breaking news
Jagitial District Latest News
-
దళితకాలనీల్లో కనిపించని అభివృద్ధి
రాయికల్: పట్టణంలోని దళితకాలనీలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలోని మూడో వార్డును బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22నెలలు పూర్తయినా దళితవార్డుల్లో నయాపైసా అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో దళితవాడలకు ప్రత్యేక నిధులు కేటాయించారని గుర్తు చేశారు. ఆమె వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ మారంపల్లి రాణి, రాయికల్ కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, మాజీ కౌన్సిలర్లు మారంపెల్లి సాయికుమార్, శ్రీరాముల సత్యనారాయణ, నాయకులు వినోద్, రాంప్రసాద్ పాల్గొన్నారు. -
మళ్లీ..అదే తీరు
● పదిహేను రోజుల క్రితం.. కోరుట్ల పట్టణ శివారులో ఇసుక అక్రమ రవాణాదారు ఓ ఆర్ఐ, ముగ్గురు వీఆర్ఏలపై దాడికి దిగి మామూళ్ల ప్రస్తావన తెస్తూ దూషించాడు. ఈ ఘటన జరిగిన ఐదు రోజుల వరకూ రెవెన్యూ అధికారులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అతికష్టంపై మోహమాటానికి ఫిర్యాదు చేసినా.. అంతలోనే రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎడారి దేశానికి వెళ్లిపోయాడు. ● రెండు రోజుల క్రితం కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి సమీపంలో ఓ ఇసుక డంప్ నుంచి లారీలు, టిప్పర్లతో ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. తమనే అడ్డుకుంటారా..? అని సదరు అక్రమ రవాణాదారులు గొడవ చేసి.. సిబ్బందిపై దాడి చేసి.. వారిని తోసేసి ఇసుకతో లారీలు, టిప్పర్లను దర్జాగా తీసుకెళ్లారు. ఈ విషయమై దాడికి గురైన సిబ్బంది రెవెన్యూ అధికారులకు తెలిపితే ‘పోనీలే’..అంటూ రాజీ పడటం విశేషం. కోరుట్ల: ఈ రెండు సంఘటనల్లోనూ రెవెన్యూ ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కలవరం రేపుతోంది. రాత్రి..పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవడానికి కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది అధికారుల తీరుతో అభద్రత భావంతో ఆందోళన చెందుతున్నారు. ఇసుక అక్రమ రవాణాదారులు దాడులకు పాల్పడుతున్నా.. ఫిర్యాదు చేయడంలో చూపుతున్న ఉదాసీనతకు ‘మామూళ్ల మత్తు’ కారణమా.. లేక రాజకీయ ఒత్తిళ్ల ఫలితమా..? అనే విషయం తేలడం లేదు. ఈ రెండు సంఘటనలు జరిగిన వెంటనే కోరుట్ల, కథలాపూర్ సరిహద్దుల్లోని సిరికొండ, బొమ్మెన, నాగులపేట, సంగెం ఏరియాల్లోని వాగుల్లో కనీసం గట్టి ఏర్పాట్లు చేసి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారా.. అంటే అదీ లేదు. ఓ వైపు రెవెన్యూ సిబ్బందిపై వరుస దాడులకు తెగబడుతూనే.. మరోవైపు యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా లారీలు, టిప్పర్లతో కోరుట్ల నుంచి జగిత్యాల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ వైపు తరలిస్తున్నారు. ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు..? ఇసుక అక్రమ రవాణాను క్షేత్రస్థాయిలో అడ్డుకోవాల్సిన కింది స్థాయి సిబ్బంది దాడుల భయంతో విధుల నిర్వహణపై అనాసక్తితో ఉండగా.. పైస్థాయి అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో నలిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోరుట్ల, కథలాపూర్ మండలాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొంతమంది కీలక నేతలు ఈ ఇసుక అక్రమ రవాణాకు వెన్నుదన్నుగా ఉంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడిన వెంటనే కీలకనేతల ఫోన్లు రావడంతో తప్పనిసరై వదిలేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే తమ సిబ్బందిపై దాడులు జరుగుతున్నప్పటికీ.. పట్టింపులేని ధోరణితో రాజీబాటను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. చివరికి కొంతమంది అధికారులు ‘నలుగురితో నారాయణ’ అన్న చందంగా అమ్యామ్యాలకు ఆశపడి నిర్లిప్తంగా ఉండక తప్పనిసరి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇసుక అక్రమ రవాణాతో ఓ వైపు భూగర్భజలమట్టం పడిపోయే ప్రమాదం పొంచి ఉండటంతోపాటు..ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాకు పెద్ద ఎత్తున గండిపడుతోందన్న మాట వాస్తవం. -
వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి
జగిత్యాలటౌన్: కోటి వెలుగుల క్రాంతి. కొత్త ఆలోచనలకు స్ఫూర్తి దీపావళి. కష్టాలు అనే చీకట్లను తొలగించే వేడుక. చెడుపై మంచి సాధించిన విజయంతో సంబరాలు జరుపుకొనే వెలుగుల తారాజువ్వల మాలిక. నేటి దీపావళి వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సిద్ధం అయ్యారు. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో ప్రత్యేక పూజలు, నివాసాలు, ఆలయాల్లో నోములు, వ్రతాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా మార్కెట్లు కిక్కిరిశాయి. బంతిపూలు, గుమ్మడికాయలు, ఇతర పూజాసామగ్రి అమ్మకాలతో రద్దీగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాల వద్ద సందడి నెలకొంది. కిలో చొప్పున విక్రయిస్తుండగా.. ధరలు ఆకాశాన్ని అంటున్నాయని చెబుతున్నారు. జిల్లాకేంద్రంలోని యావర్రోడ్డు, అంగడిబజార్, మార్కెట్ ప్రాంతాలన్నీ రకరకాల, రంగురంగుల దివ్వెల విక్రయాలతో బిజీగా మారిపోయాయి. – వివరాలు 8లో -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
జగిత్యాలటౌన్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని, రైతులకు అండగా నిలవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాకేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో వరికోతలు ప్రారంభమైన దృష్ట్యా వసతులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. రైతులకు బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. మొక్కజొన్న తదితర పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఇందూరి సులోచన, ఎంఏ.చౌదరి, వెంకటచారి తదితరులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యానికి పెద్దపీట
జగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాలలో జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 62 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.15 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగిత్యాలకు పల్లె దవాఖానాలు మంజూరు చేశామని, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. అధికార పార్టీతో ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయడం కొత్తకాదన్నారు. కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ దామోదర్ రావు, నాయకులు సురేందర్రావు, ముకుందం, రవీందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, మహేశ్, గంగాధర్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయండి సారంగాపూర్: ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులుగా నియామకం అయినవారు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సభ్యుల పదవీకాలం మూడేళ్లు ఉంటుందని, ఆలయానికి కొత్త శోభ తీసుకొచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రాంచందర్రావు, జగిత్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొలంగూరి దామోదర్రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పాలకమండలి సభ్యులు చీర్నేని శ్రీనివాస్, యశోద రమేశ్, గుమ్మడి రమేశ్, పూడూరి గంగమణి, చల్లా లక్ష్మణ్, దేవనపెల్లి జగన్మోహన్, చెక్కపల్లి సత్తన్న, ఎనగంటి సతీశ్, చెట్టుపల్లి సత్యనారాయణ, చెన్న గంగాధర్, సామ్రాట్, భీమనాతి లవన్, అల్లెపు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్నను దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి
● ఘనస్వాగతం పలికిన మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్ ● పూర్ణకుంభ కలశంతో ఆలయ అర్చకుల స్వాగతంవేములవాడ: ధర్మ విజయ యాత్రలో భాగంగా వేములవాడకు శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి ఆదివారం రాత్రి చేరుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్, కలెక్టర్ హరిత, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఈవో రమాదేవి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు ఉమేశ్శర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం పూర్ణకుంభ కలశంతో స్వామి వారికి స్వాగతం పలికారు. స్థానిక తెలంగాణచౌక్కు చేరుకున్న స్వామీజీ ప్రత్యేక రథంపై ఆసీనులయ్యారు. జేసీబీ సహాయంతో గజమాల వేశారు. ఒగ్గుడోలు, భజన మండలి కళాకారులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. స్వామీజీని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. పెద్దమ్మ స్టేజీ వద్ద జిల్లాలోకి.. గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి చేపట్టిన విజయ ధర్మ యాత్ర గంభీరావుపేట మండలం పెద్దమ్మస్టేజీ వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. బాసర నుంచి వస్తున్న స్వామీ యాత్రకు పెద్దమ్మస్టేజీ, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలో భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. -
మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంపు
జగిత్యాలక్రైం: జిల్లాలో 71 మద్యం దుకాణాలకు ప్రభుత్వం గడువు పెంచింది. ముందుగా ఈనెల 18న చివరి రోజుగా ప్రకటించడంతో శనివారం పొద్దుపోయేదాకా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తంగా 1,834 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల చొప్పున ప్రభుత్వానికి రూ.55.02కోట్ల ఆదాయం సమకూరింది. అయితే దీపావళి సెలవులతోపాటు శనివారం బీసీ సంఘాలు రాష్ట్ర బంద్ నిర్వహించడం.. బ్యాంకులకు సెలవు ప్రకటించడంతో సర్కారు దరఖాస్తులకు గడువు పెంచింది. దీని ప్రకారం.. ఈనెల 23వరకు టెండర్లు వేసేందుకు అవకాశం ఉంది. 2023–25కి గాను 2,636 దరఖాస్తులు రాగా.. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల ఫీజు చొప్పున ప్రభుత్వానికి రూ.52.72 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి 1,834 దరఖాస్తులు రాగా ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల చొప్పున రూ.55.02కోట్లు ఆదాయం వచ్చింది. గడువు పెంచడంతో మరిన్ని దరఖాస్తులు రానున్నాయి. ఈనెల 27న జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్లో కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వాహకులను డ్రాపద్ధతిలో ఎంపిక చేయనున్నారు. -
కాంగ్రెస్ పాలనపై లండన్లో ఎన్నారైల నిరసన
రాయికల్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 22 నెలలు గడుస్తున్నప్పటికీ హామీలు అమలు చేయడం లేదంటూ ఆదివారం లండన్లోని ఎన్నారై బీఆర్ఎస్ఎల్ యూకే ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు. మన కాళేశ్వరం, మన హైదరాబాద్, మన రైతులను కాపాడుకోవాలని కోరుతూ ప్రదర్శన చేశారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎఫ్టీసీ మాజీ చైర్మన్ కుర్మాచలం అనిల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే.. కాంగ్రెస్ హయాంలో అభివృద్ది లేకుండా పోయిందన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్రెడ్డి, ఉపాధ్యక్షులు నవపేట్ హరీ, సత్యమూర్తి, చినుముల రవి, కుమార్, అడ్వైజరీ బోర్డు వైస్చైర్మన్ గణేశ్, మల్లారెడ్డి, సురేష్, జాఫర్, ఐటీ మీడీయా పీఆర్ రవి ప్రదీప్, సంయుక్త కార్యదర్శులు నవీన్, ప్రశాంత్రావు తదితరులు పాల్గొన్నారు. -
ధర్మపురిలో లక్ష్మీపూజలు
అద్దాల మండపంలో పూజలు ధర్మపురి: దీపావళి సందర్భంగా శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం మొదటి రోజు అద్దాల మండపంలో ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ మంత్రోచ్ఛరణలతో లక్ష్మీపూజలు చేశారు. సోమవారం సాయంత్రం స్వామివార్ల ఊరేగింపు సేవ, మంగళవారం సాయంత్రం సహస్రదీపాలంకరణ చేస్తారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, అర్చకులు తదితరులున్నారు. దీపావళికి కొత్త కాంతులు తేవాలిజగిత్యాలటౌన్: దీపావళి జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తేవాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, సంతోషాలు నింపాలని సూచించారు. ఆలయాల్లో భక్తుల రద్దీధర్మపురిలోని ప్రధాన ఆలయంలో భక్తుల రద్దీ ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు ఆచరించారు. ఆలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాంమల్యాల: ఆలయ ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీ కోసం కృషి చేయాలని కొండగట్టు దేవస్థానం ఆలయ ఉద్యోగులు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ను కోరారు. ఆదివారం కరీంనగర్లో ఆయనను కొండగట్టు ఆలయ ఉద్యోగులు మర్యాద పూర్వకంగా కలిసి అంజన్న ప్రసాదం అందించారు. కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్ది, రాష్ట్ర టీఎన్జీవో ఉపాధ్యక్షుడు రాగి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉరేసుకుని ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
హుజూరాబాద్: హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న మోరె రిషి(20)శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రిషి జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. ఏదో విషయంలో మానస్తాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మధ్యాహ్నం చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. వ్యక్తి వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటుందని, పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే జగిత్యాల పోలీసులను సంప్రదించాలని సూచించారు. రామడుగు: తాగునీటి సమస్యను పరిష్కరించాలని రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ పరిధిలోని పదోవార్డు ప్రజలు శనివారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. పంచాయతీ కార్యాలయం గేటుకు తాళం వేసి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నప్పటికీ, తమ కాలనీకి సరఫరా చేయడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీవో శ్రావణ్కుమార్ గ్రామస్తులతో మాట్లాడి, తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. మల్యాల: తన తండ్రిని తిడుతున్నాడని ఓ మైనర్ ఒకరిపై కత్తితో దాడి చేసిన సంఘటన మల్యాల మండలం రాజారాం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నరేష్కుమార్ కథనం ప్రకారం.. గ్రామంలో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన బక్కశెట్టి రాకేశ్ ఇంటి నుంచి బయటకు వెళ్లి బక్కశెట్టి తిరుపతి ఇంటి ఎదుట కూర్చొని ఇరువురు మాట్లాడుకుంటున్నారు. ఆ చర్చ వాదనగా మారింది. రాకేశ్ తన తండ్రిని తిడుతున్నాడని తిరుపతి కుమారుడు ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి రాకేశ్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకేశ్ను 108లో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి నానమ్మ బక్కశెట్టి బూదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రాజన్న ఆలయంలో రేపు దీపావళి వేడుకలు
వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 20న దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి శనివారం తెలిపారు. ఉదయాత్పూర్వం 3.30 గంటలకు మంగళవాయిద్యాలు, 4.40 గంటలకు దీపావళి హారతి తర్వాత అభ్యంగన స్నానం, 5 గంటలకు ఆలయ శుద్ధి, స్వామివారికి ప్రాతఃకాల పూజ, సాయంత్రం 4 గంటలకు నరకాసురవధ, రాత్రి 6.30 గంటలకు ధనలక్ష్మిపూజ అనంతరం సేవ ఉంటుందని వివరించారు. 22 నుంచి కార్తీకమాసం షురూ ఈనెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీకమాసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి ప్రకటించారు. ప్రతీ సోమవారం, ఏకాదశి రోజున సత్యనారాయణస్వామికి వ్రతాలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 2న కార్తీకశుద్ధ ద్వాదశి ఉదయం 6.30 గంటలకు రుక్మిణీవిఠళేశ్వరస్వామికి పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు, సాయంత్రం 6.35 గంటలకు శ్రీకృష్ణతులసీ కల్యాణం, 4న వైకుంఠ చతుర్దశి సందర్భంగా అనంతపద్మనాభస్వామికి పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు, సుబ్రమణ్యస్వామికి మహాపూజ, పొన్నచెట్టు సేవ నిర్వహిస్తామన్నారు. 5న కార్తీకపౌర్ణమి సందర్భంగా రాత్రి 8 గంటలకు జ్వాలాతోరణం, శ్రీస్వామి వారికి మహాపూజ నిర్వహించనున్నట్లు వివరించారు. -
ముస్కానిపేట డాలర్ల పంట
ఇల్లంతకుంట(మానకొండూర్): అది పేరుకే పల్లెటూరు. ఆ ఊరిలోని యువత దారి అమెరికా, యూరప్ దేశాలు. దాదాపు ప్రతీ ఇంటిలో ఉన్నత విద్యావంతుడు ఉంటారు. ఇప్పటికే 34 మంది విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడగా.. గ్రామంలోనే ఉంటున్న 17 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి యువత ఉన్నత చదువులు.. విదేశాల్లో కొలువులే లక్ష్యంగా హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో చదువుకుంటున్నారు. కుగ్రామం ముస్కానిపేట విజయగాథపై సండే స్పెషల్. ముస్కానిపేట గ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అమెరికాకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిగా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి గుర్తుకొస్తారు. 1954లో గ్రామపంచాయతీగా ఏర్పడ్డ ముస్కానిపేటలో 3,625 మంది జనాభా నివసిస్తున్నారు. మండల కేంద్రం ఇల్లంతకుంటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామంలో అతి పురాతనకాలం నాటి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికతను పంచుతుండగా.. గ్రామం మొదట్లో దేవతామూర్తుల చిత్రాలతో ఆర్చి స్వాగతం పలుకుతుంటుంది. గ్రామం నుంచి అమెరికాకు వెళ్లిన వారు 11 మంది, లండన్లో ఇద్దరు, ఆస్ట్రేలియాలో ఒకరు, ఇండియాలో 21 మందితో కలిపి 34 మంది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. కె.లక్ష్మారెడ్డి అనస్తీషియా డాక్టర్గా యశోద ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. బద్దం అనిల్, సారా నరేశ్గౌడ్, సింగిరెడ్డి రమణారెడ్డి వివిధ బ్యాంకుల్లో మేనేజర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఇటీవల ఏడుగురు ఉద్యోగ విరమణ పొందారు. ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి వరంగల్లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ఆర్ఈసీ)లో ఇంజినీరింగ్ చదివారు. గ్రామంలో నిధులు సమకూర్చుకొని అమెరికాకు వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొట్టమొదటి వ్యక్తిగా 1961లో అమెరికాకు వెళ్లారు. నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని చాలా మంది యువకులు అమెరికాకు వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. అమెరికా, యూరప్ దేశాల్లో యువత విదేశాల్లో పనిచేస్తున్న 34 మంది 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ముగ్గురు బ్యాంక్ మేనేజర్లు ఒక డాక్టర్.. ఇదీ ఆ పల్లె విజయగాథ -
ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం
● గోండులను కలుపుతున్న దీపావళి ● జగన్నాథ్పూర్లో గుస్సాడి వేషధారణలు ● తరతరాల సంప్రదాయం రాయికల్: కొండాకోనలు.. గుట్టల మధ్య అటవీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడో విసిరేసినట్లుగా ఉండే గోండు గూడాలను కలుపుతోంది గుస్సాడీ నృత్య బంధం. తరతరాల సంప్రదాయం అందిపుచ్చుకుని తమ తెగల మధ్య సంబంధాలను కొనసాగించేందుకు దండారీ దీపావళికి వారధిగా నిలుస్తోంది. పండగకు ముందు ప్రారంభమై.. వారంపాటు దండారీ ఉత్సవాలను నియమ నిష్టలతో గూడెంవాసులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా దంతన్పల్లి, నిర్మల్ జిల్లా గొడిసిర్యాల, జగిత్యాల జిల్లా తాళ్లధర్మారంలోని గిరిజనులు రాయికల్ మండలం జగన్నాథ్పూర్లో వేడుకలో పాల్గొంటున్నారు. -
అభిప్రాయం గోప్యం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: సంస్థాగత ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారంతో ముగిసింది. అభిప్రాయ సేకరణ సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో చోటుచేసుకొన్న రభసతో పరిశీలకులు రూటు మార్చారు. ఓ హోటల్లో రహస్యంగా అభిప్రాయాలను సేకరించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్ష, కరీంనగర్, రామగుండం సిటీ అధ్యక్ష స్థానాల ఆశావహుల నుంచి చివరిరోజు అభిప్రాయాలు తీసుకున్నారు. అభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగియడంతో, నివేదికను అధిష్టానానికి అందించనున్నారు. ఆరు రోజులుగా... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న శ్రీపార్టీశ్రేణుల అభిప్రాయాల మేరకే ఎంపికశ్రీ విధానాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టింది. ఏఐసీసీ పరిశీలకుడిగా శ్రీనివాస్ మన్నె, పీసీసీ నుంచి ఆత్రం సుగుణ, చామల కిరణ్కుమార్రెడ్డి, ఖాజాఫకృద్దీన్ను నియమించింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించారు. ఒక్కో నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నాయకులను కలిసి ఎవరిని అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందో తెలుసుకున్నారు. రూటు మార్చి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభిప్రాయ సేకరణ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఆశావహుల ఆధిపత్యపోరు రసాభాసకు దారితీయడం తెలిసిందే. నాయకుల నడుమ వాగ్వాదాలు, పాత, కొత్త నేతల పంచాయతీ, పోటాపోటీగా జనసమీకరణ, ఉద్రిక్తతల నేపథ్యంలో పూర్తిస్థాయిలో అభిప్రాయాలు చేపట్టకుండానే పరిశీలకుడు వెనుదిరగాల్సి వచ్చింది. కరీంనగర్ అనుభవంతో, పరిశీలకులు రూటు మార్చారు. శుక్ర, శనివారాల్లో రహస్యంగా అభిప్రాయాలు తీసుకున్నారు. అధ్యక్ష స్థానాలకు పోటీపడుతున్న నాయకులు, పార్టీ పదవులున్న నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులను పిలిచి అభిప్రాయలు సేకరించారు. శనివారం ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి కూడా కరీంనగర్లోని అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. డీసీసీ, నగర అధ్యక్ష స్థానాలకు వచ్చిన దరఖాస్తులుకరీంనగర్ 38జగిత్యాల 36రాజన్న సిరిసిల్ల 16పెద్దపల్లి 25కరీంనగర్ సిటీ 24రామగుండం సిటీ 05ఎన్ని రోజులకో ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించిన పరిశీలకులు త్వరలో అధిష్టానానికి నివేదిక అందించనున్నారు. నాలుగు జిల్లాల అధ్యక్షులు, రెండు నగర అధ్యక్షుల ఎంపికకు అభిప్రాయ సేకరణ జరగగా, పరిశీలకులు ఇచ్చే నివేదికపైనే ఆశావహుల భవితవ్యం ఆధారపడి ఉంది. పార్టీ శ్రేణుల అభిప్రాయాలతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం ఉండే అవకాశముంది. పార్టీ పదవులు ఉన్న వారి నుంచి ఎక్కువగా అభిప్రాయాలు సేకరించడంతో, ఆ అభిప్రాయాలు పాత నాయకులకు అనుకూలమనే ప్రచారం ఉంది. నివేదికను అధిష్టానానికి ఎప్పుడు ఇస్తారు, డీసీసీలను ఎప్పుడు ప్రకటిస్తారో, ఈ మొత్తం ప్రక్రియ ఇంకెన్ని రోజులు పడుతుందో అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకొంటారా, సామాజిక, ఆర్థిక సమీకరణల కారణంగా నియామకాలు చేపడుతారో వేచి చూడాలి. -
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
మెట్పల్లి: ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని మెట్పల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు అన్నారు. పట్టణంలోని మెప్మా కార్యాలయంలో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్కుమార్తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడారు. రుణాలతో మహిళలు స్వయం ఉపాధి పొందాలన్నారు. తద్వారా ఆర్థికంగా ఎదిగే అవకాశముంటుందన్నారు. అంతకుముందు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. సీఐ అనిల్కుమార్, ఎస్సై కిరణ్కుమార్, కమిషనర్ మోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్రెడ్డి తదితరులున్నారు. గోదావరి మహాహారతి స్థల పరిశీలనధర్మపురి: ధర్మపురిలోని గోదావరి తీరంలో నవంబర్ 9న నిర్వహించే గోదావరి మహాహారతి కార్యక్రమం కోసం శనివారం సాయంత్రం స్థల పరిశీలన చేశారు. గోదావరి హారతి రాష్ట్ర కో–కన్వీనర్ రామ్సుధాకర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమంలో చేపట్టే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులున్నారు. అరటిసాగుపై రైతులకు అవగాహనమేడిపల్లి: అరటి సాగుపై ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మండలంలోని కట్లకుంటలో రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యాన అధికా టరి శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ రైతులు వరి, పత్తి వంటి పంటలతోపాటు ఆదాయం ఇచ్చే అరటిని సాగు చేయాలని సూచించారు. అరటితో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు. ఉద్యాన శాఖ ద్వారా ఎకరాకు రూ.28 వేల సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో జిల్లాలో 1500 ఎకరాల్లో అరటి సాగు ఉండేదని, ప్రస్తుతం 24 ఎకరా లకు పడిపోయిందని తెలిపారు. మార్కెట్లో అరటిపండ్లకు డిమాండ్ ఉందని, ఢిల్లీ నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేయడానికి సి ద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏవో షాహిద్ అలీ, ఏఈవో రాధ, ఉద్యాన విస్తరణ అధికారి అనిల్ కుమార్, రైతులు పాల్గొన్నారు. బంద్ సక్సెస్తో ‘రిజర్వేషన్’కు ప్రాధాన్యంజగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇచ్చిన బంద్ విజయవంతం కావడంతో ప్రక్రియ అమలుకు ప్రాధాన్యత ఏర్పడినట్లయ్యిందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. ఇందిరాభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి చొరవతో అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అన్ని చర్యలూ తీసుకుందని తెలిపారు. అయినా గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉందన్నారు. రిజర్వేషన్ అమలు రాజకీయ పార్టీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. 42శాతం రిజర్వేషన్ పొందడం, బలహీనవర్గాల ప్రజల హక్కు అని పేర్కొన్నారు. స్థానిక సంస్థలతోపాటు, విద్య, ఉద్యోగాల్లో ప్రధానమైందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నందయ్య, బండ శంకర్, మోహన్, జగదీశ్వర్ పాల్గొన్నారు. -
మద్యం షాపులకు1750 టెండర్లు
జగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం షాపులకుగాను 1750 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజైన శనివారం బీసీల బంద్ కొనసాగినా.. దరఖాస్తుదారులు భారీగా తరలివచ్చారు. రెండేళ్ల క్రితం నిర్వహించిన టెండర్లలో 2,636 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.3లక్షలకు ఫీజు పెంచడంతో దరఖాస్తుచేసుకునేందుకు చాలామంది కొంత వెనుకడుగు వేశారు. ఈనెల 23న డ్రా పద్ధతిన లబ్ధిదారుల ఎంపిక మద్యం షాపులకు టెండర్లు వేసిన వారిని ఈనెల 23న జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్లో డ్రా పద్ధతిన నిర్వాహకులను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఎకై ్సజ్ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఫొటోతో కూడిన పాస్లు అందించారు. పాస్లు ఉన్నవారినే లోనికి అనుమతివ్వనున్నారు. -
42శాతం రిజర్వేషన్కు ప్రభుత్వం కట్టుబడి ఉంది
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: 42 శాతం రిజర్వేషన్కు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని, గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్పై రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. జంతర్మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగభూషణం, బాల ముకుందం, అడువాల లక్ష్మణ్, శ్రీనివాస్, రవీందర్రావు పాల్గొన్నారు. క్రీడాపోటీల్లో పాల్గొనండి క్రీడాపోటీల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శనివారం మాస్టర్ మైండ్ అకాడమీ ఆధ్వర్యంలో అండర్–17 స్టేట్ లెవల్ చెస్ టోర్నమెంట్ పోస్టర్ను ఆవిష్కరించారు. చెస్ పోటీల్లో పాల్గొంటే మెదడు చురుకుగా ఉంటుందన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 19న గంగారెడ్డి ఫంక్షన్హాల్లో టోర్నమెంట్ జరుగుతుందని, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు 78159 74976 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ధర్మపురికి డిగ్రీ కళాశాల మంజూరుధర్మపురి: ధర్మపురిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ కళాశాల లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కళాశాల ఏర్పాటుతో మేలు జరగనుంది. సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రత్యేక చొరవతో కళాశాల మంజూరు చేస్తూ.. ఎడ్యుకేషన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో లక్ష్మణ్కుమార్ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినట్లయ్యింది. -
జగిత్యాల
34.0/22.09గరిష్టం/కనిష్టంఅంజన్న సన్నిధిలో భక్తుల సందడిమల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో స్నానమాచరించి, స్వామిని దర్శించుకున్నారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిగా ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిఽ ద ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 -
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోని వారికి నోటీసులివ్వండి
ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా కట్టుకోని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం డబ్బా, వర్షకొండ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, అంగన్వాడీ భవన నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్లు కట్టుకోని వారిని రద్దు చేసి అర్హులకు కేటాయించాలన్నారు. ఉపాధి హామీలో మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మొక్కజొన్నల తేమశాతాన్ని తెలుసుకున్నారు. ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవో మహ్మద్ సలీం, తహసీల్దార్ వరప్రసాద్, హౌసింగ్ పీడీ ప్రసాద్, పీఆర్డీఈ రమణారెడ్డి, ఏఈ అభినవ్, ఏవో రాజ్కుమార్, ఆర్ఐ రేవంత్రెడ్డి, సింగిల్విండో సీఈవో మంత్రి సతీశ్కుమార్, పంచాయతీ కార్యదర్శులు రవళి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
బంద్ విజయవంతం
జగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ ఐక్యవేదిక ఇచ్చిన బంద్ పిలుపు జిల్లాలో విజయవంతమైంది. బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తోపాటు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ఉదయం నుంచే బీసీ సంఘాల ఆధ్వర్యంలో తిరుగుతూ దుకాణాలను మూసివేయించారు. కొందరు స్వచ్ఛందంగా మూసివేశారు. బస్సులు డిపోలకే పరిమితయ్యాయి. పెట్రోల్బంక్లు మూసివేశారు. పాఠశాలలు సెలవు ప్రకటించాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొన్ని దుకాణాలు, పెట్రోల్బంక్లు తెరుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాజీమంత్రి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పోలీసుల బందోబస్తు జగిత్యాలక్రైం: అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్డిపో, బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో పహరా కాశారు. గొల్లపల్లిలో ఆందోళన చేస్తున్న బీసీ సంఘాల నాయకులుజిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు -
సంతోషంగా ఉన్నాం
నేను 2008లో యూఎస్ ఏ వెళ్లాను. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో ఒక కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో అతి కష్టం మీద ఇక్కడికి వచ్చాను. ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాం. – కె.వంశీధర్రెడ్డి, యూఎస్ఏ 2018లో అమెరికాకు వెళ్లా ను. నా భార్య సరిత, నే ను ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. మాకు ఒక కూ తురు. నార్త్ కరోలినా స్టే ట్లోని కెరీలో ఉంటున్నా ము. ఆర్థికంగా స్థిరపడ్డాం. సంతోషంగా ఉంది. – కాట్నపల్లి గోపాల్రెడ్డి నేను ఆస్ట్రేలియాకు 2017 లో వెళ్లాను. ఎన్ఐటీ పూర్తి చేసి సాఫ్ట్వేర్గా స్థిరపడ్డాను. మెల్బోర్న్లో ఉంటున్నాను. మాది వ్యవసాయ కుటుంబం. – కొమ్ముల మహేందర్రెడ్డి నేను 2023లో లండన్ వెళ్లాను. ఇక్కడ ఎంబీఏ పూర్తి చేశాను. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. – గుర్రం అజయ్రెడ్డి -
సనాతన ధర్మ రక్షణతోనే మానవాళికి మేలు
మల్యాల: సనాతన ధర్మ పరిరక్షణతోనే విశ్వమానవాళికి మేలు చేకూరుతుందని, ఆలయాల రక్షణకు దత్తగిరి మహరాజ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు సాగుతోందని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు తెలిపారు. అవదూతగిరి మహరాజ్, మహంత్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్ ఆధ్వర్యంలో పీఠాధిపతులు కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పురాతన ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గురువులు, తల్లిదండ్రులను గౌరవించి, పూజించాలన్నారు. ఈవో శ్రీకాంత్రావు, ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, స్థానాచార్యులు కపీందర్ స్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, ఆలయ పర్యవేక్షకుడు సునీల్కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. నృసింహుడి సన్నిధిలో.. ధర్మపురి: అనంతరం పీఠాధిపతులు ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ రవీందర్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. -
సంజీవ్ కుటుంబానికి అండగా ఉంటాం
జూలపల్లి(పెద్దపల్లి): హైదరాబాద్లో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ గండు సంజీవ్(50) స్వగ్రామం కాచాపూర్లో శనివారం నిర్వహించారు. జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ సొంత పనుల కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడే గుండెపోటుకు గురవడంతో వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పార్థివదేహాన్ని స్వగ్రామం కాచాపూర్ తీసుకొచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తదితరులు కాచాపూర్ చేరుకని పార్థివ దేహానికి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతిమయాత్ర సందర్భంగా మంత్రి లక్ష్మణ్కుమార్ పాడే మోశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్, ధూళికట్ట పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాలరావు, సుల్తానాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రకాశ్రావు, మాజీ సర్పంచులు నర్సింహయాదవ్, ఆడప లక్ష్మణ్, బంటు ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కాచాపూర్లో ఏఎంసీ చైర్మన్ అంత్యక్రియలు పాడె మోసిన మంత్రి లక్ష్మణ్కుమార్ హాజరైన ఎమ్మెల్యే విజయరమణారావు -
ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం
రాయికల్: గుస్సాడీ.. గోండు ప్రజలకు అదో ఆత్మీయ వేడుక. గుస్సాడీ అలంకరణ చేసుకునే వారు అత్యంత నియమనిష్టలతో ఉంటారు. దండారీ సంబరాలు ముగిసేవరకు గుస్సాడీలు ఒకే దగ్గర ఉంటారు. స్నానాలు కూడా చేయరు. నృత్యం చేసేవారు శరీరం మొత్తం బూడిద పూసుకుంటారు. ముఖానికి మసి రాసుకుంటారు. ప్రత్యేకమైన పేర్లదండలు ధరిస్తారు. కుడి చేతిలో మంత్ర దండం పట్టుకుంటారు. వీరిని దేవతలు ఆవహిస్తారని.. మంత్రదండంతో శరీరాన్ని తాకితే ఎలాంటి వ్యాధులైనా నయమవుతాయని వారి నమ్మకం. సంతానం లేనివారు గుస్సాడీలను ఇంటికి ఆహ్వానించి అతిఽథి భోజనాలు వడ్డిస్తే సంతానం కలుగుతుందన్న భరోసా. మెడలో రుద్రాక్షలు, ఇతర గవ్వలతో కూర్చిన దండలు వేసుకుంటారు. తలపై నెమలి ఈకలతో తయారు చేసిన కుంటే (కిరీటం) ధరిస్తారు. ఇది చిన్నచిన్న అద్దాలతో అందంగా అలంకరించి ఉంటుంది. కాళ్లకు గజ్జెలు కడుతారు. డప్పులు, బాజాలు, తుడుం మొదలైన వాయిద్యాల శబ్దాలకు గజ్జెల సవ్వడి చేస్తూ.. అడుగులు వేస్తూ చేతిలో మంత్రదండాన్ని కదలాడిస్తూ నృత్యాలు చేస్తారు. గూడెంవాసులు తిలకిస్తూ ఆనందంలో మునిగితేలుతారు. ఈ ఏడాది నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి సుమారు 500 మంది గిరిజనులు జగన్నాథ్పూర్కు దండారీ బృందంతో వచ్చారు. ఈ ఏడాది అతిథ్యం ఇచ్చిన గ్రామంలోని బృందం మరుసటి సంవత్సరం అతిథ్యం స్వీకరించిన గ్రామానికి తరలివెళ్తుంది. వారు ఏ రీతిలో అతిథి మర్యాదలు చేస్తూ అతిథ్యం ఇచ్చారో అదే స్థాయిలో వీరూ పొందుతారు. బృందంలోని కొందరు విజయసూచికగా పుతికట్టు (పోత్తి) ధరిస్తారు. ఈ విధంగా ఒక్కో గోండు గ్రామం కనీసం నాలుగైదు గ్రామాలతో దండారీ సంబంధాల కొనసాగిస్తుంది. ఇచ్చిపుచ్చుకనే సంప్రదాయం.. దూరంగా ఉండే గిరిజన గూడాల్లో పాడిపంటలు సమృద్ధిగా ఉండాలన్న ఆకాంక్ష, పెళ్లి సంబంధాలు కుదర్చడానికి ఈ వేడుకను వేదికగా చేసుకుంటున్నారు. దీపావళి ఉత్సవాల్లో ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు 50 మంది నుంచి 100 మంది పురుషులు గుస్సాడీ నృత్య వేషధారణ వేస్తారు. వీరిలో ఇద్దరు ఆడవేషంలో ఉంటారు. తమ దేవతైన ఏత్మాను తీసుకుని మరో గూడెంకు వస్తారు. గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసే వారితోపాటు వచ్చిన వారు గూడెంలో తమ తెగలకు కుదిరే అమ్మాయిలు, అబ్బాయిల సంబంధాల విషయమై ఆరా తీస్తారు. రెండు గ్రామాల ఏత్మా దేవతలను ఒకచోట చేర్చి పూజలు నిర్వహిస్తారు. వాయిద్యాలే వారి దేవతలు గిరిజన గూడాల వారు డోలు వాయిద్యాలను ఆరాధ్యంగా పూజించే సంప్రదాయం కొనసాగుతోంది. గుస్సాడీ నృత్యాల్లో వాడే డోలు వాయిద్యాలన్నింటినీ ఒక చోట చేర్చి వాటికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మొత్తంగా గిరిజన తెగలు ఇప్పటికీ తమ సంప్రదాయాలను కొనసాగించేలా ఆచారాలు పాటిస్తుండడం గమనార్హం. గోండులను కలుపుతున్న దీపావళి జగన్నాథ్పూర్లో గుస్సాడీ వేషధారణలు తరతరాల సంప్రదాయం మొదటిరోజు గ్రామదేవతలకు మొక్కి పూజలు నిర్వహించి వారం రోజుల పండగను ప్రారంభిస్తారు. రెండోరోజు గిరిజనులు ఒక గ్రామం నుంచి మరో గ్రామాలకు వెళ్తారు. మూడో రోజు గిరిజనులు వెళ్లిన గ్రామాల్లో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి గుస్సాడీ నృత్యాలు, గిరిజన మహిళలు కోలాటాలతో రోజంతా కోలాహలంగా గడుపుతారు. నాలుగో రోజు గ్రామంలోని ఇంటింటికీ మంగళహారతులతో వెళ్లి పూజలు చేస్తారు. ఐదోరోజు కుల పెద్ద ఇంటి వద్ద పూజలు చేసి విందు భోజనాలు ఆరగిస్తారు. ఆరో రోజు కుల పెద్దకు ఇంటి దేవతను అప్పగిస్తారు. ఏడో రోజు దీక్ష విరమణ. -
ఉత్సవాలను ఏటా నిర్వహిస్తాం
పూర్వీకులు నుంచి దండారీ ఉత్సవాల నిర్వహణకు కృషి చేస్తున్నాం. ఈ ఉత్సవాలను దీపావళి సందర్భంగా ఏటా ఘనంగా నిర్వహిస్తాం. వారంపాటు ఉపవాస దీక్షలతో పూజలు చేస్తాం. వచ్చినవారికి సదుపాయాలు కల్పిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నాం. – భీంరాావ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జగన్నాథ్పూర్ దండారి ఉత్సవాల సందర్భంగా గిరిజనుల్లో సమైక్యత పెంపొందుతుంది. మా గ్రామానికి నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి దండారి ఉత్సవాల కోసం వారం రోజుల పాటు రావడంతో ఐక్యత పెరగడంతోపాటు వివాహ బంధాలకు వేదికగా మారుతుంది. – సిడెం భీం, మాజీ సర్పంచ్, జగన్నాథ్పూర్ దీపావళి అంటేనే గిరిజనుల్లో దండారీ గుర్తుకువస్తుంది. వారంపాటు పండగ వాతావరణం నెలకొంటుంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి గిరిజనులు మా గ్రామానికి రావడంతోపాటు మేం కూడా తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లి దండారి ఉత్సవాల్లో పాల్గొంటాం. – ఆత్రం భీర్సాబ్, గ్రామ నాయకుడు -
రా అన్నా.. కలిసుందాం
అన్నను 27 ఏళ్లుగా చూడలేదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆందోళనగా ఉండేది. ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతున్నారు. నువ్వు కూడా రా అన్న కలిసుందాం. 27 ఏళ్లుగా మన ఇల్లు ఎదురు చూస్తోంది. అమ్మానాన్నలు కాలం చేశారు. ఉద్యోగం చేస్తూ తలోదిక్కు వెళ్లాం. ఇప్పుడు మన ఇల్లు ఒంటరైంది. మీరు వస్తే కలిసి ఉందాం. – తుమ్మల మధుసూదన్, విశ్వనాథ్ సోదరుడు(టీచర్) తమ్మీ రారా.. నాకు పానం బాగా లేదు. అమ్మానాయిన్నలు, తమ్ముడు కాలం చేసిండ్రు. అడవిలో అన్నలు అందరూ తుపాకులు పోలీసులకు ఇచ్చి వస్తున్నారని తెలిసింది. నువ్వు కూడా ఎక్కడ ఉన్నా ఇంటికి రా.. తమ్మీ. ప్రజల కోసం నలభై ఏళ్లు అడవుల్లో పనిచేసినవ్ చాలు. ఇగ నువ్వు వస్తే కలోగంజో కలిసి తాగుదాం. నిన్ను చూసి సచ్చిపోవాలని ఉంది. నువ్వు వస్తావని ఆశతో చూస్తున్నా. ఏడున్నా రా తమ్మీ. – బండి నాంపల్లి, చంద్రయ్య సోదరుడు, ధర్మారం -
కలప పట్టివేత
చందుర్తి/రుద్రంగి(వేములవాడ): టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి రుద్రంగి మండల కేంద్రంలోని ఎస్సీకాలనీలో సుమారు రూ.లక్ష విలువైన టేకు కలపను శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. మండల కేంద్రంలోని గసికంటి గంగారెడ్డి ఇంట్లో టేకు కలప అక్రమంగా నిలువ ఉంచారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 32 దుండలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వేములవాడ అటవీశాఖ కార్యాలయం డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేంద్రరావుకు అప్పగించారు. పట్టుకున్న కలపను కొలతలు వేసి వాటి విలువను శనివారం వెల్లడిస్తామని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి తెలిపారు. టాస్క్పోర్స్ పోలీసుల దాడులతో కలప స్మగ్లర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికురాలి మృతి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలోని 56వ డివిజన్లో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న బడుగు రేణుక శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. విద్యానగర్ రోడ్డులోని శివ థియేటర్ పెట్రోల్ బంక్ సమీపంలో రేణుకను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. తోటి కార్మికులు హాస్పిటల్కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మరణించింది. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మృతదేహం వద్దకు చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.20 వేల నగదు అందించారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఎంహెచ్వో సుమన్, శానిటేషన్ సూపర్వైజర్లు శ్యామ్రాజ్, అనిల్కుమార్ ఉన్నారు. కాగా మృతురాలి కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఐక్యరాజ్య సమితిలో భారత కీర్తి
రామగుండం: ప్రపంచ శాంతిపరిరక్షణలో భారతదేశం పోషిస్తున్న కీలకపాత్ర గురించి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించారు. సమితిలో భారత్ తమ కీర్తిని చాటుకోవడం, వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, సమర్థత వంటి అంశాలపై సమావేశంలో పలు సూచనలు, సలహాలిచ్చే అవకాశం తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించిన పలు అంశాల గురించి ఆయన శ్రీసాక్షిశ్రీతో పంచుకున్నారు. అంతర్జాతీయ ఆర్థిక, పాలనా వ్యవహారాల్లో భారతదేశ స్వరాన్ని మరింత బలంగా వినిపించేందుకు అవకాశం లభించిందన్నారు. తనతో పాటు అడ్వయిజరీ కమిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ (ఏసీఏబీక్యూ) చైర్పర్సన్ జూలియానా గాస్పర్ రుయాస్, యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్(ఫైనాన్స్ అండ్ బడ్జెట్ కంట్రోలర్) చంద్రమౌళి రామనాథన్తో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించానని ఎంపీ వివరించారు. -
రాజీవ్ రహదారిపై కారు దగ్ధం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధి రాజీవ్ రహదారిపై గురువారం అర్ధరాత్రి కారు దగ్ధమైంది. వివరాలు.. మంచిర్యాలకు చెందిన నాగరాజు తన కుటుంబసభ్యులతో కలిసి కరీంనగర్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్నాడు. గురువారం అర్ధరాత్రి ఎన్టీపీసీ బీ–గేట్ ఎదుట రాజీవ్ రహదారిపై డివైడర్కు ఢీకొంది. ఈ క్రమంలో కారులో మంటలు లేచాయి. ఇంజిన్లో ఏర్పడిన మంటలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి. కారులో ఉన్నవారు గమనించి వెంటనే కిందకు దిగి స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
అంతటా శివుడే
రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులతో తాత్కాలికంగా భక్తులకు ఇబ్బందులు కలిగినా భవిష్యత్లో మంచి సౌకర్యాలు వస్తాయి. రాజన్న, భీమన్న, నగరన్న ఆలయాల్లో శివలింగాలు దర్శనమిస్తాయి. వేములవాడకు వచ్చిన భక్తులు ఎక్కడ దర్శించుకున్నా శివుడిని దర్శించుకున్నట్లే. – నందిపేట సుదర్శన్యాదవ్, రాజన్న ఆలయ మాజీ ధర్మకర్తమరింత ప్రాచూర్యం ఎన్నో ఏండ్లుగా విస్తరణకు నోచుకోని వేములవాడ రాజన్న ఆలయం ఇప్పుడు అభివృద్ధికి భీజం పడింది. మొదటిదశగా రూ.150కోట్లతో పనులు చేస్తున్నారు. విస్తరణ పూర్తతే రాజన్న ఆలయ ప్రాశస్థ్యం మరింత పెరుగుతోంది. భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. – సగ్గు పద్మ, రాజన్న ఆలయ మాజీ ధర్మకర్త పీఠాధిపతుల సూచనలతో.. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులన్నీ శృంగేరి పీఠాధిపతుల సూచనలు, సలహాల మేరకు చేపడుతున్నాం. భక్తుల మనోభావా లకు అనుగుణంగా, స్థానికులు, పురప్రముఖుల సూచనల మేరకు పనులు చేపడుతున్నాం. ఇంకా సలహాలు, సూచనలు ఎవరూ చేసినా స్వీకరిస్తాం. ఆలయ అభివృద్ధే మా ధ్యేయం. వేములవాడను టెంపుల్ సిటీగా మారుస్తాం. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వవిప్ -
మద్యం మత్తులో యువకుల హల్చల్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులతో ఇద్దరు యువకులు మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించిన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు ప్రధాన రహదారిపై డ్రంకెన్డ్రైవ్ టెస్టులు చేస్తుండగా ఇద్దరు యువకులు మద్యం సేవించి బైక్పై వస్తున్నారు. వీరిని గుర్తించిన పోలీసులు డ్రంకెన్డ్రైవ్ టెస్ట్ నిర్వహించి బైక్ను సీజ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనాలు ఆపుతూ.. పోలీసులపైకి దూసుకెళ్తూ హంగామా చేశారు. మరింత మంది పోలీసులు అక్కడికి చేరుకొని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. రామగుండం ఎన్టీపీసీలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తిజ్యోతినగర్(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 2,600 మెగావాట్లు. ఇందులోని 500 మెగావాట్ల సామర్థ్యం గల 4, 6, 7వ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచినట్లు తెలుస్తోంది. 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల మూడో యూనిట్లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం 2,600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులో 900 మెగావాట్లే ఉత్పత్తి అవుతున్నటున్ల సమాచారం. థర్మల్ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేక ఉత్పత్తిని తగ్గించినట్లు తెలుస్తొంది. -
పీజీ మెడికల్ కాలేజీగా సిమ్స్
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) కాలేజీకి పీజీ మెడికల్ కాలేజీగా గుర్తింపు లభించింది. సిమ్స్ కాలేజీకి నాలుగు విభాగాల్లో కొత్తగా పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) నుంచి శుక్రవారం జీవో జారీ అయినట్లు ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్ తెలిపారు. పీజీ సీట్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో 2022–23 విద్యాసంవత్సంతో ప్రారంభమైన 23 కొత్త మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. ఇందులో రామగుండం సిమ్స్కు మాత్రమే పీజీ సీట్లకు ఎన్ఎంసీ నుంచి అనుమతి లభించడం గమనార్హం. ఈ ఏడాది నుంచే పీజీ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ పచ్చజెండా ఊపడంపై ప్రిన్సిపాల్తోపాటు వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, హెచ్వోడీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెస ర్లు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు యూజీ వైద్య విద్య ఉన్న సిమ్స్లోనే ఈఏడాది నుంచి పీజీ తరగతుల అమలుకు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంపీ) వెసులుబాటు కల్పించింది. అన్నింటికీ గ్రీన్సిగ్నల్.. సిమ్స్కు నాలుగు విభాగాల్లో నాలుగు పీజీ సీట్ల చొప్పున కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ, నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి ఆరు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అన్ని సీట్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. కేటాయించిన పీజీ సీట్లు ఇవే.. ఎండీ : ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఎంఎస్ : ప్రసూతి, గైనకాలజీ విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఎంఎస్ : ఆర్థోపెడిక్స్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఎండీ : బయో : కెమెస్ట్రీ విభాగంలో కూడా నాలుగు పీజీ సీట్లు కేటాయించారు. -
ఆధ్యాత్మిక జాడ.. ఎములాడ
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణం.. వేములవాడలోని అన్ని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. రాజన్న ఆలయ విస్తరణతో భీమన్నగుడిలో దర్శనాలు ప్రారంభం కావడం.. పట్టణంలోని వివిధ ఆలయాల్లో ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మికతను వెదజల్లుతున్నాయి. వేములవాడలోని ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. ఇన్నాళ్లు పెద్దగా పేరుగాంచని ఆలయాలు నేడు ప్రఖ్యాతి చెందుతున్నాయి. విస్తరణ పనులు షురూ.. రాజన్న ఆలయాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం దాదాపు రూ.150 కోట్లతో విస్తరణ, అభివృద్ధి పనుల్ని ప్రారంభించింది. ఇందులో మొదటి దశలో రూ.76 కోట్లతో ప్రాముఖ్యమైన అభివృద్ధి పనులు, రూ.35కోట్లతో అన్నదానసత్రం, రూ.53కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ పనులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు దరిచేరనున్నాయి. భవిష్యత్ స్వరూపం ఈ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత వేములవాడ క్షేత్రం మరింత ప్రఖ్యాతి చెందనుంది. ప్రస్తుతం భక్తులకు తాత్కాలిక అసౌకర్యం కలిగినా.. విస్తరణ పనులు పూర్తయితే ఆలయానికి గుర్తింపు రానుందని భక్తులు విశ్వసిస్తున్నారు. భీమన్న గుడి ప్రాశస్త్యం ఇదీ రాజన్న అనుబంధ ఆలయం భీమేశ్వరస్వామి గుడి శిల్పకళా వైభవానికి పెట్టింది పేరు. క్రీస్తుశకం 850–895 ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. గతంలో భాగేశ్వర ఆలయంగా పిలిచేవారని, కాలక్రమేణ భీమేశ్వరాలయంగా పిలుస్తున్నారని స్థానికులు చెబుతుంటారు. భీమన్న గుడి రాతితో నిర్మించారు. ద్వారపాలకులు, గజలక్ష్మీ వంటి వారిని శిల్పాలపై అద్భుతంగా చెక్కారు. మండపానికి చుట్టూ ఉన్న నాలుగు స్తంభాలకు నాలుగు విధాలైన శిల్పకళ కనిపిస్తుంది. 2011లో భీమన్న గుడిని పురావస్తుశాఖ ద్వారా అభివృద్ధి చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్కు ఆలయ అధికారులు లేఖ సైతం రాశారు. విశాలమైన గర్భగుడితోపాటు భారీ శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. విస్తరణ పనులు పూర్తయ్యే వరకు ఆర్జిత సేవలు ఈ క్షేత్రంలో జరుగనున్నాయి. -
మావోళ్లు వస్తారో !
సిరిసిల్ల: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో తొలిసారి నక్సలైట్లు ఆయుధాలను అప్పగించి సామూహికంగా లొంగుబాటు మొదలైంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని సాయుధ నక్సలైట్లు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారు. నాలుగు దశాబ్దాల కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్వార్) పార్టీ ఉద్యమం బలంగా ఉండేది. సమసమాజ స్థాపన కోసం ఆయుధాలను పట్టి ఎందరో అడవిబాట పట్టారు. ఏళ్లుగా ఉద్యమదారుల్లో నడిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు నేపథ్యంలో ‘మావో’ళ్లు ఇంటికి వస్తారా ! అంటూ ఆ అజ్ఞాతవాసుల కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. జనజీవనంలోకి వస్తారా? అజ్ఞాతంలోనే ఉంటారా? అనే చర్చ సాగుతోంది. 27 ఏళ్ల కిందట అడవిబాట రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 27 ఏళ్లుగా శ్రీనివాస్ జాడతెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా.. తల్లి భూదమ్మ ఎనిమిదేళ్ల కిందట మరణించింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపులకు శ్రీనివాస్ రాకపోవడం విషాదం. పోలీస్ కౌన్సెలింగ్తోనే వెలుగులోకి... శ్రీనివాస్ డిగ్రీ చదువుతూ కనిపించకపోవడంతో ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ పేరుతో నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తున్నాడని గుర్తించి.. బండలింగంపల్లిలోని అతని తల్లిదండ్రులు నారాయణ, భూదమ్మ ఇంటికెళ్లి.. కొడుకును లొంగిపోయేలా చూడండి.. అంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సంఘటనతోనే కొడుకు అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిసింది. ఒడిషా ప్రాంతంలో పనిచేస్తున్నాడని తరా్వాత వారికి తెలిసింది. కానీ ఆచూకీ లభించలేదు. కన్న కొడుకును చూడకుండానే తల్లిదండ్రులు కన్నుమూశారు. నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రయ్య అలియాస్ మహేశ్ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు. పదోతరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న చంద్రయ్య 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యలకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక్క కూతురు శాంతమ్మ. చిన్నకొడుకు చంద్రయ్య అడవిబాట పట్టారు. తల్లిదండ్రులు చిన్న కొడుకు తలంపులోనే అనారోగ్యంతో మరణించారు. మరో సొదరుడు శంకరయ్య అనారోగ్యంతో పదేళ్ల కిందట మరణించాడు. తల్లిదండ్రులు మరణించినా, సొదరుడు మరణించినా చంద్రయ్య ఇంటి ముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదినే దేవవ్వ ధర్మారంలో ఉంటున్నారు. -
అర్చకులను అవమానిస్తే ఊరుకునేది లేదు
ఓదెల(పెద్దపల్లి): అర్చకులను అవమానిస్తే ఊరుకునేది లేదని అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ హెచ్చరించారు. ఓదెల మల్లికార్జునస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయ ఈవో సదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఓదెల మల్లికార్జునస్వామి ప్రధాన అర్చకునితోపాటు మరో అర్చకుడిపై పాలకవర్గ చైర్మన్ దురుసుగా మాట్లాడడం, అగౌరవ పర్చడం శోచనీయమన్నారు. వారి తీరును ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి తీసుకెళ్లగా పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆలయంలో స్వామివారికి నిర్వహించే నిత్యకై ంకర్యాలపై పాలకవర్గం పెత్తనం మానుకోవాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో ఓదెల ఆలయ అర్చకులు, కరీంనగర్, జగిత్యాల జిల్లాల ధూపదీప, నైవేద్య అర్చక నాయకులు పాల్గొన్నారు. -
పార్కిన్సన్ బాధితులకు ‘డీబీఎస్’ కొత్త ఆశ
● యశోద హాస్పిటల్స్ న్యూరో సర్జన్ రాజేశ్ అలుగోలుకరీంనగర్: మందులకు స్పందించని రోగులకు డీబీఎస్ చికిత్స అద్భుత ఫలితాలనిస్తోందని, హైటెక్సిటీ యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ రాజేశ్ అలుగోలు తెలిపారు. శుక్రవారం నగరంలోని యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పార్కిన్సన్ వ్యాధి వేధిస్తోందన్నారు. గతంలో వృద్ధుల్లోనే కనిపించే ఈ సమస్య, ప్రస్తుతం యువతలోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. శరీర కదలికలను నియంత్రించే మెదడులోని భాగాలపై ఈ వ్యాధి ప్రభావం చూపుతోందని, ఫలితంగా చేతులు వణకడం, నడకలో ఇబ్బందులు, శరీరం బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు. వ్యాధి ప్రారంభదశలో మందులతో నియంత్రించినప్పటికీ, కాలక్రమేణా వాటి ప్రభావం తగ్గుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స ఆధారిత ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ (డీబీఎస్) కొత్త ఆశలు రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ఈ విధానంలో మెదడులోని నిర్దిష్ట భాగాల్లో ఎలక్ట్రోడ్లను అమర్చి, ఛాతీలో అమర్చిన చిన్న పరికరానికి అనుసంధానిస్తామన్నారు. ఈ పరికరం పంపే విద్యుత్ సంకేతాలు మెదడు కార్యకలాపాలను నియంత్రిస్తాయిని వివరించారు. సరైన మందులు, వ్యాయామం చేసుకుంటే పార్కిన్సన్ బాధితులు సాధారణ జీవితం గడపవచ్చని సూచించారు. -
ఎప్పుడొస్తావ్!
చేపా చేపా ● తప్పని ‘మీన’మేషాలు! ● చేపపిల్లల పంపిణీపై నీలినీడలు ● అదను దాటితే నష్టమంటున్న మత్య్యకారులు జగిత్యాల/సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువువు, కుంటల్లో ఉచితంగా విడుదల చేసే చేపపిల్లల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు టెండర్లు పిలిచింది. అయినా, పలుచోట్ల టెండర్లు దాఖలు కాలేదు. మరికొన్నిచోట్ల దాఖలైనా అర్హత లేకుండాపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ శుక్రవారం ప్రారంభంకాగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా మొదలుకాలేదు. మత్య్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్ల వ్యయంతో చేపపిల్లలను వదులుతోంది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు అక్రమాలతో ఈ పథకం లోపభూయిష్టంగా మారుతోంది. పంపిణీ ఆలస్యంగా చేపట్టడం, చేపప్లిలల పరిమాణం విషయంలో అక్రమాలతో ఎదగక మత్స్యకారులు ఏటా నష్టపోతూనే ఉన్నారు. ఎదుగుదలపై ప్రభావం కిలోసైజ్ చేప పెరగాలంటే కనీసం ఐదు నెలల సమయం పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఏటా ఆగస్టు నెలాఖరులోగా ప్రాజెక్టులు, చెరువుల్లో చేపపిల్లల విడుదల చేసేవారు. ఈసారి వాటిని సరఫరా చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెలాఖరులోగానైనా వదిలితే వచ్చే.. ఏడాది ఫిబ్రవరి, మార్చిలో చేపలు పట్టుకుని, విక్రయించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరింత ఆలస్యంచేస్తే వాటిఎదుగుదలపై ప్రభావం ఉంటుందని మ్య్సతకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6.96 కోట్ల చేపపిల్లలు.. 3.133 చెరువులు ఉమ్మడి జిల్లాలోని సుమారు 56 వేల మంది మత్స్యకారులు చేపలవేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పటివరకూ వాటిని విడుదల చేయకపోవడంతో వేట సీజన్ను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఒక్క నారాయణపేటలోనే.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం చేపపిల్లల పంపిణీ చేపట్టినా.. ఒక్క నారాయణపేట జిల్లా తప్ప రాష్ట్రంలో మరెక్కడా చేపలు విడుదల చేయలేకపోయింది. రెండేళ్లకు సంబంధించి బకాయిలు కాంట్రాక్టర్లకు చెల్లించలేదని, దీంతోనే వారు పంపిణీ చేసేందుకు సిద్ధంగా లేదరని తెలుస్తోంది. ఈఏడాది భారీగా కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియలో నెలకొన్న సందిగ్ధంతో పంపిణీ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. దీపావళి తర్వాత పంపిణీ పెద్దపల్లి జిల్లాలో చేపల సరఫరా కోసం రెండు బిడ్లు వచ్చాయి. వీరికి అర్హత లేక తిరిస్కరించాం. సమయం లేనందున మరోసారి టెండర్లు ఆహ్వానిస్తాం. ప్రత్యామ్నాయంగా ఇతర జిల్లాల కాంట్రాక్టర్లుతో పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాం. దీనికి సంబంధించి ఉన్నాతాధికారులు లేఖ రాశాం. దీపావళి తర్వాత పంపిణీ చేస్తాం. – నరేశ్నాయుడు, మత్య్యశాఖ జిల్లా అధికారి, పెద్దపల్లి ఉమ్మడి జిల్లాలో చేపపిల్లల పంపిణీ వివరాలుజిల్లా చెరువులు లక్ష్యం వాటిఖర్చు (లక్షల్లో) (లక్షల్లో) జగిత్యాల 696 169.33 224.11 కరీంనగర్ 921 220.04 217.98 పెద్దపల్లి 1,076 158.82 158.30 సిరిసిల్ల 440 148.28 175.87 మొత్తం 3,133 696.47 776.26 -
శిశుమరణాలను నివారించాలి
జగిత్యాల: శిశుమరణాలను నివారించేలా చూడాలని, ఆస్పత్రికి వచ్చిన ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం అందించాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. శుక్రవారం కార్యాలయంలో చైల్డ్డెత్పై సమీక్ష నిర్వహించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 10 మంది చిన్నపిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఎక్కువగా ప్రీ టర్మ్ బేబీస్ కన్జెంటల్ హార్ట్ డిసిజేస్, ఆస్పిరేషన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఎంసీహెచ్లో వెంటిలేటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత బుజంపై వేసుకుని బర్ఫింగ్ వేయాలని, నెమ్మదిగా వెన్నుపై తట్టాలన్నారు. ఆశా కార్యకర్తలు బాలింతలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. చైల్డ్ డెత్ రివ్యూ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్, డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, మాత శిశు సంరక్షణాధికారి జైపాల్రెడ్డి పాల్గొన్నారు. 1న కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికలుజగిత్యాలఅగ్రికల్చర్: నవంబర్ 1న కరీంనగర్ కో– ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి, జగిత్యాల జిల్లా సహకారాధికారి సీహెచ్.మనోజ్కుమార్ తెలిపారు. కరీంనగర్ కో– ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు కరీంనగర్, జగిత్యాలలో శాఖలు ఉన్నాయి. ఆక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు, 24న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియ కరీంనగర్ కో– ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో నిర్వహించడం జరుగుతుందన్నారు. కరీంనగర్ ఓటర్ల కోసం కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాల ఓటర్ల కోసం జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఉంటుందన్నారు. -
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
ధర్మపురి: భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ధర్మపురిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులు, రిజిష్టర్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలన్నారు. మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణ భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం ధర్మపురిలోని కస్తూరిబా గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు ఏమైన సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. భోజనం, వంటగదులు పరిశీలించారు. ఖాళీస్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆర్డీవో మధుసుదన్, డీఈవో రాము, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో సీతామహాలక్ష్మి పాల్గొన్నారు. రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. సకాలంలో ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులు, తేమయంత్రాలు, ప్యాడీక్లీనర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం డబ్బులు, బోనస్ 48గంటల నుంచి 72గంటల్లోపు రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. అదనపు కలెక్టర్ లత, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కన్నెం హరిణి, డీఆర్డీఏ పీడీ రఘువరణ్ పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు జైకుమార్ అన్నారు. కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష, నియమకంపై సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం శుక్రవారం జగిత్యాలలోని ఏబీ గార్డెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జైకుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం దిశగా హైకమాండ్ తీసుకుంటున్న చర్యలకు కట్టుబడి పనిచేయాలన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కార్యకర్తలకు పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు చేశారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రతీ కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందన్నారు. మాజీమంత్రి జీవన్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు. ప్రజాస్వామ్యయుక్తంగా అధ్యక్షుడి ఎంపికకు కార్యకర్తల అభిప్రాయం సేకరించడం అభినందనీయమన్నారు. పీసీసీ పరిశీలకులు ఫకృద్దీన్ రా య్, కేతూరి వెంకటేశ్, బాసిత్, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు. -
‘సాక్షి’ గొంతునొక్కే ప్రయత్నం
జగిత్యాల: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తోందని జగిత్యాల జిల్లా పాత్రికేయులు మండిపడ్డారు. హైదరాబాద్లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయానికి ఏపీ పోలీసులు వచ్చి ఎడిటర్ ధనంజయ్రెడ్డిని నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తాలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సాక్షి ఎడిటర్పై వెంటనే కేసులు ఎత్తివేయాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినదించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఏవో రవికాంత్కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు కందుకూరి శశిధర్, శేఖర్, కుమార్, మల్లారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీకర్, చంద్రశేఖర్, విజయ్కుమార్, గణేశ్, వెంకటేశ్వర్లు, రాంరెడ్డి, రమేశ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. ఎడిటర్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి జగిత్యాలలో పాత్రికేయుల నిరసన -
క్రీడల్లోనూ రాణించాలి
జగిత్యాలరూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా విద్యాధికారి రాము సూచించారు. జగి త్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ జిల్లా పరిషత్పాఠశాలలో శుక్రవారం ఉమ్మడి జిల్లాస్థాయి బాస్కెట్బాల్ ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఎంపీవో రవిబాబు, టీఎస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, కార్యదర్శులు అశోక్, టీజీ పేట జిల్లా అధ్యక్షుడు రాజమల్లయ్య, ప్రధానోపాధ్యాయురాలు సరోజన, బాస్కెట్బాల్ కోర్టు నిర్మాణదాత తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో దాడిస్ స్టిక్కర్లు కీలకం జగిత్యాలరూరల్: రోడ్డు ప్రమాదాల నివారణకు డాడిస్ రోడ్ స్టిక్కర్స్ కవచంలా పనిచేస్తాయని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాటిపల్లి రవాణాశాఖ కార్యాలయంలో డాడిస్ రోడ్డు ప్రాంచైజ్ను ప్రారంభించి, రోడ్డు స్టిక్కర్ను ఆవిష్కరించారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరికి డాడిస్ రోడ్ స్టిక్కర్స్ కవచంలా పనిచేస్తాయన్నారు. ఈ క్యూఆర్కోడ్ స్టిక్కర్ వేసుకోవడం వల్ల 8 రకాల ప్రయోజనాలుంటా యన్నారు. ప్రమాద, సందేశం, రక్తనిధి, పా ర్కింగ్ సమస్య, పత్రాలు భద్రపర్చుట, రిమైండర్లు, లాక్ హెచ్చరిక, టోయింగ్ హెచ్చరిక లాంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఎంవీఐ లు రామారావు, డాడీస్ రోడ్ ఆఫ్ జగిత్యా ల జి ల్లా మేనేజర్ ఆడెపు వెంకటేశ్, కందుకూరి స్వా మి, పర్వతం, సతీశ్, మహేందర్ పాల్గొన్నారు. తలనీలాల టెండర్కు దరఖాస్తుల ఆహ్వానం మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు ఈ నెల 23న మధ్యాహ్నం 3గంటలకు వేలం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. దేవాలయం చేత పోగు చేయబడిన 7 నెలల తలనీలాల కోసం దరావత్తు సొమ్ము 10లక్షలతోపాటు రూ.2,360, ఆలయంలో పోగు చేయబడిన 3 నెలల తలనీలాలకు రూ.5 లక్షలతోపాటు రూ.2,360 ఏదేని జాతీ య బ్యాంకులో డీడీ రూపంలో చెల్లించి, ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ద రఖాస్తులు అందజేయాలని ఈవో తెలిపారు. 23న మధ్యాహ్నం 3గంటలకు తలనీలాలు కిలోల చొప్పున బహిరంగ వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు పాటించాలి ధర్మపురి: పత్తి రైతులు ప్రభుత్వ విధానాలను పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ సూచించారు. మండలంలోని తుమ్మెనాల గ్రామంలో శుక్రవారం పత్తి రైతులతో స మావేశమయ్యారు. పత్తి విక్రయించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. పత్తిని సీసీఐకి విక్రయించే విధానం, కప్పస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్, మైబెల్ నంబర్ అప్డెషన్ గురించి సూచించారు. వరి కోతల్లో హార్వెస్టర్లు ఫ్యాను స్పీడు 18–20 ఆర్పీఎం ఉండేలా చూసుకోవాలన్నారు. -
గిట్టుబాటు కాక మూసేశారు
మెట్పల్లి: జిల్లాకు సరిహద్దులో ఉన్న మెట్పల్లి పట్టణానికి సమీప ప్రజలతో పాటు మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, కమ్మర్పల్లి మండలాల నుంచి వివిధ పనుల కోసం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అత్యవసర సమయంలో ఇబ్బంది కాకుండా మున్సిపల్ అధికారులు పలుచోట్ల పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని చాలాకాలంగా మూతబడ్డాయి. పట్ట ణంలోని బస్డిపో చౌరస్తా, కొత్త బస్టాండ్, రెడ్ క్రాస్ బిల్డింగ్, కూబ్సింగ్ కుంట, మున్సిపల్ కార్యాలయం, ఆరపేట చౌరస్తా, మండల పరిషత్ ఆవరణల్లో స్వచ్ఛ భారత్ నిధులతో పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. మండల పరిషత్లోనిది మినహా మిగతావాటి నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. కొంతకాలం సక్రమంగానే నడవగా.. తర్వాత గిట్టుబాటు కావడం లేదని మూసేశారు. రెడ్ క్రాస్ భవనం వద్ద ఉన్న దాన్ని నీటి సమస్య తలెత్తడంతో మూసివేశారు. కొత్త బస్టాండ్ వద్ద ఉన్న మరుగుదొడ్డిని బిల్లులు రావడం లేదని ప్రైవే ట్ వ్యక్తి మూసేశాడు. దాన్ని ఓ వ్యాపారికి వస్తువులు పెట్టుకోవడానికి అద్దెకు ఇచ్చినట్లు తెలిసింది. కాగా.. ‘పట్టణంలో మూతపడ్డ టాయిలెట్లు అన్నికూడా వినియోగంలోకి తీసుకరావడంపై దృష్టి సారిస్తాం. కొత్త బస్టాండ్ వద్ద మరుగుదొడ్డిని ప్రైవేట్ వ్యక్తి అద్దెకు ఇవ్వడంపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటాం’.అని మెట్పల్లి మున్సిపల్ డీఈఈ నాగేశ్వర్రావు వివరించారు. -
ఎగ్ బిర్యానీ పెడ్తలేరు
పెగడపల్లి: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం అంగన్వాడీ కేంద్రాల ఉద్దేశం. జిల్లా ఐసీడీఎస్ పరిధిలో నాలుగు ప్రాజెక్టుల్లో 7,267 మంది గర్భిణులు, 4,553 మంది బాలింతలు, 4,518 మంది ఆర్నెళ్లలోపు చిన్నారులు, 32,437 మంది ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారుల, 33,012 మంది మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు వారు ఉన్నారు. వీరికి పౌష్టికాహారం అందించేందుకు కొద్దిరోజుల క్రితం అంగన్వాడీల్లో ఎగ్బిర్యానీ పథకాన్ని ప్రారంభించారు. తొలిరోజు ఊరించి.. తరువాత ఉసూరుమని పించారు. దీంతో జిల్లాలోని అంగన్వాడీకేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పథకం అటకెక్కింది. నిధుల లేమితో ఒక్కరోజుతోనే నిలిచిపోయింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్లు, పాలు, బాలా మృతం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. మ రింత పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో అమ్మమాట.. అంగన్వాడీ బడిబాట, ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంలో భాగంగా చిన్నారులను కేంద్రాలను రప్పించడం లక్ష్యంగా ఈ ఏడాది జూన్ 11న జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ త యారు చేసి, కేంద్రాలకు వచ్చిన చిన్నారులు, బా లింతలు, గర్భిణులకు అందించారు. వారంలో రెండుసార్లు అందించాలని ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లు సైతం ఉత్సాహం చూపించారు. ప్రారంభించిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడం, నిధుల మంజూరు చేయకపోవడంతో ఎగ్ బిర్యానీ ఒక్క రోజుకే పరిమిౖతమైంది. పథకం కొనసాగించేలా చూడాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ ప్రారంభించాం. తరువాత ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వస్తే అమలు చేస్తాం’. అని డీడబ్ల్యూవో నరేశ్ వివరించారు. -
లిక్కర్ టెండర్లకు నేడే ఆఖరు
జగిత్యాలక్రైం: లిక్కర్ టెండర్ల ఘట్టం చివరిదశకు చేరింది. టెండర్లకు మరికొద్ది గంటలు మాత్రమే గడువు ఉండగా.. అరకొరగా వచ్చిన దరఖాస్తులు ఎకై ్సజ్ వర్గాలను కలవరానికి గురి చేస్తున్నా యి. చివరిరోజు దరఖాస్తులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. గుడువు ముగిసే వరకు క్యూలో ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీ కరిస్తామని ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–27 ఏడాదికి జిల్లాలో 71మద్యం షాపుల నిర్వహణకు టెండర్లు ఆహ్వా నించింది. శుక్రవారం 441 దరఖాస్తులు రాగా.. మొత్తంగా 884 వచ్చాయి. రెండేళ్ల క్రితం 2,636 దరఖాస్తులు రాగా.. సగం కూడా రాకపోవడానికి కారణమేంటని ఆబ్కారీవర్గాలు ఆలోచనలో పడ్డా రు.వ్యాపారం బాగా నడిచే షాపులపై చాలా మంది మక్కువ చూపుతున్నారు. చివరి వరకు వేచి చూసి, వాటికి దరఖాస్తు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. శనివారం సాయంత్రం 5 గంటలలోపు క్యూలైన్లో ఉన్న ప్రతి దరఖాస్తును స్వీకరిస్తామ ని ఎకై ్సజ్ అధికారి సత్యనారాయణ వివరించారు. -
ఎన్నాళ్లీ అణచివేత
జర్నలిస్టుల స్వేచ్ఛపై ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రజా సమస్యలపై గళమెత్తిన ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటుగా విలేకరులపై కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. సాక్షి కార్యాలయాల్లో పోలీసులు హల్చల్ చేయడంపై రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంసాక్షి పత్రిక ఎడిటర్పై వరుస కేసులు పెడుతూ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. కక్ష పూరితంగా వ్యవహరిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. – పన్నాల తిరుపతిరెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకుడు పత్రికాస్వేచ్ఛను హరించడమేజగిత్యాలటౌన్: సాక్షి ఎడిటర్పై వరుసగా కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడటం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సాక్షి పత్రిక గొంతునొక్కే యత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరమించుకోవాలి. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. – ముంజాల రఘువీర్గౌడ్, కాంగ్రెస్ నాయకుడు -
బాకీకార్డుల పేరిట బీఆర్ఎస్ నాటకం
● ప్రజలకిచ్చిన హామీలపై చర్చకు సిద్ధం ● బీఆర్ఎస్ పదేళ్లలో ఏం చేసింది..? ● రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మపురి: బాకీ కార్డుల పేరిట బీఆర్ఎస్ కొత్త నాటకం ఆడుతోందని, పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అందిన పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అనేక వాగ్దానాలిచ్చి.. పదేళ్లు పాలించి.. రాష్ట్రాని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై అనేక ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ ప్రజలకు చేసిందేమిటో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముతోనే కేసీఆర్ టీఆర్ఎస్ను నడిపించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి రానున్న రోజుల్లో ప్రజల మద్దతు తీసుకుంటామని అన్నారు. ధర్మపురిలో డిగ్రీ కళాశాల, బస్డిపో, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని, గోదావరిలో మురికినీరు కలువకుండా రూ.17కోట్లతో సీనరేజ్ ట్రిట్మెంట్ ప్లాంట్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నేరెళ్ల వద్ద రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కళాశాల నిర్మాణానికి త్వరలో ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. ఆయన వెంట నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, చిలుముల లక్ష్మణ్, మొగిలి తిరుపతి, మధుకర్రెడ్డి, చీపిరిశెట్టి రాజేష్ తదితరులున్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
పత్తి నాణ్యంగా ఉన్నా తేమ ఉందంటూ ఇబ్బంది పెడుతుంటారు. పత్తిలో అక్కడక్కడ ఎండిపోయిన ఆకులు కనబడిన తిరస్కరిస్తుంటారు. గతంలో మాదిరి పొరపాట్లు జరగకుండా.. కొత్తకొత్త నిబంధనల పేరిట రైతులను ఇబ్బంది పెట్టొద్దు. – మల్లారెడ్డి, ఎండపల్లిసీసీ నిబంధనల మేరకే సీసీఐ నిబంధనల మేరకు పత్తి కొనుగోళ్లు సాగుతాయి. తక్కువ ధరకు దళారులకు విక్రయించొద్దు. నిబంధనల మేరకు పత్తి తెచ్చి మద్దతు ధర పొందాలి. ఈ ఏడాది సీసీఐ ఆధార్ బయోమెట్రిక్ పూర్తయితేనే కొనుగోళ్లు చేపట్టనుంది. – ప్రకాశ్, జిల్లా మార్కెటింగ్ అధికారి -
ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయండి
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 6,66,500 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం 423 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. 92 బాయిల్డ్రైస్ మిల్లులు తప్పనిసరిగా వందశాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలన్నారు. వచ్చిన ధాన్యం వచ్చినట్లే దిగుమతి చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ లత, పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్రెడ్డి, మేనేజర్ జితేంద్రప్రసాద్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. పెండింగ్ ఓటరు దరఖాస్తులు పరిష్కరించాలి పెండింగ్ ఓటరు దరఖాస్తులు పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి కలెక్టర్కు సూచించారు. కలెక్టర్తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి పోలింగ్ బూత్కు అధికారిని నియమించాలని, బీఎల్వోలకు ఐడీ కార్డులు జారీ చేయాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేర్లు లేనివారిని గుర్తించి నివేదిక తయారు చేస్తున్నామన్నారు. -
గుట్టబోర్లు హాంఫట్
బుగ్గారం: మండలంలోని పలు ప్రాంతాల్లోని గుట్ట బోర్లు కనుమరుగవుతున్నాయి. కొంతమంది మట్టికోసం తవ్వుతుండగా.. మరికొంత మంది స్థలాన్ని కబ్జా చేయడానికి తవ్వుకాలు జరుపుతున్నారు. దీంతో గుట్టబోర్లు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణ సమయంలో.. ఇతర అవసరా లకు ఎక్కడైనా మొరం తవ్వి ఎడ్లబండ్లలో తెచ్చుకుంటే ఎన్నో ఇబ్బందులకు గురిచేసే అధికారులు.. బడాబాబులు, అక్రమార్కులు గుట్టలనే మాయం చేస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. మండలంలోని సిరికొండ, మద్దునూర్, యశ్వంతరావుపే ట, బుగ్గారం, చిన్నాపూర్, గోపులాపూర్ పరిధిలోని గుట్టబోర్లను కొంతకాలంగా దర్జాగా తవ్వుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆరోపిస్తున్నారు. కబ్జా కోసం మండలంలో మొత్తం 11 గ్రామాలు ఉన్నాయి. అనేక గ్రామాలలో అటవీశాఖ భూములు ఉన్నాయి. పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలోనే అటవీశాఖ పరిధిలోని గుట్టబోర్లు ఉండడంతో స్థలాన్ని కలుపుకోవాలనే దురుద్దేశంతో కొంతమంది గుట్టలను మాయం చేస్తున్నారు. ఈ స్థలంలోని విలువైన వృక్ష సంపద కనుమరుగుకావడమే కాకుండా ప్రభుత్వ పరిధిలోని భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరికొంత మంది మొరం కోసం గుట్టలను తవ్వుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలుగైదేళ్లలో సిరికొండ, మద్దునూర్, యశ్వంతరావుపేట, బుగ్గారం, గంగాపూర్, చిన్నాపూర్లోని గుట్టబోర్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇటీవల శెకెల్ల శివారులో గుట్టబోరుకు జేసీబీతో రాత్రిపూట మొరాన్ని తవ్వుతున్నారని స్థానికులు సంబధిత అధికారులకు ఫోన్లో తెలపగా.. పోలీసులకు ఫోన్ చేయండని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. అదేరాత్రి మరో అధికారికి ఫిర్యాదు చేయగా.. ఆయన స్థానిక అధికారులను పంపించేసరికే అక్రమార్కులు తమ అవసరం మేరకు తవ్వుకుని పోయారు. ఫిర్యాదు చేసిన కొంతకాలం హడావుడి చేస్తున్న అధికారులు తరువాత ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. -
పండుగ తర్వాత పత్తి కొనుగోళ్లు
● వెల్గటూర్లో సీసీఐ కేంద్రం ● నిబంధనలు కఠినతరంజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కాటన్ కార్పొరేషన్ ఇండియా (సీసీఐ) ద్వారా వెల్గటూర్ మండలంలోని జిన్నింగ్ మిల్లు పాయింట్ ఏర్పాట్లు చేస్తున్నారు. పింజ పొడువు, రకాన్ని బట్టి పత్తికి మద్దతు క్వింటాల్కు ధర రూ.8,110గా ప్రభుత్వం నిర్ణయించింది. మధ్య రకం పొడువు పింజ పత్తికి రూ.7,710. ఇది గతేడాదితో పోల్చితే క్వింటాల్కు రూ.589 అదనం. పత్తి దిగుబడి అంచనా 1.98 లక్షల క్వింటాళ్లు జిల్లాలో పత్తిని 16,556 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ఎక్కువగా ధర్మపురి మండలంలో 2,972 ఎకరాలు, ఎండపల్లిలో 2,749, వెల్గటూర్లో 2,400, కొడిమ్యాలలో 1,564, గొల్లపల్లిలో 1,630, బీర్పూర్లో 1,640, బుగ్గారంలో 1140 ఎకరాల్లో సాగవుతోంది. ఈసారి విత్తనాలు వేసినప్పటి నుంచే వర్షాలు మొదలయ్యాయి. దీంతో కలుపు తీయడం, ఎరువులు వేయడం సాధ్యం కాలేదు. నీరు నిలవడం, భూమి తేమగా ఉండటంతో తెగుళ్ల విజృంభించి దిగుబడి తగ్గింది. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ.. వాతావరణ పరిస్థితుల నేపథ్యలో 8క్వింటాళ్లు కూడా వచ్చే ఆస్కారం లేదు. మొత్తంగా 1.98లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు భావించినా.. 1.32లక్షల క్వింటాళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. యంత్రాంగం సిద్ధం దీపావళి తర్వాత పత్తి కొనేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దళారులు క్వింటాల్కు రూ.5వేల నుంచి రూ.ఏడు వేలలోపే చెల్లిస్తున్నారు. ఓపెన్ మార్కెట్లో రేటు లేకపోవడంతో సీసీఐ కొత్త నిబంధనలు తెస్తోంది. పత్తి విక్రయించే రైతులకు ఆధార్ తప్పనిసరి చేసింది. ఆధార్ బయోమెట్రిక్ నిర్ధారణ అయ్యాకే కొననుంది. డబ్బులను కూడా ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాకే జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. -
బీసీలను మభ్యపెట్టారు
● చట్టబద్దత లేకుండా 42శాతం ఎలా..? ● కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవీ..? ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావుజగిత్యాల/మెట్పల్లి: బీసీలను మభ్యపెట్టాలన్న ఉద్దేశంతో చట్టబద్దత లేకుండా రాష్ట్రప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఈనెల 18న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామని, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. బలహీనవర్గాల కోసం మాజీ సీఎం కేసీఆర్ న్యాయం చేశారని, మోదీ, రాహూల్గాంధీ పార్లమెంట్లో బిల్లు ఆమోదించేలా చూడాలన్నారు. బీసీలు కన్నెర్ర చేస్తే కాంగ్రెస్, బీజేపీ కనుమరుగవుతాయన్నారు. ఈనెల 18న బంద్కు వ్యాపార, వాణిజ్యవర్గాలు సహకరించాలని కోరారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటేనే బీసీల పార్టీ అని, కేసీఆర్ ఉద్యమకాలం నుంచి బీసీల కోసం ఎంతో పోరాటం చేశారన్నారు. నాయకులు గట్టు సతీశ్, మల్లేశం, ఆనందరావు, అనురాధ, శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతకుముందు విద్యాసాగర్రావు మెట్పల్లిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. -
ఈడీ చేతికి మెటా!?
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: మెటా క్రిప్టో కరెన్సీ పేరుతో కరీంనగర్లో వెలుగుచూసిన కుంభకోణం మలుపు తిరగనుంది. త్వరలోనే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో డబ్బులను అనతికాలంలోనే రెట్టింపు చేస్తామని బాధితుల నుంచి వసూలు చేసి, దేశం దాటడం, అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం నేతృత్వంలో పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపి త్వరలోనే డీజీపీకి నివేదిక పంపనున్నారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సమాచారం ఇవ్వనున్నారని సమాచారం. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. కింగ్పిన్ లోకేశ్వర్రావు అరెస్టుతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుపై సాక్షి కథనాలను తొలుత ఖండించిన పోలీసులు తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్తో వాటిని అంగీకరించినట్లయింది. దుబాయ్ హవాలాపై దృష్టి ఈ కేసులోని నిందితులు మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, దుబాయ్ తదితర దేశాలకు పెట్టుబడిదారులను తిప్పారు. దుబాయ్లో బినామీలను నియమించుకున్నారు. ఇక్కడ వసూలు చేసిన మొత్తం డబ్బును యూఎస్డీటీ, హవాలా మార్గాల ద్వారా దుబాయ్కి పంపారు. ఆ డబ్బుతో అక్కడ బంగారం కొన్నారు. అందులో 30 తులాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 450 మంది బాధితుల నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేశారని పైకి చెబుతున్నా, దాని విలువ దాదాపుగా వీరు రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితులు దుబాయ్ తదితర దేశాల్లో హవాలా ద్వారా పంపిన డబ్బులతో బంగారం, ఆస్తులు కూడబెట్టారని సమాచారం. దుబాయ్లో ఈ ముఠా రూ.40 కోట్ల విలువైన ఓ పబ్ను నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడ పదేళ్ల గోల్డెన్ వీసా సంపాదించి అరెస్టును జాప్యం చేసేలా ఎత్తుగడలు వేసినట్లు గుర్తించారు. నిందితులు లీగల్ టీం ఏర్పాటు చేసుకుని ఏకంగా కరీంనగర్ సీపీకి నోటీసులు పంపడం, ఫిర్యాదుదారులపై ప్రైవేటు కేసులు ఫైల్ చేయడాన్ని పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు త్వరలోనే మరిన్ని అరెస్టులు జరపనున్నారు. సరైన సమయం చూసి అరెస్టు చేసే ఆలోచనలో ఉన్నారు. గతంలో నిందితులు ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో ఈ మేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కరీంనగర్క్రైం : మెటాఫండ్ ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వర్రావు(32)ను కరీంనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీపీ గౌస్ ఆలం కమిషనరేట్లో కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని పీవీఎన్కాలనీకి చెందిన వరాల లోకేశ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీలో నిపుణుడు. గతంలో ఆన్లైన్ బిట్కాయిన్లో, డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. అతని తండ్రి స్నేహితుడైన కరీంనగర్కు చెందిన తులసీ ప్రకాశ్ తమ ప్రాంతంలో యూబిట్ కాయిన్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారని ఒకసారి వస్తే కొంతమందిని పరిచయం చేస్తానని చెప్పి 2024లో నగరానికి చెందిన బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్, కట్ల సతీశ్ను పరిచయం చేయించాడు. ఒక నకిలీ కాయిన్‘మెటాఫండ్’ రూపొందించి గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని శామీర్పేటలో ఓ రిసార్ట్లో ఆవిష్కరించారు. యాప్ ప్రచారం కోసం కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించారు. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి కరీంనగర్కు చెందిన భాస్కర్ నాయక్ వద్ద రూ.15లక్షలు, మరో 450 మంది ద్వారా రూ.30కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించారు. డబ్బులు విత్డ్రా చేయలేని విధంగా యాప్ను డిజైన్ చేశారు. కొద్దిరోజులకు బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్, టూటౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన తులసీ ప్రకాశ్, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్, కట్ల సతీశ్ను గతంలోనే అరెస్టు చేశారు. లోకేశ్వర్రావును అలుగునూరులో అదుపులోకి తీసుకుని, గురువారం రిమాండ్ చేశారు. నిందితుల నుంచి ఆస్తి ప్రతాలు, 30తులాల బంగారం, మొబైల్ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీసీఎస్ సీఐ ప్రకాశ్ను సీపీ అభినందించారు. -
అర్హులకు ఇళ్లు ఇవ్వండి
● బల్దియా కార్యాలయం ఎదుట బైఠాయించిన మాజీమంత్రి జగిత్యాల: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మాజీమంత్రి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. సమాచారం లేకుండా వార్డుల్లో సభలు నిర్వహించి కొందరికే ఇళ్లు కేటాయించారంటూ బల్దియా ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. అర్హులతోపాటు అనర్హుల జాబితా ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. డబుల్బెడ్రూం నిర్మాణలో స్థలాలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తారన్న సమాచారం మేరకు మున్సిపల్ సిబ్బంది కార్యాలయానికి గేట్లు వేశారు. సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. -
పనులు చేస్తారా.. తప్పుకుంటారా..
కోరుట్ల: జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఆర్అండ్బీ, పీఆర్ విభాగాలకు చెందిన పనులు చేసేందుకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ పనులు సత్వరమే ప్రారంభించాలని, లేకుంటే రద్దు చేసుకోవాలని గత నెల 15, 19వ తేదిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పనులకు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో బిల్లులు రాకపోవడంతో మిగిలిన పనులు మొదలుపెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇదివరకు చేసిన పనులకు బిల్లులు మంజూరైతే మిగిలిన పనులు చేద్దామన్న ఆలోచనలో కాంట్రాక్టర్లు ఉన్నారు. తాజాగా సదరు పనులను రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. పాత బిల్లుల పరేషాన్.. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన పనుల బిల్లులు చాలామేర ఇప్పటికీ కాంట్రాక్టర్ల చేతికి అందలేదు. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, సోషల్ వెల్ఫేర్లో పూర్తయిన పనులకు సంబంధించి సుమారు రూ.60 కోట్ల మేర బిల్లులు కాంట్రాక్టర్లకు రావాల్సి ఉంది. రెండేళ్లు గడుస్తున్నా ఆ బిల్లులు ఇప్పటికీ మంజూరు కాలేదు. పాత బిల్లుల కోసం ఇటు అధికార యంత్రాంగం..అటు అధికార పార్టీ నాయకుల చుట్టూ కాంట్రాక్టర్లు తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. ఈ బిల్లుల రాకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో టెండర్ వేసి పనులు మొదలుపెట్టని వాటిని ఈఈ, డీఈ స్థాయి అధికారులు పరిశీలించి వాటిని రద్దు చేసుకోవాలని కాంట్రాక్టర్లతో లేఖలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. రద్దు వైపు మొగ్గు..? రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో పాత ప్రభుత్వ హయాంలో టెండర్లు దక్కించుకుని పనులు మొదలు పెట్టని కాంట్రాక్టర్లు ఆ పనులను రద్దు చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్టు తీసుకుని గ్రౌండింగ్ పనులు కాకపోవడం.. అసలే పనులు మొదలు కాకుండా ఉన్న పనులను గుర్తించడానికి అధికారులు సన్నాహలు చేపట్టారు. ఆ పనులకు ఈఎండీ డబ్బులను వాపస్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల వచ్చిన క్రమంలో కాంట్రాక్టర్ల పనుల రద్దు లేఖలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ధర్మపురిలో మినహా మిగిలిన చోట్ల కాంట్రాక్టర్లు పాత టెండర్ల నుంచి తప్పుకోవడం వైపే మొగ్గు చూపుతుండడం గమనార్హం. ఒకవేళ కాంట్రాక్టర్లు తప్పుకుంటే తిరిగి నిధులు రావడం.. టెండర్లు వేయడం వంటి ప్రక్రియ పూర్తికావడానికి తీవ్ర జాప్యం జరుగుతుంది. అదే జరిగితే సీసీ రోడ్లు, వంతెనలు, కాజ్వేల పనులు పూర్తి కాక జనం నానా తిప్పలు పడే అవకాశాలు ఉన్నాయి. -
బాల నేరస్తుల కేసులకు సత్వర పరిష్కారం
జగిత్యాలజోన్: జువైనల్ జస్టిస్ బోర్డు ఏర్పాటుతో బాల నేరస్తుల కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లాకేంద్రంలోని బైపాస్ రోడ్డులో జువైనల్ జస్టిస్ బోర్డును బుధవారం ప్రారంభించారు. బాల నేరస్థుల కేసుల్లో జరిమానా, శిక్ష విధించడం కాకుండా.. మంచి ప్రవర్తనతో సమాజంలోకి వెళ్లేలా చూస్తామని, సమాజంలో మంచి పరిణామాలపై కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. శిశు సంక్షేమ శాఖ ద్వారా వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. బోర్డు చైర్పర్సన్, జిల్లా మొదటి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్ బెంచ్ నిర్వహించారు. బాల నేరస్తుల కేసుల్లో బెయిల్పై న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మాణ్య శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గంప కరుణాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, కోర్టు సూపరింటెండెంట్ షపీయోద్దిన్, ఎంప్లాయీస్ అధ్యక్షుడు రామడుగు శ్రీనివాస్, మహిళా, శిశు సంక్షేమాధికారి నరేశ్ పాల్గొన్నారు. -
పేరుకే ప్రజాపాలన
● ఇందిరమ్మ రాజ్యంలో కార్మికులకు ఒరిగిందేమీ లేదు ● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్గొల్లపల్లి: కాంగ్రెస్ ప్రజాపాలనలో కార్మికులకు ఒరిగిందేమీ లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ అన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా నాలుగో మహాసభను మండలకేంద్రంలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో యూనియన్ జిల్లా అధ్యక్షులు కోమటి చంద్రశేఖర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు నిత్యం పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, వైకుంఠధామాలు, పల్లె పకృతి వనాల నిర్వహణలో పనిచేస్తున్నారని, అలాంటి కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలన్నారు. అనంతరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా పులి మల్లేశం, అధ్యక్షుడుగా కొమటి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా జంగిలి ఎల్లయ్య, కోశాధికారిగా నేరళ్ల మెహన్, ఉపాధ్యక్షులుగా న్వాతరి మల్లవ్వ, గుడిసె దేవయ్య, శాతల్ల రాజేందర్ ఎన్నికయ్యారు. మహాసభలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు వెల్మలపల్లి వెంకట చారి, నాయకులు కనికరపూ సత్తయ్య, సిరివెల్లి సాయి, జోగవ్వ, లక్ష్మీ నారాయణ, తిరుపతి పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలి
జగిత్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని, కేంద్రాల్లో వసతులు కల్పించాలని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మ ల నాగేశ్వర్రావు కలెక్టర్ను ఆదేశించారు. గన్నీసంచులు, కాంటాలు, ప్యాడీక్లీనర్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. దొడ్డు, సన్నరకం ధాన్యాన్ని వేర్వేరుగా కొనాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో 421 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, దాదాపు 7.50 నుంచి 8 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని వివరించారు. డ్రైనేజీల్లో వ్యర్థాల తొలగింపుమెట్పల్లి: పట్టణంలోని 12వా ర్డు శివారు డ్రైనేజీల్లో పేరుకపోయిన వ్యర్థాలను తొలగించారు. చెత్తాచెదారాన్ని కొన్ని నెలలుగా తొలగించకపోవడంతో బుధవారం ‘సాక్షి’లో ‘ఇదేనా చి(చె)త్తశుది’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన మున్సిపల్ అధికారులు పారిశుధ్య సిబ్బందితో తొలగించి శుభ్రం చేయించారు. ఇళ్లలో వెలువడే చెత్తను ప్రజలు మున్సిపల్ ఆటోలకు ఇవ్వకుండా డ్రైనేజీల్లో వేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని అధికారులు తెలిపారు. మల్యాల పోలీస్స్టేషన్ పరిశీలించిన ఎస్పీమల్యాల: మల్యాల పోలీస్స్టేషన్ను ఎస్పీ అశోక్కుమార్ బుధవారం తనిఖీ చేశారు. రికార్డులు, కేసు డైరీ, రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. పెండింగ్ కేసులు ఉండొద్దని, బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5ఎస్ విధానాన్ని అమలు చేస్తూ, పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ రఘుచందర్, సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్ కుమార్ పాల్గొన్నారు. ప్రధాన దారి.. ప్రమాదాల నిలయంబుగ్గారం: బుగ్గారం మండలానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ దారిని డబుల్ రోడ్డుగా మార్చడానికి గ తంలో చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరి మితమయ్యాయి. మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్నిసార్లు ప్ర మాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి డ బుల్ రోడ్డుగా విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. -
జెల్ లేదంటున్నారు
శుక్రవారం నుంచి ఆస్పత్రికి స్కానింగ్ కోసం వస్తున్నాం. వచ్చిన ప్రతిసారీ జెల్ లేదని చెబుతున్నారు. స్కానింగ్ చేయడం లేదు. గంటలకొద్ది కూర్చుండబెడుతున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చాం. పట్టించుకునే వారు లేరు. అధికారులు చర్యలు తీసుకోవాలి. – గర్భిణి బంధువు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం జెల్ తెప్పించాం. సిబ్బంది తక్కువగా ఉండటంతో కొంత ఇబ్బందిగా ఉంది. రేడియాలజిస్ట్ను త్వరలో నియమిస్తాం. గర్భిణుల కోసం మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. రెండుమూడు రోజులుగా సిబ్బంది లేకపోవడం.. జెల్ సరిపడా లేక ఇబ్బంది అయింది. – రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ -
సీపీఆర్పై అవగాహన తప్పనిసరి
జగిత్యాల: సీపీఆర్పై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. జగిత్యాల బస్టాండ్లో ప్రయాణికులకు సీపీఆర్పై అవగాహన కల్పించారు. సీపీఆర్ ఎలా చేయాలి..? కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఎలా కాపాడాలని తెలుసుకుంటే ఒకరి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. డిపో మేనేజర్ కల్పన, ఎంఎఫ్ కవిత, శ్రీనివాస్, రవీందర్ పాల్గొన్నారు. స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచాలి జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచాలని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో అన్నారు. అడ్వైజరీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించాలని సూచించారు. జిల్లాలో 80 స్కానింగ్ సెంటర్లున్నాయని, లింగ వివక్ష చూపరాదని పేర్కొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, అర్చన, స్వ చ్ఛంద సంస్థ సభ్యులు తౌటు రాంచంద్రం, హెల్త్ ఎడ్యుకేటర్స్ భూమేశ్వర్, కరుణ పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రిలో గర్భిణుల అవస్థలు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంక్షేమ కేంద్రానికి వందలాదిగా గర్భిణులు తరలివస్తుంటా రు. నెలలో సుమారు 300 నుంచి 400ప్రసవాలు ఇక్కడ జరుగుతాయి. జిల్లాకేంద్రం కావడంతో మెరుగైన వైద్యం అందుతుందన్న ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాలు, పొరుగు జిల్లాల నుంచి కూడా ఇక్కడకే వస్తుంటారు. కొద్దిరోజులుగా స్కానింగ్ కోసం వస్తున్న గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఓ రేడియాలజిస్ట్ను బదిలీ చేయ డం.. ఒక్కరే రేడియాలజిస్ట్ ఉండడంతో స్కానింగ్ కోసం గర్భిణులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతిరోజూ వందమందికి తగ్గకుండా గర్భిణులు వస్తుంటారు. వారంతా స్కా నింగ్ కోసం నిరీక్షించాల్సి వస్తోంది. వాస్తవానికి గర్భిణులకు విశ్రాంతి చాలా అవసరం. బస్సులు, ఆటోలో, ఇతరత్రా వాహనాల్లో వచ్చిన వారు స్కానింగ్ కోసం ఆస్పత్రిలో గంటలకొద్ది వేచి చూడాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం వస్తే సాయంత్రం వరకూ ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రేడియాలజిస్ట్ను నియమిస్తే సమస్య కొంత తీరే అవకాశం కనిపిస్తోంది. స్టాఫ్ను కూడా సరిపడా నియమించాలని అంటున్నారు. రేడియాలజిస్ట్ ఒక్కరే.. ఆస్పత్రిలో రేడియాలజిస్ట్ ఒక్కరే ఉండటంతో స్కా నింగ్కు ఇబ్బందిగా మారింది. ఒక గర్భిణీకి స్కాన్ చేయాలంటే గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. వంద మందికి పైగా వస్తే ఒకరోజు సరిపోదు. కొంతమంది అక్కడ ఉండలేక వెనుదిరగాల్సి వస్తోంది. జిల్లాకేంద్రానికి చెందిన వారు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉంటున్నారు. ఆస్పత్రిలో జెల్ కరువు స్కానింగ్కు ఉపయోగించే జెల్ కూడా ఆస్పత్రిలో లేదని సమాచారం. ఫలితంగా నాలుగు రోజులుగా స్కానింగ్లు నిలిపివేశారు. స్కానింగ్ చేసేటప్పుడు ఎక్కువగా జెల్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో గర్భిణులు ఆవేదనకు గురవుతున్నారు. గర్భిణులపై అక్కడ పనిచేస్తున్న సెక్యురిటీ గార్డులు కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని రేడియాలజిస్ట్ను నియమించాలని, జెల్ తెప్పించి స్కానింగ్లు చేయించేలా చర్యలు చేపట్టాలని గర్భిణులు కోరుతున్నారు. -
ఆరుగాలం.. దళారుల పరం
ఇబ్రహీంపట్నం: ఆరుగాలం శ్రమించి పండించిన సోయాబీన్ పంటను కొనేవారు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఈ వర్షకాలంలో 650 ఎకరాల్లో సోయాబిన్ సాగు చేశారు. వర్షాలు సంమృద్ధిగా పడడంతో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు ప్రక్రియ చేపట్టకపోవడంతో దళారులకు తెగనమ్ముకుంటున్నారు. సోయాబిన్ క్వింటాల్కు రూ.5,328 ఉండగా.. దళారులు రూ.4వేలు మాత్రమే చెల్లిస్తూ.. రైతులను నిండా ముంచుతున్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు విన్నవిస్తున్నా, ఇటీవల మెట్పల్లిలో ధర్నా చేసినా.. అధికారుల్లో చలనం లేదంటున్నారు రైతులు. ఓ వైపు మబ్బులు భయపెడుతున్నాయని, వర్షం కురిస్తే ఆరబెట్టిన సోయా తడిసే అవకాశముందని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. దళారులకు అమ్ముకుంటున్నాం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో చేతికందిన సోయాబిన్ను విధిలేక దళారులకు అమ్ముకుంటున్నాం. దళారులకు అమ్మడం ద్వారా క్వింటాల్కు రూ.వెయ్యి నష్టపోతున్నాం. – ఏలేటి ప్రతాప్రెడ్డి, రైతు, ఇబ్రహీంపట్నం కేంద్రాలు ప్రారంభించాలి నేను రెండెకరాల్లో సోయా వేశా. 20 క్వింటాళ్ల దిగుబడి వ చ్చింది. ప్రభుత్వం కొనకపోవడంతో దళారులు క్వింటా ల్కు రూ.4వేల చొప్పున పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కేంద్రాలు ప్రారంభించాలి. – ఇట్టెడి భీంరెడ్డి, రైతు, ఇబ్రహీంపట్నం -
ఇసుక తక్కువ ధరకు ఇచ్చేలా చూడండి
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్లో ఇసుకను తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్కుమార్కు మాజీమంత్రి జీవన్రెడ్డి వినతిపత్రం అందించారు. వినియోగదారులకు రూ.6500కు ట్రిప్ ఇసుక ఇస్తుండడం భారంగా మారిందన్నారు. అక్రమ రవాణా ద్వారా వచ్చే ఇసుక సాండ్ బజార్ ఇసుక కన్నా తక్కువని, దీంతో నెలలో రూ.8 లక్షలు మాత్రమే రెవెన్యూ వచ్చిందని తెలిపారు. చైర్మన్ చొరవ చూపి రేట్లు తగ్గించాలని కోరారు. పెన్షనర్ల బకాయిలు వచ్చేవరకు ఉద్యమంజగిత్యాల: ఉద్యోగ విరమణ పొందిన వారికి ప్రయోజనాలు వచ్చేవరకూ ఉద్యమం కొనసాగిస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి అన్నారు. కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి జీపీఎఫ్, జీఐఎస్, లీవ్స్, కమ్యుటేషన్, గ్రాట్యూటీ అందలేదన్నారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాంరెడ్డి, నరేందర్రావు, వెంకటరమణ, అహ్మద్, ప్రభు, కరుణశ్రీ, రాందాస్, వేణుగోపాల్, విమల, చంద్రమౌళి పాల్గొన్నారు. ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారిగా అశోక్జగిత్యాల: ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారిగా అశోక్ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న వెంకట్రెడ్డి హైదరాబాద్ అర్బన్ ఏడీగా వెళ్లారు. ఆయన స్థానంలో నిజామాబాద్లో ఏడీగా పనిచేస్తున్న అశోక్ను ఇన్చార్జిగా నియమించారు. -
మక్కల కొనుగోలుకు మార్క్ఫెడ్ సిద్ధం
జగిత్యాలఅగ్రికల్చర్: మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే మార్కెట్కు వస్తోంది. మొన్నటి వరకు క్వింటాల్కు రూ.3వేలు పలికిన ధర.. ప్రస్తుతం రూ.1800కు పడిపోయింది. ఈ క్రమంలో మద్దతు ధర రూ.2400 చొప్పున కొనాలని రైతులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనేందుకు సర్కారు నిర్ణయించింది. ఆదేశాలు రాగానే కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో 13 కేంద్రాల ఏర్పాటు మొక్కజొన్న పంట అధికంగా సాగయ్యే ధర్మపురి, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మెట్పల్లి, రాయికల్, బీర్పూర్, భీమారం, మేడిపల్లి మండల కేంద్రాల్లో 13 కేంద్రాలను ఏర్పాటు చేయన్నారు. 9.61లక్షల క్వింటాళ్లు అంచనా జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్నే అధికంగా సాగు చేస్తారు. సుమారు 32,061ఎకరాల్లో సాగు చేయగా.. ఎకరాకు 30క్వింటాళ్ల చొప్పున 9.61 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు చేసిన మక్కలను మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లిలోని గోదాముల్లో నిల్వ చేయనున్నారు. సుమారు నాలుగు లక్షల గన్నీ సంచులు తెప్పిస్తున్నారు. అందుబాటులో ఉండాలని హమాలీలకు సూచించారు. -
విద్యకు ప్రాధాన్యం
జగిత్యాల: విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులోభాగంగానే జిల్లా కేంద్రంలోని పురాణిపేట ఉన్నత పాఠశాలకు రూ.13.50 లక్షలతో సైన్స్ల్యాబ్ నిర్మించామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కా ర్పొరేట్ విద్య అందుతోందన్నారు. డీఈవో రాము మాట్లాడుతూ పాఠశాలల్లో సైన్స్ల్యాబ్లు ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందన్నారు. సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగభూషణం, ఏఈ ధనుంజయ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనందరావు, అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. డంపింగ్ యార్డుకు పెన్సింగ్ డంపింగ్యార్డుకు పెన్సింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బుధవారం అర్బన్ హౌసింగ్ కాలనీ అభివృద్ధి పనులు పరిశీలించారు. కాలనీలో చేపడుతున్న సీసీరోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. కమిషనర్ స్పందన, డీఈ మిలింద్, ఏఈ అనిల్ పాల్గొన్నారు. ముందుగా రిటైర్డ్ ఉద్యోగుల కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పోషకాహారంతోనే ఆరోగ్యం జగిత్యాలరూరల్: పోషకాహారంతోనే తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే అన్నారు. అంతర్గాంలో పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్నా రు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవా లన్నారు. సంక్షేమాధికారి నరేశ్, తహసీల్దార్ వరందన్, ఎంపీడీవో రమాదేవి, సీడీపీవో మమత, ఎంఈవో గంగాధర్ పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లికి చెందిన బెరిగేడి నర్సయ్యకు రూ.2.50 లక్షల విలువైన ఎల్వోసీ అందించారు. ఆర్నెళ్లకోసారి గాలికుంటు నివారణ టీకాలు జగిత్యాలఅగ్రికల్చర్: పశువులకు ప్రతి ఆర్నెళ్లకోసారి ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలను పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతర్గాంలో పశువులకు టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పశువైద్యాధికారి ప్రకాష్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 69 బృందాలు టీకాలు వేస్తున్నాయన్నారు. పశువైద్య సహాయ సంచాలకులు నరేశ్, పశువైద్యులు నరేశ్ రెడ్డి, వేణుగోపాల్, కిరణ్రెడ్డి, బద్దం రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
‘ఎత్తిపోతల’కు మరమ్మతు చేయండి
సారంగాపూర్: ఎత్తిపోతల పథకాలకు మరమ్మతు చేసి పంటలకు సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జీవన్రెడ్డి అధికారులకు సూచించారు. బీర్పూర్ మండలం చిన్నకొల్వాయి శివారులోని ఎత్తిపోతల పథకాలను రైతులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఇటీవల వర్షాలకు గోదావరి ఉప్పొంగి మోటార్లలోకి ఇసుక చేరి పనిచేయడం లేదని, దీనిపై ఇటీవల నీటిపారుదల శాఖ ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో చిన్నకొల్వాయి ఎత్తిపోతల కింద కొల్వాయి, ఆరెపల్లిలో 1300 ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. రెండు మోటర్లు పనిచేసినా సాగునీరు అందుతుందని సీఈ సుధాకర్రెడ్డికి ఫోన్ చేశారు. రోళ్లవాగు ప్రాజెక్టు మూడు తూములకు రెండు నెలల్లో గేట్లు బిగించనున్నట్లు తెలిపారు. సింగిల్విండో చైర్మన్ పొల్సాని నవీన్రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, ఎత్తిపోతల పథకం చైర్మన్ రంగు లక్ష్మణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెర్పూరి సుభాష్ పాల్గొన్నారు. -
జిల్లాలో ‘జువైనల్ జస్టిస్’
జగిత్యాలజోన్: ఇటీవల బాలనేరాలు పెరిగిపోతున్నాయి. నేరాలకు పాల్పడిన చిన్నారులపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నారు. కోర్టులు వారిని జువైనల్ హోంకు తరలించి విచారణ చేపడుతున్నాయి. వారి జీవితం చీకటిమయం కాకుండా.. సమాజంలో ఉన్నతులుగా ఎదిగేందుకు అవసరమైన సహాయాన్ని జువైనల్ జస్టిస్ బోర్డులు అందిస్తున్నాయి. బాల నేరస్తుల్లో సత్ప్రవర్తన తెచ్చేలా.. కేసులు సకాలంలో విచారించేలా పిల్లల సంరక్షణ, రక్షణ చట్టం–2015 ప్రకారం ప్రతి జిల్లాలో జువైనల్ జస్టిస్ బోర్డులు (జువైనల్ కోర్టులు) ఏర్పాటు అవుతున్నాయి. జిల్లా కేంద్రానికి జువైనల్ జస్టిస్ బోర్డు మంజూరు కాగా.. బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి ప్రారంభించనున్నారు. జువైనల్ జస్టిస్ బోర్డులోనే విచారణ 18 ఏళ్ల లోపు ఉండి.. నేరాలకు పాల్పడిన బాల నే రస్థుల కేసులను జువైనల్ జస్టిస్ బోర్డు(కోర్టు)లో నే విచారిస్తాయి. ఈ కోర్టును జిల్లా కేంద్రంలోనే ప్ర త్యేక భవనంలో ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డుకు చైర్పర్సన్గా జిల్లా మొదటి అదనపు జ్యూడిషి యల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా సామాజిక సేవకురాలు శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేశ్ ఉంటారు. వారంలో ఒక్కటి రెండు రోజులు మేజిస్ట్రేట్ నేరుగా జువైనల్ జస్టిస్ బోర్డుకు వెళ్లి, బాల నేరస్తుల కేసులను విచారిస్తారు. ఆరోపణలు ఎదుర్కోంటున్న బాల నేరస్థులకు అదే భవనంలో వసతి కల్పిస్తారు. ఇప్పటివరకు కరీంనగర్లో.. ఇప్పటివరకు జువైనల్ కోర్టు కరీంనగర్లో ఉంది. తాజాగా జగిత్యాలలోని బైపాస్రోడ్డులో ప్రత్యేక భవనంలో ఏర్పాటుచేశారు. కోర్టు ఏర్పాటుతో 166 కేసులు కరీంనగర్ నుంచి జగిత్యాలకు బదిలీ అయ్యాయి. ఇంకా వందవరకు కేసులు రానున్నాయి. జువైనల్ జస్టిస్ బోర్డులు బాల నేరస్తుల్లో సత్ప్రవర్తను తెచ్చేందుకు పెద్దపీట వేస్తాయి. బాల నేరస్తులు ఒకేచోట ఉండడం ద్వారా వారు మంచి నడవడికతో ఉండేందుకు.. పోషకాలతో కూడిన ఆహారం అందించేందుకు, విద్యా, వైద్య సౌకర్యాలు అందించేందుకు, ఉపాధి అవకాశాలు పెంపొదించేందుకు బోర్డులు ప్రయత్నిస్తాయి. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి శిక్ష వేస్తే వారికి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు చూపిస్తారు. -
డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు
ఇదేనా చి(చె)త్తశుద్ధిజగిత్యాల: జిల్లా కేంద్రంలో జంక్షన్లతోపాటు, డివైడర్లలో పిచ్చిమొక్కలు ఏపుగా మారి కళావిహీనంగా మారడంతో ‘పట్టణం కళావిహీనం’ శీర్షికన ఈనెల 14న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. జగిత్యాల నుంచి కరీంనగర్, నిజామాబాద్కు వెళ్లే రహదారి డివైడర్ల మధ్య ఏపుగా పెరిగిన కానోకార్పస్ మొక్కలను తొలగించారు. దీంతో పట్టణ ప్రజలు, స్థానికులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించండిజగిత్యాల: బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. విద్యార్థుల ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. కలెక్టర్, వి ద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పాఠశాలల యజమాన్యాలతో చర్చించి విద్యార్థుల కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. చ ర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్కుమార్, కిశోర్ పాల్గొన్నారు. మెట్పల్లి: పారిశుధ్యం విషయంలో మెట్పల్లి బల్దియా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. వారి పనితీరుకు ఈ చిత్రాలే నిదర్శనంగా నిలుస్తాయి. 12వార్డులోగల ఓ వీధిలో ఉన్న డ్రైనేజీలు వ్యర్థాలతో నిండిపోయాయి. నెలల తరబడి పూడికతీయకపోవడంతో ఇదిగో ఇలా నిండి దుర్గంధం వెదజల్లుతోంది. సమస్య పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీగొల్లపల్లి: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుమేరకు ఆ పార్టీ నాయకులు మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు గోస్కుల జలేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మరిచి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘గాలికుంటు’ నివారణకు స్పెషల్ డ్రైవ్
మెట్పల్లిరూరల్: పశువుల్లో సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. సకాలంలో వ్యాధి లక్షణాలు గుర్తించకుంటే పశువులు.. వాటి పాలు తాగిన దూడలు మృత్యువాతపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా గాలికుంటు నివారణ టీకాలు వేస్తోంది. ఎప్పటిలాగే ఈ సారి బుధవారం నుంచి నవంబర్ 14వరకు పశువైద్య, సంవర్థక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేయనున్నారు. దూడలు, ఆవులు, గేదేలకు టీకాలు వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా టీకాలు జిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు, 31 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 45 ఉప పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,17,734 పశువులు ఉన్నాయి. వీటన్నింటికీ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసేలా జిల్లా పశువైద్య, సంవర్థక శాఖ సిద్ధమైంది. నిర్ణయించిన తేదీల్లో ఆయా గ్రామాలకు వెళ్లి టీకాలు, టీకా వేసిన పశువులకు ట్యాగ్ వేయనున్నారు. వ్యాధి లక్షణాలు గాలికుంటు అంటూ వ్యాధి. ఇది మార్చి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వ్యాపిస్తుంది. దేశవాళి పశువులతో పోల్చితే సంకరజాతి పశువుల్లో అధికం. వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరం వచ్చి నీరసించిపోతాయి. నోరు, గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. పొక్కులు పుండ్లుగా మారతాయి. నొప్పితో పశువులు మేత, నీరు తీసుకోవు. నోటి నుంచి చొంగ కారుతుంది. పాల దిగుబడి తగ్గిపోతుంది. నివారణ చర్యలతోనే రక్షణ గాలికుంటు వ్యాధి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని పశువైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి సోకిన పశువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. పశువులను వేరుగా ఉంచాలి. ఆర్నెళ్లకోసారి తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. దూడలు, ఆవులు, గేదెలకు ఈ టీకాలు వేయించి వ్యాధుల నుంచి రక్షించుకోవాలి. ఉచితంగానే వేస్తున్న టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – కొమ్మెర మనీషాపటేల్, మెట్పల్లి పశువైద్యాధికారి -
పనులు నాణ్యతతో చేపట్టాలి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మున్సిపల్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. టీయూఎఫ్ఐడీసీ జనరల్ ఫండ్తో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులు వర్షాలతో నిలిచిపోయాయని, వెంటనే రంభించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డీఈ ఆనంద్, ఏఈలు వరుణ్, చరణ్ పాల్గొన్నారు. రాయికల్: మండలంలోని కుమ్మరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్రాజ్ రాష్ట్రస్థాయి సెమినార్ పోటీలకు ఎంపికై నట్లు ఎంఈవో రాఘవులు తెలిపారు. ఈనెల 17న హైదరాబాద్లో నిర్వహించే సెమినార్లో ఆయన పాల్గొననున్నారు. విద్యార్థుల్లో ఉత్తమ ప్రవర్తన, మార్పులు పెంపొందించడం అనే అంశంపై ఒత్తిడి నుంచి విజయం వైపు, సమస్యల నుంచి పరిష్కారంవైపు అభయ్రాజ్ రూపొందించిన పరిశోధనపత్రాలు ఈ సెమినార్లో ప్రదర్శించనున్నారు. అభయ్రాజ్ను డీఈవో రాము, సెక్టోరియల్ అధికారులు సత్యనారాయణ, రాజేశ్, మహేశ్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పొన్నం రమేశ్, కుంబాల శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, మండల అధ్యక్షుడు గంగరాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్యలు అభినందించారు. ఇబ్రహీంపట్నం: విద్యార్థినులు చదువుతోపాటు కుట్టు శిక్షణ నేర్చుకోవాలని డీఈవో రాము అన్నారు. మండలంలోని వర్షకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓకేషనల్ కోర్సుల్లో భాగంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఐదు కుట్టు మిషన్లు అందించింది. వాటిపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు శిక్షకురాలిని నియమించామని డీఈవో తెలిపారు. పది పరీక్షలకు పకడ్బందీగా సన్నద్ధం కావాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి రాజేశ్, ఎంఈవో మధు, ప్రధానోపాధ్యాయులు రాజేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జగిత్యాల: సోషల్ మీడియా, సెల్ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని, బాలికలు సంస్కారంతో కూడిన చదువు నేర్చుకోవడం ద్వారా ఉన్నత విలువలు వస్తాయని, తద్వారా ఉన్నతస్థానాలు చేరవచ్చని జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భవానినగర్లో గల గురుకుల పాఠశాలలో మహిళ సాధికారత అంశంపై అవగాహన కల్పించారు. మంచిని గ్రహించి క్రమశిక్షణతో చదువు నేర్చుకోవాలని అన్నారు. సైకాలజిస్ట్ గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థులు ఒత్తిడికి లోను కావద్దన్నారు. అనంతరం విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో సీడీపీవో మమత, ప్రిన్సిపాల్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ జల, విజయలక్ష్మీ, శ్రీనివాస్, పవిత్ర, రాజశ్రీ, అశ్విని, స్వప్న పాల్గొన్నారు. కోరుట్ల: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కంప్యూటర్ లిటరసిపై అవహన కలిగేలా ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వాలని డీఈవో రాము అన్నారు. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుల డిజిటల్ లిటరిసీపై మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని మంగళవారం సందర్శించారు. విద్యార్థులు కోడింగ్, ఆర్టీఫిషియల్ ఇంటలెజెన్స్పై పట్టు సాధించేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. -
జగిత్యాల బల్దియాపై ‘విజిలెన్స్’
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ అవినీతి మయంగా మారింది. ప్రతిపనికి ఓ రేటు నిర్ణయిస్తున్న బల్దియా సిబ్బంది అందినకాడికీ దోచుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో గతంలో కొందరు సిబ్బంది విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు అధికారులు ఆగస్టులో సుమారు 18 మంది విజిలెన్స్ అధికారుల బృందం జగిత్యాలకు చేరుకుని బల్దియాలోని ప్రతి విభాగాన్ని పరిశీలించారు. ఆయా విభాగాల రికార్డులను తీసుకెళ్లారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. అవి నీతిలో ప్రమేయముందని భావించి.. కొన్నివిభాగా ల సిబ్బందికి రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కా ర్యాలయంలో హాజరుకావాలని సోమవారం మె మో జారీ చేసినట్లు సమాచారం. వారంతా మంగళవారం విచారణకు హాజరైనట్లు తెల్సింది. ఆయా విభాగాల ఉద్యోగులను విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు మరిన్ని రికార్డులు తీసుకురావాలని చె బుతూ కరీంనగర్లోని కార్యాలయానికి రమ్మన్నట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో వణుకు పుడుతోంది. అన్ని విభాగాల్లోనూ అంతే.. బల్దియాలో అవినీతి ఆరోపణలు రావడం కొత్తేమీకాదు. టౌన్ప్లానింగ్ విభాగంలో పర్మిషన్లు, శానిటేషన్ విభాగంలో ట్రేడ్లైసెన్స్లు, డీజిల్ కొనుగోలుకు సంబంధించి అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంజినీరింగ్ సెక్షన్లో వాటర్ చార్జీలు, టెండర్లకు సంబంధించి, రెవెన్యూ విభాగంలో అసెస్మెంట్ కాపీలు, ముటేషన్లలో అవకతవకలు జరుగుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు ఆరోపణలు వచ్చినా సిబ్బందిలో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. వీటిని భరించలేని కొందరు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గతంలోనే విచారణ చేపట్టారు. నాటి ఫిర్యాదులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలోనే నిర్మించిన ప్రతి భవనాలను పరిశీలించారు. ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉందంటే.. గతంలో టౌన్ప్లానింగ్ విభాగంలో ఒకరు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడినంతగా.. ఆర్వో విభాగంలో ఓ భూకబ్జా యత్నంలో ఏకంగా మున్సిపల్ కమిషనరే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా విజిలెన్స్ అధికారులు అవినీతి ఆరోపణలకు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలిస్తుండడంతో అక్రమార్కుల్లో వణుకుపుడుతోంది. నామమాత్రపు చర్యలు బల్దియాలో అధికారులపై నేరుగా ఆరోపణలు వస్తున్నా నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నట్లు అపవాదు ఉంది. ఇటీవల ఓ బిల్కలెక్టర్ ఏకంగా ఆస్తిపన్ను డబ్బులను సొంతానికి వాడుకోగా సస్పెండ్ చేశారు. అలాగే కొన్ని కీలక శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
అల్ఫోర్స్కు ‘సీబీఎస్ఈ’ అవార్డు
కొత్తపల్లి(కరీంనగర్): విద్య, క్రీడారంగాల్లో అవలంబిస్తున్న విధి విధానాలకు గాను అల్ఫోర్స్ హైస్కూల్కు అత్యుత్తమ సీబీఎస్ఈ పాఠశాల అవార్డు లభించింది. హైదరాబాద్లో గ్లోబల్ ట్రెండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా కంక్లేవ్ సమావేశంలో ఈ అవార్డును అల్ఫోర్స్ విద్యా సంస్థ ల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి అందుకున్నారు. వి ద్యారంగంలో అల్ఫోర్స్ విద్యా సంస్థలు చేస్తున్న కృషికి ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని వీఎన్ఆర్ తెలిపారు. నాణ్యమైన విద్య అందిస్తూ, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడమే కాకుండా ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ,, ఎయిమ్స్, మెడికల్ కళాశాలలు, సీఏ పరీక్షల ఫలితాల్లో సీట్లు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అవార్డు అందుకోవడంపై యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నేతలు, యువజన, క్రీడా సంఘం ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తంచేస్తూ నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. -
సర్వేల ఆధారంగానే రన్వే
రామగుండం: ఆరంచెల విధానంలో వచ్చే నివేదికల ఆధారంగానే అంతర్గాంలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ లభించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో చేపట్టిన ప్రీఫిజిబిలిటీ నివేదిక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40.53 లక్షలు మంజూరు చేయడం ద్వారా ఎయిర్పోర్టు ఏర్పాటుకు తొలిఅడుగు పడినట్లు ఆశలు రేకెత్తుతున్నాయి. వివిధ విభాగాల అత్యున్నతస్థాయి నిపుణులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో ఆరుదశల్లో సర్వే చేపడతారని, తుది నివేదికను ఎయిర్ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి అందజేస్తారని అధికారులు చెబుతున్నారు. రూపొందించనున్నారు. ఆరు దశల్లో.. విమానాశ్రయం ఏర్పాటు జాతీయ భద్రత, పర్యావరణం, రవాణా, ఆర్థిక, ప్రజావసరాలతో ముడిపడి ఉందని అంటున్నారు. తొలిదశలో ప్రయాణికుల డిమాండ్, వాణిజ్య అవసరాలు, రవాణా సౌకర్యాలపై ఆయా విభాగాల ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తారు. మలిదశలో స్థలం ఎంపికపై భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, ఎత్తు, ప్రధాన పట్టణాలకుదూరం, రోడ్లు, రైలు కనెక్టివిటీ పరిశీలిస్తారు. మూడోదశలో భూమి ఎత్తుపల్లాలు, పర్వతాలు, లోయలు, నదులు, రోడ్లు, సరస్సుపై పరిశోధన చేస్తారు. నాలుగో దశలో పర్యావరణ ప్రభావంపై అధ్యయం చేస్తారు. ఐదోదశలో నిర్వాసితులకు పునరావాసం, ఉపాధి కల్పన, వ్యాపార, ప్రాంతీయ అభివృద్ధి ప్రభావంపై సర్వే చేస్తారు. ఆరోదశలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టర్ జనరల్ ఏవియేషన్ అథారిటీ, ఏఏఐ, కేంద్ర, రాష్ట్ర క్యాబినెట్ అత్యున్నత ప్రతినిధులతో డీపీఆర్ తయారీ, ఆర్థిక అంచనా, బడ్జెట్ ఆమోదం, నిర్మాణానికి తుది అనుమతులు, టెండర్ల విడుదల ద్వారా విమానాశ్రయానికి రన్వే సిద్ధమైనట్లు ప్రకటిస్తారు. అంతర్గాంలో విమానాశ్రయంపై నివేదిక అన్నీబాగుంటేనే అడుగుముందుకు ప్రారంభమైన వివిధ శాఖల సర్వే పక్కాగా ఆరంచెల విధానం అమలు -
తాళంవేసిన నాలుగిళ్లలో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్ర దాటాక దొంగలు తాళం వేసిన నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంటి నుంచి ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన వెన్నం శ్రీనివాస్ దుబాయ్లో ఉంటున్నాడు. ఆయన భార్య ఇంటికి తాళంవేసి ఊరు వెళ్లింది. ఆ ఇంట్లో నుంచి సుమారుడు మూడు తులాల బంగారం, 41 తులాల వెండి ఎత్తుకెళ్లారు. షేక్ షబానా ఇంట్లో నుంచి మూడున్నర తులాల బంగారం, 12 తులాల వెండి, రూ.50 వేలు, ద్యాగల నరేశ్ ఇంటి నుంచి రూ.1.70 లక్షలు, మూడు గారు గొలుసులు, మంథని కవిత ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు. గుమ్ముల రాజేశం ఇంట్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. సోమవారం ఉదయం 2.30 గంటల నుంచి 3 గంటల సమయంలో దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బంగారం, నగదు, బైక్ ఎత్తుకెళ్లిన దొంగలు -
బంగారం కోసమే విష ప్రయోగం
కరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో వృద్ధ దంపతులపై విషప్రయోగం మిస్టరీ వీడింది. ఈ ఘటనలో వృద్ధుడు చనిపోగా.. వృద్ధురాలు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తెలిసిన వ్యక్తే బంగారం కోసం మత్తు మాత్రలు ఇవ్వగా.. నిందితుడిని గంగాధర పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ గౌస్ ఆలం సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో వెల్లడించారు. గర్శకుర్తి గ్రామానికి చెందిన గజ్జెల శంకరయ్య– లక్ష్మీ దంపతులు ఇంట్లో ఇద్దరే ఉంటారు. వారి ఇంటికి సమీపంలో ఉండే కత్తి శివ(37) వృద్దులకు చేదోడుగా ఉంటూ మందులు తేవడం, ఇతర పనులు చేస్తుండేవాడు. శివకు పేకాట, ఆన్లైన్ గేమ్స్ ఆడడంతో అప్పులయ్యాయి. అప్పు తీర్చేందుకు దంపతుల వద్ద బంగారం కాజేయాలని నిర్ణయించాడు. గతంలో ముంబైలో కల్లుడిపోలో పనిచేసిన సమయంలో అందులో వాడే మత్తు టాబ్లెట్లు వెంట తెచ్చుకున్నాడు. ఈ నెల 7వ తేదీన వృద్ధులకు అనారోగ్యం ఉండడంతో మత్తు టాబ్లెట్లు ఇచ్చాడు. అవి వేసుకుంటే జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు తగ్గుతాయని నమ్మించాడు. మాత్రలు వేసుకుని సొమ్మసిల్లిన రెండు గంటల తర్వాత ఇంట్లోకి వెళ్లి లక్ష్మి మెడలోని బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడు. అదే గ్రామంలోని కట్ల శ్రీనివాసాచారికి విక్రయించి, రూ.1.85 లక్షలు తీసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న గంగాధర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివపై ఆనుమానంతో అతని కదలికలపై నిఘా పెంచారు. సోమవారం గర్శకుర్తి శివారులో అదుపులోకి తీసుకున్నారు. తానే వృద్ధులకు మత్తుమాత్రలు ఇచ్చి, బంగారం చోరీ చేశానని ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.25వేల నగదు, 11మత్తు మాత్రలు, సెల్ఫోన్, కట్ల శ్రీనివాసాచారి నుంచి పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, హెడ్కానిస్టేబుల్ చారి, కానిస్టేబుళ్లు జంపన్న, అరవింద్ను సీపీ అభినందించి రివార్డు అందించారు. వీడిన గర్శకుర్తి వృద్ధ దంపతుల మిస్టరీ మత్తు మాత్రలు ఇచ్చిన తెలిసిన వ్యక్తి ఆపై బంగారం అపహరణ కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం -
ఆర్థిక నేరగాళ్ల ఆస్తులు జప్తు చేయాలి
జగిత్యాలటౌన్: క్రిప్టో కరెన్సీ మోసాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. అధిక లాభాలు, విదేశీ టూర్ల ఆశతో బిట్కాయిన్, మెటాఫండ్ వంటి యాప్ల ద్వారా ప్రజల నుంచి పెట్టుబడి పెట్టిస్తూ.. క్షణాల వ్యవధిలో ఆ యాప్లను తొలగిస్తూ మోసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడారు. ఆర్బీఐ అనుమతి లేకుండా సాగుతున్న ఆన్లైన్ ఆర్థిక కార్యకలాపాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని నకిలీ యాప్లు, వెబ్సైట్లలో పెట్టుబడి అరికట్టేలా చూడాలని కోరారు. నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, మసర్తి రమేశ్, కల్లెపెల్లి దుర్గయ్య, మహ్మద్భారీ, మన్సూర్, చాంద్పాషా, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
భీమన్న సన్నిధి.. భక్తుల సందడి
● బాలాలయంలో రాజన్న దర్శనాలు ● కోడెమొక్కుల చెల్లింపులు ● సౌకర్యాలపై భక్తుల సంతృప్తి ● రాజన్న ఆలయం అభివృద్ధిపై హర్షం వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో భీమన్న ఆలయంలో దర్శనం, కోడెమొక్కులకు కల్పించిన సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలాలయంలో దర్శనాలకు ఏర్పాట్లు బాగున్నాయని.. కోడెమొక్కులు సైతం ఇక్కడే చెల్లించుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 11న స్వామి వారి ఉత్సవమూర్తులను భీమన్నగుడిలోని బాలాలయంలో ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇక్కడే దర్శనాలు, కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయడాన్ని స్వాగతిస్తున్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. అదే సమయంలో భీమన్నగుడిలో చేసిన ఏర్పాట్లపై సంతృప్తిగా ఉందన్నారు. భీమన్నగుడిలో దర్శనాలు పూర్తి చేసుకున్న భక్తులు ‘సాక్షి’తో మాట్లాడారు. వారి మాటల్లోనే.. రాజన్న గుడిని విస్తరిస్తున్న క్రమంలో భీమన్నగుడిలో దర్శనాలు ఏర్పాటు చేయడం బాగుంది. ఇక్కడే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాం. భీమన్నగుడిలోనూ సౌకర్యాలు బాగా కల్పించారు. ఎన్నో ఏండ్లకు వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి జరుగుతోందంటే సంతోషంగా ఉంది. – కాటం సత్యం, లక్ష్మి, సెంటినరీకాలనీ రాజన్న గుడి విస్తరణ పనుల్లో భాగంగా భీమన్నగుడిలో దర్శనాలకు మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. అందరూ అధికారులకు సహకరిస్తే భవిష్యత్లో రాజన్న ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా తయారవుతుంది. – మహిపాల్రెడ్డి, కొత్తగూడెం, జనగామ జిల్లా రాజన్న దర్శనానికి వస్తే భీమన్న గుడిలో దర్శనం చేసుకోవాలన్నారు. భీమన్నగుడికి వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సాగాయి. రాజన్న ఆలయ విస్తరణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. – మహేశ్వర్, ముణ్యాల్, నిర్మల్ -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.08కోట్లు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షకులు రాజమౌళి సమక్షంలో ఆలయ ఈఓ శ్రీకాంత్రావు ఆధ్వర్యంలో శ్రీవేంకట అన్నమాచార్య సేవా ట్రస్టు సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. 81రోజులకుగాను 12 హుండీలను లెక్కించగా.. రూ.1,08,72,591తోపాటు 55 విదేశీ కరెన్సీ సమకూరింది. మిశ్రమ వెండి, బంగారం తిరిగి బ్యాగుల్లో వేసి, సీల్ చేసి, హుండీలో భద్రపరిచారు. లెక్కింపులో దేశిని సునీల్కుమార్, నీల చంద్రశేఖర్, గుండి హరిహరనాథ్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఏఎస్సై రమణారెడ్డి పాల్గొన్నారు. -
లోక కల్యాణ్ మేళా
జగిత్యాల: పీఎం స్వనిధి స్థానంలో లోక కల్యాణ్ పేరిట కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మొదట సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు వీధివ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. కొత్తగా వీధి వ్యాపారాలు చేసుకునే వారికి సైతం అవకాశం కల్పించారు. గతంలో రుణాలు తీసుకున్న వారితో పాటు, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టుకునే వారికి సైతం అవకాశం ఇస్తున్నారు. చాలా మంది కొత్తగా వీధివ్యాపారం చేసుకునే వారికి అవగాహన లేక ఈనెల 15 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపాలిటీల పరిధిలో.. మున్సిపాలిటీల్లో ఫుట్పాత్లపై చిరువ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మ నిర్భార్ నిధి (పీఎం స్వనిధి) పథకం ప్రవేశపెట్టింది. తొలి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేలు అందించి, నాల్గో విడతకు వచ్చేసరికి ఈ పథకాన్ని ఆపేశారు. దీంతో ఇక రుణాలు వస్తాయో లేదోనన్న ఆందోళన చిరువ్యాపారుల్లో మొదలైంది. తాజాగా వీధివ్యాపారాలకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వనిధి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. లోక్ కల్యాణ్ మేళా.. 9 నెలల పాటు పీఎం స్వనిధి పథకం నిలిచిపోగా, ప్రస్తుతం లోక్ కల్యాణ్ మేళా పేరిట రుణాలు అందించనున్నారు. ఈనెల 15 వరకు దరఖాస్తుకు గడువు పెంచారు. ఇప్పటికే ఉన్నతాధికారులు మెప్మా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈసారి శిబిరాలు ఏర్పాటు చేసి పాతవారితో పాటు, కొత్తవారికి సైతం రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మొదటి విడతలో రూ.10 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.15 వేలకు పెంచారు. ఎవరైతే సక్రమంగా చెల్లిస్తారో వారికి రూ.20 వేలు ఇవ్వనున్నారు. గతంలో రుణం తీసుకుని సక్రమంగా చెల్లించిన వారుంటే వారికి రూ.50 వేలు అందిస్తారు. క్రెడిట్కార్డులు కూడా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది. రూ.లక్ష లిమిట్తో క్రెడిట్కార్డు వాడుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిజిటల్ ప్రోత్సాహం చిరువ్యాపారులకు డిజిటల్ ప్రోత్సాహం అందించా లనే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్స్ అందించారు. ప్రస్తు తం ప్రతీ చిరువ్యాపారి డిజిటల్ ద్వారానే లావాదేవీ లు నిర్వహిస్తున్నారు. కొత్త రుణాలు తీసుకునే వారి కి త్వరితగతిన ప్రాసెసింగ్ చేయనున్నారు. లబ్ధిదా రులు పీఎం స్వనిధి మొబైల్యాప్ ఇన్స్టాలేషన్తో పాటు, క్యూఆర్ కోడ్ పొందవచ్చు. మున్సిపల్ అఽ దికారులు అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి లోక్ కల్యాణ్ మేళా గడువు ఈనెల 15 వరకు ఉంది. కొత్త, పాత వీధివ్యాపారులకు మంచి అవకాశం. రుణాలు తీసుకుని లబ్ధి పొందాలి. ప్రతీ మున్సిపాలిటీలో కార్యక్రమం చేపడతాం. విడతల వారీగా రుణం చెల్లిస్తే మళ్లీ అత్యధిక రుణాలు పొందే వీలుంటుంది. – రాజాగౌడ్, అడిషనల్ కలెక్టర్ పాత వీధివ్యాపారులు ఇలా.. బల్దియా వ్యాపారులు లక్ష్యం దరఖాస్తు రుణం మంజూరు ఇచ్చిన రుణాలు జగిత్యాల 6,005 780 540 483 473 కోరుట్ల 4,081 539 210 154 145 మెట్పల్లి 3,548 384 239 206 204 రాయికల్ 815 208 121 114 112 ధర్మపురి 858 199 150 107 102 -
నీటిలో మునిగి వ్యక్తి మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): మానేరువాగులో స్నానం చేసి బయటకు వస్తుండగా ఫిట్స్ వచ్చి నీటిలోనే వ్యక్తి చనిపోయిన సంఘటన పొత్తూరులో విషాదం నింపింది. మండలంలోని పొ త్తూరుకు చెందిన బండారి వెంకటయ్య(48) కొంతకాలంగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం హమాలీ పనులు ముగించుకున్న తర్వాత గ్రామ పొలిమేరలోని మానేరువాగులో స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తుండగానే వెంకటయ్యకు ఫిట్స్ వచ్చి నీటిలోనే పడి మృతిచెందాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మానేరువాగు వైపునకు వెళ్లిన గ్రామస్తులు వెంకటయ్య మృతదేహం చూసి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్సై జి.లక్పతి తెలిపారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు. ● ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం కోరుట్ల రూరల్: మండలంలోని వెంకటాపూర్, మోహన్రావుపేట గ్రామాల మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొని పట్టణానికి చెందిన మారుపాక వినోద్ (28) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం వినోద్ వ్యవసాయ బోర్లు మరమ్మతు చేస్తుంటాడు. సోమవారం సాయంత్రం కోరుట్ల నుంచి మోహన్రావుపేట వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతోతల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వినోద్కు భార్య, ఏడాది కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలిమెట్పల్లి రూరల్: పంటల సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు. మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్లో కరీంనగర్లోని రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ ప్రదర్శన, పంటల్లో యాజమాన్య పద్ధతులపై సోమవారం రైతు సదస్సు నిర్వహించారు. ఆధునిక కేతిక విధానాలను రైతులు అందుకోవాలన్నారు. ఎరువులు మోతాదులో వాడాలని, పంట అవశేషాలను తగలబెట్టకూడదని, మెలకువలు పాటించి అధిక దిగుబడి పొందాలని పేర్కొన్నారు. రైతు విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ హరికృష్ణ, శాస్త్రవేత్తలు మదన్మోహన్రెడ్డి, రాజేంద్రప్రసాద్, రాంప్రసాద్, ఉమారాణి, భారతీనారాయణ భట్, అరుణ్బాబు, డీఏవో భాస్కర్, ఏవో దీపిక, ఏఈవో అనిల్ పాల్గొన్నారు. విద్యార్థుల్లో సాంకేతికత అలవర్చాలిజగిత్యాల: విద్యార్థుల్లో సాంకేతికత అలవర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ లిటరసి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు క్షుణ్ణంగా తెలుసుకుని వారికి వివరించాలని డీఈవో రాము అన్నారు. భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు డిజిటల్ లిటరసిపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి సోమవారం హాజరయ్యారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే కోడింగ్, ప్రోగ్రామింగ్లో ప్రాథమిక అభ్యాసంతో నైపుణ్యం అలవర్చేలా చూడాలన్నారు. కో–ఆర్డినేటర్ రాజేశ్, ఈశా స్కూల్ ఆఫ్ నాలెడ్జ్ చైర్మన్ కంది కై లాసం పాల్గొన్నారు. హుజూరాబాద్రూరల్: మండలంలోని వెంకట్రావ్పల్లెలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోతిరెడ్డిపేటకు చెందిన గీత కార్మికుడు చింత సమ్మయ్య (46) బైక్పై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సమ్మయ్య తలకు తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన వాహనదారుడు మెట్పల్లి గ్రానై ట్ క్వారీలో పనిచేసే వ్యక్తిగా భావిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులున్నారు. -
ఎస్పీ పైలట్ వాహనంలో ఆస్పత్రికి..
● ప్రమాదాన్ని గమనించి ఆగిన ఎస్పీ ● తన వాహనంలో ఆస్పత్రికి తరలింపు సిరిసిల్లక్రైం: సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదవశాత్తు గాయపడ్డ వ్యక్తిని ఎస్పీ మహేశ్ బీ గీతే తన పైలట్ వాహనంలో ఆస్పత్రికి పంపించారు. సోమవారం బైపాస్రోడ్డుపై వెళ్తున్న ఎస్పీకి ప్రమాదంలో గాయపడ్డ అశోక్నగర్కు చెందిన రఫీక్పాషా కనిపించారు. వెంటనే తన వాహనాన్ని నిలిపి క్షతగాత్రులను తన వాహనంలో సిరిసిల్లలోని ఆస్పత్రికి తరలింపజేశారు. భవనం పైనుంచి తోయడంతో ఒకరు మృతిచిగురుమామిడి: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ శివారులోని బ్రీడింగ్ అండ్ హెచరీస్ ప్రైవేటు కంపెనీలో పేయింటింగ్ పనిచేస్తున్న దాసో సోరెన్ (32)ను తోటి పేయింటర్ భవనం పైనుంచి తోయడంతో కిందపడి చనిపోయాడు. చిగురుమామిడి ఇన్చార్జి ఎస్సై స్వాతి వివరాల ప్రకారం.. సోరేన్ను 15 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి కాంట్రాక్టర్ ఎస్కే.అర్షద్ పేయింటింగ్ వేసేందుకు తీసుకొచ్చాడు. ఇతనితో పాటు ముస్లింఖాన్ కూడా వచ్చాడు. ఆదివారం రాత్రి ఇరువురు డబ్బుల విషయంలో గొడవపడ్డారు. మాటమాట పెరిగి ముస్లింఖాన్ సోరెన్ను భవనం పైనుంచి కిందకు తోసేశాడు. తీవ్రంగా గాయపడిన సోరెన్ను 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే చనిపోయాడు. అర్షద్ ఫిర్యాదుతో తిమ్మాపూర్ సీఐ సదన్కుమార్ సోమవారం శవపంచనామా నిర్వహించి, కేసు నమోదు చేశారు. -
నా వాటా భూమి ఇప్పించండి
నా పేరు కోటె లాస్య. మాది కోరుట్ల మండలం మోహన్రావుపేట. భూ తగాదాలతో మా మామ, మరిది, మరో ఆరుగురు కలిసి నా భర్త కోటె రాజేశ్ను ఏడాది క్రితం హత్యచేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన నాపైనా దాడి చేశారు. నా చేయి విరిగిపోయింది. అప్పటినుంచి నా భర్తకు రావాల్సిన భూమి వాటాను మరిది రాకేశ్ ఆక్రమించి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు. భర్త మరణంతో నేను నా ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్లమయ్యాం. సమభాగం ఇవ్వాల్సిన ఇంట్లోకి రానీయడం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నం. పిల్లల పోషణ, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నా భర్తకు రావాల్సిన వాటా భూమి ఇప్పించి న్యాయం చేయండి. -
అర్హులకు ‘డబుల్’ ఇళ్లు కేటాయించండి
జగిత్యాల: అర్హులందరికీ డబుల్బెడ్రూం కేటా యించాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్కు సూచించారు. ఇంకా మిగిలిన 859 ఇళ్లను అర్హులకు ఇంతవరకు లబ్ధిపొందని వారికి.. గతంలో 2008లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై అసంపూర్తిగా వదిలేసిన వారికి కేటాయించాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద మిగిలిపోయిన అంతర్గత పనులు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి లేఖ రాశారు. ఇస్లాంపురకు చెందిన సయ్యద్ ఫజుల్కు రూ.21,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించారు. ఎమ్మెల్యేను మిషన్ భగీరథ ఈఈ జానకి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ధరూర్ క్యాంప్లోని కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. వసతులు, స్టోర్రూమ్, వంటగది శుభ్రతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు సుధాకర్, పృథ్వీ, ప్రశాంత్రాజ్, రాజ్కుమార్, ప్రిన్సిపల్ కవిత పాల్గొన్నారు. -
కాంక్రీట్ పిల్లర్ల రాజన్న మండపం
మద్యం దుకాణాలకు 135 దరఖాస్తులుజగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం దుకా ణాలకు ఇప్పటి వరకు 135 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెంటెండ్ సత్యనా రాయణ తెలిపారు. దరఖాస్తులు తీసుకునేందు కు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ పునర్ నిర్మాణం, అభివృద్ధి విషయంలో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణం ఎలా సాగుతోందనే అంశం తెరపైకొచ్చింది. యాదాద్రి ఆలయాన్ని కృష్ణశిల రాయితో నిర్మించినట్టుగానే ఇక్కడ జరిగేనా లేక పిల్లర్లతో నిర్మిస్తారా? అనే చర్చ సాగుతోంది. సుమారు 70 పిల్లర్లతో స్లాబు వేసి రాజన్న ఆలయ మండపం నిర్మించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆలయ పునర్ని ర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.76కోట్లను మంజూరు చేసింది. యాదాద్రి ఆలయ నిర్మాణానికి రూ.300 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. దీన్ని బట్టి చూస్తే యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ నిర్మాణం పూర్తయ్యేనా అనే అపోహలు భక్తుల్లో నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం, దేవాదాయశాఖ స్ప ష్టమైన వివరణ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. పీఠాధిపతి రాకతో అపోహలు తొలగేనా? ఈనెల 19న శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేకర భారతిస్వామి వేములవాడ ఆలయాన్ని సందర్శించి సలహాలు, సూచనలు అందించనున్నారు. ఈనేపథ్యంలో పీఠాధిపతి రాకతోనైనా ఆలయ నిర్మాణం విషయంలో స్పష్టత వచ్చేనా అని భక్తులు, స్థానికులు ఎదురుచూస్తున్నారు. స్వామీజీ సూచనల మేరకే దేవాదాయశాఖ ఆలయ పునర్ నిర్మాణ విషయంలో మాస్టర్ప్లాన్ బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఇందులో పిల్లర్లతో నిర్మాణం చేపడుతున్నట్లు భక్తులు చర్చించుకుంటున్నారు. ఇదే కొనసాగితే రాజన్న ఆలయ ఆధ్యాత్మికతకు భంగం కలిగే అవకాశం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. అలాగే ప్రాచీనతకు అద్దం పట్టినట్లు ఉండే రాజన్న ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా నిర్మించారు. అంతకంటే పురాతన చరిత్ర గల రాజన్న ఆలయాన్ని అలాంటి శైలిలోనే నిర్మాణం చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. కాకతీయుల కాలం నాటి ప్రాచీన ఆలయానికి ఆధునిక పిల్లర్లు కట్టి, వాటికి రాతి పలకలు అద్దితే నాణ్యత ఎంతకాలం ఉంటుందనే విషయంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆలయ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రాజేశ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. కాంక్రీట్ పిల్లర్లతో మండప నిర్మాణం వాస్తవమేనని, ఆ పిల్లర్లకు రాతి పలకలు తొడుగుతామన్నారు. దీని నాణ్యత చాలాకాలం ఉంటుందని స్పష్టం చేశారు.రాజన్న ఆలయ పునర్నిర్మాణం జరిగే సమయంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగేనా లేక నిలిపివేస్తారా? అని అనుమానాలు ఉన్నాయి. దేవాదాయశాఖ అధికారులు నిర్మాణ సమయంలో స్వామివారికి ఏకాంత సేవలు మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో భక్తులకు రాజన్న దర్శనం కలిగేనా అనే అపోహలు నెలకొన్నాయి. నిర్మాణ సమయంలో భక్తులకు భీమేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు ఉంటాయని, ఉత్సవ విగ్రహాలను మూడు రోజుల క్రితమే తరలించారు. కోడెమొక్కులు కూడా భీమేశ్వరాలయంలోనే ఏర్పాటు చేశారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు భక్తులకు రాజన్న ఆలయం నిర్మాణ సమయంలో దర్శన అవకాశం కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఆలయ ఈవో రమాదేవి ఆలయం మూసివేత ఉండదని, ఆలయంలో జరిగే ఏకాంత పూజలు యథావిధిగా కొనసాగుతాయని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ యాదాద్రి కానీ, కాణిపాకం ఆలయంలో గానీ పునర్నిర్మాణ విషయంలో భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా దర్శనాలు నిలిపివేయడం సరికాదంటున్నారు. మేడారం సమ్మక్క జాతర సందర్భంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ.. అని ఇలాంటి సమయంలో దర్శనం విషయంలో గందరగోళం కలిగించే ప్రకటనలు సరికాదని హితవు పలుకుతున్నారు. -
రాజరాజేశ్వరుని సన్నిధిలో మంత్రి అడ్లూరి
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీఅక్కపెల్లి రాజరాజేశ్వర స్వామిని సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారి ప్రసాదం అందించారు. గురుకులాలకు రూ.60 కోట్లు గురుకులం పాఠశాలలు, కళాశాలల్లో వసతులకు సీఎం రూ.60 కోట్లు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ఎస్సీ, బీసీ సొసైటీలకు రూ.20 కోట్లు, ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ. 10 కోట్ల చొప్పున మంజూరయ్యాయన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలుజగిత్యాలక్రైం: ఈనెల 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ‘పోలీస్ ఫ్లాగ్ డే’ సందర్బంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. పోటీ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటుందని, 6వ తరగతి నుంచి పీజీ విద్యార్థులు పాల్గొనవచ్చని, తమ వ్యాసాలను ఈనెల 28 లోపు సమర్పించాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన ముగ్గురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామన్నారు. ‘డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర.. ‘విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు..’ అనే అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుందని, ఆసక్తి గలవారు https://forms.gle/jaWdt2yhNr Mpe3A లింక్పై క్లిక్ చేసి చేసి పేరు, విద్యార్హత, ఇతర వివరాలు నమోదు చేయాలని, వ్యాసాన్ని 500 పదాలకు మించకుండా పేపర్పై రాసి, దానిని ఫొటోతీసి ఇమేజ్/పీడీఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. సీపీఆర్తో ప్రాణాలు కాపాడే అవకాశంజగిత్యాల: సీపీఆర్తో ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని ఐఎంఏ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో వాకర్స్ అసోసియేషన్ వారికి సోమవారం అవగాహన కల్పించారు. గుండెపోటు బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించేందుకు సీపీఆర్ ఉపయోగపడుతుందన్నారు. కోశాధికారి సుధీర్కుమార్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రోడ్డెక్కిన బీసీ సంఘాలుకొడిమ్యాల: రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని పేర్కొంటూ మండలంలోని పూడూర్లో కరీంనగర్ – జగిత్యాల రహదారిపై సోమవారం బీసీ నాయకులు బైటాయించారు. ప్రభుత్వం ఖరారు చేసిన 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, నోటికాడి ముద్ద లాక్కోవద్దని, బీసీలను చిన్నచూపు చూడొద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బింగి మనోజ్, రాచకొండ చందు పాల్గొన్నారు. -
ఆలకించండి.. పరిష్కరించండి
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లానలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. 55 అర్జీలు రాగా.. పరిశీలించిన ఆయన సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, జగిత్యాల, మెట్పల్లి కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జివాకర్ పాల్గొన్నారు.చెరువుల్లో పూడిక తీయించండి మాది జగిత్యాల రూరల్ మండలం నాగునూర్. గ్రామంలో నాగులకుంట, బొట్లకుంట చెరువుల్లో పూడిక పేరుకుపోయింది. చెరువు సామర్ధ్యం తగ్గి సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బందిగా మా రింది. ఈ చెరువుల కింద వంద ఎకరాలు సాగవుతుంది. పూడిక పేరుకుపోయి బావులు, బోర్లు వట్టిపోతున్నాయి. చెరువుల్లో పూడిక తీస్తే కొంత మేలు జరుగుతుంది. – నాగునూర్ గ్రామ రైతులు -
‘ఇందిరమ్మ’ ఇళ్లు పూర్తికావాలి
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గృహనిర్మాణం, మున్సిపల్ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. జిల్లాకు 10,982 ఇళ్లు మంజూరు కాగా.. 7,343కు మార్క్అవుట్ చేశామని, 2,984 బేస్మెంట్, 721 లెంటల్, 369 స్లాబ్ దశకు వచ్చాయని, మూడు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా 22వ స్థానంలో ఉందని, అధికారులు సమన్వయంగా పనిచేసి మొదటి ఐదు స్థానాల్లో ఉండేలా చూడాలన్నారు. ఇసుక బజార్ నుంచి లబ్ధిదారులు ఇసుక పొందవచ్చన్నారు. బిల్లుల్లో జాప్యం ఉన్నా, సమస్యలున్నా తన దృష్టికి తేవాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, డిప్యూటీ అదనపు కలెక్టర్ హారిణి, హౌసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు. కార్డియక్ అరెస్ట్తోనే మరణాలు కార్డియక్ అరెస్ట్తోనే యుక్త వయస్సులో చాలామంది చనిపోతున్నారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కార్డియో పల్మనరి రిసాసిటేషన్ వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో సీపీఆర్పై అవగాహన కల్పించారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని అన్నిచోట్ల వారంపాటు అవగాహన కల్పిస్తామన్నారు. -
ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్
మెట్పల్లి: ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందన్నారు. పెన్షన్లను రూ.4వేలకు పెంచకపోవడం, ఆడపిల్ల వివాహానికి తులం బంగారం అందజేయకపోవడం, పూర్తి స్థాయిలో రూ.2లక్షల రుణమాఫీన అమలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగకు మహిళలకు చీరెలు అందించి గౌరవిస్తే.. కాంగ్రెస్ ఆ ప్రక్రియను నిలిపివేసి కించపరిచిందన్నారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్కు భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. -
పట్టణం.. కళావిహీనం
జగిత్యాల: పచ్చదనం పరిశుభ్రత అందరి బాధ్యత అంటూ మున్సిపల్ అధికారులు చెబుతుంటారు. వారరే పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాకేంద్రమైన జగిత్యాల సుందరీకరణ పేరుతో గతంలో సుమారు రూ.10 లక్షల వరకు నిధులు మంజూరయ్యాయి. కొత్తబస్టాండ్ పాతబస్టాండ్ వద్ద జంక్షన్లు నిర్మించి అందులో పక్షుల బొమ్మలు, రాతి కట్టడాలు, ఫౌంటేన్లను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం వాటి నిర్వహణ మర్చిపోవడంతో ప్రస్తుతం కళావిహీనంగా మారాయి. ఫౌంటేన్ ఒక్కసారి కూడా పనిచేయడంలేదు. స్థానికులెవరైనా ఫిర్యాదు చేస్తే అడపదడపా వచ్చి ఫౌంటేన్ ప్రారంభించి వదిలేస్తుంటారు. అందులో ఉన్న పచ్చిగడ్డి ఎండిపోయింది. బొమ్మలు దుమ్ము, దూళితో కళాహీనంగా మారాయి. ఏపుగా పెరుగుతున్న కానోకార్పస్ చెట్లు జిల్లా కేంద్రంలో ఎప్పటికప్పుడు పిచ్చిమొక్కలను తొలగించడంతోపాటు, డివైడర్ల మధ్యనున్న చెట్లను తొలగిస్తుండాలి. వాటిని పట్టించుకోకపోవడంతో కానోకార్పస్ మొక్కలు ఏపుగా పెరిగాయి. కొత్తబస్టాండ్ నుంచి నిజామాబాద్ వెళ్లే రహదారితోపాటు, కరీంనగర్ వెళ్లే రహదారిలో కుడి, ఎడమ రహదారుల వైపు వెళ్లేవారు మచ్చుకై నా కన్పించరు. పైగా అందులో అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో కొత్తబస్టాండ్ నుంచి పాతబస్టాండ్కు వెళ్లే దారిలో సుమారు రూ.12 లక్షల వ్యయంతో చెట్లు ఏర్పాటుచేశారు. వాటి నిర్వహణ సక్రమంగా లేక ఎండిపోయే దుస్థితి నెలకొంది. మధ్యలో పిచ్చిమొక్కలు పెరిగాయి. పచ్చదనం పెంచుతూ.. అందంగా తీర్చిదిద్దుతామన్న అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో ఎటుచూసినా కళావిహీనంగా కనిపిస్తున్నాయి. పట్టింపేది..? అసలే జిల్లా కేంద్రం. నిత్యం వివిధ పనులపై జిల్లాకేంద్రానికి వస్తుంటారు. ఈ మధ్యనే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ లైట్స్ ఏర్పాటు చేశారు. జంక్షన్లుగానీ, డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన మొక్కలపై నిర్వహణ చర్యలు తీసుకోకపోవడంతో విపరీతంగా పెరిగాయి. వాటి మధ్య పిచ్చిమొక్కలూ పెరిగిపోయాయి. ఎన్విరాన్మెంట్ అధికారులెక్కడ? హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లను అందంగా తీర్చిదిద్దడంతోపాటు, వాటిని రక్షించేందుకు ఎన్విరాన్మెంట్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. కానీ వారు మచ్చుకు కన్పించడం లేదనే ఆరోపణలున్నాయి. వీరు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని మొక్కలు నాటించడంతోపాటు, పిచ్చిమొక్కలను తొలగిస్తూ.. ఎప్పుడూ మొక్కలకు నీరు పోస్తుంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సుందరీకరణపై శ్రద్ధ పెట్టి ఏపుగా పెరిగిన మొక్కలను తొలగించడంతోపాటు, ఫౌంటేన్లను పునఃప్రారంభించాలని పట్టణప్రజలు కోరుతున్నారు. -
శ్మశాన వాటిక వివాదం పరిష్కరించండి
రాయికల్లోని ఎర్రకుంట వద్ద గల సర్వే నంబర్ 740లోని 15గుంటల భూమిని మా పూర్వీకుల నుంచి రెవెన్యూ రికార్డుల్లో గోసంగి కుల సంఘం పేరిట నమోదై ఉంది. అక్కడ శ్మశానవాటికగా ఉపయోగిస్తున్నాం. ఆ భూమికి ఓ వ్యక్తి తప్పుడు ధ్రువీకరణపత్రాలతో తనదంటూ రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. మోఖాపై విచారించిన అధికారులు కూడా ఆ భూమి మాదేనని తేల్చారు. కానీ.. సదరు వ్యక్తి ఆ స్థలం తనదేనంటూ బెదిరిస్తున్నాడు. ఆ భూమిని భూభారతి ఆన్లైన్లో నమోదు చేయించి శాశ్వత పరిష్కారం చూపండి. – గోసంగి కులస్తులు, రాయికల్ -
వ్యక్తి పేరుతో ఊరు.. వంశమంతా ఒకటే తీరు
వెల్గటూర్: అది ఎండపల్లి మండలంలో రాజారాంపల్లి. ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి ఒకటే కారణం.. గ్రామానికి చెందిన ఏలేటి రాజారాంపటేల్ ఆ ఊరుకు చేసిన సేవ. ఆయన పేరునే గ్రామానికి పెట్టుకున్నారు. పాఠశాల, పంచాయతీ కార్యాలయం, దేవాలయాలు, సమ్మక్క, సారలమ్మ జాతర స్థలం, శ్మశాన వాటిక, డంపింగ్యార్డు, వాటర్ ట్యాంకులు, అంగన్వాడీ కేంద్రం, మహిళాసంఘం భవనం ఇలా అన్నీ ఏలేటి వంశీయుల జ్ఞాపకాలే. ఓ పదివేలు దానం చేసి వంద మందితో సన్మానాలు చేయించుకునే ఈ రోజుల్లో గ్రామ అభివృద్ధికి కోట్ల విలువైన స్థలాలు గ్రామానికి అప్పగించారు ఏలేటి వంశీయులు. తాజాగా మండలకేంద్రానికి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణానికి స్థలం కేటాయించాలని గ్రామస్తులు ఏలేటి వంశస్థులను కోరగా.. సుమారు రూ.ఐదుకోట్ల విలువైన భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏలేటి రాజారాంపటేల్ విగ్రహానికి గ్రామస్తులు సోమవారం క్షీరాభిషేకం చేశారు. గ్రామ అభివృద్ధికి ముందుకొచ్చిన ఏలేటి వంశస్థులు సత్యనారాయణ రెడ్డి, మనోహర్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, చంద్రారెడ్డి, వెంకట్రెడ్డి, శైలేందర్రెడ్డి, విజయ మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
లేబర్ కార్డుల దందా
జగిత్యాల: కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో లేబర్కార్డు ఉన్నవారికే పథకాలు వర్తిస్తాయి. కాగా, కొందరు బ్రోకర్లు కార్డు ఇప్పిస్తామంటూ కార్మికుల నుంచి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత లేని కార్మికులకు సైతం కార్డులు అందజేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కార్యాలయంలో బ్రోకర్లే హవా జిల్లాలో భవన నిర్మాణ, ఇతర రంగాల్లో సుమారు 2 లక్షల మంది కార్మికులుంటారని అంచనా. వీరికి పథకాలు, ఇన్సూరెన్స్ తదితరాలు వర్తించాలంటే లేబర్కార్డు తప్పనిసరి. అయితే కొందరికి కార్డు ఎలా పొందాలో తెలియక బ్రోకర్లను సంప్రదిస్తున్నారు. దీంతో బ్రోకర్లు వసూళ్ల దందాకు తెరలేపారు. ఒక కార్డుకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో సుమారు 2 లక్షల మంది కార్మికులున్నా ఇప్పటి వరకు దాదాపు 50 వేల కార్డులు మాత్రమే అందజేశారు. అవగాహన లేక చాలా మంది లేబర్ కార్డు పొందలేకపోతున్నారు. కార్మికుల కుటుంబంలో వివాహం, ప్రసవం వంటి క్లెయిమ్ల కోసం దరఖాస్తు చేస్తే లేబర్కార్డు ఉంటేనే సుమారు రూ.30 వేల వరకు గ్రాంట్ వస్తోంది. ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.1.30 లక్షలు వస్తాయి. ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకున్న బ్రోకర్లు కార్మికుల నుంచి అందినంత దోచుకుంటున్నారు. కాగా, లేబర్ కార్యాలయంలో కూడా ఆమ్యామ్యాలు లేనిదే పనిచేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఎక్కువగా బ్రోకర్లే దందా నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పట్టింపులేని అధికారులు? భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు లేబర్ కార్యాలయం అ ధికారులు పథకాలపై అవగాహన కల్పించాలి. కా నీ, అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణ లున్నాయి. కార్మికులు మీసేవ కార్యాలయంలో దరఖాస్తు చేసి లేబర్ కార్యాలయంలో సంప్రదిస్తే అధి కారులే కార్డు మంజూరు చేస్తారు. కానీ, వారికి తెలియక బ్రోకర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కార్మికులకు బ్రోకర్ల బెడద లేకుండా కార్డులు అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కార్మికులు బ్రోకర్లను ఆశ్రయించవద్దు. కార్డుల కోసం, ఇతరత్ర పనుల కోసం నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులకు పథకాలు వర్తిస్తాయి. ఎవరినీ ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయానికే రావాలి. – కాడం అనిల్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, జగిత్యాల -
వ్యాధుల కాలం.. ట్యాంకులు అపరిశుభ్రం
కథలాపూర్: గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన రక్షిత మంచి నీటి ట్యాంకులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. క్రమం తప్పకుండా వాటిని పరిశుభ్రం చేసి ఆయా తేదీలను పట్టిక రూపంలో ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. కొన్ని గ్రామాల్లో ట్యాంకులను నెలల తరబడిగా శుభ్రం చేయడం లేదు. పైపులైన్ లీకేజీలు, అపరిశుభ్ర పరిసరాలతో అధ్వానంగా తయారయ్యాయని ప్రజలు వాపోతున్నారు. అసలే వ్యాధుల కాలం.. ఆపై ట్యాంకులు అపరిశుభ్రంగా ఉంటే రోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 385 గ్రామాలు.. 892 నీటి ట్యాంకులు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మొత్తం 385 గ్రామపంచాయతీలు, 113 అనుబంధ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు 892 రక్షిత మంచినీటి ట్యాంకులు నిర్మించారు. ఇదంతా బాగానే ఉన్నా ట్యాంకుల నిర్వహణను పట్టించుకునేవారు లేకపోవడంతో ప్రజలకు శుద్ధ నీరు అందని ద్రాక్షలా మారింది. ట్యాంకులను నెలకు మూడుసార్లు శుభ్రం చేయించాల్సి ఉండగా.. ఎప్పుడో ఒకసారి శుభ్రం చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రజలు తాగేందుకు మినరల్ వాటర్ను కొనుగోలు చేస్తున్నారు. ట్యాంకులను శుభ్రం చేయించే బాధ్యత పంచాయతీ కార్యదర్శులదని, గ్రామాల్లో తాము సరఫరాను మాత్రమే పర్యవేక్షిస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. నీరు శుభ్రంగా రాకపోవడంతో ప్రజలు నెలకు రూ.100 నుంచి రూ.200వరకు చెల్లించి మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. దీనిని అదునుగా తీసుకుంటున్న కొందరు గ్రామాల్లో విచ్చలవిడిగా మినరల్ వాటర్ ప్లాంట్లు నెలకొల్పి వ్యాపారం జోరుగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంచాయతీ, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉన్నతాధికారులు చొరవ చూపి ట్యాంకులను వారానికి రెండుసార్లు శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
సరిపడా లేక.. ఆపదలో రాక
జగిత్యాల/సాక్షి,పెద్దపల్లి: అత్యవసర సమయంలో 108కి ఫోన్ చేస్తే ఆగమేఘాల్లో వచ్చి రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఇది అంబులెన్స్ పని.. కానీ, కొన్ని సమయాల్లో అంబులెన్స్ కావాలని ఫోన్ చేస్తే గంట ఆగాలని అటునుంచి సమాధానం వస్తోంది. దీంతో చేసేది లేక బాధితులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం సరిపడా అంబులెన్స్ వాహనాలు లేకపోవడంతో పాటు జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యం అందించక కరీంనగర్కు రెఫర్ చేయడం. ఆపత్కాల సమయంలో అంబులెన్స్ సర్వీస్ కోసం ఫోన్ చేస్తే వెయిట్ చేయాలనే సమాధానం వస్తుందని బాధితులు వాపోతున్నారు. జాతీయ, రాజీవ్ రహదారిలో వాహనాల రద్దీ పెరగడంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. దీంతో అత్యవసర సేవలకు గిరాకీ బాగానే పెరిగింది. కాగా, ఏరియా హాస్పిటల్కు వచ్చే గర్భిణులు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన బాధితులను ఇతర ఆసుపత్రులకు (రెఫర్) పంపిస్తూ వైద్యులు చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, రెఫర్ రాయగానే సమస్య పెద్దదని రోగులు ఆందోళన చెందుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇక గర్భిణులను వాహనాల్లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే వారికి పురుడుపోయాల్సి వస్తోంది. రెఫర్.. వాహనాల కొరత ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆస్పత్రుల్లో సరిపడా అంబులెన్స్లు అందుబాటులో లేక రోగులు ఇబ్బందిపడుతున్నారు. ఆయా పట్టణాల్లోని ప్రాంతీయ ఆస్పత్రుల్లో రాత్రి వేళ కేసులు వస్తే ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. కరీంనగర్కు ఎక్కువగా రెఫర్ చేస్తుండడంతో అంబులెన్స్ల కొరతతో ప్రమాదాల బారినపడిన క్షతగాత్రుల బాధ వర్ణనాతీతం. ఆపద సమయంలో ఆయా పట్టణ ప్రాంతాలు, గ్రామాల నుంచి అంబులెన్స్కు ఫోన్ చేస్తే శ్రీకరీంనగర్లో ఉన్నాంశ్రీ అనే సమాధానం వస్తుండడంతో ఆ వాహనం వచ్చే వరకు బాధితులు వేచిచూడటం, లేదా ప్రైవేట్ వాహనాలకు ఆశ్రయించాల్సి వస్తుంది. దీంతో అత్యవసర వైద్యం కోసం ఆశ్రయించిన రోగులకు 108 అంబులెన్స్ సేవలు అందడం లేదు. ఈక్రమంలో వైద్యుల నిర్వాకంపై దృష్టిసారించడంతో పాటు, ప్రతి మండలానికి ఒక్క అంబులెన్స్ సర్వీసు ఉండేలా ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రోగుల బంధువులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉండాల్సిన అంబులెన్స్లు, ప్రస్తుతం ఉన్నవి జిల్లా ఉండాల్సినవి ఉన్నవి కరీంనగర్ 18 16 జగిత్యాల 18 15 సిరిసిల్ల 13 12 పెద్దపల్లి 14 08 ‘ఇటీవల సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లోని ట్యాంక్బండ్ మీద అంబులెన్స్లను ప్రారంభించి పెద్దపల్లి జిల్లాకు నాలుగు కొత్త వాహనాలను కేటాయించారు. జూలపల్లి, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాలకు కేటాయించగా, వాటిని జిల్లాకు తీసుకొచ్చి వారం రోజులు వినియోగించారు. కారణాలు ఏంటో కానీ, పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన నాలుగు అంబులెన్స్లను గజ్వేల్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి రెండు అంబులెన్సులు అవసరం ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఒక్క అంబులెన్స్ను రాత్రివేళ రెఫర్ కేసులకు పంపిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సమయానికి వాహనాలు చేరుకోక బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు. ‘ఇటీవల పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డిపేట గ్రామంలో ఓ విద్యార్థి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, అంబులెన్స్లో పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం కోసం అదే అంబులెన్స్లో కరీంనగర్కు తీసుకెళ్లారు. అయితే అదే రాత్రి లాలపల్లి గ్రామంలో ఓ మహిళ పురిటినొప్పులతో ఇబ్బందులు పడుతుంటే అంబులెన్స్ రావడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉంది’. -
బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ
జగిత్యాలరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ కపట ప్రేమ ప్రదర్శిస్తోందని జెడీప మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ బీసీలను పావుగా వాడుకుంటోందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలకు చేసింది శూన్యమన్నారు. గవర్నర్ వద్ద.. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నా.. జీవో9తో ఎన్నికలకు ఎలా వెళ్తారో సోయి కూడా ప్రభుత్వానికి లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం బీసీకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ర్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆనందరావు, మాజీ సర్పంచ్ ప్రవీణ్గౌడ్, నాయకులు శేఖర్, మహేశ్ గౌడ్, రాకేశ్, వెంకటేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ఎన్నికల వరకే రాజకీయం
రాయికల్: రాజకీయాలు ఎన్నికల వరకేనని, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకే సీఎంతో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్లోని 35 మంది లబ్ధిదారులకు రూ. 8.50లక్షల చెక్కులు అందించారు. మున్సిపల్ పార్కు పనులపై సమీక్షించారు. రాయికల్ అభివృద్దికి నిరంతరం పనిచేస్తున్నానన్నారు. సింగిల్విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, బల్దియా కమిషనర్ మనోహర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మాండ్లు, నాయకులు పడిగెల రవీందర్ రెడ్డి, గన్నె రాజరెడ్డి, రవీందర్రావు, కోల శ్రీనివాస్, అచ్యుత్రావు, సుదర్శన్ పాల్గొన్నారు. సీపీఎస్ రద్దుకు కృషి జగిత్యాలటౌన్: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలయ్యేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పీఆర్టీయూ నాయకులకు హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన సంఘం జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు క్యాష్లెస్ హెల్త్ స్కీం వర్తించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ టెట్పై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నెలవారీగా రూ.700కోట్లు విడుదలకు ఒత్తిడి తెస్తామన్నారు. వంగ మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని కోరారు. ఇటీవల పదోన్నతి పొందిన 153మంది ఉపాధ్యాయులను సన్మానించారు. -
ఎవరూ పట్టించుకుంట లేరు
ఇప్పపెల్లిలో నల్లా నీరు సరఫరా అయ్యే పైపులైన్ సరిగా లేదు. మరమ్మతు చేయించాలని చెప్పినా ఏళ్లుగా ఎవ రూ పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామంలోని పలు వా డలకు నల్లానీరు రావడంలేదు. వాడల్లోని బోరుబావులతో ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నాం. తాగేందుకు మినరల్వాటర్ కొనుక్కుంటున్నం. – సంబ నవీన్, ఇప్పపెల్లి గ్రామాల్లో ట్యాంకులు ఉన్నా.. పైప్లైన్ లీకేజీ అవుతున్నాయి. మరమ్మతు చేయించకపోవడంతో నల్లా నీరు కలుషితం అవుతోంది. వాటర్ ప్లాంట్ నుంచి రూ.5చెల్లించి 20 లీటర్ల నీరు కొనుక్కుని తాగుతున్నాం. తాగునీటి సరఫరా విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు. – తుమ్మనపెల్లి మహేశ్, భూషణరావుపేట గ్రామాల్లో రక్షిత మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిస్తాం. నెలకు మూడు సార్లు వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించాల్సిన బాధ్యత ఆయా గ్రామాల కార్యదర్శులదే. ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు ఎప్పటికప్పుడు గ్రామాల్లో తాగునీటి సరఫరాను పర్యవేక్షించేలా చూస్తాం. – ఆనంద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ -
పేదలకు నాణ్యమైన వైద్యం
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శనివారం పట్టణానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. టీఆర్నగర్లో రూ.40 కోట్లతో ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. చల్గల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, త్వరలోనే రూ.20 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం కానుందన్నారు. రూ.203కోట్లతో జగిత్యాలకు నూతన ఆస్పత్రి మంజూరు చేస్తామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్ పాల్గొన్నారు. కోతులను నివారించండిజగిత్యాలటౌన్: రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, స్టెరిలైజేషన్ ద్వారా వాటి పునరుత్పత్త అరికట్టాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను కోరారు. కోతులను నివారించకుంటే వ్యవసాయం ప్రమాదంలో పడుతుందన్నారు. జిల్లాకో స్టెరిలైజేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రధాని, సీఎంలకు లేఖ రాశారు. కోతుల సమస్య తీవ్రతను గుర్తించిన హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం నియంత్రణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి.. వాటి పునరుత్పత్తిని గణనీయంగా తగ్గించగలిగిందని, రాష్ట్రంలో కూడా అలాంటి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్కు 50శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేయాలన్నారు. కోతుల బెడద కారణంగా రాష్ట్రంలో పప్పుదినుసులు, నూనె గింజల సాగు కనుమరుగైందన్నారు. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం మేడిపల్లి: మండలంలోని కాచారంలో ఇందిరమ్మ ఇంటిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన బర్ల సాయమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా.. నిర్మాణం పూర్తికావడంతో విప్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుకు కొత్త వస్త్రాలు అందించి గృహప్రవేశం చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిందని, ఇళ్ల నిర్మాణం వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. మండల పరిధిలో మొదట ఇల్లు పూర్తయిన లబ్ధిదారుకు రూ.50వేలు ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించిన మాజీ సర్పంచ్ రాజాగౌడ్ మాట నిలుపుకొన్నారు. సాయమ్మకు విప్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, చేపూరి నాగరాజు, శ్రీపతి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. చదువులో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు మెట్పల్లి: విద్యార్థులు చదువుల్లో రాణిస్తే ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని మెట్పల్లి జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్కుమార్ అన్నారు. పట్టణంలోని ఆరపేట బాలికల గురుకులంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని సాధించడానికి కృషి చేయాలన్నారు. అవరోధాలు ఎన్ని ఎదురైనప్పటికీ కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. అనంతరం బాలికలకు పోక్సోతోపాటు పలు చట్టాలపై వివరించారు. కార్యక్రమంలో సీఐ అనిల్కుమార్, ఎస్సై కిరణ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు సర్వంసిద్ధం
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్లో పండించిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే సన్న ధాన్యాన్ని కూడా కొనేందుకు ప్రత్యేక కేంద్రాలు ప్రారంభించనున్నారు. 421 కేంద్రాలు ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో 421 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సింగిల్ విండో ఆధ్వర్యంలో 283 కేంద్రాలు, మహిళా సంఘాల(ఐకేపీ) ఆధ్వర్యంలో 137, మెప్మా ఆధ్వర్యంలో ఒక కేంద్రం ప్రారంభించనున్నారు. యాసంగిలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా వానాకాలం సీజన్లో చర్యలు తీసుకోనున్నారు. ఏ గ్రేడ్ధాన్యం క్వింటాల్కు రూ.2,389, కామన్ రకానికి రూ.2369 చొప్పున కొననున్నారు. 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు ఈ వానాకాలం జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1.26 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగవుతోంది. బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. 1.89 లక్షల ఎకరాల్లో సాగైన దొడ్డురకానికి ఈసారి తెగుళ్లు, పురుగుల బెడద లేకపోవడంతో ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల దిగుబడి రానుంది. ఈ లెక్కన దొడ్డురకం 47.025 లక్షల క్వింటాళ్లు, సన్నాలు 31.50 లక్షల క్వింటాళ్లు దిగుబడి రానుంది. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత సివిల్ సప్లై, డీఆర్డీఏ, సింగిల్ విండో, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్షించారు. గన్నీసంచులకు కొరత లేకుండా సివిల్సప్లై, ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా ట్రాన్స్పోర్ట్ యజమానులను ఆదేశించారు. బస్తాకు రెండు కిలోల వరకు కోత విధించడంపై ఇప్పటికే రైతులు ఆగ్రహంతో ఉన్నందున.. ఈసారి అలా జరగకుండా చూడాలని రైస్మిల్లర్లను ఆదేశించారు. -
10 టీమ్లు ఏర్పాటు చేయాలి
ప్రతి పాఠశాల నుంచి కనీసం 50 మంది విద్యార్థులతో 10 టీమ్లను ఈనెల 13 లోపు రిజిస్ట్రేషన్ చేసుకుని అదేరోజు జరగనున్న లైవ్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో పాల్గొనాలి. విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలకు ఇది మంచి అవకాశం. – రాము, డీఈవో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మంచి కార్యక్రమం. ప్రతి ఒక్క విద్యార్థి ఇందులో చేరాలి. వారి నైపుణ్యత బయటపడుతుంది. వెంటనే వారిని ఇందులో చేర్చేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాత్ర వహించాలి. – మచ్చ రాజశేఖర్, జిల్లా సైన్స్ అధికారి -
ధర్మపురి క్షేత్రానికి గోదావరి మణిహారం
ధర్మపురి: నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి పుణ్యక్షేత్రానికి గోదావరి నది ఒక మణికంఠహారంగా ప్రసిద్ధి చెందిందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్రావు అన్నారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సౌజన్యంతో జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీమఠం స్థలంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చారు. నృసింహుడి పుణ్యక్షేత్రానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని. వేద పండితులకు పుట్టినిల్లయిన ఇక్కడి గోదావరి దక్షిణముఖంగా ప్రవహించడం గొప్ప విషయమని అన్నారు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దరుత దూర! అనే మకుఠంతో రాసిన ధర్మపురి నివాసి అయిన శేషప్ప కవి రాసిన పద్యాన్ని చాగంటి వివరించారు. భగవంతుని నామస్మరణ మానవ మనుగడకు ఎంతో మోక్షమని సూచించారు. ధర్మపురిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహుడి నామస్మరణలు, నరసింహుడు నరుడిగా, సింహంగా మారిన ఆయన మహిమాని త్వం, రాక్షసుడైన హిరణ్యకశిపుడు, భక్తి ప్రపత్తుడైన ప్రహ్లాదుడిపై భక్తులకు వివరించారు. 54 లక్షల జీవరాశుల్లో వాయుపుత్రుడైన హన్మంతునికి భగవంతుడు ప్రత్యేక స్థానం కల్పించినట్లు వివరించారు. చాగంటికి ఘన స్వాగతం ధర్మపురి పుణ్యక్షేత్రానికి చేరుకున్న చాగంటికి ఆలయం ఆధ్వర్యంలో ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, పాలకమండలి స్థానిక నందీ కూడలి వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాగంటి స్వామివారిని దర్శించుకున్నారు. చాగంటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ సన్మానించారు. ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్లు బందోబస్తును ఏర్పాటు చేశారు. -
అభిప్రాయ సేకరణ.. దరఖాస్తుల స్వీకరణ!
పోటీ పడుతున్నది వీరే.. సాక్షిప్రతినిధి,కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన నేపథ్యంలో అధికార పార్టీ జిల్లాలపై దృష్టి సారించింది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాకు పీసీసీ పరిశీలకులను నియమించింది. వీరంతా ఈనెల 13న ఉమ్మడి జిల్లాకు రానున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజా మద్దతు ఉన్న నాయకుడిని గుర్తించి డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్న సంకల్పంతో వీరంతా పని చేయనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో మమేకమై ఎవరి బలాబలాలు ఎంతెంత? అన్న విషయంపై అవగాహనకు రానున్నారు. ఏఐసీసీ పరిశీలకులు.. శ్రీనివాస్ మానే నేతృత్వంలో పీసీసీ పరిశీలకుల బృందం ఉమ్మడి జిల్లాకు రానుంది. వీరిలో ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్, ఆత్రం సుగుణ కరీంనగర్, చిట్ల సత్యనారాయణ సిరిసిల్ల, తూర్పు జయప్రకాశ్ రెడ్డి జగిత్యాల, ఎండీ.ఖాజా ఫక్రుద్దీన్ రామగుండం కార్పొరేషన్, కేతూరి వెంకటేశ్, గిరిజాషెట్కర్ పెద్దపల్లి రానున్నారు. చామల కిరణ్కుమార్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన రాక సందిగ్ధంలో పడింది. ముగ్గురి కోసం మధనం కాంగ్రెస్ వర్గాలు తెలిపిన ప్రకారం.. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు మొత్తం ఆరురోజులపాటు డీసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటిస్తారు. సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ ఆలోచనలు వివరిస్తారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీలును బట్టి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో వారి ఆలోచనలు, ప్రణాళికలు ఇంటర్వ్యూ తరహాలో అడిగి తెలుసుకుంటారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, ముఖ్యనాయకులతో సమావేశ మై వారి అభిప్రాయాలు సేకరిస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ బలాబలాలు, ఏ నేతకు ఎంత ఆదరణ ఉందో తెలుసుకుంటారు. అనంతరం ఆశావహుల్లో నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఆ జాబితాను తొలుత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు పంపిస్తారు. ఈ జాబితాను స్క్రూటినీ చేసి తిరిగి రాష్ట్రానికి పంపుతారు. అక్కడ దీపావళి నాటికి టీపీసీసీ చీఫ్, సీఎం, మంత్రి భట్టి విక్రమార్క, సంబంధిత ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రులు కలిసి ప్రతీ జిల్లాలో ముగ్గురిలో ఒకరిని డీసీసీ ప్రెసిడెంట్గా ఖరారు చేస్తారు.కరీంనగర్ డీసీసీకి పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి పోటీ పడుతున్నారు. సిరిసిల్ల డీసీసీ రేసులో.. గడ్డం నర్సయ్య, కె.చక్రధర్రెడ్డి, నేవూరి వెంకటరెడ్డి, సంగీతా శ్రీనివాస్ ఉన్నారు. జగిత్యాల డీసీసీకి జువ్వాడి కృష్ణారావు, సుజిత్రావు, కొమొరెడ్డి కరంచంద్ రేసులో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి సారయ్యగౌడ్, శశిభూషణ్ కాచే, బోషానబోయిన రమేశ్గౌడ్, తొట్ల తిరుపతియాదవ్, కోలేటి మారుతి, చొప్పరి సదానందం డీసీసీ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్నారు. -
ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
జగిత్యాల: ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగినివ్వొద్దని, కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండు సీజన్లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని, ఈసారి కూడా పక్కా ప్రణాళికతో కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. వానాకాలం సంబంధించి జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, 7.50–8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేయడం జరిగిందన్నారు. మద్దతు ధర క్వింటాల్కు గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369, బోనస్ క్వింటాల్కు రూ.500 చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి కేంద్రంలో రిజిస్టర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, టార్పాలిన్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఏ రోజు వచ్చిన ధాన్యాన్ని ఆ రోజే కొనుగోలు చేయాలని సూచించారు. అవసరం మేరకు గన్నీ బ్యాగులు ఉంచాలని, హమాలీల కొరత ఉండకూడదని ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత, డీఆర్డీవో రఘువరణ్, డీఎస్వో జితేందర్రెడ్డి, జితేంద్రప్రసాద్, ప్రకాశ్, అధికారులు పాల్గొన్నారు. -
మానసిక వికలాంగులను చిన్నచూపు చూడొద్దు
జగిత్యాలజోన్: మానసిక వికలాంగులను చిన్నచూపు చూడొద్దని, వారికి చేయూత నందించాలని జగిత్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.లావణ్య అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జగిత్యాల ఓల్డ్ హై స్కూల్, భవిత వికలాంగుల వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, మానసిక వికలాంగుల్లో అద్భుత శక్తి ఉంటుందని, ఆ శక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నించాలని కోరారు. మొదటి అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీనిజ మాట్లాడుతూ, బాలిక విద్యను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.సతీశ్, విజయకృష్ణ, అనురాధ పాల్గొన్నారు. వరదకాల్వ గండి పరిశీలనజగిత్యాలఅగ్రికల్చర్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గండ్లపేట వద్ద ఎస్సారెస్పీ వరదకాల్వకు 16.425 కి.మీ పరిధిలో గండి పడడంతో కొద్దిరోజులుగా నీటి విడుదలను నిలిపివేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్సారెస్పీ అధికారులు సత్యనారాయణరెడ్డి, సుధాకర్రెడ్డి గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణసారంగాపూర్(జగిత్యాల): పంటపొలాల వద్ద విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో పనులు నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో ఏడీఈ సిందూర్శర్మ, బీర్పూర్ ఏఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం బీర్పూర్ మండల కేంద్రంతో పాటు కొల్వాయి గ్రామంలో నిర్వహించిన పొలంబాట కార్యక్రమంలో మాట్లాడారు. ఎక్కడైనా లూజ్ వైర్లు, కిందికి వేళాడుతున్న వైర్లు, వంగిన, విరిగిన స్తంభాలు, ఇతర సమస్యలు ఉంటే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులు కెపాసిటర్లను వినియోగిస్తే విద్యుత్ ఆదాతోపాటు, మోటార్లు ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎం శేఖర్, మహేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సకాలంలో వేతనాలు చెల్లించాలికోరుట్లటౌన్: జీతాలు చెల్లించాలని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగులు శుక్రవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య పరిషత్కు సంబంధించిన ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రతి నెలా వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతరాణి, జూనియర్ అసిస్టెంట్లు రాజశేఖర్, రాజయ్య, వైద్యసిబ్బంది సరళ, ప్రమీళ, కవిత, శ్రీధర్, చారి, సురేందర్, చిరంజీవి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ పక్క.. ఈ పక్క.. మక్క
ఈ వర్షకాలంలో రైతులు వేసిన మొక్కజొన్న పంట చేతికి రాగా, రోడ్లపైనే కంకులను ఆరబెడుతున్నారు. రోడ్డులో సగ భాగం వరకు కంకులను పోసి, పక్కన బండరాళ్లను పెట్టడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం– మూలరాంపూర్ రోడ్డుపై మొక్కజొన్న కంకులు పోయడంతో ఓ గ్యాస్ ఏజెన్సీకి చెందిన ఆటో, మరో జీపు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాయి. ఇబ్రహీంపట్నంలో ఇలా రోడ్డుపై కంకులను ఆరబెట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు.– ఇబ్రహీంపట్నం(కోరుట్ల) -
ముగిసిన జిల్లాస్థాయి క్రీడా పోటీలు
జగిత్యాలటౌన్: నాలుగురోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. నాల్గో రోజు పోటీలను జిల్లా విద్యాధికారి రాము ప్రారంభించారు. చివరి రోజు అండర్– 17 బాలుర విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. కబడ్డీ మొదటి స్థానంలో మెట్పల్లి, రెండో స్థానంలో రాయికల్, వాలీబాల్ మొదటి స్థానంలో మెట్పల్లి, ద్వితీయ స్థానంలో వెల్గటూర్, ఖోఖో మొదటి స్థానంలో కోరుట్ల, ద్వితీయ స్థానంలో మేడిపల్లి నిలిచాయని డీఈవో తెలిపారు. క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా యువజన, క్రీడల అధికారి రవికుమార్ పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా క్రీడల కార్యదర్శి చక్రధర్రావు క్రీడా నివేదిక సమర్పించారు. పెటా జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, కార్యదర్శి అశోక్, పీడీలు పడాల కృష్ణప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మీరాంనాయక్, అజయ్బాబు, కోటేశ్వర్రావు, కొమురయ్య, వెంకటలక్ష్మి, మాధవీలత, జమునారాణి, మల్లేశ్వరి, రవి, లక్ష్మణ్ పాల్గొన్నారు. డిజిటల్పై నైపుణ్యం పెంపొందించుకోవాలిజగిత్యాల: ప్రస్తుత హైటెక్ యుగంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న డిజిటల్ లిటరసిలో భాగంగా ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని డీఈవో రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్లో గణిత ఉపాధ్యాయులకు డిజిటల్ లిటరసిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు డిజిటల్పై నైపుణ్యం పెంపొందించుకోవాలని, విద్యార్థులకు టెక్నాలజీని ఉపయోగించి బోధన చేపట్టాలన్నారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాస్లు, డిజిటల్ లైబ్రరీలు ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్సీ, డేటా సైన్స్లపై నేర్పించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వ డం జరుగుతుందన్నారు. సెక్టోరియల్ అధికా రి రాజేశ్, జయసింహారావు పాల్గొన్నారు. -
లిక్కర్ టెండర్ ప్లీజ్!
40.40214.182,61640.66షాపులుపార్ట్నర్షిప్..4,04080.802,02010,70952.322,033ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు‘గతంలో మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా మద్యం షాపులు కేటాయించేవారు. ఏ వార్డులో వైన్స్ దక్కితే అదేవార్డులో వైన్స్ తెరవాల్సి ఉండేది. ఈసారి మున్సిపాలిటీ పరిధిలోని మద్యం షాపు లాటరీలో దక్కితే ఏ వార్డులోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. హద్దులు ఏమీ లేవు. కొత్త షాపుల ఏర్పాటు తరువాతే స్థానిక ఎన్నికలు జరుగుతాయి’.. అంటూ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎకై ్సజ్శాఖ అధికారులు మద్యం వ్యాపారులకు ఫోన్లు చేసి మరీ టెండర్లు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. మద్యం వ్యాపారాన్ని మించింది మరోటి లేదంటూ టెండర్ వేయండి ప్లీజ్ అంటూ వాట్సప్లో సందేశాలు పంపిస్తున్నారు. -
కుక్కల బెడద
కోరుట్లటౌన్: పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో కుక్కల భయంతో వాకర్స్ ఆందోళన చెందుతున్నారు. రోజూ రాత్రి గ్రౌండ్లో 20 నుంచి 30 కుక్కలు నిద్ర పోతున్నాయి. ఉదయం వేళ గ్రౌండ్కు వచ్చే వాకర్స్ గుంపుగా ఉన్న కుక్కలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. కుక్కలు ఒక్కసారిగా పరిగెత్తడం, రకరకాల విన్యాసాలు చేస్తూ గ్రౌండ్లో తిరగడం ఇబ్బందికరంగా మారింది. అలాగే పట్టణ శివారులోని కల్లూర్రోడ్ పెట్రోలు బంకు సమీపంలో కుక్కలు గుంపుగా రోడ్డుపై ఉండి వెంటాడుతున్నాయని వాహనదారులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు కుక్కల బెడదను నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం
ధర్మపురి: విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసిన ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డిని బుధవారం రాత్రి ఎస్పీ అశోక్కుమార్ అభినందించిన ప్రశంసాపత్రం అందజేశారు. ఇటీవల జరిగిన వినాయక, దుర్గా నవరాత్రోత్సవాలు, దసర ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి చర్యలు చేపట్టిన సీఐని అభినందించారు. సర్వేకు సహకరించాలిజగిత్యాల: ప్రజల జీవన స్థితిగతులపై జగిత్యాల పట్టణంలో జాతీయ గణాంక శాఖ సర్వే చేపట్టనున్నట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం సర్వేకు సంబంధించిన కరపత్రాలను కమిషనర్ స్పందనకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ, మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన అనంతరం ప్రత్యేక ట్యాబ్ ద్వారా కుటుంబాలను ఎంపిక చేస్తూ కుటుంబ యజమాని పేరు, సభ్యుల వివరాలు, విద్యార్హతలు, తదితర వివరాలు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బంది సహకరించాలని కోరారు. అందరూ తమ కళ్లను ప్రేమించాలిజగిత్యాల: అందరూ తమ కళ్లను ప్రేమించాలని, సెల్ఫోన్లకు బానిస కావొద్దని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. కంప్యూటర్, సెల్ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయిస్తే దృష్టిలోపం ఏర్పడుతుందన్నారు. ఆరుబయట గడిపే సమయాన్ని పెంచుకోవాలని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు, పోషకాహారం తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని, షుగర్ వ్యాధి ఉన్న వారు తప్పకుండా రెటినా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆప్తమాలజిస్ట్ డాక్టర్ కృష్ణ, ఆర్ఎంవో గీతిక, డీపీవో రవీందర్ పాల్గొన్నారు. -
మెడికల్ షాపులపై నిఘా
జగిత్యాల: జిల్లాలోని మెడికల్ షాపులపై డ్రగ్ అధికారులు నిఘా పెట్టారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్లో దగ్గు సిరప్ వాడటంతో చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో డాక్టర్ మందులచీటి లేకుండా ఎలాంటి మందులు ఇవ్వొద్దని, అలాగే రెండేళ్లలోపు చిన్నారులకు ఎలాంటి సిరప్లు ఇవ్వొద్దని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. దీంతో మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్న మందులపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేస్తున్నారు. మందులచీటి లేకుండానే.. మెడికల్షాపుల నిర్వాహకులు కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. వైద్యుల మందులచీటి లేకుండానే మందులు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు చేసిన మందులకు రశీదులు ఇవ్వాల్సిండగా కొన్నిషాపుల్లో పాటించడం లేదు. జిల్లాలో 800కు పైగా మెడికల్ షాపులు, 100కు పైగా ఏజెన్సీలు ఉంటాయి. జనరిక్ మందులను కూడా బ్రాండెడ్ మందుల రేట్లకు అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వీటిని అంటగడుతున్నారు. డ్రగ్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలు హుష్కాక్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెడికల్ షాపులను లైసెన్స్ దారుడైన ఫార్మాసిస్ట్ నిర్వహించాలి. కానీ, చాలా దుకాణాల్లో ఫార్మాసిస్ట్లే కన్పించరు. అమ్మకాలకు సంబంధించి రశీదులు, ప్రిస్కిప్షన్ నిల్వ చేయాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క మెడికల్షాపుల్లోనూ ఇవి అమలు చేయరు. ఫిజిషియన్లు ఇచ్చే షాంపిల్ మందులు, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులను విక్రయించరాదు. కానీ జగిత్యాలలోని కొన్ని మెడికల్ షాపుల్లో వీటిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆర్ఎంపీలు, పీఎంపీలు సూచించిన మందులే విక్రయించాలి. మెడికల్ షాపునకు వచ్చిన ఏ కొనుగోలుదారుకై నా మందులను ఇవ్వరాదు. కాగా పలు షాపుల్లో ఇవేమీ పట్టించుకోవం లేదు. గల్లీకో మెడికల్షాపు జిల్లా కేంద్రంలో గల్లీకో మెడికల్షాపు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మెడికల్ షాపులను అనువైన స్థలం ఏర్పాటు చేయాలి. కానీ ఈ నిబంధనలు పాటించడం లేదు. కొన్ని చోట్ల రేకులషెడ్లలో ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల మెడికల్ మందులతో పాటు, ఇతరత్ర వస్తువులను అమ్ముతున్నారు. రేకులషెడ్లలో ఏర్పాటు చేస్తే వేసవికాలంలో మందులు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ నిబంధనలను పాటించడం లేదు. రేకులషెడ్లలో ఆస్పత్రులు ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ స్థలం ఉంటే అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మెడికల్ షాపు నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సిందే. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేనిది మందులు ఇవ్వరాదు. మెడికల్ షాపులు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. కేసులు కూడా నమోదు చేస్తాం. షాంపిల్స్ విక్రయించరాదు. తప్పకుండా రికార్డులు నమోదు చేయాలి. – ఉపేందర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ -
కార్యకర్తలే పార్టీకి బలం
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన శక్తి అని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దేవిశ్రీగార్డెన్స్లో జరిగిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను బలంగా ఉండడానికి కారణం క్షేత్రస్థాయిలో తన కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలేనని, వారి కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన నాయకులకు తన అండదండలు ఎప్పటికీ ఉంటాయన్నారు. బీఆర్ఎస్, టీడీపీ హయాంలో మెజార్టీ సీట్లు గెలిచినట్లుగానే రాబోయే ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యకం చేశారు. ఈ సమావేశంలో నాయకులు బండ శంకర్, తాటిపర్తి విజయలక్ష్మి, గాజంగి నందయ్య, జున్ను రాజేందర్, ధర రమేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నైరాశ్యం
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఉత్సాహం..స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రధాన పార్టీల కేడర్, ఆశావహుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పంచాయతీ పాలకవర్గాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘ కాలంగా ఎన్నికలకు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ జీవో విడుదల చేయడంతో బీసీవర్గాలకు దక్కే స్థానాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఎన్నికలకు సిద్ధమయ్యారు. తాజాగా ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుండటం ఆశావహులు, ప్రధాన పార్టీల కేడర్లో నైరాశ్యాన్ని నింపింది. కోర్టు తీర్పు ప్రకారం కనీసం నెల రోజుల తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా బీసీలకు రిజర్వేషన్లపై కోర్టులో తేలేవరకు వేచి చూస్తారా, లేక పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ గ్రామ్లాలో కొనసాగుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం ఉదయం నామినేషన్ల నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లాలోని పలు పల్లెల్లో సందడి నెలకొంది. అక్కడక్కడ కొందరు ఆశావహులు మద్దతుదారులతో వెళ్లి నామినేషన్లు వేశారు. కాగా.. బీసీ రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. రెండేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలవాలనుకున్న వారి ఆశలపై సాయంత్రానికి నీళ్లు చల్లినట్లయ్యింది. కొద్దిరోజులుగా అధికార యంత్రాంగం ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బందికి శిక్షణ, రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా ఎన్నికలు ఉంటాయని భావించిన వారికి కోర్టు స్టేతో ఊరించి ఉసురుమనిపించిన ట్లయ్యింది. ఆరు వారాల తరువాత కోర్టు విచారణ చేపట్టనుండటంతో, అప్పుడే ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో గ్రామాల్లో నిన్నటి వరకు సందడి నెలకొనగా.. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6ఎంపీటీసీ, మూడు జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 311 ఎంపీటీసీలు, 30 జెడ్పీటీసీ స్థానాలకు తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ను ఆయా జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు. రిజర్వేషన్ల కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపలేదు. ఈక్రమంలో జగిత్యాల జిల్లా కథలాపూర్ ఎంపీటీసీ స్థానానికి కారపు గంగాధర్, ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి ఎంపీటీసీకి నాంపెల్లి వెంకటాద్రి నామినేషన్ వేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం జల్లారం ఎంపీటీసీకి ఓదెలు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్, బోయినపల్లి మండలాల జెడ్పీటీసీలకు ఎడపల్లి అనిల్, గురజా ల శ్రీధర్ నామినేషన్ వేశారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట ఎంపీటీసీ స్థానానికి చిలుక ప్రభాకర్ నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్, మెట్పల్లి ఎంపీటీసీలకు రెడ్డి కుమార్, గొట్టె మధు, వి.సైదాపూర్ జెడ్పీటీసీ స్థానాలకు అరుణ లంకదాసరి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీలకు 6, జెడ్పీటీసీలకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు మారేనా? ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు 23శాతం ఉన్న రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో జారీచేసి, దాని అనుగుణంగా సీట్లు ప్రకటించింది. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో బీసీలకు ఉన్న 23శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తే, 19శాతం మేర బీసీలకు సీట్లు తగ్గనున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 జెడ్పీటీలు ఉండగా, 26బీసీలకు కేటాయించగా, 19 జనరల్కు కేటాయించారు. 556 ఎంపీటీసీలకు 240బీసీలకు, 184 జనరల్కు కేటాయించగా, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలల్లో 19శాతం సీట్లు తగ్గి, అంతే మొత్తంలో జనరల్ సీట్ల సంఖ్య పెరగనుంది. మొత్తంగా స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. పొలిటికల్ సీన్ -
మట్టికుప్పలు.. పిచ్చిమొక్కలు
అంబారిపేట చౌరస్తా వద్ద బస్ షెల్టర్కు అడ్డుగా ఉన్న కర్రలు, మట్టి కుప్పలుఇప్పపెల్లిలో బస్ షెల్టర్ వద్ద పెరిగిన పిచ్చిమొక్కలుకథలాపూర్(వేములవాడ): గ్రామాల్లో ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్ షెల్టర్లు నిర్మించినా కనీస సౌకర్యాలు లేవు. ప్రయాణికులు రోడ్డుపై నిలబడి బస్సులు ఎక్కుతున్నారు. మండలంలోని సిరికొండ, తాండ్య్రాల, ఇప్పపెల్లి, పోసానిపేట, అంబారిపేట చౌరస్తా వద్ద బస్ షెల్టర్లు నిర్మించారు. బస్ షెల్టర్లలో మరుగుదొడ్లు లేకపోవడంతో మల మూత్ర విసర్జన కోసం దూరం వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. అంతలోపే బస్సు వస్తే ఎక్కడమా.. మూత్ర విసర్జనకు వెళ్లడమా అని అవస్థలపాలవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బస్ షెల్టర్లు అపరిశుభ్రంగా ఉండటంతో అందులో నిలబడేందుకు ఇబ్బందులుపడుతున్నారు. బస్సులు వచ్చేవరకు రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు చొరవచూపి బస్ షెల్టర్లలో సౌకర్యాలు కల్పించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరుతున్నారు. -
ఆయుధాలు డిపాజిట్
జగిత్యాలక్రైం: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలపై పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో వ్యక్తిగతంగా లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారి నుంచి డిపాజిట్ చేసుకునేందుకు పోలీస్స్టేషన్ల వారీగా నోటీసులు జారీ అయ్యాయి. జిల్లాలో 30 మంది వద్ద లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం లైసెన్స్డ్ తుపాకులను తెప్పించుకుని పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చేయిస్తున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు ఆయుధాల కోసం లైసెన్స్ పొందారు. వీరితోపాటు ప్రైవేటు బ్యాంక్ల భద్రత కోసం ఆయుధాలకు లైసెన్స్ జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆయుధాలు ఉన్నవారు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉండటంతో ఎన్నికలయ్యే వరకు పోలీసులు డిపాజిట్ చేసుకుంటారు. ఆయుధ లైసెన్స్ ఉన్నవారి వివరాలను నేషనల్ డేటా బేస్ ఆర్ట్స్ లైసెన్స్ వెబ్సైట్లో పొందుపరిచారు. లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి ఐడీ నంబరు కేటాయించారు. ఇప్పటికే జిల్లాలో 30 మంది లైసెన్స్దారులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి బుధవారం సాయంత్రం వరకు డిపాజిట్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయుధ లైసెన్స్ పొందాలంటే... భద్రత కోసం వ్యాపారవేత్తలు, ఇతరులు ఆయుధ లైసెన్స్ పొందాలంటే పలు కారణాలు చూపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ప్రతి వ్యక్తికి ఇతరుల నుంచి ప్రాణహాని ఉంటేనే లైసెన్స్ ఇస్తారు. సంబంధిత వ్యక్తి సంఘ విద్రోహశక్తులు, మావోయిస్టులతో సంబంధం ఉండకూడదు. రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీ నుంచి ముప్పు ఉంటే లైసెన్స్ ఇస్తారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లే వ్యాపారులు, రియల్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆస్తుల రక్షణ కోసం ఆయుధ లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్లు కావాలంటే కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారి పూర్తిస్థాయిలో విచారణ చేపడతారు. లైసెన్స్దారుడు మూడేళ్లకోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. ఒక లైసెన్స్పై 3 ఆయుధాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆయుధాలను కొనుగోలు చేసి వాటి వివరాలను పోలీస్స్టేషన్లో అందించాల్సి ఉంటుంది. లైసెన్స్ కలిగిన వ్యక్తులపై ఏదైనా సందర్భాల్లో క్రిమినల్ కేసులు నమోదైతే వారి ఆయుధ లైసెన్స్ రద్దు చేస్తారు. జిల్లాలో లైసెన్స్డ్ తుపాకులు 30 పోలీస్స్టేషన్లో డిపాజిట్ చేయాలని నోటీసులు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం -
ఆలస్యంగా వచ్చారు.. రంగు డబ్బా తీసుకురండి
వేములవాడఅర్బన్: దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యాసంస్థలు శనివారం పునర్ప్రారంభమయ్యాయి. ఈక్రమంలోనే పలువురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో కళాశాల అధ్యాపకులు వారికి ఫైన్ వేశారు. పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డులోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆలస్యంగా బుధవారం రావడంతో ఒక్కొక్కరికి ఒక్కో రంగుడబ్బా కొని అప్పగించాలని హుకూం జారీ చేశారు. దూరం నుంచి వచ్చామని తమ వద్ద డబ్బులు లేవని చెప్పినా అధ్యాపకులు వినిపించుకోకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై కళాశాల వైస్ప్రిన్సిపాల్ అనురాధను ‘సాక్షి’ వివరణ కోరగా కళాశాల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నందునా వారిలో క్రమశిక్షణ పెంచాలని తాము రంగుడబ్బాలు తీసుకురావాలని ఫైన్గా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చిన రంగు డబ్బాలతోనే కళాశాల, పాఠశాల ఆవరణలో పెయింటింగ్ వేయిస్తామని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కోసమేనంటున్న గురుకుల అధ్యాపకులు -
నడకతో మేలు
నేను ఉద్యోగ విరమణ పొంది ఐదేళ్లవుతంది. రోజూ 30 నిమిషా లపాటు నడుస్త. మరో 30 నిమిషాలపాటు వ్యాయామం చేస్త. చాలాఆరోగ్యంగా ఉంటున్నా. ప్రాంతాలు వేరైనా అందరం కలిసి ప్లాంట్లో పనిచేశాం. ఒకేప్రాంతంలో ఉంటున్నాం. మాకు మేమే స్నేహితులం. – కొమ్ము గోపాల్ ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఇంతకుముందు విద్యుత్ ఉత్పత్తిలో అందరం కలిసి పనిచేసేవాళ్లం. ఇప్పుడు ఉద్యోగ విరమణ పొందాం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వాకింగ్లో కలుస్తూ అందరం కలిసిమెలసి ఉంటున్నాం. బాధలు, సంతోషాలు పంచుకుంటూ ఆనందంగా ఉంటున్నాం. – పురుషోత్తం నాలుగేళ్ల క్రితం రిటైర్డ్ అయిన. ఉద్యోగం చేసే సమయంలో కొందరం మిత్రులం కలిసి కృష్ణానగర్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు అక్కడే ఉంటున్నాం. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నాం. నాకు యోగా అంటే చాలాఇష్టం. నేను సాధన చేస్తూనే మిత్రులకు నేర్పిస్తున్నా. – రాజయ్య -
24 గంటలు.. 20 ఆపరేషన్లు
వేములవాడఅర్బన్: వేములవాడ ఏరియా ఆస్పత్రిలో 24 గంటల్లో 20 వివిధ రకాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. సాధారణ కాన్పులు 4, ఆపరేషన్లు 9, కంటి ఆపరేషన్లు 4, జనరల్ సర్జరీలు 2, ఆర్థో ఆఫరేషన్ ఒకటి చేశారు. ఆపరేషన్ చేసిన వైద్యులు సంధ్య, సోని, మాధవి, సుభాషిణి, చారీ, రమణ, అనిల్కుమార్, రాజశ్రీ, తిరుపతి, రవీందర్, రత్నమాల, నర్సింగ్ ఆఫీసర్స్ ఝాన్సీ, జ్యోతి, అనసూయతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. ఎక్స్లో కేంద్ర మంత్రి అభినందనలు వైద్యసేవలు అందించడంలె నిబద్ధతతో పనిచేస్తున్న వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఎక్స్ వేదికగా అభినందించారు. డాక్టర్లు, సిబ్బంది అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్యకు, వైద్యసిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యులకు ప్రభుత్వ విప్ ఆది అభినందనలు వేములవాడ ఏరియా ఆస్పత్రి వైద్యులు 24 గంటల్లో 20 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు. ఆధునిక వైద్యసేవలతోపాటు శుభ్రత, రోగి సేవ ధోరణిలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. వైద్యులు, సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ ఆస్పత్రి రికార్డు -
గంగ స్నానానికి వచ్చేదెట్లా..
● బస్సుల రద్దుతో ప్రయాణం ప్రయాస ● రద్దయిన సిరిసిల్ల, బెల్లంపల్లి బస్సు సర్వీసులు ● నిలిచిపోయిన సిరిసిల్ల, గర్శకుర్తి, కరీంనగర్ రూట్ సర్వీస్ ● బస్సులను పునరుద్ధరించాలని విన్నపంబోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల ప్రజలకు ఆర్టీసీ బస్సు సేవలు అంతంతే. అందులోనూ ఇటీవల మూడు బస్సు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణ కష్టాలు మరింత పెరిగాయి. సిరిసిల్ల డిపో నుంచి వయా బోయినపల్లి, గంగా ధర, జగిత్యాల, ధర్మపురి మీదుగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వరకు రోజు ఉదయం రెండు బస్సులు నడిచేవి. ఇవే రెండు బస్సులు తిరిగి సాయంత్రం మళ్లీ ఇదే రూట్లో సిరిసిల్లకు చేరుకునేవి. ఇందులో ఒక బస్సు ఉదయం 7 గంటలకు, మరో బస్సు ఉదయం 9 గంటలకు బోయినపల్లికి చేరుకునేవి. కరీంనగర్–1 డిపో నుంచి వయా కురిక్యాల, గర్శకుర్తి, విలాసాగర్, బోయినపల్లి మీదుగా వేములవాడ సిరిసిల్ల వెళ్లేది. గర్శకుర్తి, సిరిసిల్ల బస్సు ఉదయం వచ్చేది. ఈ బస్సు సైతం కొద్ది రోజులుగా నిలిచిపోయింది. బెల్లంపల్లి బస్సు రాక గంగస్నానానికి ఇక్కట్లు సిరిసిల్ల, బెల్లంపల్లి, కరీంనగర్– సిరిసిల్ల మూడు ఆర్టీసీ బస్సుల రాకపోకలు బంద్ కావడంతో ఈ బస్సుల ఆధారంగా ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల–బెల్లంపల్లి బస్సుతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే వారు. ఎక్కువ మంది భక్తులు గంగ(గోదావరి నది) స్నానానికి ఈ బస్సులోనే వెళ్లేవారు. బోయినపల్లిలో బస్సు ఎక్కితే ధర్మపురిలోనే దిగేవారు. ఈ బస్సు ఇప్పుడు నిలిచిపోవడంతో ధర్మపురికి వెళ్లే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్–సిరిసిల్ల బస్సు గర్శకుర్తి మీదుగా వెళ్లడంతో పలువురు నేతకార్మికులు, ఇతర వ్యాపారులు ఈ బస్సులో వెళ్లి ముడిసరుకులు తెచ్చుకునేవారు. ఈ బస్సు రద్దు కావడంతో ఈ రూట్లోని ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బోయినపల్లి మండలానికి గంగాధర–వేములవాడ రింగ్ బస్సు నడిచేది. అది కూడా రావడం లేదు. ఆర్టీసీ అధికారులు స్పందించి సిరిసిల్ల–బెల్లంపల్లి, కరీంనగర్–సిరిసిల్ల బస్సులు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆనందంగా.. ఆహ్లాదంగా.. ఆరోగ్యంగా..
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిలో సుదీర్ఘకాలం భాగస్వాములై ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉద్యోగులు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. రోజూ సూర్యోదయానికి ముందే స్థానిక ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ మైదానానికి కాలినడకన చేరుకుంటున్నారు. వ్యాయామం, యోగా, ధ్యానం సాధన చేస్తూ, ఆసనాలు వేస్తున్నారు. మనశ్శాంతి, ఆహ్లాదం కోసం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సూర్యాస్తమయానికి ముందే మళ్లీ అందరూ మైదానం చేరుకుని సాధన చేస్తున్నారు. రోజూ వ్యాయామం.. యోగా సాధన సుఖదుఃఖాలు పంచుకుంటున్న వైనం ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆదర్శం -
రైలు నుంచిపడి వ్యక్తికి గాయాలు
రామగుండం: కదులుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నంలో సుమిత్గుప్తా అనే ప్రయాణికుడు ప్లాట్ఫారమ్పై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. కరీంనగర్ నుంచి రామగుండం వైపు వస్తున్న పుష్పుల్ రైలులో సుమిత్గుప్తా వస్తున్నాడు. స్థానిక రైల్వేస్టేషన్లో రైలు ఆగింది. ఆ తర్వాత కదులుతున్న క్రమంలో సుమిత్గుప్తా దిగే ప్రయత్నం చేసి ప్లాట్ఫారంపై పడగా తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కరీంనగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేశామని జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి తెలిపారు. -
కాంగ్రెస్ మోసాలను ఎండగడుతాం
సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లో ఎండగడుతామని, 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఎనిమిది హామీలతో కూడిన కాంగ్రెస్ బాకీ కార్డులను బుధవారం ఆవిష్కరించారు. 2023లో ఎన్నికల ముందు అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రతీ మహిళకూ రూ.2500 ఇస్తామని ఇవ్వలేదని, ఇలా ఒక్కో మహిళకు 22 నెలలుగా రూ.55 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. వృద్ధులకు పెన్షన్ను రూ.4 వేలు ఇస్తామని రూ.44వేలు బాకీ పడ్డారని, దివ్యాంగులకు రూ.44వేలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, రైతు భరోసాగా ప్రతీ రైతుకు రూ.2లక్షలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినిలకు స్కూటీ, విద్యాభరోసా కార్డులు బాకీ పడ్డారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ బాకీకార్డులను ఇంటింటికీ తీసుకెళ్లి వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్దాల ప్రచారం చేశారని, వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయొద్దని కోరారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారన్నారు. కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి, టెస్కో మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, పార్టీ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, సిద్ధం వేణు, గజభీంకార్ రాజన్న, పబ్బతి విజయేందర్రెడ్డి, జక్కుల నాగరాజు, ‘సెస్’ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, శ్రీనివాస్రావు, నారాయణరావు, హరిచరణ్రావు తదితరులు పాల్గొన్నారు. బాకీ కార్డులతో ఇంటింటికీ వెళ్తాం ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ -
ఆర్టీసీ లక్కీడ్రా విజేతలు వీరే
విద్యానగర్(కరీంనగర్): బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ 11డిపోల పరిధిలో నిర్వహించిన లక్కీడ్రాను బుధవారం కరీంనగర్ బస్స్టేషన్ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తీశారు. కరీంనగర్కు చెందిన ఈ.రమేశ్ మొదటి బహుమతి రూ.25వేలు, గోదావరిఖనికి చెందిన వి.సదానందం రెండో బహుమతిగా రూ.15వేలు, జగిత్యాలకు చెందిన కె.నాగరాజు మూడోబహుమతిగా రూ.10వేలు గెలుచుకున్నారు. కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఎస్.భూపతిరెడ్డి, 1,2 డిపోల మేనేజర్లు ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్, బస్స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.మల్లేశం, అకౌంట్స్ ఆఫీసర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో యువకుడి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్కు చెందిన కూడలి పర్శరాములు(35) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. పర్శరాములు గ్రామంలో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గ్రామంలోనే కూలీ పనిచేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కడు పేదరికం అనుభవిస్తున్న పర్శరాములు మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం పర్శరాములు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుడికి భార్య వినోద, కుమారుడు రిత్విక్ ఉన్నారు. మల్లాపూర్: మండలంలోని వాల్గొండ తండాకు చెందిన లకావత్ రమేశ్ (45) దుబాయిలోని షార్జాలో బుధవారం వేకువజామున మూడు గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. రమేశ్ ఉపాధి కోసం ఏడాది క్రితం దుబాయి వెళ్లాడు. షార్జాలోని ఓ కంపనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు నిర్వర్తించి తన గదిలో నిద్రిస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కార్మికులు ఇక్కడి కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. రమేశ్కు భార్య పద్మ, కుమార్తె వసంత, కుమారుడు హర్షిత్ ఉన్నారు. శవాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సంజయ్కుమార్ను కోరారు. హుజూరాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందినట్లు తెలిపారు. మున్సిపల్ పారిశుధ్య సూపర్వైజర్ తూముల కుమారస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం లభ్యం హుజూరాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఓ గుర్తు తెలియని మృతదేహం బుధవారం కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడి వయస్సు 40ఏళ్లు ఉంటుందని గుర్తించారు. మృతుడు రెండు రోజుల క్రితం కాలువలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యనా.? లేక మరేదైనా కారణాలా అని తెలియాల్సి ఉంది. ● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి గంగాధర: వృద్ధదంపతులిద్దరూ ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. భర్త చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్సై వంశీకృష్ణ వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో గజ్జెల శంకరయ్య(75)– లక్ష్మి(70) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఎవరూ లేరు. మంగళవారం ఇద్దరూ ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గ్రామస్తులు గమనించారు. వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శంకరయ్య బుధవారం చనిపోయాడు. లక్ష్మి చికిత్స పొందుతోంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): బీటెక్ చదివినా వార్షిక పరీక్షలో ఫెయిలయ్యాడు.. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసినా కలిసిరాక అప్పుల పాలయ్యాడు.. మనస్తాపం చెందిన గోప గోని అజయ్కుమార్(26) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన అజయ్కుమార్ హైదరాబాద్లో బీటెక్ చదివాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. పంటల పెట్టుబడి కోసం కొంత అప్పు చేశాడు. మరికొంత మద్యం తాగేందుకు వెచ్చించాడు. వ్యవసాయం కలిసిరాకపోవడం, అప్పులు తీర్చే దారిలేక, బీటెక్ కూడా ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఈనెల 4న పొలం వద్ద గడ్డిమందు తాగాడు. తాను గడ్డిమందు తాగి విషయాన్ని తన ఫ్రెండ్స్కు ఫోన్ ద్వారా చేరవేశాడు. వారి సమాచారంతో తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఈనెల 7న రాత్రి మృతి చెందాడు. తండ్రి సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. మద్యానికి బానిసై..మానకొండూర్: మానకొండూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సదాశివపల్లి గ్రామానికి చెందిన సాయిని మహిపాల్(35) మద్యానికి బానిసై బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ బి.సంజీవ్ వివరాల ప్రకారం.. మహిపాల్కు పదేళ్ల క్రితం వివాహమైంది. భార్యతో గొడవలతో ఐదేళ్లక్రితం విడాకులయ్యాయి. ఒంటరిగా ఉంటున్న మహిపాల్ మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి కనకమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
ప్రణాళికతో ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి
జగిత్యాలక్రైం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికతో విజయవంతం చేయాలని ఎస్పీ అశోక్కుమార్ సూచించా రు. నేర విచారణ, కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఎన్నికల నియమావళి, అధి కారులు తీసుకోవాల్సిన చర్యలు, నేరాలపై సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియమావళి, ప్రవర్తనపై ప్రతి పోలీసు అధికారి అవగాహన పెంచుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా వేయాలన్నారు. నేరాలు చేసేవారు, నేర స్వభావం కలిగిన వారిని గుర్తించి బైండోవర్ చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ అమరవీరుల ది నోత్సవం సందర్భంగా ఈనెల 21 నుంచి 31 వరకు ఫ్లాగ్ డేను ప్రతి స్టేషన్లో విధిగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన, గణేశ్, దుర్గామాత, దసరా, బతుకమ్మ పండుగలు ప్రశాంతంగా పూర్తి చేయడంలో పాత్ర వహించిన పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచంధర్, రాములు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్పీ అశోక్కుమార్పాల్గొన్న పోలీసు అధికారులు నియమావళిపై అవగాహన ఉండాలి పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలి ఎస్పీ అశోక్ కుమార్ -
రోడ్డు ఇలా.. వెళ్లేది ఎలా..?
ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని 48వార్డులోని టీఆర్నగర్కాలనీకి వెళ్లే దారి. ఎక్కడ చూసినా బురదే. ఎక్కడ జారి పడతామోనని కాలనీవాసులు భయపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. మొన్నటివరకు ఇది గ్రామపంచాయతీగా ఉండేది. మున్సిపాలిటీలో విలీనం చేసినప్పటినుంచి అక్కడి ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ స్పందించి కాలనీ రోడ్డును బాగుచేయించాలని కోరుతున్నారు. – జగిత్యాల -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
మెట్పల్లిరూరల్: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అధికారంలోకొచ్చిన 22నెలల్లో చేసిందేమీలేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం వెల్లుల్లలో బుధవారం పర్యటించారు. ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ బాకీకార్డులు అందించారు. కాంగ్రెస్ హామీలు, మోసం, నయవంచనను ప్రజలకు వివరించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులు చూపించి నిలదీయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కోరారు. మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు బండ రాజేందర్, మురళి పాల్గొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ -
జగిత్యాల
32.0/24.0గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 20257గరిష్టం/కనిష్టంఆయుధాలు డిపాజిట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలపై పో లీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెల్సిందే.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం కాస్త ఎండవేడిగా ఉంటుంది. నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. -
ఆర్టీసీకి దసరా బోనాంజ
జగిత్యాలటౌన్: దసరా సందర్భంగా జిల్లా పరిధిలోని జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోల పరిధిలో సంస్థకు కాసుల పంట పండింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈనెల ఏడో తేదీ వరకు (17రోజులపాటు) చేపట్టిన స్పెషల్ ఆపరేషన్స్తో జిల్లా ఆర్టీసీకి రూ.10కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డిపోల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడిపించారు. ఇందులో రూ.4,49,056తో జగిత్యాల డిపో మొదటి స్థానంలో.. రూ.3,72,051 ఆదాయంతో కోరుట్ల డిపో రెండోస్థానంలో.. రూ.2,56,044తో మెట్పల్లి డిపో మూడో స్థానంలో నిలిచాయి. మూడు డిపోల పరిధిలో ఉన్న బస్సులు 17లక్షల కిలోమీటర్ల మేర నడిచాయి. మొత్తంగా 19 లక్షల మంది ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చారు. ఇందులో 15లక్షల మంది ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలు ఉండటం విశేషం. మూడు డిపోలకు రూ.10 కోట్లకుపైగా ఆదాయం రావడంపై ఆర్టీసీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 20 నుంచి ఈనెల ఏడు వరకు ‘స్పెషల్’ బస్సులు జిల్లా పరిధిలో మూడు బస్ డిపోలు 17లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు 19 లక్షల మంది గమ్యస్థానానికి.. వీరిలో 15లక్షల మంది ‘మహాలక్ష్ములు’ మూడు డిపోల పరిధిలో రూ.10.78 కోట్ల ఆదాయం -
‘భూభారతి’ దరఖాస్తులు పరిష్కరించాలి
జగిత్యాల: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో తహసీల్దార్లతో సమీక్షించారు. ఆర్ఎస్ఆర్లో తేడా ఉన్న సర్వేనంబర్లపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. సాదాబైనామా కేసులు పరిష్కరించాలని, అసైన్డ్ కేసుల్లో ఎంకై ్వరీ పూర్తి చేసి కోర్టు కేసుల్లో ఉన్న భూములపై కౌంటర్ దాఖలు చేయాలన్నారు. భూసేకరణకు తొందరగా అవార్డు చేయాలన్నారు. దరఖాస్తులు పరిశీలించాలి మల్యాల: రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. స్తానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం సిబ్బంది, జీపీలతో సమావేశమయ్యారు. జీపీఓల బాధ్యతలు, విధులపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ అనంద్కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, జమున తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
ఈవీఎం గోదాముల పరిశీలన
జగిత్యాల: ఈవీఎంలు భద్రపర్చిన జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్లోగల గోదాములను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. యంత్రాల భద్రత, సీసీకెమెరాల పనితీరును తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, ఏవో హకీం, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు. గుండె సంబంధిత వ్యాధులు నిర్ధారణ చేసుకోవాలి ● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బుధవారం మాతాశిశు సంక్షేమ కేంద్రంలో హృదయ సంబంధిత వ్యాధుల నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించారు. 2డీఈకో ద్వారా పరీక్షించి సిద్దిపేటలోని సత్యసాయి సంజీవని ఆస్పత్రిలో చికిత్స అందిస్తారని వెల్లడించారు. అనంతరం జగిత్యాల మైనార్టీ గురుకులంలో ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుని నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఫ్రీ సీటు సాధించిన విద్యార్థి సురేందర్ను అభినందించారు. ప్రిన్సిపల్ మహేందర్, అధ్యాపకులు పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత రాయికల్: రైతుల దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రూ.1800 నుంచి రూ.1900వరకే కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరమన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్కుమార్, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సాయికుమార్, మహేందర్, మాజీ కో–ఆప్షన్ మెంబర్ సోహెల్, నాయకులు రాంచంద్రం, వినోద్, రాజేందర్గౌడ్ పాల్గొన్నారు. మద్యం దుకాణాలకు 25 దరఖాస్తులు జగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం షాపులకు బుధవారం వరకు 25 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తుదారులు నేరుగా ఎకై ్సజ్ కార్యాలయంలో సంప్రదించినా.. అధికారులు సలహాలు, సూచనలు ఇస్తారని పేర్కొన్నారు. -
కట్టలకు పగుళ్లు.. ప్రమాదంలో చెరువులు
రైతులు అప్రమత్తంగా ఉండాలి జిల్లాకేంద్రం చుట్టూ చెరువులు ఉన్నాయి. కొన్ని కట్టలు కుంగిపోయి పగుళ్లు బారాయి. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. త్వరలోనే మరమ్మతు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్లో ఈఎన్సీ దృష్టికి తీసుకెళ్లాను. లోతట్టు ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. – సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నాం చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతు చర్యలు చేపడతాం. అలాగే కాలువల్లో పూడిక తీసేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు రానీయం. – ఖాన్, ఎస్సారెస్పీ ఈఈ జగిత్యాల: జిల్లా కేంద్రం చుట్టూ మోతె చెరువు, కండ్లపల్లి చెరువు, లింగంపల్లి చెరువు, ముప్పారపు చెరువు ఉన్నాయి. వీటితోపాటు చల్గల్లో పెద్ద చెరువు, పొలాసలో కొత్తకుంట చెరువులు ప్రధానమైనవి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని చెరువుల కట్టలు కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. కట్టలకు గండ్లుపడితే జిల్లాకేంద్రాన్నే ముంచెత్తనున్నాయి. కండ్లపల్లి చెరువుకు ప్రమాదం జరిగితే నీరంతా పట్టణంలోకే చేరుతాయి. మోతె, కండ్లపల్లి, ముప్పారపు చెరువుల చుట్టూ అనేక ఇళ్ల నిర్మాణాలున్నాయి. ఆ చెరువు కట్టలు పగుళ్లు పారడంతో ఎప్పుడేం జరుగుతుందోనని చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొంచి ఉన్న ముప్పు: జిల్లాకేంద్రంలోని చింతకుంట నుంచి కండ్లపల్లి చెరువు, ధరూర్, మోతె చెరువు మధ్య నిర్మించిన గొలుసుకట్టు కాలువల్లో చెట్లు విపరీతంగా పెరిగాయి. కాలువ ద్వారా నీరు ప్రవహించే పరిస్థితే కన్పించడం లేదు. ఇటీవల చింతకుంట చెరువును కలెక్టర్ సత్యప్రసాద్ స్వయంగా పరిశీలించారు. వెంటనే మరమ్మతు చేపట్టాలని మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో కాలువ కూడా కబ్జా కావడంతో కుచించుకుపోయింది. ఒకవేళ నీటి ప్రవాహం పెరిగితే కాలువద్వారా కాకుండా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కట్టలు పూర్తిగా పగుళ్లుబారడం కలవరపెడుతోంది. కాలువల్లో పూడిక తీయకపోవడం, చెరువు కట్టలకు మరమ్మతు చేయించకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్, ఎస్సారెస్పీ అధికారులు స్పందించి మరమ్మతు చేపట్టాలని కోరుతున్నారు. మరమ్మతు ఎప్పుడో..? చెరువుల మరమ్మతుకు ఎస్సారెస్పీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. మోతె పెద్ద చెరువుకు రూ.288 లక్షలు, ధర్మసముద్రం చెరువుకు రూ.121.20 లక్షలు, చల్గల్ పెద్ద చెరువుకు రూ.54.20 లక్షలు, పొలాస కొత్తకుంట చెరువుకు రూ.14.89 లక్షలు, ముప్పారపు చెరువుకు రూ.101 లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా.. నిధులు మంజూరుకాకపోవడం గమనార్హం. రైతుల్లోనూ కలవరం చెరువు కట్టలు కుంగిపోవడంతో ఆయకట్టు రైతుల్లో నూ ఆందోళన నెలకొంది. పగుళ్లు చూపిన కట్టలకు గండిపడితే తమ పంటలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంగపుత్రుల ఫిర్యాదు మేరకు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్ కండ్లపల్లి చెరువు కట్టను పరిశీలించారు. వెంటనే మరమ్మతు చేపట్టాలని క్వాలిటీ కంట్రోలర్, కన్స్ట్రక్షన్స్ ఎస్ఈతో మాట్లాడారు. కండ్లపల్లి చెరువు కట్టకు మరో రూ.27 లక్షలు మంజూరయ్యాయని పనులు అలసత్వం వద్దని సూచించారు. పట్టణం చుట్టూ నాలుగు చెరువులు కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఎప్పుడేం జరుగుతుందోనని భయంభయం జిల్లాకేంద్రం వాసులకు పొంచి ఉన్న ప్రమాదం చెరువుల మరమ్మతుకు నిధుల ప్రతిపాదన ఇలా.. మోతె పెద్ద చెరువు : రూ.288 లక్షలు ధర్మసముద్రం చెరువు: రూ. 121.20 లక్షలు చల్గల్ పెద్ద చెరువు : రూ.54.20 లక్షలు పొలాస కొత్తకుంట చెరువు : రూ.14.89 లక్షలు ముప్పారపు చెరువు : 101 లక్షలు -
కండ్లపెల్లి చెరువుకట్టకు మరమ్మతు చేయండి
జగిత్యాలటౌన్: కుంగిపోయిన కండ్లపెల్లి చెరువు కట్టకు మరమ్మతు చేయించాలని మాజీమంత్రి జీవన్రెడ్డి చీఫ్ ఇంజినీర్ సుధాకర్రెడ్డిని కోరారు. భారీవర్షాలకు చెరువు కట్ట పది గజాల వరకు కుంగిపోయిందని, దీంతో రైతులు, కండ్లపల్లి, హన్మాజిపేట ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రజాజీవితంలో బాధ్యతగా ఉండాలి ప్రజాజీవితంలో ఉన్నవారు అభిప్రాయాలు వ్యక్తం చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని జీవన్రెడ్డి అన్నారు. మంత్రి అడ్లూరిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఉపసంహరించుకుంటే గౌరవ ప్రదంగా ఉంటుందన్నారు. -
ఆహార నిధి ఏర్పాటు చేయాలి
కొండట్టు ఆలయ పరిసరాలు, ఘాట్రోడ్డు వెంట ఉన్న వందలాది వానరాల ఆకలి తీర్చేందుకు ప్రత్యేక స్థలంలో ఆహారకేంద్రం ఏర్పాటు చేయాలి. దాతల విరాళాల కోసం ఆహార నిధి పేరిట ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి. వీటితోపాటు ఆలయ ఆదాయం నుండి కొంత మొత్తం కేటాయించాలి. – గసిగంటి ఉపేంద్ర, భక్తుడు,మల్యాల భక్తులు స్పందించాలి కొండగట్టుకు వచ్చే భక్తులు వానరాల ఆకలి తీర్చేందుకు అరటిపండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకొస్తే బావుంటుంది. నిత్యం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. వానరాల కోసం కొంత ఖర్చు చేయగలిగితే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. – ఆగంతపు నవతేజ్, భక్తుడు, మల్యాల -
భీం స్ఫూర్తితో ఆదివాసీలు ముందుకెళ్లాలి
మల్లాపూర్: ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొమురం భీం అని నాయక్పోడ్ (ఆదివాసి) సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మొట్ట సంజీవ్ అన్నారు. కొమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా మండలంలోని చిట్టాపూర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీలు, నాయక్పోడ్లు అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. ఆదివాసీల న్యాయపరమైన హక్కుల సాధనకు.. వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కొమురం భీం అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఆదివాసీలు, నాయక్పోడ్ కులపెద్దలు బిచ్చల అనిల్, సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. -
మహనీయుడు వాల్మీకి మహర్షి
జగిత్యాల: రామాయణం మహాకావ్యాన్ని గ్రంథరూపంలో అందించిన మహనీయులు వాల్మీకి మహర్షి అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జీవిత పాఠాలు నేర్పిన రామాయణాన్ని ప్రతిఒక్కరం గుర్తు చేసుకోవాలన్నారు. రామాయణం కథ మాత్రమే కాదని, ధర్మం, నీతి, స్నేహం, కుటుంబ విలువలు నేర్పే అద్భుత పాఠంలా ఉపయోగపడుతుందన్నారు. అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, బీసీ సంక్షేమాధికారి సునీత, డీఆర్డీఏ పీడీ రఘువరణ్ పాల్గొన్నారు. -
దళితులంటే అందరికీ చులకనే..
● ఏ స్థాయిలో ఉన్నా వివక్ష తప్పడం లేదు ● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్జగిత్యాల: సమాజంలో దళితులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగి నా అందరికీ చులకనగానే ఉంద ని, వివక్ష తప్పడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నా రు. అంబేడ్కర్ నుంచి ఇప్పటివరకు దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. కుల వివక్ష అంతానికి ఆర్థిక, సామాజిక సమానత్వం అవసరముందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్రామకృష్ణ గవాయ్పై జరిగిన దాడి.. దళిత మంత్రి అడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు జాతికే అవమానం జరిగినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు, దాడులపై వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి జగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ ఉద్యోగులు నిబద్దతతో పనిచేయాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం విద్యుత్ సిబ్బందితో సమీక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్సేవల్లో ఆగస్టులో జిల్లా ముందువరుసలో ఉందన్నారు. కార్యక్రమంలో అన్ని విభాగాల ఉద్యోగులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. -
డీజీపీని కలిసిన ఎస్పీ
జగిత్యాలక్రైం: డీజీపీ శివధర్రెడ్డిని మంగళవారం ఎస్పీ అశోక్కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సారెస్పీకి 1.86 క్యూసెక్కుల ఇన్ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 1.86లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 37 గేట్లను ఎత్తి 2,27,940 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. మద్యం దుకాణాలకు 13 దరఖాస్తులుజగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం దుకాణా లకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఇప్పటి వరకు 13 వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెంటెండ్ సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కూరగాయల పంటలపై అవగాహనకొడిమ్యాల: మండలకేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో మిరప, కూరగాయల సస్యరక్షణ చర్యలు, కాపాస్ కిసాన్ యాప్, పత్తి కొనుగోలుపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. డీఏవో వి.భాస్కర్, ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్, వెటర్నరీ అధికారి రాకేశ్ పాల్గొన్నారు. పూడూరులో అభ్యుదయ రైతు రాంరెడ్డి శాస్త్రవేత్తలతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. తిరుమలాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతునేస్తంలో ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం దిష్టిబొమ్మ దహనంజగిత్యాలటౌన్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నాయకులు పొన్నం దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు పొన్నం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో ల్యాబ్లు ప్రారంభంజగిత్యాల: పాఠశాలల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోందని డీఈవో రాము అన్నారు. జిల్లాలోని పీఎంశ్రీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలైన కోరుట్ల, మగ్గిడి, ధర్మపురి పాఠశాలలకు అగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్) వర్చువల్ రియాలిటీ(వీఆర్) టెక్నాలజీ సైన్స్ ల్యాబ్లు మంజూరు కాగా.. మంగళవారం వాటిని ప్రారంభించారు. ఈ టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు వివిధ అంశాలను త్రీడీగా చూపిస్తూ.. వారిలో లోతైన అవగాహన, కల్పిత ప్రపంచాల అన్వేషణను ప్రోత్సహిస్తాయన్నారు. బయోల జీ చరిత్ర, భౌతికశాస్త్రల్లో నూతన ప్రయోగాలు, ల్యాబ్ అనుకరణలు, వర్చువల్ టూల్స్ ద్వారా విద్యార్థులు సురక్షితంగా అభ్యసించడమే కాకుండా జ్ఞాన సాధన సాధిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
వానరాల వీరవిహారం
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో వానరాలు ఆకలితో నకనకలాడుతున్నాయి. భక్తుల చేతుల్లోని ప్రసాదాలే వాటికి ఆహారం అవుతున్నాయి. మరోవైపు వానరాలతో కొండగట్టుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రసాదం కవర్లు మొదలు.. సంచులనూ లాక్కేందుకు ప్రయత్నం చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాటి ఆకలి తీర్చేందుకు విరాళాల సేకరణ కోసం వానరాల ఆహారనిధి, ప్రత్యేక ఆహార కేంద్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తీరని ఆకలి.. కొండగట్టులో వేల సంఖ్యలో వానరాలు ఉన్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతోపాటు కొంతమంది అరటిపండ్లు తీసుకొచ్చి అందిస్తున్నారు. దిగువ కొండగట్టులో.. ఘాట్ రోడ్డు వెంట భక్తులు అడపాదడపా పుట్నాలు, బియ్యం, వివిధ రకాల పండ్లు అందిస్తున్నా.. ఆ ఆహారం ఎటూ సరిపోవడం లేదు. దీంతో కోనేరు, ఆలయ పరిసరాల్లోని కొబ్బరి చిప్పలు తింటూ కాలం వెల్లదీస్తున్నాయి. అవి కూడా సరిపోకపోవడంతో భక్తులచేతుల్లోని లడ్డూ, ప్రసాదాలను లాక్కెళ్తున్నాయి. రోడ్డుపై గుంపులుగా చేరుతుండడంతో భక్తులు, వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆలయానికి వెళ్లే దారిలో ఆకలి తీర్చుకుంటున్న వానరాలు, కోనేరు వద్ద కొబ్బరి చిప్ప తింటున్న వానరం -
ఆయిల్ పాం తోటల్లో ‘కామెరూనికస్’ కీటకాలు
కొడిమ్యాల: మండలంలోని కోనాపూర్లో సాగుచేస్తున్న ఆయిల్పాం తోటల్లో మంగళవారం ఉద్యానశాఖ, లోహియా కంపెనీ ఆధ్వర్యంలో పరాగ సంపర్కం కోసం ఉపయోగపడే ఎలైడోబియస్ కామెరూనికస్ కీటకాలను విడుదల చేశారు. జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగుచేస్తున్న ఆయిల్ పాం తోటలు ప్రస్తుతం మూడేళ్ల వయస్సుకు వచ్చాయని, అధిక దిగుబడి కోసం కీటకాలను విడుదల చేశామని, ఒకే మొక్కపై ఆడ, మగ పుష్పాలు పూస్తాయని, వాటిలో పరాగసంపర్కం జరిగి పిందెలుగా మారడానికి ఈ కీటకాలు పుప్పొడిని ఆడ పూల వద్దకు చేర్చుతాయని తెలిపారు. తద్వారా పిందెలో నాణ్యత పెరిగి ఆర్నెళ్లలో దిగుబడి చేతికి అందుతుందని తెలిపారు. ప్రస్తుతం టన్ను ఆయిల్ పాం గెలలకు ధర రూ.19400 ఉందన్నారు. మూడేళ్ల వయస్సున్న తోటల్లో కీటకాలను వదులుతామని లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయభరత్ తెలిపారు. కార్యక్రమంలో డీఏవో భాస్కర్, ఏవో పి.జ్యోతి, ఉద్యాన విస్తరణ అధికారి అనిల్, రైతులు పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
జగిత్యాల: ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. మంగళవారం బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కమిటీ జిల్లాస్థాయి సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రులు కచ్చితంగా క్లినికల్ ఎస్లాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. మున్సిపల్ వాహనాలకు బయో మెడికల్ వేస్ట్ను అందించొద్దన్నారు. ఏజెన్సీ వారికి అప్పగించాలన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 302 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయన్నారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ స్పందన, మోహన్ పాల్గొన్నారు. -
వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం
మల్లాపూర్: వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శప్రాయమని బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచుల నర్సయ్య అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా మంగళవారం మండలకేంద్రంతో పాటు వెంకట్రావ్టపేలో ఉత్సవాలను ఘ నంగా నిర్వహించారు. బోయ వాల్మీకుల్లో 80శాతం ప్రజలు నిరుపేదలు ఉన్నారని, కొన్నిచోట్ల ఎస్టీలు గా, మరికొన్ని చోట్ల బీసీలుగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. బోయలను ఎస్టీల్లో చేర్చాలని చెల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్రానికి బిల్లు పంపించినా పెండింగ్లో ఉందన్నారు. కార్యక్రమంలో బోయ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మీనుగు చంద్రశేఖర్, నాయకులు పెనుకుల మల్లేశ్, పెనుకుల మనోహర్, మీనుగు కొండయ్య, రాజమౌళి, రాజేందర్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల ఆందోళన
జగిత్యాలజోన్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు మంగళవారం ఆందోళనకు దిగారు. కోర్టు విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. న్యాయవాదులు బిరుదుల లక్ష్మణ్, ఉమామహేశ్, దిలీప్, కరుణాకర్, పురుషోత్తం, సంతోష్, అక్బర్, రాజన్న, సాయి, కిరణ్ పాల్గొన్నారు. కోరుట్లలో.. కోరుట్ల: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థకు మంచిది కాదన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరి విజయ్కుమార్, న్యాయవాదులు ఫసియోద్దీన్, కడకుంట్ల సదాశివ రాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పరిషత్’ ఏర్పాట్లు ముమ్మరం
కౌంటింగ్ కేంద్రాలు జగిత్యాల: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడత బీర్పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడత బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, జగిత్యాల, జగిత్యాలరూరల్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మొదటగా పరిషత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీటీసీ రిజర్వేషన్ వివరాలు ఇలా.. బీర్పూర్ (ఎస్టీ జనరల్), ఎండపల్లి, మల్యాల (ఎస్సీ మహిళ), కొడిమ్యాల, గొల్లపల్లి (ఎస్సీ జనరల్), పెగడపల్లి, జగిత్యాల, భీమారం, మేడిపల్లి (బీసీ మహిళ), రాయికల్, కోరుట్ల, వెల్గటూర్, సారంగాపూర్, మెట్పల్లి, బుగ్గారం (బీసీ జనరల్), బుగ్గారం, మల్లాపూర్, కథలాపూర్ (జనరల్ మహిళ), ఇబ్రహీంపట్నం, ధర్మపురి, జగిత్యాల రూరల్ (జనరల్)కు కేటాయించారు. ఎంపీపీ రిజర్వేషన్ల వివరాలు ఇలా.. బీర్పూర్ (ఎస్టీ జనరల్), ఎండపల్లి, బుగ్గారం (ఎస్సీ మహిళ), కొడిమ్యాల, మల్యాల (ఎస్సీ జనరల్), రాయికల్, భీమారం, గొల్లపల్లి, కోరుట్ల (బీసీ మహిళ), పెగడపల్లి, జగిత్యాల, మేడిపల్లి, వెల్గటూర్ (బీసీ జనరల్), ధర్మపురి, మెట్పల్లి, జగిత్యాలరూరల్ (జనరల్ మహిళ), సారంగాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ (జనరల్) స్థానాలుగా ఖరారయ్యాయి. మొదటి దశ పోలింగ్కు ఈనెల 9న నోటిఫికేషన్ రానుండగా.. ఈనెల 23న పోలింగ్, నవంబర్ 11న కౌంటింగ్ చేపట్టనున్నారు. అలాగే రెండో దశకు ఈనెల13న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఈనెల 27న పోలింగ్, నవంబర్ 11 కౌంటింగ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ కల్పించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. ఫేస్–1 పోలింగ్: 10 జెడ్పీటీసీ, 108 ఎంపీటీసీ స్థానాలు పోలింగ్ కేంద్రాలు: 554మండలాలు: బీర్పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో: జగిత్యాల, జగిత్యాలరూరల్, కొడిమ్యాల, మల్యాల, ధర్మపురి, బుగ్గారం కండ్లపల్లి మోడల్స్కూల్లో: రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ ఇబ్రహీంపట్నం మోడల్స్కూల్లో మల్లాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం కల్లూరు మోడల్స్కూల్లో కోరుట్ల, భీమారం, మేడిపల్లి గొల్లపల్లి మోడల్స్కూల్లో: గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్, ఎండపల్లిఫేస్–2 పోలింగ్ 10 జెడ్పీటీసీ, 108 ఎంపీటీసీ స్థానాలు పోలింగ్ కేంద్రాలు: 569మండలాలు: బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లిఫేస్–1 నోటిఫికేషన్ విడుదల: 9న పోలింగ్: అక్టోబర్ 23కౌంటింగ్: నవంబర్ 11ఫేస్–2 నోటిఫికేషన్ విడుదల: 13న పోలింగ్ : అక్టోబర్ 27కౌంటింగ్ : నవంబర్ 11 -
మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయండి
మెట్పల్లి: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. పంట కోతకు వచ్చి రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంతో మార్కెట్లో వ్యాపారులు మద్దతు ధర క్వింటాల్కు రూ.2400 ఉంటే.. రూ.1800కు మించి చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సకాలంలో కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నామన్నారు. ఎన్నికలకు ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో జరిగిన సభలో పంటలకు మంచి ధరలను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత దానిని విస్మరించిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే క్వింటాల్కు రూ.2800 చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు. కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎలాల దశరథరెడ్డి, నోముల లక్ష్మారెడ్డి, అంజిరెడ్డి, జేడీ.సుమన్, ఏలేటి చిన్నారెడ్డి, భాస్కర్రెడ్డి, తిరుపతిరెడ్డి, రాజాగౌడ్ తదితరులున్నారు. -
‘బెస్ట్ అవెలబుల్’ విద్యార్థుల ఆందోళన
జగిత్యాలటౌన్: చదువుకునేందుకు తమను పాఠశాలలోకి అనుమతించడం లేదంటూ బెస్ట్ అవెలబుల్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు జిల్లాకేంద్రంలో ని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద జగి త్యాల, కరీంనగర్ రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. బెస్ట్ అవెలబుల్ స్కూళ్లుగా గుర్తించిన కొ న్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాల్సి ఉంది. రెండేళ్లుగా నిధులు విడుదలకాకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులను క్లాసులకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముందుగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించారు. అక్కడ కాసేపు నిరసన తెలిపారు. అనంతరం రహదారిపై బైటాయించారు. బకాయిలు విడుదల చేసి పిల్లల విద్యాభ్యాసం నిలిచిపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ ఎస్సై మల్లేశం వారికి సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. -
ఎన్నికల్లో లోటుపాట్లు రానీయొద్దు
జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో లోటుపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో నామినేషన్ల స్వీకరణపై ఆర్వో, ఏఆర్వోలకు అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో ఎన్నికలు నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్లు తీసుకోవాలని, ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, అధికారులు, ఆర్వో, ఏఆర్వోలు పాల్గొన్నారు. కారిడార్ అభివృద్ధికి డీపీఆర్ చేపట్టాలి: స్పెషల్ చీఫ్ సెక్రటరీ గ్రీన్ఫీల్డ్ నాగ్పూర్, హైదరాబాద్ హైస్పీడ్ కారిడార్ అభివృద్ధికి డిటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) చేపట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్తో సమీక్షించారు. జాతీయ రహదారుల మాస్టర్ ప్లాన్లో భాగంగా నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు హైస్పీడ్ కారిడార్ అభివృద్ధికి డీపీఆర్ తయారుచేయాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలో కొంతమేర కారిడార్ ఉన్న నేపథ్యంలో దాని ప్రకారం చేపడతామన్నారు. కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఉన్నారు. -
మంత్రి ‘పొన్నం’ క్షమాపణ చెప్పాలి
జగిత్యాలటౌన్/ధర్మపురి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం అన్నారు. జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. మాదిగల ఆత్మగౌరవం దెబ్బతీసేలా సహచర మంత్రి అడ్లూరిని కించపరిచేలా పొన్నం మాట్లాడడం సరికాదన్నారు. 24గంటల్లో క్షమాపణ చెప్పకుంటే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పొన్నం దిష్టిబొమ్మలు దహనం చేస్తామని హెచ్చరించారు. ధర్మపురి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెందోలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాదిగల ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరించిన పొన్నం తీరు సరికాదన్నారు.దుర్భాషలాడిన వారిపై చర్యలు తీసుకోండిజగిత్యాల: ఆస్పత్రుల్లో వైద్యులపై కొందరు చికిత్స కోసం వచ్చి దుర్భాషలాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్కు ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందించారు. మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యులపై అనుచితంగా ప్రవర్తించారని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలన్నారు. ఈ ఘటనలతో వైద్య సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారన్నారు. వైద్యులు శశికాంత్రెడ్డి, నవీన్, అమరేందర్ పాల్గొన్నారు.కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ కరువైందిజగిత్యాలటౌన్: జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ కరువైందని, పోలీస్ యంత్రాంగమే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడారు. బాలెపల్లి రేవంత్రెడ్డిపై గంగారెడ్డి అనుచరులు రాళ్లతో దాడులు చేయగా.. కార్తీక్ అనే మధ్యవర్తికి తగిలిందని, రేవంత్రెడ్డిపై దాడి చేస్తున్నారని, శాంతిభద్రతలు కాపాడాలని పోలీసులకు సమాచారం ఇచ్చినా.. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన రేవంత్రెడ్డినే అరెస్టు చేసి రిమాండ్కు పంపడం దారుణమన్నారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డీజీపీ, సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.కోరుట్ల నుంచి వేములవాడకు టికెట్ ధర రూ.60ఆర్టీసీలో రెట్టింపు చార్జీ వసూలుకథలాపూర్: కోరుట్ల నుంచి వేములవాడకు ఆర్టీసీ బస్ చార్జి రూ.60. కానీ.. కోరుట్ల డిపోకు చెందిన ఓ బస్ కండక్టర్ మండలంలోని సిరికొండకు చెందిన ప్రయాణికుడు గుండేటి రాజు నుంచి రూ.120 తీసుకున్నారు. ఇదేమిటని అడిగితే కోరుట్ల డిపో అధికారులు చెప్పడంతోనే తాను వసూలు చేస్తున్నట్లు కరాఖండీగా చెప్పాడు. రాజుతోపాటు ప్రయాణికులు వారించినా వినిపించుకోలేదు. విషయాన్ని రాజు కోరుట్ల డిపో అధికారులకు ఫోన్లో తెలపగా.. పొంతనలేని సమాధానమిచ్చారు. రాజు తిరుగు ప్రయాణంలో వేములవాడ నుంచి సిరికొండకు వేములవాడ డిపో బస్సులో వెళ్లగా కండక్టర్ మాత్రం రూ.60 తీసుకున్నాడు. రెట్టింపు చార్జి వసూలుపై కోరుట్ల ఆర్టీసీ డిపో అధికారులను వివరణ కోరగా.. ఒక బస్సు ట్రిప్పులో ఎక్కువ ధర తీసుకున్న మాట నిజమేనని, మిగిలిన బస్సుల్లో పెంచలేదని తెలిపారు. -
కరీంనగర్కు ఒడిశా పోలీసులు
కరీంనగర్క్రైం: సైబర్ క్రైం కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన పోలీసులు సోమవారం కరీంనగర్కు వచ్చినట్లు తెలిసింది. కరీంనగర్ టూటౌన్ పరిధికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి పాత్ర ఉందని భావించి అతను ఉంటున్న విద్యానగర్ ప్రాంతంలో దర్యాప్తు చేశారు. సైబర్ నేరస్తులు సామాన్యులకు కొంతడబ్బు ఇచ్చి వారి పేర్లపై ఖాతాలు తెరుస్తుండటంతో ఇలాంటి నేరంతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న పోలీసులు అతడిని అక్కడికి తీసుకెళ్లినట్లు సమాచారం. వేములవాడలో కొండచిలువవేములవాడ పట్టణ శివారులోని మూలవాగు తీరంలో ధోబీఘాట్ వద్ద 9 ఫీట్ల పొడవు ఉన్న కొండచిలువ సోమవారం కనిపించింది. దీన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ట్రాఫిక్ ఎస్సై రాజు అక్కడికి చేరుకుని పాములు పట్టే జగదీశ్కు సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి కొండచిలువను పట్టుకొని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. – వేములవాడ