Jagitial District Latest News
-
పీసీసీలో మనోళ్లకు చోటు
● పీఏసీ కమిటీలో దుద్దిళ్ల, పొన్నం, ఆది ● కేబినెట్లో చోటు కోసం ఉమ్మడి నేతల ఆరాటంసాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన వివిధ పీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రికి చోటు దక్కింది. పీసీసీ కమిటీల్లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లను నియమించారు. ఇటీవల కొంతకాలంగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డికి సలహా కమిటీలో అవకాశం కల్పించారు. డీలిమిటేషన్ కమిటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలను సభ్యులుగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, అందులో నలుగురికి పీసీసీ కమిటీల్లో అవకాశం లభించింది. మంత్రి వర్గంలో ఆది.. మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు మరో బెర్తు ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నా రు. మున్నూరు కాపు సామాజికవర్గం కోణంలో ఆయనకు బెర్తు ఖాయమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. మాదిగ సామాజిక వర్గం తరఫున తమకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని మరో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కోరుతున్నారు. మరోవైపు తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరిన విషయం విధితమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు కేబినెట్లో ఉన్నారు. వీరికి తోడుగా మరో ఒక్క బెర్తు మాత్రమే ఖరారయ్యే అవకాశాలు ఉండటంతో ఈ ఒక్క మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. -
జెండా పండుగ అతిథులు వీరే
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ పండుగకు జిల్లా కేంద్రాల్లో జరిగే ఉత్సవాలకు అతిథులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, జగిత్యాలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, పెద్దపల్లికి రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, రాజన్న సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు జెండా ఆవిష్కరించనున్నారు. -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును శుక్రవారం ఆలయ అధికారి శ్రీకాంత్, పర్యవేక్షణాధికారి రాజమౌలి ఆధ్వర్యంలో చేపట్టారు. 24 రోజులకుగాను హుండీ ఆదాయం రూ.1,00,95,392 సమకూరిందని, 44 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. భక్తులు హుండీలో వేసిన మిశ్రమ బంగారం, వెండికి సీలువేసి,తిరిగి హుండీలో వేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ, స్థానాచార్యుడు కపీందర్, పర్యవేక్షకుడు సునీల్కుమార్, ఎన్.చంద్రశేఖర్, హరిహరనాథ్, ఆలయ సిబ్బంది, ఏఎస్సై శ్రీనివాస్, శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యమల్యాల: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి కృష్ణ(38) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. వైద్య చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసినా, వ్యాధి నయం కాకపోవడంతోపాటు జీవితంపై విరక్తి చెందిన తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. బావిలో పడి వృద్ధుడు మృతిసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన లంక ముత్తయ్య(70) సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు.. ముత్తయ్యకు కొడుకు, కూతురు ఉండగా కూతురు నర్సయ్యపల్లిలో ఉంటోంది. అనారోగ్యంతోపాటు మతిస్థిమితం సరిగా లేని ముత్తయ్య నెలరోజుల క్రితం కూతురు ఇంటికి వచ్చాడు. ఈనెల 18న ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. ఈక్రమంలో అతడు ఇంటికి వెళ్లకపోవడంతో బంధువులు ఇళ్లలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం నర్సయ్యపల్లి శివారులోని వ్యవసాయ బావిలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనబడడంతో ముత్తయ్యగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
మల్లాపూర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలకేంద్రం శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మాట్ల చిన్నపెద్దులు(61)కు భార్య సత్తమ్మ, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం గతంలో గల్ఫ్ వెళ్లి వచ్చి కుమార్తె వివాహం జరిపించాడు. ఎనిమిదేళ్లుగా స్వగ్రామంలోనే ఉంటూ ట్రాక్టర్ నడిపించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన శనిగారపు రమేశ్కు చెందిన వ్యవసాయ భూమిలో చిన్నపెద్దులు ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్నాడు. రివర్స్ వెళ్లే క్రమంలో ట్రాక్టర్ వ్యవసాయబావిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. నీటమునిగి చిన్నపెద్దులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి భార్య సత్తెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. -
జగిత్యాల మున్సిపాలిటీకే అధిక నిధులు
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి రాని నిధులు జగిత్యాల మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగిందని, జగిత్యాల పట్టణాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో రూ.5 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు, 25వ వార్డులో రూ.8 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 4,520 డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మించగా పేదల సొంతింటి కల సాకారమైందన్నారు. పట్టణంలో 18 వేల ఇళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వడంతో పాటు, ఉచిత బస్సు సౌకర్యం, సన్నబియ్యం పంపిణీ, రాజీవ్ యువ వికాసం అందజేయడం జరుగుతోందన్నారు. బీట్బజార్ మార్కెట్ త్వరలోనే ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టడం వల్ల రానున్న వర్షకాలంలో వార్డులన్నీ జలమయం అయ్యే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కూతురు రాజేశ్, కూసరి అనిల్, నర్సమ్మ, గంగమల్లు, రాజకుమార్, డీఈ వరుణ్, ఏఈలు చరణ్, అనిల్ పాల్గొన్నారు. -
పొగాకు నిర్మూలిద్దాం
● విచ్చలవిడిగా తంబాకు, గుట్కా వినియోగం ● బహిరంగంగానే ధూమపానం ● పెరుగుతున్న సిగరేట్లు కాల్చే వారి సంఖ్య ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంకరీంనగర్టౌన్: యువత ఎంజాయ్ చేస్తున్నామనే భావనలో ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. సిగరేట్ కాలినట్లే తమ ఆరోగ్యం కాలిపోతుందనే విషయం గమనించలేకపోతున్నారు. జిల్లాలో యుక్తవయస్సు వచ్చిన విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సిగరేట్, బీడీ, తంబాకు, జర్ధా, గుట్కా వంటి మత్తు పొగాకు మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదాగా మొదలు పెట్టి చివరకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులపై నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటి వల్ల వివిధ రకాల రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నా తినేవారిలో మార్పు రావడం లేదు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కథనం.బహిరంగ ధూమపానం నేరం ధూమపానం నష్టాన్ని గుర్తించిన పాలకులు 2003లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని చట్టం తీసుకువచ్చారు. చట్ట ప్రకారం ప్రయాణ ప్రాంగణాలు, పార్కులు, రోడ్లపై, సినిమా థియేటర్లు, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే చట్టరీత్యా చర్యలతో పాటు జరిమానా విధించాలి. కానీ, జిల్లాలో అలాంటి కేసులు నమోదు కావడం లేదు. సిగరేట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని ప్యాకెట్లపై ముద్రించి వదిలేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై మరింత కఠిన నియంత్రణలు విధించాలని, విద్యాసంస్థల పరిసరాల్లో గుట్కా, సిగరెట్ అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని ఆరోగ్య కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు
జగిత్యాల: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ లత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతిశాఖకు చెందిన అధికారులు, సిబ్బంది వేడుకలకు హాజరు కావాలని, వారికి సంబంధించిన ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఏఎన్ఎం ఆధ్వర్యంలో వైద్య బృందాలతో శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానపత్రాలు అందేలా చూడాలన్నారు. మెప్మా ఆధ్వర్యంలో స్వశక్తి సంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలని, ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించి అందించాలన్నారు. అదనపు ఎస్పీ భీంరావు ఉన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు రాయికల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందవద్దని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని ఐకేపీ కేంద్రం నిర్వాహకులకు సూచించారు. మైతాపూర్ గ్రా మంలోని శివమణి రైస్మిల్లును సందర్శించి కొ నుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని త్వ రితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్ వెంట ఉన్నారు.● అదనపు కలెక్టర్ బీఎస్.లత -
రోళ్లవాగు పనులు ప్రారంభం
సారంగాపూర్: సుదీర్ఘకాలం తరువాత రోళ్లవాగు ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు కట్ట(బండ్)పై 1,275 మీటర్ల పొడవుతో పారపెట్ వాల్(పిట్టగోడ) నిర్మాణం చేపట్టారు. పనులు సత్వరమే పూర్తి చేసి, పంటలకు నీరందించాలని రైతుల డిమాండ్ మేరకు పనులు ప్రారంభం కావడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. పారపెట్ వాల్ నిర్మాణంతో పాటు మూడు తూములకు గేట్లు బిగించాలని కోరుతున్నారు. గేట్లు బిగింపు జరగకపోతే ప్రాజెక్టులోకి వచ్చే వర్షపునీరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీ–53, 12 ఎల్ కాలువ నీరు గోదావరిలో కలుస్తుందని చెబుతున్నారు. రూ.153.81కోట్లతో ప్రాజెక్టు బీర్పూర్ శివారులో 2015–16 సంవత్సరంలో రూ.60 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. పలు సాంకేతిక కారణాలతో ఆలస్యం అయ్యా యి. దీంతో వ్యయం భారీగా పెరిగి రూ.136.81 కోట్లకు చేరింది. ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయి. ఏడాదికాలంగా నిధుల లేమితో మిగితా పనులకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు అటవీశాఖ అనుమతులు ఆలస్యమయ్యాయి. ప్రభుత్వం ప్రాజె క్టు పనులు పూర్తి చేయడానికి ఇటీవల రూ.17కోట్లు విడుదల చేసింది. దీంతో రోళ్లవాగు వ్యయం రూ.153.81కోట్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తయితే బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని 15వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టులో అటవీశాఖకు భూములు ముంపునకు గురికావడంతో పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. త్వరలో అటవీశాఖ నుంచి పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి పంటలకు నీటి విడుదల చేసేందుకు మూడు స్లూయిస్(తూములు)ఏర్పాటు చేశారు. వీటికి గేట్లు బిగించాల్సి ఉంది. ప్రాజెక్టుకు 1,500మీటర్ల పొడవుతో మూడు కట్టల(బండ్) నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో 1,275 మీట ర్ల కట్ట పూర్తి కాగా, 1275 మీటర్ల పొడవుతో పారపెట్ వాల్ పనులు చేపడుతున్నారు. ఈ ఖరీఫ్లో రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈ ఛక్రూనాయక్ వెల్లడించారు. 1,275 మీటర్ల పారాపెట్ వాల్ నిర్మాణం ప్రాజెక్టు పనులకు గతంలో రూ.136.81 కోట్లు ఖర్చు ఇటీవల మరో రూ.17 కోట్లు విడుదల -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● డీఈవో శ్రీరామ్ మొండయ్యకరీంనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మక విద్య లభిస్తుందని, పాఠశాలల బలోపేతానికి ఎస్జీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆరు రోజుల పాటు బడిబాట ప్రచార రథాన్ని నిర్వహించడం అభినందనీయమని డీఈవో శ్రీరామ్ మొండయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు కోసం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల ఉమ్మడి జిల్లా ప్రచార రథాన్ని డీఈవో శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జూన్ 5 వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి మాట్లాడుతూ, న్యాయపరంగా రావాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తామని, ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యార్థులు తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విజయేందర్రెడ్డి, మంజుల హరిప్రియ, రమణారెడ్డి, సత్యం, కిషన్, సుధాకర్రావు, గాయత్రి, రోహిణిదేవి, సాగర్, మాధవ్, రామన్, వెంకటేశ్, అరవింద్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
సేవ.. స్వచ్ఛంద తోవ
● రాజన్న సేవలో మహిళలు ● ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరు ● గోశాలలోని గడ్డి ఆరబెట్టేందుకు తరలివచ్చిన అతివలు వేములవాడ: రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు రాజన్న సేవలో తరిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. హుండీ లెక్కింపు.. ఉత్సవాల సమయాల్లో ఆలయంలో వివిధ సేవల్లో రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన తిప్పాపూర్ గోశాలలోని గడ్డిని ఆరబెట్టేందుకు సైతం శుక్రవారం భారీగా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారు. పశువులకు సేవా చేయడంలో ఉన్న సంతృప్తి వేరేదాంట్లో రాదని వారు పేర్కొంటున్నారు. దాదాపు 63 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి కోడెలకు ఉపయోగపడే గడ్డిని ఆరబెట్టే పనుల్లో నిమగ్నమై.. ఆదర్శంగా నిలిచారు. -
‘బంటియా’ ఫర్నీచర్ షోరూం ప్రారంభం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎదురుగా నూతనంగా ఏ ర్పాటు చేసిన బంటియా ఫర్నీచర్ షోరూంను శు క్రవారం బంటియా మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ బంటియాతో కలిసి సుడా చైర్మన్ కె.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేందర్ బంటియా మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు పొందిన బంటియా ఫర్నీచర్స్ ఇప్పుడు కరీంనగర్లో తన అతిపెద్ద షోరూంను గ్రాండ్గా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి దిగుమతి చేసిన తాజా, నాణ్యమైన ఫర్నిచర్ ఉత్పత్తులను అందిస్తున్నామని అన్నారు. రూ.99,999కి పైగా కొనుగోలు చేసే కస్టమర్లకు హోండా యాక్టివా 6జీ ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రత్యేక బహుమతులు, డిసౌంట్లు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ ఆధారిత రీకై ్లనర్లు రూ.99,999లకు లభిస్తాయన్నారు. క్రేవింగ్ సోఫాలు రూ. 66,000 నుంచి ప్రారంభమవుతాయని, ప్యాకేజీలు, జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
మహిళల రక్షణకు భరోసా కేంద్రం
జగిత్యాల: మహిళల రక్షణకు భరోసాకేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని డీఈవో రాము పేర్కొన్నారు. ఓల్డ్ హైస్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భరోసా సెంటర్ బృందం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల కోసం భరోసా బృందం పనిచేస్తుందని, బాలికలు, మహిళలను వేధింపులకు గురిచేస్తే ఫోక్సో చట్టం ప్రకారం కేసు చేయడం జరుగుతుందని, మహిళలు భరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే ఫోన్ చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. భరోసా సెంటర్ సభ్యులు సుజాత, సునీత పాల్గొన్నారు. జీలుగ విత్తనాల కొరత లేదు జగిత్యాలఅగ్రికల్చర్/కోరుట్ల: జిల్లాలో జీలుగ విత్తనాల కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. జిల్లాలోని కోరుట్ల మండలంలో జీలుగ విత్తనాలు లేవన్నది వాస్తవం కాదని అన్నారు. కోరుట్లకు బుధవారం 666 బస్తాల జీలుగ వచ్చిందని, గురువారం 251 బస్తాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కోరుట్లలో 415 బస్తాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు ఏడీఏ రమేశ్, ఏవో నాగమణి కోరుట్లలో జీలుగ విక్రయించే కేంద్రాలను శుక్రవారం పరిశీలించారని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి జగిత్యాల: నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు అరుణ అన్నారు. జిల్లా కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం ఎన్నికై నెల రోజులు కావస్తున్నా పాత కార్యవర్గం సంఘం భవనాన్ని అప్పగించకపోవడంతో అందరి సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోని నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉమ్మడి నారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ రాజేందర్, ట్రెజరర్ నారాయణ పాల్గొన్నారు. వెంకటేశ్వరుడికి క్షీరాభిషేకం ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకంను ఘనంగా నిర్వహించారు. అనంతరం రంగురంగుల పూలతో అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు మంత్రోచ్ఛవాలతో ప్రత్యేక పూజలు జరిపి, ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. దరఖాస్తులకు ఆహ్వానం జగిత్యాల: జిల్లాలోని మినీ గురుకులం ఒడ్డెలింగాపూర్, మల్లాపూర్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇంగ్లిష్ మీడియంలో ఖాళీగా ఉన్న సీట్లకు గిరిజన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారి వెంకన్న తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో 1వ తరగతిలో 60, 2వ తరగతిలో 12, 3వ తరగతిలో 1, 5వ తరగతిలో 25 సీట్లకు ప్రవేశాలున్నాయని, ఆసక్తి గల గిరిజన విద్యార్థులు జూన్ 6లోపు దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 96521 41962 సంప్రదించాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని గంగారం శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కూనారం గ్రామానికి చెందిన ఎండీ అక్రం(27) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలో మెకానిక్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న అక్రం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఆటోట్రాలీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అక్రం అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ పేర్కొన్నారు. మృతుడికి భార్య సమీరాబేగం, తల్లి దండ్రులు రేష్మ బేగం అక్బర్ పాషా ఉన్నారు. -
బైక్.. టిప్పర్.. బస్సు ఢీ
● ముగ్గురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపుమల్యాల(చొప్పదండి): ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని, హఠాత్తుగా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న సంఘటనలో ముగ్గురు గాయపడిన సంఘటన మ ల్యాల మండలంలోని రాజారం గ్రా మ శివారులో చోటుచేసుకుంది. శుక్రవారం జగిత్యాల నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న టిప్పర్ రాజారం శివారులో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు నీరజ్తోపాటు మరో ఇద్దరు గాయపడగా, 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. బైక్ను ఢీకొన్న లారీ డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో వెనక ఉన్న ఆర్టీసీ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఈ సంఘటనలో బస్సు అద్దాలు పగిలి, ముందుభాగం దెబ్బతిన్నది. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం
కొత్తపల్లి(కరీంనగర్): టీపీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైందని ఎస్ఈ మేక రమేశ్బాబు అన్నారు. విద్యుత్ భవన్లోని ఎస్ఈ చాంబర్లో శుక్రవారం ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. గత సంవత్సరం నవంబర్ నెల నుంచి వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని.. అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంతో విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించామన్నారు. లోడ్ పెరిగే అవకాశమున్నచోట్ల రాచర్ల తిమ్మాపూర్, మొయినకుంట, జేపీనగర్, బోనాల, మల్లారం, రేణిగుంట ప్రాంతాల్లో 5 ఎంవీఏ, కరీంనగర్ టౌన్ బ్యాంక్ కాలనీలో 12.5 ఎంవీఏ కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పామని, కరీంనగర్ టౌన్ ఉజ్వల పార్క్, వాటర్ వర్క్స్, ఎస్ఆర్ఆర్, నవపేట్, వీర్నపల్లి ప్రాంతాల్లో 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏ, సప్తగిరికాలనీ సాయినగర్(ఖాజీపూర్–2)లో 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏ, కోర్కల్, వట్టములలో 3.15 నుంచి 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం వరకు పెంచామని వివరించారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కాజిపూర్(బాబుపేట్), చిగురుమామిడి, సిరిసిల్ల జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లోడ్ సామర్థ్యం పెంచడంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివారించగలిగామని చెప్పారు. ఇప్పటివరకు 325 కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతోపాటు 355 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో అల్గునూరు, చిగురుమామిడి, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర ప్రాంతాల్లో ఓవర్ లోడ్ తగ్గించామని, గత నవంబర్ నెల నుంచి నిరంతరాయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ వేసవికాల ముందస్తు కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేశామని తెలిపారు. -
పొగాకుతో గుండెకు ముప్పు
పాన్, గుట్కా, తంబాకు, సిగరెట్లలో నికోటిన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలను సంకుచితం చేస్తాయి. దీంతో రక్తప్రసరణ తగ్గి గుండైపె ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంగా వీటిని వినియోగించే వారిలో గుండెపోటు, పక్షవాతం, హైపర్టెన్షన్ వంటి తీవ్రమైన కార్డియోవాస్కులర్ సమస్యలు వస్తాయి. పొగాకు వల్ల శరీరంలో శ్రీకోలెస్ట్రాల్శ్రీ స్థాయి పెరిగి, నాళాల్లో శ్రీబ్లాక్శ్రీ ఏర్పడుతుంది. ఇది గుండెకు రక్తసరఫరాను తగ్గించి ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మితాహారం, వ్యాయామం పాటించడం ఎంతో అవసరం. – డాక్టర్ అనీశ్పబ్బ, కార్డియాలజిస్టు -
ఒడ్డెలింగాపూర్ను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలి
రాయికల్: ఒడ్డెలింగాపూర్ను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలని రాష్ట్ర తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మాట్లాడుతూ, ఆదివాసీల పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని, విద్య, వైద్య సౌకర్యాలను కల్పించాలని, ఒడ్డెలింగాపూర్ను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలని కోరారు. దీంతో గిరిజనులకు, ఎస్టీలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఆయన వెంట నాయకులు ఆత్రం రవీందర్, పరంచ శంకర్ ఉన్నారు. సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు సారంగాపూర్: సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని పొలాస పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి. రవి, ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ కె. స్వాతి అన్నారు. శుక్రవారం మండలంలోని పెంబట్ల గ్రామంలో రైతుముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనిక ఎరువులతోపాటు, పురుగు మందులు వాడడం పూర్తిగా తగ్గి స్తేనే నేలతో పాటు, పర్యావరణం కాపాడుకోని పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రదీప్ రెడ్డి, ఏఈవో అంజనేయులు, రైతులు పాల్గొన్నారు. -
జగిత్యాల
న్యూస్రీల్జిల్లాకు తేలికపాటి వర్ష సూచనజగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదురోజుల్లో అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధనస్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో జిల్లాలో అక్కడక్కడ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 36నుంచి 37 డిగ్రీల సెల్సియస్గా, రాత్రి ఉష్ణోగ్రత 26–28 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 59075 శాతం, మధ్యాహ్నం 26–51శాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. Iశనివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2025 -
ధాన్యం వెంటనే తరలించండి
సారంగాపూర్: వర్షాలు పడుతున్నందున తూకం వేసిన ధాన్యం వెంటవెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బీర్పూర్ మండలం కందెనకుంట, చర్లపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం తూకం వేసిన వెంటనే మిల్లులకు లారీల్లో తరలించాలని, లారీలు ఎప్పటికప్పుడు కేంద్రాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, ఇతర అధికారులను ఆదేశించారు. కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, రెండు రోజుల్లో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్ హమీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీవో మదుసూధన్, తహసీల్దార్ సుజాత ఉన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు వేళాయె శాతవాహనలో న్యాయ విద్య
వివరాలు 8లోఇళ్ల నిర్మాణాల అనుమతులకు బిల్డ్ నౌ● ఏఐ ఆధారిత వ్యవస్థతో.. ● కొత్త విధానం ప్రారంభంజగిత్యాల: భవనాల నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు ఆధునాతన సాంకేతికతతో రూపొందించిన బిల్డ్ నౌ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. గత నెలలోనే మెట్రో నగరంలో ఏఐ సాంకేతికతతో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తాజాగా మున్సిపాలిటీల్లోనూ అమలవుతోంది. కృత్రిమ మేథా సాంకేతికతతో ఇంటి నిర్మాణ అనుమతులు పొందడంలో సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ ఉండేది. ఇంటి అనుమతులు పొందడంలో ఇబ్బందులు ఉన్నాయన్న నేపథ్యంలో ఆ విధానాన్ని రద్దు చేసి బిల్డ్ నౌ తీసుకొచ్చింది. ఏఐ ఆధారిత వ్యవస్థతో బ్లాక్ చైన్, రియాల్టీ, ఆటోమేషన్ వంటివి తీసుకొచ్చారు. ఇందులో ఇంటి నిర్మాణ స్థలం, లేఅవుట్ సరిహద్దులను తెలుసుకునేందుకు జీపీఎస్ ఆధారిత పటాలను పొందుపర్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా మన ఇంటి నిర్మాణ దరఖాస్తు ఏ స్టేజీలో ఉందని వాట్సాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఏవైనా తప్పుడు దరఖాస్తులు చేసుకున్నా మళ్లీ సవరించుకునే అవకాశం కల్పించారు. భవన నిర్మాణాలకు సంబంధించి పరిశీలనకు వెళ్తే ఏఐ ఆధారంగా రెండు నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. వీడియో ద్వారా వీక్షించే అవకాశం ఉంది. ఇందులో హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంది. అనుమతి 15 రోజుల్లోనే... 500 చదరపు మీటర్లలోపు భవనం నిర్మాణం చేపడితే 15 రోజుల్లోనే అనుమతులు జారీ చేయనున్నారు. 500కు పైగా ఉంటే 21 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు ఈ మేరకు గురువారం నుంచి బిల్డ్ నౌ ద్వారానే అనుమతులు జారీ చేస్తున్నారు. ఏఐ సాంకేతికతతో ఏఐ సాంకేతికతతో బిల్డ్నౌ విధానంలో ఇంటి అనుమతులు ఇవ్వనున్నాం. పాత టీఎస్ బీపాస్ రద్దు అయింది. ప్రస్తుతం జిల్లాలో ఈ కొత్త బిల్డ్నౌ ద్వారానే అనుమతులు లభించనున్నాయి. – శ్రీనివాస్, టీపీవో -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలని.. అనర్హులకు ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు వానాకాలం పంటలసాగు సన్నద్ధతపై కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఖరీఫ్ సీజన్లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను భాగస్వామ్యం చేస్తాం. ఎస్సారెస్పీ సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీసిల్టేషన్ ఆధునిక పద్ధతుల్లో పూర్తిచేసి పూర్వపు సామర్థ్యం తీసుకొస్తాం. కడెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తాం. కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా.. ఇందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో ముందుకు వెళ్తా. సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తాం. పాలకుర్తి ఎత్తిపోతల పథకం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.● రోళ్లవాగు ప్రాజెక్టు అటవీ అనుమతులు వచ్చేలా ఉన్నతాధికారులతో జగిత్యాల కలెక్టర్ నిరంతరం సంప్రదింపులు చేయాలని మంత్రి సూచించారు. నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలుచేస్తుందన్నారు. కలెక్టర్లు మరోవారం కొనుగోలు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైనమేర ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధం చేసుకోవాలని.. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు వాడాలన్నారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణలోని 84 శాతం జనాభాకు ఉచితంగా ఆరుకిలోల సన్నబియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది విప్లవాత్మక పథకమని.. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రం మనదే అని తెలిపారు.ఇళ్ల స్థలాలపై ఆందోళన వద్దు..మీడియా మిత్రులకు ఎస్సారెస్పీ సమీపంలో అందుబాటులో ఉన్న భూములు పంపిణీకి ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కరీంనగర్ మీడియా మిత్రులు ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో చర్చించి త్వరలో పట్టాలు అందించే కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతుల నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. భూ భారతి చట్టంతో పట్టాదారులకు ఎటువంటి నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో రైస్ మిల్లులవద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. మలకపేట, సూరమ్మ, మోతె నారాయణపూర్, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టుల పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోకి భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలు వస్తాయని.. ఆయా జిల్లా కలెక్టర్లను సైతం సమీక్ష సమావేశాలకు ఆహ్వానించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయ రమణా రావు, డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, సత్య ప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ జె.అరుణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. -
శాతవాహనలో న్యాయ విద్య
కరీంనగర్క్రైం: లా చదవాలనే విద్యార్థులు కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ న్యాయ కళాశాల లేకపోవడంతో చాలా ఇబ్బందులుపడ్డారు. కాగా, ఇటీవల శాతవాహన యూనివర్సిటీకి న్యాయ కళాశాల మంజూరు కావడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. బీసీఐ నుంచి గ్రీన్లిగ్నల్ దేశవ్యాప్తంగా ఎక్కడ లా కళాశాల ఏర్పాటు చేయాలన్నా స్థానిక ప్రభుత్వ అనుమతితో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) అనుమతి కీలకం. ఈనేపథ్యంలో శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని 11 నవంబర్ 2024న వైస్ చాన్స్లర్ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈక్రమంలో శాతవాహనలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం తరగతులు నిర్వహించేందుకు ఫిబ్రవరి 2025లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు జారీ చేసింది. దీంతో ఎల్ఎల్బీ తరగతులకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. న్యాయకళాశాల భవన నిర్మాణం, ఇతరత్రా అవసరాలకు సుమారు రూ.22 కోట్లు మంజూరయ్యాయి. భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని మొదటి అంతస్తులో తరగతులు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల టీచింగ్, నాన్టీచింగ్ కోసం 35 పోస్టులు అవసరం ఉండడంతో వీటి కేటాయింపునకు కేబినెట్లో ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. కేబినెట్ సమావేశం కాగానే పోస్టుల భర్తీ జరుగుతుందని యూనివర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. పట్టా చేతిలో ఉంటే పుట్టెడు మార్గాలు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పట్టా చేతిలో ఉంటే ఉపాధికి పుట్టెడు మార్గాలుంటాయి. సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా లా ప్రాక్టిస్ చేసుకోవడంతో పాటు వివిధ కంపెనీలకు లీగల్ అడ్వైజర్లుగా ఉండడం, జిల్లా జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇవే కాకుండా ఇతర శాఖల్లో కూడా లా చదివిన వారిని వివిధ కమిషన్ మెంబర్లు, కమిటీ మెంబర్లుగా నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఎల్ఎల్ఎం చేసిన వారు ఎల్ఎల్బీ తరగతులు చెప్పడంతోపాటు ఇతర అవకాశాలు ఉండడంతో చాలా మంది న్యాయవిద్యపై ఆసక్తి చూపిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా లా కాలేజీలు రెండు మాత్రమే అవి కూడా ప్రైవేట్ కళాశాలలు మాత్రమే నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఎస్యూలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు కావడంతో ఇక్కడి ప్రాంత విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని విద్యార్థి సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఎల్ఎల్బీలో 120, ఎల్ఎల్ఎం 20 సీట్లు రూ.22కోట్లతో భవన నిర్మాణ, మౌలిక సదుపాయాలు త్వరలో 35 మంది టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఈ అకడమిక్ నుంచి తరగతులు ప్రారంభం కోర్సు సెక్షన్లు సీట్లు ఎల్ఎల్బీ 2 120 ఎల్ఎల్ఎం 1 20 ఈ సంవత్సరం నుంచి తరగతులు శాతవాహన యూనివర్సిటీకి న్యాయ కళాశాల మంజూరైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి ఆర్ట్స్ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తున్నాం. భవనాలు నిర్మించిన తర్వాత శాశ్వతంగా ప్రత్యేక వసతి సౌకర్యాలు ఉంటాయి. – ప్రొఫెసర్ ఉమేశ్కుమార్, శాతవాహన వీసీ -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం
● ఎమ్మెల్సీ మల్క కొమురయ్యజగిత్యాల: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని, నాణ్యమైన విద్య అందించడానికి కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న ఉపాధ్యా య శిక్షణ కేంద్రాలను గురువారం సందర్శించారు. అభ్యాసన సామర్థ్యాలను పెంచుకుని పాఠశాలల్లో బోధించాలన్నారు. ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. డీఈ వో రాము మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతంగా పాఠశాలల్లో బోధన నడుస్తోందని, మరింత మెరుగుపర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయినందుకు భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. సెక్టోరియల్ అధికారులు కొక్కుల రాజేశ్, సత్యనారాయణ, బోనగిరి దేవయ్య, ప్రసాద్రావు, నరేందర్రావు, ఒడ్నాల రాజశేఖర్, మచ్చ శంకర్ పాల్గొన్నారు. మోసం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోం ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు మెట్పల్లి: బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లిన వారు తిరిగి వస్తే చేర్చుకునే ప్రసక్తి లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్లో పదవులతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందిన కొందరు ప్రభుత్వం మారిన తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లారని, అలాంటి వారు ఆ పార్టీల్లో ఇమడలేక తిరిగి బీఆర్ఎస్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోబోమన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి తప్పకుండా తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకపోవాలన్నారు. సమావేశంలో పట్టణాధ్యక్షులు చంద్రశేఖర్రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. షరతుల్లేకుండా పథకాలు అందించాలి ● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత రాయికల్: నిరుద్యోగులకు సంక్షేమ పథకాలను షరతులు లేకుండా అమలు చేయాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాయికల్లో విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కేవలం అరగుంటకే పరిమితం చేశారని, సిబిల్ స్కోర్ ఉన్న నిరుద్యోగులకే యువ వికాసం అమలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. పథకాల అమలులో జాప్యం చేయడం కోసమే ఇలాంటి షరతులు పెట్టారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్కుమార్, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, కో–ఆర్డినేటర్ శ్రీధర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ ఎనగందుల ఉదయశ్రీ, మారంపల్లి రాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ మారే స్వేచ్ఛ కవితకుంది
● మాజీమంత్రి జీవన్రెడ్డి జగిత్యాలటౌన్: పార్టీ మారే స్వేచ్ఛ కవితకు ఉందని, అయితే ఆమె పార్టీ మారుతుందని తా ను భావించడం లేదని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. ఆమె పార్టీ పెడితే ఎమ్మెల్యేలు వెళ్తారన్న గ్యారంటీలేదని, వారేమీ అంగట్లో సరు కు కాదని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన కవిత పార్టీ మారుతుందని తాను భావించడం లేదన్నారు. వరికి క్వింటాల్కు రూ.69 పెంచి కేంద్రం ఆర్భాటం చేయడం సరికాదని రూ. 500 పెంచితే తాము సంబరాల్లో పాల్గొంటా మని తెలిపారు. రుణమాఫీ చేయాలన్న ఆలో చన కాంగ్రెస్కు తప్ప మరో పార్టీకి రాలేదన్నారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, జున్ను రాజేందర్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు రానీయొద్దు మల్లాపూర్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించాలని సూచించారు. లీకేజీ మరమ్మతుకు ఉపాధి హామీ నిధులు వినియోగించుకోవాలన్నారు. మహిళా సంఘాలతో ఆయిల్ బాల్స్ తయారు చేయించి నిల్వ నీరులో వేయించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించాలని పేర్కొన్నారు. ఎంపీడీవో శశికుమార్రెడ్డి, ఎంపీవో జగదీష్, మండల వైద్యాధికారి వాహిని, పీహెచ్సీ సీహెచ్వో రామ్మోహన్ అధికారులు పాల్గొన్నారు. కూలీలకు రూ.307 వచ్చేలా చూడాలిసారంగాపూర్: ఉపాధి కూలీలకు రోజుకు రూ.307 వేతనం అందేలా పనులు చేయించాలని పథకం జిల్లా విజిలెన్స్ అధికారి దేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పెంబట్ల, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లోని అటవీప్రాంతాల్లో జరుగుతున్న కందకాల పనులు, గొర్రెలు, గేదెలు, కోళ్ల పెంపకం షెడ్లను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏపీవో శ్రీలత, టీఏ స్వప్న, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు ఉన్నారు. -
నిరుపేదల సొంతింటి కల సాకారం
మల్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలకేంద్రంలో గురువారం 303మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ అర్హులందరికీ సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులు ప్రభుత్వం సూచించిన మేరకే ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. జియో ట్యాగింగ్ చేసిన స్థలంలో మాత్రమే నిర్మాణం చేపట్టాలన్నారు. తహసీల్దార్ వసంత, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి, ముత్యాల రాంలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
జగిత్యాలక్రైం: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం నేర సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతి, తాజా నేరాల విశ్లేషణ, నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రాత్రివేళల్లో గస్తీ బలోపేతం, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలపై సమీక్షించారు. బక్రీద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. గోవధ, గోవుల అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. గోదావరి పరీవాహక రైతులకు నకిలీ పత్తి విత్తనాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేసి అమ్మకాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించారు. అదనపు ఎస్పీ భీంరావు, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, రంగారెడ్డి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బక్రీద్కు ఏర్పాట్లు పూర్తి చేయాలి నేర సమీక్షలో ఎస్పీ అశోక్కుమార్ -
కోరుట్లలోనే నవోదయ
● ఈ విద్యాసంవత్సరమే తరగతులు ● తాత్కాలిక భవనం ఏర్పాటుకోరుట్ల: ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ నవోదయ పాఠశాల కోరుట్లలోనే ఏర్పాటు కానుంది. ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఫైనల్ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభించాలని జవహార్ నవోదయ ఉమ్మడి కరీంనగర్ ప్రిన్సిపాల్కు నవోదయ విద్యాలయాల హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ గోపాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల ఏర్పాటుకు అవసరమైన వసతుల కల్పనకు నవోదయ అధికారులు జగిత్యాల కలెక్టర్తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ ఉత్తర్వులతో ఇప్పటివరకు నవోదయ పాఠశాల ఏర్పాటు విషయంలో కొనసాగిన సస్పెన్షన్కు తెరపడినట్లయ్యింది. జిల్లా నేతల ఆశలు హుళక్కి ఎంపీ అర్వింద్ కృషితో ఆరు నెలల క్రితం పార్లమెంట్ పరిధిలో రెండు నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయి. వీటిలో ఒకటి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లాకు కేటాయించారు. ఈ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో చిక్కు వచ్చి పడింది. జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల అసెంబ్లీ స్థానాలు ఉండగా.. నవోదయ విద్యాలయాన్ని జగిత్యాల, ధర్మపురి పరిధిలో ఏర్పాటు చేయాలని ఆయా నియోజకవర్గ కీలక నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఒక దశలో జిల్లా కేంద్రం లేదా పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో ఏర్పాటు కానుందన్న ప్రచారం జరిగింది. సుమారు ఆరు నెలల పాటు ఈ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరికి కోరుట్లలో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కీలక నేతల పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి. ఈ విద్యాసంవత్సరమే.. కోరుట్లలో ఏర్పాటుకానున్న నవోదయ విద్యాలయంలో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి తాత్కాలికంగా పట్టణంలోని వేములవాడ రోడ్లో ఉన్న వసతి గృహంతోపాటు నెల క్రితం వరకు కొనసాగిన అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులు ఉన్న భవనాన్ని కేటాయించారు. ఈ భవనాల్లో తరగతులు ప్రారంభించనున్నారు. శాశ్వత భవనం కోసం పట్టణంలోని జంబి గద్దెల వద్దగల 923 సర్వే నంబర్లో 23 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పుట్టిన గడ్డపై మమకారం.. ఎంపీ అర్వింద్ అమ్మమ్మది కోరుట్ల. ఇక్కడే బురుజు కూరగాయాల మార్కెట్ సమీపంలోగల ఆయన అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. చిన్నతనంలో పాఠశాల సెలవుల్లో ఇక్కడికి వచ్చినప్పుడల్లా పరిసర ప్రాంతాల వారితో గడిపేవాడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అర్వింద్ కోరుట్ల నుంచి పోటీ చేసిన సమయంలోనూ తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి పాత జ్ఞాపకాలను మననం చేసుకుని చుట్టుపక్కల వారందరిని పలకరించి ఆప్యాయతను చూపారు. ఈ క్రమంలోనే జగిత్యాల, ధర్మపురి ప్రాంతాల్లోని కీలక నేతలు నవోదయ పాఠశాలను తమ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని పంతాలకు వెళ్లినా అర్వింద్ మాత్రం పుట్టిన గడ్డకు ప్రాధాన్యం ఇచ్చి కోరుట్లలో నవోదయ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ చిత్రపటానికి క్షీరాభిషేకంకోరుట్లకు నవోదయ మంజూరు చేసిన ఎంపీ చిత్రపటానికి బీజేపీ నాయకులు గురువారం క్షీరాభిషేకం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబు, ఓబీసీ ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, జిల్లా పదాధికారులు వడ్డేపల్లి శ్రీనివాస్, కస్తూరి లక్ష్మీనారాయణ, తులసి కృష్ణ ఉన్నారు. ఈ విద్యాసంవత్సరమే ప్రారంభం కోరుట్లలో నవోదయ విద్యాలయం ఈ విద్యాసంవత్సరమే ప్రారంభం అవుతుంది. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఈ పాఠశాల ఎంతగానో ప్రయోజకరంగా ఉంటుంది. పాఠశాల శాశ్వత భవనం నిర్మాణం, ఇతర వసతుల కల్పనకు ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే చర్యలు చేపడతాం. – ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ -
ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం
మెట్పల్లిరూరల్: ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. మెట్పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన పలువురితో వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, మందుల స్టాక్ పరిశీలించారు. క్షయ సంబంధిత కేసులు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతి, ఇతరత్రా విషయాలు తెలుసుకున్నారు. ఫీవ ర్ సర్వే, దోమలతో కలిగే వ్యాధులను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించేలా కృషి చేయాలని సూచించారు. వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎల్హెచ్పీ డాక్టర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలతో సమీక్షించారు. మండల వైద్యాధికారి ఎల్లాల అంజిత్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు వేళాయె..
● ఈనెల 31 నుంచి ఆన్లైన్లో స్వీకరణ కరీంనగర్: రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీలో 2025–26 విద్యా సంవత్సరం (1,500 మంది) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు. ఫీజుల వివరాలు రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్కు అ ర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లే దు. ప్రవేశ సమయంలో ఆరోగ్యబీమా, ఇతరాలకు సంబందించి రూ.3,500 ఇ తరులకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 3,000 చెల్లించాలి. క్యాషన్ (దీనిని తిరి గి ఇస్తారు) డిపాజిట్ కింద ఏ కేటగిరి అభ్యర్థులైనా రూ.2,000 చెల్లించాలి. ఇ తర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లో పని చేసే వారి పిల్లలు ఏడాదికి రూ.1.36 లక్షలు, ఎన్ఆర్ఐ విద్యార్థులు రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ–సేవ, మీ– సేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ. 500, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.450, వేరే రాష్ట్రం వారు రూ.1,500 చెల్లించాలి. ప్రవేశాల షెడ్యూల్, అర్హతలు ఈనెల 31 నుంచి జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణ, వికలాంగులు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్, గ్లోబల్ కేటగిరీకి చెందిన వారికి 25 వరకు అవకాశం. జూలై 4న ఎంపిక జాబితా విడుదల, 7న తొలి విడత కౌన్సెలింగ్. విద్యార్థులు ప్రథమ ప్రయత్నంలో 2025–ఎస్సెస్సీ తత్సమాన పరీక్షలో రెగ్యులర్గా ఉత్తీర్ణులై ఉండాలి. 31–12–2024 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. పదో తరగతిలో మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రెవేషన్ స్కోర్ను అదనంగా కలుపుతారు. బాసర ట్రిపుల్ఐటీలో 85శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ–ఏ 7, బీసీ–బీ 10, బీసీ–సీ 1, బీసీ–డీ 7, బీసీ–ఇలకు 4 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2, ఎన్సీసీ విద్యార్థులకు 1 , స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా వేరే రాష్ట్రాల వారికి, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు, రెండు జతల యూనిఫాం, షూలు, ల్యాప్టాప్లు, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
మానకొండూర్: మండలంలోని నిజాయతీగూడెం గ్రామానికి చెందిన తుమ్మనపల్లి శ్రీహర్షిక(3) గురువారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తుమ్మనపల్లి ప్రసాద్ కుమార్తె శ్రీహర్షిక ఇంటినుంచి ఆడుకుంటూ వెళ్లి కచ్చకాయల రామయ్య ఇంటి సమీపంలోని నీటి సంపులో ప్రమాదవశాత్తు పడిపోయింది. శబ్దం వినబడటంతో రామయ్య ఇంటి నుంచి బయటకు వచ్చి బాలికను చూసి కేకలు వేశాడు. కొందరు సంపులోకి బాలికను బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సంజీవ్ వివరించారు. -
అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి
● ఇటు చదువు.. అటు పాటలు ● జానపదగేయాలతో రాణిస్తున్న కట్కూరి స్నేహ ● 40కి పైగా పాటలు రాసిపాడిన యువతి ‘దూసుకోను దువ్వెన తెమ్మంటది.. చూసుకోను అద్దం తెమ్మంటది.. కాటుక తెమ్మంటది.. కాళ్లకు పెట్టుమంటది.. అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి..’ ‘బావో నా బంతి పూల దండ.. నిన్న చూస్తుంటే నా గుండెల గుదిబండ..’ అంటూ స్నేహ పాడితే యువత గుండెలు జారిపోతున్నాయి. ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ జానపద పాటలను రాసి, పాడింది రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన కట్కూరి స్నేహ. చదువుకుంటూనే పాటలు రాస్తున్న యువజానపద గాయనీ గురించి తెలుసుకుందాం.. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన కట్కూరి స్నేహ కరీంనగర్లో ఎంఫార్మసీ చదువుతోంది. ఇప్పటి వరకు 40కి పైగా జానపద గేయాలు రాసి, పాడింది. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పాటల్లో చాలా మటుకు స్నేహ రాసి, పాడినవే. హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో బాలల దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించిన పాటల పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచింది. ఈ పోటీలు ఆమెను పాటలు పాడడం వైపు మళ్లించాయి. బీ ఫార్మసీ చదువుతుండగా తనకు పాటలు రాయాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40కి పైగా పాటలు, రాసి పాడింది. శేఖర్ మాస్టర్ కావాలంటే ఇటీవల రాసి, పాడిన ‘అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి..’ పాట మంచి పేరు తెచ్చిందని పేర్కొంది. చదువుకుంటూనే పాటలు రాస్తానని స్నేహ చెప్పింది. సినిమా పాటలు పాడాలనేది తన జీవిత ఆశయమని పేర్కొంది. -
క్షణికావేశంలో తండ్రిని హత్య చేసిన కొడుకు
మేడిపల్లి: క్షణికావేశంలో కన్న కొడుకే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మేడిపల్లి మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. కోరుట్ల సీఐ సురేశ్బాబు, మేడిపల్లి ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన అంగడి నర్సయ్య అలియస్ గంగారెడ్డి (56) తాగివచ్చి కొడుకు వెంకటేశ్తో ఘర్షణ పడ్డాడు. దీంతో క్షణికావేశంలో వెంకటేశ్ దగ్గరలో ఉన్న ఇనుప వస్తువుతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో గంగారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం వెంకటేశ్ మేడిపల్లి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. నర్సయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు సంతానం. కొడుకు వెంకటేశ్ ఇటీవలే గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వెంకటేశ్కు ఇంకా పెళ్లి కాలేదు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ, ఎస్త్సె వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కరీంనగర్–నిజామాబాద్ రూట్లో ఈడీలక్స్ బస్సులువిద్యానగర్(కరీంనగర్): కరీంనగర్–నిజామాబాద్ రూట్లో గురువారం నుంచి ఈడీలక్స్ బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు కరీంనగర్ 2 డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుంచి 6.30 వరకు, మధ్యాహ్నం 1గంట నుంచి 3.30 వరకు ప్రతీ 30 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని అన్నారు. ఈ బస్సులో ప్రయాణికులకు 10శాతం రాయితీతో పెద్దలకు రూ.230, పిల్లలకు రూ.130 చార్జి ఉంటుందని తెలిపారు. ఎల్ఎల్బీ 4వ సెమిస్టర్ విద్యార్థులకు ప్రత్యేక బ్యాక్లాగ్ అవకాశం కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ నాల్గో సెమిస్టర్ విద్యార్థులకు బ్యాక్లాగ్ పరీక్ష ప్రత్యేక రుసుముతో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డి.సురేశ్కుమార్ తెలిపారు. జూన్ 3వ తేదిలోగా తమ కళాశాలల్లో ప్రతీ పేపర్కు రూ.1500 లు చెల్లించాలని పేర్కొన్నారు. ఎస్యూలో మొదటిదశలో 5,931 డిగ్రీ సీట్ల భర్తీ కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని దోస్త్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 5,931 డిగ్రీ కోర్సుల సీట్ల భర్తీ జరిగింది. ఎస్యూ పరిధిలో మొత్తం 36,540 సీట్ల ఉండగా మొదటి దశలో 5,931 సీట్లు భర్తీ కాగా 30,609 సీట్లు ఖాళీగా మిగిలాయి. 13 ప్రభుత్వ కళాశాలల్లో 297 సీట్లు భర్తీకాగా, 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో 2,047 సీట్లు భర్తీ అయ్యాయి. ఇదిలా ఉండగా 60 ప్రైవేట్ కళాశాలల్లో కలిపి 3,587 మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరిగింది. మొదటిదశలో సీట్లు పొందిన వారు జూన్ 6వ తేదీలోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. -
‘మద్దతు’ ధరపై పెదవి విరుపు
● వరి క్వింటాల్కు రూ.69.. మక్కలకు రూ.175 ● పెరిగిన ధరలతో జిల్లా రైతులకు రూ.63 కోట్ల లాభం జగిత్యాలఅగ్రికల్చర్: ఏటా మాదిరిగానే వానాకాలం సీజన్కు ముందు పంటల మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వరికి క్వింటాల్కు రూ.69 మాత్రమే పెంచడంతో పెద్దగా ఉపయోగం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇలా అరకొరగా పెంచడంతో ఒరిగిందేమీ లేదని చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం 14 పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది. ఇందులో వరి క్వింటాల్కు రూ 69, మొక్కజొన్నకు రూ.175 పెంచింది. దీంతో వరి క్వింటాల్ ధర రూ.2.389కు చేరింది. కామన్ రకానికి రూ.2300 ఉండగా.. తాజగా రూ.2369కు చేరింది. మొక్కజొన్నకు మొన్నటి వరకు రూ.2,225 ఉండగా.. రూ.175 పెరగడంతో రూ.2400కు చేరింది. జిల్లా రైతులకు రూ.63 కోట్ల లాభం జిల్లాలో ప్రతి సీజన్లో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేస్తే 75 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుత ధర రూ.2,320 ప్రకారం రైతులకు రూ.1,740 కోట్లు వస్తే.. పెరిగిన ధర రూ.2,389 ప్రకారం రైతులకు రూ.1791కోట్లు రానున్నాయి. మొక్కజొన్నను దాదాపు 35 వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా.. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున దిగుబడి అంచనా వేస్తే 7 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుత ధర రూ.2,225 ప్రకారం రైతులకు రూ.156 కోట్లు వస్తే.. పెరిగిన ధర రూ.2400 ప్రకారం రూ.168 కోట్లు రానున్నాయి. ఈ లెక్కన రైతులకు అదనంగా రూ.63 కోట్లు రానున్నాయి. పంటలకు మద్దతు ధర పెరగడంతో ఎక్కువగా దొడ్డురకంతోపాటు మొక్కజొన్నను అధికంగా సాగు చేసే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో పర్యటించకపోవడంతోనే పంట సాగు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర ప్రకటించాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా పెంచుతోంది. గతేడాది వరి క్వింటాల్కు రూ.143 పెంచగా.. ఈ ఏడాది కేవలం రూ.69మాత్రమే పెంచింది. మద్దతు ధరలను నిర్ణయించే కేంద్ర వ్యవసాయ ధరల నిర్ణాయక కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి, రైతుల నుంచి సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే కొంత మేలు జరిగేది. గతంలో ఉన్న ధరలకే ఎంతో కొంత శాతం కలిపి ఇస్తుండటంతో సాగు ఖర్చులకు, రైతులకు వచ్చే ఆదాయానికి పొంతన ఉండటం లేదు. ఇవేమీ పట్టించుకోకుండా ధరల నిర్ణాయక కమిషన్ సిద్ధం చేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చే యడంతో రైతులకు అంతంతమాత్రంగానే లాభం చేకూరుతోంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు రెట్టింపు ఆదాయం రావాల్సి ఉండగా.. కనీసం ఖర్చులు కూడా రావడం లేదు. ఏటా రూ.250 పెంచాలి ఏటా వరికి అదనంగా రూ.250 వరకు పెంచితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. రూ.50, రూ.వంద పెంచితే రైతులకు పెద్దగా లాభం ఉండదు. మద్దతు ధర కొంత పెరిగితే కూలీల ఖర్చు రెట్టింపు అవుతోంది. – గడ్డం సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఉత్తమ రైతు, ధర్మపురి సిఫార్సు మేరకు పెంచాలి రైతులు పెట్టిన పెట్టుబడికి రెండింతల ఆదాయం రావాలి. అప్పుడే రైతులు నిలదొక్కుకునే అవకాశం ఉంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంటల ధరలు పెరగడం లేదు. ర్చులకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచాలి. – వెల్ముల రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు, పూడూరు -
పశువుల రవాణా నివారణకు చర్యలు
జగిత్యాలక్రైం: పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి జిల్లాలో చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తామన్నారు. పోలీస్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది నిరంతర నిఘాతో పనిచేస్తారని తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఆవులు, దూడలను రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో ద్వేషపూరిత, రెచ్చగొట్టేలా, అసభ్యకరమైన పోస్టులు పెట్టొద్దని, అలాంటి వారిపై చర్యల కోసం మీడియా మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజారాంపల్లిలో చెక్పోస్ట్ వెల్గటూర్: ఎస్పీ ఆదేశాల మేరకు ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో చెక్పోస్ట్ను ప్రారంభించినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. పశువుల రవాణా నిబంధనల మేరకు జరగాలని, అనుమతి లేకుండా ఆవులు, దూడలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అభివృద్ధి నిరంతర ప్రక్రియ
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల/రాయికల్: అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్లో గిరిజన సంక్షేమ మినీ గురుకులం పాఠశాలలో రూ.40 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయాలతో సంబంధం లేకుండా పని చేస్తున్నానన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనన్నారు. బోర్నపల్లి–జగన్నాథపూర్ బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల కేంద్రమంత్రులను కలిశానని గుర్తుచేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, ఎంపీడీవో చిరంజీవి, ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, మాజీ సర్పంచ్ రవి, సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్రావు, అచ్యుత్రావు, గన్నె రాజిరెడ్డి, అనుపురం శ్రీనివాస్గౌడ్, పడిగెల రవీందర్రెడ్డి, తిరుపతిగౌడ్, ముకీద్ పాల్గొన్నారు. పట్టణాభివృద్ధికి నిరంతర కృషి జగిత్యాల పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని 25, 26 వార్డుల్లో రూ.45లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో డబుల్బెడ్రూం ఇళ్ల వద్ద వసతులకు రూ.34 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.40 కోట్లు తీసుకొచ్చానన్నారు. మున్సిపాలిటీలో 14 జోన్లు, 126 సర్వే నంబర్లను మార్చామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్లు అడువాల జ్యోతి, గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పవన్, షకీల్, భూమయ్య, నాగేశ్వర్ పాల్గొన్నారు. చికిత్స ద్వారానే క్యాన్సర్ నివారణ చికిత్స ద్వారానే క్యాన్సర్ నివారణ సాధ్యమని, మూఢనమ్మకాలు నమ్మవద్దని ఎమ్మెల్యే అన్నారు. ఐఎంఏ, కిమ్స్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తే క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ హేమంత్, శ్రీనివాస్రెడ్డి, మోహన్రెడ్డి, గంగాధర్, మధు, శ్రావణ్, సుదీర్, సురేశ్, నవీన్, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి పాల్గొన్నారు. -
దళిత యువకుడిని చితకబాదిన పోలీసులు
సైదాపూర్: డ్రంకెన్డ్రైవ్లో సహకరించడం లేదని ఓ దళిత యువకుడిని 20 రోజుల క్రితం చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు వివిధ రూపాల్లో బాధితుడికి న్యాయం చేయాలని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బాధితుడు కరీంనగర్ సీపీ, మానవ హక్కుల కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్లో ట్రైనీ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అగస్త్య భార్గవ్గౌడ్ తోటి సిబ్బందితో కలిసి మండలంలోని లస్మన్నపల్లి శివారులో డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తున్నాడు. పోలీసులు ఆపారు. టెస్టు చేసి చలాను వేసిన తర్వాత అతడి వివరాలు రాసుకున్నారు. ఇంతలో మహేందర్కు ఇంటి వద్ద నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న బాధితున్ని సహకరించడం లేదని ఫోన్ తీసుకొని ఎస్ఐ అగస్త్య భార్గవ్గౌడ్తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే చితకబాదారు. చెవి కర్ణభేరి దెబ్బతిని చెవి నుంచి రక్తం కారుతున్నా వదల్లేదని, తర్వాత పోలీస్ స్టేషన్కు పిలిచి తనతో క్షమాపణ పత్రం రాయించుకున్నారని మహేందర్ కమిషన్లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై విచారించాలని కరీంనగర్ సీపీ హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ను ఆదేశించారు. బాధితుడి వాగ్మూలం తీసుకున్న మర్నాడే ఏసీపీ శ్రీనివాస్ బదిలీ కావడంతో పోలీసుల విచారణలో జాప్యం జరుగుతోందని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్ మాత్రం అడిషనల్ డీజీపీ, కరీంనగర్ సీపీకి విచారణ నివేదికను 20 రోజుల్లో అందజేయాలని నోటీసులు జారీ చేసింది. తాను పీజీ బీఈడీ చేసి, నిరుద్యోగిగా కూల్డ్రింకులు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, అకారణంగా చితకబాదడంతో అవమానంతో మానసికంగా భరించలేకపోతున్నాని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మహేందర్ అప్పటికే వేరే సంఘటనలో ఇతరులతో తగాదా పడి దెబ్బలు తిని వస్తున్నాడని, డ్రంకెన్డ్రైవ్ టెస్టులో సహకరించకుండా పోలీసులలో దుర్భాషలాడారని, అందుకు క్షమాపణ పత్రం రాసి ఇచ్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. దెబ్బతిన్న బాధితుడి చెవి కర్ణభేరి హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు విచారించి నివేదిక ఇవ్వాలని అడిషనల్ డీజీపీ, సీపీకి నోటీసులు -
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాల: నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అందిస్తోందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కొడిమ్యాల మండలకేంద్రంలోని అక్షయ గార్డెన్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పంపిణీ చేశారు. మండలంలో 437 ఇళ్లు మంజూరు కాగా.. 436 మందికి మంజూరు పత్రాలను అందించామన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ ప్రత్యేక అధికారి, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పకడ్బందీగా అమలు రాజీవ్ యువ వికాసం పథకం పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. యూనిట్ల గ్రౌండింగ్కు సంబంధించి డెప్యూటీ సీఎం విక్రమార్క కలెక్టర్లతో సమీక్షించారు. జిల్లా సమాచారాన్ని కలెక్టర్ ఆయనకు వివరించారు. గ్రామీణుల కోసమే పల్లె దవాఖానాలు ఇబ్రహీంపట్నం: గ్రామీణులకు వైద్య సేవలు అందించేందుకే పల్లె దవాఖానాలు ప్రారంభిస్తున్నట్లు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని తిమ్మాపూర్, వర్షకొండ గ్రామాల్లో దవాఖానాల ఏర్పాటుకు జాతీయ వైద్య ఆరోగ్య శాఖ నిధులు రూ.20లక్షల చొప్పున మంజురయ్యాయన్నారు. పట్టణాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోలేని పేదల కోసం కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె దవాఖానాలను నిర్మించిందని గుర్తు చేశారు. ఇందులో అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారని, మందులు ఉచితంగా ఇస్తారని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. తాను ఎంబీబీఎస్ చదివినప్పుడు కేవలం రెండు మెడికల్ కాలేజీలే ఉండేవని, కేసీఆర్ సీఎం అయ్యాక జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటైందన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, డిప్యూటీ వైద్యాధికారి శ్రీనివాస్, వైద్యాధికారి అనిల్కుమార్, ఎంఎల్హెచ్పీ మాధవి, పంచాయతీ రాజ్ డీఈ శ్రీనివాస్, ఏఈ అభినవ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అఖిల్, మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అవ్వా నిన్ను ఆదుకుంటా ‘అవ్వా.. నిన్ను ఆదుకుంటా.. ఏడ్వకు, వృద్ధాశ్రమానికి పంపిస్తా..’ అని ఎమ్మెల్యే ఓ వృద్ధురాలిని ఓదార్చారు. తిమ్మాపూర్లో పల్లె దవఖానా ప్రారంభించి వస్తుండగా రోడ్డు పక్కన చిన్న గుడిసెలో ఉంటున్న అనాథ వృద్ధురాలు చిన్నంశెట్టి లచ్చవ్వ వద్దకు వెళ్లారు. ఆమెను ఏదైనా ఆశ్రమంలో చేర్పించాలని కొందరు మహిళలు ఆయనకు వివరించడంతో చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్కు ఫోన్ చేసి వృద్ధురాలిని ఆశ్రమంలో చేర్పించాలని సూచించారు. రోళ్లవాగు పనులు ప్రారంభంసారంగాపూర్: రోళ్లవాగు ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. కట్టపై 1275 మీటర్ల పొడవుతో గోడ నిర్మాణ పనులు చేపడుతున్నారు. బీర్పూర్ శివారులో రూ.136.81 కోట్లతో 2015 – 16లో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయ్యాయి. నిధుల లేమితో ఏడాదికాలంగా పనులు ముందుకు సాగలేదు. మరోవైపు అటవీశాఖ అనుమతులు కూడా ఆలస్యం కావడంతో ప్రాజెక్టు వ్యయం పెరిగింది. ఇటీవల ప్రభుత్వం రూ.17 కోట్లు కేటాయించడంతో పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తయితే బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇంకా మూడు స్లూయిస్కు గేట్లు బిగించాల్సి ఉంది. జూన్లో గేట్లు బిగించనున్నట్లు డీఈ చక్రూనాయక్ తెలిపారు. -
సహకార సంఘాల్లో బదిలీలు
కథలాపూర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న అధికారులకు బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. వీరంతా ఏళ్ల తరబడిగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు బదిలీ చేపట్టాలని ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది. ఇందుకోసం ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 51 సహకార సంఘాలు.. 148 మంది ఉద్యోగులు జిల్లాలో 20 మండలాల పరిధిలో 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో సీఈవోలు 42 మంది, స్టాఫ్ అసిస్టెంట్లు 106 మంది పనిచేస్తున్నారు. ఇతర సిబ్బంది తాత్కలిక పద్ధతిలో పనిచేస్తున్నారు. సీఈవోలతోపాటు స్టాఫ్ అసిస్టెంట్లను బదిలీ చేయనున్నారు. ఏళ్లతరబడి ఒకేచోట పనిచేస్తుండడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి కరీంనగర్ డీసీసీబీ పరిధిగా బదిలీలు కొత్త జిల్లాల వారీగా డీసీసీబీలు లేకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ డీసీసీబీ పరిధిగానే బదిలీలు చేపడుతారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం కమిటీని నియమించారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. డీసీవో, నాబార్డు డీడీఎం, డీసీసీబీ జీఎం, డీజీఎంలు కన్వీనర్లుగా ఉంటారు. కసరత్తు చేస్తున్న అధికారులు జిల్లాలో 51 పీఏసీఎస్లు.. 148 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న అధికారుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏళ్లతరబడి ఉద్యోగుల బదిలీలు జరగలేదు. ఉమ్మడి కరీంనగర్ డీసీసీబీ పరిధిలో ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తాం. – మనోజ్కుమార్, డీసీవో -
డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!
● మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన కరీంనగర్వాసి ● చర్యలు తీసుకోవాలని మరిన్ని ఫిర్యాదులు ● క్రమంగా వెలుగులోకి జనార్దన్రావు వ్యవహారాలు ● ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లుగా కరీంనగర్లో విధులు ● కలెక్టరు కార్యాలయం తీరుపైనా విమర్శలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రావు వ్యవహారం మరింత ముదిరింది. శ్ఙ్రీభర్తలకు వంట రాకపోతే.. భార్యలు లేచిపోతారు.. తాను రెండు సంసారాలు ఈదుతున్నానుశ్రీశ్రీ అంటూ తలతిక్క వ్యాఖ్యలతో శిక్షణ శిబిరాల్లో టీచర్లను బెంబేలెత్తించిన డీఈవో జనార్దన్రావుపై విమర్శలు, ఆరోపణలు ఆగడం లేదు. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. కలెక్టర్ పమేల సత్పతి మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చినా.. టీచర్లు శాంతించడం లేదు. ఆయన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని పలువురు తోటి ఉద్యోగులు మండిపడుతుండగా.. సామాజిక ఉద్యమకారుడు షాబుద్దీన్ డీఈవోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. మహిళా కమిషన్కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. డెమొక్రాటిక్ టీచర్ ఫెడరేషన్ (డీటీఎఫ్) నాయకులు జనార్దన్రావుపై హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) కూడా అతనిపై చర్యలకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం కూడా సోషల్ మీడియాలో, మెయిన్స్ట్రీమ్ మీడియాలో విషయం ప్రాధాన్యం సంతరించుకోవడంతో ఇదే వ్యవహారంపై చర్చ నడుస్తోంది. డీఈవో జనార్దన్ సిరిసిల్లకు కూడా డీఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కామారెడ్డి డీఈవో ఎస్.రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు కరీంనగర్ డైట్ ప్రిన్సిపాల్ మొండయ్య నూతన డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. దండిగా పెద్దల దన్ను.. జనార్దన్రావుకు ప్రభుత్వ పెద్దల నుంచి దండిగా సహకారాలు ఉన్నాయని సమాచారం. కరోనా నుంచి డీఈవోగా కొనసాగుతున్న ఈయనపై ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ● జిల్లాలో టీచర్లకు అకారణంగా, అత్యధికంగా మెమోలు ఇచ్చిన డీఈవో అన్న ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ నాయకులకు ఇంక్రిమెంట్లలో కోత విధించారన్న విమర్శలు తెలిసిందే. ● వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో పనిచేసిన ప్రతీ ఉన్నతాధికారి ఎన్నికల నియమావళి ప్రకారం.. బదిలీపై వెళ్లారు. కానీ, ఈయనను కదపలేదు. ● హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్, ఇటీవల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయినా ఇతని బదిలీ జరగకపోవడం అతని పలుకబడికి నిదర్శనం. ● ఇవన్నీ తెలిసీ.. కలెక్టర్ కార్యాలయం కూడా ఆయన బదిలీ విషయంలో అలసత్వం వహించి విమర్శలను మూటగట్టుకుంది. ● 317 జీవో సమయంలోనూ పలువురు టీచర్లు ప్రొడ్యూస్ చేసిన మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ● హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయలో అప్పటి సీఎం సభను విజయవంతం చేయాలని ఆదేశాలివ్వడం, రూటు బాధ్యతలను టీచర్లకు అప్పగించడం తీవ్ర దుమారం రేపింది. ● ఇపుడు కూడా తన స్వయంకృపరాదంతో వేటు పడిందే.. ఆయన్ను ఇక్కడ నుంచి ఎవరూ కదపలేకపోవడం గమనార్హం. -
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి
రామగిరి(మంథని): భర్త అనారోగ్యం.. ఆర్థికలేమి.. ముగ్గురు పిల్లలు పోషణ.. కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఆ గృహిణికి తలకుమించిన భారంగా మారింది. దాతలు సాయం చేస్తే భర్తకు మంచి వైద్యచికిత్స అందిస్తామని, పిల్లల పోషణ చూసుకుంటానని అంటోంది ఆ గృహిణి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన దుబ్బాక కుమార్ – విజయ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం కిరణ్, మహేందర్, చెర్రీ ఉన్నారు. అనారోగ్యానికి గురైన కుమార్.. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. అయినా నయం కాలేదు. తనకున్న స్థోమత వరకు ఖర్చుచేశాడు. చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చు కావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లడానికి చిల్లిగవ్వకూడా లేకుండాపోయింది. కనీసం ప్రయాణానికి కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఆ కుటుంబం ఉంది. విజయ కూలీ పనులకు వెళ్లి అంతోఇంతో సంపాదిస్తున్నా కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని విజయ కోరుతోంది. రెండు కిడ్నీలు పనిచేయక యువకుడి నరకయాతన -
కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కోర్టు ఆవరణలో పార్కింగ్ చేసిన ఆటోను దొంగిలించిన నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని గౌతమినగర్కు చెందిన జిలకర ప్రసాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టపూర్కు చెందిన మగ్గిడి కృష్ణ ఈనెల 26న జగిత్యాల కోర్టు ఆవరణలో ఆటోను పార్కింగ్ చేశాడు. దానిని ప్రసాద్ చాకచక్యంగా దొంగిలించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఈనెల 27న పట్టణ ఎస్సై గీత జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ప్రసాద్ ఆటోలో వస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిన ఉంచి ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్, వంశీ పాల్గొన్నారు. ఉద్యమకారులను ఆదుకోవాలి పెద్దపల్లిరూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి అన్నివిధాలా ఆదుకోవాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఐలయ్య కోరారు. స్థానిక అమరవీరుల స్థూపం వద్ద బుధవారం ఉద్యమకారులతో కలిసి నివాళి అర్పించారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత తమకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశపడితే అప్పటి సీఎం ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు. కేవలం తమ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు మేలు కలిగేలా చూడాలని కోరారు. ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సారయ్య, నల్ల మనోహర్రెడ్డి, రాజేశం, జ్యోతి, చంద్రకళ, సురేందర్రెడ్డి, భాస్కర్, సదాశివ, రాజిరెడ్డి, రాజు, కృష్ణ, సదయ్య తదితరులు ఉన్నారు. ఫాజుల్నగర్ ప్రాంతంలో ‘పులి’ ఆనవాళ్లువేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈవిషయంపై వేములవాడ ఎఫ్ఆర్వో కలీలొద్దీన్ను వివరణ కోరగా వేములవాడ, కొడిమ్యాల, చందుర్తి ఫారెస్ట్ ప్రాంతంలో పులి తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజుకు పులి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, అది ఫారెస్టు ప్రాంతంలో అనుకూలమైన ప్రాంతానికి వెళ్తుందని తెలిపారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన సిరిపురం శ్రీహరి (47) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. శ్రీహరి బీడీ ప్యాకర్గా పనిచేస్తున్నాడు. కుటుంబపోషణకు కొంత అప్పు చేశాడు. ఇటీవలే కూతురు పెళ్లి చేశాడు. మొత్తం రూ.8లక్షల వరకు అప్పు ఉందని, దానిని ఎలా తీర్చలోనని నిత్యం మనస్తాపం చెందుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీహరి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పరారైన ఖైదీ కోసం లుక్ ఆఫ్ నోటీస్జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం పరారైన జున్ను ప్రసాద్ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ను పట్టుకునేందుకు పోలీసు శాఖ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు విదేశాలకు పారిపోకుండా బుధవారం ఉదయమే దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు లుక్ ఆఫ్ నోటీసు జారీ చేశారు. 4.35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటివరకు 4.35లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్.లత తెలిపారు. 4.33 లక్షల టన్నుల దొడ్డురకం, 2,475 టన్నుల సన్నరకం కొన్నామని, అకాల వర్షాలు కురుస్తున్నా.. ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించామని పేర్కొన్నారు. ఇంకా 925 టన్నుల ధాన్యం కేంద్రాల్లో ఉందని, యుద్ధప్రతిపాదిక తరలిస్తున్నామని వివరించారు. రైతులకు రూ.1010 కోట్లకు రూ.950.69 కోట్లకు ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేశామని, రూ.893.71 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. తిర్మలాపూర్లో అత్యధిక వర్షంజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు కొడిమ్యాల మండలం తిర్మలాపూర్లో 103.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పెగడపల్లిలో 72.8 మి.మీ, కథలాపూర్లో 64.8, కొడిమ్యాల మండలం పూడూర్లో 62, భీమారం మండలం గోవిందారంలో 56.8, మల్యాల మండలం మద్దుట్లలో 53, మేడిపల్లిలో 48.3, సారంగాపూర్లో 44.3, కోరుట్లలో 39, భీమారం మండలం మన్నెగూడెంలో 31.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
వానాకాలం రుణ ప్రణాళిక ఖరారు
● ప్రస్తుత సీజన్లో రూ.1540 కోట్ల రుణాలు ● గతేడాదితో పోల్చితే రూ.166 కోట్లు అదనం ● జిల్లాలో 24 బ్యాంకుల ద్వారా పంపిణీకి సిద్ధం రుణం ఇచ్చేందుకు పేచీలు పెట్టొదు పంట రుణం ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు సర్టిపికెట్ల పేరిట పేచీ పెడుతున్నాయి. రుణం ఎక్కువ అడిగితే మార్టిగేజ్ చేయమంటున్నారు. కొన్ని బ్యాంకులు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా తనఖా పెట్టుకుంటున్నాయి. ఎలాంటి నిబంధన లేకుండా రుణాలు ఇవ్వాలి. – మల్లారెడ్డి, ఎండపల్లి పంపిణీ ప్రారంభమైంది అన్ని బ్యాంకుల్లో పంట రుణాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే కొందరు పాత రుణాలు చెల్లించి.. కొత్త రుణం తీసుకుంటున్నారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు పంట రుణం ఇస్తాం. పట్టాదారు పాస్ బుక్లో వ్యవసాయ భూమి ఏ మేరకు ఉంటే, ఆ మేరకు పంట రుణం ఇస్తున్నాం. – రాంకుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ పంటల రుణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. గతేడాదితో పోల్చితే రూ.166 కోట్లు అదనంగా ఇచ్చేందుకు బ్యాంకర్లు గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి. మొత్తంగా ఈ వానాకాలం పంటల సాగుకు రూ.1,540 కోట్లు రుణాలుగా అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. వీటిని జిల్లాలోని 24 బ్యాంకు శాఖల ద్వారా రైతులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే బ్యాంకులు 10 శాతం మేర పంట రుణాలు ఇవ్వగా.. మిగిలిన రైతులు పాత రుణాలు చెల్లించి, కొత్తగా రుణం తీసుకుంటున్నారు. లక్ష్యం రూ 1540 కోట్లు జిల్లాలో గ్రామీణ, ప్రభుత్వ, ప్రైవేట బ్యాంకులు కలిపి దాదాపు 129 శాఖలు ఉన్నాయి. అన్ని బ్యాంకు శాఖలు పంట రుణాలు ఇచ్చేలా కలెక్టర్ సత్యప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంకుమార్ లక్ష్యాన్ని నిర్దేశించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 1,54,449 మంది రైతులకు రూ.2,564.65 కోట్ల రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సీజన్లో 92,671 మంది రైతులకు రూ.1540 కోట్లు, యాసంగిలో 61,778 మంది రైతులకు రూ.102.65కోట్లు రుణాలుగా అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించుకుంది.అత్యధికంగా పంట రుణాలను ఇచ్చే బ్యాంకులు బ్యాంకు రైతులు పంట రుణం (కోట్లలో) కో–ఆపరేటివ్ 18,020 299.00 యూనియన్ 17,329 288 ఎస్బీఐ 15,602 259 తెలంగాణ గ్రామీణ 11,406 189 కెనరా 7,004 116 ఇండియన్ 6,539 109 -
వేతనాలు వచ్చేదెప్పుడో..?
గొల్లపల్లి: డీఎస్సీ–2008లో వారంతా అర్హత సాధించారు. పోస్టింగ్ రావడంలో ఆలస్యం కాగా.. 16 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిని కాంట్రాక్టు పద్ధతిలోనే విధుల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి అందే వేతనాలు కావడంతో భరోసా ఉంటుందని భావించారు ఆ ఉపాధ్యాయులు. అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాలు మానుకుని ఉపాధ్యాయులుగా చేరారు. వారికి నాలుగు నెలలైనా వేతనం రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 38 మంది జిల్లాలో డీఎస్సీ – 2008 అభ్యర్థులు 38 మంది ఈ ఏడాది ఫిబ్రవరి 15న విధుల్లో చేరారు. వారిని వివిధ పాఠశాలలకు కేటాయించగా పాఠాలు బోధిస్తున్నారు. నాలుగు నెలలుగా వేతనాలు మాత్రం పొందడం లేదు. విద్యా సంవత్సరం చివరలో ఆయా ఉపాధ్యాయులను టెర్మినేట్ చేసిన విద్యాశాఖ.. వేతనాల జారీలో మాత్రం జాప్యం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కుటుంబ పోషణ కష్టంగా ఉంది ఎంతో ఆశతో ఉద్యోగాలు చేస్తూ వచ్చాం. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టమవుతోంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఇటీవలే జరిగిన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు ఐదు రోజులు పాల్గొన్నాం. – శివకుమార్, ఎంపీపీఎస్, భీమారం వేతనాలు ఇవ్వాలి కస్తూరిభా పాఠశాలలో సీఆర్టీ ఉద్యోగం మానేసి పాఠశాలలో చేరాను. ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదు. ఏప్రిల్ 23న టెర్మినేట్ చేశారు. మిగితా కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులను మూడు రోజుల్లో విధల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వం మా ఆవేదనను అర్థం చేసుకుని వేతనాలు చెల్లించాలి. – జయ, పీఎస్, తొత్తునూర్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఎదురుచూపులు నాలుగు నెలలుగా జీతం అందక ఇక్కట్లు సర్వీసు పునరుద్ధరణపై నీలినీడలు పెండింగ్లో ఉన్నాయి 2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాల అంశం రాష్ట్రస్థాయిలో ఉంది. జిల్లాలో 38 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికి నాలుగు నెలలకు సంబంధించిన వేతనాలు ఇవ్వాల్సిన మాట వాస్తవమే. వేతనాలు, సర్వీసు పునరుద్ధరణపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – రాము, డీఈఓ -
కేబుళ్లతో వినియోగదారులకు ముప్పు వాటిల్లొద్దు
జగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ స్తంభాలకు కేబుల్ ఆపరేటర్లు వైర్లను కడుతుండటంతో వినియోగదారుల భద్రతకు ముప్పు పొంచి ఉందని ఎస్ఈ సాలియానాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో బుధవారం కేబుల్ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. టీవీ కేబుల్, ఇంటర్నెట్ సేవలందించే ఆపరేటర్లు స్తంభాలకు ఇష్టారీతిన వైర్లు బిగిస్తున్నారని పేర్కొన్నారు. అద్దె చెల్లించాలని, క్రమబద్ధీకరణ తప్పనిసరి చేయాలని, కేబుళ్ల నిర్వహణ ఎప్పటికప్పుడు చూసుకోవాలని సూచించారు. కేబుళ్లు అన్నింటిని బంచ్ చేసి క్లాంప్స్ అమర్చాలన్నారు. డీఈ, ఏడీఈ, ఏఈలు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియనాయక్ -
రైతుల కష్టం వరదపాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యం మూలంగా వరదపాలైంది. అకాల వర్షాలు దండికొట్టడంతో 45రోజులుగా తూకం వేయకుండా కేంద్రాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తింది. దీంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఐకేపీ అధికారులు, నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల మాయిచ్చర్ వచ్చి 45 అయినప్పటికీ రైతులు కేంద్రాలకు తెచ్చిన వడ్లను తూకం వేయలేదు. కేంద్రాల్లో హమాలీలు లేక, నిర్వహకులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యం -
హ్యాకర్ల చేతికి ఓదెల ఆధార్ కేంద్రం
పెద్దపల్లిరూరల్: ఆన్మోసాలు ఆగడంలేదు. సైబర్ నేరగాళ్లు, ఆన్లైన్ మోసగాళ్లు రోజుకో రూట్ మార్చుతూ ప్రజలకు ఎరవేస్తున్నారు. తాజాగా ఓదెల మండల కేంద్రంలోని మీసేవ ఆపరేటర్ తన ఆధార్ కేంద్రానికి సంబంధించి అప్డేట్ చేస్తామంటూ సైబర్ మోసగాళ్లు (సెల్ నంబరు 07427069687) నుంచి చేసిన ఫోన్కాల్కు స్పందించడంతో ఆధార్ సెంటర్ను హ్యాక్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఆ ఐడీ ద్వారా నాలుగు ఆధార్కార్డులు డౌన్లోడ్ చేసినట్లు ఆపరేటర్కు సమాచారం రావడంతో అవాక్కయ్యాడు. ఆ వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. స్పందించిన అధికారులు యూఐడీఏఐ అధికారులను అప్రమత్తం చేశారు. వారు ఆధార్సెంటర్ హ్యాకర్ల చేతికి చిక్కినట్లు నిర్ధారించారు. ఇలాంటి ఘటన ఇదివరకు నాగర్కర్నూల్ జిల్లాలోనూ జరిగినట్లు సమాచారం. జిల్లాలోని పలు ఆధార్కేంద్రాల నిర్వాహకులకు సైతం ఇలాంటి ఫోన్కాల్స్ వచ్చినట్లు ఆపరేటర్లు తెలిపారు. కొంతకాలంగా ఓదెల మీసేవ కేంద్రంలో గల ఆధార్ సెంటర్ ద్వారా సేవలు నిలిపి వేశారు. కొద్ది రోజుల క్రితమే అధికారులు అనుమతినివ్వడంతో సేవలు పునరుద్ధరించారు. ఈ క్రమంలో హ్యాకర్ల నుంచి ఫోన్కాల్ రావడంతో ఆధార్ కేంద్రం అనుమతులిచ్చే కార్యాలయ అధికారుల నుంచే ఫోన్కాల్ వచ్చిందని భావించి ఎనీడెస్క్ను హ్యాకర్లకు అప్పగించి మోసపోయినట్లు తెలిసింది. పీఈసీ కిట్లను అప్పగించొద్దు.. ఆధార్ కేంద్రాలను నిర్వహించే ఆపరేటర్లు అనధికారిక అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్కాల్స్కు స్పందించొద్దని యూఐడీఏఐ అధికారులు బుధవారం రాష్ట్రంలోని ఆధార్ ఆపరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఆధార్కేంద్ర నిర్వాహకులు తమ సెంటర్లలో వినియోగించే కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్, లేదా ఇతర రిమోట్యాక్సెస్ ఇచ్చి మోసపోతున్నారని, ఇది ఆధార్ డేటా భద్రతకు ముప్పు తెస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనీడెస్క్, టీంవ్యూయర్ ఇతర రిమోట్ యాక్సెస్ సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. యూఐడీఏఐ భద్రతా విధానాలకు అనుగుణంగా అవసరం లేని రిమోట్ యాక్సెస్ టూల్స్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నారు. అపరిచితుల ఫోన్కాల్స్కు స్పందిచొద్దు యూఐడీఏఐ కార్యాలయ అధికారుల ఆదేశం -
కర్బూజ రైతు నష్టాలపాలు
● అకాల వర్షాలతో ఆగం ● రూ.లక్షలు వస్తాయనుకుంటే.. ఖర్చులు కూడా రాలేదంటున్న వైనం ● పురుగు పట్టి పనికి రాకుండా పోయిన కాయలు జగిత్యాలఅగ్రికల్చర్: కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను అతులాకుతలం చేశాయి. ముఖ్యంగా వేసవిలో కర్బూజ, తర్బూజ వంటి ఉ ద్యాన పంటలను సాగు చేసిన రైతులను కోలుకోకుండా చేశాయి. జిల్లాలో యువ రైతులు వినూత్నంగా సాగు చేసిన కర్బూజ(పుచ్చకాయ) పంటను మరో వారం రోజుల్లో మార్కెట్కు తీసుకెళ్లే తరుణంలో కురిసిన వర్షాలు దెబ్బతీశాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 100 ఎకరాల్లో సాగు.. జిల్లాలో వేసవిలో చల్లదనాన్నిచ్చే కర్బూజ, తర్బూజ, జన్నత్ వంటి పండ్ల తోటలను దాదాపు 100 ఎకరాలకు పైగా సాగు చేశారు. రెండు, మూడేళ్లుగా యువ రైతులు సాగు చేస్తూ.. నేరుగా మార్కెటింగ్ చేస్తూ మంచి అదాయాన్ని పొందుతున్నారు. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన బండారి వెంకటేశ్, మల్లాపూర్ మండలం సిర్పూర్కు చెందిన నరేశ్, రాయికల్ మండలం అలూరుకు చెందిన మెక్కొండ రాంరెడ్డి, రాజు, మల్లారెడ్డి, ధర్మారంకు చెందిన రాజు, రాజిరెడ్డి అనే యువ రైతులు 25 ఎకరాల వరకు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. తమ పంటను జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో నేరుగా విక్రయిస్తుండడంతోపాటు హైదరాబాద్లోని పలు కార్పొరేట్ సంస్థలతో కూడా ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో వర్షాలు కురవడం, రాష్ట్రమంతా చల్లదనంగా ఉండటంతో కాయలు తెంపేందుకు వేచి చూస్తున్న తరుణంలో ఒక వర్షం తర్వాత మరో వర్షం కురవడంతో పంట పూర్తిగా ధ్వంసమైంది. విత్తన ఖర్చే రూ.35 వేలు కర్బూజ(వాటర్ మిలన్), తర్బూజ(మస్క్మిలన్), జన్నత్(సూపర్ మార్కెట్ వైరెటీ) పండ్ల తోటలను సాగు చేశారు. మార్కెట్లో ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియదు కాబట్టి.. సగటున ధర గిట్టుబాటయ్యేందుకు ప్రతి పంటను మూడు దఫాలుగా సాగు చేశారు. ఫిబ్రవరి నెలలో సాగు చేసిన పంట.. మండు వేసవిలో మే నెలలో చేతికందుతున్న తరుణంలోనే పూర్తిగా దెబ్బతింది. వీటికి సంబంధించిన 50 గ్రాముల విత్తనాలకే దాదాపు రూ.1,600 నుంచి 1,800 వరకు ధర ఉంటుంది. ఎకరాకు దాదాపు రూ.35వేలు ఖర్చు పెట్టి హైదరాబాద్, బెంగళూర్ నుంచి విత్తనాలు తెప్పించారు. పంట పూర్తిగా నాశనం.. రైతులు సాగు చేసిన కర్బూజ కాయలు అమ్మకానికి వచ్చాయి. కాయలు తెంపే సమయంలోనే భారీ వర్షాలతో భూమిలో నీళ్లు ఆగాయి. వేరు వ్యవస్థ దెబ్బతిని కర్బూజ మొక్కలు వాడిపోయాయి. దీనికితోడు పూత రాలిపోయింది. అప్పటికే కాచిన కాయ లు కుచించుకుపోయాయి. పక్వానికి వచ్చిన కాయ ల్లో పురుగు చేరింది. దీనికితోడు రాళ్ల వానతో కాయ లు ఎక్కడికక్కడే పగిలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరానికి రూ.3లక్షల నుంచి 4లక్షలు వస్తాయనుకుంటే.. కనీసం విత్తనాలకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని కన్నీళ్లపర్యంతమవుతున్నారు. అకాల వర్షాలతో కర్బూజ వంటి కొత్త పంటలు పెట్టాలంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొంది. -
ప్రపంచ అర్చరీ పోటీలకు చికిత
కరీంనగర్స్పోర్ట్స్: ప్రపంచ అర్చరీ క్రీడాకారిణి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన తానిపర్తి చికిత జూన్లో సింగపూర్లో, ఆగస్టులో కెనడాలో జరగబోయే ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొనే భారత మహిళల కంపౌండ్ క్రీడాకారుల జట్టులో చోటు సంపాదించింది. మహిళల కంపౌండ్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్లో 71వ స్థానంలో కొనసాగుతోంది. ఏషియా కప్స్టేజ్ 2 పోటీలు సింగపూర్లో జూన్ 14 నుంచి 21 వరకు, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలు ఆగస్టు 16 నుంచి 25వరకు కెనడాలోని విన్నిపెగ్లో జరుగనున్నాయి. పూణెలో జరిగిన ఇండియన్ టీంసెలక్షన్ ట్రయల్స్లో చికిత అద్భుతంగా రాణించి చోటు దక్కించుకుంది. ఏషియా, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలకు తానిపర్తి చికిత ఎంపికకావడంపై ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్దారెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, మహ్మద్ కరీం, పెద్దపల్లి డీవైఎస్వో సురేశ్, బేస్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఉమ్మడి జిల్లా అర్చరీ సంఘం కార్యదర్శి కొమురాజు శ్రీనివాస్, కొమురాజు కృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
మహిళ హత్య కేసులో తల్లి, కొడుకు అరెస్టు
చందుర్తి(వేములవాడ): భూవివాదంలో మహిళను హత్య చేసిన రౌడీషీటర్, హత్యకు ప్రోత్సహించిన తల్లిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. చందుర్తి ఠాణాలో మంగళవారం నిందితులిద్దరిని సీఐ, ఎస్సైలు అరెస్ట్ చూపారు. చందుర్తికి చెందిన బొల్లు మల్లవ్వకు రౌడీషీటర్ బొల్లు మనోజ్ తల్లి మోహినవ్వకు కొద్దికాలంగా భూవివాదం ఉంది. ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకున్న రౌడీషీటర్ మల్లవ్వను అడ్డు తొలగించేందుకు సోమవారం పెద్దమ్మ గుడి సమీపంలో కాపుకాసి కత్తితో దాడిచేసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపాయాడు. ఈ హత్యకు ప్రోత్సహించిన బొల్లు మోహినవ్వ ఉరప్ మల్లవ్వ, రౌడీషీటర్ మనోజ్అను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. హత్యకు వినియోగించిన కత్తిని, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య, సిబ్బంది ఉన్నారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా జిల్లాలోని పాతనేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. చందుర్తికి చెందిన బొల్లు మనోజ్పై 2023లో హత్యకేసుతోపాటు పలు దొంగతనాల కేసులు ఉన్నాయని, అయినా మార్పు రాకపోవడంతో 2024లో రౌడీషీటర్ తెరిచినట్లు తెలిపారు. రౌడీషీటర్లలో మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హత్యకు వినియోగించిన కత్తి, సెల్ఫోన్ స్వాధీనం -
రిమాండ్ ఖైదీ పరార్
● గాలిస్తున్న పోలీసులు జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న క్రమంలో రిమాండ్ ఖైదీ పోలీసుల కన్నుగప్పి పరారైన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్కు చెందిన జున్ను ప్రసాద్ నిరుద్యోగులను గల్ఫ్ పంపిస్తానని, డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు పెగడపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈనెల 17న కేసు నమోదు చేసి జున్ను ప్రసాద్ను జగిత్యాల జైలుకు తరలించారు. అతడిపై కొడిమ్యాల పోలీస్స్టేషన్లో కూడా గల్ఫ్ మోసంపై కేసు నమోదైంది. దీంతో కొడిమ్యా ల పోలీసులు పీటీ వారెంట్ ద్వారా ప్రసాద్ ను జైలు నుంచి తీసుకొచ్చి.. జగిత్యాల కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. తిరిగి రిమాండ్కు తరలిస్తున్న క్రమంలో పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరి పట్టివేతమెట్పల్లి: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. పట్టణ శివారులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా..అబ్దుల్ సోహైల్, ఓ మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేయగా.. వారి వద్ద 120 గ్రాముల గంజాయి దొరికింది. వారిపై కేసు నమోదు చేసి బైక్, రెండు సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కొత్త పింఛన్దారులకు 3.0 పింఛన్
జ్యోతినగర్(రామగుండం): ప్రయాస్ పథకాల కింత కొత్త పింఛన్దారులకు 3.0 పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు విడుదలయ్యాయని ఈపీఎఫ్వో కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాం తెలిపారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో మంగళవారం నిధి పే నిక్కత్ 2.0లో భాగంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ, భవిష్యనిధి ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కార్మికులు తమ వివరాలను ఈపీఎఫ్ సేవల వెబ్సైట్లో తెలుసుకోవచ్చని అన్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, ప్రయాస్ పథకం, వాటాదారులకు అవగాహన కల్పించారు. ఫీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు పీఎఫ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈమేరకు ఈఫీఎఫ్వో ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాంకు వినతిపత్రం అందించారు. పుట్టిన తేదీల్లో పొరపాట్లు, కాంట్రాక్టర్లు ఫీఎఫ్ జమచేయకపోవడం, యజమాని మారినప్పుడు, ప్రస్తుత నంబరుపై కాకుండా పాత నంబర్పై డబ్బులు జమచేయడం, 58 ఏళ్లవయసు పూర్తిచేసిన కార్మికులకు పింఛన్ రాకపోవడం, మాన్యువల్ పద్ధతిలోని పీఎఫ్ డబ్బులు ప్రస్తుత ిపీఎఫ్ నంబర్లోకి జమకాకపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. సర్వీస్ సర్టిఫికెట్లలో ఇంటిపేరు పూర్తిగా లేకపోవడంతో నిధులు ట్రాన్సఫర్ కావడం లేదన్నారు. ఈ సమస్యలపై కరీంనగర్ భవిష్యనిధి కార్యాలయానికి వెళ్లే కార్మికులకు సిబ్బంది సహకరించకుండా, ఇబ్బందులకు గురిచేసే విధానం మానుకోవాలని హెచ్చరించారు. ఐన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, సీఐటీయూ నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఐఎఫ్టీయూ నాయకులు చిలుక శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ఈపీఎఫ్వో ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్ -
పిడుగుపాటు.. గొర్రెలకాపరి మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో మంగళవారం పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతిచెందాడు. గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్(21) గొర్రెలను మేత కోసం రేపాక శివారుకు తీసుకెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలోనే చెట్టు కింద ఉన్న లక్ష్మణ్ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించాడు. అతనికి కొంతదూరంలో ఉన్న మరో కాపరి రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్సై శ్రీకాంత్గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తల్లీబిడ్డలకు గాయాలు మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తాటిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన జేరుపోతుల సుమలత ఇంటి సమీపంలో భారీ శబ్దంతో పిడుగుపడడంతో విద్యుత్ మీటరు కాలిపోయింది. ఇంటి లోపల గోడల పెచ్చులు ఊడిపోయాయి. విద్యుత్ పైపులు కాలిపోయి, స్విచ్బోర్డు పగిలిపోయింది. ఇంట్లో ఉన్న సుమలత చేతిపై మెరుపులు పడడంతో గాయాలయ్యాయి. ఆమె కూతురు ఆరాధ్య, కుమారుడు ఫ్రాన్సిస్ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటు శబ్దానికి సుమలతకు వినికిడి లోపం తలెత్తింది. మల్యాల ఎస్సై నరేశ్కుమార్, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కాసారంలో గేదె మృతి.. గంగాధర: మండలంలోని కాసారం గ్రామంలో పిడుగుపాటుకు పాడిగేదె మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. పెద్దిపల్లి తిరుపతి గేదెను పొలం వద్ద కట్టి వేయగా మంగళవారం సాయంత్రం పిడుగుపడి మృతి చెందింది. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచు వేముల దామోదర్ కోరాడు. నేలవాలిన వృక్షంగన్నేరువరం: మండలకేంద్రంలోని చావిడి వద్ద భారీ వృక్షం మంగళవారం వీచిన గాలివానకు నేలవాలింది. ఆయుర్వేదిక్ ఆసుపత్రి, వాటర్ ప్లాంట్ సమీపంలోని వృక్షం నేలవాలడంతో పెను ప్రమాదం తప్పింది. పక్కనే గ్రామానికి చెందిన అరిగెల వరవ్వ, రామవ్వ నివాస గృహాలు ఉన్నాయి, చెట్టు కింద పడుతున్న సమయంలో భయాందోళనకు గురై ఇంట్లో నుంచి భయటకు పరుగులు తీశారు. ఇళ్ల మధ్య పడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఏళ్లనాటి వృక్షం నేలవాలిందని గ్రామస్తులు తెలిపారు. కాగా మండలంలో గంట పాటు భారీ వర్షం కురిసింది. -
ప్రాణం పోస్తున్న ఎమర్జెన్సీ వైద్యులు
● మెడికవర్లో వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే కరీంనగర్టౌన్: కరీంనగర్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కలిగిన ఏకై క ఆసుపత్రి మెడికవర్లో అందించే సేవలతో ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలువురు వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఎమర్జెన్సీ విభాగం ఎంతో కీలకంగా మారిందన్నారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీతో పాటు క్రిటికల్ కేర్ టీం బ్యాక్ బోన్గా పనిచేస్తుందన్నారు. కేక్ కట్ చేసి, ఎమర్జెన్సీ వైద్యులను సన్మానించారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు సత్యనారాయణ, రుత్విక్, మహేష్, జగదీప్, దిలీప్, రవికిరణ్,, వినయ్, ఉపేందర్రెడ్డి, నాగరాజు, లోకేశ్, పల్లవి, విష్ణు, రవి, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
భూసారం తెలుసుకోవడం తప్పనిసరి
● భూసార పరీక్షతో సుస్థిర వ్యవసాయం సాధ్యం ● రామగిరిఖిల్లాలో ఉచితంగా భూసార పరీక్షలు రామగిరి(మంథని): నైరుతి రుతుపవనాల ప్రవేశం తర్వాత రైతులు వ్యవసాయానికి సిద్ధమవుతున్నారు. అంతకంటే ముందే నేలలో మట్టి పరీక్షలు చేయించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. భూసార పరీక్షలకు ఇదేసరైన సమయమంటున్నారు. పొలాల్లోని మట్టి నమునాలను సేకరించి పరీక్షలు చేయించుకుంటే భూసారం తెలియడంతో పాటు ఆ నేలల్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎంతమేర ఎరువులను వినియోగించాలనే విషయాలు రైతులు తెలుసుకోవచ్చు. రైతులు పంట పండించేందుకు మూడు పెట్టుబడులు అవసరం. అవి భూమి, విత్తనం, నీరు. వీటన్నింటికన్నా నేల ముఖ్యమైన పెట్టుబడి. అందుకే భూమిగుణగణాలు తెలిస్తే ఎలాంటి పంటలు పండుతాయో అవగాహన వస్తుంది. అందుకోసం మట్టి పరీక్షలు చేయించాలి. తద్వారా పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలో తెలియడంతో ఖర్చు తగ్గించుకోవచ్చు. చాలామంది రైతులు మట్టిపరీక్షలు జరిపించకుండా ఎరువులు అధిక మోతాదులో వేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరగడంతోపాటు పంటల్లో పురుగుల ఉధృతి కూడా ఎక్కువవుతుంది. పొలాల్లో ఎరువుల మోతాదు తెలుసుకునేందుకు కచ్చితంగా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపించాలి. దీనికోసం సాగుభూమి నుంచి మట్టిని ఇలా సేకరించాలి. మట్టి నమూనా సేకరించ కూడని ప్రదేశాలు ● పొలం వరాలు, చెట్టు నీడ, బోరుబావులు, నీరు పొసేచోటు, బండరాళ్లు ఉన్న చోటు, మందులు కలుపుకునే చోటు. మట్టి నమూనా సేకరించే విధానం ● భూసార పరీక్ష ఫలితాలు సేకరించే మట్టి నమూనాలపై ఆధారపడి ఉంటాయి. కనుక మట్టి నమూనాలను ఒక ఎకరం విస్తీర్ణంలో ఒకచోటు నుంచే కాకుండా 10 నుంచి 15 ప్రదేశాల్లో తీయాలి. ● ఎంపిక చేసిన పొలంలో జిగ్జాగ్(ఎగుడు దిగుడు) పద్ధతిలో 10 నుంచి 15 చోట్ల గుర్తులు పెట్టాలి. ● గుర్తులు పెట్టిన చోట చెత్తాచెదారం తొలిగించి శుభ్రపరచాలి. శుభ్రపర్చిన చోట గుంతలు తీయాలి. ● ఆ గుంతల్లో ఒక అంగుళం(2.5 సెం.మీ.) మట్టిని సేకరించాలి. ● పొలంలో 10 నుంచి 15 చోట్ల సేకరించిన మట్టిని ఒకకుప్పగా పోసి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన మట్టిని గుండ్రంగా చేసి నాలుగు భాగాలుగా విభజించాలి. పైరెండు భాగాలను(ఏ, సీ)లుగా, కింది రెండు భాగాలను(బీ,డీ) భాగాలుగా గుర్తించాలి. వీటిలో రెండు ఎదురెదురుగా ఉన్న భాగాలను (బీ,డీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(ఏ, సీ) తొలిగించాలి. ఇప్పుడు మిగిలిన (బీ,డీ) భాగాలను బాగా కలిపి మళ్లీ గుండ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా గుండ్రంగా చేసుకున్న మట్టిని మళ్లీ ముందుగా విభజించినట్లుగా నాలుగు భాగాలుగా చేసి ఎదురెరుగా ఉన్న భాగాలను(ఏ,సీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(బీ,డీ)లను తొలిగించాలి. ఈ విధంగా 10–15 చోట్ల నుంచి సేకరించిన మట్టిని అర్ధకిలో మట్టి నమూనా వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత ఈ నమూనాను నీడలో ఆరబెట్టి పరిశుభ్రమైన, గుడ్డసంచిలో నింపి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఇవ్వాలి. ఉచితంగా భూసార పరీక్షలు రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం. కార్డులు కూడా ఉచితంగా ఇస్తాం. భూసారాన్ని బట్టి ఏ పంటకు ఎలాంటి ఎరువులు వాడాలో కూడా రైతులకు సూచిస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ పిల్లి కిరణ్, మృత్తిక శాస్త్రవేత్త, కేవీకే, రామగిరి ఖిల్లా -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ సత్యప్రసాద్జగిత్యాల: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. డెంగీ, సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రతిరోజు డ్రైడే పాటించేలా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరదలతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. వాటర్ లీకేజీలను మున్సిపల్ సిబ్బంది గుర్తించాలని పేర్కొన్నారు. డీపీవో మాట్లాడుతూ మొత్తం 296 ఫాగింగ్ మిషన్స్, 336 హ్యాండ్పంప్స్ ఉన్నాయని, 31 వేల ఆయిల్బాల్స్ తయారు చేశామన్నారు. టిమోపస్, మలాథియన్ గ్రామ పంచాయతీలకు చేర్చామన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఎంహెచ్ ప్రమోద్కుమార్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, కమిషనర్లు పాల్గొన్నారు. ఉత్తరాది నుంచి కూలీలు వచ్చే పరిస్థితి లేదు జగిత్యాలఅగ్రికల్చర్: ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి కూలీలు జిల్లాకు వచ్చే పరిస్థితి లేదని కలెక్టర్ అన్నారు. ఆయిల్ పాం సాగుపై జిల్లాకేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ధాన్యం తూకం వేసేందుకు, మిల్లుల్లో, మామిడి మార్కెట్లో పనిచేసేందుకు గతంలో ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వచ్చేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఈ క్రమంలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పాం సాగు వైపు అడుగులు వేయాలని సూచించారు. మంచి ఆదాయంతోపాటు సబ్సిడీలు అందే అవకాశం ఉందన్నారు. లోహియా కంపెనీ సీఈఓ సిద్దాంత్ లోహియా మాట్లాడుతూ.. బుగ్గారం మండలం యశ్వంత్రావుపేటలో సెప్టెంబర్ 4న ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 4,700 ఎకరాల్లో ఆయిల్ పాం సాగవుతోందని, ఈ ఏడాది మరో 3500 ఎకరాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంకుమార్ పాల్గొన్నారు. ఆయిల్ పాం సాగు చేసే రైతులను కలెక్టర్ సన్మానించారు. -
నోరు తెరిచిన మ్యాన్హోల్స్
● పట్టింపులేని అధికారులు ● తరచూ ప్రమాదాలు ● సమీపించిన వర్షకాలం ● వరద ప్రవాహంలో వెళ్తే అంతే.. ● ఇటీవల ఓ వృద్ధుడు పడిపోయిన వైనంజగిత్యాల: జిల్లాకేంద్రంలో మ్యాన్హోళ్లు నోరు తెరుచుకున్నాయి. బైపాస్రోడ్, యావర్రోడ్ ఇరుకుగా ఉండడం.. వాహనాల సంఖ్య పెరగడం.. ఆ మేరకు ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లాకేంద్రం కాకముందు బైపాస్రోడ్ నిర్మించారు. జిల్లాగా అవతరించాక వ్యాపార, వాణిజ్య కేంద్రాలన్నీ బైపాస్రోడ్లోనే ఏర్పాటయ్యాయి. దీంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. యావర్రోడ్ ఇరుకుగా మారింది. కొన్నేళ్ల క్రితం నుంచే ఎస్సారెస్పీ కాలువ ఉండగా.. దానిపై కప్పు వేసి కాలువకు ఇరువైపులా రోడ్డు వేశారు. కాలువపై పెద్ద ఎత్తున డివైడర్లను ఏర్పాటు చేశారు. కాలువ కన్పించకుండా నిర్మాణం చేపట్టినా.. అక్కడక్కడ మ్యాన్హోల్స్ ఉండటంతో అవి ప్రమాదకరంగా మారాయి. విపరీతంగా వాహనాలు రావడం.. పెద్దపెద్ద వాహనాలు కూడా ఈ మార్గంమీదుగానే ధర్మపురి, గొల్లపల్లి వైపు వెళ్తుండడంతో రద్దీ మారుతోంది. ఈ కాలువపై అక్కడక్కడ కప్పులు నిర్మాణం చేపట్టినప్పటికీ ఏళ్ల క్రితం కావడంతో కొన్ని చోట్ల నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. మరమ్మతు చేయించకపోవడంతో వాహనదారులు మ్యాన్హోల్స్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. బైపాస్రోడ్ అనేది టౌన్ ప్రిన్సెస్ కన్నా ఎక్కువ కావడంతో అటు వైపు ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్, వ్యాపార వాణిజ్య కేంద్రాలు, ఫంక్షన్హాల్స్ అత్యధికంగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రస్తుతం కాలువ పైన ఏర్పాటు చేసిన డివైడర్లను, మ్యాన్హోల్స్ మరమ్మతు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బైపాస్రోడ్ కరీంనగర్ రోడ్ నుంచి ధర్మపురి రోడ్కు వెళ్తుంది. ఈ మధ్యలో ఎస్సారెస్పీ కాలువ పెద్దది కావడంతో దాదాపు 10 ఫీట్ల వెడల్పుతో డివైడర్లు నిర్మించారు. ఆ కాలువ కింద నుంచి ఎస్సారెస్పీ నీరు వెళ్తుంది. వర్షకాలం భారీగా వర్షం కురిస్తే అది ఉప్పొంగుతుంది. దీంతో ప్రమాదం ఎంతో పొంచి ఉంది. ముఖ్యంగా గొల్లపల్లి రోడ్లోని శ్మశాన వాటిక వద్ద ఎలాంటి పైకప్పు లేకుండా కేవలం ఐరన్తో ఏర్పాటు చేసినప్పటికీ అది ఊడిపోయింది. నాయీబ్రాహ్మణ సంఘం భవనం సమీపంలో కాలువపై పైకప్పు లేకపోవడంతో అందులో వాహనదారులు పడిపోతున్నారు. ఒకవేళ వర్షకాలం భారీగా వర్షం కురిసినప్పుడు పడితే దాదాపు మనుషులు బతికే అవకాశాలు ఉండవు. రెండు కిలోమీటర్లకు పైగానే కాలువ కరీంనగర్ రోడ్ నుంచి ధర్మపురి రోడ్ వరకు వెళ్లే బైపాస్రోడ్ రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఎస్సారెస్పీ కాలువ మధ్యలో ఉండటంతో రోడ్డంతా వన్వేగా మారింది. ఎటు వైపు వాహనాలు అటు వెళ్తున్నప్పటికీ మధ్యలో ఈ మ్యాన్హోల్స్ ఉండడం ప్రమాదకరంగా మారింది. ఎత్తు ఉన్నప్పటికీ ఒక్కోసారి అదుపుతప్పి అందులోకే వెళ్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బైపాస్రోడ్లో ఉన్న ఎస్సారెస్పీ కాలువపై పూర్తిస్థాయి పైకప్పులు, డివైడర్ల ఎత్తు పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ఈనెల 22న.. జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ముకుందరెడ్డి అనే వృద్ధుడు ద్విచక్రవాహనంపై రోడ్డుపై వస్తున్నాడు. నాయీబ్రాహ్మణ సంఘం సమీపంలోని మ్యాన్హోల్లో ద్విచక్రవాహనంతోపాటు పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి వృద్ధుడితోపాటు ద్విచక్రవాహనాన్ని బయటకు తీశారు. మ్యాన్హోల్లో ప్రవాహం లేకుంటే సదరు వృద్ధుడి పరిస్థితి వేరేలా ఉండేది. సుమారు నెల క్రితం.. ఓ కారు అతి వేగంగా వచ్చి డివైడర్లను ఢీకొంది. కాలువ పైకప్పు ఎక్కి ఆగిపోయింది. దానికి ఒకే అడుగు దూరంలో పెద్ద డ్రైనేజీ ఉంది. ప్రమాదవశాత్తు కారులో అందులో పడిపోతే కారులో ఉన్న వారే బతికే అవకాశమే లేకుండేది. మ్యాన్హోల్ సమీపంలో కారు ఆగి పోవడంతో ప్రమాదం తప్పింది. ఇలా జిల్లా కేంద్రంలో నిత్యం బైపాస్రోడ్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. మోతె చౌరస్తాలోని బైపాస్రోడ్లోని పైకప్పు లేని కాలువపైకప్పులు ఏర్పాటు చేయాలి బైపాస్రోడ్లో ఒకప్పుడు పెద్ద ఎస్సారెస్పీ కాలువ ఉండేది. దానిపైనుంచే డివైడర్లు ఏర్పాటు చేసి రోడ్డు ఏర్పాటు చేశారు. పైన కప్పులు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి వాటిపైన ఇనుప చువ్వలను ఏర్పాటు చేసి పైకప్పు నిర్మించాల్సి ఉంది. – అనిల్, జగిత్యాల ప్రమాదకరంగా ఉన్నాయి మ్యాన్హోల్స్ ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిపై ఇనుప చువ్వలతో ఉన్న కప్పులు వేయాలి. ప్రమాదాలను నివారించాలి. బైపాస్రోడ్లాగా లేదు. బైపాస్రోడ్ సిటీ మధ్యలో ఉంది. మరో బైపాస్రోడ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – మచ్చ శంకర్, జగిత్యాల -
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల భారీ వర్షం కురుస్తుంది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలికోరుట్ల: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన కోరుట్ల మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్తో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలు, మోసపూరిత హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. బీఆర్ఎస్ బలపరిచే అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోట నారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో సత్తా చాటాలి ఇబ్రహీంపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని విద్యాసాగర్రావు, ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మండలకేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడారు. పార్టీ నుంచి వెళ్లి పోయినవారిని ఎట్టి పరిస్థితిల్లోనూ తిరిగి తీసుకోబోమని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎలాల దశరథరెడ్డి, ప్రధాన కార్యదర్శి నేమూరి సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎలేటి చిన్నారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు హాజరైన ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
అవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి పెట్టాలి
మెట్పల్లి: హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి సారించాలని, పెద్ద సంఖ్య లో మొక్కలు నాటాలని ఆదనపు కలెక్టర్, ము న్సిపల్ స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత అధికారుల కు సూచించారు. రేగుంటలోని నర్సరీ, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్లకిరువైపులా మొక్కలు నాటడానికి గుంతలు తవ్వాలన్నారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద పూలు, పండ్లు మొక్కలు నాటాలన్నారు. ఆమె వెంట ఆర్డీఓ శ్రీనివాస్, కమిషనర్ మోహన్, డీఈఈ నాగేశ్వర్రావు తదితరులున్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలివెల్గటూర్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వెల్గటూర్ పోలీస్స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, వాహనాల పార్కింగ్, 5ఎస్ అమలు తీరు, సిబ్బంది డ్యూటీ వివరాలు తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి చూపాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి, నేరాలు నియంత్రించాలని పేర్కొన్నారు. యాక్సిడెంట్ జోన్లు గుర్తించి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100 కాల్స్పై తక్షణమే స్పందించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ రఘుచందర్, ఎస్సైలు ఉమాసాగర్, సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. ఆదివాసీలపై హత్యాకాండ ఆపాలిజగిత్యాలటౌన్: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రప్రభుత్వం ఆదివాసీలపై చేస్తున్న హత్యాకాండను ఆపాలని ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. వామపక్ష, ప్రజాతంత్ర, అంబేడ్కర్వాదుల, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ కగార్ ఆపాలని, కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేశ్, పౌరహక్కుల సంఘం నాయకులు పొన్నం రాజమల్లు, పిట్టల నారాయణ, చింత భూమయ్య పాల్గొన్నారు. ఈనెల 29, 30న భారీ వర్షంజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఈనెల 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మీ తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 10 జిల్లాలో ప్రవేశించాల్సి ఉండగా 15 రోజుల ముందుగానే వచ్చాయని వివరించారు. కొడిమ్యాలలో మంగళవారం ఒక్క గంటలోనే 9.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. పరిశుభ్రత అందరి బాధ్యతజగిత్యాల: పరిశుభ్రత అందరి బాధ్యత అని, వర్షాకాలంలో పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ స్పందన అన్నారు. మంగళవారం పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ఉన్న పెద్ద నాలాను కార్మికులచే శుభ్రం చేయించామని, ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రతను పాటించాలన్నారు. ఆమె వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, మహేశ్వర్రెడ్డి, రాము ఉన్నారు. -
వరద వచ్చినా సిద్ధం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో తొలకరి పలకరిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా ఈసారి అసాధారణరీతిలో దాదాపు రెండువారాల ముందే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నీటిపారుదలశాఖ వానాకాలానికి ముందస్తుగానే గేట్ల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రుతుపవనాలు ముందుగా రావడంతో ఈ పనులల్లో వేగం పెంచింది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యాం అధికారులు గేట్ల నిర్వహణ పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు టెండర్లు ఖరారవగా.. సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టు గేట్ల నిర్వహణ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ల కాలంలో గేట్ల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా ఏం చేస్తారు? సాధారణంగా ఏటా వర్షాకాలానికి ముందే.. నీటిపారుదలశాఖ అధికారులు గేట్ల నిర్వహణకు పూనుకుంటారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం ప్రతీ డ్యాం వద్ద వర్షాకాలానికి ముందు (ప్రీ మాన్సూన్), వర్షాకాలానికి తరువాత (పోస్ట్ మాన్సూన్) గేట్ల లూబ్రికేషన్ ప్రక్రియను చేపడతారు. వరద సమయంలో గేట్లు సులువుగా పైకి లేచేందుకు లూబ్రికేషన్ దోహదపడుతుంది. ఇందులో భాగంగా వాల్వ్ గేర్బాక్స్లకు కూడా గ్రీస్ పూయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా జనరేటర్ల పనితీరును సమీక్షిస్తారు. వీటిని ప్రతీ ఐదు రోజులకు ఒకసారి దాదాపు 5 నిమిషాలపాటు అనివార్యంగా పనిచేయిస్తారు. ఇలాంటి భారీ జనరేట్లు ప్రతీ ప్రాజెక్టు వద్ద రెండు వరకు ఉంటాయి. వీటితోపాటు లిఫ్ట్లు, మెకానిక్ టూల్స్, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను కూడా నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఎల్ఎండీ అధికారులు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు టెండరు పిలవగా.. ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లికి సంబంధించి రూ.38లక్షలకు టెండరు ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా మిడ్మానేరుకు సంబంధించి దాదాపు రూ.26 లక్షలతో తాజాగా టెండరు పిలిచారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు జూన్లో మొదలు కానున్నాయి. వరద అవకాశాలు అంతంతే.. సాధారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ఉన్న సమయంలో ప్రాజెక్టుల్లో నీరు చెప్పుకోదగ్గస్థాయిలో ఉండేది. వీటికి వర్షాలు తోడైనపుడు ప్రాజెక్టులు వేగంగా నిండి గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేది. దాదాపుగా ఏడాదిన్నరగా ఎత్తిపోతలు నిలిచిపోయిన దరిమిలా మునపటి తరహాలో ప్రాజెక్టులలో నీటిమట్టాలు లేవనే చెప్పాలి. ఒకవేళ భారీగా కుండపోత వర్షాలు కురిసి, ఎగువనున్న మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరదలు వస్తేనే మన ప్రాజెక్టులు నిండి, గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం గేట్లు ఎల్ఎండీ 24 టీఎంసీ 20 ఎంఎండీ 27.5 టీఎంసీ 25 ఎల్లంపల్లి 20 టీఎంసీ 62 ముందస్తు రుతుపవనాలతో ఇరిగేషన్శాఖ అప్రమత్తం ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్లంపల్లి గేట్ల నిర్వహణ షురూ పనుల కోసం టెండర్లు పిలిచిన అధికారులు ఎల్ఎండీలో మొదలైన పనులు, ఎంఎండీ, ఎల్లంపల్లివి జూన్లో వరదకు ముందే అప్రమత్తంగా ఉండేలా చర్యలు -
అన్నీ.. ఇంటికే!
స్కూటీపై కూర్చున్న ఇతను పవన్. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అనంత్నగర్కు చెందిన పవన్ బీకాం చదివాడు. సిరిసిల్లలో ఓ మల్టీనేషనల్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. నిత్యం 35 నుంచి 40 పార్సిళ్లు డోర్ డెలివరీ చేస్తుంటాడు. కంపెనీ స్కూటీపైనే వస్తువులు ఇంటింటికీ అందిస్తూ నెలకు రూ.12,500 జీతం పొందుతున్నాడు.● గడపదాటని జనం ● ఆన్లైన్ కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ● రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ కామర్స్ సేల్స్ ● నేడు మార్కెటింగ్ దినోత్సవం -
మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేయండి
మా తాతముత్తాతల కాలం నుంచి ఆలూరు చెరువులో చేపలు పెంచుకుంటూ ఉపాధి పొందుతున్నం. ఇప్పటివరకు మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీ ఏర్పాటుకాలేదు. మత్స్యశాఖ అధికా రులను కోరినా పట్టించుకోవడం లేదు. మాకు ప్ర భుత్వం నుంచి లభించే పథకాలు అందడం లే దు. ప్రమాదబీమాకూ దూరమవుతున్నం. గ్రామ ముదిరాజ్ మత్స్యకారుల పేరిట మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయండి. – రాయికల్ మండలం ఆలూరు మత్స్యకారులు ఫైనాన్స్ వేధింపుల నుంచి కాపాడండి మేం తీసుకోని లోన్లు చెల్లించా లంటూ బజాజ్ ఫైనాన్స్, క్రెడ్బీ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు రాత్రి, పగలు తేడా లేకుండా ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లికి చెందిన మేం (పిట్టల సురేశ్, చెప్యాల శంకర్, చె ప్యాల శైలజ) రెక్కల కష్టం చేసుకుని జీవిస్తున్నాం. ఏనాడూ రుణం తీసుకోకపోయినా మాకు ఫోన్ అసభ్యపదజాలంతో తిడుతున్నారు. వారి నుంచి కాపాడండి. బజాజ్, క్రెడ్బీ ఫైనాన్స్ బాధితులు -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేయాలి
జగిత్యాలరూరల్/ధర్మపురి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లిలోగల కేంద్రం, ధర్మపురి మండలం జైన సహకార సంఘం పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కాంటా చేసి మిల్లులకు తరలించాలన్నారు. వాహనాల కొరత, హామాలీల సమస్య రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాల నిర్వాహకులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎం జితేంద్రప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ధర్మపురి ఇన్చార్జి తహసీల్దార్ సుమన్ పాల్గొన్నారు. లైసెన్స్లు లేకుండా విత్తనాలు అమ్మొద్దు జగిత్యాలఅగ్రికల్చర్: లైసెన్స్ లేకుండా రైతులకు విత్తనాలు అమ్మొద్దని, విత్తనాలు కొంటే రశీదులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో సోమవారం సమీక్షించారు. బీటీ–3 పత్తి, లూస్, నకిలీ, గడువు తీరిన విత్తనాలపై నిషేధం ఉందని, విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఏవైనా సమస్యలుంటే రైతులు అధికారులను సంప్రదించాలన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణా నిర్మూలన అందరి బాధ్యత
జగిత్యాల: మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని డీఈవో రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో రాష్ట్ర విద్య పరిశోధన సంస్థ శిక్షణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అక్రమ రవాణాలో పేద, మధ్యతరగతి అమ్మాయిలే అధికంగా ఉంటున్నారని తెలిపారు. ఉద్యోగం, సినిమాల్లో అవకాశం అంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో అమ్ముతున్నారని, అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ ట్రాకింగ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాల గురించి పిల్లలకు తెలపాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రజ్వల సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటివరకు 30 వేల మంది మహిళలను కాపాడామన్నారు. మహిళల కోసం సఖీ, భరోసా, చైల్డ్లైన్, పోలీస్ టోల్ఫ్రీ, బీఎంఎస్ ఐటీపీఏ, పోక్సో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
యమ ధర్మరాజుకు పూజలు
ధర్మపురి: భరణి నక్షత్రం సందర్భంగా ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహాస్వామి అనుబంధం శ్రీయమధర్మరాజుకు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ మంత్రోచ్ఛరణల మధ్య రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయూష్యసూక్తంతో అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆయుష్షు హోమం, మంత్రపుష్పం నిర్వహించారు. వివిధ పాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ట్రస్టు సభ్యులు సూపరింటెండెంట్ కిరణ్ ఉన్నారు. కల్లెడ సహకార సంఘం సీఈవో సస్పెన్షన్జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ సహకార సంఘం సీఈవో శేఖర్ను సస్పెండ్ను చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంఘం ఆధ్వర్యంలో సోమన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించగా.. కొనుగోలులో తీవ్ర జాప్యం, ని ర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించి దీనికి కారణమైన శేఖ ర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సారంగాపూర్లో తిరంగా ర్యాలీసారంగాపూర్: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు జేజేలు పలుకుతూ బీజేపీ నాయకులు మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. భారతమాతకీ జై, జైజవాన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రెంటం జగదీష్, నాయకులు కంచర్ల శివ, బాస నాగేందర్, బొడ్డుపల్లి శేఖర్, బాదినేని శేఖర్, బొక్కల రమేశ్, అంజి, వంశీ, మల్లేశం, చెరుకు గంగారెడ్డి పాల్గొన్నారు. రైతులు అధైర్యపడద్దు.. అండగా ఉంటాంరాయికల్: అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని బోర్నపల్లిలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యాన్ని త్వరగా తూకం వేసి మిల్లర్లకు తరలించాలని అధికారులకు సూచించారు. కేంద్రాల వద్దగాని, రైస్మిలర్ల వద్దగానీ సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొడిపెల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సర్వే విధానాన్ని సక్రమంగా నేర్చుకోవాలిజగిత్యాల: సర్వే విధానాన్ని సర్వేయర్లు సక్రమంగా నేర్చుకోవాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. సోమవారం ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో లైసెన్స్డ్ సర్వే శిక్షణను ప్రారంభించారు. భూభారతి చట్టం కోసం ప్రభుత్వం సర్వేయర్లను నియమించాలని చూస్తోందన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం 279 దరఖాస్తులు వచ్చాయని, మొదటి విడత 156 మందికి రెండు నెలల పాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. సర్వేను చిత్తశుద్ధితో నేర్చుకుని ఉపాధి పొందాలని, రైతులకు సహాయపడాలన్నారు. ఏడీ వెంకట్రెడ్డి, విఠల్ పాల్గొన్నారు. కోటిలింగాల జాతర వేలం వెల్గటూర్: కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయంలో ఏడాది పాటు కొబ్బరికాయలు, పూజాసామగ్రి విక్రయించుకునేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి తెలి పారు. వేలంలో పాల్గొనదలచిన వారు ఈనెల 28న ఉదయం పది గంటల లోపు ఏదైనా జాతీ య బ్యాంకులో ‘కార్యనిర్వహణ అధికారి, శ్రీకోటేశ్వరస్వామి దేవస్థానం, కోటిలింగాల’ పేరున డీడీ తీసి సీల్డ్ టెండర్ ఫారంకు జతపరి చి సమర్పించాలని, వివరాలకు ఈవోను సంప్రదించాలని సూచించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
మల్లాపూర్: అధికారంకొచ్చిన 18నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. మండల కేంద్రంలోని కేఎంఆర్ గార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మోసపూరిత హామీలు, అబద్దపు ప్రచారం చేసి.. ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు అమలు చేయలేక చతికిలపడిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో ఇక్కటీ నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని, రా నున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం అన్నివర్గాల ప్రజలు మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సా ధిస్తుందని తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ వేంపేట నర్సారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
ఇంక్రిమెంట్ల లొల్లి
● ఆందోళనలో రెగ్యులరైజ్డ్ జూనియర్ లెక్చరర్లుజగిత్యాల: ఇంటర్ విద్యావ్యవస్థలో అధికారుల వైఖరిని నిరసిస్తూ రెగ్యులరైజ్డ్ జూనియర్ లెక్చరర్లు ఆందోళన బాట పడుతున్నారు. 2023 మే 3న జీవో నంబరు 16 ద్వారా పలు శాఖలకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి పొందిన వారు 2024 మేలో మొదటి ఇంక్రిమెంట్ పొందారు. 2025 మే నెలకు సంబంధించిన ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. ఇంక్రిమెంట్ నిలుపుదల జిల్లా వ్యాప్తంగా 15 జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 138 మంది జూనియర్ లెక్చరర్ల వార్షిక ఇంక్రిమెంట్లు ఆయా ప్రిన్సిపాల్స్ నిలుపుదల చేయడంతో లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకారం వ్యవహరించాల్సి ఉండగా.. కొన్ని జిల్లాల్లో ఇంక్రిమెంట్లు వేయడం, మరికొన్ని జిల్లాల్లో వేయకపోవడం గందరగోళంగా మారింది. జిల్లాలో కూడా అమలు కాకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారు. నోడల్ అధికారికి వినతి 130 మందికి వార్షిక ఇంక్రిమెంట్లు రాక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పించేలా చూడాలని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (711) ఆధ్వర్యంలో నోడల్ అధికారి నారాయణకు వినతిపత్రం అందించారు. జగిత్యాలలోని గర్ల్స్, మల్లాపూర్ కళాశాల ప్రిన్సిపాల్స్ మాత్రమే ఇంక్రిమెంట్స్ సబ్మిట్ చేశారని, మిగతా 13 కళాశాలల ప్రిన్సిపాల్స్ నిలిపి వేశారని తెలిపారు. వీలైనంత త్వరగా రెండో వార్షిక ఇంక్రిమెంట్ ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి తిరుపతి, జితేందర్రావు, ఎం.తిరుపతి, రవిప్రసాద్ పాల్గొన్నారు. ఆరుగురు విద్యార్థులు డిబార్జగిత్యాల: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్కాపీయింగ్కు పాల్పడుతున్న ఆరుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు నోడల్ అధికారి నారాయణ తెలిపారు. కథలాపూర్ జూనియర్ కళాశాల కేంద్రంలో నలుగురు, కోరుట్ల కళాశాల (బాలురు)లో ఇద్దరిని రాష్ట్రం నుంచి వచ్చిన పరిశీలన బృందం డిబార్ చేసింది. జిల్లా వ్యాప్తంగా 1970 మంది విద్యార్థులకు సోమవారం 1870 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. -
రోజుకు ఉమ్మడి జిల్లా నుంచి 50 నుంచి 60 వేల ఆర్డర్లు ● రూ.కోట్లలో వ్యాపారం
షాపింగ్.. ఒకప్పుడు ఒకరిద్దరిని తోడుగా తీసుకెళ్లి నచ్చింది చూసి.. ధర ఆరా తీసి.. బేరం చేసి తెచ్చుకునేవాళ్లం. నేడు అంతా మారిపోయింది. ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమి షాల్లో ఇంటికి చేరుతోంది. జీవితం ఉరుకుల..పరుగులమయం కావడంతో ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ ఆప్షన్గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు సుమారు 50 నుంచి 60 వేల ఆర్డ ర్లు వెళ్తుండగా, కోట్లలో వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. ఈ ఆన్లైన్ షాపింగ్ డెలివరీబాయ్స్కు ఉపాధి ఇస్తుండగా.. ప్రజ లకు ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే శ్రమ లేకుండా పోతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం, బీపీ, గుండె సమస్యలు వస్తున్నాయి. జీవితం టైమ్ మెషిన్లా మారిన తరుణంలో ఆన్లైన్ షాపింగ్.. పరిణామాలపై మార్కెటింగ్ దినోత్సవం సందర్భంగా.. – వివరాలు 8లోu -
బిల్లులు చెల్లించండి
గత ప్రభుత్వం, అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశాం. ఇప్పటివరకు బిల్లులు రాలేదు. మన ఊరు మన బడి, రైతు వేదికలు, పంచాయతీ భవనాల నిర్మా ణం, సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలను అప్పు చేసి పూర్తి చేశాం. ఎంబీ తయారు చేసి ట్రెజరీ లో సమర్పించాం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతున్నా.. మాకు రూపాయి విడుదల కాలేదు. అప్పు ఇచ్చిన వారు ఇబ్బంది పెడుతున్నారు. నిధులు వి డుదలైనట్లు తప్పుడు ప్రచారం మమ్మల్ని ఇరకాటంలో పడేసింది. బి ల్లులు విడుదల చే యకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు. వెల్గటూర్ మండల మాజీ సర్పంచులు -
ఇంకా అందని కొత్త పింఛన్లు
● ప్రజాపాలనలో భారీగా దరఖాస్తులు ● ప్రభుత్వం నుంచి కొలిక్కిరాని స్పష్టతజగిత్యాలరూరల్: ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ల కోసం అర్హులు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అర్హులై న ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్, బీడీ కార్మికులు, వికలాంగులు, గీతకార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికుల ఫించన్లు పెంచుతామని ప్రకటించింది. అధికారంలోకొచ్చాక అర్హులందరూ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా తమకు పింఛన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. పింఛన్దారులకు గత ప్రభుత్వం నెలకు రూ.2016 చొప్పున అందించిన విషయం తెల్సిందే. అధికారంలోకొస్తే దివ్యాంగులకు రూ.4016కు పెంచుతామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో అర్హులందరూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త పింఛన్ల కోసం కూడా వేడుకుంటున్నారు. ఏళ్ల తరబడి మంజూరు కాని పెన్షన్ 2016లో అప్పటి ప్రభుత్వం మంజూరు ఇచ్చిన పెన్షన్లనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కేవలం వృద్ధాప్య పెన్షన్ మాత్రమే భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు ఇస్తున్నారు. ఇద్దరూ లేని ఇంట్లో పెన్షన్ను తొలగిస్తున్నారు. పెన్షన్లపై డీఆర్డీఏ పీడీ రఘువరణ్ను వివరణ కోరగా పింఛన్ల పెంపు ఇంకా ఖరారుకాలేదన్నారు. జిల్లాలో పెన్షన్ల వివరాలువృద్ధాప్య 60,138 వితంతు 43,925 వికలాంగ 16,561 గీత కార్మిక 3,435 చేనేత 2,404 హెచ్ఐవీ 666 ఫైలేరియా 1,667 డయాలసిస్ 83 ఒంటరి మహిళ 4,553 బీడీ వర్కర్స్ 88,660 టేకేదార్లు 756 మొత్తం 2,22,848 -
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి
జగిత్యాలటౌన్: మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్, ట్రాక్టర్, డంపింగ్ యార్డు నిర్వహణలో సేవలందిస్తున్నారని, డెంగీ, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారని వివరించారు. అలాంటి వారిని ప్రభుత్వం మల్టీపర్పస్ విధానం పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోమటి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పులి మల్లేశం, మహిళా నాయకురాలు న్యాతరి మల్ల్లవ్వ, వివిధ మండలాల పంచాయతీ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రశాంతంగా గ్రామ పరిపాలనాధికారి పరీక్ష
జగిత్యాలటౌన్: గ్రామ పరిపాలన అధికారి రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో 149 మంది అభ్యర్థులకు 142 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, ఏడుగురు గైర్హాజరయ్యారని వివరించారు. అంజన్న ముడుపుల ఆదాయం రూ.85,094 మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా దీక్షాపరులు సమర్పించిన ముడుపుల్లో కొంతభాగాన్ని ఈఓ శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో ఆదివారం విప్పారు. రూ.85,094 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి ఎం.రాజమౌళి, ఎన్.చంద్రశేఖర్, హరిహరనాథ్, శ్రీవల్లి సేవా సమతి సభ్యులు పాల్గొన్నారు. రాఘవపేటలో అత్యధిక వర్షంజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా 25.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మల్యాల మండలం మద్దుట్లలో 24 మి.మీ, బీర్పూర్ మండలం కొల్వాయిలో 21.3, మల్యాలలో 17, జగిత్యాలలో 16.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గ్రామ పెద్దలు ఇబ్బంది పెడుతున్నారుజగిత్యాలక్రైం: చెరువులో చేపలు పట్టేందుకు డబ్బులు చెల్లించాలని గ్రామ పెద్ద మనుషులు ఇబ్బంది పెడుతున్నారని రాయికల్ మండలం అలూరుకు ముదిరాజ్ కులస్తులు ఆదివారం పోలీస్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలోని కొత్త చెరువులో చాలా ఏళ్ల నుంచి చేపలు పట్టుకుంటున్నామని, రెండేళ్ల నుంచి ఏడాదికోసారి గ్రామానికి డబ్బులు కూడా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ముదిరాజ్ల పేరు మీద చెరువు రిజిస్ట్రేషన్ చేస్తామని గ్రామ పెద్దలు గతేడాది రూ.80 వేలు తీసుకున్నారని, ఈసారి కూడా డబ్బులు ఇవ్వాలని కోరడంతో రిజిస్ట్రేషన్ చేస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పినట్లు వివరించారు. దీంతో, గ్రామానికి చెందిన కొంతమంది తమను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కూచిపూడిలో చిన్నారుల ప్రతిభ
జగిత్యాలటౌన్: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో నిర్వహించిన జాతీయస్థాయి కూచిపూడి పోటీల్లో జగిత్యాలకు చెందిన మహాదేవుని నిత్యశ్రీ, శ్రేయాంషి, విశ్వద, శ్రీనిధి, శ్రీకృతి ప్రతిభచాటారు. నిత్యశ్రీ, శ్రేయాంషి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నారు. ఈసందర్భంగా చిన్నారులను మాజీ మంత్రి జీవన్రెడ్డి, జగిత్యాల మేదిని కళానిలయం నిర్వాహకులు, నాట్య సామ్రాట్ బొమ్మిడి నరేశ్ అభినందించారు. భవిష్యత్తులో చిన్నారులు నాట్యమయూరాలుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. -
నీరు వృథా.. తప్పని వ్యథ
● ప్రధాన చోట్ల లీకేజీ అవుతున్న తాగునీరు ● ఇబ్బంది పడుతున్న ప్రజలు ● మరమ్మతుల్లో జాప్యం జగిత్యాల: అసలే జిల్లా కేంద్రం.. ఆపై గ్రేడ్–1 మున్సిపాలిటీ. ఇక్కడ లక్షకు పైగా జనాభా ఉండగా వారికి సరిపడా ప్రతిరోజు 18.1 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) అవసరం. ప్రస్తుతం 1.80 కోట్ల లీటర్ల నీటిని మున్సిపల్ అధికారులు సరఫరా చేస్తున్నారు. అయితే లీకేజీలతో శివారు కాలనీలు, ప్రధాన ప్రాంతాలకు నీరు చేరడం లేదు. దీంతో నీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అమృత్ 2.0 కింద పైప్లైన్ మరమ్మతు, నూతన పైప్లైన్ల నిర్మాణం చేపడుతున్నారు. కానీ లీకేజీలను అరికట్టడంలో మాత్రం మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి ధర్మసముద్రం వద్దనున్న ఫిల్టర్ బెడ్ల నుంచి నాలుగు ప్రధాన వాటర్ ట్యాంక్లకు నీరు సరఫరా అవుతోంది. వాటర్ ట్యాంక్లకు ఫిల్టర్బెడ్ల నుంచి వచ్చే ప్రధాన పైప్లైన్లు చాలా చోట్ల లీకేజీలు ఉన్నాయి. ట్యాంక్లకు వచ్చే వరకే నీరు వృథా అవుతోంది. ట్యాంక్ల నుంచి వివిధ కాలనీలకు నీటిని సరఫరా చేస్తుంటారు. ఆ పైప్లైన్లకు కూడా అత్యధికంగా లీకేజీలు ఉండటంతో నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. మరమ్మతు చేస్తేనే నీరు వృథాగా పోవద్దంటే మరమ్మతు ఒక్కటే శరణ్యం. ఇటీవలే కొన్ని చోట్ల మరమ్మతులు చేపడుతున్నప్పటికీ కొన్నిచోట్ల మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా పాతబస్టాండ్, తహసీల్ చౌరస్తా, కొత్తబస్టాండ్, నటరాజ్ చౌరస్తా, నిజామాబాద్ రోడ్, కరీంనగర్రోడ్లో ప్రధానమైన పైప్లైన్లు ఉంటాయి. ఇక్కడ లీకేజీలు కావడం ఇబ్బందికరంగా మారింది. ఏటా రూ.10 లక్షలు కేటాయింపు పైప్లైన్ల మరమ్మతు కోసం మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఏటా రూ.10 లక్షల నిధులు కేటాయిస్తుంటారు. ఎక్కడ లీకేజీ అయినా వెంటనే మరమ్మతు చేయించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేబర్ నిధులు సైతం అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రంగుమారుతున్న నీరు లీకేజీ కారణంగా నీరు కలుషితం అవుతోందని, ఆ నీటిని వినియోగించుకోలేకపోతున్నామని ప్రజలు అంటున్నారు. కొన్నిచోట్ల ముదురు రంగులో సరఫరా అవుతోందని చెబుతున్నారు. ఆ నీటిని తాగితే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తా. ఇక్కడ తరచూ తాగునీటికి సంబంధించిన గేట్వాల్ లీకేజీ అవుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు నీరు వృథా అవుతూనే ఉంది. మరమ్మతు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణానికి నీరు సరఫరా చేసే ప్రధాన గేట్ వాల్ కావడం.. ఏళ్ల క్రితం దీనిని వేయడంతో లీకేజీ ఆగడం లేదు. అధికారులు స్పందించి కొత్త పైప్లైన్ వేసి గేట్వాల్ బిగించాలని ప్రజలు కోరుతున్నారు. -
భూమి ఎంతున్నా.. రుణం అంతంతే..
● స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉత్తర్వులు పట్టని బ్యాంకర్లు ● రైతులకు ఇచ్చేది రూ.లక్ష నుంచి రెండు లక్షలలోపే పంట రుణం(రూ.లలో) వరి 44,000 – 46,000 మొక్కజొన్న 34000 – 36,000 వేరుశనగ 32,000 – 34,000 మిర్చి 84,000 – 86,000 పత్తి 46,000 – 48,000 పసుపు 88,000 – 90,000 చెరుకు 80,000 – 82,000 నువ్వు 20,000 – 22,000 కందులు 23,000– 25,000 మల్బరీ 60,000 – 62,000 టమాట 55,000 – 57,000 మామిడి 64,000 – 66,000 పెసర 20,000 – 22,000 కూరగాయలు 35,000 – 37,000 జగిత్యాలఅగ్రికల్చర్: పంటల సాగుకు పెట్టుబడి కోసం రైతులు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుంటారు. ఆ రుణాన్ని ఏడాదిలోపు వడ్డీతో సహా చెల్లించి కొత్తగా రుణం తీసుకుంటారు. బ్యాంకర్లు మాత్రం రైతులకు భూమి ఎంత ఉన్నా.. కొన్ని బ్యాంకులు రూ.లక్ష వరకు.. మరికొన్ని బ్యాంకులు రూ.2లక్షల వరకే ఇచ్చేందుకు పరిమితం అవుతున్నాయి. బ్యాంకులు ఇచ్చిన రుణం సరిపోక రైతులు వడ్డీ వ్యాపారులు, పైనాన్స్ సంస్థలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రుణం పెంచమంటే ససేమిరా జిల్లాలో 90 శాతం మంది రైతులు తమ సమీప గ్రామాల దత్తత బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. ఏటా సక్రమంగా తిరిగి కడుతూ.. బ్యాంకు అధికారుల వద్ద నమ్మకం పెంచుకుంటున్నారు. మరోవైపు ఏటేటా పంట సాగు ఖర్చులు రెంటింపవుతున్నాయి. కాని పంట రుణం పెంచాలని అడిగితే బ్యాంకర్లు మాత్రం ససేమిరా అంటున్నారు. బ్యాంకర్లు రైతులకు సరిపడా రుణం ఇవ్వడం లేదు. భూమి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు మాత్రమే తీసుకుని పంటలు సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పసుపు, పండ్లతోటలు వంటి వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు ఎక్కువ మొత్తంలో రుణం ఇవ్వాలని కోరితే నిబంధనలు ఒప్పుకోవని బ్యాంకర్లు లేనిపోని సాకులు చెపుతున్నారు. ఎక్కువ రుణం కావాలంటే భూమిని మార్టిగేజ్ చేసుకోవాలని చెబుతుండడంతో చాలామంది ఇచ్చినదాంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక పిల్లల చదువులు, ఆస్పత్రుల ఖర్చుల కోసం అప్పు తీసుకునే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఏటా ఆయా పంటలకు ఇవ్వాల్సిన రుణాన్ని ప్రభుత్వం సీజన్కు ముందుగానే బ్యాంకర్లకు ఆదేశాలు ఇస్తుంది. ఆ మేరకు ఏ బ్యాంకు కూడా రుణాలు ఇవ్వడం లేదు. నిబంధనల సాకుతో రుణం పెంచేందుకు వెనుకంజ వేస్తున్నాయి. పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో బ్యాంకులు ఇచ్చే రుణం సరిపోక అధిక వడ్డీకి ఫైనాన్స్ సంస్థల వద్ద అప్పు తెచ్చుకుంటున్నారు. ఆ అప్పు చెల్లించేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. రైతులు గ్రామాల్లో గ్రూపులుగా ఏర్పడి చీటీలు వేసుకుంటూ డబ్బులు సమకూర్చుకుంటున్నారు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో రైతులు చీటీలు వేసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ప్రస్తుత ఏడాది ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కలిసి జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటలకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణ పరిమితిని ప్రకటించాయి. రెండు లక్షలకు మించి ఇవ్వడం లేదు నాకు ఐదెకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. రూ.లక్ష లేదంటే రూ.రెండు లక్షలు మాత్రమే రుణం ఇస్తున్నారు. నాలాగా చాలామంది రైతులు ఏటా తీసుకున్న రుణాన్ని చెల్లిస్తూనే ఉన్నారు. సక్రమంగా రుణం చెల్లిస్తున్న రైతులకు అధిక మొత్తంలో రుణం ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. – కోల నారాయణ, చల్గల్స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకే వానాకాలం సీజన్కు అన్ని బ్యాంకుల్లో పంట రుణాల పంపిణీ ప్రారంభమైంది. కొ ందరు పాత రుణాలు చెల్లించి, కొత్త రుణం తీసుకుంటున్నారు. సక్రమంగా రుణం చెల్లించే వారికి స్కేల్ ఆఫ్ పైనాన్స్ మేరకు ఎక్కువ మొత్తంలో పంట రుణం ఇస్తున్నాం. – రాంకుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్, జగిత్యాల -
లీకేజీలను అరికట్టాలి
జిల్లా కేంద్రంలో అత్యధిక చోట్ల లీకేజీలు అవుతున్నాయి. పాతబస్టాండ్, తహసీల్ చౌరస్తాలో లీకేజీలతో వాహనాలు కూడా వెళ్లలేని స్థితిలో నీరు రోడ్లపై పారుతోంది. ప్రధానమైన ప్రాంతాల్లో వెంటనే మరమ్మతు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. – కిరణ్, జగిత్యాల వాహనదారులకు ఇబ్బంది లీకేజీలతో నీరంతా రోడ్లపైకి వస్తుండడంతో ద్విచక్రవాహనదా రులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మున్సిపల్ అధికారులు లీ కేజీలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి. ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్లపై నీరు నిలిస్తే వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయి. – మదన్మోహన్, జగిత్యాలచర్యలు తీసుకుంటున్నాం చాలా చోట్ల మరమ్మతు చేయిస్తున్నాం. పైప్లైన్లు పాతవి కావడంతో కొంత ఇబ్బందికరంగా ఉంది. అమృత్ పథకం కింద మున్సిపాలిటీ పరిధిలో కొత్త పైప్లైన్లు వేస్తున్నాం. ఇప్పటికే చాలాచోట్ల లీకేజీలను అరికట్టాం. ప్రజలకు శుద్ధ జలం అందించేందుకు కృషి చేస్తున్నాం. – చరణ్, మున్సిపల్ ఏఈ -
పారిశుధ్య కార్మికుల సంరక్షణ అందరి బాధ్యత
జగిత్యాల: పారిశుధ్య కార్మికుల సంరక్షణ అందరి బాధ్యత అని డీఆర్డీవో పీడీ రఘువరణ్, డీపీవో మదన్మోహన్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో యూనిసెఫ్ ఆధ్వర్యంలో పంచాయతీ, పారిశుధ్య కార్మికులకు శిక్షణ నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పింస్తామని, ఆరోగ్య పరీక్షలు తరుచూ చేపడతామని అన్నారు. యూనిసెఫ్ నిర్వాహకులు మాట్లాడుతూ.. కార్మికులు జీవన అలవాట్లు, పద్ధతులు మార్చుకోవాలని, ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. తడి, పొడి చెత్త నిర్వహణ ఎలా చేయాలి..? పారిశుధ్య నిర్వహణ ఎలా చేపట్టాలన్న అంశంపై శిక్షణ కల్పించారు. అనంతరం వారిని సత్కరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కొనుగోళ్ల జాప్యంపై పురుగు మందు డబ్బాతో రైతు నిరసన
సారంగాపూర్: సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలోగల ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ.. ఓ రైతు క్రిమిసంహారక మందు డబ్బాతో నిరసన తెలిపాడు. కేంద్రంలో ధాన్యం పోసి 15 రోజులు గడస్తున్నా కొనుగోలు చేయడం లేదని నిరసనకు దిగగా కేంద్ర నిర్వాహకులు తనను అసభ్యంగా దూషించారని రైతు మల్లయ్య ఆరోపించాడు. వర్షానికి ధాన్యం మొలకెత్తిందని, అయినా ధాన్యం కొంటలేరని, నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు. ఒక దశలో పురుగుల మందు తాగడానికి ప్రయత్నించాడు. అక్కడున్న రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై దత్తాద్రి అక్కడికి చేరుకుని మల్లయ్య, కేంద్రం నిర్వాహకుడు సత్యనారాయణతో మాట్లాడారు. మల్లయ్య ధాన్యం కొనుగోలు చేయించడంతో సమస్య సద్దుమనిగింది. -
తిరుపతి ఎట్లున్నడో?
కోరుట్ల: మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నేపథ్యంలో సెంట్రల్ మిలిషియా కమిషన్ మెంబర్..మావోల కీలక దాడుల్లో వ్యూహకర్త.. మావోయిస్టు పార్టీలో సెకండ్ క్యాడర్లో ఉన్న కోరుట్లకు చెందిన తిప్పి రి తిరుపతి ఉరఫ్ దేవ్జీ ఎట్లున్నడో.. అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ కగా ర్ కొనసాగుతున్న క్రమంలో ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మృతి చెందుతున్న విషయం తెల్సిందే. అయితే ఏ ఎన్కౌంటర్లో తిప్పిరి తిరుపతి ఎక్కడన్నా ఉన్నాడోనని స్థానికులు కలవరపడుతున్నారు. ఆర్ఎస్యూ నేపథ్యమే.. కోరుట్లలోని అంబేడ్కర్నగర్కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు సాధారణంగా జరుగుతున్న క్రమంలో పోలీసు కేసులు నమోదు అయ్యాయి. 1983 చివరలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్గా, మిలిషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్ క్యాడర్ హోదాలో పనిచేస్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో తిప్పిరి తిరుపతిని దేవ్జీగా పిలుచుకుంటారు. మిలి షియా దాడులు జరిపి నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్యగా చెబుతారు. తిరుపతి సమీపంలోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి 74 మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది ఇతడేనని పోలీసు వర్గాలు చెబుతాయి. ఆయన తలకు ఎన్ఐఏ రూ. కోటి రివార్డు ప్రకటించినట్లు సమాచారం. ఎక్కడున్నడో ఏమో? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో మావో యిస్టు పార్టీ రిక్రూట్మెంట్లో కీలకంగా వ్యవహరించడంతోపాటు మిలటరీ శిక్షణ కేంద్రం నిర్వహణలోనూ తిరుపతి పాలుపంచుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తి రుపతి తన స్థావరాలు మార్చుకుంటున్నట్లు పో లీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కొంత మంది మా వోయిస్టు కీలక నేతలు పశ్చిమ బెంగాల్ సరి హద్దు ప్రాంతాల్లోకి వెళ్లి షెల్టర్ తీసుకుంటున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ భావిస్తోంది. వీరిలో తిప్పిరి తిరుపతి కూడా ఉంటాడన్న ప్రచా రం జరుగుతోంది. ఈ మూడు నెలల వ్యవధిలో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందుతున్న క్రమంలో తిరుపతి ప్రస్తావన రా వడం గమనార్హం. ఇటీవల మెట్పల్లి డీఎస్పీ అ డ్డూరి రాములు కోరుట్లలోని తిరుపతి ఇంటికి వె ళ్లి అజ్ఞాతంలో ఉన్న అతడిని లొంగిపోయేలా చూ డాలని ఆయన బంధువులను కోరడం గమనార్హం సీనియర్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ సారధి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తల వెల రూ. కోటి పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో మకాం? వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో కలవరం -
హడలెత్తిస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ..
పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష 2024 జూన్ 16న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూనే, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పాలనను పరుగులు పెట్టించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, కార్పొరేషన్, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శిస్తూ, స్థానిక సిబ్బంది సూచనలు స్వీకరిస్తూనే అధికారులుగా వారేం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు. విధులకు డుమ్మాకొట్టిన వారు, అలసత్వం వహించేవారు, అవినీతికి పాల్పడే అధికారులను సుమారు ఆరుగురిని సస్పెండ్ చేశారు. ముఖ్యంగా జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీలతో గాడినపెట్టారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో తన సతీమణి విజయకు ప్రతి నెలా పరీక్షలు చేయిస్తూ, డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచారు. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలను ప్రజలందరూ ఉచితంగా వినియోగించుకోవాలనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. వృద్ధాప్య దశలో ఉన్న ఓ తండ్రిని పట్టించుకోని కొడుక్కి కలెక్టర్ ఝలక్ ఇచ్చారు. కొడుకు పేరిట తండ్రి చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ను తిరిగి తండ్రి పేరుపైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తాజాగా తబిత ఆశ్రమంలో మానస అనే అనాథ యువతికి పెళ్లిపెద్దగా వ్యవహరించి, అధికారులను సమన్వయం చేస్తూ అంగరంగా వైభవంగా వివాహం జరిపించడం ద్వారా జిల్లావాసుల మన్ననలు పొందారు. -
విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి
జగిత్యాలరూరల్: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఈ సాలియా నాయక్ సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు సొంతంగా విద్యుత్కు సంబంధించిన పనులను ఎట్టి పరిస్థితిల్లో చేయొద్దన్నారు. తెగిపడిన, వేలాడుతున్న తీగలను తాకకూడదన్నారు. ఇళ్లలో బట్టలు ఆరవేసే జీఐ వైర్లకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్ దండెంలు ఉపయోగించాలని పేర్కొన్నారు. ఇంటి ముందు రేకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రసా రం కాకుండా చూడాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలకు తగలకుండా పశువులు కాపరులు జాగ్రత్త వహించాలని కోరారు. సెల్ఫోన్ ఛా ర్జింగ్ పెట్టి తడి చేతులతో తాకొద్దన్నారు. ఒకవేళ ఎవరైనా షాక్కు గురైతే కర్ర, ప్లాస్టిక్ వంటి వస్తువులతో దూరం చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, కాలిన తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ సరిచేయొద్దని పేర్కొన్నారు. విద్యుత్ సమస్య తలెత్తితే ఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912కు సంప్రదించాలని ఆయన కోరారు. ఎస్కేఎన్ఆర్లో లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణజగిత్యాల: భూభారతి చట్టం అమలులో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తొలి విడత 156 మందికి ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. మలి విడతలో 120 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 26 నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఏడీ వెంకట్రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 276 దరఖాస్తులు వచ్చాయి. -
సౌరశక్తి.. అనాసక్తి
సాక్షి, పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి ఉమ్మడి జిల్లాలో స్పందన అంతంత మాత్రమే ఉంది. సౌరశక్తి ద్వారా విద్యుదుత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహించి, గృహాలు, ఆఫీస్లు, ఇతరత్రా సంస్థలు, అర్హులందరికీ రాయితీ కల్పిస్తున్నారు. అయినా ఆయా వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. దీనిపై సంబంధిత సంస్థల నుంచి కొరవడిన ప్రచారంతో ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. అణు, థర్మల్ విద్యుదుత్పత్తితో పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. దీనిని నియంత్రించడంతోపాటు భవిష్యత్ డిమాండ్ నేపథ్యంలో సౌర విద్యుత్కు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. గృహ వినియోగదారులకు అవసరమయ్యే విద్యుత్ను వారి ఇంటిపై సౌర ఫలకలు(సోలార్ ప్యానళ్లు) ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు వచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటే దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కానరావడం లేదు. 465 దరఖాస్తులకు.. ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీ నాటికి 589.4 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 465 దరఖాస్తులు రాగా, అందులో కేవలం 131మంది మాత్రమే డబ్బులు చెల్లించారు. వీరిలో 109 మంది 134.7 మెగావాట్ల రూఫ్టాప్ సోలార్ యూనిట్లను ఇళ్లపై ఏర్పాటు చేశారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాక ‘రోజుకు ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది?, ఎంత వినియోగం ఉంటుంది?, గ్రిడ్కు ఎంత వెళుతుంది?’ అనే సమాచారాన్ని ‘నెట్మీటర్’ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా మరమ్మతులు వస్తే కంపెనీ ప్రతినిధులు వచ్చి చేస్తారు. కేవలం గృహ అవసరాలకు మాత్రమే సోలార్ ప్లాంట్లు మంజూరు చేస్తారు. టీఎస్ రెడ్కో వీటిని ఏర్పాటు చేస్తుంది. రూ.కోటి నజరానా పీఎం సూర్యఘర్, ముఫ్త్, పీఎం కుసుమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాయితీ ద్వారా సోలార్ ప్యానెళ్లను అమర్చుకునేలా ఆయా గ్రామాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాలో 5వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన గ్రామాలను ప్రాథమికంగా ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో ఎక్కువ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా పోటీని ప్రారంభించి ఆరునెలలు కొనసాగిస్తోంది. అత్యధికంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునే గ్రామాన్ని జిల్లాస్థాయి కమిటీ ‘మోడల్ సోలార్ విలేజ్గా’ గుర్తిస్తుంది. ఆయా గ్రామానికి రూ.కోటి ప్రోత్సాహం అందించనుంది, ఇందులో భాగంగా పెద్దపల్లిలో 21, జగిత్యాలలో 23 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గ్రామాల ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో సౌరశక్తి యూనిట్ల దరఖాస్తులు జిల్లా దరఖాస్తులు ఈఎండీ కెపాసిటీ (మెగావాట్లలో) జగిత్యాల 117 31 33.7 కరీంనగర్ 178 56 52.2 పెద్దపల్లి 90 13 16.8 సిరిసిల్ల 80 31 32 మొత్తం 465 131 134.7 సూర్యఘర్ పథకంపై జిల్లావాసుల్లో నిరాసక్తత రాయితీ వర్తిస్తున్నా పట్టించుకోని వైనం ఉమ్మడి జిల్లాలో 465 దరఖాస్తులకు డబ్బు చెల్లించింది 131 మందే అపోహలు వద్దు సోలార్ పవర్తో విద్యుత్ బిల్లు భారీగా తగ్గుతుంది. తొలుత పెట్టుబడి ఎక్కువగా అనిపించినా.. భవిష్యత్లో ఊహించని ప్రయోజనం చేకూరుతుంది. సోలార్ రూఫ్టాప్ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదు. – అజేయ్, డీఎం, రెడ్కో -
ఉగ్రవాదాన్ని అంతమొందించాలి
కరీంనగర్: దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించి, మతసామరస్యాన్ని కాపాడాలని, ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సుగుణాకర్రావు భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వారోత్సలు నిర్వహించార. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి, అనంతర పరిణామాలు అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అధ్యక్షతన సెమినార్ జరిగింది. వీరయ్య మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురిచేసిందని, అయితే, ఒక మతానికి వ్యతిరేకంగా మోదీ పరివారం సోషల్ మీడియాలో ప్రచారం చేసిందని, ఇది దేశ ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. కశ్మీర్ ముస్లింలే పర్యాటకులను కాపాడారని, రైల్వే, ఎయిర్పోర్టులకు ఉచితంగా పర్యాటకులను చేరవేశారన్నారు. అదే కార్పొరేట్ శక్తులు ఎయిర్లైన్స్లో రూ.6 వేలు ఉన్న టిక్కెట్కు రూ.60వేలకు పెంచారన్నారు. ఈ ఉగ్రదాడిలో ఒకముస్లిం హార్స్ రైడర్ చనిపోయారన్నారు. తామంతా ఒకటిగా ఉన్నామని అక్కడి ముస్లింలు నినదించిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. యుద్ధంతో ఉగ్రవాదాన్ని అణచివేసిన ఉదంతాలు ప్రపంచంలోనే లేవన్నారు. కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ వైఖరిపై మోదీ నోరు మెదపలేదన్నారు. ఉగ్రవాదుల అంతు తేల్చామని ఒకవైపు ప్రధాని చెబుతున్నారని, నేటికీ ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదని ఎద్దేవా చేశారు. కాల్పుల విరమణ అనంతరం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఉగ్రదాడి అనంతర పరిణామాలపై పార్లమెంట్లో ఎందుకు చర్చించలేదన్నారు. మావోయిస్టులు చర్చలకు వస్తామని ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్లకు పాల్పడడం శోచనీయమన్నారు. అడవిలో ఉన్నవారు ప్రజల కోసం పోరాడుతున్నారు తప్ప వ్యక్తిగత హింస చేయడం లేదన్నారు. నాయకులు వర్ణ వెంకటరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, బీమా సాహెబ్, సుంకర సంపత్, ఎడ్ల రమేశ్, జి.రాజేశం, కోనేటి నాగమణి, తిప్పారపు సురేశ్, జి.తిరుపతి నాయక్, కొంపెల్లి అరవింద్, రాజమల్లు, నరసింహారెడ్డి, రామ్మోహన్, శ్రీధర్, మాతంగి శంకర్, పుల్లెల మల్లయ్య, విద్యాసాగర్, వామన్రావు, వెంకటేశ్వర్లు, బోడ మోహన్ నాయక్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య -
ఉత్తీర్ణత పెంచుతూ.. ఉపాధి కల్పిస్తూ..
చదువు ఒక్కటే సమాజాన్ని ఉన్నత స్థితికి తీ సుకెళ్తుందని గుర్తించిన జగిత్యాల కలెక్టర్గా స త్యప్రసాద్ 2024 జూన్ 16న బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జిల్లాపై తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లాగా ఏర్పడిన అనంతరం హ్యాట్రిక్గా నిలిచింది. అనంతరం కరోనాతో అట్టడుగు స్థానానికి వెళ్లింది. రాష్ట్రస్థాయిలో మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో విద్యార్థులతో ముఖాముఖీ, ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేయడంతో పాటు, ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. దీంతో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాల్గో స్థానంలో జగిత్యాల మళ్లీ నిలిచింది. ఎస్సీ స్టడీ సర్కిల్లో 200 మందికి ఉచితంగా కోచింగ్ ఇప్పించగా 60 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆరుగురు గ్రూప్–1 జాబ్లు సాధించారు. అవసరమైన పిల్లలకు ఉచితంగా ల్యాప్టాప్స్ అందజేశారు. కొండగట్టు జయంతోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఎండ, వాన లెక్కచేయకుండా స్వామివారి సన్నిధిలో ఉంటూ రాత్రంతా భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేస్తూ పాలనలో తనదైన మార్క్ చూపెడుతున్నారు. -
‘పోషణ్ అభియాన్’లో జిల్లా ప్రథమస్థానం
జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా మధ్యాహ్న భోజనం అమలులో జిల్లాకు ప్రథమస్థానం లభించింది. శుభ్రమైన ఆహారం అందించడం, నాణ్యమైన భోజనం పెట్టడం ద్వారా అత్యధిక విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ఇలా 63.5శాతంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. వంటగదులు పూర్తి కావడం, హెల్త్క్యాంప్లు నిర్వహించడం, గార్డెన్స్ ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు పోషణ్అభియాన్లో చేపడుతున్నారు. కరీంనగర్ 8, రాజన్న సిరిసిల్ల 12, పెద్దపల్లి 16వ స్థానాల్లో నిలిచాయి. డీఈవో రాము, ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ సత్యప్రసాద్ అభినందించారు. భూములకు హద్దులు ఏర్పాటు చేస్తాంసారంగాపూర్: భూ భారతి కార్యక్రమంలో భాగంగా రైతుకు ఎంత భూమి ఉందో తెలుసుకుని వాటికి రైతుల సమక్షంలోనే హద్దులు నిర్ణయిస్తామని, ఆ భూమికి మ్యాప్ అందిస్తామని అదనపు కలెక్టర్ బీఎస్. లత అన్నారు. బీర్పూర్ మండలం కోమన్పల్లిలో భూ సర్వేపై అవగాహన కల్పించారు. కోమన్పల్లి పునరావాస గ్రామం కావడంతో ఇక్కడి భూములకు ఇప్పటి వరకు మ్యాపులు లేవన్నారు. భూ భారతి కింద కోమన్పల్లిని జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, గ్రామంలోని 624 ఎకరాల విస్తీర్ణం ఉన్న భూమిని సర్వే చేసి, రైతుల సమక్షంలో హద్దులు ఏర్పాటు చేస్తామని వివరించారు. డ్రోన్ ద్వారా సర్వే చేస్తామన్నారు. ఆర్డీవో మధుసూదన్, ల్యాండ్, రెవెన్యూ ఏడీ వెంకట్రెడ్డి, డీఐ విఠల్, ఇన్చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐలు శ్రీనివాస్, రాహుల్, రైతులు పాల్గొన్నారు. బయో మైనింగ్ పరిశీలనమెట్పల్లి: ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను ఎరువుగా మార్చడానికి బయోమైనింగ్ చేపడుతున్నట్లు మెట్పల్లి కమిషనర్ మోహన్ తెలిపారు. పట్టణ శివారులోని డంపింగ్ యార్డులో ఏర్పాటుచేసిన బయో మైనింగ్ మిషన్ను శనివారం ప్రారంభించారు. చెత్తను ఎరువుగా మార్చడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఈ నాగేశ్వర్రావు, ఏఈ తిరుపతి, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, విష్ణు, ముజీ ఉన్నారు. జిల్లాలో భారీ వర్షంజగిత్యాలరూరల్: జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. శనివారం నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. వెల్గటూర్ మండలం మారేడుపల్లిలో 65.8 మిల్లీమీటర్లు, బుగ్గారం మండలం సిరికొండలో 56.8, కొడిమ్యాల మండలం తిమ్మాపూర్లో 54.8, మల్యాలలో 46.4, గొల్లపల్లిలో 44.3, కొడిమ్యాల మండలం పూడూరులో 39, ఎండపల్లిలో 38.8, జగిత్యాలలో 36, ధర్మపురి మండలం నేరెళ్లలో 31.3 మిల్లీమీటర్ల వర్షపాతంగా నమోదైంది. అతి స్వల్పంగా మల్లాపూర్ మండలం రాఘవపేటలో 0.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలుమెట్పల్లి: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ స్పష్టం చేశారు. పట్టణంలోని సాయి సీడ్ ప్లాంట్లో శనివారం తనిఖీలు నిర్వహించారు. ప్రాసెసింగ్ ప్లాంట్, సీడ్ ప్రాసెస్, రా సీడ్ మెటీరియల్, బ్యాగింగ్ తదితర వాటిని పరిశీలించారు. వ్యాపారులు రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలన్నారు. ఆయన వెంట ఏడీఏ రమేశ్, ఏఓ దీపిక తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
పాలకుర్తి(రామగుండం): పుట్నూర్ గ్రామంలో టాటామ్యాజిక్ ఆటో ఢీకొని శ్రీరాముల మల్లయ్య(60) మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం రామయ్యపల్లికి చెందిన టాటామ్యాజిక్ వాహనం బసంత్నగర్ వైపు వస్తుండగా మార్గమధ్యంలో పుట్నూర్ గ్రామశివారులోని గాంధీనగర్ వద్ద రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న మల్లయ్యను వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలు కాగా వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని సుల్తానాబాద్లో మల్లయ్య మృతిచెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు బసంత్నగర్ పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటా పూర్ శివారులో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని మహిళను స్కూటీ బలంగా ఢీకొట్టడంతో మృతిచెందింది. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు. వెంకటాపూర్లోని సిరిసిల్ల– కామారెడ్డి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని మహిళను ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్లకు వెళ్లున్న స్కూటీ శుక్రవారం రాత్రి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ మహిళను అదే గ్రామానికి చెందిన వాటర్పంపు మెకానిక్ మల్లాపురం వెంకటేశ్, అతని స్నేహితుడు మేకల మల్లయ్య సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ సంఘటనపై వెంకటేశ్, మల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. బైక్ ఢీకొని వృద్ధుడి మృతిసిరిసిల్లక్రైం: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో నర్ర బుచ్చయ్య(60) మృతిచెందాడు. స్థాని కుల కథనం ప్రకారం.. బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి అతివేగంగా వెళ్తూ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఎక్సెల్పై వెళ్తున్న బుచ్చయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తీసుకెళ్లగా మృతిచెందాడు. మృతికి కారణమైన పీసీ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపినట్లు స్థానికులు తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో రేవతి నక్షత్రోత్సవం
● రాజన్నను దర్శించుకున్న 70 వేల మంది ● రూ.65 లక్షల ఆదాయం ● రాజన్న సేవలో సినీనటులు వేములవాడ: రేవతీ నక్షత్రోత్సవం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో శనివారం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతపద్మనాభస్వామికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం చేశారు. 70వేల మంది భక్తులు దర్శించుకోగా, రూ.65 లక్షల ఆదాయం సమకూరింది. కరీంనగర్ ఏసీపీ వెంకటస్వామి దంపతులు రాజన్నను దర్శించుకున్నారు. శనిత్రయోదశిని పురస్కరించుకుని అనుబంధ ఆలయం భీమన్నగుడిలో నవగ్రహాలకు పూజలు నిర్వహించారు. రాజన్నను సినీనటులు బాలాదిత్య(చంటి), కౌశిక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. -
రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జగిత్యాల: గ్రామ పరిపాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశామని, ఇబ్బంది లేకుండా అభ్యర్థులు పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ లత, అధికారులు పాల్గొన్నారు. విద్యార్హత నిబంధనతో పరీక్షకు దూరం గ్రామ పరిపాలన అధికారుల రాత పరీక్షకు డిగ్రీ, ఐదేళ్ల సర్వీస్, ఇంటర్ విద్యార్హత పెట్టారని, పాత సర్వీస్ను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేయడంతో జిల్లాలో చాలామంది పూర్వ వీఆర్ఏలు, వీఆర్వోలు పరీక్షకు దూరమవుతున్నారని వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు హరి అశోక్కుమార్ అన్నారు. వీఆర్ఏ, వీఆర్వోలు విద్యార్హత లేని కారణంగా జీపీవో పరీక్షకు దూరమయ్యారని, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో.. సిలబస్ ఏంటో తెలియక ఇబ్బంది పడుతున్నారని వివరించారు. -
మచ్చలేని నాయకుడిపై నిందలా?
పెద్దపల్లిరూరల్: మచ్చలేని నాయకుడిగా, నీతి, నిజాయతీతో రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కుటుంబం నిందలు వేయడం మానుకోవాలని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం హితువు పలికారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరస్వతీ పుష్కరాల ప్రచారంలో ఫ్లెక్సీపై ఎంపీ వంశీకృష్ణ ఫొటో ఏర్పాటు చేయలేదని శ్రీధర్బాబుపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. 30 ఏళ్ల యువకుడికి ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపించిన నాయకు డిని ఎలా విమర్శిస్తారని మండిపడ్డా రు. వివేక్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చెడ్డు పేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని, ఇప్పటికై నా కుల రాజకీయాలు మానుకోవాలని హితువు పలికారు. వివేక్ పార్టీలు మారడంలో దిట్ట అని, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఎక్కడ కలిశావో తనకు తెలుసుని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఇష్టం ఉంటే పార్టీ కోసం పనిచేయాలని, లేకుంటే తనకు నచ్చిన పార్టీలోకి వెళ్లాలని సూచించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. నాయకులు మల్యాల తిరుపతి, మంథని సత్యం, కర్ణ కృష్ణ, తోకల మల్లేశ్, ఇరుగురాల మహేందర్, బూడిద శంకర్, అక్కపాక సంపత్, సాట్ల అమరజ్యోతి, పులిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశపూర్వకంగానే మంత్రి శ్రీధర్బాబుపై అక్కసు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం -
రాయికల్లో తిరంగా యాత్ర
జగిత్యాలరూరల్(రాయికల్): ఆపరేషన్ సిందూర్ విజయాన్ని స్వాగతిస్తూ శనివారం రాయికల్లో బీజేపీ పట్టణ నాయకులు పాతబస్టాండ్ నుంచి భరతమాత విగ్రహం వరకు తిరంగాయాత్ర నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. దేశభక్తి, ఐక్యత, సమైక్యతను ప్రజల్లో బలపర్చాలనే లక్ష్యంతో తిరంగాయాత్ర నిర్వహించినట్లు పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వడ్డెపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేశ్, నాయకులు తీపిరెడ్డి రాజశేఖర్రెడ్డి, బన్న సంజీవ్, భూమేశ్, శ్రీకాంత్రెడ్డి, సామల్ల సతీశ్, సాయిరాజ్గౌడ్, నరేందర్, కుర్మ నారాయణరెడ్డి, మల్లారెడ్డి, అశోక్, మల్లేశ్, రంగోపాల్, మోహన్రెడ్డి, నర్సయ్య, సంతోష్, బొంగోని భూమాగౌడ్, రాజేశం పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
ధర్మపురి: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలోని జైనా, దొంతాపూర్, మగ్గిడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం సందర్శించారు. అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలరోజులు గడుస్తున్నా.. తూకం వేయకపోవడం వైఫల్యానికి నిదర్శనమన్నారు. అలాగే తూకం వేసేటప్పుడు క్వింటాలుకు ఆరు కిలోలు తరుగు తీస్తున్నట్లు రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని అన్నారు. రైతుల సమస్యలపై సివిల్ సప్లై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కొనుగోళ్లలో తీవ్ర జాప్యంసారంగాపూర్: బీర్పూర్ మండలంలోని పలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జాప్యం జరుగుతున్నాయని, వర్షానికి మొలకలు వస్తున్నాయని అదనపు కలెక్టర్కు రైతులు శనివారం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ, విండో మాజీ చైర్మన్ మెరుగు రాజేశం, బీజేపీ నాయకులు గర్షకుర్తి రమేశ్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కందెనకుంట కేంద్రం నిర్వాహకులతో మాట్లాడిన లత కారణాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లు చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. -
అంజన్న ఆదాయం రూ.1.51కోట్లు
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 20 నుంచి 22వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు అన్ని శాఖల సమన్వయం, సహకారంతో విజయవంతమయ్యాయని ఆలయ ఈఓ శ్రీకాంత్రావు తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాలతో మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించామని పేర్కొన్నారు. స్వామివారికి లడ్డూ ప్రసాదం ద్వారా రూ.79,14,200, పులిహోర ద్వారా రూ.10,45,920, దీక్ష విరమణల ద్వారా రూ.30,56,100, కేశ ఖండనం ద్వారా రూ.8,51,450, శీఘ్ర దర్శనం ద్వారా రూ.23,04,800 మొత్తం రూ.1,51,72,470 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. సౌదీలో తెలుగు సంఘం ఏర్పాటుజగిత్యాలరూరల్: సౌదీ అరేబి యాలో తెలుగు అసోసియేషన్ ఫౌండర్ మల్లేశ్ ఆధ్వర్యంలో సాటా రియాద్ చాప్టర్ కోర్ టీంను శనివారం ప్రకటించారు. అధ్యక్షుడిగా మచ్చ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్గా నూర్ మహమ్మద్, ఇంజినీరింగ్ ప్రెసిడెంట్గా సింగు నరేష్కుమార్, బిజినెస్ ప్రెసిడెంట్గా వీరవెల్లి యోగేశ్వరా రావు, టీచర్స్ ప్రెసిడెంట్గా మురళిని ఎన్నుకున్నా రు. శ్రీనివాస్ మాట్లాడుతూ కులం, మతం బేధం లేకుండా అందరం కలిసి కష్టాల్లో ఉన్న తెలుగువారికి సహాయం చేద్దామన్నారు. కోర్ టీమ్ శహబా జ్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, నయీమ్, అయాజ్, ముజామిలోద్దీన్, ఇలియాస్, కోకిల, మంజూష మహేశ్కు అభినందనలు తెలిపారు. ఏటీఎం కార్డు దొంగిలించి రూ.92,500 విత్ డ్రాసారంగాపూర్: ఇంట్లోంచి ఏటీఎం కార్డు దొంగిలించి రూ.92,500 విత్డ్రా చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొహిబి షన్ ఎస్సై రాజు కథనం ప్రకారం.. నర్సింహులప ల్లెకు చెందిన మెరుగు సత్తయ్య షాపు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం కార్డు దొంగిలించాడు. మా ర్చి నుంచి ఈనెల వరకు పలుమార్లు రూ.92,500 డ్రా చేసుకున్నాడు. సత్తయ్య ఇటీవల బ్యాంక్కు వెళ్లి అకౌంట్ పరిశీలించగా.. ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వృద్ధుడిపై పోక్సో కేసుమెట్పల్లి: పట్టణానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించిన వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక (7) గురువారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా పొరుగున ఉండే వృద్ధు డు (70) తన ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడుతుండగా బాలిక కేకలు వేసింది. బాలిక నానమ్మ, కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
అమ్మకు ఆరోగ్యం.. పిల్లలకు చదువు..
కలెక్టర్లు సాధారణంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం, పైళ్లు క్లియర్ చే యడం, విజిట్స్, ఇతర కార్యకలాపాలతో బిజీగా గడుపుతారు. కానీ.. కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పమేలా సత్పతి మాత్రం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చిన్నారుల మానసిక వికాసం కోసం ‘ఏ టూ జెడ్ నాణ్యమైన రైమ్’ పేరిట రైమ్ రాసి పిల్లల కోసం పాడారు. ప్రతీ అక్షరం ప్రాముఖ్యతను తెలిపేలా.. ఏ ఫర్ ఆక్టివ్, బీ ఫర్ బ్రైట్.. అంటు జెడ్ వరకూ అన్ని అక్షరాలను ఉపయోగించి రైమ్ విడుదల చేశారు. అలాగే ‘శుక్రవారం సభ’ పేరుతో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పోషణలోపం గల చిన్నారులు, రక్తహీనత ఉన్న మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకున్నారు. ఉచిత పరీక్షల ద్వారా మహిళలకు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా భరోసా ఇస్తూ చేపట్టిన కార్యక్రమం అద్భుత ఫలితాలను సాధించింది. అలాగే జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించి సుమారు 500 మంది వలసకార్మికుల పిల్లలకు బోధన అందించి తనదైన తల్లి పాలనతో ఆకట్టుకుంటున్నారు. -
అంజన్నా మళ్లొస్తాం
● ముగిసిన పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ● కొండగట్టులో కొనసాగుతున్న భక్తుల రద్దీమల్యాల: మల్యాల మండలం ముత్యంపేట శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. కొండపై మూడు రోజులపాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శుక్రవారం సైతం భక్తుల రద్దీ కొనసాగింది. ఆంజనేయస్వామి నామస్మరణతో కొండగట్టు ఆలయ పరిసరాలు మార్మోగాయి. జయంతి ఉత్సవాలకు మూడు రోజులపాటు సుమారు రెండున్నర లక్షలకుపైగా భక్తులు తరలివచ్చారు. కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయ అధికారుల సమన్వయంతో వేడుకలు విజయవంతంగా నిర్వహించారు. -
ఆందోళన వద్దు.. ఆదుకుంటాం
జగిత్యాల అగ్రికల్చర్/సారంగాపూర్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం,.. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్, తిప్పన్నపేట, సారంగాపూర్ మండలం కోనాపూర్, పెంబట్ల గ్రామాల్లో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని శుక్రవారం పరిశీలించారు. తడిసిన ధాన్యం కొనుగోలుపై కలెక్టర్తో మాట్లాడటం జరిగిందని, కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ శ్రీనివాస్, సింగిల్విండో చైర్మన్లు మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ దామోదర్రావు, నాయకులు రవీందర్ రెడ్డి, పెండెం రాములు, బాల ముకుందం, కోల శ్రీనివాస్, నారాయణ, సీఈఓ వేణు ఉన్నారు. -
మళ్లీ కరోనా.. కట్టడి ఎలా?
9జగిత్యాల: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుందనే సమాచారంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైరస్ వస్తే పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్కుమార్తో శనివారం ఫోన్ఇన్ నిర్వహిస్తోంది. జిల్లావాసులు సద్వినియోగం చేసుకుని, తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తేదీ : 24.05.2025 (శనివారం), సంప్రదించాల్సిన ఫోన్ నం.: 98490 22772సమయం : 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు -
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి
జగిత్యాలరూరల్: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన తడిసిన ధాన్యంను కూడా కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట, గోపాల్రావుపేట, మూటపల్లి, భూపతిపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అకాల వర్షాలతో వాహనాల ఇబ్బంది, తూకం సమస్య ఏర్పడటంతో కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని కూడా వెనువెంటనే లోడింగ్ చేసి మిల్లులకు తరలించాలని అన్నారు. గతేడాది ఈ సమయానికి 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగగా, ప్రస్తుతం ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని తెలిపారు. గతంలో కన్నా మెరుగ్గా ఉందని, గతంలో లాగా వడ్లు పట్టడం, కటింగ్లు లాంటి కోతలు లేవన్నారు. ప్రభుత్వం తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తుందని, ఇప్పటికే కలెక్టర్, అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. గంగమ్మతల్లి ఆలయంలో జీవన్రెడ్డి పూజలు జగిత్యాలరూరల్(రాయికల్): రాయికల్ మండలం భూపతిపూర్లో శుక్రవారం నిర్వహించిన గంగమ్మతల్లి బోనాల పండుగలో మాజీ మంత్రి జీవన్రెడ్డి ప్రత్యేక పూజలుచేశారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు సుస్థిర ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ స్పందన అన్నారు. శుక్రవారం జగిత్యాలలోని బుడిగజంగాల కాలనీ తో పాటు తదితర కాలనీలను పరిశీలించారు. లోతట్టు ప్రాంతమైన బుడిగజంగాల కాలనీలో ఇళ్లలోకి వర్షం నీరు రావడంతో వారికి దగ్గరలోని ప్రైమరీ పాఠశాలల్లో తాత్కాలిక నివాసం కల్పించినట్లు తెలిపారు. అనంతరం జేసీబీల సహాయంతో నిలిచిన వర్షం నీటిని తొలగించామన్నారు. ఆమె వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు మహేశ్వర్రెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు. జిల్లాలో భారీ వర్షంజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం జగిత్యాలలో 88.0 మి.మీ, మేడిపల్లిలో 86.8, జగిత్యాలరూరల్ మండలం పొలాసలో 76.8, బీమారం మండలం గోవిందారంలో 65.3, ఎండపల్లి మండలం గుల్లకోటలో 58.0, మల్యాల మండలం మద్దుట్లలో 58.0, కథలాపూర్ మండలం 50.5, వెల్గటూర్ మండలంలో 48.5, మల్యాలలో 46.3, కోరుట్లలో 45.0, ధర్మపురి మండలం నేరెల్లలో 43.5 మి.మీ వర్షపాతం నమోదైంది. -
రైతులు అధైర్య పడొద్దు
ధర్మపురి/బుగ్గారం: వర్షాలతో వరి ధాన్యం తడిస్తే రైతులు అధైర్యపడొద్దని, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని మ్యాచర్ వచ్చాక కొనుగోళ్లు చేపడుతారని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ధర్మపురి మండలం నేరెళ్ల, బుగ్గారం మండలం మద్దునూ ర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించా రు. తడిసిన వరి ధాన్యాన్ని వీలైనంత తొందరగా కొ నుగోలు చేసి రైసుమిల్లులకు పంపించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధా న్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్లో ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత, లారీల కొరత లేకుండా అధికా రులు చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా కే ంద్రాల ఇన్చార్జిలు కొనుగోళ్ల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పడని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డీసీవో మనోజ్కుమార్, డీఎస్వో జితేందర్రెడ్డి,డీఎం జితేంద్రరెడ్డి తదితరులున్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం తగదు
కోరుట్ల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం తగదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నా రు. శుక్రవారం కోరుట్ల మండలం మోహన్రావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరి పంట కోసి నెల గడుస్తున్నా కొనుగోళ్ల ప్రక్రియ ముగియలేదని అధికారుల పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలకు కొన్ని చోట్ల ధాన్యం మొలకలు వచ్చాయన్నారు. మరో పది రోజుల్లో వర్షాకాలం ప్రా రంభం అవుతుందని ధాన్యం కొనుగోళ్లు చేయకుంటే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అ నంతరం చినమెట్పల్లిలో హనుమాన్ ఆలయ ధ్వజస్తంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అకాల వర్షాలతో అన్నదాత విలవిల
జగిత్యాలఅగ్రికల్చర్/మెట్పల్లిరూరల్: జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాత విలవిలలాడుతున్నాడు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం వర్షార్పణం అవుతోంది. ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోతుండటంతో పాటు మొలకలు వస్తుండటంతో రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కూలీల ఖర్చు రెట్టింపు అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తడిసిన ధాన్యం ఆరబెట్టి కొనుగోళ్లు పూర్తయ్యే నాటికి ఎన్ని రోజులు అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఓ వైపు రైతులు ఆందోళనలు చేస్తుండగా కలెక్టర్ సత్యప్రసాద్ నేతృత్వంలో జిల్లా అధికారులు, మరోవైపు ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాల బాట పట్టి రైతులకు ధైర్యం చెబుతున్నారు. వర్షపు నీరు తొలగించేందుకు కష్టాలు కొనుగోలు కేంద్రాల్లో సరిపోయేంత స్థలం లేకపోవడం, ఓ కుప్ప పక్కనే మరో ధాన్యం కుప్ప పోయడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వర్షపు నీరు ఎటుపోయే పరిస్థితి లేకపోవడంతో రైతులు తట్టలు, బకెట్లతో బయటకు ఎత్తిపోసే పరిస్థితి నెలకొంది. ధాన్యం కుప్పల మధ్య నుంచి చిన్నపాటి కాలువలు ఏర్పాటు చేసుకొని నీటిని తరలించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు తిప్పలు వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు ఎక్కువగా ఉన్న చోట తడిసిన ధాన్యం ఆరబెట్టడం సమస్యగా మారింది. ధాన్యం కుప్పల పక్కన స్థలం లేకపోవడంతో డబ్బాలతో ఇతర చోటుకు మోసి ఆరబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని నేర్పడం ఒకరిద్దరు రైతులతో అయ్యే పని కాకపోవడంతో ఆరబెట్టేందుకు కూలీలను పెట్టుకుంటున్నారు. దీంతో రైతులకు రెట్టింపు ఖర్చులు అవుతున్నాయి. నిలిచిన ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో అకాల వర్షాలతో ధాన్యం కొనుగోళ్లు నిలి చిపోయాయి. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్న సమయంలో వర్షాలతో కొనుగోలు కేంద్రాలు గందరగోళంగా మారాయి. కవర్లు కప్పినప్పటికీ ధాన్యం అక్కడక్కడ తడవడంతో తేమ సాకుతో మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు తంటాలు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళనలు రైతులకు రెట్టింపు కానున్న ఖర్చుఆరబెట్టడం ఇబ్బందిగా మారింది వర్షాలతో కవర్లు కప్పినప్పటికీ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం ఇబ్బందిగా మారింది. కుప్పల పక్కన కుప్పలు ఉండటంతో ఆరబెట్టేందుకు స్థలం లేదు. ఎక్కడికక్కడే నిలిచిన వర్షపు నీటిని తొలగించడం కష్టమవుతోంది. – సాయిరెడ్డి, సింగరావుపేట తూకం వేస్తే ఇబ్బందులుండేవి కావు కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేసి రవా ణా చేస్తే ఇబ్బందులు ఉండేవి కావు. ఇప్పుడు తడిసిన ధాన్యం ఆరబెట్టడం సమస్యగా మారింది. ఆరబెట్టకపోతే గింజలు నల్లబడుతాయి. – అత్తినేని లచ్చవ్వ, తిప్పన్నపేట ఫొటోలో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతు భూమేశ్. బండలింగాపూర్కు చెందిన ఈ రైతు నెల రోజుల క్రితం గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి 30 క్వింటాళ్ల ధాన్యాన్ని తీసుకెళ్లాడు. పదిరోజుల్లోపే తేమశాతం వచ్చినా ధాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి తడిసింది. ఆరబెట్టేందుకు తంటాలు పడుతున్నాడు. -
యూరియాను మోతాదుకు మించి వాడుతున్నారు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు అవసరం ఉన్నా, లేకున్నా ఒక్కరిని చూసి మరొకరు మోతాదును మించి యూరియాను వాడుతున్నారని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సైదానాయక్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ల బృందం శుక్రవారం రాయికల్ మండలం రామోజిపేటలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మాట్లాడారు. వానాకాలంలో ఓ పంట వేస్తే, యాసంగిలో మరో పంట వేయాలని సూచించారు. పంట మార్పిడి చేయడం వల్ల రైతులకు సాగు ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. తెగుళ్ల, పురుగుల బెడద ఉండదన్నారు. అవసరం మేరకు మాత్రమే పంటలకు నీటిని ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొపెసర్లు డాక్టర్ శేషు, డాక్టర్ సతీ శ్, ఏఈవో పద్మావతి, రైతులు పాల్గొన్నారు. పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలిగొల్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను పరిశీలించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి మెరుగైన విద్యాబోధన అందించాలని సూచించారు. ఆయన వెంట స్టేట్ అబ్జర్వర్ దుర్గాప్రసాద్, ఎంఈవో జమునదేవి, ఉపాధ్యాయులు, ఆర్పీలు, సీఆర్పీలు పాల్గొన్నారు. -
విజిలెన్స్ స్లో!
● శాతవాహన సిబ్బందికి మరోసారి నోటీసులు ● ఖర్చు బాధ్యులకు తాజాగా తాఖీదులు ఇవ్వనున్న విజిలెన్స్ ● గతంలో నోటీసులకు పెద్దగా స్పందించని వర్సిటీ అధికారులు ● వీసీ, సిబ్బంది మారడంతో తొలి నుంచి విచారణ ● విచారణకు ఆటంకంగా మారిన విజిలెన్స్లో సిబ్బంది కొరతసాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయంటూ గతేడాది మొదలైన విజిలెన్స్ విచారణ నత్తనడకన సాగుతోంది. ఇటీవల యూనివర్సిటీ వీసీ మారడం, కొందరు సిబ్బంది బదిలీ కావడం, పదవీ విరమణ పొందడం అదే సమయంలో విజిలెన్స్కు కూడా కొత్త ఎస్పీ రావడంతో విచారణ తిరిగి మొదటి నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. వాస్తవానికి శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధి పనులపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ నిధులను మంచినీళ్లలా ఖర్చు చేశారని పలువురు ఫ్రొఫెసర్లు బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్ 18వ తేదీన హైదరాబాద్లోని విజిలెన్స్ ప్రధాన కార్యాలయంలో కొందరు ఫిర్యాదు చేశారు. సరిగ్గా నెలరోజుల తరువాత ఈ ఫిర్యాదు కరీంనగర్ విజిలెన్స్ కార్యాలయానికి చేరింది. దాదాపు 160 పేజీలు ఉన్న ఆ ఫిర్యాదును అధ్యయనం చేసిన జిల్లా విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించినా అనుకున్న మేరకు అది సాగలేదు. వర్సిటీ అధికారులు సహకరించకపోవడం ప్రధాన కారణం అయితే, విజిలెన్స్లో స్టాఫ్ కొరత మరో ముఖ్య కారణంగా తెలుస్తోంది. మళ్లీ నోటీసులు దాదాపుగా ఏడాది కావొస్తున్నా.. విచారణలో పెద్దగా పురోగతి లేకపోవడంతో దీనిపై మరోసారి విజిలెన్స్ దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో వర్సిటీలో జరిగిన అధిక ఖర్చులపై విజిలెన్స్ చిట్టా రూపొందించింది. ముఖ్యంగా వర్సిటీ భవనాల్లో భారీగా (రూ.50 కోట్లకుపైగా) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ సమయంలో ఎవరు ఆ నిర్మాణాలకు బాధ్యలుగా ఉన్నారో గుర్తించారు. ఈ నిర్మాణాల్లోనే చాలా మట్టుకు టెండర్లలో గోల్మాల్ జరిగిందన్న విమర్శలున్నాయి. వారికి తిరిగి కొత్తగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. కొత్తగా వచ్చిన వీసీకి కూడా జరిగిన విషయాన్ని విజిలెన్స్ అధికారులు వివరించి విచారణకు సహకరించాలని కోరారు. అదే సమయంలో విజిలెన్స్ ఎస్పీగా ఎం.శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టడంతో ఆయనకూ వివరించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.వేధిస్తున్న సిబ్బంది కొరతవాస్తవానికి విజిలెన్స్ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. డాక్యుమెంటేషన్ ప్రక్రియ కోసం డీటీపీ ఆపరేటర్లనూ రిక్రూట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఇన్స్పెక్టర్ ర్యాంకుల్లో ఉన్న అధికారులే విచారణతోపాటు కేసు వివరాలను స్వయంగా డీటీపీ చేసుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి కరీంనగర్లో గతంలో గొర్రెల స్కాం, పత్తి స్కాం, ఆసరా పింఛన్ల స్కాం, సదరం సర్టిఫికెట్ల స్కాం, బల్దియాలో పనులతో పాటు ఉమ్మడి జిల్లాలో అనేక కేసులు పరిమితి సిబ్బందితో విచారణ చేయాలంటే వీరికి తలకుమించిన భారంగా మారింది. పైగా పని ఒత్తిడితో సిబ్బంది సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శాతవాహన వర్సిటీ అధికారులు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. -
అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలి
జగిత్యాల: మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఆదేశించారు. గురువారం మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. వార్డుల్లో కొనసాగుతున్న పనులను నాణ్యతతో చేయించాలని, ఆగిపోయిన పనులకు తిరిగి టెండర్లు పిలవాలని, వర్షాకాలానికి ముందే పూర్తి చేసేలా చూడాలని సూచించారు. డీఈ నాగేశ్వర్, పబ్లిక్ హెల్త్ డీఈ వరుణ్, ఏఈలు చరణ్, అనిల్ పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంచాలి విద్యార్థుల్లో దేశభక్తిని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. గురువారం ఓల్డ్ హైస్కూల్లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలు వివరించాలని, మత్తుకు బానిస కాకుండా చూడాలన్నారు. డీఈవో రాము, మండల విద్యాధికారి చంద్రకళ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పాలన వైఫల్యంతో రాష్ట్రం తిరోగమనం
మల్లాపూర్/కోరుట్ల/కోరుట్లరూరల్: కాంగ్రెస్ పార్టీ పాలన వైఫల్యంతో రాష్ట్రం తిరోగమనంలో పయని స్తోందని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నా రు. మల్లాపూర్లో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాల్లో కోత పెడుతున్న ప్రభుత్వం ప్రజలు, రైతులను వంచిస్తోందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి కొట్లాడుతానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి పాల్గొన్నారు. హనుమాన్ జయంతిలో ఎమ్మెల్యే కోరుట్ల/కోరుట్ల రూరల్: కోరుట్లతోపాటు కల్లూర్ హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానం ప్రారంభించారు. నాయకులు చీటి వెంకట్రావు, రాజేశ్, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు. -
వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
జగిత్యాల/జగిత్యాలటౌన్/మేడిపల్లి/కథలాపూర్:జిల్లాకేంద్రంలో గురువారం మధ్యాహ్నం గంటన్నరపాటు కుండపోత వర్షం కురిసింది. పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మురుగు కాలువల్లోని చెత్తాచెదారం రోడ్లపైకి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ స్పందన అన్నారు. లోతట్టు ప్రాంతాలైన తులసీనగర్, లింగంచెరువు, పార్క్ సందులను పరిశీలించారు. ఆమె వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్రెడ్డి, బల్దియా సిబ్బంది ఉన్నారు. ఇళ్లలోకి చేరిన వరద నీరు ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మేడిపల్లి వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేడిపల్లి మండలకేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగు నీరు రోడ్లపైకి చేరింది. భీమారంలోని కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. మేడిపల్లి నుంచి దేశాయిపేట వరకు ఇటీవల వేసిన డబుల్ రోడ్డు పక్కన సైడ్బర్మ్ మట్టి కొట్టుకపోవడంతో వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. కథలాపూర్లో భారీ వర్షం కథలాపూర్లో భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. -
భాగ్యరెడ్డి వర్మ ఆదర్శం
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలటౌన్: సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో వర్మ 137వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానంలో దళిత బాలికల పాఠశాలను స్థాపించి వారి అభ్యున్నతికి పునాదులు వేశారని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్కుమార్, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జగిత్యాలక్రైం: దళిత ఉద్యమానికి పునాది వేసిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డివర్మ అని అడిషనల్ ఎస్పీ భీంరావ్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను గుర్తిస్తూ ఏటా మే 22న జయంతిని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు, ఆర్ఎస్సై రమేశ్, డీపీవో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ధర్మపురిలో మారుమోగిన శ్రీరామ నామం ధర్మపురి: హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీప్రసన్నాంజనేయ స్వామిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. స్వామివారికి వేదపండితులు క్షీరాభిషేకం చేశారు. అంజన్న మాలలు ధరించిన భక్తులంతా కొండగట్టు నుంచి ధర్మపురికి చేరుకున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ధర్మపురికి చెందిన గునిశెట్టి అంజన్న మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు పాల్గొన్నారు. నృసింహుడి ఆదాయం రూ.8లక్షలుశ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి గురువారం టికెట్లు, ప్రసాదాలు, అన్నదానం ద్వారా రూ. 8,18,480 వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.డీఎస్పీ రఘుచందర్ బదిలీ నిలిపివేతజగిత్యాలక్రైం: ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఇందులో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ను ఇంటలీజెన్సీ డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రామగుండం సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్న వెంకటస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా రఘుచందర్ బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్లో మహా చండీయాగంజగిత్యాలటౌన్: జూన్ 14, 15న ఉద్యమకారుల మహా చండీయాగం చేపడుతున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి అన్నారు. జిల్లాకేంద్రంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయాలని యాగం చేపడుతున్నామన్నా రు. తిమ్మాపూర్ మండలంలోని తాపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో యాగం ఉంటుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి భారతపు లింగా రెడ్డి, ప్రేంకుమార్, వేణుగోపాల్, చినారెడ్డి, మల్లేశం, గాలిపెల్లి సత్తవ్వ, శంకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని, దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత అన్నారు. ప్రాజెక్టులో అవినీతి లేదని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని జస్టిస్ సతీశ్చంద్రశర్మ నాగరత్న బెంచ్ స్పష్టం చేసిందన్నారు. నీటి ప్రాజెక్ట్లు ప్రజాప్రయోజనాల కోసం చేపడతారని, ప్రాజెక్ట్లతో తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారని గుర్తు చేశారు. ఇది సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్రెడ్డి సర్కారుకు చెంప పెట్టు అన్నారు. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
జగిత్యాల: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 428 కేంద్రాల ద్వారా 65,554 మంది రైతుల నుంచి 3.88 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని, రూ.723.46 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నరకాలకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని వివరించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీసీ రోడ్డు ప్రారంభం గొల్లపల్లి: మండలంలోని దమ్మన్నపేట నుంచి హనుమాన్ ఆలయం వరకు నిర్మించిన సీసీరోడ్డును విప్ అడ్లూరి మాజీమంత్రి జీవన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, వైస్ చైర్మన్ పురాపాటి రాజిరెడ్డి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ధర్మపురి: ధర్మపురి ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మీ చెక్కులను విప్ పంపిణీ చేశారు. 54 మందికి రూ.54 లక్షల చెక్కులు అందించారు. పేద ల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఎంపీడీవో రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ సుమన్, నాయకులు ఎస్ దినేష్, చిలుముల లక్ష్మణ్ తదితరులున్నారు. -
యువతకు ఉపాధి కల్పిస్తాం
జగిత్యాలరూరల్: గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్ అన్నారు. గురువారం జగిత్యాల మండల పరిషత్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకున్న 12 మంది ఎస్టీ, 152 మంది మైనార్టీ, 57 మంది ఈబీసీలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
మెట్పల్లిరూరల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగుతున్నాయని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి మండలం బండలింగాపూర్ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని రైస్మిల్లులకు వెంటనే తరలించాలని ఆదేశించారు. లారీల కొరత ఎక్కడా లేదన్నారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్, డీసీవో మనోజ్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలి జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరిందని, వర్షాలు పడుతున్న నేపథ్యంలో వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని 65 ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. ఇప్పటివరకు 11,51,922 క్వింటాళ్ల ధాన్యం సేకరించామన్నారు. ఏపీఎం గంగాధర్, సీసీలు రవీందర్, శ్రీనివాస్ ఉన్నారు. -
నవ భారత నిర్మాత రాజీవ్గాంధీ
జగిత్యాలటౌన్: నవ భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్గాంధీ అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మ ణ్కుమార్, మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం ఇందిరాభవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజీవ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలనకు ఆయన కృషిని మరువలేమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, నక్క జీవన్, రఘువీర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ధర్మపురిలో.. ధర్మపురి: రాజీవ్గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని విప్ అడ్లూరి అన్నారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నాయకులు ఎస్ దినేష్, వేముల రాజు, సింహరాజు ప్రసాద్, చిలుముల లక్ష్మణ్ తదితరులున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభంమేడిపల్లి: మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సత్య ప్రసాద్తో కలిసి బుధవారం ప్రారంభించారు. గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. కట్లకుంటలో బీరప్ప కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్కు నోటీసులు కక్ష సాధింపు చర్యజగిత్యాల: కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యేనని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మంచి పరిపాలన అందించారని, ప్రజలు, రైతులకు నీరు అందించాలని కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని, అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని తెలిపారు. పంటలకు నీరు అందించక ఎండబెట్టిన ఘనత సీఎం రేవంత్రెడ్డిదన్నారు. కేసీఆర్కు వస్తున్న ఆదరణ చూసి కాళేశ్వరం ప్రాజెక్ట్పై కమిషన్ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యేనని పేర్కొన్నారు. ధర్మపురిలో భక్తుల రద్దీధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని ప్రసన్నాంజనేయ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ముందుగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీలక్ష్మీనృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. కొలతల ప్రకారం విద్యార్థులకు దుస్తులుజగిత్యాలరూరల్: విద్యార్థులకు కొలతల ప్రకారమే దుస్తులను మహిళా సంఘాల సభ్యులతో కుట్టి ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. పొరండ్లలోని గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘం సభ్యులు కుడుతున్న ఏకరూప దుస్తుల యూనిట్ను సందర్శించారు. జిల్లాలో పాత 18 మండలాల్లో క్లస్టర్ల వారీగా కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేసి దుస్తులు కుట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఉన్నది మాట్లాడితే ఉలుకెందుకు?
● పార్టీ మారి బుకాయింపా? ● మాజీమంత్రి జీవన్రెడ్డి జగిత్యాలటౌన్: ఉన్నది మాట్లాడితే ఎమ్మెల్యే ఎందుకు ఉలిక్కిపడుతున్నాడని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. తాను గాంధీభవన్లో మాట్లాడుతుండగా సంజయ్ ఏ పార్టీ అని మీడియా మిత్రులు అడిగితే స్పీకర్ను అడగాలని మాత్రమే చెప్పానని, తానెక్కడా సహనం కోల్పోలేదని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. 1983 నుంచి 14సార్లు బీ ఫాం పొందడం తనకు.. పార్టీకున్న అనుబంధానికి నిదర్శమని, అత్యధిక సార్లు టికెట్ పొందానని, అత్యధికసార్లు గెలిచింది.. ఓడిపోయింది కూడా తానేనని వివరించారు. 2014లో ఉత్తర తెలంగాణ నుంచి ఏకై క ఎమ్మెల్యేగా గెలిచిందిన తానేనన్నారు. బీఆర్ఎస్ పాలనపై తాను చేసిన పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజాజీవితాన్ని ఎప్పుడూ లాభనష్టాలతో చూడలేదన్నారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారి ఉల్టా చోర్ కోత్వాల్కుడాంటే అన్న చందంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నర్సింగాపూర్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. కొత్త మోహన్, బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపల్లి దుర్గయ్య, గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు. -
క్యూఆర్ కోడ్ అమలులో రెండు ఠాణాలకు ప్రశంసలు
జగిత్యాలక్రైం: ప్రజలు, బాధితులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా పోలీసు శాఖ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ను రూపొందించారు. సీఎఫ్సీ ద్వారా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా రాష్ట్రస్థాయిలో పది పోలీస్స్టేషన్లను ఎంపిక చేశారు. ఇందులో జిల్లా నుంచి మేడిపల్లి ఠాణ రాష్ట్రంలో రెండో ర్యాంక్, ఇబ్రహీంపట్నం ఆరో ర్యాంక్ సాధించాయి. మేడిపల్లి ఎస్సై శ్యాంరాజ్, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్కు బుధవారం హైదరాబాద్లో డీజీపీ జితేందర్ చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఎస్పీ అశోక్కుమార్ వారిని అభినందించారు. జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ట్రస్థాయిలో ప్రశంస పత్రం అందుకోవడం అభినందనీయమన్నారు. మేడిపల్లికి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు ఆరో స్థానంలో ఇబ్రహీంపట్నం ఠాణా డీజీపీ చేతులమీదుగా పత్రాలు అందుకున్న ఎస్సైలు -
చదవనిద్దాం.. ఎదగనిద్దాం
గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థి దశలో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత వేసే అడుగే కీలకం. ఇంటర్లో సరైన అడుగు పడితేనే జీవితంలో త్వరగా స్థిరపడతాం. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. తమ పిల్లల ఆసక్తిని తెలుసుకొని ప్రొత్సహించినప్పుడే భవిష్యత్లో రాణించగలుగుతారు. ఈ సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని విద్యావేత్తలు, మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు ఇష్టమైన కోర్సులను పిల్లలపై బలవంతంగా రద్దువద్దని కోరుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 10 ప్రభుత్వ కళాశాలలు, 31 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 14 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 15 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. అడ్మిషన్.. ఆలోచించాల్సిన సమయం పదోతరగతిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. కరీంనగర్ జిల్లాలో 12,245 మంది, రాజన్నసిరిసిల్లలో 6,629, పెద్దపల్లిలో 7,157, జగిత్యాలలో 11,636 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరంతా ఇంటర్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు సిద్ధమవగా.. మరికొందరు హైదరాబాద్, కరీంనగర్ వంటి పట్టణాల్లోని కార్పొరేట్ కాలేజీల్లో చేరేందుకు ఇప్పటికే అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. మరికొందరు విద్యార్థులు పాలీసెట్ రాసి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అత్తెసరు మార్కులతో పాసైన వారు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్ కోర్సులను ఎంచుకోవడం ఉత్తమమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అయితే ఏం చదువాలో అనే నిర్ణయం విద్యార్థులకు వదిలేయాలని, సలహాలు.. సూచనలు మాత్రమే ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులు కరీంనగర్ 12,245 రాజన్నసిరిసిల్ల 6,629 పెద్దపల్లి 7,157 జగిత్యాల 11,636 -
ఎన్టీపీసీ ప్లాంట్లో ప్రమాదం .. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్టులో వేడిఆయిల్ లీకేజీ కావడంతో ఇద్దరు కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. రామగుండం ప్రాజెక్టు స్టేజ్–2లోని 500 మెగావాట్ల నాలుగో యూనిట్ ప్రాంతంలో ఫ్యాబ్ ఎరెక్టర్స్ సంస్థలో బుధవారం ఉదయం షిప్టులో లక్ష్మీపురం గ్రామానికి చెందిన సిరవేన కొమురయ్య, అన్నపూర్ణకాలనీకి చెందిన మహ్మద్ అంకూస్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయిల్ ఫైర్ చేసేందుకు ఉన్న ట్యాంకుల నుంచి వేడి ఆయిల్ టర్బైన్కు వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా లీకేజీ కావడంతో కాంట్రాక్టు కార్మికులపై పడింది. దీంతో తోటి కాంట్రాక్టు కార్మికులు ప్రమాద విషయాన్ని అధికారులకు తెలియజేశారు. వెంటనే అంబులెన్స్ ద్వారా ఇద్దరు కార్మికులను చికిత్స నిమ్తితం పర్మినెంట్ టౌన్షిప్లోని ధన్వంతరి ఆస్పత్రిలో చేర్పించారు. సిరవేన కొమురయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. అంకూస్కు చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని అధికారులు సందర్శించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ లెక్చరర్ దుర్మరణం
ధర్మపురి: రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ లెక్చరర్ దుర్మరణం పాలైన ఘటన ధర్మపురిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై ఉదయ్కుమార్ కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన వొడ్నాల భూమేశ్ అలియాస్ భూమేశ్వర్ భార్య బింధు కరీంనగర్లో టీటీసీ చేస్తోంది. ధర్మారం డిగ్రీ కళాశాలలో ప్రైవేటు అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. బింధు ప్రతిరోజూ కరీంనగర్ వెళ్లడానికి ఉదయం బస్టాండ్కు వస్తుంది. జగిత్యాల మీదుగా కరీంనగర్ చేరుకుంటుంది. ఎప్పటిలాగే బుధవారం కూడా భర్త భూమేశ్తో కలిసి ద్విచక్రవాహనంపై బస్టాండ్కు వచ్చింది. అప్పుడే బస్సు వెళ్లిందని తెలుసుకున్న భూమేశ్ బస్సును అందుకునేందుకు జగిత్యాల వైపు బయల్దేరాడు. పట్టణ శివారులోని పెట్రోల్బంక్ వద్దకు రాగానే రాంగ్రూట్లో ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ కిందపడ్డారు. భూమేశ్ (43) తలకు బలమైన గాయాలయ్యాయి. బింధు కాలుకు ఫ్యాక్చర్ అయింది. ఇద్దరినీ జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. భూమేశ్ పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. భూమేశ్కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. టాటా ఏస్ వాహనం నడిపింది మైనర్ అని, అతడిది తీగళధర్మారమని పోలీసులు గుర్తించారు. భూమేశ్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. భూమేశ్ మృతితో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
సూచనలు, మార్కెటింగ్
ఆయిల్పాం సాగుకు జిల్లాలోని నేలలు అనుకూలం. రైతులకు రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తాం. పంట కోతకు వచ్చాక మేమే మార్కెటింగ్ నిర్వహిస్తాం. ఎకరాకు 57 మొక్కలు అవసరం కాగా ఒక మొక్క పూర్తి ఖర్చు రూ.198 కానీ, సబ్సిడీపై రైతులకు ఒక మొక్కను కేవలం రూ.20 అందిస్తున్నాం. – కె.విజయ్భరత్, ప్రాజెక్ట్ మేనేజర్, లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ రైతుల నుంచి స్పందన ఆయిల్పాం సాగుకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ప్రతీ మండలంలో వంద ఎకరాలకు పైగా సాగులో ఉంది. ప్రభుత్వం అదనంగా మరో 3వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. తదనుగుణంగా సదస్సులు నిర్వహిస్తుండగా రైతులు ముందుకొస్తున్నారు. – ఆర్.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి -
తాటిచెట్టు పై నుంచి పడి గీతకార్మికుడి మృతి
ముస్తాబాద్ (సిరిసిల్ల): మండలంలోని కొండాపూర్లో పెద్దూరి బలరాంగౌడ్(56 ) అనే గీతాకార్మికుడు తాటిచెట్టు పై నుంచి పడి దుర్మరణం చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన పెద్దూరి బలరాంగౌడ్ మంగళవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కేందుకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో భార్య పద్మ, ముగ్గురు కొడుకులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు తాటి వనానికి వెళ్లి గాలించగా ఓ చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్నాడు. మోకు జారీ చెట్టుపై నుంచి పడి మృతి చెందినట్లు కార్మికులు తెలిపారు. భార్య పద్మ, కుమారులు శివ, శ్రవణ్, సంజయ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హుజూరాబాద్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్కు చెందిన శ్రావణ్(34) ప్రైవేటు ఉద్యోగి. తన ద్విచక్ర వాహనం వెళ్తుండగా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతుడి జేబులో ఉన్న సెల్ఫోన్లో ఉన్న నంబర్కు ఫోన్ చేసి విషయం తెలియజేయగా మృతుడి పేరు మాత్రమే తెలిసింది. చౌరస్తా వద్ద ప్రమాదం జరగడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్వగ్రామం చేరిన మృతదేహంమల్యాల: పోలాండ్ దేశంలో కారు ఢీకొని చనిపోయిన మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం మనోజ్ (29) మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. మల్యాలకు చెంది పర్శరాం, భూలక్ష్మీ కుమారుడు మనోజ్ ఉపాధి కోసం మస్కట్ వెళ్లి వచ్చాడు. ఐదు నెలల క్రితం పొలాండ్ దేశం వెళ్లాడు. అక్కడ ఫిక్కీ అనే గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే ఈనెల 12న డ్యూటీకి వెళ్తుండగా.. వెనుక నుంచి కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పొలాండ్లోని తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు అక్కల చంద్రభాను, కార్యదర్శి గంగుల శైలేంద్ర సహకారంతో మృతదేహం స్వగ్రామానికి చేరింది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆయన చితికి తండ్రి పర్శరాం తలకొరివి పెట్టాడు. స్వగ్రామం చేరిన మృతదేహంమల్యాల: పోలాండ్ దేశంలో కారు ఢీకొని చనిపోయిన మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం మనోజ్ (29) మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. మల్యాలకు చెంది పర్శరాం, భూలక్ష్మీ కుమారుడు మనోజ్ ఉపాధి కోసం మస్కట్ వెళ్లి వచ్చాడు. ఐదు నెలల క్రితం పొలాండ్ దేశం వెళ్లాడు. అక్కడ ఫిక్కీ అనే గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే ఈనెల 12న డ్యూటీకి వెళ్తుండగా.. వెనుక నుంచి కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పొలాండ్లోని తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు అక్కల చంద్రభాను, కార్యదర్శి గంగుల శైలేంద్ర సహకారంతో మృతదేహం స్వగ్రామానికి చేరింది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆయన చితికి తండ్రి పర్శరాం తలకొరివి పెట్టాడు. -
భూసేకరణ పరిహారం ఫైళ్లు మాయం
సిరిసిల్ల: జిల్లాలో భూసేకరణకు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయి. జిల్లాలో భారీ, మధ్యతరహా జలాశయాల నిర్మాణాలు, కాల్వలు, రోడ్ల నిర్మాణాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు పట్టాభూములను సేకరించారు. ప్రజాప్రయోజనార్థం ప్రజల నుంచి సేకరించిన భూములకు సంబంధించిన రికార్డులు(ఫైళ్లు) జిల్లా రెవెన్యూ అధికారుల వద్ద కనిపించడం లేదు. గతంలో జరిగిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ఫైళ్లు మాయం కావడంపై జిల్లా అధికారులు అయోమయానికి గురయ్యారు. గతంలో జిల్లాలో పనిచేసిన రెవెన్యూ అధికారులు ఆ రికార్డులను మాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. మధ్యమానేరు జలాశయానికి సంబంధించి అప్పటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ) నటరాజ్ ఫైళ్లు మాయం చేశారని అతనిపై అప్పట్లోనే కేసు నమోదైంది. అతని వద్ద ఫైళ్ల రికవరీకి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత జిల్లాలో మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు–9, 8, 7, 6, 5లకు సంబంధించిన భూసేకరణలు భారీ ఎత్తున జరిగాయి. మొత్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపుల ఫైళ్లు మాయం కావడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వానికి నివేదిక.. కేసు నమోదుకు అవకాశం సిరిసిల్ల, వేములవాడ రెవెన్యూ డివిజన్ల పరిధిలో భూసేకరణ ఫైళ్లు కనిపించడం లేదు. ఆ రెండు ఆఫీస్ల్లో పూర్తి స్థాయిలో వెదికిన అధికారులు రికార్డులు లేవని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని జిల్లా రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు రికార్డులను మాయం చేసిన గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీవోపై కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఎన్ని ఫైళ్లు మాయమయ్యాయి.. ఎంత మేరకు పరిహారం చెల్లించారు.. ఎన్ని ఎకరాలకు చెల్లించారు.. ఎందుకు రికార్డులు మాయం చేశారు అనే అంశాలను బయటకు రాకుండా జిల్లా అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాజన్నసిరిసిల్ల జిల్లాలో భూసేకరణ ఫైళ్ల మాయం రెవెన్యూ అధికారుల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీవోపై కేసు నమోదై, పూర్తి స్థాయి విచారణ జరిగితే భూసేకరణలో జరిగిన అక్రమాలన్నీ బయటపడనున్నాయి. దీనిపై జిల్లా స్థాయిలో ప్రత్యేకాధికారి పూర్తి స్థాయిలో వివరాలను క్రోఢీకరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం విశేషం. అధికారుల అయోమయం జిల్లాలో పనిచేసిన అధికారిపై కేసు నమోదుకు సిఫార్సు -
నాలుగేళ్లు శ్రమిస్తే.. ముప్పై ఏళ్లు దిగుబడి
● ఆయిల్పాం సాగువైపు రైతుల మొగ్గు ● రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ● సస్యరక్షణ చర్యలు, మార్కెటింగ్ బాధ్యత కంపెనీదే ● ఈ సారి 3వేల ఎకరాల్లో సాగు లక్ష్యంకరీంనగర్అర్బన్: ఇష్టారీతిగా మందుల పిచికారీ, ఎరువుల వాడకంతో సాగు నేలలు గుల్లబారుతున్నాయి. పంట దిగుబడులు తగ్గుతుండగా పర్యావరణం ప్రమాదంలో పడుతోంది. ఈ క్రమంలో అన్నదాతకు అధిక ఆదాయన్నిచ్చే ఆయిల్పాం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నాలుగేళ్లు శ్రమిస్తే 30ఏళ్ల వరకు ఆదాయం వస్తుండగా మందుల పిచికారీ, ఎరువుల వాడకం ఉండదు. జిల్లాలో గత రెండేళ్లలో 2,500 ఎకరాల వరకు సాగు చేయగా తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే మానకొండూరు మండలం వేగురుపల్లిలో ముత్తారెడ్డి పంట దిగుబడి పొందుతుండగా ఆదాయాన్ని గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యా న, వ్యవసాయ శాఖల అధికారులతో పాటు లోహి యా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు. 3వేల ఎకరాలు లక్ష్యం జిల్లాలో 3వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు దాదాపు 12,000 ఎకరాల్లో ఆయిల్పాంను సాగు చేస్తున్నారు. వివిధ మండలాల్లో మరికొంత మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. నాలుగేళ్లు పంట సాగుకు శ్రమిస్తే 30 ఏళ్లపాటు ఏటా ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడులు తీయొచ్చు. ఒక టన్నుకు రూ.20,000 అయినా ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం రైతుకు వస్తుంది. జూలై నుంచి జనవరి వరకు పంట దిగుబడులను తీయొచ్చని అధికారులు చెబుతున్నారు. సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ● ఆయిల్పాం సాగు చేసే ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ సిస్టం కోసం 100 శాతం సబ్సిడీ ఇస్తుంది. బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ● మొక్కలకు సబ్సిడీ అందించడంతోపాటు బిందు సేద్యం ద్వారా నీరు అందించడానికి డ్రిప్ పరికరాలనూ సబ్సిడీపై అందించనుంది. ఆయిల్పాం మొక్కలను 80 శాతం సబ్సిడీపై రూ.1,140 రైతు వాటా చెల్లిస్తే ఎకరాకు 57 మొక్కలు ప్రభుత్వం అందిస్తుంది. ● నాలుగేళ్లు పంట నిర్వహణకు ఎకరాకు రూ.4,200 ప్రభుత్వం రైతుకు ఇస్తుంది. ఇక వచ్చిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ● ప్రస్తుతం మానకొండూరు మండలం అన్నారంలో కేంద్రం ఏర్పాటు చేయగా డైరెక్టర్ ఆఫ్ హర్టికల్చర్ నిర్ణయించిన రేట్ల ప్రకారం కొనుగోలు చేయనుండగా దళారీ వ్యవస్థ అసలే ఉండదు. ● పంట చేతికొచ్చే నాలుగేళ్లలో అంతర పంటలుగా మొక్కజొన్న, పత్తి, పెసర, మినుములు, బొబ్బర, వేరుశనగ మొదలగు పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
బక్రీద్ను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
జగిత్యాల: బక్రీద్ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ఎవరైన ఆవులు, లేగదూడలను వధిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్పీ అశోక్కుమార్తో కలిసి మంగళవారం సమీక్షించారు. స్లాటర్ హౌస్ల వద్ద పరిశుభ్రత ఉండేలా చూడాలని కమిషనర్లను ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో 8 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.కార్మిక చట్టాలు అమలు చేయాలిజగిత్యాలటౌన్: పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుతారి రాములు, ఎండీ.ముక్రం డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించారు. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకొచ్చాక 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తోందన్నారు. కార్మికుల చట్టాలు అమలు చేయాలని ఈనెల 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినా యుద్ధవాతావరణం నేపథ్యంలో జూలై 9కు వాయిదా వేశామన్నారు. కార్యక్రమంలో ఇరుగురాళ్ల భూమేశ్వర్, వెన్న మహేష్, రామిల్ల రాంబాబు, మునుగూరి హన్మంతు ఉన్నారు.బాలామృతం పక్కదారిపై ఇన్చార్జి పీడీ విచారణమెట్పల్లి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని కొందరు గేదెల పోషకులకు విక్రయిస్తున్న వైనంపై ‘సాక్షి’ ‘ఐసీడీఎస్లో ఆగని అక్రమాలు’ శీర్షికన మంగళవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ శాఖ జిల్లా ఇన్చార్జి పీడీ నరేష్ మెట్పల్లికి వచ్చి స్థానిక ఏడో వార్డులో ఉన్న ఓ గేదెల కొట్టంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ గేదెలకు పెడుతున్న దాణాను పరిశీలించారు. అనంతరం పీడీ ‘సాక్షి’తో మాట్లాడారు. తమకు ఉన్న సమాచారంతో ఓ కొట్టంలో తనిఖీలు చేశామని, అందులో బాలామృతం ప్యాకెట్లు లభించలేదన్నారు. చిన్నారులకు ఈ ప్యాకెట్లను అందించే సమయంలో ఫొటోలు తీయాలనే నిబంధన ఉందని, దీనివల్ల అవి పక్కదారి పట్టే అవకాశమే ఉండదన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పోషకాహారాన్ని అమ్ముకోవద్దని సిబ్బందికి ఆదేశాలిచ్చామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని పేర్కొన్నారు.కేసీఆర్ ఆనవాళ్లు చెరగవుకథలాపూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచం గర్వించదగిన నిర్మాణాలు చేపట్టారని, ఆయన ఆనవాళ్లు చెరిపేస్తే చెరగవని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్రూం, యాదాద్రి ఆలయం మచ్చుతునకలు మాత్రమేనని గుర్తు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్నోళ్లు ప్రస్తుతం ప్రపంచానికి చూపిస్తున్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాల స్మారక జ్యోతి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని మిస్ వరల్డ్ పోటీదారులకు చూపిస్తే రాష్ట్ర గొప్పతనం మరింత వ్యాపిస్తుందన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన వాటిని అందాల భామలకు చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి దిక్కయిందన్నారు. -
రెక్కలు?
భూముల ధరలకుసాక్షిప్రతినిధి,కరీంనగర్: భూముల మార్కెట్ విలువ పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల ధరలు ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖను ఆదేశించింది. అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు ఆదేశాలు పంపింది. ప్రస్తుతం ఉన్న భూముల వివరాలు, మార్కెట్ విలువ? దాన్ని ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలువురుశాఖల అధికారులతో కూడిన కమిటీలను కూడా సిద్ధం చేసింది. వీరు భూముల విలువపై అంచనాకు వచ్చి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నివేదికలోని సూచనలు అమలైతే దాదాపు 50 నుంచి 100 శాతం వరకు మార్కెట్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. కమిటీలు ఇలా.. భూముల పెంపులో ప్రభుత్వం అర్బన్, రూరల్ రెండు ప్రాంతాలుగా విభజించింది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అందులో ఇటీవల విలీనమైన గ్రామాలకు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో అడిషనల్ కలెక్టర్ (లోకల్బాడీస్) చైర్మన్గా ఉంటారు. సభ్యులుగా మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్చైర్మన్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. కన్వీనర్గా సబ్రిజిస్ట్రార్ వ్యవహరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చైర్మన్గా ఆర్డీవో వ్యవహరిస్తారు. సభ్యులుగా తహసీల్దార్, ఎంపీడీవో ఉంటారు. కన్వీనర్ బాధ్యతలను సబ్రిజిస్ట్రార్ నిర్వహిస్తారు. భవన నిర్మాణాల ధరల నిర్ధారణకు జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ చైర్మన్గా ఉండగా.. ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్యుడిగా ఉంటారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలన్నీ వ్యవసాయ, రియల్ ఎస్టేట్, భూములతోపాటు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాల మార్కెట్ విలువను నిర్ధారిస్తారు. మే నెలాఖరుకు నివేదిక ప్రభుత్వ ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న కమిటీలు వారి పరిధిలో ఉన్న భూముల మార్కెట్ విలువపై సర్వే ప్రారంభించాయి. దాదాపుగా ఈ సర్వే కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెలాఖరున (28న) నివేదికను ప్రభుత్వానికి అంజేయనున్నారు. ఈ నివేదిక ప్రకారం.. 50 నుంచి 100శాతం వరకు మార్కెట్ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మొత్తం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా), సిరిసిల్ల జిల్లా మొత్తం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)లుగా అవతరించడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు ముఖ్యంగా రెక్కలు రానున్నాయి.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలు (రూ.కోట్లలో)ఏడాది డాక్యుమెంట్లు ఆదాయం 2024 88,762 231.98 2025 32,383 86.25 మరోసారి మార్కెట్ విలువ పెంపు 50 నుంచి 100శాతం పెంచేలా కసరత్తు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం ఆదేశం మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి కమిటీలు నివేదిక పంపేందుకు ఈ నెలాఖరు వరకు సమయం భూ విలువలపై అధ్యయనం ప్రారంభించిన అధికారులు -
జగిత్యాలకు ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు
● జగిత్యాల అంటే తానే అన్నట్లు జీవన్రెడ్డి అనుకోవద్దు ● కాంగ్రెస్లో అత్యధికసార్లు ఓటమి పాలైంది ఆయనే.. ● జీవన్రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఫైర్జగిత్యాల: జగిత్యాలకు ఎవరేం చేశారో ప్రజలందరికీ తెలుసని, తాను చేసిన అభివృద్ధిని చూసే తనను రెండోసారి గెలిపించారని స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మోతెలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల అంటే తానే అన్నట్లు జీవన్రెడ్డి అనుకోవడం సరికాదని హితవు పలికారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు టికెట్ ఇచ్చిందని, అత్యధికసార్లు ఓడిపోయింది కూడా ఆయనేనని గుర్తు చేశారు. గాంధీభవన్లో కూర్చుని తనను ఇండిపెండెంట్ అనడం సరికాదన్నారు. గతంలో అనేకమంది ఎమ్మెల్యేలుగా పనిచేశారని, జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాక రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా డబుల్బెడ్రూంలు మంజూరు చేయించానని గుర్తు చేశారు. జీవన్రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, హుందాతనం కాపాడుకుంటే మంచిదని, సీనియర్ నాయకుడిగా సలహాలు ఇవ్వాలని సూచించారు. తనను తరచూ విమర్శిస్తే ఊరుకోనన్నారు. ఆయన అనుచరులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇకనుంచి సంహించబోనన్నారు. 2014లో ఇవే చివరి ఎన్నికలు అని చెప్పడంతో తనపై జీవన్రెడ్డి గెలిచినా. నైతిక విజయం తనదేనన్నారు. ఆయన హయాంలో తీసుకొచ్చిన జేఎన్టీయూ, న్యాక్ సెంటర్ గుట్టల్లో పెట్టారని, అక్కడకు సరైన రోడ్లు కూడా లేవని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో ఎత్తిపోతల పథకంగానీ.. చెరువులు నింపే ప్రయత్నంగానీ చేయలేదన్నారు. ఆయన వెంట నాయకులు దామోదర్రావు, ముజాహిద్, గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, రాజేందర్రెడ్డి, నక్కల రవీందర్రెడ్డి, గోలి శ్రీనివాస్, రాజిరెడ్డి, ముస్కు నారాయణరెడ్డి, సురేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట విత్తనాల ధరలు తగ్గించండి
● రాయికల్లో రైతుల రాస్తారోకో ● మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్జగిత్యాలరూరల్(రాయికల్): పచ్చిరొట్ట విత్తనాల ధరలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాయికల్లో రైతులు ఆందోళనకు దిగారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. బీఆర్ఎస్ రాయికల్ పట్టణ కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ ధరలు రెండింతలు పెంచడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోందన్నారు. వాటి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సై సుధీర్రావు ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. అనంతరం రైతులు వ్యవసాయాధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతునాయకులు కుర్మ మల్లారెడ్డి, తిరుపతి, సంజీవ్, నరేశ్, గంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
భూ భారతి సరిచేసేనా..?
● జిల్లాలో భూ సమస్యలు అధికం ● ధరణి స్థానంలో భూ భారతి చట్టం ● పైలెట్ ప్రాజెక్ట్గా బుగ్గారం ఎంపిక ● వందల్లో దరఖాస్తుల స్వీకరణజగిత్యాల: ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చింది. పైలెట్ ప్రాజెక్ట్గా బుగ్గారం మండలాన్ని ఎంపిక చేయగా.. ఇప్పటికే అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ మండలంలో వందల్లో దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో అసైన్డ్, అటవీ భూములు, పార్ట్–బీలో పేర్కొన్న నిషేధిత జాబితాలోని భూ ములు అత్యధికంగా పెండింగ్లో ఉన్నాయి. ఈ చట్టంతో సమస్యలు తీరుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు సులభంగా అయ్యేలా చట్టం రూ పొందించడంతోపాటు తహసీల్దార్లు, ఆర్డీవో లకు మ్యూటేషన్ అధికారం కల్పించడంతో సమస్యలు వేగవంతంగా తీరే అవకాశాలున్నాయంటున్నా రు. జిల్లాలో గత నెల 15 నుంచి 30వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. బుగ్గారంలో రైతుల నుంచి ఈనెల 5 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన సమస్యలను పరి ష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో బృందానికి నాయబ్ తహసీల్దార్, గిర్దవార్, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్లను కేటాయించారు. మొదట రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి తద్వారా గ్రామాల్లో రైతుల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయిలో పర్యటించి భూమి భౌగోళిక హద్దుల్ని నమోదు చేస్తారు. సంబంధిత వివరాలను తహసీల్దార్లకు నివేదించగా దానిపై పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటారు. వందల్లో దరఖాస్తులు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న బుగ్గారం మండలంలో మొత్తం 744 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్లు 84, పెండింగ్ మ్యూటేషన్లు 22, ఏరియా కరెక్షన్ 128, డీఎస్ పెండింగ్ 10, ల్యాండ్ నేచర్ క్వాలిషిఫికేషన్ 9, పట్టాదారు డిటేయిల్స్ 10, నిషేధిత భూముల గురించి 11, అసైన్డ్ భూమి గురించి 21, సక్సెషన్ 108, ల్యాండ్ ఇక్వేషన్ 2, సాదాబైనామాలు 298, పట్టా ల్యాండ్ల గురించి 35, కాస్తు గురించి ఒక టి, డూప్లికేట్ పాస్బుక్ల గురించి 4, మెర్జింగ్ ఖా తా గురించి ఒక దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అధికారులు 181 దరఖాస్తులను విచారించగా 563 విచారణ చేపడుతున్నారు. బుగ్గారంలో 10 గ్రామాలు ఉండగా.. 122661.21 ఎకరాల భూ మి ఉంది. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులు అధికా రులు పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. రైతుల్లో ఆశలు భూభారతి చట్టంతో రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ధరణి పోర్టల్ అమలులో ఉన్నప్పుడు చాలామంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రతీది సీసీఎల్ వరకు వెళ్లే పరిస్థితి ఉండేది. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో కొన్ని పరిష్కారం అ య్యే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు చేసేదేమీలేక ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణి స్థానంలో భూభారతి తీసుకురావడంతో అన్ని సమస్యలకు వెసులుబాటు కల్పించడంతో రైతులకు ఇది ఎంతో మేలు జరుగుతుంది. నేరుగా రైతుల వద్ద నుంచి దరఖాస్తులు సైతం స్వీకరిస్తున్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్ ఇక నుంచి కొత్తగా సర్వే పటం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. ముఖ్యంగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బీర్పూర్ మండలం కొమ్మనపల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు. మొదట ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ, వక్ఫ్, అటవీ తదితర భూములును సర్వే చేయనున్నారు. పహాణిలో ఉన్న వివరాలు, సర్వే ద్వారా వచ్చిన వివరాలను సరిచూసి చర్యలు తీసుకోనున్నారు. ఇలా త్వరలోనే జిల్లా వ్యాప్తంగా వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.దరఖాస్తులకు పరిష్కారం ఇప్పటికే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూభారతి చట్టంపై అవగాహన కల్పించాం. పైలెట్ ప్రాజెక్ట్ కింద బుగ్గారం ఎంపిక కాగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. మండలంలో 744 దరఖాస్తులు వచ్చాయి. 181 విచారణ చేపట్టాం. 563 దరఖాస్తులపై విచారణ జరుగుతోంది. సత్యప్రసాద్, కలెక్టర్ బుగ్గారం మండల విస్తీర్ణం 19,735.36రెవెన్యూ గ్రామాలు 10పంచాయతీలు 10మొత్తం భూమి 12,261.21 ఎకరాలు ఎండోమెంట్ : 7.01 ఎకరాలు అటవీ : 2,474.25 ఎకరాలు వక్ఫ్ : 1.27 ఎకరాలు సీలింగ్ అసైన్డ్ : 480.16 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ : 716.38 ఎకరాలు ప్రభుత్వ భూమి : 7113.20 ఎకరాలు -
రైతులకు గుర్తింపు కార్డులు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులకు ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగిన భూధార్కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ గ్రామాల వారీగా నమోదు ప్రక్రియను ప్రారంభించింది. వానాకాలం సీజన్ ప్రారంభం వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఉదయం 8 గంటలకే గ్రామాలకు వెళ్లి రైతుల బయోడేటా, భూ వివరాలు సేకరిస్తున్నారు. రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య రైతులకు 11 అంకెలతో ఉద్యోగుల మాదిరిగానే రైతులకూ ప్రత్యేక గుర్తింపు కార్డును ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయం, రైతుల ప్రతి సమాచారం కోసం కేంద్రం రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో సరైన సమాచారం లభించడం లేదు. దీంతో కేంద్రమే దేశవ్యాప్తంగా రైతులు, వారి భూ వివరాలు సేకరించాలని నిర్ణయించింది. రానున్న సీజన్ నుంచే పీఎం కిసాన్ నిధిని విశిష్ట సంఖ్య(భూధార్) ఆధారంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో మండల వ్యవసాయాధికారులు, ఏఈఓలతో సమావేశాలు నిర్వహించి, నమోదు ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. ప్రతి రైతు వివరాలు సేకరణ గ్రామస్థాయిలో ఏఈఓలు ప్రతి రైతు వద్దకు వెళ్లి వారి బయోడేటా సేకరిస్తారు. రైతు పేరిట ఉన్న భూమి వివరాలను రెవెన్యూ శాఖ నుంచి సేకరించి.. రైతుల ఆధార్ సంఖ్య, సెల్ నంబర్తో ఏఈఓలు తమ వద్ద ఉన్న ట్యాబ్ ద్వారా ప్రత్యేక యాప్లలో అనుసంధానం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో రైతుల కోసం ప్రవేశపెట్టే ప్రతి పథకంలో ఈ రైతు గుర్తింపు సంఖ్య కీలకం కానుంది. ఇతర రాష్ట్రాలలో మీసేవ కేంద్రాల ద్వారా ఈ నమోదు కొనసాగుతుండగా.. ఇక్కడ ఏఈఓలే రైతుల వద్దకు వచ్చి నమోదు ప్రక్రియను చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన సెల్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ రిజిస్ట్రేషన్ సమయంలో రైతుల సెల్ నంబర్కు మూడు సార్లు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఏఈఓ వద్ద ఉన్న యాప్లలో నమోదు చేయగానే సదరు రైతుకు విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య వస్తుంది. గుర్తింపు సంఖ్యను గుర్తుంచుకోవాలి విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా గుర్తించుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి ఇచ్చే సబ్సిడీలు, విత్తన పంపిణీ, రుణసాయం వంటి పథకాలన్నింటికీ ఇదే నంబర్ కీలకం కానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన, నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్, సాయిల్ హెల్త్కార్డుల జారీ, కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కిసాన్ మాన్ధన్ యోజన, జాతీయ ఆహార భద్రత, పీఎం సమ్మాన్ నిధి, నాబార్డు రుణ సహాయం, జాతీయ ఉపాధి పథకం, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలకు గుర్తింపు సంఖ్యనే ప్రమాణీకం కానుంది. సెల్ నెంబర్ అధార్తో లింక్ అయి ఉంటేనే నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. లేదంటే రిజిస్ట్రేషన్ నిలిపివేయబడుతుంది. రైతులకు అవగాహన వ్యవసాయ సిబ్బంది చేసే నమోదు ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు వ్యవసాయ శాఖ అవగాహన సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి తోడు, గ్రామాల్లో మైకుల ద్వారా చాటింపు చేస్తున్నారు. గ్రామానికి ఏ రోజు ఏఈఓలు వస్తారో ముందుగానే ఆ గ్రామ రైతులకు సమాచారం ఇస్తున్నారు. అనర్హుల తొలగింపు, పథకాల అమలు తీరు తెన్నులను తెలుసుకోవడంలో ఈ సంఖ్య కీలకం కానుంది. ఆధార్ తరహాలో భూధార్ కార్డులు జిల్లాలో ప్రారంభమైన నమోదు ప్రక్రియ -
పెద్ద జయంతికి ధర్మపురిలో ఏర్పాట్లు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధమైన శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని జయంతి వేడుకలకు ముస్తాబు చేశామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు స్వామివారి జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆలయం లోపల, వెలుపల ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, తాగునీటి వసతి కల్పించారు. లడ్డూ, ప్రసాదాలను తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ కుట్రతోనే కేసీఆర్కు నోటీసులుజగిత్యాల: తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోదావ రి జలాలను తరలించడానికి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో గొప్పదని, రాజకీయ కుట్రతోనే కేసీఆర్కు కమిషనర్ నోటీసులు ఇచ్చారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో రాష్ట్రం దేశానికే అన్నం పెడుతోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నారు. త్వరలోనే కాలం అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు. -
సబ్సిడీ పెంచి.. ధర తగ్గించాలి
రైతులు ఒక్కటి, రెండు పచ్చిరొట్ట విత్తనాల బస్తాలు వాడుతారు. పెరిగిన ధరలు గతేడాదితో పోల్చితే ప్రతి రైతుకు దాదాపు రూ.2 వేల వరకు అదనపు ఖర్చు వస్తోంది. మేం పండించే పంటకు మాత్రం విత్తనాల మాదిరిగా రేట్లు పెరగడం లేదు. ప్రభుత్వం ఆలోచించి సబ్సిడీ పెంచి, రేటు తగ్గించి రైతును ఆదుకోవాలి. – వేముల విక్రంరెడ్డి, ధర్మపురి విత్తనాలు తెప్పిస్తున్నాం జిల్లాకు అవసరమైన మేర పచ్చిరొట్ట విత్తనాలను తెప్పిస్తున్నాం. వరి ఎక్కువగా సాగు చేస్తుండటంతో, ఇతర జిల్లాలతో పోల్చితే పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సింగిల్ విండో కేంద్రాలు, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందిస్తున్నాం. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
రోడ్డు బ్లాక్ చేశారు
రైతు బజార్లో విక్రయించాల్సిన కూరగాయలను విద్యానగర్ రోడ్డుపై అమ్ముతుండడంతో రోడ్డు బ్లాక్ అవుతోంది. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డుపైనే అమ్ముతుండడంతో రోడ్డు రద్దీగా ఉంటోంది. ఈ రోడ్డు వెంటే ఆస్పత్రులు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు, అంబులెన్స్లు వెళ్లలేని పరిస్థితి ఉంది. విక్రయదారులను రైతుబజార్కు తరలించాలి. – విద్యానగర్వాసులు, జగిత్యాల కొండ చెరువును కాపాడండి రాయికల్ మండలంలోని ద్యావనపెల్లిలో కొండచెరువు కబ్జాకు గురవుతోంది. పశువులకు నీటి సౌలభ్యం కరువై రైతులు ఇబ్బంది పడుతున్నాం. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొండ చెరువుకు హద్దులు నిర్ణయించి కబ్జాదారుల నుంచి కాపాడాలి. – దావన్పల్లి, రాయికల్ వడ్డీ వ్యాపారి వేధిస్తున్నాడు వడ్డీతో సహా అ ప్పు చెల్లించినా వ్యాపారి లక్ష్మి ప తి వేధిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం బతుకు దెరువు కోసం దు బాయ్ వెళ్లాను. కథలాపూర్ మండలం పోతారా నికి చెందిన వడ్డీ వ్యాపారి పాలెపు లక్ష్మిపతి పరి చయం అయ్యాడు. ఆయన నుంచి రూ.2.20లక్షలు అప్పుగా తీసుకున్న. ఇప్పటివరకు రూ.5లక్షల దాకా చెల్లించాను. ఇటీవల స్వగ్రామానికి వచ్చాను. నాకంటే ముందే ఇక్కడకు వచ్చిన లక్ష్మీపతి అప్పు చెల్లించాలంటూ ఇంటికొచ్చి వేధిస్తున్నాడు. ఆ యన నుంచి నా కుటుంబానికి రక్షణ కల్పించండి. – దేశవేని నవీన్, ఽదరూర్ -
ఆకట్టుకున్న హల్దీ వేడుకలు
పెళ్లి కూతురుకు దుస్తులు అందిస్తున్న ఐసీడీఎస్ బృందం రామగుండం: పట్టణంలోని తబితా ఆశ్రమంలో 16ఏళ్లుగా ఆశ్రయం పొందుతున్న నక్క మానస వివాహ వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం హల్దీవేడుకలు ఘనంగా నిర్వహించింది. యువతి పెళ్లి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. ఈనెల 21వ తేదీన కలెక్టరేట్లోని ఆలయంలో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. తొలిరోజు వేడుకల కోసం సింగరేణి ఆర్జీ–1 జీఎం సతీమణి అనిత, ఆర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భీమనాథి విజయ పుస్తె, మట్టెలు, చీర, సారె, అంతర్గాం అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ.ఐదు వేల నగదు, ఎన్టీపీసీ శ్రీసీతారామ సేవాసమితి నిర్వాహకులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కొండు రమాదేవి పెళ్లి బట్టలు అందజేశారు. ఫైట్ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకుడు మద్దెల దినేశ్, లెనిన్ జయహో సంస్థ ప్రతినిధి చక్కెన శ్రీలత పెళ్లి కుమార్తెను తయారు చేశారు. జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్రావు, అంతర్గాం తహసీల్దార్ రవీందర్పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభమైన మానస వివాహ వేడుకలు రేపు సుభముహూర్తం -
వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కరీంనగర్స్పోర్ట్స్: వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేస్తామని జిల్లా పేటా టీఎస్ అధ్యక్షుడు బాబు శ్రీనివాస్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన జిల్లా పెటా టీఎస్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. నూతనంగా ఏర్పడ్డ కమిటీ సభ్యులు ఎల్లవేళలా సంఘం పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. పెటా టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ సభ్యుల సలహాలు, సూచనలతో ముందుకు సాగుతామన్నారు. అనంతరం పెట టీఎస్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం పెటా టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులుగా దత్తాత్రి, హరికిషన్, వి.రూపారాణి, పి.శ్రీనివాస్, ఎన్.శ్యామలాదేవి, కె.రమాదేవి, పి.శ్రీనివాస్ జి.నిర్మల ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్.రమేశ్కుమార్, వి.శ్రీలత, ఎం.చంద్రశేఖర్, వి.సూర్యప్రకాశ్, యజాజ్ అహ్మద్, బిట్ర శ్రీనివాస్, ఎం.రమేశ్, కె.వెంకటలక్ష్మి ఎన్నికయ్యారు. సంఘం కోశాధికారిగా డి.వీర్పాల్, సంయుక్త కార్యదర్శులుగా రామానందతీర్థ, బి.సత్యనారాయణ, స్నేహలత, ప్రవీణ, రాజ్కుమార్, సత్యానంద్, ప్రతిమ ఎన్నికయ్యారు. -
ఆరోపణలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం
ధర్మపురి: పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలిగానీ.. ఎల్వోసీలు ఇచ్చి ఒకరినొకరు అవమానపర్చుకోవద్దని డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి అన్నా రు. మూడు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విష యం తెల్సిందే. మున్సిపల్ మాజీ చైర్పర్సన్కు మా జీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఎల్ఓసీ ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దీనిని ఖండిస్తూ సోమవారం శ్రీకాంత్రె డ్డి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్కు గతంలో ఆస్పత్రి ఖర్చుల కింద అప్ప టి ప్రభుత్వం ఎల్వోసీ ఇచ్చిందని, ఎల్వోసీలు, సీఎం రిలీఫ్ఫండ్లు ప్రభుత్వ నిధులని, కాంగ్రెస్వో.. మరో పార్టీవో కావన్నారు. కాంగ్రెస్ పుణ్య మా అని ఎల్వోసీ ఇచ్చామని కిందిస్థాయి నాయకులు అనడంలో అర్థం లేదని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 32 వేల మందికి రూ.87 కోట్ల వి లువైన ఎల్వోసీలు, సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను అప్పటి మంత్రి ఈశ్వర్ పంపిణీ చేశారని పేర్కొన్నారు. అప్పుడు పార్టీలకతీతంగా ఇచ్చామని పే ర్కొన్నారు. కొప్పుల ఈశర్ చేసిన అభివృద్ధి ధర్మపురిలో ఎక్కడ చూసినా కనిపిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సవాల్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం బురద జల్లడం మానుకోవాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తీర్పు ఇస్తారని అన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మె ల్యే కార్యాలయానికి ప్రతిఒక్కరూ వస్తారని, బీఆర్ఎస్ నాయకులు రావద్దని రూల్స్ ఉంటే కాంగ్రెస్ కా ర్యాలయమని బోర్డు పెట్టుకోవాలని సూచించారు. సంగి సత్తమ్మ మాట్లాడుతూ .. ఎల్వోసీ కాంగ్రెస్ పుణ్యమని అనడం బాధగా ఉందన్నారు. నాయకులు సంగి శేఖర్, మాజీ ఎంపీపీ చిట్టిబాబు, అయ్యో రి వేణు, యూనుస్, శేఖర్, అనంతుల లక్ష్మణ్ తదితరలున్నారు. -
పచ్చిరొట్ట ధరలు రెట్టింపు
● రేటు భారీగా పెంచడంతో రైతుల్లో అయోమయం ● సబ్సిడీ కూడా 60శాతం నుంచి 50 శాతానికి తగ్గింపు ● జిల్లా రైతులపై రూ.5.52 కోట్ల అదనపు భారంజగిత్యాలఅగ్రికల్చర్: పచ్చిరొట్ట విత్తనాల ధరలను ప్రభుత్వం అమాంతం పెంచింది. గతేడాదితో పోల్చితే ధర రెట్టింపు పెరగగా.. సబ్సిడీ కూడా పది శాతం తగ్గించింది. దీంతో రైతులు అయోమయంలో పడుతున్నారు. భూములకు పుష్టి ఇచ్చేందుకు తొలకరికి ముందుగానే జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట సాగు చేస్తారు రైతులు. ఈ విత్తనాలపై గతేడాది 60 శాతం సబ్సిడీ ఇవ్వగా.. ఈ ఏడాది 50 శాతానికి కుదించారు. విత్తనాల ధరలు కూడా రెట్టింపు చేశారు. ఈ లెక్కన జిల్లా రైతులుపై సుమారు రూ.5.52 కోట్ల భారం పడనుంది. ఇటు సబ్సిడీ తగ్గింపు, అటు విత్తనాలు రేట్లు పెరగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 23 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు జిల్లా రైతుల కోసం 23వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అవసరమని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇటీవల 15వేల క్వింటాళ్ల జనుము, 1600 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను మాత్రమే అలాట్ చేశారు. ఇప్పటివరకు 9వేల క్వింటాళ్ల జీలుగ, 300 క్వింటాళ్ల జనుము మాత్రమే జిల్లాకు చేరింది. వాటిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సింగిల్విండోలు, డీసీఎంఎస్ కేంద్రాలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో సోమవారం నుంచి పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ ఏడాది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలకు విత్తనాలను సరఫరా చేయడం లేదు. పెరిగిన విత్తనాల ధరలు విత్తనాల ధరలు రెట్టింపయ్యాయి. 30 కిలోల జనుము, 40 కిలోల జీలుగ బస్తాలను పంపిణీ చేస్తారు. గతేడాది జీలుగ కిలో ధర రూ.93 ఉండగా.. అందులో రూ.55.80 సబ్సిడీ ఇచ్చేవారు. రైతు కిలోకు రూ.37.20 చెల్లించేవారు. జనుము కిలోకు రూ.90.50 కాగా.. రూ.54.30 సబ్సిడీ పోను రైతు కేవలం రూ.36.20 చెల్లించేది. ప్రస్తుతం జీలుగ కిలో ధర రూ.142.50కు పెంచారు. ఇందులో సబ్సిడీ రూ.71.25 పోను రైతు రూ.71.25 చెల్లించాలి. జనుము కిలో రూ.125.50 ఉండగా.. సబ్సిడీ రూ.62.75 ఇస్తున్నారు. రైతులు రూ.62.75 చెల్లించాల్సి వస్తుంది. గతేడాదితో పోల్చితే జీలుగ కిలోకు రూ.34 పెరిగింది. జనుము కిలోకు రూ.26.55 పెరిగింది. 30 కిలోల జీలుగ బస్తాకు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా రూ.1020 చెల్లించాల్సి వస్తోంది. 40 కిలోల జనుము బస్తా గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.1062 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. మొత్తంగా రైతులు 30 కిలోల జీలుగ బస్తాకు రూ.2,137, జనుము బస్తాకు రూ.2,510 చెల్లించాల్సి ఉంది. 50 శాతానికి సబ్సిడీ తగ్గింపు విత్తనాల సబ్సిడీని గతేడాదితో పోల్చితే 10 శాతం తగ్గించారు. గతేడాది సబ్సిడీ 60శాతం ఇస్తే.. ఈ ఏడాది 50 శాతానికి కుదించారు. ఈ లెక్కన జీలుగ బస్తాపై రూ.102అధిక భారం పడుతుంది. జనుము బస్తాకు రూ.106.20 అదనపు భారం పడుతుంది. దివంగత వైఎస్ హయాంలో పచ్చిరొట్ట విత్తనాలపై 75శాతం సబ్సిడీ ఇచ్చారు. -
పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని చిన్నలింగాపూర్లో పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన వలిదాసు కృష్ణయ్య–లలిత దంపతులుకు ఇద్దరు కూతుళ్లు స్నేహాన్షి(4), శ్రీజ(2). తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్లో బంధువు సంవత్సరీకం ఉండగా, మరో బంధువు సోమవారం మృతిచెందారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు లలిత తన ఇద్దరు పిల్లలతో చిన్నలింగాపూర్లోని తలి గారింటికి వచ్చింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద కూతురు స్నేహాన్షి ఆడుకుంటూ ఇంటి బయటకు వెళ్లగా పాముకరిచింది. పాపను గమనించే సరికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిమానకొండూర్: మండలంలోని పచ్చునూర్ గ్రామ శివారులో సోమవారం అనుమానాస్పదంగా కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆంజనేయులు(50) అనే వ్యక్తి కొద్ది నెలల నుంచి గ్రామానికి చెందిన బత్తుల అజయ్ మేసీ్త్ర వద్ద కూలీ పనిచేస్తున్నాడు. సోమవారం గ్రామ శివారులోని ఓ వ్యక్తికి చెందిన పొలం సమీపంలో మృతదేహం కుళ్లి పోయిందని గ్రామ కారోబార్కు తెలుపగా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని సీఐ సంజీవ్ పరిశీలించారు. మృతుకి గల కారణాలు తెలియనందున అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు అంకురార్పణ
మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. ఆలయ ప్రధాన ద్వారం, వైజంక్షన్ వద్దగల స్వాగత తోరణం, ఆలయ పరిసరాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. స్వామివారి ఉత్సవమూర్తిని దీక్ష విరమణ మంటపానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల శుద్ధి పుణ్యహవచనం, అంకురార్పణ, అఖండ ద్వీపస్థాపన చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్కుమార్, హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరో ఇద్దరికి గాయాలు సిరిసిల్లక్రైం/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలంలోని బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు తెలిపిన వివరాలు. తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూరుకు చెందిన శనిగరపు దిలీప్(28) గజసింగవరంలోని తన బంధువుల వివాహ రిసెప్షన్కు ఆదివారం హాజరయ్యాడు. రాత్రి కావడంతో ఎల్లారెడ్డిపేటలోని బంధువుల ఇంట్లో నిద్రించాడు. సోమవారం తెల్లవారుజామున వేములవాడకు వెళ్తుండగా బైపాస్రోడ్డులోని మెడికల్ కాలేజీ వద్ద కల్వర్టులోకి బైక్ దూసుకెళ్లింది. దిలీప్ అక్కడికక్కడే మృతిచెందగా.. బైక్పై ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు దిలీప్ చనిపోవడంతో తల్లిదండ్రులు చంద్రయ్య, లక్ష్మి రోదనలు మిన్నంటాయి. దిలీప్ ఓ ప్రైవేట్ మైక్రోఫైనాన్స్లో ఉద్యోగం చేస్తుండేవాడని తెలిసింది. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకోరుట్ల రూరల్: మండలంలోని మోహన్రావుపేటలో ఆదివారం రాత్రి దొంగలు తాళం వేసి ఉన్న ఇల్లలో దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన సింగు సురేశ్ రెండురోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు సురేశ్కు ఫోన్ద్వారా సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరిన సురేష్ బీరువాలో దాచిపెట్టిన నాలుగు తులాల బంగారం, 15 తులాల వెండి పట్టగొలుసులు, రూ.8వేల నగదు ఎత్తుకెళ్లినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
● భార్యను గొంతు నులిమి చంపిన భర్త కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మామిడికాయ పచ్చడి పెట?్ట విషయంలో తలెత్తిన గొడవలో భార్యను గొంతు నులిపి చంపాడు భర్త. ఈ ఘటన పందిళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర అంజలి– సూర రాజ్కుమార్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మామిడికాయ పచ్చడి పెట్టేందుకు అంజలి సన్నద్ధమైంది. ఇందుకోసం అవసరమైన వెల్లుల్లి కొనుక్కు రావాలని భర్త రాజ్కుమార్కు సూచించింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రాజ్కుమార్.. అంజలి(27)ను గొంతు నులిమి చంపేశాడు. ఈమేరకు మృతురాలి తండ్రి సంపంగి మల్లేశ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శవాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త రాజ్కుమార్పై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య రామగిరి(మంథని): కల్వచర్ల గ్రామానికి చెందిన వేముల లింగయ్య(90) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రకుమార్, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం .. లింగయ్య భార్య పద్మ కొంతకాలం క్రితం మరణించడంతో లింగయ్య ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి తన ఐదో కుమారుడు ఇంట్లో భోజనం చేయాలని అడుగగా తినకుండా వెళ్లి పడుకున్నాడు. సోమవారం ఉదయం బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి తలుపుతీయగా రేకులషెడ్డు కర్రకు ఉరి వేసుకుని ఉన్నాడు. తమ తండ్రి ఒంటరిగా ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి పెద్ద కుమారుడు వేముల కుమార్స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. భర్తను చితకబాదిన భార్యఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బిడ్డను తీసుకెళ్తున్నాడని ఆగ్రహించిన భార్య.. భర్తపై దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పరిధిలోని కిష్టునాయక్తండాకు చెందిన ధరావత్ స్వప్న(మమత), విజయవాడకు చెందిన సిద్ది నాగార్జునరెడ్డి కొన్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు అలేఖ్య జన్మించింది. నాగార్జునరెడ్డి మేసీ్త్ర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు నెలలుగా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలోనే నాగార్జునరెడ్డి మండల కేంద్రంలో ఉంటున్న తన భార్య వద్దకు వెళ్లి కూతురు అలేఖ్యను తనకు ఇవ్వమని గొడవకు దిగాడు. కూతురును లాక్కునే ప్రయత్నంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో స్వప్న తన భర్తపై రాయితో దాడి చేసింది. నాగార్జునరెడ్డి తన కూతురును తనకు ఇవ్వాలని రోడ్డుపై కూర్చున్నాడు. గ్రామస్తులు జోక్యం చేసుకుని మంగళవారం మాట్లాడడానికి నిర్ణయించారు. -
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
పెగడపల్లి: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగల కింద ఉన్న చెట్లను తొలగిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని నంచర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సిబ్బంది, రైతులతో కలిసి ఎడ్ల రాజేందర్రెడ్డి (43) చెట్లను తొలగించే పనులు చేపడుతున్నాడు. అప్పటికే ట్రాన్స్ఫార్మర్కు కరెంటు సరఫరా నిలిపివేశారు. అయితే ట్రాన్స్ఫార్మర్ పైభాగాన ఉన్న చెట్టు తీగను తొలగించేందుకు రాజేందర్రెడ్డి పైకి ఎక్కాడు. ఈ క్రమంలో 11కేవీ విద్యుత్ తీగ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంటి వద్ద ఉన్న తన భర్తను గ్రామానికి చెందిన కోల రాములు అనే వ్యక్తి బలవంతంగా తీసుకెళ్లాడని, విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపి వేయకుండానే పనులు చేయడంతో తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మృతుడి భార్య విజయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ట్రైనీ ఎస్సై రవీందర్కుమార్ తెలిపారు. ట్రాన్స్కో ఏడీఈ వరుణ్ కుమార్, ఏఈ మధు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఏడీఈ తెలిపారు. -
2డే క్రికెట్ లీగ్ టోర్నీకి వేళాయే..
● 21 నుంచి జూన్ 5 వరకు లీగ్ మ్యాచ్లు ● వేములవాడ, కరీంనగర్ కేంద్రంగా పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో 2డే క్రికెట్ లీగ్ టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) రాష్ట్రస్థాయి టోర్నీల కోసం ముందస్తుగా ఉమ్మడి జిల్లా క్రికెట్ పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈనేపథ్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్– 25 విభాగంలో 2డే క్రికెట్ టోర్నీ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలలోని 9 నియోజకవర్గాల నుంటి 6 జట్లను ఎంపిక చేయగా, ఈ నెల 21 నుంచి జూన్ 6 వరకు మ్యాచ్లు నిర్వహించనున్నారు. మ్యాచ్ల వివరాలను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్.మురళీధర్ రావు, ఉపాధ్యక్షుడు కె.మహేందర్గౌడ్ వెల్లడించారు. ఈ పోటీల్లో రాణించినవారిని అండర్– 25 ఉమ్మడి కరీంనగర్ జట్టుకు ఎంపిక చేయనున్నారు. జూన్లో హెచ్సీఏ ఆధ్వర్యంలో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ టోర్నమెంట్లో కరీంనగర్ అండర్– 25 జట్టు పాల్గొననుంది. 6 జట్లు..16 మ్యాచ్లు.. ఉమ్మడి కరీంనగర్లోని 13 నియోజకవర్గాల నుంచి 6 జట్లను ఎంపిక చేశారు. 3 వేదికల్లో 16 మ్యాచ్లు నిర్వహిస్తారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ, సెయింట్ అల్ఫోన్స్ పాఠశాల, వేములవాడలోని డాక్టర్ నర్సింగరావు మైదానాల్లో పోటీలు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్లు జూన్ 5, 6 తేదీల్లో శాతవాహనలో జరుగనున్నాయి. మ్యాచ్లు ఇవే.. ● 21, 22న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ పెద్దపల్లి, మంథని, రామగుండం – శాతవాహన యూనివర్సిటీ. ● 21, 22న జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ – సెయింట్ అల్ఫోన్స్ స్కూల్. ● 21, 22న కరీంనగర్ రూరల్, చొప్పదండి వర్సెస్ కరీంనగర్ టౌన్ – వేములవాడ. ● 24, 25న మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ వర్సెస్ సిరిసిల్ల, వేములవాడ – వేములవాడ. ● 24, 25న కరీంనగర్టౌన్ వర్సెస్ పెద్దపల్లి, మంథని, రామగుండం– సెయింట్ అల్ఫోన్స్. ● 24, 25న కరీంనగర్ రూరల్, చొప్పదండి వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – శాతవాహన యూనివర్సిటీ. ● 27, 28న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ కరీంనగర్ టౌన్ – వేములవాడ. ● 27, 28న మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ వర్సెస్ కరీంనగర్ రూరల్, చొప్పదండి – సెయింట్ అల్ఫోన్స్. ● 27, 28న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – శాతవాహన యూనివర్సిటీ. ● 30, 31న కరీంనగర్ రూరల్, చొప్పదండిి వర్సెస్ సిరిసిల్ల, వేములవాడ – వేములవాడ. ● 30, 31న జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి వర్సెస్ కరీంనగర్టౌన్ – శాతవాహన యూనివర్సిటీ. ● 30, 31న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్– సెయింట్ అల్ఫోన్స్. ● జూన్ 2, 3న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – వేములవాడ. ● 2, 3న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ కరీంనగర్ రూరల్, చొప్పదండి – సెయింట్ అల్ఫోన్స్. ● 2, 3న కరీంనగర్ టౌన్ వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ – శాతవాహన యూనివర్సిటీ. ● 5, 6న ఫైనల్.. లీగ్లో ఎక్కువ స్కోర్ చేసిన రెండు జట్లు – శాతవాహన యూనివర్సిటీ. -
అను‘మతి’లేని ట్రావెల్స్
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే అదునుగా తీసుకుంటున్న కొంతమంది ట్రావె ల్స్, గల్ఫ్ ఏజెంట్ల పేరుతో గల్ఫ్ పంపిస్తామని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలు రెండేళ్లుగా భారీగా పెరిగాయి. జిల్లాలో సుమా రు 180 ట్రావెల్స్ అనధికారికంగా నడుస్తున్నట్లు తె లుస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు విదేశీల్లో ఉపాధి కల్పిస్తామంటూ గల్ఫ్ ఏ జెంట్లు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ట్రావెల్స్కు విమాన టికెట్లు బుకింగ్ చేసేందుకే అనుమతి ఉంటుంది. కానీ కొందరు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి వారి పా స్పోర్టులు తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూలకు పిలి పించి వీసా వచ్చిందని నమ్మిస్తూ రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్లో అనుమతి లేకుండా మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 18 మందికే లైసెన్స్లు జిల్లాలో గల్ఫ్ పంపించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కేవలం సుమారు 18 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్ ఉంది. మిగిలిన వారు అనుమతి లేకుండా ట్రావెల్స్, ఏజెంట్లుగా చలామణి అవుతూ నిరుద్యోగుల నుంచి వీసాల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. లైసెన్స్ లేకున్నా ఇంటర్వ్యూలు గల్ఫ్ ఏజెంట్లు, ట్రావెల్స్ నిర్వాహకులు లైసెన్స్ ఉన్నప్పటికీ ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసులకు సమాచారం అందించి ఇంటర్వ్యూలు నిర్వహించాలి. కానీ కొందరు ఎలాంటి సమాచారం లేకుండానే హోటళ్లు, ఫంక్షన్హాల్స్, గెస్ట్హౌస్ల్లో నిర్వహిస్తున్నారు. పాస్పోర్టులు తీసుకుని ఏదో ఒక వీసా అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. యూరప్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ రూ.3 నుంచి రూ.ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పెరుగుతున్న గల్ఫ్ మోసాలు ఏజెంట్ల చేతికి చిక్కుతున్న నిరుద్యోగులు అందినకాడికి దండుకుంటున్న నిర్వాహకులు ‘రాయికల్ మండలకేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు జగిత్యాలకు చెందిన లైసెన్స్ లేని ఓ ట్రావెల్స్ నిర్వాహకులు యూరప్ దేశం పంపిస్తామని ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.5 లక్షలు వసూలు చేశారు. వారిని పంపించకుండా మూడు నెలలుగా నేడు.. రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు..’ ‘జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు గల్ఫ్ వెళ్లేందుకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కు చెందిన ఓ వ్యక్తికి రూ.2లక్షలు ఇచ్చాడు. ఆర్నెళ్లు గడుస్తున్నా సదరు యువకుడిని పంపించడం లేదు. ఏజెంట్ ఇంటికి వెళ్లి డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడు..’ ఇటీవల జగిత్యాల జంబిగద్దె ప్రాంతంలో ఓ వ్యక్తి ఎలాంటి అనుమతి లేకుండా ట్రావెల్స్ పెట్టి యువతులను రిసెప్షనిస్ట్గా నియమించి నిరుద్యోగులకు ఫోన్కాల్స్ చేయిస్తున్నాడు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో వారిని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి గల్ఫ్ వెళ్తారా..? అని అడుగగా సదరు ఎమ్మెల్యే ఎవరికి ఫోన్ చేశావని అడగడంతో కంగుతిన్న రిసెప్షనిస్ట్ ఫోన్ పెట్టేసింది. ఆ ఎమ్మెల్యే విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ నకిలీ ట్రావెల్స్ యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయండి
మల్యాల: కొండగట్టు ఆలయ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం 300 ఎకరాలు సేకరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ముందుకెళ్లాలని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కొండగట్టు అంజన్నను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, దావ వసంత, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం వినోద్కుమార్ మాట్లాడుతూ.. వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముత్యంపేట శివారు వరదకాలువ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిందన్నారు. కేటాయించిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిందని, తక్షణమే ఆ నిధులు కేటాయించేలా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ చూపాలన్నారు. తాను కొండగట్టు అభివృద్ధి అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని, ప్రస్తుత ఎంపీ నిధులు తీసుకురావాలని సూచించారు. రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధి చేపట్టిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దారని తెలిపారు. అంజన్న సన్నిధిలో కొత్త కోనేరు నిర్మించి, వసతులు కల్పించామన్నారు. మాజీ జెడ్పీటీసీలు కొండపల్కల రాంమోహన్రావు, ప్రశాంతి కృష్ణారావు, మాజీ ఎంపీపీ ఎడిపెల్లి అశోక్, పాక్స్ చైర్మన్ బోయినపల్లి మధుసూదన్రావు, అయిల్నేని సాగర్ రావు పాల్గొన్నారు. ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలి ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ -
బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 18 మంది అర్జీలు సమర్పించారు. ఎస్పీ వారితో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సులకు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరికోరుట్ల: ప్రైవేటు స్కూల్ బస్సులకు అన్ని రకాల ధ్రువీకరణపత్రాలు తప్పనిసరి అని జిల్లా రవాణా అధికారి భద్రు నాయక్ అన్నారు. పట్టణంలోని ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం ప్రైవేట్ స్కూల్ యజమానులతో సమావేశమయ్యారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పర్మిట్, పొల్యూషన్, రిజిస్ట్రేషన్, డ్రైవర్ లైసెన్స్, డ్రైవర్కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరిగా పేర్కొన్నారు. కోరుట్ల మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, కథలాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల ప్రైవేట్ స్కూల్ యజమానులు పాల్గొన్నారు. గ్రామీణులకు మెరుగైన వైద్యంజగిత్యాలరూరల్: గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నిరుపేదలకు వైద్యం అందించేందుకు ముక్త్ భారత్ అభియాన్ దోహదపడుతుందన్నారు. జబ్బులు గుర్తించి చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. కల్లెడ మెడికల్ ఆఫీసర్ సౌజన్య, పంచాయతీ కార్యదర్శి కిరీటి, కారోబార్ రాజిరెడ్డి, సబ్సెంటర్ ఆఫీసర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల డీఎస్పీ బదిలీజగిత్యాలక్రైం: జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ హైదరాబాద్ ఇంటెలిజెన్సీ డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రామగుండం సీసీఎస్లో ఏసీపీగా పనిచేస్తున్న వెంకటస్వామిని నియమిస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండిజగిత్యాల: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 28 వరకు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష ఉంటుందన్నారు. సీసీ కెమెరాల నిఘా నేతృత్వంలో పరీక్షలు జరుగుతాయని, విద్యుత్, వైద్యశాఖ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడపాలని సూచించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి నారాయణ, పోలీసు, విద్యుత్, వైద్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోండి
గ్రామంలోని సర్వే నంబర్ 22లో గల 6గుంటల ప్రభుత్వ స్థలంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పిల్లర్ల దశ వరకు నిర్మాణం పూర్తయింది. దానికి 3–96నంబర్ కేటాయించారు. అయితే అదే గ్రామానికి చెందిన భోగ సత్తన్న ఆ భవనాన్ని కూల్చివేసి అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి, డీపీవోతో ఫిర్యాదు చేశాం. 24గంటల్లో కూల్చివేయాలని నోటీసు జారీచేసినా.. సదరు వ్యక్తి స్పందించడం లేదు. విచారణ జరిపి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి. – నర్సింహులపల్లె, బీర్పూర్అక్రమ భూమార్పిడిని రద్దు చేయండి మా తాత కోల గంగారాం పేరిట రాయికల్ మండలం అల్లీపూర్ రెవెన్యూ పరిధిలో 1120(అ)గల సర్వే నంబర్లోని 1.3 ఎకరాల భూమిని దుగ్గిల్ల కొమురయ్య పేరిట అక్రమంగా మార్పిడి చేయించుకున్నాడు. ఆ భూమిపై 2016 నుంచి ఏటా పంట రుణం పొందుతున్నాం. 2023లో రుణమాఫీ కూడా పొందాం. సాక్షి సంతకం పెట్టాలంటూ మా తాత గంగారాంను తీసుకెళ్లిన రొడ్డ బక్కయ్య 2020లోనే దుగ్గిల్ల కొమురయ్య పేరిట భూమిని మార్పిడి చేయించినట్లు ఇటీవలే తెలిసింది. రికార్డులు, మోకాపై విచారణ జరిపి ఆ భూ మార్పిడిని రద్దు చేసి న్యాయం చేయండి. – కోల వంశీకుమార్, అయోధ్య, రాయికల్ -
ఐసీడీఎస్లో ఆగని అక్రమాలు
మెట్పల్లి: మెట్పల్లి ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు చెందిన కొందరు నిర్వాహకులు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కడుపు కొడుతున్నారు. కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని వారికి అందించకుండా బయట అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. సీడీపీఓ, సూపర్వైజర్ల పర్యవేక్షణ కొరవడడంతో చాలా కాలంగా పెద్ద ఎత్తున సరుకులు పక్కదారి పడుతున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు మండలాలు..312 కేంద్రాలు ● మెట్పల్లి ఐసీడీఎస్ పరిధిలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ మండలాలు ఉన్నాయి. ● ఈ మండలాల్లో 312 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటికి ప్రతినెలా ప్రభుత్వం పోషకాహార వస్తువులను సరఫరా చేస్తుంది. ● వీటిని కేంద్రాల నిర్వాహకులు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సి ఉంటుంది. ప్రధానంగా పాలు, బాలమృతం ప్యాకెట్లు ● మొత్తం సరఫరా చేస్తున్న వస్తువుల్లో ప్రధానంగా పాలు, బాలమృతం ప్యాకెట్లను నిర్వాహకులు అమ్ముకుంటున్నారు. ● అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రతినెలా 2.50కిలోల బాలమృతాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ● చిన్నారులు బలంగా ఎదగడానికి ఇది దోహాదం చేస్తుంది. అయితే కొందరు ఈ ప్యాకెట్లను డెయిరీ నిర్వాహకులకు అమ్ముకుంటున్నారు. వారు వీటిని గేదెలకు దాణాగా వినియోగిస్తున్నారు. ● పట్టణంలో ఉన్న పలువురు గేదెలపెంపకందారులు వీటిని బహిరంగంగానే వినియోగిస్తున్నారు. ● అలాగే గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేకంగా అందించే హోమోజినైజ్డ్ టోన్డ్ పాలను పూజ స్టోర్లకు అమ్ముతున్నారు. తనిఖీలు.. చర్యలు శూన్యం ● కేంద్రాలను తరచూ సీడీపీఓ, సూపర్వైజర్లు తనిఖీలు చేసి పోషకాహారం సక్రమంగా పంపిణీ జరుగుతోందా..? లేదా..? అని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. ● మొక్కుబడిగా తనిఖీలు చేస్తూ.. చేతులు దులుపుకుంటున్నారు. ● ఈ కారణంగానే మెట్పల్లి ఐసీడీఎస్ పరిధిలో చాలాకాలంగా పెద్ద ఎత్తున సరుకులు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● పాలు, బాలామృతం ప్యాకెట్లను కొందరు అమ్ముకుంటున్న వైనంపై గతంలోనూ పలు కథనాలు వచ్చాయి. ● అయినా అధికారులు వీటికి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● దీనివల్ల కొందరు నిర్వాహకులు ఇంకా సరుకులు పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటూనే ఉన్నారు. ● ఉన్నతాధికారులు స్పందించి మెట్పల్లి ఐసీడీఎస్ పరిధిలో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్ మణెమ్మను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. పాలు, బాలామృతం పక్కదారి ఏళ్ల తరబడిగా సాగుతున్న అక్రమాలు చిన్నారులకు అందని పౌష్టికాహారంపట్టణ శివారులోని ఓ డెయిరీ ఫాం వద్ద ఇలా కనిపిస్తున్నవి బాలామృతం ప్యాకెట్లు. ఇక్కడ కూడా ఈ పోషకాహారాన్ని గేడెలకు ఆహారంగా వినియోగిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి చాలా రోజులుగా ఇక్కడకు పెద్ద సంఖ్యలో ప్యాకెట్లను తరలిస్తున్నట్లు తెలిసింది. ‘ఈ చిత్రంలో కనిపిస్తున్నది బాలామృతం ప్యాకెట్. మెట్పల్లిలోని ఓ డెయిరీ ఫాంలో ఇలా ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించాల్సిన ఈ ప్యాకెట్లను డెయిరీ ఫాంలోని గేదెలకు దాణాగా వాడుతున్నారు. కొందరు టీచర్లు తమ స్వలాభం కోసం ప్యాకెట్లను ఇలా విక్రయిస్తున్నారు. -
గోడు వినండి.. పరిష్కారం చూపండి
జగిత్యాలటౌన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 43 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవోలు మధుసూదన్గౌడ్, జివాకర్, శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు. రశీదు కోసం ఎదురుచూపులు ప్రజావాణికి వచ్చిన వారికి రశీదు ఇచ్చేందుకు అధికారులు గంటల తరబడి గడువు పెడుతున్నారు. గంటల తరబడి వేచి ఉండడం ఇబ్బందిగా మారిందని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఆలస్యంగా రశీదు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. -
వేసవి శిక్షణ శిబిరాలతో విద్యార్థులకు మేలు
● ముగిసిన శిబిరాలు ● ఇబ్రహీంపట్నంలో 120 మంది విద్యార్థులకు శిక్షణఇబ్రహీంపట్నం : వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎండలో ఆటలు ఆడకుండా బావులు, చెరువుల, కాలువల వైపు వెళ్లకుండా ప్రభుత్వం 6 నుంచి 9 వ తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరం వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించింది. ఈ శిబిరాలను ఈ నెల 2 నుంచి 17 వరకు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గోధూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 120 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నైపుణ్యం గల ఉపాధ్యాయులతో శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు నోట్బుక్కులు, పెన్నులు అందించారు. శిక్షణలో యోగా, మెడిటేషన్, వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంగ్లిష్ గ్రామర్, చేతి రాతలో శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, సులభంగా లెక్కలు చేసేందుకు షార్ట్కట్ మ్యాథ్స్ను నేర్పించారు. విద్యార్థులు శిక్షణ పొందడం వలన మేథాశక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇంగ్లిష్ మాట్లాడడం, మ్యాథ్స్లో షార్ట్కట్ పద్ధతులు, సైన్స్లో మెలకువలు, మెంటల్ ఎబిలిటీ నేర్చుకున్నట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు ఉపయోగకరంగా శిక్షణ నైపుణ్యం గల ఉపాధ్యాయులతో శిక్షణనిచ్చాం. విద్యార్థులలో మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఈ వేసవి కాలంలో కొత్తగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాలకు విద్యార్థుల తల్లిదండ్రులు శిక్షణకు పంపిస్తే వివిధ రకాల శిక్షణలు పొంది విద్యార్థుల్లో మంచి విద్యతో పాటు మేథాశక్తి కూడా పెరుగుతుంది. – మధు, ఎంఈవో, ఇబ్రహీంపట్నం -
యూనిఫాం.. ఉపాధి
● మహిళా సంఘాల చేతికి కుట్టు పని ● జిల్లాలో 667 స్కూళ్లు.. 47,963 మంది విద్యార్థులు ● ఒక్కొక్కరికి రెండు జతల దుస్తులు ● 1,144 మంది మహిళా సభ్యులకు లబ్ధి జగిత్యాలరూరల్: మహిళా సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వారికి నిత్యం పని ఉండేలా ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా అందిచే యూనిఫాంల కుట్టు పనిని మహిళ సంఘాలకు అప్పగించింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను ఇప్పటికే సేకరించారు. వారి సంఖ్యకు అనుగుణంగా ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున కుట్టి ఇచ్చే బాధ్యతను తీసుకున్నారు. 667 పాఠశాలలు.. 47,963 మంది విద్యార్థులు జిల్లాలో 667 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 47,963 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి రెండు జతల దుస్తుల చొప్పున మహిళా సంఘం సభ్యులు కుడుతున్నారు. గతంలో కొలతలు లేకుండా కుట్టడంతో విద్యార్థులకు సరిపోయేవి కావు. కానీ ప్రస్తుతం విద్యార్థుల కొలతలు తీసుకుని ఒక్కొక్కరికి రెండు జతల దుస్తులు కుడుతున్నారు. రెండు జతల దుస్తులు కుడితే మహిళలకు రూ.75 చొప్పున చెల్లించనున్నారు. అంగన్వాడీ పిల్లలకు రూ.80, వసతి గృహ విద్యార్థులకు రూ.80 నుంచి రూ.100 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 1144 మంది మహిళలకు ఉపాధి జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1144 మంది మహిళలు దుస్తులు కుట్టేలా శిక్షణ పొందారు. వారు ప్రస్తుతం పాఠశాలల వారీగా విద్యార్థులకు దుస్తులు కుట్టడంలో నిమగ్నమయ్యారు. వీరు ప్రతిరోజు సుమారు 4,121 డ్రెస్లు కుట్టే అవకాశం ఉంటుంది. పాఠశాల ప్రారంభం నాటికి ప్రతి వి ద్యా ర్థికి యూనిఫాం అందేలా చర్యలు చేపడుతున్నారు. జూన్ వరకు దుస్తులు జిల్లాలో మహిళా సంఘాల సభ్యులతో విద్యార్థులకు యూ నిఫాంలు కుట్టిస్తున్నాం. ప్రతి విద్యార్థికి రెండు జతల యూని ఫాంలను కుట్టిచ్చి.. జూన్ మొ దటి వారంలో అందించేలా ని ర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం మహిళాసంఘ సభ్యులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. – రఘువరణ్, డీఆర్డీఏ పీడీ జిల్లాలో మండల సమైక్యలు 18 గ్రామ సమైక్యలు 565 స్వశక్తి సంఘాలు 14,957 మహిళా సంఘాల్లో సభ్యులు 1,72,801 -
రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం
మేం అన్నాచెల్లెళ్లం. బీటెక్, ఎంసీఏ పూర్తి చేశాం. వ్యవసాయంపై ఇష్టంతో రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నాం. మంచి దిగుబడులు సాధిస్తున్నాం. రసాయనాలు లేని ఆహార ఉత్పత్తులు పండించి వాటిని ఆహారంగా వాడుకుంటున్నాం. – గుర్రాల శశికుమార్, సాహితీ ఖర్చు లేని పద్ధతులతో లాభం ఖర్చు లేని సాగు పద్ధతులను ఇప్పటికే ఆచరిస్తున్నాం. మరిన్ని పద్ధతులను తెలుసుకునేందుకు శిక్షణకు వచ్చాను. ఘనామృతం, జీవామృతం తయారీ, ఉపయోగించే విధానం వివరించారు. ఆవు మూత్రం, పేడతో తయారు చేసే పద్ధతులు తెలిపారు. – బద్దం రాహుల్, ఇబ్రహీంపట్నం శిక్షణ ఉపయోగంగా ఉంది ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఇచ్చిన శిక్షణ ఉపయోగకరంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి చాలామంది రైతులు హాజరయ్యారు. ఇటీవలి కాలంలో సాగు ఖర్చులు పెరుగుతున్నందున ఎలా తగ్గించుకోవాలనే దానిపై శిక్షణ ఇచ్చారు. – పాత రమేశ్, తుంగూర్, సారంగాపూర్(మం) -
రసాయనాలతో సాగు భూములు నిర్జీవం
● పెట్టుబడి లేని వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ● హాజరైన వివిధ ప్రాంతాల రైతులు జగిత్యాలఅగ్రికల్చర్: హరిత విప్లవం ద్వారా పంట ఉత్పత్తి లక్ష్యాలు సాధించినప్పటికీ.. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపు మందులతో సాగు భూములు నిర్జీవం అవుతున్నాయని దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ శిక్షణ నిపుణులు బసంపల్లి నాగరాజు అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి సురభి గోశాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆదివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక రసాయనాలతో భూములు తమ సహజత్వాన్ని కోల్పోయి పంటల దిగుబడి తగ్గిపోతోందని తెలిపారు. పురుగుమందుల పిచికారీతో వాతావరణ కాలుష్యంతో మనిషి మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకర ఉత్పత్తులను సమాజానికి అందించేందుకే రైతులు గోఆధారిత, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు. రసాయనాలతో రైతులు పండించిన పంట ఉత్పత్తులను తినేందుకు ప్రజలు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. ఆవుమూత్రం, పేడతో ఘనామృతం, జీవామృతం, నీమాస్త్రం తయారు చేసి పంటలకు పోషకాలు అందిస్తూనే.. మరోవైపు పురుగులు, తెగుళ్లను అరికట్టవచ్చని తెలిపారు. మురళీధర గోదాం వ్యవస్థాపకుడు చెన్నమనేని పద్మ మాట్లాడుతూ.. గోఆధారిత వ్యవసాయంతో భూమి ఆరోగ్యంగా ఉండడంతోపాటు మనిషి ఆరోగ్యం కూడా బాగుంటుందని వెల్లడించారు. గోఆధారిత ఉత్పత్తులు వాడేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గోఆధారిత ఉత్పత్తుల తయారీతో స్వయం ఉపాధి పొందవచ్చని, ఇందుకోసం శిక్షణ కూడా ఇస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ ఉందన్నారు. ఆవుమూత్రం, పేడతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టారు. గోశాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండారి కమలాకర్రావు, గ్రామ భారతి అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.