breaking news
Jagitial District Latest News
-
అవగాహన కల్పిస్తున్నాం
బిడ్డకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు తాగించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శిశువుకు సరిపడా పాలు పడేందుకు గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పాలు, గుడ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. వారోత్సవాల్లో భాగంగా ఈ విషయాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. – భాస్కర్ జిల్లా సంక్షేమ అధికారి సరైన ఆహారం ముఖ్యం గర్భం దాల్చినప్పటి నుంచే మహిళ పోషకాహారం తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే పసిపాపలకు డబ్బా పాల అవసరమే రాదు. పుట్టిన వెంటనే బిడ్డకు తప్పని సరిగా ముర్రుపాలు తాగించాలి. అప్పుడే బిడ్డ సంపూ ర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. – డాక్టర్ స్నేహ, ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్య కళాశాల, జగిత్యాల -
ఇంటికి చేరకముందే కబళించిన మృత్యువు
● ఇంటికి చేరకముందే కబళించిన మృత్యువు ● స్నేహితుడితో కలిసి రోడ్డు దాటుతుండగా ప్రమాదం ● గుర్తు తెలియనివాహనం ఢీకొని కాంట్రాక్ట్ కార్మికుడి మృతి జ్యోతినగర్: పెద్దపల్లిలోని తమ బంధువుల ఇంట ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు కోండ్ర లింగమూర్తి(42) ఎఫ్సీఐ క్రాస్రోడ్డు రాజీవ్ రహదారిపై ఆదివారం అర్ధరాత్ర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో నివసిస్తున్న కోండ్ర లింగమూర్తి ఎన్టీపీసీలోని సీహెచ్పీ విభాగంలో హౌస్కీపింగ్ పనులు చేస్తున్నాడు. ఆదివారం పెద్దపల్లిలో తమ బంధువుల ఇంటిలో జరిగిన కార్యక్రమానికి హాజరై రాత్రి శ్రీరాంపూర్ బస్సులో వెళ్తున్నాడు. ఎఫ్సీఐ క్రాస్రోడ్డులోని తన స్నేహితుడు ముల్కల శ్రవణ్కుమార్ను కలుసుకునేందుకు అక్కడికి రాగానే బస్సు దిగాడు. ఇద్దరూ కలిసి రోడ్డు దాటుతుండగా గోదావరిఖని వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతివేగంతో లింగమూర్తిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని శ్రవణ్కుమార్తోపాటు గోదావరిఖని గంగానగర్కు చెందిన కారుడ్రైవర్ కలవేని అనిల్ వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు కోండ్ర నర్సయ్య ఫిర్యాదు మేరకు ఏఎస్సై బుచ్చిన్నాయుడు కేసు నమోదు చేశారు. కుటుంబసభ్యుల అంగీకారంతో సదాశయ ఫౌండేష్న్ ఆధ్వర్యంలో టెక్నీషియన్ ప్రదీప్ మృతుడి నేత్రాలను సేకరించి హైదరాబాద్కు పంపించారు. మృతుడికి భార్య స్వర్ణలత, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, కార్మికులు సంతాపం తెలిపారు. శ్రీరాంపూర్లో జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యారు. -
తల్లిపాలు అమృతం
గొల్లపల్లి: మాతృత్వం ఒక అద్భుతమైన అనుభూ తి. నవమాసాలు మోయడంతోపాటు బిడ్డకు ఈ లోకాన్ని పరిచయం చేశాక మరింత భద్రంగా కాపాడుకోవడం ప్రధానం. శిశువుకు ఎంత మంచి పోషకాలు అందితే అంత దృఢంగా ఉంటారు. అయితే ఆ పోషకాలు ఒక్క తల్లిపాలలో మాత్రమే లభి స్తాయి. పిల్లల ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే అమృతంతో సమానం. ఉరుకులు, పరుగులు జీవితంలో చాలామంది తల్లులు పిల్లలను కా స్త నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరికొందరు తల్లులు కొన్ని అపోహలతో పిల్లలకు పాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి వారిలో అవగాహన కోసమే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏటా ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు వివిధ కార్యక్రమాల ద్వారా తల్లులకు అవగాహన కల్పిస్తోంది. తల్లిపాలలో ఉండే పోషకాలు.. ఇతరత్రా అంశాలను పరిశీలిస్తే.. అమృతధార ‘ముర్రుపాలు’ ప్రసవం సాధారణమైనా.. (నార్మల్), సిజేరియన్ అయినా సరే బిడ్డ పుట్టిన వెంటనే పాలు పట్టడం అత్యంత ఆవశ్యకం. ముర్రుపాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నారికి లభించే తొలి వ్యాక్సిన్. పాలల్లో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బిడ్డకు అవసరమైన క్యాలరీలను అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కొండంత పెంచుతాయి. ఆర్నెళ్ల వరకు.. బిడ్డ పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. తర్వాత తగిన ఆహారంతోపాటు రెండేళ్ల వరకు పాలు ఇస్తే శిశువుకి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. తల్లిపాలు చాలారోజులు తాగిన పిల్లల్లో శారీరక శక్తితో పాటు మానసిక వికాసం, మెదడు ఎదుగుదల అద్భుతంగా ఉంటాయి. డయేరియా, న్యుమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. భవిష్యత్తులో క్యాన్సర్, గుండెజబ్బులు, అలర్జీ, ఆస్తమా, డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. ఎముకలకు అవసరమైన కాల్షియం నిల్వ లను పెంచి, శరీరాన్ని బలంగా మారుస్తుంది. తల్లికీ మేలే.. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల శిశువుకే కాదు.. తల్లికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పాలు పట్టించడం వల్ల ప్రసవానంతరం తల్లి ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది. రోజుకు 8 నుంచి 12సార్లు పిల్లలకు పాలు పట్టించాలి. తల్లి తగినంత విశ్రాంతి తీసుకుంటూ.. ఎక్కువ నీరు తాగుతూ, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి -
ద్విచక్ర వాహనాల దొంగల అరెస్టు
● రూ.25 లక్షల విలువ గల 28 బైక్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ శ్వేతవరంగల్ క్రైం: వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగలను సీసీఎస్, కేయూ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. సోమవారం సాయంత్రం కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బైక్ల చోరీలు చేసిన తరువాత నిందితులు అనంతరం చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నమోదైన కేసుల్లో బైక్ల రికవరీ కోసం సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మంచిర్యాల ఎన్టీపీసీ కాలనీకి చెందిన దొంతుల ప్రశాంత్ కుమార్, మంచిర్యాల జిల్లా జైపూర్ గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు తెలిపారు. తనిఖీల సమయంలో నిందితులు ప్రయాణిస్తున్న బైక్ను స్వాధీనం చేసుకుని విచారించగా నిందితులు వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిపల్లి గ్రామం, ఎల్కతుర్తి శివారులో 28 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. వాహనాల చోరీలు ఇలా... నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు పలు జిల్లాలో వాహనాల చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. వరంగల్ కమిషనరేట్లో–8, కరీంనగర్ కమిషనరేట్లో –9, రామగుండం కమిషనరేట్ పెద్దపల్లిలో –3, సిద్దిపేట కమిషనరేట్లో –2 హైదరాబాద్ కమిషనరేట్లో–3, రాచకొండ కమిషనరేట్లో –1, భూపాలపల్లి జిల్లాలో –2 మొత్తం 28 బైక్లు చోరీ చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో హనుమకొండ ఏసీపీ నరసింహరావు, సీసీఎస్ ఏసీపీ సదయ్య, కేయూ ఇన్స్పెక్టర్ సుంకరి రవికుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, హరికృష్ణ, రామకృష్ణ, సిబ్బందిని సీపీ అభినందించారు. -
వాహిని షాపింగ్మాల్ ప్రారంభం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాహిని షాపింగ్మాల్ సోమవారం సినీనటి క్రితిశెట్టి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఓంప్రకాశ్ జాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటి క్రితి శెట్టి మాట్లాడుతూ.. వాహిని షాపింగ్మాల్లో వైరెటీ చీరలు, చిన్న పిల్లల బట్టలు, మెన్స్వేర్ చాలా వైరెటీలు ఉన్నాయన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా వాహిని షాపింగ్ మాల్లో షాపింగ్ చేయాలని కోరారు. వాహిని షాపింగ్ మాల్లో కస్టమర్లకు మంచి ఆఫర్లను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని నగర, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యజమాని వేముల వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, అనిల్, ప్రశాంత్, శ్రీనివాస్, విష్ణు, వేణుగోపాల్ జాజు, నవనీత్ బంగ్, శ్రీరామ్ జాజు, దేవరాజు, నాగరాజు, నటరాజ్, నందరాజ్, కొమురవెల్లి రవితేజ, గాజుల అరుణ్ పాల్గొన్నారు. -
చిన్న గాయం.. పెద్ద ప్రమాదం
● పంజా విసురుతున్న సెల్యులైటిస్ ● ఉమ్మడి కరీంనగర్లో రోగుల ఉక్కిరిబిక్కిరి ● మూడేళ్లుగా తీవ్రమవుతున్న ముప్పుకరీంనగర్: ఒకప్పుడు అరుదుగా కనిపించిన సెల్యులైటిస్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరస్థాయికి చేరుకుంది. మూడేళ్లుగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో మరింత వేగంగా కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. జనరల్ సర్జరీ విభాగం ఉన్న ఆస్పత్రుల్లో సెల్యులైటిస్ బాధితులు చికిత్స పొందుతుండడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. కొందరు మందులతో కోలుకుంటుండగా, మరికొందరికి చీము పేరుకుపోవడంతో శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తోంది. మధుమేహం, రక్తప్రసరణ లోపాలు, పాదాల పగుళ్లు, చిన్న గాయాలను నిర్లక్ష్యం చేయడం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో ఈ వ్యాధి ఎక్కువగా విజంభిస్తోందని వైద్యలు చెబుతున్నారు. తొలిదశలో చర్మ సమస్యగా కనిపించే ఈ ఇన్ఫెక్షన్ను చాలామంది నిర్లక్ష్యం చేయడంతో తీవ్రస్థాయికి చేరుకుని శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు పెరుగుతున్నాయి. ఈ లక్షణాలు ప్రమాదకరం... సెల్యులైటిస్ అనేది చర్మంతో పాటు చర్మం కింద ఉన్న మదుకణజాలంలో ఏర్పడే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చర్మం ఎర్రగా మారడం, వాపు వేగంగా పెరగడం, భరించలేని నొప్పి, ప్రభావిత భాగం వేడిగా అనిపించడం, జ్వరం, వణుకు, చర్మం బిగుసుకుపోవడం, చీము ఏర్పడటం, నడవడంలో ఇబ్బంది, ఈ లక్షణాలతో పాటు మధుమేహం కూడా ఉంటే వెంటనే శస్త్రచికిత్స నిపుణుడిని సంప్రదించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే... సెల్యులైటిస్ను నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ లోతైన కణజాలానికి వ్యాపించి నెక్రోటైజింగ్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్, సెప్సిస్, గ్యాంగ్రీన్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. కొందరిలో చీము పేరుకుపోవడంతో ఇన్సిషన్ అండ్ డ్రైనేజీ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీనిని గుర్తించేందుకు సీ–రియాక్టివ్ ప్రోటీన్, టోటల్ ల్యూకోసైట్ కౌంట్, అల్ట్రాసౌండ్ పరీక్షలు, చీము ఉంటే కల్చర్ పరీక్ష ద్వారా ఏ బ్యాక్టీరియా కారణమో గుర్తిస్తారు. చీము వస్తోందని స్వయంగా నొక్కడం, కోయడం, ఇంటి చిట్కాలతో కాలయాపన చేయడం ప్రమాదకరం. ఇన్ఫెక్షన్ పెరిగితే ఒక్కోసారి కాలుకూడా తీసి వేయాల్సి వస్తుంది. -
రాజన్నకు బంగారు గొలుసు
వేములవాడ: పట్టణంలోని బ్రహ్మంగారివీధికి చెందిన విద్యాసాగర్–సురేఖ దంపతులు రాజన్నకు రూ.3.50 లక్షల విలువైన బంగారు గొలుసును సోమవారం ఆలయ ఈవో రమాదేవి, అధికారులకు అందజేశారు. దాతలకు దేవస్థానం తరఫున అధికారిక రసీదును జారీ చేసి విరాళం స్వీకరించారు. ఆలయ డీఈవో నవీన్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. రూ.30 లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణంకథలాపూర్(వేములవాడ): మండలంలోని ఇప్పపెల్లికి చెందిన అతికెం ధనుంజయ్(55) రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ధనుంజయ్ గతేడాది నవంబర్ 11న బైక్పై పెట్రోల్బంక్కు బయల్దేరాడు. రోడ్డు దాటుతుండగా కారు వచ్చి ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలైన ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. సుమారు 8 నెలలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందగా రూ.30 లక్షల వరకు ఖర్చయినట్లు బంధువులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతిచెందినట్లు పేర్కొన్నారు. ధనుంజయ్కి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కానిస్టేబుల్ రాసలీలలు.. సస్పెన్షన్ముస్తాబాద్(సిరిసిల్ల): ఓ మహిళతో కానిస్టేబుల్ రాసలీలలపై జిల్లా పోలీస్ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్, ఓ మహిళతో చనువుగా ఉన్నాడు. సిద్దిపేట జిల్లా రాజక్కపేట శివారులో సదరు మహిళతో కానిస్టేబుల్ సన్నిహితంగా ఉండగా గమనించిన రైతు వీరిని ప్రశ్నించాడు. పంట పొలాల్లో ఈ పాడు పనిలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కానిస్టేబుల్ సదరు రైతును బెదిరించడంతో.. ఆ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో జిల్లా పోలీస్ అధికారులకు చేరడంతో క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. అయితే ఈ వీడియో పక్షం రోజుల క్రితం తీసిందని చర్చ సాగుతోంది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ వివాహేతర సంబంధం కొనసాగించడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉంటు హద్దులు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ముస్తాబాద్ ఠాణాలో గతంలో పనిచేసిన మరో ఇద్దరు కానిస్టేబుళ్ల అక్రమ వ్యవహారాలపై కూడా విచారణ సాగుతున్నట్లు సమాచారం. మూడోసారి మింగేసిన మద్యం మత్తు పెద్దపల్లి: మద్యం మత్తులో ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన ముత్యాల రాజగోపాల్(36) మూడోసారీ యత్నించడంతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా చనిపోయి కనిపించడంతో బోరుమన్నారు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు వినక పోగా.. ఆ మత్తులో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు వారించడంతో బతికిపోయాడు. కానీ, మద్యం మానేయలేదు. సోమవారం మద్యం తాగి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మత్తులో ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. -
బావిలో పడ్డా బతికారు
బాలికను బయటకు తీసుకొస్తున్న స్థానికులుబైక్పడిన వ్యవసాయ బావిఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో సోమవారం ఓ బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఆ శబ్దాదనికి సమీప పొలాల్లో పనిచేస్తున్న రైతులు వెంటనే వచ్చి దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థినులు, బైక్ నడిపించే వ్యక్తి ప్రాణాలు కాపాడారు. స్థానికుల కథనం ప్రకారం.. తొలిఏకాదశి సెలవులు ముగియడంతో సుల్తానాబాద్ మండలం కనుకులకు చెందిన అనవేని సతీశ్ తన కూతురు అరణ్య(ఎనిమిదో తరగతి), చెల్లెలి కూతురు ఆరాధ్య(తొమ్మిదో తరగతి) కాల్వశ్రీరాంపూర్లోని కేజీబీవీకి తీసుకెళ్లేందుకు సోమవారం తన బైక్పై ఇద్దరి తీసుకుని బయలు దేరాడు. కొలనూర్ శివారులో ఎదురుగా మరోబైక్ రావడంతో దానిని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లారు. ఇదేసమయంలో వ్యవసాయ పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న రైతులు, కూలీలు ఆశబ్దాన్ని గుర్తించి వెంటనే అక్కడకు వచ్చి ముగ్గురినీ బయటకు తీశారు. గాయాలపాలైన ఆరాధ్య, అరణ్యను ఆస్పత్రికి తరలించారు. సతీశ్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, గాయాలపాలైన విద్యార్థినులు రోదించడం కలచివేసింది. -
బైక్ నంబరు మార్చేసుకున్నారు
● నకిలీ నంబరుతో తిరిగి పట్టుబడ్డారు పెద్దపల్లిరూరల్: రోడ్లపై తిరిగే బైక్ నంబర్లను టాంపరింగ్ చేసి ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు యత్నిస్తుంటే.. ఇంకొందరు ఏకంగా వాహన నంబరునే మార్చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖిల్లో నకిలీ నంబరు(టీఎస్ 19ఏ 9821)తో హెచ్ఎఫ్ డీలక్స్బైక్ తిరుగుతున్నట్టు గుర్తించి దానిని స్వాధీ నం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఇదే నంబరుగల బైక్ హైదరాబాద్లో ఉన్నట్టు తేలింది. ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తే ఆ నంబరు యజమాని సెల్ఫోన్కు మెసేజ్లు వెళ్తున్నాయి. నకిలీ నంబరు వినియోగిస్తున్న పెద్దపల్లిలోని కొంతంవాడకు చెందిన వీరేశంపై కేసు నమోదు చేశారు. ఈబైక్ య జమాని ఓ వ్యాపారి వద్ద కుదువపెట్టగా.. సదరు వ్యాపారి ఇలా బోగస్ నంబరుతో తిరిగాడని వీరేశం పోలీసులకు వివరించినట్టు తెలిసింది. -
వానాకాలం గట్టెక్కినట్టే..!
హమ్మయ్యా.. జగిత్యాలఅగ్రికల్చర్: ఎల్నినో ప్రభావంతో వారం క్రితం 52శాతం లోటు వర్షపాతం ఏర్పడగా.. వేసిన పంటలు పండుతాయో..లేదోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. అలాంటి తరుణంలో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలు రైతులకు భారీగా ఊరటనిచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోటు నుంచి 21 శాతం అధిక వర్షాపాతానికి చేరింది. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి మత్తళ్లు దూకాయి. సాధారణ వర్షపాతం 451.1 మిల్లీమీటర్లు జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 2 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 451.1 మిల్లీమీటర్లు కాగా.. ఇటీవల కురిసిన వర్షాలతో 547 మిల్లీమీటర్లకు చేరింది. ఈ లెక్కన ఏకంగా 21 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయితే గొల్లపల్లి మండలంలో 8 శాతం, భీమారంలో 7, ఇబ్రహీంపట్నంలో 2, కథలాపూర్లో ఒక శాతం ఇంకా లోటుగానే ఉంది. వెల్గటూర్ మండలంలో 87శాతం, బుగ్గారంలో 55, సారంగాపూర్లో 54, ఎండపల్లిలో 45, ధర్మపురిలో 37, బీర్పూర్లో 33, మల్యాలలో 34, రాయికల్లో 26, మేడిపల్లిలో 21శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. మల్లాపూర్లో 18, జగిత్యాల రూరల్లో 12, జగిత్యాలలో 8, కోరుట్లలో 6, మెట్పల్లిలో 4, కొడిమ్యాలలో 8 శాతం చొప్పున సాధారణ స్థాయి వర్షపాతం నమోదైంది. పొదుపుగా వాడుకుంటే రెండు పంటలకు నీరు మూడు రోజులు కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, బావులు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటే ఈ వానాకాలంతోపాటు యాసంగి పంటలకు కూడా సరిపోయే అవకాశం ఉంది. అయితే చాలా చెరువుల్లోని నీటిని ఇష్టారాజ్యంగా పొలాలకు వదులుతుండటంతో యాసంగి నాటికి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. వరదకాలువలో 0.5 టీఎంసీ నీరు మల్యాల: మొన్నటివరకు చుక్కనీరు లేని వరదకాలువ ఎత్తిపోతలతో జలకళ సంతరించుకుంది. ఎగువన ఉన్న ఎస్సారెస్పీని నింపేందుకు తవ్విన ఈ వరదకాలువ మల్యాల మండలంలో 60వేల ఎకరాలకు ఆధారమవుతోంది. వరదకాలువలో ఆరు కిలోమీటర్ల దూరం సుమారు 0.5 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నీటితో వానాకాలం గట్టెక్కనుంది. ఎస్సారెస్పీలో నీరు లేనప్పుడు రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టు నింపేందుకు చేపట్టిన ఈ పథకం కాలువ పొడువునా ఉన్న మండలాల్లోని పంటలకు జీవం పోస్తోంది. రామడుగు గాయత్రి పంప్హౌస్ నుంచి వరదకాలువలో నీటిని ఎత్తిపోస్తుండడంతో గ్రావిటీ ద్వారా రాంపూర్ పంప్హౌస్కు.. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా రాజేశ్వరరావుపేట పంప్హౌస్కు నీరు చేరనుంది. అనంతరం ముప్కాల్ వరకు వరదకాలువలో నీటిని నిల్వ చేయనున్నారు. ఇక్కడి ప్రాంత రైతలందరం వరదకాలువపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నాం. మొన్నటివరకు కాలువలో చుక్కనీరు లేకపోవడంతో అయోమయంలో పడిపోయాం. ఇప్పుడు భారీ వర్షాలు కురవడం.. కాలువలోకి ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నాం. వరదకాలువలో నీటి నిల్వ చేయడం ద్వారా వానాకాలం పంటలకు ఢోకా లేదు. – ముద్దం శ్రీనివాస్, రైతు, నూకపల్లి -
మహాపురాణ ప్రవచనం
కోరుట్ల: పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో ధర్మప్రచార సమితి ఆధ్వర్యంలో అష్టాదశ మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఙంలో భాగంగా ఆదివారం మహాపురాణ ప్రవచన సప్తాహం నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం ఆస్థానపౌరాణికులు, గర్రెపల్లి మహేశ్వర శర్మ ప్రవచనాలు ఇచ్చారు. కాంతిని ప్రసాదించి కాపాడే సూర్య భగవానుడే ప్రత్యక్ష దైవమన్నారు. ధర్మ ప్రచార సమితి అధ్యక్షుడు మంచాల జగన్, అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చిద్రాల నారాయణ, బట్టు హరికృష్ణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పడిగెల శ్రీనివాస్, నిర్వాహకులు మంచాల రాజలింగం పాల్గొన్నారు. -
గ్రామపాలన బలోపేతం
జగిత్యాలరూరల్: గ్రామ పాలన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి 45 రోజులకు ఒకసారి ఎంపీడీవో కార్యాలయాల్లో సాధారణ సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూన్ 24న పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పరిషత్ సమావేశాలు నిర్వహించలేకపోయారు. గతంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీవో ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసేవారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యేవారు. పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియడంతో మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి పాలన కొనసాగిస్తున్నారు. అధికారులను నియమించినప్పటికీ సమావేశాలు మాత్రం నిర్వహించలేదు. ఈ క్రమంలో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి.. అనంతరం ప్రతి 45 రోజులకోసారి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమం, సమస్యలపై చర్చ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాల అమలు, గ్రామాలవారీగా నెలకొన్న సమస్యలపై సభ్యులు చర్చించనున్నారు. గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కీలక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలపై తీర్మానాలు చేస్తారు. వీటితో పాటు అధికారుల తీరుపై ప్రశ్నిస్తారు. ఫలితంగా గ్రామ పరిపాలన వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయి. పరిషత్ సభ్యులు లేకుండా .. సాధారణంగా మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన కోరం సభ్యులతో నిర్వహిస్తారు. ప్రస్తుతం పరిషత్ సభ్యులు లేకుండానే సమావేశం నిర్వహించనున్నారు. మండల ప్రత్యేక అధికారి తప్పనిసరిగా హాజరు కావాలి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 385 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మండల కేంద్రాల్లో నిర్వహించే సమావేశాలకు ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు హాజరుకానున్నారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రతి 45 రోజులకోసారి మండలస్థాయి అధికారులు, సర్పంచులతో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండల పరిషత్ సమావేశాలు ఇప్పటికే నిర్వహణ కొనసాగుతోంది. – మదన్మోహన్, జిల్లా పంచాయతీ అధికారి -
కాకతీయ వర్సిటీ పాఠ్యాంశంగా ‘బతుకు తాడు’
జగిత్యాలటౌన్: జగిత్యాలరూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన గీత కార్మికుడు, రచరు ుత శ్రీనివాస్గౌడ్ రాసిన బతు కుతాడు నవలను కాకతీయ యూనివర్సిటీ తెలుగు పాఠ్యాంశంగా పొందుపరిచారు. 2026 –27 విద్యాసంవత్సరానికి ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం నాలుగో సెమిస్టర్ మూడో పేపర్గా నవల ఎంపిక కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన సాహిత్యంపై అంబేడ్కర్, ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసినట్లు తెలిపారు. నవలను పాఠ్యాంశంగా ఎంపిక చేసిన వర్సిటీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రాజేశ్వర్రావుపేట పంప్హౌస్ నుంచి ఎత్తిపోతలు మెట్పల్లి రూరల్: మండలంలోని రాజేశ్వర్రావుపేట పంప్ హౌస్ నుంచి ఆదివారం ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించారు. ఎల్లంపెల్లి నుంచి వరదకాలువకు నీటి విడుదల చేయగా రాజేశ్వర్రావుపేట పంప్హౌస్కు చేరుకున్నాయి. అధికారులు మోటార్లను ఆన్ చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
నృసింహాలయంలో మంత్రి అడ్లూరి పూజలు
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆదివారం పూజలు చేశారు. ముందుగా మంత్రికి ఆలయం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, సూపరింటెండెంట్ అలువాలు శ్రీనివాస్ తదితరులున్నారు. ఘనంగా సంకటహర చతుర్థిధర్మపురి: సంకటహర చతుర్థి సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్కుమార్ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బీఆర్ఎస్ హయాంలోనే వ్యవసాయానికి ప్రాధాన్యం వెల్గటూర్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయం, సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్, తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని కోటిలింగాల పుణ్యక్షేత్రంలో శ్రీపార్వతికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పరిశీలించారు. రాష్ట్రం ఏర్పడక ముందు కూడా గోదావరి ప్రవహించిందని, అప్పటి ప్రభుత్వాలు ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదో తెలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం, నీటిపారుదల రంగానికి ప్రాధాన్యత ఇచ్చి.. ఎల్లంపల్లిని కాళేశ్వరం ప్రాజెక్ట్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా రీడిజైన్ చేసి.. గోదావరి జలాలను రాష్ట్రమంతా అందించారని గుర్తు చేశారు. కాళేశ్వరం పూర్తికాకముందు ఎల్లంపల్లి కేవలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రమేనని, కాళేశ్వరం అనేక రిజర్వాయర్లు, పంప్హౌస్లు, కాలువల కలయిక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి తగ్గిన వరదజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు 19,457 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1074.60 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 80.5 టీఎంసీలకు 31.918 టీఎంసీలకు చేరింది. -
పాఠశాలల్లో గ్రంథాలయాలు
కథలాపూర్: సెల్ఫోన్, కంప్యూటర్ యుగంలో విద్యార్థుల్లో క్రమంగా పుస్తక పఠనం అలవాటును పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొదటి దశ కింద 18 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు చేయనుంది. ఎంపికై న బడుల్లో గ్రంథాలయం నిర్వహణకు తొలుత రూ.15వేలను పాఠశాల కమిటీ పేరిట నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసి గ్రంథాలయం నిర్వహిస్తే ప్రతినెలా రూ.వెయ్యి చొప్పున అందించనున్నారు. గ్రంథాలయాల్లో కథలు, జీవితచరిత్రలు, సైన్స్, సాహిత్యం, పోటీ పరీక్షలు, బాల సాహిత్యం పుస్తకాలు అందుబాటులో ఉంటాయని గ్రంథాలయం శాఖ అధికారులు తెలిపారు. ఎంపికై న జెడ్పీ హైస్కూళ్లు ఇవే.. కథలాపూర్ మండలంలో కథలాపూర్, అంబారిపేట, బీర్పూర్ మండలంలో తుంగూర్, జగిత్యాల రూరల్ మండలంలో పొరండ్ల, జగిత్యాల పట్టణంలో పురాణిపేట, ఓల్డ్ హైస్కూల్, మేడిపెల్లి మండలంలో కొండాపూర్, మల్లాపూర్ మండలంలో వీవీ.రావుపేట, మెట్పల్లి పట్టణంలో బాలికల, బాలుర పాఠశాల. కోరుట్లలో బాలుర, ప్రభుత్వ పాఠశాల, రాయికల్ మండలంలో భూపతిపూర్, అల్లీపూర్, రాయికల్ బాలికల పాఠశాల, వెల్గటూర్ మండలంలో వెల్గటూర్, ధర్మపురిలో బాలికల పాఠశాల, గొల్లపల్లి మండలంలో చిల్వకోడూర్ పాఠశాలలు ఎంపికయ్యాయి. గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచే చదవడంపై దృష్టిసారించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గ్రంథాలయాల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పోటీ పరీక్షలకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. – శంకరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి -
బల్దియా ఆస్తులు ఇక డిజిటల్
జగిత్యాల: బల్దియాలకు స్థిరాస్తులు సర్వసాధారణం. అలాంటి ఆస్తులను గుర్తించి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఎల్ఐఎస్), డబుల్ ఎంట్రీ అక్రువల్ బెస్ట్ అకౌంటెంటింగ్ సిస్టమ్ (డీఈఏబీఏఎస్)లో తప్పనిసరిగా నమోదు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాకేంద్రంలో శ్రీరామ థియేటర్ చౌరస్తాలో బల్దియాకు క్వార్టర్స్, బిల్డింగ్స్, రైతుబజార్ ఉన్నాయి. కొత్తబస్టాండ్ సమీపంలో ఖాళీ స్థలాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇలా ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో గుర్తించి నమోదు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో కొన్ని ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురికాగా.. మరికొన్ని కనుమరుగయ్యాయి. అలాంటి వాటిపై దృష్టి సారిస్తే ప్రభుత్వ స్థలాలు అనేకం బయటకొచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆస్తుల నమోదుకు చర్యలు మున్సిపాలిటీల స్థిరాస్తి వివరాలను జీఎల్ఐఎస్, డీఈఏబీఏఎస్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్న ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. మున్సిపాలిటీల్లో కొన్ని ఆస్తులు కనుమరుగుకాగా.. మరికొన్ని కబ్జాకు గురయ్యాయి. మున్సిపల్ ఆస్తులను గుర్తించి డిజిటల్ రూపంలో నమోదు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ల పరిధిలో ఉన్న భూములు, భవనాలు, తదితర ఆస్తుల వివరాలు గుర్తించి ధ్రువీకరించి నమోదు చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ ఆస్తుల రిజిస్టర్ కూడా భౌతికంగా, డిజిటల్ రూపంలో నిర్వహించడంతోపాటు ఏటా ఏప్రిల్లో సరిచూసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఆస్తుల నమోదు, మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయకుంటే చర్యలు తీసుకుంటామని కూడా ఆదేశాలు వచ్చాయి. ఈ విషయంలో నిత్యం పర్యవేక్షించాలని ఆర్డీఎంఏకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపల్ స్థిరాస్తులకు సంబంధించి జీఎల్ఐఎస్, డీఈఏబీఏఎస్లో డేటాబేస్లో నమోదు చేసేలా ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే ప్రారంభించి మున్సిపల్ ఆస్తులను గుర్తించి నమోదు చేసి మ్యాపింగ్ పూర్తి చేస్తాం. – సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్ -
ఆత్మబంధువు!
స్నేహ బిందువు.. జగిత్యాల: స్నేహబంధం చాలా గొప్పది. ఓపెన్గా మాట్లాడుకోవడం, ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడం ఒక స్నేహితులతోనే ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ కడలి జయకృష్ణ. బీటెక్ పూర్తయ్యాక అమెరికాలో స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ నన్ను ఐఏఎస్కు ప్రిపేర్ కావాలని సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్కు ప్రిపేర్ అయ్యా. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర కూడా ఉంది. జయకృష్ణ ఆంధ్రప్రదేశ్లోని పోలవరం డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటాం. – సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాలసప్తగిరికాలనీ(కరీంనగర్): ఒకప్పుడు స్నేహమంటే ఒకే బెంచ్, ఒకే వీధి, ఒకే ఊరు. ఇప్పుడు స్నేహమంటే ఒకే స్క్రీన్, ఒకే గ్రూప్, ఒకే వీడియో కాల్. కాలంతో పాటు మనుషులు మారారు. స్నేహం కొత్త రూపం దాల్చింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ నేటితరం జీవితంలో నిజమైన దోస్త్గా మారాయి. చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలిపే వేదికగా, కొత్త పరిచయాలకు పునాదులుగా మారుతున్నాయి. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు, జ్ఞాపకాల ఫొటోలు, రీయూనియన్లు.. ఇవన్నీ డిజిటల్ వేదికలతో సాధ్యమయ్యాయి. వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్తో రక్తదానం చేసిన స్నేహితులు, క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.లక్షలు సేకరించి వైద్యం చేయించినవారు.. వరదలు, ప్రమాదాల సమయంలో తమ ప్రాణా లను సైతం ఫణంగా పెట్టి స్నేహితులను కాపాడిన ఘటనలు నిజమైన స్నేహానికి నిర్వచనాలు.బంధంగా పుట్టకపోయినా.. అనుబంధంగా రూపుదిద్దుకుని.. కలిసిన సమయం నుంచి.. కడదాకా నీడనిచ్చేదే స్నేహం..! అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్ని ఇస్తాడు.. స్నేహితుడు బతుకుదారి చూపుతాడు..!! బుడిబుడి అడుగులతో మొదలయ్యే స్నేహం జీవిత చరమాంకం వరకు కొనసాగుతుంది. బడిబాటతో ముడిపడి.. జీవితంలో స్థిరపడే వరకు వెన్నంటే నడుస్తుంది. ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే జీవితకాలం కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే స్నేహమంటే రెండక్షరాల పదమే కాదు.. రెండు హృదయాల బంధం.. ఈ ప్రపంచంలో స్నేహితులు లేని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫ్రెండ్షిప్కు మారుపేరుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఒకేచోట చదువుకుని.. ఒకే వృత్తిలో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. స్నేహితులూ ముఖ్యమంటున్నారు. పలువురు తమ స్నేహానికి గుర్తుకు నెలకోసారి కలుసుకుంటున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనం.సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన ప్రముఖ వైద్యులు పి.పెంచలయ్య, ఎన్.వి.రమణరావు, పి.చంద్రశేఖర్ 42ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న రోజుల్లో కర్నూల్ మెడికల్ కాలేజీలో స్నేహితులయ్యారు. ముగ్గురు పుట్టి పెరిగిన జిల్లాలు వేరైనా ప్రభుత్వ డాక్టర్లుగా సిరిసిల్లలో స్థిరపడ్డారు. కడపకు చెందిన పెంచలయ్య, నెల్లూరు జిల్లా సర్వేపల్లి మండలం నిడిగుంటపాలెం చెందిన రమణరావు, నెల్లూరు పట్టణానికి చెందిన చంద్రశేఖర్కు ఎంబీబీఎస్ కాలేజీ ఫంక్షన్లో స్నేహం కలిసింది. పెంచలయ్య, చంద్రశేఖర్ 1993లో, 1995లో రమణరావు సిరిసిల్లకు వచ్చారు. ఇప్పుడు సర్జన్గా పెంచలయ్య, ఆర్థోపెడిక్గా రమణరావు, డీఎంహెచ్వోగా చంద్రశేఖర్ మంచి గుర్తింపు పొంది ఉద్యోగ విమరణ చేశారు.ఇల్లంతకుంట: ఇల్లంతకుంట పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చుని 10వ తరగతి వరకు చదువుకున్న ఇద్దరు మిత్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామానికి చెందిన గుర్రం సందీప్ రెడ్డి, మల్లారం గ్రామానికి చెందిన సింగిరెడ్డి రమణారెడ్డి పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు. గుర్రం సందీప్రెడ్డి 2002లో ఉపాధ్యాయుడిగా ఎంపికై , పెద్ద లింగాపూర్లో పనిచేస్తున్నాడు. సింగిరెడ్డి మనోహర్రెడ్డి 2005లో ఉపాధ్యాయుడిగా ఎంపికై స్కూల్ అసిస్టెంట్గా సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నాడు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. -
కలెక్టరేట్ వేదికగా స్నేహం చిగురించి..
కరీంనగర్ అర్బన్: కరీంనగర్లోని కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలో పనిచేసే నాయబ్ తహసీల్దార్ నేరేళ్ల కిషన్, భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండల తహసీల్దార్ కుంబాల రవికుమార్, మైన్స్లో నాయబ్ తహసీల్దార్(ఎపిక్) భూషణబోయిన రాకేశ్కుమార్, వెల్ది ప్రభుత్వ వైద్యశాలలో సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల వసంత్, నిజామాబాద్ జిల్లా రూరల్ నాయబ్ తహసీల్దార్ వినయ్సాగర్ 2012లో కరీంనగర్ కలెక్టరేట్లో ఉద్యోగులే. జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నప్పుడే చిగురించిన వీరి స్నేహం కష్టసుఖాల్లోనూ తోడునీడగా నిలుస్తోంది. ఉద్యోగ రీత్యా మొదలైన స్నేహం ఆదర్శంగా నిలుస్తోంది. -
‘సకుటుంబ’ స్నేహితులు
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణానికి చెందిన గుర్రాల అమరేందర్, తడుక వెంకటరమణ, శ్రీపతి రమేశ్, జోగిన్పెల్లి కృష్ణమోహన్రావు, ఖాందేశి ఉత్తమ్కుమార్, తిరుమల శ్రీధర్, రాచకొండ వెంకటేశ్, జిల్లా ధనుంజయ్, మండలోజు నరేందర్, రుద్రంగికి చెందిన రానవేని శ్రీనివాస్, వెగ్యారపు చంద్రశేఖర్, ఆకుల గంగాధర్ చిన్నతనం నుంచి స్నేహితులు. వీరు వివిధ ప్రాంతాల్లో వృత్తి, ఉద్యోగరీత్యా కొనసాగుతున్నా ప్రతినెల 10వ తేదీన గత 26ఏళ్లుగా కలుసుకుంటున్నారు. ప్రతి స్నేహితుడి పెళ్లిరోజు ఆరు గ్రాముల బంగారం కానుకగా ఇస్తున్నారు. మూడేళ్లకోసారి సకుటుంబ సమేతంగా తీర్థయాత్రకు వెళ్లి తమ అనుబంధాలను కాపాడుకుంటున్నారు. -
వసతుల కల్పనకు ప్రాధాన్యం
● రూ.74 లక్షలతో కరెంట్ తీగల షిఫ్టింగ్ ● ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు సంక్షేమం ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్గొల్లపల్లి: ధర్మపురి నియోజకవర్గంలో విద్యుత్ వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. గొల్లపల్లి మండలంలో రూ.74 లక్షల వ్యయంతో 11 కేవీ, 33 కేవీ విద్యుత్ తీగల షిఫ్టింగ్ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. మండలకేంద్రంలో సంబంధిత అధికారులతో శనివారం పనులను ప్రారంభించారు. విద్యుత్ వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేస్తే.. ఒక్క గొల్లపల్లి మండలానికే రూ.2.3 కోట్ల నిధులు కేటాయించామన్నారు. విద్యుత్ లైన్ల షిఫ్టింగ్ పనులను నాణ్యతతోపే పూర్తి చేయాని సూచించారు. అనంతరం 75 మందికి రూ.25.63 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నల్ల నీరజ, గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, విద్యుత్ శాఖ ఎస్ఈ బి.సుదర్శనం, డీఈఈ గంగారాం, ఏడీఈ వరుణ్ కుమార్, ఏఈ రాకేష్ కుమార్, ఉపసర్పంచ్ జి.బుచ్చిరెడ్డి, సబ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. ప్రతి ఎకరాకూ సాగు నీరు వెల్గటూర్: సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికీ నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. మండలంలోని స్తంభంపల్లిలోని చెరువును పరిశీలించారు. వర్షాలకు చెరువు ప్రమాదకరంగా మారడంతో శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్తంభంపల్లి లిఫ్ట్, చెరువు మత్తడి, తూముల వెడల్పు పనులకు రూ.5లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ తిరుపతి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. -
మిల్లర్ల అక్రమాలు.. విజిలెన్స్తో బట్టబయలు
జగిత్యాలరూరల్: ప్రభుత్వం రైతుల నుంచి ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా కొనుగోలు కేంద్రాల ద్వారా కొని జిల్లాలోని రైస్మిల్లర్లకు సామర్థ్యాన్ని బట్టి అధికారులు ధాన్యం కేటాయించారు. మిల్లర్లు ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కానీ.. కొంతమంది మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్ దాడుల్లో వెలుగుచూస్తోంది. సకాలంలో అప్పగించని బియ్యం 2024–25 యాసంగి పంటకు సంబంధించిన ధాన్యం తీసుకున్న 69 మంది రైస్మిల్లర్లు సీఎంఆర్కు 79,395 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. కానీ వారు బియ్యం అప్పగింతలో జాప్యం చేస్తున్నారు. అలాగే 2025–26 వానకాలంలో 119 మంది మిల్లర్లు సీఎంఆర్కు 1,76,951 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీనికి కొంత గడువు ఉన్నా.. చాలామంది అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2025–26 యాసంగిలో 116 మంది మిల్లర్లు సీఎంఆర్కు 3,11,251 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీనికి కూడా కొంత గడువు ఉండగా, బియ్యం సేకరణలో కొంత జాప్యం నెలకొంది. వెలుగు చూస్తున్న నిజాలు వాస్తవానికి బియ్యం బకాయి ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయించొద్దు. అయితే కొందరు మిల్లర్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుంచి నేరుగా ఆదేశాలు తెచ్చుకుని ధాన్యం కేటాయింపు చేయించుకున్నారు. వారిలోని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. మిల్లుల్లో కనిపించని ధాన్యం జిల్లాలో 2024 నుంచి 2025–26 యాసంగికి సంబంధించిన ధాన్యం మిల్లర్లకు కేటాయించగా.. ధాన్యాన్ని సీఎంఆర్ అప్పగించాల్సి ఉంది. కానీ 20 శాతం మంది రైస్మిల్లర్లు ప్రభుత్వం నుంచి వచ్చిన ధాన్యాన్ని విక్రయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సకాలంలో బియ్యం అప్పగించాలి ధాన్యం తీసుకున్న మిల్లర్లు నిబంధనల ప్రకారం సీఎంఆర్ అప్పగించాలి. అక్రమాలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు డిఫాల్టర్గా ప్రకటించి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. – జితేంద్రప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ -
విద్యార్థులు ఉన్నత లక్ష్యం కోసం తపించాలి
జగిత్యాలజోన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని.. ఆ మేరకు కష్టపడాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతోపాటు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని కోరారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విజయకృష్ణ, అనురాధ పాల్గొన్నారు. -
నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ చవాన్
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరని చెప్పడం కష్టమే. మహారాష్ట్రలో నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు. మేం 14 ఏళ్లుగా స్నేహితులం. నా కాలేజీ రోజుల్లో రూమ్మేట్. అనుకోకుండా ఓ సారి అనారోగ్యం బారిన పడ్డారు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయిస్తే కేన్సర్గా తేలింది. ఆ సమయంలో నేను అతనికి, అతని కుటుంబానికి అండగా నిలబడ్డాను. అప్పుడు ఐపీఎస్ కాలేదు. కానీ రూ.6లక్షల వరకు ఆర్థిక సాయం అందించాను. పృఽథ్వీరాజ్ చవాన్ ఇప్పుడు కేన్సర్ నుంచి కోలుకున్నారు. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఇప్పటికీ మేం ఫోన్లో మాట్లాడుకుంటాం. – మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
ఖైదీల్లో మార్పు రావాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి జగిత్యాలజోన్: జైలు జీవితంతో ఖైదీల్లో మార్పు రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి సూచించారు. జగిత్యాల స్పెషల్ సబ్ జైలును శనివారం సందర్శించారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలుకు వస్తున్నారని, బయటకు వెళ్లిన తర్వాత మార్పు తెచ్చుకుని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. మొదటి అదనపు జిల్లా జడ్జి జి.సునీత మాట్లాడుతూ నేరమయ జీవితానికి అలవాటుపడితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జైలర్ మొగిలేషు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విజయ్కుమార్, రమాదేవి పాల్గొన్నారు. రాంపూర్ పంప్హౌస్ ఎత్తిపోతలు ప్రారంభంమల్యాల: ఎల్లంపల్లి పంప్హౌస్ నుంచి నంది, గాయత్రి పంప్హౌస్ ద్వారా నీటిని మధ్యమానేరు, వరదకాలువకు ఎత్తిపోస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మండలంలోని రాంపూర్ పంప్హౌస్ వద్ద అధికారులు మోటార్లను ఆన్ చేసి కాలువలకు ఎత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పంప్హౌస్ను సందర్శించి కుంకుమపూజ, హారతి ఇచ్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్గౌడ్, నక్క అనిల్, గ్యాదం కుమార్, నాయకులు నల్ల తిరుపతిరెడ్డి, మరాటి సత్తయ్య, కొల్లూరి గంగాధర్, మ్యాక లక్ష్మణ్, దిండు ప్రవీణ్, కంచర్ల లక్ష్మణాచారి, కటుకం వినయ్కుమార్, పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకుఎంపికధర్మపురి: మండలంలోని మగ్గిడి సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జూలై 24న నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్లో రాణించారు. పరుగు పందెంలో ఎం.రితిక్ 60 మీటర్లు, ఎం.రిషి 400మీటర్లు, విఘ్నేష్ 600మీటర్లు, టి.రిషి 200 మీటర్లు, ఆర్.మణి ప్రతిభ చూపారు. బి. హర్షవర్దన్ షాట్ఫుట్లో ప్రతిభను కనబర్చాడు. విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు. ఇబ్రహీంపట్నం విద్యార్థి ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి వి ద్యార్థి బి.జశ్వంత్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (జావెలెన్త్రో) పోటీలకు ఎంపికయ్యాడు. హెచ్ఎం రాజన్న మెడల్ అందించి అభినందించారు. పీడీ రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి 83,956 క్యూసెక్కుల ఇన్ ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 83,956 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1072.9 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 80.5 టీఎంసిలకు, ప్రస్తుతం 28.541 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి 822 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
మెట్పల్లిలో ఆర్డీడీ విచారణ
● టీపీవోపై వచ్చిన లంచం ఆరోపణ ● ఉన్నతాధికారులకు చేరనున్న నివేదికమెట్పల్లి: మెట్పల్లి బల్దియాలో టౌన్ప్లానింగ్ అధికారిగా పనిచేసిన రాజేంద్రప్రసాద్పై వచ్చిన లంచం ఆరోపణలపై ఆ విభాగం వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వందనం శనివారం మెట్పల్లికి వచ్చి విచారణ చేపట్టారు. పట్టణంలోని ఆదర్శనగర్కు చెందిన జగ్గుల లావణ్య తమ ఇంటిపై మరో అంతస్తు నిర్మాణం కోసం రాజేంద్రప్రసాద్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి లింబాద్రి రూ.2లక్షల లంచం తీసుకుని నకిలీ అనుమతి పత్రాలు ఇచ్చారని గతంలో ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేసింది. ఫోన్పే ద్వారా వారికి చెల్లించినట్లు ఆధారాలు అందించింది. పరిశీలించిన ఆయన టీపీవో అవినీతికి పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి జూన్ 16న ఆయనను సస్పెండ్ చేస్తూ.. లింబాద్రిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశౠరు. పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీడీ మెట్పల్లికి వచ్చి మున్సిపల్ కార్యాలయంలో రాజేంద్రప్రసాద్, లింబాద్రి, లావణ్య నుంచి వేర్వేరుగా వివరాలు సేకరించారు. లావణ్య ఇంటిని సందర్శించి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఆర్డీడీ తెలిపారు. టీపీవోను ఉద్యోగం నుంచి తొలగించాలి ఇంటి నిర్మాణ అనుమతులకు లంచం కోసం వేధింపులకు గురిచేసిన రాజేంద్రప్రసాద్ విషయంలో ఉన్నతాధికారులు సస్పెండ్కే పరిమితం కాకుండా ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలని లావణ్య కోరింది. ఇల్లు తన పేరిట లేకున్నా.. నోటీసులు ఇచ్చి అప్పటి కమిషనర్ మోహన్, రాజేంద్రప్రసాద్, లింబాద్రి బ్లాక్మెయిల్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్డీడీకి పూర్తి వివరాలు అందించానని, మరొకరికి ఇలా జరగకుండా ఉన్నతాధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. -
ఆస్పత్రిలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలి
రాయికల్: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సమయపాలన పాటించాలని, తప్పనిసరిగా అటెండెన్స్ బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యసేవలు, ఓపీ సేవలు, ల్యాబ్ రికార్డ్స్, మందుల నిల్వను పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మలేరియా, డెంగీ వంటి వైరల్ ఫీవర్లు ప్రబలే అవకాశం ఉందని, మందులు అందుబాటులో ఉంచుకునేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో తాగునీటి సమస్యతోపాటు, పారిశుధ్య వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పునరావృతం కావొద్దని జిల్లా కో–ఆర్డినేటర్ రామకృష్ణకు సూచించారు. అనంతరం ఉప్పుమడుగులోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అక్కడి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆలూరు గ్రామంలో నిర్మిస్తున్న వీవో భవనం, రాజనగర్ గ్రామంలో కల్వర్టు, వీరాపూర్లో అంగన్వాడీ కేంద్రం పనులను పరిశీలించారు. ఈనెల 30లోపు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, మెడికల్ ఆఫీసర్ సతీశ్, జిల్లా ఆస్పత్రి కో–ఆర్డినేటర్ రామకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ శశికాంత్రెడ్డి, డీఈవో రాము పాల్గొన్నారు. -
పూత దశలో దెబ్బ
వానాకాలం సీజన్లో మంచి రేటు వస్తుందని ఎకరం బీర సాగు చేస్తున్న. కాత దశకు చేరుకుంటున్న తరుణంలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. నీరు తోటలో నిలిచి పూత రాలిపోయింది. మొక్కలు పసుపు పచ్చగా మారాయి. దాదాపు రూ.50వేల వరకు నష్టం వాటిల్లింది. – మెక్కోండ రాంరెడ్డి, అలూరు, రాయికల్ మం నీరు నిల్వతోనే ఇబ్బంది కూరగాయల పంటలు ఎక్కువగా నీటిని తట్టుకోవు. రెండు, మూడు రోజులు నీరు నిల్వ ఉంటే భూమి నుంచి ఆహారాన్ని తీసుకోక మొక్కలు వడలిపోయి, చనిపోతాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతోనే కూరగాయల పంటలకు ఇబ్బంది కలిగింది. – కట్ట లత, ఉద్యాన శాఖాధికారి, జగిత్యాల -
కూరగాయల పంటలకు తీవ్ర నష్టం
జగిత్యాలఅగ్రికల్చర్: ఎడతెరిపి లేకుండా రెండురోజులు కురిసిన వర్షాలకు కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో కూరగాయలు మార్కెట్కు రాక వినియోగదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రైతులు ఎక్కువగా సాగు చేసిన టమాట, బీర, సోర, వంకాయ, కొత్తిమీర, పాలకూర వంటి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 130ఎకరాల్లో టమాట, 200ఎకరాల్లో బీర, సోర, కాకర, 40 ఎకరాల్లో వంకాయ, 60ఎకరాల్లో బెండ, మరో 90 ఎకరాల్లో ఆకు కూరలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వానాకాలం సీజన్ అయిన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూరగాయలకు డిమాండ్ ఉంటుంది. మార్కెట్ డిమాండ్ను అనుసరించిన కొందరు రైతులు మేలో కూరగాయల విత్తనాలు నాటారు. కలుపు రాకుండా మల్చింగ్ పేపర్ వేశారు. అన్నిరకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో పంట ఏపుగా పెరగడంతో రైతులు సంతోషించారు. పూతను దెబ్బతీసిన వర్షాలు కూరగాయల పంటల్లో పూత నుంచి కాత మొదలవుతున్న తరుణంలో వచ్చిన వర్షాలు కూరగాయల పంటలను దెబ్బతీశాయి. ఫలితంగా రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. కూరగాయల తోటల్లో నీరు నిలిచి, మొక్కలు పసుపు పచ్చగా మారాయి. ఈదురుగాలులకు పూత రాలిపోయింది. వేర్లు కుళ్లిపోయి మొక్కలు చనిపోయాయి. చేతికి వస్తుందనుకుంటున్న తరుణంలో వర్షాలు పడడంతో పెట్టుబడి కూడా రాదని రైతులు అంటున్నారు. పెరుగుతున్న రేట్లు జిల్లాలో సాగు చేసిన కూరగాయలు మార్కెట్కు రాకపోవడంతో మహారాష్ట్రలోని నాందేడ్, చిత్తూరు జిల్లాల నుంచి టమాటలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా టమాట కిలో రూ.30 వరకు పలుకుతోంది. సోరకాయ రూ.20, బీర రూ.80కి చేరింది. కాకర కిలో రూ50 నుంచి రూ.60, వంకాయలు రూ.40 నుంచి 50 వరకు ఉంది. పాలకూర, తోటకూర వంటివి మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు. మిర్చి కిలో రూ.50 నుంచి 60కు చేరింది. -
తీర ప్రాంతం.. వరద భయం
ధర్మపురి: వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి తీరప్రాంత వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. వరదలతో ఏటా లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరుగుతోంది. ధర్మపురి పట్టణ అభివృద్ధికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా వరద ముప్పును నియంత్రించడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. కడెం నుంచి వచ్చే వరదతో.. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరి ఉగ్రరూపమై తీరప్రాంత వాసులను వరదతో ముంచేస్తోంది. కడెం ప్రాజెక్టు నుంచి వచ్చే వరదతో మండలంలోని ఆరెపెల్లి, దొంతాపూర్, జైనా, రాజారం దమ్మన్నపేట, ధర్మపురికి వరద పోటెత్తుతుంది. దీంతో గోదావరి ఒడ్డునున్న పంట పొలాలు, విద్యుత్ మోటార్లు, స్తంభాలు నీట మునిగి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిన ఘటనలున్నాయి. వరదలతో నష్టపోయిన ప్రాంతాలు.. గోదావరి వరద పోటెత్తడంతో ధర్మపురిలోని మంగలిగడ్డ, బ్రాహ్మణ సంఘం, సంస్కృతాంధ్ర కళాశాల, సంతోషిమాత, రామాలయం, బోయవాడ, విద్యుత్ సబ్స్టేషన్ నీటిలో మునిగిపోతుంటాయి. వీటితో పాటు వరద ఇళ్లలోకి చేరి వస్తువులు కొట్టుకుపోవడం, సామగ్రి నానిపోయి తీవ్ర ఆస్తి నష్టం సంభవిస్తుంది. గతంలో వరదలతో నష్టపోయిన ముంపు ప్రాంతాలను అధికారులు గుర్తించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రతిపాదనలోనే కరకట్ట నిర్మాణం ధర్మపురి తీరప్రాంత వాసులను వరద ముప్పు నుంచి కాపాడేందుకు గతంలో కరకట్ట నిర్మాణం కోసం సర్వే చేసి గాలికొదిలేశారు. కరకట్టను గోదావరిలోని హనుమాన్ గడ్డ నుంచి కింద నున్న మహాలక్ష్మి ఘాట్ వరకు 2 కి.మీ పొడవు నిర్మించేందుకు సర్వే చేపట్టారు. రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కాగా, కరకట్ట నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రోళ్లవాగు నీరు వృథా
జగిత్యాలరూరల్: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రోళ్లవాగు నీరు వృథాగా పోతోందని, గేట్లు బిగించడంలో అధికారులు విఫలం కావడంతో రైతులు, మత్స్యకారులు నష్టపోతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. బీర్పూర్లోని రోళ్లవాగును జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి శనివారం పరిశీలించారు. రోళ్లవాగు సామర్థ్యం 0.25 టీఎంసీ కాగా.. కేసీఆర్ ఒక టీఎంసీకి పెంచారని గుర్తు చేశారు. యాసంగి సీజన్లోనే గేట్లు అమరుస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. దీంతో వర్షాలకు వచ్చిన నీరు వృథాగా పోతోందన్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బాధ్యత వహించాలన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తాటిపర్తి చంద్రకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ, మాజీ ఎంపీపీ మసర్థి రమేశ్, సుమన్, సుభాష్యాదవ్, సత్యంరావు, జితేందర్యాదవ్, ముక్క శంకర్, ఆకుల రమేశ్, వీరేశ్, ఆకుల రాజిరెడ్డి, తేలు రాజు, రిక్కల ప్రభాకర్, చిక్కుల రవి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కారును ఢీకొన్న ఆటో.. ఒకరికి తీవ్రగాయాలుజగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లి శివారులో జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై కారును ఆటో ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్కు చెందిన వ్యక్తి తన ఆటోలో బ్లాంకెట్స్ విక్రయించేందుకు బయల్దేరాడు. కారు నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఆటో డ్రైవర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. కారు కూడా దెబ్బతింది. ఆటో డ్రైవర్కు స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. -
రైతుబజార్ మెయిన్ గేటుకు తాళం
జగిత్యాల: జిల్లా కేంద్రంలో రైతుబజార్ను కొద్దిరోజుల క్రితం వినియోగంలోకి తెచ్చారు. అప్పటివరకు రైతుబజార్ ముందున్న రోడ్డుపైనే రైతులు కూరగాయలు విక్రయించారు. అక్కడ ఆస్పత్రి, కాలేజీ తదితర ఉండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో వ్యాపారులను రైతుబజార్లోకి పంపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రజలు రైతుబజార్ వెనుక వైపు నుంచే వెళ్లి కొనుగోలు చేసుకోవాలని మెయిన్ గేటు మూసివేశారు. ఫలితంగా ముందు వైపు నుంచి వస్తున్న ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. వెనుక వైపు రూటు చాలా మందికి తెలియదు. గేటు ఎందుకు మూశారో తెలియని పరిస్థితి నెలకొంది. -
వైద్య సదుపాయాల విస్తరణకు కృషి
జగిత్యాల: వైద్య సదుపాయాల విస్తరణకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. పట్టణంలోని మోతె కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.80లక్షల విలువైన చెక్కులను శనివారం అందించారు. మెడికల్ కళాశాలలో 800 పడకలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నానన్నారు. డిప్లోమో ఇన్ ఈసీజీ, డయాలసిస్ ట్రైనింగ్, పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటవుతుందన్నారు. ట్రామా సెంటర్ రానుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, బండ శంకర్, గట్టు సతీశ్, నాగభూషణం పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాభివృద్ధికి కృషి రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్గా ఎన్నికై న జక్కుల చంద్రశేఖర్, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. గుర్రం భావన, మహేందర్, సింగిల్ విండో మాజీ చైర్మన్ శేఖర్రెడ్డి, ఉపసర్పంచ్ సంజీవాచారి, కమిటీ సభ్యులు దిలీప్, జక్కుల సాగర్, మహేందర్, నాగరాజు, అర్చకులు వెంకటకృష్ణ, ప్రదీప్ పాల్గొన్నారు. అవయవదానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగుకొడిమ్యాల: మండలంలోని పూడూరుకు చెందిన పొన్నం మల్లేశంగౌడ్ (59) మరణానంతరం చేసిన అవయవదానం ఆ రుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. మూడురోజుల క్రితం అస్వస్థతకు గురైన మల్లేశంను చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు. దీంతో భార్య రేణుక, కుమారులు భార్గవ్, భరత్ స్వచ్ఛందంగా అవయవదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. గోరింటాకు వేడుకల్లో గంగవ్వజగిత్యాలటౌన్: పట్టణంలోని వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో శనివారం నిర్వహించిన గోరింటాకు వేడుకల్లో మై విలేజ్షో, బిగ్బాస్ ఫేం గంగవ్వ, చందు పాల్గొని సందడి చేశారు. గోరింటాకు పండుగ అనాదిగా వస్తున్న సంప్రదాయమని, ఆరోగ్యరీత్యా ఎంతో ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. న్యాయవాది భీమనాతిని ఉమాదేవి, ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రముఖ్ భానుచందర్, కౌన్సిలర్ బోయినిపల్లి ప్రశాంత్రావు, సేవాభారతి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సభ్యులు శ్రీనివాస్, సంపూర్ణాచారి, మధుకర్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
అనారోగ్యంతో మహిళ ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన తోకల సమత (29) శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన సమతకు మోతె గ్రామానికి చెందిన తోకల మహేశ్తో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. కొద్దికాలంగా సమత అనారోగ్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. సమత తల్లి ఆర్మూరి లక్ష్మీరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. గంజాయి విక్రయించిన ఇద్దరికి ఏడేళ్ల జైలుజగిత్యాలజోన్: గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ఇద్దరికి ఏడేళ్ల చొప్పున జైలు, రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జడ్జి జి.సునీత శనివారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సయ్య కథనం ప్రకారం.. 31 అక్టోబర్ 2023న రాయికల్ మండలం అల్లీపూర్ ఎస్సారెస్పీ కాలువ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అదే మండలం ఒడ్డెలింగాపూర్కు చెందిన బోదాసు సతీష్కుమార్, జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంకు చెందిన బెక్కం రేవంత్ అలియాస్ బిట్టు స్కూటీపై జగిత్యాల నుంచి రాయికల్ వైపు వెళ్తున్నారు. పోలీసులకు అనుమానాస్పదంగా కనబడటంతో తనిఖీ చేశారు. స్కూటీలో గంజాయి ప్యాకెట్లు కనిపించింది. వాటిని అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామానికి చెందిన మేస్రం నాగనాథ్ నుంచి కొని తెచ్చినట్లు చెప్పారు. అప్పటి ఎస్సై అజయ్ ముగ్గురు నిందితులు సతీష్కుమార్, రేవంత్, నాగనాథ్పై కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ అరీఫ్అలీఖాన్ నిందితులను కోర్టులో హాజరుపర్చారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్కుమార్, బి.రాజు, కె.నరేష్ సాక్ష్యాలను చూపడంతో సతీష్కుమార్, రేవంత్కు ఏడేళ్ల జైలు, ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. నాగనాథ్పై కేసు నిరూపణ కాకపోవడంతో నిర్దోషిగా ప్రకటించారు. మంజూరైన కోర్టులకు నిధులు ఇప్పించండిధర్మపురి: మంజూరైన అదనపు కోర్టులకు ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలోని కోర్టుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో న్యాయవాదుల సూచన మేరకు హైకోర్టు ఇటీవల ఫ్యామిలీ, అదనపు జుడిషియల్ కోర్టులను మంజూరు చేసింది. వాటికి అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో కోర్టుల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సత్యం, సీనియర్ న్యాయవాది రాచకొండ శ్రీరాములు పాల్గోన్నారు. -
ఎన్నాళ్లిలా..
జగిత్యాల: జిల్లా కేంద్రంలో చాల్లా ఏళ్ల క్రితం 4–5 ప్రధాన నాలాలు నిర్మించగా శిథిలావస్థకు చేరాయి. పాలకులు మారుతున్నా వాటి గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. ముఖ్యంగా పట్టణంలోని గంజ్నాలా సుమారు 2 కి.మీ ఇళ్లను ఆనుకునే ఉంటుంది. దీని రక్షణ గోడలు కూలిపోయి శిథిలావస్థకు చేరడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు అందులో పడే ప్రమాదముంది. వర్షాలు బాగా కురిస్తే పలుచోట్ల నాలా నీళ్లు ఇళ్లలోకి చేరుతోంది. అలాగే పొన్నాల గార్డెన్స్ నుంచి చింతకుంట చెరువు వరకు ఉన్న నాలా పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. చింతకుంట మత్తడి నుంచి సలీమా గార్డెన్స్ వరకు ఉన్న నాలా సక్రమంగా లేక రెండురోజులు కురిసిన వర్షానికి స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జేసీబీలతో చెత్తాచెదారం తొలగించడంతో నీళ్లు సాఫీగా వెళ్లాయి. మరో నాలా నర్సింగ్ కళాశాల నుంచి గోవిందుపల్లికి వెళ్లే రోడ్డు వరకు ఉంటుంది. ఇది మోతె వాగులో కలుస్తోంది. ఈ నాలా చాలా వరకు కబ్జాకు గురవడంతో సమీపంలోని ఇళ్లలోకి వరద చేరుతోంది. కబ్జామయం జిల్లాకేంద్రంలోని ప్రధాన నాలాలు, డ్రెయినేజీలు, శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జగిత్యాల డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు ధరూర్ వాగును కబ్జా చేసి ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టగా అప్పటి సబ్కలెక్టర్ శశాంక అక్రమ కట్టడాలను కూల్చివేసి వాగును పునఃనిర్మించారు. ప్రస్తుతం మళ్లీ కొద్దిపాటి కబ్జాలకు గురికావడంతో వాగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. అలాగే భవానినగర్, కృష్ణానగర్, విద్యానగర్లో నాలాలపై షాపులు, నివాసాలు కట్టడంతో 12 ఫీట్ల కాలువలు 2–3 ఫీట్లుగా మారాయి. టవర్సర్కిల్ ప్రాంతంలో డ్రెయినేజీలపై నిర్మాణాలు చేపట్టడంతో ఇళ్లలోకి మురికినీరు వస్తుందని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు. రక్షణ గోడలు నిర్మించాలి పట్టణంలోని నాలాలను విస్తరించి, రక్షణ గోడలు నిర్మిస్తే ముంపు ముప్పు ఉండదు. కాలువల్లో షిల్ట్, పిచ్చిమొక్కలు తొలగించడానికి అధికారులు నిధులు కేటాయిస్తున్నారు కానీ రక్షణ గోడలకు కేటా యి ంచడం లేదు. ఇప్పటికై నా నాలాలను విస్తరించి గో డలు నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. విస్తరణకు నోచుకోని నాలాలు రక్షణ గోడలు లేక పొంచి ఉన్న ముప్పు పట్టింపులేని అధికారులు -
జగిత్యాల
33.0/25.0శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 20267గరిష్టం/కనిష్టంఅప్రమత్తంగా ఉండాలి జగిత్యాలరూరల్: విషజ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విష జ్వరాలపై ఇంటింటా సర్వే చేపట్టారు. ఎమ్మెల్యేను కలిసిన ఎస్ఈజగిత్యాలరూరల్: జిల్లా రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన హరిచందర్ శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీస్తాయి. -
ప్రణాళికతో సన్నద్ధం కావాలి
పోలీస్ ఉద్యోగం ఉపాధి మాత్రమే కాదు. సమాజ సేవకు లభించే గౌరవప్రదమైన వేదిక. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవడంతో పాటు శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రోజువారీ వ్యాయామం, రన్నింగ్, క్రమశిక్షణతో కూడిన సాధన, మాక్ టెస్టులు విజయానికి కీలకం. సోషల్ మీడియా, వదంతులను నమ్మకుండా అధికారిక నోటిఫికేషన్లోని నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేయాలి. సరైన మార్గదర్శకత్వంతో సిద్ధమైతే ఈ అవకాశాన్ని ఉద్యోగంగా మార్చుకోవచ్చు. – ఎన్.వెంకట్రెడ్డి, డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ కరస్పాండెంట్, కరీంనగర్ -
యూనిఫాం పిలుస్తోంది!
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీజీఎస్ఎల్ పీఆర్బీ) తీపి కబురు తీసుకొచ్చింది. కొన్ని నెలలుగా పోలీసు కొలువు కోసం ఎదురుచూస్తున్న యువత తాజా నోటిఫికేషన్తో సాధనను కఠినం చేశారు. పోలీస్ విభాగంలో మల్టీజోన్–1లో ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల– రాజన్న జోన్), జగిత్యాల– బాసర జోన్, పెద్దపల్లి– కాళేశ్వరం జోన్ పరిధిలోకి వస్తాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ విభాగాల ఎస్సై, కానిస్టేబుళ్ల ఖాళీలకు కలిపి మొత్తం 1,061 పోస్టులు భర్తీ చేయనుంది.(ఇందులో రామగుండం కమిషనరేట్లోని మంచిర్యాల జిల్లా పోస్టులు కూడా ఉన్నాయి.) ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలతో ‘సాక్షి’ కథనం. – సాక్షిప్రతినిధి,కరీంనగర్ -
ఎస్సారెస్పీకి 61,111 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు సాగు, తాగు నీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 61,111 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1,091 అడుగులకు గాను 1,070 అడుగులకు చేరింది. అలాగే, నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు 23.308 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 300, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 291 క్యూసెక్కులు వృథా అవుతోంది. నిధులు మంజూరు చేయించాలికోరుట్ల/కోరుట్లరూరల్: మండలంలోని కల్లూర్–సర్పరాజ్పూర్ గ్రామాల మధ్య వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్ను కోరారు. శుక్రవారం వంతెనను ఎమ్మెల్యే పరిశీలించారు. వాగు ప్రవాహానికి వంతెనపై భగీరథ పైపులు కొట్టుకుపోవడంతో ప్రజలు నీటికోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉందని కలెక్టర్కు ఫోన్ ద్వారా వివరించారు. పైపులను వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు. సర్పంచ్ నత్తి రాజ్కుమార్, నాయకులు వనతడుపుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. బీర్పూర్లో 140.3 మి.మీ వర్షంజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రెండురోజులు గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా సాధారణ వర్షపాతం 437.4 మి.మీ కాగా, భారీ వ ర్షాలతో 544.0 మి.మీ చేరింది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు బీర్పూర్ మండలంలో అత్యధికంగా 140.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, ఇబ్రహీంపట్నం 60.5, మల్లాపూర్ 65.8, రాయికల్ 77.5, సారంగాపూర్ 110.7, ధర్మపురి 95.0, బుగ్గారం 107.0, జగిత్యాలరూరల్ 74.5, జగిత్యాల 65.7, మేడిపల్లి 71.4, కోరుట్ల 56.6, మెట్పల్లి 77.1, కథలాపూర్ 64.1, కొడిమ్యాల 79.2, మల్యాల 80.8, పెగడపల్లి 65.8, గొల్లపల్లి 83.2, వెల్గటూర్ 129.1, ఎండపల్లి 99.7, బీమారంలో 59.8 మి.మీ నమోదైంది. జిల్లాలో సగటున 83.2 మి.మీ వర్షం కురిసింది. బట్టపల్లి శివారులో కొట్టుకుపోయిన రోడ్డుజగిత్యాలరూరల్: భారీ వర్షాలకు సారంగాపూర్ మండలం బట్టపల్లి శివారు చింతలపల్లి సమీపంలో బతుకమ్మ ఒర్రె ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది. మరమ్మతు చేపట్టాలని సర్పంచ్ మర్రిపల్లి అశ్విని కోరారు. పొలాల్లో ఇసుక మేటలు ధర్మపురి: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని దమ్మన్నపేట, రాజారం, జైనా, దొంతాపూర్ గ్రామాల్లోని పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుచున్నారు. ఇళ్లు మంజూరు చేయాలిజగిత్యాలరూరల్: బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన సింగారపు రవి ఇల్లు ఇటీవల వర్షాలకు కూలిపోగా శుక్రవారం పరిశీలించి ఆర్థికసాయం అందజేశారు. రెవెన్యూ అధికారులు బాధితులను గుర్తించి సత్వరమే వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు, నాయకులు పాల్గొన్నారు. -
యువతకు శుభవార్త
నిరుద్యోగులకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఒక శుభవార్త. యూనిఫాం జాబ్ కోరుకునే ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రణాళికతో రాత పరీక్ష కోసం చదవడంతో పాటు శారీరక దృఢత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి ఆహార అలవాట్లతో ఈవెంట్స్ సులభంగా సాధించవచ్చు. సెల్ఫోన్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. పోలీస్ ఉద్యోగాలకు మా అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. – ఎర్రంశెట్టి మునీందర్, చైర్మన్, సాన్వీ డిఫెన్స్ అకాడమీ, రేకుర్తి -
రోడ్లు, కల్వర్టులను పునరుద్ధరించాలి
ధర్మపురి: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ధర్మపురితో పాటు మండలంలోని నర్సయ్యపల్లె– కొత్త కొరండ్లపల్లె మధ్య దెబ్బతిన్న రోడ్డు, కల్వర్టు, ఆకసాయిపల్లె– నాగారం మధ్య కోతకు గురైన రోడ్డును శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, సంబంధిత అధికారులు తదితరులున్నారు. శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలి వెల్గటూర్(ధర్మపురి): మండలంలోని స్తంభంపల్లి చెరువుకు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఇటీవల మండలంలో 175.7 మి.మీర్ల భారీ వర్షం కురవడంతో చెరువులో భారీగా వరద చేరింది. చెరువు తూముకు ఆనుకుని గతంలో ఏర్పడిన సింక్హోల్లో అప్పడు ఇసుక బస్తాలతో తాత్కాళిక చర్యలు చేపట్టారు. ప్రస్తుత వర్షాలకు బస్తాలు కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుందేమోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయగా, సింక్హోల్ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. పర్యవేక్షించారు. చెరువు భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, శుక్రవారం సాయంత్రం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చెరువుకు వరద పూర్తిగా తగ్గింది. దీంతో చెరువు కట్ట, తూముకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో వెంకట్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కొల్వాయిలో 146.8 మి.మీ వర్షం
జగిత్యాలఅగ్రికల్చర్: అల్పపీడన ప్రభావంతో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ప్రజలు ఇళ్ల నుంచి నుండి బయటకు వెళ్లలేకపోయారు. బీర్పూర్ మండలం కొల్వాయిలో 146.8 మి.మీ వర్షం నమోదైంది. ఎండపల్లి మండలం గుల్లకోటలో 108.8, వెల్గటూర్లో 107.5, సారంగాపూర్లో 105.8, బుగ్గారం మండలం సిరికొండలో 104.3, ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 101.3, గొల్లపల్లిలో 81, మల్యాలలో 80.5, జగిత్యాల రూరల్ మండలం పొలాసలో 79.8, రాయికల్ మండలం అల్లీపూర్లో 79.5, మెట్పల్లిలో 78.5, కొడిమ్యాల మండలం తిర్మలాపూర్లో 73, మల్లాపూర్లో 72.8, మేడిపల్లిలో 68, జగిత్యాలలో 64, కథలాపూర్లో 56.3, కోరుట్ల మండలం అయిలాపూర్లో 55.3, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్లో 53.5, పెగడపల్లిలో 53.5, భీమారం మండలం గోవిందారంలో 52 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఎస్సారెస్పీకి 72,452 క్యూసెక్కుల ఇన్ ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు ఎగువ ప్రాంతాల నుంచి 72,452 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అవుట్ ఫ్లో 751 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో 18.131 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కెనాల్కు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో 16 గేట్లను ఎత్తి గోదావరిలోకి వదిలారు. -
స్తంభించిన జనజీవనం
తుమ్మెనాల వద్ద తెగిపోయిన రహదారిధర్మపురి పుష్కరఘాట్ల సమీపంలో గోదావరి ఉధృతిధర్మపురి: ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. ఆకసాయిపల్లె సమీపంలో జాతీయ రహదారిపై లోలెవల్ వంతెన నీటమునిగింది. తుమ్మెనాల నుంచి సాలపల్లె మీదుగా ధర్మపురికి వచ్చే రహదారి తెగిపోయింది. పట్టణంలోని పలు వార్డుల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కరఘాట్ల సమీపంలోకి ప్రవాహం చేరుకుంది. ప్రమాదపుటంచున స్తంభంపల్లి పెద్దచెరువు వెల్గటూర్: మండలంలోని స్తంభంపల్లి పెద్దచెరువు మత్తడి దూకుతోంది. గతేడాది బుంగ పడగా.. తాత్కాలిక చర్యలు చేపట్టారు. తాజాగా కట్టపై ఒత్తిడి పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టకు ప్రమాదం జరిగితే వెంకటాపూర్, కుమ్మరిపల్లి, వెల్గటూర్, కోటిలింగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. ముత్యాల పోచమ్మ చుట్టూ డ్రైనేజీ నీరు గొల్లపల్లి: మండలకేంద్రంలోని ముత్యాల పోచమ్మ ఆలయంతోపాటు శ్రీకాలభైరవ సహిత స్వయంభు అష్టభుజ దుర్గాదేవి ఆలయం చుట్టూ డ్రైనేజీ నీరు చేరింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దర్శనానికి భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ నీటి కారణంగా దోమలు పెరిగి, టైపాయిడ్, మలేరియా వంటి వైరల్ ఫీవర్ వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిన రాకపోకలు రాయికల్: మండలంలోని భూపతిపూర్, మైతాపూర్, కుమ్మరిపల్లిలోని లోలెవల్ వంతెనలపై ఉధృతంగా వర్షపునీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాయికల్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఎస్సై సుధీర్రావు, ఎంపీవో సుష్మ పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. మైతాపూర్ కల్వర్టుపై పడిపోయిన చెట్టును తహసీల్దార్, ఎంపీడీవో స్వయంగా తొలగించారు. -
కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం
రాయికల్: రాయికల్ పట్టణాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ కట్కం రవి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో వార్డుల్లో నీటిని తొలగించేందు కు మోటార్లను వినియోగిస్తామని, అవసరమైన చోట్లలో జేసీబీలతో పారిశుధ్య పనులు చేపడతామ ని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కాంట్రాక్టు పొందిన కొందరు పనులు చేపట్టడం లేదని కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తీసుకెళ్లగా.. వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ మనోహర్గౌడ్ను ఆదేశించారు. పట్టణంలో తైబజార్ పెట్టకపోవడంతో మున్సిపల్ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని కౌన్సిల్లో చర్చించారు. అనంతరం 11 అంశాలకు గాను 10 అంశాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో కౌన్సిలర్లు తోపారపు ప్రశాంతి, రాకేశ్నాయక్, వేముల మౌనిక, పల్లికొండ గంగాధర్, పుర్రె శ్రీధర్, కల్లెడ చిన్నధర్మపురి, కో–ఆప్షన్ సభ్యులు వల్లకొండ మహేశ్, సుదవేని లత, ఇర్ఫాన్ అలీ పాల్గొన్నారు. -
రెండోరోజూ అదే జోరు..
● లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం ● భయంభయంగా ప్రజలు ● పొర్లుతున్న వాగులు, కుంటలు ● పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలుజగిత్యాల: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రెండోరోజు కూడా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. సదర్మాట్ బ్యారేజీకి సుమారు 10వేల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో మూడు గేట్లను ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ సదర్మట్ బ్యారేజీని పరిశీలించారు. జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జగిత్యాల చుట్టూ ఉన్న ఐదు చెరువుల నాలాలు పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో వరదనీరు ఇళ్లను ఆనుకుని ప్రవహిస్తోంది. మోతె వాగుకు వరద ఉధృతి పెరగడంతో వెంకటాద్రినగర్ బ్రిడ్జి మునిగిపోయింది. కండ్లపల్లి చెరువు సమీపంలో ఉన్న ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది. వారిని మున్సిపల్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బైపాస్రోడ్ సమీపంలో మ్యాన్హోల్స్ ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాకేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చివేస్తున్నారు. మెట్పల్లిలో భారీ వర్షం మెట్పల్లిరూరల్: బుధవారం రాత్రి నుంచి మోస్తరు వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గురువారం పొద్దంతా ముసురు పెట్టడంతో జనజీవనం స్తంభించింది. వెల్లుల, చెర్లకొండాపూర్లో రెండు పాత ఇళ్లు కూలిపోయాయి. వాటిని తహసీల్దార్ నీత, ఎంపీడీవో మహేందర్, ఆర్ఐ సంధ్యారాణి, సర్పంచ్ లాస్య పరిశీలించారు. అల్లూరి సీతరామరాజు తండా శివారు లోలెవల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సై కిరణ్కుమార్ నీటి ఉధృతిని పరిశీలించారు. ఉధృతంగా గోదావరి, పెద్దవాగు మల్లాపూర్: బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు మల్లాపూర్ మండలవ్యాప్తంగా 10.8 సెంటీమీటర్ల వర్షం కురిసిందని ఏఎస్వో శ్రీనివాస్ తెలిపారు. గోదావరి, పెద్దవాగు ఉధృతంగా ప్రవహించాయి. తహసీల్దార్ రాంచందర్, ఎస్సై అనిల్, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో మహేశ్వర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు నీటి ప్రవహాన్ని పరిశీలించారు. మల్లాపూర్లో మోడల్ స్కూల్ రోడ్డు నీటమునగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. స్కూల్ రోడ్డు నీటమునగడంతో బాలికల హాస్టల్ నైట్వాచ్మన్ సత్యనారాయణ నీటిలో చిక్కుకున్నారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి స్పందించి అతడిని క్షేమంగా రోడ్డు దాటించారు. కల్లూర్ లోలెవల్ వంతెన పరిశీలనకోరుట్లరూరల్: మండలంలోని కల్లూర్–సర్పరాజ్పూర్ మధ్య పెద్ద వాగుపై ఉన్న లోలెవల్ వంతెనను కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్తో పరిశీలించారు. వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైలెవల్ వంతెనకు ప్రతిపాదనలు పంపించాలని ఆర్అండ్బీ ఏఈ లక్ష్మీకాంత్కు సూచించారు. ఆర్డీవో జీవాకర్రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, సీఐ లక్ష్మీనారాయణ, సర్పంచులు నత్తి రాజ్కుమార్, చిట్నేని లత ఉన్నారు. -
రహదారులపై పడిపోయిన చెట్లు
జగిత్యాలక్రైం: ఈదురుగాలులకు జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై బుధవారం రాత్రి చెట్లు కూలిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని చెట్లను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. బుగ్గారం పోలీస్స్టేషన్ పరిధిలోని గంగాపూర్లో రహదారిపై చెట్టు కూలిపోగా తొలగించి రాకపోకలను క్లియర్ చేశారు. పెగడపల్లి–రామడుగు రహదారిపై చెట్టు కూలిపోగా బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో తొలగించారు. కొండగట్టు మండలం రాజారం సమీపంలో రెండు చెట్లు కూలిపోయాయి. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, చెట్లు కూలిపోయినా.. విద్యుత్ స్తంభాలు లేదా ఇతర అడ్డంకులు కనిపిస్తే సమీప పోలీస్స్టేషన్, లేదా డయల్ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
ముందస్తు చర్యలు చేపట్టండి
జగిత్యాల/ఇబ్రహీంపట్నం: భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బల్దియా కమిషనర్లతో సమావేశమయ్యారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, గోదావరి నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముంపునకు గురయ్యే గ్రామాలు, కాలనీల్లో పర్యటించాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పునరావాస కేంద్రాలను గుర్తించి విద్యుత్, ఆహారం, వైద్యం, పారిశుధ్యం సక్రమంగా ఉంచాలన్నారు. నాలాలు బ్లాక్ కాకుండా చూడాలని బల్దియా కమిషనర్లను ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు తప్పనిసరి అనంతరం కలెక్టర్ ఇబ్రహీంపట్నం మండలం యామపూర్, ఫకీర్కొండాపూర్ మధ్య తెగిపోయిన తాత్కాలిక రోడ్డును ఎస్పీ అశోక్కుమార్తో కలిసి పరిశీలించారు. వాగుల్లో ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. యామపూర్, ఫకీర్కొండాపూర్ మధ్య నిలిచిపోయిన బ్రిడ్జి పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకొవాలని యామపూర్ సర్పంచు నాగయ్య కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఆయన వెంట డీఎస్పీ రాములు, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేష్, ఎంపీవో రామకృష్ణరాజు, ఫకీర్కొండాపూర్ సర్పంచ్ తోట రమేశ్ ఉన్నారు. -
చెరువులు, కుంటలకు జలకళ
జగిత్యాలఅగ్రికల్చర్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. మొన్నటి వరకు ఎల్నినోతో దిగులు పడిన రైతులకు ప్రస్తుత వర్షంతో చెరువులు నిండడంతో పంటలపై ఆశలు చిగురిస్తున్నాయి. యాసంగి కూడా గట్టెక్కే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో నీటి పారుదల శాఖ కింద 1226 చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు ఉన్నాయి. వీటి కింద 81,322 ఎకరాల ఆయకట్టు ఉంది. 939 చెరువులు ఉండగా వాటి కింద 55,332 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 100ఎకరాలకు పైగా ఆయకట్టు చెరువులు 107 ఉన్నాయి. వంద ఎకరాల లోపు ఉన్న చెరువులు 832 ఉన్నాయి. ఈ చెరువులన్నీ వర్షాలు కురిసినప్పుడు.. లేకుంటే ఎస్సారెస్పీ నీటితో నింపాల్సిందే. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దాదాపు 90 శాతం చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. కొన్ని చెరువులు అలుగు పోస్తున్నాయి. ఆ నీరంతా వాగుల ద్వారా దిగువకు వెళ్తోంది. గుల్లపేట, తక్కళ్లపల్లి వంటి ప్రాంతాల్లో వాగులపై చెక్ డ్యాంలు నిర్మించినప్పటికీ పెద్దగా నీరు నిలిపే పరిస్థితి లేదు. పెంబట్ల వంటి చాలా చెరువుల్లో పూడిక పేరుకుపోవడంతో కొద్దిపాటి వర్షానికే నిండుతున్నాయి. కొన్ని చెరువులు ఆక్రమణలకు గురవడంతో నీటి సామర్థ్యం భారీగా తగ్గిపోతోంది. -
ఇళ్లు కూలిన బాధితులను ఆదుకోవాలి
జగిత్యాలరూరల్: ఇళ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి జీవన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత కోరారు. సారంగాపూర్ మండలం పెంబట్ల, కోనాపూర్ గ్రామాల్లో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అదే గ్రామంలో ఇల్లు కూలిపోయిన పస్తం స్వప్న, పరమేశ్, దుర్గేశ్ ఇళ్లను పరిశీలించారు. ఆర్డీవో, తహసీల్దార్లతో ఫోన్లో మాట్లాడి బాధితులకు పరిహారం అందించాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, సర్పంచ్ ఆకుల రమేశ్, నాయకులు శ్రీనివాస్, అలీం, జనార్దన్, వెంకటేశ్, వేణు, మల్లయ్య పాల్గొన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొరండ్లకు చెందిన సింగారపు రవి ఇల్లు బుధవారం రాత్రి కూలిపోగా వారి కుటుంబాలను దావ వసంత పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆనందరావు, నాయకులు గంగారెడ్డి, తోట మహేశ్, శేఖర్, మల్లేశంగౌడ్, లింగయ్య, సన్నిత్, చందు, రాము పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితురాలు అరెస్ట్
కరీంనగర్ రూరల్: తీగలగుట్టపల్లిలో జరిగిన రూ.26 లక్షల నగదు చోరీ కేసులో మరో నిందితురాలు ఆడెపు రేష్మాను గురువారం కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు తగరం శంకర్ను రిమాండ్కు తరలించారు. తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్లో అనుమానస్పదంగా సంచరిస్తున్న రేష్మాను అదుపులోకి తీసుకున్నారు. శంకర్తో కలిసి ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించి బాత్రూమ్లో ప్లాస్టిక్డ్రమ్లో దాచిన సుమారు రూ.26 లక్షల నగదును అపహరించినట్లు అంగీకరించింది. శంకర్ను అరెస్ట్ చేయడంతో భయపడిన రేష్మా చంద్రాపూర్ వెళ్లేందుకు గురువారం రైల్వేస్టేషన్కు రావడంతో పట్టుకున్నారు. కేసులో మిగిలిన అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
మూడు రెస్క్యూ బృందాలు
జగిత్యాలక్రైం: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు జగిత్యాల జిల్లా పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇబ్బందులు తలెత్తితే సంరక్షణకు మూడు ప్రత్యేక రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. లోతట్టు ప్రాంతాలు, రహదారుల వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బృందాలకు లైఫ్ జాకెట్లు, తాళ్లు, రెస్క్యూ కిట్లు, ఇతర ప్రత్యేక భద్రత పరికరాలు అందుబాటులో ఉంచామన్నారు. -
రైస్మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీ
జగిత్యాలక్రైం: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విజి లెన్స్ అధికారులు రైస్మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. గురువారం ఉదయం జిల్లాలో మూడు రైస్మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు ఇటీవల ప్రభుత్వం టెండర్ల ద్వారా విక్రయించిన ధాన్యం తీసుకుని డబ్బులు జా ప్యం చేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తాళం వేసిన ఇంట్లో చోరీకి యత్నంజగిత్యాలక్రైం: పట్టణంలోని హౌసింగ్బోర్డు రామాలయం వెనుక తాళం వేసి ఉన్న కడారి సత్యనారాయణరావు ఇంట్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి యత్నించారు. సత్యనారాయణరావు బుధవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి పని నిమిత్తం హైదరాబాద్కు వెళ్లాడు. రాత్రి గుర్తుతెలియని దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చోరీకి యత్నించారు. గురువారం మధ్యాహ్నం స్థానికులు బాధితుడికి సమాచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. దొంగతనం జరిగిన ప్రాంతాల్లో ఫింగర్ప్రింట్స్ సేకరించారు. స్వగ్రామానికి యువకుడి మృతదేహంచొప్పదండి: దేశాయిపేట గ్రామానికి చెందిన పులిపాక బాబు(30) ఇటీవల దుబాయిలో మృతిచెందగా.. గురువారం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. కొన్నేళ్లుగా బాబు దుబాయికి వెళ్తున్నాడు. అక్కడ జూలై 7న గుండె సంబంధిత అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి పెళ్లి కాలేదు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాబుకు సోదరి ఉందని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. జేఎన్టీయూలో ‘రెడ్రాబ్’ ఉచిత శిక్షణ కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ రె డ్రాబ్ ఏఐ శిక్షణ ఇచ్చేందుకు గురువారం ఒ ప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు, అధ్యాపకులు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగానికి ఆర్నెళ్లపాటు రెడ్రాబ్ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థులకు ఏఐ ఆధారిత రెజ్యూమ్ బిల్డింగ్, జాబ్ మ్యాచింగ్, ఇంట ర్వ్యూ ప్రిపరేషన్, ఉ ద్యోగార్హత స్కోరింగ్ వంటి సేవలు అందుబా టులోకి రానున్నాయి. అధ్యాపకులకు పరిశోధ న, అసెస్మెంట్ రూపకల్పన, ప్లేస్మెంట్ అధి కారులకు హెచ్ఆర్ బృందాలతో నేరుగా అనుసంధానమయ్యే అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కళాశాల పూర్తిస్థాయి ‘ఏఐ రెడీ క్యాంపస్’గా రూపుదిద్దుకోనుందని కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ బి.సతీశ్ కుమార్ తెలిపారు. వర్షానికి కూలిన ఇల్లు ఫెర్టిలైజర్సిటీ: రామగుండం కార్పొరేషన్ 21 డివిజన్ వీర్లపల్లిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జంజిరాల నరసమ్మకు చెందిన రేకుల షెడ్డు పూర్తిగా కూలిపోయింది. భర్త శంకరయ్య మృతి చెందడంతో ఒంటరిగానే జీవిస్తోంది. కొడుకు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాడు. ఇల్లు కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ రోదిస్తోంది. -
నిధులు మంజూరు చేయాలి
వట్టిమల్ల నుంచి నిమ్మపల్లికి, కోనరావుపేట మండలకేంద్రానికి వెళ్లాలంటే ఇదే మూలవాగు పైనుంచే వెళ్లాలి. వాగుపై గతంలో నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నా వర్షాలకు మళ్లీ కొట్టుకుపోతుండడంతో రవాణాకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలి. – గుండా వెంకటేశ్, వట్టిమల్ల సర్పంచ్రవాణాకు ఇబ్బంది మండలంలోని మూలవాగుపై వంతెనల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన రాహిత్యంతో ఎస్డీఎఫ్ నిధులను రద్దు చేశారు. దీంతో ఏటా వర్షాకాలంలో రవాణాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికై నా వంతెనల కోసం నిధులు మంజూరు చేయాలి. –బడుగు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మామిడిపల్లి -
తాత్కాలిక మరమ్మతులతోనే సరి
కోనరావుపేట: మండలంలోని మూలవాగుపై గతంలో నిర్మించిన కాజ్వేలు భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో రవాణా కష్టాలు ఎదురవుతున్నాయి. కాజ్వేల స్థానంలో వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరైనా ప్రారంభానికి నోచుకోవడంలేదు. మండలంలోని మామిడిపల్లి–నిజామాబాద్, వెంకట్రావుపేట – బావుసాయిపేట, వట్టిమల్ల – నిమ్మపల్లి మధ్య ఉన్న మూలవాగుపై రవాణా కష్టాలు నిత్యకృత్యమవుతున్నాయి. వర్షాలు పడితే మూలవాగు ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయి, సంబంధాలు తెగుతున్నాయి. పలుగ్రామాల ఇబ్బందులపై అప్ప టి నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి జీవన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మూడు వంతెనలు మంజూరుచేశా రు. ఐదేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈవంతెనలు కొట్టుకుపోయి, మళ్లీ రవాణా వ్యవస్థ దెబ్బతింది. స్థానిక పాలకులు తాత్కాలిక మరమ్మతులు చేపట్ట డం, వర్షాలకు కొట్టుకుపోవడం పరిపాటి అయింది. రద్దయిన రూ.52 కోట్ల నిధులు.. గత కొన్నేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా త ప్రభుత్వం ఈవంతెనల నిర్మాణానికి రూ. 52 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించినా టెండర్లు అవుతున్నాయని చెప్పిన అధికారులు ఆ నిధులన్నీ రద్దయ్యాయని తెలుపుతున్నారు. తమ రవాణా కష్టాలు తప్పవని గ్రామీణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
గుండెపోటుతో రైతు మృతి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్లో గురువారం గుండెపోటుతో బండి అంజయ్య(50)అనే రైతు పొలంలోనే మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు భార్య కొమురమ్మతో కలిసి అంజయ్య ఉదయం 11గంటలకు పొలం వద్దకు వెళ్లాడు. పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం 3.30గంటలకు ఇంటికి బయల్దేరాడు. కొంతదూరం నడిచిన అంజయ్యకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పొలంలోనే పడిపోయాడు. భార్య కొమురమ్మ కేకలు వేయడంతో స్థానిక రైతులు వచ్చారు. చికిత్స నిమిత్తం కరీంనగర్లో ఆటోలో తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్యతోపాటు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పారిశుధ్య కార్మికుడు.. రాయికల్: రాయికల్ బల్దియాలో వాటర్ లైన్మన్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి భీమయ్య (50) గుండెపోటుతో గురువారం మృతిచెందాడు. మున్సిపల్ చైర్మన్ కట్కం రవి అంత్యక్రియల నిమ్తితం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట కౌన్సిలర్లు గంగాధర్, రాకేశ్నాయక్, నాయకులు తురగ శ్రీధర్రెడ్డి, భూమేశ్, రాము, అనిల్, నాగరాజు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ సందడి
● 1న గరంలో కిడ్స్ చాంపియన్షిప్స్తో పాటు అండర్– 18 జిల్లా ఎంపికలుకిడ్స్ విభాగంలో ఉదయం 8.30 గంటలకు క్రీడాకారులు రిపోర్ట్ చేయాలి. 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. కిడ్స్ విభాగంలో అండర్–6, 8, 10, 12 బాలురు, బాలికలకు రన్నింగ్, స్టాండింగ్ లాంగ్జంప్, షాట్పుట్, బ్యాక్ త్రో పోటీలు నిర్వహిస్తారు. అండర్–14, 16, 18, 20 విభాగాలతో పాటు ఓపెన్ కేటగిరీలో బాలురు, బాలికలు, పురుషులు, మహిళలకు జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తారు. అండర్ 18 విభాగంలో కిడ్స్, జావెలీన్ త్రో ఎంపికలతో పాటు అండర్–18 బాలురు, బాలికల జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తారు. ఇందులో 100, 200, 400, 1000 మీటర్ల రన్నింగ్, హర్డిల్స్, హైజంప్, లాంగ్జంప్, షాట్పుట్, డిస్కస్, జావెలిన్, రేస్వాక్, హెప్టాథ్లాన్ ఈవెంట్లలో పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు రూ.150 ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఆగస్టు 7న హన్మకొండ జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. పోటీల్లో పాల్గొనేవారికి సర్టిఫికెట్లు, విజేతలకు మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు మహిపాల్ తెలిపారు. కరీంనగర్స్పోర్ట్స్: పరుగులో వేగం, జావెలిన్లో గురి, క్రీడాస్ఫూర్తిలో విజయం... ఇవే ఒక అథ్లెటిక్ చాంపియన్ను తీర్చిదిద్దే ఆయుధాలు. గ్రామీణస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ప్రతిభను వెలికితీసి యువ అథ్లెట్లకు ఉన్నత వేదిక కల్పించాలనే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆగస్టు 1న జాతీయ జావెలిన్ దినోత్సవం, కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్, అండర్ 18 జిల్లా ఎంపికలను ఒకే వేదికపై నిర్వహిస్తోంది. ఆగస్టు 1 కరీంనగర్లోని రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో 5వ జాతీయ జావెలిన్ దినోత్సవం, 1వ కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్తో పాటు 12వ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ అండర్ 18 జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, సుమన్ కల్యాణ్ తెలిపారు. ప్రవేశ రుసుం జిల్లా సంఘం భరిస్తుంది జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చి ఆగస్టు 7న హన్మకొండ జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారుల రూ.300 రాష్ట్ర ప్రవేశ రుసుంను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషనే భరిస్తుంది. చిన్నారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు కిడ్స్ అథ్లెటిక్స్, జావెలిన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. జిల్లాలోని ప్రతి యువ క్రీడాకారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – నందెల్లి మహిపాల్, జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు -
ఎస్సారెస్పీకి స్వల్ప ఇన్ ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా ఇన్ ఫ్లో వస్తోంది. బుధవారం సాయంత్రం వరకు 3500 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. అవుట్ ఫ్లోగా 751 క్యూసెక్కులుగా ఉంది. గతేడాది జూలై 29 నాటికి ప్రాజెక్టు నీటిమట్టం 1075 అడుగులు, 32.897 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 1065 అడుగులు, 16.545 టీఎంసీలుగా ఉంది. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నిండే అవకాశం ఉందని, ఏ క్షణమైనా గేట్లు ఎత్తి గోదావరిలోకి వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు ఇంజినీర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు నది వైపు రావద్దని సూచించారు. ధర్మపురి వద్ద పెరుగుతున్న గోదావరి మట్టంధర్మపురి: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వరద ప్రవాహాన్ని మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి సిబ్బందితో కలిసి పరిశీలించారు. పశువుల కాపరులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సీఐ రాంనర్సింహారెడ్డి సూచించారు. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు లోనికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోరుట్లలో లోతట్టు ప్రాంతాలు జలమయంకోరుట్ల/కోరుట్ల రూరల్: కోరుట్ల పట్టణంతోపాటు వివిధ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలూ పొంగి ప్రవహించాయి. ముత్యాలవాడ, ప్రకాశం రోడ్, రథాల పంపు ఏరియాలు వాగును తలపించాయి. పెద్దవాగు ప్రవాహాన్ని మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ పరిశీలించారు. డిజిటలైజేషన్ 88.43శాతం పూర్తిజగిత్యాల: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ జిల్లాలో 88.43 శాతం పూర్తయిందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేశామని, లోపాలను వెంటనే సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 87.74 శాతం, జగిత్యాలలో 85.63శాతం, ధర్మపురిలో 92.06 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. జాతీయ పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మరాయికల్: పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు చెరుకు మహేశ్వరశర్మ ఢిల్లీలో జాతీయ విశేష పురస్కారాన్ని బుధవారం కేంద్రమంత్రి భూపతిరాజ్, శ్రీనివాస్వర్మ, రాజ్యసభ సభ్యుడు బంగారు లక్ష్మణ్ చేతులమీదుగా అందుకున్నారు. సాహిత్యంలో ఆయన సేవలకు గుర్తింపు లభించింది. మహేశ్వర శర్మను ఉపాధ్యాయులు అభినందించారు. -
రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి
రాయికల్: రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అన్నారు. పట్టణంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి భేషజాలానికి పోతున్నాడని విమర్శించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి దయతో కురిసిన వర్షానికి రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారని, ఈ క్రమంలో యూరియా, డీఏపీ వంటి మందుల కొరత లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం స్పందించి 24 కరెంట్ అందించాలన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు తాటిపర్తి చంద్రకృష్ణారెడ్డి, బర్కం మల్లేశ్, గోపి రాజిరెడ్డి, కొయ్యడి మహిపాల్రెడ్డి, హరీశ్రావు, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
వరద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ కూలిన ఇంటి వద్ద బాధితులు జగిత్యాలక్రైం: భారీ వర్షాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. వరద ప్రాంతాలను అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ప్రజలు వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, నీరు నిలిచే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. వరద ప్రాంతాల్లో తాత్కాలిక హెచ్చరిక బోర్డులు, బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. పెంబట్లలో కూలిన ఇల్లు సారంగాపూర్ మండలం పెంబట్ల, కోనాపూర్కు చెందిన పస్తం స్వప్న ఇల్లు భారీ వర్షానికి కూలిపోయింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. పోలీసుల సూచనలు... ● ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ దిగవద్దు ● చేపల వేటకు చెరువులు, వాగులు, నదుల వద్దకు వెళ్లవద్దు ● నీట మునిగిన కల్వర్టులు, వంతెనలు, వాగులను దాటే ప్రయత్నం చేయవద్దు ● విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగలను ముట్టుకోవద్దు ● రైతులు విద్యుత్ తీగలు, నీటి ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలి ● శిథిలావస్థలో ఉన్న, కూలిపోయే ఇళ్లలో ఉండొద్దు ● మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దు ● సెల్ఫీ, రీల్స్ కోసం జలపాతాల వద్దకు వెళ్లవద్దు -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: భారీవర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం జగిత్యాలరూరల్ మండలం అనంతారం, గుల్లపేటలో వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయాలను విడిచి వెళ్లొద్దన్నారు. నీటి ముంపు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హకీం, ఎంపీడీవో రమాదేవి, ఆర్ఐ శంషోద్దీన్ పాల్గొన్నారు. -
నిలిచిన రాకపోకలు
జగిత్యాలరూరల్: వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ఊరటనిచ్చింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతారం శివారు జాతీయ రహదారి మీదుగా వాగు ఉధృతిగా ప్రవహించింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై రాకపోకలు నిలిపివేయించారు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్, ఎంపీవో రవిబాబు అనంతారం రోడ్డ్యాం వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. పెర్కపల్లి–హన్మాజీపేట గ్రామాల మధ్య ఉన్న బొల్లెవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పొరండ్ల, రంగపేట వైపు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు ఉంచారు. -
శిక్షణకు పలువురు కౌన్సిలర్ల డుమ్మా
మెట్పల్లి: స్థానిక సంస్థల్లో పాలనకు సంబంఽధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి మెట్పల్లి బల్దియా కౌన్సిలర్లు పలువురు డుమ్మా కొట్టారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సగానికి పైగా కౌన్సిలర్లు గైర్హాజరుకావడం చర్చనీయాంశమైంది. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులకు మున్సిపల్ చట్టాలు, పాలన, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణను ఏర్పాటు చేసింది. ఇందుకు హైదరాబాద్కు వెళ్లడానికి ప్రయాణం, ఇతర ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున అధికారులు అందించినట్లు సమాచారం. ఎంతో ప్రాధాన్యమున్న ఈ శిక్షణకు కొందరు కౌన్సిలర్లు దూరంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. 26 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులు కలుపుకొని 29మంది ఉంటే.. కేవలం 11మందే శిక్షణకు వెళ్లినట్లు తెలిసింది. ఖర్చుల కింద మాత్రం డబ్బులు అందరికీ ముందుగానే ఇచ్చినట్లు సమాచారం. ఘనంగా సినారె జయంతిజగిత్యాల: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి 99వ జయంతి వేడుకలను కళాశ్రీ ఈశ్వరమ్మ సాహితీపీఠం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశ్రీ అధినేత రాజు మాట్లాడుతూ సినారె సాహితీరంగంలో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు జమున, అనిత, లక్ష్మీ, లావణ్య, కవిత, శ్రీనివాస్, గంగాధర్ పాల్గొన్నారు. -
ఇంత‘లా’ హడావుడి దేనికి..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనిర్సిటీ లా ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆగస్టు మూడో తేదీ నుంచి ఆరో సెమిస్టర్ పరీక్షలు అంటూ బుధవారం సాయంత్రం షెడ్యూల్ ప్రకటించిన వర్సిటీ అధికారులు న్యాయ విద్యార్థుల నెత్తిన పిడుగేశారు. ఈ సెమిస్టర్ సెకండ్ ఇంటర్నల్ 31వ తేదీన, మరునాడు ఆగస్టు 1న మూట్ కోర్ట్ ప్రాక్టీస్ షెడ్యూల్ గత వారమే విడుదలైంది. అయితే, విద్యార్థులు ఇంకా పరీక్ష ఫీజు కడుతూనే ఉన్నారు. జూలై 31 వరకు విద్యార్థులకు, ఆగస్టు 1వ తేదీన పరీక్షలకు ఆన్లైన్లో ఫీజు గడువు విధించారు. వాస్తవానికి ఆగస్టు 1 శనివారం రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో చెల్లింపులకు అవకాశమిచ్చారు. అదే ఆగస్టు 3న ఉదయం 10 గంటల నుంచి ఆరో సెమిస్టర్ తొలి పరీక్ష నిర్వహించనున్నారు. యూనివర్సిటీ అధికారులు కనీసం విద్యార్థులకు ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తీవ్ర వివాదం రేపుతోంది. సెంటర్ ఎక్కడ..? హాల్టికెట్ ఎలా? శనివారం సాయంత్రం వరకు పరీక్ష ఫీజు కట్టించుకునేలా షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు, సోమవారం ఉదయం 10 గంటలకు పరీక్ష పెట్టడంపై విద్యార్థులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తాము హాల్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి..? సెంటర్ ఎక్కడ? అన్న కనీస విషయాలు తెలసుకునే వీలు లేకుండా పరీక్షకు షెడ్యూల్ విడుదల చేయడంపై విద్యార్థులు బిత్తరపోతున్నారు. కేవలం 24 గంటల్లో హాల్టికెట్లు ఎలా విడుదల చేస్తారు? ఎలా పంపిణీ చేస్తారు? అన్న విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఇంటర్నల్ పరీక్షలు పూర్తయిన కనీసం వారం నుంచి 15 రోజుల వ్యవధి అనంతరం సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలి. కానీ, అధికారులు ఈ విషయాల గురించి కనీసం ఆలోచించనట్లుగా స్పష్టమవుతోంది. ఈ విషయమై శాతవాహన వర్సిటీ పరీక్షల కంట్రోలర్ సురేశ్ను సంప్రదించగా.. ఎల్ఎల్ఎం కౌన్సెలింగ్కు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని పలు న్యాయకళాశాలలు, విద్యార్థుల నుంచి అనేక వినతులు వచ్చిన నేపథ్యంలో పరీక్షల ఆల్మోనాక్ (విద్యా వార్షిక ప్రణాళిక)ను మార్చి మరీ ముందుకు జరిపినట్లు వివరణ ఇచ్చారు. మరోవైపు పరీక్షలు ముందుకు జరపడంపై తమకు అభ్యంతరం లేకున్నా.. కనీసం హాల్ టికెట్ తీసుకునే సమయం, పరీక్ష కేంద్రం తెలుసుకునే వ్యవధి అయినా ఇవ్వకపోవడంపై న్యాయ విద్యార్థులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. -
జాతీయ వేదికపై కరీంనగర్ కెరటాలు
● నేషనల్ టేబుల్ టెన్నిస్ బరిలో జిల్లా క్రీడాకారులు ● ఆగస్టు 16 నుంచి 23 వరకు కాన్పూర్లో పోటీలుఢిల్లీ, డయ్యూడామన్, తమిళనాడులో జరిగిన ఎస్జీఎఫ్ జాతీయ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. పతకం సాధించలేదు. ఈ సారి తప్పకుండా పతకం సాధిస్తా. టేబుల్ టెన్నిస్లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతిరోజూ సాధన చేస్తున్నా. – ఎల్లా అవనిరెడ్డి రాష్ట్రస్థాయి పోటీల్లో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. చీఫ్ మినిస్టర్స్ కప్లో 3వ స్థానం సాధించాను. జిల్లాస్థాయి పోటీల్లో 19 పతకాలు గెలుచుకున్నాను. ప్రస్తుతం జరుగనున్న పోటీల్లో పతకం సాధించడమే నా లక్ష్యం. – కటికిరెడ్డి అద్వికనాథ్ కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. స్థానిక కేహెచ్ఆర్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు వచ్చే ఆగస్టులో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగే నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్–2026కు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు ఎంపికయ్యారు. ఆగస్టు 16 నుంచి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం క్రీడాకారులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సుమారు ఐదు గంటల పాటు కఠినమైన సాధన చేస్తున్నారు. -
టీఆర్ఎస్ చీఫ్ కవిత వాహనానికి వరుస చలాన్లు
తంగళ్లపల్లి(సిరిసిల్ల) : టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న టీఎస్09ఈయూ6666 నంబర్ గల కారుపై భారీ స్థాయిలో ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్న విషయం శ్రీసాక్షిశ్రీ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ఈ వాహనంపై 25 చలాన్లు నమోదై ఉండగా, మొత్తం రూ.21,875 చెల్లించాల్సి ఉంది. జిల్లాలు దాటినా ఆగని ఉల్లంఘనలు తెలంగాణ పబ్లికేషన్స్ పేరిట రిజిస్టరైన ఈ కారు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రయాణించిన సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈ చలాన్ డేటా స్పష్టం చేస్తోంది. ఓవర్ స్పీడింగ్: ఎంవీ యాక్ట్ సెక్షన్ 184 ప్రకారం.. నిర్ణీత వేగ పరిమితి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినందుకు నిజామాబాద్ (ఇందల్వాయి), కరీంనగర్ (నుస్తులాపూర్), సిద్దిపేట, కామారెడ్డి (అడ్లూర్), మెదక్ (చేగుంట), రామగుండం, హైదరాబాద్ (పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే) వంటి ప్రధాన రహదారులపై అత్యధికంగా రూ.1,000 చొప్పున ఫైన్లు విధించారు. ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు: మోటార్ వాహనాల నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్ కలిగి ఉన్నందుకు హైదరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పలుమార్లు రూ.200 చొప్పున చలాన్లు వేశారు. అక్రమ పార్కింగ్: రహదారిపై వాహనాల రాకపోకలకు అడ్డంకిగా వాహనాన్ని నిలిపినందుకు సైబరాబాద్ (నార్సింగి) పరిధిలోనూ జరిమానా పడింది. సాధారణ వాహనదారులపై నిబంధనల పేరుతో కఠినంగా వ్యవహరించే పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల వాహనాల విషయంలోనూ అదే రీతిలో చలాన్లను వసూలు చేస్తే బాగుంటుందని సామాన్యులు కోరుతున్నారు. పెండింగ్ ఫైన్ రూ.21,875 -
ఎల్ఆర్ఎస్ అంతంతే..
జగిత్యాల: అక్రమ ప్లాట్లు.. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ పథకానికి జిల్లాలో స్పందన కరువైంది. ఈనెల 31లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. క్రమబద్ధీకరణకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నప్పటికీ పరిష్కరించడంలో జాప్యం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అవకాశం ఇచ్చింది. ఇప్పటికీ రెండుమూడు సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఎల్ఆర్ఎస్కు పెద్దగా స్పందన రావడం లేదు. ఈనెల 31తో గడువు ముగుస్తున్నప్పటికీ జిల్లాలో ఇంకా అనేకం పెండింగ్లోనే ఉన్నాయి. దరఖాస్తుదారుల్లో చాలామంది ఇళ్ల నిర్మాణం చేపట్టుకోక ప్లాట్ల క్రయవిక్రయాలు చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యమో.. దరఖాస్తుదారులు పట్టించుకోకపోవడమోగానీ పథకం ఆశించిన తీరులో ముందుకు కదలడం లేదు. కొన్ని దరఖాస్తులు వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడం, ప్రొసీడింగ్స్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండడం ఇబ్బందికరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫీజు అధికంగా ఉండటంతో ప్రజలు ముందుకు రావడం లేదని సమాచారం. ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించినప్పటికీ పట్టించుకోవడం లేదు. దరఖాస్తుల పరిశీలనలు ఎల్–1, ఎల్–2, ఎల్–3 దశల్లో చేపడుతున్నారు. మూడు దశల్లో ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అన్ని వివరాలు సక్రమంగా ఉంటేనే అధికారులు ప్రొసీడింగ్ జారీ చేస్తారు. పొడిగింపు ఉండేనా..? జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. వీటి పరిధిలో ఎల్ఆర్ఎస్కు సుమారు 27,483 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కేవలం 2435 మాత్రమే అప్రూవ్ అయ్యాయి. ఈనెల 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుంది. ఒకవేళ 31 దాటితే మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల్లో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ ఎల్ఆర్ఎస్ పథకాన్ని పొడిగిస్తే అధికారులు పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తే తప్ప పథకం ఆశించినస్థాయిలో ముందుకు కదలదు. ఎల్ఆర్ఎస్ పకడ్బందీగా అమలు చేస్తే ఇటు ము న్సిపాలిటీలు, అటు గ్రామపంచాయతీలకు ఫీజుల రూపంలో ఆదాయం లభించే అవకాశం ఉంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల వివరాలు వచ్చిన దరఖాస్తులు 27,483అప్రూవ్ అయినవి 2,435రిజెక్ట్ చేసినవి 441పెండింగ్ 24,607గ్రామపంచాయతీలు వచ్చిన దరఖాస్తులు 11,512అప్రూవ్ అయినవి 990రిజెక్ట్ అయినవి 2పెండింగ్ 10,520 -
అభ్యుదయ రైతుకు సన్మానం
కొడిమ్యాల: ఆభ్యుదయ రైతు, వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు కొడిమ్యాల మండలం పూడూరుకు చెందిన వెల్ముల రాంరెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మంగళవారం హైదరాబాద్లో ఘనంగా సన్మానించారు. రాంరెడ్డి 78 ఏళ్ల వయసులోనూ వ్యవసాయం చేస్తున్నారు. అన్ని పంటలపై వ్యవసాయ విద్యార్థులకు క్షేత్ర స్థాయిలో పాఠాలు భోదిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనల్లోనూ చేదోడు, వాదోడుగా ఉంటున్నారు. రైతులకు సంబంధించి వ్యవసాయ పరిశోధన స్థానం, రైతు వేదికల్లో ఇలా ఎక్కడ.. ఏ కార్యక్రమం జరిగిన పాల్గొని సాగులో తన అనుభవాలు వివరిస్తున్నారు. రైతు సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తూ.. పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. రైతు వేదికలు, రైతునేస్తం ద్వారా ఆయా పంటలపై ప్రభుత్వం ఇప్పటివరకు 100 ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించగా.. పాల్గొన్న ఆయన రైతుల కష్టాలను ఏకరవు పెట్టాడు. వృద్ధాప్యంలోనూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తూ.. నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఆయనను మంత్రితోపాటు అగ్రివర్సిటీ వైస్ చాన్సలర్ అల్దాస్ జానయ్య, హర్టికల్చర్ వైస్ చాన్సలర్ దండె రాజిరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా సన్మానించారు. మండల కేంద్రంలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా ఏవో జ్యోతి ఆరుతడి పంటల సాగుపై రైతులకు వివరించారు. విత్తనమేళా నిర్వహించి కందులు, కూరగాయల విత్తనాలు అందించారు. మండల ఉద్యాన అధికారి మంజూవాణి మాట్లాడుతూ ఆయిల్ పాం , కూరగాయల సాగు చేయాలని కోరారు. ఎఈవోలు శ్రీలత, గ్రీష్మ, హెచ్ఈవో అనిల్, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
గిరి ప్రదక్షిణం.. స్వామి నామస్మరణం
మల్యాల: కొండగట్టు గిరి ప్రదక్షిణ.. వందమందితో ప్రారంభించిన కార్యక్రమం.. నేడు పది వేల భక్తులకు మించింది. భక్తులు పాదయాత్ర చేస్తూ.. స్వామివారి నామస్మరణతో ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. బుధవారం నిర్వహించే కొండగట్టు 43వ గిరి ప్రదక్షిణలో రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొననున్నారు. ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి రోజున నిర్వహిస్తున్నారు. 2023లో చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు సురేశ్ ఆత్మారాం పౌర్ణమి రోజున దిగువ కొండగట్టులోని ఆంజనేయస్వామి విగ్రహం ఎదుట కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు ప్రతి పౌర్ణమికీ తరలివస్తున్నారు. దారికిరువైపులా ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిల రావాల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకెళ్తున్నారు. గిరి ప్రదక్షిణదారిని అభివృద్ధి చేసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ముందుకొచ్చారు. అటవీ ప్రాంతంలో సుమారు 3.5కిలోమీటర్ల దూరం కొనసాగే ప్రదక్షిణలో భక్తులు సేదతీరేందుకు బెంచీలు, తాగునీటి సౌకర్యం, కంచె ఏర్పాటు చేసేందుకు అంచనాలు రూపొందించారు. పాల్గొనున్న మంత్రి, ఎమ్మెల్యే 43వ గిరి ప్రదక్షిణ.. వరుణపూజలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే సత్యం పాల్గొనున్నారు. ఉదయం ఆరు గంటలకు దిగువ కొండగట్టులో ప్రారంభమయ్యే ఈ ప్రదక్షిణలో పాల్గొన్న అనంతరం వర్షాలు కురవాలని పూజలు చేయనున్నారు. మంత్రి పొన్నం, వేలాదిమంది భక్తులు తరలిరానుండడంతో ప్రదక్షిణ దారిని ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. భక్తులు ఇబ్బంది పడకుండా రహదారిని జేసీబీతో చదును చేయించారు. -
ప్రైవేట్ పాఠశాల వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని యావర్రోడ్లో.. అటవీశాఖ కార్యాలయం సమీపంలో కృష్ణానగర్ వైపు వెళ్తున్న ప్రైవేటు పాఠశాల వాహనాన్ని ఆర్టీసీ అద్దె బస్సు మంగళవారం ఉదయం ఢీకొంది. కృష్ణానగర్కు చెందిన ఓ ప్రైవేటు వాహనం 20 మంది విద్యార్థులతో కొత్తబస్టాండ్ నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తోంది. అదే సమయంలో పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు అతివేగంగా వెళ్లి ఢీకొంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే యావర్లో సంఘటన జరగడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ఉన్న వారంతా చిన్నారులను చేరదీశారు. ప్రైవేట్ వాహన డ్రైవర్, జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన చక్రాల సుదర్శన్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ మారంపల్లి నరేశ్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు -
అంతర్జాతీయంగా రాణిస్తా
హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో మూడు సార్లు పాల్గొన్నా. పతకాలు సాధించలేదు. జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. టేబుల్టెన్నిస్లో అంతర్జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహించేలా ఎదగడం నా లక్ష్యం. – అన్విక్ష్ నందన్ జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. తప్పకుండా పోటీల్లో రాణిస్తాను. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నమెంట్లో రాణించాను. భవిష్యత్లో గొప్ప క్రీడాకారిణిగా మారాలని ఉంది. – ఎ.అనన్య -
అక్కాచెల్లెళ్ల అద్భుత ప్రతిభ
రాయికల్: మండలంలోని మైతాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అక్కాచెల్లెళ్లు కడ దీక్షిత, హర్షిణి మూలకాలు చెప్పి రికార్డు సృష్టించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న దీక్షిత నిత్యం సాధన చేసి చూడకుండా.. తక్కువ సమయంలో మూలకాల పేర్లు రికార్డ్ నెలకొల్పింది. ఆమె పీరియడిక్ టేబుల్లోని 118 మూలకాలను 25 సెకన్లలో చెప్పి ఇతరుల పేరిట ఉన్న రికార్డ్ను అధిగమించింది. దీక్షత ప్రతిభను గుర్తించిన ఇంటర్నెషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థలు ‘ఫాస్టేస్ట్ చైల్డ్ టు రియాక్టివ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ పీరియాడికి టేబుల్ పేరిట రికార్డ్ నమోదు చేసి ప్రశంసపత్రాలు, మెడల్స్ అందించారు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హర్షిణి 42 సెకన్లలో పీరియడిక్ టేబుల్ను చూడకుండా చదివి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకుంది. రికార్డ్స్ నెలకొల్పిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను కలెక్టర్ సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ రాజగౌడ్, డీఈవో రాము అభినందించారు. హెచ్ఎం మోహన్రెడ్డి, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రికార్డులు సాధించామని దీక్షిత, హర్షిణి తెలిపారు. మైతాపూర్ జిల్లా పరిషత్ విద్యార్థినుల ఘనత అభినందించిన కలెక్టర్ -
గంజాయి విక్రేతల అరెస్ట్
● 120 గ్రాముల గంజాయి స్వాధీనం జగిత్యాలక్రైం: జగిత్యాల శివారు మోతె శ్మశానవాటిక ఎదురుగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మంగళవారం నిందితులను అరెస్ట్ చూపారు. పట్టణ శివారు లింగంపేటకు చెందిన జవ్వాజి తేజ, హౌసింగ్బోర్డుకు చెందిన గజ్జెల అజయ్, లక్ష్మీపూర్కు చెందిన ఆలకుంట్ల గణేశ్, తులసీనగర్కు చెందిన ఏళ్ల మనోజ్ ఇటీవల ఉత్తరప్రదేశ్లోని వారణాసికి వెళ్లి 120 గ్రాముల గంజాయి కొనుక్కుని వచ్చి మోతె శ్మశాన వాటిక వద్ద విక్రయిస్తున్నారు. వారిని పట్టణ ఎస్సై సుప్రియ పట్టుకుని 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై కుమారస్వామి పాల్గొన్నారు. ఒకరి అదృశ్యంకరీంనగర్క్రైం: నగరంలోని సు భాష్నగర్కు చెందిన రామగిరి శ్రీకాంత్ (37) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు త్రీ టౌన్ పో లీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మానసిక సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఈ నెల 23 నుంచి కనిపించడం లేదు. శ్రీకాంత్ ఎత్తు 5.4 అడుగులు, తెలుపు వర్ణం, గుండ్రని ముఖం కలిగి ఉండగా, తలకు శస్త్రచికిత్స చేసిన మచ్చ ఉందని తెలి పారు. ఆచూకీ తెలిసిన వారు కరీంనగర్–3 టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
కోరుట్ల రూరల్: ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులను ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు వెళ్లాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సమీక్షసమావేశం నిర్వహించారు. రైతులకు పంటల వైవిధ్యంపై అవగాహన కల్పించాలని, చిరుధాన్యాలు, ఆరుతడి పంటలు సాగు చేసేలా చూడాలని సూచించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పైడిమడుగు గ్రామంలో వీవీజీ రాంజీ పథకం కింద జలసిరిలో భాగంగా ఫాం పాండ్లు, ఇంకుడుగుంతలు, బోర్ రిచార్జీ పనులకు భూమిపూజ చేశారు. జోగిన్పల్లిలో వీవో భవనాలు, అంగన్వాడీ భవన పనులను పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్డీవో రఘువరన్, ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో, సర్పంచులు భూమేశ్వర్, బద్దం తిరుపతి రెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్ యాదవ్, సర్పంచులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాల హాస్టల్ పూర్తి చేయాలి
జగిత్యాల: జిల్లా కేంద్రంలో మెడికల్, నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కోర్సులు తేవాలని ఎమ్మెల్యే సంజయ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్లో కోరా రు. జిల్లాకేంద్ర ఆస్పత్రిలో మందులు స్టాక్ ఉంచాలని, రేడియాలజీ విభాగాన్ని ఆస్పత్రి పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రూ.235 కోట్లతో నిర్మిస్తున్న 450 పడకల ఆస్పత్రి, వైద్య కళాశాల హాస్టల్ త్వరగా పూర్తి చేయాలని కోరారు. పాతబస్టాండ్ వద్దగల ఆస్పత్రిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు రూ.2 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ట్రామా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలన్నారు. ఆస్పత్రులను బలోపేతం చేయాలి కోరుట్ల: కోరుట్ల, మెట్పల్లి ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహను కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన వైద్య ఆరోగ్య సమీక్ష సమావేశంలో పాల్గొని నియోజకవర్గంలోని ఆస్పత్రుల సమస్యలను మంత్రికి వివరించారు. రెండు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులను బదిలీ చేయొద్దని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని వినతిపత్రం సమర్పించారు. స్పెషలిస్ట్, స్టాఫ్నర్స్, పారామెడికల్, సాంకేతిక పరిపాలని సిబ్బందిని నియమించాలని కోరారు. కోరుట్ల ఆస్పత్రికి కొత్త భవనం ఉన్నా.. సరైన పరికరాలు, సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. -
ఫంక్షన్కు వెళ్లి.. రైల్వే ట్రాక్ వద్ద శవమై..
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం సత్తక్కపల్లి శివారులో రైలు ఢీకొని ఒకరు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం సమయంలో గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేటకు చెందిన మామిడి రాజగంగారాం(60)గా గుర్తించారు. రాజగంగారాం కమ్మర్పల్లి సమీపంలోని నాగాపూర్లో ఓ ఫంక్షన్ వచ్చినట్లు సమాచారం. అక్కడ మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించడంతో కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెట్టిపల్లి శ్రీకాంత్ (38) మంగళవారం ఓ ఇంట్లో కరెంట్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే వేములవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి తల్లి రాజేశ్వరి ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై వెంకట్రాజంను వివరణ కోరగా, శ్రీకాంత్ ఫిట్స్తో మృతిచెందాడని, ఇప్పటి వరకు మృతుడి బంధువుల నుంచి ఏలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తానని తెలిపారు. బండరాయి మీద పడి కూలీ మృతిమానకొండూర్: గంగిపల్లి గ్రామ శివారులో రెడ్డి కొమురయ్య(52) అనే కూలీ పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బండరాయి మీద పడి బావిలోనే దుర్మరణం చెందాడు. గంగిపల్లి గ్రామ శివారులో కొండపల్కల గ్రామానికి చెందిన బాపురెడ్డి వ్యవసాయ బావిలో పూడిక తొలగింపు పనులు క్రేన్ సహాయంతో చేపట్టారు. బావిలోకి దిగిన కొమురయ్య తోటి కూలీలతో పని చేస్తున్న సమయంలో క్రేన్ బకెట్(డబ్బా) నుంచి బండరాయి జారి అతడి తలపై పడింది. తీవ్ర గాయాలతో కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మానకొండూర్ సీఐ పి.శ్రీలత ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తేనే మృతదేహాన్ని కరీంనగర్కు తరలించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేయగా.. వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని సీఐ మృతదేహాన్ని కరీంనగర్కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా.. అందరికీ వివాహమైంది. నీటి సంరక్షణే ధ్యేయంగా జలసిరికథలాపూర్: నీటి సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని డీపీవో మదన్మోహన్ అన్నారు. మండలంలోని సిరికొండ శివారులో సర్పంచ్ రవి పంట చేను వద్ద ఫాం పాండ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, తక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయాలన్నారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటిగుంటలు, ఊటకుంటలు తవ్వి చుక్క నీరు వృథా చేయవద్దని కోరారు. ఎంపీడీవో శంకర్, ఎంపీవో ప్రదీప్, ఏపీవో కొమురయ్య, సర్పంచ్ ముదాం రవి, ఏఎంసీ డైరెక్టర్ ఎండీ.హఫీజ్, ఉపసర్పంచ్ మల్లయ్య, కార్యదర్శి సౌజన్య, నాయకులు రాజు, రేహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి ఆరోపణలు.. పోస్టింగ్కు పైరవీలు
మల్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారి సొమ్మును స్వాహా చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. ఇతర ఆలయానికి వెళ్లిన అధికారులు స్థానిక నేతల అండతో మళ్లీ కొండగట్టులో పోస్టింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొంతమంది అధికారులు, అర్చకులు చేయి కలిపి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందికి వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొండగట్టులో ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ జూనియర్ అసిస్టెంట్, మరో సీనియర్ అసిస్టెంట్పై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ.. బదిలీ చేయించేందుకు ప్రజాప్రతినిధులకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిసింది. గతంలో అక్రమాలకు పాల్పడడంతోపాటు అంజన్న నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఎదుర్కొని, సస్పెన్షన్ను తప్పించుకునేందుకు మరో ఆలయానికి బదిలీపై వెళ్లిన అధికారులు మళ్లీ కొండగట్టులో పోస్టింగ్ కోసం రాజకీయ నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. కొండగట్టులో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులు తమ అవినీతికి అడ్డుగా ఉన్న అధికారులను తప్పించేందుకు తప్పుడు ఆరోపణలతో రాజకీయ నాయకులను తప్పుదోవ పట్టిస్తూ.. అడ్డు తొలగించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. కొండగట్టు అంజన్న సొమ్ము రూ.52లక్షలు స్వాహా కేసులో ఆరోపణలు ఎదుర్కొని మరోచోటుకు బదిలీపై వెళ్లిన ఇద్దరు ఉన్నతాధికారులు, మరో సీనియర్ అసిస్టెంట్ కొండగట్టులో తిరిగి పోస్టింగ్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అంజన్న నిధుల గోల్మాల్పై చర్యలకు ఆదేశాలు.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 2022–23లో నిధుల గోల్మాల్పై బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్నెళ్ల కిత్రం దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్రమార్కులపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఇంక్రిమెంట్లలో కోత పెట్టి వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2022–23లో టెండర్ల సొమ్ము రూ.52 లక్షలు ఆలయ ఖాతాలో జమ చేయాల్సి ఉండగా.. సొంతానికి వాడుకోవడంతో అప్పటి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసచారిని సస్పెండ్ చేశారు. ఏఈవో, సూపరింటెండెంట్కు నోటీసులు ఇచ్చి బదిలీ చేశారు. నిధుల గోల్మాల్ నిర్ధారణ కావడంతో సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్నెళ్ల క్రితం దేవాదాయ శాఖ ఆదేశాలు జారీచేసింది. తాజాగా అదే అధికారులు కొండగట్టులో మళ్లీ పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొండగట్టుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు గతంలో అంజన్న నిధుల గోల్మాల్పై చర్యలకు ఆదేశం ఇంక్రిమెంట్ల కోతతో సరిపెట్టిన వైనంకొండగట్టు ఆలయ నిధుల గోల్మాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులకు కొండగట్టులో పోస్టింగ్ ఇవ్వలేదు. ఆలయ నిధుల గోల్మాల్లో అధికారుల పాత్ర నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే. ఈ మేరకు సదరు అధికారుల ఇంక్రిమెంట్లలో కోత పెట్టేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. వారి వివరణ తీసుకున్నాం. న్యాయసలహా ప్రకారం చర్యలు తీసుకుంటాం. కమిషనర్ ఆదేశాల మేరకే బదిలీలు జరుగుతున్నాయి. – అంజనారెడ్డి, కొండగట్టు ఆలయ ఈవో -
ఫొరెన్సిక్ సైంటిస్ట్గా హరీశ్
గొల్లపల్లి: సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. పట్టుదలతో చదివి తెలంగాణ ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో శాసీ్త్రయ అధికారి (సైంటిఫిక్ ఆఫీసర్)గా మండలకేంద్రానికి చెందిన చెవులమద్ది హరీశ్. ఈ మేరకు డీజీపీ చేతులమీదుగా హైదరాబాద్లో నియామకపత్రం అందుకున్నారు. మండలకేంద్రానికి చెందిన చెవులమద్ది రామవ్వ, నర్సయ్య దంపతుల కుమారుడు హరీశ్ జేఎన్టీయూ (హైదరాబాద్) నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఇటీవల తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన నియామక ప్రక్రియలో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదన్నారు. తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కతజ్ఞతలు తెలిపారు. హరీశ్ను కుటుంబ సభ్యులు, గొల్లపల్లి గ్రామస్తులు అభినందిస్తున్నారు. రానున్న ఐదు రోజులు మోస్తరు వర్షాలుజగిత్యాలఅగ్రికల్చర్: రానున్న ఐదురోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోదన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మీ తెలిపారు. 29, 30తేదీల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, 31 నుంచి ఆగస్టు రెండు వరకు బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఘనంగా కుజదోష నివారణ పూజలుధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగనంలోని యాగశాలలో మంగళవారం కుజదోష నివారణ పూజలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ కలహాలు, వాస్తుదోశాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు శారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హైపటైటిస్పై అప్రమత్తంగా ఉండాలిజగిత్యాల: హైపటైటిస్పై జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మెడికల్ కళాశాల వద్ద మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైపటైటిస్తో కాలేయంలో వాపులు, కామెర్లు, కాలేయ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని, జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం ఉండదన్నారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సుభాష్, డాక్టర్లు శ్రీనివాస్, రాజేందర్, నరేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు. దిగుబడినిచ్చే పంటలు సాగు చేయాలిధర్మపురి: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటి వినియోగం అయ్యే పంటలు సాగు చేయాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి కట్ట లత సూచించారు. ధర్మపురిలోని రైతు వేదిక కార్యాలయంలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల రైతులకు ఆయిల్ పాం, పండ్లు, కూరగాయల సాగుపై అవగాహన కల్పించారు. మల్బరీ, ఉల్లి, కూరగాయలు, పండ్లు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ హెచ్ఈవో వంశీకృష్ణ, అర్చన, రాజ్కుమార్, రైతులు తదితరులున్నారు. -
ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి
జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత జగిత్యాలరూరల్: ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె, ధర్మనాయక్ తండాలో వందశాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా బీఎల్వోలు స్వప్న, శ్యామల, ఆదిలక్ష్మీని సన్మానించారు. బీఎల్వోలు అంగన్వాడీ బాధ్యతలు, ఎస్ఐఆర్ ప్రక్రియను బాధ్యతతో పూర్తి చేయడం అభినందనీయమన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, ప్యాక్స్ మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు సాంబారి గంగాధర్, ఉపేందర్, వోడ్నాల జగన్, మహిపాల్, జలందర్, ఆనంద్రెడ్డి, శ్రీనివాస్, రాజేశ్వర్రెడ్డి, సుమన్ పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయండి
జగిత్యాలటౌన్: ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి సీఎంకు లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని, అనంతరం ఏటా లక్ష ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రాధాన్యతాక్రమంలో క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖలో తొలగించిన కంప్యూటర్ ఆపరేటర్లను విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం ఒక్కరికీ అమలు చేయలేదని, వెంటనే యువతను ఆదుకోవాలని లేఖలో కోరారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంరాయికల్: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి అన్నారు. మంగళవారం రాయికల్ మండలం అల్లీపూర్ రైతు వేదికలో 100 ఎపిసోడ్స్ వరకు హాజరైన బండారి వెంకటేశ్, ఏఈవో రమ్య, పూడూరి రాజేశ్ను సన్మానించారు. ఈ సీజన్లో వర్షాలు అనుకూలంగా కురవకపోవడంతో రైతులు ప్రభుత్వం ప్రకటించిన పంటలు పండించాలని కోరారు. బబ్బర్లు, కందులు వంటివి సాగు చేయడం ద్వారా అధిక లాభం వస్తుందన్నారు. సర్పంచ్ ఎంబారి గౌతమి, జిల్లా అధికారి భాస్కర్, సింగిల్ విండో చైర్మన్ రాజలింగం, ఏవో ముక్తేశ్వర్, పశువైద్యాధికారి నరేశ్, ఏఈవోలు రమ్య,సౌందర్య, స్రవంతి, నరేశ్, మతయ్య పాల్గొన్నారు. -
క్రీడాప్రాంగణంలో శవం పూడ్చివేత
సైదాపూర్: ఆరెపల్లిలోని తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణంలో మంగళవారం శవాన్ని పూడ్చివేసిన ఘటనతో క్రీడాకారులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన లొల్లేటి భిక్షపతి మృతిచెందగా.. మృతదేహాన్ని ఆరెపల్లి తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణంలోనే పూడ్చేశారని గ్రామస్తులు, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే శ్మశాన వాటిక ఉన్నా.. కాల్చ కుండా ఎదురుగా ఉన్న క్రీడాప్రాంగణంలో పూడ్చేశారు. ఈ ఏడాది వర్షాల్లేక.. చెరువులోకి నీరు రాక మైదానం ఆటలకు అనుకూలమైంది. నెల రోజులుగా ఈ క్రీడాప్రాంగణంలో సైదాపూర్, వెన్కెపల్లి, జాగీర్పల్లి, రాంచంద్రాపూర్, ఎలబోతారం, వెన్నంపల్లి గ్రామాలతోపాటు మానకొండూర్ నియోజకవర్గం నుంచి కూడా క్రీడాకారులు వచ్చి క్రికెట్ టోర్నమెంట్, క్రీడలు నిర్వహించుకున్నారు. మండలంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగణాల్లో ఎక్కడ ఆట స్థలం లేదు. కేవలం ఆరెపల్లి క్రీడాప్రాంగణంలో మాత్రమే మైదానం ఉండడంతో.. మైదానాన్ని చదును చేసుకొని రోజూ క్రీడలు నిర్వహించుకుంటున్నారు. పంచాయతీ అధికారులు, పాలకులు చర్యలు తీసుకొని క్రీడాప్రాంగణాన్ని వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు, క్రీడాకారులు కోరుతున్నారు. -
ప్రత్యేక శిక్షణలో కౌన్సిలర్లు
జగిత్యాల:నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ నిర్వహించారు. ఇందులో జగిత్యాల బల్దియా కార్యవర్గం పాల్గొంది. మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, స్థానిక సంస్థల పరిపాలన, ప్రభుత్వ పథకాల అమలు, మున్సిపల్ సేవల పెరుగుదల, పట్టణ ప్రణాళిక, ఆర్థిక నిర్వహణ అంశాలపై కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. చైర్పర్సన్ సమిండ్ల వాణి మాట్లాడుతూ శిక్షణ ద్వారా ప్రజాప్రతినిధుల సామర్థ్యాలు మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు తోడ్పడుతుందన్నారు. -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ ఈవీ బస్సు
మెట్పల్లి: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 8 మంది ప్రయాణకులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్టీసీ వరంగల్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు మంగళవారం ఉదయం 3.30 గంటల సమయంలో నిజామాబాద్ నుంచి బయల్దేరింది. ఆ సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం ఐదు గంటలకు మెట్పల్లి సమీపంలోకి రాగానే.. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న షౌకత్ అలీ, పంకజ్, అక్షయ్, నదీమ్, ఖదీర్, రాజు, జుబేర్, ప్రవీణ్ గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం కొందరిని జగిత్యాలకు తరలించారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గాయపడ్డ ప్రయాణికులు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం 8 మంది ప్రయాణికులకు గాయాలు -
రేవంత్ రెడ్డి వచ్చిన్నుంచే కరెంట్ సరిగా ఉండట్లే..!
మెట్పల్లిరూరల్: రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటినుంచే కరెంట్ సరిగ్గా ఉండడంలేదు.. ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మెట్పల్లి మండలంలోని వెల్లుల సర్పంచ్ తిరుపతి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గ్రామాల అభివృద్ధిపై మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పలు శాఖల అధికారులు వారివారి శాఖలపై వివరించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ సర్పంచ్ తిరుపతి కరెంట్ సమస్యపై వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంట్ సమస్య ఉందని, గ్రామాల్లో స్తంభాలు వేయడం లేదని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలను గమనించిన ఆర్డీవో నర్సింహారావు కల్పించుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఆర్డీవో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని, సమస్యలుంటే త్వరగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ నీత, ఎంపీడీవో మహేందర్, వైద్యాధికారి అంజిత్రెడ్డి, ఏవో దీపిక, పశువైద్యాధికారి అశ్విని, సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఆర్టీవో చలాన్ పేరుతో సైబర్ మోసాలు
● ఓపెన్ చేయొద్దని పోలీసుల సూచన వేములవాడ: సైబర్ మోసాలు రోజుకో తీరున జరుగుతున్నాయి. షాపింగ్పై డిస్కౌంట్లు, బంపర్డ్రా వచ్చిందంటూ ఇన్నాళ్లు మోసాలకు పాల్పడ్డ సైబర్ నేరస్తులు తాజాగా మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందంటూ వాట్సాప్లో ఆర్టీవో పేరట మెసేజ్లు పంపుతున్నారు. ఆ టెక్ట్స్ ఫైల్ను ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతుండడంతో వేములవాడ పట్టణంలో సోమవారం వైరల్గా మారింది. పట్టణానికి చెందిన సురేష్కు ఆదివారం ఈ మెసేజ్ రాగా.. ఓపెన్ చేయడంతో ఖాతాలోని డబ్బులు ఖాళీ అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించిన సురేష్ స్థానికంగా ఉన్న సోషల్మీడియా గ్రూప్లలో ఇలాంటి మెసేజ్ వస్తుందని అలర్ట్ చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930లో ఫిర్యాదు చేయాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు.వ్యాట్సాప్లలో వచ్చే ఆర్టీవో చలాన్ ఇదే -
చైన్స్నాచింగ్కు విఫలయత్నం
● మహిళ కేకలు వేయడంతో పరారైన ఆగంతకుడుబోయినపల్లి(చొప్పదండి): కిరాణ స్టోర్లో ఉన్న మహిళ మెడలోంచి బంగారు చైన్ లాగేందుకు ఓ ఆగంతకుడు యత్నించగా.. మహిళ కేకలు వేయడంతో పరారయ్యాడు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో కొండం విజయ తన కిరాణ దుకాణంలో ఒంటరిగా ఉంది. మొదట హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్పై వచ్చి సిగరెట్ కొనుగోలు చేసి వెళ్లాడు. అనంతరం అదే వ్యక్తి మళ్లీ వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడంతో ఆగంతకుడు పరారయ్యాడు. బాధితురాలు కొండం విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
పిల్లల్లో ఎదుగుదల లోపం
గొల్లపల్లి: జిల్లాలో చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. రేపటితరం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా. క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణలోపం, సిబ్బంది నిర్లక్ష్యం, తల్లిదండ్రుల అవగాహనరాహిత్యం కలిసి చిన్నారులను పోషకాహారలోపం వైపు నెడుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఎదుగుదల లోపంతో.. తక్కువ బరువు, తక్కువ ఎత్తుతో నీరసించిపోతున్నారనే నిజం జిల్లావాసులను కలవరపెడుతోంది. మహిళా, శిశు సంక్షేమశాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎదుగుదల లోపం జిల్లాలోని 2,328 మంది చిన్నారుల్లో ఎదుగుదల లోపం కనిపించింది. వీరిలో 2,075 మంది మధ్యస్థ, 253 మంది తీవ్ర లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే భవిష్యత్తులో శారీరక సామర్థ్యం, మెదడు వికాసం, చదువులో ప్రతిభ దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్కువ బరువు ఎత్తుకు తగిన బరువు లేని చిన్నారులు 2,829 మంది ఉన్నారు. వీరిలో 2,075 మంది మధ్యస్థంగా, 754 మంది తీవ్ర తక్కువ బరువుతో ఉన్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గి పిల్లలు తరచూ రోగాల బారిన పడుతున్నారు. పోషకాహార లోపం మొత్తం 2,343 మంది పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో 2,076 మంది మధ్యస్థ, 253 మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పట్టణాల్లో కన్నా.. మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి, జగిత్యాలరూరల్ మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత. తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన లేకపోవడం, సమతుల్య ఆహారం అందకపోవడం, అంటువ్యాధులు వ్యాపించడం దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. తల్లి గర్భంతో ఉన్నప్పటి నుంచే పోషకాహారం అందించడం ద్వారా సమస్యను కాస్త అదుపులో ఉంచే అవకాశముందంటున్న వైద్యులు. అప్పుడే పుట్టిన బిడ్డకు తొలి ఆరు నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఆరు నెలల తర్వాత నాణ్యమైన అనుబంధ ఆహారం ఇస్తూ, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.జిల్లా వివరాలు అంగన్వాడీ కేంద్రాలు 1,065 ఐదేళ్లలోపు చిన్నారులు 60,958 పరీక్షించిన చిన్నారులు 60,680 ఎత్తుకు తగిన బరువు లేనివారు 2,328 వయసుకు తగ్గ ఎత్తు లేనివారు 2,285 పోషకాహార లోపం ఉన్నవారు 2,343 -
జోరుగా మానేరు రివర్ ఫ్రంట్ పనులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: కరీంనగర్ జిల్లా కేంద్రానికి తలమాణికంగా మారుతుందని చెప్పుకుంటున్న మానేరు రివర్ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) కోసం మరింత భూమి అవసరమైంది. తాజాగా నదికి ఎడమవైపున 8.05 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం రూ.410 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నీటిపారుదల, పర్యాటక శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో రూ.300 కోట్ల వరకు నీటిపారుదల శాఖ భరించగా, మిగిలిన నిధులను పర్యాటకశాఖ వెచ్చించనుంది. గుజరాత్లోని సబర్మతీ నదీ తీరం స్ఫూర్తిగా గత ప్రభుత్వం మానేరు తీరాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టును చేపట్టింది. నదికి రెండు వైపులా కాంక్రీట్ గోడలు నిర్మించి తీరాన్ని రెండువైపులా పర్యాటపరంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో చేపట్టిన మానేరు రివర్ఫ్రంట్ పురోగతి ప్రభుత్వం మారిన కొన్ని నెలల తర్వాత పర్యావరణ, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా నెమ్మదించింది. ఇటీవల ఈ ప్రాజెక్టుకు జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రాధాన్యం ఇవ్వడంతో పనులు తిరిగి వేగం పుంజుకున్నాయి. రూ.40 కోట్ల చెల్లింపునకు సిద్ధం ఎడమవైపు (నగరం వైపు) 8.05 ఎకరాల స్థలం అవసరం అయింది. నదీతీరం వైపు తవ్వేందుకు స్థలం కావాల్సి వచ్చింది. ఈ మేరకు తొలుత అధికారులు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఎంత స్థలం కావాలి అన్న విషయంలో పలు సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో తొలిదశలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు అంతా సిద్ధమైనా.. ఆఖరు నిమిషంలో నోటిఫికేషన్ విడుదల కాకుండా నిలిచిపోయింది. చివరికి రెవెన్యూ డిపార్ట్మెంట్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విషయాన్ని కొలిక్కి తీసుకురావడంతో 8.05 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అలా గే.. ఈ మొత్తం భూమికి యజమానులకు దాదాపు రూ.40 కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా మంత్రులంతా పనులపై ఆరా తీస్తుండటంతో భూసేకరణకు అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. తొలి దశలో 82శాతం పనులు పూర్తి.. మానేరు రివర్ ఫ్రంట్ మొదటి దశలో 3.75 కిలోమీటర్ల వరకు, రెండో దశలో 6.25 కిలో మీటర్ల మేర ఇరువైపులా అభివృద్ధి చేయనున్నారు. మానేర్ రివర్ ఫ్రంట్లో 12 నుంచి 13 అడుగుల లోతు వరకు నీరు నిల్వ ఉంటుంది. స్పీడ్ బోట్లు, క్రూజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ కన్సల్టెన్సీ మానేర్ రివర్ ఫ్రంట్ పనులు చేపడుతోంది. తొలిదశ పనుల్లో ఇప్పటి వరకు 82 శాతం పూర్తయ్యాయి. 3.75 కి.మీ ప్రొటెక్షన్ వాల్లో ఎడమవైపు 3.5 కి.మీ మేర, కుడివైపు 3.25 కి.మీ మేర గోడ నిర్మాణం అయిపోయింది. మరో 250 మీటర్ల మేర పనులు పెండింగ్ ఉన్నాయి. ప్రొటెక్షన్ వాల్స్కు ఇరువైపులా మట్టితో నిర్మించిన కట్ట పనులు కూడా పూర్తయ్యాయి. మొత్తంగా రూ.277 కోట్లను నీటిపారుదల శాఖ పనులకోసం వెచ్చించింది. ఇందులో భాగంగా తీగల వంతెన పక్కన నిర్మించనున్న చెక్ డ్యాం పనులు దాదాపు పూర్తయ్యాయి. వీటికి బిగించేందుకు అధికారులు గేట్లు కూడా తీసుకువచ్చారు. ఈ గేట్లతోనే మానేరు రివర్ఫ్రంట్లో నీటిని నియంత్రించనున్నారు. ఇటీవల కలెక్టర్ చిత్రా మిశ్రా సైతం మానేరు రివర్ ఫ్రంట్ విషయంలో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బ్యూటిఫికేషన్ వర్క్స్, రైలింగ్, గార్డెనింగ్ వంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. ఇరిగేషన్, టూరిజం కార్పొరేషన్, రెవెన్యూ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
నేడు నేరెళ్లకు కల్వకుంట్ల కవిత
● బాధితులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ పరామర్శ ● న్యాయపోరాటానికి అండగా ఆర్థికసాయంసాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నేరెళ్లలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంచలనం రేపిన నేరెళ్ల ఘటన బాధితులను పరామర్శించేందుకు ఆమె వస్తున్నారు. 2017లో పోలీసుల థర్డ్ డిగ్రీలో తీవ్రంగా గాయపడి 9 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు పడి ఇటీవల కన్నుమూసిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను కవిత మంగళవారం ఉదయం 10.30 గంటలకు పరామర్శిస్తారు. కొంతకాలం క్రితం నేరెళ్ల బాధితులు కవితను కలిసి తమ గోడు చెప్పుకోగా వారికి అన్నివిధాల అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వారి న్యాయపోరాటానికి కొంత సాయం అందించారు. నేరెళ్ల దురాగతంలో భాగస్వాములుగా ఉన్న వారికి న్యాయపరంగా శిక్షపడే వరకు బాధితులకు వెన్నంటి ఉంటానని కవిత భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే మంగళవారం ఆమె బాధితుల కుటుంబాలతో మాట్లాడుతారు. ఘటన నేపథ్యం మిడ్ మానేరు రిజర్వాయర్లో ముంపునకు గురయ్యే మానేరునదిలో ఇసుక తవ్వకాలకు 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నేతలు మానేరు నది నుంచి పెద్దఎత్తున ఇసుక తీసి లారీల్లో హైదరాబాద్ తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీలతో సిరిసిల్ల ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. 2017 జూలై 2న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్లకు చెందిన రైతు బదనపు భూమయ్య చనిపోయారు. భూమయ్య మరణంతో భగ్గుమన్న గ్రామస్తులు నేరెళ్లలో ఇసుక లారీలను తగులబెట్టారు. ఈ ఘటనకు బాధ్యులుగా గ్రామానికి చెందిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కరీంనగర్ జైలుకు తరలించిన తర్వాత 8 మంది బాధితుల్లో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పరిశీలనలో థర్డ్ డిగ్రీ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి పోలీసుల చిత్ర హింసల నుంచి బాధితులు ఇప్పటికీ కోలుకోలేదు. నేరెళ్ల బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ ఇటీవల మృతిచెందారు. మరో బాధితుడు పెంట బాణయ్య కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నాడు. మిగతా వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. -
తుపాకుల కలకలం
జగిత్యాలక్రైం: ఇలాంటి ఘటనల్లో తుపాకులే ప్రాధాన్యంగా కనిపిస్తుండడం సంచలనం రేకెత్తిస్తోంది. జిల్లాలో రియల్ ఎస్టేట్, బడా వ్యాపారులతోపాటు కొందరు భూ వివాదాల్లో గన్కల్చర్ ప్రదర్శిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో సంవత్సరానికో తుపాకుల కాల్పుల ఘటనలు పోలీసులకు సవాల్గా మారాయి. తొమ్మిదేళ్లలో ఏడు సంఘటనలు 2017 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఏడు తుపాకుల సంఘటనలు చోటుచేసుకున్నాయి. నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గిన అనంతరం తుపాకులు వెలుగుచూస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చాలామంది బడా వ్యాపారులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, రౌడీషీటర్లు మారణాయుధాలు వాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. మారణాయుధాలు ఉంటే చర్యలు ప్రజలు ఎవరు కూడా మారణాయుధాలు కలిగి ఉండరాదు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. అనుమానితులు కన్పించినా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. పోలీసు శాఖ ప్రజల భద్రతకు నిరంతరం పనిచేస్తుంది. – అశోక్కుమార్, ఎస్పీ -
తక్కువ బరువున్న పిల్లలకు బాలామృతం
అంగన్వాడీ కేంద్రంలో ప్రతినెలా చిన్నారుల బరువు, ఎత్తు కొలిచి నమోదు చేస్తున్నాం. తక్కువ బరువు ఉన్న చిన్నారులను గుర్తించి బాలామృతం ప్లస్ అందిస్తున్నాం. గుడ్లు, పాలు క్రమం తప్పకుండా ఇస్తూ, తల్లి పాల ప్రాధాన్యంపై తల్లులకు అవగాహన కల్పిస్తున్నాం. – రమ, అంగన్వాడీ టీచర్ శ్రీరాములపల్లి కౌన్సెలింగ్, వైద్య సేవలు అందిస్తున్నాం పోషకాహార లోపం ఉన్న పిల్లలకు అదనపు పౌష్టికాహారం ఇస్తున్నాం. వైద్య, ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చికిత్స, కౌన్సెలింగ్ కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు అవగాహన పెంచుకుని పిల్లలకు సరైన ఆహారం అందించాలి. – భాస్కర్, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి -
రైతుబజార్లోనే కూరగాయలు విక్రయించాలి
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని రైతుబజార్లో రైతులెవరూ కూరగాయలు విక్రయించడం లేదు. ప్రధాన రోడ్డుపైనే విక్రయిస్తుండడంతో వాహనదారులు, ఆస్పత్రులకు వచ్చేవారు, వాకర్స్కు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై తరచూ మున్సిపల్ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లడంతో శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రైతుబజార్లోపల గద్దెలు, చెత్తాచెదారం తొలగించారు. పోలీసుల సహకారంతో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు రైతులందరినీ రైతుబజార్ లోపలికి పంపించారు. ఇక నుంచి అక్కడే విక్రయించాలని ఆదేశించారు. పేద విద్యార్థికి ఉచిత ఇంజినీరింగ్ సీటు తిమ్మాపూర్/ముస్తాబాద్: ఆ తల్లి చివరి కోరిక నెరవేరింది. ఆర్థిక ఇబ్బందులతో కొడుకును ఇంజినీరింగ్ చదివించలేకపోతున్నానని ఆ మాతృమూర్తి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కరీంనగర్లోని జ్యోతి ష్మతి కళాశాల యాజమాన్యం స్పందించింది. మానవత్వంతో ఆ తల్లి చివరి కోరికను నెరవేర్చింది. ముస్తాబాద్ మండలం ఆవునూరుకు చెందిన బండి లావణ్య 15 రోజుల క్రితం కొడుకు ఇంజినీరింగ్ చదువుకు ఫీజు చెల్లించలేకపోతున్నానని మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. లావణ్య భర్త రవీందర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ సంఘటనపై సాక్షి ఈనెల 24న ‘చితికి పోతున్నారు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల యజమాని జువ్వాడి సాగర్రా వు స్పందించారు. వికాస్కు జ్యోతిష్మతి కళాశాలలో పూర్తి ఉచిత బీటెక్ ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లపాటు హాస్టల్ వసతి కూడా ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వికాస్.. చైర్మన్ జువ్వాడి సాగర్రావు, సెక్రటరీ జువ్వాడి సుమిత్సాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు బైరి శ్రీనివాస్గౌడ్, ఆశాగౌడ్, సావిత్రి తదితరులు సాగర్రావు, సుమిత్సాయిలకు, సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. -
గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి
గోవులను హతమార్చొద్దు. జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఆవులను రక్షించాలని దేశవ్యాప్తంగా సంతకాలు సేకరిస్తున్నారు. జిల్లా ప్రజల తరఫున ప్రభుత్వానికి విన్నవించండి. – హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి జగిత్యాలరూరల్ మండలం తిమ్మాపూర్ శివారు సర్వే నంబర్ 77/4లో 20గుంటల స్థలాన్ని ఇమ్మడి లచ్చయ్య నుంచి మా తాత మెరుగు దేవయ్య 1989లో కొన్నాడు. పట్టా చేయాలని కోరితే వాయిదా వేస్తూ వచ్చాడు. ఇటీవల ఆ భూమిని ఆయన కుమారుడు ధర్మయ్య పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఆయన మరో వ్యక్తికి విక్రయించి పట్టా చేశాడు. ఆ రిజిస్ట్రేషన్ను రద్దు పరిచి మాకు న్యాయం చేయండి. – మెరుగు ఉమేశ్, తిమ్మాపూర్ -
ఎస్సీ కార్పొరేషన్ రుణసాయంపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు
కోరుట్ల: ఇంటర్వ్యూలు లేకుండా ఎస్సీ కార్పొరేషన్ రుణసాయానికి లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయమై కలెక్టర్ సత్యప్రసాద్ విచారణకు ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఇచ్చే సబ్సిడీ రుణాల ప్రక్రియ తప్పుదారి పట్టిందంటూ కోరుట్లకు చెందిన చిత్తారి శ్రీనివాస్, ఆనంద్, సాయిలు, రమేశ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ‘ఉత్తుత్తి ఇంటర్వ్యూలు’ శీర్షికన ‘సాక్షి’ ఈనెల 21న కథనం ప్రచురించింది. ఈ కథనంతో కొంతమంది దరఖాస్తుదారులు ప్రజావాణిలో అధికారులకు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణసాయం ఇంటర్వ్యూలకు అధికారులెవరూ రాలేదని, కోరుట్ల మున్సిపల్ అటెండర్లు అప్లికేషన్ ఫారాలు తీసుకుని వెళ్లిపోమ్మన్నారని ఆరోపించారు. కేవలం గంటలోపే 58 మందిని ఎలా ఇంటర్వ్యూ చేస్తారని ప్రశ్నించారు. ఇంటర్వ్యూలు లేకుండా కొంతమంది తమకు నచ్చిన వారిని ఎంపిక చేయడం అన్యాయమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎంపిక చేసిన లబ్ధిదారులను రద్దు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టి వాస్తవాలు తేల్చాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు. -
బిల్లులు ఇప్పించండి
మల్లాపూర్ మండలంలోని సాతారం ఉన్నత, రేగుంట జెడ్పీ, ప్రాథమిక పాఠశాలలు, పల్లె దవాఖానా పనులు పూర్తి చేశాం. బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. – రంగు రామాగౌడ్, కాంట్రాక్టర్. రేగుంట రెవెన్యూ భూములు కాపాడండి మా గ్రామం పక్కనే ఉన్న నడికుడను ముంపు గ్రామంగా గుర్తించారు. గ్రామస్తులకు 1976 డి1 పట్టాలు, నక్షాల ప్రకారం భూమి కేటాయించారు. రీసర్వే సందర్భంగా నడికుడ గ్రామస్తులు తప్పుడు డి1 పట్టాలు, తప్పుడు నక్షా ప్రకారం సర్వే చేయాలని అధికారులను బలవంతం చేస్తున్నారు. నడికుడ, రాఘవపేట మధ్య ఉన్న రెవెన్యూ భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. – రాఘవపేట గ్రామస్తులు, మల్లాపూర్ మండలం -
సీ్త్రనిధి రుణాలతో ఆదాయం పెంచుకోవాలి
జగిత్యాల: మహిళా సంఘాల సభ్యులు సీ్త్రనిధి రుణాలతో ఆదాయం పెంచుకోవాలని, ఆ దిశగా సీ్త్రనిధి, సెర్ప్ సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో సీ్త్రనిధి, సెర్ప్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా టార్గెట్ చేరుకోవాలని, బకాయిలు లేకుండా చూడాలని, డిజిటల్ పద్ధతి ద్వారా లావాదేవీలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. మైక్రోఫైనాన్స్ బారిన పడకుండా గ్రామీణ, పట్టణ ప్రాంత రైతులకు అండగా సీ్త్రనిధి సంస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డీఆర్డీవో రఘువరణ్, డీఏవో భాస్కర్, అధికారులు పాల్గొన్నారు. జలసంరక్షణలో భాగస్వామ్యం కావాలిమల్యాల: జలసంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని డీపీవో మదన్ మోహన్, ఎంపీడీవో స్వాతి అన్నారు. మండలకేంద్రంలో జలసిరి కార్యక్రమంపై ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీపీవో మాట్లాడుతూ గ్రామాల్లో నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇంకుడుగుంతలు, బోర్వెల్ రీచార్జ్ పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో ఆమని, ఏపీవో శ్రీనివాస్, ఈజీఎస్ ఈసీ మనోజ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి రఘుమెట్పల్లి: తెలంగాణ రక్షణ సేన కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జిగా డాక్టర్ చిట్నేని రఘును నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో ఉన్న రఘు, పలువురు నాయకులు ఇటీవల కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి టీఆర్ఎస్ తరఫున రఘు పోటీ చేస్తారని కవిత ఇప్పటికే ప్రకటించారు. తాజా గా ఆయనను ఇన్చార్జిగా నియమించడంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడి భార్య ప్రసవంకోరుట్ల: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వై ద్యుడిగా పనిచేస్తున్న ము ఖ్రం తన భార్య సోఫియా కు జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించి ఆదర్శంగా నిలిచారు. తన భార్య ప్రసవానికి సహకరించిన వైద్యులు శైలజ, తిరుమల, సాయి, మహేష్, నరేష్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో పూర్తిస్థాయి ప్రసూతి సౌకర్యాలు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతోనే తాను తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించినట్లు తెలిపారు. తనకు కొడుకు జన్మించినట్లు తెలిపారు. ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలిధర్మపురి: మండలంలోని ఆరెపల్లి, కొల్వాయిలో ఎత్తిపోతల పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరందించాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. సాగునీరు రావడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జైనాలో ఆయన ఏర్పాటు చేయించిన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ గ్రామాల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, నాయకులు అయ్యోరి రాజేశ్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులున్నారు. -
ఎస్ఐఆర్ ముమ్మరం
జగిత్యాల: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఆగస్టు 3 వరకు గడువు ఉన్నప్పటికీ ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్వోలకు వెంటనే అందించాలని అధికారులకు పేర్కొంటున్నారు. గడువు సమీపిస్తున్న కొద్ది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 92.84 శాతం పూర్తయింది. ఇంకా 7.16 శాతం పూర్తి కావాల్సి ఉంది. ఈనెల 24తో ముగియనుండగా.. ఓటర్ల నుంచి స్పందన రాకపోవడంతో ఆగస్టు 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. డిజిటలైజేషన్ మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చకచకగా ముందుకెళ్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లో 90 శాతానికి పైగానే పూర్తయింది. ఇప్పటికే రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు ఈ సర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. మొదట కొంత ఇబ్బందులు పడినప్పటికీ తర్వాత నెమ్మది నెమ్మదిగా పుంజుకుంది. కొన్ని చోట్ల 100 శాతం పూర్తి కావాలన్న ఉద్దేశంతో ఎన్యుమరేషన్ ఫారాలు నింపినా, నింపకున్నా ఇచ్చేశారు. దీంతో పని మళ్లీ మొదటికొచ్చింది. అధికారులు ఇలా అయితే ఓటు ఉండదని, కచ్చితంగా ఫారం నింపి ఇవ్వాలని పేర్కొనడంతో తెలియని వారు తెలిసిన వారి వద్దకు వెళ్లి మరీ నింపి ఇచ్చేందుకు ఆసక్తి చూపారు. అంతేకాక మండలాల్లో అక్కడక్కడ అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేసి కొంత మంది నింపి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. వలస ఓటర్లు సైతం వారి పేర్లు నమోదు చేసుకున్నారు. సుదూర ప్రాంతంలో ఉన్న వారు కొందరు మాత్రం రాకపోవడంతో అక్కడే ఓటరు నమోదు చేసుకున్న వారు ఉన్నారు. గ్రామాల్లోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ వందశాతం చేరే అవకాశాలు ఉన్నాయి. పట్టణాల్లోనే ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. అత్యధిక మంది ఉండటం, ఒక వార్డులో ఉన్న వారివి మరో వార్డులో ఉండటంతో వారు ఎక్కడ ఫాం ఇవ్వాలో తెలియడం లేదు. కొంతమందికి ఇప్పటి వరకు ఫారాలు అందలేదు. వారు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గడువు మళ్లీ పెంచే అవకాశాలు లేవని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు ప్రతి ఓటరును కలుస్తూ ఓటరు నమోదు చేసుకోవాలని పేర్కొంటున్నారు. పట్టణాల్లో వందశాతం నమోదయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
జీవన్రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం
జగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్: మొన్న కేసీఆర్ను తిట్టి నేడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జీవన్రెడ్డి తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. బోర్నపల్లి, జగన్నాథపూర్ బ్రిడ్జి విషయంలో మంత్రి లక్ష్మణ్కుమార్ను కలిసి వినతిపత్రం ఇస్తే జీవన్రెడ్డికి ఏం బాధ అన్నారు. 2012లోనే బోర్నపల్లి బ్రిడ్జికి రూ.కోటి మంజూరయ్యాయని చెప్పిన ఆయన.. ఆ నిధులు ఏమయ్యా యో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వాణి పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు వరి సాగు చేయొద్దని తెలిపారు. పొలాస రైతు వేదికలో విత్తనమేళా నిర్వహించారు. తక్కువ కా లంలో చేతికొచ్చే పంటలు సాగు చేయాలన్నారు. -
అధైర్య పడకండి.. అండగా ఉంటా..
మల్యాల: తల్లి మరణంతో దిక్కుతోచని స్థితిలో పడిన మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నలుగురు ఆడపిల్లలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అండగా నిలిచారు. ఇప్పటికే ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన ఆయన.. సోమవారం ఇద్దరు చిన్నారులను గురుకులం పాఠశాలలో చేర్పించారు. తక్కళ్లపల్లికి చెందిన బూత్కూరి శారద, కనకయ్యకు కృష్ణవేణి, త్రివేణి, నీలవేని, మాహాన్విత కూతుళ్లు. కనకయ్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లివస్తున్నాడు. తల్లి శారద కూలీగా పనిచేస్తూ కూతుళ్లను చదివిస్తున్నాడరు. కృష్ణవేణి హైదరాబాద్లో బీటెక్ రెండో సంవత్సరం, త్రివేణి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో బీటెక్ మొదటి సంవత్సరం, నీలవేని తక్కళ్లపల్లి జెడ్పీ పాఠశాలలో పదో తరగతి, మహాన్విత ఏడో తరగతి చదువుతోంది. శారద అనారోగ్యంతో ఇటీవల చనిపోగా.. వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి రూ.20వేలు అందించారు. ఇద్దరిని గురుకులంలో చేర్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్తో మాట్లాడి గురుకులంలో సీట్లు కేటాయించేలా చూశారు. సోమవారం తక్కళ్లపల్లికి వెళ్లి నలుగురు పిల్లలకు నూతన వస్త్రాలు అందించారు. నీలవేణి, మహాన్వితను తన వాహనంలో తాటిపల్లి బాలికల గురుకులానికి తీసుకెళ్లి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయించారు. నలుగురు ఆడపిల్లల చదువు, భవిష్యత్కు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అలాగే గురుకులం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రిన్సిపాల్ మానస, తాటిపల్లి సర్పంచ్ మెట్పల్లి లత, తక్కళ్లపల్లి మాజీ సర్పంచ్ మరాటి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు దొంగ ఆనంద రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెవుల మద్ది శ్రీనివాస్, ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, నేరెళ్ల సతీశ్ రెడ్డి, పాల్గొన్నారు. -
‘సర్దుబాటు’లో ఇష్టారాజ్యం
జగిత్యాల: జిల్లాలో ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ఇష్టారాజ్యంగా మారాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడైతే సబ్జెక్ట్ టీచర్లు లేరో అక్కడ నియమిస్తూ.. సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో నిబంధనలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా సర్దుబాటు చేపట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు సిఫారసుల ఆధారంగా పలు పాఠశాలల్లో సర్దుబాట్లు జరిగినట్లు ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అవసరమైన పాఠశాలకు ఉపాధ్యాయులను పంపకుండా అనుకూల ప్రాంతాలకు సర్దుబాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు ఉపాధ్యాయులను సమీప ప్రాంతాలకు తీసుకురాగా.. మరికొందరిని నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ దూరంలో ఉన్న పాఠశాలలకు పంపించినట్లు సమాచారం. జిల్లాలో చాలా పాఠశాలల్లో అవసరానికి మించిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఏ ప్రతిపాదికన ఉపాధ్యాయులను ఎంపిక చేశారు..? ఏ పాఠశాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి టీచర్ల సర్దుబాటును పారదర్శకంగా చేపట్టాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు. -
ఎరువుల బ్లాక్ మార్కెట్ను అరికట్టండి
యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. డీఏపీ ధర రూ. 1350ఉంటే డీలర్లు రూ.1950కి విక్రయిస్తున్నారు. ఎల్నినోతో రైతులు ఇబ్బంది పడుతుంటే కొందరు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. – జెడ్పీ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు దావ వసంత, భోగ శ్రావణి అర్హులకు న్యాయం చేయండి మెట్లచిట్టాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో టీజీటీ, పీజీటీ అతిధి పోస్టుల నియామకాలను రద్దు చేసి, అవకతవకలకు పాల్పడిన ఆర్సివో, డీసీవోలపై చర్యలు తీసుకోండి. గెస్ట్ టీచర్ పోస్టులకు జూలై 8న డెమో నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు చిట్టాపూర్ గురుకులంలోని టీజీటీ మ్యాథ్స్, పీజీటీ మ్యాథ్స్ పోస్టులకు ఎలాంటి ప్రకటనా చేయకుండానే నియమించారు. వాటిని రద్దు చేసి అర్హులకు న్యాయం చేయండి. – సుంకెట విజయ్, మెట్పల్లి -
మోటార్లకు మరమ్మతు చేపట్టండి
జగిత్యాలరూరల్: బీర్పూర్ మండలం కొల్వాయిలో ని ఎత్తిపోతల మోటార్లకు మరమ్మతు చేపట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. కొల్వాయిలోని ఎత్తిపోతల పథకాన్ని సోమవారం పరిశీలించారు. మోటార్లు కాలి నీటి సరఫరా కావడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఇరిగేషన్ ఎస్ఈ, డీఈతో ఫోన్లో మాట్లాడారు. ఏడాది కాలంగా మరమ్మతు చేయక పోవడం అధికారుల నిర్లక్ష్యమన్నారు. నీరు ఉండి పంటలు పండించుకోలేని దుస్థితి రాకుండా చూడాలని కోరారు. ఈనెల 31లోగా కమ్మునూర్, మంగేళ పంపుసెట్ల ద్వారా నీరు అందించాలన్నారు. -
ఇక రేషన్ స్మార్ట్కార్డ్
గొల్లపల్లి: ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త పద్ధతికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న కాగితపు లామినేషన్ రేషన్కార్డుల స్థానంలో అత్యంత ఆధునికమైన, ఆకర్షణీయమైన పీవీసీ స్మార్ట్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాకు కేటాయించిన కార్డులన్నీ ఇప్పటికే చేరుకోవడంతో పౌర సరఫరాల శాఖ యంత్రాంగం పంపిణీకి సంబంధించి ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. చెరగవు.. చిరిగిపోవు ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 3.53లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త స్మార్ట్కార్డులు జారీ చేయనున్నారు. ఇవి ఏటీఎంకార్డుల తరహాలోనే ధృడంగా ఉండటంతోపాటు సుదీర్ఘకాలం మన్నికగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కార్డుల్లో లబ్ధిదారుడి పూర్తి సమాచారం, కుటుంబ సభ్యుల వివరాలు, ప్రత్యేక గుర్తింపు సంఖ్యను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తారు. కార్డు నీటిలో తడిచినా.. ఎంతకాలం వాడినా వివరాలు చెరిగిపోవడం లేదా కార్డు చిరిగిపోవడం వంటి సమస్య ఉండదు. బహుళ ప్రయోజనాలు ఈ స్మార్ట్ కార్డు కేవలం నెలానెలా బియ్యం, సరుకులు తీసుకోవడానికి మాత్రమే పరిమితం కాదని అంటున్నారు అధికారులు. భవిష్యత్తులో ప్రభుత్వం అమలు చేసే వివిధ రకాల సంక్షేమ పథకాలకు ఈ కార్డునే ప్రామాణికంగా ఉపయోగించనున్నారు. కుటుంబ వివరాల ధ్రువీకరణతో పాటు ప్రభుత్వ సేవలను వేగంగా పొందడానికి ఈ కార్డు సహాయపడనుంది. పంపిణీకి ఏర్పాట్లు పూర్తి జిల్లాకు ఇప్పటికే 2.80లక్షల స్మార్ట్కార్డులు చేరుకున్నాయి. వాటిని పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాగానే నియోజకవర్గాలు, మండలాల వారీగా రేషన్ దుకాణాలు లేదా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు వీటిని అందజేస్తారు. రేషన్ దుకాణాలు 595 కొత్తకార్డులు 45,103 పాత కార్డులు 3,07,897 లబ్ధిదారులు 9,99,109 ప్రతినెలా బియ్యం పంపిణీ 6300 టన్నులు స్మార్ట్ కార్డుల రాకతో పీడీఎస్ వ్యవస్థలో అక్రమాలకు శాశ్వతంగా తెరపడనుంది. బోగస్ కార్డులకు అడ్డుకట్ట పడనుంది. డిజిటల్ వివరాల ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు సులభతరం కానుంది. డూప్లికేట్, బోగస్కార్డులను సులభంగా ఏరిపారేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి లబ్ధిదారుల సమగ్ర వివరాల నిర్వహణ మరింత సులభంగా, వేగవంతంగా మారనుంది. జిల్లాకు అవసరమైన స్మార్ట్రేషన్ కార్డులు ఇప్పటికే చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు అందిన వెంటనే మండలాల వారీగా, పారదర్శకంగా పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తాం. మన్నికగా ఉండే ఈ కొత్త కార్డులు భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందేందుకు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయి. – జితేందర్ రెడ్డి, సివిల్ సప్లై అధికారి -
తొలి సంతకాన్నే మర్చిపోయిన మంత్రి అడ్లూరి
రాయికల్: మండలంలోని బోర్నపల్లి – జగన్నాథ్పూర్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి హోదాలో మొదటి సంతకం చేశారని, రూ.17.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా.. ఆ పనులు ఎంతవరకు వచ్చాయో చెప్పాలని మాజీమంత్రి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. రాయికల్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏడాది క్రితం రూ.17.50 కోట్లు మంజూరు చేస్తూ అప్పటి సెక్రటరీ శరత్ చేతుల మీదుగా ఉత్తర్వులు జారీ చేయించారని, తాజాగా అదే బ్రిడ్జి నిర్మాణం కోసం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మళ్లీ మంత్రిని కలవడం.. ఆయన సానుకూలంగా స్పందించడమేంటని ఎద్దేవా చేశారు. సీఎం చెప్పినట్లు నడుచుకునేందుకే అడ్లూరి మంత్రి అయ్యారని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలియకుంటే ఎలా అని హెచ్చరించారు. రాయికల్ – మైతాపూర్, రాయికల్ – రామాజీపేట మధ్య బ్రిడ్జి రోడ్డు పనులు పూర్తి కాలేదని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుబొమ్మల నుంచి కుమ్మరిపల్లి వరకు, ఇటిక్యాల నుంచి కాలేజీ వరకు బీటీ రోడ్డు మంజూరైనా నేటికీ పనులు ప్రారంభం కావడం లేదని, వాటిపై దృష్టి సాధించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, కౌన్సిలర్ రాకేష్ నాయక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అనిల్, కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్రెడ్డి, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్ యాదవ్, మండల నాయకులు గోపి రాజరెడ్డి, చింతలపెల్లి గంగారెడ్డి, హరీశ్రావు, మండ రమేశ్, షంషీర్, నాగరాజు పాల్గొన్నారు. -
పోలీస్పై పొలిటికల్ పడగ
కోరుట్ల: ఖద్దరు నేతల వ్యవహారం ఖాకీలకు శాపంగా పరిణమిస్తోంది. పోస్టింగ్ల కోసం నేతలను పోలీసులు ఆశ్రయించడం సహజం. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ నేతను ఆశ్రయించి పోస్టింగ్ పొందితే మరో నేతకు కంటగింపుగా మారే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కీలక నేతల మధ్య విభేదాలు పోలీసులను కొన్ని సందర్భాల్లో ఇరకాటంలో పడేస్తున్న వైనం కలవరం రేపుతోంది. కొంతకాలంగా జిల్లాలో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపించడం గమనార్హం. రెండు రోజుల క్రితం ఓ ఎస్సై సస్పెన్షన్ వ్యవహారంలోనూ ఈ తీరు కనిపించిందన్న చర్చ పోలీసువర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం. నేతల తఖరారు.. జిల్లాలో ఏడాదిన్నర కాలంగా నేతల మధ్య విభేదాలు పోలీసుల పోస్టింగ్లు, పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏడాదిన్నర క్రితం జిల్లా కేంద్రంలో ఓ డీఎస్పీ విషయంలో అప్పుడు అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య తీవ్ర విబేధాలు వచ్చాయి. ఆ సమయంలో జగిత్యాల డీఎస్పీ ఒకరు బదిలీ కాగా.. ఇటీవల పార్టీ మారిన అప్పటి అధికార పార్టీ నేత తీవ్రంగా పరిగణించి ఆ పోస్టింగ్ను రద్దు చేయించారు. కొత్తగా వచ్చిన డీఎస్పీ కేవలం ఒక్కరోజు మాత్రమే జిల్లా కేంద్రంలో పనిచేశారు. ఆ తరువాత పాత డీఎస్పీ యథాస్థానంలోకి వచ్చి విధులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సదరు నేతల మధ్య విబేధాలతో కొంతమంది సీఐలు, ఎస్సైలు ఇదే రీతిలో పోస్టింగ్ సమస్యలతో అవస్థలు పడ్డారు. ప్రస్తుతం ఓ కీలక నేత పార్టీ మారడంతో పరిస్థితి ఎంతో కొంత సద్దమణిగినట్లు కనిపిస్తోంది. ఇదే రీతిలో జిల్లాలోని నిజామాబాద్ సరిహద్దు ప్రాంతంలోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిలీ అయ్యారు. ఇలాగే మరికొన్ని సర్కిళ్లలోనూ ఆయా ప్రాంతాల కీలక నేతలకు నచ్చని పోలీసు అధికారులు తక్కువ కాలం పనిచేసి పోస్టింగ్లు వదులుకుని వెళ్లిపోయారు. పనితీరుపై ఒత్తిళ్లు జిల్లాలో కీలకంగా ఉన్న జగిత్యాల, జగిత్యాల రూరల్, టౌన్, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ఇబ్రహీంపట్నం, మల్యాల వంటి పోలీస్స్టేషన్ల పోస్టింగ్ల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నాయి. ఆయా ఠాణాల్లో క్రైం రేట్ అధికంగా ఉండటంతో పాటు నేర సంఘటనలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నేతలకు చెందిన నియోజకవర్గ కీలక నేతలతో పోస్టింగ్లు పొందినప్పటికీ ఆయా పోస్టింగ్లను కాపాడుకోవడంపైనే దృష్టి సారించేసరికి నేరాల నియంత్రణపై పట్టు జారిపోతోంది. దీనికి తోడు కీలక నేతల అనుయాయుల ఒత్తిళ్లు.. ఠాణాల్లో ఎక్కువ సంఖ్యలో వచ్చే ఫిర్యాదులు.. తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బంది ఫలితంగా వాటి పరిష్కారం చేసే దిశలో ఎదురయ్యే సమస్యల మధ్య పోలీసులు కొంతమేర తప్పటడుగులు వేయాల్సిన దుస్థితి నెలకొంది. వీటి ఫలితంగానే ఇటీవల కాలంలో రౌడీషీటర్లు, నిందితులపై నిఘా తగ్గిపోయి కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల కీలక సర్కిళ్లలో హత్య సంఘటనలు, చోరీలు, దొంగతనాలు పెరుగుతుండటం గమనార్హం. -
భూ వివాదాలతో రావొద్దు..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కలెక్టర్.. పోలీసు విభాగానికి మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. భూ సమస్యలకు సంబంధించిన ఎలాంటి వివాదాలూ తమ వద్దకు తీసుకురావద్దని జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎదుట పోలీసులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ బోర్డులు గమనించకుండా వెళ్లిన వారికి ప్రజావాణి లేదా రెవెన్యూ విభాగానికి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో చేసేది లేక బాధితులు ప్రజావాణి బాట పడుతున్నారు. వాస్తవానికి కోర్టు పరిధిలో ఉన్న అంశాలు, ఆస్తి పంపకాలు, అద్దె గొడవలు, సివిల్ వివాదాల విషయాల్లో పోలీసులు కలగజేసుకోరు. కానీ.. ఈ వివాదాల నేపథ్యంలో ఏవైనా గొడవలు, కొట్లాటలు, ఇతర హింసాత్మక చర్యలు తలెత్తితే మాత్రం వారి జోక్యం అనివార్యం. ఇటీవల పెద్దపల్లి డీసీపీ కూడా ఎలాంటి భూవివాదాల్లోనూ పోలీసులు జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఠాణాల ఎదుట ఈ బోర్డులు వెలిశాయి. నాటి వివాదమే కారణమా..? ఇటీవల రెవెన్యూ, పోలీసు శాఖలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు పోలీసులు దారి తప్పుతున్నారని, ఎవరు ఏమేం చేస్తున్నారో తనకు అంతా తెలుసని, ప్రతీ ఒక్క పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డిపార్ట్మెంట్ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ పోలీస్ శాఖకు నేరుగా హెచ్చరికలు జారీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్ హెచ్చరికలను డిపార్ట్మెంట్లోని కొందరు స్వాగతించగా.. మరికొందరు విభేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మెజారిటీ పోలీసులు కలెక్టర్ తీరుపై అసంతప్తిగానే ఉన్నా.. బయటకు వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖలో రెవెన్యూ విభాగానికి చెందిన భూ సమస్యల ఫిర్యాదులు తీసుకోకూడదంటూ పెద్దపల్లి డీసీపీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామే తప్ప.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బోర్డులు ఏర్పాటు చేయలేదని పోలీసులు అధికారులు స్పష్టంచేస్తున్నారు. పోలీసు శిక్షణకు పరస్పర దూరం రెవెన్యూ, పోలీసు విభాగాల మధ్య దూరం లేదని పైకి చెబుతున్నా.. వారి చర్యలు మాత్రం మరోలా కనిపిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో పోలీసు ఉద్యోగార్థుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించారు. గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు కనిపించలేదు. అదే పెద్దపల్లిలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పోలీసు విభాగం నుంచి ఎవరూ పాల్గొనలేదు. ఈ రెండు కార్యక్రమాల్లో సంబంధిత విభాగాలు పాల్గొనలేకపోవడానికి కారణం సమాచార లోపమా..? లేక రెండు విభాగాల మధ్య పెరుగుతున్న దూరమా..? అనే విషయంపై ఎవరూ స్పష్టతనివ్వడం లేదు. మొత్తానికి రెండు విభాగాల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందని జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో మాత్రం చర్చ మొదలైంది. -
ఎస్ఐఆర్లో పాల్గొనేలా చూడాలి
మల్లాపూర్: అర్హులైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్లో వివరాలు అందించేలా చూడాలని సహకార కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ ఆగస్టు 3తో ముగుస్తుందని, అప్పటివరకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య, నాయకులు సిరిపురం రవీందర్, కోటగిరి ఆనంద్గౌడ్, మరిపెల్లి మల్లయ్య, గొట్టిపడత రమేష్, ఎర్ర భూమయ్య, బోదాసు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోరుట్లలో ఉద్యోగుల బైక్ ర్యాలీకోరుట్ల: సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని కోరుతూ టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్తో అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న జనజాగరణ యాత్ర ఆదివారం కోరుట్లకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాద్యాయులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొత్త పెన్షన్ విధానాన్ని దర్దు చేసి పాత విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరమణ సమయం పెరుగుతున్నప్పటికీ పెన్షన్ భద్రత లేకపోవటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు సాయిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు మ్యాన పవన్, గడ్డం వెంకటేశ్, అంజన్న, చంద్రకాంత్, జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేశ్, కోకిల కృష్ణ, రాజు పాల్గొన్నారు. వాగ్దేవి పురస్కారానికి మహేశ్వర శర్మ రాయికల్: జాతీయ వాగ్దేవి పురస్కార్ అవార్డుకు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నంత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు చెరుకు మహేశ్వర శర్మ ఎంపికై నట్లు జాతీయ తెలుగు సారసత్వ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేశిరాజు రాంప్రసాద్ తెలిపారు. మహేశ్వరశర్మ తెలుగు సాహిత్యంలో చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 28న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రుల చేతులమీదుగా అవార్డు అందుకోనున్నారు. -
● పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి ● రక్షిత మంచినీటినే తాగాలి ● డీఎంహెచ్వో సుజాత
పొరండ్లలో అదుపులోకొచ్చిన జ్వరాలుజగిత్యాల రూరల్: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై దృష్టిసారిస్తే వ్యాధులను అరికట్టవచ్చని డీఎంహెచ్వో సుజాత అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొరండ్లలో విష జ్వరాలతో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెల్సిందే. దీంతో ఆదివారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటా సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విషజ్వరాలు వ్యాపించకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వర్షకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి బావిలో క్లోరినేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరాలు వస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులకు అవసరమైన మందులు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు అర్చన, నరేంద్ర, రాజేందర్, మండల వైద్యాధికారి సౌజన్య, సర్పంచ్ నక్క హరీశ్, ఉప సర్పంచ్ ముద్దం మల్లేశం గౌడ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య పాల్గొన్నారు. వ్యాధులు ప్రబలకుండా చూడండి గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. పొరండ్లలో విషజ్వరాలతో మరణించిన చిన్నారుల కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. జగిత్యాల మాతాశిశు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సందర్శించారు. విషజ్వరాలతో మరణించిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని కోరారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, నాయకులు రాధాకిషన్రావు, శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి, శేఖర్, సతీశ్, రాము, విష్ణు పాల్గొన్నారు. ముందస్తు చర్యలు చేపట్టాలి విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. పొరండ్లలో ఇటీవల ఇద్దరు చిన్నారులు విషజ్వరంతో మృతి చెందగా.. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, నాయకులు గంగారెడ్డి, మహేశ్, లింగన్న, బాలు, శ్రీను, రాము, పవన్ పాల్గొన్నారు. చిన్నారులకు వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు బాధితులకు మందులు అందిస్తున్న సిబ్బంది -
కోటి తులసీదళార్చన
మల్యాల: తొలి ఏకాదశిని పురస్కరించుకుని మండలంలోని లంబాడిపల్లిలోగల శ్రీపద్మావతిసమేత ప్రసన్నవేంకటేశ్వర స్వామివారికి శనివారం కోటి తులసీదళార్చన నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి, పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మరాటి సత్తయ్య, సర్పంచ్ మరాటి సంధ్య, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కోరుట్ల: పింఛన్ డబ్బులు అందుకుని.. ఇప్పటికే చనిపోయిన, ఆచూకీ లేనివారి ఖాతాల్లో ఏకంగా రూ.20 కోట్లు వారివారి బ్యాంకు ఖాతాల్లో ఏళ్లతరబడిగా మూలుగుతున్న తీరు విస్మయం కలిగిస్తోంది. జిల్లాలోని ఐదు బల్దియాల్లో సుమారు 58వేల మంది పింఛన్ పొందుతున్నారు. రెండు నెలల క్రితం పింఛన్దారుల ముఖ చిత్రీకరణ కార్యక్రమం కొనసాగింది. ఇది జూన్ 22న ముగిసింది. పింఛన్దారుల్లో ఎంతమంది అర్హులు..? ఎంతమంది అనర్హులు..? ఎంతమంది చనిపోయారు..? ఆచూకీ లేని వారు ఎందరు..? అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈలెక్కన ఐదు మున్సిపాలిటీల్లో కలిపి సుమారు రూ.20 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. -
ఆర్నెళ్లలో అక్కపల్లి ఎత్తిపోతల పూర్తి
ధర్మపురి: పెండింగ్లో ఉన్న అక్కపల్లి రిజర్వాయర్ ఎత్తిపోతల పనులను ఆర్నెళ్లలో పూర్తి చేయాలని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధికారులను ఆదేశించారు. అక్కపల్లితోపాటు నక్కలపేట ఎత్తిపోతల ద్వారా రైతులకు సాగునీరు అందించడానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. వెల్గటూర్ మండలంలోని జంగల్నాలా ప్రాజెక్టు పనులు, బీర్పూర్లోని రోళ్లవాగు గేట్ల పనుల పూర్తిపై హైదరాబాద్లో నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 15వరకు రోళ్లవాగుకు గేట్లు బిగించాలని ఆదేశించారు. గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి చెరువు పూడిక తీత పనులకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. -
నిందితులకు శిక్షపడేవరకూ పోరాటం
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం చింతలపేటకు చెందిన మహిళను హత్య చేసిన నిందితులకు జీవితఖైదు పడే వరకూ పోరాడుతామని స్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. చింతలపేటలో హత్యకు గురైన కర్రె సునీత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. ఇలాంటి పరువు హత్యలు సరికావన్నారు. ప్రభుత్వం నుంచి తక్షణసాయంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు, అవసరమైన పథకాలు అందేలా మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. బాధితురాలి ఇద్దరు కుమారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కేసు దర్యాప్తు, పురోగతిపై పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఎస్పీ అశోక్కుమార్, అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో నరసింహారావు, డీఎస్పీ రాములు, సీఐ సురేశ్బాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీణ్, నీలాదేవి, రాంబాబు, శంకర్, ఎస్పీ వెల్ఫేర్ అధికారి రాజుకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్, తహసీల్దార్ నీత పాల్గొన్నారు. ఎస్సైపై సస్పెన్షన్ ఎత్తేయాలి కోరుట్ల: కోరుట్ల ఎస్సై చిరంజీవిపై సస్పెన్షన్ ఎత్తేయాలని కోరుట్ల దళిత సంఘాల నాయకులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు. చింతలపేటకు వెళ్తున్న ఆయన పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దళిత సంఘాల నాయకులు ఉయ్యాల నర్సయ్య, బలిజ రాజిరెడ్డి, పేట బాస్కర్, చెట్పల్లి లక్ష్మణ్, పసుల కృష్ణ ప్రసాద్, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, రాజశేఖర్, వుయ్యల శోభన్, రాజేశం, సామల్ల వేణు, సత్యం, నారాయణ చైర్మన్ను శాలువాతో సన్మానించారు. కర్రె సునీతపై మొదటిసారి దాడి జరిగిన సమయంలో బాఽధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని, ఆమెను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనపై విచారణ చేపట్టకుండానే ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని పేర్కొన్నారు. -
కొండగట్టులో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పూజలు
మల్యాల: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారిని శనివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత పుష్పగుచ్ఛం అందించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వెంకటయ్య మాట్లాడుతూ ఆంజనేయస్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సంమృద్ధిగా కురవాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఈవో అంజనారెడ్డి, డీఎస్పీ రాములు, ఎస్సీ, ఎస్టీ, కమిషన్ సభ్యులు ప్ర వీణ్, నీలాదేవి, రాంబాబు, శంకర్, ఎస్సీ సంక్షేమాధికారి రాజ్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ తిరుపతి, అర్చకులు పాల్గొన్నారు. నేరాలు తగ్గించాలిజగిత్యాలక్రైం: నేరాలు నియంత్రించాలని బాసర జోన్ డీఐజీ భాస్కరన్ అన్నారు. జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. ముందుగా జగిత్యాల పోలీస్ గెస్ట్హౌస్కు చేరుకోగానే ఎస్పీ అశోక్కుమార్ స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ కార్యాలయంలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ చర్యలు, భద్రత, సాంకేతిక పరిజ్ఞాన అంశాలపై సమీక్షించారు. జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్ను సందర్శించి స్టేషన్ రికార్డులు, ఎఫ్ఐఆర్లు, కేస్డైరీలు, సీసీటీఎన్ఎస్ నమోదు, స్టేషన్ పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవల తీరును పరిశీలించారు. ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. స్పెషల్బ్రాంచ్ ఐటీకోర్, డిస్ట్రిక్ట్ క్రైం రిపోర్ట్, బ్యూరో, డీసీఆర్బీ కార్యాలయాలను పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్, రాజు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిఇబ్రహీంపట్నం: వర్షకాలంలో వచ్చే వ్యాధులపై అందరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో సుజాత వైద్య సిబ్బందికి సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. మలేరియా, డెంగీ, చికున్గున్యా, పైలేరియా వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కూలర్లు, టైర్లు, కొబ్బరిచిప్పలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని తెలిపారు. వారంలో ఒకసారి డ్రైడే పాటించాలని సూచించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి నరేంద్ర, వైద్యాధికారులు హరీశ్, వనజ, సిబ్బంది పాల్గొన్నారు. పారిశుధ్యం మెరుగుపర్చాలిజగిత్యాలరూరల్: పారిశుధ్యం మెరుగపర్చాలని డీపీవో మదన్మోహన్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొరండ్లలో ఇటీవల ఇద్దరు చిన్నారులు విషజ్వరాలతో మృతిచెందగా.. శనివారం గ్రామాన్ని సందర్శించారు. ప్రధానవీధులను పరిశీలించారు. రక్షిత మంచి నీటి సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడారు. సర్పంచ్ నక్క హరీశ్, ఎంపీవో రవిబాబు, ఉపసర్పంచ్ మల్లేశం పాల్గొన్నారు. జలసిరిపై అవగాహనపెగడపల్లి: జలసిరిపై గ్రామీణుల్లో అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఐకేపీ, వీవోఏలు, వీబీ జీరాంజీ సిబ్బందికి అవగాహ న కల్పించారు. నీటి వనరులను పెంపొందించడం, భావితరాలకు నీటి భద్రత కల్పించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఇంటికో ఇంకుడుగుంత, గ్రామానికి ఒకటి రెండు చొప్పున నీటి కుంటలు, పాంపాండ్లు తవ్వించాల్సిన అవసరముందన్నారు. -
కాంగ్రెస్ క్యాండిల్లైట్ ర్యాలీ
జగిత్యాలటౌన్: కేంద్రమంత్రి రాజీనామా వెనుక విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో శనివారం పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నెల రోజులుగా కొనసాగిస్తున్న ఆందోళనలకు పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. టీపీసీసీ సెక్రెటరీ బండ శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, సేవాదళ్ కార్యదర్శి ముఖేష్ఖన్నా, ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మరిది వేసిన మాస్టర్ప్లాన్! కథ అడ్డం తిరిగింది..
కరీంనగర్, జగిత్యాల: వదినను చంపి ఆస్తి దక్కించుకోవాలన్న పథకాన్ని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రణాళిక రచించిన మరిది, అతని భార్య, సమీప బంధువులను ఇప్పటికే రిమాండ్కు తరలించగా.. తాజాగా మరో నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్వర్మను అరెస్ట్ చేశారు. మెట్పల్లి సర్కిల్ ఆఫీస్లో డీఎస్పీ రాములు శుక్రవారం వివరాలు వెల్లడించారు.జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, రాజం అన్నదమ్ములు. పొత్తుల ఉన్న 58 గుంటల భూమిని శంకర్ తన అన్నకు తెలియకుండా విక్రయించడమే కాకుండా పొత్తులో ఉన్న ఇంటిని సైతం తన పేరిట రిజి స్ట్రేషన్ చేయించుకోవడం ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీసింది. ఈక్రమంలోనే రెండు సార్లు శంకర్ తన అన్నవదినలు రాజం, లక్ష్మిలపై దాడి చేయగా కేసులు నమోదయ్యాయి. ఆస్తిని దక్కించుకునేందుకు తన వదిన గోనెల లక్ష్మిని హత్య చేయాలని భార్య అనూష, బంధువు ముత్తన్నలతో కలిసి పథకం రచించాడు.తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన సచిన్వర్మను సంప్రదించి డబ్బు ఆశ చూపాడు. దీనికి ఒప్పుకున్న సచిన్ గత మార్చిలో ప్రయాగ్రాజ్కు వెళ్లి అపరిచిత సాధువు వద్ద నాటు పిస్టల్, మూడు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. దీని కోసం శంకర్ రూ.35వేలు ఫోన్పే ద్వారా సచిన్కు పంపించాడు. సచిన్వర్మ మెట్పల్లికి తిరిగి వచ్చిన తర్వాత గత నెల 13న లక్ష్మిని చంపడానికి వారి ఇంటికి వెళ్లిన సచిన్ భయాందోళనకు గురై కాల్పులు జరపకుండా వెళ్లిపోయాడు.తిరిగి 15న అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురి ప్రోద్బలంతో సచిన్ బైక్పై వెళ్లి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే గురితప్పడంతో బుల్లెట్ ఎడమ చెంప భాగంలో తగిలింది. కాల్పులతో భారీ శబ్దం రావడం, లక్ష్మి కేకలు వేయడంతో సచిన్ పరారయ్యాడు. ఆ తర్వాత నిందితులు ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.సచిన్ను ఉత్తరప్రదేశ్కు పంపించి కేసులో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి మరుసటి రోజు శంకర్, ముత్తన్న.. 28న అనూషలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేసిన తర్వాత బుల్లెట్ బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఈనెల 20న ప్రయాగ్రాజ్కు వెళ్లి సచిన్ను అదుపులోకి తీసుకొని.. పిస్టల్, రెండు బుల్లెట్స్, బైక్, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ సురేశ్బాబు, ఎస్సై కిరణ్కుమార్, సిబ్బందిని అభినందించారు. -
కేజీబీవీల్లో ‘చెలిమి’
గొల్లపల్లి: కొత్తగా హాస్టల్లో చేరిన విద్యార్థినుల్లో ఇంటిపై బెంగను పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. ‘చెలిమి’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేక కార్యక్రమం చిన్నారుల్లోని మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ వారిలోని అద్భుతమైన సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీస్తోంది. రోజుకు గంట.. 45 రోజుల శిక్షణ జిల్లాలోని 16 కేజీబీవీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో దాదాపు 540 మంది బాలికలు చేరారు. మొదటిసారిగా ఇల్లు వదిలి హాస్టల్ వచ్చిన చిన్నారుల్లో బెరుకును తొలగించి వారిని చదువు వైపు మళ్లించేందుకు జూన్ 20న ‘చెలిమి’కి శ్రీకారం చుట్టారు. రోజు సాయంత్రం 3.30 నుంచి 4.30వరకు గంట పాటు ఆగస్టు రెండోవా రం వరకు 45రోజులు ఈ శిక్షణ కొనసాగుతుంది. చిన్నారుల్లో ఉత్సాహం నింపేందుకు.. చిన్నారుల్లో ఉత్సాహం నింపేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, మాటల నేర్పరితనం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి రోల్ ప్లే కథలు, సృజనాత్మకతను పెంచేందుకు పేపర్ క్రాఫ్ట్, కాగితాలతో రకరకాల ఆకృతులు తయారు చేయిస్తున్నారు.ఇంటి బెంగ పోయింది హాస్టల్కు వచ్చిన కొత్తలో చాలా భయంగా అనిపించేది. ‘చెలిమి’ వల్ల ఆహ్లాదకరంగా మారింది. టీచర్లు ఆటపాటలతో ప్రోత్సహిస్తూ మాలోని ప్రతిభను వెలికితీస్తున్నారు. నాలో భయం పోయి, ఇంటిపై ధ్యాస తగ్గి చదువుపై దృష్టి పెట్టగలుగుతున్న. వర్షిణి, ఆరో తరగతి విద్యార్థిని, కేజీబీవీ, గొల్లపల్లి భవిష్యత్తుకు బలమైన పునాది బాలికల సర్వతోముఖాభివృద్ధి కి తోడ్పడుతోంది. విద్యాభ్యాసంతో పాటు సామాజిక నైపుణ్యాలను అలవర్చుకుంటూ భవిష్యత్కు బలమైన పునాది వేసుకుంటున్నారు. ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణతో కేజీబీవీల్లో మెరుగైన ఫలితాలకు బాటలు పడుతున్నాయి. – నీరజ, జీఈసీవో ఒత్తిడిని అధిగమిస్తున్నారు చెలిమి ద్వారా విద్యార్థినులు మానసిక ఒత్తిడిని సులువుగా అధిగమిస్తున్నారు. డ్రాయింగ్, యోగా, రోల్ ప్లే, సింగింగ్ వంటి శిక్షణ ఇస్తుండటంతో ఆసక్తి కనబరుస్తున్నారు. మేము ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ స్నేహపూర్వక వాతావరణంలో బోధన సాగిస్తున్నాం. – పద్మ, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ, గొల్లపల్లి -
‘సర్’ సకాలంలో పూర్తి చేయాలి
రాయికల్: ఎస్ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. శుక్రవారం రాయికల్తో పాటు మండలంలోని వీరాపూర్లో బీఎల్వోలు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తప్పులు దొర్లకుండా నమోదు చేయాలని సూ చించారు. అనంతరం వీరాపూర్లో భూముల రీసర్వేపై గ్రామస్తులకు అవగాహన కల్పించా రు. తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ డిండిగాల గంగు పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి రాయికల్: గురుకుల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం అల్లీపూర్లోని జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల ఆవరణ, స్టాక్ రిజిష్టర్లు, మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డిప్యూటీ సీఈవో నరేశ్, ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ గౌతమి పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలికథలాపూర్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు ఎస్పీ చేతన్ ని తిన్ అన్నారు. శుక్రవారం కథలాపూర్ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం అందేలా చూడాలన్నారు. గ్రామాల్లో రాత్రిపూట పె ట్రోలింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని, నేరాల నియంత్రణపై దృష్టిసారించాలని సూచి ంచారు. సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై రవికిరణ్ పాల్గొన్నారు. నిధుల గోల్మాల్ కేసుపై దర్యాప్తు జగిత్యాలక్రైం: జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో నిధులు దుర్వినియోగం చేశారని ఆస్పత్రిలో పనిచేస్తున్న షేక్ యాసిన్తో పాటు, మరికొంత మందిపై గతేడాది మే 26న అప్పటి ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు షేక్ యాసిన్ను అరెస్ట్ చేశారు. సుమారు 4.96 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పోలీసు అధికారులు బదిలీ కావడంతో ప్రస్తుతం ఈ కేసును పోలీసులు మళ్లీ దర్యాఫ్తు ముమ్మరం చేశారు. బ్యాంకర్ల పాత్ర, ఉద్యోగుల పాత్రపై లోతైన విచారణ చేస్తున్నట్లు పోలీసులు ముమ్మర దర్యాఫ్తు కొనసాగిస్తున్నారు. -
వెల్నెస్ సెంటర్ మంజూరు చేయాలి
జగిత్యాల: ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం జగిత్యాలలో వెల్నెస్ సెంటర్ మంజూరు చేయాలని ఆరోగ్య శాఖమంత్రి రాజనర్సింహకు ఎమ్మెల్యే సంజయ్కుమార్ వినతిపత్రం అందజేశారు. అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. హైలెవల్ బ్రిడ్జి .. రాయికల్: రాయికల్ మండలం బోర్నపల్లి–జగన్నాథపూర్ మధ్య హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే సంజయ్కుమార్ శుక్రవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. గిరిజన గ్రామం జగన్నాథ్పూర్ నుంచి రాయికల్కు రావాలంటే సుమారు 15కి.మీ రావా ల్సి ఉంటుందని, ఈ గ్రామాల మధ్య వాగుపై హైలెవల్ వంతెన నిర్మిస్తే గిరిజనులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ విషయంపై కేంద్ర గిరి జన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. -
విష జ్వరాల పంజా
జిల్లాలో ఇప్పటికే విష జ్వరాల బారిన పడి జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఇలా నిత్యం ఆస్పత్రుల్లో అనేక కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వైద్య బృందం క్యాంపులు కొనసాగిస్తున్నారు.జగిత్యాల: ఎల్నినో ప్రభావం.. వాతావరణంలో మా ర్పులు రావడంతో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. జిల్లాలో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా జ్వరం, జలుబు, తలనొ ప్పితో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి సారించినప్పటికీ ఆస్పత్రికి మాత్రం రోగుల తాకిడి పెరిగిపోతోంది. నిత్యం వందల సంఖ్యలో ఓపీ పెరిగిపోతో ంది. ఈసంవత్సరం డెంగీ 3 కేసులు నమోదయ్యా యి. మలేరియా కేసులు అత్యఽధికంగా ఉన్నాయి. జి ల్లాలోని ఐదు మున్సిపాలిటీలతో పాటు మండలా లు,గ్రామాల్లో సైతం విష జ్వరాలు సోకుతున్నాయి. ప్రత్యేక చర్యలు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. మున్సిపల్ పరిధిలో కొన్ని వార్డులను సందర్శించి పారిశుధ్య నిర్వహణపై సూ చనలు చేశారు. డ్రెయినేజీల్లో పూడిక తీయకపోవడ ం, ప్రతీచోట నీరు నిలిచి ఉండటంతో పారి శుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇళ్లలో టైర్లు, కూలర్లు, పూలకుండీలు, కొబ్బరిచిప్పలు, ఖాళీ సీసాలు, నీరు నిలువ ఉండే పాత్రలను గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకోకపోతే వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. ప్రతీరోజు డ్రై డే పాటిస్తేనే.. ప్రస్తుత సీజన్లో ప్రతీరోజు డ్రై డే పాటిస్తేనే వ్యాధులు తగ్గే అవకాశం ఉంది. జిల్లాలో పారిశుధ్య అస్థవ్యస్థంగా మారడంతో డెంగీ, చికెన్ గున్యా, మలేరి యా వంటి వ్యాధులు ప్రబలే ప్రబలిస్తున్నాయి. దో మల నిర్మూలనకు ప్రతిఒక్కరూ చర్యలు తీసుకోవడంతో పాటు, పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించాల్సి అవసరం ఉంది. ప్రతీ మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు, వర్షపు నీటితో నిండిపోవడంతో దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. సాయంత్రం 6 గంటలైందంటే ఇళ్లలోకి విపరీతంగా దోమలు వస్తున్నా యి. వీటిని అరికట్టకపోతే వ్యాధుల బారిన పడాల్సిందే. ముఖ్యంగా ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మచ్చుకు సైతం ఏ మున్సిపాలిటి, గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపించడం లేదు. శానిటేషన్ అస్తవ్యస్తం మున్సిపాలిటీల్లో శానిటేషన్ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపైనే చెత్తాచెదారం వేయడం, అవి 3–4 రోజుల వరకు తీయకపోవడంతో దుర్గందం వెదజల్లుతోంది. దీంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒక వైపు కలెక్టర్ ఆదేశిస్తున్నా కొన్ని మున్సిపాలిటీల్లో ఆశించిన మేరకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదు. మున్సిపల్ అధికారులు నిత్యం వార్డుల్లో ఫాగింగ్ చేయడంతో పాటు, ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప వ్యాధులు అరికట్టే అవకాశం ఉండదు. 2026 జనవరి నుంచి ఇప్పటివరకు ఫీవర్ కేసులు : 6,389డెంగీ : 3చర్యలు తీసుకుంటాం ఎల్నినో ప్రభావంతో వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉంది. ఇప్పటికే నిత్యం డ్రై డే పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించాం. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. సీజనల్ వ్యాధులను దూరం చేద్దామనే సందేశంతో ముందుకెళ్తున్నాం. ఆస్పత్రుల్లో సైతం పరీక్ష కిట్లు, సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – సత్యప్రసాద్, కలెక్టర్ -
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి
కోరుట్ల రూరల్: ప్రతీఒక్కరు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం మండలంలోని సంగెం గ్రామంలో సంఘ మహేశ్వర ఆలయ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం గ్రామంలో నిర్మించిన గ్రామైఖ్య మహిళా సంఘ భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, సర్పంచ్ చీటి స్వరూప, కార్యదర్శి శేఖర్, ఉప ససర్పంచ్ సుదవేణి మహేశ్, నాయకులు చీటి వెంకట్రావు, రాంచందర్ రావు, తీగల మహేశ్, శంకర్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు. భూ తగాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం భూ తగాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దటమే ప్ర భుత్వ లక్ష్యమని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని సంగెంలో శుక్రవారం భూ రీసర్వేలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ గ్రామం నుంచి 50–60 భూ తగాదా దరఖాస్తులు ఉన్నాయని, వాటిని పరిష్కరించటమే భూ రీసర్వే కార్యక్రమం అని కలెక్టర్ వివరించారు. అంతకు ముందు రైతుల నుంచి సందేహాలు, సలహాలు స్వీకరించారు. సర్పంచ్ చీటి స్వరూప, ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చై తన్య, ఆర్ఐ శ్రీనివాస్ యాదవ్, ఉపసర్పంచ్ మహేశ్, కార్యదర్శి శేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
రైస్ వార్
నాణ్యత లేక..ఎఫ్సీఐ మిల్లర్ల వద్ద నుంచి సేకరించే ధాన్యం జిల్లాలో గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లి, బుగ్గారం మండలం యశ్వంతరావుపేట, కొడిమ్యాల మండలం నాచుపల్లి, మల్యాల మండలం బల్వంతాపూర్లోని గోదాములుకు చేరుతాయి. ఈ గోదాముల నిర్వాహకులు కొంతకాలంగా నిబంధనలు పాటించకపోవడంతో పాటు నాణ్యత ప్రమాణాలు, తూకంలో వ్యత్యాసం లాంటి కారణాలతో బియ్యం గోదాముల్లో దింపుకునేందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో మిల్లర్లు కూడా తామేం తక్కువ కాదంటూ గోదాం నిర్వాహకులకు భయపడేది లేదంటూ బియ్యం కూడా నాణ్యతగానే సరఫరా చేస్తున్నామంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఎఫ్సీఐ అధికారులు కూడా బియ్యం సేకరణ సక్రమంగా చేయాలని నిర్వాహకులకు సూచిస్తున్నా వారు కూడా వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. తూకంలో వ్యత్యాసాలు జిల్లాలో ప్రభుత్వం ఐకేపీల వద్ద కొనుగోలు చేసిన వరిధాన్యాన్ని రైస్మిల్లర్లకు అప్పగించగా రైస్మిల్లర్లు వరిధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్సీఐ గోదాములకు తరలిస్తున్నారు. గోదాంలకు తరలిస్తున్న సమయంలో రైస్మిల్లర్లు వేబ్రిడ్జిల వద్ద తూకం వేసి పంపిస్తున్నారు. కానీ గోదాంల వద్దకు వెళ్లేసరికి ఒక్కో లారీకి 70 నుంచి క్వింటాల్ వరకు వ్యత్యాసం వస్తుండటంతో బియ్యం తీసుకునేందుకు గోదాంల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. దీంతో తాము తూకం వేసి పంపించిన లారీల్లో ఎలా వ్యత్యాసాలు వస్తాయంటూ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలరూరల్: జిల్లాలో రైస్మిల్లర్లు, ఎఫ్సీఐ గోదాం నిర్వాహకుల మధ్య కొద్దికాలంగా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో మిల్లర్లు, గోదాంల నిర్వాహకుల మధ్య ఇటీవల సయోధ్య కుదిర్చేందుకు అదనపు కలెక్టర్ బీఎస్ లత ఇరువర్గాలతో సమావేశం నిర్వహించి ఎలాంటి బేధాలు లేకుండా సజావుగా బియ్యం సేకరించాలని సూచించినా అవేం పట్టించుకోవడం లేదు. దీంతో మిల్లర్లు తరలించిన ధాన్యం లారీలు గోదాంల వద్దే పడిగాపులు కాస్తున్నారు. -
పరిశుభ్రతపై దృష్టి సారించాలి
జగిత్యాలక్రైం: గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర హెల్త్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ అన్నారు. పొరండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు విష జ్వరంతో మృతిచెందగా శుక్రవారం రాత్రి చిన్నారులు నివసించే కాలనీతో పాటు, ప్రజలకు మంచినీరు సరఫరా అయ్యే మంచినీటి బావిని పరిశీ లించారు. విషజ్వరాలతో బాధపడుతూ జగిత్యా ల ఎంసీహెచ్లో చికిత్స పొందుతున్న బాలుడిని పరిశీలించి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో యుద్ధ ప్రతిపాదికన శానిటేషన్ పనులు నిర్వహించాలని, వైద్య సిబ్బంది నిత్యం గ్రామంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాలతో బాధపడుతున్న వారికి వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆమె వెంట డీఎంహెచ్వో సుజాత, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, మండల వైద్యాధికారి సౌజన్య, సర్పంచ్ నక్క హరీశ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణచైతన్య పాల్గొన్నారు. 20 మంది గుర్తింపు పొరండ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 20 మంది చిన్నారులు విష జ్వరంతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. అందులో ఒక చిన్నారి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొ ందుతుండగా, మరో బాలుడు ఎంసీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వా రి ఆరోగ్యాలు బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దోమకాటు ద్వారానే విష జ్వరాలు పొరండ్లలో దోమకాటు వల్లే చిన్నారులు విషజ్వరంతో బాధపడుతున్నట్లు జగిత్యాల డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పాటు, పందులు సంచరించే ప్రాంతాల్లో దోమలు కాటు వేయడం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. ము మ్మరంగా శానిటేషన్ చేపట్టడం జరిగిందన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి జగిత్యాల: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కీటక జనిత వ్యాధుల నివారణ శాఖ అడిషినల్ డైరెక్టర్ పద్మజ అన్నారు. శుక్రవారం ఎంసీహెచ్లో చికిత్స పొందుతున్న ఇటీవల విషజ్వరాలతో మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు. -
మరిచిపోలేని విషాదం..తరలిన మృత్యు శకటం!
2026 జూలై 242018 సెప్టెంబర్ 11జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై 2018 సెప్టెంబర్ 11న (మంగళవారం ఉదయం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులోని మూలమలుపు వద్ద పల్లెవెలుగు బస్సు అదుపు తప్పి 30 అడుగుల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. అప్పుడు సుమారు 65 మంది చనిపోయారు. దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రమాదం ఇది. ఇన్నేళ్లపాటు కొండగట్టు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఆ బస్సును శుక్రవారం ఎస్సై సందీప్ టోయింగ్ వాహనం ద్వారా ఆర్టీసీ గ్యారేజ్కు తరలించారు. – మల్యాల -
కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి
కొడిమ్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్లో శుక్రవారం వేకువజామున పర్వతాలు అనే గ్రామస్తుని గొర్రెల మందపై వీధి కుక్కల దాడి చేశాయి. 25 గొర్రెలు మృతి చెందగా, 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. తీవ్ర గాయాలతో రక్తమోడి విలవిల్లాడుతున్న గొర్రెలను చూసిన పర్వతాలు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనతో తమ కుటుంబం బతుకు భారమయిందని, రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని రోదించాడు. గాయపడిన గొర్రెలకు చికిత్స అందిస్తున్నామని, వాటిలో కూడా కొన్ని చనిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరాడు. బాధితుడిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఆందోళన చెందవద్దని సూచిస్తూ, ఘటన వివరాలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటామని బాధితుడికి భరోసా ఇచ్చారు. బాధితుడికి ఎమ్మెల్యే భరోసా -
గాడితప్పుతున్నారు!
‘చందుర్తి మండలం నర్సింగపూర్ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం జితేందర్రెడ్డి ట్రైనింగ్పై వెళ్లగా.. సీనియర్ టీచర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రీ ప్రైమరీ స్కూల్ ఆయాకు పాఠశాల సమయంలో ఇన్చార్జి హెచ్ఎం పని చెప్పగా.. మీరెవ్వరూ నాకు పని చెప్పేదంటూ గొడవకు దిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నంత పని చేశారు. సీఆర్పీ, కాంప్లెక్స్ హెచ్ఎంలు వెళ్లి ఆయాకు మరోసారి గొడవకు దిగొద్దని సర్ది చెప్పారు.’‘చందుర్తి మండలం ఎన్గల్ జెడ్పీ హైస్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉపాధ్యాయుడు అల్లరి చేస్తున్నారని ముగ్గురు విద్యార్థినులను కొట్టారు. ఇద్దరికి స్వల్పంగా గాయాలు కాగా వీరికి ఉపాధ్యాయులే వైద్యం చేయించారు. కాగా మరో విద్యార్థి అనారోగ్యం బా రిన పడి పాఠశాలకు రావడం లేదు.’చందుర్తి(వేములవాడ): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు గాడితప్పుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఫ్రస్ట్రేషన్.. సర్దిచెప్పే ఓపిక లేకపోవడం ప్రధాన సమస్యగా తెలుస్తోంది. సమాజంలో బాధ్యతాయుతమైన టీచర్ ఉద్యోగం చేస్తూ మరీ ఇంత దిగజారుడు ప్రవర్తన చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన గురువులే ఎడాపెడా కొడుతుంటే... ఎవరికీ చెప్పుకోవాలో అటు విద్యార్థులకు.. ఇటు తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు. ఈ వ్యవహారం ఇలాగే వదిలేస్తే ప్రభుత్వ విద్యావ్యవస్థ గాడితప్పే ప్రమాదం ఉందని విద్యాభిమానులు అ భిప్రాయపడుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దా ల్సిన ఆవశ్యకత ఏర్పడింది. లేకుంటే పాఠశాలల్లో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కనిపించని ఉన్నతాధికారులు మండలంలోని బండపల్లిలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వివాదం ఐదారు నెలలుగా కొనసాగుతున్న ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోవడంపై గ్రా మస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల గొడవ ఠాణా వరకు వెళ్లిందంటేనే మండల, జిల్లా స్థాయి విద్యాధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. సనుగుల విద్యార్థిపై దాడి, నర్సింగపూర్ ఇన్చార్జి హెచ్ఎంపై ఆయా దురుసు వ్యవహారం ఘటనలపై కనీసం విచారణ కూడా చేపట్టకపోవడం అధికారుల తీరును తెలియజేస్తుంది. జిల్లా అధికారులు ఉపాధ్యాయుల పనితీరుపై నిఘా పెట్టి పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలపై డీఈవో మొండయ్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.‘చందుర్తి మండల కేంద్రంలోని బాలుర ఎస్సీ హాస్టల్ పనిచేస్తున్న వాచ్వుమెన్ కల్లు తీసుకొచ్చింది. గమనించిన ఓ విద్యార్థి ఆ కల్లులో ఉప్పు కలిపాడు. దీంతో కోపోద్రిక్తురాలైన వాచ్వుమెన్ విద్యార్థిపై చేయి చేసుకుంది. అంతటితో ఆగకుండా విద్యార్థి ప్రవర్తన సరిగ్గా లేదని వార్డెన్కు చెప్పడంతో టీసీ ఇచ్చారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఈ విషయాన్ని చందుర్తి సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ జోక్యం చేసుకున్నా వినకుండా ఆ విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించారు.’ -
ఖోఖో సంరంభం
కరీంనగర్స్పోర్ట్స్: క్రీడాకారుల కేరింతలు, ఆకట్టుకున్న మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబించే ఉత్సాహభరిత వాతావరణం మధ్య కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో పాఠశాలలో సీబీఎస్ఈ క్లస్టర్–7 బాలికల ఖోఖో చాంంపియన్షిప్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అండర్ –14 విభాగంలో 46, అండర్– 17లో 55, అండర్– 19 విభాగంలో 13 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. మొత్తం 104 జట్లు పోటీల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీపడనున్నాయి. అంతకుముందు పోటీలను చొప్పదండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, అదనపు కలెక్టర్ అశ్వినితానాజీ వాకాడే, అసిస్టెంట్ కలెక్టర్ పి.హరిప్రసాద్, సీబీఎస్ఈ రీజనల్ ఆఫీసర్ జంగం సునీల్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచినప్పుడే విద్యార్థులకు సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. అల్ఫోర్స్ అధినేత వి.నరేందర్రెడ్డి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ అత్యాధునిక వసతులు, అనుభవజ్ఞులైన కోచ్లతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. క్రీడాస్ఫూర్తితో నిబంధనలు పాటిస్తూ పోటీలను విజయవంతం చేయాలన్నారు. క్రీడాకారుల మార్చ్ఫాస్ట్, విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. పోటీల పరిశీలకులు భరత్కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్రెడ్డి, ఖోఖో సంఘం కార్యదర్శి మహేందర్రావు, ఖోఖో అసోసియేషన్ రెఫరీస్ బోర్డ్ కన్వీనర్ వంగపల్లి సూర్యప్రకాశ్, ప్రజాప్రతినిధులు వాసాల రమేశ్, చంద్రశేఖర్, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులుమార్చ్ఫాస్ట్లో క్రీడాకారులు అట్టహాసంగా ప్రారంభమైన సీబీఎస్ఈ క్లస్టర్–7 ఖోఖో పోటీలు తెలంగాణ, ఏపీ నుంచి 104 బాలికల జట్లు హాజరు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం -
ప్రాణం తీసిన ఈత సరదా
● మానేరు చెక్డ్యాం గొయ్యిలో పడి బాలుడి మృతి ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన చెలిక ఆదిత్య(15) అలియాస్ లక్కీ అనే పదో తరగతి విద్యార్థి మానేరులో ఈతకోసం వెళ్లి మృతి చెందాడు. పొత్కపల్లిలో పదో తరగతి చదువుతున్న ఆదిత్య.. శుక్రవారం ఒక్కపూట పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఈతకోసం మరో విద్యార్థితో కలిసి మానేరుకు వెళ్లాడు. మానేరులో చెక్డ్యాం నిర్మాణానికి ఇటీవల తీసిన గొయ్యిలో పడి ఊపిరి ఆరాడక ఆదిత్య మృతి చెందాడు. శ్రీనివాస్ – రజిత దంపతులకు కుమారుడు ఆదిత్య, కూతురు ఉంది. ఒక్కాగానొక్క కుమారుడు మృతి చెందటంతో దంపతులు విషాదంలో మునిగారు. ఎస్సై సనత్కుమార్రెడ్డి కేసు నమోదు చేసుకొన్నారు. స్వగ్రామానికి వలసజీవి మృతదేహం ● ధర్మారంలో విషాదం కోనరావుపేట(వేములవాడ): సొంతూరిలో ఉపాధి లేక ఎన్నో ఆశలతో గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ యువకుడి జీవితం గుండెపోటుతో విషాదాంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి వెంకటేశ్వర్లు(40) ఒమన్ రాజధాని మస్కట్కు మూడేళ్ల క్రితం వెళ్లాడు. వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే పనిచేస్తు ఉన్నాడు. ఈక్రమంలో జూన్ 16న వీసా సంబంధిత కారణాలతో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. జూన్ 25న గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు మృతిచెందాడు. వెంకటేశ్వర్లు మృతదేహం బంధువుల ద్వారా స్వగ్రామానికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటేశ్వర్లుకు భార్య పుష్పలత, ఇద్దరు కుమారులు మనోజ్, అజయ్ ఉన్నారు. -
రైతులకు ఉపయోగపడేలా నిధులు వెచ్చించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: ఆత్మ ద్వారా అందే నిధులు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలకు వెచ్చించాలని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి వడ్డెపల్లి భాస్కర్ అన్నారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మ జిల్లాస్థాయి రైతు సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఉపయోగపడే క్షేత్ర ప్రదర్శనలు, రైతు శిక్షణ, వివిధ ప్రాంతాల పర్యటనల వంటి కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని సూచించారు. రైతు సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు, రసాయన పురుగు మందుల వినియోగాన్ని తగ్గించేందుకు డ్రోన్ల ద్వారా మందులు పిచికారి చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాన్ సుధాకర్, ఆత్మ చైర్మన్లు కాటిపల్లి గంగారెడ్డి, తాళ్లపల్లి మల్లేశం, వాకిటి భూమారెడ్డి, శాస్త్రవేత్త వై.స్వాతి పాల్గొన్నారు. -
ఆరుగురు మేజిస్ట్రేట్లకు సబ్ జడ్జీలుగా పదోన్నతి
జగిత్యాలజోన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు జూనియర్ సివిల్ జడ్జి, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్లకు సీనియర్ సివిల్ జడ్జి, సబ్ జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ హైకోర్టు రిజిష్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో జగిత్యాలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.లావణ్య, కరీంనగర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్డి యశ్వంత్సింగ్, పెద్దపల్లి జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఎన్.మంజుల, గోదావరిఖని రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్, మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాడి, ధర్మారం మండలం నందిమేడారం జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సరిత మట్టలు ఉన్నారు. వీరందరికి పదోన్నతి కల్పించినప్పటికీ ప్రస్తుతం పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. త్వరలో ఖాళీలను బట్టి ఆయా ప్రాంతాలకు పదోన్నతిపై బదిలి చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో పలు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. పని ఒత్తిడితో సనుగుల పాఠశాలలో విద్యార్థి చెయ్యి విరిగిన ఘటన పూర్థి స్థాయిలో విచారణ చేయలేకపో యాను. నాకు మంగళవారం రాత్రే విషయం తెలిసింది. నర్సింగపూర్ పాఠశాల గొడవ జరిగిన రోజు లీవ్లో ఉన్నాను. సీఆర్పీ, కాంప్లెక్ హెచ్ఎం వెళ్లి సమస్యను పరిష్కరించాలని ఆదేశించాను. – వినయ్కుమార్, ఎంఈవో, చందుర్తి -
అగ్నివీర్ ఇంటర్వ్యూకు రప్పించాలి
జగిత్యాలక్రైం: భారతసైన్యం నిర్వహిస్తున్న అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా తన కుమారుడిని యునైటెడ్ అరబ్ ఎమిరెడ్స్ (యూఏఈ) రాజధాని అబుదాబి నుంచి అత్యవసరంగా స్వదేశానికి రప్పించాలని కోరుతూ తల్లి శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిని ఆశ్రయించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరుకు చెందిన పోపర్తి అభిలాష్ జగిత్యాలలోని లైసెన్స్ కలిగిన రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ద్వారా టూరిస్ట్ వీసాపై ఈనెల 8న ముంబాయ్ నుంచి అబుదాబికి వెళ్లాడు. అనంతరం ఈనెల 13న ఎంప్లాయిమెంట్ వీసా జారీ చేశారు. ఆ సమయంలో సైన్యం నిర్వహిస్తున్న అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా నిర్వహించే ఫిజికల్ స్క్రీనింగ్ (దేహ దారుఢ్య పరీక్ష)కు షార్ట్లిస్ట్ అయినట్లు, అతనికి ఈనెల 14న ఈమెయిల్ అందింది. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ యజమాన్యం ఇండియాకు తిరిగి వెళ్లాలంటే 4100 యూఏఈ దినార్లు సుమారు ఇండియా రూ.1.08 లక్షలు చెల్లించి వీసా రద్దు చేస్తేనే భారత్కు పంపిస్తామని షరతులు విధించారు. ఏజెంట్ కూడా ఇదే విషయం చెబుతున్నాడని అభిలాష్ తల్లి సుమలత వాపోయారు. తన కుమారుడు అగ్నివీర్ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ తీసుకుని అతన్ని అత్యవసరంగా అబుదాబి నుంచి హైదరాబాధ్కు తెప్పించాలని హైదరాబాద్లోని బేగంపేట ప్రజాభవన్లో సీఎం ప్రవాసి ప్రజావాణిలో ఆమె వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఆయన పేద కుటుంబానికి చెందిన యువకున్ని తగిన సహాయం అందించి అత్యవసరంగా స్వదేశానికి రప్పించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జీఏడీ)కి లేఖ రాశారు. -
26న అరుణాచలం యాత్ర
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ తీర్ధయాత్రల్లో భాగంగా కరీంనగర్ 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 26న అరుణాచలం యాత్రకు బయలుదేరుతుందని కరీంనగర్ 1డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సు బయలుదేరి కాణిపాకం, కంచి, అరుణాచలం, శ్రీరంగం, మదురై, రామేశ్వరం, జోగులాంబ దర్శనాలు చేసుకుని ఈనెల 31న సాయంత్రం వరకు కరీంనగర్ చేరుకుంటుందని ఆమె పేర్కొన్నారు. పెద్దలకు రూ.7,300, పిల్లలకు రూ.5,475గా టికెట్ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 7382849352, 9959225920 నంబర్లలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు. 24 గంటల్లోనే చోరీ కేసు ఛేదన కరీంనగర్క్రైం: నగరంలోని త్రీ టౌన్ పరిధిలో జరిగిన చోరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1,25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం తులసీనగర్, వావిలాలపల్లికి చెందిన తోట రోహిత్ ఈ నెల 22న తన తల్లితో కలిసి డిమార్ట్కు షాపింగ్కు వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో దాచిన రూ.4.80 లక్షల నగదు అపహరించి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని విశ్లేషించి నిందితుడు దేవనవేణి మహేశ్గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని, రూ.1.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్ చేశారు. కేసును ఛేదించిన త్రీటౌన్ ఎస్సై బి.చేరాలు, కానిస్టేబుల్ కె.ప్రశాంత్ను సీఐ తిరుమల్ అభినందించారు. గుండెపోటుతో ఉప్పుమడుగు సీఈవో మృతిరాయికల్: రాయికల్ మండలం ఉప్పుమడుగు సహకార సంఘం సీఈవో సుతారి తిరుపతి (56) గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన తిరుపతి ఉదయం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు జగిత్యాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. తిరుపతి మృతిపై జిల్లా సహకార సంఘ అధికారి మనోజ్, డీజీఎం సత్యప్రసాద్, మాజీ మంత్రి జీవన్రెడ్డి, సహకార సంఘం సీఈవోలు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషజ్వరంతో బాలుడి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన కాముని వరుణ్తేజ (6) విష జ్వరంతో గురువారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన కాముని అర్జయ్య, సరిత చిన్న కుమారుడు వరుణ్ తేజ యూకేజీ చదువుతున్నాడు. బుధవారం జ్వరం రావడంతో తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు కరీంనగర్కు తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అదేకాలనీకి చెందిన మరో బాలిక విషజ్వరంతో అపస్మారకస్థితికి వెళ్లింది. జిల్లా వైద్యాధికారి సుజాత, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేపట్టారు. -
బియ్యం అప్పగించరు.. డబ్బులు చెల్లించరు
● పెగడపల్లి మండలం బతికెపల్లిలో హరిహర మోడ్రన్ రైస్మిల్లు యజమానులు ప్రభుత్వం వద్ద రూ.3 కోట్ల ధాన్యాన్ని తీసుకుని బియ్యం అప్పగించకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వారిపై పెగడపల్లి పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ● జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం శివారులోని మంజునాథ రైస్మిల్లు ప్రభుత్వం నుంచి రూ.18 కోట్ల విలువైన ధాన్యాన్ని తీసుకుని బియ్యం అప్పగించకపోవడంతో మిల్లు యజమానులు ఐదుగురిపై జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. జగిత్యాలరూరల్: రైతుల నుంచి ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కానీ కొంతమంది మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని ఇతరులకు విక్రయించుకుని సొమ్ము చేసుకుని ఎగవేతకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు వారిపై ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తున్నారు. అయినప్పటికీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. బియ్యం అప్పగించకుండా, డబ్బు చెల్లించకుండా అధికారులు నోటీసులు జారీ చేస్తే కోర్టులను ఆశ్రయించి కాలం వెళ్లదీస్తున్నారు. జగిత్యాలలో 19 మంది డిఫాల్టర్లు జగిత్యాల జిల్లాలో 2023–24, 2024–25 సంవత్సరాలకుగాను 19 మంది రైస్మిల్లర్లు ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని ఇప్పటివరకు బియ్యం అప్పగించలేదు. ధాన్యం విలువ సుమారు రూ.80కోట్లు ఉంటుందని సమాచారం. మిల్లర్ల వద్ద ధాన్యం కూడా లేకపోవడంతో అధికారులు వారిని డిఫాల్టర్లుగా ప్రకటించారు. ఆగస్టు 15 లోపు వీరు బియ్యం అప్పగించకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మిల్లర్ల వద్ద ధాన్యం కరువు చాలామంది రైస్మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది మిల్లర్లు ఎంతో కొంత బియ్యం అప్పగిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు మిల్లర్ల వద్ద ధాన్యం కూడా లేకపోవడం గమనార్హం. ధాన్యం తీసుకున్న 19 మంది రైస్మిల్లర్లు రూ.80 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఆగస్టు 15 వరకు బియ్యం అప్పగించకుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు చేపడతాం. వానాకాలం సీజన్ ధాన్యాన్ని కేటాయించబోం. – జితేంద్రప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ రూ.21 కోట్ల ఎగవేత 19 మంది రైస్మిల్లర్లు డిఫాల్ట్ ఇద్దరు రైస్మిల్లర్లపై క్రిమినల్ కేసులు అప్పగించాల్సిన బియ్యం విలువ రూ.80కోట్లు -
ట్రినిటీలో ఫ్రెషర్స్ డే వేడుకలు
కరీంనగర్కల్చరల్: ట్రినిటీ జూనియర్ కళాశాలలో 2026–28 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన వేదికలపై నిర్వహించిన కార్యక్రమానికి కళా శాల ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జగిత్యాల డిప్యూటీ కలెక్టర్, ట్రినిటీ పూర్వ విద్యార్థిని కన్నం హరిణి, గ్రూప్–1లో విజ యం సాధించిన సందవేణి ప్రియాంక, బింగి కీర్తన ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. మనోహర్రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో వేలాది మంది విద్యార్థులను ఇంజినీర్లు, వైద్యులు, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దామని తెలిపారు. ట్రినిటీలో చదివిన తన ప్రయాణమే నేటి విజయానికి పునాది అని హరిణి పేర్కొన్నారు. అనంతరం గ్రూప్స్లో విజ యం సాధించిన పూర్వ విద్యార్థులు, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన ఇంటర్ విద్యార్థులు, నీట్, జేఈఈ, ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకర్లు, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం సన్మానించింది. -
ఎరువుల ఉచిత రవాణాకు మంగళం
జగిత్యాలఅగ్రికల్చర్: సహకార సంఘాలకు అందించే ఎరువుల రవాణాభారాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం భరించగా.. తాజాగా చేతులేత్తేసింది. ఇందుకు సంబంధించిన జీవోను అన్ని సహకార సంఘాలకు పంపించి, వెంటనే అమలు చేయాలని ప్రకటించింది. ఆ భారమంతా ఇకనుంచి రైతులపైనే పడనుంది. ఇక నుంచి ఓపెన్మార్కెట్ మాదిరిగానే సహకార సంఘాలు కూడా రసాయన ఎరువులను అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఒక్కో బస్తాపై అదనంగా రూ.15 వరకు రవాణా చార్జీల పేరిట రైతులపై భారం పడే అవకాశం ఉంది. దీనిపై ఇటీవల జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ప్రభుత్వ జీవోను ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మార్క్ఫెడ్ ద్వారా ఉచిత రవాణా మార్క్ఫెడ్ ద్వారా జిల్లాలోని అన్ని సహకార సంఘాలకు రసాయన ఎరువులు అందుతాయి. రైల్వే వ్యాగన్లలో లేదంటే గోదాముల్లో నిల్వ చేసిన ఎరువులను ఆయా సంఘాలకు అవసరాన్ని బట్టి మార్క్ఫెడ్ సంస్థ పంపిస్తుంటుంది. మార్క్ఫెడ్ సంస్థ లారీల్లో హమాలీలతో ఎరువుల బస్తాలను లోడ్ చేయించి సంఘాలకు పంపించేంది. లారీ, హమాలీల ఖర్చు మార్క్ఫెడ్ భరించేది. దీంతో సహకార సంఘాలు హమాలీ ఖర్చు, సంఘానికి లాభం చూసుకుని, బయటి వ్యాపారుల కంటే తక్కువ రేటుకు రైతులకు ఎరువులు అందించేవారు. ఒక్క సహకార సంఘానికి ఒక లారీ యూరియా ఎరువుల లోడ్ వస్తే.. బస్తా అసలు ధర రూ.252.40, హమాలీ ఖర్చు రూ.6.50, మాములు కింద బస్తాకు రూ.2.25, సంఘం లాభం కింద బస్తాకు రూ.5.35 ఇలా మొత్తం బస్తాకు రూ266.50 ధర చొప్పున రైతులకు అమ్ముతుంటారు. మల్లాపూర్, కథలాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని చివరి గ్రామాల సొసైటీలకు చేర్చితే ఖర్చు మరింతగా వచ్చేది. రవాణా భారం ఎత్తివేత ప్రభుత్వం తాజాగా మార్క్ఫెడ్ నుంచి సంఘాలకు ఉచితంగా సరఫరా చేసే లారీల రవాణా ఖర్చును ఉపసంహరించుకుంది. ఇకనుంచి లారీల ఖర్చును సంఘాలే భరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు యూరియా బస్తా సంఘంలో రూ.266కు లభిస్తే, ప్రైవేట్ డీలర్ల వద్ద రూ.300కు దొరికేది. తాజాగా మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన ర్యాక్ల వద్దకు లారీలను మాట్లాడుకుని, ఎరువులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లారీ కిరాయిలు పెంచే అవకాశం ఉండటంతో సహకార సంఘాలు ఎరువుల విక్రయం నుంచి తప్పుకొనే ఆలోచన చేస్తున్నాయి. రైతులపై పెనుభారం ఇక, ప్రైవేట్ డీలర్ల చేతిలో రసాయన ఎరువులు -
యువకుడి ఆత్మహత్య.. ఉద్రిక్తం
ఎల్లారెడ్డిపేట/సిరిసిల్లటౌన్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన యువకుడు పిట్ల వంశీ ఆత్మహత్యతో స్వగ్రామంతోపాటు సిరిసిల్లలో హై అలర్ట్ నెలకొంది. ప్రధాని మోదీ తన మృతికి కారకుడిగా పేర్కొంటూ సూసైడ్నోట్ రాయడంతో మృతుడి స్వగ్రామం గొల్లపల్లి, జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ● గొల్లపల్లిలో బీఆర్ఎస్ ర్యాలీ వంశీ ఆత్మహత్య చేసుకోగా.. వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పరామర్శించారు. ఆగయ్య మాట్లాడుతూ వంశీని కేంద్ర ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు. పేయింటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడని, యువకుడి మృతితో ఆ కుటుంబం వీధిన పడిందన్నారు. యువకుడి కుటుంబానికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఫ్లకార్డులతో ర్యాలీ తీశారు. సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సర్పంచ్ కొండ రమేశ్గౌడ్, అందె సుభాష్ ఉన్నారు. ● అండగా ఉంటాం వంశీ కుటుంబానికి అండగా ఉంటామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గౌస్, శ్రీనివాసరెడ్డి, గుడ్ల శ్రీనివాస్ ఉన్నారు. ● సంగీతం పరామర్శ మృతుడు వంశీ కుటుంబ సభ్యులను జిల్లా ఆస్పత్రి వద్ద డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పరామర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. కాగా మార్చురీ గదిలో ఉన్న వంశీ మృతదేహాన్ని చూడటానికి ఆస్పత్రి సెక్యూరిటీ కొద్ది సేపు ఒప్పుకోకపోవడం చర్చనీయాంశమైంది. ● పోలీసుల మోహరింపు తన చావుకు ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ సూసైడ్ నోట్ రాయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొల్లపల్లిలో పోలీసు బలగాలు మోహరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామంలో ఊరేగించాలని యువకులు భావించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సర్పంచ్ కొండ రమేశ్గౌడ్ జోక్యం చేసుకోవడంతో బస్టాండ్ నుంచి ఇంటి వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. రాచర్లగొల్లపల్లి, సిరిసిల్లల్లో బందోబస్తు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ల మద్దతు -
రెండుసార్లు సర్పంచ్.. సాయం కోసం ఎదురుచూపు
కొడిమ్యాల: ఆయన రెండుసార్లు సర్పంచ్గా కొనసాగారు. పదేళ్లపాటు ప్రజాసేవకు పాటుపడ్డారు. పదిమందికి సహాయపడిన ఆయన చేతులు ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్న ఆయన.. దాతలు సాధ్యమైనంత సాయం చేయాలని వేడుకుంటున్నాడు. అతడే మండలంలోని తిరుమలాపూర్ మాజీ సర్పంచ్ చెట్టుపల్లి హరేందర్. హరేందర్కి ఇద్దరు కూతుళ్లు. ఉన్నంతలో ఇద్దరికీ వివాహం చేశాడు. పదేళ్లపాటు సర్పంచ్గా కొనసాగినప్పటికీ నయాపైసా కూడబెట్టుకోలేకపోయారు. కొద్దికాలంగా కడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంబారిన పడగా.. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ఖర్చులు భారంగా మారడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇల్లు తప్ప ఏమిలేదని అతని సన్నిహితులు తెలిపారు. దాతలు స్పందించి తోచినంత సహాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు రూ.52వేల ఆర్థిక సహాయాన్ని ఆయన భార్యకు అందించారు. హరేందర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హరెందర్ కుటుంబానికి దాతలు అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, కృష్ణారావు, వెంకటేష్, నరేందర్ రెడ్డి, మల్లేశం, మహేష్, సత్యం, మల్లేశ్ యాదవ్ కోరారు. అనారోగ్యం బారిన తిరుమలాపూర్ మాజీ సర్పంచ్ వైద్య ఖర్చులకు చేయిచాస్తున్న హరేందర్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం ఇల్లు తప్ప గుంట భూమిలేక తల్లడిల్లుతున్న ఇల్లాలు -
రైతులపై భారమే
ఇప్పటికే వర్షాలు లేక వేసిన పంటలు పండుతాయో.. ఎండుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా సంఘాలకు ఉచితంగా ఎరువులను రవాణా చేయడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ద్వారా రైతులపై మరింత భారం పడుతుంది. – మెక్కొండ రాంరెడ్డి, అలూరు, రాయికల్(మం) రైతులపై భారం మోపుతున్న ఎరువుల రవాణా జీవోను ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే సంఘాలు అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. లారీలను కిరాయికి పెట్టి ఎరువులు తెచ్చే పరిస్థితి లేనందున, ఎరువుల విక్రయం నుంచి వైదొలిగే అవకాశం ఉంది. – పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు, జగిత్యాల -
పడకేసిన పట్టణ అభివృద్ధి
రాయికల్: రాయికల్ పట్టణాభివృద్ధికి ప్రభుత్వం జనవరిలో రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో తొమ్మిది అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కేవలం ఆరు పనులకు మాత్రమే టెండర్ నిర్వహించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు నేటికీ కేవలం ఒకే ఒక్క పనికి ముందుకొచ్చారు. మిగతా పనులు ప్రారంభం కాకపోవడంతో పట్టణంలో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. బల్దియాలో 12 వార్డులు ఉన్నాయి. 20,500 వరకు జనాభా ఉంది. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.15కోట్లతో సీసీరోడ్లు, బీటీరోడ్లకు రూ.15 లక్షలు, జంక్షన్ డెవలప్మెంట్కు రూ.కోటి, మాదిగకుంటలో నీటి తొలగింపు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.5 కోట్లు, మత్తడి వద్ద రిటర్నింగ్ వాల్ కోసం రూ.20 లక్షలు, మురికికాలువల కోసం రూ.3.15 కోట్లు, శ్మశాన వాటికకు రూ.50 లక్షలు, వీధి దీపాల కోసం రూ.కోటి, పార్క్, ఓపెన్ జిమ్ కోసం రూ.50 లక్షలు, పటేల్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు డివైడర్లు, మొక్కల పెంపకానికి రూ.50 లక్షల చొప్పున మంజూరు చేశారు. ప్రారంభం కాని పనులు మొత్తంగా తొమ్మిది పనులకు టెండర్ నిర్వహించినప్పటికీ కేవలం ఆరు పనులకు మాత్రమే కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. టెండర్లు కానివాటిలో పటేల్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు డివైడర్ల నిర్మాణం, శ్మశాన వాటిక అభివృద్ధి పనులు, సీసీ, బీటీ రోడ్డు పనులు ఉన్నాయి. పాలకమండలి సభ్యులు, అధికారులు స్పందించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కౌన్సిలర్లు, ప్రజలు కోరుతున్నారు. రాయికల్ బల్దియా వివరాలు వార్డులు 12 జనాభా 20,500 విడుదలైన నిధులు రూ.15 కోట్లు టెండర్ ద్వారా పనులు 9 టెండర్ అయినవి 6 టెండర్ కానివి 3 -
ఆక్రమణలపై కొరడా
జగిత్యాల: జిల్లా కేంద్రం.. అత్యంత రద్దీ గల ప్రాంతాల్లో రోడ్లపైనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో పార్కింగ్ సమస్యతోపాటు, నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలు తరచూ ప్రజావాణి, మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో ఆక్రమణలపై బల్దియా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కొన్ని చోట్ల చేసినప్పటికీ ప్రతిచోట ఆక్రమణలను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధానమైనవి యావర్రోడ్, తహసీల్ చౌరస్తా, టవర్సర్కిల్, కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, గొల్లపల్లి రోడ్, బైపాస్రోడ్, ధర్మపురి రోడ్ అత్యంత రద్దీ గల ప్రాంతాలు. రోడ్లపైనే పండ్ల విక్రయ నిర్వాహకులతోపాటు, గాజులు అమ్మేవారు, తాళం చెవులు, డ్రెస్సెస్లు అమ్ముకుంటూ చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ వీరు ఫుట్పాత్లనే కాకుండా రోడ్లపైకి వచ్చి విక్రయిస్తున్నారు. కొందరైతే ఏకంగా పర్మినెంట్గా షెడ్లు వేయడం, రోడ్లపై ఫ్లెక్సీ బోర్డులతో స్టాండ్లు ఏర్పాటుచేసుకున్నారు. దీంతో ప్రజలు, వాహనదారులకు నడవడం, వాహనాల పార్కింగ్కు ఇబ్బందికరంగా మారింది. యావర్రోడ్, పాతబస్టాండ్లో ట్రాఫిక్ విపరీతంగా జామ్ కావడంతో పాటు, ప్రమాదాలు జరుగుతున్నాయి. సాయంత్రం స్కూళ్లు ముగిసిన అనంతరం ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తం యావర్రోడ్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ చిన్నవిగా ఉండటం, చిరువ్యాపారులు వ్యాపారాలు చేయడం, వాహనదారులకు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. టవర్ సర్కిల్లో అయితే పెద్ద వాహనాలు రావడంతో వెళ్లడం, రావడం చాలా కష్టతరంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రణాళిక ప్రకారం చేపడితే ట్రాఫిక్ నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. రోడ్లను ఆనుకుని ఉన్న ఆక్రమణలను తొలగిస్తే ట్రాఫిక్ మెరుగుపడే అవకాశాలుంటాయి. అన్ని తొలగించాల్సిందే.. మున్సిపల్ అధికారులు ఫిర్యాదు వచ్చిన చోటే తాత్కాలికంగా తొలగించడం, మళ్లీ కొద్దిరోజుల అనంతరం షరామామూలే. ఇలా నెలలో రెండుసార్లు చేయడం తప్ప పూర్తిగా తీయలేకపోవడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిళ్లు తేవడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పండ్ల బండ్లు, కూరగాయలను ఏకంగా రోడ్లపైనే అమ్ముతున్నారు. మున్సిపల్ అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నా.. కొన్ని మాత్రమే తీసేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు చెబితే కొందరివి తీయకుండా ఆపుతున్నారని చెబుతున్నారు. అన్ని తీస్తే అటు పార్కింగ్, ఇటు వాహనదారులకు ఇబ్బంది ఉండదు. తాజాగా కొన్ని ఫిర్యాదులు రావడంతో యావర్రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఇదే విధంగా జిల్లా కేంద్రంలోని అన్ని సెంటర్ల వద్ద చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
పుష్కర సమయం..ఏర్పాట్లు ఘనం
గొల్లపల్లి: వచ్చే సంవత్సరంలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా.. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమైంది. అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. కుంభమేళా స్థాయిలో మౌలిక వసతులు కల్పించేలా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. గోదావరి తీరం ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల రూపురేఖలను మార్చేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ తీసుకుంటున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తొలి విడతగా రూ.117కోట్లు విడుదల చేసింది. వీటిని జగిత్యాల జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాలకే కేటాయించారు. ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోనున్న ధర్మపురి, కోటిలింగాల దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం.. శాతవాహనుల తొలి రాజధానిగా చారిత్రక ప్రాశస్త్యం పొందిన కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి, శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాల పరిధిలో ఈ నిధులతో సకల సౌకర్యాలు కల్పించనున్నారు. కోటిలింగాల వద్ద కొత్తగా ఘాట్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులు సురక్షితంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా సరికొత్త మోడల్లో స్నానపు ఘాట్ల నిర్మాణానికి రూ.8 కోట్లు కేటాయించారు. ఆలయాల ఆధునీకరణ ధర్మపురి, కోటిలింగాల ఆలయాల పరిసరాలను సుందరీకరించడానికి, భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, షెడ్లు నిర్మించడానికి రూ.10 కోట్ల చొప్పున ప్రత్యేకంగా వెచ్చించనున్నారు. మిగిలిన నిధులను గోదావరికి అనుసంధానంగా ఉన్న అంతర్గత రహదారుల విస్తరణ, రాత్రి వేళల్లో వెలుగులు విరజిమ్మేలా అత్యాధునిక విద్యుద్ధీకరణ, నిరంతర తాగునీరు, పారిశుధ్య పనులకు ఉపయోగించనున్నారు. మరో రూ.50 కోట్ల అదనపు నిధులకు ప్రతిపాదన పుష్కరాల సమయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. ప్రత్యేక బైపాస్ రోడ్ల నిర్మాణం కోసం అదనంగా మరో రూ. 50 కోట్లు మంజూరు చేయాలని మంత్రి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అధికారుల సన్నద్ధత వచ్చే ఏడాది జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. 12 రోజులపాటు మహా వేడుకల కోసం ప్రభుత్వం ఇప్పటినుంచే యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. నిధులు కేటాయించడంతో టెండర్ల ప్రక్రియను వేగవంతం చేశారు. పుష్కరాల నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలను జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. రూ.117 కోట్ల నిధులతో ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే కాకుండా.. భవిష్యత్తులోనూ భక్తులకు ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన వసతులు కల్పిస్తాం. – అడ్లూరి లక్ష్మణ్కుమార్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి -
పనులు చేపట్టాలి
మున్సిపాలిటీ అభివృద్ధి నిధులతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లతో పనులు అధికారులు పనులు చేయించాలి. టెండర్ కానివాటిపై ప్రత్యేక దృష్టి సారించి తిరిగి టెండర్లు పిలవాలి. పట్టణ అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి. – ధర్మపురి, బీజేపీ ఫ్లోర్ లీడర్ టెండర్ దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశాం. ప్రస్తుతం కేవలం మురికికాలువల నిర్మాణ పనులు చేపడుతున్నాం. మిగతా కాంట్రాక్ట్ పనులు కూడా టెండర్లు నిర్వహించి పట్టణాభివృద్ధికి కృషి చేస్తాం. – మనోహర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ -
వచ్చిన కరువు కాదు.. రేవంత్ తెచ్చింది
జగిత్యాలటౌన్: మేడిగడ్డ మరమ్మతు చేసేవరకూ కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయవద్దని ఎన్డీఎస్ఏ రిపోర్టులో ఎక్కడా పేర్కొనలేదని, ఆ నెపంతో రాష్ట్రాన్ని ఎడారిగా మార్చొద్దని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఇది వచ్చిన కరువు కాదని, రేవంత్ తెచ్చిన కరువు అని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. అప్పుడు చంద్రబాబు హయాంలో కరువు వస్తే.. ఇప్పుడు రేవంత్ హయాంలో వచ్చిందని గుర్తు చేశారు. నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కరువుకు ప్రభుత్వం కారణమవుతోందని ఆరోపించారు. ప్రత్యేక పరిస్థితుల్లో నీటిని వినియోగించుకోవచ్చని ఎన్డీఎస్ఏ సభ్యుడు రాజేష్ తోతెజ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నీటిరంగ నిపుణుడు వెదిర శ్రీరాం కూడా నీటిని ఎత్తిపోయాలని పేర్కొన్నారని, ఒక్క రేవంత్రెడ్డి తప్ప ప్రతిఒక్కరూ నీటిని ఎత్తి పోయవచ్చన్నారని తెలిపారు. కేసీఆర్కు పేరు వస్తుందనే కుట్రతోనే రేవంత్రెడ్డి నీటిని ఎత్తిపోయడానికి ఇష్టపడటం లేదన్నారు. కేసీఆర్పై ఈర్ష, ద్వేషంతోనే కుంగిన పిల్లర్లకు మరమ్మతు చేయడం లేదని విమర్శించారు. ఎల్నినోతో ఏర్పడిన కరువును ఎదుర్కోవడానికి ప్రాణహిత జలాలను కన్నెపల్లి పంప్హౌజ్ ద్వారా ఎత్తిపోయాలని కోరారు. ఆయన వెంట నాయకులు గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ఒల్లం మల్లేశం, కల్లెపెల్లి దుర్గయ్య, చందా రాధాకిషన్, నక్క జీవన్, అబ్దుల్ బారీ పాల్గొన్నారు. -
విజిబుల్ పోలీసింగ్పై దృష్టి
పెగడపల్లి: విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. గురువారం పెగడపల్లి పోలీస్స్టేషన్ను సందర్శించారు. రికార్డులు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, లాకప్గదిని పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించారు. బాధితుల ఫిర్యాదుపై సత్వరమే స్పందించాలని సూచించారు. యువతకు సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తుకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, మల్యాల సీఐ రాజ్కుమార్, ఎస్సై కిరణ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రీ సర్వేకు రైతులు సహకరించాలిమల్లాపూర్: రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా రీ సర్వేకు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత కోరారు. మండలంలోని సిరిపూర్లో రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. రీ సర్వేను ఆధునిక సాంకేతికతతో పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. మెట్పల్లి ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్ రామచందర్, ఆర్ఐ అశోక్, సర్పంచ్ పెంట సౌజన్య, ఉప సర్పంచ్ సోమ నాగార్జున రెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల బాపురెడ్డి, నాయకులు పెంట శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. గీతకార్మికులకు కాటమయ్య కిట్ల పంపిణీ జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం కోనాపూర్లో పెంబట్ల, కోనాపూర్, పోచంపేట, అర్పపల్లి గ్రామాలకు చెందిన గీత కార్మికులకు 105 కాటమయ్య కిట్లను ఎమ్మెల్యే సంజయ్ పంపిణీ చేశారు. కాటమయ్య కిట్లు గీత కార్మికులకు శ్రీరామ రక్ష అన్నారు. ఎల్నినో పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తిరుపతి, బీసీ వెల్ఫేర్ అధికారి జయరాజ్, తహసీల్దార్ వహీద్, ఎంపీడీవో నీరజ, ఎంపీవో సలీం, సర్పంచ్ కొలపాక రాధ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్రెడ్డి పాల్గొన్నారు. రైతులను దోపిడీ చేస్తే జైలుకే..గొల్లపల్లి: ఎరువులు, విత్తనాల పేరిట రైతులను దోపిడీ చేస్తే జైలుకు పంపిస్తామని డీఏవో భాస్కర్ ఫర్టిలైజర్ షాపు డీలర్లను హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. స్టాక్ రిజిస్టర్లు, ఈపాస్ యంత్రాల్లోని వివరాలపై ఆరా తీశరు. దుకాణాల ఎదుట విధిగా ఎరువుల ధరల పట్టిక ప్రదర్శించాలని ఆదేశించారు. రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేసినా.. బిల్లులు ఇవ్వకుండా విక్రయించినా.. సదరు డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటీ డైరెక్టర్ జాన్ సుధాకర్ మాట్లాడుతూ డీలర్లు ఈపాస్ ద్వారానే విక్రయించాలన్నారు. ఏవో కరుణ, ఏఈఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిజగిత్యాలరూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో సుజాత సూచించారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో గురువారం పర్యటించారు. వర్షాకాలం దృష్ట్యా గ్రామీణులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, చిన్నపాటి జ్వరం రాగానే ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, మండల వైద్యాధికారి సౌజన్య, ఎంపీవో రవిబాబు, సర్పంచ్ నక్క హరీశ్, సూపర్వైజర్లు సత్యనారాయణ, శ్రీధర్, ఏఎన్ఎం విజయలక్ష్మీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
32.0/24.0
7గరిష్టం/కనిష్టంవాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. జాబ్మేళాలో యువతజగిత్యాలటౌన్: ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జాబ్మేళాకు అభ్యర్థుల నుంచి విశేష స్పందన వచ్చిందని అధికారి బింగి సత్యమ్మ తెలిపారు. 153మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 40మందిని ఎంపిక చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు. స్వతంత్య్ర మైక్రోఫైనాన్స్ కంపనీ ప్రతినిధి జి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్’లో ఎమ్మెల్యే సంజయ్మెట్పల్లి: ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గురువారం పాల్గొన్నారు. ఫారంలో పూర్తి వివరాలు నమోదు చేసి బీఎల్వోకు అందించారు. సర్ విషయంలో నిర్లక్ష్యం చూపితే ఓటరుగా పేరు తొలగిపోయే అవకాశముందన్నారు. అర్హులందరూ పూర్తి వివరాలను బీఎల్వోలకు అందించాలని సూచించారు. రీయింబర్స్మెంట్కు పోరుబాటజగిత్యాలటౌన్: విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని పేర్కొంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు గురువారం చలో కలెక్టరేట్ చేపట్టారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు అక్రమాలిక్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గాలికొదిలేసిందని, మద్యం శాఖకు మంత్రి ఉన్నా.. విద్యాశాఖకు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రణయ్, సాయి, చందు, వరుణ్, కార్తీక్ పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి
ధర్మపురి: ఎస్ఐఆర్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలు అందించిన దరఖాస్తు ఫారాలను ఆగస్టు మూడో తేదీలోగా అందించాలని ప్రజలకు సూచించారు. ఫారాలు నింపడంలో సందేహాలుంటే బీఎల్వో, ఎన్నికల అధికారులను సంప్రదించాలని సూచించారు. స్కూల్ పనులు వేగవంతం చేయాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నేరెల్ల సమీపంలో చేపడుతున్న స్కూల్ పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు, భవనాల రూపకల్పన, తరగతి గదులు, వసతి గృహాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీఈవో రాము, తహసీల్దార్ శ్రీనివాస్, ఇంజినీరింగ్ అధికారులు, బీఎల్వోలు ఉన్నారు. -
అమెరికా వేదికపై ఒగ్గుకథ
వేములవాడ/వేములవాడరూరల్: తెలంగాణ జానపద కళారూపం ఒగ్గుకథ ఖండాంతరాలు దాటనుంది. ఒగ్గుకథా సామ్రాట్ దివంగత మిద్దె రాములు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన మనుమడు మిద్దె వినీత్, తండ్రి పరశురాములుతో కలిసి అమెరికాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘సిలికానాంధ్ర’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నట్లు వినీత్ బుధవారం తెలిపారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరనున్నట్లు చెప్పారు. ఈనెల 31 నుంచి ఆగస్టు 1 వరకు అమెరికాలోని కాపిఫోర్నియా రాష్ట్రంలోని ఆక్లాండ్ ఏరినాలో నిర్వహించే వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ‘సిలికానాంధ్ర’ వేడుకల్లో మిద్దె వినీత్ ప్రదర్శన -
జాతీయ జెండాపై అవగాహన
రాయికల్: జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా ఇందిరానగర్కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ సభ్యులు విద్యార్థులకు జెండా ఆవశ్యకతతోపాటు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అధ్యక్షుడు వాసం ప్రసాద్, సెక్రటరీ కనపర్తి శ్రీనివాస్, కోశాధికారి సుదవేని మురళీగౌడ్, సభ్యులు బత్తిని భూమయ్య, మ్యాకల రమేశ్, రాంరెడ్డి, ఆదిరెడ్డి, గంప ఆనందం, అశోక్, రవి, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. గొల్లపల్లిలో..గొల్లపల్లి: జాతీయ పతాక స్వీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ ఆవరణలో బుధవారం విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఎంఈవో చెరుకు రాజన్న, క్లబ్ అధ్యక్షుడు పాల్గొని పోటీలను పర్యవేక్షించారు. ఎంఈఓ మాట్లాడుతూ జాతీయ పతాకం స్వేచ్ఛ, ఐక్యతకు సజీవ ప్రతిరూపమన్నారు. తెలుగు ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య ఎంతో అధ్యయనం చేసి జెండాను రూపకల్పన చేయడం గర్వకారణంమన్నారు. అనంతరం విద్యార్థులకు జాతీయ పతాక విశిష్టత – పింగళి వెంకయ్య పాత్ర అంశంపై వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. ప్రిన్సిపల్ సుంకరి రవి, లయన్స్ క్లబ్ కోశాధికారి సురేష్, ప్రోగ్రామింగ్ చైర్మన్, మాజీ ఎంపీటీసీ భీమసత్యం, లీడ్ ఇండియా ఫౌండేషన్ మేనేజర్ తాడూరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బస్సును తీసుకెళ్లిన నిందితుడి అరెస్ట్
కోరుట్ల: పట్టణంలోని బస్టాండ్ నుంచి ఓ బస్సును మంగళవారం తీసుకెళ్లిన ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన నిందితుడు కందుల సాంబయ్యను అరెస్టు చేసినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. బస్సును తీసుకెళ్లడంతోపాటు నిర్లక్ష్యంగా నడిపి పలువురికి ఢీకొట్టి గాయపరిచినందుకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు. పాముకాటుతో గీతకార్మికుడి మృతితంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో బుధవారం గీత కార్మికుడు గుగ్గిళ్ల శ్రీనివాస్గౌడ్(46) పాముకాటుతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి పాము కాటు వేయగా.. బుధవారం ఉదయం శ్రీనివాస్ నోటి నుంచి నురుగలు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుప్పకూలిన రైస్మిల్లు ● రూ.3కోట్లకుపైగా ఆస్తినష్టం పెద్దపల్లి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ముసురువాన కురిసింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని సాయి సరస్వతి బాయిల్డ్ రైస్మిల్లు గోడలు కుప్పకూలినట్లు కార్మికులు తెలిపారు. గోదాములో నిల్వచేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. సుమారు రూ.3కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు యజమాని శ్రీకాంత్ అధికారులకు విన్నవించారు. సమాచారం అందుకున్న రైస్మిల్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు విజయ్పాల్రెడ్డి, చీటి సతీశ్రావు కేశవరావు తదితర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంజం వెంకటస్వామిబౌద్ధనగర్(హైదరాబాద్): ఎంఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఇంజం వెంకటస్వామిని ఇటీవల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నియమించారు. బుధవారం పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయానికి వచ్చిన ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామిని హైదరాబాద్ జిల్లా నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు డప్పు మల్లికార్జున్, రాజశేఖర్, సత్యనారాయణ, దావ శివ ప్రసాద్, ఎల్లయ్య, సత్యనారాయణ, బాబూరావు, విజయ్కుమార్, చాగంటి యాదగిరి, మీసాల శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలకు ప్రాధాన్యమివ్వాలి
కోరుట్ల రూరల్: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యమివ్వాలని మండల వ్యవసాయ అధికారి నాగమణి అన్నారు. వెంకటాపూర్ గ్రామంలో బుధవారం పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలతో కలిసి ఎల్నినోపై రైతులకు అవగాహన కల్పించారు. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. సర్పంచ్ ద్యాగ గంగాదర్, శాస్త్రవేత్తలు సుమలత, రామకృష్ణ, మధుకర్, ఏఈవో ఫమీనా పాల్గొన్నారు. మేడిపల్లి: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డా.ఎ.విజయ్భాస్కర్ కొండాపూర్, మేడిపల్లి గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి ఎండీ షాహిద్ అలీతో కలిసి వరి, పత్తి, మొక్కజొన్న పంట పొలాల్లో క్షేత్ర సందర్శన నిర్వహించారు. రైతులకు సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. -
దొంగిలించిన బైక్ల గుర్తింపు
దోపిడీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దుండగులు ఎత్తుకెళ్లిన రెండు బైక్లు హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ సమీపంలో లభ్యమయ్యాయి. గ్రామ శివారులో అనుమానాస్పదంగా రెండు బైక్లు ఉన్నాయని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో వెంటనే హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి, సీఐలు జి.కరుణాకర్, శ్రీనివాస్ పరిశీలించారు. దోపిడీకి పాల్పడిన ముఠా హుజూరాబాద్ ప్రాంతానికి చెందినదేనా? లేక పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా బైక్లను అక్కడ వదిలేసిందా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వరకు ఉన్న మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలోని సీసీ కెమెరా దృశ్యాలను విశ్లేషిస్తూ నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. రెక్కీ చేశారా? నగర నడిఒడ్డున ఉండే భగత్నగర్కు నేరుగా వచ్చి దోపిడీ చేయడంపై అనుమానం వ్యక్తం అవుతోంది. దోపిడీకి ముందుగానే కొద్దిరోజులు రెక్కీ చేశారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత నగదు, బంగారం బాధితులు ఇంట్లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. కీలకంగా సర్జికల్ గ్లౌజ్ నిందితులు దోపిడీకి సర్జికల్ గ్లౌజులు వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సర్జికల్ గ్లౌజ్ ముక్కలు లభ్యమైనట్లు తెలిసింది. దీని ఆధారంగా నిందితులు అప్పటికప్పుడే గ్లౌజులు కొని ఉంటారనే కోణంలో నగరంలోని అన్ని మెడికల్షాపుల సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. గతంలో హుజూరాబాద్ ప్రాంతంలో జరిగిన బంగారం దోపిడీ నిందితుడిని సర్జికల్ గ్లౌజ్ పట్టించింది.హుజూరాబాద్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్లు -
3 నిమిషాల్లో రూ.3.50 లక్షలు మాయం
వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో మూడు నిమిషాల్లో రూ.3.50లక్షలు చోరీకి గురయ్యాయి. బైక్ ట్యాంక్ కవర్లో పెట్టిన డబ్బులను నిమిషాల్లో మాయం చేశారు. ఈ సంఘటన వేములవాడలో బుధవారం కలకలం రేపింది. వేములవాడ రూరల్ మండలం బాలరాజ్పల్లికి చెందిన నాగరాజు తన ఇంటి నుంచి రూ.2.40లక్షలు తీసుకొని వేములవాడకు వచ్చారు. వేములవాడలోని కేడీసీసీ బ్యాంకు నుంచి మరో రూ.1.10 లక్షల నగదు డ్రా చేసుకున్నాడు. మొత్తం డబ్బులను తన బైక్ ట్యాంక్ కవర్లో పెట్టుకొని పట్టణంలోని విద్యానగర్లోని మాజీ సర్పంచ్ నేదూరి రాజు నివాసానికి చేరుకున్నారు. బైక్ను ఇంటి ముందు నిలిపి ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికే నాగరాజును అనుసరిస్తున్న ముగ్గురు దొంగలు రెండు బైక్లపై అక్కడికి చేరుకొని బైక్ ట్యాంక్ కవర్లో ఉన్న రూ.3.50 లక్షలను తీసుకొని పరారయ్యారు. ఇంట్లో నుంచి వచ్చిన నాగరాజు నగదు లేకపోవడాన్ని గమనించి షాక్కు గురయ్యాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చోరీకి గురైన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటీజీని పరిశీలించారు. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని తల్లగడ ప్రాంతానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. వేములవాడలో బైక్ నుంచి డబ్బులు చోరీ ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు ముఠా పనిగా అనుమానం రంగంలోకి పోలీసులు -
ఆరు దుకాణాల్లో చోరీ
వేములవాడ: పట్టణంలోని జాతరగ్రౌండ్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆషాఢ మాసం నేపథ్యంలో మూసివేసి ఉన్న డేరా షాపులను లక్ష్యంగా చేసుకున్నారు. ఒకే రాత్రిలో ఆరు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. షాపుల తాళాలు పగులగొట్టి లోపల ఉన్న నగదు, విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం షాపులు తెరిచేందుకు వచ్చిన వ్యాపారులు చోరీ జరిగిన విషయం గుర్తించి షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. -
తుపాకీతో బెదిరించి.. దుప్పటితో బంధించి
కరీంనగర్క్రైం: నిషిరాత్రిలో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పీఎంజే జువెల్లరీస్ దోపిడీ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మంగళవారం అర్ధరాత్రి మరో భారీచోరీ జరిగింది. భగత్నగర్లోని ఓ ఇంట్లో చొరబడిన దుండగులు ఇంట్లోవారిని డమ్మీ తుపాకీతో బెదిరించి, ఆపై బంధించి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. వన్టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని భగత్నగర్లో అజ్మత్అలీ భార్య మహముదా బేగం, ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటలకు ఇంటి ఆవరణలో లైట్లు ఆఫ్ చేసేందుకు బయటకొచ్చాడు. అప్పటికే కారిడార్లో మాటువేసి ఉన్న 6 నుంచి 8మంది గుర్తు తెలియని దుండగులు అలీపై దాడి చేశారు. డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరించారు. హాల్లోకి ఈడ్చుకెళ్లి బెడ్షీట్లతో బంధించారు. నోటికి గుడ్డ కట్టి టీవీ శబ్దాన్ని పెంచారు. బెడ్రూమ్లో ఉన్న మహముదా బేగం, ఇద్దరు కుమార్తెలనూ అదే విధంగా బంధించారు. అల్మారా తెరిచి రూ.25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి, రెండు ఖరీదైన సెల్ఫోన్లు అపహరించారు. ఇంట్లో అద్దెకుంటున్న వినోద్, మహ్మద్ గౌసోద్దీన్లకు చెందిన రెండు బైక్లను తీసుకుని పరారయ్యారు. మెల్లిగా తేరుకున్న బాధితులు బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం చోరీ జరిగిన ఇంట్లో దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రలు, పాదముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దుండగులు వదిలివెళ్లిన డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యూపీ– ఢిల్లీ ప్రాంతానికి చెందినట్లుగా, హిందీలో మాట్లాడినట్లు బాధితులు పోలీసులకు వివరించారు. తెలిసినవారి హస్తం ఉందా? ఇంట్లో ఉన్న నగదు, బంగారాన్ని నిందితులు నేరుగా వెళ్లి చోరీచేసిన తీరు, కుటుంబ సభ్యుల కదలికలపై వారికున్న స్పష్టమైన అవగాహనను బట్టి బాధితులకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి సమాచారం ఇచ్చి ఉండొచ్చనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించిన సీపీ గౌస్ ఆలం ఘటనాస్థలాన్ని సీపీ గౌస్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ వెంకటస్వామి పరిశీలించారు. దోపిడీ జరిగిన తీరుపై ఆరా తీశారు. నిందితులను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దుండగులు నగరంలోకి ఏ మార్గంలో వచ్చారు..? దోపిడీ అనంతరం ఏ దిశగా వెళ్లారు, దొంగిలించిన బైక్లను ఎక్కడ వదిలివేశారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దర్యాప్తునకు ప్రతిబంధకంగా మారింది. సమీపంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, టోల్ప్లాజాలు, పెట్రోల్ బంకుల వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వరంగల్ వైపుగా పారిపోయిన నిందితులు నిందితులు దొంగతనం అనంతరం వరంగల్ వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. రెండు వాహనాలపై ఐదుగురు వెళ్లి సిరిసిల్ల బై పాస్ రోడ్డులో ఉన్న బంక్లో పెట్రోల్ పోయించుకున్నట్లు గుర్తించారు. వరంగల్ రూట్లో పెద్దపాపయ్యపల్లి వరకు వెళ్లి అక్కడ నుంచి గ్రామీణరోడ్ల గుండా ప్రయాణించినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం 8 మంది వచ్చి ఉంటే, ఐదుగురు మాత్రమే రెండు బై కులపై వరంగల్ వైపునకు వెళ్తే.. మిగితా ముగ్గురు ఎటువైపు వెళ్లారనేదానిపై విచారణ చేస్తున్నారు.


