breaking news
Jagitial District Latest News
-
విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత
పెగడపల్లి: జిల్లావ్యాప్తంగా విద్యుత్ శాఖలో ఖాళీల కొరత వేధిస్తోంది. కిందిస్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ఏటా పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లకు సరిపడా సిబ్బంది పోస్టులు భర్తీ కావడం లేదు. ఉన్నవారిపైనే అదనపు భారం పడుతుండటంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రైవేటు ఎలక్ట్రిషీయన్లు రోజువారి కూలీలుగా పనిచేస్తుండటంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షాకాలంలోనే ఎక్కువగా విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. అక్కడక్కడ సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నా ఇబ్బంది మాత్రం తప్పడం లేదు. ఇద్దరుముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయాల్సి రావడంతో వినియోగదారులకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. జిల్లాలో ఏటా గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరుగుతున్నా.. దానికి తగ్గట్టు సిబ్బందిని నియమించడం లేదు. ఒక్కో డివిజన్లో పరిధిలో ప్రతి 1500 సర్వీసులకు ఒక జూనియర్ లైన్మన్, ప్రతి మూడు వేల కనెక్షన్లకు అసిస్టెంట్ లైన్మెన్, ప్రతి 4500 విద్యుత్ కనెక్షన్లకు లైన్మన్, లైన్ఇన్స్పెక్టర్ ఉండాలి. సెక్షన్ మొత్తానికి ఒక సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మన్ ఉండాలి. కానీ.. ఉండాల్సిన నిష్పత్తిలో ఎక్కడా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది కొరతతో వ్యవసాయ బావుల వద్ద ఫ్యూజ్లు పోతే పునరుద్ధరణ ఆలస్యం అవుతోంది. గ్రామాల్లోనూ రాత్రిపూట ఫ్యూజ్లు పోతే పెట్టడానికి ఎవరూ అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణులున్నాయి. వారు వచ్చేలోపు రైతులు, స్థానికులే సరిచేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యుత్ ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లాలో జేఎల్ఎం, ఏఎల్ఎం పోస్టులు ఎక్కువగా ఖాళీలున్నాయి. ఈ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. 2019లో జేఎల్ఎం పోస్టులు భర్తీ కాగా.. ఏడాది విధులు పూర్తి చేసుకున్న వారందరూ ఏఎల్ఎంలుగా పదోన్నతి పొందారు. జేఎల్ఎం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారిపై పని భారం పడుతుండటంతో ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. ఏ రాత్రయినా విద్యుత్ పునరుద్ధరణకు క్షేత్రస్థాయి సిబ్బందే పనులు చేయాల్సి వస్తోంది. అత్యవసర సమయంలో వెళ్లాలంటే మరో సిబ్బంది అదనంగా పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. పోస్టులు, ఖాళీల వివరాలు హోదా పోస్టులు ఉన్నది ఖాళీలు జూ.లైన్మెన్లు 207 21 186అ.లైన్మెన్లు 207 189 18లైన్మెన్లు 151 146 05లైన్ ఇన్స్పెక్టర్లు 61 61 03సీ.లైన్స్పెక్టర్లు 21 19 02 ఫోర్మెన్లు 11 7 04అ.ఇంజినీర్లు 51 49 02డి.ఇంజినీర్లు 16 13 03జిల్లాలో సబ్ డివిజన్లు 09గృహ విద్యుత్ కనెక్షన్లు 3,41,104కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు 43,825ఇండస్ట్రియల్ విద్యుత్ కనెక్షన్లు 4,374వ్యవసాయ కనెక్షన్లు 1,38,689మొత్తం కనెక్షన్లు 5,37,780 -
పరిశుభ్రతతో అంటువ్యాధులు దూరం
బుగ్గారం: పరిశుభ్రతతోనే విషజ్వరాలు, అంటువ్యాధులకు దూరంగా ఉండొచ్చని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రంలో మంగళవారం పర్యటించారు. వార్డుల్లో పర్యటించి డ్రైనేజీ, నీరు నిలిచిన ఖాళీ స్థలాలను పరిశీలించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అత్యంత ముఖ్యమని అన్నారు. గ్రామంలో ఎవరికి ఎలాంటి అనారోగ్యం ఏర్పడినా వెంటనే స్థానిక ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్వో అల్లెంకి శ్రీనివాస్, సూపర్వైజర్లు వెంకటేశ్, శ్రీనివాస్, కార్యదర్శి అక్బర్, ఏఎన్ఎంలు శైలజ, స్వప్న, శోభన్, మహేంద్ర పాల్గొన్నారు. సూరమ్మ ప్రాజెక్టుకు ఇసుక తరలింపును అడ్డుకోవద్దుమెట్పల్లిరూరల్: సూరమ్మ ప్రాజెక్టు పనుల కో సం ఆత్మకూర్ వాగు నుంచి ఇసుక తరలిస్తున్నామని, ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చ ర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నీతా, సీఐ అనిల్కుమార్ తెలిపారు. ఆత్మకూర్లో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఇసు క విషయమై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. కథలాపూర్ మండలంలో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టుకు అవసరమైన ఇసుకను ఆత్మకూర్ వాగు నుంచి తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారని, గ్రామస్తులు సహకరించాలని కోరారు. కొందరు వ్యక్తులు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించడంతో అట్రాసిటీ కేసు నమోదు చేశామని, ఇసుక రవాణాను అడ్డుకున్నందుకే కేసు పెట్టామన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. యూరియా కొరతకు కేంద్రానిదే బాధ్యతరాయికల్: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రం బాధ్యత వహించాలని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం రాయికల్లో విలేకరులతో మాట్లాడారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తికి బ్రేక్ పడిందని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఎప్పటికప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. రాయికల్ మండలం బోర్నపల్లి, సారంగాపూర్ మండలం కలమడుగు, మల్లాపూర్ మండలం బాదనకుర్తి, నిర్మల్లో గుమిర్యాలలో గోదావరిపై వంతెనల నిర్మాణం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడి మహిపాల్రెడ్డి, నాయకులు పొన్నం శ్రీకాంత్, షాకీర్, చింతలపల్లి గంగారెడ్డి, బాపురపు నర్సయ్య ఉన్నారు. పుట్టినరోజు కానుకగా యూరియా బస్తాకథలాపూర్: మండలంలోని తాండ్య్రాలలో ముక్కెర మధు అనే యువకుడి పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాత్రి నిర్వహించారు. పుట్టినరోజు కానుకగా మధుకు తోటి మిత్రులు యూరియాబస్తా బహుమతిగా అందించారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, అందుకోసమే బస్తాను కానుకగా అందించామని యువకులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని యువకులు మంచాల మహేశ్, మా మిడిపెల్లి శివ, శేఖర్, సంజీవ్, మనోజ్, మహిపాల్ కోరారు. జిల్లాకు తేలికపాటి వర్షసూచనజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి. శ్రీ లక్ష్మి తెలిపారు. ఈనెల 20 నుంచి 24 వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 30నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తుందని తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 31 డి గ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24 డి గ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
వర్షంలో పనులు.. నాణ్యత కరువు
జగిత్యాల: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, నాణ్యతగా లేకుండా చేస్తే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రతి వార్డు తిరుగుతూ.. పనులను పర్యవేక్షిస్తూ.. ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తున్నారు. అయినప్పటికీ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తోంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కొన్నిచోట్ల నెలలు తరబడినా చేయకపోవడం, మరికొన్ని చోట్ల కొబ్బరికాయ కొట్టి నెలలు గడిచినా రోడ్లను తవ్వి వదిలేస్తున్నారు. జగిత్యాల బల్దియాకు టీయూఎఫ్ఐడీసీ కింద రూ.20కోట్లు మంజూరయ్యాయి. ప్రతి కాలనీలో సీసీరోడ్డు పనులు చేపడుతున్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లేదంటూ స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిపించని నాణ్యత సీసీరోడ్లు మొదలుపెట్టాక.. పొక్లెయిన్తో లేయర్ తీసి తర్వాత చిన్న కంకరపోయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు కంకర పోస్తే చాలా ఖర్చు అవుతుందని ఎక్కడైనా కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన గార్బెజ్ తీసుకొచ్చి ఆ లేయర్పై పోస్తున్నారు. నాణ్యమైన మొరం పోయాల్సి ఉండగా.. ఎక్కడిదో తీసుకొస్తున్నారు. నిత్యం పర్యవేక్షించాల్సిన వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈలు గానీ పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లు చెత్తాచెదారం పోసి నింపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కాలనీలో ఫిర్యాదు చేస్తే చిన్నపాటి కంకర నింపుతూ మమ అనిపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? నిబంధనల ప్రకారం సీసీరోడ్డు నిర్మించేటప్పుడు ఎంత సిమెంట్ వాడుతున్నారు..? ఎంత ఎంఎం కంకర వేస్తున్నారు..? వంటి అంశాలను అధికారులు పని పూర్తయ్యేవరకూ పరిశీలిస్తూ ఉండాలి. కానీ పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేకుండా సీసీరోడ్లను నిర్మిస్తున్నారు కాంట్రాక్టర్లు. ఫలితంగా వేసిన రెండుమూడు నెలల్లోనే చెడిపోతున్నాయి. కొందరు అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీరోడ్డు మొదలు పెట్టాక కంకర పోయడంతో పాటు, దానిపై నాణ్యతతో కూడిన మొరం పోసి రోడ్డురోలర్తో చదును చేయాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో చదును చేసిన అనంతరం నాణ్యతతో కూడిన సిమెంట్ బస్తాలు కంకరతో కలిపి రోడ్డు వేయాల్సి ఉంటుంది. కానీ కొందరు కాంట్రాక్టర్లు నిబంధనలు గాలికి వదిలేస్తూ ఇష్టారాజ్యంగా చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రోడ్డంతా పూర్తయిన అనంతరం ఇటీవల వంచం డ్రై ఫ్యాన్ (వీడీఎఫ్) ద్వారా సీసీరోడ్డును నీట్గా చేయాల్సి ఉంటుంది. ఏదో రాత్రిపూట డ్రై ఫ్యాన్తో మీదమీద చేస్తూ మమ అనిపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో చేపడుతున్న సీసీరోడ్లపై నిఘా ఉంచాలని, పూర్తిస్థాయిలో నిర్మితమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నాణ్యతతో ఉంటేనే బిల్లులు నాణ్యతతో కూడిన సీసీరోడ్లు వేస్తేనే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్లు సీసీరోడ్డు వేసిన అనంతరం క్వాలిటీ అధికారులు పరిశీలించి ఏదో ఒకచోట డ్రిల్లింగ్ చేసి దానికి సంబంధించిన మెటిరియల్ను తీసుకెళ్లి నాణ్యత ఉందా..? లేదా..? అని చూస్తుంటారు. కాంట్రాక్టర్లు మాత్రం నాణ్యతతో ఉన్న ఏదోచోటును చూపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏదో ఒక విధంగా బిల్లులు మంజూరు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లేకుంటే చర్యలు నాణ్యత లేకుంటే చర్యలు తీసుకుంటాం. విద్యానగర్లో వాంచం డ్రైఫ్యాన్ ద్వారా రోడ్డును నీట్గా చేసి దానిపై పాలిథిన్ కవర్ కప్పుతున్నారు. వర్షానికి కొంత లేయర్ పోయింది. మళ్లీ రోడ్డు నాణ్యతగా చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి చోట పకడ్బందీగా పర్యవేక్షణ చేస్తున్నాం. – అనిల్, ఏఈ -
బోధనోపకరణలతో నాణ్యమైన విద్య● డీఈవో రాము
గొల్లపల్లి: ప్రాథమికస్థాయి విద్యార్థులకు బోధనోపకరణల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తే సులభతరంగా అర్థమవుతుందని డీఈవో రాము అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ టీఎల్ఎం మేళా నిర్వహించారు. 35 పాఠశాలల విద్యార్థులు 124 నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. ప్రతి సబ్జెక్ట్కు ఒకటి చొప్పున నాలుగు సబ్జెక్ట్లకు నాలుగు నమూనాలతో ప్రదర్శనలు చేపట్టారు. విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటపాటలు, కథలు వంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు తయారుచేసిన లోకాస్ట్, నో కాస్ట్ బోధనోపకరణ సామగ్రి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలు ప్రదర్శించిన 10 మంది ఉపాధ్యాయులను విజేతలుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంఈవో చెరుకు రాజన్న, ఎంపీడీవో రాంరెడ్డి, తహసీల్దార్ మాజిద్ పాల్గొన్నారు. -
రోళ్లవాగుకు గేట్లు ఎప్పుడు బిగిస్తారు..?
సారంగాపూర్: బీర్పూర్ శివారు రోళ్లవాగు ప్రాజె క్టు పూర్తయినా.. గేట్లు మాత్రం ఎందుకు బిగించడం లేదని ఎమ్మెల్సీ ఎల్.రమణ ప్రశ్నించారు. వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న నీరు గేట్లు బిగించకపోవడంతో వృథాగా గోదావరిలో కలు స్తోందని తెలిపారు. 15వేల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టి.. 90శాతం పూర్తి చేశామని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 కోట్లు విడుదల చేసిందని, జూన్లోనే అటవీశాఖ నుంచి అనుమతులు కూడా వచ్చాయని, ఇప్పటి వరకు ఎలాంటి పురోగతీ లేదని పేర్కొన్నారు. వానాకాలం సీజన్ సగం దాటినా.. గేట్లు ఎందుకు బిగించడం లేదో తెలపాలని డిమాండ్ చేశారు. -
ప్రజలకు ఇబ్బంది రానీయొద్దు
కోరుట్ల/కోరుట్లరూరల్/మెట్పల్లి: వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. స్థానిక బల్దియా కార్యాలయంలో అదనపు కలెక్టర్ లతతో కలిసి కోరుట్ల, మెట్పల్లి బల్దియా అధికారులతో సమావేశమయ్యారు. పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. అయిలాపూర్ రోడ్డు దెబ్బతిన్న నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బంది రానీయొద్దన్నారు. కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ కమిషనర్లు రవీందర్, మోహన్, డీఈ మధుసూదన్, ఏడీలు పాల్గొన్నారు. అనంతరం తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు ఫయీం, రమేశ్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం మెట్పల్లిలోని గంగారాం మెస్లో ఎమ్మెల్యే సంజయ్ కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. భోజనం రుచిగా ఉందంటూ నిర్వాహకులను అభినందించారు. -
ధరణిలో నమోదు చేయించండి
మాది జగిత్యాల. మల్యాల మండలం ముత్యంపేటలో సర్వే నంబర్ 438/బిలో నా భార్య సిరిపురం విజయలక్ష్మి పేరిట 13 గుంటల భూమిని దస్తావేజు నంబర్47/2005లో కొన్నాను. రెవెన్యూ అధికారులు పాస్ బుక్ నంబర్ 350037 ద్వారా పట్టానంబర్ 746 జారీ చేశారు. 2018వరకు 1బీలో సదరు భూమి నా భార్య విజయలక్ష్మి పేరిటే ఉంది. ధరణి పోర్టల్లో రెవెన్యూ అధికారులు మా పేరు నమోదు చేయలేదు. అది ఎక్సెస్ ల్యాండ్గా చూపారు. పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. – సిరిపురం అంజయ్య. జగిత్యాల -
ఎక్కడుంటారో.. ఏం చేస్తారో..?
టెండర్లు పూర్తయ్యాయి జగిత్యాల: మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులో పౌరసేవలు పక్కాగా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల వార్డు ఆఫీసర్లను నియమించింది. వీరు ప్రతిరోజు మున్సిపల్ కార్మికులతో సమావేశం కావడం.. పనులను పర్యవేక్షించడం.. నివేదికను ఉన్నతాధికారులకు చేరవేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే వార్డుస్థాయి పారిశుధ్య ప్రణాళిక అమలు, ఇంటింటికీ చెత్త సేకరణ, వ్యర్థాల ప్రాసెస్, ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్లు, మటన్, చికెన్ స్టాల్స్ పరిశీలించాల్సి ఉంటుంది. అయితే వీరు విధుల్లో చేరి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా.. ఈ వార్డు ఆఫీసర్లు ఉంటారన్న విషయం కూడా ఎవరికీ తెలియకుండా ఉంది. జిల్లాకేంద్రమైన జగిత్యాల బల్దియాలో 48వార్డులు ఉన్నాయి. ఇక్కడకు కొత్తగా 31 మంది వార్డు ఆఫీసర్లు వచ్చారు. గతంలో వీఆర్వోలుగా ఉన్న వారిలో కొందరిని వార్డు ఆఫీసర్లుగా నియమించారు. వారు విధుల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే వార్డులో వార్డు ఆఫీసర్ ఉన్నారని, ముఖ్యమైన పనులు వారు చూసుకుంటారన్న అవగాహన మాత్రం ప్రజల్లో లేకుండా పోయింది. ప్రజలు కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తే.. వారు ఎక్కడుంటారో..? ఏం చేస్తారో..? కూడా తెలియడం లేదు. కనీసం మొబైల్ నంబర్ కూడా అందుబాటులో ఉండడంలేదంటే అతిశయోక్తికాదు. చోటు కరువు.. జగిత్యాల మున్సిపాలిటీలో ఇప్పటివరకు వార్డు ఆఫీసర్లకు చోటు కల్పించలేదు. ఇటీవల మున్సిపల్ కార్యాలయం పక్కనున్న కాంప్లెక్స్లో వీరికి ఆఫీసు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రూ.5 లక్షలతో టెండర్లను ఆహ్వానించారు. అందులో ఫర్నీచర్తోపాటు రెనోవేషన్ చేయాల్సి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పటివరకు పనులు మొదలుపెట్టలేదు. ఫలితంగా వార్డు ఆఫీసర్లకు చోటు కరువైంది. కార్యాలయానికి ఎవరు ఎప్పుడు వచ్చి వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. వారిదే కీలకపాత్ర ప్రస్తుతం మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పారిశుధ్య ప్రణాళిక అమలు, ఇంటింటా చెత్త సేకరణ, వ్యర్థాలను వేరు చేయడం, మురికికాలువలు, ప్రజామరుగుదొడ్లను శుభ్రం చేయించేలా చూడాలి. ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇవి జిల్లాలో మచ్చుకై నా కనిపించడం లేదు. నీటి సరఫరా, వీధి దీపాల పర్యవేక్షణ, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు, పట్టణ పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాలను చూడాల్సి ఉంటుంది. ఇంటి పన్ను, ఫీజులు, చార్జీలు అంచనా వేస్తూ జాబితాలు రూపొందించాల్సి ఉంటుంది. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ వీరికంటూ ఓ కార్యాలయం లేకపోవడంతో సమస్యగా మారింది. రోజువారి కార్యక్రమాలను పర్యవేక్షించే వీరికి ఓ ఆఫీస్ కేటాయిస్తే బాగుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెల్ఫోన్ నంబరు ఇస్తే ప్రజలు ఏమైనా సమస్యలుంటే చెప్పుకునే అవకాశం ఉంటుందంటున్నారు. కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రజలు జగిత్యాల బల్దియాలో 48 వార్డులు ఉన్నాయి. వివిధ సమస్యలపై ప్రజలు కార్యాలయానికి వస్తుంటారు. ఏ వార్డు అని అధికారులు తెలుసుకుని సదరు వార్డు ఆఫీసర్ను కలవాలని సూచిస్తున్నారు. కానీ.. వారు ఎక్కడుంటారో మాత్రం చెప్పడం లేదు. ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కార్యాలయంలో వారికంటూ ఓ గది కేటాయించి బోర్డు ఏర్పాటుతోపాటు సెల్నంబర్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. కొంతమంది సిబ్బంది రాకపోకలు సాగిస్తూ సకాలంలో కార్యాలయానికి రావడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రజాప్రతినిధులు చొరవ చూపాలిఇప్పటికే మున్సిపాలిటీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతోపాటు, ఎక్కడా డ్రైనేజీలుగానీ, నాలాలుగానీ శుభ్రంగా లేవనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వార్డు ఆఫీసర్లు కీలకంగా వ్యవహరిస్తే పారిశుధ్యం కొంత మెరుగు పడే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పారిశుధ్యం మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కౌన్సిలర్లు ఉండటంతో ప్రజలు ఏ సమస్యనైనా ఉంటే వారి దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ పాలన ఉండటంతో ఈ వార్డు ఆపీసర్లే వారికి కీలకంగా మారారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వారికంటూ ఓ చోటు ఏర్పాటు చేసి ప్రజల్లో ప్రతి వార్డుకు ఒక వార్డు ఆఫీసర్ ఉంటారన్న అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.వార్డు ఆఫీసర్లకు మౌళిక వసతులు ఏర్పాటు చేసేందుకు టెండర్లు వేయడం జరిగింది. రూ.5 లక్షలతో ఫర్నీచర్తో పాటు రెనోవేషన్ చేయాల్సి ఉంటుంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్తో పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.– చరణ్, ఏఈ -
హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయవాదులు
జగిత్యాలజోన్: హైకోర్టు జడ్జి, జిల్లా పోర్టుపోలియో జడ్జి వై.రేణుకను సోమవారం జగిత్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు కలిశారు. జిల్లాలో ఫ్యామిలీ కోర్టు ఏర్పాటు, క్యాంటీన్కు శంకుస్థాపన, ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏర్పాటు, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జి నియామకం, వివిధ కోర్టులో సరిపడా సిబ్బంది నియామకం వంటి సమస్యలపై రేణుకకు వినతిపత్రం అందించారు. అనంతరం జిల్లాకు చెందిన హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి మ ర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్కుమార్, బార్ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్రనాథ్ పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం
కథలాపూర్: ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని భూషణరావుపేటలో 41 మందికి రూ.15.70 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. చింతకుంట జెడ్పీ హైస్కూల్లో రూ.20లక్షలతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను ప్రారంభించారు. రాళ్లవాగు ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోకుంటే తాము పూర్తి చేయిస్తున్నామన్నారు. డీఈవో రాము, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, చెదలు సత్యనారాయణ, వాకిటి రాజారెడ్డి, గడ్డం చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్జీటీలకు పదోన్నతులు ఇవ్వాలి బీఎడ్ అర్హత ఉన్న ఎస్జీటీలకు ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించాలని వివిఽ ద ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. వీరిలో మామిడిపెల్లి శ్రీనివాస్రెడ్డి, కృష్ణారావు, అల్లె పరమేశ్వర్, బద్రకంటి వేణుగోపాల్, విష్ణు, అరుణ, రాజకళ ఉన్నారు. -
జగిత్యాల
27.0/19.07గరిష్టం/కనిష్టంచెరుకు రైతుకు రవాణా భారం జిల్లాలో ఏకై క ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని రైతులు ఏళ్ల తరబడి కోరుతు న్నా.. పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొనసాగుతాయి. శివాలయాల్లో శ్రావణ సందడిధర్మపురి: శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. శ్రీరామలింగేశ్వర, అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామికి భక్తులు మొక్కులు చెల్లించారు. మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025 -
పట్టాలిచ్చి ఆదుకోండి
మాది వెల్గటూర్ మండలం చెగ్యాం. గ్రామ శివారులోని సర్వే నంబర్ 289, 341, 344లోని 54.23 ఎకరాల భూమిని 175మందిమి 15ళ్లుగా కాస్తు చేసుకుంటున్నాం. ఆ భూమికి పట్టా ఇప్పించాలని అర్జీ పెట్టుకున్నాం. అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే పూర్తిచేసిన తహసీల్దార్ పెండింగ్లో పెట్టారు. సర్వే నివేదిక ప్రకారం ఆ భూమికి అసైన్డ్ పట్టాలు ఇప్పించి ఆదుకోండి. – చెగ్యాం గ్రామస్తులు, వెల్గటూర్ సెల్టవర్ నిలిపేయండి మాకు ఎలాంటి సమాచార ఇవ్వకుండా జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మిస్తున్నారు. రేడియషన్తో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. టవర్ నిర్మాణం ఆపాలని పలుసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదు. టవర్తోపాటు టైర్ గ్రూపింగ్ పరిశ్రమను జనావాసాల దూరంగా తరలించండి. – భాగ్యనగర్ కాలనీవాసులు -
ఇంట్లో జారిపడి వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని గంజ్రోడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అతిక్ (38) తన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందాడు. అతిక్ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో కాలుజారి పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిగురుమామిడి: మండలంలోని గాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో పని చేస్తు న్న జుట్టు స్వామి విషజ్వ రంతో సోమవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. స్వామి వారంరోజులు కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందాడు. అయినా జ్వరం తగ్గలేదని తెలిపారు. జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రాజశేఖర్ (35) అనే వ్యక్తి ఒంటరితనం భరించలేక మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రాజశేఖర్ భార్య మూడు నెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి రాజశేఖర్ ఒంటరితనంతో బాధపడుతూ తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి బందెల గంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. రెండు ఆలయాల్లో చోరీవీణవంక: మండలంలోని కోర్కల్ గ్రామంలో ఆదివారం రాత్రి రెండు ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామ శివారులోని రేణుక ఎల్లమ్మ ,పెద్దమ్మ తల్లి ఆలయాల్లో రెండున్నర తులాల బంగారం, 59తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. గ్రామస్తుడు పూదరి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. జగిత్యాలజోన్: సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ.. వాహనాన్ని అజాగ్రత్తగా.. నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి సోమవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్కు చెందిన 12 మంది మహిళలు రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి ఓ మినీటాక్సీలో వెళ్లారు. మోరపల్లి శివారులో డ్రైవర్ పరాంకుశంవంశీకృష్ణ సెల్ఫోన్ మాట్లాడుతూ.. వాహనాన్ని అజాగ్రత్తగా నడిపి రోడ్డుపక్కనున్న కల్వర్టును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ఉన్న తోట్ల గంగవ్వ అక్కడికక్కడే చనిపోయింది. మిగతావారు గాయపడ్డారు. దీనిపై బాధితురాలు రాధ ఫిర్యాదు మేరకు అప్పటి జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేశారు. సీఐ కృష్ణకుమార్ దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్కుమార్, కె. నరేశ్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో వంశీకృష్ణకు రెండేళ్ల జైలు, జరిమానా విధించారు. -
చెరుకు రైతుకు రవాణా భారం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఏకై క ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని రైతులు ఏళ్ల తరబడి కోరుతున్నా.. పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నా.. చక్కెర ఫ్యాక్టరీ మాత్రం ప్రారంభం కావడం లేదన్నది ఇక్కడి రైతుల వేదన. దీంతో చెరుకు పంటపై మమకారం చంపుకోలేక.. రైతులు ఇతర జిల్లాలో ఉన్న ప్రైవేట్ చెరుకు ఫ్యాక్టరీతో ఒప్పందాలు చేసుకొని చెరుకును సాగు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీ సైతం చెరుకు రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించలేక నిర్లక్ష్యం చూపుతోంది. ఈ నేపథ్యంలో ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని, అప్పటివరకు చెరుకు రైతులపై పడే రవాణా భారాన్ని ప్రభుత్వం భరించాలని చెరుకు రైతులు ఇటీవల జగిత్యాలకు వచ్చిన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్కుమార్, వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందించారు. 1,500 ఎకరాల్లో సాగు జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో.. ప్రస్తుతం చెరుకు పంటను దాదాపు 1,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఒకప్పుడు 10వేల ఎకరాలకు పైగా చెరుకు పంట ఉన్నా.. ఫ్యాక్టరీ మూసేయడంతో విస్తీర్ణం తగ్గిపోయింది. గతంలో జిల్లాలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ ప్రభుత్వానిది కావడంతో.. పంట సాగు చేసే రైతులకు ఎరువులు, విత్తనం, కటింగ్, రవాణా వంటి వాటిపై ప్రోత్సాహకాలు అందించేది. ఇప్పుడు జిల్లాలో చెరుకు సాగు చేసే రైతులు కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రైవేట్ షుగర్ ప్యాక్టరీకి చెరుకును పంపిస్తుండడంతో.. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా, లేనిపోని నిబంధనలు పెట్టి జిల్లా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రవాణా భారం.. ప్రైవేట్ ఫ్యాక్టరీ ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకపోయినా.. చెరుకు పంటపై ఆసక్తితో చెరుకును సాగు చేసిన రైతులకు రవాణా భారం పెద్ద సమస్యగా మారింది. జిల్లా నుంచి కామారెడ్డి చక్కెర ఫ్యాక్టరీ కనీసం 150 కి.మీ. వరకు ఉంటుంది. గతంలో ముత్యంపేట ఫ్యాక్టరీ వారు 15 కి.మీ. వ్యాసార్థంలో రవాణా భారం వేసేవారు కాదు. 15 కి.మీ. తర్వాత ఉన్న రైతులు ఎంతో కొంత మొత్తం చెల్లించేవారు. ఇప్పుడు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చెరుకు సాగు చేసేవారు కామారెడ్డికి లారీల్లో చెరుకు తరలించడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం రైతులు చెరుకును కామారెడ్డి ప్రైవేట్ ఫ్యాక్టరీకి తరలించేందుకు టన్నుకు దాదాపు రూ.700 వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇలా దాదాపు జిల్లా చెరుకు రైతులు రవాణా పేరిట రూ.4.50కోట్ల వరకు నష్టపోతున్నారు. దిగుబడులు ఘనం.. వచ్చేది స్వల్పం ఇక్కడి చెరుకు రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ప్రస్తుతం చెరుకు టన్ను ధర రూ.3,470 వరకు ఉండగా, అందులో చెరుకు కటింగ్ కోసం కూలీలకు టన్నుకు రూ.860, రవాణా కోసం టన్నుకు రూ.700 వరకు ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. పంటకు అవసరమైన రసాయన ఎరువులు, కలుపు వంటి వాటి కోసం మరింత ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇతర ప్రాంతాలకు చెరుకు తరలించడం వల్ల రైతులకు పెద్దగా మిగిలింది ఏమీ లేదు. చెరుకు రైతులపై పడే రవాణా భారాన్ని ప్రభుత్వం భరించాలి. చెరుకు పండిస్తే మాకు ఆదాయం కాకుండా ఖర్చులు మిగులుతున్నాయి. త్వరగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించి చెరుకు రైతులకు అండగా ఉండాలి. – మామిడి మహేందర్రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి చెరుకు పంటపై మమకారం చంపుకోలేక సాగు చేస్తున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభం కాకపోవడంతో కామారెడ్డికి తరలించాల్సి వస్తోంది. రవాణా భారం, కటింగ్ వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. – పీసు రాజేందర్రెడ్డి, మూడుబొమ్మల మేడిపల్లి, మెట్పల్లి ఫ్యాక్టరీ ప్రారంభం కాక అదనపు ఖర్చులు టన్నుకు రూ.700 వరకు భారం ఆదుకోవాలని రాష్ట్ర మంత్రులకు విన్నపాలు -
పోరాటయోధుడు పాపన్న గౌడ్
జగిత్యాలటౌన్: సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసిన సర్వాయి పాపన్న మహోన్నత వీరుడని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ కొనియాడారు. పాపన్న 375వ జయంతి సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని గొల్లపల్లి చౌరస్తా వద్ద గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాపన్న ఔన్నత్యాన్ని చాటేలా గొల్లపల్లి బైపాస్చౌరస్తాకు సర్వాయి పాపన్న కూడలిగా నామకరణం చేశామన్నారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, గోపా జిల్లా అధ్యక్షుడు దుర్గపు రవీందర్గౌడ్ పాల్గొన్నారు. పోరాట యోధుడు పాపన్న వీరోచిత పోరాటానికి, సమానత్వానికి ప్రతీక పాపన్న అని జిల్లా అదనపు కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్లో పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఆర్డీవో మధుసూదన్గౌడ్, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారులు సునీత, రాజ్కుమార్, మెప్మా పీడీ దుర్గపు శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. హమాలీ కార్మికులకు అండగా ఉంటా హమాలీ కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూలీలు లేబర్ కార్డు తీసుకోవాలన్నారు. జాబితాపూర్లో భారీ గోదాం నిర్మిస్తామని, తద్వారా హమాలీలకు ఉపాధి పెరుగుతుందన్నారు. హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొమురయ్య పాల్గొన్నారు. టెక్నికల్ సెంటర్తో ఉపాధి జగిత్యాల: అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్తో ఉపాధి అవకాశాలుంటాయని ఎమ్మెల్యే అన్నారు. టెక్నికల్ సెంటర్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఏటీసీలో ఫస్ట్, సెకెండ్ ఫేస్లో మిగిలిన సీట్లలో విద్యార్థులు నేరుగా చేరవచ్చన్నారు. -
ఎస్సారెస్పీ 39 గేట్ల ఎత్తివేత
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రం 39 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 1,25,400 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 2,26,867 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరదకాలువకు 18వేల క్యూసెక్కులు, కాకతీయ కాల్వకు 4700 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 73.370 టీఎంసీలకు చేరింది. బాగున్నారా సార్..మల్యాల: ‘సార్ బాగున్నారా.. అంటూ మాజీమంత్రి జీవన్రెడ్డిని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పలుకరించారు. మండలంలోని ముత్యంపేటకు సంత లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించేందుకు సుంకె రవి శంకర్ వెళ్లారు. అదే సమయంలో మాజీమంత్రి జీవన్రెడ్డి లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించి వస్తున్నారు. ఇద్దరూ ఎదురుపడగా.. ‘బాగున్నారా సార్..’ అంటూ రవిశంకర్ జీవన్రెడ్డిని పలుకరించారు. కరచాలనం చేశారు. జీవన్రెడ్డి చిరునవ్వుతో అదేస్థాయిలో స్పందించారు. ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. భద్రత కోసమే గణేశ్ విగ్రహాలకు ఆన్లైన్జగిత్యాలక్రైం: గణేశ్ మంటపాల వద్ద భద్రత కోసమే విగ్రహాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు కోరుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. మంటపాల నిర్వాహకులు పోలీస్ రూపొందించిన http://policeportal.tspo lice.gov.in/index.htm పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మండపం సమాచారం కోసం మాత్రమే ఈ పోర్టల్ రూపొందించామని, బందోబస్తు చేయడం పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు. గోదావరి ఉధృతిని పరిశీలించిన అధికారులుఇబ్రహీంపట్నం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ నిండింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి రండుల లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీటి ప్రవాహాన్ని ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్, ఎర్దండి వద్ద తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో ఎండీ.సలీమ్, ఎస్సై అనిల్ పరిశీలించారు. భక్తులు, చేపలుపట్టేవారు, గొర్రెలకాపరులు గోదావరి వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. గోదావరి ప్రవాహం పెరిగితే తీరప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి హైస్కూల్లో పునారావాసం కల్పించేందుకు వసతులు పరిశీ లించారు. పంచాయతీ కార్యదర్శి మనోజ్, కారోబార్ రత్నం, తదితరులు ఉన్నారు. జిల్లాలో 11.2 మి.మీ వర్షంజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సోమవారం సగటున 11.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా వెల్గటూర్లో 52.1 మి.మీ, అత్యల్పంగా మల్యాలలో 0.4 మి.మీ కురిసింది. ఇబ్ర హీంపట్నంలో 9 మి.మీ, మల్లాపూర్లో 8.9, రాయికల్లో 7, బీర్పూర్లో 45.6, సారంగా పూర్లో 14, ధర్మపురిలో 7.9, బుగ్గారంలో 21, జగిత్యాల రూరల్లో 5.4, జగిత్యాలలో 5.3, మేడిపల్లిలో 3.5, కోరుట్లలో 3, మెట్పల్లిలో 1.9, కథలాపూర్లో 1.6, కొడిమ్యాలలో 1.5, గొల్లపల్లిలో 7.7, ఎండపల్లిలో 27.4, భీమారంలో 0.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు కల్వకోట విద్యార్థులుమేడిపల్లి: మండలంలోని కల్వకోట జెడ్పీ పాఠశాల విద్యార్థులు నోమన్, వసుధ అండర్–15 విభాగంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. వీరు ఈనెల 19న రంగా రెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పా ల్గొంటారని ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ తెలిపారు. విద్యార్థులను పీఈటీ సాగర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
బహిరంగ ప్రదేశంలో కోడె టికెట్లు ?
● ఉద్యోగుల తీరుపై అనుమానాలు వేములవాడ: రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కు అయిన కోడె టికెట్లు ఆలయం బయట ప్రదేశంలోకి రావడం కలకలం రేపాయి. కోడెమొక్కు చెల్లించే భక్తులు రూ.200 పెట్టి టికెట్ కొని కోడెతో ప్రదక్షిణ చేసి ప్రధాన ద్వారానికి ఎదురుగా కట్టేస్తారు. ఈక్రమంలో కోడె టికెట్లు పరిశీలించేందుకు రెండు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది కోడె టికెట్లు తీసుకుని చించివేస్తారు. అయితే ఆ చించివేసిన టికెట్లు సోమవారం ఆలయంలోని స్వామి వారి ఓపెన్స్లాబ్పై దర్శనమిచ్చాయి. ఇక్కడి ఎలా వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఉద్యోగులే రీసైక్లింగ్ చేస్తూ డబ్బులు దండుకునేందుకు ఇలా తెచ్చి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఈవో రాధాభాయి మాట్లాడుతూ గతంలో ఈ టికెట్లను ఓపెన్స్లాబ్పై వేసి ఉంటారని, ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బందిని విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక వివాదం..● ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా గ్రామస్తుల మధ్య వాగ్వాదం ● నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు ● విచారణ చేపట్టిన మెట్పల్లి డీఎస్పీ రాములు మెట్పల్లి రూరల్: ఇసుక విషయమై జరిగిన వివాదంపై మెట్పల్లి పోలీసులు నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఈనెల 10న అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా రెండు రోజులైనా అదుపులోకి రాలేదు. యార్డులో గన్నీసంచులు కాలుతుండగా వాటిపై ఇసుక పోసి మంటలు ఆర్పాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆత్మకూర్ పెద్దవాగు నుంచి ఈనెల 12న ట్రాక్టర్లలో ఇసుక తరలించారు. ఆ సమయంలో పలువురు ట్రాక్టర్లను అడ్డుకుని వివాదం చేశారు. అక్కడే ఉన్న తనను కులం పేరుతో దూషిస్తూ దుర్భషలాడారని వీడీసీ చైర్మన్ రమేశ్ మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నలుగురిపై ఫిర్యాదు చేశాడు. దీంతో గ్రామానికి చెందిన తాటిపెల్లి సురేశ్రెడ్డి, తిప్పిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కేశిరెడ్డి నవీన్రెడ్డి, శోభపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు మెట్పల్లి డీఎస్పీ రాములు సోమవారం ఆత్మకూర్కు వెళ్లి విచారణ జరిపారు. ఆయన వెంట మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ ఉన్నారు. నిండుకుండలా ఎగువమా‘నీరు’గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు నిండుకుండలా మా రింది. ఎగువ ప్రాంతాలైన కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వా గుల ద్వారా వరద నీరు జలాశయంలోకి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం రెండు టీఎంసీలు(31అడుగులు) కాగా.. ప్రస్తుతం 1.61టీఎంసీలు (29అడుగులు) నీటి మట్టం ఉంది. దాదాపు 1,080 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇదే వరద కొనసాగితే ఒకటి, రెండు రోజుల్లో ప్రాజెక్టు పరవళ్లు తొక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరీవాహక వాగు ప్రాంత రైతులు, పశువుల, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ మారుతిరెడ్డి సూచించారు. వాగుల వద్దకు చేపల వేటకు ఎవరు వెళ్లవద్దని హెచ్చరించారు. -
రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు జగిత్యాల: వానాకాలం పంటలకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్లతో మాట్లాడారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ లత పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని వివరించారు. సమయపాలన తప్పనిసరిధర్మపురి: మండలంలోని నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సోమవారం డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ సందర్శించారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు ఆవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇంటింటా తిరుగుతూ జ్వరాలతో బాదపడుతున్న వారి వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. సీహెచ్వో శ్రీనివాస్, సూపర్వైజర్లు వెంకట్, సులోచన, శోభన్బాబు తదితరులున్నారు. -
వర్షానికి కూలిన రెండిళ్లు
కోరుట్ల: ‘వేకువజాము.. సుమారు నాలుగవుతోంది. ఒక్కసారిగా డబ్మని చప్పుడు వచ్చింది. లేచి చూస్తే చిమ్మ చీకటి.. సెల్ఫోన్ లైట్తో చూస్తే పైక ప్పు రేకులు కిందికి వంగి ఉన్నాయి. పక్కింటి గోడ కూలి మాఇంటి గోడపై పడింది. మా ఇంటి గోడ కూలి బెడ్పక్కనే పడింది. వంగిన రేకులు, పడిపోయిన గోడ శిథిలాలను తప్పించుకుని నా భార్య, ఇద్దరు చిన్నపిల్లలం బయటపడ్డాం..’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు..కోరుట్ల కాల్వగడ్డ సమీపంలోని బెండపల్లికి చెందిన లతీఫ్, ఫిరోజ్ కుటుంబసభ్యులు. కూలిపోయిన రెండిళ్లు నాలుగు రోజులుగా కురుస్తున వర్షాలకు కాల్వగడ్డ సమీపంలోని లతీఫ్కు చెందిన ఇంటి మట్టిగోడ కూలింది. అది పక్కనే ఉన్న అమీరోద్దీన్, ఫిరోజ్ ఇంటి గోడపై పడింది. ఫిరోజ్ ఇంటి గోడ కూలి బెడ్రూంలో పడిపోయింది. ఆ సమయంలో రూమ్లో ఫిరోజ్ భార్య, ఆరేళ్ల కుమారుడు, ఆర్నెళ్ల కూతురు నిద్రిస్తున్నారు. గోడ కూలిన వెంటనే బెడ్రూంపైకి వంగిన రేకులు, కూలిన శిథిలాలను తొలగించి నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. లతీఫ్, ఫిరోజ్ ఇంటికి ఆనుకుని ఉన్న అమీరోద్దీన్ ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జువ్వాడి ఆర్థిక సహాయం భారీ వర్షాలకు ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వపరంగా రూ.1.20లక్షల చొప్పున సాయం అందిస్తామని కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు తెలిపారు. కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. తక్షణ సాయం కింద బాధితులకు రూ.5 వేలు అందించారు. కలెక్టర్తో మాట్లాడి బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో జివాకర్రెడ్డి, తహసీల్దార్ కృష్ణచైతన్యకు సూచించారు. బాధితులకు పునరావాసం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్కు తెలిపారు. ఆయనవెంట కాంగ్రెస్ నాయకులు అన్నం అనిల్, తిరుమల గంగాధర్, పుప్పాల ప్రభాకర్, ఫసియోద్దీన్, భూంరెడ్డి ఉన్నారు. -
చిత్రం.. జ్ఞాపకాల పత్రం
● ఫొటోగ్రఫీ డే గురించి ఫ్రెంచ్ దేశస్తుడైన డాగురే 1839లో మొదటిసారి ఫొటోగ్రాఫీక్ ప్రాసెస్ కనిపెట్టి అదే సంవత్సరం ఆగష్టు 19న ప్రపంచానికి పరిచయం చేశాడు. సిల్వర్ అయొడైడ్ రసాయనంతో చిత్రానికి శాశ్వతత్వం కల్పించవచ్చని ప్రతిపాదించాడు. 1842 నుంచి 1880 మధ్య కాలంలో ఇండియలో ఫొటోగ్రఫీ పరిశ్రమ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో మొదటి పోర్ట్రయిట్ స్టూడియోను దీన్ దయాళ్ కెన్నడీ అనే మహిళ స్థాపించింది. 1960 నాటికి స్టూడియో ఫొటోగ్రఫీ, 1980 నాటికి కంప్యూటర్తో కలర్ ఫొటోగ్రఫీ విస్తరించింది. రాజా త్రయంబక్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి సారి 1957లో ఫొటోగ్రఫీ సొసైటీ ప్రారంభమైంది. ● ఉమ్మడి జిల్లా ప్రస్థానం 1940లో ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్లో మొదటి ఫొటోస్టూడియో నెలకొల్పారు. ప్రతిష్టాత్మక ఫెలోషిఫ్ ఆఫ్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ(ఇంగ్లాండ్) సాధించిన ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకై క వ్యక్తి కోరుట్లకు చెందిన ఫొటోగ్రాఫర్ బండి రాజన్బాబు. 1987లో నగ్న చిత్రాలపై థీసిస్ సమర్పించి రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ ఫెలోషిప్ పొందారు. జగిత్యాలకు చెందిన అల్లె శ్రీకాంత్, కోరుట్లకు చెందిన బండి వెంకటరమణ, కరీంనగర్కు చెందిన బాబురెడ్డి, వేణు, రాజు, సంపత్కుమార్, వాసు, గంగాధర్, సదానందం, ఆత్మారాం, వేములవాడకు చెందిన రాజయ్య, జగిత్యాలకు చెందిన రామ్మోహన్, సతీష్, సిరిసిల్లలో ఎం.సి. శేఖర్, బోడ రవీందర్, కోడం దేవేందర్, వంకాయల శ్రీకాంత్, కోరుట్లకు చెందిన నాగరాజు, రాజేశం, శేఖర్, మహేందర్, మారుతి, మెట్పల్లి రాము, మల్యాల శ్రీనులు, ఎల్లారెడ్డిపేటకు చెందిన ప్రభాకర్రెడ్డి, సిరిసిల్లకు చెందిన శంకర్ మరెందరో ఫొటోగ్రఫీలో సృజనాత్మకతను జోడించి రాష్ట్ర స్థాయి అవార్డులు పొందారు. ● ప్రీ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఏ ఫంక్షన్ జరిగిన, ఎక్కడికి వెళ్లిన సెల్ఫోన్లతోనే ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ ఫొటోగ్రఫీపై కొత్తగా జంటలు ఉత్సాహం చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా తమకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ప్రీ వెడ్డింగ్ ఫొటోలతోపాటు పెళ్లి వేడుకలను ఫొటోగ్రాఫర్లతో తీయించుకుంటున్నారు. చరితకు చెరిగిపోని సాక్ష్యం నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం విద్యానగర్(కరీంనగర్)/సిరిసిల్ల: ఫొటో.. చెదిరిపోని జ్ఞాపకం. గతించిన కాలాన్ని కళ్ల ముందుంచే సాక్ష్యం. మదిలే మెదిలే భావాలను కళ్ల ముందు నిలిపే ఛాయాచిత్రం. ఫొటోగ్రఫీకి సృజనాత్మకత తోడైతే అద్భుత చిత్రాలు కళ్లముందుంటాయి. మదిని పులకింపజేసి.. మనుసును తట్టిలేపి.. మధురమైన అనుభూతులను పదిలం చేసేది ఫొటో. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఫొటోగ్రఫీలో వస్తున్న మార్పులు.. జిల్లా వాసుల ప్రతిభపై ప్రత్యేక కథనం. 1961 ప్రాంతంలో కరీంనగర్లో ఫొటో స్టూడియోలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్లోని క్లాక్టవర్ వద్ద ఏవీఎం ఫొటో స్టూడియో, తిలక్రోడ్లో అజంతా ఫొటో స్టూడియోను ప్రారంభించారు. కరీంనగర్కు చెందిన ఏలేటి వేణుమాధర్రెడ్డి 1961 జనవరి 1న ఆయన పేరుతో ఏవీఎం స్టూడియో ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత గురుదత్త నిర్మాత సారథ్యంలో ముంబైలో రూపొందిన మొదటి స్కొప్ సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేశారు. బ్లాక్ అండ్ వైట్ మాన్యువల్ నుంచి 35 ఎంఎం మినియేచర్ ఫిలిం, కలర్ ప్రాసెసింగ్ కంప్యూటర్ వరకు కొనసాగారు. ఆయన వాడిన 1945 నాటి రోలిఫ్లెక్స్, ఎగ్జాక్ట, మన్య, కేబినేట్, ఫుల్సైజ్ల నెగెటివ్ల బాడీ కెమెరాలు ఇప్పటికి వాళ్ల ఇంట్లో భద్రంగా ఉన్నాయి. ఆయన నలుగురు కొడుకులు ఈ రంగంలోనే రాణిస్తున్నారు. నాడు రీళ్లతో ఫొటోలు తీసేవాళ్లం, సాంకేతిక ప్రగతిలో నేడు డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. సెల్ఫోన్ కెమెరాలు, ఇంటింటికీ కెమెరాలు వచ్చినప్పటికీ ఫొటో స్టూడియోలకు ఆదరణ తగ్గలేదు. రీళ్ల పద్ధతి పోయి, డిజిటల్ కెమెరాలు, ప్రింటింగ్ యంత్రాలు ప్రవేశించడంతో ఈ ప్రక్రియ పూర్తిగా సులభతరమైంది. – ఆవుల నరేశ్, ఫొటోగ్రాఫర్, జ్యోతినగర్, కరీంనగర్ మా చిన్నప్పుడు ఫొటో అంటే ఓ క్రేజ్. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫొటోగ్రాఫర్ వచ్చి ఫొటోలు తీయడం, స్టూడియోకి వెళ్లి ఫొటోలు దిగడం చాలా కొత్తగా అనిపించేది. ఇప్పుడు సెల్ఫోన్లో అన్ని ఫంక్షన్లు, అన్ని సందర్భాల్లో ఫొటోలు తీసుకోవడం, మెమొరీ కార్డుల్లో భద్రపరచుకుంటున్నాం. – పల్లెర్ల శ్రీనివాస్, అశోక్నగర్, కరీంనగర్ సిరిసిల్లకు చెందిన ఫొటోగ్రాఫర్ మేర్గు చంద్రశేఖర్(ఎంసీ శేఖర్)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దక్షిణాఫ్రికా పర్యాటక గిరిజనశాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిలా ఆర్ట్ ఆఫ్ ఫొటోగ్రఫీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచస్థాయి పోటీల్లో శేఖర్ తీసిన ‘హార్టీస్మైల్’ బంగారు పతకం సాధించింది. అంతకుముందే శేఖర్ దశాబ్దకాలంగా గిరిజన జీవనశైలిపై, సామాజిక అంశాలపై ఫొటోలు తీసి పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సిగ్మా ఫొటోగ్రఫీ అకాడమీ స్థాపించారు. ఔత్సాహికులైన ఫొటోగ్రాఫర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల సాలర్జంగ్ మ్యూజియంలో రాష్ట్రస్థాయి ఫొటో వర్క్షాప్ నిర్వహించారు. ఎం.సీ.శేఖర్ తీసిన ఫొటోలకు 98 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్కు చెందిన దాసరి మల్లేశ్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకున్న మల్లేశ్ ఫొటోగ్రఫీలోని మెలకువలను నేర్చుకొని.. తీరక సమయంలో తన కళాభిరుచిని తీర్చుకుంటున్నారు. ఫొటో వర్క్షాప్లలో పాల్గొని అద్భుత ఫొటోలు తీసి బహుమతులు అందుకున్నారు. పల్లె ప్రజల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలపై తీసిన ఫొటోలకు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల జరిగిన జోనల్స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో ఫొటోగ్రఫీ విభాగంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చేతుల మీదుగా మూడో బహుమతి అందుకున్నారు. -
పాఠశాలల్లో ఏఐ
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ (ఏఐ) ద్వారా పాఠాలు బోధించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. హైటెక్ యుగంలో ఏఐ బోధన అందించాలన్న ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని 31 పాఠశాలలను గతేడాది ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ శిక్షణ, పాఠాలు చెప్పడంతో విద్యార్థులకు కోర్సుపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఏఐని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. త్వరలోనే అన్ని పాఠశాలలకు.. త్వరలోనే అన్ని పాఠశాలల్లో ఏఐ పాఠాలు మొదలు కానున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఒక పాఠ్యాంశంగా ఏఐని చేర్చారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఏఐ బుక్లెట్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ బుక్కులు అన్ని పాఠశాలలకు వచ్చాయి. దీనివల్ల ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలు పెరిగే అవకాశం ఉంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక స్థాయిలో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటిపై శిక్షణ కల్పిస్తున్నారు. కొత్తగా ఈ ఏఐ కోర్సును తీసుకురావడంతో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందనుంది. ఇప్పటికే జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ఈ ఏఐపై శిక్షణ కల్పించారు. రానున్నది అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీయే.. ప్రస్తుత హైటెక్ యుగంలో రానురాను ప్రతి ఒక్కరూ అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. విద్యార్థులకు అదేస్థాయిలో చదువు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు గూగుల్ ప్లేస్టోర్కు వెళ్లి GCO MTQI అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని దీని ద్వారా విద్యార్థులకు యాక్టివిటిస్ చేయించనున్నారు. ముఖ్యంగా డ్రా, ఏ స్కేర్ కోడింగ్ స్టెప్స్, క్లాస్ అండ్ షేప్స్ ఇతరత్రా అంశాలను దీని ద్వారా నేర్పించవచ్చు. విద్యార్థుల్లో ఈ అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ నైపుణ్యం పెరిగితే రానున్న కాలంలో ఎంతో ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలుంటాయి. అంతేకాక విద్యార్థుల్లో సృజనాత్మకత పెరగడంతోపాటు, కంప్యూటర్పై సైతం పట్టు ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు 31 పాఠశాలల్లో మాత్రమే విద్యార్థులకు అందిన అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ కోర్సు ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో ఈ కోర్సు అందనుంది. డిజిటల్ లర్నింగ్ పుస్తకాలు ఏఐకి సంబంధించి డిజిటల్ లర్నింగ్ పేరుతో ప్రభుత్వం పుస్తకాలను రూపొందించి పలు పాఠశాలలకు పంపించడం జరిగింది. ఇందులో ఏఐ కోడింగ్, డాటా సైన్స్, డిజైన్ థింకింగ్, డిజిటల్ సిటిజన్ అనే అంశాలతో దాదాపు 21 పాఠ్యాంశాలను ముద్రించినట్లు విద్యాధికారులు పేర్కొన్నారు. స్కూళ్లు 1,128 విద్యార్థులు 1,50,709 ఉపాధ్యాయులు 2,572 -
సాగు భళా.. బ్యాంకులు కళకళ
జగిత్యాల అగ్రికల్చర్: ఓవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే వరదకాలువ నీటితో చెరువులు, కుంటలకు జలకళ. మరోవైపు వ్యవసాయ బావులు, బోర్లలో పుష్కలమైన నీటి వనరులు. ఫలితంగా జిల్లాలో ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తి పెరుగుతోంది. ఆధునాతన పద్ధతుల్లో వ్యవసాయం.. మహిళా రైతుల్లో కష్టపడేతత్వం ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. కొందరు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లడం.. చాలామంది సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండడంతో జిల్లా ఆర్థికంగా ముందు వరసలోనే ఉంది. దీంతో ఈ ప్రాంతంలో బ్రాంచీలు ఏర్పాటు చేసేందుకు వివిధ బ్యాంకులు పోటీపడుతున్నాయి. 129 బ్యాంకుల బ్రాంచీలు మొన్నటివరకు జిల్లాలోని 20 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 60 నుంచి 70వరకు బ్రాంచీలు ఏర్పాటు చేశాయి. ఆర్థిక పరిపుష్టి నేపథ్యంలో మూడేళ్లలో 129కు పెంచాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 65బ్యాంకు శాఖలు, మండలస్థాయిలో(సెమిఅర్బన్) 36, అర్బన్ (పట్టణస్థాయి)లో 28 బ్యాంకు శాఖలు ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు 29, యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు 54, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు 30, సహకార బ్యాంకులు 16 శాఖలను ఏర్పాటు చేసి.. సేవలను కొనసాగిస్తున్నాయి. ఆయా బ్యాంకుల్లో దాదాపు 3 లక్షల మంది వరకు ఖాతాదారులు బ్యాంకు సేవలు వినియోగించుకుంటున్నారు. జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా.. సగటున మూడు గ్రామాలకో బ్యాంకు శాఖలు ఉన్నాయి. మూడు మండలాల్లో ఒక్కో శాఖే వ్యాపారపరంగా పోటీపడుతున్న బ్యాంకులు ఎక్కువగా అర్బన్, సెమిఅర్బన్ స్థాయిలోనే బ్యాంకు శాఖలను ఏర్పాటు చేస్తూ.. గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తున్నాయి. ఇప్పటికీ సారంగాపూర్, బుగ్గారం, బీర్పూర్ మండలాల్లో ఒక్కో బ్యాంకు శాఖ మాత్రమే ఉన్నాయి. చుట్టుపక్క గ్రామాల ప్రజలు బ్యాంకు సేవల కోసం ఆయా ప్రాంతాలకు వెళ్లిరావడం కష్టంగా ఉంది. మండలాల వారీగా బ్యాంకు శాఖలను పరిశీలిస్తే జగిత్యాల అర్బన్లో 36, మెట్పల్లిలో 15, కోరుట్లలో 16, రాయికల్లో 6, కథలాపూర్లో 6, వెల్గటూర్లో 6, ధర్మపురిలో 6, మేడిపల్లిలో 5, మల్లాపూర్లో 5, కొడిమ్యాలలో 5, మల్యాలలో 5, పెగడపల్లిలో 4, గొల్లపల్లిలో 4, ఇబ్రహీంపట్నంలో 4, జగిత్యాల రూరల్లో 3, సారంగాపూర్లో 1, బీర్పూర్లో 1, బుగ్గారంలో 1 బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి. డిపాజిట్ల సేకరణలోను ముందంజ రైతులు ఆర్థికంగా ఎదగడంతో బ్యాంకులు పోటీపడి డిపాజిట్లు సేకరించే పనిలో పడ్డాయి. 129 బ్రాంచ్ల ద్వారా 2020–21లో రూ.4,484.13 కోట్లు, 2021–22లో రూ.4,835.16 కోట్లు, 2022–23లో రూ.4,691.26 కోట్లు, 2023–24 (మార్చి 31 వరకు) రూ.5,524.58 కోట్లు డిపాజిట్లు సేకరించాయి. ఖాతాదారులకు అవసరమైన పంట రుణాలు, ధీర్ఘకాలిక రుణాలు, వ్యాపార రుణాలు అందించడంలోనూ బ్యాంకులు తమ పాత్ర పోషిస్తున్నాయి. 129 బ్రాంచ్ల ద్వారా 2021–22లో రూ.5,110.07 కోట్లు, 2022–23లో రూ.5,922.1 కోట్లు, 2023–24లో రూ.7,419.19 కోట్ల రుణాలు అందిస్తున్నాయి. ఖాతాదారులు బ్యాంకులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. రికవరీని 94 శాతం సాధిస్తున్నారు. -
పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం
జగిత్యాలరూరల్: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్, గుట్రాజ్పల్లి, అనంతారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. సంగంపల్లి, సోమన్పల్లి, అనంతారం, గుట్రాజ్పల్లి, తిమ్మాపూర్, ధర్మారంలో సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. డీఈఓ రాములు, తహసీల్దార్ అరుణ్కుమార్, ఎంపీడీవో రమాదేవి, ఎంఈఓ గాయత్రి, ఏఈ రాజమల్లయ్య, నాయకులు పాల్గొన్నారు. వరదకాలువకు నీటి విడుదలజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరదకాలువకు 10వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1,51,806 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 66.233 టీఎంసీల నీటినిల్వ ఉంది. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటున్నందున పూర్తిస్థాయిలో నిండితే ఏ సమయంలోనైనా గోదావరిలోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సారెస్పీ ఎస్ఇ శ్రీనివాస్రావు గుప్తా తెలిపారు. జగిత్యాలరూరల్: ఆరుగ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. అదివారం జగిత్యాలరూరల్ మండలం లక్ష్మిపూర్లో రైతులతో కలిసి మాట్లాడారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుచేయడంలో విఫలం కావడంతో ఇప్పుడు మాట మారుస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచారన్న చర్చ సాగుతోందని పేర్కొన్నారు. 20నెలల కాలంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు. తులం బంగారం ఊసేలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనందరావు, లక్ష్మన్, హరీష్, నరేశ్ పాల్గొన్నారు. జేఎన్టీయూలో నేడు ఓరియంటేషన్ డేకొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో సోమవారం ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.విశ్వనాథరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులకు ఆయా బ్రాంచ్ల హెచ్వోడీలు విద్యావిధానం, సదుపాయాలు, పరిశోధన అవకాశాలపై అవగాహన కల్పిస్తారని, ముఖ్య అతిథిగా ఎస్పీ అశోక్కుమార్ హాజరవుతున్నారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్, ఫస్టియర్ క్లాస్ రివ్యూ కమిటీ చైర్మన్ సురేష్ శ్రీపాద రానున్నారని తెలిపారు. వైస్ ఛాన్స్లర్ టి.కిషన్కుమార్రెడ్డి, కె.విజయ్కుమార్రెడ్డి, రిజిస్ట్రార్? కె.వెంకటేశ్వరరావు వర్చువల్గా మాట్లాడుతారని వివరించారు. -
కాంగ్రెస్ పాలనలోనే నిరుపేదలకు ఇళ్లు
జగిత్యాలరూరల్/సారంగాపూర్: కాంగ్రెస్ పాలనలోనే నిరుపేదలకు ఇళ్లు అందుతున్నాయని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టు గ్రామమైన జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్లో కడప లక్ష్మి, నరేశ్ నిర్మించుకున్న ఇంటిని ప్రారంభించారు. నియోజకవర్గంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎంపీటీసీ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ నవీన్ పాల్గొన్నారు. అంతకుముందు జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ శివారులో నిర్మించిన రాజా బహాదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిజాంకాలంలో వెనుకబడిన రెడ్డిలను ఆదుకునేందుకు వెంకట్రామిరెడ్డి హాస్టళ్లు ఏర్పాటు చేశారని కొనియాడారు. ఏడాదిలోనే నాలుగు లక్షల ఇళ్లు ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని లచ్చక్కపేటలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. నాయకులు రాంచంద్రారెడ్డి, సుధాకర్, శంకర్రెడ్డి, రాజిరెడ్డి, గోపాల్, రవి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
సేవలు పెరిగాయి
గతంతో పోల్చితే బ్యాంకు సేవలు బాగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పోటీ పడి శాఖలు ఏర్పాటు చేస్తున్నాయి. కొత్తకొత్త పథకాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని బ్యాంకు శా ఖల్లో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. – దుంపల రాజిరెడ్డి, పోరండ్ల ఏటా రైతులకు రూ.5వేల కోట్ల వరకు దీర్ఘకాలిక పంట రుణాలను అందిస్తున్నాం. ఇతర వ్యాపార వర్గాలకు, మహిళాస్వశక్తి సంఘాలకు కూడా విరివిగా రుణాలను అందిస్తున్నాం. ఇతర జిల్లాలతో పోల్చితే జిల్లాలో బ్యాంకులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి. – రాంకుమార్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్, జగిత్యాల -
మారుమోగిన హరినామం
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం పెద్దాపూర్ శివారు రాధాగోవర్ధన ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంకీర్తనలు, అభిషేకాలు, ప్రవచనాలు, మహాహారతి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వాహకులు నరహరిప్రభూజీ శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం, భగవంతుడి ప్రకటన ఉద్దేశం, ప్రవచనాలు ఇచ్చారు. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాదుల ఆవిర్భావ మహోత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి నందోత్సవం చేపట్టారు. -
ముదురుతున్న క్రిప్టో యాప్స్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ దందా పెరుగుతోంది. అనతికాలంలోనే రూ.కోట్ల లాభాలు అంటూ అమాయకులకు ఆశచూపి.. విదేశీ ప్రయాణాలు ఎరవేసి.. వారి నుంచి రూ.లక్షలు గుంజుతున్న యాప్ల సంఖ్య పెరిగిపోతోంది. మార్కెట్లో వీటిని నియంత్రించే మెకానిజం ఏదీ లేకపోవడంతో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా వీటి మధ్య ఆధిపత్య పోరు కూడా సాగుతోంది. ఇటీవల హైదరాబాద్లో నెక్ట్స్బిట్ అనే క్రిప్టో కరెన్సీగా చలామణి అవుతున్న ఓ యాప్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఈ విషయంలో రాచకొండ పోలీసులను అంతా అభినందించారు. అయితే.. ఈ అరెస్టు వెనుక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం పోలీసు యాక్షన్ అంతా నెక్ట్స్బిట్ వ్యతిరేక యాప్ వర్గం వాళ్లు చెప్పినట్లు సాగిందని జగిత్యాలలో ప్రచారం సాగుతోంది. అసలేం జరిగింది..? విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తమ కంటే అధిక వ్యాపారం చేస్తున్నాడన్న కోపంతో వ్యతిరేక యాప్ వారే.. హిమాన్షు అరెస్టులో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో క్రిప్టో కరెన్సీ పేరిట అనేక యాప్లు నడుస్తున్నా.. ఎలాంటి ఫిర్యాదూ లేకుండా విశ్వసనీయ సమాచారంతో అరెస్టు చేసింది ఈ ఒక్క కేసులోనే కావడం గమనార్హం. ఇందుకోసం నెక్ట్స్బిట్ పోటీదారైన యాప్ స్వయంగా రంగంలోకి దిగింది. నెక్ట్స్బిట్ యాప్కు సంబంధించిన కొందరు బాధితులను వెంటేసుకుని రాచకొండలోని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. వీరిచ్చిన సమాచారంతోనే పోలీసులు ఓ హోటల్లో తమ యాప్ను ప్రమోట్ చేసుకుంటున్న హిమాన్షును అరెస్టు చేశారు. అతని అరెస్టు తతంగం అయ్యేవరకూ పోటీదారు యాప్ నిర్వాహకుల ప్రతినిధులు అక్కడే ఉండటం కొసమెరుపు. దాదాపు 400 మంది వద్ద రూ.19కోట్ల మేరకు మోసం చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ క్రిప్టోదందా సాగుతోంది. ఈ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నా.. కేసు పెట్టేందుకు పోలీసులు సహకరించడం లేదు. అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యవహారంపై ఇంటలిజెన్స్ ఎప్పటికపుడు డీజీపీకి.. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఒక్క రాచకొండ కమిషనరేట్లో మాత్రమే పోలీసులు స్వయంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడం గమనార్హం. ఈ మొత్తం ఆపరేషన్ వెనక నెక్ట్స్బిట్ పోటీదారులే ఉన్నారని జగిత్యాల వాసులు ఆరోపిస్తున్నారు. ఎలా చేస్తున్నారు..? వాస్తవానికి నెక్ట్స్బిట్ ప్రవేశించేందుకు ముందు.. డజనువరకు యాప్లు అక్కడ దందా చేస్తున్నాయి. వీరంతా జనాలను నమ్మించేందుకు ఒకరిని మించి మరొకరు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని యాప్లు జనాల నుంచి డబ్బులు వసూలు చేసి అదృశ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త యాప్లను అంత తేలిగ్గా నమ్మడం లేదు. అందుకే వీరి పెట్టుబడికి ఆస్తలను ష్యూరిటీగా ఇస్తున్నారు. ఉదాహరణకు వీరు ఐదు నుంచి పది మంది పెట్టుబడిదారులను ఒక గ్రూపుగా పోగుచేస్తారు. వీరికి నమ్మకం కలిగేలా రూ.20 లక్షలు కూడా చేయని భూమికి రూ.50 లక్షలు అని చెప్పి.. బాధితుల నుంచి అంతమేరకు డబ్బును క్రిప్టో పేరిట వసూలు చేస్తారు. ఆ డబ్బుకు సమాన విలువ అంటూ కొన్ని డాలర్లను వారి ఫోన్లో ఇన్స్టాల్ చేసిన యాప్కు పంపుతారు. ఇటు యాప్లో ఉన్న డాలర్లను, అటు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన భూములను ష్యూరిటీగా చూసుకుని మురిసిపోతున్నారు. తమ పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి రాదని, తాము కొన్న భూమికి అంత విలువలేదన్న విషయం వీరు గ్రహించే సరికి నిర్వాహకులు ఆ డబ్బును లక్కీభాస్కర్ సినిమాలో మాదిరిగా దేశం దాటిస్తున్నారు. ఇటీవల జీబీఆర్ క్రిప్టో కరెన్సీపేరిట రూ.95 కోట్లు, మెటాపేరిట రూ.100 కోట్లు, నెక్ట్స్బిట్ పేరిట రూ.19 కోట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలతో పోలిస్తే పెద్దపల్లిలో బాధితుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. -
దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
జగిత్యాలక్రైం: పలు దోపిడీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శనివారం రూరల్ పోలీస్స్టేషన్లో నిందితులను అరెస్ట్ చూపారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండంపల్లికి చెందిన వనం పాపయ్య, జగిత్యాల శివారు టీఆర్నగర్కు చెందిన వనం పాపయ్య, వనం రాము, దాసరి రవి, బాన్సువాడకు చెందిన జగన్నాథం కృష్ణ ముఠాగా ఏర్పడి కొద్దికాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జగిత్యాల, రాయికల్, మల్యాల, భూపాలపల్లి, భద్రాచలం ప్రాంతాల్లో 30కి పైగా దొంగతనాలు చేశారు. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రాయికల్ ఎస్సై సుధీర్రావు రాయికల్ శివారులోని లలితామాత దేవాలయం వద్ద శనివారం తనిఖీలు చేస్తుండగా.. సమీపంలోని మామిడితోటలో నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనాలు ఒప్పుకున్నారు. వారి నుంచి 12 తులాల బంగారం, రూ.15 వేలు, మూడు సెల్ఫోన్లు, నిందితులు ఉపయోగించిన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వనం పాపయ్య, వనం రాము, దాసరి రవిని రిమాండ్కు తరలించారు. జగన్నాథం కృష్ణ పరారీలో ఉన్నాడు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన రూరల్ సీఐ సుధాకర్, ఎస్సైలు సుధీర్రావు, సదాకర్, హెడ్కానిస్టేబుల్ గంగాధర్, సుమన్ను అభినందించారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ పరారీలో ఒకరు 12 తులాల బంగారం, కారు, రూ.15వేలు, 3 సెల్ఫోన్లు స్వాధీనం డీఎస్పీ రఘుచందర్ వెల్లడి -
కవిత్వంతో నిలిచిపోయింది..
ఇవీ బూర రాజేశ్వరీ కవితలు. ఒక్కో సందర్భంలో తన స్పందనను కవితారూపంలో స్పందించింది. ప్రస్తుతం జీవించి లేకున్నా.. ఆమె జ్ఞాపకాలు.. ఆశయాలు.. అక్షరాల రూపంలో కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె జీవితాన్ని 2023లో పాఠ్యాంశంగా చేర్చింది. ఈ సందర్భంగా రాజేశ్వరీ జీవితం.. కవిత్వంపై కథనం. సిరిసిల్ల: ఎదురీతే.. ఆమె కవితలు సిరిసిల్లకు చెందిన బూర అనసూర్య, సాంబయ్య దంపతులకు 1980లో రాజేశ్వరీ జన్మించింది. దివ్యాంగురాలు కావడంతో తల్లి అనసూర్య తోడుగా బడికి వెళ్లింది. అందరిలా చేతులతో కాకుండా కాళ్లతో అక్షరాలు దిద్దింది. స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. తరువాత పదో తరగతి, ఇంటర్ ప్రైవేటుగా పూర్తి చేసింది. రాజేశ్వరీ వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ తన వేదనను అక్షరీకరించింది. తాను నిలబడి చేయలేని పనులను, చెప్పలేని భావాలను కాళ్లతో వందలాది కవితల్ని రాసి వ్యక్తపరిచింది. వికసించిన రాజేశ్వరీ కవిత్వం రాజేశ్వరీ మాటలు సరిగా రాకపోయినా, కవిత్వాన్ని వారధిగా చేసుకొని సమాజంతో సంభాషించింది. సామాజిక సమస్యలపై తనదైన కోణంలో స్పందించింది. అమ్మే ఆమెకు ప్రపంచం కాబట్టి ‘ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. చిరునవ్వుకు చిరురూపం అమ్మ.. అనురాగానికి అపురూపం అమ్మ’ అంటూ సున్నితంగా అమ్మ మనసును చెప్పింది. ప్రపంచాన్ని తిరిగి చూడకున్నా ప్రపంచీకరణ వికృతరూపాన్ని తన మనసుతో చూసింది. మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న సందర్భాన్ని పట్టి చూపిస్తూ ‘అంతా సెల్మయం.. చివరికి మనుషులు మాయం’ అంటూ సెల్ఫోన్ మీద అద్భుతమైన కవిత్వాన్ని రాసింది. తెలుగులోనే కాదు.. ఇంగ్లిష్లో కూడా కవిత్వాన్ని రాసింది. 2022 డిసెంబరు 28న ఆమె ఊపిరి ఆగిపోయింది. వెతుక్కుంటూ వచ్చిన సుద్దాల అశోక్ తేజ బూర రాజేశ్వరీ కవిత్వాన్ని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ తన సొంత ఖర్చులతో ‘సిరిసిల్ల రాజేశ్వరీ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన సుద్దాల హన్మంతు జానకమ్మ అవార్డును 2014లో అందించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలు అందించింది. 2016 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ల్యాప్టాప్ అందించి ప్రోత్సహించింది. కాలుతోనే ల్యాప్టాప్ను ఆపరేట్ చేసింది. రాజేశ్వరీ కవితలతో పుస్తకం వచ్చింది. 1999 నుంచి రాజేశ్వరీ వరుసగా కవిత్వం రాసింది. తాను చనిపోయే వరకు 550కిపైగా కవితలు రాసింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతోపాటు మూడు జీవిత చరిత్రలనూ రాయడం విశేషం. మహారాష్ట్రలో పాఠ్యాంశం రాజేశ్వరీ సాహిత్యం, జీవనశైలిని గుర్తించిన మహారాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి, పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ ‘తెలుగు యువ భారతి’లో సిరిసిల్ల రాజేశ్వరీ గురించి ప్రచురించారు. 2021లో స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితాన్ని పాఠ్యాంశాన్ని చేశారు. ఆమె గురించి పుస్తకాన్ని ప్రచురించిన సుద్దాల అశోక్తేజ వద్ద సమాచారం సేకరించిన మహారాష్ట్ర అధికారులు పాఠ్యప్రణాళిక కమిటీ సభ్యులు డాక్టర్ తులసీ భారత్ భూషణ్, భమిడిపాటి శారద, టి.సుశీల, బి.విజయభాస్కర్రెడ్డి, కె.అనురాధ, ఎం.విద్యాబెనర్జీ, చలసాని లక్ష్మీప్రసాద్, కె.వై.కొండన్న, సీతా మహాలక్ష్మీ, మల్లేశం బేతి, శ్రీధర్ పెంబట్ల బృందం రాజేశ్వరీ జీవితం మొత్తాన్ని ఓ పాఠంగా రూపొందించారు. 12వ తరగతి తెలుగు విభాగంలో పాఠ్యాంశంగా ప్రచురించారు. ఇప్పుడు ఆమె లేకున్నా.. సాహిత్యం.. జీవితం మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ఉండడం విశేషం.తన పరిస్థితిపై.. ‘మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు.. నన్ను అనుక్షణం వెంటాడి వేధిస్తున్నాడు..’ తెలంగాణ ఉద్యమంపై.. ‘భగభగమని మండే సూర్యునివలె.. గలగలమని పారే సెలయేరువలె.. సాగుతోంది సాగుతోంది తెలంగాణ ఉద్యమం..’ మహారాష్ట్రలో పాఠ్యాంశమైన బూర రాజేశ్వరీ జీవితం 2021లో పాఠ్యాంశంగా చేర్చిన అక్కడి ప్రభుత్వం 2022లో చనిపోయిన కవయిత్రి -
క్రిమిసంహారక మందు తాగి యువకుడి బలవన్మరణం
వెల్గటూర్: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని ఎండపల్లిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన అంగడి రాజు (26)కు కొంతకాలంగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా గొడవ కాగా ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎండపల్లి శివారులో క్రిమి సంహారక మందు తాగాడు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. రాజు తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ధర్మపురి: మేకలను మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కెనాల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దోనూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోనూరుకు చెందిన మాసం చంద్రయ్య (59) ఎప్పటిలాగే శనివారం మేకలను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని భీమన్న గుట్ట వద్ద ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ చిన్న కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు భార్య నర్సవ్వ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. నృసింహుడి సన్నిధిలో మాజీ ఎమ్మెల్యేధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని నిజా మాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా శనివారం దర్శించుకున్నారు. ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ ఆయనకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించా రు. బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారని, గోదావరి పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహించారని అన్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులున్నారు. జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ సమీపంలోని రాజీవ్ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనగా నలుగురికి గాయాలయ్యాయి. న్యూపీకేరామయ్య కాలనీకి చెందిన రాధారపు గట్టయ్య టీవీఎస్ వాహనంపై ప్రాజెక్టు లేబర్ గేట్ నుంచి మెయిన్ రోడ్కు వస్తుండగా మంథని ప్రాంతానికి చెందిన ముగ్గురు మరో బైక్పై వేగంగా వచ్చి గట్టయ్య వాహనాన్ని ఢీ కొట్టారు. గట్టయ్యతో పాటు మంథని కౌశిక్, బూడిద మనోజ్, బూడిద సాయి మనోహర్కు గాయాలయ్యాయి. -
పరిశుభ్రత ఎలా?
కోరుట్ల: ‘రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పాఠశాల తరగతి గదులతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు’. అక్కడున్న వారంతా.. ఒకే సర్ అని తలలు ఊపారు.. ఇదంతా బాగానే కానీ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి పనిచేస్తున్న స్కావెంజర్లకు దాదాపు ఆరునెలలుగా వేతనాలు లేవు. అడపదడప వేతనాలు ఇస్తున్నా..అవి అరకొరగానే ఉండటంతో స్కావెంజర్లు ఆసక్తిగా పనిచేయడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. జిల్లాలో విద్యాశాఖ పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలుపుకుని మొత్తం 270 వరకు ఉన్నాయి. వీటిలో టాయ్లెట్స్, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతీ పాఠశాలకు ఒక స్కావెంజర్ను నియమించుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి స్కావెంజర్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది. కానీ, ఇక్కడి పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నా.. కేవలం ఒక్క స్కావెంజర్ను మాత్రమే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ మేరకు దాదాపుగా జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్ల నియామకం జరిగింది. ఇక్కడితో సమస్య సమసిపోతుందని భావించినా గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చే అరకొర వేతనాలు సైతం ఇవ్వడం లేదు. ‘ఇదిగో వేతనాలు వస్తున్నాయి..అదిగో వస్తున్నాయి’.. అంటూ ఊరించడమే తప్ప ఇప్పటికీ వేతనాలు ఇవ్వలేదు. స్కావెంజర్ల వేతనాల విషయంలో జిల్లాతో పోలిస్తే ఇతర జిల్లాలో ఎక్కువ మొత్తంలో వేతనాలు అందుతున్నట్లు సమాచారం. పొరుగు జిల్లాలో స్కావేంజర్లకు నెల రూ. 6వేలు, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అదనంగా స్కావెంజర్ల నియామకానికి అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో మాత్రం స్కావెంజర్లకు కేవలం రూ.3వేలు వేతనం ఇవ్వడం..ఆ వేతనం సకాలంలో ఇవ్వకపోవడం సమస్యగా మారింది. వేతనాలు సరిగా రాకపోవడంతో స్కావెంజర్లు సరిగా పనులకు రావడం లేదు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తే..‘అరకొర వేతనాలు..అవీ సరిగా రావడం లేదు.. కానీ ఎక్కడా లేని ఆజమాయిషి’ ఎందుకని వర్కర్లు అసహానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలల్లో పరిశుభ్రతను ఎలా మెయింటేన్ చేయాలో తెలియక నిర్వాహకులు అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు. పాఠశాల విద్యకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్న జిల్లా కలెక్టర్ ఈ మధ్య కాలంలో తరచూ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించడంతో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏలాంటి చర్యలు ఉంటాయోనని ఉపాధ్యాయులు బెదిరిపోతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. పాఠశాలల పరిశుభ్రతకు అవసరమైన వనరులు కల్పించి ఫలితం ఆశిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ● జాడలేని స్కావెంజర్లు ● అరకొర వేతనాలు.. అవీ సరిగా ఇవ్వరు.. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
సైదాపూర్: సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని బూడిదపల్లిలో గడ్డి మందు తాగిన అమరగొండ రాహుల్(20) అనే యువకుడు శనివారం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సైదాపూర్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఎస్ఐ, గ్రామస్తుల కథనం ప్రకారం.. విజయ–కొమురయ్య ఏకై క కుమారుడు రాహుల్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. 4 రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రిలో చూపించడం లేదని ఇంట్లో గొడవ పడ్డాడు. మనస్తాపం చెంది ఆగస్టు 15న సాయంత్రం వ్యవసాయ పొలాల వద్ద గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాగా రాహుల్ గడ్డి మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. హాయిగా చనిపోతున్నాను.. ఎప్పుడో చచ్చిపోదామనుకున్నా.. ఈరోజు అవకాశం వచ్చిందంటూ నవ్వుతూ గడ్డి మందు తాగే వీడియో గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో వైరలైంది. నవ్వుతూ తిరిగే రాహుల్ ఆత్మహత్యకు పాల్పడడం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది. హుజూరాబాద్: పట్టణానికి చెందిన పంజాల కృష్ణ(42) ఈనెల 3న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కృష్ణ హుజురాబాద్కు చెందిన వనం హరీశ్కు రూ.25లక్షలు అప్పుగా ఇచ్చాడు. గత 15నెలలుగా అసలు, వడ్డీ ఇవ్వడం లేదు. ఇటీవల డబ్బుల కోసం అడగగా, ఇవ్వననడంతో మనస్తాపానికి గురై పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో ఈనెల 3న రాత్రి తన చావుకు హరీశ్ కారణమని సెల్ఫీ వీడియో తీశాడు. అనంతరం పురుగుల మందుతాగాడు. చావు బతుకుల మధ్య ఉన్న కృష్ణను హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం జమ్మికుంట, అక్కడి నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కృష్ణ భార్య హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. -
అజయ్ని బతికించారు
వీణవంక: వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన బొంగోని అజయ్(26) వినాయకుడి విగ్రహాల తయారీలో కూలీ పనికి వెళ్లగా విగ్రహం మీదపడటంతో మెడనరాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆయన దీనస్థితిని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. జూలై 16న ‘నిరుపేదకు పెద్ద కష్టం’ కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా అజయ్ పరిస్థితిపై వాకబు చేశారు. చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించాలని ఆదేశించారు. నెల రోజులుగా నిమ్స్లో చికిత్స పొందిన ఆజయ్కి శుక్రవారం ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి అజయ్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఆపరేషన్ తర్వాత మూడు నెలల పాటు ఫిజియోథెరఫి చేయించాలి. దీని కోసం డిహాబిటేషన్ సెంటర్లో ఉంచాలి. రోజుకు రూ.38,00 ఖర్చు అవుతుంది. ఈ మూడు నెలలు అజయ్కి కీలకం. ఈ సమయంలో ఎంత ఫిజియోథెరిఫి చేపిస్తే అంత తొందరగా కోలుకునే పరిస్థితి ఉంటుందని నిమ్స్ వైద్యులు చెప్పుతున్నారు. పేద కుటుంబం కాబట్టి దాతలు సహకరిస్తే అజయ్ పూర్తిస్థాయిలో కోలుకుంటాడని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సాయం చేయాల్సినవారు ఫోన్ నంబర్ 97013 14308ను సంప్రదించాలని కోరుతున్నారు. -
కొనసాగుతున్న ఎత్తిపోతలు
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరగడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నంది పంప్హౌస్లోని నీటిని తరలిస్తూ నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కులు, నాలుగు పంపుల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి సొరంగాల ద్వారా లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్లోకి తరలిస్తున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు పంపులను కొనసాగించిన అధికారులు ఒక్క పంపును ఆఫ్చేసి మూడు పంపుల నుంచి ఎత్తిపోతలు కొనసాగిస్తున్నట్లు ఏఈఈ వెంకట్ తెలిపారు. -
సైకిల్పై తిరిగొద్దాం
ఇంటి నుంచి అడుగు బయటపెట్టడమే ఆలస్యం.. వాహనం ఎక్కి దూసుకెళ్తున్నాం. ప్రమాదానికి ఆస్కారం ఉందని తెలిసినా రహదారి నిబంధనలు పట్టించుకోం. మనస్థాయికి తగ్గ వాహనాలు ఉన్నా.. వాటికి అప్పుడప్పుడు విరామమిద్దాం. వారంలో కనీసం ఒక్కరోజు ఆఫీసుకే కాదు... చిన్నచిన్న అవసరాలకు సైకిల్పై వెళ్లొద్దాం. ఆరోగ్యంగా ఉందాం. ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా జిమ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సైకిల్ తొక్కడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సెలవు దొరికితే సినిమా లేదా ఎగ్జిబిషన్కు వెళ్దామా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ ఆదివారం పిల్లలతో కలిసి సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లొద్దాం. రైతు పడుతున్న కష్టాన్ని తెలుసుకుందాం. పిల్లలకు సాగు పద్ధతులు తెలియచేద్దాం. చుట్టుపక్కల ఉన్న పచ్చదనంతో ఆహ్లాదంతో గడుపుదాం. ప్రకృతి విలువ అర్థమయ్యేలా వివరిద్దాం. ఇలా చేయడంతో గ్రూప్డిస్కషన్ జరుగుతుంది. పరిశీలించే గుణం పెరుగుతుంది. వాతావరణం, పంటలపై అవగాహన కలుగుతుంది. క్షేత్రస్థాయి అనుభవం వస్తుంది. -
ఎస్సీరెస్పీకి భారీగా వరద
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో 1.04 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. నీటి నిల్వ 53.62 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి 4,952 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గో దావరిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలికోరుట్ల: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. పట్టణంలోని తాళ్లచెరువు, మద్దుల చెరువు కిందగల లోతట్టు ప్రాంతాలను శనివారం పరిశీలించారు. చెరువు వైపు ప్రజలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయించారు. మురికి కాలువలను శుభ్రం చేయించి వరద నీరు సక్రమంగా వెళ్లేలా చూశారు. కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండే ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాని సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సీహెచ్ రాజేంద్ర ప్రసాద్ (శానిటరీ ఇన్స్క్టర్)ను సెల్ 99495 65606లో.. బి.అశోక్ (ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్)ను సెల్ 98499 07961 నంబర్లకు ఉద యం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశామని 91000 39255కు ఫోన్ చేయవచ్చని వివరించారు. 30.9 మిల్లీమీటర్ల వర్షపాతంజగిత్యాలఅగ్రికల్చర్: శనివారం ఉదయం వర కు జిల్లాలో సగటున 30.9 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. అత్యధికంగా సారంగాపూర్ మండలంలో 116.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంఇ. అత్యల్పంగా గొల్లపల్లిలో 5.2 మి.మీగా నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 39.2, మల్లాపూర్లో 47.6, రాయికల్లో 62.8, బీర్పూర్లో 40.2, ధర్మపురిలో 54.9, బుగ్గారంలో 31, జగిత్యాల రూరల్లో 18.1, జగిత్యాల అర్బన్లో 19.9, మేడిపల్లిలో 23.7, కోరుట్లలో 30.2, మెట్పల్లిలో 16, కథలాపూర్లో 16.8, కొడిమ్యాలలో 14.8, మల్యాలలో 9.4, పెగడపల్లిలో 11.4, వెల్గటూర్లో 27.7, ఎండపల్లిలో 21.8, భీమారంలో 11 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అభివృద్ధి దిశగా గాయత్రి బ్యాంకుజగిత్యాల: రూ.342 8.46 కోట్లతో.. 66 శాఖలతో గాయత్రి బ్యాంకు అభివృద్ధి పథంలో నడుస్తోందని సీఈవో వనమాల శ్రీనివాస్ అన్నారు. శనివారం నిర్వహించిన బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. 25ఏళ్లలో 7.88లక్షల వినియోగదారులను కలిగి రూ.34 28.46 కోట్ల వ్యాపారంతో మల్టీ స్టేట్ కో–ఆపరేటీవ్ బ్యాంక్గా అవతరించిందన్నారు. త్వరలో 15 బ్రాంచ్లను ప్రారంభించేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్ వంటి సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ప్రమాద బీమా సౌకర్యం ఉందన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఖాతాదారుడు కుటుంబానికి రూ.లక్ష చెక్కు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రవికుమార్, డైరెక్టర్లు మల్లేశం, ప్రసాద్, వాసాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించండిజగిత్యాల: ఓటర్ల జాబితా పారదర్శకంగా రూ పొందించాలని, ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా చూడాలని రాజ్యాంగంలోని 15వ భాగంలో 324 నుంచి 329 వరకు ఆర్టికల్లో పొందుపర్చింద ని మాజీమంత్రి జీవన్రెడ్డి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు శనివారం లేఖ రాశారు. ఆధార్కార్డును ఓటరు జాబితాకు లింక్ చేస్తూ వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఓట్లు కలిగిన వ్యక్తులను గుర్తించాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారు ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వీటిని నిరోధించేలా చూడాలని కోరారు. -
వానొచ్చింది.. వరదొచ్చింది..
కలెక్టరేట్లో టోల్ఫ్రీ నంబరు 96662 34383అధికారులను అలర్ట్ చేసిన కలెక్టర్ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వారికోసం కలెక్టరేట్లో టోల్ఫ్రీ నంబరు 96662 34383 ఏర్పాటు చేశారు. విద్యుత్, రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సారంగాపూర్/ఇబ్రహీంపట్నం/ధర్మపురి: జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు నిండి మత్తడులు దూకుతున్నాయి. సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, ధర్మపురిలో భారీ వర్షం కురిసింది. సారంగాపూర్లో వందలాది ఎకరాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల ఇసుక మేట వేసింది. సారంగాపూర్–బట్టపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై నుంచి వరద పారడంతో రాకపోకలు నిలచిపోయాయి. రోళ్లవాగు ప్రాజెక్టులో నీటిమట్టం 12 అడుగులకు చేరింది. బీర్పూర్ మండలం తుంగూర్–కండ్లపల్లి గ్రామాల మధ్య వంతెన అప్రోచ్రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలను ఎంపీడీవో భీమేష్, ఎస్సై రాజు రహదారిని మూసివేయించారు. పంచాయతీ కార్యదర్శులను కాపలాగా ఉంచారు. ఇబ్రహీంపట్నం మండలం యామపూర్, ఫకీర్కొండాపూర్ దారిలో వేసిన తాత్కాలిక రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. తహసీల్దార్ వరప్రసాద్ పరిశీలించి ఇరువైలా ట్రాక్టర్లను పెట్టారు. ధర్మపురిలో లోలెవల్ వంతెనలు మునిగి రాకపోకలు స్తంభించిపోయాయి. ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద, అనంతారం వద్దనున్న లోలెవల్ వంతెనలు పూర్తిగా మునిగిపోయాయి. ధర్మపురి నుండి జగిత్యాల వెల్లే వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆకసాయిపల్లెలో సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వంతెనపై ఉన్న చెత్తాచెదారాన్ని జేసీబీ సాయంతో తొలగించారు. వాహనాలు రాయపట్నం, మద్దునూర్, సిరికొండ, గొల్లపల్లి మీదుగా జగిత్యాలకు వెళ్లాయి. నృసింహుని ఆలయం డ్రైనేజీ పొంగిపొర్లడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై నీరు చేరి ఆ పరిసర ప్రాంతమంతా దుర్గందం వెదజల్లింది. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది డ్రైనేజీని శుభ్రం చేయడంతో మురుగునీరు వెళ్లిపోయింది. -
ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్దాం
పోటీ ప్రపంచంలో దొరికే కొద్దివిరామ సమయాన్ని పబ్బులు, రెస్టారెంట్లు, పార్కులకు కేటాయిస్తున్నారు. వీటితో కలిగే ప్రయోజనం కన్నా ఇబ్బందులే ఎక్కువ. అలా కాకుండా ఆధ్యాత్మికతను అందిపుచ్చుకుందాం. ఇష్టదైవారాధన కోసం ప్రార్థనా మందిరాలకు వెళ్దాం. అక్కడ ఓ పూట ఆనందంగా గడుపుదాం. పెద్దల సందేశాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. తోటి భక్తుల్లోని మంచిని స్వీకరిద్దాం. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు అదే పనిగా ఫోన్ వినియోగిస్తుండగా వారిలో 11శాతం మంది సెల్కు బానిసలవుతున్నారు. ఇది అనేక సమస్యలకు కారణమవుతోంది. ఆదివారం ఫోన్ను పక్కన పెడదాం. పుస్తక పఠనం లేదా దినపత్రికను పూర్తిగా చదువుదాం. ఒక రోజులో 30 పేజీలకు తక్కువ కాకుండా చదివితే జ్ఞానంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దినపత్రికలు చదవడంతో నిత్యనూతనంగా.. హుషారుగా పనిచేస్తాం. -
పెరిగిన గోదావరి ఉధృతి
ధర్మపురి/సారంగాపూర్/ఇబ్రహీంపట్నం/జగిత్యాల క్రైం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో గోదావరి ఉధృతి పెరిగింది. ధర్మపురి వద్ద సంతోషిమాత, మంగలిగడ్డ పుష్కరఘాట్లు నీటిలో మునిగి పోయాయి. కలెక్టర్ సత్యప్రసాద్ గోదావ రి తీర ప్రాంతాలను పరిశీలించారు. మున్సిపల్, రెవెన్యూ, మండల పరిషత్, పోలీస్శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాయపట్నం వద్ద లో లెవల్ వంతెన, ఆకసాయిపల్లె గుట్ట వద్ద లోలెవల్ వంతెలనలు పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఎంపీడీవో రవీందర్, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్కుమార్ ఉన్నారు. కమ్మునూర్ వద్ద.. బీర్పూర్ మండలం కమ్మునూర్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంపీడీవో భీమేశ్, ఎస్సై రాజు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు గోదావరి వైపు వెళ్లవద్దని ఎమ్మెల్యే సంజయ్కుమార్ విజ్ఞప్తి చేశారు. భారీవర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోందని ఈఈ చక్రపాణి శనివారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎప్పుడైనా నీరు విడుదల చేసే అవకాశం ఉన్నందున ప్రజలు, గొర్రెలకాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సారంగాపూర్ మండలంలోని గంగమ్మ చెరువు ఉప్పొంగడంతో రేచపల్లి – భీంరెడ్డిగూడం గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కానిస్టేబుల్ను నియమించాలని, భారీకేడ్లు ఏర్పా టు చేయాలన్నారు. సెల్ఫీ దిగడానికి ఎవరైనా వస్తే వెనక్కి పంపించాలని సూచించారు. ఆర్డీవో మదుసూధన్, తహసీల్దార్ వాహిదొద్దీన్, ఎంపీడీవో గంగాధర్, ఎస్సై గీత ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శనివా రం గోదావరి పరీవాహక ప్రాంతాలు, చెరువులు, వాగులు, వంతెనలు, ప్రధాన రహదారులను సందర్శించారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు 100 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. -
కలెక్టర్ పతాకావిష్కరణ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్యాంపు, జెడ్పీ కార్యాలయాల్లో కలెక్టర్ సత్యప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం చిన్నారులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఇందిరాభవన్లో మంత్రి లక్ష్మణ్కుమార్, మోతె రోడ్డులో మాజీ మంత్రి జీవన్రెడ్డి, బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్రావు, బీజేపీ కార్యాలయం కమలా నిలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, టవర్ వద్ద నిత్యజనగణమన మిత్రబృందం ప్రతినిధులు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎస్పీ అశోక్కుమార్, ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, అదనపు కలెక్టర్ లత, డీఎస్పీ రఘుచందర్, ఆర్డీవో మధుసూదన్, వివిధ శాఖ ల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
త్యాగధనులతోనే దేశానికి స్వేచ్ఛ
జగిత్యాలక్రైం: ఎంతో మంది త్యాగధనులతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతిస్థాపనకు కృషి చేయాలన్నారు. మహానుభావుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, సైబర్క్రైం డీఎస్పీ వెంకటరమణ, మెట్పల్లి డీఎస్పీ రాములు, సీఐలు శ్రీనివాస్, ఆరీఫ్అలీఖాన్, రఫీక్ఖాన్, శ్రీధర్, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, వేణు, సైదులు, డీపీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
విశేష సేవలకు ప్రతిష్టాత్మక పతకాలు
జగిత్యాలక్రైం: పోలీసు శాఖలో విశేష సేవలందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పతకాలను శుక్రవారం ఎస్పీ అశోక్కుమార్ అందజేశారు. సారంగాపూర్ హెడ్కానిస్టేబుళ్లు రాములు, అహ్మద్ మొయినొద్దీన్, డీఎస్బీ హెడ్కాని స్టేబుళ్లు ఉపేందర్రాజు, శంకరయ్య, ఏఆర్ ఎస్సైలు శ్రీనివాస్, సయ్యద్ తఖియోద్దీన్, ఏఆర్ హెడ్కానిస్టేబుళ్లు పోచయ్య, మోహన్లాల్, నాగన్న, మల్లారెడ్డి, నసిమోద్దీన్, మెట్పల్లి ఏఎస్సైలు ఎండీ జమీల్, నర్సింహారెడ్డి, కథలాపూర్ ఏఎస్సై బిక్షపతి, కోరుట్ల ఏఎస్సై సత్తయ్య, మల్యాల హెడ్కానిస్టేబుళ్లు మల్లారెడ్డి, రవి, కథలాపూర్ హెడ్కానిస్టేబుళ్లు నీలానాయక్, శ్రీనివాస్, మేడిపల్లి హెడ్కానిస్టేబుల్ ఎండీ ఇలియాస్అహ్మద్, గొల్లపల్లి హెడ్కానిస్టేబుల్ రాజమౌళి, ఇబ్రహీంపట్నం హెడ్కానిస్టేబుల్ తనోబ, మెట్పల్లి హెడ్కానిస్టేబుల్ ప్రకాశ్ సేవా పతకాలు స్వీకరించారు. ఏఆర్ ఎస్సై రామస్వామి, మేడిపల్లి హెడ్కానిస్టేబుల్ ఎ.శ్రీనివాస్ ఉత్తమ సేవా పతకాలు అందుకున్నారు. -
రెండో బ్యాచ్ శిక్షణకు సర్వం సిద్ధం
జగిత్యాల: లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకాల్లో భాగంగా రెండో బ్యాచ్ శిక్షణకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 18 నుంచి అక్టోబర్ 22 వరకు ఎంపిక చేసిన 123 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. భూభారతి చట్టాన్ని ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతున్న నేపథ్యంలో సర్వేయర్లు తక్కువగా ఉండటంతో లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 156 మందికి పైగా నూతన సర్వేయర్లను శిక్షణ ఇచ్చి రాత పరీక్ష నిర్వహించగా 60 మంది అర్హత సాధించారు. వీరికి త్వరలోనే లైసెన్స్డ్ సర్వేయర్లుగా అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం రెండో విడతలో 123 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరికి పరీక్షలు నిర్వహించి మండలాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. రెండో విడతలో సైతం ఈనెల 18 నుంచి అక్టోబర్ 22 వరకు శిక్షణ ఇస్తారు. అక్టోబర్ 26న థియరీ పరీక్షలు, 23 నుంచి 25 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. -
లారీ, బైక్ ఢీకొని ఒకరి మృతి
మంథని: మున్సిపల్ పరిధిలోని గంగాపురి వద్ద ద్విచక్ర వాహనా న్ని లారీ ఢీకొట్టిన ఘ టనలో పెద్దపల్లి మండలం కనగర్తికి చెంది న చెట్టం వెంకటేశ్ (30) మృతి చెందా డు. మంథని మండలం ధర్మారం గ్రామానికి చెందిన తిప్పని అభిలాష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటేశ్, అభిలాష్ ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి ద్విచక్రవాహనంపై పెద్దపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన అభిలాష్ను 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్నారు. క్రెడిట్ కార్డుల కమీషన్ పేరుతో డబ్బులు స్వాహా..వరంగల్ క్రైం: క్రెడిట్ కార్డుల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇస్తానంటూ బాధితుల నుంచి లక్షలు స్వాహా చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హనుకొండ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్ 2023లో హనుమకొండ రాయపురలో ‘భద్రకాళి డిజిటల్ సేవ’ పేరుతో షాపు ఏర్పాటు చేశాడు. ఆన్లైన్ అప్లికేషన్స్తోపాటు కస్టమర్ల క్రెడిట్ కార్డు స్వైప్ చేసి వారికి డబ్బులు ఇచ్చేవాడు. రెగ్యులర్ కస్టమర్లను తన వాలెట్లో యాడ్ చేసుకుని వారి క్రెడిట్ కార్డుల్లో బ్యాలెన్స్ ఉంటే ఫోన్ చేసేవాడు. తాను వేరే పేమెంట్ చేసేది ఉందని చెప్పి వారి కార్డులు స్వైప్ చేసి వారికి ఎలాంటి చార్జీలు లేకుండా తానే క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లిస్తానని మోసం చేసేవాడు. కార్డులు స్వైప్ చేసిన తర్వాత వేరే కస్టమర్ల కార్డులు పేమెంట్ చేసి దానికి 4 శాతం వరకు చార్జీ తీసుకుని లాభం పొందేవాడు. ఎలాంటి కమీషన్ లేకుండా డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి డబ్బులు వాడుకున్న అనంతరం కొన్ని రోజుల తర్వాత ఇతరుల క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేవాడు. సంవత్సరంన్నర పాటు కస్టమర్లకు నమ్మకంగా ఉంటూ వారి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తూ, క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ బాధితుల డబ్బుల నుంచి తన క్రాప్ లోన్, అప్పులు కట్టుకున్నాడు. ఇలా సుమారు రూ.28 లక్షలు వాడుకున్నాడు. కొద్ది రోజులుగా విజయవాడలో ఉంటున్న నిందితుడు బుధవారం షాపు ఖాళీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించగా అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఇద్దరు లీడింగ్ ఫైర్ ఆఫీసర్లకు రాష్ట్రపతి పతకాలు
మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి ఫైర్ స్టేషన్లో లీడింగ్ ఫైర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న వహిదుల్లాఖాన్ అత్యున్నత పురస్కారమైన రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 1986లో ఫైర్మెన్గా అగ్ని మాపక శాఖలో చేరిన ఆయన.. ఆసిఫాబాద్, ఇచ్చోడ, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్లో పని చేసి.. రెండేళ్ల క్రితం మెట్పల్లికి బదిలీపై వచ్చారు. 2015లో లీడింగ్ ఫైర్మెన్గా పదోన్నతి పొందారు. మొదటి నుంచి అంకితభావంతో పనిచేసే ఆయన విపత్తుల సమయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారనే పేరు సంపాదించారు. అత ని సేవలకు గుర్తింపుగా ఇప్పటివరకు ఆరు ప్రశంసపత్రాలు, ఒక సేవాపతకం ప్రదానం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పతకానికి ఎంపిక కావడంపై ఆయనను ఉన్నతాధికారులు అభినందించారు. లీడింగ్ ఫైర్మెన్ గోపాల్ రెడ్డికి రాష్ట్రపతి అవార్డు జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్మెన్గా విధులు నిర్వహిస్తున్న బీరెడ్డి గోపాల్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఫైర్మెన్గా విధుల్లో అత్యంత ఉత్తమ సేవలు అందించినందుకు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. ఫైర్ ఆఫీసర్గా విధుల్లో క్రమ శిక్షణ, నిబద్ధతతో పని చేసినందుకు రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక చేసినట్లు గోపాల్రెడ్డి తెలిపారు. ఈయనను పలువురు అభినందించారు. -
సేవలకు దక్కిన గౌరవం
జగిత్యాలక్రైం/మల్యాల: విధి నిర్వహణలో వారు ఎప్పుడూ ముందున్నారు. తమ సర్వీసులో ఏనాడూ మచ్చ కూడా ఎరగరు. వారి సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక పతకాలు అందించింది. తాజాగా ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై రాజేశుని శ్రీనివాస్, మల్యాల పోలీస్స్టేషన్ ఏఎస్సై రుద్ర కృష్ణకుమార్కు మెడల్ ప్రకటించింది. రాజేశుని శ్రీనివాస్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2019లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2012లో రాష్ట్ర పోలీసు సేవా పథకం, 2019లో ఉత్తమ సేవా పథకం అందుకున్నారు. 36ఏళ్లుగా పోలీస్ పోలీసు శాఖకు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేసింది. అలాగే రుద్ర కృష్ణ కుమార్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2017లో హెడ్కానిస్టేబుల్గా.. 2021లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2022లో రాష్ట్ర పోలీసు సేవా పథకానికి ఎంపికయ్యారు. 36 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేశారు. ఇద్దరిని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ అభినందించారు. కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని తెలిపారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజేశుని శ్రీనివాస్ రుద్ర కృష్ణకుమార్ ఇండియన్ పోలీస్ మెడల్కు ఇద్దరు ఏఎస్సైలు -
1,947కే ఆరోగ్య పరీక్షలు
కరీంనగర్టౌన్: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీ ప్రవేశ పెట్టిందని ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ తెలిపారు. స్థానిక ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ పేరిట అందుబాటులోకి తీసుకొచ్చిన పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలను రూ.1,947 చెల్లించి పొందవచ్చన్నారు. కార్డియాలజీ, జనరల్ ఫిజీషియన్, డైటీషియన్ కన్సల్టేషన్తోపాటు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్(సీయూఈ), పాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్ఎఫ్టీ), ఎక్స్రే చెస్ట్ (విత్అవుట్ ఫిలిం), ఈసీజీ, 2డీ ఎకో, హెపటైటిస్బీఏ1సి, సీరం యూరియా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ (అబ్డొమెన్– పెల్విస్), సీరం క్రియాటినిన్ పరీక్షలు ఈ ప్యాకేజీ ద్వారా నిర్వహిస్తామని వివరించారు. ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు సద్వనియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ‘మెడికవర్’లో వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ -
సమాన అవకాశాలు
అందరికీ విద్య ..మల్యాల/కొడిమ్యాల: అంతరాలు లేని సమాజం కావాలి. కులమతాల బేధం లేకుండా అన్నివర్గాలకు నాణ్యమైన విద్య, వైద్యం అందాలి. సాంకేతికంగా స్వావలంబన సాధించేందుకు పరిశోధనలు పెరగాలి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. స్వేచ్ఛ, సమానత్వ భావాలు విరజిల్లాలి. రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు స్వేచ్ఛగా పొందాలి. దేశంలోని యువత శక్తిని సద్వినియోగం చేసుకుంటూ.. సుస్థిర అభివృద్ధికి బాటలు వేయాలి. కరోనావంటి మహమ్మారి మరోసారి వచ్చినా తట్టుకునే శక్తివంతమైన సమాజం నిర్మాణం కావాలి.. ఇవి భావిభారత పౌరుల మాటలు. ‘2047 నాటికి వందేళ్ల భారతదేశం’ అంశంపై కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ‘సాక్షి’ టాక్ షో నిర్వహించింది. ప్రిన్సిపాల్ విశ్వనాథన్ అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమంలో దేశ అభివృద్ధిపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వాతంత్య్ర లక్ష్యం నెరవేరాలి నాణ్యమైన విద్య అందాలి ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యం ప్రకృతిని కాపాడుకోవాలి అంతరాలు లేని సమాజం కాలుష్య రహిత సమాజం రావాలి యువశక్తి పెరగాలి మౌలిక వసతులు కల్పించాలి ప్లాస్టిక్ నిషేధించాలి కుటుంబం అభివృద్ధి చెందితేనే.. -
పోరాటాల ‘గాలిపల్లి’
ఇల్లంతకుంట: పోరాటాల గ్రామంగా చరిత్రలో నిలిచిపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నిజాంపాలిత ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రానికి ఇంకా విముక్తి లభించలేదు. బద్ధం ఎల్లారెడ్డి ప్రాంతమైన గాలిపల్లి ప్రజలు నైజాం పాలనపై తిరగబడ్డారు. 1948 సెప్టెంబర్ మొదటి వారంలో రజాకార్లు గాలిపల్లికి వచ్చారు. తిరుగుబాటుదారులు వారిసైన్యంపై రాళ్లు విసిరారు. రజాకార్ల కాల్పుల్లో తిరుగుబాటుదారుల్లో ముందువరుసలో ఉన్న 11మంది చనిపోయారు. వీరిలో గాలిపల్లికి చెందిన వారు ఏడుగురు, బేగంపేట, సోమారంపేట, తాళ్లపల్లి, నర్సక్కపేట గ్రామాలకు చెందినవారు నలుగురు ఉన్నారు. రజాకార్ల పాలన నుంచి విముక్తి కలిగిన తరువాత గాలిపల్లిలో దాదాపు 20మందికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీడంఫైటర్ పింఛన్లు మంజూరు చేశాయి. -
మొదటి జెండా ఎగిరింది ధర్మపురిలోనే..
ధర్మపురి: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కేవీ.కేశవులు, మాణిక్యశాస్త్రి ప్రాణస్నేహితులు. కేశవులు ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు హయాంలో చేనేత జౌళిశాఖ మంత్రిగా కొనసాగారు. 1947లో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ధర్మపురిలోని గోదావరి ఒడ్డునున్న కర్నెఅక్కెపెల్లి భవనంపై తన మిత్రుడైన మాణిక్యశాస్త్రితో కలిసి మొట్టమొదటి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఎగురవేయడం నిషేధమని అప్పటి నిజాం ప్రభుత్వం కేశవులను బంధించడానికి ప్రయత్నించగా.. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిలోంచి వెళ్లి తప్పించుకున్నారు. ఏడాదిపాటు ముంబయిలో తలదాచుకున్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం రోజు తిరిగి ధర్మపురికి చేరుకున్నారు. 2019 జనవరి 30న అనారోగ్యంతో మృతి చెందారు. -
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మా భూమి.. మా దేశం.. మా ప్రాంతం.. మా సొత్తు.. మా మనుషులు నినాదంతో ఎందరో మహనీయుల పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యమ సమయం నాటి అనేక సంఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటానికి వేదికై న మెట్పల్లి ఖాదీప్రతిష్టాన్ విదేశీ వస్తు బహిష్కరణలో కీలక పాత్ర పోషించింది. తాజాగా పొలిటికల్ బ్రాండ్గా పేరొందుతోంది. ఉమ్మడి జిల్లానుంచి ఎందరో మహనీయులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అమరులైన వారి పేరిట శిలాఫలకాలు ఆయా ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. నాటికీ.. నేటికీ పరిస్థితులు మారాయి. 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అయినప్పటికీ విద్య, వైద్యం, చట్టాలపై మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందని నేటి యువత అంటోంది. 2047 నాటికి వందేళ్ల భారతదేశాన్ని పునర్నిర్మిస్తామని సగర్వంగా చెబుతోంది. నేడు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. -
పునరావాసం ఏర్పాట్లు చేసుకోండి
● కలెక్టర్ సత్యప్రసాద్ ఇబ్రహీంపట్నం: గోదావరి ఉధృతంగా ప్రవహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజల కోసం ముందస్తు పునరావాస ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఇరిగేషన్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి మనోజ్కు సూచించారు. గతేడాది వడగండ్ల వర్షాలతో నష్టపోయిన తమకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని రైతు తెడ్డు రాజరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిహారం డబ్బులు వచ్చాయని, త్వరలోనే జమ చేస్తామని కలెక్టర్ తెలిపారు. మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో ఎండీ.సలీమ్, ఇరిగేషన్ డీఈ దేవనందం, ఆర్ఐ రమేశ్ ఉన్నారు. మద్దుల చెరువు పరిశీలనకోరుట్ల: పట్టణంలోని మద్దులచెరువును కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించారు. గురువారం ‘వరద ముంపు ముప్పు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన చెరువు కట్టను పరిశీలించారు. మత్తడి వద్దకు వెళ్లి మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వరద మళ్లింపునకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణచైతన్య, ఇరిగేషన్ ఏఈ సిరాజ్ ఉన్నారు. -
ఎన్నికల నిర్వహణలో ఈసీదే ప్రధాన పాత్ర
జగిత్యాల: ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్దే ప్రధాన పాత్ర అని, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న ప్రధాని మోదీకి ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. తహసీల్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగ ఓట్ల నమోదును బీజేపీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగించారన్నారు. కాంగ్రెస్ అనుకూల ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. కోర్టుల్లో మీడియేషన్ డ్రైవ్జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో కేసుల మధ్య రాజీ కుదిర్చేందుకు మీడియేషన్ డ్రైవ్ (మధ్యవర్తిత్వం) నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. సెప్టెంబర్ 30వరకు కార్యక్రమం కొనసాగుతుందని, రాజీకి అనుకూలమైన క్రిమినల్, చెక్బౌన్స్, మోటార్ వాహనాలు, బ్యాంకు కేసులు, చిట్ఫండ్ కేసులను పరిష్కరిస్తామని వివరించారు. -
గోదావరి తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ధర్మపురి: గోదావరికి వరద పెరుగుతున్నందున తీరప్రాంత ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. గోదావరి ప్రవాహాన్ని గురువారం పరిశీలించారు. నదీ వద్ద ప్రస్తుతం నీటిమట్టం, ప్రవాహం, వేగం, సేఫ్టీ బారీకేడ్లు, రక్షణ చర్యలను పరిశీలించారు. భక్తులు నదిలోపలికి వెళ్లి స్నానాలు చేయొద్దని, సెల్ఫీలు దిగడం ప్రమాదకరమని అన్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్కుమార్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. పెరిగిన గోదావరి ప్రవాహం ధర్మపురి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు.. కడెం ప్రాజెక్టు నుంచి వదిలిన నీటితో ధర్మపురి వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. మంగలిగడ్డ పుష్కరఘాట్ నుంచి నీరు ప్రవహిస్తోంది. సీపీఐ వందేళ్ల చరిత్ర పల్లెకు చేరాలికోరుట్లటౌన్: సీపీఐ వందేళ్ల చరిత్రను ప్రజలకు చేరవేయాలని ఆ పార్టీ జాతీయ నేత చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేని శంకర్ అన్నారు. కోరుట్లలోని సి.ప్రభాకర్భవన్ లో జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశాన్ని కార్యవర్గ సభ్యులు సుతారి రాములు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎర్ర జెండాలతో ప్రదర్శనలు చేపట్టాలన్నారు. ఈనెల 20 నుంచి 22వరకు మేడ్చల్ జిల్లాకేంద్రంలో రాష్ట్ర మహా సభలు ఉంటాయన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా చెన్న విశ్వనాథం పార్టీ జిల్లా కార్యదర్శిగా కోరుట్లకు చెందిన చెన్న విశ్వనాథం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను చాడ శాలువతో సన్మానించారు. అలాగే సహాయ కార్యదర్శిగా ఇరుగురాల భూమేశ్వర్, కార్యవర్గసభ్యులుగా వెన్న సురేష్, సుతారి రాములు, ఎండీ.ముఖ్రం, హనుమంతు, కొక్కుల శాంత, ఎన్నం రాధ, మహేష్, భూమయ్య, ఎండి.ఉస్మాన్, అక్రమ్ మాలిక్, ప్రవీణ్, మౌలానా, రాజన్న ఎన్నికై నట్లు ప్రకటించారు. జిల్లాకు మోస్తరు వర్ష సూచన జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు రానున్న ఐదురోజులు మోస్తరు వర్ష సూచన ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 30, రాత్రి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
పొలిటికల్ బ్రాండ్.. మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్
కోరుట్ల/మెట్పల్లి: ఇక్కడి నేతలకు ఖాదీ బట్టలే స్ఫూర్తి. చాలా మందికి ఖాదీ రాజకీయంగా ఊపిరి పోసిందంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర పోరా టకాలంలో ఖాదీ ఉద్యమానికి వేదికగా నిలిచింది జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి. గాంధీ శిశ్యుడు అన్నాసాహెబ్ ఆధ్వర్యంలో మెట్పల్లిలో వెలిసిన ఖాదీ ప్రతిష్టాన్ ఖద్దరు ఆ కాలంలో ఖ్యాతి పొందింది. అప్పటి ఆనవాయితీని పుణికిపుచ్చుకుని మెట్పల్లి ప్రాంత రాజకీయ నాయకులు ఖాదీ వస్త్రాలు ధరించడం ఇప్పటికీ దూరం కాలేదు. కడక్ ఖాదీ బట్టలతో ఎవరైనా కనిపిస్తే చాలు ఈయన మెట్పల్లి లీడరని చెప్పొచ్చు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన వర్ధినేని వెంకటేశ్వర్రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కేవీ.రాజేశ్వర్రావు, జనతా పార్టీ నుంచి ఏకై క ఎమ్మెల్యేగా ఎన్నికై న కొమొరెడ్డి రామ్లు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఖాదీ ప్రతిష్టాన్ వస్త్రాలు ధరించి రాజకీయాల్లో కీలకంగా ఎదిగినవారే. 2009 అసెంబ్లీ పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంగా మారినప్పటికీ.. మెట్పల్లి ఖాదీ కార్ఖానా స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సంజయ్ ఇక్కడి ఎమ్మెల్యేలుగా కొనసాగడం గమనార్హం. -
గుండుసూదిపై జాతీయ జెండాతో పరుగెడుతున్న యువతి
జగిత్యాలటౌన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండుసూది మొనపై జాతీయ జెండాతో పరుగెడుతున్న యువతి చిత్రాన్ని రూపొందించి ఔరా అనిపించాడు. పండుగలు, పబ్బాలు, జాతీయ పండుగలు వంటి ప్రత్యేక సందర్భంలో ఏదో సూక్ష్మరూప చిత్రం ద్వారా సమాజానికి సందేశం పంపించే దయాకర్.. ఈ స్వాతంత్య్ర వేడుకకు జాతీయ జెండాతో పరుగులు పెడుతున్న యువతి సూక్ష్మకళాకండాన్ని రూపొందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందు వరుసలో నిలుస్తున్నారన్న సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ చిత్ర ఉద్దేశమని దయాకర్ తెలిపారు. ఈ సూక్ష్మ కళారూపాన్ని తయారు చేసేందుకు మైనం పెన్సిల్ కలర్స్ ఉపయోగించానని, పది గంటల సమయం పట్టినట్టు తెలిపారు. చిత్ర రూపకర్త గుర్రం దయాకర్ గుండుసూదిపై జాతీయ జెండాతో యువతి సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్బుత సృష్టి -
గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
జగిత్యాలక్రైం: ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవా లను జరుపుకోవాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శబ్దకాలుష్యం కలిగించే డీజేలు, భారీ సౌండ్ సిస్టమ్స్ నిషేధించామన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు వేడుకలను ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నామని తెలిపారు. సామాజిక మాద్యమాల్లో వచ్చే వదంతులను నమ్మకూడదని పేర్కొన్నారు. సందేహాలుంటే పోలీసు వారికి లేదా 100 డయల్ ద్వారా సమాచారం అందించాలన్నారు. -
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
జగిత్యాలటౌన్:స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణరావు, కన్నం అంజయ్య, కృష్ణహరి, మ్యాదరి అశోక్, పాత రమేష్, తిరుపతి, గడ్డల లక్ష్మి, చెన్నాడి మధురిమ, పద్మ తదితరులు ఉన్నారు. 16న పెద్దగుట్ట నృసింహునికి వరదపాశంసారంగాపూర్: బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధం శ్రీపెద్దగుట్ట నృసింహస్వామికి ఈనెల 16న వరదపాశం సమర్పించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్దసంతోష్, అర్చకులు చిన్న సంతోష్, మధుకుమార్ తెలిపారు. ఉదయం ఆలయం సమీపం నుంచి ఉదయం 7 గంటలకు కాలినడకన పెద్ద గుట్టపైకి చేరుకుని వరదపాశాన్ని కిందకు జారవిడుస్తారు. -
పనులకు ఆటంకం కలిగించొద్దు
జగిత్యాల: అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించొ ద్దని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రతిపక్షాలను కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో రూ.1.30 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటికీ మంజూరు కాని నిధులు తెచ్చానని, పనులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని తెలి పారు. 40 ఇళ్లు కట్టని నాయకులు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి 4,500 ఇళ్లలో వసతులపై మా ట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మున్సిపల్ సిబ్బంది తడి, పొడి చెత్త వేరుగా చేయాలన్నారు. డంపింగ్యార్డు ప్రహరీకి రూ.2కోట్లు, చెత్తశుద్ధికి ఇప్పటికే రూ.5 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వివరించారు. -
జీవనదిగా వరదకాలువ
కథలాపూర్: వరదకాలువ ప్రస్తుతం జీవనదిగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని దుంపేట శివారు వరదకాలువను బుధవారం పరిశీలించారు. వరదకాలువ తవ్వుతున్న సమయంలో టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు నిరాశపరిచారని, అదే కాలువ ఇప్పుడు జీవనదిగా మారిందని పేర్కొన్నారు. కొంతమంది రైతు ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాళ్లవాగు, సూరమ్మ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ నరేశ్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
జగిత్యాల: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్లో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగిస్తే 14446కు సంప్రదించాలన్నారు. ఎస్పీ అశోక్కుమార్, అడిషనల్ కలెక్టర్ లత, డీఈవో రాము పాల్గొన్నారు. కొండగట్టులో డాగ్ స్క్వాడ్ తనిఖీలుమల్యాల: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం తనిఖీలు నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఎస్పీ అశోక్కుమార్ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా తనిఖీలు చేపట్టామని ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారం, మండపాలు, భక్తుల ప్రవేశ ద్వారం, పార్కింగ్ స్థలాలు, వసతి గృహాలు, ఆలయ పరిసరాలు, భక్తుల రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. ‘మత్తు’ నివారణలో భాగస్వామ్యం కావాలిజగిత్యాలక్రైం: మత్తు పదార్థాలపై వ్యతిరేక పోరాటం వ్యక్తిగత బాధ్యతతోపాటు సామాజిక కర్తవ్యంగా భావించాలని ఎస్పీ అశోక్ కు మార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మాద క ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ‘మత్తు పదార్థాలపై జరుగుతున్న పోరాటంలో క్రియశీల భాగస్వామి అవుతా నని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ.. నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగో లు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారా న్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతా’నని ప్రతిజ్ఞ చేయించారు. ఏవో శశికళ, డీసీఆర్బీ, ఎస్బీ, ఐటీకోర్ సీఐలు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రఫిక్ ఖాన్, ఆర్ఐలు కిరణ్ కుమార్, సైదులు, ఇతర పోలీసు అధికారులు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి● మాజీ ఎంపీ మధుయాష్కీ మెట్పల్లి: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ఆమో దం కోసం రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వ కల్పించిన రిజర్వేషన్లు అమలు కాకుండా కేంద్రం అడ్డు తగులుతోందన్నారు. రాజకీయాలకతీతంగా దీని ఆమోదం కోసం ఎంపీలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ తెలంగాణను అన్ని విధాలుగా దోపిడీ చేసిందన్నారు. ఆయన వెంట నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, నాయకులు కృష్ణారావు, జెట్టి లింగం, తిప్పిరెడ్డి అంజిరెడ్డి తదితరులున్నారు. -
రాఖీ కట్నం
15.48● ఆర్టీసీకి కరీంనగర్ రీజియన్లో లాభాల పంట ● గోదావరిఖని డిపోకు మొదటిస్థానంవిద్యానగర్(కరీంనగర్): రాఖీ పండుగ కరీంనగర్ రీజియన్కు కాసుల పంట పండించింది. ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ.15.48 కోట్ల ఆదా యం సమకూరింది. పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీనుంచి 11వ తేదీ వరకు రీజియన్ పరిధి లోని 11డిపోల్లో ఉన్న బస్సులు 21.50 లక్షల కిలో మీటర్లు తిరగగా.. 29,10,435 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వీరిలో 73శాతంపైగా (21,21,668) మహిళలు ఉండగా మహాలక్ష్మి పథ కం ద్వారా రూ.9.08 కోట్లు ఆదాయం వచ్చింది. రాఖీ పౌర్ణమి రోజున ఈనెల 9న రికార్డుస్థాయిలో 7.02 లక్షల మంది రాకపోకలు సాగించగా రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా గోదావరిఖని డిపో నుంచి 4,28,432 మంది ప్రయాణించారు. వీరిలో 3,21,821మంది మహిళలు ఉన్నారు. మొత్తం రూ.223.79 లక్షల ఆదాయం రాగా.. మహాలక్ష్మీ స్కీంకింద రూ.130.09 లక్షల ఆదాయం వచ్చింది. జగిత్యాల డిపో 3,67,855 మందిని చేరవేసి రెండోస్థానంలో నిలిచింది. వీరిలో 2,71,103 మంది మహిళలున్నారు. మొత్తం ఆదాయం రూ.178.57 లక్షలు రాగా.. జీరో టికెట్లు ద్వారా 104.38లక్షల ఆదాయం వచ్చింది.కోట్లుఅందరి సహకారంతోనే కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోలకు చెందిన సిబ్బంది, డైవర్లు, కండక్టర్లులు, అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పేర్ బస్సులతో పాటు జేబీఎస్ నుంచి సిటీ బస్సులు నడిచేలా చూశాం. 29 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. – బి.రాజు, కరీంనగర్ రీజినల్ మేనేజర్ -
వరద ముంపు ముప్పు
కోరుట్ల: కోరుట్లకు వరద ముంపు పొంచి ఉంది. భారీ వర్షం కురిస్తే పట్టణమంతా అతలాకుతలం కానుంది. గతేడాది వర్షాకాలంలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు పట్టణంలోని కొన్ని వార్డుల్లో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడటం.. మరికొన్ని వార్డుల్లో పదుల సంఖ్యలో ఇళ్లు వరద నీటిలో మునగడం నిత్యావసర సరుకులు కొట్టుకుపోవడం వంటి దయనీయ పరిస్థితులు ఎదురయ్యాయి. తాజాగా రానున్న వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో కోరుట్లకు మరోసారి వరద ముంపు ప్రభావం తీవ్రత పెరగవచ్చన్న అందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాలనీలకు వర్షపు వరద నీటి ముంపు తిప్పలు తప్పించాలంటే ముందు జాగ్రత్తలు తప్పనిసరి. వరద ముంపు పరేషాన్.. భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో కోరుట్ల మున్సిపాలిటీలో విలీనమైన ఎఖీన్పూర్ స్తంభాల చెరువు నీరు కంచరకుంట ద్వారా కోరుట్లలోని మద్దుల చెరువుకు చేరుతుంది. ఆ ప్రవాహం ఆదర్శనగర్, అయోధ్యపట్నం మీదుగా వెళ్తుంది. ప్రవాహం పెరిగితే ఈ రెండు ప్రాంతాలు నీటిమయంగా మారుతాయి. మద్దులచెరువులోకి చేరిన వరద మత్తడి దూకి అక్కడి నుంచి కింది ప్రాంతాలైన అయిలాపూర్రోడ్, ప్రకాశం రోడ్, ఝాన్సీరోడ్ కింది బాగాల్లో పెద్ద ఎత్తున ప్రవహించే అవకాశాలున్నాయి. అక్కడి నుంచి కల్లూర్ రోడ్ రైల్వే బ్రిడ్జి కింద నుంచి ఆనంద్నగర్, నక్కలగుట్ట ఏరియాల్లోనూ వరద నీటి ముంపు తీవ్రత ప్రభావం ఉంటుంది. గతేడాది ప్రకాశం రోడ్, ఝాన్సీ రోడ్, ఆనంద్నగర్ ఏరియాల్లో ఇళ్ల చుట్టూ వర్షపు నీరు చేరడం.. అక్కడ నివస్తున్న వారిని కొందరిని జేసీబీలతో ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. భారీ వర్షాలు కురిస్తే కోరుట్ల పట్టణ పైభాగంలో ఉన్న కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి, కోరుట్ల మండలం సంగెం, నాగులపేట ఏరియాల్లో ఉన్న వాగులు, చెరువులు మత్తళ్లు దూకి కోరుట్ల వాగులోకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ఫలితంగా కోరుట్ల వాగు పరిసరాల్లో ఉన్న గంగంపేట, అర్పత్పురా, కాగజ్నగర్ ఏరియాల్లో పెద్ద ఎత్తున నీటి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. గతేడాది గంగంపేట ఏరియాలో సుమారు 80 నివాసాలు పూర్తి స్థాయిలో వరదనీటి ప్రవాహంలో మునిగిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనం ఇళ్ల నుంచి పరుగులు తీసిన విషయం తెలిసిందే. వరద ఉధృతి తగ్గే వరకూ ఇళ్ల సమీపంలోకి ఎవరూ వెళ్లలేని దుస్థితి. ఇళ్లలో ఉన్న నిత్యావసర సరుకులు, నగలు, డబ్బులు సామాన్లు కొట్టుకుపోయాయి. నీటి మళ్లింపునకు చర్యలేవి..!? కంచరకుంట నుంచి ఆదర్శనగర్ ఏరియాకు వర్షపు వరద నీరు మద్దుల చెరువుకు చేరే క్రమంలో నీటి మళ్లింపునకు అవకాశముంది. ఈ విషయంలో గతేడాది వరదలు వచ్చిన సమయంలో అప్పటి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ఇంజినీరింగ్ అఽధికారులు కలిసి నీటి మళ్లింపు కోసం మద్దుల చెరువు పక్క పెద్ద డ్రైనేజీ తవ్వించాలని ప్రతిపాదించారు. దీంతోపాటు మద్దుల చెరువు మత్తడి దూకిన నీటి మళ్లింపు కోసం రేల్వే లైన్ ఏరియా నుంచి మరో డ్రైనేజీ నిర్మాణానికి సంకల్పించారు. కానీ ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరిచిపోయారు. మళ్లీ వర్షాలు కురిసి ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కొవాలన్న విషయంలో అవసరమైన చర్యలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ముందు జాగ్రత్తలు అవసరం భారీ వర్షాలు కురిస్తే అంతేముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం వర్షపు వరద నీటితో ముంపునకు గురయ్యే ఏరియాలను ఇప్పటికే గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో అవసరమైన తాత్కాలిక ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రణాళిక రూపొందించాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం. – రవీందర్, బల్దియా కమిషనర్, కోరుట్ల -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి
● గొల్లపల్లిలో క్రీడా ప్రాంగణానికి భూమిపూజ ● ఏడెకరాల్లో నిర్మాణం: మంత్రి అడ్లూరిగొల్లపల్లి: గొల్లపల్లి మండలకేంద్రంలోని క్రీడాకారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. సుమారు ఏడెకరాల్లో క్రీడా మైదానం ఏర్పాటుకు బుధవారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ విప్గా ఉన్న సమయంలో స్థానిక యువత క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయాలని కోరగా.. హామీ ఇచ్చారు. తాజాగా యువతకు ఏడెకరాల స్థలం ప్రొసీడింగ్ కాపీని అందించారు. మైదానానికి ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. అంతకుముందు శ్రీరాములపల్లి రైతు వేదికలో ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సహాయంతో ఎస్సీ యువతకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ మాజీద్, ఎంపీడీవో రాంరెడ్డి, ఎంపీవో సురేశ్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిషాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. తప్పు చేసింది మీరు.. బద్నాం మాపైనా..? జగిత్యాల: ‘తప్పు మీరు చేసి మమ్మల్ని బద్నాం చేస్తారా.. ?’ అని బీఆర్ఎస్ నేత ప్రవీణ్పై మంత్రి అడ్లూరి మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని మెడికల్ గెస్ట్ హౌస్లో విలేకరులతో మాట్లాడారు. జీవో 17పై ప్రవీణ్కు అవగాహన లేదన్నారు. కోడిగుడ్ల కొనుగోలులో రూ.600 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఖండించారు. ప్రజలకు సత్వర సేవలు వెల్గటూర్: ప్రజలకు సత్వర సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లిలో ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. కొద్ది రోజులుగా ఎండపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో కార్యకలాపాలు నిర్వహించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అద్దె భవనంలో ఎంపీడీవో కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. -
సేంద్రియ సాగుకు శ్రీకారం
● జిల్లావ్యాప్తంగా 2500 మంది రైతుల ఎంపిక ● ఒక్కో క్లస్టరు నుంచి 125 మంది ● మహిళలకు కృషి, సఖీలుగా నామకరణం గోదావరిలో పుణ్య స్నానాలు ధర్మపురి: శ్రావణం సందర్భంగా బుధవారం గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాల్లో మొక్కులు చెల్లించారు. గొల్లపల్లి: వ్యవసాయంలో రైతులు పాత పద్ధతులను అలవర్చేందుకు కేంద్రం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా రైతులతో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేయించడానికి ఎన్ఎంఎన్ఎఫ్ (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్) ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 20మండలాల్లో 2500 మంది రైతులను ఎంపిక చేశారు. అలాగే 2500ఎకరాలను సేంద్రియ వ్యవసాయం కోసం గుర్తించారు. ప్రకృతి వ్యవసాయానికి చర్యలు ఎన్ఎంఎన్ఎఫ్ కార్యక్రమం ద్వారా మండలానికి ఒక క్లస్టర్ను ఎంపిక చేసి వాటి పరిధిలో ఉన్న రైతులను గుర్తించి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేయించడానికి చర్యలు చేపట్టారు. ఒక్కో క్లస్టర్కు 125 మందితో సేంద్రియ వ్యవసాయం చేయించనున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన క్లస్టర్ల పరిధిలో రైతులను గుర్తించి వారికి అవగాహన కల్పించారు. ఎంపిక చేసిన రైతుల భూముల వద్దకు వెళ్లి భూసార పరీక్షలు చేసి ల్యాబ్కు పంపించారు. నేలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. జీవవైవిధ్యం పెంచడానికి.. భూమి సహజవనరులను పరిరక్షించడానికి ఈ పథకం ద్వారా రైతులకు వివరించనున్నారు. ప్రకృతి, సేంద్రియ సేద్యం చేయిస్తూ.. సహజ పద్ధతిలో సాగు చేయించడానికి అధికారులు రైతులను సిద్ధం చేస్తున్నారు. మహిళల ఎంపిక సేంద్రియ వ్యవసాయం కోసం రైతులను గుర్తించగా.. ఎంపిక చేసిన క్లస్టర్లలో 125 మందిలో మహిళలనూ ఎంచుకున్నారు. ఒక్కో క్లస్టర్ నుంచి ఇద్దరు మహిళలను ఎంపిక చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో 20 మంది మహిళల వివరాలు సేకరించారు. వీరు మహిళా సంఘాలతో అనుబంధంగా ఉండేలా చూస్తున్నారు. ఎంపిక చేసిన మహిళలకు ‘కృషి, సఖి’గా నామకరణం చేశారు. వీరికి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారు. జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశానికి ఇద్దరు మహిళలు హాజరుకావాల్సి ఉంటుంది. వీరు వారివారి క్లస్టర్ పరిధిలో ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు వీరికి గౌరవ వేతనం కూడా ఇవ్వనున్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు మూడేళ్ల పాటు ఎన్ఎంఎన్ఎఫ్ పథకం కింద ఇన్పుట్ సబ్సిడీ అందించనున్నారు. అవగాహన కల్పిస్తున్నాం సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే రెండు క్లస్టర్లలో 150 మందిని ఎంపిక చేశాం. భూసార పరీక్షలకు శాంపిళ్లు సేకరించి ఉన్నతాధికారులకు పంపించాం. వారి ఆదేశాల మేరకు సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నాం. – కరుణ, ఏవో, గొల్లపల్లి సేంద్రియ వ్యవసాయం చేయాలి సేంద్రియ వ్యవసాయంతో రసాయన మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. పురుగుల మందులు అధికవాడకంతో క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఎంపిక చేసిన గ్రామాల రైతులే కాకుండా ఇతర రైతులూ సేంద్రియ వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవాలి. – భాస్కర్, డీఏవో -
పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుండాలి
● సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్రాయికల్: పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుండాలని సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలీ సేవ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న బోగ రాజేశం, ఉపాధ్యక్షుడు దాసరి గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా కడకుంట్ల నరేశ్, కోశాధికారిగా ఆడెపు నర్సయ్య ప్రమాణస్వీకారం చేశారు. ప్రతి గ్రామంలో పద్మశాలిల సామాజిక వర్గమే ఎక్కువగా ఉందని, సామాజిక, రాజకీయ సేవ రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. పద్మశాలీల ఓటు బ్యాంక్తోనే రాజకీయాలు తారుమారవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి జక్కుల చంద్రశేఖర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, యువజన అధ్యక్షుడు సామల్ల సతీశ్, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, నాయకులు తాటిపాముల విశ్వనాథం, దాసరి రామస్వామి, రాజ్కిశోర్, పోపా సంఘం నాయకులు పాల్గొన్నారు. -
అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలి
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● జిల్లాకేంద్రంలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణజగిత్యాలటౌన్: బహుజనులు అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని బైపాస్రోడ్డులో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ముందుగా మంత్రికి స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్ స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ బైపాస్రోడ్లోని గొల్లపల్లి కూడలిని సర్వాయి పాపన్న జంక్షన్గా నామకరణం చేశామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ రమణ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్ తదితరులు ఉన్నారు. అనంతరం మాజీ మంత్రి జీవన్రెడ్డి సోదరుడి కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జగిత్యాలకు తరలివచ్చిన మంత్రులు సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ, జీవన్రెడ్డి సోదరుని కూతురు వివాహానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు జగిత్యాల వచ్చారు. వీరిలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, మాజీమంత్రి రాజేశంగౌడ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి ఉన్నారు. పాపన్న అందరికీ ఆదర్శంసర్వాయి పాపన్న ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయుడని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు ఉన్నారు. -
గడువులోపు ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ కథలాపూర్: గడువులోపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మండలంలోని భూషణరావుపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మంగళవారం పరిశీలించారు. పీఏసీఎస్ను తనిఖీ చేసి యూరియా నిల్వలపై అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ హైస్కూల్లో పాఠాలు విన్నారు. సిరికొండ పీఏసీఎస్ తనిఖీ చేశారు. మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల నిర్మాణాలు వేగవంతమయ్యేలా చూడాలన్నారు. యూరియా విక్రయిస్తే కచ్చితంగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఆయన వెంట కోరుట్ల ఆర్డీవో జివాకర్రెడ్డి, తహసీల్దార్ వినోద్, ఎంపీడీవో శంకర్ ఉన్నారు. ఎరువుల నిల్వలు తనిఖీ మేడిపల్లి: మండలకేంద్రంలోని పీఏసీఎస్ గోదాంను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎకరానికి ఒక యూరియా బస్తా మాత్రమే రైతులకు ఇవ్వాలని ఆదేశించారు. తహసీల్దార్ మునిందర్, ఎంపీడీవో పద్మజ, ఏవో షాహిద్ అలీ ఉన్నారు. -
సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.1.30కోట్లు మంజూరు
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం మెట్పల్లి: రేగుంటలో సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.1.30కోట్లు మంజూరైనట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం తెలిపారు. సబ్స్టేషన్ కోసం కేటాయించిన స్థలాన్ని మంగళవారం ఆయన స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణంలో ఇప్పటికే రెండు సబ్స్టేషన్లు ఉన్నాయ ని, వాటి ద్వారా 24వేల మంది వినియోగదారులకు విద్యుత్ అందిస్తున్నామని, పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మరో సబ్స్టేషన్ను నిర్మించాలని నిర్ణయించామన్నారు. టెండర్ పూర్తయిందని, పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. డీఈ మధుసూదన్, ఏడీఈలు మనోహర్, రాజబ్రహ్మచారి, ఏఈ రవి ఉన్నారు. అమ్మక్కపేట సబ్స్టేషన్కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇబ్రహీంపట్నం: మండలంలోని అమ్మక్కపేట సబ్స్టేషన్కు రూ.85 లక్షలతో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫర్ మంజురు చేసినట్లు ఎస్ఈ తెలిపారు. ఈనెల 18లోగా పనులు పూర్తిచేస్తామన్నారు. ఏఈ రవి, సబ్ ఇంజినీర్ చావన్, ఇందల్ లైన్మన్ రాము, కంట్రాక్టర్ లింగం పాల్గొన్నారు. -
ఎరువుల పంపిణీలో నిబంధనలు తప్పనిసరి
ఇబ్రహీంపట్నం: ఎరువుల పంపిణీలో నిబంధనలు పాటించాలని డీఏవో భాస్కర్ అన్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, ఈ పాస్లోఎరువుల అమ్మకాలను పరిశీలించా రు. అవసరం మేరకే యూరియాను విక్రయించాలని, ఏ రైతుకూ ఎక్కువ విక్రయించొద్దని తెలిపారు. ఏవో రాజ్కుమార్, సొసైటీ సీఈవో మంత్రి సతీష్కుమార్, ఆగ్రోస్ యజమాని ఆమెటి కృష్ణ పాల్గొన్నారు. మహిళలను సంఘాల్లో చేర్చండిజగిత్యాల/జగిత్యాలజోన్: అర్హులైన మహిళల ను సంఘాల్లో చేర్చాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. కలెక్టరేట్లో మహిళాసంఘాలతో సమావేశమయ్యారు. కొత్తగా వృద్ధులు, దివ్యాంగుల, బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 14 నుంచి అవగాహన కల్పించాలన్నారు. 30లోపు సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంక్ల్లో ఖాతాలు తీసి రుణాలు ఇప్పించాలని సూచించారు. -
గోదాంను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్
మెట్పల్లి: అగ్ని ప్రమాదం సంభవించిన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంను మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తినష్టం వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. గోదాం పక్కనే ఇళ్లు ఉన్నందున వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంటలను అదుపు చేయడానికి కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, ఆర్డీఓ శ్రీనివాస్, కమిషనర్ మోహన్, ఫైర్ ఆఫీసర్ సైదులు, తహసీల్దార్ వరస్రసాద్, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి ఉన్నారు. విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలి కోరుట్ల రూరల్: విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. వెటర్నరీ సైన్స్ కళాశాలలో యువజన దినోత్సవం, యాంటీ ర్యాగింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ర్యాగింగ్తో విద్యార్థులు తమ కెరీర్ను పాడు చేసుకుంటున్నారని తెలిపారు. వాదప్రతివాదం, క్విజ్, పోస్టర్ మేకింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కళాశాల అసోసియేట్ డీన్ డి.శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ అధికారులు పాల్గొన్నారు. -
జగిత్యాల
30.0/27.07గరిష్టం/కనిష్టంవాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొనసాగుతాయి. రిటైర్డ్ కార్మికుల ధర్నామెట్పల్లి: తమకు బెనిఫిట్స్ చెల్లించడంలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు మెట్పల్లి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో అనుమతించాలన్నారు. రేండ్ల రమేశ్, గట్ల రమేశ్, అలీ, అశోక్ పాల్గొన్నారు. బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025 -
మహిళలకు భరోసా
● దివ్యాంగులు, కిశోర బాలికలతో గ్రూపుల ఏర్పాటు ● బ్యాంక్ల నుంచి లింకేజీ రుణాలు ఇచ్చేలా చర్యలు ● యాక్షన్ ప్లాన్ తయారుచేస్తున్న అధికారులుజగిత్యాల: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. అలాగే మహిళాసంఘాలను బలోపేతం చేసి వారు ఆర్థిక సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో ఇందిర మహిళాశక్తి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికలకు కొత్తగా మహిళాసంఘ గ్రూపులు ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ బ్యాంక్ రుణాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, బాలికలు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహిళ సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు 60 ఏళ్లు దాటితే వారిని గ్రూపులోంచి తొలగించారు. ప్రస్తుతం ఉన్నవారిని అలాగే ఉంచాలని, లేకుంటే వారికి ఒక ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, బాలికల్లో ఆనందం గతంలో 60 ఏళ్లు దాటాయంటే గ్రూపు నుంచి తొలగించారు. దీంతో వారు పొదుపు చేసుకునే అవకాశం కోల్పోయారు. వృద్ధులు కావడంతో వారికి బ్యాంక్ రుణాలు ఇవ్వలేమని అప్పుడు రిజెక్ట్ చేశాయి. తాజాగా ప్రభుత్వం కచ్చితంగా వృద్ధులకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ మహిళాసంఘాల ఆధ్వర్యంలో కొత్తగా ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరితోపాటు 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న బాలికలతో కూడా సంఘాలను ఏర్పాటు చేసి వారికీ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. వీరితోపాటు, సామాజిక మాద్యమాల మోసాలు, అత్యాచారాలు, ఇతరత్రా అంశాలపై వారికి చైతన్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక గ్రామంలో 12 మంది ఉంటే వారందరికీ ఒక గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. లేకుంటే వేరే సంఘాల్లో ఉంటారు. వీరందరికీ బ్యాంక్ రుణాలు అందించి వారిని ఆర్థిక సాధికారత సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాచరణ.. ఈనెల 12 నుంచి 14వరకు గ్రామాల వారిగా జాబితా రూపొందించి మహిళాసంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, బాలికలను గుర్తిస్తారు. 14 నుంచి 15 వరకు వారికి సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరించనున్నారు. బ్యాంక్ రుణాలు అందుతాయని చెప్పి వారిని గ్రూపులో చేర్పించేలా చూస్తారు. 15 నుంచి 30 వరకు సంఘాల్లో చేరిన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల్లో ఖాతాలను ఓపెన్ చేసి రుణాలు అందిస్తారు. వీరికి సంబంధించిన వివరాలన్నింటినీ సెర్ప్ వెబ్సైట్లో నమోదు చేస్తారు. రుణాలు అందజేత ఈ సంఘాలను రూపొందించిన అనంతరం మహిళాసంఘాలను సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి రుణాలు సైతం మంజూరు చేయనున్నారు. రీవాల్వింగ్ ఫండ్ను ఖాతాల్లో జమచేస్తారు. మహిళల సాధికారతే లక్ష్యం జిల్లాలో మహిళా సంఘాలు 15019మొత్తం సభ్యులు 177250గ్రామైక్య సంఘాలు 565మండల సమైక్యలు 18జిల్లా సమైక్య 1మహిళలు సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో కొత్తగా మహిళాసంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో నూతనంగా వృద్ధులు, దివ్యాంగులకు, బాలికలతో గ్రూపులు ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నాం. వీరికి బ్యాంకు నుంచి లింకేజీ రుణాలు అందిస్తాం. – రఘువరణ్, డీఆర్డీఏ పీడీ -
నేడు జగిత్యాలకు మంత్రి పొన్నం
జగిత్యాలటౌన్: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధశారం జగిత్యాలకు రానున్నారు. ఉదయం 9గంటలకు గొల్లపల్లి బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మాజీమంత్రి జీవన్రెడ్డి సోదరుడి కూతురి వివాహానికి హాజరవుతారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పోగొట్టుకున్న 1268 సెల్ఫోన్లు అందజేతజగిత్యాలక్రైం: జిల్లా పరిధిలో పోగొట్టుకున్న.. చోరీకి గురైన 1268 సెల్ఫోన్లను ఎస్పీ అశోక్ కుమార్ తన కార్యాలయంలో బాధితులకు మంగళవారం అందించారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకుంటే ఫోన్ను గుర్తించవచ్చని ఎస్పీ అన్నారు. సీఈఐఆర్లో వినియోగదారులు తమ వివరాలు నమోదు చేసుకుంటే మొబైల్ఫోన్ను ఈపోర్టల్ ద్వారా గుర్తించవచ్చన్నారు. సెల్ఫోన్ రికవరీకి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆర్ఎస్సై, హెడ్కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీంను నియమించామని తెలిపారు. ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ఖాన్, సీఈఆర్ఐ హెడ్కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుళ్లు అజర్, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకు మోస్తరు వర్ష సూచనజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రానున్న ఐదురోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి. శ్రీలక్ష్మి తెలిపారు. శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 30 డిగ్రీలుగా, రాత్రి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. రాజగంగారాం సమస్యపై ఆర్డీవో విచారణమల్లాపూర్: మండలంలోని ముత్యంపేటలో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ విచారణ చేపట్టారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు మర్రిపెల్లి రాజగంగరాంను అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్, ఇతర సిబ్బంది ఈడ్చుకెళ్లిన విషయం తెల్సిందే. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆదేశాల మేరకు ఆర్డీవో శ్రీనివాస్ ముత్యంపేటలో విచారణ చేపట్టారు. రాజగంగరాం సమస్యపై ఇరువర్గాలు, గ్రామస్తుల వాదనలు తెలుసుకున్నానని, నివేదికను కలెక్టర్కు అందిస్తానని తెలిపారు. ఆయ న వెంట తహసీల్దార్ రమేష్గౌడ్, ఎంపీడీవో శశికుమార్రెడ్డి, ఎంపీవో జగదీశ్, ఆర్ఐ రాజేశ్, పంచాయతీ కార్యదర్శి ముబిన్ ఉన్నారు. మంటల అదుపునకు రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ బృందంమెట్పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ప్రమాదం జరిగి 60 గంటలు దాటినా మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఉన్నతాధికారులు ఎస్డీఆర్ఎఫ్ (రాష్ట్ర విపత్తు స్పందన దళం)ను రంగంలోకి దింపారు. రెండు రోజులుగా గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న అగ్ని మాపక సిబ్బంది అలసిపోవడం, మంటలు తగ్గకపోవడంతో మంగళవారం రాత్రి తొమ్మిది మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రమాద స్థలానికి పంపారు. వారు బుధవారం ఉదయం వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తారని అధికారులు తెలిపారు. గోదాం వద్ద కరెంట్ సదుపాయం లేకపోవడం, జనరేటర్ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి కొద్దిసేపు పనులకు అంతరాయం కలిగింది. తర్వాత జనరేటర్ను తెప్పించడంతో తిరిగి పనులను కొనసాగించారు. -
● రాయితీపై సాగు పరికరాలు ● ఏడేళ్ల తర్వాత నిధుల కేటాయింపు ● జిల్లాకు రూ.3.11 కోట్లు మంజూరు ● మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ ● లబ్ధిదారులను ఎంపిక చేయనున్న కమిటీలు
గొల్లపల్లి: వ్యవసాయ యాంత్రీకరణకు మోక్షం లభించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత వ్యవసాయ పరికరాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే ఈ ఏడాది కేవలం పనిముట్లకే పరిమితం చేశారు. పంట సాగులో కూలీల ఖర్చును తగ్గించడానికి యాంత్రీకరణ దోహదపడుతుంది. 2025–26కుగాను జిల్లాకు 4,194 యూనిట్లకు రూ.3.11కోట్లు మంజూరు చేశారు. త్వరలో రైతులకు పరికరాలు అందించేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లాలో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. రైతులకు అందించేందు వ్యవసాయ పరికరాలను మహిళ రైతులతో పాటు, ఎస్సీ, ఎస్టీ, రైతులకు 50 శాతం రాయితీపై ఇవ్వనున్నారు. మిగతా వారికి 40శాతంతో అందించనున్నారు. 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు సబ్సిడీపై వివిధ రకాల పరికరాలు అందిస్తారు. స్ప్రేయర్లు, ట్రాక్టర్తో నడిచే వ్యవసాయ పరికరాలు రోటోవేటర్లు, నాగళ్లు, గొర్రు, కలుపుతీసే యంత్రాలు, పవర్టిల్లర్లు, మొక్కజొన్న తీసే యంత్రం తదితర వాటిని అందించనున్నారు. ఎంపిక బాధ్యత కమిటీలదే యాంత్రీకరణ పరికరాలు అందించేందుకు జిల్లా, మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రాయితీ రూ.లక్ష దాటితే జిల్లా కమిటీ ఆమోదం తప్పనిసరి. ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న వారు ఈ రాయితీకి అర్హులు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్గా.. డీఏవో, ఆగ్రోస్, ఎల్డీఎం, శాస్త్రవేత్త సభ్యులుగా ఉండనున్నారు. మండలస్థాయి కమిటీలో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవోలు ఉంటారు. ఏడేళ్ల తర్వాత... 2017–18 వరకు యాంత్రీకరణ పథకం అమలులో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాదిగాను నిధులు మంజూరు చేసింది. గతంలో రైతులకు వ్యవసాయం కోసం ట్రాక్టర్లు అందించేవారు. ఈ ఏడాది కేవలం పనిముట్లకే పరిమితం చేశారు. అయితే గతంలో మాదిరిగా ట్రాక్టర్లు కూడా అందిస్తే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పలువురు అన్నదాతలు సూచిస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు జిల్లాకు వచ్చిన పనిముట్లు పనిముట్లు యూనిట్లు నిధులు(రూ.లక్షల్లో) సబ్సిడీ బ్యాటరీ/ఫూట్/మ్యానువల్ ఆపరేటెడ్ 3106 31.06 1,000 పవర్ స్ప్రేయర్స్ 513 51.30 10,000 రోటోవేటర్ 174 87 50,000 సీడ్కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 43 12.90 30,000 డిస్క్హారో, కల్టివేటర్, ఎంబీఫ్లౌ, కేజీవీల్స్, రోటోఫ్లడర్స్ 226 45.20 20,000 బాండ్ఫార్మర్ 12 1.80 15,000 పవర్ వీడర్ 17 5.95 35,000 బ్రష్ కట్టర్ 41 14.35 35,000 పవర్ టిల్లర్స్ 25 25.00 1,00,000 స్ట్రాబ్బేలర్స్ 37 37.00 1,00,000 -
పంద్రాగస్టు ఏర్పాట్ల పరిశీలన
జగిత్యాల/జగిత్యాలక్రైం: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జిల్లావ్యాప్తంగా డాగ్స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీంలతో తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజారవాణా కేంద్రాలు, సమావేశ ప్రాంగణాలు, ముఖ్య రహదారులు, వంతెనలు, పబ్లిక్ ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీస్స్టేషన్, డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ముందుగా కలెక్టర్ సత్యప్రసాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్ను పరిశీలించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, మున్సిపల్ కమిషనర్ స్పందన ఉన్నారు. -
పదేళ్ల అనంతరం రేషన్కార్డులు
● పల్లె దవాఖానాల ద్వారా మెరుగైన వైద్యం ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాల: రాష్ట్రంలో పదేళ్ల అనంతరం కొత్త రేషన్కార్డులు మంజూరవుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో మంగళవారం 1,597 కొత్త రేషన్కార్డులు, 17మందికి కల్యాణలక్ష్మీ చెక్కులు, 44 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసారు. నాగునూర్లో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. రూ.17.60లక్షలతో సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కస్తూరిబా బాలికల విద్యాలయంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, తహసీల్దార్ వాహిదొద్దీన్, ఎంపీడీవో గంగాధర్, మండల వైద్యాధికారి రాధారెడ్డి, ఆర్ ఐ వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మేం ఒరిజినల్.. రేషన్కార్డుల పంపిణీ సందర్భంగా మాజీమంత్రి జీవన్రెడ్డి వర్గీయులు రైతువేదిక వద్ద నిరసనకు దిగారు. ఎమ్మెల్యే చుట్టూ ఆయన వర్గీయులు చేరడం.. జీవన్రెడ్డి వర్గం వారికి నిలబడేందుకూ స్థలం లేకపోవడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు వారికి కుర్చీలు వేయించారు. రేషన్కార్డుల పంపిణీకి తమను పిలవలేదని రైతువేదిక మెట్లపై బైఠాయించి తమది ఒరిజినల్ కాంగ్రెస్ అని, వారిది డూప్లికేట్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. జగిత్యాలరూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్, బీర్పూర్ ఎస్సైలు గీత, రాజు వారిని సముదాయించారు. నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ కండువాలు కప్పుకోకుంటే తాము ఎలా ఒప్పుకుంటామని నాయకులు వారితో వాదనకు దిగారు. నిరసన తెలిపిన వారిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాంచందర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శులు ఆసాది హరీశ్, చేకుట శేఖర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అప్పం స్వామి, నాయకులు ఉన్నారు. అయితే ఎమ్మెల్యేతో కలిసి తాజామాజీ ప్రజాప్రతినిధులు చెక్కులను పంచడం విమర్శలకు తావిచ్చింది. -
రోగాలు ఫుల్.. బెడ్లు నిల్
● ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల తాకిడి ● వాతావరణ మార్పులతో వ్యాధులు ● వరండాలోనే వైద్యమందిస్తున్న వైద్యులుజగిత్యాల: వాతావరణ మార్పులతో జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ప్రజలు వివిధ రోగాలతో ఆస్పత్రులకు తరలివస్తున్నారు. వైద్యాధికారులు డోర్ టు డోర్ సర్వే చేస్తూ.. అనుమానితులను గుర్తిస్తూ.. చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు డెంగీ ప్రభావం పెద్దగా లేనప్పటికీ టైపాయిడ్, మలేరియా ప్రబలుతున్నాయి. అయితే జిల్లాకేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో బెడ్లు లేకపోవడంతో రోగులకు వరండాలోనే చికిత్స అందిస్తున్నారు. జిల్లాకేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుకుముందు ఓల్డ్ బస్టాండ్ ప్రాంతంలో 100 పడకల ఆస్పత్రి ఉండేది. వైద్య కళాశాల ఏర్పడటంతో ఈ ఆస్పత్రిలో 30 పడకల వరకు పెంచి ధరూర్ క్యాంప్లో రూ.17 కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులోనూ 200 బెడ్ల వరకు ఉన్నాయి. వైద్య కళాశాల నామ్స్ ప్రకారం 330 బెడ్లు ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆర్థో, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెంటల్, ఎమర్జెన్సీ విభాగాలు కొనసాగుతున్నాయి. మాతా శిశు సంక్షేమ కేంద్రంలో గైనకాలజీ, పిడియాట్రిక్, డెర్మటాలజీ, అస్తమాలజీ, సైకియాట్రిక్ విభాగాలు కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం ప్రజలు జ్వరాలకు సంబంధించి జనరల్ మెడిసిన్ వద్దకే వెళ్తుంటారు. ఈ విభాగం పాతబస్టాండ్లోని జనరల్ ఆస్పత్రిలో ఉండటంతో ఇక్కడనే బారులు తీరుతున్నారు. ఇక్కడ 130 పడకలు మాత్రమే ఉండటం.. దాదాపు 200కు పైగా ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. ఓపీ నిత్యం వెయ్యికి పైగా వస్తున్నారు. కొన్ని విభాగాలు మాతాశిశు సంక్షేమ కేంద్రానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు. కొన్ని ఇక్కడ... కొన్ని అక్కడ కొన్ని విభాగాలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో.. కొన్ని ధరూర్లోని మాతాశిశు సంక్షేమ కేంద్రంలో ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. మాతాశిశు సంక్షేమ కేంద్రంలోనే ఎక్కువ బెడ్స్ ఉన్నాయి. అక్కడ జనరల్ మెడిసిన్కు సంబంధించిన కొంతమంది సిబ్బందిని పంపిస్తే ఈ కొరత తీరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభించడంతో ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువైంది. మాతాశిశు సంక్షేమ కేంద్రానికి ఓల్డ్ బస్టాండ్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో వైద్యులు కూడా వెళ్లి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఎక్కడ ఉన్నా వెళ్లాల్సి ఉంటుంది. కొందరు వెళ్లడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నీ ఉన్నా... జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 330 బెడ్ల వరకు ఉన్నప్పటికీ రెండు చోట్ల ఆస్పత్రులు ఉండటం.. కొన్ని విభాగాలు అక్కడ, కొన్ని విభాగాలు ఇక్కడ ఉండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. 330 బెడ్లు ఒకేచోట ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావు. పాత ఆస్పత్రిలో సౌకర్యాలు లేనప్పుడు కొత్త ఎంసీహెచ్కు జనరల్ మెడిసిన్కు సంబంధించిన విభాగాలను అక్కడకు తరలిస్తే బెడ్స్ సరిపోవనే సమస్య తలెత్తదు. ఓల్డ్బస్టాండ్లో ప్రభుత్వ ఆస్పత్రి ఉండటం, చుట్టు మండలాల నుంచి ప్రజలకు ఇది సౌకర్యవంతంగా ఉండటంతో ఇక్కడకే వస్తున్నారు. ఆ విభాగానికి కాకున్నప్పటికీ మరికొన్ని విభాగాలను ఇక్కడకు తరలిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. – సుమన్రావు, ఆస్పత్రి ఆర్ఎంవోమరికొన్ని బెడ్స్ ఏర్పాటు చేస్తేనే పాతబస్టాండ్ సమీపంలోని ఆస్పత్రిలో ప్రస్తుతం 150 బెడ్స్ మాత్రమే ఉండటం ఇబ్బందికరంగా మారింది. ఆస్పత్రిలో ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పేషెంట్లను ఉంచుతున్నారు. వెంట వచ్చిన బంధువులు ఎక్కడెక్కడో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పై ఫ్లోర్లలో అదనపు గదులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఒకేసారి కేసులు రావడంతో ఫ్లో పెరిగింది. రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. మాతాశిశు సంక్షేమ కేంద్రంలో పిడియాట్రిక్స్ మాత్రమే చికిత్స అందిస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం సైకియాట్రిస్ట్, ఆప్తమాలజీ విభాగాలున్నాయి. -
రామన్నపేట పరిధి చూపండి
మాది మల్యాల మండలం రామన్నపేట. ప్రొసీడింగ్ నంబర్ 470/78 ఈల్సీఈ ఏ5 తేదీ 15–10–1978 నాటి కలెక్టర్ ఉత్తర్వుల ద్వారా నూకపల్లి నుంచి వీడి ప్రత్యేక గ్రామపంచాయతీగా అయ్యింది. రామన్నపేట పంచాయతీ నుంచి అనుమతి పొంది నిర్మించుకున్న ఇళ్లు, దుకాణాలు నూకపెల్లి పరిధిలోకే వస్తాయంటూ కొందరు బెదిరిస్తున్నారు. ఇది శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉంది. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మా గ్రామానికి గతంలో కేటాయించిన సర్వేనంబర్ల ప్రతిని అందించి ఇరుగ్రామాల మధ్య గొడవలకు ఆస్కారం లేకుండా చూడండి. – రామన్నపేట గ్రామస్తులు -
ప్రజావాణికి 40 అర్జీలు
● జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన బాధితులు● పరిష్కరించాలని వేడుకోలుజగిత్యాలటౌన్:కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 40మంది అర్జీలు పెట్టుకున్నారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు పులి మధుసూదన్గౌడ్, జివాకర్, శ్రీనివాస్, డీఆర్డీవో రఘువరణ్, అధికారులు పాల్గొన్నారు. -
యూరియాపై ఆందోళన వద్దు– మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
జగిత్యాల: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని, సరిపడా స్టాక్ ఉందని, ఆధార్కార్డు ద్వారా సరఫరా చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. యూరియా ముడిసరుకు ఆలస్యం కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎళ్లవేళలా రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. జగిత్యాలకు వచ్చిన ఆయనను టీఎన్జీవో నాయకులు కలిశారు. పెండింగ్ బిల్లుల మంజూరు, ఉద్యోగుల హెల్త్స్కీం అమలు, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ మంజూరు చేయాలని, పీఆర్సీ అమలు వంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేందర్రెడ్డి, అమరేందర్రెడ్డి, నాయకులు మహబూబ్, రాజేందర్, రవికుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుడికి మంత్రి పరామర్శ కొడిమ్యాల: కాంగ్రెస్ నాయకుడు, ప్యాక్స్ చైర్మన్ రాజనర్సింగరావును మంత్రి పరామర్శించారు. ఆయన తల్లి ప్రేమలత (70) హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పరామర్శించారు. -
ప్రజావాణికి 40 అర్జీలు
జగిత్యాలటౌన్:కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 40మంది అర్జీలు పెట్టుకున్నారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు పులి మధుసూదన్గౌడ్, జివాకర్, శ్రీనివాస్, డీఆర్డీవో రఘువరణ్, అధికారులు పాల్గొన్నారు. -
రామన్నపేట పరిధి చూపండి
మాది మల్యాల మండలం రామన్నపేట. ప్రొసీడింగ్ నంబర్ 470/78 ఈల్సీఈ ఏ5 తేదీ 15–10–1978 నాటి కలెక్టర్ ఉత్తర్వుల ద్వారా నూకపల్లి నుంచి వీడి ప్రత్యేక గ్రామపంచాయతీగా అయ్యింది. రామన్నపేట పంచాయతీ నుంచి అనుమతి పొంది నిర్మించుకున్న ఇళ్లు, దుకాణాలు నూకపెల్లి పరిధిలోకే వస్తాయంటూ కొందరు బెదిరిస్తున్నారు. ఇది శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉంది. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మా గ్రామానికి గతంలో కేటాయించిన సర్వేనంబర్ల ప్రతిని అందించి ఇరుగ్రామాల మధ్య గొడవలకు ఆస్కారం లేకుండా చూడండి. – రామన్నపేట గ్రామస్తులు -
సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 15 మంది వివిధ సమస్యలపై దరఖాస్తుల చేసుకున్నారు. ఎస్పీ వారితో నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వరదకాలువకు నీటి నిలిపివేతజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరదకాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు సోమవారం గేట్లను కిందకు దించారు. ఈనెల ఏడో తేదీ నుంచి వరదకాలువకు మూడు వేల క్యూసెక్కుల చొప్పున సాగు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 19,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. నీటి నిల్వ 44.49 టీఎంసీలుగా ఉంది. కాకతీయ కాలువకు 3500 క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 150, అలీ సాగర్, గుత్పా ఎత్తిపోతలకు 495, మిషన్ భగరీథకు 231 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు వేయాలి జగిత్యాల: పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మైనార్టీ గురుకులంలో మాత్రలు పంపిణీ చేశారు. నులిపురుగులు, కొంకి పురుగులు, ఎలికపాములు అభివృద్ధి చెంది అనారోగ్యానికి గురవుతారని, మాత్రలు వేసుకుంటూ అవన్నీ నశించిపోతాయని పేర్కొన్నారు. పోషకాహార లోపం, తీవ్రమైన అలసట, చదువుపై ధ్యాస ఉండదన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ చిత్రనాయక్, కట్కం భూమేశ్వర్, ప్రిన్సిపల్ సుచరిత పాల్గొన్నారు. తహసీల్దార్ల బదిలీలుఙ జిల్లాలోని పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ను ధర్మపురికి, నాయబ్ తహసీల్దార్ అరుణ్కుమార్కు ఫుల్ అడిషనల్ చార్జి తహసీల్దార్గా నియమించారు. బుగ్గారం తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ మాజీద్ను గొల్లపల్లికి, జగిత్యాల అర్బన్ నాయబ్ తహసీల్దార్ ఎల్.తిరుపతిని బుగ్గారం ఫుల్ అడిషనల్ చార్జి తహసీల్దార్గా, గొల్లపల్లి తహసీల్దార్ వరందన్ను కలెక్టరేట్లో రిపోర్ట్ చేయాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న శరణు.. శరణుసారంగాపూర్: శ్రావణ సోమవారం కావడంతో దుబ్బరాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోడెమొక్కులు, గజశూలం, గండదీపం, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. స్వామివారికి అర్చన, అభిషేకాలు చేశారు. ఆలయ ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకరయ్య, ఆలయ సిబ్బంది భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 15 మంది వివిధ సమస్యలపై దరఖాస్తుల చేసుకున్నారు. ఎస్పీ వారితో నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వరదకాలువకు నీటి నిలిపివేతజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరదకాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు సోమవారం గేట్లను కిందకు దించారు. ఈనెల ఏడో తేదీ నుంచి వరదకాలువకు మూడు వేల క్యూసెక్కుల చొప్పున సాగు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 19,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. నీటి నిల్వ 44.49 టీఎంసీలుగా ఉంది. కాకతీయ కాలువకు 3500 క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 150, అలీ సాగర్, గుత్పా ఎత్తిపోతలకు 495, మిషన్ భగరీథకు 231 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు వేయాలి జగిత్యాల: పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మైనార్టీ గురుకులంలో మాత్రలు పంపిణీ చేశారు. నులిపురుగులు, కొంకి పురుగులు, ఎలికపాములు అభివృద్ధి చెంది అనారోగ్యానికి గురవుతారని, మాత్రలు వేసుకుంటూ అవన్నీ నశించిపోతాయని పేర్కొన్నారు. పోషకాహార లోపం, తీవ్రమైన అలసట, చదువుపై ధ్యాస ఉండదన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ చిత్రనాయక్, కట్కం భూమేశ్వర్, ప్రిన్సిపల్ సుచరిత పాల్గొన్నారు. తహసీల్దార్ల బదిలీలుఙ జిల్లాలోని పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ను ధర్మపురికి, నాయబ్ తహసీల్దార్ అరుణ్కుమార్కు ఫుల్ అడిషనల్ చార్జి తహసీల్దార్గా నియమించారు. బుగ్గారం తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ మాజీద్ను గొల్లపల్లికి, జగిత్యాల అర్బన్ నాయబ్ తహసీల్దార్ ఎల్.తిరుపతిని బుగ్గారం ఫుల్ అడిషనల్ చార్జి తహసీల్దార్గా, గొల్లపల్లి తహసీల్దార్ వరందన్ను కలెక్టరేట్లో రిపోర్ట్ చేయాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న శరణు.. శరణుసారంగాపూర్: శ్రావణ సోమవారం కావడంతో దుబ్బరాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోడెమొక్కులు, గజశూలం, గండదీపం, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. స్వామివారికి అర్చన, అభిషేకాలు చేశారు. ఆలయ ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకరయ్య, ఆలయ సిబ్బంది భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
‘డబుల్బెడ్రూం’ ఇళ్లలో వసతులు కల్పించాలి
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావుజగిత్యాల: నూకపల్లి అర్బన్ హౌసింగ్కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్లవద్ద వసతులు కల్పించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. సోమవారం కాలనీలో పర్యటించారు. దోమలు వ్యాపిస్తున్నాయని, పాములు, తేళ్లు తిరుగుతున్నాయని, వీధిదీపాలు వెలగడం లేదని, మురుగుకాలువలు లేవని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని జగిత్యాల బల్దియా కమిషనర్ స్పందనకు ఫోన్ చేసి ఆదేశించారు. కాలనీలో ఇళ్లు తొలగించిన వారికి తిరిగి ఇళ్లు కేటాయించాలని కలెక్టర్కు లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులు కొందరు ఆర్థిక స్థోమత లేక ఆలస్యం చేస్తున్నారని, ఇప్పటి ప్రభుత్వం వాటిని కూల్చివేసిందని, ఆ బాధితులకు తిరిగా ఇళ్లు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ కౌన్సిలర్ దేవేందర్నాయక్, శివకేసరిబాబు పాల్గొన్నారు. -
‘డబుల్బెడ్రూం’ ఇళ్లలో వసతులు కల్పించాలి
జగిత్యాల: నూకపల్లి అర్బన్ హౌసింగ్కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్లవద్ద వసతులు కల్పించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. సోమవారం కాలనీలో పర్యటించారు. దోమలు వ్యాపిస్తున్నాయని, పాములు, తేళ్లు తిరుగుతున్నాయని, వీధిదీపాలు వెలగడం లేదని, మురుగుకాలువలు లేవని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని జగిత్యాల బల్దియా కమిషనర్ స్పందనకు ఫోన్ చేసి ఆదేశించారు. కాలనీలో ఇళ్లు తొలగించిన వారికి తిరిగి ఇళ్లు కేటాయించాలని కలెక్టర్కు లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులు కొందరు ఆర్థిక స్థోమత లేక ఆలస్యం చేస్తున్నారని, ఇప్పటి ప్రభుత్వం వాటిని కూల్చివేసిందని, ఆ బాధితులకు తిరిగా ఇళ్లు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ కౌన్సిలర్ దేవేందర్నాయక్, శివకేసరిబాబు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
కోరుట్ల: రాజ్యాంగ పరిరక్షణ దేశంలోని ప్రతీ పౌరుని బాధ్యత అని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సినారే కళాభవన్లో వామపక్షాలు, పూలే అంబేడ్కర్, మైనార్టీ, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. నోటు కోసం ఓటును అమ్ముకోవద్దని సూచించారు. మానవ వికాస్ వేదిక రాష్ట్ర కార్యదర్శి డి. హన్మంతరావు మాట్లాడుతూ, రాజ్యాంగం దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. వామపక్షాల నాయకులు చెన్నా విశ్వనాథం, జి.తిరుపతి నా యక్, చింత భూమేశ్వర్, ప్రజా సంఘాల జేఏ సీ రాష్ట్ర అధ్యక్షుడు పేట భాస్కర్, భారత్ బచా వో జిల్లా కార్యదర్శి పి.నారాయణ, లక్ష్మ క్క, పీయూసీఐ భీమయ్య, టీపీజేసీ నాయకుడు పొన్నం రాజమల్లయ్య, వడ్డెర వృత్తి సంఘం జిల్లా కార్యదర్శి కుంచం శంకర్ పాల్గొన్నారు. బెదిరించినవారిపై చర్యలు తీసుకోవాలిమల్యాల(చొప్పదండి): మల్యాల మండలం రామన్నపేట శివారులోని నిర్మాణాలకు రామన్నపేట బోర్డు తొలగించాలని సంబంధిత యజమానులను బెదిరిస్తున్నవారిపై చర్యలు తీసుకోవా లని ఆదివారం గ్రామస్తులు సీఐ రవికి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఇటీవల నూతనంగా నిర్మించిన ఫంక్షన్హాల్కు రామన్నపేట గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకొని బోర్డు ఏర్పాటు చేస్తే అది నూకపల్లి సరిహద్దు అని భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. అలాగే మహామార్ట్, డాక్టర్ వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలకుసైతం రామన్నపేట బోర్డు తొలగించాలని హెచ్చరించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు పన్నాల మహేందర్రెడ్డి, వెల్మ లక్ష్మారెడ్డి, గడ్డం మల్లారెడ్డి, నేరెళ్ల సతీశ్, నేరెళ్ల నర్సింహారెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రవీణ్, అజారొద్దీన్, వలీ మహమ్మద్, కోరుట్ల మురళి పాల్గొన్నారు. యూనియన్ బ్యాంకులో మోగిన సైరన్జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో గల యూనియన్ బ్యాంకులో ఆదివారం మధ్యాహ్నం సైరన్ మోగింది. దీంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వారు అప్రమత్తమై వెంటనే బ్యాంకు అధికారులను పిలిపించారు. అధికారులు బ్యాంకులో పరిశీలించి సాంకేతిక లోపంతోనే సైరన్ మోగినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో, పోలీసులు, బ్యాంకు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని ఆందోళనజగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని వివిధ కుల సంఘాల్లో పొదుపు డబ్బులు తీసుకుని చెల్లించడం లేదని గ్రామానికి చెందిన కొంతమంది ఆదివారం డబ్బు తీసుకున్న వ్యక్తి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన సుమారు 15 మంది అదే గ్రామానికి చెందిన ఓ నాయకుడికి రూ.15–20 లక్షలు అవసరం నిమిత్తం పొదుపు డబ్బులు ఇచ్చారు. తిరిగి డబ్బులు చెల్లించాలని అడిగితే, తాను రాజకీయ నాయకుడినని, ‘మీ దమ్మున్న చోట చెప్పుకో’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని నిరసిస్తూ నాయకుడి ఇంటి ఎదుట ఆదివారం ఆందోళన చేశారు. రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పేదల సొంతింటి కల నెరవేర్చిన ఇందిరమ్మ పథకం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కథలాపూర్(వేములవాడ): ఇళ్లులేని పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని కలిగోట, పోతారం గ్రామాల్లో ఇందిరమ్మ పథకంలో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించారు. రెండు గ్రామాల్లో 19 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, మిగతా లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని, నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరై పనులు జరుగుతున్నాయన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్పర్సన్ పులి శిరీషా, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు తొట్ల అంజయ్య, ఎండీ అజీమ్, కల్లెడ గంగాధర్, హరిప్రసాద్, మ్యాదరవేని రాజు, రాధాకృష్ణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘సర్కారు’ భూమి ‘హస్తగతం’
● రూ.60కోట్ల విలువైన స్థలం రికవరీ సాక్షిప్రతినిధి, కరీంనగర్: పరాధీనంలో ఉంటున్న రూ.కోట్లాది విలువైన భూమిని కలెక్టర్ చొరవతో అధికారులు తిరిగి హస్తగతం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రం శివారులోని చంద్రగిరి సమీపంలో సర్వేనంబరు 25, 26లోని ప్రభుత్వ భూమిలో చాలా ఏళ్లు ఇటుకబట్టీలను తిప్పాపూర్కు చెందిన ఓ వ్యక్తి నడిపించాడు. జిల్లా కలెక్టర్గా సందీప్కుమార్ ఝా వచ్చినప్పటి నుంచి పరాధీనంలో ఉంటున్న ప్రభుత్వ భూములను రికవరీ చేస్తున్నారు. గతంలో కొంతమందిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే చంద్రగిరి శివారులో ఉన్న భూమి ప్రస్తుతం రూ.60కోట్ల వరకు పలుకుతోంది. ఇటుక బట్టీలు నడిపించిన వ్యక్తి ఇతరుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ప్రభుత్వ భూమి కావడంతో సదరు భూమిలో ఇటుకబట్టీలు నడిచి పరాధీనంలో ఉంటున్నాయన్న విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూములుగా తేలడంతో వెంటనే రికవరీకి ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఆదివారం సదరు భూమిలో ఉన్న కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చేశారు. రూ.60కోట్ల విలువైన భూమి ప్రభుత్వపరం కావడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. -
జగిత్యాల మున్సిపాల్టీకి అత్యధిక నిధులు
జగిత్యాలటౌన్: రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో జగిత్యాలకు సీఎం రేవంత్రెడ్డి అత్యధిక నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే సంజయ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 19,26,27వ వార్డుల్లో రూ.50లక్షల నిధులతో చేపట్టే సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు ప్రారంభించి మాట్లాడారు. జగిత్యాల మున్సిపాల్టీకి ఇప్పటి వరకు రూ.140 కోట్లు, స్టాంపు డ్యూటీ కింద మరో రూ.10 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం గతంలో రూ.34కోట్లు, ప్రస్తుతం మరో రూ.20 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. రూ.50 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. అలాగే తాటిపల్లి గ్రామంలో రూ.27 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన, రూ.6 లక్షలతో నిర్మించిన తాగునీటి పైపులైన్ను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, తహసీల్దార్ శ్రీనివాస్, డీఈ ములింద్, రామారావు, ఎంపీవో రవిబాబు, నాయకులు దామోదర్రావు, ఎల్లారెడ్డి, నక్కల ర వీందర్ రెడ్డి, ముకుందం, శంకర్, అంజన్న, గంగారెడ్డి, మల్లారెడ్డి, మహేశ్వర్రావు తదితరులు పాల్గ్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
నియంత్రణ చర్యలు అంతంతే..
● అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల ఇప్పట్లో కుక్కల నియంత్రణ సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ● కుక్కలను బర్త్ కంట్రోల్ సెంటర్కు తరలించి చికిత్స చేసిన అనంతరం తిరిగి వాటిని పట్టుకున్న ప్రదేశాల్లోనే వదిలిపెడుతున్నారు. ● దీంతో ప్రస్తుతం వీధుల్లో వాటి బెడద తొలగిపోయే అవకాశం మాత్రం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. ● పెరిగిపోతున్న కుక్కల బెడద వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ● ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కేవలం కుక్కల సంతానోత్పత్తిని తగ్గించడానికి మాత్రమే పరిమితం కాకుండా వాటిని నియంత్రించే చర్యలపైనా కూడా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
చెట్లను నరికి.. చదును చేసి
● యథేచ్ఛగా అటవీ భూముల ఆక్రమణ ● దాదాపు 300ఎకరాలు కబ్జా కథలాపూర్(వేములవాడ): చెట్లను విరివిగా పెంచి ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం ఓ వైపు ఏటా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తుండగా.. పలు గ్రామాల్లో అటవీశాఖకు చెందిన సుమారు 300 ఎకరాల్లో చెట్లను యథేచ్ఛగా నరికివేసి సాగు భూములుగా మార్చుతున్నారు. ఇంతా జరుగుతున్న నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల శివారులో అటవీశాఖ పరిధిలోని భూములు పచ్చని చెట్లతో దర్శనమివ్వాల్సి ఉండగా అవి కనుమరుగవుతున్నాయని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాకు గురైన అడవులను అధికారులు రక్షించాలని కోరుతున్నారు. 2,521 హెక్టార్లలో.. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలుండగా.. అటవీశాఖ తరుఫున మూడు బీట్లుగా విభజించారు. పోతారం బీట్ పరిధిలో పోతారం, ఇప్పపెల్లి, కలిగోట గ్రామల్లో 1,000 హెక్టార్ల భూమి, అంబారిపేట బీట్ పరిధిలో అంబారిపేటలో 600 హెక్టార్లు, చింతకుంట బీట్ పరిధిలోని 11 గ్రామాల్లో 921 హెక్టార్లలో అటవీశాఖ భూములున్నాయి. కాగా అటవీశాఖకు చెందిన భూములను కొందరు కబ్జా చేస్తున్నారు. యంత్రాలతో రాత్రివేళ చెట్లను తొలగించి భూములు చదును చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో పలువురు అటవీ భూములను చదును చేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇలా మండలంలోని మూడు బీట్ల పరిధిలో 300 ఎకరాల అటవీభూములను కబ్జా చేసి పంటలు సాగుచేస్తున్నట్లు సమాచారం. గతేడాది కాలం నుంచి పోతారం, చింతకుంట బీట్ పరిధిలోని అటవీశాఖ భూములపై పలువురు కన్నేసి చెట్లను తొలగిస్తుండటంపై ఒకరి నుంచి మరొకరికి సమాచారం వ్యాప్తి చెందడంతో ఈ తతంగం యథేచ్ఛగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చొరవ చూపి అటవీ భూములకు హద్దులు నిర్ణయించాలని, కబ్జాకు గురైనవాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అటవీభూములను కాపాడాలి
చెట్లను కాపాడడం అందరి బాధ్యతగా భావించాలి. అటవీ భూములు పచ్చని చెట్లతో కళకళలాడాలి. అవి అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం సరికాదు. ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తున్నపటికీ చెట్లను నరికివేసే వారిపై చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పటికై నా అధికారులు అటవీభూములను కాపాడాలి. – తాలుకా మల్లేశ్, పౌర మానవహక్కుల సంస్థ ప్రతినిధి, కథలాపూర్ చర్యలు తీసుకుంటాం అటవీభూముల్లోని చెట్లను తొలగించడం నేరం. అటవీశాఖ భూముల్లో చెట్లను తొలగిస్తే ప్రజలు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలి. చెప్పినవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అటవీభూములను చదును చేసి అక్రమించుకొని పంటలు సాగుచేస్తే వాటిని పరిశీలించి శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం. – ఎండీ ముస్తాక్ ఆలీ, అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్, కథలాపూర్ -
వణికిస్తున్న
మెట్పల్లి పట్టణంలోని ఓ వీధిలో సంచరిస్తున్న కుక్కల గుంపుమెట్పల్లి(కోరుట్ల): మెట్పల్లి మున్సిపాలిటీలో కుక్కల బెడదతో పట్టణవాసులు వణుకుతున్నారు. ఏ వీధిలో చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపించిన వారిపై దాడులకు తెగబడుతున్నాయి. ప్రతినెలా వందలాది మంది వీటి బారినపడి గాయాల పాలవుతున్నారు. వీటిని నియంత్రించాల్సిన మున్సిపల్ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వార్డుల్లో రోజురోజుకు వీటి సంఖ్య పెరుగుతూ పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడు నెలల్లో 1,870 మందికి కుక్కకాట్లు.. ● పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి రికార్డుల ప్రకారం.. గడిచిన ఏడు నెలల్లో 1,870 మంది కుక్కల దాడిలో గాయాలపాలయ్యారు. ● ఇందులో మెట్పల్లితో పాటు ఇతర ప్రాంతాలకు చెందినవారూ ఉన్నారు. ● అయితే వీరిలో ఎక్కువగా పట్టణానికి చెందిన వారే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ● గతంలో ఏడాదంతా ఈ కేసుల సంఖ్య వందకు మించేవి కావు. కానీ, ప్రస్తుతం ఒక్క నెలలోనే వంద కంటే ఎక్కువగా నమోదవుతుండడం కుక్కల తీవ్రతకు అద్దం పడుతోంది. సెంటర్ ఏర్పాటు.. అంతలోనే తరలింపు ● మెట్పల్లి మున్సిపల్ పరిధిలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల పరిధిలో సుమారు పదిహేను వందలకు పైగానే కుక్కలు ఉన్నట్లు అంచనా. ● అయితే కుక్కల నియంత్రణలో భాగంగా మొదట వాటి సంతానోత్పత్తిని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల క్రితం స్థానిక 7వ వార్డులో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ● సెంటర్లో 120 కుక్కలను తరలించి శస్త్ర చికిత్స చేశారు. ఇందుకు గాను ఒక్కో కుక్కకు మున్సిపాలిటీ రూ.1,650 వెచ్చిస్తోంది. ● ఇదిలా ఉంటే ఈ కేంద్రం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఇటీవల కోరుట్ల పట్టణ శివారుకు తరలించారు. ● ప్రస్తుతం కుక్కలను అక్కడకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.‘గాయాలతో కనిపిస్తున్న ఈ చిన్నారులది మెట్పల్లి పట్టణం. ఇటీవల తమ ఇళ్ల ముందు ఆడుకుంటున్న సమయంలో వీరిపై కుక్కలు దాడి చేశాయి. ఈ సంఘటనల్లో వారి ఒంటిపై పలు చోట్ల తీవ్రగాయాలయ్యాయి. నొప్పి భరించలేక విలవిల్లాడిపోయారు. ఇలా ఈ ఇద్దరే కాదు.. గడిచిన పది రోజుల్లో పట్టణంలో సుమారు పది మంది వరకు కుక్కల దాడిలో గాయపడడం స్థానికంగా వాటి బెడద ఎంతో ఉందో స్పష్టం చేస్తుంది. వీటిని నియంత్రించాలని చాలారోజులుగా పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నా మున్సిపల్ అధికారులు పెడచెవిన పెడుతూ వస్తున్నారు. దీంతో చాలామంది కుక్కల వల్ల గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు.’ -
వామ్మో చిరుత
● ధర్మపురి శివారులో సంచారం ● ధ్రువీకరించిన ఫారెస్టు అధికారులుధర్మపురి: ధర్మపురి శివారులో చిరుతపులి సంచరించిన ట్లు ఫారెస్టు అధికా రులు ధ్రువీకరించారు. ధర్మపురితో పాటు మండలంలో ని కమలాపూర్, నాగారం, ఆకసాయిపల్లె గ్రామాలకు సమీపంలో గుట్టలతో కూడిన దట్టమై న అడవి ఉంది. శనివారం సాయంత్రం కొందరు రైతులు, వ్యవసాయ కూలీలు పనులు ముగించుకొని వస్తుండగా ధర్మపురి– కమలాపూర్ వెళ్లే దారిలో చిరుతను భయభ్రాంతులకు గురై పరగులు తీశారు. ధర్మపురి నుంచి కమలాపూర్ వెళ్లే దారిలో పెట్రోలుబంకు పక్కనున్న చిన్న రహదారి గుండా నిత్యం వ్యవసాయదారులు పనుల కోసం వెళ్తుంటారు. పనులు ముగించుకొని వస్తుండగా చిరుత కనిపించినట్లు తెలిపారు. రంగంలోకి ఫారెస్టు అధికారులు చిరుతపులి సంచరించిన విషయంపై జిల్లా ఫారెస్టు అధికారులకు పలువురు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈక్రమంలో ఆదివారం ధర్మపురి శివారులోని కొన్ని ప్రదేశాలను సంబంధిత అధికారులు పరిశీలించారు. చిరుతపులి సంచరించినట్లు దాని పాదముద్రల ద్వారా గుర్తించారు. దాడికి పాల్పడవద్దు ధర్మపురి శివారులో చిరుతపులి సంచరించినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. దానిపై ఎవరూ దాడికి పాల్పడవద్దని సూచించారు. వ్యవసాయ పనులకు గుంపులుగుంపులుగా వెళ్లాలని, సాయంత్రం 4 గంటల వరకు పనులు ముగించుకొని ఇళ్లకు చేరాలని పేర్కొన్నారు. ధర్మపురితో పాటు మండలంలోని కమలాపూర్, రామయ్యపల్లె, నాగారం, ఆకసాయిపల్లె గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ విషయంలో బీసీలను నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. బీసీల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామంటూ మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కు పంపి హడావుడి చేసిందని విమర్శించారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయడం లేదని, కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చడం లేదంటూ కేంద్రంపై నెపం నెట్టి సీఎం, మంత్రులు ఢిల్లీ వెళ్లి ఆందోళన చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ పేరుతో హడావుడి చేసినప్పుడు రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటదన్న విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. రాహుల్గాంధీ ప్రధాని అయ్యాక బీసీ రిజర్వేషన్ సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం వారిని మోసగించడమేమన్నారు. బీసీల పట్ల బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉందన్నారు. రిజర్వేషన్ అమలుపై ఈనెల 14న కరీంనగర్ కేంద్రంగా నిర్వహించే సదస్సుకు బీసీలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, ఓరుగంటి రమణారావు, జవ్వాజి ఆ దిరెడ్డి, హరీశ్, రాజేశ్వర్రావు, హరీశ్ పాల్గొన్నారు. -
యువజన సంఘాల ఊసేది
కథలాపూర్: నెహ్రూ యువ కేంద్రంలో వాలంటీర్ల వ్యవస్థ నిలిచిపోయింది. ఏడాదిన్నర నుంచి పోస్టులు భర్తీ చేయడంలేదు. దేశప్రగతిలో యువతను భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర యువజన సర్వీ సుల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నెహ్రూ యువ కేంద్రం పేరును ఇటీవల ‘మేరా యువ భారత్’గా మార్చారు. యువజన సంఘాల ను పర్యవేక్షిస్తూ వారిలో చైతన్యం నింపేందుకు క్షేత్రస్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ పని చేయాల్సి ఉంటుంది. ఏడాదిన్నరగా జిల్లాలో కొత్తగా యువజన సంఘాల స్థాపన ఊసేలేదు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపేలా ప్రజా చైతన్య కార్యక్రమాలు స్తంభించిపోయాయని పేర్కొంటున్నారు. ఎన్వైకే వాలంటీర్లుంటే ప్రజా చైతన్య కార్యక్రమాలు ప్రస్తుత పరిస్థితుల్లో గంజాయి, మత్తు పదార్ధాలు యువతపై చెడు ప్రభావం చూపుతోంది. యువతలో మార్పు తేవడానికి ఎన్వైకే వలంటీర్ల కార్యక్రమాలు ప్రభావం చూపుతాయి. వలంటీర్ల నియామకాల్లో 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఉన్నత విద్య, కంప్యూటర్ పరిజ్ఞానం, స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ తెలిసి ఉండి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో పనిచేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు. గ్రామాల్లో సర్పంచుల, పట్టణాల్లో కౌన్సిలర్ల పాలన కొనసాగడంలేదు. ఇలాంటి సందర్భాల్లో యువ కేంద్రాల వలంటీర్లుంటే ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రయోజనముంటుందని అంటున్నారు. రక్తదాన శిబిరాలు, వన మహోత్సవం, స్వచ్ఛభారత్, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మూఢనమ్మకాల నిర్మూలన, బాల్య వివాహాలు అరికట్టడం, క్రీడలు తదితర సామాజిక కార్యక్రమాలు యువజ న సంఘాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో వలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తారు. వలంటీర్ వ్యవస్థ ఉద్యోగం కానప్పటికి సేవా భావంతో పని చేస్తుండటంతో గౌరవ వేతనం రూ.5 వేలు చెల్లిస్తారు. కొత్త జిల్లాల వారీగా నియమిస్తే ప్రయోజనం నెహ్రూ యువ కేంద్రం వలంటీర్ల నియామకం గురించి ఏడాదిన్నరగా పట్టించుకోవడంలేదని యువత అంటోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఎన్వైకేను కొనసాగిస్తుండటంతో జిల్లాకు కేవలం ముగ్గురు వలంటీర్లను మాత్రమే నియమించి అరకొరగా కార్యక్రమాలు నిర్వహించేవారు. జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతోంది. ప్రస్తుతం 20 మండలాలున్నాయి. రోజురోజుకూ జనాభా పెరుగుతుండటంతో కొత్త జిల్లాల ప్రకారం ఎన్వైకే కార్యక్రమాలు నిర్వహిస్తే రెండు మండలాలను కలిపి ఒక బ్లాక్గా ఏర్పాటు చేసి సుమారు 10 మంది వలంటీర్లను నియమించే అవకాశం ఉంటుందని యువజన సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇలా అయితేనే లక్ష్యం నెరవేరుతుందంటున్నారు. యువజనశాఖ ఉన్నతాధికారులు చొరవ చూపి కొత్త జిల్లాల ప్రకారం ఎన్వైకే వలంటీర్లను నియమించి ప్రజాచైతన్య కార్యక్రమాలు కొనసాగించాలని యువత కోరుతోంది. ఏడాదిన్నరగా నిలిచిన నెహ్రూ యువ కేంద్రం వలంటీర్ల నియామకం కొత్త జిల్లా ప్రకారం వలంటీర్లను నియమించాలంటున్న యువత -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ రాయికల్: రాజకీయాలకతీతంగా పనిచేసి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శనివారం రాయికల్ మండలం సింగరావుపేట, కిష్టంపేట గ్రామాల్లో రూ.10 లక్షల ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సింగరావుపేటలో మారంపల్లి మహేశ్, మహంకాళి రాజం, గంగరాజుకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం రేవంత్రెడ్డితో కలిసి పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పక్షాన ప్రజలు ఉండాలన్నారు. దశాబ్దాల కాలం తర్వాత నూతన రేషన్కార్డుల పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రుణమాఫీ, రైతు భరోసాతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా మారిందన్నారు. కార్యక్రమంలో రాంచందర్రావు, జానగోపి, జాన గంగాధర్, రవిగౌడ్, రవిందర్రావు, ముఖీద్, భీమయ్య, సిరిపురం సత్తయ్య, ఆదిరెడ్డి, జీవన్రెడ్డి, రాజమౌళి పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి కృషి జగిత్యాలరూరల్: ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి, బావోజీపల్లిలో హనుమాన్ ఆలయానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ మొగలుల పాలనలో ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయని, మన చరిత్ర మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని సూచించారు. ముందుగా ఇవే ఆలయానికి జెడ్పీ చైర్పర్సన్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో నాయకులు సదాశివరావు, ప్రకాశ్, శంకర్, శేఖర్, శాంతపురావు, రవీందర్రావు పాల్గొన్నారు. -
అన్నదానం టోకెన్లు ఎప్పుడో.. ఎక్కడో..!
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన ప్రసాదం కొందరికే అందుతోంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ ఆవరణలో నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళ, శనివారాల్లో 200 మంది భక్తులకు.. మిగిలిన రోజుల్లో రోజుకు వందిమంది చొప్పున భక్తులకు అన్నదానం అందిస్తున్నారు. అన్నదానం టోకెన్లు ప్రతిరోజు ఉదయం 11గంటలకు జారీ చేస్తుంటారు. ఈ టికెట్ల కోసం కొందరు ఉదయం 9గంటల నుంచే పడిగాపులు కాస్తున్నారు. టోకెన్లు ఎప్పుడిస్తారో..? ఎక్కడిస్తారో..? తెలియక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అన్నదానం టోకెన్లు జారీ సమయం తెలిసేలా ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతోపాటు, ప్రతి మంగళవారం, శనివారాల్లో కనీసం 300మందికి, మిగిలిన రోజుల్లో 200 మందికి ఉచిత అన్నదానం అందేలా ఆలయ అధికారులు చొరవ చూపాలని భక్తులు కోరుతున్నారు. -
మిగిలింది ఐదు రోజులే..!
రాఖీ వేడుకజగిత్యాల/కోరుట్ల/గొల్లపల్లి: రాఖీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరికి పలువురు రాఖీ కట్టారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కి ఆయన సోదరి డాక్టర్ సమత రాఖీ కట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్కు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, జీవన్రెడ్డికి మాజీ కౌన్సిలర్ అనిత రాఖీ కట్టారు. జగిత్యాల: ‘ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఆయా సమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15 వరకు దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలి..’ ఇది కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు జారీ చేసిన ఆదేశం. కానీ.. ఆయన ఆదేశాలు క్షేత్రస్థాయంలో గడువులోపు అమలయ్యే అవకాశం కన్పించడం లేదు. ఆయన ఇచ్చిన గడువుకు ఇంకా మిగిలింది ఐదు రోజులు మాత్రమే. ఆ లోపు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కన్పించడం లేదు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 24,420 దరఖాస్తులు వచ్చాయి. అందులో 24,387 దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. 21,591 మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో కేవలం 910 మాత్రమే పరిష్కారం అయ్యాయి. 434 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. ఈ ఆగస్టు 15లోపు సమస్యలన్నిటినీ పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా కొన్ని ఇబ్బందులతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బుగ్గారం మండలాన్ని ఎన్నుకుని అందులో దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో అత్యధికంగా మిస్సింగ్ సర్వేనంబర్లు రాగా, సాదాబైనామాలే 8,667 వచ్చాయి. మిస్సింగ్ సర్వేనంబర్లు 4,237 వచ్చాయి. వచ్చిన దరఖాస్తులన్నింటిని అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారుగానీ.. సమస్య పరిష్కరించాలంటే కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గత ప్రభుత్వం 2జూన్ 2014కు ముందు సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంది. కొన్నాళ్లకు సాదాబైనామాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం అలాంటి వాటిపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సాదాబైనామా దరఖాస్తులు పరిశీలించి క్రమద్ధీకరించాలని రైతులు కోరుతున్నారు. గడువులోపు కష్టమే.. జిల్లావ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో కేవలం 910 మాత్రమే పరిష్కరించారు. ఇంకా 23,510 పెండింగ్లో ఉన్నాయి. సమయం ఐదు రోజులే ఉండటంతో పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే అవకాశాలు కన్పించడం లేదు. వచ్చిన దరఖాస్తులను ఆయా సమస్యలను బట్టి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ నోటీసులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు చిన్నచిన్న సమస్యలకు సంబంధించి అప్డేట్ చేశారే కానీ పెద్ద సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. కొన్ని కోర్టులో సైతం పెండింగ్లో ఉండటంతో వాటిని పరిష్కరించాలన్నా కొన్ని టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. రైతుల్లో ఆశలు గతంలో ధరణి పోర్టల్ కొన్ని తప్పిదాలు ఉండటంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఎక్కువ శాతం సర్వేనంబర్లు మిస్సింగ్ కా వడం, ఒకరి సర్వేనంబర్లు మరొక రైతులకు రావడంతో ఇబ్బందులకు గురయ్యారు. దీంతో భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకురావడంతో రైతుల్లో కొంత ఆశలు రేకెత్తాయి. చిన్నచిన్న సమస్యలు అనేకంగా పరిష్కారమ్యాయి. పూర్తిస్థాయిలో పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ● ఆత్మకూర్ పెద్దవాగు ఇసుక రవాణాపై విమర్శలు ● రీచ్ నుంచి అనుమతి లేకుండానే తరలింపు ● ఇందిరమ్మ ఇళ్ల ఇసుకకూ డబ్బులు వసూలు ● తాజాగా ‘సూరమ్మ’ పనులకు అనుమతులపై అభ్యంతరంరీచ్ వద్దంటూనే ఇసుక తవ్వకాలు..మెట్పల్లిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ప్రభుత్వ అధికారి తన ఇంటి నిర్మాణ పనులకు ఇసుక కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. డీడీ తీసి కార్యాలయంలో అందించారు. ఆత్మకూర్ రీచ్ నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఇసుక కోసం ట్రాక్టర్లు వాగుకు వెళ్లగా కొందరు అడ్డుకున్నారు. అధికారులు హెచ్చరించినప్పటికీ వినకుండా రాద్దాంతం చేశారు. చివరకు పోలీసుల దృష్టికి వెళ్లడంతో ట్రాక్టర్లను అక్కడి నుంచి పంపించారు. ఇలా అనుమతి తీసుకున్న వారు ఇసుక తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతుండగా.. అనుమతి లేకుండా ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది. ‘భూభారతి’ సమస్యలు పరిష్కారమయ్యేనా..? ఈనెల 15వ తేదీ గడువు ఒకవైపు సిబ్బంది కొరత మరోవైపు సమస్యలపై స్పష్టత కరువు జిల్లాలో మొత్తం దరఖాస్తులు 24,420పరిష్కరించే దిశగా చర్యలు భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు గడువులోపు పూర్తి చేసేలా చూస్తాం. ఆన్లైన్లో అన్ని దరఖాస్తులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రతి సమస్యకు నోటీసులు జారీ చేశాం. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. – సత్యప్రసాద్, కలెక్టర్ -
నృసింహస్వామి సన్నిధిలో మంత్రి అడ్లూరి
గొల్లపల్లి: రాఖీపౌర్ణమి సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తజన సంద్రంగా గోదావరిధర్మపురి: శ్రావణ శనివారం, పౌర్ణమి సందర్భంగా ధర్మపురి గోదావరి భక్త జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. కథలాపూర్ చేరిన వరదకాలువ నీరుకథలాపూర్: ఎస్సారెస్పీ నుంచి ఈనెల 7న వరదకాలువకు నీరు వదలగా.. శనివారం మండలంలోని గ్రామాలకు చేరాయి. వరదకాలువలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందారు. ఆలస్యంగానైనా నీటి విడుదలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. పెగ్గెర్ల, కథలాపూర్, దుంపేట, దూలూర్, తక్కళ్లపెల్లి గ్రామాల మీదుగా నీరు ప్రవహించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు జీవన్రెడ్డి భూమిపూజజగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మాజీమంత్రి జీవన్రెడ్డి భూమిపూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రతిపాదికన మంజూరు చేస్తున్నారని తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, నాయకులు పెద్దన్న, సురేశ్, శ్రీనివాస్, వెంకన్న పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలిసారంగాపూర్: ఆదివాసీ దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు చిక్రం మారుతి అన్నారు. శనివారం బీర్పూర్ మండలం చిత్రవేణిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. ఆదివాసీలు నివాసం ఉండే చోట విద్యా, వైద్యం, వసతులు కల్పించాలని పేర్కొన్నారు. పోడు వ్యసాయం ఆదివాసీల హక్కు అని, అలాంటి భూములకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించాలని కోరారు. జిల్లాలో 10 వేల మంది వరకు ఆదివాసీలు ఉన్నారని, ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుగా ఆదివాసీల ఆరాధ్యుడు కొమురంభీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంప్రదాయ నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, ఆదివాసీ నాయకులు కుడిమెత గంగారాం, చిక్రం హరీశ్, లక్ష్మణ్, భగవంత్రావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
230 పడకల ఆస్పత్రికి రూ.203 కోట్లు
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలరూరల్: జిల్లా కేంద్రంలో నూతనంగా 230 పడకల ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణ శివారులోని పార్టీ కార్యాలయంలో 88 మంది లబ్ధిదారులకు రూ.36.66 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. జగిత్యాలకు మెడికల్ కళాశాల మంజూరు చేసుకుని రాష్ట్రంలోనే మొదటి అనుమతి తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికే మంజూరయ్యాయని వివరించారు. మెడికల్ కళాశాల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రూ.20 కోట్లు మంజూరు చేశారన్నారు. నూకపల్లిలో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిధుల మంజూరుతో లబ్ధి చేకూరుతుందన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, ఏఎంసీ మాజీ చైర్మన్లు దామోదర్రావు, నక్కల రాధ రవీందర్రెడ్డి, నాయకులు బాలె శంకర్, గోలి శ్రీనివాస్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాలరూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంలో దండ్ల శ్రీనివాస్పై జరిగిన దాడి ఘటనపై జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ను కలిసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాడి వెనుక ఉన్న నిందితులకు ఇప్పటికే నేర చరిత్ర ఉందని, వీరిని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాపాడుతున్నాడని పేర్కొన్నారు. నిందితులపై నాన్బెయిలబుల్ కేసు పెట్టామని, పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారని మాజీ మంత్రి తెలిపారు. అనంతరం జగిత్యాలలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, హరిచరణ్రావు, గోస్కుల జలేందర్, ఆవుల సత్యం, వెంకట మాధవరావు, రవీందర్, శేఖర్, అశోక్రావు, రవీందర్, కిషన్, చందు ఉన్నారు. -
క్రిప్టోకు రెక్కలు!
దేశం దాటుతున్న రూ.వందల కోట్లు ● మూడేళ్ల క్రితమే కేంద్రం హెచ్చరికలు ● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ● తాజాగా నెక్ట్స్ బిట్ పేరుతో రూ.300 కోట్ల టోకరా? ● గతంలో రెక్సిట్, మెటా పేరుతో రూ.కోట్ల దందాలు ● ఉమ్మడి జిల్లాలో ఇంకా పెట్టుబడి పెడుతున్న అత్యాశపరులు ● క్రిప్టో వసూళ్లపై రాచకొండ పోలీసుల ఉక్కుపాదం ● కరీంనగర్లో రెవెన్యూ, పోలీసులవే అధిక పెట్టుబడులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘క్రిప్టోలో ఒక్కసారి పెట్టుబడి పెట్టండి. ప్రతీ రోజూ సాయంత్రానికి మీ ఖాతాల్లో రూ.వేలు చూసుకోండి. నెలకు రూ.లక్షల సంపాదన. రెండుమూడు నెలల్లో మీ జీవితం మారిపోతుంది, హోదా పెరుగుతుంది’ అంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి.. అమాయకుల నుంచి రూ.లక్షలు పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఒకరిద్దరికి సరిగానే ఇచ్చి.. మిగిలిన వారికి టోకరా వేస్తున్నారు. అలా వసూలు చేసిన డబ్బులు రూ.వందల కోట్లు దేశం దాటుతున్నాయి. క్రిప్టో పేరిట తెలంగాణలో పలు నకిలీ యాప్లు పుట్టుకొస్తున్నాయని, అమాయకులు పెట్టుబడి పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారని మూడేళ్ల క్రితమే కేంద్ర నిఽఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను హెచ్చరించాయి. ఈ తరహా యాప్లను రాష్ట్ర పోలీసులు నియంత్రించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక క్రిప్టో మోసాలకు వేదికవుతున్నా.. పోలీసులు చర్యలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. జిల్లాలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ యాప్లలో పెట్టుబడులు పెట్టడం శోచనీయం.దేశం దాటుతున్న రూ.వందల కోట్లు భారీగా లాభాలు ఆశ చూపి, వసూలు చేసిన మొత్తాన్ని జగిత్యాల కేంద్రంగా కొంచెం హవాలా మార్గంలో, క్రిప్టోలోకి కొంచెం మార్చి దేశం దాటిస్తున్నారు. విదేశాల్లో ఆస్తులు కొని, వ్యాపారాలు ప్రారంభించి అక్కడే స్థిరపడేలా ‘లక్కీ భాస్కర్’సినిమాను తలపించేలా భారీ స్కెచ్ వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జీబీఆర్ క్రిప్టో కరెన్సీ పేరుతో రమేశ్గౌడ్ అనే వ్యక్తి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.95 కోట్లు కొల్లగొట్టాడు. దీనిపై సీఐడీ విచారణ జరపుతోంది. ఇందులో లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై ఓ డీఎస్పీని అటాచ్ చేశారు. రమేశ్ గౌడ్ ఆ డబ్బును దుబాయ్లో పెట్టుబడులు పెట్టి, పదేళ్ల గోల్డెన్ వీసా సంపాదించినట్లు బాధితులు తెలిపారు. ఇటీవల మెటా ఫండ్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకుపై వసూలు చేసిన లోకేశ్, కె.సతీశ్ ఆ డబ్బును దేశం దాటించారని, వీరికి ఓ బీజేపీ నాయకుడు సాయం చేశాడన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి లోకేశ్ ఎప్పుడో థాయ్లాండ్ వెళ్లాడని బాధితులు చెబుతున్నారు. తాజాగా హిమాన్ష్ అనే యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. ఇతను రాష్ట్రవ్యాప్తంగా 400 మంది వద్ద రూ.19 కోట్లు నెక్ట్స్బిట్ యాప్ పేరుతో వసూలు చేశాడని రాచకొండ పరిధిలోని మేడిపల్లి పీఎస్లో కేసు నమోదైంది. ఈ యాప్ బారిన పడ్డవారిలో అత్యధికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లావారే. గతంలోనూ హిమాన్షు రిక్సో యాప్ను నిర్వహించి రూ.కోట్లలో వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ముఠా దాదాపు రూ.300 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం.పట్టించుకోని కరీంనగర్ పోలీసులు నెక్ట్స్బిట్ యాప్పై రహస్య సమాచారం మేరకు రాచకొండ పోలీసులు ఆగస్టు 1వ తేదీన హిమాన్షును అరెస్టు చేశారు. ఈ కేసులో రికీఫామ్ (ఫారిన్ ఆపరేటర్), అశోక్ శర్మ (థాయ్లాండ్ ఆపరేటర్), డీజే సొహైల్ (రీజనల్ రిక్రూటర్), మోహన్ (సహాయకుడు), అశోక్కుమార్ సింగ్ (హిమాన్షుకు సహాయకుడు)ను నిందితులుగా చూపించారు. వీరంతా నెక్ట్స్ బిట్యాప్లో పెట్టుబడి పెట్టించి ప్రజలను మోసగించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో రామగుండం, కరీంనగర్ కమిషనరేట్లు, జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. రాచకొండ పోలీసుల తరహాలో వీరూ చర్యలకు దిగితే రూ.వందల కోట్ల దందా బయటికి వస్తుందని బాధితులు అంటున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీసుస్టేషన్లలో ఈ విషయమై ఫిర్యాదులు ఇస్తే సెటిల్మెంట్ చేసుకోండని తిప్పి పంపుతున్నారని, కేసులు నమోదు చేయకుండా నిందితుల వైపు ఉంటున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కేసులు ఎందుకు నమోదు చేయడం లేదంటే బాధితులు ముందుకు రావడం లేదని పోలీసులు సమాధానం ఇస్తున్నారు. -
జగిత్యాల
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025రావమ్మా వరలక్ష్మీమీరు సెల్ఫీ పంపించాల్సిన ఫోన్ నంబర్ 85007 86474జగిత్యాలరూరల్/మెట్పల్లి/ధర్మపురి: జిల్లాలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆలయాల్లో అమ్మవారికి పూలు, పండ్లు, చీరెసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని సహస్త్ర లింగాల ఆలయం, మెట్పల్లి పట్టణంలోని గాయత్రీ, వాసవీ కన్యకాపరమేశ్వరి, ధర్మపురిలోని గోదావరి ఒడ్డునున్న శ్రీమహాలక్ష్మీ, సంతోషిమాత ఆలయాల్లో మహిళలు సామూహిక కుంకుమార్చన తదితర పూజలు చేశారు. న్యూస్రీల్ -
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మపురి: డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని కాశెట్టివాడలో గురువారం కురిసిన భారీ వర్షంతో డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి చేరి కాలనీవాసులను తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈక్రమంలో శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించి సాయంత్రం అధికారులతో కలిసి డ్రైనేజీని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పట్టణంలో నీటి నిల్వలు లేకుండా, మురికినీరు గోదావరిలో కలవకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు తదితరులున్నారు. రాత్రివేళ యూరియా పంపిణీకోరుట్ల: కోరుట్ల పట్టణంలోని కల్లూర్ రోడ్ పీఏసీఎస్ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల వరకు యూరియా పంపిణీ చేశారు. ఒక్కో ఎకరానికి ఒకటి చొప్పున బస్తాలు రైతులకు అందించారు. మధ్యాహ్నమే యూరియా పంపిణీ ప్రారంభించామని, రైతుల వేలిముద్రలు తీసుకోవడంలో ఆలస్యంతో పాటు కౌలు రైతులు ఓటీపీ వివరాలు చెప్పాల్సి ఉండటంతో పంపిణీ ఆలస్యం అయినట్లు పీఏసీఎస్ కార్యదర్శి బుచ్చయ్య తెలిపారు. యూరియా కోసం రాత్రి వరకు వేచి ఉండటం ఇబ్బందికరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదించకపోవడం అన్యాయంజగిత్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బీజీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపితే నెలల తరబడి ఆమోదించకుండా తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మాట్లాడారు. సామాజిక న్యాయం అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లిన సీఎం రేవంత్రెడ్డిని అనుమతించకపోవడం కేవలం ముఖ్యమంత్రినే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి రావాల్సిన రూ.1500కోట్ల నిధులు కోల్పేయే పరిస్థితి ఉందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేసిన బిజేపీ ప్రభుత్వం బలహీనవర్గాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. ముస్లింలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ అమలు కాదన్న విషయాన్ని గమనించాలని కోరారు. ఇకనైనా 50శాతం సీలింగ్ తొలగించి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజంగి నందయ్య, దర రమేశ్, చందా రాధాకిషన్, జున్ను రాజేందర్, శేఖర్, మన్సూర్ తదితరులు ఉన్నారు. వరద కాలువలో రైతుల పూజలు కథలాపూర్(వేములవాడ): వరదకాలువలోకి నీరు వదలడంతో కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామశివారులోని కాలువలో శుక్రవారం రైతులు, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రజాప్రతినిధులకు విన్నవించగా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో ఎస్సారెస్పీ నుంచి వరదకాలువలోకి నీరు వదిలారని రైతులు తెలిపారు. ఏఎంసీ డైరెక్టర్ కారపు గంగాధర్, విండో డైరెక్టర్ మార్గం శ్రీనివాస్, నాయకులు లైసెట్టి గణేశ్, అంజాగౌడ్, లవకుమార్, రాజేశం, ప్రభు, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ఇసుక రీచ్ వద్దే వద్దు
● ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చిన ఆత్మకూర్ గ్రామస్తులుమెట్పల్లిరూరల్(కోరుట్ల): సామాన్య ప్రజలకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగు ఇసుక రీచ్ విషయంలో మరోమారు వివాదం తలెత్తింది. ఆత్మకూర్ పెద్దవాగు నుంచి ఇసుక తీసేందుకు నవంబర్ 2024లో ప్రభుత్వం రీచ్ పాయింట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో సుమారు 5,550 మెట్రిక్ టన్నుల ఇసుక తీసే వీలుందని అధికారులు గుర్తించారు. ఇందులో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఇతరాత్ర అసరాలకు దాదాపు 1,500 మెట్రిక్ టన్నుల ఇసుకకు అనుమతులు ఇచ్చారు. మిగతా 4,050 మెట్రిక్ టన్నుల ఇసుక తీసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో కథలాపూర్ మండలం కలిగోట ప్రాంతంలో నిర్మించే సూరమ్మ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ఇసుక అవరముండగా ఉన్నతాధికారులు 2,500 క్యూబిక్ మీటర్ల ఇసుకకు అనుమతులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అనుమతులు వారం క్రితమే వచ్చినా విషయం బయటికి రాలేదు. గురువారం ఒక్కసారిగా వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. శుక్రవారం 150 మందికి పైగా మెట్పల్లి ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చి రీచ్ రద్దు చేయాలని ఆర్డీవో శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నాకు నీడగా.. నీకు తోడుగా..
● ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ ● ఎక్కడున్నా రాఖీని మరువని రక్త సంబంధాలు ● మార్కెట్లో పండుగ సందడికలెక్టర్కు పోషణ బంధం రాఖీ63 ఏళ్లుగా పండుగ సంతోషం..సోదరి కోసం సౌదీ నుంచి..అన్నంటే ధైర్యం.. తమ్ముడంటే ప్రేమ.. అమ్మగర్భాన్ని పంచుకుని.. నాన్న చూపిన బాటలో నడుచుకుని.. ఏళ్లకాలం తోడునీడగా నిలిచేది సోదర, సోదరీమణుల బంధం. రక్తం పంచుకుని పుట్టి.. చివరి అంకం వరకు ప్రేమ, ఆప్యాయతలు పంచుకునే ప్రేమబంధం. ఇలాంటి బంధానికి ప్రతీకగా నిలుస్తోంది రాఖీ పండుగ. నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా అంటూ.. అన్నా.. తమ్ముళ్లకు అక్కాచెల్లెల్లు కట్టేది రక్షాబంధన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు బట్వాడా చేస్తుండగా.. మరికొందరు పండక్కి స్వదేశానికి వచ్చేశారు. కొందరు వృద్ధులు శుక్రవారం నుంచే సోదరుల ఇళ్లకు పయనమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో పండుగ రద్దీ కనిపిస్తుండగా.. మార్కెట్లలో వివిధ డిజైన్లలతో రాఖీలు మెరుస్తున్నాయి. స్వీట్ల దుకాణాల్లో వివిధ రకాల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేడు రాఖీ పండుగ సందర్భంగా కథనం..మరిన్ని కథనాలు 8లో..పెద్దపల్లిరూరల్: కలెక్టర్ కోయ శ్రీహర్షకు శుక్రవారం పెద్దపల్లి సీడీపీవో కవిత పోషణ బంధం రాఖీ కట్టారు. రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకంగా పోషణ రాఖీలు తయారు చేయించి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేశామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. అంగన్వాడీ టీచర్లు విధిగా గర్భిణులు, బాలింతలు, పిల్లల ఇళ్లకు వెళ్లి రాఖీ కట్టి పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 15 వేల ఇళ్లకు వెళ్లి ఇలా అవగాహన కల్పిస్తారని వివరించారు.ఇల్లంతకుంట: చిత్రంలో కనిపిస్తున్న వీరు సార మల్లేశం, అంతటి లక్ష్మి. అక్కా తమ్ముళ్లు. సొంతూరు ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట. తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు. ముగ్గురు మగపిల్లలు. అంతటి లక్ష్మి అన్న నర్సయ్య ఐదేళ్లక్రితం చనిపోయాడు. ప్రతీ రాఖీ పండక్కి అక్క లక్ష్మినర్సవ్వతో కలిసి అంతటి లక్ష్మి ముస్కానిపేటకు నడుచుకుంటూ వెళ్లి అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టేవారు. ప్రస్తుతం ముగ్గురూ ఇల్లంతకుంటలోనే వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ‘మా తమ్ముడు మల్లేశానికి నేను మా అక్క ప్రతీ ఏటా రాఖీ కడతాం. తమ్ముడికి రాఖీ కడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. 63ఏళ్లుగా రాఖీ కడుతున్నా. ఆరోజు మా ఇళ్లంతా పండుగ వాతావరణం ఉంటుంది. గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం’ అని అంతటి లక్ష్మి తెలిపింది.16 ఏళ్లుగా స్పీడ్ పోస్ట్లో..జమ్మికుంట: చిన్నతనం నుంచి తన చేతులతో రాఖీ కట్టించుకున్న సోదరుడు ఇప్పుడు సప్తసముద్రాల అవతల ఉన్నా రాఖీ పంపించడం మరవడం లేదు ఆ సోదరి. అమెరికాలో స్థిరపడిన సోదరుడికి 16ఏళ్లుగా ఇంటర్నేషనల్ స్పీడ్పోస్టు ద్వారా రాఖీ పంపుతోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సుజాతకు ఇద్దరు సోదరులు పొనగంటి సంపత్, రమేశ్ ఉన్నారు. సంపత్ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. రమేశ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా జీవనం సాగిస్తున్నాడు. సుజాత ఏటా రాఖీ పండుగ సందర్భంగా 15రోజుల ముందుగానే రమేశ్కు ఇంటర్ నేషనల్ స్పీడ్పోస్ట్ ద్వారా రాఖీ పంపిస్తోంది. పండుగ రోజున రమేశ్ రాఖీ కట్టుకొని ఫోన్ ద్వారా సుజాతతో మాట్లాడి తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు.కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన బీమనాతి శ్రీధర్ ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా స్వదేశానికి రాలేదు. రాఖీ పండుగ సందర్భంగా తన సోదరి మౌనికతో రాఖీ కట్టించుకోవాలని అనిపించింది. గల్ఫ్ దేశంలో కంపెనీ యజమానితో విషయం చెప్పాడు. వారు ఒప్పుకోవడంతో బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. సోదరితో రాఖీ కట్టించుకుంటే ఆ సంతోషం వర్ణించలేనిదని శ్రీధర్ అంటున్నాడు. -
ఇసుక తవ్వకాలపై వివాదం
మెట్పల్లి రూరల్: మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగు రీచ్ నుంచి ఇసుక తరలించే విషయంలో వివాదం చోటుచేసుకుంది. రీచ్ నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు వచ్చిన వాహనాలను గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. కథలాపూర్ మండలం కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ పనులకు 2500 క్యూబిక్ మీటర్ల ఇసుకకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. ఇసుక కోసం వాగు వద్దకు వెళ్లిన టిప్పర్లు, పొక్లెయినర్ను గ్రామస్తులు తిప్పి పంపించేశారు. మెట్పల్లి తహసీల్దార్ నీత, ఎస్సై కిరణ్కుమార్, ఆర్ఐ ఉమేశ్ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. అనుమతి ఉండగా అడ్డుకోవడం సరికాదన్నారు. -
ట్రిప్ అవుతోంది
వర్షాలు కురవకపోవడంతో మోటార్లతో సాగునీరు అందించాల్సి వస్తోంది. అప్పుడప్పుడు ఓవర్లోడ్తో ట్రిప్ అవుతున్నాయి. కొన్నిసార్లు లోడ్ పెరిగి ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజులు కొట్టేస్తున్నాయి. సిబ్బంది వచ్చి మరమ్మతు చేస్తున్నారు. – వేముల విక్రమ్ రెడ్డి, ధర్మపురి(మం) డిమాండ్ పెరుగుతోంది వర్షాలు లేక విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయినా నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా సమస్య ఏర్పడితే పరిష్కరిస్తున్నాం. సబ్ స్టేషన్లను పరిశీలించి, అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నాం. – సుదర్శనం, ఎస్ఈ, జగిత్యాల -
టీ హబ్ సందర్శనతో కొత్త ఆలోచనలు
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల: హైదరాబాద్లోని టీహబ్ సందర్శనతో విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు వస్తాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల, మెట్పల్లిలోని డిగ్రీ విద్యార్థులను ఈనెల 14 హైదరాబాద్లోని టీ హబ్ సందర్శనకు తీసుకెళ్తున్న సందర్భంగా విద్యార్థులతో సమావేశమయ్యారు. టీహబ్, టీ వర్క్స్ సందర్శనతో ఉపయోగాలను వివరించారు. రాష్ట్ర ఐటీ మంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు ఉన్నపుడు ఐటీ రంగం ఎంతో అభివృద్ధి జరిగిందని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మాజీ వైస్ ఎంపీపీ కాశిరెడ్డి మోహన్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం.. పట్టణంలోని పద్మశాలీ సంఘం భవనంలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చేనేత జెండాను సంఘం మాజీ అధ్యక్షుడు గోనే శంకర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మగ్గం నేసి ఆకట్టుకున్నారు. అనంతరం అయిలాపూర్కు చెందిన గాడిపెల్లి నరేశ్ కుటుంబాన్ని పరామర్శించారు. -
వికలాంగుల పింఛన్ పెంచండి
● కేంద్రమంత్రిని కలిసిన మంత్రి అడ్లూరి గొల్లపల్లి: వికలాంగుల పింఛన్ పెంచాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి కేంద్రమంత్రి వీరేందర్ కుమార్కు విన్నవించారు. గురువారం ఆయనను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందించారు. పెన్షన్ మొత్తాన్ని రూ.3000 పెంచాలని, అర్హతను 80శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని కోరారు. 40 శాతం బెంచ్ మార్క్ వైకల్యానికే పరికరాలు ఇవ్వాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ చేనేత విభాగం చైర్మన్ గూడూరి శ్రీనివాస్, పెరిక కార్పొరేషన్ సాధన సమితి అసోసియేట్ అధ్యక్షుడు కోట మల్లికార్జున్రావు ఉన్నారు. ఎస్సారెస్పీ నీటి విడుదలజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ, వరద కాల్వకు గురువారం సాగునీటిని విడుదల చేశారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ప్రాజెక్టు ఉన్నతాధికారులు గణేశ్, వంశీ, విన్యాస్రెడ్డి పాల్గొన్నారు. కాకతీయ కాలువకు మూడు వేల క్యూసెక్కులు, లక్ష్మి కెనాల్కు 150, సరస్వతి కెనాల్కు 300, అలీసాగర్ ఎత్తిపోతలకు 180, వరదకాలువకు 3వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 2,153 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 7,353 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. ప్రధాని మోదీకి ఆపరేషన్ సిందూర్ రాఖీవిద్యార్థులు తయారు చేసిన ఆపరేషన్ సిందూర్ రాఖీ కోరుట్ల: పట్టణంలోని పీఎంశ్రీ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రధాని మోదీకి ఆపరేషన్ సిందూర్ రాఖీని స్వయంగా తయారు చేసి పోస్టు ద్వారా పంపించారు. ఆపరేషన్ సిందూర్లో మోదీ, భారత సైన్యం పాకిస్తాన్పై చూపిన ధైర్యసాహసాలు, ఆకాష్, బ్రహ్మోస్, రాఫెల్, ఎస్–400 యుద్ద విమానాల చిత్రాలను రాఖీలో పొందుపరిచారు. భానుగ్న, సంజన, సాయిశ్రీ,శరణ్య, మనుశ్రీ, పూజ, లిఖిత, చైత్రవి రాఖీ తయారీలో భాగస్వామ్యం అయ్యారు. ఉపాద్యాయులు చావ్ల లక్ష్మీనారాయణ, చందా నాగరాజు, బాస సుమలత, పిస్క వేణు గైడ్ చేశారు. హెచ్ఎం కృష్ణమోహన్ రావు అభినందించారు. అయోధ్య ఆస్పత్రికి ఎన్క్వాస్ సర్టిఫికెట్రాయికల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. గురువారం ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈనెల 11 జరిగే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 19 ఏళ్లలోపు పిల్లలందరికీ మాత్రలు వేయాలన్నారు. అయోధ్య ఆస్పత్రికి ఎన్క్వాస్ సర్టిఫికెట్ వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి జైపాల్రెడ్డి, మండల వైద్యాధికారి సతీశ్, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారి రవీందర్, ఐఎంఏ సత్యనారాయణ, పర్యవేక్షకులు సాగర్, మురళీధర్, భూమేశ్వర్ పాల్గొన్నారు. -
పెరిగిన విద్యుత్ వినియోగం
30.0/22.0● వర్షాభావ పరిస్థితులే కారణం ● రోజువారి కోటా మించి వినియోగం ● సబ్స్టేషన్లను సందర్శిస్తున్న అధికారులు ● వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం ● సీజనల్ వ్యాధులు రానీయొద్దు ● జ్వరమొస్తే వైద్యులను సంప్రదించాలి ● 85004 34042 టోల్ఫ్రీ నంబరు ఏర్పాటు ● ప్లేట్లెట్స్ తగ్గితే ఆందోళన చెందొద్దు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ 7గరిష్టం/కనిష్టంవాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. –8లోu జాగ్రత్తలతోనే జ్వరాలు దూరంజగిత్యాల: ‘జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాలు రావు. ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జ్వరం లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ప్రతి ఆస్పత్రుల్లో మందులు, పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాం..’ అన్నారు డీఎంహెచ్వో ప్రమోద్కుమార్. జిల్లాలో జ్వరపీడితులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. -
బీసీలపై కపట ప్రేమ
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లపై కపట ప్రేమ చూపుతోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. ఢిల్లీలో నామమాత్రంగా ధర్నా చేసి బీసీలను మోసం చేయాలని చూస్తోందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తే కనీసం రాహుల్గాంధీ వచ్చి మద్దతివ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి దీనిని బట్టే అర్థమవుతోందన్నారు. మహిళా సాధికారతకు తోడ్పాటుఉచిత కుట్టు శిక్షణ ప్రారంభించిన డాక్టర్ బీఎన్.రావు మల్యాల: మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగి, సాధికారత సాధించేందుకు తోడ్పాటు అందిస్తోందని బీఎన్.రావు హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బీఎన్.రావు అన్నారు. గురువారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా బీఎన్.రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన నిరుపేద మహిళలను ఎంపిక చేసి నెలపాటు ఉచితంగా శిక్షణ ఇస్తామని, అనంతరం సర్టిఫికెట్లు అందిస్తామని వివరించారు. ఫౌండేషన్ కార్యదర్శి ఝాన్సీ, డక్టార్ శ్రీదేవి, గంగ, న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ జి.రమేశ్ పాల్గొన్నారు. ‘ఉల్లాస్’పై శిక్షణమాట్లాడుతున్న డీఈవో రాము జగిత్యాల: జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచేందుకు ప్రతి గ్రామంలో స్వచ్ఛంద వాలంటీర్లు, టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో రాము తెలిపారు. జిల్లాకేంద్రంలోని టీచర్స్ భవన్లో ఆర్పీలతో గురువారం సమావేశమయ్యారు. జిల్లాలో ఎంపికై న ప్రతి మండలం నుంచి ఇద్దరు రిసోర్స్ పర్సన్లను నియమించామని, ప్రతిఒక్క మహిళను అక్షరాస్యులుగా చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో 70.31 శాతం పురుషులు, మహిళలు 50.6 శాతం అక్షరాస్యులుగా ఉన్నారని, వందశాతం అక్షరాస్యులను చేయాలన్నారు. ఉల్లాస్ కో–ఆర్డినేటర్ ప్రతాప్రావు, సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్ మహేశ్ పాల్గొన్నారు. -
విద్యార్థులు వందశాతం హాజరు ఉండాలి
● విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు దుర్గాప్రసాద్ జగిత్యాల: విద్యార్థులు వందశాతం హాజరు ఉండేలా చూడాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు దుర్గాప్రసాద్ అన్నారు. గురువారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, భవితసెంటర్లు, కేజీబీవీలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, హెచ్ఎంలతో సమీక్షించారు. యూడైస్ స్లోగా ఉందని, విద్యార్థులు నమోదయ్యేలా చూడాలని, స్టూడెంట్ ప్రొఫైల్ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. విద్యార్థులతో ఇన్స్పైర్ అవార్డుల నామినేషన్లు, వనమహోత్సవం నిర్వహణ అమలు చేసేలా చూడాలన్నారు. ఆయన వెంట డీఈవో రాము ఉన్నారు. తాటిపల్లి గురుకులంలో.. మల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులాన్ని దుర్గాప్రసాద్ సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. గ్రంథాలయం, ల్యాబ్ల వినియోగంపై విద్యార్థులతో మాట్లాడారు. ఇంటర్, పదో తరగతిలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడంపై ఉపాధ్యాయులను అభినందించారు. ఎంఈవో జయసింహారావు, సెక్టోరియల్ అధికారి రాజేశ్, ప్రిన్సిపాల్ మానస, ఏపీఓ రమణ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడి అరెస్టు
ముస్తాబాద్(సిరిసిల్ల)/సిరిసిల్లక్రైం: ఆరోగ్యశాఖ నుంచి మాట్లాడుతున్నామని.. ఆస్పత్రుల్లో ఖర్చు అయిన డబ్బులను పంపిస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టించి లక్షల్లో కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 79 కేసులు నమోదయ్యాయి. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. ముస్తాబాద్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం ఓ ఫోన్కాల్లో ఆరోగ్యశాఖ నుంచి మాట్లాడుతున్నానని, వైద్యఖర్చుల కోసం ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు రీఫండ్ పంపిస్తున్నామని నమ్మబలికాడు. వాట్సాప్కు పంపిన లింక్ను ఓపెన్ చేయాలని, అందులో యూపీఐ పిన్ను ఎంటర్ చేయాలని సూచించాడు. డబ్బులు వస్తాయనే ఆశతో సదరు వ్యక్తి అతను చెప్పినట్లు చేయడంతో బ్యాంక్ ఖాతా నుంచి రూ.40 వేలు మాయమయ్యాయి. వేములవాడ పట్టణానికి చెందిన వ్యక్తి ఖాతా నుంచి ఇలాగే చెప్పి రూ.10వేలు కాజేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్సై గణేశ్, సైబర్ టీమ్ సభ్యులు జునైద్, గంగారెడ్డి, ఖాసీంలు సాంకేతిక సాయంతో హైదరాబాద్లో నిందితుడిని పట్టుకుని సిరిసిల్లకు తరలించారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా జమ్మలమడుగులోని భాగ్యనగర్కు చెందిన ముల్లుంటి సలీంమాలిక్(32)గా గుర్తించారు. అతడిపై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 79 కేసులు నమోదయ్యాయి. వివిధ వ్యక్తుల బ్యాంక్ ఖాతాల నుంచి రూ.15లక్షల వరకు మోసం చేశాడు. నిందితుడిని పట్టుకున్న సీఐ, ఎస్సైలను డీఎస్పీ అభినందించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 79 కేసులు రూ.15లక్షల వరకు మోసాలు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి -
నేటి నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గురువారం సాగునీరు విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జూన్లో వర్షాలు ప్రారంభమై.. జూలైలో కురిసిన భారీ వర్షాలకు ఎస్సారెస్పీ నిండింది. ఫలితంగా పలుమార్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి వదిలారు. అలాగే అవసరం లేకున్నా భూగర్భజలాలు పెరుగుతాయనే ఉద్దేశంతో వరదకాల్వకూ నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగానే కురవడంతో ప్రాజెక్టులోకి నీరు పూర్తిస్థాయిలో చేరలేదు. ఫలితంగా ఆయకట్టుకు నీరు విడుదల చేసే అవకాశం లేదు. ఈ క్రమంలో నీటి సౌలభ్యాన్ని బట్టి ఆన్, ఆఫ్ పద్ధతిలో విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టులో ఉన్న నీటినే యాసంగి పంటలకూ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి.. ఈ వానాకాలం పంటకు పరిమితంగానే నీరు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. సాగునీటిని వృథా చేయకుండా కాలువలపై గట్టి భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల ప్రాజెక్టు నీటిపై ఆధారపడిన వారు మాత్రం నాట్లు వేయలేదు. ప్రాజెక్టు నీరు వస్తే నాట్లు వేసే అవకాశం ఉంది. రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు ఎస్సారెస్పీ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు కాకతీయ కాలువ ద్వారా నీరు అందుతుంది. కాకతీయ కాల్వ సామర్థ్యం 6 వేల క్యూసెక్కులు. కట్టలసామర్థ్యం సరిగా లేకపోవడంతో రోజుకు 4 నుంచి 5 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేయాలని భావిస్తున్నారు. తొలి రెండురోజులు రెండు వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసి తర్వాత నుంచి సామర్థ్యాన్ని పెంచనున్నారు. జగిత్యాల జిల్లాలో వ్యవసాయ బావులు అత్యధికంగా ఉన్నా.. రైతులు ఎక్కువగా ఎస్సారెస్పీ నీటిపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుకానున్నాయి. వరిపంటే దాదాపు మూడు లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. కాకతీయ కాలువ డిస్ట్రిబ్యూటరీలకు తూములు పెట్టడంతో చెరువులు, కుంటలకు నీటిని వదలనున్నారు. కాలువకు ఇరువైపులా విద్యుత్ మోటార్లు బిగించుకుని రైతులు సాగు నీటిని వాడుకునే అవకాశం ఉంది. 40.582 టీఎంసీలకు నీటి నిల్వలు గతంలో జూలైలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండేది. ఈ ఏడాది ప్రాజెక్టులోకి అంతంతమాత్రంగానే నీరు చేరింది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 31.552 టీఎంసీలు చేరగా.. 3.757 టీఎంసీలను బయటకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులకుగాను.. ప్రస్తుతం 1078.30 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు 40.582 టీఎంసీల నిల్వ ఉంది. తాగునీటి కోసం మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 793 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 40.582 టీఎంసీలకు నీటిమట్టం కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువల ద్వారా పంటలకు.. -
ఇంటింటికీ కేంద్ర పథకాలు
కోరుట్ల రూరల్: బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రతీ ఇంటికీ పథకాలు అందిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, సంపర్క్ అభియాన్ ప్రభారి గంగాడి మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపూర్లో బుధవారం బీజేపీ సంపర్క్ అభియాన్ నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. జిల్లా కన్వీనర్ ఒడ్డెపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పంచిరి విజయ్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర పథకాలపై ఇంటింటా ప్రచారంరాయికల్: మండలంలోని వస్తాపూర్, దావన్పల్లి, కట్కాపూర్, తాట్లవాయి, ఆల్యనాయక్తండా, ధర్మాజీపేటలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్ ఆధ్వర్యంలో కేంద్ర పథకాలపై ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు. -
కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి
ధర్మారం(ధర్మపురి): కరెన్సీపై అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలనే డిమాండ్ పార్లమెంట్లో ప్రస్తావించాలని అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ డిమాండ్ చేశారు. కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బుధవారం ఫొటో సాధన సమితి నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ మా ట్లాడుతూ జాతీయ జెండాలో అశోక్ చక్రం పెట్టిన రోజు.. జూన్ 23న ప్రారంభమైన లక్ష మందితో పోస్టుకార్డుల ఉద్యమం 2026 జనవరి వరకు ముగుస్తుందన్నారు. ఇందులో భాగంగానే జంతర్మంతర్ వద్ద ధర్నా చేస్తున్నట్లు ఆయన వివరించారు. 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు అంబేడ్కర్ చేసిన ప్రయత్నంతోనే 1935లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాగా ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ పార్టీ జాతీయ అధ్యక్షుడు జాన్, ఓబీసీ విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షుడు కిరణ్, కరెన్సీ అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి, చంద్రహాస్, సంపత్ చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో తహసీల్దార్ మృతి
జగిత్యాలక్రైం: మంచిర్యాల జిల్లా నెన్నెల తహసీల్దార్.. జగిత్యాలలోని మిషన్కాంపౌండ్ ప్రాంతానికి చెందిన ముద్దమల్ల జ్యోతి బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆమె అంత్యక్రియల్లో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, పెద్దపల్లి ఆర్డీవో గంగన్న, తహసీల్దార్లు వెంకటకిషన్, జగిత్యాల రూరల్, అర్బన్ తహసీల్దార్లు శ్రీనివాస్, రాంమోహన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రవిబాబు, ఏవో హకీం, మూడు జిల్లాల రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణ శివారు రంగంపల్లి ప్రాంతంలో బుధవారం తెల్లవారు జాము న గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గుర్తుతెలియని (సుమారు 35నుంచి 40 ఏళ్ల మధ్య వయసు) వ్యక్తి మృతిచెందాడు. మృతుడి కుడివైపు చాతీపై పచ్చబొట్టుతో త్రిశూలం, ఢమరుకం ఉందని ఎస్సై లక్ష్మణ్రావు తెలిపారు. ఎడమ భుజంపై త్రిశూలం, కుడిచేతిపై గిటార్, కత్తి, పూలతో కూడిన పచ్చబొట్లు ఉన్నా యని వివరించారు. నలుపురంగు ఫుల్ డ్రాయ ర్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. మృతదేహా న్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపర్చినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 87126 56506, 87126 56505 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు . బైక్ అదుపుతప్పి యువకుడు..చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన గిరబోయిన అజయ్(22) ద్విచక్ర వాహనం అదుపుతప్పి మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. అజయ్ బుధవారం ద్విచక్రవాహనంపై నవాబుపేట్ నుంచి ఇంటికి వస్తున్నాడు. మార్గంమధ్యలో సుందరగిరిలోని రాజ్యాంగ స్తూపం వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. అజయ్ రవళి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది, నాలుగు నెలల ఇద్దరు కూతుళ్లున్నారు. అజయ్ తల్లిదండ్రులు స్వరూప, సంపత్ గతంలోనే చనిపోయారు. పేద కుటుంబానికి చెందిన అజయ్కి ఇల్లు కూడా లేదు. తిప్పన్నపేటలో మరొకరు..జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామ శివారులో జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనగా గుంటి రాజేందర్ అనే వ్యక్తికి తీవ్రగాయాలై మృతి చెందాడు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన గుంటి రాజేందర్ బుధవారం సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై తిప్పన్నపేటకు వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో రాజేందర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు రాజేందర్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మరణించాడు. పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని లారీని పోలీస్స్టేషన్కు తరలించారు. జ్వరంతో యువకుడు..మంథనిరూరల్: మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన దేవళ్ల వెంకటేశ్(17) జ్వరంతో మృతి చెందాడు. రెండురోజుల క్రితం వెంకటేశ్కు జ్వరం రాగా స్థానికంగా చికిత్స చేయించుకున్నా తగ్గకలేదు. దీంతో గోదావరిఖనికి అక్కడి నుంచి కరీంనగర్లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. వెంకటేశ్ మంథని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. -
రైతులకు సరిపడా ఎరువులు
పెగడపల్లి: జిల్లాలో యూరియా కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సత్యప్రసా ద్ ఈన్నారు. సహకార సంఘాలు ఎప్పటికప్పు డు ఇన్డెంట్ పెట్టి తెప్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పెగడపల్లి మండలం నంచర్ల సొసైటీ గోదామును బుధవారం తనిఖీ చేశారు. ఎరువు ల నిల్వలు, స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. ఈ పా స్ ద్వారా రైతులకు ఎకరాకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేయాలని సూచించారు. ఎక్కువ మొ త్తం ఇస్తే సొసైటీ సిబ్బంది, వ్యవసాయశాఖ అధి కారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నంచర్ల సొసైటీకి మంగళవారం సుమారు 340 బస్తాల యూరియా వచ్చింది. కలెక్టర్ తని ఖీకి ముందే సిబ్బంది 162 బస్తాలు రైతులకు పంపిణీ చేశారు. ఇంకా 172 బస్తాల యూరియా ని ల్వ ఉంది. వానాకాలం పంటలకు సొసైటీ పరిధి లోని రైతులకు 238 టన్నుల యూరియా అవసరమవుతుంది. అయితే ఇప్పటివరకు కేవలం 76 టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా 162 టన్నులు రావాల్సి ఉంది. ఆ మొత్తం వస్తే రైతులకు ఇ బ్బంది లేకుండా యూరియా పంపిణీ చేసే అవకాశం ఉంది. అనంతరం కలెక్టర్ మోడల్ స్కూల్ ను సందర్శించారు. పరిసరాలు, స్టాక్ రూమ్, వంట సరుకులు, మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. పదో తరగతి గదిలో కూర్చుని విద్యార్థులకు గణితంలో టాస్క్ను డిజిటల్ బోర్డుపై చేయించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్య అందించాలన్నారు. వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని సూచించారు. ఆర్డీవో మధుసూదన్, డీఏవో భాస్కర్, డీఈవో రాము, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఏవో శ్రీకాంత్, విండో చైర్మన్ వేణుగోపాల్, ప్రిన్సిపాల్ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. యూరియా కొరత లేదు రైతులూ ఆందోళన వద్దు కలెక్టర్ సత్యప్రసాద్ -
మీసేవ అర్హత పరీక్ష మరోసారి నిర్వహించాలి
జగిత్యాల: జిల్లాలో ఇటీవల నిర్వహించిన మీసేవ అర్హత పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని కలెక్టరేట్లో నిరుద్యోగులు వినతిపత్రం అందించారు. అర్హత పరీక్షలో అవకతవకలు జరిగాయని, నాన్లోకల్ అభ్యర్థులు తప్పుడు ధ్రువపత్రాలతో పరీక్షకు హాజరయ్యారని ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టి మరోసారి పరీక్ష నిర్వహించాలని కోరారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని.. ● కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన జగిత్యాలటౌన్: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. మధ్యాహ్న భోజన కార్మికులు బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. రూ.పదివేల వేతనం చెల్లించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే సెప్టెంబర్ ఒకటోతేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ఇన్చార్జి వెన్న మహేశ్ హెచ్చరించారు. ప్రతిరోజు రెండు కూరలు చేసి పెట్టాలని ఒత్తిడి తెస్తున్న అధికారులు.. పెండింగ్ బిల్లులపై స్పందించడం లేదన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరా రు. యునిఫాంతోపాటు ప్రమాదబీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మిక సంఘం ప్రతినిధులు మునుగూరి హన్మంతు, వెల్మలపల్లి వెంకటాచారి, పద్మ, సరిత, గంగవ్వ, రుక్మ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● 16 తులాల బంగారు నగలు స్వాధీనం జగిత్యాలక్రైం:జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అత్తినేని చంద్రమోహన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. బుధవారం సాయంత్రం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాయికల్ మండలానికి చెందిన చంద్రమోహన్ అలియాస్ చందు కొన్నేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతడిపై పీడీయాక్ట్ నమోదై ఉంది. బుధవారం పట్టణ శివారులోని శంకులపల్లి రైతుచౌరస్తా వద్ద పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మోహన్ అనుమానాస్పదంగా కన్పించాడు. అతడిని విచారించగా గతంలో జిల్లాలో జరిగిన ఏడు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతడి నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై సుప్రియ, కానిస్టేబుల్ జీవన్ పాల్గొన్నారు. -
పింఛన్ పెంచేదాకా పోరాటం
జగిత్యాలటౌన్/ధర్మపురి: ప్రభుత్వం ఆసరా పింఛన్లు పెంచేదాకా పోరాటం సాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాది గ అన్నారు. ఈనెల 13న హైదరాబాద్లో నిర్వహించనున్న దివ్యాంగుల మహాగర్జన సభ సన్నాహక సమావేశాలను జిల్లాకేంద్రంతోపాటు ధర్మపురిలో నిర్వహించారు. అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ 20నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ప్ర భుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితమయ్యారని విమర్శించా రు. పింఛన్లు పెంచాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరుకావా లని కోరారు. ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలి చి.. సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మ ణ్కుమార్కు పింఛన్ల పెంపు బాధ్యత తీసుకోవాలన్నారు. వికలాంగులు, వృద్ధులు నెలకు రూ.2వేల చొప్పున ఇప్పటివరకు రూ.40వేలు నష్టపోయారని తెలిపారు. వాటిని వడ్డీతో సహా చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు లంక దాసరి శ్రీనివాస్, అజ్గర్ఖాన్, ధర్మపురి ఇన్చార్జి గొల్లపె ల్లి శ్రీధర్, జాతీయ కమిటీ చైర్మన్ గోపాల్రావు, రాయిల్ల రవికుమార్ తదితరులున్నారు. ● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
రాష్ట్ర సాధనే లక్ష్యంగా జయశంకర్ కృషి
కోరుట్ల: రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జయశంకర్ 91వ జయంతి సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణకు జరిగిన అన్యాయం, అసమానతలను ఎత్తి చూపుతూ ప్రజల్లో చైతన్యదివిటి వెలిగించిన గొప్ప దార్శనికుడు జయశంకర్ అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు మాజీ అద్యక్షుడు చీటి వెంకట్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు భాస్కర్ రెడ్డి, ఫయీం పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు బ్రహ్మకుమారీలు రాఖీ ఎమ్మెల్యేను కలిసిన వార్డు ఆఫీసర్లు మున్సిపల్ వార్డు ఆఫీసర్లు ఎమ్మెల్యేను కలిశారు. టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్–4 పరీక్ష రాసి వార్డు ఆఫీసర్లుగా.. కొందరం జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులయ్యామని, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందికి రూ.24,280 నుంచి రూ.72, 850 వరకూ స్కేల్ ఉండగా వార్డు ఆఫీసర్లకు రూ.22,240 నుంచి రూ.67,300 స్కేల్ చెల్లిస్తున్నారని, దీంతో తాము ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. పదోన్నతులను సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా మార్చేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పద్మశాలీ సంఘం భవన నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాలని సంఘం అధ్యక్షుడు జక్కుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యేను కోరారు. జయశంకర్ ఆశయసాధనకు కృషి చేద్దాం జగిత్యాలటౌన్: తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య జయశంకర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జయశంకర్ 91వ జయంతిని కలెక్టరేట్లో నిర్వహించా రు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివా ళి అర్పించారు. జయశంకర్ విగ్రహానికి అదనపు కలెక్టర్లు ప్రజాప్రతినిధులు నివాళి అర్పించారు. డీఆర్డీవో రఘువరణ్, డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్, ఆర్డీవో పులి మధుసూదన్గౌడ్, బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ అధికారులు సునీత, రాజ్కుమార్, చిత్రు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ జగిత్యాల: ధరూర్ క్యాంప్లోగల ఈవీఎం గో దాంను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. ఆర్డీవో మధుసూదన్, కలెక్టర్ ఏవో హకీం, జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రొఫెసర్ జయశంకర్కు ఘనంగా నివాళి -
చేనేత.. ఎదురీత !
● ఆటుపోట్ల మధ్య వస్త్రపరిశ్రమ ● మార్పులకు అనుగుణంగా నూతనత్వం ● నేడు జాతీయ చేనేత దినోత్సవం సిరిసిల్ల: చేనేత, మరనేత(పవర్లూమ్)రంగాలు కాలానికి ఎదురీదుతూ.. ఆధునికతను సంతరించుకుంటూ.. సగర్వంగా తలెత్తుకు నిలబడుతోంది. అనేక కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే.. మార్పులకు అనుగుణంగా చేనేత రంగం సుస్థిరంగా పదిలమైంది. నేతన్నలు మార్పులకు అనుగుణంగా వస్త్రోత్పత్తిలో నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. చేనేతరంగం వయోభారంతో మరణశయ్యపై ఉండగా.. పవర్లూమ్(మరమగ్గాల) రంగం ఆటుపోట్ల మధ్య ఆత్మగౌరవంతో జీవించేందుకు ఆరాటపడుతోంది. దేశంలో వ్యవసాయరంగం తర్వాత రెండోస్థానం వస్త్రోత్పత్తి రంగానిదే. చేనేత మగ్గాలపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన ఘనత సిరిసిల్ల నేతకార్మికులది. సంక్షోభంలోనూ శ్రమిస్తున్న నేతన్నలపై జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. చేనేత వందేళ్ల చరిత్ర 1905లో పశ్చిమ బెంగాల్ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ చేనేతరంగంలో ఉద్యమం మొదలైంది. కలకత్తా టౌన్హాల్లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపు నిస్తూ 2012 ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. జాతీయస్థాయిలో ఉత్తమ నేతకార్మికులకు అవార్డులు అందిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనూ నేతన్నలకు గుర్తింపు నిస్తూ అవార్డులు ఇస్తున్నారు. సిరిసిల్లలోనే తొలి నేతన్న విగ్రహం దేశంలోనే తొలి చేనేత కార్మికుడి కాంస్య విగ్రహాన్ని సిరిసిల్లలో నెలకొల్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 78 వేల మరమగ్గాలు ఉండగా, సిరిసిల్లలోనే 28 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 24 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం, 4 వేల మగ్గాలపై కాటన్ వస్త్రోత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్లలో నిత్యం 25 లక్షల మీటర్ల వస్త్రం తయారవుతుంది. 20వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సిరిసిల్లలో చేనేత మగ్గాలు 175 ఉండగా.. వీటిపై 58 మంది వృద్ధులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. సిరిసిల్ల వస్త్రాలు దేశ వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. సిరిసిల్ల అద్దకంలో అగ్రస్థానంగా ఉంది. జాతీయ జెండాలను గతేడాది 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడి నుంచే దేశ వ్యాప్తంగా సరఫరా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్ష అభియాన్, ఎస్సీ, బీస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖలకు అవసరమైన వస్త్రోత్పత్తి ఆర్డర్లను నేతన్నలకు ఇస్తున్నారు. ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీని ప్రభుత్వం పక్కన పెట్టి ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లు ఇచ్చింది. మహిళా సంఘాల్లోని సభ్యులకు రెండు జతల చీరలు అందించే లక్ష్యంతో 1.30 కోట్ల చీరల ఉత్పత్తి ఆర్డర్లు సిరిసిల్లకు అందించారు. అపెరల్ పార్క్లో టెక్స్పోర్ట్, గోకుల్దాస్ గార్మెంట్ యూనిట్లలో వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. అమెరికాకు రెడీమేడ్ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. ఇవీ చేస్తే మేలు ఉత్పత్తి అయిన వస్త్రానికి మార్కెట్ వసతి కల్పించాలి. మొత్తం వ్యవస్థ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వపరంగా ఆజమాయిషి ఉండేలా తీర్చిదిద్దాలి. నేతకార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆధునిక మగ్గాలపై శిక్షణ ఇవ్వాలి. పేదరికమే అర్హతగా అంత్యోదయకార్డులు, ఆర్థిక చేకూర్పు, మహిళా సంక్షేమ పథకాల అమలు చేయాలి. నేతకార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. త్రిఫ్ట్ పథకంలో అందరిని చేర్పించాలి. కార్మికులకు గుర్తింపుకార్డులు ఇచ్చి ఆరోగ్య సంరక్షణ పథకాలు అందించాలి. నేటి తరం యువతకు ఆధునిక మగ్గాలపై వస్త్రోత్పత్తి శిక్షణ అందించాలి. వస్త్రపరిశ్రమలో ఆధునికతపై పరిశోధనలు జరగాలి. బీమా నేతన్నలకు వరంనేతన్నలకు రైతుల తరహాలో రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించారు. 2021 జూలై 4న సిరిసిల్ల వేదికగా ఈ పథకాన్ని ప్రకటించారు. 18–59 ఏళ్ల మధ్య వయసు గల నేతకార్మికులకు అమలు చేస్తున్నారు. బీమాలో చేరిన నేతన్నలు ఏ కారణంగా మరణించినా బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం ఎల్ఐసీ ద్వారా అందుతుంది. నేతకార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీ, త్రిఫ్ట్ పొదుపు పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయి. -
వరదకాలువకు నీరు విడుదల చేయండి
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువకు నీరు విడుదల చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్కు వినతిపత్రం అందించారు. వరదకాలువకు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని, లేకుంటే ఈనెల 8న కథలాపూర్లో ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో వేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేశ్ రెడ్డి, నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, బద్దం మహేందర్ రెడ్డి, పిడుగు ఆనందరెడ్డి, బందెల మల్లయ్య, మో హన్ రెడ్డి, సంజీవ్, మహిపాల్ పాల్గొన్నారు. పీహెచ్సీల్లో మెరుగైన సేవలుమెట్పల్లి రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మెట్పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని తెలుసుకున్నారు. మందుల స్టాక్, ల్యాబ్, టీహబ్కు పంపించిన శాంపిల్స్ వివరాలు ,క్షయవ్యాధి కేసులపై ఆరా తీశారు. లెప్రసీ, టీబీ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మండల వైద్యాధికారి ఎలాల అంజిత్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహనకోరుట్ల: సైబర్ నేరాలపై విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల, మెట్పల్లి డీఎస్పీలు వెంకటరమణ, రాములు సూచించారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఓటీపీ ఫ్రాడ్స్, ఇన్స్ర్ట్రాగాం ఫ్రెండ్స్, బ్యాంక్ లోన్ ఫ్రాడింగ్, ఏపీకే యాప్ లింక్ తదితర నేరాలతో నష్టాలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చేందుకు పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. సైబర్ క్రైం ఎస్సైలు కృష్ణ, దినేష్, కోరుట్ల ఎస్సై ఎం.చిరంజీవి, ట్రాప్మా అధ్యక్షుడు ఎంఏ.భారి, పా ఠశాల, కళాశాలల కరాస్పాండెట్లు పాల్గొన్నారు. భూ భారతి సమస్యలు పరిష్కరించాలిమల్యాల: భూభారతి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతికి వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై తహసీల్దార్ వసంతను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి, రాణి, సిబ్బంది పాల్గొన్నారు. తల్లిపాలు అమృతంతో సమానంజగిత్యాలరూరల్: తల్లిపాలు పిల్లలకు అమృతంతో సమానమని మాతాశిశు సంరక్షణాధికారి జైపాల్రెడ్డి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల రూరల్ మండలం గుల్లకోటలో మహిళలకు బుధవారం అవగాహన కల్పించారు. తల్లిపాలతో శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, పుట్టిన బిడ్డకు గంట వ్యవధిలో ముర్రుపాలు తాగించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోపాటు, శిశువుకు ఆరునెలల తర్వాత ఆహారం ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో గాయత్రి, ఆరోగ్య పర్యవేక్షకులు శ్యామ్, అంగన్వాడీ సూపర్వైజర్ రాజేశ్వరి, ఏఎన్ఎం శోభ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
వెల్గటూర్: స్కూల్ బస్సును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొన్న సంఘటన మండలంలోని కప్పారావుపేట వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కప్పారావుపేట వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా కుడివైపు తిప్పాడు. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆ బస్సును తప్పించే క్రమంలో కుడివైపు తిప్పాడు. అదే సమయంలో వెల్గటూర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్న బైక్ ఎదురుగా రావడంతో బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్పై ఉన్న మండలంలోని పాశిగామకు చెందిన కాండ్రపు మహేశ్, ధర్మపురి మండలం రాయపట్నంకు చెందిన పోతరాజుల కమలాకర్, పిట్టల చందుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని, ఒకవేళ స్కూల్ బస్సును ఢీకొడితే చిన్నారులు ప్రమాదానికి గురయ్యేవారని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది. ముగ్గురికి తీవ్రగాయాలు తృటిలో తప్పిన పెను ప్రమాదం -
ఆగని అవినీతి
కోరుట్ల: ఈ ఏడాది నాలుగు నెలలుగా జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నెలకొకరు చొప్పున వరుసగా ఏసీబీకి చిక్కుతున్న వైనం కలరవపెడుతోంది. జగిత్యాల మున్సిపాల్టీలో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై లెక్కలేని అవీనితి ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో వివిధ శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది పని తీరు పై పరిపాలనపరంగా దృష్టి సారించడం లేదా..? ఒకవేళ తమ దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోవడం లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు లేకుంటేనే ఏసీబీకి..? సాధారణంగా వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నవారు అక్కడి ఉద్యోగులు లంచాలు ఆశిస్తూ వేధిస్తున్న విషయాన్ని మొదటగా పైఅధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. పైఅధికారుల నుంచి ఎలాంటి చర్యలూ లేకపోవడం..లంచం కోసం పీడిస్తున్న ఉద్యోగి తన తీరు మార్చుకోని పరిస్థితుల్లోనే బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు తమ పరిధిలోని ఉద్యోగుల తీరుతెన్నులు, పనితీరు, అవినీతి వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ.. నామమాత్రంగా వ్యవహరిస్తున్న ఫలితంగానే కింది స్థాయి సిబ్బంది పట్టపగ్గాలు లేని రీతిలో లంచావతారం ఎత్తుతున్నారు. ఇంకా చెప్పాలంటే కొంత మంది ఉద్యోగులు తమ పైఅధికారులను మచ్చిక చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి మరీ దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన నలుగురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడిన వైనం చూస్తుంటే కింది స్థాయి ఉద్యోగుల పనితీరుపై ఉన్నతాధికారులు ఏ మేర దృష్టి సారిస్తున్నారన్న అంశం తేటతెల్లమవుతోంది. పర్సంటేజీల దందా.. వరుసగా ఏసీబీ దాడులు కొనసాగుతున్నప్పటీకి జిల్లాలోని కొన్ని ప్రభుత్వ శాఖల్లో పర్సంటేజీల దందా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీసు, పౌరసరఫరాల శాఖలో కొంతమంది ఉద్యోగులు పర్సంటేజీలు, కమీషన్లు తీసుకుంటున్న తీరు బహిరంగ రహస్యం. జిల్లాలో ఐదు మున్సిపాల్టీల్లో ఇటీవల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఆయా బల్దియాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. ఇదే అదనుగా గతంలో పాలకవర్గాల ప్రజాప్రతినిధులకు ఇచ్చే పర్సంటేజీతో కలుపుకొని తమ పర్సంటేజీ పెంచి కమీషన్ ఇవ్వాలని కొంత మంది ఉద్యోగులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖ పనుల్లోనూ ఉద్యోగుల హోదాను బట్టి కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీల వసూలు యథేచ్ఛగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూభారతి అమల్లోకి వచ్చిన తహసీల్దార్ కార్యాలయాల్లో కిందిస్థాయి ఉద్యోగుల తీరు మారలేదు. రాయికల్ ఇన్చార్జి తహసీల్దార్ ఏసీబీకి చిక్కడమే దీనికి నిదర్శనం. ఈ రీతిలో జిల్లాలోని కొన్ని ప్రభుత్వ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులు పర్సంటేజీలు, కమీషన్ల కోసం వేధిస్తూ.. ఏసీబీకి చిక్కుతున్నప్పటికీ ఉన్నతాధికారులు ఆ అవినీతిని అడ్డుకునేందుకు దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీతో పాటు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తే అవినీతి చీడకు చెక్ పడే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏసీబీకి పట్టుబడుతున్న అధికారులు జిల్లాలో నెలకొకరు చొప్పున పట్టివేత కలవరపెడుతున్న వరుస ఘటనలు అధికారులు ఏం చేస్తున్నట్లు..!?ఏప్రిల్ 11.. జగిత్యాల సబ్ ట్రెజరీ కార్యాలయంలో రఘు అనే ఉద్యోగి రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. జూన్ 3న..రాయికల్ ఇన్చార్జి తహసీల్దార్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. ఆగస్టు 6.. డీటీవో భద్రునాయక్ తన వ్యక్తిగత డ్రైవర్ను మధ్యవర్తిగా ఉంచి రూ.22 వేలు లంచం తీసుకుంటై ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. జూలై 30.. జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఈ అనిల్ రూ.7 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. -
సీబీఎస్ఈ క్లస్టర్–7 టేబుల్ టెన్నీస్ పోటీలు ప్రారంభం
కరీంనగర్స్పోర్ట్స్/కొత్తపల్లి: కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ పాఠశాలలో బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీబీఎస్ఈ పాఠశాలల క్లస్టర్–7 బాలికల టేబుల్ టెన్నీస్ చాంపియన్ షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని సీబీఎస్ఈ పాఠశాలల నుంచి 2,500 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా క్రీడల్లో సాధన చేసి, విజయం సాధించాలన్నారు. దేశంలో పారా ఒలంపిక్ అథ్లెట్ దీపా మాలిక్ సాధించిన విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. దీప్తి రాష్ట్ర క్రీడా రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగడం శుభపరిణామన్నారు. డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వంతో దూసుకుపోవాలన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్రెడ్డి మాట్లాడుతూ పాఠశాల వార్షిక ప్రణాళికలో భాగంగా నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. జిల్లా క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్గౌడ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్రెడ్డి, పోటీల అబ్జర్వర్ పద్మారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 2,500 మంది క్రీడాకారుల హాజరు -
విమానంలో వలసకార్మికుడికి గుండెపోటు
● ముంబయిలో అత్యవసర ల్యాండింగ్ ● సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణం ● మృతుడి నివాసం కోరుట్లలో విషాదంకోరుట్ల: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఇంటికి తిరిగొస్తున్న ఓ వలసకార్మికుడికి విమానంలోనే గుండెపోటు వచ్చింది. తోటి ప్రయాణికులు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కథలాపూర్ మండలం చింతకుంటకు చెందిన శ్రీరాముల శ్రీధర్ (42) ఇరవై ఏళ్లుగా కోరుట్లలో అద్దెకు ఉంటున్నాడు. 15 ఏళ్లుగా గల్ఫ్ వెళ్లివస్తున్నాడు. అతడికి భార్య వీణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంటికి వచ్చేందుకు మంగళవారం ఉదయం సౌదీ నుంచి హైదరాబాద్కు విమానంలో బయలుదేరాడు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో శ్రీరాములు ఊపిరి ఆడటం లేదని విమాన సిబ్బందికి చెప్పడంతో వారు వెంటనే సీపీఆర్ చేసి ముంబయిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆస్పత్రికి తరలించి చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ముంబయి నుంచి శ్రీధర్ మృతదేహం గురువారం కోరుట్లకు రానుంది. ఆయనకు కోరుట్లలో సొంత ఇల్లు లేకపోవడంతో శ్రీధర్ కుటుంబం ఉండటానికి స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచే శ్రీధర్ అంతిమయాత్ర నిర్వహించనున్నారు. భార్యాపిల్లలను చూసేందుకు ఇంటికి వస్తున్న క్రమంలో శ్రీధర్ విమానంలోనే మృతి చెందడంతో కోరుట్లలో విషాదం నెలకొంది. -
మావో అగ్రనేతపై అరెస్ట్ వారెంట్
మంథనిరూరల్: సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఉరఫ్ సత్తన్నకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా సెషన్స్ కోర్డు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని మల్లా రాజిరెడ్డి స్వగ్రామం శాస్త్రులపల్లిలోని ఆయన ఇంటికి కాంకేర్ పోలీస్స్టేషన్ ఓస్సై ఆర్కే సేతీయ, కానిస్టేబుల్ మనోహర్ స్థానిక పోలీసులతో కలిసి బుధవారం నోటీసు అంటించారు. రాజిరెడ్డి ఉరఫ్ సత్తన్న ఉరఫ్ మురళి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కోర్డు వారెంట్ జారీచేసిందని, ఆయన ఇంటికి వెళ్తే ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి తలుపులపై నోటీసు అంటించామని పోలీసులు తెలిపారు. రాజిరెడ్డిపై కాంకేర్ జిల్లా పరిధిలో క్రైమ్ నంబర్ 09/2025 ప్రకారం బీఎస్ఎస్ 191(2), 191(3), 190, 109, బీఎన్ఎస్ 25,27, అంసెట్ 13, 38(2), 39(2) యూఏపీఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పోలీసులు వివరించారు. వచ్చేనెల 11వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మల్లా రాజిరెడ్డి ఇంటికి నోటీసు అంటించిన పోలీసులు -
కల్తీ మద్యం విక్రయిస్తున్న ముఠా రిమాండ్
వేములవాడరూరల్: వేములవాడ ప్రాంతంలో కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా కల్తీ మద్యం తయారీ చేస్తూ విక్రయిస్తున్న ముఠాను ఎకై ్సజ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ రాజేశ్వర్రావు తెలిపిన వివరాలు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కార్తీక్, వేములవాడ పట్టణంలో అద్దెకు ఉంటున్న సంతోష్ కలిసి తక్కువ ధర గల మద్యం కొని, బ్రాండెడ్ పేర్లు గల బాటిళ్లలో నింపుతూ విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎకై ్సజ్ పోలీసులు బుధవారం వారి ఇళ్లపై దాడి చేయగా అసలు విషయం తెలిసింది. కార్తీక్ చీప్లిక్కర్ను కొని బ్రాండెడ్ బాటిళ్లలో నింపుతూ విక్రయిస్తున్నాడు. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఎకై ్సజ్ పోలీసులు విచారణ చేపట్టగా తనతోపాటు మరో వ్యక్తి సంతోష్ సైతం ఉన్నట్లు తెలిపాడు. వేములవాడలోని సంతోష్ ఇంటిపై దాడి చేయగా బ్రాండెడ్ బాటిళ్లలో నింపిన మద్యం, ఖాళీ సీసాలు లభించాయి. ఇద్దరి వద్ద రూ.50వేల విలువైన మద్యం దొరికింది. ఆరు నెలలుగా వీరిద్దరు మద్యాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తనిఖీల్లో ఎస్ఐ రవి, సిబ్బంది పాల్గొన్నారు. బ్రాండెడ్ బాటిళ్లలో చీప్లిక్కర్ రూ.50 వేల మద్యం పట్టివేత ఇద్దరి రిమాండ్ -
మనవద్దా ‘సృష్టి’ కేంద్రాలు..!
● నిబంధనలు పాటించని సంతాన సాఫల్య కేంద్రాలు ● జిల్లావ్యాప్తంగా సుమారు పది వరకు నిర్వహణ ● లోపించిన అధికారుల పర్యవేక్షణ ● తాజాగా తనిఖీలకు ప్రత్యేక బృందాలుజిల్లాలో ప్రభుత్వ అనుమతితో నాలుగు ఫెర్టిలిటీ కేంద్రాలు నడుస్తున్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి కాకుండా అనధికారికంగా పది వరకు కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు నేరుగానే ఫెర్టిలిటీ సెంటర్గా పేరు పెట్టుకుని చికిత్స చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పేదలే టార్గెట్ కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాలు ఆర్థికంగా లేని మహిళలను టార్గెట్ చేసుకుంటున్నారు. వారికి ఎంతోకొంత ముట్టజెప్పి వారి అండాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కొన్ని కేంద్రాలు పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారంటే అతిశయోక్తికాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళల వద్దకు కొందరు నిర్వాహకులు వెళ్లి వారిని ఫెర్టిలిటీ సెంటర్లకు తీసుకొచ్చి అండాలు విక్రయించుకునేలా చేస్తున్నట్లు తెలిసింది. అమ్మ కోసమే.. చాలామంది దంపతులకు కొన్ని కారణాలతో సంతానం కలగకపోవడంతో ఈ ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మధ్యవర్తులు ఆశ్రయిస్తున్నారు. వారు ఇదే అదునుగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని గ్రామాల్లోని ఆర్ఎంపీలు, పీఎంపీలు ఫెర్టిలిటీ కేంద్రాలు నియమించుకున్న పీఆర్వోలతో ఈ దందా నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. చికిత్స కోసం వచ్చిన దంపతులకు ఫెర్టిలిటీ సెంటర్లలో రెండు రకాల చికిత్సలు చేస్తారు. దంపతులను పరీక్షించి వారిలో ఉన్న లోపం గుర్తించి వీర్యకణాలు, అండాలు సేకరించి చికిత్స చేస్తుంటారు. ఇందులో ఒకటి ఇంట్రాయుటిరైన్ ఇన్ సెమినేషన్ (ఐయూఐ), రెండోది ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్). ఇది దంపతుల అంగీకారంతోనే చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు వీటిని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతర దాతల నుంచి సేకరించిన వీర్యకణాలు, అండాలను ప్రవేశపెట్టి సంతానం కలిగేలా చికిత్స చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ ప్రత్యేక దృష్టి జిల్లాలోని ఫెర్టిలిటీ సెంటర్లపై కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని ఇప్పటికే వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో అనుమతి ఉన్న కేంద్రాలు ఎన్ని..? లేనివి ఎన్ని..? నిబంధనల ప్రకారం ఉన్నాయా..? లేవా..? పూర్తిస్థాయిలో సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు వైద్యశాఖ అధికారులు కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది.జగిత్యాల: ఒకప్పుడు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమైన సంతాన సాఫల్య కేంద్రాలు.. ప్రస్తుతం జిల్లాలకూ విస్తరించాయి. ఒకటికాదు.. రెండుకాదు.. విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. అనుమతులు లేకుండానే ప్రతిచోట ఫెర్టిలిటీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. సికింద్రాబాద్లో సృష్టి సరోగసి కేంద్రంలో జరిగిన మోసంతో జిల్లాలోని ఫెర్టిలిటీ కేంద్రాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. కలెక్టర్ సత్యప్రసాద్ కూడా ప్రత్యేక దృష్టిసారించారు. మరోవైపు ప్రభుత్వం కూడా ముగ్గురు సభ్యులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేయగా.. జిల్లాలోనూ బృందాలను నియమిస్తున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం ఫెర్టిలిటీ సెంటర్లో అన్ని వసతులు కల్పించడంతోపాటు డీఎంఏ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -
వసతుల్లేని గోదావరి
ధర్మపురి: గోదావరిలో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు కనీస వసతులు కరువయ్యాయి. ఫలితంగా మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు కనీసం తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. స్నానాలకోసం వచ్చే భక్తులకు గోదావరిలో నీడ సౌకర్యం కల్పించడంతోపాటు మహిళలు దుస్తులు మార్చుకునేందుకు షెడ్లు తప్పనిసరి. కానీ.. వాటిని ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. భక్తుల ద్వారా నృసింహస్వామి ఆలయం, మున్సిపాలిటీకి ప్రతిరోజూ భారీగానే ఆదాయం సమకూరుతోంది. కానీ.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో మాత్రం అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు అంటున్నారు. ఏ పుణ్యక్షేత్రంలో చూసినా భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ ధర్మపురి పుణ్యక్షేత్రంలో మాత్రం భక్తులు వసతులకు నోచుకోలేకపోతున్నారు. శ్రావణంలో భక్తుల రద్దీ దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి వద్ద గోదావరితోపాటు, శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయాలున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణమాసం సందర్భంగా నెలరోజుల పాటు గోదావరి, దేవాలయాలు కిక్కిరిసి పోతాయి. పుణ్యస్నానాలు, దైవదర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అనంతరం లక్ష్మీనృసింహస్వాములను దర్శించుకుంటారు. కనిపించని వసతులు శ్రావణమాసం సందర్భంగా నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. గోదావరిలో స్నానాలు చేసిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకుంటారు. అలాంటి వసతులు గోదావరిలో ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు బట్టలు మార్చుకునేందుకు రాళ్లు రప్పలు, ముళ్ల పొదలను ఆశ్రయించాల్సి వస్తోంది. నిరుపయోగంగా షెడ్లు గోదావరిలో కనీసం తాత్కాలిక షెడ్లనైనా ఏర్పాటు చేయాలని భక్తులు అంటున్నారు. కొందరు స్నానాల కోసం నది దాటి వెళ్తున్నారు. అక్కడ వసతులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మంగలిగడ్డ వద్ద గతంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ల వద్ద 2, 3 షెడ్లు మాత్రమే ఉన్నాయి. వాటి పైకప్పులు గాలికి లేచిపోవడంతో నామమాత్రంగా కవర్ కప్పారు. అయితే ఆ పుష్కరఘాటు వద్ద నీరు లేకపోవడంతో భక్తులు స్నానాల కోసం ఎగువ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఫలితంగా ఆ షెడ్లు నిరుపయోగంగా మారాయి. భక్తులున్న చోట వసతులు కల్పిస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. పుణ్యస్నానాలకు భక్తుల ఇబ్బందులు పుష్కరఘాట్ల వద్ద నామమాత్రంగా ఏర్పాట్లు ఆదాయమున్నా.. వసతుల కల్పనలో నిర్లక్ష్యం -
ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ప్రథమ బహుమతి
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని బిర్లా ఓపెన్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన 3వ తరగతి విద్యార్థి మరియం భాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ప్రథమ బహుమతి సాధించినట్లు పీడీ సుంకరి మురళీధర్ తెలిపారు. ఈ నెల 3న స్వదేశ్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి ప్రథమ బహుమతి, రూ.10వేల నగదు గెలుచుకున్నట్లు వివరించారు. మంగళవారం విద్యార్థిని పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, ప్రిన్సిపాల్ బబితా విశ్వనాథన్ అభినందించారు. -
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
మల్లాపూర్: సీజనల్ వ్యాధులపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. మందులు ఉన్నాయా..? లేదా..? తెలుసుకున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు చేయాలని, రోగి లక్షణాలు రికార్డు చేయాలని సూచించారు. సిబ్బంది సకాలంలో విధులకు హజరుకావాలన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్, మండల వైద్యాధికారి వాహిని, తహసీల్దార్ రమేశ్గౌడ్, ఎంపీడీవో శశికుమార్రెడ్డి, సీహెచ్వో రామ్మోహన్ పాల్గొన్నారు. ఫిర్యాదులపై సత్వరమే పరిష్కరించాలి భూసమస్యలు, ఇతరత్రా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఈనెల 14లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ సత్యప్రసాద్ -
అంజన్న సన్నిధిలో శ్రావణ సందడి
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ సందడి నెలకొంది. మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. సామూహిక అభిషేకాలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. టికెట్లు, లడ్డూ విక్రయాల ద్వారా రూ.4.56లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, సునీల్కుమార్, చంద్రశేఖర్, హరిహరనాథ్, అశోక్కుమార్ పాల్గొన్నారు. సామూహిక అభిషేకాలు చేస్తున్న భక్తులు -
సోలార్ విద్యుత్ సబ్సిడీని వినియోగించుకోండి
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం మెట్పల్లి: సోలార్ విద్యుత్కు అవసరమైన పరికరాలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం తెలిపారు. సోలార్ ఇంధన వనరుల ఆవశ్యకతపై మంగళవారం ని ర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. థర్మల్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి జరుగుతోందని, తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతోపాటు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్రం పీఎం సూర్యఘర్ యోజన, పీఎం కుసుమ్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. దీనికింద సోలార్ పరికరాలను సబ్సిడీపై అందిస్తోందన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులు వెలి బుచ్చిన పలు సందేహాలను కంపెనీ ప్రతినిధి బండి ప్రవీణ్ నివృత్తి చేశారు. డీఈ మధుసూదన్, ఏడీఏ మనోహర్ తదితరులున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతం
● పీఎంశ్రీ స్కూళ్లకు చేరిన వాయిద్య పరికరాలు ● వారానికో తరగతి చొప్పున నిర్వహణ ● శిక్షకుల నియామకానికి కమిటీ ఏర్పాటు ● జిల్లాలో పది పాఠశాలల ఎంపిక గొల్లపల్లి: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు, వారి సర్వతోముఖాభివృద్ధికి వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. చదువుతోపాటు క్రీడలు, యోగా, కరాటే వంటి అంశాలను ఐచ్ఛికంగా నేర్చుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లాలో పది పాఠశాలలను మొదటి విడత కింద ఎంపిక చేసి సంబంధిత పరికరాలను స్కూళ్లకు పంపిణీ చేశారు. విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా వారంలో ఒకరోజు సంగీతం నేర్చుకోనున్నారు. తద్వారా వారికి శ్రవనానందంతోపాటు, ఏకాగ్రత పెరగనుంది. సంగీత సాధనతో వివిధ రకాలైన కళల్లో ప్రావీణ్యం పొందనున్నారు. పిల్లలు వాటిని నేర్చుకునేందుకు మరింత ఆసక్తి చూపనున్నారు. సంగీత సాధనతో టీవీ, సెల్ఫోన్లకు దూ రంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్లో ఆయా వృత్తుల్లో కూడా స్థిరపడేందుకు ఉపకరిస్తుంది. శిక్షకులు వస్తే ప్రయోజనం పాఠశాలలకు సంగీత వాయిద్యాలు అంది నెల రోజులు అవుతోంది. విద్యార్థులతో సాధన చేయించే శిక్షకులను ఇంకా నియమించలేదు. అన్ని రకాల వాయిద్యాలు తెలిసిన వారు అరుదుగా ఉంటారు. ఒక్కో దాంట్లో ఒక్కొక్కరికి ప్రావీ ణ్యం ఉంటుంది. ఇలాంటి వారిని ఎంపిక చేయడం సులభమే. అన్ని తెలిసిన వారికి రూ.10 వేల గౌరవ వేతనం సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. భిన్నరంగాల్లో ప్రతిభ ఉన్న ఇద్దరిని నియమించి వేతన సర్దుబాటు చేస్తే పరిష్కారం లభిస్తుందని పలువురు అంటున్నారు. సంగీత పా ఠాలు బోధించడంలో ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే సంగీత ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే సంగీత పాఠాలు బోధించేందుకు ఆస్కారం ఉంటుంది. పరికరాల పంపిణీ జిల్లాలో పీఎంశ్రీ కింద 10 పాఠశాలకు సంగీత పరికరాలను పంపిణీ చేశారు. డోలక్, తబల, హ ర్మోనియమం, డ్రమ్స్, వయోలిన్ వంటివి అందించారు. వీటిని 6–10వ తరగతి చదివే విద్యార్థులతోపాటు, కేజీబీవీ, గురుకుల, మోడల్స్కూళ్లలో ఇంటర్ విద్యార్థులకు నేర్పించనున్నారు. -
తల్లిపాల ప్రాముఖ్యత వివరించాలి
మల్లాపూర్: తల్లిపాలు బిడ్డకు సురక్షితమని, వాటి ప్రాముఖ్యతను వివరించాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్సీని ఆయన సందర్శించారు. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని, ఈ విషయాన్ని బాలింతలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. అలాగే డెంగీ, టైపాయిడ్, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలకుండా చూడాలని సూచించారు. నిలిచిన ఇళ్లకు నిధులివ్వండిజగిత్యాలటౌన్: నూకపల్లి అర్బన్ కాలనీలో వివిధ దశల్లో నిలిచిపోయిన 1611 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.52కోట్లు మంజూరు చేయాలని మాజీమంత్రి జీవన్రెడ్డి సీఎంను కోరారు. ఈ మేరకు హైదరాబాద్లో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నూకపల్లిలో ఇందిరమ్మకాలనీ పేరిట 4వేలమందికి ఇళ్లు మంజూరు చేసిందని, 80గజాల స్థలంలో పట్టాలు పంపిణీ చేసిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం రెండువేల ఇళ్లను కూల్చివేయించిందని, మిగిలిన 1611 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి నిర్మాణానికి రూ.52కోట్లు అవసరమని వివరించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు జీవన్రెడ్డి పేర్కొన్నారు. పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలిజగిత్యాల: పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించాలని అదనపు కలెక్టర్ లత అన్నా రు. మంగళవారం వైద్యాధికారులతో సమీక్షించారు. జిల్లాలో పిల్లలు 2,22,950 మంది ఉ న్నారని, వారి కోసం 2,175 కేంద్రాలు ఏర్పా టు చేశామని, అన్ని అంగన్వాడీకేంద్రాలు, ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రలు వేయాలని సూచించారు. ఆగస్టు 11న వేసే ఈ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని, తిరి గి 18న మరోసారి మాత్రలు పంపిణీ చేస్తామ ని వివరించారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, శ్రీనివాస్, జైపాల్రెడ్డి, అర్చన, నరేశ్, నారా యణ, సుమన్, చైతన్యసుధ పాల్గొన్నారు. జిల్లాకు మోస్తరు వర్ష సూచనజగిత్యాలఅగ్రికల్చర్: రానున్న ఐదురోజుల్లో జిల్లాకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీ లక్ష్మి తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్గా.. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 27 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. బస్సులను జాగ్రత్తగా నడపాలిజగిత్యాలటౌన్: ఆర్టీసీ బస్ డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని, తమ కుటుంబాలతోపాటు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకోవాలని జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై మల్లేశం సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల డిపోలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. రివర్స్ తీసుకునే సమయంలో కండక్టర్ సూచనలు పాటించాలన్నారు. బ్లాక్ స్పాట్స్పై అవగాహన కల్పించారు. డీఎం కల్పన మాట్లాడుతూ సంస్థ నమ్మకాన్ని మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు. డిపో ఏఈఎం కవిత, సేఫ్టీ వార్డెన్ ఎస్జె.రెడ్డి పాల్గొన్నారు. -
జిల్లాలో నాలుగు సెంటర్లు
జిల్లాలో ఫెర్టిలిటీ సెంటర్లు నాలుగు ఉన్నాయి. ఎవరైనా నేరుగా ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతాం. అనుమతులు డీఎంఏ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. – ప్రమోద్కుమార్, డీఎంహెచ్వో అనుమతి లేకుంటే చర్యలు నిబంధనలు అతిక్రమిస్తే ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. తనిఖీలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించాం. బాధితులెవరైనా ఉంటే సమాచారం ఇవ్వొచ్చు. కేంద్రాలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అనుమతి లేకుంటే సీజ్ చేస్తాం. – సత్యప్రసాద్, కలెక్టర్ -
కళలను ప్రోత్సహించడం హర్షణీయం
పిల్లలకు చదువుతో పాటు, వివిధ కళలను నేర్పించడం హర్షణీయం. చిన్నతనం నుంచి సంగీతం నేర్చుకోవడం ద్వారా దేశ సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. సంగీతంతో మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాఠశాలలకు విస్తరించడం స్వాగతిస్తున్నాం. – చెన్నాడి వెంకటరమణరావు, కవి ప్రతిభను వెలికితీసేలా ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతం నేర్పించడం ద్వారా వారిలో ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుంది. బోధనతో అలసటకు గురయ్యే పిల్లలు సంగీతంతో మరింత ఉత్సాహంగా ఉంటారు. ప్రస్తుతం అనేక పాఠశాలల్లో టీచర్లు పాఠాలను కథలు, గేయాల రూపంలో చెబుతూ తోడ్పాటు అందిస్తున్నారు. – రవి, ప్రిన్సిపల్, గొల్లపల్లి మోడల్స్కూల్ పరికరాలు వచ్చాయి పీఎంశ్రీ పథకం కింద జిల్లాలోని ఎంపిక చేయబడిన పాఠశాలలకు మొదటి విడత కింద సంగీత పరికరాలను పంపిణీ చేశారు. దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నాం. వారానికో పీరియడ్ సంగీతం, వాయిద్యాలపై శిక్షణ ఇచ్చేందుకు టైంటేబుల్ ఏర్పాటు చేస్తున్నాం. – రాము, డీఈవో -
పల్లెకు సౌరవెలుగులు
● సోలార్ పవర్ ఉత్పత్తిపై గ్రామీణుల ఆసక్తి ● విద్యుత్ చార్జీల ఆదా.. అదనపు ఆదాయం ● పీఎం సూర్యఘర్ స్కీంకు పెరుగుతున్న డిమాండ్ మంథనిరూరల్: ఆధునిక సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెదుతోంది. దీనిని సొంతం చేసుకోవడంలో పల్లెవాసులూ ఆసక్తిచూపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన సోలార్ పవర్ తయారీ, వినియోగం పద్ధతులు గ్రామాలకూ విస్తరిస్తున్నాయి. విద్యుత్ చార్జీల భారం తగ్గించుకునేందుకు పల్లెప్రజలు సోలార్ పవర్పై ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సోలార్ ప్యానెల్స్ అమర్చుకుంటున్నారు. ఇంటికి 300 యూనిట్లు ఉచితం.. పీఎం సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజన ద్వారా సోలార్ సిస్టం అమర్చుకుంటే ఇంటికి 300 యూనిట్లు ఉచితంగా అందించేలా రూపకల్పన చేశారు. దీంతో విద్యుత్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. చార్జీల ఆదా.. అదనపు ఆదాయం.. సోలార్ పవర్ తయారీ సిస్టమ్ అమర్చుకుంటే ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఆదా అవుతాయి. ఈ ప్యానెల్స్ ద్వారా నెలకు 300 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 200 – 300 యూనిట్ల వరకు గృహావసరాలకు వినియోగించుకోవాలి. మిగిలిన విద్యుత్ను ఎన్పీడీసీఎల్ ఒక్కో యూనిట్కు రూ.4 చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఒకవైపు విద్యుత్ చార్జీల భారం తగ్గడం, మరోవైపు విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుండడంతో పల్లెవాసులు తమ ఇళ్లపై సోలార్ పవర్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం నుంచి రాయితీ.. కేంద్రప్రభుత్వం గతేడాది ప్రవేశ పెట్టిన సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా రాయితీ వర్తింపజేస్తోంది. 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ సిస్టం అమర్చుకుంటే రూ.78 వేలు, 2 కిలోవాట్లు అయితే రూ.60 వేలు, ఒక కిలోవాట్ అయితే రూ.30 వేల వరకు సబ్సిడీ అందిస్తోంది. దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, నెలసరి విద్యుత్ బిల్లు, ఇంటి యజమాని ధ్రువీకరణ పత్రం ఉంటే చాలు. దరఖాస్తు ఆమోదం తర్వాత ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చుతారు. కరెంట్ చార్జి తగ్గుతుంది రోజురోజుకూ కరెంట్ చార్జీలు పెరుగుతున్నయ్. ఎండకాలంలో రూ.వేలకు వేలు కట్టాల్సి వస్తోంది. కరెంటు చార్జీల భారం తగ్గుతుందనే ఆలోచనతో సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకున్న. ప్రస్తుతం బాగానే పనిచేస్తుంది. – ముత్యాల లింగయ్య, ధర్మారం, మంథని అదనపు ఆదాయం గృహావరాలకు ఉచితం. అదనపు ఆదాయం వస్తుందనే ఆలోచనతో సోలార్ సిస్టం తీసుకున్న. సబ్సిడీ కూడా వస్తుంది. ఇంట్లో మేం వాడుకోగా మిగలిన సోలార్ కరెంట్ను అధికారులు తీసుకుని మాకు పైసలు ఇస్తున్నరు. – బడికెల సతీశ్, ఉప్పట్ల, మంథని -
మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
మానకొండూర్: ఇసుక లారీ ఢీకొని చనిపోయిన మానకొండూర్ మండలం మద్దికుంట గ్రామానికి చెందిన కెక్కర్ల సురేశ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని, ప్రమాదానికి కారణమైన ఊటూరు ఇసుకక్వారీ యజమానులు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై కేసు నమోదు చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. మానకొండూర్లో మంగళవారం మాట్లాడుతూ.. కెక్కర్ల సురేశ్ కరీంనగర్లోని ఓ ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవాడన్నాడు. పోచంపల్లి వద్ద ఇసుక లారీని ఢీకొని చనిపోయాడని తెలిపారు. సురేశ్ను అంబులెన్సులో కరీంనగర్ తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. రహదారి వెంట ఇసుక లారీలు నిలిపేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కనీసం పరామర్శించలేదన్నారు. మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్గౌడ్, రవీందర్రెడ్డి, దేవేందర్రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, నెల్లి శంకర్, గుర్రం కిరణ్ గౌడ్, గడ్డం సంపత్, నెల్లి మురళి, అశోక్రెడ్డి పాల్గొన్నారు. క్వారీ యజమాని, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ -
వినూత్నంగా.. ఉపాధి పక్కాగా..
సిరిసిల్లకల్చరల్: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి.. అని పెద్దలు చెప్పిన మాటలను నమ్మి ముందుకెళ్లి విజయం సాధించాడు భైరి మధు. తన తప్పేమి లేకున్నా చేస్తున్న వ్యాపారంలో నష్టం రాగా.. అదే రంగంలో వినూత్నంగా ఆలోచించి ఉపాధి పక్కాగా చేసుకున్నాడు. మరో 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన మధు తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం భీవండిలో స్థిరపడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి సిరిసిల్ల సమీపంలోని చంద్రంపేటకు వచ్చాడు. తన రెక్కల కష్టంతో రెండు కార్ఖానాలు నిర్వహించే స్థాయికి ఎదిగాడు. అయితే కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయాడు. పడిన చోటే తిరిగి లేవాలని భావించి.. చేనేత రంగంలోని వినూత్నంగా ఆలోచించాడు. ఇప్పుడు 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కరోనాతో కొత్త జీవితం కరోనా నియంత్రణకు మాస్కులు ధరించడం తప్పనిసరైన నేపథ్యంలో మాస్కుల తయారీపై దృష్టి సారించిన మధు కరీంనగర్, వరంగల్ జిల్లాల వరకు సరఫరా చేశాడు. సంక్షోభం ముగిసి సమాజం సాధారణ స్థితికి చేరేసరికి మధుకు ప్రత్యామ్నాయ వ్యాపారం జాడ దొరికింది. జాతీయ జెండాల రూపకల్పన, బ్యానర్లతోపాటు పండుగల సందర్భంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న కండువాలు తయారు చేయడం ప్రారంభించాడు. గత ఐదేళ్లుగా వస్త్రం కొనుగోలు చేయడం, రంగులు అద్దించడంతోపాటు వాటిని ఆర్డర్ల మేరకు కండువాలు, తయారు చేయిస్తున్నాడు. కృష్ణాష్టమి, వినాయక చవితి వంటి సామూహిక ఉత్సవాల్లో ఉపయోగించే లాల్చీలు, కుర్తాలు కుట్టించి విక్రయిస్తున్నాడు. వివాహాది శుభకార్యాల సందర్భంగా ఆయా కార్యక్రమాల నిర్వాహకులు ఏకరీతిగా ఉండే కుర్తాలు ధరిస్తుంటారు. అదే అదనుగా హల్దీ, సంగీత్ వంటి ఉత్సవాలకు అవసరమైన కుర్తాలు తయారు చేయించి అమ్ముతున్నాడు. మరో 40 మందికి ఉపాధి మధు తాను ఉపాధి పొందడంతోపాటు మరో 40 మందికి కుర్తాలు కుట్టే పనిలో ఉపాధి ఇస్తున్నాడు. ఒక్కొక్కరు వారి పని తీరు ఆధారంగా రోజుకు కనీసం రూ.300 సంపాదిస్తున్నారు. మధు చేస్తున్న పనికి ఆయన సతీమణి శ్యామల సైతం తోడుగా నిలుస్తోంది. కుర్తాలు, లాల్చీల తయారీ మరో నలభై మందికి ఉపాధి స్వయంకృషితో రాణిస్తున్న మధు కరోనా నేర్పిన దారి కోవిడ్ మహమ్మారి కారణంగా చేస్తున్న వ్యాపారం నష్టపోయాను. మాస్కులు ధరించడం తప్పనిసరి అనే ప్రచారంతో మాస్కులు త యారు చేయించి ఊరూరూ తిరిగి అమ్మేవాన్ని. టీవీఎస్ ఎక్సెల్ బండిమీద పలు జిల్లాల్లో మాస్కులు విక్రయించాను. మెల్లగా కరోనా పీరియడ్ తరువాత ఈ కుర్తాలు, జెండాలు, కండువాలు తయారు చేయించి విక్రయిస్తున్నాను. – భైరి మధు, తయారీదారుడు కొన్నేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా కొంతకాలంగా కుర్తాలు, లాల్చీలు కుట్టడం కోసం ఇక్కడే పనిచేస్తున్నాను. రోజుకు 30 నుంచి 40 వరకు లాల్చీలు కుట్టగలుగుతున్నాను. రోజుకో రూ.400 చొప్పున నెలకు రూ.12వేలు వరకు ఆదాయం వస్తోంది. – సిరిపురం లక్షణ -
ఘనత సాధించిన తండ్రీకొడుకులు
పెద్దపల్లిరూరల్: యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఎల్బ్రోస్ 5,642 మీ ఎత్తు (18,150 అడుగులు) పర్వతశిఖరాన్ని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన వివేకానందరెడ్డి, ఆయన తండ్రి మహిపాల్రెడ్డి అధిరోహించారు. దీంతో కలెక్టరేట్లో మంగళవారం తండ్రీకొడుకులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. తండ్రిబాటలో తనయుడు.. మాజీ సైనికోద్యోగి అయిన లెంకల మహిపాల్రెడ్డి ఇప్పటికే పలు దేశాల్లోని 12 పర్వతాలను అధిరోహించి ఇంటర్నేషనల్ మౌంటనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. తన బాటలోనే తనయుడు వివేకానందరెడ్డిని కూడా పర్వతారోహకుడిగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో గతేడాది శిక్షణ ఇచ్చారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని పతాల్సు పర్వతాన్ని వివేకానందరెడ్డి అధిరోహించారు. తండ్రి ఇచ్చిన శిక్షణతోనే యూరప్లో అత్యంత ఎత్తయిన పర్వతాన్ని ఈనెల 3న అధిరోహించారు. సే నో టు డ్రగ్స్ బ్యానర్ ఆవిష్కరణ యూరప్లోని పర్వతాన్ని అధిరోహించిన వివేకానందరెడ్డి.. అక్కడ సే నో టు డ్రగ్స్ అనే బ్యానర్ ఆవిష్కరించారు. గతనెల 28న రష్యాకు చేరుకుని అక్కడే ఐదురోజుల పాటు శిక్షణ పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణంలోనూ మాస్టర్ వివేకానందరెడ్డి ధైర్యసాహసాలతో పర్వతాన్ని అధిరోహించడం అభినందనీయమని కలెక్టర్ అభినందించారు. భవిష్యత్లో మరెన్నో పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించి తెలంగాణ రాష్ట్రానికి, భారతావనికి కీర్తిప్రతిష్టలు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. యూరప్లో ఎత్తయిన శిఖరం అధిరోహణ అభినందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష -
కొత్తబస్టాండ్లో గుర్తుతెలియని మృతదేహం
జగిత్యాలక్రైం: జగిత్యాల కొత్తబస్టాండ్లో గుర్తుతెలియని మృతదేహం కనిపించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. వేములవాడ బస్ ప్లాట్ఫాం సమీపంలోని మరుగుదొడ్ల పక్కన వ్యక్తి మృతదేహం ఉందని, బూడిద రంగు టీషర్ట్, తెల్లపంచ కట్టుకుని ఉన్నాడని, మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని పేర్కొన్నారు. అతని సమాచారం తెలిసినవారు 87126 56815నంబర్లో సంప్రదించాలని కోరారు. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యశంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామంలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శంకరపట్నం ఎస్సై శేఖర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రావ్య(27)కు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కొడుకు శ్రేయాన్స్నందన్ ఉన్నాడు. ధర్మతేజ్ రెండేళ్లక్రితం దుబాయ్ వెళ్లాడు. అప్పటినుంచి శ్రావ్య పుట్టింట్లో ఉంటోంది. సోమవారం రాత్రి దుబాయ్ నుంచి ధర్మతేజ్ శ్రావ్యతో వీడియోకాల్లో మాట్లాడాడు. ఇద్దరిమధ్య గొడవ జరగడంతో మంగళవారం వేకువజామున ఇంట్లో శ్రావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావ్య సోదరుడు గొట్టె శివకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మానసికవేదనతో ఒకరు.. చిగురుమామిడి: చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన బల్ల బాలయ్య(50) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బాలయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గుండె సంబంధిత ఆపరేషన్ సైతం జరిగింది. కొద్దిరోజులుగా మానసిక వేదనకు గురవుతూ.. మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుక్కల దాడిలో బాలుడికి గాయాలుమెట్పల్లి: పట్టణంలోని దుబ్బవాడకు చెందిన చిన్నారి జెట్టి మాన్విక్పై మంగళవారం కుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న మాన్విక్పై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడికి పలుచోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతడిని మొదట స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తీసుకెళ్లారు. -
దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తూ..
● ఐలాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం ● చెట్టును ఢీకొట్టిన కారు ● ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు కోరుట్లరూరల్: దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని అయిలాపూర్ శివారులో మంగళవారం ఉదయం నాలుగు గంటలకు చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం.. అయిలాపూర్కు చెందిన గాడిపెల్లి నరేశ్ (36) కొంతకాలంగా గల్ఫ్ వెళ్లి వస్తున్నాడు. 20రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో పండగలన్నీ చేసుకున్నారు. ఈనెల 10న తిరిగి గల్ఫ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. సోమవారం ఉదయం తోడళ్లుడు బొల్లపెల్లి శ్రీనివాస్ కారులో రెండు కుటుంబాలు కలిసి యాదగిరి, స్వర్ణగిరి ఆలయాలను దర్శించుకున్నారు. రాత్రిసమయంలో తిరుగు పయణమయ్యారు. రెండు నిమిషాలైతే ఇంటికి చేరేదే.. ఆలోపే అయిలాపూర్ శివారు సబ్స్టేషన్ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. బొల్లెపల్లి శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీనివాస్ భార్య సుజాతకు రెండు కాళ్లు, ఓ చేయి విరిగింది. నరేశ్ భార్య సరితకు రెండు చేతులు విరిగాయి. నరేశ్ కుమారుడు, కూతురు, శ్రీనివాస్ కూతురును జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. నరేశ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు.