరాళ్లు అడ్డువేసి.. నీటిని మళ్లించి ఇబ్రహీంపట్నం: వేసిన పంటలను కాపాడుకునేందుకు.. గుక్కెడు తాగునీటి కోసం రైతులు, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది నామమాత్రంగా కురిసిన వర్షాలకు మండలంలోని గంగనాల ప్రాజెక్టు కింద సుమారు నాలుగు వేల ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేస్తున్నారు. ఆ పంటలను కూడా కాపాడుకునేందుకు సదర్మట్ ప్రాజెక్టు నుంచి గేట్ల లీకేజీ ద్వారా వస్తున్న కొద్దిపాటి నీటిని గంగనాల మాటుకాలువకు మళ్లించేందుకు గోదావరిలో బండరాళ్లను అడ్డుగావేస్తున్నారు. చివరి ఆయకట్టుకు నీరు అందేందుకు పూడిక, పిచ్చి మొక్కలను జేసీబీ తో రైతులు తొలగించుకుంటున్నారు. గంగనాల ప్రాజెక్ట్ ఎగువభాగంలో గోదావరిపై సదర్మట్ నిర్మించడంతో గంగానాలకు నీరు రావడం కష్టమవుతోంది. దీంతో వేములకుర్తి, యామాపూర్, ఫకీర్కొండపూర్ గ్రామాల రైతులు పంటలను కాపాడుకునేందుకు ఇలా అష్టకష్టాలు పడుతున్నారు. -
ఒకరి అనుమానాస్పద మృతి
కరీంనగర్క్రైౖం: నగరంలోని కోతిరాంపూర్కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వన్టౌన్ పోలీసుల వివరాల ప్రకారం కోతిరాంపూర్కు చెందిన బండ మల్లేశం (45) గతంలో మేసీ్త్రగా పనిచేసేవాడు. ఐదేళ్లుగా మద్యానికి బానిసయ్యడు. బుధవారం రాత్రి మల్లేశం చాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డ్రంకెన్ డ్రైవ్లో ఒకరికి జైలు గోదావరిఖని: డ్రంకెన్ డ్రైవ్లో కేసులో ఆటో డ్రైవర్కు ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్రావు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన 8మందిని కోర్టులో హాజరుపర్చగా ఏడుగురికి రూ.21,000లు నగదు జరిమానా విధించగా, ఒకరికి జైలు శిక్ష విధించారన్నారు. అలాగే కమిటీ సర్వీస్లో భాగంగా రూ.3వేల నోట్బుక్స్ను విద్యార్థులకు వారి ద్వారా అందించారు. షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధంకోనరావుపేట(వేములవాడ): మండలంలోని బావుసాయిపేటలో షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధమైంది. గ్రామానికి చెందిన షేక్ హోలీగౌసీబీకి చెందిన గుడిసెలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గుడిసెతోపాటు సామగ్రి కాలిపోయింది. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ షేక్ యాస్మిన్పాషా, ఉపసర్పంచ్ తిక్కల నవీన్ పరామర్శించారు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ సంతోష్ సందర్శించి పంచనామా చేశారు. కాపర్ వైర్ చోరీమంథనిరూరల్: పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లకు కరెంటు సరఫరా అయ్యే వైర్ల నుంచి కాపర్ వైర్ను చోరీ చేసిన సంఘటన మంథని మండలం ఖానాపూర్లో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ గ్రామశివారులోని గోదావరినది, బొక్కలవాగుల నుంచి సుమారు 30మంది రైతులు విద్యుత్ మోటార్లు అమర్చుకుని పంటలకు సాగునీరు అందిస్తున్నారు. ఆ విద్యుత్ మోటార్లకు సరఫరా అయ్యే వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేసి అందులోని కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. గురువారం అటువైపు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. 30మంది రైతులకు సుమారు రూ.2నుంచి 3లక్షల వరకు నష్టం జరిగిందన్నారు. కాపర్ వైర్ దొంగిలించిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భర్త వద్దకు యువతిజగిత్యాలక్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కుటుంబసభ్యులు, బంధువులు రెండుకార్లలో వచ్చి తీసుకెళ్లిన ఘటన జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంలో బుధవారం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం సీతారాంపల్లికి వెళ్లారు. సదరు యువతి బంధువుల ఇంట్లో ఉండగా పోలీసులు గుర్తించి జగిత్యాలకు తీసుకొచ్చి భర్త ప్రశాంత్కు అప్పగించారు. ● కాంగ్రెస్ పాలనపై మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ పెద్దపల్లి: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోందని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల మోటార్లు అందుబాటులో ఉన్నా.. కావాలని ఆన్చేయడం లేదని ఆరోపించారు. కాళేశ్వరంలో చిన్నపాటి మరమ్మతులతో సమస్య పరిష్కరించగలిగే అవకాశం ఉన్నా.. కేసీఆర్పై కక్షతో ఉత్తర తెలంగాణను ఎండబెడుతున్నారని విమర్శించారు. శ్రీశైలంలో తాగునీటి అవసరాల పేరుతో తెలంగాణకు నీటిని నిరాకరిస్తూ.. మరోవైపు పోతిరెడ్డిపాడు, వెలిగొండ మార్గాల ద్వారా ఏపీ నీటిని తరలించుకుపోతున్నా.. ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారని, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటి పథకాలను పక్కనపెట్టారని, బీసీ సబ్ప్లాన్, 42 శాతం రిజర్వేషన్లు, గొర్రెల పంపిణీ వంటి హామీలను విస్మరించారని తెలి పారు. 22ఏ భూముల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, నాయకులు, అ ధికారులు పర్సంటేజీ తీసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 22ఏ నిబంధన, హైడ్రా రద్దు చేస్తామన్నారు. -
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
జగిత్యాలరూరల్: పంటల సాగు వివరాలు పక్కాగా లెక్కగట్టేందుకు వ్యవసాయ శాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈనెల చివరి వరకు సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. జిల్లా పరిధిలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ చొప్పున జిల్లావ్యాప్తంగా 289 మందిని నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పంటల వివరాలను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన సెల్ ఫోన్ యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 3,76,629 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా.. వలంటీర్లు వివరాల నమోదులో బిజీగా మారారు. జిల్లాలో 2,92,860 ఎకరాల్లో వరిసాగు జిల్లాలోని 20 మండలాలు 385 గ్రామాల్లో రైతులు మొత్తం 3,76,629 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 2,92,860 ఎకరాల్లో వరి, ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నరకాలు 2,06,074 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇతర సన్నరకాలు 21,486 ఎకరాలు, అలాగే దొడ్డురకం 65,300 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. 289 మంది వలంటీర్లు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక్కరు చొప్పున 289 మంది వలంటీర్లను నియమించారు. వారు తమకు కేటాయించిన గ్రామాల్లో 10 రోజులుగా సర్వే చేస్తూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ప్రతి రైతు తనకున్న భూమిలో ఏయే పంటలు సాగు చేశారన్నది పూర్తిస్తాయి వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లో శిక్షణ యాప్ వినియోగం, పంటల సాగు నమోదు విషయాలపై వలంటీర్లకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. వలంటీర్లు గ్రామాల్లో సర్వే చేసి ప్రభుత్వం నిర్దేశించిన 45 రోజుల్లో తమకు కేటాయించిన గ్రామాల్లో శాటిలైట్ ఆధారంగా డిజిటల్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. వివరాలను ప్రతీరోజు యాప్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. -
యోగా సంబరం
● కరీంనగర్లో 13వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్, జూనియర్ పోటీలు ● ఈనెల 11, 12వ తేదీన నిర్వహణ ● 890 మంది క్రీడాకారుల రాకకరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి యోగా క్రీడలకు కరీంనగర్ వేదిక కానుంది. 13వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్, జూనియర్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ ఆదేశాల మేరకు, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ల సహకారంతో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్లో ఈ నెల 11,12న పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 400 మంది బాలురు, 400 మంది బాలికలు, 50 మంది కోచ్లు, మేనేజర్లు, 40మంది రిఫరీలు, కలిపి మొత్తం 890 మంది ఈ పోటీల్లో పాల్గొననున్నారు. 8–10, 10–12, 12–14 సంవత్సరాల సబ్జూనియర్ విభాగాలతో పాటు 14–16, 16–18 సంవత్సరాల జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 30మందిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో అక్టోబర్ 3 నుంచి 10 వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్నారు. -
దొంగల ముఠా అరెస్ట్
● పట్టించిన సీసీకెమెరాలు ● తులంన్నర బంగారం.. ● ద్విచక్ర వాహనం స్వాధీనంరాయికల్: పట్టణంలోని ఇటిక్యాల క్రాస్ రోడ్ వద్దనున్న కల్లెడ నర్సు అనే వృద్ధురాలి మెడలోంచి బంగారం చోరీ చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి.. వారి నుంచి ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నామని జగిత్యాల డీఎస్పీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. రాయికల్ ఠాణాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటిక్యాల క్రాసింగ్ వద్ద ఒంటరిగా నివసిస్తున్న నర్సు ఇంట్లోకి ఈనెల 5న గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి తులంన్నర బంగారం దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై సుధీర్రావు, స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు పట్టణంలోని సీసీకెమెరాల పుటేజీలను పరిశీలించారు. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై పల్లికొండ నరేశ్, తోపారపు నవనీత్, కల్లెడ మనోజ్ తిరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితులు కుమ్మరిపల్లి బస్టాండ్ నుంచి రాయికల్కు వెళ్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి తులంన్నర బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రాయికల్ ఎస్సై సుధీర్రావు, క్రైంపార్టీ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, విజయ్, తిరుమల్ను డీఎస్పీ అభినందించారు. -
మున్సిపల్ క్వార్టర్స్ ఆక్రమణ
కరీంనగర్: జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన విలువైన స్థలాలు కొన్ని ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ, మున్సిపల్ ఆస్తులకు సంబంధించి 3ఎంఐజీ, 1ఎల్ఐజీ క్వార్టర్లపై ఆక్రమణలు, అనధికారిక కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలు జరిగినట్లు జిల్లాకేంద్రంలోని విజయపురికి చెందిన కుమార్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు ఫిర్యాదు చేశాడు. మున్సిపల్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరాడు. దీనికి విజిలెన్స్ శాఖ స్పందించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు లేఖ పంపించారు. ఈ క్రమంలో క్వార్టర్స్ విషయంలో వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్వార్టర్స్కు సంబంధించి గతంలోనే వారికి అలాట్ చేశారని తెలిసింది. అయితే అలాట్ ఎలా చేశారు..? ఉత్తర్వులు ఎలా జారీ చేశారు..? అనేది తెలియాల్సి ఉంది. పూర్తిస్థాయిలో విచారణ చేయాలని మున్సిపల్ శాఖకు లేఖ పంపించారు. జగిత్యాల రైతుబజార్ సమీపంలో క్వార్టర్స్, భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక భవనంలో ల్యాండ్ అక్వేషన్కు సంబంధించిన కార్యాలయం కొనసాగుతోంది. ఇది మున్సిపల్దే అయినప్పటికీ ఈ కార్యాలయం కొనసాగడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. విలువైన స్థలాల్లో ఆక్రమణలు జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన స్థలాలు అనేకం ఆక్రమణలకు గురవుతున్నాయి. కొత్తబస్టాండ్ సమీపంలో ఉద్యానవనం ఆనుకుని ఉన్న మున్సిపల్ స్థలంలో అనేక షెడ్లు వెలిశాయి. ఆ సమీపంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే అత్యధికంగా ఆదాయం లభిస్తుంది. ఆక్రమించుకున్న వారు చిన్నపాటి ఫీజు మున్సిపల్కు చెల్లిస్తూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇటు స్పోర్ట్స్ అథారిటీకి చెందిన విలువైన భూమిలో అనేక దుకాణ సముదాయాలు, రేకులషెడ్లు వెలిశాయి. ఈ స్పోర్ట్స్ అథారిటీలో నిధులు లేకపోవడంతో అక్కడ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనట్లు తెలిసింది. దీంతో కొందరు రేకులషెడ్లు నిర్మించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బినామీలు అత్యధికంగా ఉన్నారు. కొందరు షెడ్లు వేసి ఏకంగా ఇతరులకు అద్దెకు కూడా ఇస్తున్నారు. పాతబస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్లలో చిన్న గది అద్దెకు తీసుకుని అందులో వరండాలో రేకులషెడ్డు వేసుకుంటూ బల్దియా ఆదాయానికి గండి కొడుతున్నా రు. విలువైన స్థలాల్లో ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. టౌన్ విభాగం అధికారులు నిత్యం పర్యవేక్షించాలని, ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఆదాయానికి గండి... ఆస్తుల గుర్తింపేది విలువైన స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తే మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం లభిస్తుంది. మున్సిపల్ ఆస్తులు గుర్తించాలని ఇటీవల ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. బల్దియాలకు స్థిరాస్తులు సర్వసాధారణం. అలాంటి ఆస్తులను గుర్తించి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఎల్ఐఎస్), డబుల్ఎంట్రీ అక్రూవల్ బెస్ట్ అకౌంటెంటింగ్ సిస్టమ్ (డీఈఏడీఏఎస్)లో తప్పనిసరిగా నమోదు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని శ్రీరామ థియేటర్ చౌరస్తాలో బల్దియాకు క్వార్టర్ల్స్, బిల్డింగ్స్, రైతుబజార్ ఉన్నాయి. కొత్తబస్టాండ్లో ఖాళీ స్థలాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిని గుర్తించాలన్నప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోనట్లు తెలిసింది. రోడ్లపై ఆక్రమణలు మున్సిపల్ ఆస్తులు అన్యాక్రాంతం కావడంతోపాటు, జిల్లా కేంద్రంలో రోడ్లపై షెడ్లు వేసుకుని అక్రమంగా కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధానమైన యావర్రోడ్, తహసీల్ చౌరస్తా, కొత్తబస్టాండ్, టవర్సర్కిల్, పాతబస్టాండ్, గొల్లపల్లిరోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైనే పండ్ల విక్రయాలు చేపడుతున్నారు. గాజులు అమ్మేవారు, ఫుట్పాత్తోపాటు రోడ్లపైకి వచ్చి విక్రయిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మున్సిపల్ స్థలాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, కాంప్లెక్స్లు నిర్మిస్తే బల్దియాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. విచారణ చేస్తున్నాం జగిత్యాల మున్సిపాలిటీలోని 3ఎంఐజీ, 1 ఎల్ఐజీ క్వార్టర్లపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం. రెవెన్యూ విభాగం వారిని ఆదేశించాం. పూర్తిస్థాయిలో విచారించిన అనంతరం చర్యలు తీసుకుంటాం. గతంలోనే అలాట్ చేసినట్లు తెలిసింది. – సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్ -
సిరుల పంట.. ప్రకృతి బాట
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న డీఏవో భాస్కర్, నోడల్ అధికారివర్మికంపోస్ట్ తయారీ విధానం గొల్లపల్లి: రసాయనాల్లేని సాగుతో నేలకు బలం.. ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ స్పష్టం చేస్తోంది. రైతులు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించేందుకు స్థానిక వనరుల ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎంతగానో దోహదపడతాయి. విచక్షణారహితంగా వాడుతున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలతో భూమి నిర్జీవంగా మారుతున్న తరుణంలో శ్రీప్రకృతి వ్యవసాయంశ్రీ అన్నదాతకు కొత్త ఆశాకిరణంగా నిలుస్తోంది. ఘన జీవామృతం, పంచగవ్య, వేప గింజలు, సీతాఫల ఆకుల కషాయాల వంటి సహజ పదార్థాలతో నాణ్యమైన ఉత్పత్తులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్’ ద్వారా స్థానికంగా లభించే పశువుల వ్యర్థాలు, జీవ పదార్థాలు, వ్యవసాయ అవశేషాలతో భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి. క్షేత్రస్థాయిలో శిక్షణలు.. మట్టి నమూనాల సేకరణ ● రైతులు తమ ప్రాంత వాతావరణం, నేల స్వభావానికి సరిపడే పంటలను ఎంచుకునేలా వ్యవసాయ అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. ● ప్రతి క్లస్టర్లో దాదాపు 125 మంది రైతులతో బృందాన్ని ఏర్పాటు చేసి, శాసీ్త్రయ పద్ధతిలో మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. ● జిల్లా వ్యాప్తంగా 23 క్లస్టర్లులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ● ల్యాబ్ పరీక్షల ద్వారా నేలలోని పోషక లోపాలను గుర్తించి, వాటికి తగినట్లు సహజ ఎరువుల వాడకంపై సాంకేతిక సలహాలు అందిస్తున్నారు. ● ఘన జీవామృతం (నేలలో సూక్ష్మజీవుల వృద్ధికి), పంచగవ్య (పైరు ఎదుగుదలకు), వేప, సీతాఫల కషాయాలు (చీడపీడల నివారణకు) పొలాల్లోనే స్వయంగా తయారు చేసుకునేలా శిక్షణ ఇస్తున్నారు. సీఆర్పీలదే కీలక పాత్ర మహిళా సంఘాల పరిధిలోని క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు (సీఆర్పీ) ప్రత్యేక తర్ఫీదునిచ్చి రంగంలోకి దించారు. రైతులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ మట్టి సేకరణ, సహజ ఎరువుల తయారీ, అవగాహన సదస్సుల నిర్వహణలో వీరు వారధిగా వ్యవహరిస్తున్నారు. పెట్టుబడి తగ్గింది.. లాభం పెరిగింది నేను 12 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న. పదెకరాల్లో మామిడి, రెండెకరాల్లో వరి నాటేసిన. అంతర పంటగా కూరగాయలు పండిస్తున్న. ప్రకృతి సేద్యం కోసం ప్రత్యేకంగా నాలుగు గిరిజాతి ఆవులను కొనుగోలు చేసి జీవామృతం తయారుచేసి వాడుతున్న. రసాయనాల పెట్టుబడి భారం తగ్గింది. చెట్టుచుట్టూ బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. 15ఏళ్లుగా తోట దున్నలేదు. అదనంగా ఎరువు అవసరం లేదు. మామిడి తోటలకు మట్టి ద్రావణం స్ప్రే చేయడం ద్వారా పురుగు ఆకును తినకుండా ఉంటుంది. ఇంగువా, పుల్లటి మజ్జగా స్ప్రేచేయడం ద్వారా చెడు బ్యాక్టీరియా ఉండదు. తేనెటీగల ఉధృతి పెరిగి లాభం చేకూరుస్తాయి. అలాగే నీము అస్త్రం స్ప్రే చేయడం ద్వారా పంట ఎదుగుతుంది. – మిట్టపల్లి రాములు, రైతు, తుంగూర్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, క్షేత్ర ప్రదర్శనలను రైతులు అందిపుచ్చుకోవాలి. దశలవారీగా రసాయనాలను తగ్గించి, సహజ పద్ధతులను అలవర్చుకోవడం వల్ల భూసారం పెరగడంతో పాటు సమాజానికి విషరహిత ఆహారం అందుతుంది. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలతో ముందుకెళ్లాలి. – భాస్కర్, డీఏవో -
ఖతార్లో ఉద్యోగావకాశాలు
● ఈనెల 17 నుంచి ఫ్రీ ఇంటర్వ్యూలువేములవాడ: ఖతార్లో వివిధ ఉద్యోగాల భర్తీకి జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ఆ సంస్థ ప్రతినిధి చీటి సతీష్రావు తెలిపారు. బాగేజ్ హ్యాండ్లర్లు, క్లీనర్లు, వెయిట్రెస్లు, సౌస్చెఫ్లు, కుక్లు, క్యాటరింగ్ సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. బాగేజ్ హ్యాండ్లర్, క్లీనర్ పోస్టులకు ఖతార్ రూ.1,000 రియాల్స్ బేసిక్ వేతనం ఉండగా, సౌస్ చెఫ్కు రూ.5వేల రియాల్స్, సీనియర్ సీడీపీకి రూ.4వేల రియాల్స్, చీఫ్ స్టీవర్డ్కు రూ.3,500 రియాల్స్ వరకు వేతనం ఉంటుందని వివరించారు. ఇతర పోస్టులకూ పోస్టును బట్టి రూ.1,600 నుంచి రూ.3,200 రియాల్స్ వరకు గ్రాస్ వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత భోజనం, వసతి, రవాణాతోపాటు వీసా, టికెట్, వైద్య సదుపాయాలను సంస్థ కల్పిస్తుందని వెల్లడించారు. వివరాలకు సికింద్రాబాద్ 83320 52299, నిజామాబాద్ 86868 60999, ఆర్మూర్ 83320 13999, జగిత్యాల 83320 42299, సిరిసిల్ల 93476 61522, ఆఫీస్ 040–42029999 నంబర్లపై సంప్రదించవచ్చని తెలిపారు.సెప్టెంబర్ 17 : సికింద్రాబాద్ – జీటీఎం ఇంటర్నేషనల్ కార్యాలయం సెప్టెంబర్ 18: సిరిసిల్ల, జగిత్యాల– క్లీనర్ (బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు) సెప్టెంబర్ 19: నిజామాబాద్, ఆర్మూర్ (క్లీనర్, బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు) -
ఊరేగింపు.. పొంచిన ఉన్న ముప్పు
జగిత్యాలక్రైం: పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా గణేశ్ నవరాత్రోత్సవాల సందడి మొదలైంది. బొజ్జ గణపయ్యను మండపాలకు ఆహ్వానించేందుకు యువత, ఉత్సవ కమిటీలు పోటీపడుతూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. అయితే భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా సాగాల్సిన గణేశుడి ఆగమనం.. కొన్నిసార్లు ప్రమాదాలకు వేదికవుతోంది. గతంలో వినాయకుడి విగ్రహాన్ని మేళతాళాలు, భజనలతో మంగళకరమైన వాతావరణంలో మండపానికి తీసుకొచ్చేవారు. కొన్నేళ్లుగా మహారాష్ట్ర తరహాలో ఆగమనం పేరిట ఇటీవల విపరీత పోకడలు పెరిగిపోయాయి. ట్రాలీలు, లారీలపై వేలాడే భారీ డీజే సౌండ్ బాక్సులు, ఊపిరాడకుండా కాల్చే బాణసంచా పొగ, యువకుల చిందులు.. వెరసీ కొన్నిచోట్ల ప్రమాదకర విన్యాసంగా మారుతోంది. ఆర్భాటం, సోషల్ మీడియాలో రీల్స్ మోజు, విచ్చలవిడి పోటీతత్వం కారణంగా ఏర్పాటు చేస్తున్న డీజేలు, కళ్లు బైర్లు కమ్మేలా లేజర్ లైట్లు, ట్రాఫిక్ను స్తంభింపజేస్తూ చేస్తున్న విన్యాసాలు పండుగ ఆనందాన్ని మిగల్చకపోగా.. పచ్చని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అధికార యంత్రాంగం సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. ఆదేశాలు పాటించాల్సిందే.. నిబంధనలు కఠినతరం నవరాత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఆగమనం పేరిట నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డీజేలపై నిషేధం ఉంది. రహదారులపై ట్రాఫిక్కు ఆటంకం కలిగించొద్దు. విగ్రహాల తరలింపు వేళ ప్రమాదకర స్టంట్లు చేయొద్దు. – అశోక్కుమార్, ఎస్పీ -
ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ
● కలెక్టర్ సత్యప్రసాద్ కరీంనగర్: పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అంటూ ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ అని కలెక్టర్ సత్యప్రసా ద్ అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన తన రచనల ద్వారా ప్రజాసమస్యలు, సామాజిక రుగ్మతలు, అన్యాయాలను ఎత్తిచూపుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చారన్నారు. సామాజిక మార్పు కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలపై కాళోజీకి అపారమైన అభిమానం ఉండేదన్నారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్ పాల్గొన్నారు. భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలిపెగడపల్లి: భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండలంలోని ల్యాగలమర్రిలో జరుగుతున్న రీ సర్వేను బుధవారం పరిశీలించారు. సర్వేలో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతి సర్వే నంబర్ను వరుస క్రమంలో కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఇది రైతులకు ఎంతో మేలని, ఇందుకు సహకరించాలని రైతులకు సూచించారు. సర్పంచ్ ఎల్గటూరి రవి, తహసీల్దార్ సయ్యద్ నిజామొద్దీన్, ఆర్ఐ శ్రీనివాస్, సర్వేయర్ తనూజ, రైతులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణలో సీసీకెమెరాలు దోహదంజగిత్యాలక్రైం: నేరాల నియంత్రణలో సీసీకెమెరాలు దోహదం చేస్తాయని జగిత్యాల డీఎస్పీ పురుషోత్తంరెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లో సర్పంచ్ కుకునూరి వంశీ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను ఆయన బుధవారం ప్రారంభించారు. ప్రజలు తమ వ్యాపార సముదాయాలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలను నియంత్రించవచ్చన్నారు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్, ఉపసర్పంచ్, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మాస శివరాత్రి పూజలుజగిత్యాలరూరల్: మాస శివరాత్రి సందర్భంగా జగిత్యాలరూరల్ మండలం పొలాస శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, లక్ష్మణ్ దంపతులు పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు నలమాసు గంగాధర్, భక్తులు పాల్గొన్నారు. విద్యార్థి దశ విలువైందికరీంనగర్: విద్యార్థి దశ విలువైందని ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరాదేవి అన్నారు. కళాశాలలో యుపోరియా–2026 పేరుతో బుధవారం వార్షికోత్సవం నిర్వహించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలన్నారు. రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ మాట్లాడు తూ.. చదువుతోపాటు, మానసిక ప్రశాంతత, మానవీయ విలువలు అలవర్చుకోవాలన్నారు. ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి రమేశ్బాబు మాట్లాడుతూ ప్రస్తుతం అర్టిఫిషియల్ ఇంటలీజెన్సీ నైపుణ్యాలను విద్యార్థులు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్ ప్రి న్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రయ్.. రయ్యంటూ..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జాతీయ రహదారి 563పై రాకపోకలు ప్రారంభం అయ్యాయి. 68 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి కరీంనగర్– వరంగల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కేవలం 40 నిమిషాల్లో రెండు నగరాల మధ్య వాహనాలు రాకపోకలు సాగించేలా ఈ రహదారిని నిర్మించిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రహదారి మానకొండూరు సమీపంలోని ఖాదర్గూడం వరకు అందుబాటులో ఉండేది. దుర్శేడ్ వద్ద ర్యాంపు నిర్మించకపోవడంతో పెద్దపల్లి నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందిగా మారిందన్న ‘సాక్షి’ కథనంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వారు కరీంనగర్– వరంగల్ సెక్షన్ దుర్శేడ్ వద్ద రోడ్డు చివర తాత్కాలిక ర్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్కు రాకపోకలు సాగించేందుకు వీలు చిక్కింది. జగిత్యాల– కరీంనగర్ సెక్షన్ పనులు మొదలయ్యే వరకు ఈ తాత్కాలిక ర్యాంప్ మీదుగా రాకపోకలు సాగనున్నాయి. ఈ రహదారిని అత్యంత వేగంగా పూర్తి చేసినందుకు హన్మకొండ కలెక్టర్ చేతుల మీదుగా ఎన్హెచ్–563 ప్రాజెక్టు డైరెక్టర్ కీర్తి భరద్వాజ్ అవార్డు అందుకోవడం విశేషం. ఇక అక్టోబరు మొదటి వారం నుంచి కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్ ద్వారా టోల్ చార్జీలు వసూలు చేయనున్నారు. దుర్శేడ్ వద్ద రోడ్డు చివర ఏర్పాటు చేసిన ర్యాంపుతో కరీంనగర్–వరంగల్– పెద్దపల్లి వెళ్లే వాహనాలకు కాస్త ఊరట లభించింది. రోడ్డు దిగాక.. కరీంనగర్ లేదా పెద్దపల్లి వైపు ఎలా వెళ్లాలి? అన్న విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. పెద్దపల్లి నుంచి వచ్చేవారు దుర్శేడ్ పద్మనాయక భవనం వద్ద యూటర్న్ తీసుకుని ర్యాంపుమీదుగా హైవే ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ వాహనదారులు తికమకపడితే పరస్పరం ఢీకొనే ప్రమాదముంది. పెద్దపల్లి నుంచి వచ్చే వారికి జగిత్యాల వైపు నిర్మించినట్లుగా శాశ్వత ర్యాంపులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ రహదారికి శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి వద్ద అండర్ పాస్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఎన్హెచ్ఏఐ అధికారులు స్పందిస్తూ.. తమ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేస్తే తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.దాదాపు రూ.రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో 59 కిలోమీటర్ల ఎన్హెచ్– 563 జగిత్యాల– కరీంనగర్ సెక్షన్కు ఇటీవల టెండర్లు పిలిచారు. ఇవి త్వరలోనే ఖరారవనున్నాయి. ఇరుకుగా ఉన్న జగిత్యాల– కరీంనగర్ రోడ్డుపై రాకపోకలు అంటే ప్రతీరోజూ ఆర్టీసీ, ప్రైవేటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంగాధర వద్ద రైల్వేగేట్తో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ అధికారులు టెండరు ఖరారయ్యేలోగా వాహనదారులకు వీలుగా ఉండేలా ట్రాఫిక్ను చక్కదిద్దేందుకు సిద్ధపడ్డారు. ఇందుకోసం దాదాపు రూ.9 కోట్లు విడుదల చేశారు. పలుచోట్ల రోడ్ల వెడల్పు, చెట్ల తొలగింపు, స్పీడ్ బ్రేకర్లు, ప్రమాదాలు జరిగే చోట సైన్ బోర్డులు ఏర్పాటు చేసే పని చేపడుతున్నారు. వరంగల్– కరీంనగర్ సెక్షన్లో పాత రహదారిని ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో 39కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. -
జేఎన్టీయూలో ప్లేస్మెంట్ డ్రైవ్
● వివిధ ఉద్యోగాలకు 82 మంది ఎంపిక కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ(నాచుపల్లి )లో వర్టికల్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రాంగణ నియామకాలు చేపట్టారు. ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ విభాగాలకు చెందిన 82 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికై నట్లు సంస్థ హెచ్ఆర్ సబర్ తెలిపారు. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అసెంబ్లింగ్ విభాగానికి 68 మంది, బీవైడీ సంస్థకు 14 మంది ఎంపికయ్యారు. అమ్మాయిలకు నెలకు రూ.20వేల వేతనం, ఉచిత భోజన వసతి, రవాణా, అబ్బాయిలకు నెలకు రూ.32,500 చెల్లిస్తారని పేర్కొన్నారు. హన్సన్ టెక్నాలజీస్ సంస్థలు ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా మేనేజ్మెంట్ రోల్కు సంబంధించి సీఎస్సీ విభాగంలో ఒకరు, ఐటీ విభాగంలో ముగ్గురు విద్యార్థినులు టెక్నికల్ రౌండ్కు ఎంపికయ్యారని, ఆఖరి రౌండ్లో ఎంపికై న వారికి ఏడాదికి రూ.6.7 లక్షల వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్ నరసింహ అభినందించారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ సతీష్కుమా ర్ కృషిని ప్రశంసించారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బోధన, బోధేనతర సిబ్బంది పాల్గొన్నారు. ఉపకరణల నిర్ధారణ శిబిరంకరీంనగర్: సమగ్ర శిక్ష అభియాన్ అలింకో ఆధ్వర్యంలో ఈనెల 10న కోరుట్ల, 11న జగిత్యాల డివి జన్లో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలి పారు. కోరుట్ల భవిత కేంద్రం, జిల్లాకేంద్రంలో పురాతన హైస్కూల్లో శిబిరం నిర్వహిస్తామన్నా రు. ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. ఆశావర్కర్లు చొరవ చూపాలన్నారు. -
కేసీఆర్కు కీడు కోరుకోవడం నేరం
● బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి ● షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్పై పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుజగిత్యాలక్రైం: రాష్ట్ర సాధకుడు కేసీఆర్కు కీడు జరగాలని కోరుకోవడం నేరపూరిత చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ చావు కోరుతూ డప్పు కొట్టిన షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్పై చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ కరుణాకర్కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ చావు కోరుతూ డప్పు కొట్టిన ఎమ్మెల్యే శంకర్తోపాటు, ఆ నేరాన్ని ప్రోత్సహించిన సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు. పార్టీలపరంగా భిన్నాభిప్రాయాలున్నా నేరాన్ని ప్రోత్సహించేలా ఎమ్మెల్యే శంకర్ కేసీఆర్ చావు కోరడం క్షమించరాని నేరమన్నారు. అసెంబ్లీలో జవాబు చెప్పలేక బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారన్నారు. శాసనసభ, పార్లమెంట్కు డ్రెస్కోడ్ ఉండదని, నల్ల దుస్తులతో నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్తున్న మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, అవమానించడం బాధాకరమన్నారు. అదే అసెంబ్లీలో బీజేపీ నాయకులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. కేసీఆర్ హయాంలో 24గంటలు సరఫరా అయిన విద్యుత్.. రేవంత్ పాలనలో ఎప్పుడు పోతుందో తెలియడం లేన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. కేసీఆర్ చావు డప్పు కొడతానన్న ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలు ఖండించారు. ఎమ్మెల్యే శంకర్పై పోలీసులు సుమోటాగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మున్సిపల్ మాజీ చైర్మన్లు విజయలక్ష్మీ, దేశాయ్, బీఆర్ఎస్ నాయకులు వొల్లం మల్లేశం, శివకేసరిబాబు, దుర్గన్న, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలి
కరీంనగర్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలని, బయోమెడికల్ వ్యర్థాలను వేరు చేసి కలర్ కోడెడ్ బిన్లలో నిల్వ చేసి ఏజెన్సీ ద్వారా తరలించాలని డీఎంహెచ్వో సుజాత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో టారిఫ్ బోర్డులు ఏర్పాటు చేసి వైద్యసేవలు, పరీక్షలు, సంబంధించిన చార్జీల వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ఆస్పత్రుల్లో క్లీనికల్ ఎస్లాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్, రికార్డులు ఉండాలని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ల్యాబ్లు నిబంధనల ప్రకారం ఉండాలన్నారు. ఆమె వెంట వైద్య సిబ్బంది ఉన్నారు. -
కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి ఇంటి రిజిస్ట్రేషన్
గొల్లపల్లి: పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా.. నకిలీ ధ్రువపత్రాలు, స్టాంపులు సృష్టించి ఏకంగా ఇంటినే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘరానా మోసం గొల్లపల్లి మండలంలోని తిరుమలాపూర్ (పీడీ) గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు, కార్యదర్శి తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చిన గొలుసుల రాములు కొన్నేళ్లుగా ప్రభుత్వ స్థలంలో ఇంటి నంబర్ 3–122/2 పేరిట ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నాడు. ఇటీవల ఆ ఇంటిని గ్రామానికే చెందిన గండికోట లక్ష్మణ్కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం పంచాయతీ కార్యదర్శి సంతకం, స్టాంపులతో నకిలీ ధ్రువీకరణ పత్రం, ఇంటి పన్ను రశీదును అక్రమంగా సృష్టించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు. తీగ లాగితే డొంక కదిలింది.. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, కొనుగోలుదారుడు లక్ష్మణ్ ఆ పత్రాలను పంచాయతీ రికార్డుల్లో నమోదు చేసుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి వద్దకు తీసుకొచ్చాడు. ఆ పత్రాలను నిశితంగా పరిశీలించిన కార్యదర్శి వాటిపై ఉన్నది తన సంతకం కాదని, నకిలీ స్టాంపులు వేసి ఫోర్జరీకి పాల్పడ్డారని గుర్తించి షాక్కు గురయ్యాడు. అందులో పొందుపరిచిన ఇంటి పన్ను రశీదు నంబర్ను రికార్డుల్లో పరిశీలించగా.. అది గతేడాది ఆగస్టులో జారీ చేసిన నీటి పన్ను రశీదు నంబర్గా తేలింది. నీటి పన్ను రశీదును ఇంటి పన్ను రశీదుగా మార్చి మోసానికి తెరలేపినట్లు నిర్ధారణ అయ్యింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీకి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్కు పాల్పడిన గొలుసుల రాములు, గండికోట లక్ష్మణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శి తిరుపతి గొల్లపల్లి పోలీస్స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొండగట్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పూజలు
మల్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ, ప్రసాదాలు అందించారు. కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, డీఎస్పీ పురుషోత్తం, సీఐ రాజ్కుమార్ ఎస్సై ఎస్.సందీప్, ఎన్.నరేశ్, ఆలయ అధికారులు సునీల్, అశోక్ పాల్గొన్నారు. -
కోరుట్లలో బీఆర్ఎస్ ఆందోళన
కోరుట్ల: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ గేటు వద్ద దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వ కుంట్ల విద్యాసాగర్రావు డిమాండ్ చేశారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అ నంతరం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా విద్యాసాగర్రావు మాట్లాడుతూ మాజీ మంత్రులైన సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించటం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చే స్తోందని ఆరోపించారు. మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షు డు లోక బాపురెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచులు,కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
రద్దీ ప్రకారం బస్సులు నడపాలి
విద్యానగర్(కరీంనగర్): వినాయక చవితి రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్ జోన్ పరిధిలోని రీజినల్ మేనేజర్లకు సూచించారు. మంగళవారం కరీంనగర్ బస్స్టేషన్ ఆవరణలోని తన కార్యాలయంలో రీజియన్ల ఆర్థిక స్థితిగతులపై సమీక్షించారు. వినాయక చవితి సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా తగిన బస్సులు నడపాలని సూచించారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ రీజినల్ మేనేజర్లు డి.విజయభాను, బి,రాజు, ఎ.శారీరం, ఎస్, భవానీప్రసాద్, కరీంనగర్ జోన్లోని పర్సనల్ ఆఫీసర్స్ ఎం.సంపత్ కుమార్, వీరన్న, శ్యామలదేవి పాల్గొన్నారు. -
ఇటిక్యాల పెద్దవాగులో తోడేళ్లు
ఇటిక్యాల వాగులోంచి ఇసుక అక్రమ రవాణా రాయికల్: రాయికల్ మండలం ఇటిక్యాలలోని పెద్ద వాగు నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. గ్రామంలోని హనుమాన్ ఆలయ అభివృద్ధి పేరిట కొంత మంది ఆర్నెళ్ల కాల వ్యవధికి రూ.10 లక్షల టెండర్ను దక్కించుకున్నారు. అప్పటినుంచి ఎవరికీ అనుమానం రాకుండా హనుమాన్ ఆలయ అభివృద్ధి అంటూ దేవుని పేరిట రశీదులు తయారుచేయించి ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఇందుకోసం వాగు శివారులో.. పరిసర ప్రాంతాల్లో ట్రాక్టర్ డ్రైవర్లకు చిట్టీ అందిస్తున్నారు. ఒక్కో చిట్టీకి అదే గ్రామానికి ఇసుక అయితే రూ.300, ఇతర గ్రామాలకు తరలిస్తే రూ.500 వసూలు చేస్తున్నారు. ప్రకృతి సంపద అయిన ఇసుకను హనుమాన్ ఆలయ అభివృద్ధి పేరిట రశీదులు తయారు చేసి ఒక్కో ట్రాక్టర్కు రూ.300 నుంచి రూ.500 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇదంతా తెలిసినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాయికల్ నుంచి మెట్పల్లి వరకు తరలింపు ఇసుకకు డిమాండ్ ఉండటంతో మల్లాపూర్ మండలం సాతారం, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్పల్లి పట్టణంతోపాటు, పరిసర గ్రామాల నుంచి ట్రాక్టర్లు ఇటిక్యాలలోని పెద్దవాగు నుంచి ఇసుకను తీసుకెళ్తున్నాయి. ఒక్కో ట్రిప్పుకు సుమారు రూ.2500 నుంచి ప్రాంతాలను బట్టి రూ.3500 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతిరోజు సుమారు 50 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. చూసీచూడనట్లుగా మైనింగ్ అధికారులు పెద్దవాగు నుంచి భారీ ఎత్తున ఇసుక రవాణా అవుతున్నా.. రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక ట్రాక్టర్లను ఎవరైనా అడ్డుకుని ప్రశ్నిస్తే.. సంబంధిత అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పినట్లు బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం. అనుమతి లేకుండా.. కేవలం ఆలయ అభివృద్ధి కోసమంటూ ఇసుకను తరలిస్తున్న వారితోపాటు ఇందుకు సహకరిస్తున్న సంబంధిత శాఖల అధికారులపై గ్రామస్తులు, పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు.అక్రమంగా రవాణా చేస్తే చర్యలు అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుకను ఇళ్ల నిర్మాణాలకు తరలించాలి. వీఆర్ఏలు, జీపీవోలు ఎప్పటికప్పుడు ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నారు. – నాగార్జున, తహసీల్దార్, రాయికల్ -
కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
జగిత్యాలజోన్: రోడ్డు ప్రమాదాల పరిహారం కేసులు అత్యధికంగా పరిష్కారం అయ్యేలా ఇన్సూరెన్సు సంస్థలు చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో మంగళవారం ఇన్సూరెన్సు కంపెనీల న్యాయవాదులు, ప్రతినిధులతో సమీక్షించారు. కేసులు వేసినవారు, ఇన్సూరెన్స్ సంస్థలు సయోధ్య కుదుర్చుకోవాలన్నారు. మానవత దృక్పథంతో కేసులు పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, కటుకం చంద్రమోహన్, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులు పాల్గొన్నారు. కల్తీ ఎరువులు అమ్మితే కేసులురాయికల్: ఫర్టిలైజర్ దుకాణాల్లో కల్తీ ఎరువులు అమ్మితే సదరు దుకాణాలపై కేసులు నమో దు చేసి సీజ్ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ సూచించారు. మంగవారం రా యికల్ పట్టణంతోపాటు మండలంలోని వివిధ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. రిజి ష్ట్రర్లు, బిల్బుక్లు పరిశీలించారు. తప్పనిసరి గా రిజిస్టర్లు వివరాలు పొందుపర్చాలని సూ చించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి ముక్తేశ్వర్, ఏఈవో నరేశ్ పాల్గొన్నారు. 12న లోక్ అదాలత్జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మట్ట సరిత తెలిపారు. జిల్లా కోర్టులో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాజీ చేసుకోదగ్గ కేసులన్నింటినీ లోక్అదాలత్ ద్వారా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇరువర్గాల రాజీతో కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందన్నారు. సివిల్, క్రిమినల్, మోటార్వాహనాలు, కుటుంబ తగాదాల కేసులు పరిష్కరిస్తామని వివరించారు. సమాచారం కోసం న్యాయ సేవా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ గృహ నిర్బంధంజగిత్యాలక్రైం: ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి బయల్దేరిన జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతను మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేవంత్రెడ్డికి పాలన చేతకాక రౌడీరాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ సాధించినందుకు చావుడప్పు కొట్టారా..? తెలంగాణను ప్రపంచచిత్రపటంలో మొదటి స్థానంలో నిలిపినందుకా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్రెడ్డి పాలనకు చరమగీతం పాడుతారన్నారు. కేసీఆర్ ఇంటి గేట్ తాకినా ప్రజలంతా అగ్గిలా మండుతారని తెలిపారు. బీర్పూర్ నృసింహస్వామి ఆలయ ఈవోగా కిరణ్జగిత్యాలరూరల్: బీర్పూర్లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవోగా కొడిమ్యాల మండలం నల్లగొండలోగల శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవోగా పనిచేస్తున్న బి.కిరణ్కుమార్ను నియమించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఈవో శ్రీనివాస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. -
రేవంత్రెడ్డి పాలనకు నూకలు చెల్లాయి
జగిత్యాల: సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రంలో నూకలు చెల్లాయని, అది జగిత్యాల నుంచే ప్రారంభమైందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లాకేంద్రంలో చేసిన ధర్నాలో మాట్లాడారు. జగిత్యాల ఉద్యమాల గడ్డ అని, రేవంత్రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం నిజమవుతోందన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నీరుగార్చుతున్నారని, కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీరు తరలించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. ఎల్నినో ప్రభావంతో యాసంగి చేసుకునే పరిస్థితి లేదన్నారు. యూరియా సరఫరాపై అనేక ఆంక్షలు పెట్టి రైతులను గోస పెడుతున్నారని, వెంటనే యాప్ తొలగించి రైతులకు యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతుల కోసం రైతుబీమా, రైతుభరోసా ప్రవేశపెట్టారని, ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేశారని, వైఎస్సార్ ప్రారంభించిన పథకాలు కేసీఆర్ పటిష్ఠంగా అమలు చేశారని, కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందోనని రేవంత్రెడ్డి పథకాలను అణగదొక్కుతున్నారని తెలిపారు. జగిత్యాల ప్రజలు కేసీఆర్ను చూసి ఇక్కడ సంజయ్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే రేవంత్రెడ్డి పక్కన చేరి గుట్టలు, భూములు దోచుకుంటున్నాడని విమర్శించారు. మహిళలను అవమానించిన రేవంత్రెడ్డి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్ పెంపు, మహిళలకు రూ.2500, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీల హామీ నెరవేర్చలేదన్నారు. -
అమ్మతనానికి ఆపద..!
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లే జరుగుతున్నాయి. సిజేరియన్తో మహిళల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. ప్రతి ఆస్పత్రిలో సిజేరియన్లే ఎక్కువగా అవుతుండడంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానానికి చేరి ఆందోళన కలిగిస్తోంది. బరువు తక్కువగా ఉన్నా... గర్భిణులు బరువు తక్కువగా ఉన్నా హైరిస్క్గా గుర్తిస్తారు. 18 ఏళ్లలోపు, 35ఏళ్లపైబడి గర్భం దాల్చిన మహిళలు హైరిస్క్లోకి వెళ్తారు. చిన్న వయస్సులో అయితే శారీరక ఎదుగుదల లేకపోవడం, పెద్ద వయస్సులో అయితే గర్భధారణ సమస్యగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో 18 ఏళ్లలోపు, 35 ఏళ్ల పైబడిన వారిని 159మందిని గుర్తించారు. అలాగే ఊబకాయం, అధిక బరువు ఉన్న వారు కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. పోషకాహారం లేకనే.. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పోషకాహా రం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. గ్రామీ ణప్రాంతాల్లో సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఉప్పు అధికంగా తీసుకోవడం ద్వారా హైరిస్క్లోకి వెళ్తున్నారు. గ్రామీణులకు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అందిస్తుంటారు. కానీ.. దానిని కొందరు తీసుకోకపోవడంతో సమస్యలు ఎదుర్కోవా ల్సి వస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, పండ్లు, గుడ్లు తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి భోజనం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమయపాలన పాటించకపోతే పోషకాహార లోపంతో బిడ్డ 9 నెలలు నిండకముందే తక్కువ బరువుతో జన్మించే అవకాశం ఉంటుంది. వీరికి గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మార్పు రాకపోవడంతో హైరిస్క్ కేసులు పెరుగుతున్నాయి. జగిత్యాల: హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గర్భధారణ సమయంలో వివిధ అనారోగ్య సమస్యలు రావడంతో ప్రసవం సమయంలో ప్రాణాలకే ముప్పు వస్తోంది. ఒకానొక దశలో తల్లితోపాటు, శిశువులూ మృత్యువాత పడిన ఘటనలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 5,884 మంది హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి గర్భం దాల్చినప్పటి నుంచే మహిళలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతినెలా చెకప్ చేయించుకోవడంతోపాటు డాక్టర్ సలహాలు తప్పనిసరిగా పాటించాలి. సాధారణంగా 6, 8వ నెల వచ్చేసరికి బీపీ, షుగర్ రావడం.. హైపర్ టెన్షన్.. డయాబెటిస్.. థైరాయిడ్ వంటి సమస్యలు వస్తుంటాయి. ఆ సమయంలో డాక్టర్లు ఎకై ్సర్సైజ్లు చేయిస్తుంటారు. వీటిని గర్భిణులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సిందే. అయితే గ్రామీణప్రాంతాల మహిళల్లో ఎక్కువగా అవగాహన లేకపోవడంతో గర్భధారణ తర్వాత పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో బలహీనతగా మారి ప్రసవ సమయంలో ఇబ్బందిపడటంతోపాటు కొన్నిసార్లు మృత్యువాత పడిన సంఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. మొదటి కాన్పులో సిజేరియన్ అయితే రెండో కాన్పులో అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్లీ సిజేరియన్ చేయాల్సి వస్తే అది హైరిస్క్గా మారుతుంది. ప్రసవం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. పర్యవేక్షణ అవసరం పరీక్షలు చేయించుకోవాలి గర్భం దాల్చిన మహిళా ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సరైన పౌషకాహారం తీసుకోవాలి. పరీక్షలు చేయించుకుంటే తల్లీబిడ్డ ఎలా ఉన్నారన్నది తెలుస్తుంది. దానిని బట్టి వైద్యులు మందులు రాస్తారు. 9 నెలలు నిండే వరకు ప్రతినెల స్కానింగ్ చేయించుకోవాలి. – జైపాల్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో -
సీజనల్ వ్యాధులు నివారించాలి
పెగడపల్లి: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం, తిరుమలాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. సిబ్బంది పనితీరు, వైద్య సేవలు, మందుల నిల్వలు, హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. వైద్య సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని సూచించారు. వైద్యాధికారి నరేశ్, సీహెచ్వో సందీప్, హెచ్వీలు జయశీల, జ్యోతి, సిబ్బంది మౌనిక, లక్ష్మీ, భాస్కర్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027
కరీంనగర్స్పోర్ట్స్: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ పరిధిలోని మై భారత్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతోందని ఉమ్మడి జిల్లా యువజన అధికారి గోలి తిరుపతి రెడ్డి అన్నారు. మంగళవారం మై భారత్ కార్యాలయంలో మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరిగే జాతీయ యువజనోత్సవంలో 15 నుంచి 29ఏళ్ల మధ్య వయసు కలిగిన యువతీ యువకుల నుంచి కరీంనగర్ జిల్లా మై భారత్ కార్యాలయం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియ డిజిటల్ క్విజ్, వ్యాస రచన, జిల్లా స్థాయి ప్రజెంటేషన్, రాష్ట్ర స్థాయి డైలాగ్, న్యూఢిల్లీలో జరిగే నేషనల్ గ్రాండ్ ఫినాలే వరకు బహుళ దశల్లో పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన ప్రతినిధులు 2027 జనవరి 10 నుంచి 12 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి కలిగిన కరీంనగర్ జిల్లా యువతీ యువకులు మై భారత్ అధికారిక పోర్టల్ ద్వారా తమ పేరు, పుట్టిన తేదీ, జిల్లా వివరాలతో సైన్అప్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, అనంతరం లభించే ఐడీ ద్వారా క్విజ్, పోటీల్లో పాల్గొనవచ్చునని అన్నారు. జిల్లా కార్యక్రమ అధికారి జి.కిరణ్ కుమార్ పాల్గొన్నారు. యువత ఆలోచనలకు జాతీయ వేదిక ఉమ్మడి జిల్లా యువజన అధికారి గోలి తిరుపతి రెడ్డి -
ఉద్యోగాల పేరిట రూ.44 లక్షలు వసూలు
కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్గా పరిచయం చేసుకుని ప్రభుత్వశాఖలు, యూని వర్సిటీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన దుడపాక తిరుపతి అలియాస్ తిరుపతిరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 21మంది నుంచి రూ.44 లక్షలు వసూలు చేసినట్లు నిర్ధారించారు. కేసు వివరాలను టూ టౌన్ పోలీస్స్టేషన్లో మంగళవారం టౌన్ ఏసీపీ వెంకటస్వామి వెల్లడించారు. నగరంలోని విద్యానగర్లో అద్దెకుంటున్న దుడపాక తిరుపతిరావు శాతవాహన యూనివర్సిటీలో బోట నీ ప్రొఫెసర్గా చెప్పుకుంటూ తిరిగేవాడు. తనకు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు. విద్యానగర్కు చెందిన పురుషోత్తం మమత కూతురు కీర్తనకు శాతవాహన యూనివర్సిటీలో డేటాఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకు రూ.1.50 లక్షలు డిమాండ్ చేశాడు. మమత రూ.65వేలు నగదుగా ఇచ్చింది. మరో రూ.85వేలు తిరుపతి భార్య లావణ్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేసింది. కొద్దిరోజులకు కీర్తనకు రికార్డు అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చిందని నకిలీ నియామక ఉత్తర్వులు సృష్టించాడు. విషయం తెలిసి మమత బంధువులు సైతం తిరుపతిని సంప్రదించడంతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి సుమారు రూ.8.50 లక్షలు వసూలు చేశాడు. వారికి నియామక పరీక్షలు నిర్వహించి, ఓఎంఆర్ షీట్లు కూడా తయారు చేశాడు. ఇందుకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్లో ఓ టీంను ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తంగా 21మంది నుంచి రూ.44లక్షలు తీసుకున్నాడు. తరువాత తిరుపతి ఇచ్చినవి నకిలీ నియామక పత్రాలుగా రుజువు కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం శాతవాహన యూనివర్సిటీ సమీపంలో దుడపాక తిరుపతిరావును టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. తిరుపతికి ఈట్ల సత్యం, రాజశేఖర్తో పాటు మరికొందరు సహకరించారని, వారిని త్వరలో పట్టుకుంటామని ఏసీపీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు దుడపాక తిరుపతి అరెస్ట్ వివరాలు వెల్లడించిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి -
అంగట్లో ఎస్యూ కొలువులు?
కరీంనగర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో తాజాగా చేపట్టిన ఔట్ సోర్సింగ్ నియామకాలపై వివాదం ముదురుతోంది. ఎస్యూలో కొలువుల పేరిట డబ్బులు దండుకున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేయగా.. ఇటీవల జరిగిన ఔట్సోర్సింగ్ ఎంపిక ప్రక్రియలోనూ అక్రమాలు జరిగా యని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 36 మంది ఎంపిక ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఇటీవల ఎస్యూలో నియామకాలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ సమాచారం బయటకు పొక్కకుండా వ్యవహరించారు. వివిధ విభాగాలకు 36మందిని ఎంపిక చేసి, నియామక పత్రాలు అందించారు. వీరి నియామకంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పలువురి విజ్ఞప్తులను ఎస్యూ అధికారులు చెత్తబుట్టలో వేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎంపికై న గ్రూప్–4 ఉద్యోగులకు శాతవాహన యూనివర్సిటీలో పోస్టింగ్ ఇచ్చారు. అయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హవానే సాగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. నియామకాలపై ఆరోపణలు వర్సిటీలో 36 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు అక్రమంగా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. వీరికి రాజకీయ పలుకుబడితో చేరిన ఓ ఉద్యోగి సాయం చేశాడని వినికిడి. షాడో వీసీగా పేరున్న సదరు వ్యక్తి ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. వీరికి వర్సిటీలోని వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. వర్సిటీలో చేపట్టిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామాకాలపై విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై శాతవాహన వీసీ, రిజిస్ట్రార్ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.విచారణ జరిపించాలి వర్సిటీలో సరైన నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టిన నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలి. నియామకాల్లో ఎలాంటి పారదర్శకత పాటించలేదు. రోస్టర్ విధానం, ప్రభుత్వ నిబంధనలను విస్మరించారు. విధులకు హాజరుకాకపోయినా కొందరు వేతనాలు పొందుతున్నారు. కనీస విద్యార్హతలు లేనివారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. – కరికె మహేశ్, శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ మరోసారి తెరపైకి యూనివర్సిటీ నియామకాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు పెద్దమొత్తంలో వసూలు? ఇటీవల జరిగిన 36మంది ఎంపిక ప్రక్రియపై అనుమానాలు పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటున్న విద్యార్థులు -
మా సంగతేంటి..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణి మారుపేర్లపై తొలిసారిగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయడం కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపింది. సంస్థలో రెండుపేర్లతో పనిచేస్తున్న కార్మికులను ఇప్పటికే తాము గుర్తించామని, దీనిపై కమిటీ వేశామని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడాన్ని సింగరేణి వ్యాప్తంగా కార్మికలోకం స్వాగతిస్తోంది. అదే సమయంలో తమ సమస్యలను కూడా పరి ష్కరించాలని విశ్రాంత కార్మికులు వేడుకుంటున్నా రు. అదే రెండుపేర్ల సమస్య తమనూ నేటికీ వెంటా డుతోందని, కనీసం తాము మరణించేలోగానైనా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వంతో విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో అనేక ఇబ్బందులు పడుతున్నతా ము.. ఆస్తుల మార్పిడి, ఆధార్కార్డులు, ఇతర గు ర్తింపు కార్డుల విషయంలో చెప్పలేని పాట్లు, మానసిక వ్యధ అనుభవిస్తున్నామని వాపోతున్నారు. ఆస్తులు, పింఛన్ల విషయంలో.. ఇప్పటివరకూ రిటైర్డ్ అయిన వారిలో 35వేల మందికిపైగా విశ్రాంత కార్మికులు రెండుపేర్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరంతా 70 నుంచి 80ఏళ్లు పైబడిన వారే. వీరిలో సగానికిపైగా రెండు ఆధార్కార్డులు తీసుకున్నారు. ఇదే వీరికి శాపంగా పరిణమించింది. ప్రస్తుతం బ్యాంకులు కేవైసీలు అడుగుతున్న క్రమంలో ఆధార్కార్డులు మ్యాచ్ కాక సగానికిపైగా కార్మికుల పింఛన్లు నిలిచిపోయాయి. ఇప్పటికీ వీరి ఆస్తులు వారి సంతానం పేరిట మారకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. తాజాగా కాస్తోకూస్తో వస్తున్న పింఛన్లు కూడా నిలిచిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. తమకు కూడా ఆలియాస్ పేరుతో అవకాశం కల్పించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరుతున్నారు. -
బయోమందుల దందా
కరీంనగర్ అర్బన్: జీవ ఎరువుల దందా కరీంనగర్ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎరువుల బస్తాలతో అంటగడుతూ మాటల గారడీతో జేబులు నింపుకుంటున్నారు. బయోఎరువులు, మందుల పేరుతో రూ.కోట్లలో దందా సాగుతుండగా నియంత్రించేవారే కరవవడం అనుమానాలకు తావిస్తోంది. మార్కెట్లో వాటి పేరిట నకిలీవి అంటగడుతుండగా వాస్తవానికి బయోఎరువులు అమ్మడం నిషేధమని అధికారులు చెబుతున్నారు. కానీ డీలర్లకు, కంపెనీలకు కాసుల వర్షం కురుస్తునే ఉంది. విక్రయాల పరిమితిని బట్టి ఏజెంట్లు, డీలర్లకు ప్రోత్సాహకాలు, టూర్లు వంటి ఆఫర్లు ఇస్తున్నారు. డీలర్లే వ్యాపారం చేస్తుండగా ఏఈవోలు, ఏవోలకు కంటపడలేదంటే ఆశ్చర్యమే. రూ.లక్ష దాటితే టూర్లు, ప్యాకేజీలు కరీంనగర్ అర్బన్, హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండూరు, గంగాధర, చొప్పదండి, కొత్తపల్లి, శంకరపట్నం, తిమ్మాపూర్ తదితర మండలాల్లోని ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కరీంనగర్లో హోల్సేల్ డీలర్లు ఉన్నారు. బడా కంపనీలకు హోల్సేల్ డీలర్గా వ్యవహరించే వ్యక్తే ఈ దందాలో కీలకమని స్పష్టమవుతోంది. విక్రయాలను బట్టి దుకాణ డీలర్లకు కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. సదరు ఎరువులు, మందులు అతి చౌక ధర కాగా వీరు మాత్రం పదింతలు అధిక ధరకు విక్రయిస్తున్నారు. దానిపై ఉండే ఎంఆర్పీ ధరలో సగానికి పైగా డబ్బులు కమీషన్ రూపంలో ఇస్తుండటంతో దుకాణాల డీలర్లు వీటి విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. సదరు మందుల విలువ రూ.లక్ష దాటితే విహార యాత్రలు, విలువ గల బహుమతులను అందిస్తున్నారు. పలువురు డీలర్లను ఇటీవల గోవా టూర్కు తరలించి సకల మర్యాదలు చేశారన్న ఆరోపణలున్నాయి. సందర్శనలు.. సమావేశాలు రోడ్డును ఆనుకుని ఉన్న రైతుల పొలాలను ఎంపిక చేసి తమ కంపెనీల మందుల ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. గ్రామంలోని రైతులను మభ్య పెడుతూ పంటచేలలో క్షేత్రసందర్శనలు పెడుతూ తమ ఉత్పత్తుల వాడకంతో పంట ఏపుగా పెరిగిందంటూ మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. రైతులను పిలిచి రచ్చబండ వద్ద కుర్చీలు వేసి టీ, టిఫిన్లు పెట్టి పెద్దపెద్ద స్క్రీన్లపై రైతులతో మాట్లాడిస్తూ బయో ఉత్పత్తులు వాడేలా చూస్తున్నారు. వివిధ గ్రామాల రైతులను పిలిచి వారితోనే మాట్లాడించి బయో మందులు వాడమని చెప్పిస్తున్నారు. ఇక ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఏఐ రూపొందిత రీల్స్, వీడియోలతో ఆకర్షణీయ ప్రకటనలూ చూపి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దుకాణదారులు అరువుపై మందులను ఇవ్వడం కూడా రైతులు బయోమందుల వైపు మొగ్గు చూపేలా సఫలీకృతులవుతున్నారు. అయితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్ తెలిపారు. బయో మందుల విక్రయానికి ప్రభుత్వ అనుమతి లేదని, వాటిని రైతులు వినియోగించి నష్టపోవద్దని సూచించారు. టార్గెట్ దాటితే టూర్లు, ప్యాకేజీలు బోగస్ కంపెనీల రూ.కోట్ల వ్యాపారం అన్నదాతల అమాయకత్వమే పెట్టుబడి -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
జగిత్యాల: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నా రు. కలెక్టరేట్లో ఎస్పీ అశోక్కుమార్, అధికారులతో కలిసి మంగళవారం సమీక్షించారు. గణేశ్ మండపాలకు విద్యుత్ సరఫరా చేస్తామని, నిమజ్జన పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా వేస్తామని తెలిపారు. ఉత్సవ కమిటి సభ్యులు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య, అగ్నిమాపక, శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బారికేడ్లు, క్రేన్లు, తాగునీరు, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద మెడికల్ క్యాంప్ ఉండాలని, 108 వాహనం, పాముకాటు నివారణ మందులు అందుబాటులో ఉంచాలన్నారు. గజ ఈతగా ళ్లను షిఫ్ట్ల వారీగా నియమించాలన్నారు. ఎస్పీ మా ట్లాడుతూ ఈనెల 23, 24తేదీల్లో గణేశ్ నిమజ్జనా నికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టాలి ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అన్నారు. అనామలిస్, నోమ్యాపింగ్ ఓటర్లపై సమీ క్షించారు. హియరింగ్ సమయంలో ఓటర్లు సమర్పించే ఆధారాలు, వివరాలు సమగ్రంగా పరిశీలించాలని, అర్హుల పేరు తొలగించొద్దని సూచించారు. ఈవీఎం గోదాముల తనిఖీఈవీఎం గోదాముల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. ధరూర్ క్యాంప్లోని ఈవీఎం గోదాంలను రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. సిబ్బంది ఈవీఎంలు వీవీప్యాట్ల భద్రతకు చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్, జ్యోతి ఉన్నారు. -
చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
ఎల్లారెడ్డిపేట( సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామానికి చెందిన జనగామ సతీశ్ (35) ఆర్థిక ఇబ్బందులతో 15 రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకోగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పేద కుటుంబానికి చెందిన సతీశ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులకు స్తోమత లేకపోవడంతో సర్పంచ్ కొండ రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం రూ. 10వేల సాయం అందించి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు.. సతీశ్ తనకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ నివాసంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్నాడు. వెంటనే అక్కడున్న వారు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య మమత, కుమారుడు విగ్నేష్, కూతురు భవానిశ్రీ ఉన్నారు. సతీశ్ మృతితో కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదుపుతప్పి కిందపడి వ్యక్తి..వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన చింతకుంట నర్సయ్య (60) ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. బంధువుల కథనం ప్రకారం.. నర్సయ్య మంగళవారం కట్టెల కోసం ద్విచక్ర వాహనంపై అగ్రహారం శివారులోని గుట్టకు వెళ్లాడు. కట్టెలను ద్విచక్ర వాహనంపై పెట్టి గుట్ట దిగుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. టిప్పర్ ఢీకొని ఒకరికి గాయాలుమల్యాల: మండలంలోని రాజారం గ్రామ శివారులో బైక్ను టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్ జిల్లా దేశాయిపేట గ్రామానికి చెందిన సందీప్ లింగంపేట రైల్వేస్టేషన్లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం బైక్పై విధులకు వస్తున్నాడు. రాజారం సమీపంలోకి రాగానే మూలమలుపు వద్ద టిప్పర్ వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో సందీప్ తొడభాగం నుజ్జునుజ్జుయ్యింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత రాయికల్: రాయికల్ మండలం ఇటిక్యాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ నాగార్జున తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
యువ ఇంజినీర్ను బలితీసుకున్న వాహనం
మంగళగిరి రూరల్: ఉపాధి కోసం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పని చేసేందుకు వచ్చిన ఓ యువ ఇంజినీర్ చివరకు అదే కంపెనీ వాహనం కింద పడి మృతిచెందాడు. రాజన్నసిరిసిల్ల పట్టణానికి చెందిన కళికవాయి వెంకటశ్యామ్(22) రాజధానిలో ఈ–14 రోడ్డు నిర్మాణం చేస్తున్న మెయిల్ అనే కంపెనీలో జూనియర్ సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో ఈ–5 క్యాంప్ నుంచి విధులకు హాజరవుతున్నాడు. మంగళవారం మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో క్రికెట్ స్టేడియం సమీపంలో నిర్మిస్తున్న ఈ–14లో డ్యూటీ చేస్తున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో డివైడర్ ఏర్పాటుకు సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ నింపే క్రమంలో ఓ వాహనం వచ్చింది. ఆ వాహనం వెనక్కి వచ్చే క్రమంలో శ్యామ్ను ఢీకొనడంతో టైర్ కింద పడిపోయాడు. తోటి ఉద్యోగులు శ్యామ్ను హుటాహుటిన ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఏపీ రాజధాని ప్రాంతంలో ఈ–14 రోడ్డు నిర్మాణ పనుల్లో ఘోరం కాంక్రీట్ మిక్సర్ వాహనం కిందపడి దుర్మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన వ్యక్తి గా గుర్తింపు -
‘చేయూత’కు 15వేల దరఖాస్తులు
జగిత్యాల: ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పెన్షన్లకు ఇప్పటివరకు జిల్లాలో 15 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నవారు వితంతువులే ఉన్నారు. దరఖాస్తులకు ఆగస్టు 31 వరకే చివరి తేదీ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఈనెల 15 వరకు పెంచారు. ఈ క్రమంలో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. గడువులోపు అర్హులందరూ దరఖాస్తులు చేసుకోవాని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ సూచించారు. కేటగిరీల వారీగా వచ్చిన మొత్తం దరఖాస్తులు 15,032వితంతువులు 6,071ఒంటరి మహిళలు 1,317దివ్యాంగులు 2,424చేనేత 2,435కల్లుగీత కార్మికులు 2,165పైలేరియా 560డయాలసిస్ 60 -
గ్రామాభివృద్ధికి బాటలు
కథలాపూర్/పెగడపల్లి: గ్రామ పంచాయతీల సమగ్ర భాగస్వామ్యమే ధ్యేయంగా ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీజీరాంజీ) పథకంలో పనుల గుర్తింపు మొదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలు’ (వీజీపీపీ) రూపొందించడానికి జిల్లాలో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గాలతోపాటు ప్రజలను భాగస్వామ్యం చేసి తమ గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి తీర్మానాలు చేస్తున్నారు. పనులకు అయ్యే ఖర్చును అంచనా వేసి కూలీలకు అనుగుణంగా కల్పించాల్సిన పనిదినాలను లెక్కించనున్నారు. 2026–2027 ఏడాదికి సంబంధించిన ప్రణాళికలో 318 రకాలు పనులను ప్రతిపాదిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులతోపాటు మండల పరిషత్ అధికారులు పనుల వివరాలను నమోదు చేస్తున్నారు. గ్రామస్థాయిలో తీసుకున్న ప్రణాళికలను మండలస్థాయిలో ఆమోదించి జిల్లాస్థాయికి పంపాల్సి ఉంటుంది. 385 గ్రామాలు.. 2.80లక్షల మంది కూలీలు జిల్లాలో 20 మండలాలు.. 385 గ్రామ పంచాయతీలున్నాయి. మొత్తంగా 1.70 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 2.80లక్షల మంది కూలీలుగా ఉన్నారు. వీబీజీ రామ్జీ పథకం పనులకు వెళ్లే కూలీలు 1.37లక్షలు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి పనుల్లో స్వేచ్ఛ పంచాయతీలకే వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా గ్రామాభివృద్ధికి ఏది అత్యంత అవసరమో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛను పంచాయతీలకు ఇచ్చారు. గ్రామపంచాయతీ పాలకవర్గాలతోపాటు మహిళాసంఘాలు, రైతులు, ప్రజలు గ్రామసభల్లో పాల్గొని పనులపై చర్చించి ప్రతిపాదించే అవకాశం కల్పించారు. నీటి భద్రత, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు, పాఠశాలల్లో వసతులు, పశువుల పాకలు, విపత్తు నిర్వహణ పనులు ప్రణాళికలో చేర్చుతున్నారు. దీంతో గ్రామాభివృద్ధి జరగడంతోపాటు స్థానిక కూలీలకు ఉపాధి లభించనుంది. ప్రజలు భాగస్వామ్యం కావాలి గ్రామాల అభివృద్ధి ప్రణాళిక తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా గ్రామసభల ద్వారా వికసిత్ గ్రామపంచాయతీల ప్రణాళికలు రూపొందించాలి. గ్రామాల అభివృద్ధికి స్వయంగా బాటలు వేసుకునేందుకు ఇది మంచి అవకాశం. – శంకర్, ఎంపీడీవో, కథలాపూర్ -
కాంగ్రెస్ పాలనలో పల్లెలు విధ్వంసం
కోరుట్లరూరల్: కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో పల్లెలు విధ్వంసం అయ్యాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ మండలంలోని అయిలాపూర్లో ఆదివారం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. చెత్త ఊడ్చి ట్రాక్టర్లో వేశారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇచ్చారని, దాని ద్వారా ప్రతిరోజూ చెత్త సేకరణ జరిగేదని, ఈ ప్రభుత్వంలో డీజిల్కు డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్నారు. పల్లెప్రకృతి వనాల ద్వారా మొక్కలు పెంచితే ఈ ప్రభుత్వంలో ఉన్న మొక్కలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. చదరంగంతో మేధాశక్తిజగిత్యాలజోన్:విద్యార్థుల్లో ఏకాగ్రతకు చదరంగం దోహదం చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో జీనియస్ చెస్ అకాడమీని ప్రారంభించారు. ఆటలతో విద్యార్థుల్లో పోటీతత్వం అలవడుతుందన్నారు. ఎమ్మెల్సీ రమణ, మాజీమంత్రి జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, కోచ్ కంకిటి అనూప్కుమార్, నిర్వాహకులు సంగీత, నవీన్, కంకటి కనకయ్య, కో–ఆర్డినేటర్ సుజన్కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల పచ్చదనంతో నిండాలి జిల్లా కేంద్రం పచ్చదనానికి చిరునామాగా చేయాలని ఎమ్మెల్యే అన్నారు. 14వ వార్డులో ఆదివారం వన మహోత్సవం నిర్వహించారు. ఫిల్టర్ బెడ్ వద్ద రూ.5 లక్షలతో గ్రీన్షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. 15 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు పనులను పరిశీలించారు. మొక్కలు నాటడంతోపాటు సంరక్షించాలని కోరారు. కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్ స్వప్న, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, నాయకులు బండ శంకర్, గిరి నాగభూషణం, బాలే శంకర్, కుసరి అనిల్, రాము, శరత్రావు పాల్గొన్నారు. రైతు కుటుంబానికి అండగా.. జగిత్యాలరూరల్: బీర్పూర్ మండలం కండ్లపల్లికి చెందిన పర్వతం అంజన్న ఇటీవల విద్యుత్షాక్తో మృతి చెందగా.. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.4.50లక్షల బాండ్, రూ.50వేల చెక్కును ఎమ్మెల్యే అందించారు. కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. సర్పంచ్ సురేందర్, ఉప సర్పంచ్ రవి, ఏఈ శ్రీనివాస్, లైన్మెన్ సతీశ్ పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి 2,894 క్యూసెక్కుల ఇన్ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు 2,894 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1080.20 అడుగులు, 45.459 టీఎంసీలుగా ఉంది. 933 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. మెట్పల్లి లయన్స్ క్లబ్కు మెంబర్షిప్ రోలింగ్ ట్రోఫీమెట్పల్లి: మెట్పల్లి లయన్స్ క్లబ్కు ఇంటర్నేషనల్ మెంబర్షిప్ రోలింగ్ ట్రోఫీ అందించారు. రామగుండంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2025–26 సంవత్సరానికి ఎక్కువ సంఖ్యలో మెంబర్షిప్ చేయించి ముందంజలో నిలిచిన క్లబ్ అధ్యక్షుడు వెల్ముల శ్రీనివాస్రావుకు ట్రోఫీ అందించి అభినందించారు. కార్యదర్శి బొమ్మెల శివ, జోగ జగదీశ్వర్ తదితరులున్నారు. -
ఏమైంది..?
జగిత్యాల బల్దియాకు జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇద్దరు పారిశుధ్య కార్మికులు డీజిల్ చోరీ చేస్తూ.. రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో బల్దియాలో ఎంత అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తరచూ ఏదో ఒక ఘటన వెలుగు చూస్తుండడంతో మున్సిపల్కు ఏమైందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గం, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదా..? అనే చర్చ మొదలైంది. కొంతకాలంగా బల్దియాలో అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్, ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. వారి దాడుల్లోనూ అనేక అక్రమాలు బయటపడిన విషయం తెలిసిందే. అక్రమాల్లో బల్దియా అధికారుల పాత్ర ఉందని గుర్తించిన విజిలెన్స్, ఏసీబీ అధికారులు నివేదికను సీడీఎంఏకు పంపించారు. ● అవినీతికి కేరాఫ్ గతంలో టౌన్ప్లానింగ్ విభాగంలో లంచాలు తీసుకుంటూ టీపీవో రెడ్హ్యాండెడ్గా దొరికిన విషయం తెలిసిందే. ఇటీవల ఏసీబీ అధికారులు ఏకకాలంలో 10 గంటలు దాడులు చేసి అనేక అక్రమాలు, నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రజావాణిలో ఫిర్యాదులు వస్తున్నా ప్రజాప్రతినిధుల జోక్యంతో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో పనుల విషయంలో జాప్యం జరుగుతోందని ఇటీవల అధికారులు గుర్తించారు. నిధులు ఉన్నా కొందరు పనులు చేపట్టకపోవడం, చేపట్టినా నాణ్యత లేకపోవడం, అనతికాలంలోనే డ్రైనేజీలు, సీసీరోడ్లు దెబ్బతింటున్నాయనే ఆరోపణలున్నాయి. సుందరీకరణ పేరిట ఏర్పాటు చేసిన జంక్షన్లు కళాహీనంగా మారాయి. ఎక్కడా ఫౌంటేన్లు పనిచేయడం లేదు. డివైడర్లలోని చెట్లపై శ్రద్ధ తీసుకోవడం లేదు. ఇటీవల డబుల్బెడ్రూంల వద్ద రోడ్లు నిర్మించగా సుమారు రూ.20 లక్షల బిల్లు పెట్టారని, ఆ పనులను మున్సిపల్ కార్మికులే చేసినట్లు తెలిసింది. ఇక రెవెన్యూ సెక్షన్లో సైతం అనేక అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ శాఖలో అక్రమంగా ముటేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో ఓ భూకబ్జాకు సంబంధించి కమిషనర్, ఆర్వో సైతం జైలుకెళ్లిన విషయం తెలిసిందే. పనుల్లో జాప్యం.. జిల్లా కేంద్రంలో సుమారు రూ.60 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నా.. ఎక్కడా సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల 45వ వార్డుకు చెందిన ఓ మహిళ 2020లోనే డ్రైనేజీకి రూ.20 లక్షలు కేటాయించారని, ఇప్పటివరకు పనులు చేపట్టలేదని బహిరంగంగానే ఆరోపించారు. శానిటేషన్కు సంబంధించి డీజిల్ బిల్లులపై ఎక్కువ అవినీతి జరిగిందని ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లాయి. అప్పటి కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి డీజిల్ బిల్లులు రూ.8 లక్షలు వచ్చేలా చేశారు. తాజాగా మళ్లీ రూ.12లక్షలకు పైగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల డీజిల్ చోరీ బయటపడటంతో అవకతవకల ఆరోపణలకు బలం చేకూరింది. -
నెల రోజుల నుండి కాపలా
నేను రెండెకరాల్లో మొక్కజొన్న పంట వేసిన. నెల రోజుల నుంచి కోతులు రాకుండా కాపలా వెళ్తున్నాను. ఇప్పుడే పంట గింజ దశకు చేరుకుంది. మరో నెలరోజులు కాపలా ఉండాల్సిందే. – వామన్, అంతర్గాం కోతులతో పంట ధ్వంసం కోతులతో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. రోజంతా కాపలా ఉండాల్సి వస్తోంది. మా ఊర్లో కొందరు కోతుల కోసం కుక్కలను పెంచుతున్నారు. పంట చేతికొచ్చే వరకు కష్టంగానే ఉంది. – కోల నారాయణ, చల్గల్ -
యోగానంద స్వామి ఆలయం నిర్మిస్తాం
ధర్మపురి:పురావస్తుశాఖ అనుమతి రాగానే ధర్మపురిలో యోగానంద స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శ్రీఉగ్రనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని మంత్రి పరిశీలించారు. వందేళ్ల వరకు భక్తుల అవసరాలకు తగినట్లు ఆలయ నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. వెయ్యి రోజుల విజయోత్సవ ర్యాలీ ముందుగా మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వ వెయ్యిరోజుల పాలన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పటేల్, గాంధీ, నందీ చౌక్ల మీదుగా నిర్వహించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి ప్రజల మన్ననలు అందుకున్నామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, నాయకులు వేముల రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు. ఆదివారం ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం చేయగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం మండల, పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికై న సాయిని శ్రీనివాస్, పెన్న శ్రీనివాస్ ప్రమాణం చేశారు. వారిని మంత్రి సన్మానించారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట నాయకులు, వివిధ జిల్లాల నాయకులు ఉన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి వెల్గటూర్: మండలంలోని పాషిగాంలో ఏర్పాటు చేసిన గమ్యం హోటల్ను మంత్రి ప్రారంభించారు. ధర్మపురి, కోటిలింగాల, గూడెంగుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
జగిత్యాలరూరల్: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు పల్లెల విధ్వంసం, పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జెడ్పి మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి బీర్పూర్ మండలకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం చూస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో డంపింగ్యార్డు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడామైదానాలు ఏర్పాటు చేశారని అన్నారు. కాంగ్రెస్ మూడేళ్లలో కొత్తవి లేకపోగా.. కేసీఆర్ పథకాలు అమలు కావడం లేదన్నారు. రోళ్లవాగు తెగిపోయి చేపలు కొట్టుకుపోయినా పరిహారం ఇవ్వలేదని, ఊరూరా బెల్ట్ షాపులతో గీతాకార్మికులు ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. గుట్టలు తవ్వుతూ, ఇసుక అక్రమ రవాణా చేస్తూ పల్లెలను విధ్వంసం చేస్తున్నారని తెలిపారు. హరిచరణ్రావు, మసర్తి రమేశ్, సుభాష్యాదవ్, ముక్క శంకర్, కొల్ముల రమణ, జితేందర్ యాదవ్, లక్ష్మణ్రావు, తేలు రాజు, బర్కం మల్లేషం, బైరి మల్లేశం పాల్గొన్నారు. -
మొక్కజొన్నపై వానరమూకలు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతన్నలు రాత్రింబవళ్లు కష్టపడి పంట పండించడం ఒక ఎత్తైతే.. ఆ పంటను కోతుల నుంచి కాపాడడం మరో ఎత్తుగా మారింది. ప్రస్తుతం మొక్కజొన్న పంట గింజ దశకు చేరుకుంది. ఈ సమయంలో రైతులు తోటల వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కోతుల సమూహం (సుమారు రెండుమూడు వందలు)గా వస్తున్న కోతులు పంటను గంట వ్యవధిలోనే సర్వనాశనం చేస్తున్నాయి. కోతులను తోటల నుంచి తరిమేందుకు రైతులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ నేపథ్యంలో రైతులు కొంతమంది సోలార్ కంచెలు ఏర్పాటు చేస్తుండగా.. పెద్దపెద్ద శబ్దం చేసే మైక్లు పెడుతున్నారు. మొక్కజొన్న వేయాలంటేనే భయం.. తొలకరి వర్షాలు కురవగానే రైతులు పెసర, మొక్కజొన్న, వేరుశెనగ వంటి పంటలు వేస్తారు. కొంతకాలంగా కోతుల బెడద ఎక్కువవడంతో రైతులు వేరుశెనగ, పెసర సాగు తగ్గించారు. మొక్కజొన్న పంటను మాత్రం దాదాపు 50 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గింజ దశకు చేరుకున్న పంటను ఓ వైపు రామచిలుకలు, మరోవైపు అడవిపందులు, ఇంకోవైపు కోతులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో ఎక్కువగా గుట్టల ప్రాంతం కావడంతో మొక్కజొన్న పంటను వేయాలంటేనే ఇక్కడి రైతులు భయపడే పరిస్థితి ఉంది. తినేది తక్కువ..ధ్వంసం చేసేది ఎక్కువ కోతులు గుంపులుగుంపులుగా వచ్చి మొక్కజొన్న కంకులను నాశనం చేస్తున్నాయి. కంకిలో గింజలు లేకపోతే అన్ని కంకులను చీరి పారేస్తున్నాయి. అంతరపంటగా పసుపు వేసిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మొక్కజొన్న గింజకు వచ్చిన తర్వాత రైతులు ఉదయం, సాయంత్రం కాపలాగా వెళ్లాల్సిన పరిస్థితి. చేతిలో కర్ర లేకపోతే వారిపైనే దాడి చేస్తున్నాయి. కోతులను ఎదుర్కొనేందుకు తంటాలు తోటల నుంచి కోతులను తరిమేందుకు రైతులు రూ.50వేల వరకు ఖర్చు పెట్టి సోలార్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కోతులు ఈ సోలార్ కంచెలను కూడా లెక్క చేయడం లేదు. ఈ క్రమంలో కొందరు రైతులు కుక్కలను పెంచుతున్నారు. మరికొందరు సెల్ఫోన్లలో కుక్కల అరుపులను రికార్డు చేసి చెట్లకు మైక్లు కడుతున్నారు. ఇంకొందరు పంట చుట్టూ వల పెడుతున్నారు. పెద్ద సంఖ్యలో కోతులు వచ్చిన ప్పుడు టపాసులు పేల్చుతున్నారు. పంటలను కోతుల బారి నుంచి కాపాడేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని, ప్రభుత్వం ఆలోచనలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
నాలుగు ఆటోలు.. రెండు ట్రాక్టర్లు డీజిల్కు రూ.1.80లక్షలు
రాయికల్ పట్టణ వ్యూ రాయికల్: రాయికల్ చిన్న మున్సిపాలిటీ. మేజర్ పంచాయతీగా ఉన్న రాయికల్ను 12 వార్డులతో మున్సిపాలిటీగా చేశారు. ఆదాయం తక్కువగా ఉన్న ఈ బల్దియాలో చెత్త సేకరణ కోసం ఆటోలు, ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. వీటికి వినియోగించే డీజిల్ ఖర్చు ఏకంగా నెలకు అక్షరాల రూ.1.80లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ ఖర్చులపై పట్టణంలో సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. బల్దియాలోని 12 వార్డుల్లో చెత్త సేకరణకు ప్రతిరోజు నాలుగు మినీ ఆటోలు, ఒక ట్రాక్టర్ మాత్రమే వినియోగిస్తుండగా.. నెలకు అంత పెట్రోల్, డీజిల్ ఖర్చు ఏంటని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వారంలో ఒకట్రెండు రోజులు మాత్రమే.. మున్సిపాలిటీలో 12 వార్డులు, 4500 గృహాలు ఉన్నాయి. చెత్త సేకరణకు మున్సిపల్ ఆధ్వర్యంలో ఆరు మినీఆటోలను గతంలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం నాలుగు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేయగా.. ఒకటి చెత్త సేకరణకు, మరొకదానిని ఫ్రంట్బ్లేడ్గా వినియోగిస్తున్నారు. 12వార్డుల్లో వారానికి ఒకటి లేదా రెండుసార్లు చెత్త సేకరిస్తున్నారు. అంచనాలు మించి ఖర్చు నాలుగు ఆటోలు, ఒక ట్రాక్టర్ ద్వారానే చెత్తను సేకరిస్తుండగా.. నెలకు పెట్రోల్, డీజిల్ కోసం రూ.1.80 నుంచి రూ.రెండు లక్షలు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆటోలు డీజిల్తో నడుస్తుండగా.. ఇక్కడ మాత్రం పెట్రోల్ ఆటోలు వినియోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం రూ.లక్షల్లో వ్యయం చేస్తుండడంతో సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. గతంలో చెత్త సేకరణకు 57 మంది పారిశుధ్య సిబ్బంది ఉంటే ప్రస్తుతం 26 మందే ఉన్నారు. మహిళా సిబ్బంది ఊడ్వడం, బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు పరిమితం అవుతున్నారు. పురుషులు ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరిస్తున్నారు. ఆటోలు అందుబాటులోకి తెచ్చి ఇంధన ఖర్చు పారదర్శకంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రాయికల్ మున్సిపాలిటీ స్వరూపం వార్డులు 12 గృహలు 4500 పారిశుధ్య కార్మికులు 26 ఆటోలు 6 వినియోగంలో ఉన్నవి 4 ట్రాక్టర్లు రెండు వెలువడే చెత్త 9 టన్నులు డ్రైవర్, కార్మికుడు ఒక్కడే ఈ ఫొటోలో కనిపిస్తున్నది రాయికల్ బల్దియాలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు. ఉదయం మినీ ఆటో డ్రైవర్గా పనిచేయడంతోపాటు అదే ఆటోలో చెత్తసేకరణ చేపడుతున్నాడు. వార్డుల్లోని ఇళ్లముందు వాహనం ఆపుతూ.. చెత్త సేకరిస్తూ మళ్లీ అతడే డ్రైవింగ్ చేస్తూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా చేయడం ద్వారా ఆటోకు డీజిల్ వినియోగం పెరుగుతోంది. మరోవైపు రాయికల్ మున్సిపాలిటీలో సిబ్బంది కొరత వేధిస్తోందని చెప్పకనే చెబుతోంది. మినీ ఆటోలను ఎక్కువసార్లు తిప్పుతున్నాం బల్దియాలో 12 వార్డుల్లో చెత్త సేకరణ కోసం ఉన్న ఆటోలనే ఎక్కువ సార్లు తిప్పడంతో పెట్రోల్, డీజిల్ వ్యయం అవుతోంది. రిపేరులో ఉన్న ఆటోలను వినియోగంలోకి తీసుకువస్తాం. – మనోహర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ -
నేడు ధర్మపురికి డిప్యూటీ సీఎం
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 7న చేపట్టనున్న శ్రీఉగ్ర నృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు ధర్మపురికి చేరుకుంటారని, సోమవారం వేకువజామున 2.30 గంటలకు ఉగ్రనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం పర్యటను విజయవంతం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరారు. MýS*Æý‡-V>Ķæ$ÌS ç³…rÌSOò³ §ýl–íÙt ÝëÇ…^éÍే జగిత్యాలరూరల్: కూరగాయల పంటలపై దృష్టి సారించాలని పొలాస శాస్త్రవేత్తలు తెలిపారు. ‘ఆత్మ’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు, ఆర్ఏఆర్ఎస్ పొలాస శాస్త్రవేత్తలు సారంగాపూర్ మండలం పెంబట్లలో సాగవుతున్న సన్నరకాల పంటలను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల పరిస్థితి, యాజమాన్య పద్ధతులను పరిశీలించి, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడలు, తెగుళ్ల నియంత్రణపై సూచనలు అందించారు. కూరగాయల పంటలు, పూలతోటలను సందర్శించారు. చీడపీడలు, తెగుళ్ల పరిస్థితిపై రైతులతో చర్చించారు. అవసరమైన సాంకేతిక సలహాల కోసం సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో ప్రదీప్రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు,రైతులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యల పరిష్కారంలో విఫలం
జగిత్యాల: విద్యార్థుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లో ఉందని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కేసీఆర్ పాలనలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారని, 33 జిల్లాల్లో 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కటీ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, మహిళలకు మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడబిడ్డకు రూ.13 వేలతో పాటు, కేసీఆర్ కిట్ ఇస్తే రేవంత్రెడ్డి వచ్చాక అన్ని మూలన పడేశారన్నారు. రేవంత్రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ తరఫున గెలిచి అభివృద్ధి పేరిట రేవంత్రెడ్డి సంకలో చేరాడన్నారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ వందరోజుల్లో ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా అమలు చేయకపోవడమేంటన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు మాట్లాడుతూ హామీలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు. విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని రేవంత్రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మీ పాల్గొన్నారు. -
జానపద కెరటాలు!
మట్టి పరిమళాలు..వారికి పల్లె పాటలంటే ప్రాణం. జానపదాలకు అందమైన అర్థాలు అల్లి.. బాణీకట్టి తమ గొంతుకతో పాడి పాటకే జీవం పోస్తున్నారు. పల్లెటూరు నుంచి నుంచి సినిమాల్లో పాడేవరకూ ఎదిగిన జానపద స్వరం చుంచు నాగవ్వది. చదువు రాకున్నా.. పాటనే శ్వాసగా మార్చుకుని.. తెలంగాణ మట్టి వాసనను తన గొంతుతో జగమంతా పరిచయం చేస్తున్నారు నాగవ్వ. అమ్మమ్మ, తాతయ్యల ఊరి మట్టి వాసనతో మొదలై.. కోట్లాది వ్యూస్, సినిమా స్వరాలతో దూసుకుపోతున్నారు మల్లిక్ తేజ. పల్లె యాసలో ఉండే తీయదనం, జానపదంలో పలికే జీవధార ఆయన పాటలకు ప్రాణం పోస్తున్నాయి. పల్లెగుండె చప్పుడును తన గొంతుకగా మార్చుకున్నాడు మరో కళాకారుడు గడ్డం రమేశ్. మట్టి వాసనలు.. పల్లె జీవన సౌందర్యం, బతుకమ్మ, బోనాల విశిష్టతను నరనరానా జీర్ణించుకుని జానపదానికి సరికొత్త ఊపిరి పోస్తున్నారు. తండ్రి యక్షగాన వారసత్వాన్ని ఒంటపట్టించుకుని, కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటూ తెలంగాణ జానపద శిఖరంగా ఎదుగుతున్నారు. – గొల్లపల్లి – వివరాలు 8లోu -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న విజయ్
కథలాపూర్: మండలంలోని తాండ్య్రాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుండు విజయ్ రాష్ట్రస్థా యి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును శనివారం అందుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవంలో వి ద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితారాణా విజ య్కి అవార్డును ప్రదానం చేశారు. విజయ్ని మండల అధికారులు, ఉపాధ్యాయులుఅభినందించారు. సీఎం చేతుల మీదుగా..మల్యాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల ప్రిన్సిపాల్ మోతె శివరామకృష్ణ శనివారం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. కళాశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో చొరవ తీసుకోవడం, సబ్జెక్టులవారిగా వెనకబడిన వారిని గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాల సాధనకు చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు అందుకున్నారు. కళాశాల అధ్యాపకులు శివరామకృష్ణకు అభినందనలు తెలిపారు. -
● కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి కొప్పుల ఆగ్రహం
ధర్మపురి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురిలో శనివారం వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కొప్పుల మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇప్పటికి రూ.14వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు రూ.300 కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. కేసీఆర్ పాలనలో ఏర్పాటుచేసిన గురుకులాలను నిర్వీర్యం చేసి యంగ్ ఇండియా మోడల్ స్కూల్ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహం నుంచి నంది, గాంధీ కూడలీ మీదుగా ర్యాలీ నిర్వహించారు. నాయకులు శ్రీకాంత్రెడ్డి, అయ్యోరి రాజేశ్, వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. -
కనిపించని మెుక్కలు
లక్షల్లో ఖర్చు..పర్యావరణ పరిరక్షణతోపాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం మెట్పల్లి ము న్సిపాలిటీలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వ డం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం కింద ఏటా వేల సంఖ్యలో వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. తర్వాత వాటి సంరక్షణపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో నాటిన వాటిల్లో ఎక్కువశాతం మొక్కలు ఎండిపోతున్నాయి. దీనివల్ల పచ్చదనాన్ని పెంపొందించాలనే ప్రభుత్వం ఆశయం నీరుగారిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా రూ.లక్షల ఖర్చు అదనంగా రూ.15.66 లక్షలతో కొనుగోలు మెట్పల్లి: ఈ చిత్రం మెట్పల్లి పట్టణంలోని 8వార్డు శివారులో ఉన్న ప్రకృతి వనం. మున్సిపాలిటీకి చెందిన ఈ స్థలంలో వనమహోత్సవం కింద చుట్టూ కంచె నిర్మించారు. అందులో మొక్కలు నాటారు. వాటికి నీరు అందించేందుకు ప్రత్యేకంగా బోరు, డ్రిప్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించారు. కొంతకాలంపాటు సంరక్షణ చర్యలు తీసుకోవడంతో మొక్కలు ఎదిగి ప్రకృతి వనంలో పచ్చదనం పెంపొందడానికి దోహాదపడింది. తర్వాత నిర్లక్ష్యం చూపడంతో మొక్కలు ఎండిపోయి.. కంచె తొలగిపోయి అధ్వానంగా తయారైంది. సంరక్షణ చర్యలు అంతంతే -
తక్కువ ఖర్చుతో లాభాలు
వెల్గటూర్: ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త విజయ్ భాస్కర్ అన్నారు. ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శనివారం అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత, నేల ఆరోగ్య పరిరక్షణ, జీవ ఎరువుల వాడకంపై వివరించారు. పడకల్, కొత్తపేట, రాజారాంపల్లి గ్రామాల్లో వరి, పత్తి, పసుపు పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించి రైతులకు ఆయా పంటలలో అనుసరించాల్సిన సాగు యాజమాన్య పద్ధతులు వివరించారు. -
● అదనపు కలెక్టర్ లత
జగిత్యాల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ లత తెలిపారు. ప్రచార కార్యక్రమాలను ప్రారంభించామని, ఆదివారం జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతామని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాను ప్రజలు తమ సంబంధిత ఓటును పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించుకోవాలన్నారు. అర్హులైన వారు కొత్తగా ఓటరు నమోదుకు ఫారం 6, పేర్ల తొలగింపు అభ్యంతరాల కోసం ఫారం 7, ఓటరు జాబితాలోని వివరాల సవరణ, చిరునామా మార్పు కోసం ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఎల్వోలు పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అర్హులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పాఠ్య పుస్తకాల తయారీలో..
చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయలక్ష్మి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రూపొందించే పాఠ్య పుస్తకాల ప్రణాళిక కమిటీలో సభ్యురాలుగా కొనసాగుతున్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. కళాశాలలో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డును ఈనెల 5న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదగా అందుకోనున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మరింత అంకితభావంతో పని చేస్తానని విజయలక్ష్మి వెల్లడించారు. -
క్రీడల్లో పదును పెట్టి.. జాతీయస్థాయికి చేర్చి
జమ్మికుంట: గ్రామీణ పాఠశాలల్లో చదివే విద్యార్థుల క్రీడా ప్రతిభకు పదును పెడుతూ జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నాడు జమ్మికుంట మండలంలోని కోరపల్లి ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జిట్టబోయిన శ్రీను. 2012లో ఫిజికల్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరాడు. వివిధ పాఠశాలల్లో పనిచేస్తూ విద్యార్థులకు క్రీడల్లో కీలకమైన మెలకువలు నేర్పిస్తున్నారు. జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం కోరపల్లి పాఠశాల నుంచి శ్రీను శిక్షణలో వనరసు సుశాంత్, ఇంజం రీతిక, ఎన్.లౌక్యశ్రీ, పింగిళి అక్షర జాతీయస్థాయి హ్యాండ్బాల్పోటీల్లో ప్రతిభ చూపారు. శ్రీను తన కెరియర్లో 80మంది క్రీడాకారులను తయారు చేశాడు. పలువురు ఇండియన్ ఆర్మీ, వివిధ పాఠశాలల్లో వ్యాయమ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శ్రీను జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యాడు.– మరిన్ని కథనాలు – 8లోu -
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం రంగపేటలో రూ.11 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం భూమిపూజ చేశారు. రూ.56 లక్షలతో చేపట్టిన రంగపేట–ఆలూరు వయా బతుకమ్మ కుంట ఫార్మేషన్ రోడ్ను ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రామంలో పలువురు ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై కానుకలు అందించారు. నియోజకవర్గంలో దళితులకు 909 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. పెంబట్ల, కోనాపూర్ బ్రిడ్జి విషయంలో నాడు సీనియర్ నాయకులు మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. రూ.3 కోట్లతో బ్రిడ్జి నిర్మించి కాంట్రాక్టర్కు బకాయిలు కూడా చెల్లించడం జరిగిందన్నారు. అనంతరం బీర్పూర్ గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, మైక్ సెట్ను ప్రారంభించారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సర్పంచ్లు ఏదుల శేఖర్, హరీశ్, ఎంపీడీవో నీరజ, ఎంపీవో సలీం తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు రాయికల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం చింతలూరు గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. సర్పంచ్ రమేశ్నాయక్, ఆ త్మ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. హామీలు అమలు చేసేవరకు నిలదీసుడేఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేవరకు నిలదీసుడేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల దగాపై శుక్రవారం మండలకేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద వంటావార్పుతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా కొట్లాడుడేనని పేర్కొన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డిని గద్దె దించే వరకు పోరాడుదామని, కేసీఆర్ అధికారంలోకి వచ్చే దాకా కొట్లాడుదామన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్రెడ్డి 420 హామీలు ఇచ్చి 420 అయ్యారన్నారు. హామీలు అమలు చేసే వరకు గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను నిలదీయాలన్నారు. అనంతరం వంటావార్పులో భాగంగా సహపంక్తి భోజనం చేశారు. మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, నోముల లక్ష్మారెడ్డి, చిన్నారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలాల దశరథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసులు ఉపసంహరించుకోవాలిమెట్పల్లి(కోరుట్ల): ఉత్తరాఖండ్లో రాహుల్గాంధీపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు డిమాండ్ చేశారు. కేసులను వ్యతిరేకిస్తూ పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాఖండ్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సభ నిర్వహించిన ప్రాంతాన్ని శుద్ధి చేయడంపై ప్రశ్నించిన రాహుల్గాంధీపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను కేసులతో అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్నారు. కేసులను ఉపసంహరించుకోవాలని లేకుంటే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
అక్షర దీపాలు.. ఆదర్శ మూర్తులు
గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః.. అంటూ ప్రతీ వ్యక్తి నాలుగు గోడల మధ్య నేర్చుకునే అక్షరాలు వారి జీవితంలో వెలుగును నింపుతాయి. తల్లిదండ్రులు జన్మనిస్తే... బడిలో పాఠాలు చెప్పే గురువులు ఆ జన్మకు సాకారాన్ని అందిస్తారు. మొన్నటి వరకు ఉపాధ్యాయులు పుస్తకంలోని పాఠాలను బోధించేవారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతీ అంశాన్ని ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. జీవితంలో ఎలా స్థిరపడొచ్చు అనే అంశాన్ని విద్యార్థులకు పాఠశాలస్థాయిలోనే చెబుతున్నారు. ప్రస్తుత కార్పొరేట్ పోటీ ప్రపంచంలో సర్కారు బడి అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు. ఆటల్లో జాతీయస్థాయిలో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నారు. తరగతి గదుల్లో వినూత్నంగా బోధన అందిస్తూ.. మా మంచి మా‘స్టార్లు’ అనిపించుకుంటున్నారు. నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..!! -
విద్యార్థుల ముంగిటకు విజ్ఞానం
జ్యోతినగర్: పాఠ్యపుస్తకాల్లోని అంశాలు బోధించడమే కాకుండా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట వేస్తున్నారు ఉపాధ్యాయుడు గూళ్ల అంజన్కుమార్. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతినగర్లోని జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్(బయోసైన్స్)గా పనిచేస్తున్న అంజన్కుమార్ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా జీవశాస్త్రాన్ని ప్రయోగాత్మక పద్ధతుల్లో బోధిస్తున్నారు. క్లిష్టమైన అంశాలను ప్రయోగాలు, నమూనాలు, దృశ్య ప్రదర్శనల ద్వారా వివరిస్తున్నారు. విద్యార్థులు స్వయంగా పరిశీలించి, ప్రశ్నించి, తెలుసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. మొబైల్ ల్యాబొరేటరీ ద్వారా విజ్ఞాన కార్యక్రమాల నిర్వహణ తదితర సేవలకు గుర్తింపుగా 2024లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. -
వినూత్న బోధన విజయ్ ప్రత్యేకత
కథలాపూర్(వేములవాడ): 2026 ఏడాదికి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికై న జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న గుండు విజయ్ 2008లో ఉద్యోగంలో చేరాడు. మండలంలోని సిరికొండ, అంబారి పేట పాఠశాలల్లో పనిచేశాడు. 2018లో తాండ్య్రాలకు బదిలీపై వచ్చారు. అప్పుడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 90మంది విద్యార్థులు ఉండగా, గతేడాది సంఖ్య 153కు పెరిగింది. ప్రీ ప్రైమరీకి అనుమతి రావడంతో ఈసారి ప్రవేశాలు పెరిగి 176 మంది చదువుతున్నారు. విజయ్ ప్రీ ప్రైమరీ తరగతికి పుస్తకాలు రూపకల్పన చేసి, ఎఫ్ఎల్ఎన్లో 90శాతం ఫలితాలు సాధించడంతో అధికారుల మెప్పు పొందాడు. కరోనా సమయంలో ఆన్లైన్లో పాఠాలు బోధిస్తూ, విద్యార్థులు సెల్ఫోన్ ద్వారా సమాధానాలు రాసేలా వర్క్షీడ్ తయారు చేశాడు. -
చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్రెడ్డి పాలన
జగిత్యాలరూరల్: రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్రెడ్డి పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై శుక్రవారం సారంగాపూర్ మండలం పెంబట్లలో నిరసన ర్యాలీ నిర్వహించి వంటావార్పు కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు రోజులు దగ్గరపడ్డాయని, రేవంత్రెడ్డి రియల్ఎస్టేట్ వ్యాపారి అని, రైతుల భూములను 22ఏ లో పెట్టి వారి గోస పోసుకుంటున్నాడని విమర్శించారు. వెయ్యి రోజుల పాలన సంబురాలు ఎందుకు చేసుకుంటున్నరో చెప్పాలన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వనందుకా, పింఛన్ రూ.2,000 నుంచి రూ.4,000 పెంచుతామని మాట తప్పినందుకా, మహిళలకు రూ.2,500 ఇస్తామన్న హామీ నెరవేర్చనందుకా అని ఎద్దేవా చేశారు. దేవుని కండువా కప్పుకొని అభివృద్ధి చేస్తున్న అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఎందుకు రోడ్లు మరమ్మతు చేయడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 పెన్షన్ ఇస్తే, కేసీఆర్ పదింతలు చేసి రూ.2,000 ఇచ్చారన్నారు. రేవంత్రెడ్డి రూ.4,000 పెన్షన్ ఇస్తామని వెయ్యి రోజులు గడుస్తున్నా ఒక్కరికి ఇవ్వలేదని ఆరోపించారు. ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశాడని, వారి ఉసురు పోసుకుంటున్న రేవంత్ బాగుపడరన్నారు. అభివృద్ధి అని జగిత్యాల్ ఎమ్మెల్యే, రేవంత్రెడ్డి చంకలో చేరాడన్నారు. గ్రామాలకు ఉపాధి హామీ నిధులు సైతం మంజూరు చేయకుండా సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, కేసీఆర్ నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మీ కింద రూ.లక్ష ఇచ్చారని, రేవంత్రెడ్డి కల్యాణలక్ష్మీకి తోడు తులం బంగారం ఇస్తామని చెప్పి గురిజ కూడా ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మీ కూడా ఎగ్గొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్రెడ్డికి మహిళలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, పాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్రెడ్డి, మాజీ చైర్మన్ సత్యంరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం
పెగడపల్లి(ధర్మపురి): ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్ పేర్కొన్నారు. ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా మానసిక ప్రశాంతత, సామాజిక ఐక్యతను పెంపొందించే అత్యున్నత కేంద్రాలుగా ఉపయోగ పడుతాయన్నారు. మండలంలోని రామబద్రునిపల్లి గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మన సనాతన సంప్రదాయాలు, సంస్కృతి, పురాతన జీవన విధానాన్ని ఆలయాలు సజీవంగా నిలబెడుతాయని వివరించారు. ఆలయ నిర్మాణానికి పూనుకోవడం హర్షణీయమని, గ్రామస్తులు ఐక్యమత్యమై ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని, తోచిన విధంగా సాయం అందించి సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు. ఇందుకు తానుకూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణం పూర్తయితే గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొంది ప్రజల్లో భక్తిభావం పెరుగుతోందన్నారు. సర్పంచ్ కాశవేని కుమార్, ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, మాజీ జెడ్పీటీసీ రాజేందర్రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కడారి తిరుపతి, నా యకులు శ్రీనివాస్, అంజయ్య, లింగారెడ్డి, రవినా యక్,కిషన్, విజయభాస్కర్, మహేశ్ పాల్గొన్నారు. సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం వెల్గటూర్: పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి మంత్రి శుక్రవారం హాజరయ్యారు. నూతన ఇంటిలో అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
జ్ఞానదీపికలు మేటిగురువులు
కరీంనగర్ సిటీ/రాయికల్/కథలాపూర్/రామగుండం/చొప్పదండి/తిమ్మాపూర్/సిరిసిల్ల టౌన్/చందుర్తి: ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు అధ్యాపకులు, ఉపాధ్యాయుల పనితీరుకు గుర్తింపు లభించింది. ఈనెల 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉన్నతవిద్య, విద్యాశాఖ ఉత్తమ పురస్కారాలు ప్రకటించింది. శాతవాహన వర్సిటీ వృక్షశాస్త్ర ప్రొఫెసర్ పడాల తిరుపతి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకుడు డి.హరికాంత్, రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయలక్ష్మి ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. పడాల తిరుపతి జగిత్యాల జిల్లా రాయికల్ వాస్తవ్యుడు. ఆయనను ఉపాధ్యా య సంఘం రాష్ట్ర సేవ విభాగం కన్వీనర్ చెరుకు మహేశ్వరశర్మ, టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముక్కెర శేఖర్, ఎంఈవో రాఘవులు అభినందించారు. డి.హరికాంత్ 2015 నుంచి శాతవాహన వర్సిటీలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. గతంలో కామర్స్ విభాగం అధిపతిగా, బీవోఎస్ చైర్మన్గా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ, యూసీసీబీఎం ప్రిన్సిపాల్గా పనిచేశారు. వైస్చాన్స్లర్ ఓఎస్డీగా సేవలు అందిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుండు విజయ్, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల హైస్కూల్ మ్యాథ్స్ ఉపాధ్యాయుడు గద్దె శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు గూట్ల మధుసూదన్, ఇదే జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు షరీఫ్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల బాలికల హైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు చేరాల తిరుపతి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరంతా పనితీరులో ప్రత్యేకత.. వృత్తిధర్మాన్ని అంకిత భావంతో నిర్వహించడం తదితరాల కారణంగా ఉత్తములుగా ఎంపికయ్యారు. ఎంపికై న అధ్యాపకులను, ఉపాధ్యాయులను పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, విద్యాభిమానులు అభినందించారు.చేరాల తిరుపతిగద్దె శ్రీనివాస్గూట్ల మధుసూదన్ షరీఫ్విజయలక్ష్మిపడాల తిరుపతిగుండు విజయ్హరికాంత్జేఎన్టీయూ స్కామ్!రైతు రాజ్యం కేసీఆర్తోనే సాధ్యం -
సూరమ్మ ప్రాజెక్ట్ నుంచి నీరిస్తే పోటీ చేయను..!
కథలాపూర్(వేములవాడ): మండలంలోని కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 43,100 ఎకరాలకు సాగునీరందించినట్లయితే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, నీరందించకపోతే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా నామినేషన్ వేయొద్దని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల అవస్థలపై మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందరోజుల్లో ఆరుగ్యారంటీలను అమలు చేస్తామని ఆది శ్రీనివాస్ బాండ్ పేపర్ రాసిచ్చారని, రాజన్న ఆలయంలో పెట్టి పూజలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వరదకాలువ నిర్మించింది కాంగ్రెస్ అయినా.. దానిని జీవనదిగా మార్చింది మా త్రం కేసీఆర్ అని, రివర్స్ పంపింగ్ ద్వారా ఈ ప్రాంతానికి నీరు అందించారని పేర్కొన్నారు. రైతులు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మండల నాయకులు గడ్డం భూమారెడ్డి, మామిడిపెల్లి రవి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆదికి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ సవాల్ -
మీ అవినీతి.. మా అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం
ధర్మపురి: ‘పదేళ్లలో మీ అవినీతి.. వెయ్యి రోజుల్లో మా అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం.. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురండి..’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్రావు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అప్పులతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అధికారంలోకొచ్చిన తర్వాత 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. ధర్మపురి లక్ష్మినృసింహునికి నిధులు మంజూరు చేస్తామని శఠగోపం పెట్టిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. వెయ్యిరోజుల పాలనపై ఆరోపణలు చేసిన మాజీమంత్రి కొప్పులకు వెయ్యి రోజుల ప్రగతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ధర్మపురిలో డిగ్రీ కళాశాల, రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, బస్డిపో, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేశ్, నాయకులు చీపిరిశెట్టి రాజేష్, చిలుముల లక్ష్మణ్, కుంట సుధాకర్ ఉన్నారు. సంక్షేమ పాఠశాలల్లో కార్పొరేట్ సౌకర్యాలు వెల్గటూర్: సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.67 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తహసీల్దార్, ఎంపీడీవోలు వారంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాలను తనిఖీ చేయాలని, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించాలని ఆదేశించారు. ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సర్పంచ్ జక్కుల ఆమని, ఆర్డీవో మధుసూదన్, ఏఎంసీ చైర్మన్ తిరుపతి, తహసీల్దార్ శేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, నాయకులు మురళి, ఉదయ్, శ్రీకాంత్రావు, నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ను తీసుకురావాలి కేటీఆర్, హరీశ్రావుకు మంత్రి అడ్లూరి సవాల్ -
మూడంచెల్లో ఎస్జీఎఫ్ పోటీలు
కథలాపూర్: జిల్లాలో ఎస్జీఎఫ్ పోటీల సందడి నెలకొననుంది. డీఈవో, డీవైఎస్వో, పీడీలు, పీఈటీలు, క్రీడా సంఘాల బాధ్యుల సహకారంతో పాఠశాలస్థాయి క్రీడలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎస్జీఎఫ్ షెడ్యూల్ ప్రకటించారు. అండర్–11, 14, 17, 19 విభాగాల్లో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల11లోపు మండలస్థాయి పోటీలు పూర్తి మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. మండలస్థాయిలో ఈనెల 11లోపు పోటీలు పూర్తవుతాయి. మండల స్థాయిలో రాణించిన వారు జిల్లాకేంద్రంలో నిర్వహించే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో సత్తాచాటిన వారిని జోనల్ స్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయి క్రీడలను ఈనెల 30లోపు పూర్తి చేస్తామని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి చక్రధర్రావు వివరించారు. -
‘ఇంటిగ్రేటెడ్’ పనుల్లో వేగం
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలరూరల్: వచ్చే విద్యాసంవత్సరం వరకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనుల్లో వేగం పెంచుతున్నామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి శివారులో 25ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను గురువారం పరిశీలించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలను ఒకే ప్రాంగణంలో అందించడం లక్ష్యమన్నారు. 2500 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచులు గంగారెడ్డి, కట్ట రాజేందర్, నాయకులు నక్కల రవీందర్రెడ్డి, సదానందం, నలువాల సురేశ్, సతీశ్, లింగారెడ్డి, గంగారెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులను మోసం చేస్తున్న సీఎం ● ఈనెల 10న చలో హైదరాబాద్ ● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్ జగిత్యాలరూరల్: కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాక ఉద్యోగులను మోసం చేస్తోందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం మోరపల్లి, పొరండ్లతోపాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్టీయూ సభ్యత్వ నమోదు చేపట్టారు. వంద రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని, పెండింగ్ డీఏలు మంజూరు చేస్తామని, సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాక విస్మరించారని తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 10న నిర్వహించే నిరసన కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు. రాష్ట్ర అదనపు కార్యదర్శి మచ్చ శంకర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్, అసోసియేషన్ అధ్యక్షుడు ఎగ్యారపు వెంకటేశ్, మండల అధ్యక్షుడు విష్ణు పాల్గొన్నారు. శిశుమరణాలు తగ్గించాలి ● డీఎంహెచ్వో సుజాత జగిత్యాల: జిల్లాలో శిశుమరణాలు లేకుండా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో సుజాత అన్నారు. డీఎంహెచ్వో కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. శిశుమరణాలను సింగిల్ డిజిట్కు తీసుకురావాలని, గర్భిణులకు మొదటి నుంచే అవగాహన కల్పించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, వైద్యులు పాల్గొన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలిధర్మపురి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని డీఆర్డీవో రఘువరణ్, పీపీవో మదన్మోహన్ అన్నారు. నవ వసంతోత్సవం కార్యక్రమంలో భాగంగా మండలంలోని రాయపట్నంలో ఎంపీడీవో రవీందర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ వంతుగా మొక్కను నాటి సంరక్షించాలన్నారు. సర్పంచ్ మొగిలి, ఉప సర్పంచ్ చిలుక రామన్న, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తదితరులున్నారు. -
పాత లావాదేవీలపైనా విచారణ జరగాలి
జేఎన్టీయూకు అనుబంధంగా కొండగట్టులో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో ఉపకార వేతనాలు రాని విద్యార్థులు నేరుగా హాస్టల్కు చెల్లించే ఫీజులు కాలేజ్ అకౌంట్ కాకుండా యూనివర్సిటీలో పని చేసే ఉద్యోగి అకౌంట్కు వెళ్లడంపై పూర్తి విచారణ జరగాలి. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జేఎన్టీయూలో పెద్దస్థాయి అధికారి అండ ఉంటేనే ఈ విధంగా చేయగలుగుతాడు. కేవలం ఏడాది ఫీజులపై కాకుండా గత మూడు విద్యా సంవత్సరాలు జరిగిన ఫీజుల లావాదేవీలపై విచారణ జరిపించాలి. అసలు దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. – మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
వెయ్యి రోజుల్లో అభివృద్ధి శూన్యం
● రూ.3.5లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారు..? ● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ● గొల్లపల్లిలో ఎడ్లబండ్ల ర్యాలీగొల్లపల్లి: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ముస్కు శ్యాంసుందర్ గార్డెన్ వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి అడ్లూరి రిపోర్టులు అడగడం మాని, తన పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, బస్తీ దవాఖానా ల వంటి ఆస్తులు సృష్టించామని, అయినా అప్పు రూ.3.90లక్షల కోట్లు దాటలేదని, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్ల అప్పు చేశారని, వాటితో ఏం చేశారని ప్రశ్నించారు. రైతుభరోసా ఎగ్గొట్టారని, పెన్షన్ రూ.నాలుగు వేలు ఇవ్వడం లేదని, మహిళలకు రూ.2500, తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. రోళ్లవాగు ప్రాజెక్టును బీఆర్ఎస్ 95శాతం పూర్తి చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గేట్లు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కపెల్లి చెరువు, దొంతాపూర్ రోడ్డు, యశ్వంతరావుపేట చెరువు, మ్యాదరి గండి పనులను పక్కనపెట్టారని ఆరోపించారు. రాయపట్నం, ముత్తురూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ గాలికి వదిలేశారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. -
రాహుల్గాంధీపై కేసు ఉపసంహరించుకోవాలి
కోరుట్ల: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు గురువారం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ రాహుల్పై ఉత్తరఖాండ్ పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదన్నారు. శ్రీఎస్ఐఆర్శ్రీ కార్యక్రమంలో పాలొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభాస్థలాన్ని బీజేపీ శ్రేణులు గంగాజలంతో శుద్ధి చేసి కించపరిచారని, దీనిపై రాహుల్ మాట్లాడటాన్ని తప్పుపట్టి కేసు నమోదు చేయటం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, పన్నాల అంజిరెడ్డి, నాయకులు కొంతం రాజం, పలువురు సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కోరుట్లలో కాంగ్రెస్ శ్రేణుల ధర్నా -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
కోరుట్ల: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ గురువారం మల్లాపూర్ మండలకేంద్రంలో ధర్నా నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదని, రైతుబంధు, రైతుబీమా ఎగ్గొట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సాగునీటి రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. పలువురు సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కోరుట్ల: కోరుట్ల మండలం మోహన్రావుపేట – మేడిపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మేడిపల్లి మండలకేంద్రానికి చెందిన దుమాల లక్ష్మణ్(24) మృతి చెందాడు. ఎస్సై శ్యాంరాజ్ కథనం ప్రకారం.. లక్ష్మణ్ కోరుట్లకు ఉపాధి కోసం ప్రతిరోజు మేడిపల్లి నుంచి వచ్చిపోతున్నాడు. ఎప్పటిలాగే తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా.. మోహన్రావుపేట బ్రిడ్జి దాటగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేశామని, ద్విచక్రవాహన్ని ఢీకొట్టిన వాహనం కోసం గాలింస్తున్నామని ఎస్సై తెలిపారు. ఇసుక టిప్పర్ పట్టివేతఇబ్రహీంపట్నం: మండలంలోని అమ్మక్కపేట వద్ద గురువారం ఇసుక టిప్పర్ను పట్టుకున్నట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. కథలాపూర్ మండలం నుంచి అమ్మక్కపేటకు అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తుండగా టిప్పర్ను పట్టుకున్నామని పేర్కొన్నారు. వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించి టిప్పర్ యజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని తెప్పించాలని కేంద్రమంత్రికి వినతిజగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్గౌడ్ ఇటీవల ఉక్రెయిన్లో జరిగిన రష్యా బాంబు దాడిలో మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయన మృతదేహాన్ని తెప్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ను అతని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. స్పందించిన ఆయన ఉక్రెయిన్ రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా సమాచారం చేరవేశారు. చికిత్సపొందుతూ వ్యక్తి మృతిమెట్పల్లిరూరల్: ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడిన మెట్పల్లి మండలం మేడిపల్లికి చెందిన బోదాసు చిన్నరాజయ్య(35) చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్కు చెందిన చిన్న రాజయ్య మేడిపల్లిలో అద్దెకు ఉంటున్నాడు. ఈనెల ఒకటిన భార్య రాధతో చిన్నరాజయ్య గొడవ పెట్టుకుని రోడ్డుపైకి రాగా ఆటో ఢీకొట్టింది. చికిత్స నిమిత్తం మెట్పల్లి.. తరావ్త జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. మృతుడి సోదరుడు పెద్ద రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
4.47 మీటర్ల లోతులో జలం
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ ముగుస్తున్నా.. భూగర్భజలాలు ఇంకా లోతులోనే ఉన్నాయి. వర్షాలు అంతంతమాత్రంగా కురవడంతో జూలైతో పోల్చితే ఆగస్టు చివరి నాటికి భూగర్భజలం 1.14 మీటర్ల మేర పెరగడం కొంత ఆశాజనకంగా మారింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే 0.86 మీటర్ల లోతులోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కోరుట్ల మున్సిపాలిటీలో 9.21మీటర్ల లోతుల్లో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి వంటి పట్టణ ప్రాంతాల్లో రోజువారి అవసరాలకు నీటి వినియోగం పెరగడంతో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతుండటం ఇబ్బందిగా మారింది. వరదనీటిని నిల్వ చేయాల్సింది పోను.. ఇష్టానుసారంగా బోరు బావులను తవ్వుతుండడంతో నీటిమట్టం లోతుకు పడిపోతోంది. ఆగస్టులో మున్సిపాలిటీల్లో పడిపోయిన నీటిమట్టాలను పరిశీలిస్తే.. జిల్లాకేంద్రంలో 7.27 మీటర్లు, కోరుట్లలో 9.21 మీటర్లు, మెట్పల్లిలో 4.88 మీటర్లు, రాయికల్లో 2.89మీటర్లు, ధర్మపురిలో 3.22 మీటర్ల మేర పడిపోయింది. నాన్ఆయకట్టు ప్రాంతాల్లోనూ అంతంతే.. నాన్ఆయకట్టు ప్రాంతాలైన మల్యాల, మేడిపల్లి, కథలాపూర్, కొడిమ్యాల, భీమారం మండలాల్లో భూగర్భజలాలు మరింతగా పడిపోతున్నాయి. నాన్ఆయకట్టు ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా తగ్గుతున్నాయి. మల్యాల మండలంలో 7.61మీటర్లు, కొడిమ్యాలలో 13.32మీటర్లు, కథలాపూర్లో 2.60 మీటర్లు, మేడిపల్లిలో 6.69 మీటర్లు, భీమారంలో 2.72 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది. ఒక్క నెలలో పెరిగిన భూగర్భజలం అడపదడపా కురిసిన వర్షాలతో నీటిమట్టం ఒక్క నెలలోనే సగటున 1.14 మీటర్లకు పెరిగింది. జూలైలో 5.61 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఆగస్టు చివరి నాటికి 1.14 మీటర్లు పెరిగి 4.47 మీటర్లకు చేరుకుంది. బీర్పూర్ మండలంలో 2.50 మీటర్ల లోతులో నీరు ఉండగా, అత్యధికంగా 13.32 మీటర్ల లోతులో కొడిమ్యాల మండలంలో నీరు ఉండటం గమనార్హం. ఆయకట్టు మండలాల్లోనూ అంతే.. ఆయకట్టు మండలాల్లోనూ నీటిమట్టం పడిపోతూనే ఉంది. బుగ్గారంలో 3.19 మీటర్లు, ఎండపల్లిలో 7.17, గొల్లపల్లిలో 2.57, జగిత్యాలరూరల్లో 2.72, పెగడపల్లిలో 3.62, సారంగాపూర్లో 4.64, వెల్గటూర్లో 3.26, ఇబ్రహీంపట్నంలో 3.25, మల్లాపూర్లో 5.18 మీటర్ల మేర పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తుండటంతో ఈనెలలోనూ భూగర్భజల మట్టం పెద్దగా పెరగకపోవచ్చని చర్చ నడుస్తోంది. జూలైతో పోల్చితే ఆగస్టులో కొంత ఆశాజనకం కొడిమ్యాల మండలంలో 13.32 మీటర్లలోనే నీరు -
పనిచేస్తేనే వేతనం..
గొల్లపల్లి : వేతనం తీసుకుంటూ.. పాఠశాలలకు డుమ్మాకొట్టే కొందరు ఉపాధ్యాయుల తీరుకు ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)తో బ్రేక్ పడింది. పాఠశాల ప్రాంగణంలోనే నిల్చుని సమయానికి ముఖం చూపిస్తేనే హాజరు నమోదయ్యే సాంకేతికత అమల్లోకి రావడంతో టీచర్లు విధిగా సమయపాలన పాటిస్తున్నారు. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో ఎఫ్ఆర్ఎస్ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో సిబ్బందిలో మరింత గుబులు మొదలైంది. జియో ఫెన్సింగ్ పక్కా జిల్లావ్యాప్తంగా 782 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్న ఎంఈవోలు, ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సీఆర్పీలు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు సహా మొత్తం 4,139 మందిని ఎఫ్ఆర్ఎస్ పరిధిలోకి తెచ్చారు. ఉపాధ్యాయులతోపాటు బోధనేతర సిబ్బంది కూడా బడి ప్రారంభంలో ఒకసారి, ముగిశాక మరోసారి తమ లొకేషన్ నుంచి ఫొటో క్యాప్చర్ చేయాల్సిందే. పాఠశాల పరిధి దాటి ఇతర ప్రాంతాల్లో ఉండి హాజరు వేస్తామంటే సాంకేతికత అంగీకరించదు. సెలవు తీసుకున్నా ముందస్తుగా యాప్లోనే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం రెండు పూటలా హాజరు నమోదు కాకపోతే ఆ రోజు గైర్హాజరు పడటం ఖాయం. క్షేత్రస్థాయి సిబ్బందిపై తప్పని నిఘా ఎఫ్ఆర్ఎస్ను ప్రధానంగా రెండు పద్ధతుల్లో వర్తింపజేస్తున్నారు. టీచర్లు రోజూ వారివారి పాఠశాల ప్రాంగణం నుంచే మొబైల్ ద్వారా నేరుగా ఫేస్ క్యాప్చర్ చేయాలి. ఫీల్డ్ వర్క్లో ఉండే ఎంఈవోలు, సీఆర్పీలు తనిఖీలకు వెళ్లిన పాఠశాలలు లేదా అధికారిక సమావేశాలు జరిగే ప్రదేశాల నుంచే తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. హాజరుతోనే జీతం కేవలం హాజరు కోసమే కాకుండా.. రాబోయే రోజుల్లో ఎఫ్ఆర్ఎస్ డేటాను నేరుగా ట్రెజరీ వేతన వ్యవస్థకు లింక్ చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. నెలవారీగా ఉపాధ్యాయుడి హాజరు శాతాన్ని లెక్కించి, అనుమతించిన సెలవుల కంటే ఎక్కువ రోజులు విధులకు గైర్హాజరైతే వేతనంలో నేరుగా కోత విధించనున్నారు. బోధనలో నాణ్యత పెరిగేనా..? సాంకేతిక నిఘాతో ఉపాధ్యాయుల హాజరు శాతం మెరుగవుతున్నప్పటికీ సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతాయనే చర్చ ప్రజల్లో మొదలైంది. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గి, ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్న వేళ.. ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపేలా నిబంధనలు తెస్తేనే బోధనలో నిజమైన జవాబుదారీతనం వస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
అంగన్వాడీ పోస్టులపై దళారుల కన్ను
జగిత్యాల: అంగన్వాడీ కేంద్రాల్లోని 64పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమైంది. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల్లో 1085 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 64 పోస్టులకు 1199 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఈనెల ఐదో తేదీ వరకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే పోస్టుల భర్తీలో దళారుల కన్ను పడింది. అభ్యర్థుల నుంచి డబ్బులు దండుకోవడానికి పోస్టులు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు. జగిత్యాల, ధర్మపురి, మల్యాల, మెట్పల్లిలో అత్యధిక మంది పోటీ పడుతుండడం వీరికి కలిసివస్తోంది. దళారులను నమ్మి మోసపోవద్దని, అర్హతను బట్టే పోస్టులు వస్తాయని సీ్త్ర సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నా.. ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలని కొందరు పైరవీలు చేస్తున్నారు. తమకు ప్రజాప్రతినిధులు తెలుసునని, ఎమ్మెల్యే, మంత్రితో చెప్పి పోస్ట్ ఇప్పిస్తామని చెబుతుండడంతో వారి వలలో పడుతున్నారు. నేతల చుట్టూ ప్రదక్షిణలు అంగన్వాడీ పోస్టులకు మొదటి నుంచి డిమాండ్ ఉండటంతో చిన్నచిన్న లీడర్లు ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో ఓ ప్రజాప్రతినిధి పీఏ ఏకంగా రూ.4 లక్షలు డిమాండ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాకేంద్రంలో అన్రిజర్వ్డ్ పోస్టులు ఉండటంతో పైరవీలు తీవ్రతరంగా మారాయి. అధికారపార్టీకి చెందిన బడా నాయకుల వద్దకు నిత్యం వెళ్తూ పోస్టులు ఇప్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో పోస్ట్కు సుమారు రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జోరుగా సాగుతున్న పైరవీలు అంగన్వాడీ కేంద్రం -
ఆగస్టు 27 నుంచి 31 వరకు వచ్చిన ఆదాయం
1.581.71కరీంనగర్–12.24హుజూరాబాద్కరీంనగర్–22.051.06గోదావరిఖని3.162.853.892.19హుస్నాబాద్1.202.553.371.65జగిత్యాలకోరుట్ల0.86మంథనిఆదాయం (రూ.కోట్లలో)0.97మెట్పల్లి1.03సిరిసిల్ల1.08వేములవాడఆర్టీసీకి గి‘రాఖీ’కరీంనగర్: రక్షాబంధన్ టీజీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. పండగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల పరిధిలో ఆగస్టు 27 నుంచి 31 వరకు 4,940 బస్సులు నడిపారు. ఇవి 21.40 లక్షల కిలోమీటర్లు తిరిగి ఏకంగా 27.39 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. వీరిలో 19.55 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం రవాణా ద్వారా రూ.14.78 కోట్ల ఆదాయం సమకూరింది. మహిళల ప్రయాణానికే రూ.8.50 కోట్ల విలువ మహాలక్ష్మి పథకంతో మహిళల రాకపోకలు భారీగా పెరిగాయి. జీరో టికెట్ల విలువ రూ.8.50 కోట్లుగా నమోదైంది. సాధారణ టికెట్ల ద్వారా వచ్చిన వసూళ్లతో కలిపి సంస్థకు గణనీయమైన ఆదాయం లభించింది. ఐదు రోజుల వ్యవధిలో సగటున రోజుకు రూ.2.95 కోట్ల ఆదాయం సమకూరగా, దాదాపు 5.47 లక్షల మంది రోజువారీగా ప్రయాణించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. రాఖీ రోజే రూ.3.60 కోట్లు... రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 28న 988 బస్సులు అదనంగా నడపగా, 6.38 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఇందులో 4.73 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఆ రోజు ఆర్టీసికి రూ.3.60 కోట్ల ఆదాయం లభించింది. జీరో టికెట్ల రూపంలోనే రూ.2.20 కోట్ల విలువైన ప్రయాణం నమోదైంది. కరీంనగర్–2 డిపో రూ.2.24 కోట్లతో ఆదాయంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గోదావరిఖని రూ.2.05 కోట్లు, జగిత్యాల రూ.1.65 కోట్లు ఆర్జించి తర్వాతిస్థానాల్లో ఉన్నాయి. కరీంనగర్–1 డిపో రూ.1.58 కోట్లు, హుస్నాబాద్ రూ.1.71 కోట్లు, హుజూరాబాద్ రూ.1.20 కోట్లు, కోరుట్ల రూ.1.06 కోట్లు, మెట్పల్లి రూ.0.97 కోట్లు, సిరిసిల్ల రూ.1.03 కోట్లు, వేములవాడ రూ.1.08 కోట్లు, మంథని రూ.0.86 కోట్ల వసూళ్లు సాధించాయి.పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సాధారణ సర్వీసులతో పాటు అదనపు బస్సులు నడిపించాం. ముందస్తు టికెట్ రిజర్వేషన్ల సంఖ్యను పెంచడంతోపాటు అవసరమైన ప్రాంతాలకు ఇతర డిపోల నుంచి సర్వీసులు నడిపించాం. దీంతో మహిళలు, సాధారణ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు చేరుకోగలిగారు. రాఖీ పండగ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల రవాణా వ్యవస్థ సజావుగా సాగింది. – రాజు, రీజినల్ మేనేజర్, కరీంనగర్1.892.011.32గోదావరిఖని డిపో 3.89 లక్షలమందిని గమ్యస్థాలకు చేర్చి మొదటిస్థానంలో నిలిచింది. జగిత్యాల 3.37 లక్షలు, కరీంనగర్–1 డిపో బస్సుల్లో 3.16 లక్షల మంది ప్రయాణించారు. కరీంనగర్–2 డిపో బస్సుల్లో 2.85 లక్షలు, హుజూరాబాద్ 2.55 లక్షలు, హుస్నాబాద్ 2.19 లక్షలు, మెట్పల్లి 2.01 లక్షలు, కోరుట్ల 2.01 లక్షలు, వేములవాడ 2.07 లక్షలు, సిరిసిల్ల 1.89 లక్షలు, మంథని డిపో బస్సులు 1.32లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.ప్రయాణికులు (లక్షల్లో)2.07 -
సహకార పదవులు దక్కేనా?
జగిత్యాలరూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నామినేటెడ్ పద్ధతిలో పదవుల ఎంపికకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైర్మన్ల నియామకం విషయం హైకోర్టులో ఉండటంతో ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు కొనసాగుతోంది. గతంలో మాదిరిగా పీఏసీఎస్లో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నామినేటెడ్ విధానంలో పదవులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో 51స్థానాలకు మల్యాల మండలం పోతారం, నూకపల్లి సింగిల్ విండోలకు చైర్మన్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించారు. మిగతా 49 స్థానాల్లో నియామకాలు చేపట్టనున్నారు. కొన్నిచోట్ల పాత పాలకవర్గాలు కోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ.. ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా నామినేటెడ్ పద్ధతిలో పదవుల ఎంపికకు జాబితా ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహుల జాబితాను ప్రభుత్వానికి అందించారు. పీఏసీఎస్ చైర్మన్, వైస్చైర్మన్, డైరెక్టర్ల పదవులకు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. గడువు తీరి రెండున్నరేళ్లు జిల్లాలోని పీఏసీఎస్లకు చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. వాటి కాలపరిమితి 14 ఫిబ్రవరి 2025తో ముగిసింది. ప్రభుత్వం ఆరునెలల చొప్పున రెండు దఫాలుగా పొడిగించింది. ప్రస్తుతం పర్సనల్ ఇన్చార్జిలు కొనసాగిస్తున్నారు. పాత పాలకవర్గాలు కొన్ని చోట్ల కోర్టును ఆశ్రయించాయి. ఎన్నికలయ్యే వరకు తమనే పదవిలో ఉంచాలని కోరారు. కోర్టు కూడా పర్సన్ ఇన్చార్జీలను తొలగించి.. పాత పాలక వర్గాలను కొనసాగించాలని సూచించింది. ప్రభుత్వం మాత్రం నామినేటెడ్ పద్ధతిలో పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని ఎమ్మెల్యేల ద్వారా ఆశావహుల జాబితా ను సేకరించింది. పోటీ ఎక్కువగా ఉన్న చోట ఆశావహులను బుజ్జగిస్తూ.. రహస్యంగా ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో గుట్టుగా సంబంధిత సహకార సంఘాల అధికారులను పిలుపించుకొని.. ఎంపిక చేసిన డైరెక్టర్లకు ఆయా సొసైటీ పరిధిలో సభ్యత్వాలు ఉన్నాయా..? లేదా అని ఆరా తీస్తున్నారు. ఎంపిక అభ్యర్థికి తెలి యకుండా గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. సభ్యత్వం తప్పనిసరి జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో 51 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 83,387 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్కో సంఘంలో 13 మంది డైరెక్టర్లుగా ఉంటారు. ఆ డైరెక్టర్లలో ఆరింటికి రిజర్వేషన్లు ఉంటాయి. రెండు బీసీ, ఒక ఎస్టీ, రెండు ఎస్సీల్లో ఒకటి మహిళ, ఎస్సీ జనరల్, మరొకటి జనరల్ మహిళా రిజర్వు సీట్లు ఉన్నాయి. 13 మంది డైరెక్టర్లలోనే ఒకరు చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఎంపిక చేస్తారు. ఈ పదవులకు ఎంపిక కావాల్సిన వారు కచ్చితంగా ఆ పీఏసీఎస్ డైరెక్టర్ పరిధిలో సభ్యత్వం ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వమే నియమిస్తుంది సహకార సంఘాల చైర్మన్లను గతంలో ఎన్నికలు నిర్వహించి ఎంపిక చేసేవారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ల నియామకానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ కొనసాగుతుంది. – మనోజ్కుమార్, డీసీవో -
22ఏ నిషేధిత భూముల జాబితాలో జాగ్రత్త
జగిత్యాల: జిల్లాలోని దేవాదాయశాఖకు సంబంధించిన భూములను 22ఏ నిషేధిత జాబితాలో చే ర్చే ప్రక్రియను జాగ్రత్తగా, తప్పిదాలు లేకుండా పూ ర్తి చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. 22ఏ నిషేధిత భూములపై సమీక్షించారు. ఆలయ భూ ములు, సర్వే నంబర్లు, ఉప విభాగ సంఖ్యలు, విస్తీర్ణం, భూమి వర్గీకరణ, యాజమాన్య వివరాలు, రెవెన్యూ, దేవాదాయ శాఖ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఖరారు చేయాలన్నారు. దేవా దాయ శాఖ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గడువులోపు సమగ్రంగా పరిశీలించి జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. -
పెరోల్పై పీఎఫ్ఐ నాయకుడు
జగిత్యాలక్రైం: దేశద్రోహం కేసులో మూడేళ్ల క్రితం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ సలీం చిన్నమ్మ 15 రోజుల క్రితం మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సలీంకు కోర్టులో పెరోల్ మంజూరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య సలీంను జగిత్యాలకు తీసుకొచ్చారు. సుమారు మూడున్నర గంటల పాటు కుటుంబసభ్యులతో గడిపిన అనంతరం సలీంను పోలీసులు తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. సలీం పెరోల్పై వస్తున్నాడని తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి మూడున్నర గంటల తర్వాత జైలుకు తీసుకెళ్లిన పోలీసులు -
లలిత కళా సమితి స్థలం.. వివాదం
మెట్పల్లి: మెట్పల్లి పట్టణంలోని 12వార్డులో లలిత కళా సమితికి చెందిన స్థలం కోసం స్థానిక మహిళలు ఆందోళనలు చేస్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల క్రితం సమితికి కేటాయించిన భూమిలో ఖాళీగా ఉన్న దానిలో కొంతభాగాన్ని మహిళా సంఘం భవనానికి కేటాయించాలంటూ వారు పట్టుబట్టుతున్నారు. వినియోగంలో లేని స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తుండడం వివాదానికి దారి తీసింది. 1981లో 19గుంటలు కేటాయింపు.. అధికారుల నిర్ణయంపై ఉత్కంఠ -
లేని నల్లాకు నీటి పన్ను
పట్టణంలో సుమారు 20వేల జనాభా ఉంది. 12 వార్డులు, 4500 వరకు ఇళ్లు ఉన్నాయి. బల్దియాలో ఆరేళ్లుగా మిషన్ భగీరథ, అమృత్ 2.0 పనుల నిమిత్తం గతంలో గ్రామపంచాయతీలో ఉన్న నల్లాలు తొలగించారు. ఉన్న నల్లాలు తొలగించడంతో చాలామంది నిరుపేదలు తాగునీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటినుంచి వారికి కొత్త కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. మరోవైపు నెలకు రూ.75 చొప్పున ఏడాదికి రూ.900 చెల్లించాంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తుండడం గమనార్హం. మున్సిపల్ నీరు నల్లాద్వారా రాకున్నా ఏడాదికి రూ.900 ఎందుకు చెల్లించాలంటూ బల్దియా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్షేత్రస్థాయిలో నీటి సరఫరా ఉన్న వాటికే బిల్లులు వసూలు చేయడంతో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు. ప్రస్తుతం నీటి కనెక్షన్ల వివరాలు ఆన్లైన్ చేయడంతో నల్లా నీరు రాకున్నా బిల్లులు మాత్రం తప్పనిసరిగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కూడా వారికి నల్లా కనెక్షన్లు లేకున్నా నల్లా బిల్లులు మాత్రం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. బల్దియా ప్రజలకు అందని రక్షిత మంచినీరు పట్టణ ప్రజల తాగునీటి కోసం గతంలో మిషన్ భగీరథ పథకం కింద రూ.6 కోట్లు వెచ్చించి నీరు అందించాలని నిర్ణయించారు. అయినప్పటికీ కొన్ని వార్డుల్లో కొన్ని గృహాలకు చుక్క నీరు అందలేదు. అమృత్ 2.0 పథకం కింద రూ.15.20 కోట్లు మంజూరు కాగా.. ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు దరి చేరడం లేదు. మున్సిపల్ అధికారులు స్పందించి వార్డుల్లో పైప్లైన్లను త్వరితగతిన వేయడంతోపాటు, నల్లా కనెక్షన్ బిగించి తాగునీటి సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఆరేళ్లుగా కనెక్షనే లేదు ఆరేళ్లుగా నా ఇంటికి నల్లా కనెక్షనే లేదు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం నల్లా బిల్లు వేస్తున్నారు. ఇటీవల ఆన్లైన్లో చూడటంతో నెలకు రూ.75 చొప్పున బిల్లు కనిపించడంతో అవాక్కయ్యాను. మున్సిపల్ అధికారులు నల్లా కనెక్షన్ లేని వారికి బిల్లు మాఫీ చేయాలి. – పుర్రె రమేశ్ 11వ వార్డు నల్లాలు లేకుంటే బిల్లు బంద్ బల్దియాలో నల్లాలు లే కుంటే ఆన్లైన్లో వచ్చే బిల్లులు వసూలు చేయబోం. అలాంటి వారికి మాఫీ చేస్తాం. దీనిపై పట్టణ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నల్లా కనెక్షన్ లేనివారికి బిల్లు నుంచి మినహా యింపు ఇస్తాం. – మనోహర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాయికల్: రాయికల్ బల్దియాలో నల్లాలు లేకున్నా ఏడాదికి రూ.900 పట్టణ ప్రజలు చెల్లించాల్సి న పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో 3400 నల్లా కనెక్షన్లు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనీసం వెయ్యి కూడా లేవు. అయినప్పటికీ ఇల్లు ఉన్న ప్రతిఒక్కరూ నల్లాపన్ను మాత్రం చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది.రాయికల్ మున్సిపాలిటీ స్వరూపం వార్డులు 12గృహాలు 4500ఉన్న నల్లాలు 1000అధికారికంగా మాత్రం 3400నీటి పన్ను నెలకు రూ.75 ఏడాదికి రూ.900 -
ఆగిన బూట్ల చప్పుళ్లు మోగని తుపాకులు
మంథని: ఒకప్పుడు పీపుల్స్వార్ నక్సలైట్ల సంచారం.. ఆ తర్వాత మావోయిస్టుల కదలికలు.. మరోవైపు పోలీసుల కూంబింగ్ ఆపరేషన్లు.. ఎదురుకాల్పులు.. తుపాకుల మోతలతో దద్దరిల్లిన కరీంనగర్ తూర్పు ప్రాంతంలోని అడవులు ప్రస్తుతం ప్రశాంత వాతావరణం సంతరించుకున్నాయి. దశాబ్దాల పాటు హింస, రక్తపాతం, భయాందోళనలకు వేదికగా నిలిచిన అడవుల్లో మారిన పరిస్థితులు కొత్తఆశలకు బాటలు వేస్తున్నాయి. తెలంగాణలోనే విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న మంథని నియోజకవర్గంలో 120 కిలోమీట్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. మావోయిస్టు పార్టీల్లోని కేంద్ర కమిటీ సభ్యులు, దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మహిళల ఎన్కౌంటర్లు, నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఓ పెద్దస్థాయి పోలీస్ అధికారి.. ఇలా అనేక ఘటనలకు తూర్పు అడవులు సాక్ష్యంగా నిలిచాయి. అలాంటి అడవులు ఇప్పుడు నిశబ్దంగా మారాయి. మౌనంగా భరించిన అడవితల్లి అడవితల్లి అన్నింటినీ మౌనంగా భరరించింది. తుపాకీ గుళ్ల శబ్దాలు విన్నది. రక్తపు మరకలు చూసింది. పరుగులు తీసిన బూట్లను చూసింది. ఎన్కౌంటర్ల తర్వాత నెలకొన్న నిశబ్దాన్నీ అనుభవించింది. పరిస్థితులు మారడంతో సాయుధులు సంచరించిన ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం వెళ్లే అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు కనిపిస్తున్నారు,. జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోవు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో జరిగిన అనేక జ్ఞాపకాలు చెరిగిపోలేదు. అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, మావోయిస్టులు, సామాన్యులు వారి కుటుంబాల విషాద గాథలు ఇప్పటికీ జ్ఞాపకాల్లో ఉన్నాయి. గతాన్ని గుర్తు చేస్తున్నా.. భవిష్యత్పై ఆశలు కలిగిస్తున్నాయి. ఏదీ ఏమైనా అలజడులతో అట్టుడికిన తూర్పు అడవులు ఇప్పుడు ఆహ్లాదం పంచుతున్నాయి. రక్తసిక్తమైన అడవితల్లి నేడు నిశబ్దం పీపుల్స్వార్ నుంచి మావోయిస్టు పోరాటం వరకు .. దశాబ్దాల హింసకు తెరపడుతున్న వేళ మారిన తూర్పు అడవుల ముఖచిత్రం రక్తపుటేరులైన అడవులు పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన అనేక ఎదురుకాల్పులు ఈ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. తుపాకీ కాల్పులతో దద్దరిల్లిన సందర్భాలు అనేకం. ఇరువైపులా ప్రాణనష్టం సంభవించేది. ఈ ఘర్షణల మధ్య అడవిని నమ్ముకుని జీవించే సామాన్యులే తీవ్రంగా నష్టపోయారు. ఓవైపు తమ వారిని కోల్పోయిన కుటుంబాల కన్నీళ్లు.. మరోవైపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలతో గడిపిన గిరిజన కుటుంబాలు.. ఇలా అనేక విషాదాలకు అడవులు సాక్ష్యంగా నిలిచాయి. పరిస్థితులు మారాయి. మావోయిస్టు ఉద్యమం క్రమంగా బలహీనపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన నిరంతర భద్రతా చర్యలు, ఆపరేషన్లతో అనేక ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోవడం, మరికొందరు ఉద్యమానికి దూరం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పుడు భయం.. ఇప్పుడు పక్షుల కిలకిలరావాలు ఇప్పుడు అక్కడ బూట్ల చప్పుళ్లు వినిపించడం లేదు. తుపాకుల మోత లేదు. కూంబింగ్ బృందాల హడావుడి లేదు. ఎన్కౌంటర్ భయం లేదు. పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. చెట్ల ఆకులను తాకుతూ గాలి వెళ్తోంది. అడవిని నమ్ముకుని జీవించే ప్రజలు దైనందిన జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. నేల శాంతి కోసం ఎదురుచూస్తోంది. ఈ నిశబ్దం వెనుక ఒక సుదీర్ఘమైన విషాద చరిత్ర ఉంది. అనేక ప్రాణాలు పోయాయి. చాలా కుటుంబాలు ఆప్తులను కోల్పోయాయి. అనేకమంది తల్లులు కన్నీటితో కాలం గడిపారు. చాలామంది పిల్లలు తండ్రి కోసం ఎదురుచూశారు. అనేక గిరిజన కుటుంబాలు భయంతో బతికాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కాలగర్భంలో కలిసిపోయినా.. ఆ అడవులకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. అందుకే నేడు అడవితల్లి మూగపోలేదు.. మౌనంగా ఉంది. -
ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యాధికారుల తనిఖీలు
మెట్పల్లి: పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రుల అనుమతులు, వైద్యుల అర్హత ప్రతాలను పరిశీలించారు. సూర్య ఆసుపత్రిలో అర్హత లేని వైద్యుడితో ఈఎన్టీ పరీక్షలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదు మేరకు తనిఖీలు జరిపి ప్రాథమికంగా గుర్తించిన అంశాల ఆధారంగా నిర్వాహకులకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఆస్పత్రి నిర్వహణ విషయంలో ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట మండల వైద్యాధికారి జైపాల్రెడ్డి ఉన్నారు. విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలుకోరుట్ల: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం కంటి పరీక్షలు నిర్వహించారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తున్నామని జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి తెలిపారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు ఎక్కువగా చూడడం ద్వారా చూపుపై ప్రభావం పడుతుందన్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. హెచ్ఎం గంగాధర్, హెల్త్ ఎడ్యూకేటర్ జక్కని ధనుంజయ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
న్యాయసేవలను విస్త్రృతం చేయాలి
జగిత్యాలజోన్: న్యాయసేవలను విస్త్రృతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శిగా నియమితులైన ఎం.సరితకు బార్ అసోసియేషన్లో న్యాయవాదులు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయ సేవా సంస్థ కార్యకాలాపాలను మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లాలని, ప్రజలకు హక్కులతోపాటు విధులు వివరించాలని సూచించారు. సరిత మాట్లాడుతూ కక్షిదారులకు ఉచిత న్యాయసహాయం అందించడంతోపాటు, ప్రజలు మోసాలకు గురికాకుండా చట్టాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత, సబ్ జడ్జి నాగేశ్వర్రావు, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సత్యం, న్యాయవాదులు పాల్గొన్నారు.నిరంతర విద్యుత్ సరఫరే లక్ష్యంజగిత్యాలరూరల్: వ్యవసాయానికి, గృహ అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్ఈ సుదర్శనం అన్నారు. సారంగాపూర్ మండలకేంద్రంలో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో కొత్త 5ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను బుధవారం ప్రారంభించారు. లోవోల్టేజీ, సాంకేతిక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, 24 గంటల సరఫరా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్లు, మోటార్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. డీఈ గంగారాం, శ్రీనివాస్, డివిజనల్ ఇంజినీర్ ఎంఆర్టీ సింధూశర్మ, ఏడీఈ ప్రదీప్, శ్రీనివాస్, ఏఈ రహీం, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. 44.937 టీఎంసీలకు ఎస్సారెస్పీ నీటిసామర్థ్యంజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1750 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. మరోవైపు 933 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులకు 1080, నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు 44.937 టీఎంసీలుగా ఉంది. భూ రీసర్వే నిలిపివేయాలంటూ ఆందోళనమెట్పల్లి: మల్లాపూర్ మండలంలోని నడికుడ, రాఘవపేట గ్రామాల మధ్య చేపడుతున్న భూ రీసర్వేను నిలిపివేయాలంటూ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం రెండు గ్రామాల వీడీసీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ రెండు గ్రామాల మధ్య ఉన్న గుడ్డనుగుల గుట్ట ప్రాంతంలోని రెవెన్యూ భూమిని ఏళ్ల నుంచి పశువుల మేతకు వినియోగించుకుంటున్నామని, నడకుడకు చెందిన ఓ వ్యక్తి ఇ టీవల ఆ భూమి తనదని చెబుతూ అందులో పంట సాగు చేస్తున్నాడని తెలిపారు. విషయాన్ని కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకెళ్లి భూమికి ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని కోరామని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా ఆర్డీవో, తహసీల్దార్లు ఆ భూమిలో సర్వే చేపట్టడం సరికాదన్నారు. వెంటనే సర్వేను నిలిపివేసి పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. -
ఆగని అవినీతి
వాహనాల మరమ్మతు పేరిట నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పారిశుధ్య వాహనాల కోసం బల్దియా మెకానిక్ను నియమించినా.. చిన్నచిన్న రిపేర్లకు కూడా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. రూ.9లక్షలు వెచ్చించి వాహనాలకు జియోట్యాగింగ్ ఏర్పాటు చేసినా.. అది కొన్ని వాహనాలకే పరిమితమైంది. బల్దియాలో 50వార్డులున్నాయి. చెత్త సేకరణకు 64 వాహనాలున్నాయి. ఈ వాహనాలకు వినియోగించే డీజిల్ బిల్లులు ఏకంగా రూ.లక్షలు దాటుతోందని కౌన్సిలర్లు చెబుతున్నారు. కొందరికే బయోమెట్రిక్ మున్సిపల్ కార్మికులు కొందరికే బయోమెట్రిక్ హాజరు ఉందని, అందరికీ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ కార్మికుల నియామకంలో అనేక అవకతవకలు వెలుగుచూసినా అధికారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. జగిత్యాల మున్సిపాలిటీ అంటేనే అవినీతికి కేరాఫ్గా మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ కమిషనర్లుగా పనిచేసిన వారు ఒత్తిడి తట్టుకోలేక బదిలీపై వెళ్లిపోయిన ఘటనలున్నాయి. ఇద్దరు ఔట్సోర్సింగ్ డ్రైవర్లపై కేసు నమోదు జగిత్యాలక్రైం: చెత్త సేకరించే వాహనాల నుంచి డీజిల్ దొంగతనం చేసిన ఇద్దరు ఔట్సోర్సింగ్ డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై మహేశ్ తెలిపా రు. చెత్త వాహనాల నుంచి కొద్ది రోజు లుగా ఇంధనం దొంగతనం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం విద్యానగర్ వాటర్ ట్యాంక్ వద్ద పార్క్ చేసిన వాహనాల నుంచి ఔట్సోర్సింగ్ డ్రైవర్లు బొమ్మెన అనిల్కుమార్, కట్కూరి నాగరాజు డీజిల్ తీస్తుండగా శానిటేషన్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని విచారణ చేపట్టగా.. ఇప్పటివరకు రూ.10 వేల విలువైన 83 లీటర్ల ఇంధనాన్ని చోరీ చేసినట్లు అంగీకరించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ దోనాల కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. 294జగిత్యాల: జగిత్యాల బల్దియాలో మళ్లీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు శాఖల్లో అవినీతి పెచ్చుమీరుతోందని సాక్షాత్తు కౌన్సిలర్లే పేర్కొంటున్నారు. గతంలో మున్సిపల్ పారిశుధ్య వాహనాలకు సంబంధించిన డీజిల్ వ్యవహారంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. వాహనాలు వార్డుల్లో తిరగకున్నా తిరిగినట్లు.. చెత్త సేకరించినట్లు రికార్డుల్లో రాశారు. అధికారులపై విచారణ చేపట్టినప్పటికీ ఎవరిపైనా వేటు వేయలేదు. ఈ క్రమంలోనే డీజిల్ వ్యవహారంలో కుంభకోణం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జూలైలో డీజిల్ కోసం రూ.11,83,630 ఖర్చు చేసినట్లు బిల్లులు రాశారు. వాస్తవంగా జూలై ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టలేదు. అయినా జూన్తోతో పోల్చితే రూ.2లక్షల బిల్లు పెరిగిందని అంటున్నారు.


