breaking news
Jagitial District Latest News
-
ఆ ఎన్నిక రద్దు చేయండి..
జగిత్యాలటౌన్: ఏకగ్రీవం చేసిన సర్పంచ్ స్థానాన్ని రద్దు చేయాలని కోరుతూ యామాపూర్ గ్రామస్తులు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. యామాపూర్ సర్పంచ్ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలుకాగా.. ఏకగ్రీవం చేయాలని భావించిన గ్రామ పెద్దలు ఒకరిని బరి నుంచి తప్పించారని ఆరోపించారు. నిరసనలో నామినేషన్ ఉపసంహరించుకున్న ఎల్లాల గోపాల్రెడ్డి కూడా పాల్గొన్నారు. వీడీసీ సభ్యులు తనను బెదిరించి రూ.4లక్షలు ఇచ్చిన వ్యక్తిని ఏకగ్రీవం చేశారని, దానిని రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరారు. పోలీసులు చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు. -
మద్యం షాపునకు అనుమతి ఇవ్వొద్దని ధర్నా
కోరుట్లరూరల్: మండలంలోని అయిలాపూర్లో గతంలో ఎస్సీ కాలనీలో ఉన్న మద్యం షాపును కోరుట్ల–అయిలాపూర్ రోడ్డుకు మార్చడాన్ని నిరసిస్తూ వార్డు మహిళలు గురువారం ధర్నాకు దిగారు. ఊరు చివరన ఉన్న మద్యం షాపును కోరుట్ల–అయిలాపూర్ రోడ్డుకు మార్చేందుకు షెడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. షాపును మార్చడానికి ఎందుకు అనుమతి ఇచ్చారంటూ పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. విషయాన్ని ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని కార్యదర్శి తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళల్ని సముదాయించారు. -
ఏకగ్రీవం.. వివాదం
● ఆర్డీవో కార్యాలయం ఎదుట యామాపూర్ గ్రామస్తుల ఆందోళన ● వీడీసీ బలవంతంగా అభ్యర్థిని తప్పించిందని ఆగ్రహం ● ఎన్నిక జరపాలంటూ అధికారులకు విజ్ఞప్తి మెట్పల్లి: పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల గ్రామాభివృద్ధి కమిటీలు (వీడీసీ) సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న తీరు వివాదాస్పదమవుతోంది. గ్రామస్తుల అభిప్రాయాలను పట్టించుకోకుండా.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో సర్పంచ్ పదవికి బహిరంగ వేలం వేసిన వీడీసీపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో ఓ అభ్యర్థితో బలవంతంగా నామినేషన్ను విత్ డ్రా చేయించి.. ఎన్నిక లేకుండా చేసిన వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు గురువారం మెట్పల్లిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టర్కు నివేదిక అందించాం యామాపూర్లో గోపాల్రెడ్డి నామినేషన్ విత్ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్కు అందించాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఆర్డీవో -
వైభవంగా దత్తజయంతి
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని శ్రీమార్కండేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షుడు బోగ గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాజేందర్, భోగ రాజు, భక్తులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలిసారంగాపూర్: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని అదనపు కలెక్టర్ బీఎస్. లత అన్నారు. బీర్పూర్ మండలం తుంగూరు, కొల్వాయి, తాళ్లధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. తహసీల్దార్ బి.సుజాత, సివిల్ సప్లయ్ అధికారులు ఉన్నారు. అరటితో అధిక ఆదాయంజగిత్యాలఅగ్రికల్చర్: వరితో పోలిస్తే అరటితో అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంలో రైతులు సాగుచేసిన అరటి తోటలను గురువారం ఉద్యానశాఖ అధికారులు పరిశీలించారు. అరటి మొక్కలు నాటేందుకు శీతాకాలం అనువైన సమయమన్నారు. నాటిన 9 నెలల తర్వాత దిగుబడి ప్రారంభమై.. రెండేళ్ల వరకు కొనసాగుతుందన్నారు. టిష్యూ కల్చర్ మొక్కలతో అరటిలో అధిక దిగుబడి వస్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యానశాఖ అధికారి కె.స్వాతి, హెచ్ఈవో అన్వేష్, రైతులు పాల్గొన్నారు. మొబైల్ ఎక్స్రేతో క్షయ నివారణ సులభం● డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ జగిత్యాల: మొబైల్ ఎక్స్రేతో క్షయనివారణ మరింత సులభతరం అవుతుందని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. జిల్లాకు చేరిన మొబైల్ ఎక్స్రేను గురువారం ప్రారంభించారు. గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో ఈ మిషన్ల ద్వారా ఎక్స్రే తీసి టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించవచ్చన్నారు. వైద్యులు శ్రీనివాస్, ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీనివాస్, రవీందర్ పాల్గొన్నారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం● డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి జగిత్యాల: లింగనిర్ధారణ చట్టరీత్యా నేరమని, ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రులను గురువారం తనిఖీ చేశారు. స్కానింగ్ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం వసతులు, వెంటిలేషన్ సౌకర్యం, వెయిటింగ్హాల్ ఉండాలన్నారు. స్కానింగ్ మిషన్స్, డాక్టర్ అర్హత, ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అని తెలిపారు. ఆయన వెంట కట్కం భూమేశ్వర్, పడాల శంకర్ ఉన్నారు. -
జగిత్యాల
31.0/15.0శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 20257గరిష్టం/కనిష్టంనృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి:శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. -
పరిశీలించి.. ఆరా తీసి
● అంతర్గాం ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఏఏఐ బృందం పరిశీలన ● వివిధశాఖల ఉన్నతాధికారులతో సూక్ష్మ సమాచార సేకరణ ● సాంకేతికపరమైన అంశాలపై అధికారుల క్షేత్రస్థాయి పర్యటన ● రోడ్డు, రైల్వే కనెక్టివిటీపై ఆరా ● ప్రాజెక్టు, పంపుహౌజ్, రైల్వేస్టేషన్, గోదావరితీరం సందర్శనఉత్తర తెలంగాణకు ఎయిర్ కనెక్టివిటీ చేసే అంతార్గం ఎయిర్పోర్టు ఏర్పాటుకు గురువారం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారుల బృందం క్షేత్ర పరిశీలన చేపట్టింది. ఎయిర్పోర్టుకు ఉన్న అనుకూలతలు, అడ్డంకులను పరిశీలిస్తూ.. వివిధ అంశాలపై అధికారులను ఆరాతీస్తూ ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో ఎవియేషన్ బృందం పర్యటన కొనసాగింది. పాలకుర్తిలో ఎయిర్పోర్టు నిర్మాణం ఏర్పాటుకు పలుసాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్గాం మండలంలో ఎయిర్పోర్టు నిర్మించాలని తలంచింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రీఫిజిబిలిటీ సర్వే కోసం రూ.50 లక్షలు నిధులు విడుదల చేసింది. దీంతో విమానాశ్రయ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహించేందుకు ఏఏఐ అధికారుల బృందం రాగా.. వారికి వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారుల బృందం సాంకేతికపరమైన అంశాలను నివేదించేలా ప్రతిపాదనలు అందించారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత ప్రభుత్వ స్థలం, గోలివాడ గోదావరినది తీరం, పెద్దంపేట రైల్వేస్టేషన్, గోలివాడ పంపుహౌజ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో ఏఏఐ బృందం క్షేత్ర పరిశీలన చేసింది. – సాక్షిప్రతినిధి,కరీంనగర్, – వివరాలు 8లో.. -
కంట్రోల్రూం వినియోగించుకోవాలి
జగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సహాయ కేంద్రం కంట్రోల్ రూంను వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏవైనా సమస్యలుంటే 96662 34383 నంబర్లో సంప్రదించాలని కోరారు. మూడో ర్యాండమైజేషన్ పూర్తి మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో జనరల్ అబ్జర్వర్ రమేశ్తో కలిసి ర్యాండమైజేషన్ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, నోడల్ అధికారి మధుసూదన్ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
ప్రజాభద్రతలో హోంగార్డుల సేవలు అమూల్యం
జగిత్యాలక్రైం: ప్రజాభద్రత, విపత్తు ప్రతిస్పందన, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ విభాగాల్లో హోంగార్డుల సేవలు అభినందనీయమని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు హోంగార్డ్ రైజింగ్ డే వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డులు చూపే అంకితభావం ప్రశంసనీయం అన్నారు. హోంగార్డు సిబ్బంది డ్యూటీని బాధ్యతగా నిర్వహించే క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి పోలీస్శాఖకు గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, రిజర్వ్ సీఐలు కిరణ్కుమార్, సైదులు, వేణు, రిజర్వ్ ఎస్సైలు, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ -
నేడు ప్రశాంతం
నాడు సమస్యాత్మకం.. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మూడు దశాబ్దాల క్రితం సిరిసిల్ల మానేరు ప్రాంతంలో ఎన్నికలు అంటేనే గ్రామీణుల్లో భయాందోళన ఉండేది. ఒక వైపు పోలీసుల ప్రచారం.. మరో వైపు నక్సలైట్ల అల్టిమేటంతో పల్లెల్లో భయానక వాతావరణం ఉండేది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోవడం.. పోలీసుల అవగాహన కార్యక్రమాలతో ఓటుహక్కును వినియోగించుకునేందుకు పల్లెజనం ముందుకొస్తున్నారు. బహిష్కరణ పిలుపుతో భయాందోళన మూడు దశాబ్దాల క్రితం ఎన్నికలు వచ్చిందంటే సిరిసిల్ల ప్రాంతంలో ఒక రకమైన భయానక పరిస్థితులు ఉండేవి. ఒక వైపు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని నక్సలైట్లు దర్బార్లు పెట్టి పిలుపునిచ్చేవారు. గోడలపై రాతలతో హెచ్చరించేవారు. దీన్ని సవాల్గా తీసుకున్న పోలీసులు పోలింగ్శాతాన్ని పెంచేందుకు జనాన్ని పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకునేవారు. అయినా చాలా మంది గ్రామీణులు ఓటు వేసేందుకు వెనుకంజ వేసేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో నక్సలైట్లు మద్దతు ఉన్న అభ్యర్థులే ఎక్కువగా నిలుచుండేవారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణులు సైతం ఓటుహక్కు వినియోగించుకునేవారు. అసెంబ్లీ ఎలక్షన్స్కు వస్తే ఓటు వేసేందుకు జంకేవారు. ఆ కాలంలో పంచాయతీ ఎన్నికల్లో 65 నుంచి 68 శాతం పోలింగ్ నమోదయ్యేది. అదే ఇప్పుడు 73 నుంచి 78 శాతం వరకు నమోదవుతుంది. బ్యాలెట్లు మాయం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో 1995 ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో అప్పటి పీపుల్స్వార్ నక్సలైట్లు బ్యాలెట్బాక్స్లను అపహరించుకు వెళ్లారు. అయితే తర్వాత పోలీసుల విచారణలో గ్రామంలోని ఓ మిలిటెంట్ వద్ద ఉంచినట్లు తెలుసుకొని స్వాధీనం చేసుకున్నారు. అదే క్రమంలో అప్పటి ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండలం అడవిపదిర గ్రామంలో పోలింగ్అధికారులను బెదిరించడమే కాకుండా బ్యాలెట్బాక్స్ల్లో సిరాను పోసి ఎన్నికలను డిస్టర్బ్ చేశారు. అదే ప్రాంతంలోని కంచర్ల గ్రామంలో కొందరు రిగ్గింగ్ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు కల్లోలిత ప్రాంతంగా ముద్రపడ్డ సిరిసిల్ల ఏరియాలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. పోలీసులు తీసుకున్న అవగాహన చర్యలు, నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోవడం.. గ్రామీణుల్లో ఆర్థిక అక్షరాస్యత.. ఉన్నత విద్యావంతులు పెరిగిపోవడంతో రాజ్యాంగహక్కులపై అవగాహన పొందారు. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి అధికారం దక్కించుకోవాలనే ఆలోచనలో పల్లె ప్రజలు ఉన్నారు. దీంతో ఒకప్పుడు అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా పేరొందిన దుమాల, అడవిపదిర, కంచర్ల, వీర్నపల్లి, మద్దిమల్ల, తిమ్మాపూర్, గుంటపల్లిచెరువుతండా, బుగ్గరాజేశ్వరతండా, వట్టిమల్లతండా, బండమీదితండా, కేలోత్తండా, కోనరావుపేట మండలం నిమ్మపల్లి, వట్టిమల్ల, బావుసాయిపేట, ఎగ్లాస్పూర్, చందుర్తి, రుద్రంగి మండలాల్లోని చాలా గ్రామాల్లో నక్సలైట్ల ప్రాబల్యం ఉండేది. కానీ నేడు ఆ గ్రామాలే ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ నమోదు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మూడు దశాబ్దాల క్రితం నక్సల్స్ మాటే వేదం నేడు ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి మారిన గ్రామీణ పరిస్థితులు ఎన్నికల్లో పోటాపోటీగా బరిలోకి.. -
సర్పంచ్ బరిలో భార్యాభర్తలు, కుమారుడు
సర్పంచ్ బరిలో రిటైర్డ్ ఐపీఎస్ భార్య సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేయాలనే ఉద్దేశంతో మాజీ ఐపీఎస్(ఎస్పీ) భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేసింది. సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన ఉప్పు తిరుపతి(రిటైర్డ్ ఐపీఎస్) భార్య లక్ష్మి గురువారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. ఉద్యోగ రిత్యా ఎక్కడ ఉన్నా సొంత గ్రామంలో అభివృద్ధి, సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి రావడంతో బరిలో నిలిచింది. ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే సర్పంచ్ పదవికి పోటి చేస్తున్నట్లు లక్ష్మి, తిరుపతి పేర్కొన్నారు. రాత్రివరకూ నామినేషన్లుబుగ్గారం: మూడో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా రెండోరోజు నామినేషన్ల ప్రక్రియ మండలంలోని వెల్గొండ గ్రామంలో అర్ధరాత్రి వరకూ కొనసాగింది. మండలంలో మొత్తం నాలుగు నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెల్గొండలో రాత్రి పదిన్నర వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. మండలంలోని 10 గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులుగా రెండో రోజు 23 మంది, 96 వార్డులకు 113 మంది నామినేషన్ వేశారు. గురువారం శుభదినం కావడం.. పైగా పౌర్ణమి కావడంతో నామినేషన్లు వేయడానికి అధిక మంది అభ్యర్థులు ఆసక్తి చూపారు. ఆశావహులు జ్యోతిష్య పండితులను సంప్రదించి తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి మూడు గంటల వరకు రాహుకాలం కావడంతో ఎక్కువ మంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కేంద్రానికి వచ్చారు. రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఎంపీడీవో సుమంత్, ఎంపీవో అఫ్జల్మియా నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్ బరిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నామినేషన్లు తిరస్కరణకు గురైన పక్షంలో ఎవరోఒకరు బరిలో ఉండేందుకు ముందుచూపుగా వ్యవహరించిన ఆ కుటుంబానికి వింత పరిస్థితి ఎదురైంది. గ్రామానికి చెందిన పుల్ల సాయగౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ముందు జాగ్రత్తగా తన భార్య పుష్పలత, కుమారుడు వెంకటేశ్తో కూడా నామినేషన్ వేయించాడు. అయితే సర్పంచ్ స్థానానికి వీడీసీ వేలం వేయడం.. అది వివాదానికి దారితీయడం.. వేలం వేసిన వీడీసీ సభ్యులు పలువురిని బైండోవర్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు గ్రామంలో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే నిర్వహిస్తామని, నామినేషన్లు ఎవరూ విత్డ్రా చేసుకోవద్దని సూచించారు. వీడీసీ ఆంక్షలకు భయపడొద్దని చెబుతూనే.. నామినేషన్ వేసిన ప్రతిఒక్కరూ బరిలో ఉండాల్సిదేనని తేల్చిచెప్పారు. ఫలితంగా ముందు జాగ్రత్తతో మూడు నామినేషన్లు వేసిన సాయగౌడ్ కుటుంబం కూడా బరిలో నిలవాల్సి వచ్చింది. ప్రచారంలో భాగంగా ముగ్గురు కలిసే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భర్తను గెలిపించాలని భార్య.. తండ్రిని గెలిపించాలని కుమారుడు ఓట్లు అభ్యర్థిస్తున్న తీరును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. సర్పంచ్ బరిలో 75 ఏళ్ల వృద్ధురాలుమంథనిరూరల్: అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ 75 ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్ బరిలో నిలబడి సమరానికి సై అంటోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపేట వెంకటమ్మ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉప్పట్ల పంచాయతీకి జనరల్ మహిళ రిజర్వేషన్ రాగా ఆ సామాజికవర్గం నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడం వెంకటమ్మతో పాటు మరో ఇద్దరు పోటీలో ఉన్నారు. అయితే బరిలో నిలిచిన ముగ్గురిలో వెంకటమ్మ వృద్ధురాలు కావడం, గ్రామాభివృద్ధిలో ముందుంటానంటూ భరోసా కల్పిస్తూ తనకు సర్పంచ్గా అవకాశం కల్పించాలని ప్రచారం చేయడం హాట్ టాపిక్గా మారింది. -
పరిశీలించి.. ఆరా తీసి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా అంతర్గాం గోలివాడ శివారులోకి వచ్చే ప్రభుత్వ భూముల వద్దకు ఏఏఐ బృందం అధికారులు చేరుకునే సరికి ఇరిగేషన్, రెవెన్యూ, గ్రౌండ్వాటర్, హైడ్రాలజిస్ట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, ఆర్అండ్బీ, మైనింగ్ తదితరశాఖలకు చెందిన జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య భూమికి సంబంధించి నక్ష (చిత్రపటం) ఆధారంగా వివిధ సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమి లభ్యత, సత్వరమే అందుబాటులోకి తీసుకునే అవకాశాలు, భూ విస్తీర్ణం, సదరు భూములలో సాగయ్యే పంటలు, భూముల యధార్థ స్థితిగతులతో పాటు ప్రభుత్వేతర భూలభ్యత, విస్తీర్ణం తదితర అంశాలను వివరించారు. ప్రభుత్వ భూముల్లో హైటెన్షన్ టవర్లు ప్రతిపాదిత స్థలంలో 400 కేవీ హైటెన్షన్ టవర్లు, విద్యుత్ తీగలను పరిశీలించిన ఏఏఐ అఽధికారులు తొలగించాల్సి ఉంటుందని, లేదంటే భూగర్భం నుంచి విద్యుత్లైన్ వేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రతిపాదిత స్థలం నుంచి నాలుగు కిలోమీటర్ల రేడియస్లో 45 మీటర్లలోపు, ఆరు కిలోమీటర్ల రేడియస్ తర్వాత 90 మీటర్ల ఎత్తులో నిర్మాణాలున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేయగా, ప్రతిపాదిత స్థలంలో సుమారు 60కి పైగా టవర్లు ఉండే అవకాశం ఉంటుందని ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. తొలుత టవర్లను ఎత్తివేసేందుకు అంచనా వ్యయం సుమారు రెండువేల కోట్లుగా భావించినా, ప్రస్తుతం ఏఏఐ వారి చ్చిన నివేదికలలో పేర్కొన్న మేరకు మరోసారి అంచనా వ్యయ నివేదిక సిద్ధం చేయాల్సి ఉండనుంది. స్థల లభ్యతపై ఎయిర్పోర్టు నిర్మాణానికి సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరం ఉన్నట్లు ఏఏఐ అధికారులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం 600 ఎకరాల ప్రభుత్వ భూ లభ్యత ఉండగా, మరో 400 ఎకరాలు ప్రభుత్వేతర భూములు అందుబాటులో ఉన్న నివేదికను అందజేసినట్లు సమాచారం. ల్యాండింగ్ అయ్యే స్థలం నుంచి 1.5 కిలో మీటర్ రేడియస్లో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని, సదరు స్థలాన్ని నిషేధిత స్థలంగా పరిగణించడం జరుగుతుందని ఏఏఐ ప్రతినిధులు తెలిపారు. గోదావరినది తీరం సందర్శన ఏఏఐ బృందం గోలివాడ గోదావరినది తీరాన్ని సందర్శించడంతో పాటు నీటి లభ్యత అంశాలను నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో నీటి లభ్యత 130 మీటర్లు, వరదల సమయంలో గరిష్టంగా 280 మీటర్ల ఎత్తులోకి వరద చేరుతుందని, భూగర్భ జలాలు పది మీటర్లస్థాయిలో ఉంటాయని వివరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ఏటా గరిష్టంగా ఇన్ఫ్లో, కనిష్ట ఇన్ఫ్లో, నీటి లభ్యత, సాగు, తాగునీటి కేటాయింపుల వివరాలు, ప్రాజెక్టు గేట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ వివరాలు, పునరావాసం తదితర అంశాలను తెలుసుకున్నారు. అండర్గ్రౌండ్ వంతెన పరిశీలన, రోడ్డు భూగర్భంలో ఏమైనా రైల్వే కమ్యూనికేషన్కు కేబుల్స్, రైల్వే ట్రాక్షన్ మీద విద్యుత్ తీగల ఎత్తు, ప్రతిపాదిత విమానాశ్రయం స్థల దూరం, సమీపంలో ఉన్న విద్యుత్ టవర్స్ ఎత్తు, ప్రతీ రోజు రైళ్ల రాకపోకల సంఖ్య తదితర అంశాలను నేరుగా పెద్దంపేట రైల్వేస్టేషన్కు వచ్చి తెలుసుకున్నారు. మొత్తంగా ఏఏఐ అధికారుల బృందం పర్యటనతో ఇప్పటికై నా విమానం ఎగిరేనా.. ఎప్పటిలాగే పర్యటనలు, నివేదికలకే పరిమితమవుతుందా అనే చర్చ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజల్లో నెలకొంది. -
యువకుడి ఆత్మహత్య
పెగడపల్లి: కుటుంబసభ్యులు మందలించడంతో బీటెక్ చదివిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాములపల్లిలో చోటుచేసుకుంది. స్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నీలం రమేశ్, జమున దంపతులకు కూతురు వర్షిత, కుమారుడు అరవింద్ ఉన్నారు. అరవింద్ హైదరాబాద్లో బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. మంచి ఉద్యోగం చూసుకోవాలని కుటుంబ సభ్యులు అరవింద్ను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అరవింద్ బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో మహిళ.. చందుర్తి(వేములవాడ): ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్నసిరిసిల్ల చందుర్తి మండలం బండపల్లిలో విషాదం నింపింది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాలు. బండపల్లికి చెందిన నేదూరి అంజవ్వ(55)కు భర్త పోశయ్యతోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం కొనుగోలు చేసి హార్వెస్టర్ను కొనుగోలు చేయగా ఆర్థికంగా నష్టపోయారు. హర్వెస్టర్ విక్రయించిన అప్పులు తీరలేదు. దీనికితోడు వ్యవసాయంలో వచ్చిన నష్టంతో పూర్తిగా దివాళ తీశారు. దీంతో అప్పులిచ్చిన వారు అప్పులు చెల్లించాలని కోరితే ముగ్గురు కుమారులు పట్టించుకోకుండా పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై అంజవ్వ ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకుంది. మృతురాలు అంజవ్వ తల్లి రాజవ్వ వృద్ధాప్యంలో అనా రోగ్యంతో బాధపడుతోంది. ఏకై క కుమార్తె అంజవ్వ ఆత్మహత్య చేసుకోవడంతో నాకు దిక్కెవరూ అంటూ తల్లి రాజవ్వ రోదిస్తుండడంతో అక్కడున్న వారందరూ కన్నీరుపెట్టారు. కాగా అంజవ్వ భర్త పోశయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రైలు కిందపడి యువకుడు.. జమ్మికుంట: అనారోగ్య కారణాలతో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామంగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. తనుగుల గ్రామానికి చెందిన జక్కె రజనీకాంత్(31) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బిజిగిరి షరీఫ్, పొత్కపల్లి రైల్వేస్టేషన్ మధ్య తనుగుల సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. తల్లి జక్కె రమ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. జీవితంపై విరక్తి చెంది డ్రైవర్.. ముస్తాబాద్(సిరిసిల్ల): జీవితంపై విరక్తి చెంది ఓ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సద్ది రాజిరెడ్డి(40) తల్లితో కలిసి డబుల్బెడ్రూమ్ ఇంటిలో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం రాజిరెడ్డి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారాడు. బుధవారం రాత్రి భోజనం చేసిన తన గదిలో నిద్రించాడు. వరండాలో తల్లి సత్తవ్వ పడుకుంది. మరుసటి రోజు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు రాజిరెడ్డి ఇంటికెళ్లారు. సత్తవ్వతో మాట్లాడగా, రాజిరెడ్డి కోసం ఆరా తీశారు. ఇంకా లేవలేదని తల్లి తెలపగా.. సదరు నాయకులు తలుపులు తట్టిన స్పందన రాలేదు. దీంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. సత్తవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కువైట్లో వలసజీవి మృతిముస్తాబాద్(సిరిసిల్ల): ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వలసజీవి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కుటుంబ సభ్యులు తెలి పిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎండీ వేదుల్(36) కువైట్లో పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఫుడ్పాయిజన్కు గురైన వేదుల్ను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వెంటిలేటర్పై చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస వదిలాడు. మృతునికి భార్య షబానా, కుమారుడు, కూతురు ఉన్నారు. వేదుల్ మృతదేహన్ని స్వగ్రామానికి రప్పించి, గల్ఫ్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పొలంలో దున్నుతుండగా కేజ్వీల్ ఊడిపోయి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో విషాదం నింపింది. ఎస్సై రాహుల్రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాలు. వెంకటాపూర్కు చెందిన గడ్డం జితేందర్(30) గురువారం పోతిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో పొలం దున్నుతుండగా కేజ్వీల్ ఊడిపోయింది. ఏం జరిగిందోనని తెలుసుకునేందుకు వెనక్కి తిరిగి చూడగా ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి బాల్రాజ్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన జితేందర్ మరణంతో వారి కుటుంబం రోడ్డున పడింది. మృతునికి భార్య దివ్య, కుమారుడు విశాల్, తల్లి లక్ష్మి ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి వెల్గటూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఎండపల్లి మండలం కొత్తపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేటకు చెందిన గౌరెల్లి లక్ష్మణరావు(37) గత నెల 29న వెల్గ టూర్ నుంచి బైక్పై కొత్తపేట వస్తుండగా రోడ్డుపై గుంతలను తప్పించే క్రమంలో ముత్తునూర్కు చెందిన కల్యాణ్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడ్డారు. కల్యాణ్ను జగిత్యాల, లక్ష్మణరావును కరీంనగర్ తరలించారు. చికిత్సపొందుతూ లక్ష్మణరావు గురువారం మృతి చెందాడు. లక్ష్మణరావుకు 8 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య సహజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. భార్య వెంటే భర్త.. మానకొండూర్ (శంకరపట్నం): భార్య మృతి చెందిన 24 గంటలకే భర్త ప్రాణాలొదిలిన ఘటన శంకరపట్నం మండలం ముత్తారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కనకం రాజమల్లు, రాజవ్వ దంపతులు అన్యోనంగా ఉండేవారు. కొంతకాలంగా వీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాజవ్వ బుధవారం మృతి చెందగా, భర్త రాజమల్లు గురువారం మృతి చెందాడు. భూ విస్తీర్ణం అధిక నమోదుపై జీపీవోపై కేసుమల్యాల: భూవిస్తీర్ణం పహణీలో అధికంగా నమోదు చేసిన జీపీవోతోపాటు, భూయజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. మండలంలోని తాటిపల్లికి చెందిన జలజ కొన్నేళ్ల క్రితం పహణీల సర్టిఫైడ్ కోసం తహసీల్దార్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకుంది. బల్వంతాపూర్ జీపీవో ప్రవీణ్ను కలిసి భూవిస్తీర్ణం అధికంగా నమోదు చేయాలని సంప్రదించింది. దీనికి ప్రవీణ్ తాటిపల్లికి చెందిన కొన్ని సర్వే నంబర్లలోని 2.20 ఎకరాలను జలజ పేరిట రాయించాడు. ప్రభుత్వ రికార్డులు, పహణీలను ట్యాంపరింగ్ చేశాడంటూ తహసీల్దార్ వసంత పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రవీణ్, జలజపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
స్వరశంఖాలు
సంగ్రామంలో● అభ్యర్థులకు వ్యాఖ్యాతలుగా సిరిసిల్ల గొంతులు ● ఆ గొంతులు వింటేనే ఓటర్లు ఫిదా ● ఎన్నికల నేపథ్యంలో వేలాది మందికి ప్రచారబాణీలుసిరిసిల్లటౌన్: ఊరుపోరులో సిరిసిల్ల స్వరాలు మార్మోగుతున్నాయి. ఏ ఎన్నిక అయినా వారి గొంతులే వినిపిస్తాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా వినిపించే మృదుమధుర గొంతులు సిరిసిల్ల వాసులవే. పట్టణానికి చెందిన ఎండీ సలీం, సాంబారి రాజు గొంతులు అభ్యర్థుల తరఫున ఓట్లను అడుగుతున్నాయి. అభ్యర్థి ఎవరైనా గొంతు వీరిదే. వీరి స్వర విన్యాసాలపై ప్రత్యేక కథనం.సిరిసిల్లకు చెందిన ఎండీ సలీం ఎన్నికల ప్రచార స్వరకర్తగా పేరుంది. సలీం స్వర ప్రస్థానం 1974లో ప్రారంభమైంది. పదోతరగతి చదివే రోజుల్లో అప్పుడే ప్రారంభమైన పట్టణంలోని శ్రీలక్ష్మి థియేటర్లో ఆడే సినిమాలకు సంబంధించిన ప్రచారంతో వ్యాఖ్యాతగా అరంగేట్రం చేశాడు. ‘రోజూ నాలుగు ఆటలు నేడే చూడండి..’ అంటూ మొదలైన స్వరప్రస్థానం ఎన్నికలు వచ్చాయంటే మరింత మారుమోగుతుంది. ఇందిరాగాంధీ నుంచి కేసీఆర్, ఎమ్మెస్సార్, కేటీఆర్, భాగారెడ్డి, నర్సింగరావు, గొట్టె భూపతితోపాటు ఇప్పటి వార్డు, కౌన్సిలర్ల వరకు ఎన్నికలు ఎక్కడ జరిగినా సలీం స్వరం ప్రచారాస్త్రమైంది. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాలకు సలీం గళం పరిచయమైంది. 1988లో ఆకాశవాణిలో 25 నిమిషాల ప్రత్యక్ష వ్యాఖ్యానం, 1989లో ఘంటసాల ఆలపించిన పాటలకు తన గొంతుతో వ్యాఖ్యానం చేశారు. అనంతర కాలంలో చాలా ఏళ్లు న్యూస్ చానల్లో న్యూస్రీడర్గా రెండో ప్రస్థానం ప్రారంభించారు. సలీం ప్రతిభకు ఎన్నో పురస్కారాలు వచ్చాయి.సిరిసిల్లకు చెందిన మరో వ్యాఖ్యాత సాంబారి రాజు. గురువు సలీం వ్యాఖ్యానికి తీసిపోకుండానే ప్రకటనలకు స్వరం అందిస్తున్నారు. 1982, జూన్ 16న సిరిసిల్లకు చేనేత కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటేశం, బాలలక్ష్మి. ఆరో తరగతి వరకు చదువుకున్న రాజు, తన బాబాయ్ సాంబారి ప్రదీప్ నడిపే ఆర్కెస్ట్రాలో ప్రవేశించాడు. పదిహేనేళ్ల క్రితం డబ్బింగ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టిన ప్రస్థానం నేడు ఎన్నికల ప్రచారం, ప్రకటనలకు స్వరం అందించే స్థాయికి ఎదిగారు. ఇరవై ఏళ్లుగా 20వేలకు పైగా వ్యాపార, ఎన్నికల ప్రకటనలకు తన స్వరాన్ని అందించారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రస్తుతం ఆన్లైన్ సేవలనూ అందిస్తున్నారు. సమాచారం పంపితే చాలు వాయిస్ ఓవర్ సిద్ధం చేసి, మెయిల్ చేసేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్, సుంకె రవిశంకర్, గంపగోవర్ధన్, షబ్బీర్ అలీ ఎన్నికల్లో నిల్చోగా వారి ప్రచారంలో తన గొంతు అందించారు. సలీం గొంతుకు సలాంస్వర‘రాజ’సంప్రాంతీయ యాసల్లో వ్యాఖ్యానం తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ యాసల్లో వారు కోరిన విధంగా వ్యాఖ్యానం చేస్తున్నాను. గురువు గారు సలీం స్ఫూర్తితో 20 ఏళ్లుగా వ్యాఖ్యానంలో కొనసాగుతున్నాను. నాతో పాటుగా ఫిమేల్ వాయిస్కు స్థానిక మహిళ స్వాతి గొంతు అందిస్తున్నారు. ఇతర భాషల్లోనూ ప్రకటనలు చేస్తున్నాం. పంచాయతీ ఎన్నికల ప్రకటనలు విరివిగా చేస్తున్నాం – సాంబారి రాజు, సిరిసిల్ల -
జగిత్యాల
29.0/15.07గరిష్టం/కనిష్టంఐయిలేని మల్లన్నకు బోనాలుజగిత్యాలరూరల్: వంజరిపల్లిలో అయిలేని మల్లన్న స్వామికి బోనాలు సమర్పించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొని పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ చేగుంట రజిత, నాయకులు తిరుపతి, రవి, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. పాక్షికంగా మేఘావృతం అవుతుంది. సాయంత్రం, రాత్రి సమయంలో చలి గాలులు కొనసాగుతాయి. గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025బెడిసికొట్టిన ‘వీడీసీ’ వ్యూహం మెట్పల్లి మండలం జగ్గాసాగర్ సర్పంచ్ ఎన్నిక విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) వ్యూహం బెడిసికొట్టింది. -
బల్దియాలో అవినీతిని అరికట్టండి
మెట్పల్లి: మెట్పల్లి బల్దియాలో అవినీతిని ఉన్నతాధికారులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల్లో అధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రజల నుంచి లంచాలు వసూలు చేయిస్తున్నారని, వార్డుల్లో వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. మున్సిపాలిటీని అవినీతికి అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు సుంకేట విజయ్, మద్దెల లావణ్య, బొడ్ల నగేష్, కొయ్యల లక్ష్మణ్, తోకల సత్యనారాయణ తదితరులున్నారు. -
మల్లన్నస్వామికి బోనం మొక్కులు
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేట శ్రీమల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం దండివారం సందర్భంగా సుమారు 17వేల మంది భక్తులు బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.79,510 ఆదాయం సమకూరింది. డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్ కన్నం హారిణి స్వామివారిని దర్శించుకున్నారు. ఫౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య, ఈవో ముద్దం విక్రం, అర్చకులు రాజేందర్, సీఐ నర్సింహా రెడ్డి, శ్రీనివాస్, ఎస్సైలు కృష్ణసాగర్రెడ్డి, గీత, కుమారస్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫ్యూచర్ సిటీ కాదు..
పెండింగ్ పనులు పూర్తి చేయండిమెట్పల్లి: కొత్తగా ఫ్యూచర్ సిటీని నిర్మించే ముందు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో శిథిలావస్థలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వాసుపత్రి, సమీకృత మార్కెట్ భవనాలను బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హాయాంలో చేపట్టిన ప్రభుత్వాసుపత్రి, సమీకృత మార్కెట్ భవనాల పనులు 90శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన చిన్నచిన్న పనులను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా నిర్లక్ష్యం చూపుతోందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజాఅవసరాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం కొత్తగా ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీలు నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు చంద్రశేఖర్రావు, అంగడి పురుషోత్తం, గజం రవి, మోరెపు తేజ తదితరులున్నారు. -
నామినేషన్ సెంటర్ల తనిఖీ
గొల్లపల్లి/పెగడపల్లి: నామినేషన్ కేంద్రాల వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా గొల్లపల్లి మండలకేంద్రంతోపాటు, చిల్వాకోడూర్, తిరుమలాపూర్, పెగడపల్లి మండలం నంచర్లలోని నామినేషన్ కేంద్రాలను బుధవారం సందర్శించారు. ఈనెల 5 వరకు నామినేషన్లు స్వీకరించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హారిణి, తహసీల్దార్లు మాజీద్, ఆనందర్కుమార్, ఎంపీడీవోలు రవీందర్, ప్రేమ్సాగర్ ఉన్నారు. రెండో విడత ప్రశాంతం జగిత్యాల: జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఏడు మండలాల్లో 144 గ్రామపంచాయతీలకు 941 నామినేషన్లు, 1276 వార్డు స్థానాలకు 2,927 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుజగిత్యాలక్రైం: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని, ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సోషల్మీడియాపై నిఘా పెంచామన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. మూడు విడుతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. అధికారులు సిబ్బందికి మార్గదర్శనం చేస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మద్యం, నగదు, ఉచితాల పంపిణీపై నిఘా పెంచాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్ర్పైజ్ వెహికల్ చెకింగ్ చేపట్టాలన్నారు. నేరాలకు పాల్పడేవారు, రౌడీషీటర్స్పై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా ఉంచాలన్నారు. విద్వేషాలు రేచ్చగొట్టేలా.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలు పోస్ట్ చేసినా.. షేర్ చేసిన వారితోపాటు గ్రూప్ అడ్మిన్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
అయ్యప్పా.. ఒకటే ట్రిప్పా?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లా అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైలు విషయంలో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. నాందేడ్ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలు ఒక ట్రిప్ అది కూడా దిగువమార్గంలో వయా కరీంనగర్– పెద్దపల్లి మార్గంలో ఏటా నడిపిస్తున్నారు. ఈ రైలు ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప స్వాములకు, భక్తులకు సరిపోవడం లేదు. ముఖ్యంగా మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట నుంచి శబరిమలకి వెళ్లే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం ఈ నెల మొత్తం, వచ్చే నెల 15 (సంక్రాంతి ) మకరజ్యోతి వరకు శబరిమల సన్నిధానం తెరచి ఉంటుంది. ఈ మాసంలో ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు, అయ్యప్ప మాలధారులు శబరిమల దర్శనానికి వెళ్తుంటారు. వీరికి అందుబాటులో ఉండేది రైలుమార్గమే. ఇందుకు తగినన్ని రైళ్లు మన ఉమ్మడి జిల్లా నుంచి లేవు. రామగుండంలో ప్రతి రోజు నిలిచే 12626 కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రెండు నెలల ముందు రిజర్వేషన్ చేసుకున్న కూడా కన్ఫర్మ్ కానీ పరిస్థితి ఉంటుంది. ఇది దేశంలో అత్యంత దూరం నడిచే రైళ్లలో ఒకటి. 16318 హిమసాగర్ వీక్లీ ఎక్స్ ప్రెస్, 22647 కోర్బా బై వీక్లీ సూపర్ ఫాస్ట్ రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల నుంచి కొల్లాం లేక కొట్టాయం వరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలోని కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, విశాఖపట్నం, చర్లపల్లి, కాజీపేట, వికారాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ మార్గాల్లో 10 ట్రిప్పులు ఎగువ, దిగువ మార్గాల్లో నడిపిస్తుంటే, కరీంనగర్ నుంచి ప్రతి ఏటా తూతూ మంత్రంగా ఒకట్రిప్ వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సిర్పూర్ కాగజ్నగర్ నుంచి ఒక ట్రిప్ కూడా వెళ్లడం లేదు. ఈ నిర్లక్ష్య వైఖరిపై శబరిమల వెళ్లే ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు ఎంపీలు చొరవ తీసుకోవాలి ఏటా వేలాదిమంది భక్తులు ఉమ్మడి జిల్లా నుంచి శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో నాందేడ్ నుండి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలులో దిగువ మార్గంలోనే అవకాశం కల్పించడంపై భక్తులు మండిపడుతున్నారు. తక్షణమే కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవ తీసుకొని నాందేడ్ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైళ్ల సర్వీసులను కనీసం ఎగువతోపాటు దిగువ మార్గాల్లో మొత్తంగా 8 ట్రిప్పులు నడపాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు. -
దివ్యాంగులు చట్టాలను వినియోగించుకోవాలి
మెట్పల్లి: దివ్యాంగుల రక్షణకు ప్రత్యేక చట్టా లున్నాయని, వాటిని వినియోగించుకోవాలని సీనియర్ సివిల్ మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు సూ చించారు. పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం న్యా య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, న్యాయపరంగా వారికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్రెడ్డి, న్యాయవాదులు ఉన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాంమల్యాల: కొండగట్టు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు వడ్డీలేని రుణాలు అందిస్తామని డీఆర్డీఓ ఏపీడీ సునీత అన్నారు. కొండగట్టు అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు జిల్లా సమైఖ్య సభ్యులు ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున రూ.1.50లక్షల ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షురాలు సరోజన, ప్రాజెక్టు మేనేజర్ రమేశ్, నారాయణ, ఏపీఓ గంగాధర్, దేవయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్యం చేరేందుకు శ్రమించాలిమల్లాపూర్: విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చేందుకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యాధికారి నారాయణ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం తనిఖీ చేశా రు. కళాశాలలో వసతులను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్లోనే విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా శ్రమించాలన్నారు. కమ్యూనికేషన్, రైటింగ్ స్కిల్స్లో ప్రా వీణ్యం పొందాలన్నారు. కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ బండిసత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మల దహనంజగిత్యాలటౌన్/రాయికల్/ధర్మపురి: హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని పేర్కొంటూ సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ ఆధ్వర్యంలో దహనం చేశారు. జిల్లాకేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. రాయికల్లో గాంధీచౌక్ వద్ద నాయకులు ఆందోళన చేపట్టారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్, ప్రధాన కార్యదర్శి భూమేశ్, నాయకులు సామల్ల సతీశ్, గాజంగి అశోక్, వట్టిమల్ల శ్రీను, సత్యం తదితరులు పాల్గొన్నారు. ధర్మపురిలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గాజు భాస్కర్, బెజ్జారపు లవన్కుమార్, బండారి లక్ష్మణ్, స్తంభంకాడి శ్యామ్, ఆకుల శ్రీనివాస్ ఉన్నారు. యావర్రోడ్డు ఆక్రమణలపై కలెక్టర్ దృష్టిజగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని యావర్రోడ్డులో ఆక్రమణపై చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్కు లేఖ రాశారు. 1989 నాటి మాస్టర్ ప్లాన్ ప్రకారం యావర్రోడ్డును 80ఫీట్లకు ఆమోదం తెలిపినప్పటికీ సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని మాజీమంత్రి జీవన్రెడ్డి గతనెల 24న కలెక్టర్కు లేఖ రాసిన విషయం తెల్సిందే. దీంతో రాజాగౌడ్ అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్కు లేఖ రాశారు. -
మహిళలదే తీర్పు..
జగిత్యాల: జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారనున్నారు. ప్రతి మండలంలో వారి ఓట్లే అధికంగా ఉన్నాయి. పొదుపు మహిళా సంఘాలు లక్షకు పైగా ఉండటంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి ఓట్లను రాబట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. వారు మద్దతిస్తే విజయం ఖాయమనే భావనతో మహిళాసంఘాల చుట్టూ తిరుగుతున్నారు. గెలిస్తే ఏం చేస్తామన్న హామీలు కూడా ఇప్పటినుంచే ఇస్తున్నారు. మహిళాసంఘాలకు ఆఫర్లు జిల్లాలో ఓటర్లు 6,07,263 మంది ఉండగా.. పురుషులు 2,89,702 మంది, మహిళలు 3,17,552 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన మహిళా ఓటర్లు 27,850 మంది అధికంగా ఉన్నారు. పొదుపు సంఘాల్లో ఉన్నవారు ఎటువైపు మొగ్గుచూపితే వారు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతో అభ్యర్థులు మహిళా సంఘాలకు ఆఫర్లు ఇస్తున్నారు. రుణాలు ఇప్పిస్తామని, వ్యాపారాలకు కృషి చేస్తామని ఓటర్లను ఆకర్షిస్తున్నారు. రాయికల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి, రెండోదశ పోరుకు నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. ఉపసంహరణ కూడా ముగిసిపోయింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎలాగైనా పీఠం దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలైనప్పటికీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో డబ్బులు సమకూర్చుకునే పనిలో అభ్యర్థులు తలమునకలవుతున్నారు. పార్టీల నుంచి బీఫాం ఇచ్చే అవకాశం ఉంటే కొంతవరకై నా ఫండ్ వచ్చేదని, పార్టీలకు సంబంధం లేకపోవడంతో ఖర్చులన్ని ఎలా భరించాలోనని అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆస్తుల తాకట్టు.. చిట్టీల లిఫ్టింగ్ జిల్లాలో మొదటి విడత ఈనెల 11న, రెండో విడత 14న, మూడో విడత 17న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు డబ్బులు సమకూర్చుకునేందుకు ఉన్న ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటున్నారు. మరికొందరు నెలనెలా వేసుకుంటున్న చిట్టీలను లిఫ్ట్ చేస్తున్నారు. ఎన్నికలు అయ్యే వరకు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మద్యం, మాంసం వంటివి సమకూర్చాల్సి ఉంటుంది. ఇందుకు ఖర్చులు తడిసిమోపెడవుతాయి. తమ ప్యానల్ వార్డుసభ్యులు గెలిచేందుకూ తమవంతుగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది అభ్యర్థులకు మరింత భారంకానుంది. ఇప్పటికే వాడవాడలా కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళలకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ లెక్కన ఎన్నికలు పూర్తయ్యే వరకు చిన్న పంచాయతీలో కూడా ఖర్చు తడిసిమోపెడు కానుంది. బిల్లులు రాక ఇబ్బందుల్లో ‘మాజీ’లు మాజీ సర్పంచులకు గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాకపోవడంతో అప్పులపాలయ్యారు. అయినప్పటికీ ఈసారి కూడా సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు రూ.లక్షల్లో అప్పు చేసేందుకు వెనుకాడడం లేదు. ఖర్చులతో కూడుకున్న సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతే అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకుంటారో.. లేక గెలిస్తే పెట్టిన ఖర్చును మర్చిపోయి సంబరపడతారో వేచి చూడాల్సిందే.. జగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొంతమంది ఉద్యోగులకు ఆర్వో, ఏఆర్వో విధులు కేటాయించారు. చాలామంది విధులకు హాజరుకాకపోవడంతో కలెక్టర్ సత్యప్రసాద్ 15 మందికి మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. రాయికల్: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, సీఆర్పీలు, రిసోర్స్ పర్సన్లు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వారందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. వీరంతా సాధారణ పౌరుల్లాగా మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలిగానీ.. ఏ సర్పంచ్ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసినా.. ఎన్నికల కమిషన్కు సాక్ష్యాలతో నిరూపిస్తే వారి ఉద్యోగాలపై వేటు పడుతుంది. జగిత్యాల: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎన్నికల అబ్జర్వర్ జి.రమేశ్ అన్నారు. బుధవారం ఎంసీసీ కంట్రోల్రూమ్ను పరిశీలించారు. ఫిర్యాదుల రిజిస్టర్లు, డాక్యుమెంటేషన్, రియల్టైం మానిటరింగ్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తున్నాయా..? లేదా..? చూశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలన్నారు. డీపీవో రఘువరణ్, నోడల్ అధికారి నరేశ్ పాల్గొన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలిఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నా రు. కలెక్టర్, ఎస్పీలతో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ బ్యాలెట్ బాక్స్లు, పత్రాలన్నీ అందుబాటులో ఉంచుకున్నామని తెలిపారు. ఎస్పీ అశోక్కుమార్ మాట్లాడుతూ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టామని, చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా సమాచారం మండలాలు : 20 గ్రామపంచాయతీలు : 385 వార్డులు : 3,536 ఓటర్లు : 6,07,263 పురుషులు : 2,89,702 మహిళలు : 3,17,552 ఇతరులు : 9 అభ్యర్థుల్లో ఖర్చుల భయం..15 మంది ఆర్వో, ఏఆర్వోలకు మెమోలు?ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటే వేటే..‘కంట్రోల్రూమ్’ ఫిర్యాదులు పరిష్కరించాలి -
కాంగ్రెస్లో జోష్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: హుస్నాబాద్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో ఉత్సాహం నింపింది. పల్లెల్లో పట్టు సాధిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని సీఎం రేవంత్రెడ్డి అభ్యర్థుల్లో నింపే ప్రయత్నం చేశారు. ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చామంటూ సీఎం సభలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్త్రెడ్డి మొదట హుస్నాబాద్కు మంజూరైన ఇంజినీర్ కళాశాలకు రూ.45 కోట్లు మంజూరు చేస్తూ పనులకు శంకుస్థాపన చేశారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ ఇటీవల అమెరికాలో పర్యటించగా, అక్కడ ఓ ఎన్నారై అందించిన 70 సైకిళ్లను సీఎం చేతిలో మీదుగా ఇంజినీరింగ్ విద్యార్థినులకు అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. గత పదేళ్లు పాలించిన పార్టీ లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేసిన ఎస్సారెస్పీతోనే కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగునీరందుతుందని తెలిపారు. సిద్దిపేట, మెదక్, గజ్వేల్లను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం హుస్నాబాద్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన గౌరవెళ్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎలాంటి వరాలు ఇవ్వకుండా సీఎం నిరాశపరిచారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్కుమార్, గడ్డం వివేక్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు. -
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
జగిత్యాల: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, వారి కోసం ప్రత్యేకమైన క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ లత అన్నారు. జిల్లా కేంద్రంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల ఆధ్వర్యంలో మినీస్టేడియంలో క్రీడాపోటీలు నిర్వహించారు. దివ్యాంగులు ప్రతి రంగంలో ప్రతిభ చాటాలన్నారు. వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు రన్నింగ్, షాట్పుట్, జువెలెన్త్రో, ఫీల్డ్ ఈవెంట్స్లో ప్రతిభ కనబర్చారు. వారికి బహుమతులు అందజేశారు. యువజన క్రీడా అధికారి రవికుమార్, డీఈవో రాము, సీడీపీవో మమత, ఈవో పవిత్ర పాల్గొన్నారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
ఎన్నికల్లో బందోబస్తు ఎలా చేపడుతున్నారు..? ఇప్పటివరకు ఏమైనా కేసులు నమోదయ్యాయా..? మండలస్థాయిలో బృందాలు ఏర్పాటు చేశారా..? జిల్లాలో ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి..? సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? ఇప్పటివరకు ఎంతమందిని బైండోవర్ చేశారు..? ప్రచారానికి, సమావేశాలకు అనుమతి తీసుకోవాలా..? జగిత్యాలజోన్: జగిత్యాలరూరల్ మండలం వెల్దుర్తి అనుబంధం బా వోజిపల్లె. ఇక్కడ బావోజోల్లు, బుడిగెజంగాల వారు ఉంటారు. చిలుక జ్యోతిష్యం చెబుతుంటారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీరంతా ఒకేమాటకు కట్టుబడి ఉంటున్నారు. వెల్దుర్తి పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి బావోజిపల్లెకు సర్పంచ్ పదవి లభించలేదు. 20 ఏళ్ల క్రితం ఇక్కడ 180 ఓట్లు ఉండగా.. ప్రస్తుతం 300కు చేరాయి. ఈ సారి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఎలాగైనా పదవిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వెల్దుర్తిలో 1450 ఓట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి సుమారు ఇద్దరుముగ్గురు బరిలో ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓట్లు చీలితే.. రెండువార్డులు.. ఎస్సీ సామాజికవర్గమే ఉన్న బావోజిపల్లెకు ఈసారి సర్పంచ్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్కు ఆసక్తి చూపని ఉద్యోగులురాయికల్: స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్కు ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగులు, సైనికులు ఎలక్షన్ విధులు నిర్వర్తించే ఉద్యోగులు, ఖైదీలు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో పోస్టల్ బ్యా లెట్లో ఓటు వేయడం ద్వారా ఎన్నికల ఫలితాల రోజు అభ్యర్థులకు చూపించుకుంటూ ఓట్లు లెక్కిస్తారు. స్థానికంగా సర్పంచ్ ఎన్నికల్లో తక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉండటంతో తాము వేసి న ఓటు ఎవరికి వేసిందో తెలుస్తుందనే ఉద్దేశంతో ఓటు వేసి తలనొప్పి తెచ్చుకునే బదులు వేయకుండా ఉండాలని ఉద్యోగులు భావిస్తున్నారు.ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకం లేదు రాయికల్: ఏకగ్రీవ గ్రామాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ప్రోత్సాహకం వస్తుందని చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకం కింద ఎలాంటి ప్రకటనా రాలేదని డీపీవో రఘువరణ్ తెలిపా రు. తమ సెగ్మెంట్ పరిధి లో ఏకగ్రీవమైతే ఎంపీలు, మంత్రులు బీజేపీ తరుఫున కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి నిధులు మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నారుగానీ.. ప్రభుత్వం నుంచి మాత్రం ఉత్తర్వులు జారీ కాకపోవడం గమనార్హం. సర్పంచ్కు గులాబీ.. వార్డు సభ్యులకు తెలుపు రాయికల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రక్రియలో భాగంగా ఓటరుకు ఇచ్చే బ్యాలెట్ పత్రాల్లో రెండు రంగుల్లో ఉంటాయి. సర్పంచ్కు వేసే బ్యాలెట్ పత్రం గులాబీ రంగులో ఉంటుంది. వార్డు సభ్యులకు వేసే బ్యాలెట్ పత్రం తెలుపురంగులో ఉంటుంది. ప్రతి ఒక్క ఓటరు ఎన్నికల్లో గులాబీ, తెలుపు బ్యాలెట్ పత్రాలపై ఓటు వేయాల్సి ఉంటుంది.జగిత్యాలక్రైం: జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. ఎన్నికల బందోబస్తుపై ఆయన ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడారు. ఒకేమాటపై బావోజిపల్లెఅభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవచ్చు రాయికల్: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో నామినేషన్లపై ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలు సమర్పిస్తే ఆర్వోలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అన్ని పత్రాలు సరిగా ఉంటే ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు. ఒకవేళ తిరస్కరణకు గురైతే సదరు అభ్యర్థి ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చు. రెండు రోజుల నిర్ణీత గడువులోపు పరిష్కరించుకోవాలి. -
‘మల్చర్’ యంత్రంతో కొయ్యకాలు ముక్కలు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు అవగాహనతో వరి కొయ్యకాళ్లను కాల్చడం లేదు. అలాగే కొయ్యకాళ్లను కలియదున్నేందుకు ముందుగా ట్రాక్టర్కు బిగించిన మల్చర్ యంత్రం వినియోగిస్తున్నారు. ఈ ఆధునాతన పరికరం ట్రాక్టర్తో నడుస్తుంది. 5 నుంచి 7 అడుగుల వెడల్పుతో రోటోవేటర్ను పోలి ఉంటుంది. యంత్రంలోని బ్లేడ్లు కొయ్యకాళ్లను చిన్న ముక్కలుగా కట్ చేస్తాయి. ఎకరం పొలంలో గడ్డిని కట్ చేసేందుకు గంట సమయం పడుతుంది. దీని ధర రూ.లక్ష వరకు ఉంటుంది. ఎకరం పొలంలోని కొయ్యకాళ్లు రెండు ట్రాక్టర్ల పశువుల ఎరువుతో సమానం. పొలంలోనే కలియదున్నడం వల్ల 15 కిలోల భాస్వరం, 15 కిలోల యూరియా, 8 కిలోల పొటాష్ లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
రాయికల్: గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్, కొత్తపేట, అల్లీపూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను మంగళవారం పరిశీ లించారు. జిల్లాలో రెండో విడతలో ఏడు మండలాల్లో 144 గ్రామాలు, 1276 వార్డులకు నా మినేషన్ల స్వీకరణ గడువు పూర్తయిందన్నారు. పొరపాట్లు జరగకుండా నామినేషన్లు తీసుకున్న వారి దరఖాస్తు ఫారాలను వివరాలతో రిజిస్ట్రేషన్ నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లను ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పంపించాలని ఆదేశించారు. హెల్ప్డెస్క్, పోలీసు బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు. ఈనెల 3న పరిశీలన ఉంటుందని, 6 వరకు ఉ పసంహరణ గడువు ఉంటుందన్నారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన ‘రెడ్కో’ మేనేజర్జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇందిరా వనరుల సంస్థ రెడ్కో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్గా రిటైర్డ్ ఏడీఈ దుర్శెట్టి మనోహర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద్ను కలిసి అభినందనలు తెలిపారు. జిల్లాలో పోలీస్యాక్ట్ అమలుజగిత్యాలక్రైం: శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 31 వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రజ లు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. బెట్ట పరిస్థితి ఏర్పడితేనే మామిడిలో పూతజగిత్యాలఅగ్రికల్చర్: బెట్ట పరిస్థితులు ఏర్పడితేనే మామిడిలో పూత వచ్చే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారి కె. స్వాతి తెలిపారు. జగిత్యాలరూరల్, రాయికల్ మండలంలోని మామిడి తోటలను మంగళవారం పరిశీలించారు. ఈ ఏడు అధిక వర్షాలతో భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉందని, ఫలితంగా పూత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, 10 గ్రాముల పోటాషియం నైట్రేట్, రెండు గ్రాముల బోరాన్, రెండు గ్రాముల జింక్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలని, తద్వారా పూత వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడికి నియామకపత్రంజగిత్యాలటౌన్: హైదరాబాద్లోని గాంధీభవన్లో మంగళవారం నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య హాజరయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ నందయ్యకు డీసీసీ అధ్యక్ష నియామకపత్రం అందించారు. నందయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
కమనీయం.. రమణీయం
7ఇబ్రహీంపట్నం: మండలకేంద్రం శివారులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అర్చకులు చక్రపాణి, మాధవచారి అధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు ఐదు వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అర్చకులు సత్యనారాయణ, రవీందర్ శర్మ, నవీన్చారి, సంతోష్, దివాకరచారి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అధికారులూ.. అప్రమత్తంఅక్షరక్రమంలో గుర్తులు కేటాయించాలినామినేషన్ల ప్రక్రియ సజావుగా ఉందా.. -
జోష్ పెరిగేనా?
హస్తంలోసాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘పల్లెల్లో’ పాగా వేసేందుకు ‘పట్టణం’లో పెట్టిన సీఎం సభపై కాంగ్రెస్ పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. మూడు దశల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీస్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేందుకు, తద్వారా రాష్ట్రంలో పార్టీకి ఢోకా లేదని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్లో జరిగే సీఎంసభను ప్రచార అస్త్రంగా భావిస్తున్నారు. పల్లెలను ప్రభావితం చేసేలా పెడుతున్న పట్టణ సభద్వారా మరింత జోష్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. కానీ.. ఉమ్మడి జిల్లా మంత్రుల నడుమ ఆధిపత్యపోరు, కరీంనగర్ కేంద్రంగా పార్టీ అనాథలా మారడం, నేతల మధ్య సమన్వయ లోపం, గ్రూప్పోరు.. శ్రేణులను కలవరపరుస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి సభతో ముగ్గురు మంత్రులు, విప్లు, అంతా ఏకమై సభ విజయవంతానికి తమ వంతుగా పనిచేసుకుంటూ పోతుండటం పార్టీలో పెరిగిన సహకారానికి నిదర్శనమని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం ప్రసంగంలో ఉమ్మడి జిల్లాకు ప్రకటించే వరాల జల్లుతో స్థానికసంస్థల్లో మెజారిటీ స్థానాలు హస్తగతం చేసుకునేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మూడు ముక్కలాటకు సీఎం సభతో చెక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల నడుమ అంతర్గత ఆధిపత్యపోరు తారాస్థాయిలో ఉంది. ముఖ్యంగా హుస్నాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్కు మరో ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ నడుమ ఏ విషయంలోనూ పొసగదనేది బహిరంగరహస్యమే. నామినేటెడ్ పదవుల్లో శ్రీధర్బాబుది పైచేయి కావడం, కరీంనగర్కు సంబంధించిన నియామకాల్లోనూ ఆయనే కీలకం కావడంపై అప్పట్లో పొన్నం కినుక వహించారు. ఒక దశలో సుడా చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని భీష్మించుకొని ఉన్నా, ఇటీవల కాస్త మెత్తపడి, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డిని చేరువ చేసుకున్నారు. ఇక అడ్లూరి లక్ష్మణ్కుమార్పై చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు పెనుదుమారం లేపడం తెలిసిందే. పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయంలో ముగ్గురి నడుమ అధికారులు నలిగిపోతూనే ఉన్నారు. సీఎంసభ నేపథ్యంలో విభేదాలన్నీ పక్కనబెట్టి అంతా కలిసి పనిచేస్తుండటం శుభసూచకం. ఈ మైత్రి మునుముందు కూడా కొనసాగి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని క్యాడర్ ఆశాజనకంగా ఉంది.అడ్లూరి లక్ష్మణ్కుమార్పొన్నం ప్రభాకర్ఉమ్మడి జిల్లా ‘హెడ్’ క్వార్టర్ అయిన కరీంనగర్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనాథలా మారింది. ఇటీవల డీసీసీ, కార్పొరేషన్ అధ్యక్షుల నియామకంతో కాసింత గాడినపడినట్టుగా కనిపిస్తున్నా, ఇప్పటికీ కరీంనగర్ ఎవరిదనే సమస్య కొనసాగుతోంది. కరీంనగర్కు చెందిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి పోటీచేసి గెలుపొందడం, శ్రీధర్బాబు పెద్దపల్లి, లక్ష్మణ్కుమార్ జగిత్యాల జిల్లాలకు ప్రాతినిథ్యం వహించడంతో కరీంనగర్లో పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయింది. పైగా కరీంనగర్ ప్రతిపక్ష పార్టీ చేతిలో ఉండడంతో, ఆ స్థాయిలో కాంగ్రెస్కు నాయకుడు కనిపించడం లేదు. తాను కరీంనగర్ వాసినని పొన్నం ప్రభాకర్ అప్పుడప్పుడు జోక్యం చేసుకొంటున్నా, పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో పార్టీ నాయకులు ఎవరికి వారే అన్న తీరుగా మారారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్కుమార్ను నియమించిన తరువాత పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఖాళీగానే ఉంది. దీంతో నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు ఎవరికీ లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీ అసంపూర్తి సంస్థాగత నిర్మాణం సమస్యగా మారుతోంది. పూర్తిస్థాయిలో డీసీసీ, సిటీ, మండల కమిటీలను నియమిస్తే పార్టీలో కొత్త జోష్కు అవకాశముంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలతో పాటు, పార్టీ గుర్తులపై త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే పార్టీలో సమన్వయం ముఖ్యం. ప్రస్తుతం కాంగ్రెస్లో అదే కరువైంది. -
తమ్ముడూ.. తప్పుకో!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: తొలిదశ నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఒకటే టెన్షన్ పట్టుకుంది. అదేంటంటే.. ప్రతీ పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలు ఏళ్లుగా స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా ఆ అవకాశం రాగానే ఎగిరి గంతేసి బరిలోకి దూకారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవుగానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. అన్ని పార్టీల నుంచి అధిక సంఖ్యలో పోటీ ఉండడం మంచిది కాదని తలచి.. మధ్యవర్తిత్వానికి జిల్లా నాయకులను పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. ఈ మేరకు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. రిజర్వ్డ్ స్థానాల కంటే జనరల్ స్థానాల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బరిలో ఉన్నారు. ఈనెల 3వ తేదీతో తొలిదశ నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో సీనియర్లు బుజ్జగింపుల పర్వాన్ని ముమ్మరం చేశారు. కులం ఓట్లే ప్రామాణికం ప్రతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరికి వారు పోటీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుజ్జగింపుల పర్వరంలోకి దిగిన సీనియర్లు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తున్నారు. అయితే, అభ్యర్థుల సామాజిక స్థితిగతులు, అతని సామాజికవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంత ఖర్చు పెట్టగలుగుతారు? తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి తగిన హామీలు ఇచ్చి, పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతివ్వాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో సామాజికవర్గం ఓట్లు దండిగా ఉన్న అభ్యర్థులు మెట్టుదిగేది లేదని, పోటీ చేసి తీరుతామని భీష్మించుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ సీనియర్లు కూడా ఏమీ చేయలేని అయోమయంలో ఉన్నారు. అందుకే, గెలిచిన వాడే మనవాడు అవుతాడని, అప్పటి వరకూ వేచి చూసే ధోరణి అవలంబించేందుకు మొగ్గుచూపుతున్నారు.దాదాపు రెండేళ్లుగా జాప్యమైన స్థానిక ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ.. ఆశావహులంతా నామినేషన్లు వేసి ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇదే అన్ని పార్టీలకు మింగుడు పడని అంశంగా మారింది. అందుకే, సీనియర్లను రంగంలోకి దింపారు. దీంతో వారంతా నామినేషన్ వేసిన వారితో భేటీ అవుతున్నారు. పార్టీలో పదవుల పరంగా ప్రాధాన్యం కల్పిస్తామంటూ, భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని హామీలిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ కల్పించేందుక సిద్ధంగా ఉన్నామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పార్టీలో పదవులు, స్థానిక సంస్థల్లో టికెట్ల అవకాశంతో పాటు అధికార పార్టీ మరో అడుగు ముందుకు వేస్తోంది. స్థానికంగా జరిగే వర్క్స్, టెండర్లలోనూ ప్రాధాన్యం కల్పిస్తామంటూ వారిలో నమ్మకం కలిగించే ప్రయత్నాలు ప్రారంభించారు. -
అనుమతి ఉంటేనే ప్రచారం
పోలింగ్ కేంద్రాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాలిజగిత్యాల: జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. రెండోవిడత నామినేషన్ల గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దూకుతున్నారు. ప్రచారానికి అతితక్కువ వ్యవధి మాత్రమే ఉండడం అభ్యర్థులకు కొంత ఇబ్బందిగా మారింది. పైగా ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే అభ్యర్థులు ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. పబ్లిక్ మీటింగ్లు, ర్యాలీలకు తహసీల్దార్, పోలీస్స్టేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పోలింగ్కు ఒకరోజు ముందుగానే ప్రచారం నిషేధం. ప్రచారానికి ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సర్పంచ్ అభ్యర్థికై ఒక వాహనానికి అనుమతి ఉంటుంది. వార్డు అభ్యర్థికి వాహనాలకు అనుమతి ఉండదు. ఊపందుకున్న ప్రచారం మొదట విడత నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రతిచోట 8 నుంచి 9 మంది పోటీలో ఉన్నారు. కొందరు దగ్గరివారిని ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ గుర్తులు లేకున్నా.. ఒక పార్టీ నుంచే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిని ఎలాగోలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీకి అవకాశం వస్తుందో.. లేదోనన్న భావనలో చాలామంది సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. దీంతో బుజ్జగింపులపర్వం ప్రారంభమైంది. పకడ్బందీగా నిఘా ఎన్నికల సమయంలో నగదు, మద్యం పంపిణీకి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు రూ.50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆపై తీసుకెళ్తే సీజ్ చేస్తారు. అవి ఎక్కడివో ఆధారాలు ఉంటే అనుమతి ఇస్తారు. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల నియమవళి ప్రచారం చర్యలు తీసుకుంటామని, అనుమతులు తీసుకోకుండా సభలు, సమావేశాలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల: పోలింగ్ కేంద్రాల్లో మైక్రోఅబ్జర్వర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కాన్ఫరెన్స్ హాల్లో సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. కేంద్రాల్లో అన్ని సక్రమంగా ఉన్నాయో చెక్ చేసుకోవాలన్నారు. 3,536 పోలింగ్ కేంద్రాలకు 110 మంది మైక్రోఅబ్జర్వర్లను నియమించామన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించాలని, ఓటు వేసేందుకు 13 రకాల గుర్తింపు కార్డులను అనుమతించాలన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ చేపట్టాలన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ ఉపయోగించే విధానంపై డెమో నిర్వహించారు. అనంతరం ర్యాండమైజేషన్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీపీవో రఘువరణ్, నోడల్ అధికారులు నరేశ్, రాము, రవికుమార్ పాల్గొన్నారు. అటు నామినేషన్లు.. ఇటు పన్నుల వసూలుజగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పన్నులు వసూలవుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే అభ్యర్థులతోపాటు వారిని బలపర్చే వారు కూడా ఇంటి, నీటి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసేందుకు వస్తున్న వారు పన్నులు చెల్లిస్తుండడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఇప్పటివరకు రూ.2 కోట్ల వరకు పన్నులు వసూలయ్యాయని అధికారులు అంచనా వే స్తున్నారు. జిల్లాలోని 385 గ్రామపంచాయతీలు, 3,536 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు, బలపర్చేవారు పన్నులు చెల్లించి రసీ దులను నామినేషన్ పత్రానికి జతచేసి ఎన్నికల అధికారులకు అప్పగిస్తున్నారు. పన్నుల చెల్లింపు కోసం నామినేషన్ సెంటర్ల వద్ద పంచాయతీ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. సీఎం, మంత్రులకు కోడ్ వర్తించదా..?జగిత్యాల: సీఎం, మంత్రులకు ఎన్నికల కోడ్ వర్తించదా అని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కోడ్ అమలులో ఉండగా సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధి పేరుతో జిల్లాలో పర్యటించడం కోడ్ ఉల్లంఘనే అన్నారు. ఆమె వెంట మాజీ కౌన్సిలర్ శీలం ప్రవీణ్, నాయక్ ఉన్నారు. రాత్రి దాకా నామినేషన్ల స్వీకరణ రాయికల్: రాయికల్ మండలంలో నామినేషన్ల స్వీకరణ మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 67, వార్డు సభ్యులకు 212 నామినేషన్లు వచ్చాయి. మైతాపూర్లో రాత్రి 8 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. -
జగిత్యాల
32.0/14.07గరిష్టం/కనిష్టంరాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థినులుమల్యాల: తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థినులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ మానస తెలిపారు. హారిక, యశ స్విని, తేజస్విని, నిత్యశ్రీ, చందన ఎంపికయ్యారు. వీరిని తోటి విద్యార్థినులు అభినందించారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. కేంద్రాల వద్ద బందోబస్తు రాయికల్/సారంగాపూర్: నామినేషన్ కేంద్రాల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. రాయికల్ మండలం ఆలూరు, సారంగాపూర్ మండలంలోని లచ్చక్కపేటలోని నామినేషన్ కేంద్రాలను సోమవారం సందర్శించారు.మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు
● కలెక్టర్కు ఫిర్యాదు చేసిన లక్ష్మిపూర్ రైతులుజగిత్యాలఅగ్రికల్చర్: కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదంటూ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ రైతులు సోమవారం కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేశారు. లక్ష్మీపూర్ ఎఫ్పీవో ఆధ్వర్యంలో లక్ష్మీపూర్, తిమ్మాపూర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపించినా తీసుకోవడం లేదని, ఒకవేళ బలవంతంగా దించుకుంటే బస్తాకు కిలో చొప్పున కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. లక్ష్మీపూర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు రూ 1.50కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. లక్ష్మీపూర్ ఎఫ్పీవో అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, సంఘ సభ్యులు లింగారెడ్డి, తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డి, బుచ్చిరెడ్డి, శివ, రాజేశ్వర్ రెడ్డి, పోచయ్య, కుమార్ ఉన్నారు -
మహమ్మారి నివారిద్దాం
● యువత జాగ్రత్తగా ఉండాలి ● అదనపు కలెక్టర్ రాజాగౌడ్జగిత్యాల: ఎయిడ్స్ మహమ్మారికి చికిత్స కంటే నివారణే మేలు అని, యువత జాగ్రత్తగా ఉండాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ నుంచి కొత్తబస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. మహమ్మారికి చికిత్స లేదన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 2,573 బాధితులు ఉన్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు శ్రీనివాస్, ఐఎంఏ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి, సుధీర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు. -
పుట్టినరోజు కానుక
మా నాన్న నాకు పుట్టినరోజు కానుకగా ఫోన్ కొనిచ్చాడు. కంప్యూటర్ క్లాస్కు వెళ్లే క్రమంలో ఫోన్ పోయింది. రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సీఈఐఆర్ యాప్లో నమోదు చేశారు. పోలీసుల కృషితో నా సెంటిమెంట్ ఫోన్ నాకు వచ్చింది. – రమ్య, తిప్పన్నపేట, జగిత్యాలరూరల్ మండలం పొలం వద్ద దొంగిలించారు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన సమయంలో ద్విచక్రవాహనం నుంచి నా ఫోన్ దొంగిలించారు. బుగ్గారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మొబైల్ ఐఎంఈఐ నంబర్తో సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసి ట్రాకింగ్ చేసి నాకు అప్పగించారు. – తిరుపతి, బుగ్గారం చార్జింగ్ పెడితే ఎత్తుకెళ్లారు నా చెల్లి జ్యోతి అత్తగారింటికి వెళ్తున్న సమయంలో బస్టాండ్లో ఫోన్కు చార్జింగ్ పెట్టింది. ఎవరో ఆ ఫోన్ను దొంగిలించారు. పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాకింగ్ చేసి నా ఫోన్ను అప్పగించారు. ఆనందంగా ఉంది. – లక్ష్మణ్, జగిత్యాల -
పోగొట్టుకున్న 136 ఫోన్లు అప్పగింత
జగిత్యాలక్రైం: పోగొట్టుకున్న.. చోరీకి గురైన ఫోన్లను సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా గుర్తించి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. వివిధ ఘటనలో చోరీకి గురైన రూ.28 లక్షల విలువైన 136 సెల్ఫోన్లను ఎస్పీ కార్యాలయంలో బాధితులకు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రూ.3.5 కోట్ల విలువైన 1548 ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు. సెల్ఫోన్లు పోగొట్టుకుంటే ఆందోళన చెందకుండా.. సీఈఐఆర్ అప్లికేషన్లో నమోదు చేసుకుంటే గుర్తించి ఇస్తామని తెలిపారు. సెల్ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆర్ఎస్సై హెడ్కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ఖాన్, సీఈఆర్ఐ టీం ఆర్ఎస్సై కృష్ణ, హెడ్కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుళ్లు అజర్ పాల్గొన్నారు. -
భరోసా లేని వలస బతుకులు
వెల్గటూర్: పొట్టకూటి కోసం ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి మన రాష్ట్రం వచ్చిన వలస కూలీల బతుకులకు భరోసా లేకుండా పోయింది. కూలీల చెమటను సొమ్ము చేసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్న యాజమాన్యాలు.. వారు ఉండేందుకు కనీస వసతులు కూడా కల్పించడం లేదు. కష్టానికి తగిన వేతనం ఇవ్వడం పక్కనపెడితే.. పనిచేసే ప్రదేశంలో ప్రమాదవశాత్తు గాయపడినా.. మృత్యువాత పడినా పరిహారం కూడా ఇవ్వడం లేదు. చదువు రాకనో.. భాషరాకనో.. చట్టాలపై అవగాహన లేకనో ఎంతోమంది కూలీలు వెట్టిచాకిరీ లోనే మగ్గిపోతున్నారు. కనీస సౌకర్యాలు కరువు ఉమ్మడి వెల్గటూర్ మండల పరిధిలో చాలా వరకు క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 300 మంది వరకు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కూలీలు వలస వచ్చి పనిచేస్తున్నారు. వీరిని ఓ కాంట్రాక్టర్ తీసుకొచ్చి క్వారీలు, క్రషర్లలో పనికి కుదుర్చుతాడు. యాజమాన్యాల నుంచి ఎక్కువ మొత్తం తీసుకుని కూలీలకు మాత్రం అరకొర జీతాలు ఇచ్చి వెట్టిచాకిరీ చేయిస్తాడు. పని చేసే ప్రదేశంలో వారి భద్రతకు సంబంధించిన పరికరాలు ఉండవు, నివాసానికి సరైన వసతులు కూడా కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. . ప్రమాదాలు జరిగితే పరిహారం లేదు వాస్తవానికి క్వారీలు, క్రషర్ల వంటి ప్రమాదకర ప్రాంతాల్లో 14 నుంచి 18 ఏళ్ల వయస్సున్న పిల్లల ను రానీయొద్దు. కానీ వెల్గటూర్ మండలంలో ఈ నిబంధన అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేసే కూలీలకు ఏదైనా ప్రమాదం జరిగితే మైనింగ్, లేబర్ చట్టాల ప్రకారం యాజమాన్యాలు కార్మికుడి వయసు, నెల వేతనం ఆధారంగా రూ.పది లక్షలకు పైగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. లేబర్ డిపార్ట్మెంట్ కూడా బాధితులు కేసు నమోదు చేస్తే పరిహారం ఇస్తుంది. కానీ చట్టాలపై అవగాహన లేని కూలీలకు అవగాహనారాహిత్యంతో పరిహారం పూర్తిగా పరిహాసంగా మారింది. బాల కార్మికులతో బలవంతంగా పని.. మైనింగ్, లేబర్ చట్టాల ప్రకారం బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధం. అయినా ఈ నిబంధన అమలు కావడం లేదు. గతంలో ఎండపల్లి మండలం మారేడ్పల్లిలో ఓ క్వారీలో బాల కార్మికుడితో జేసీబీతో గుట్టపై పని చేయించగా.. ప్రమాదవశాత్తు జేసీబీ కింద పడి మృతి చెందాడు. యాజమాన్యాల ఒత్తిడి మేరకు పోలీసులు సదరు బాలుడిని మేజర్ అని తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్వారీ యజమానిపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా వత్తాసు పలికారు. బాలుడు మృతి చెందిన సందర్భంలో నిబంధనల ప్రకారం క్వారీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి క్వారీ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు, మైనింగ్, లేబర్ శాఖల అధికారులు మామూలుగా చూసీచూడనట్లు వదిలేశారు. ఈ ఘటన జరిగి ఏడాది గడిచినా బాలుడి కుటుంబానికి యాజమాన్యం ఎటువంటి పరిహారమూ ఇవ్వక పోగా.. కనీసం లేబర్ ఆఫీస్లో కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో బాధిత కుటుంబానికి సుమారు రూ.15లక్షల వరకు పరిహారం అందకుండా పోయింది. చట్టం ఉల్లంఘిస్తే చర్యలు 2014 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారం లేబర్ డిపార్ట్మెంట్లో నమోదైన వాటిని మాత్రమే తనిఖీ చేసే అవకాశం ఉంది. ఫ్యాక్టరీలు, రైస్మిల్లులు మొదలైనవి లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి రావు. ప్రత్యేకంగా ఏదైనా పిర్యాదులు వచ్చిన సందర్భంలో మాత్రమే వాటిని తనిఖీ చేసి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – సురేంద్రకుమార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, జగిత్యాల -
ప్రమాద బాధితులను ఆదుకోండి
● ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ఇవ్వండి ● సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సత్యం మల్యాల: మండలంలోని ముత్యంపేట దిగువ కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే, కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సోమవారం సీఎం రేవంత్రెడ్డిని కలిసి విన్నవించారు. షార్ట్ సర్క్యూట్తో 30 దుకాణాలు దగ్ధమయ్యాయని, సర్వం కోల్పోయి రోడ్డు పడ్డారని, మంటల్లో సామగ్రితోపాటు విలువైన పత్రాలు కాలిపోయాయని వివరించారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున అందించాలని కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి, ఎమ్మెల్యే తెలిపారు. మద్యం దుకాణాలు ప్రారంభంజగిత్యాలక్రైం: మద్యం షాపుల లైసెన్స్ పొందిన 72 మంది వ్యాపారులు సోమవారం దుకాణాలను ప్రారంభించారని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. వీరంతా గతనెల 29, 30 తేదీల్లో సుమారు రూ.6 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్త మద్యం షాపుల నిర్వాహకులు మరో రెండుమూడు రోజుల్లో భారీగా మద్యం కొనుగోలు చేయనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్ని కల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే కొన్ని చోట్ల భారీగా మద్యం నిల్వ చేసుకోగా.. మరికొంత మంది పెద్ద ఎత్తున మ ద్యం కొనుగోలు చేసేందుకు మంతనాలు జరుపుతున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రా మాల్లో భారీగా మద్యానికి డిమాండ్ పెరిగింది. చీరల పంపిణీపై ఈసీ పునఃసమీక్షించాలిజగిత్యాలటౌన్: ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ప్రారంభమైన చీరల పంపిణీని యథా విధిగా కొనసాగించేలా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని యావర్రోడ్డులో మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి ట్రాఫిక్ సమస్య నివారించాలని హైదరాబాద్లో డీటీసీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో ఇళ్లు పొందిన లబ్ధిదారులు వెంటనే తమకు కేటాయించిన ఇళ్లలో చేరాలని కోరారు. నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, మన్సూర్, రఘువీర్గౌడ్, గుండ మధు, రమేష్రావు, నేహాల్ ఉన్నారు. మక్కల తరలింపురాయికల్: పట్టణంలోని మార్కెట్యార్డులో మార్క్ఫెడ్ ద్వారా తూకం వేసిన బస్తాలను చల్గల్ ఏఎంసీకి తరలించినట్లు సెంటర్ ఇన్చార్జి మల్లికార్జున్ తెలిపారు. గతనెల 30న ‘మక్కలు కొంటలేరు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన కేంద్రంలో ఉన్న మొక్కజొన్న బస్తాలను ఏడు లారీల్లో చల్గల్ ఏఎంసీకి తరలించారు. మంగళవారం నుంచి మక్కలు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇతర మండలాల నుంచి రైతులు రావడంతో ఆలస్యమైందని వివరించారు. -
పెత్తనం వాళ్లది.. ఇగ పోటీ ఎందుకు..?
జగిత్యాలజోన్: జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా గ్రామాభివృద్ధి సంఘాలు పెత్తనం చెలాయిస్తున్నాయి. దీంతో సంబంధిత గ్రామాల్లో సర్పంచ్లుగా పోటీి చేసేవారు వెనకాముందు ఆలోచిస్తున్నారు. గ్రామానికి సంబంధించిన ప్రతీ పనిలో గ్రామాభివృద్ధి సంఘాలు జోక్యం చేసుకోవడం గ్రామ సర్పంచ్లకు ఈసడింపుగా మారింది. గతంలో పలు విషయాల్లో గ్రామ సర్పంచ్లు, గ్రామాభివృద్ధి సంఘాల మధ్య విభేదాలు రావడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. గ్రామాభివృద్ధి సంఘంలో కులానికి ఒకరిద్దరు ప్రతినిధులుండడం.. వారు చెప్పిందే గ్రామంలో వేదంగా మారడంతో గ్రామ సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. ఒకానొక దశలో గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సవాల్ విసిరేవరకు గ్రామాభివృద్ధి సంఘాలు చేరాయంటే.. పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. దీంతో గ్రామంలో రూ.లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి.. ఇల్లిల్లూ తిరిగి సర్పంచ్గా గెలిచినా ఏం లాభం అన్న రీతిలో సర్పంచ్గా పోటీ చేసేవారు వెనకాముందు ఆలోచిస్తున్నారు. సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి గ్రామ పెత్తనమంతా గ్రామాభివృద్ధి సంఘాలే చేస్తుండడం పోటీ చేసే యువతకు అసలు రుచించడం లేదు. ఈ నేపథ్యంలోనే గ్రామాభివృద్ధి సంఘాలను ఎదిరించే దీటైన నాయకుడు సర్పంచ్గా రావాలని చాలా గ్రామాల్లో ప్రజలు కోరుకుంటుండడం విశేషం. -
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
రామడుగు(చొప్పదండి): రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి వెంకటేశ్(39) అనే యువకుడు టిప్పర్ ఢీకొని శనివారం రాత్రి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలో శనివారం రాత్రి మట్టిని తరలిస్తున్న టిప్పర్ బ్రేక్డౌన్ కాగా.. వెంకటేశ్ టిప్పర్ ముందు భాగాన పడుకొని మరమ్మతు చేస్తున్నాడు. ఇది గమనించని మృతుడి తమ్ముడు డ్రైవర్ నరేశ్ టిప్పర్ను స్టార్ట్ చేసి ముందుకు నడిపించాడు. వెంకటేశ్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై కె.రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దారి దోపిడీ దొంగల అరెస్ట్ జగిత్యాలక్రైం: దారి దోపిడీ దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు నిందితులతోపాటు మరో మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మంచిర్యాల జిల్లా జెండావెంకటపూర్కు చెందిన తాళ్లపెల్లి నవీన్ శనివారం మంచిర్యాలలో తన డీసీఎం వాహనంలో వరి ధాన్యం నింపుకొని నిజామాబాద్ వెళ్లాడు. వరి ధాన్యం దింపి తిరిగి మంచిర్యాల వస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో జగిత్యాల గాంధీనగర్ సమీపంలో కాలకృత్యాల కోసం వాహనం ఆపి తిరిగి వాహనం ఎక్కుతుండగా.. ముగ్గురు వ్యక్తులు పల్సర్ మోటార్ సైకిల్పై వచ్చి నవీన్పై దాడి చేశారు. రూ.22వేల నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ కరుణాకర్ నిందితులైన పెర్కపల్లి రోడ్డు సమీపానికి చెందిన ఎర్ర సాయి, గాంధీనగర్కు చెందిన నక్క గణేశ్ను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.22వేల నగదు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. మైనర్ బాలుడిని జువైనల్ కోర్టుకు తరలించారు. పోలీసులు 5 గంటల్లో కేసు ఛేదించారు. -
అనుకోని ప్రమాదం.. అపార నష్టం..
మల్యాల(చొప్పదండి): మల్యాల మండలం ముత్యంపేటలోని దిగువ కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన షార్ట్ సర్క్యూట్తో 30 దుకాణాలు బుగ్గిపాలు కాగా.. 36 కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారి సమీపంలోని హనుమాన్ విగ్రహం వద్దకు వెళ్లే దారిలో ఇరువైపులా బొమ్మల దుకాణాలుండగా.. శనివారం రాత్రి ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు.. 30 దుకాణాల్లోని సుమారు రూ.కోటికి పైగా విలువైన సామగ్రి, బంగారం, నగదు, సర్టిఫికెట్లను బుగ్గిపాలు చేశాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దుకాణాల్లో నిద్రిస్తున్న వారు హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. కట్టుబట్టలే మిగిలాయి.. అప్రమత్తమైన స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నం చేసినా.. గాలి వీయడంతో మంటలు పక్క దుకాణాలకూ వ్యాపించాయి. దుకాణాల్లో నిద్రిస్తున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. రూ.2లక్షల నుంచి రూ.7లక్షల సామగ్రి సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కానుండడంతో దుకాణాదారులు ఒక్కొక్కరు సుమారు రూ.2లక్షల నుంచి రూ.7లక్షల వరకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. సమీపంలోని మరో మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించి.. పైపులు, విద్యుత్ తీగలు కాలడంతోపాటు ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. మంటల్లో కాలుతున్న దుకాణాల ఎదుట ఉన్న రెండు దుకాణాల బొమ్మలు కాలిపోయాయి. చికెన్ సెంటర్ ఎదుట జాలీలో ఉన్న సుమారు 18 కోళ్లు మృతిచెందాయి. ఫైరింజన్ సకాలంలో రాక భారీ నష్టం వాటిల్లింది. దిగువ కొండగట్టులో షార్ట్ సర్క్యూట్ 30 బొమ్మల దుకాణాలు బుగ్గి 36 కుటుంబాలు రోడ్డుపాలు కాలి బూడిదైన బంగారం, నగదు, సర్టిఫికెట్లు, విలువైన సామగ్రి సుమారు రూ.కోటికి పైగా నష్టం సంఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్న ఫైరింజన్షార్ట్ సర్క్యూట్.. సకాలంలో ఫైరింజన్ రాకపోవడం.. గాలి వీయడం.. వెరసి నిరుపేదల జీవితాల్లో శనివారం కాళరాత్రిగా మిగిలిపోయింది. సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం కొనుగోలు చేసిన రూ.లక్షలాది సామగ్రి, కుటుంబం కోసం దాచుకున్న బంగారం, నగదు, సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.కోటికి పైగా నష్టం వాటిల్లింది. కష్టార్జితం మంటల్లో కాలిపోయి కట్టు బట్టలతో రోడ్డున పడ్డారు. నీడ కరువై.. ఉపాధి కోల్పోయి.. మంటల్లో బూడిదైన తమ దుకాణాలను చూస్తూ.. చేసిన అప్పులు తీర్చేదెలా దేవుడా అంటూ హృదయ విదారకంగా రోదించారు. -
‘అజ్ఞాత’ హత్యలు.. జనజీవనానికి సవాళ్లు
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడున్నర దశాబ్దాల కాలంపాటు విప్లవోద్యమాలు సాగాయి. సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు, జనశక్తి పార్టీలు ప్రధానంగా సాయుధ విప్లవ పోరాటాన్ని సాగించాయి. ఈ క్రమంలో వర్గశత్రు నిర్మూలన పేరుతో నక్సలైట్లను అనేక మందిని వివిధ సందర్భాల్లో హత్య చేశారు. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అనేక మందిని పోలీస్ ఇన్ఫార్మర్లంటూ నక్సలైట్లు చంపారు. భూస్వాములు, వ్యాపారులు, పోలీసులు, ఆఖరికి మహిళలను కూడా నక్సలైట్లు హతమార్చిన సంఘటనలు అనేకం. అజ్ఞాతంలో ఉండగా.. అప్పటి నక్సలైట్ గ్రూపులకు నాయకత్వం వహించిన దళ నాయకులు, డిప్యూటీ దళ నాయకులు ఆనాటి సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తాజాగా సిరిసిల్ల–వేములవాడ పట్టణాల మధ్య అగ్రహారం గుట్టల్లో హత్యకు గురైన బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధన్న అలియాస్ బాపురెడ్డి(58) ఉదంతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. విప్లవోద్యమాల్లో పని చేసి పోలీసులకు లొంగిపోయి.. అరెస్టయి ఇప్పుడు జనజీవనంలో ఉంటున్న మాజీ నక్సలైట్లలో ఈ ఘటన వణుకు పుట్టిస్తోంది. సిద్ధన్న హత్యోదంతం కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ప్రతీకారాన్ని శంకించి.. ఊరికి దూరంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన సిద్ధన్న పదేళ్లపాటు అప్పటి పీపుల్స్వార్ పార్టీలో పని చేశారు. ఉద్యమ కాలంలో అనేక మందిపై దాడులు, పార్టీ ఆదేశాల మేరకు హత్యలు చేశారు. పీపుల్స్వార్ పార్టీలోనే ఉంటూ.. పోలీసులకు కోవర్టుగా పని చేస్తున్నారని ఆరుగురిని వట్టిమల్ల–మరిమడ్ల మధ్య, మరో నలుగురిని మానాలతండా వద్ద కట్టేసి కాల్చి చంపిన ఘటనల్లో సిద్ధన్న ఉన్నారు. ఇలా సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో అప్పటి పీపుల్స్వార్ నక్సలైట్లు చేసిన అనేక హత్య కేసుల్లో సిద్ధన్న నిందితుడు. ఆయన 2004లోనే పోలీసులకు లొంగిపోయారు. ప్రతీకార దాడులుంటాయని భయపడిన సిద్ధన్న.. మూడేళ్లపాటు సొంత ఊరు గండిలచ్చపేట, సిరిసిల్ల ప్రాంతానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్లో చాలాకాలం ఉన్నారు. సిద్దిపేటలో భార్యతో కలిసి హోటల్ నిర్వహించాడు. ఇక ఏమీ కాదని నిర్ధారణకు వచ్చి సొంత ఊరిలో వ్యవసాయ చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 1999 ఏప్రిల్ 9న వీర్నపల్లిలో జక్కుల అంజయ్య అనే వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట సిద్ధన్న దళం హత్య చేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా అంజయ్య కొడుకు జక్కుల సంతోష్ 26 ఏళ్ల తరువాత సిద్ధన్నను ఇంటర్వ్యూ కోసం పిలిచి అగ్రహారం గుట్టల్లో దారుణంగా హత్య చేశాడు. అంతకుముందు ఓ చానల్ ఇంటర్వ్యూలో సిద్ధన్న అంజయ్య హత్యోదంతాన్ని ఉటంకిస్తూ మాట్లాడడంతో సంతోష్ అతన్ని గుర్తించి ఈ హత్యకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంతోష్ ఒక్కడే సిద్దన్నను హత్య చేయడం గమనార్హం. మాజీ నక్సలైట్లలో వణుకు.. సిద్ధన్న హత్యోదంతంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా స్థిరపడిన మాజీ నక్సలైట్లలో వణుకు మొదలైంది. అజ్ఞాతంలో అనేక మందిని పార్టీ ఆదేశాల మేరకు హత్య చేసిన వారు ఇప్పుడు సాధారణ జనజీవనం సాగిస్తున్నారు. ఆయుధం చేతిలో ఉండగా.. వ్యక్తిగత కక్షలు ఏమీ లేకపోయినా.. పార్టీ ఆదేశాలను అమలు చేసిన వారు కొందరైతే.. వ్యక్తిగత నిర్ణయాలతో హత్యలు చేసిన సంఘటనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది మాజీలను అజ్ఞాత హత్యలు.. ఇప్పుడు జనజీవనంలో సవాళ్లు విసురుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వందలాది మంది మాజీ నక్సలైట్లు జనజీవనంలో ఉన్నారు. వ్యాపారాలు చేస్తూ.. వ్యవసాయం చేస్తూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ సాధారణ జీవనాన్ని సాగిస్తున్నారు. సిద్ధన్న హత్య ఘటన వారిని ఆలోచనలో పడేసింది. అజ్ఞాతంలో ఉండగా.. దాడులు చేసి కాళ్లు, చేతులు విరిచిన ఘటనలు, హత్య చేసిన సంఘటనల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యుల నుంచి ప్రతీకార దాడులు జరిగే ప్రమాదముంటుందని ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది సొంత ఊర్లకు దూరంగా ఉంటుండగా.. కొందరు గత్యంతరం లేక సొంత ఊర్లలోనే సాధారణ జీవనాన్ని సాగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా మావోయిస్టు, జనశక్తి పార్టీలో పని చేసి లొంగిపోయిన వారు అనేక మంది ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. అజ్ఞాతంలో ఉండగా నమోదైన పోలీసు కేసులు కోర్టు విచారణలో సాక్ష్యాలు లేక కొట్టుడుపోయాయి. లొంగిపోయిన వారిపై కేసులను పోలీసు అధికారులు ఎత్తేశారు. కొందరిపై వారెంట్లున్నా.. అరెస్ట్ చేయకుండా వదిలేశారు. తాజాగా సిద్ధన్న హత్యోదంతంతో మాజీలు ఎవరు కూడా మీడియాకు ఇంటర్వ్యూలివ్వడం కానీ, అజ్ఞాతంలో చేసిన ఘటనల గతాన్ని మళ్లీ తవ్వే ప్రయత్నం కానీ చేయొద్దని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. సిద్ధన్న హత్యోదంతం నేపథ్యంలో జిల్లాలోని మాజీ నక్సలైట్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎవరి నుంచయినా ప్రమాదం పొంచి ఉంటే పోలీసులను ఆశ్రయించాలి. పంచాయతీ ఎన్నికల తరువాత జిల్లాలో పోలీస్ స్టేషన్ వారీగా మాజీ నక్సలైట్లను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. చట్టవ్యతిరేక చర్యలను సహించం. అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. – మహేశ్ బి గితే, జిల్లా ఎస్పీ ప్రతీకార హత్యతో ‘మాజీ’ల్లో వణుకు కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సిద్ధన్న హత్యోదంతం మాజీ నక్సలైట్లు అప్రమత్తంగా ఉండాలి పోలీస్ స్టేషన్ వారీగా మాజీలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే -
నోటాకు పదిహేనేళ్లు
ప్రతీ ఊర్లో మనోళ్లు పోటీ చేయాల్సిందే..!కరీంనగర్ అర్బన్/కరీంనగర్టౌన్: అవును.. నోటాకు 15 ఏళ్లు. ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చనపుడు తెరపైకి వచ్చిన ఆప్షనే నోటా(నన్ ఆఫ్ ది ఎబొ). పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఆ అభిప్రాయం వ్యక్తీకరించే అవకాశం నోటా కల్పిస్తుంది. 2013 వరకు ఓటర్లకు అభ్యర్థులు నచ్చకపోయినా.. సరైన అభ్యర్థి పోటీలో లేరని భావించినా ఎవరికో ఒకరికి ఓటేయాల్సిన పరిస్థితి ఉండేది. అదే ఏడాది సెప్టెంబర్ 27న దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుతో నోటా అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం ఈవీఎంలలో నోటా బటన్ అమర్చాక మొదటిసారి ఢిల్లీ, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభభ ఎన్నికల్లో శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో నోటా ఉంటోంది. రాష్ట్ర పంచాయతీరాజ్ సంస్థలు ఎన్నికల నిర్వహణ నియమావళిలో కూడా దీనిని పొందుపరిచారు. దీనిననుసరించి ప్రస్తుతం బ్యాలెట్ విధానంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ బ్యాలెట్ పత్రంలో చివరి చిహ్నం నోటా ఉంటుందన్న మాట. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకుంటే దీన్ని ఉపయోగించండి.. అంతేకానీ పోలింగ్కు దూరంగా ఉండొద్దు. పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థుల ప్రచార ఖర్చుల ధరలను ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రచార ఖర్చుల రోజువారీ వివరాలను అధికారులకు ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోగా అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఖర్చుల వివరాలను ఇంతకన్న ఎక్కువ చూపితే అంగీకరించబోమని అధికారులు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం సైకిల్ రిక్షా వినియోగిస్తే రోజుకు రూ.400, అదే ఆటో రిక్షా అయితే రూ.1,500, టాటాఏస్ అయితే రూ.1,600గా నిర్ణయించారు. 100 యాంప్స్ మైక్సెట్కు రూ.2,500, వెయ్యి వాల్ పోస్టర్లకు రూ.5వేలుగా ప్రకటించారు. నెత్తిన ధరించే టోపీకి రూ.40, టీషర్ట్కు రూ.100 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఒకరోజుకు కారు అద్దెను రూ.2,500గా, ఇన్నోవాకు రూ.3,500గా చూపాల్సి ఉంటుందన్నారు. కూర్చునేందుకు వినియోగించే ఒక్కో కుర్చీకి రోజుకు రూ.20గా, వీఐపీ కుర్చీ అయితే రూ.100 అద్దెగా నిర్ణయించారు. కూల్డ్రింకు, వాటర్ బాటిల్కు రూ.20 చొప్పున, లస్సీకి రూ.35గా, వాటర్ పాకెట్కు రూపాయి, చాయ్కు రూ.10, కాఫీకి రూ.15 ధర చొప్పున లెక్క చూపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కిలో బరువున్న బాణసంచాకు రూ.800, ఒక డప్పుకు రూ.700 చొప్పున చెల్లించాలన్నారు. సాదా భోజనానికి రూ.80, మటన్ బిర్యానీకి రూ.150, చికెన్ బిర్యానీకి రూ.100 చొప్పున బిల్లు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. జగిత్యాలజోన్: సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినా సరే.. ఓడినా సరే.. కాని జిల్లాలోని ప్రతీ గ్రామంలో మనోళ్లు పోటీలో ఉండాల్సిందే అంటూ రాజకీయ పార్టీలు స్థానిక నాయకులకు హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో రిజర్వేషన్కు అనుకూలంగా పోటీ చేసే నాయకుల కోసం అన్వేషిస్తున్నారు. స్థానిక నాయకుల ఒత్తిడితో పోటీ చేసేందుకు కొందరు ఆసక్తి చూపినా.. డబ్బుల్లేక వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు తలా కొంత వేసుకొని పార్టీపరంగా అభ్యర్థి ఉండేలా చూస్తున్నారు. గ్రామంలో ఏదైనా పార్టీ తరఫున అభ్యర్థి లేడంటే.. ఆయా పార్టీల నియోజకవర్గ ఇన్చార్జీల వద్ద తలెత్తుకోలేమని స్థానిక నాయకులు భయపడుతున్నారు. ఇప్పటికే తొలి విడత నామినేషన్ వేసిన కొందరిని పోటీ నుంచి ఉపసంహరించేలా ప్రయత్నాలు జరుగుతుండడంతో.. అప్రమత్తంగా ఉండాలని ఆయా పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు. స్థానిక నాయకులు గెలిచినా.. ఓడినా.. ఓ వర్గంగా బలంగా ఉంటేనే రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమకు అండగా ఉంటారని ఆయా పార్టీల నియోజకవర్గ ఇన్చార్జీలు భావిస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకున్నా.. తప్పనిసరిగా ప్రతీ పార్టీ తరఫున అభ్యర్థులుండేలా మండల, జిల్లాస్థాయి నాయకులు పల్లెల్లో సమావేశాలు పెడుతున్నారు. ప్రతీ చిన్న పల్లెలోనూ సర్పంచ్ పదవికి నలుగురైదుగురు పోటీ పడుతుండడం గమనార్హం. ఎన్నికల ప్రచార ఖర్చులిలా.. -
కాంగ్రెస్ తెచ్చిన విద్యుత్ పాలసీ బూటకం
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ పాలసీ పచ్చి బూటకమని, వారు చెప్పేది ఒకటి, చేసేది మరొకటని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. పవర్ ప్లాంట్లకు బీఆర్ఎస్ ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. కాంగ్రెస్ స్కాంలను హరీశ్రావు ఎండగడితే అతడి దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని ఖండించారు. దేశంలోనే అతి పెద్ద భూ స్కాం బయటపడగా, మళ్లీ రూ.50 వేల కోట్ల పవర్స్కాం వెలుగు చూసిందన్నారు. సీఎం రేవంత్ రామగుండంలో రూ.15 కోట్లతో పవర్ప్లాంట్ అంచనా వేశారని, ఇది ఇప్పటితో ఆగదన్నారు. వారు కమీషన్ల కోసమే వీటిని కడుతున్నారని ఆరోపించారు. ఎన్టీపీసీ తక్కువ ధరకే 2,400 మెగావాట్ల కరెంట్ ఇస్తామన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా బుగ్గారం మండలానికి చెందిన బీజేపీ నాయకులు పోలంపెల్లి మల్లేశ్, భరతపు గంగాధర్ బీఆర్ఎస్లో చేరారు. నాయకులు హరిచరణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
జగిత్యాలటౌన్: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య కోరారు. ప్రతీ ఆదివారం భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (డిక్కీ) ఆధ్వర్యంలో నిర్వహించే అంబేడ్కర్ స్మరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిపిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లో వారి విశ్వాసాలకు అనుగుణంగా భగవంతుని తర్వాత అత్యధికంగా ఆరాధించేది అంబేడ్కర్ మహశయుడినేనని పేర్కొన్నారు. జైభీం, జైసంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నల్ల శ్యాం, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, అనంతుల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో నామినేషన్ రిపోర్టులు పంపించాలి
సారంగాపూర్(జగిత్యాల): నామినేషన్ పత్రాలను పరిశీలించి స్వీకరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంతోపాటు, రేచపల్లి, లక్ష్మీదేవిపల్లి రెండో దశ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని పేర్కొన్నారు. ప్రతీ కేంద్రం వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థుల సందేహాలను సిబ్బంది నివృత్తి చేసి అవసరమైన సహకారం అందించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వాహిదొద్దీన్, ఎంపీడీవో సలీం తదితరులు ఉన్నారు. ప్రజావాణి రద్దు జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. -
మున్సిపల్ అక్రమాలపై విచారణ జరిపించాలి
మెట్పల్లి: మెట్పల్లి మున్సిపాలిటీలో సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని, విజిలెన్స్ విచారణ చేపట్టాలని బీజేపీ పటణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. పట్టణంలో అక్రమ నిర్మాణదారులతోపాటు అనుమతులు పొంది.. అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టని వారిని బెదిరింపులకు గురిచేస్తూ టౌన్ ప్లానింగ్ సిబ్బంది భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. రెవెన్యూ విభాగంలో ఇంటి నంబర్ల కేటాయింపు, ఆస్తి పన్ను విధింపు, పేరు మార్పిడి వంటి పనులకు లంచాలు వసూలు చేస్తున్నారని తెలిపారు. శానిటేషన్ విభాగంలో ట్రేడ్ లైసెన్స్ల జారీ, వాహనాలకు మరమ్మతు, డీజిల్ వినియోగం, బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు. ఔట్సోర్సింగ్ విభాగంలో అవినీతికి పాల్పడిన కొందరిని తొలగించిన అధికారులు.. వారిని తిరిగి తీసుకోవడమే కాకుండా కీలక సెక్షన్లల్లో విధులు అప్పగించారని, పలువురు ఏళ్ల తరబడిగా ఒకే విభాగంలో కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. వీటిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సుంకేట విజయ్, ఉపాధ్యక్షులు బొడ్ల నగేశ్, తల్లొజి భాస్కర్ ఉన్నారు. -
సమయం లేదు మిత్రమా..!
జగిత్యాల: పంచాయతీ ఎన్నికల సంబంధించిన షెడ్యూల్లో అభ్యర్థుల తుది జాబితా అనంతరం ప్రచారానికి సరిగ్గా వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండోది ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయ్యాకనే అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తుంటారు. కానీ, ప్రచారానికి సరిగా వారం రోజుల సమయం ఉండడంతో ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కో చోట సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే పల్లెల్లో ఎవరు నిల్చోవాలి, ఎవరు వద్దన్నది చర్చించుకుంటున్నారు. బుజ్జగింపులకు సమయం లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. రెబల్స్ను ప్రసన్నం చేసుకునేందుకు రాజీ మార్గం కోసం తాపత్రయపడుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను బతిమిలాడుతున్నారు. ఒక్క చాన్స్ ప్లీజ్ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఆశావహులు స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో పోటీ చేసే ఆశావహులు పార్టీల మద్దతు ఉంటే విజయ అవకాశాలు కొంచెం మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవైపు సమయం లేకపోవడం, మరో వైపు ప్రజాప్రతినిధులు సైతం బలమైన అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు ప్రకటించిన అభ్యర్థులే కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎలాగైనా స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి అంశాలు సానుకూలంగా ఉంటాయనే ఆశావహులు ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు కోరుతున్నారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీపీలుగా చేసిన వారు సైతం ప్రస్తుతం సర్పంచ్ పదవికి ఉత్సాహం చూపుతున్నారు. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో రిజర్వేషన్లు కలిసి వస్తాయో లేదో అనే ఉద్దేశంతో సర్పంచ్ పదవుల కోసం బరిలోకి దిగుతున్నారు. జిల్లాలో సర్పంచ్, వార్డు పదవిని ఎలాగైన దక్కించుకోవాలని కొందరు ఏకగ్రీవం కోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహాయంతో ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, కుల సంఘాల నాయకులు పెద్ద మనుషుల సాయంతో ఎవరి ప్రయత్నం వారే చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామంలో కాసుగంటి లాస్యప్రియ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అలాగే, మిగతా స్థానాల్లో సైతం చాలా తక్కువ మంది పోటీలో ఉండేలా బుజ్జగింపులు, ఏకగ్రీవ ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి
జగిత్యాలరూరల్: గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్ వేసే అభ్యర్థులు ఖర్చు వివరాలను ఎన్నికల అనంతరం తప్పకుండా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు మనోహర్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్మండలం చల్గల్ నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభ్యర్థులు నామినేషన్ పత్రాలను, వారి బ్యాంకు వివరాలను పొందుపర్చాలన్నారు. ఎన్నికల సమయంలో రోజూ చేసిన ఖర్చును ఎన్నికల తర్వాత సమర్పించాలని సూచించారు. మొన్న జెడ్పీటీసీ.. నేడు సర్పంచ్గా నామినేషన్జగిత్యాలరూరల్: జగిత్యాల జెడ్పీటీసీగా మొన్నటి వరకు సంగెపు మహేశ్ పనిచేశారు. ఇటీవలే పదవీకాలం పూర్తయింది. కాగా, జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్ కావడంతో ఆదివారం సర్పంచ్గా నామినేషన్ వేశారు. జెడ్పీటీసీ చేసిన వ్యక్తి సర్పంచ్గా బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థులకు సమాచారం అందించాలిజగిత్యాలరూరల్: నామినేషన్ కేంద్రాల వద్దకు వచే అభ్యర్థులకు సరైన సమాచారం అందించాలని డిప్యూటీ సీఈవో నరేష్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాం నామినేషన్ కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. అభ్యర్థులకు నామినేషన్పత్రాలు అందించడంతోపాటు సరైన వివరాలు పొందుపర్చేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. నామినేషన్ పత్రాలు తీసుకుంటున్న సమయంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
జగిత్యాలరూరల్: జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియను సజావుగా చేపట్టాలని డీపీవో రఘువరణ్ అన్నారు. ఆదివారం జగిత్యాల అర్బన్ మండలం మోతె, తిప్పన్నపేట గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడారు. అభ్యర్థుల వివరాలు పరిశీలించిన తర్వాతే నామినేషన్ స్వీకరించాలన్నారు. ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపివో వాసవి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలని డీపీవో (శిక్షణ) రేవంత్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం అనంతారం, పోరండ్ల, నర్సింగాపూర్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేవారు నిబంధనల ప్రకారం నామినేషన్లు సమర్పించాలన్నారు. ఏదైనా అనుమానాలు ఉంటే స్థానిక అధికారులతో నివృత్తి చేసుకోవాలన్నారు. ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు ఉన్నారు. -
అవగాహనే ఔషధం
● జిల్లాలో తగ్గుతున్న ఎయిడ్స్ బాధితులు ● విస్తృతంగా అవగాహన కల్పిస్తుండడమే కారణం ● నేడు ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినంజగిత్యాల/కరీంనగర్: ఎయిడ్స్ అంటే భయం. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు శరీరాన్ని వదిలివెళ్లదు. మందులు వాడితే నియంత్రణలో ఉంటుంది గానీ ఆదమరిస్తే తిరగబెట్టి కబళించేస్తుంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరిగి క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటుచేసింది. ఫలితంగా జిల్లాలో కొన్నేళ్లుగా ఎయిడ్స్ తగ్గుముఖం పడుతూ వస్తోంది. గతంలో కన్నా ప్రస్తుతం కేసులు తక్కువగా కనిపిస్తున్నా.. జిల్లాలో అధికారికంగానే ప్రతినెల 20కి పైగా పాజిటివ్కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా చాలా మంది వ్యాధిబారిన పడుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. నెలనెలా పరీక్షలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ విభాగం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో బాధితుల సంఖ్య తగ్గుతోంది. జిల్లాలో ప్రస్తుతం 2,211 మంది హెచ్ఐవీ పాజిటివ్తో ఉన్నారు. ఈ ఏడాది 9,650 మందికి పరీక్షలు చేయగా 83మందికి పాజిటివ్ వచ్చింది. 6,710 గర్భిణులకు పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరు ప్రస్తుతం ఏఆర్టీ సెంటర్ల ద్వారా చికిత్స పొందుతున్నారు. అవగాహన ముఖ్యం హెచ్ఐవీ అని తెలియగానే సీడీ–4 కణాల సంఖ్య తగ్గేంత వరకూ అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక వైద్యసేవలు పొందితే 75 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవనం సాగించొచ్చు. ఎయిడ్స్ రోగులూ మధుమేహం, బీపీ, ఆస్తమా రోగుల మాదిరిగానే ఔషధాల వాడకం ద్వారా మంచి ఆరోగ్యం పొందొచ్చు. హెచ్ఐవీ ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్టీ మందులు వాడి ఆ రోగం లేని పిల్లలకు జన్మనివ్వొచ్చు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి హెచ్ఐవీ బాధితులు ఉదయం 3 కిలోమీటర్లు నడిచి, 15 నిమిషాల పాటు ధాన్యం చేయాలి. గ్లాస్ పాలు, బ్రెడ్, ఉడికించిన గుడ్డు తీసుకోవాలి. రోజు రాగి జావా, అంబలి తాగాలి. మధ్యాహ్నం భోజనంలో తాజా కూరగాయలు, ఆలు దుంపలు, ఆకు కూరలు, పప్పు దినుసులు, నాన్వెజ్ తీసుకోవాలి. సాయంత్రం ఆపిల్, దానిమ్మ, అంగూర, అరటి పండ్లు, ఫైనాపిల్, సపోట తినాలి. గోధుమ రవ్వ పాలలో కలిపి ఉడికించి ఆరగించాలి. రాత్రి భోజనంలో తాజా కూరగాయలు, రెండు చపాతీలు, నిద్రించే సమయంలో వేడి చేసి చల్లార్చిన నీరు తాగిలి. ఎయిడ్స్ బారిన యువత... హెఐవీ కేసుల్లో యువత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే 70 శాతం వరకు హెఐవీ వ్యాధి బారినపడుతున్నారు. మద్యానికి బానిస కావడం, మత్తు పదార్థాలు సేవించడం, సురక్షితం లేని శృంగారంలో పాల్గొనడం, తగు జాగ్రత్తలు పాటించకపోవడవమని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో హైరిస్క్ ప్రవర్తన కలిగిన వ్యక్తులు, ఫీమేల్ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్ల తరపున స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పునకు యత్నిస్తున్నాయి. మంచి మందులు అందుబాటులో ఉండడంతో మరణాల సంఖ్య తగ్గింది. ఎయిడ్స్ నిర్మూలనకు విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలతో జిల్లా ప్రథమస్థానంలో నిలవడంతో గతేడాది స్టేట్ అవార్డు వచ్చింది. వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందజేశారు. హెచ్ఐవీ బాధితులకు ఏఆర్టీ సెంటర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. వారికి కావాల్సిన మందులు ఇవ్వడంతో పాటు సీడీ–4, వైరల్ లోడ్పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నాం. హెచ్ఐవీ నియంత్రణ మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – ఎం.సదానందచారి, ఐసీటీసీ కౌన్సిలర్, కరీంనగర్ -
పక్షవాత బాధితుడికి ఆర్థికసాయం
సారంగాపూర్(జగిత్యాల): బ్రెయిన్ స్ట్రోక్తో పక్షవాతం సోకి మంచానికి పరిమితమైన ఓ బాధితుడికి వైద్య ఖర్చుల కోసం రూ. 1.13 లక్షలు సాయం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాలు.. బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన బొమ్మిడి తిరుపతి బైక్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. పేదరికం కారణంగా అవసరమైన వైద్యసేవలు అందక మరింత ఆరోగ్యం క్షీణించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్.. తిరుపతి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తన ఫేస్బుక్లో పోస్టు చేశాడు. దాతలు స్పందించి రాజ్యలక్ష్మి బ్యాంక్ ఖాతాకు రూ. 1.13 లక్షలు విరాళాలు అందించారు. ౖఈ నేపథ్యంలో వెద్యఖర్చుల కోసం కొంత మొత్తాన్ని ధర్మపురి ఎస్బీఐ మేనేజర్ చేతుల మీదుగా రాజ్యలక్ష్మికి అందించారు. ఈ సందర్భంగా రమేశ్ చేసిన సాయానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
రైతు ఇంటా.. పసిడి పంట
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రైతులు పసుపును ప్రధాన పంటగా సాగు చేస్తుంటారు. పంట కాలం దాదాపు 9 నెలలు ఉండటంతో ఏ గ్రామంలో చూసినా రోడ్ల వెంట పచ్చని పసుపు తోటలే స్వాగతం పలుకుతూ కనిపిస్తాయి. పంటను తవ్వడం నుంచి ఉడికించడం, మార్కెట్కు తరలించే సమయంలో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. 35,230 ఎకరాల్లో.. ఉద్యానశాఖ అంచనా ప్రకారం జిల్లాలో 35,230 ఎకరాల్లో పసుపు సాగయింది. గతేడాది పసుపు క్వింటాల్కు రూ.15 వేల వరకు పలకడంతో కొంత విస్తీర్ణం పెరిగింది. అత్యధికంగా ఈ పంటను మెట్పల్లిలో 6,196, మల్లాపూర్ 5,123, ఇబ్రహీంపట్నం 5,121, జగిత్యాలరూరల్ 3,202, కోరుట్ల 2,684, రాయికల్ 2,380, కథలాపూర్ 2,354, మేడిపల్లిలో 1,557 ఎకరాల్లో వేశారు. రేటు ఉన్నా.. లేకున్నా.. జిల్లావ్యాప్తంగా మెజార్టీ గ్రామాల్లో పసుపు సాగు చేస్తుంటారు. పంటకు రేటు ఉన్నా, లేకున్నా అర ఎకరం నుంచి నాలుగైదు ఎకరాల వరకు సాగు చేయడం ఆనవాయితీగా వస్తుంది. విత్తనాన్ని కొనకుండా గతేడాది పంట నుంచి సేకరిస్తారు. కనీసం ఒక్కో రైతు 25 నుంచి 200 క్వింటాళ్లు పండిస్తాడు. ఏదైనా అశుభాలు జరిగినప్పుడు ఏ రైతూ తోటలోకి వెళ్లరు. పంట దిగుబడిని జగిత్యాల, మెట్పల్లి, నిజమాబాద్, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లకు తీసుకెళ్తారు. జిల్లాలో ఎర్ర నేలలు అనుకూలంగా ఉండడం, నాణ్యతో కూడిన దిగుబడులు రావడంతో ఇక్కడి పసుపునకు మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది. ఆదాయంతో అమెరికాకు.. పసుపు ద్వారా మంచి ఆదాయం వస్తుండడంతో రైతులు గ్రామాల్లో అందమైన భవంతులు నిర్మించడంతో పాటు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి అమెరికా, లండన్, కెనడా దేశాలకు పంపిస్తున్నారు. తోటల్లో పనిచేసేటప్పుడు రైతు దంపతులు బురద దోవతి, మాసిన చీరతో కనిపిస్తారు. ఇంటికి వద్ద కారు, తెల్లదోవతి, తెల్ల అంగి, పచ్చ టవల్తో రైతు, రైతు భార్య మెడ చుట్టూ బంగారు కంటె, చెవులు ఊడిపడేలా బంగారు పోగులతో కనబడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. పసుపు పంటకు రేటు ఉన్నా, లేకున్న రెండెకరాల్లో సాగు చే స్తుంటా. మిగతా పంటల ద్వా రా వచ్చే ఆదాయం ఖర్చులకు పోగా, పసుపు పంట ఆదాయం మిగులుతుంది. – కాసారపు భూమారెడ్డి, మల్లాపూర్ జిల్లాలో వరి, మొక్కజొన్న తర్వాత పసుపు ప్రధాన పంట. గతేడాది రేటు పెరగడంతో పసుపు సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సేంద్రియ ఎరువులు వాడి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
బీసీల కోసం పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్
ధర్మపురి: బీసీల కోసం నిజమైన పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ విషయంలో అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని, కొందరు పార్టీనీ బదనాం చేయడానికి ప్రజలకు రెచ్చగొడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందని, అన్ని కులాలవారిని కలుపుకొని వెల్లడం తమ నాయకుడి లక్షణమన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఒక బీసీ నాయకున్ని నియమించడం జరిగిందని, ఇది తమ పార్టీ వైఖరి అని వివరించారు. గ్రామాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ధర్మపురి డంపింగ్యార్డు రిసైక్లింగ్ యూనిట్ కోసం త్వరలోనే ముహూర్తం పెడుతామని, అవసరమైన నిధులు తెచ్చేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నాయకులు ఎస్.దినేశ్, కుంట సుధాకర్, చీపిరిశెట్టి రాజేశ్ తదితరులున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
ప్రయోగాలతో శాస్త్రవేత్తలుగా ఎదగాలి
జగిత్యాల: వైజ్ఞానిక ప్రదర్శనలతో నైపుణ్యత పెరుగుతుందని, ప్రయోగాలతో శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చని డీఈవో రాము అన్నారు. శనివారం 53వ జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రదర్శనలో 350 మంది బాల శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణలు చేపట్టారని, సుమారు 3,400 మంది వచ్చారని చెప్పారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ వినోద్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆలోచనలతో శాస్త్రవేత్తలుగా మారుతారని, కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చన్నారు. ఎంఈవో చంద్రకళ మాట్లాడుతూ, దేశభవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని, సోషల్ మీడియాతో సమయం వృథా చేసుకోకూడదన్నారు. జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించినప్పుడే సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే ప్రయోగాలు చేయవచ్చన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా రాష్ట్రస్థాయికి జూనియర్ విభాగంలో 7, సీనియర్ విభాగంలో 7 ఎంపికయ్యాయని తెలి పారు. అలాగే 111 ఇన్స్పైర్ ప్రదర్శనలకు గాను 11 ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని వివరించారు. ఎంపికై న విద్యార్థులు కామారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈసందర్భంగా విద్యార్థులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. నృత్యం చేస్తున్న విద్యార్థులువిజేతలతో డీఈవో రాము -
పార్ట్టైం జాబ్ పేరిట సైబర్ మోసం
జగిత్యాలక్రైం: సైబర్ నేరగాళ్లు పార్ట్టైం జాబ్ పేరుతో ఓ నిరుద్యోగిని నమ్మించి మోసానికి పాల్పడ్డారు. జగిత్యాల పట్టణానికి చెందిన మహ్మద్ అయూబ్కు ఈనెల 21న టెలిగ్రామ్లో పార్ట్టైం జాబ్లున్నాయని మెసేజ్ వచ్చింది. దీంతో అతను లింక్ ఓపెన్ చేయగా సైబర్ నేరగాళ్లు రిజిస్ట్రేషన్ కోసం రూ.10 వేలు చెల్లించాలని కోరారు. దీంతో మహ్మద్ అయూబ్ రూ.10 వేలు చెల్లించాడు. అనంతరం అయూబ్ ఐసీఐసీఐ ఖాతాకు రూ.16 వేల వేతనం వేశారు. దీంతో నమ్మిన అతను సైబర్ నేరగాళ్లు ఇచ్చిన టాస్క్లను పూర్తి చేసి అడిగిన విధంగా దశల వారీగా రూ.1,14,032 వారి ఖాతాలో జమచేశాడు. లింక్ క్లోజ్ కావడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ పోలీసులు తక్షణమే స్పందించి సైబర్ నేరగాళ్ల ఖాతాలో ఉన్న రూ.25 వేలు ఫ్రీజింగ్ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కుమారస్వామి తెలిపారు. జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో బంగారు ఉంగరం మాయం చేసి నకిలీ ఉంగరాన్ని వదిలి వెళ్లిన ఘటన జరిగింది. టవర్సర్కిల్ ప్రాంతంలోని ఓ బంగారం దుకాణానికి శనివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి వచ్చి బంగారు ఉంగరం సెలక్షన్ చేసుకున్నాడు. అదే తరుణంలో మరో కస్టమర్ రావడంతో మాటల్లో దింపి ఓ ఉంగరాన్ని తూకం వేయాలని కోరగా తూకం వేసి యజమాని ఉంగరాన్ని టేబుల్పై పెట్టగానే 2 గ్రాముల బంగారు ఉంగరాన్ని కాజేసి నకిలీ ఉంగరాన్ని పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. సీసీపుటేజీల ఆధారంగా చోరీకి పాల్పడ్డట్లు గుర్తించి పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశాడు. -
నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగొద్దు
కోరుట్లరూరల్: మండలంలోని యూసుఫ్నగర్లో శనివారం నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జీవాకర్రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఎన్నికల నియామవళి అమలు చేయాలి మెట్పల్లిరూరల్: ఎన్నికల ప్రవర్తనా నియామవళి పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి మండలం మేడిపల్లి, బండలింగాపూర్, వెల్లుల గ్రామాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవో సురేశ్, ఎంపీవో మహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
పంచాయతీ ఎన్నికల్లో సోషల్ మీడియా హవా
జగిత్యాలజోన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్ మీడియా ప్రచారాన్ని విస్త్రృతంగా వాడుకుంటున్నారు. వివిధ రకాల యాప్లు అందుబాటులోకి రావడంతో తమకు ఉన్న పరిజ్ఞానంతో ఫొటోలు, వీడియోలతో ఎన్నికల పాటలు చిత్రీకరించి, ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పాటలన్నీ కూడా యువతను ఉత్తేజపరిచేలా, మహిళలను గౌరవించే విధంగా, గ్రామాభివృద్ధికి పాటు పడేలా, పోటీ చేస్తున్న నాయకుడిని పొగిడేలా.. ఇప్పటికే ట్రెండ్లో ఉన్న రాజకీయ, సినిమా, జానపద పాటలను వాడుకుంటున్నారు. ఇందుకోసం, గ్రామంలో కులాల వారీగా, యువజన సంఘల వారీగా, మహిళల గ్రూపుల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి పోస్ట్ చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. తాము గెలిస్తే గ్రామాభివృద్ధికి చేయబోయే పనులను కూడా ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఇది చాలదన్నట్టూ తమ బంధువులు, అనుయాయుల సెల్ఫోన్లలో స్టేటస్లుగాను, ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగామ్ల్లో సైతం పోస్టులు పెడుతున్నారు. కొందరు అభ్యర్థులు తమ ఫొటోలతో డిజైన్ చేయించి, గ్రూపుల్లో పెడుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. వాయిస్ మేసేజ్లను కూడా జత చేస్తున్నారు. -
నిబంధనలు అమలయ్యేనా?
జగిత్యాలక్రైం: జిల్లాలోని 72 మద్యం దుకాణాల నిర్వహణకు (2025–27 సంవత్సరానికి) ఇటీవల టెండర్లు పిలిచి లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి. కాగా ప్రభుత్వానికి ఆదాయ నిధిగా ఉన్న ఎకై ్సజ్ శాఖ అమ్మకాలపై చూపిస్తున్న శ్రద్ధ కొత్త మద్యం పాలసీ నిర్వహణలో నిబంధనలు అమలు చేయడంలో విఫలమవుతుందని ఆరోపణలున్నాయి. గతంలో జిల్లాలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో జనావాసాలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనలు చేసిన ఘటనలున్నాయి. అయినా ఎకై ్సజ్ అధికారులు అవేం పట్టించుకోకుండా వ్యాపారులకు వత్తాసు పలుకుతూ వారికి అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అనుమతులిచ్చారని ఆరోపణలున్నాయి. కొత్త మద్యం పాలసీ నిర్వహణలోనైనా నిబంధనలు అమలు చేస్తారా, మామూలుగానే వదిలేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కళాశాలకు సమీపంలో.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ జోన్స్, ఆలయాలు, మసీదులు, చర్చిలకు 100 మీటర్ల దూరంలో, గ్రామాల్లో జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. 50 స్క్వేర్ మీటర్లు కలిగిన రూంలో సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ బాటిళ్లు, కూల్డ్రింక్స్, తినుబండారాలు విక్రయించకూడదు. కానీ, జిల్లాలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కాకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద మహిళా డిగ్రీ కళాశాల ముందే మూడు మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. అలాగే బైపాస్రోడ్లో దేవిశ్రీ గార్డెన్స్ వద్దనున్న మద్యం షాపు వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని వైన్స్ కూడా ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోనే ఉన్నా పట్టించుకోవడం లేదు. మహిళ డిగ్రీ కళాశాల ఆవరణలో బాలికల వసతి గృహం ముందే మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త మద్యం పాలసీలో జనవాసాలకు దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపాల్టీల్లో క్లస్టర్ల తొలగింపు జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎకై ్సజ్ శాఖ క్లస్టర్ విధానాన్ని తొలగించింది. దీంతో మద్యం దుకాణం లక్కీడ్రాలో వస్తే పట్టణం, నగరాల్లో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఎండోమెంట్ ఆదీనంలోని ఆలయాలతో పాటు, బడి, గుడి, హాస్పిటల్స్కు వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనలు మాత్రం ఉన్నాయి. ఇది కచ్చితంగా పాటించాల్సిందే. మున్సిపాల్టీ, నేషనల్ హైవే, స్టేట్ హైవే పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. దీంతో మంచి అడ్డాలపై దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కన్నేస్తున్నారు. రేపటి నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభం -
సర్పంచ్ బరిలో విద్యావంతుడు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం సర్పంచ్ స్థానంలో పోటీ చేసేందుకు విద్యావంతుడు, న్యాయ వాది మార తేజ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తేజ తండ్రి బమార కిశోర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయవాది. తేజ ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివారు. తండ్రి మార కిశోర్ మాజీ ఎంపిటిసిగా కూనారంలో సేవ లు అందించారు. తేజ వయసు 26 ఏళ్లు. చిన్నవయసులో సర్పంచ్ స్థానాని కి నామినేషన్ వేసిన వ్యక్తిగా గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు పేర్కొన్నారు. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
జమ్మికుంట: ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ చెందిన పాతకాల విజయరాణి(35) కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగింది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమెకు భర్త కిరణ్, ముగ్గురు కొడుకులున్నారు. గంగారపు చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. దేశరాజ్పల్లి వాసి..రామడుగు: దేశరాజ్పల్లి గ్రామానికి చెందిన కొత్త రేణుక(38) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రేణుక కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. భర్త రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తాళం వేసిన ఇళ్లలో చోరీకోరుట్ల: కోరుట్ల పట్టణంలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు.. పట్టణంలోని రవీంద్రారోడ్లో ఇల్లుటపు భూమయ్య ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని బంగారు గొలుసు, ఉంగరం, వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. జూనియర్ కళాశాల గ్రౌండ్ వద్ద కటుకం రాజారాం ఇంటి తాళాలు పగులగొట్టి కబ్బోర్డ్లోని ఐదు బంగారు ఉంగరాలు, ఒక జత చెవి కమ్మలు, కాళ్ల కడియాలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. వీణవంక: బేతిగల్, కనపర్తి, వల్భాపూర్ గ్రామాల రైతులకు చె ందిన వ్యవసాయ బా వుల సర్వీస్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రైతు ల వివరాల ప్రకారం.. సుమారు పది మంది రైతుల వ్యవసాయ బా వుల వద్ద స్టార్టర్ నుంచి విద్యుత్ మోటార్ వరకు వెళ్లే సర్వీస్ వైర్లు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం రై తులు గమనించి డయ ల్ 100కు ఫోన్ చేశా రు. బేతిగల్కు చెందిన ఓ రైతు బోరు మెటార్ వైరు రూ.3వేల విలువ ఉంటుందని, మరో రైతు వైరు రూ.1,500 ఉంటుందని వాపోయారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. -
సర్పంచ్ గిరి.. ‘నల్లకోటు’ గురి
జగిత్యాలజోన్: ఉమ్మడి జిల్లాలో వివిధ కోర్టుల్లో దాదాపు 3,000 మంది న్యాయవాదులు ఉంటారు. ఎప్పుడు కోర్టుల్లో నల్లకోటు వేసుకుని, నాలుగు గోడల మధ్య ఉండే న్యాయవాదులు పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. దాదాపు 90 శాతం న్యాయవాదులు గ్రామాల నుంచి వచ్చి ఆయా కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నవారే. ప్రజలతో ఉన్న సంబంధాలతో పాటు రిజర్వేషన్లు కూడా అనుకూలించడంతో పోటీకి సై అంటున్నారు. వివిధ కోర్టుల నుంచి ఐదారుగురు న్యాయవాదులు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జగిత్యాల జిల్లాలో పోటీ చేసే న్యాయవాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. గత పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది న్యాయవాదులు సర్పంచ్లుగా గెలుపొందగా, ఇప్పుడు వారిని చూసి మరికొందరు పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆయా సామాజిక వర్గాల్లో పెద్దగా చదువుకున్న వారు లేకపోవడం, ఏదైనా సమస్య వస్తే గట్టిగా మాట్లాడేవారు కరువవడంతో న్యాయవాదులుగా ఉన్నవారిని పోటీ చేయాలని కులసంఘాలే డిమాండ్ చేస్తూ గ్రామాలకు పిలుస్తున్నాయి. -
కేసీఆర్ ఆమరణ దీక్ష మహోత్తర మలుపు
జగిత్యాల: 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఒక మహోత్తర మలుపు అని, తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. శనివారం 16వ దీక్ష దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీక్ష దివస్ ప్రజల్లో తెలంగాణ ఆత్మ గౌరవ జ్వాలను మరింత రగిలించి రాష్ట్ర సాధనకు బాటలు వేసిందన్నారు. అలాగే ఉద్యమం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన వీరులను మరువలేమని పేర్కొన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉద్యమకాలంలో కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని, జైలులో సైతం దీక్ష చేపట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రకటన చేస్తామని చెప్పడం కేసీఆర్ దీక్ష ఫలితమేనని వివరించారు. కేసీఆర్ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం కోసం కృషి చేయాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్, దావ వసంత, నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు -
కులపోళ్ల ఓట్లే కీలకం
కరీంనగర్టౌన్: పల్లె సంగ్రామంలో భాగంగా శనివారం మొదటి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఆదివారం రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలు పర్వం షూరు కానుంది. ఈనేపథ్యంలో సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు పల్లెల్లో తమకు మద్దతు ఇవ్వాలని పగలు ప్రచారం చేస్తూనే..రాత్రి మంతనాలలో ముగినితేలుతున్నారు. గెలుపే లక్ష్యంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తమ అనుచరుల్లోని ముఖ్యులను రంగంలోకి దింపి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కుస్తీ పడుతున్నారు. కుల పెద్దలను రహస్యంగా సంప్రదిస్తున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఉన్న ఓట్లను సామాజిక వర్గాల వారీగా గుర్తించి ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని సామాజికవర్గాల మద్దతు లభిస్తే విజయం సునాయాసమన్న భావనలో అభ్యర్థులున్నారు. ఎత్తుకు పై ఎత్తులు గ్రామాల్లో వార్డుల వారీగా మొత్తం ఓట్లలో ఎక్కువ ప్రాబల్యం కలిగిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటున్న అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలుపోటములను నిర్ధారించే పోలింగ్ బూత్లపై దృష్టి సారిస్తూ, ప్రత్యేకంగా ఒక టీమ్ తయారు చేసుకొని తీసివేతలు, కూడికలు మొదలుపెట్టారు. గెలుపుబాటలో పయనించాలంటే తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు ముమ్మరం చేశారు. ఆయా కుల సంఘాల్లో జిల్లా స్థాయి పదువుల్లో ఉన్నవారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కులపెద్దలతో మంతనాలు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఓటర్లను గుర్తించి ఆయా వర్గాలకు చెందిన పెద్దలతో అనుచరగణం సాయంతో మంతనాలు చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఫోన్లలో వారిని ఆప్యాయంగా పలుకరించి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. స్థానిక సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారితో ప్రస్తావించి గెలిచిన వెనువెంటనే తొలిప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భిన్న రూపం దాల్చడంతో ఎన్నికల సమయంలోనే సమస్యల పరిష్కారానికి పునాది రాయి పడాలనే ముందుచూపుతో అన్ని సామాజిక వర్గాలు వ్యవహరిస్తున్నాయి. రెండు వైపులా వారే.. పోటీలో ఉండే అభ్యర్థులకు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదయం ఓ అభ్యర్థికి మద్దతుగా కనిపిస్తున్న వ్య క్తులు చీకటి కాగానే మరో అభ్యర్థికి మద్దతుగా వాడలలో కలియతిరుగుతున్నారు. తమ కే ఓట్లు వేయిస్తామని నమ్మబలుకుతున్నారు. మందు, విందు పార్టీల్లో మునిగి తేలుతున్నారు. ఒక్కరుగా కాకుండా కొంత మందిని పోగేసుకుని వెళ్తున్నారు. వీరిని బుజ్జగించడానికి ఆశావహులు తంటాలు పడుతున్నారు. దీంతో పంచాయతీ సమరం రాను రాను రసకందాయంగా మారనుంది. పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు వీటిపై అన్ని పార్టీల దృష్టి గంపగుత్తగా వేసుకునేందుకు ప్రణాళికలు సామాజికవర్గాల వారీగా మంతనాలు కుల పెద్దలను సంప్రదిస్తున్న నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ముందస్తు హామీలు.. నజరానా -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్: కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతం రాగానే కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లత సూచించారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాణ్యత ప్రమాణాల ప్రకారం వెంటనే ధాన్యం కొనుగోలు చేసి అదే రోజు మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మిల్లుల వద్ద జాప్యం లేకుండా ధాన్యం దిగుమతి అయ్యేలా చూడాలని, హమాలీ సమస్య లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. రూరల్ తహసీల్దార్ వరందన్, డెప్యూటీ తహసీల్దార్ అరుణ్కుమార్, ఆర్ఐ రాజేంద్రప్రసాద్, సీసీ గంగారాం పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రాల తనిఖీకథలాపూర్/ఇబ్రహీంపట్నం: కథలాపూర్ మండలం దుంపేట, కథలాపూర్, బొమ్మెన, ఇబ్రహీంపట్నం మండలంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా పరిశీలకులు రమేశ్ శనివారం తనిఖీ చేశారు. నామినేషన్లు స్వీకరిస్తున్న తీరును పరిశీలించి అధికారులతో మాట్లాడారు. కేంద్రాల వద్ద ఏర్పాట్లు, బందోబస్తు వివరాలను తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవోలు శంకర్, గణేశ్, ఎంపీవో రాజశేఖర్, రిటర్నింగ్ ఆఫీసర్లు శ్రీరాం కిషన్, అంబటి వెంకట్రాజం ఉన్నారు. పాఠశాలలను శుభ్రంగా ఉంచాలి మల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రతను పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, పంచాయతీ ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు రమేశ్ అన్నారు. శనివారం మల్లాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో జగదీశ్, హెచ్ఎం చంద్రమోహన్రెడ్డి తదితరులున్నారు. జేఎన్టీయూలో విద్యార్థుల గొడవకొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో విద్యార్థుల మధ్య గొడవకు సంబంధించిన విషయం శనివారం వెలుగుచూసింది. మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని(అమ్మాయి), మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(అబ్బాయి) కొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో తోటి విద్యార్థులు భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ను వివరణ కోరగా, సదరు విద్యార్థులకు మొదటి నుంచి పరిచయం ఉందని, అన్ని వివరాలు తెలుసుకొని సోమవారం కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలికోరుట్ల: ప్రభుత్వాసుపత్రిలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులు, బాలింతలు, గర్భిణులతో మాట్లాడారు. సూపరింటెండెంట్ సునీతారాణి, వైద్యులు చైతన్య సుదా, విజయలక్ష్మి, వినోద్, రమేశ్, సూపర్వైజర్లు ధనుంజయ, నాగభూషన్ పాల్గొన్నారు. స్కానింగ్ సెంటర్లు పరిశీలన పట్టణంలోని పలు స్కానింగ్ సెంటర్లను డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి తనిఖీ చేశారు. నిబంధనలు పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షల సమయంలో గోప్యత పాటించకుంటే చట్ట రీత్యా కేసులు తప్పవని హెచ్చరించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే సంజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల జోరు
జగిత్యాల: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో రోజురోజుకు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారం పూర్తి కావడంతో ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. దీంతో రాజకీయ సమావేశాలతో పల్లెలు హోరెత్తుతున్నా యి. ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పని లో ఏ అవకాశం దొరికినా తమకు అనుకూలంగా మలుచుకునేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో రచ్చబండల వద్ద నిత్యం సమావేశాలతో జోరందుకుంటోంది. జిల్లాలోని మరో 7 మండలాల్లో నేటి నుంచి రెండో విడత నామినేషన్ల పర్వం మొదలుకావడంతో అభ్యర్థులు మంతనాలు మొదలుపెడుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ‘అన్నా నేను నిలబడుతున్నా.. మాకు మద్దతు ఇవ్వాలి’ అంటూ బతిమి లాడుతున్నారు. రాత్రి చలిలో సైతం ఇంటింటికీ తిరుగుతూ బోట్లు అభ్యర్థిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీల గుర్తులతో కానప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జూబ్లీహిల్స్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ దిశగానే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు అత్యధికంగా గెలిచేలా నాయకులు ముందుకెళ్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు సైతం అత్యధికంగా సీట్లు సాధించాలని ప్రయత్నిస్తున్నా రు. జిల్లాలో బీజేపీ ఎంపీ ఉండటంతో అధిక సీట్లు గెలిచేలా ఎవరి వ్యూహం వారు పన్నుతున్నారు. బలమైన అభ్యర్థుల కోసం వేట కొన్ని గ్రామపంచాయతీల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. బలమైన నాయకులు ప్రజల్లోకి వెళ్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా నలుగురైదుగురు గుంపుగా ఏర్పడి ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా భయం పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు సోషల్ మీడియా భయం పట్టుకుంది. అలాగే సెల్ఫోన్లలో మాట్లాడేందుకు భయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ పెడితే అది ఏ దిశగా వెళ్తుందో తెలియదని భావిస్తున్నారు. రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మంచి రోజులు లేక ఇబ్బందులు నామినేషన్లు వేసే అభ్యర్థులు ముహూర్తం కోసం ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 17 వరకు మంచిరోజులు లేక ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. ఐదేళ్ల పాటు పదవీలో ఉండే ఈ పదవీ కోసం మంచిరోజు వేస్తే గెలుస్తామని ఆశాభావంతో ఉంటారు. కానీ, ఇప్పుడు మూఢం కావడంతో అనాసక్తిగా ఎప్పుడో ఓసారి నామినేషన్ వేసేలా చూస్తున్నారు. కాగా, మొదటి విడత నామినేషన్లు పూర్తి కావడంతో జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కాసుగంటి లాస్యప్రియ ఒకే ఒక్క నామినేషన్ రావడంతో దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లే. అధికారులు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే సర్పంచ్ స్థానం బీఆర్ఎస్ బోణి కొట్టిందని చెప్పవచ్చు. ముగిసిన మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి రెండోవిడత నామినేషన్ల స్వీకరణ గ్రామాల్లో సమావేశాల జోరు బలమైన అభ్యర్థుల కోసం పార్టీల వేటమొదటి విడతలో.. మండలాలు 7 గ్రామాలు 122 వార్డులు 1172 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు 709 వార్డులకు 2,006 రాత్రి వరకూ నామినేషన్ల స్వీకరణ కోరుట్లరూరల్: కోరుట్ల మండలంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగింది. మొదటి విడత శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా తరలి వచ్చి నామినేషన్ వేసేందుకు రాత్రి 9 గంటల వరకూ క్యూలో ఉన్నారు. కాగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుల ధ్రువీకరణ, బ్యాంక్ ఖాతాలు తీసుకోవడంలో జాప్యంతో చివరి రోజు వరకు ఆగాల్సి వచ్చిందని పలువురు పేర్కొన్నారు. మండలంలోని ఒక్కో గ్రామంలో 10కి పైగా వార్డులు ఉండటం, ఒక్కో వార్డుకు ఇద్దరు నుంచి ముగ్గురు పోటీలో ఉండటంతో నామినేషన్ కేంద్రాల్లో రద్దీ నెలకొంది. మల్లాపూర్లో..మల్లాపూర్: మండలంలోని మల్లాపూర్, కొత్తదాంరాజుపల్లి, మొగిలిపేట, రాఘవపేట, సాతారం, గొర్రెపల్లి, కుస్తాపూర్ నామినేషన్ కేంద్రాల్లో శనివారం నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు పోటెత్తారు. కొత్తదాంరాజ్పల్లిలో రాత్రి 7గంటల వరకు వేచి ఉండి నామినేషన్ వేశారు. -
కన్నీటి సంద్రమైన తంగళ్లపల్లి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తల్లీకొడుకుల మృతితో కన్నీటి సంద్రమైంది తంగళ్లపల్లి. ఇద్దరి మృతదేహాలకు అంతిమయాత్రను ఒకేసారి నిర్వహించారు. తల్లి మంచికట్ల లలిత, కొడుకు అభిలాష్ మృతదేహాలను ఒకే ట్రాక్టర్పై తీసుకెళ్లారు. బెటాలియన్ కానిస్టేబుల్ అయిన అభిలాష్ సహ ఉద్యోగులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. తల్లి లలిత చితికి పెద్దకూతురు మౌనిక, అభిలాష్ చితికి చిన్నకూతురు మానస నిప్పుపెట్టారు. అభిలాష్ సోదరీలను ఓదార్చడం ఎవరీ తరం కాలేదు. 7వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించే అభిలాష్ మృతదేహానికి బెటాలియన్ కమాండెంట్ సురేష్ నివాళి అర్పించారు. తల్లి, అన్న చితికి నిప్పుపెట్టిన చెల్లెళ్లు -
ఇదీ పల్లె.. పంచాయతీ కథ
సిరిసిల్ల: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అని పాలకులు పదే పదే చెబుతుంటారు. ఇప్పుడు పల్లెల్లోనే ఎన్నికల సందడి మొదలైంది. అసలు గ్రామపంచాయతీ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది.. ఆ చరిత్ర ఏమిటో..? ఇప్పటి తరానికి తెలియదు. పల్లెల్లో పాలన ఆరు దశాబ్దాల కిందటే మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్థానిక పాలన ఉండాలని భావించిన అప్పటి పాలకులు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు 1957లో భారత ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మూడు అంచెల స్థానిక సంస్థల వ్యవస్థ ఉండాలని భావించింది. ఈమేరకు గ్రామపంచాయతీ, పంచాయతీ సమితి(తాలూకా), జిల్లా పరిషత్ మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని బల్వంతరాయ్ కమిటీ సిపార్సు చేసింది. ఈమేరకు జాతీయ అభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. ఈ చట్టాన్ని తొలిసారి రాజస్థాన్ అమలు చేసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1959 అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా అమలు చేశారు. అప్పటి నుంచి అనేక మార్పులతో పంచాయతీరాజ్ చట్టం రూపాంతరం చెందింది. పరోక్ష పద్ధతిలో ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో 1964లో సమగ్ర గ్రామపంచాయతీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 500లకు పైగా జనాభా ఉన్న గ్రామాలను గుర్తించి గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామపంచాయతీలో ఐదు నుంచి 17 వరకు వార్డు సభ్యులు ఉండవచ్చని నిర్ధేశించారు. 1964లో జరిగిన ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. ఎన్నికల్లో వార్డు సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటే.. ఎన్నికై న వార్డు సభ్యుల్లో ఒక్కరిని మెజార్టీ సభ్యుల ఆమోదంతో సర్పంచ్గా ఎన్నుకునేవారు. ఇలా ఎన్నికై న గ్రామ సర్పంచ్లు అందరూ కలిసి సమితి ప్రెసిడెంట్ను ఎన్నుకునే వారు. ఎన్నికై న సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే పరోక్ష విధానం ఉండేది. 1976 వరకు అంటే 12 ఏళ్ల పాటు ఇదే విధానం కొనసాగింది. ప్రత్యక్ష పద్ధతికి 1978లో శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. గ్రామసర్పంచ్ ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే అంశంపై అధ్యయనం చేసింది. నరసింహం కమిటీ ప్రత్యక్ష పద్ధతిలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సిపార్సు చేయడంతో అప్పటి నుంచి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మండల వ్యవస్థతో సమూల మార్పులు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి సీఎం ఎన్టీఆర్ తాలూకాలను రద్దు చేశారు. 1987లో మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టి ఎన్నికలు నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఓటర్లు ఓట్లు వేసి ఎన్నుకునే విధానాన్ని అమలు చేశారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ల్లో ఒక్కరిని మెజారీ సభ్యుల ఆమోదంతో ఎన్నుకునే విధానం అమలు చేశారు. ఎంపీపీలుగా ఎన్నికై న వారు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకునేవారు. 1994లో ఏపీ పంచాయతీరాజ్ చట్టం అమలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 ద్వారా అదే ఏడాది నుంచి గ్రామాల్లో గ్రామపంచాయతీ సర్పంచ్లతోపాటు మండల పరిషత్ సభ్యులు(ఎంపీటీసీ), జిల్లా పరిషత్(జెడ్పీటీసీ) సభ్యుల ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఎంపీటీసీ సభ్యులు మెజార్టీ ఆమోదంతో ఎంపీపీల ఎన్నిక, జెడ్పీటీసీ సభ్యుల మెజార్టీ ఆమోదంతో జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లను నియమించడం, ప్రతీ ఊరిలోనూ వైకుంఠధామాలు, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతివనాలు, ట్రాక్టర్లు, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్యార్డుల ఏర్పాటు వంటి సమూలమైన మార్పులకు 2018 చట్టం శ్రీకారం చుట్టింది. గ్రామపంచాయతీలకు విశేష అధికారాలు కల్పిస్తూ చట్టం రూపుదిద్దుకుంది. ఈ చట్టం ప్రకారమే ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు దశాబ్దాల గ్రామ‘పంచాయతీ’ తొలిసారి 1964లో ఎన్నికలు పంచాయతీరాజ్ చట్టాల రూపకల్పన -
స్వగ్రామానికి వలస జీవి మృతదేహం
పెగడపల్లి(ధర్మపురి): బతుకుదెరువు కోసం ఇరాక్ వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ఆయన మృతదేహం 38 రోజులకు ఇంటికి తీసుకొచ్చారు. వివరాలు.. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి రమేశ్ (55) జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం ఇరాక్ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పనికి తగిన జీతం లేక కంపెనీ నుంచి బయటకు వెళ్లాడు. దొరికిన చోట పని చేసుకుంటున్న రమేశ్ గత నెల 21న గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. శనివారం శవపేటికలో ఇంటికి చేరిన మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. హన్మాజిపల్లెకు మృతదేహం గన్నేరువరం: హన్మాజిపల్లెకి చెంది న పారునంది వీరయ్య(44) గుండెపోటుతో సౌదీ అరేబియాలో ఈనెల 19న మృతిచెందగా.. శని వారం మృతదేహం గ్రామానికి చే రుకుంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు, కుటుంబ సభ్యుల క థనం ప్రకారం.. ఉపాధి కోసం వీరయ్య కొన్నేళ్లుగా సౌదీ అరేబియా వెళ్తున్నాడు. పది నెలల క్రితం గ్రామానికి వచ్చి మళ్లీ సౌదీకి వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో కారు డ్రైవర్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 19న కారు పార్కింగ్ చేసి అందులోనే సేద తీరుతున్న సమయంలో గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే మృతిచెందినట్లు తోటి కార్మికులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఖర్చు లేకుండానే గెలిచిన
కథలాపూర్(వేములవాడ): అప్పుడు పురుషాధిక్యంలో గ్రామాలుండేవి. ఎన్నికల్లో ఎవరైనా బరిలో ఉండాలంటే ఏదో అన్నట్లుగా భావించేవారని కథలాపూర్ తొలి ఎంపీపీ, జెడ్పీటీసీ అంబల్ల భాగ్యవతి పేర్కొన్నారు. మండలంలోని భూషణరావుపేట గ్రామానికి చెందిన భాగ్యవతి సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. అప్పుడు, ఇప్పుడు ఎన్నికల పరిస్థితులపై ఆమె మాటల్లోనే.. 1981లో భూషణరావుపేట సర్పంచ్గా గెలిచిన. ఆ సమయంలో 8 మంది బరిలో ఉండగా నేను ఒక్కదానినే మహిళను. మిగతావారు పురుషులు. ఓటు కోసం ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తే మహిళలకు రాజకీయాలెందుకని ప్రశ్నించారు. గెలిచాక వాహ్... అని విస్తుపోయారు. ఖర్చు అసలే లేదు. అప్పట్లో బరిలో ఉన్న అభ్యర్థి గురించి పూర్తిస్థాయిలో ప్రజలు సమాచారం సేకరించి స్వచ్ఛందంగా ఓటు వేసేవారు. అప్పట్లో ప్రజాప్రతినిధులకు జవాబుదారీతనం ఎక్కువ. 1987లో కథలాపూర్ ఎంపీపీ, 1995లో జెడ్పీటీసీ సేవలందించా. ఎన్నికల ప్రచారం కోసం జీపులో నలుగురం కలసిపోయేవాళ్లం. గ్రామాల్లోకి పోతే ప్రజలే ఆప్యాయంగా పలకరించి తిండి పెట్టేవారు. కాలం మారింది.. ఓట్ల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. -
తొలిఫలితాలు తేలేది ఇక్కడే!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: పంచాయతీ ఎన్నికలకు తొలివిడత నామినేషన్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఓట్లున్న గ్రామాలపై అందరి దృష్టి పడుతోంది. నవంబరు 27 నుంచి మొదలై.. డిసెంబరు 17 వరకు మూడు దశల్లో జరిగే ఈ ఎన్నికలకు కరీంనగర్ 316 గ్రామాలు, పెద్దపల్లి 263 గ్రామాలు, జగిత్యాల 385 గ్రామాలు, సిరిసిల్ల 260 కలిపి మొత్తం గ్రామాలు 1224 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా గ్రామ జనాభా కనీసం 1000 ఓట్లకు కాస్త అటూఇటూగా ఉంటుంది. కానీ.. నూతన రాష్ట్రంలో పలు హామ్లెట్లు, తండాలకు జీపీ హోదా లభించింది. ఈ నేపథ్యంలో 500 ఓట్లలోపు ఉన్న జీపీలు సర్వసాధారణ విషయంగా మారాయి. అదే సమయంలో అంతకుమించి తక్కువ ఓట్లున్న గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. ఇలాంటి గ్రామపంచాయతీల్లో ఫలితాలు వేగంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరీ 200, 300 లోపు ఓట్లున్న గ్రామాల్లో గంటలోపే ఫలితం తేలనున్నాయి. ఇలాంటి తక్కువ ఓట్లున్న గ్రామ పంచాయతీలు సిరిసిల్లలో ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఎల్లారెడిపేట మండలం గుంట చెరువు పల్లి తండాలో కేవలం 121 ఓట్లు ఉండగా, ఇల్లంతకుంట మండలం చిక్కుడువాని పల్లెలో 150 ఓట్లు.. చందుర్తి మండలం కొత్తపేటలో 163 ఓట్లు ఉండటం గమనార్హం. కరీంనగర్ జిల్లాలో 500 ఓటర్ల కంటే తక్కువగా ఉన్న గ్రామాలు (28).. కరీంనగర్ నియోజకవర్గంలో (2), కరీంనగర్ రూరల్ మండలం తాహెర్కొండాపూర్ (436), నల్లగుంటపల్లి (431). హుజురాబాద్ నియోజకవర్గంలో (9), హుజురాబాద్ మండలం బొత్తలపల్లి (448), సైదాపూర్ మండలం గర్రెపల్లి (382), రాయికల్ తండా (470), గుండ్లపల్లి (420), జమ్మికుంట మండలం పాపయ్యపల్లి (492), నాగారం (457), వీణవంక మండలం నర్సింహాలపల్లి (498), రామకృష్ణాపూర్ (404), ఇల్లంతకుంట మండలం వాగొడ్డు రామన్నపల్లి (486). చొప్పదండి నియోజకవర్గంలో(2), చొప్పదండి మండలం కోనేరుపల్లి (347), గంగాధర మండలం ఇస్లాంపూ ర్ (484). మానకొండూర్ నియోజకవర్గంలో (15 గ్రామాలు) మానకొండూర్ మండలం పెద్దూర్పల్లి (282), రాఘవపూర్ (342), బంజేరుపల్లి (310), గన్నేరువరం మండలం చాకలివానిపల్లి (436), చొక్కరావుపల్లె (460), గోపాల్పూర్ (394), పీచుపల్లి (285), సాంబయ్యపల్లి (215), యస్వాడ (230), శంకరపట్నం మండలం అంబేద్కర్నగర్ (386), అర్కండ్ల (452), గుడాటిపల్లి (375), కల్వల (345), మక్త (264), నల్లవంకాయపల్లి (246).తంగళ్లపల్లి మండలంలో మొత్తం ఏడు గ్రామాల్లో 500 లోపు ఓట్లున్నాయి. అందులో చింతల్ఠాణాలో అత్యల్పంగా 209 ఓట్లే ఉన్నాయి. ముస్తాబాద్ మండలంలో మొత్తం ఐదు గ్రామాల్లో గోపాల్పల్లిలో 262 అత్యల్ప ఓట్లు కలిగి ఉంది. వీర్నపల్లి మండలంలో 5 గ్రామాలుండగా.. మద్దిమల్ల (306 ఓట్లు) ఆఖరుగా నిలిచింది. గంభీరావుపేటలో ఐదు గ్రామాలకు లక్ష్మీపూర్ (265 ఓట్లు) చివరన నిలిచింది. ఎల్లారెడ్డిపేటలో 9 గ్రామాలు ఉండగా అందులో గుంటచెరువుపల్లి తండా (121) ఓట్లు కలిగి ఉంది. ఇల్లంతకుంట మండలంలో మొత్తం నాలుగు గ్రామాలకు చిక్కుడువాని పల్లెలో (150) ఓట్లు నమోదయ్యాయి. వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ అర్బన్లో 500 ఓట్లున్న ఏకై క గ్రామం గుర్రం వానిపల్లి (293 ఓట్లు). వేములవాడ రూరల్లో మూడు గ్రామాలలో వెంకటంపల్లి (308) ఓట్లతో చివరన ఉంది. రుద్రంగిలో ఆరు గ్రామాల్లో వీరునితండా (278)ఓట్లతో ఆఖరు స్థానంలో నిలిచింది. కోనరావుపేటలో మొత్తం ఆరుగ్రామాలకు గాను గొల్లపల్లి కొలనూరు 227 అతి తక్కువ ఓట్లు నమోదు చేసింది. చందుర్తిలోలో రెండు గ్రామాలకు కొత్తపేటలో అత్యల్పంగా 163 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. బోయినపల్లి మండలంలో 500లోపు ఓట్లున్న గ్రామాలేవీ లేవు.జగిత్యాల నియోజకవర్గంలో (5గ్రామాలు), రాయికల్ మండలం ధావన్ పెళ్లి (436), కురుమ పెళ్లి (323), కై రిగూడెం (170), రామారావుపల్లె (390), వస్తాపూర్ (442), సారంగాపూర్.. బీర్పూర్ మండలం (నాలుగు గ్రామాలు), ఇందిరానగర్ (310), బొందు గూడెం (235), చిన్న కొలువై (110), కోమన్ పల్లి (350). కోరుట్ల నియోజకవర్గంలో (9గ్రామాలు), మల్లాపూర్ మండలం హుస్సేన్ నగర్ (357), ఓబులపూర్తండా (311), వాల్గొండ తండా (326), మెట్పల్లి మండలం ఏఎస్ఆర్ తండా (297), చెర్లకొండాపూర్ (484), కేసీఆర్ తండా (333), పాటిమీది తండా (311), రామారావుపల్లె (359), రంగారావుపేట (424). ధర్మపురి నియోజకవర్గంలో (4గ్రామాలు), గొల్లపల్లి మండలం గంగాదేవి పల్లి (441), నందిపల్లి (365), వెల్గటూర్ మండలం కోటిలింగాల (436), బుగ్గరాం మండలం సందయ్యాపల్లి (250).మంథని మండలంలో బెస్తపల్లిలో 472, భట్టుపల్లిలో 476, గుమ్నూర్లో 490, తోటగోపయ్యపల్లిలో 490 ఓటర్లు మాత్రమే ఉన్నారు. అలాగే రామగిరి మండలంలోని లొంకకేసారం గ్రామంలో 486, పెద్దంపేట గ్రామంలో 482, కమాన్పూర్లోని గొల్లపల్లెలో 507, ముత్తారంలోని దర్యాపూర్లో 360 ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఓదెల మండలంలోని అబ్బీడిపల్లిలో 450, లంబాడి తండాలో 421, కాల్వశ్రీరాంపూర్లోని మడిపల్లిలో 439, ఇప్పలపల్లిలో 477, లక్ష్మీపురంలో 496 ఓట్లు, ధర్మారం మండలంలోని లంబాడితండలో 445, నాయకంపల్లిలో 454, ఎలిగేడులోని లోకపేటగ్రామంలో 527 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. -
పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు
జగిత్యాల: పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అభ్యర్థు లు సైతం ప్రచారాలకు తహసీల్దార్ల వద్ద అనుమతి తీసుకోవాలన్నారు. నామినేషన్లు పూర్తిగా దాఖలు చేయకుంటే రిజెక్ట్ అవుతాయని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు వంటి వాటిని తనిఖీ చేసి పట్టుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో 3 ఎస్ఎస్టీ, 20 ఎఫ్సీటీ బృందాలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక బృందాల్లో మెజిస్ట్రేట్ స్థాయి అధికారులు ఉంటారని చెప్పారు. పార్టీల నాయకులు పెట్టే ప్రలోభాలు, ఇచ్చే బహుమతులు, పంచే డబ్బులు, మద్యం వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ వాహనాలను కూడా చెక్ చేసే అధికారం ఉందన్నారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, పరిశీలకులు రమేశ్, మనోహర్, మదన్మోహన్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా అమలు చేయాలి మెట్పల్లిరూరల్(కోరుట్ల): ఎన్నికల నియామవళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ రమేశ్ అన్నారు. మెట్పల్లి మండలం చౌలమద్ది క్లస్టర్ నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. నోటీస్ బోర్డుపై ప్రదర్శించిన రిజర్వేషన్ వివరాలు పరిశీ లించి, నామినేషన్ సరళిని తెలుసుకున్నారు. రికార్డు ల నిర్వహణ సరిగా చేయాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
మొక్క నాటి సంరక్షించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ కళాశాలలో చేరిన ప్రతీ విద్యార్థి మొక్క నాటడంతో పాటు నాలుగేళ్ల పాటు సంరక్షించాలని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ భారతీనారాయణ్ భట్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో శుక్రవారం గ్రీన్ గ్రాడ్యుయేషన్ సెర్మని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ మాట్లాడుతూ, వ్యవసాయ వర్శిటీ నిబంధనల మేరకు కళాశాలలో మొదటి ఏడాదిలో చేరిన ప్రతీ విద్యార్థి ఒక్క మొక్క నాటాల్సి ఉంటుందని చెప్పారు. ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సమాజంలో అవగాహన కల్పించాలని సూచించారు. చైర్పర్సన్ డాక్టర్ వేణుగోపాల్, సభ్యులు డాక్టర్ సత్యనారాయణరెడ్డి, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ అరుణ్కుమార్, డాక్టర్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. అటవీశాఖ సర్వేపై ఆలయ అధికారుల అభ్యంతరం మల్యాల(చొప్పదండి): కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో శుక్రవారం అటవీశాఖ ఆధ్వర్యంలో సర్వే చేసేందుకు రాగా, ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొండగట్టు ఆలయాన్ని ఆనుకొని అటవీశాఖ భూములు ఉండడంతో కొంతకాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సర్వే చేపట్టేందుకు రాగా, అటవీ శాఖ భూములకు సంబంధించిన పత్రాలు చూపించాలని, ఆలయ ఈవో శ్రీకాంత్రావు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సర్వే అధికారులు వెనుదిరిగారు. -
ఎన్నికల వ్యయం.. ఆశావహుల భయం
జగిత్యాల: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో ఆశావహులు సర్పంచ్గా నిలబడాలంటే ఖర్చు భరించేదెలా అని ఆందోళన చెందుతున్నారు. కుల సంఘాలు, యువత, మహిళ సంఘాలను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రతీది ఖర్చుతో కూడుకున్నది కావడంతో కొంత భయాందోళనకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్గా నిలబడే అభ్యర్థులు కచ్చితంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.5లక్షల నుంచి 10 లక్షల వరకు.. ఎన్నికల నిబంధనల ప్రకారం 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉండే గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు రూ.2.50 లక్షలు, తక్కువ ఉంటే రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుల విషయంలో 5 వేల మంచి జనాభా ఉంటే రూ.50 వేలు, తక్కువ ఉంటే రూ.30 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, సర్పంచ్ అభ్యర్థులు చిన్న గ్రామాల్లో కనీసం రూ.5 లక్షల నుంచి పది లక్షలు, పెద్ద గ్రామాల్లో రూ.10 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులున్నాయి. కాగా, పట్టణాలకు దరిదాపుల్లో ఉన్న గ్రామాల్లో సర్పంచులకు తీవ్ర పోటీ ఉంటుంది. కాగా, మొదటి విడత ఎన్నికల్లో అభ్యర్థులకు కొంత మేర ఖర్చు మిగిలే అవకాశాలున్నా, 2,3వ విడతలకు చాలా సమయం ఉండడంతో వారు ఇప్పటి నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో ఇప్పటి నుంచే ఖర్చు చేస్తే అప్పులపాలయ్యే అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. కలిసొచ్చిన షష్టి గ్రామపంచాయతీ ఎన్నికలకు ఈసారి అభ్యర్థులకు కొంత మేర కలిసి వచ్చినట్లే కన్పిస్తోంది. ప్రస్తుతం డిసెంబర్లో షష్టిమాసం సందర్భంగా చాలా మందికి మల్లన్నదేవుని మొక్కులు ఉంటాయి. మాంసం తినరు, మద్యం ముట్టరు. దీంతో అభ్యర్థులకు దేవుని రూపంలో కొంత కలిసివచ్చిందనే చెప్పవచ్చు. అప్పులు చేసి... సర్పంచ్గా నిలబడాలని చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆశిస్తుంటారు. ఈ విషయంలో వెనుక ముందు ఆలోచించకుండానే ఖర్చు చేసి అప్పుల పాలైన ఘటనలు అనేకంగా ఉన్నాయి. బరిలో దిగిన తర్వాత ఎంత మేరకు అయినా ఖర్చు చేయాల్సిన అవసరం రావడంతో కొందరు భూములు అమ్ముకోగా, మరికొందరు తమ భార్య పుస్తెమెట్టెలు, బంగారం సైతం అమ్ముకుని పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే గ్రామాల్లో రాజకీయాలు వేరేగా ఉంటాయి. ఒకవైపునే ఉంటూ మరో వైపునకు ప్రచారం చేస్తూ, ఇరువైపులా అందిన కాడికి దోచుకుంటారు. పల్లెల్లో సందడి సర్పంచ్ ఎన్నికలు రావడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఎక్కడ చూసినా రచ్చబండలపై చర్చ సాగుతోంది. అభివృద్ధికి పాటుపడే వ్యక్తులను ఎన్నుకోవాలని కొంత మంది వ్యక్తులు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, డబ్బు పలుకుబడి ఉన్న వారిదే ప్రతిసారి పైచేయి అవుతుంది. దీంతో గ్రామాల్లో చాలా వరకు అభివృద్ధి లేకుండా పోతోంది. చాలా డబ్బులు ఖర్చు చేసుకుని పదవి కై వసం చేసుకున్న అనంతరం ఐదేళ్లలో ఖర్చు చేసినంత సైతం లాభం పొందలేకపోతారు. దీంతో అప్పుల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న గ్రామపంచాయతీల్లో అయితే అతితక్కువగా పనులు ఉంటాయి. ఇప్పటికై నా పోటీచేసే అభ్యర్థులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు భరించేదెలా..? డబ్బు సర్దుబాటు కోసం తిప్పలు అభ్యర్థుల్లో ఆందోళన -
విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
జగిత్యాల: విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, సమాజంలో గుర్తింపు ఉండాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం జగిత్యాల ఓల్డ్ హైస్కూల్లో జిల్లాస్థాయి బాలవైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మానక్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు సైన్స్పై అవగాహన పెంచుకుని శాస్త్రవేత్తలుగా మారాలని, ఈ ప్రదర్శనల ద్వారా నైపుణ్యం పెంపొందుతుందన్నారు. అదనపుక లెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం మన దేశంలో శాస్త్రవేత్తగా ఆవిష్కరణలు చేయనట్లయితే డిఫెన్స్లో మనం ఇతర దేశంపై ఆధారపడాల్సి వచ్చేదనాన్నారు. అదేస్థాయిలో విద్యార్థులు ప్రదర్శించాలన్నారు. సమాజంలో విద్యార్థులకు గుర్తింపు లభించినప్పుడే తల్లిదండ్రులకు గౌరవం దక్కుతుందన్నారు. డీఈవో రాము, సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఎయిడ్స్పై అవగాహన కల్పించాలి
జగిత్యాల: ఎయిడ్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక మెడికల్ కళాశాలలో విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై క్విజ్ కాంపిటిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఎయిడ్స్ నివారణకు సంబంధించిన ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. అనంతరం క్విజ్ కాంపిటిషన్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఎయిడ్స్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, ఇన్చార్జి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. పురుషులు కు.ని. చేయించుకోవాలి పురుషులు కుటుంబ నియంత్రణ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సర్జన్ డాక్టర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో 17 కు.ని. ఆపరేషన్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకన్నా పురుషులే చేయించుకుంటే ఆరోగ్యకరమన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, డెప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి పాల్గొన్నారు. వృద్ధుల కోసమే జెరియాట్రిక్ వైద్యసేవలుజగిత్యాల: వయోవృద్ధుల కోసమే జెరియాట్రిక్ వైద్యసేవలు ఏర్పాటు చేయడం జరిగిందని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి నరేశ్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జెరియాట్రిక్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీనియర్ సిటిజన్లకు డయాబెటిస్, రక్తపోటు, గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ సమస్యలు, పక్షవాతానికి ఉచితంగా చికిత్స పొందవచ్చన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్, డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, ఆర్ఎంవో విజయ్, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, హన్మంతరెడ్డి, యాకూబ్ పాల్గొన్నారు. శిశు మరణాలు తగ్గించాలిజగిత్యాల: శిశు మరణాలు తగ్గించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాతాశిశు సంరక్షణాధికారి జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంసీహెచ్లో నవజాత శిశువుల సంరక్షణపై సంకల్ప శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృ సంరక్షణ చర్యల్లో భాగంగా సీ్త్రలకు కౌమార దశ నుంచి వారి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా వైవాహిక జీవితం గర్భాధారణ సమయంలో ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. గర్భాధారణ జరిగిన 12 వారాల్లోపు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని ధనుర్వాసం రాకుండా టెటానస్ డిప్తిరియా 1, 2 డోస్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణకుమారి, సాయిచరణ్ పాల్గొన్నారు. డిపోల నుంచి మద్యం కొనాలిజగిత్యాలక్రైం: జిల్లాలో 2025–27 సంవత్సరానికి గాను మద్యంషాపుల నిర్వహణకు లైసెన్స్ పొందినవారు ఈనెల 29 నుంచి తమకు కేటాయించిన రిటైలర్ కోడ్ ద్వారా డిపోల నుంచి మద్యం కొనాలని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణదారులు తమకు కేటాయించిన దుకాణాల్లో మద్యం విక్రయాలు చేపట్టాలన్నారు. కోటిలింగాల హుండీ లెక్కింపువెల్గటూర్: మండలంలోని కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. కార్తీకమాసం ముగిసిన సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేశ్ ఆధ్వర్యంలో హుండీ లెక్కించగా రూ.2,73,695 ఆదాయం సమకూరినట్లు ఈవో కాంతారెడ్డి తెలిపారు. ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజమౌళి, ధర్మకర్తలు గుమ్ముల వెంకటేశ్, రవి, లావణ్య, అర్చకులు నాగరాజుశర్మ, సంజీవ్శర్మ, వెల్గటూర్ సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. -
జగిత్యాల
27.0/17.0శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 20257ఎమ్మెల్యేను కలిసిన డీసీసీ అధ్యక్షుడుజగిత్యాల: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న గాజంగి నందయ్య శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గరిష్టం/కనిష్టంగోదావరిలో భక్తుల రద్దీధర్మపురి: ధర్మపురి పవిత్ర గోదావరిలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. షష్ఠి మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.వాతావరణం పొడి వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతం అవుతుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. -
పంచాయతీ షురూ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పల్లె పోరు షురువైంది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందడితో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహులు మొదటి రోజు తమ మద్దతుదా రులతో వచ్చి నామినేషన్లు సమర్పించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో జరిగే 398 సర్పంచ్ స్థానాలకు తొలిరోజు 258 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 3,682 వార్డు స్థానాలకు 188 మంది నామినేషన్లు వేశారు. నేడు, రేపు భారీస్థాయిలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. నామినేషన్లు సమర్పించేందుకు కావాల్సిన ధ్రువపత్రాలు, ఇంటి, నల్లా పన్నులు చెల్లింపు ప్రతిపాదించే వారిని సమకూర్చుకోవడం వంటి కార్యక్రమాల్లో మరికొంత మంది నిమగ్నమై ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో పోలింగ్ జరిగే ఐదు మండలాల్లో 92 సర్పంచ్స్థానాలకు గానూ 92 నామినేషన్లు, 866 వార్డుమెంబర్ స్థానాలకు 86 నామినేషన్లు దాఖలయ్యాయి. జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో జరిగే ఆరు మండలాల్లోని 122 సర్పంచ్ స్థానాలకు గానూ 48 నామినేషన్లు, 1172 వార్డు మెంబర్ స్థానాలకు 33 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడతలో జరిగే ఐదు మండలాల్లో 85 సర్పంచ్స్థానాలకు 42 నామినేషన్లు, 748 వార్డు మెంబర్ స్థానాలకు 32నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో మొదటి విడతలో జరిగే ఐదు మండలాల్లో 99 సర్పంచ్స్థానాలకు గానూ 76నామినేషన్లు, 896 వార్డు మెంబర్ స్థానాలకు 37 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి పరిశీలకులుగా నియమితులైన అధికారులు క్లస్టర్ గ్రామాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమావేశాలు నిర్వహించి పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులతో ప్రమేయం లేకున్నా ఆయా పార్టీల మద్దతు కోసం ఆశావహులు నాయకులతో మంతనాలు మొదలు పెట్టారు. అంగబలం, ఆర్థిక బలం, సామాజిక కోణంతో పరిశీలించి అభ్యర్థులను నియమించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీలు తమ పార్టీ తరఫున గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నాయి. సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీ, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధితో బీఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీజేపీ తమ ప్రచారాన్ని గ్రామాల్లో ముమ్మరం చేసి కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నాయి. మరో రెండు రోజుల్లో మొదటి విడత నామినేషన్లు ముగుస్తుండడంతో ఏ పార్టీ తరఫున ఎవరు పోటీలో ఉంటారనేది తేటతెల్లం కానుంది. -
ముహూర్తాలు.. ముడుపులు.. ఉపవాసాలు
జగిత్యాలజోన్: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆశావహులు వేద పండితులు, జ్యోతిష్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. సర్పంచ్గా పోటీ చేస్తే గెలుస్తానా..? లేదా..? అని ఆరా తీస్తున్నారు. పండితులు మాత్రం తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ జాతకం బాగుంది.. తప్పకుండా గెలుస్తావ్.. అంటూ భరోసా ఇస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఓటు అడిగితే విజయం వరిస్తుందని కూడా సూచనలు చేస్తున్నారు. పోటీ చేయాలనుకుంటున్నవారు నమ్ముకున్న దేవుళ్ల వద్దకు కుటుంబసమేతంగా వెళ్లి పూజలు చేసి, ముడుపులు కడుతున్నారు. నామినేషన్ ఏ రోజు వేయాలి..? ఏ ముహూర్తానా వేస్తే కలిసి వస్తుంది..? అని అడిగి తెలుసుకుంటున్నారు. గెలిస్తే దేవుడి పేరిట వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటామని ముడుపులు కడుతున్నారు. జనరల్ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందని సమాలోచనలు చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు పోలీసుల సూచనలుజగిత్యాలక్రైం: అభ్యర్థులు అనుమతి పొందిన వాహనాలను మాత్రమే వినియోగించాలి. ● ఊరేగింపు కార్యక్రమాలు ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించాలి. ● కులం, మతం, ప్రాంతం, వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా ఎవరూ మాట్లాడరాదు. ● వాహనాలకు లౌడ్ స్పీకర్లు వినియోగించాలంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా పొందాలి. ● వాహనాలపై రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పర్మిట్ ఒరిజినల్ కాపీతోపాటు వాహనం నంబర్, అభ్యర్థి పేరు ప్రదర్శించాలి. ● నామినేషన్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ● నామినేషన్ సమర్పించడానికి ఊరేగింపుతో వచ్చే అభ్యర్థి తన అనుచరులు, మద్దతుదారులు మొదలైన వారు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధి వరకు మాత్రమే అనుమతిస్తారు. ● రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి, మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. రాయికల్: ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, ఐదు వేల కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు ఐదువేల జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామాల్లో రూ.50 వేలు, ఐదు వేల కంటే తక్కువ ఉంటే రూ.30 వేల వరకు ఖర్చు చేసుకోవచ్చు. ● పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముగ్గురు పిల్లలు.. ఆపై ఉన్నవారు పోటీలు ఉండే నిబంధన 1994 వరకు కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన వచ్చింది. 30 ఏళ్ల తర్వాత.. ఈ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ నవంబర్ 1న గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో ముగ్గురు, అంతకన్నా ఎక్కువ సంతానం గల వారు కూడా పోటీ చేయవచ్చు. ● ఒక అభ్యర్థి తన స్థానానికి నాలుగు నామినేషన్ పత్రాల వరకు దాఖలు చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు పోటీ చేస్తే నిర్దేశిత గడువులోపు ఒకటి మినహా మిగతా నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. లేదంటే అన్నీ తిరస్కరణకు గురవుతాయి. ముఖ్యంగా గ్రామపంచాయతీలో ఆస్తి, ఇతరత్రా బకాయిలు ఉండకూడదు. ప్రభుత్వ, పంచాయతీ ఉద్యోగులు, రుణ ఎగవేతదారులు అనర్హులు. కొత్త బ్యాంక్ ఖాతా.. అభ్యర్థుల ఇక్కట్లుకథలాపూర్: సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ దాఖలు చేయాలంటే కొత్తగా బ్యాంక్ ఖాతా తెరవాల్సిందేనని అధికారులు చెప్పడంతో ఆశావహులు ఇక్కట్ల పాలయ్యారు. గతంలో నామినేషన్ పత్రాలకు గ్రామపంచాయతీ పన్నుల నో డ్యూ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్ జతపరిచేవారు. ఈసారి కొత్తగా బ్యాంక్ ఖాతా తెరవాలని, వాటి జిరాక్స్ను జతపరచాలని రిటర్నింగ్ అధికారులు పేర్కొనడంతో ఆశావహులు బ్యాంకుల వద్దకు పరుగెత్తుతున్నారు. ఆయా బ్యాంకుల్లో గతంలో ఖాతా ఉన్నప్పటికీ కొత్తగా ఖాతా తెరవాల్సిందేనని చెప్పడంతో నాయకులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో బ్యాంక్ ఖాతా ఉంటే అదే బ్యాంకులో మరో ఖాతా ఇవ్వడం కష్టమని బ్యాంకర్లు చెబుతుండడతో మండల పరిషత్ కార్యాలయానికి పరుగెత్తుతున్నారు. కథలాపూర్లో ఇలాంటి పరిస్థితి రావడంతో ఎంపీడీవో శంకర్ బ్యాంక్ అధికారులకు లేఖ రాశారు. దీంతో బ్యాంకు అధికారులు కొత్త ఖాతాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారు. ఓట్ల కోసం వంగివంగి దండాలురాయికల్: గ్రామాల్లో మొన్నటి వరకు ఏమిరా బిడ్డా బాగున్నావా.. ఎలా ఉన్నావురా అంటూ అరెయ్ తొరెయ్ మీది నుంచి దిగని నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో మాటమార్చుతున్నారు. వంగివంగి దండాలు పెడుతున్నారు. ఉదయం నుంచే గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్దకు చేరుకుంటున్నారు. హోటళ్ల వద్ద ప్రత్యక్షమవుతూ ‘అన్నా బాగున్నావా.. చలిబాగా వేస్తుందే.. అటుకులు బుక్కదాం, చాయ్ తాగుదాం దా..’ అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. మధ్యాహ్న సమయంలో ఎదరుపడిన ప్రతిఒక్కరినీ అమ్మా బాగున్నారా, భోజనం చేశారా అంటూ పలుకరిస్తున్నారు. సాయంత్రం కాగానే చిన్నారులతో ఆటవిడుపులు, రాత్రి కాగానే యువత, వృద్ధులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉంటున్నాను.. మీ ఓటు నాకే వేయండి..’ అంటూ అభ్యర్థిస్తున్నారు. మొన్నటి వరకు అరెయ్ తొరెయ్ అన్న వ్యక్తి నేడు ఒక్కసారిగా వంగి వంగి దండాలు పెట్టడం ఏంటని ఓటర్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎన్నికలు అయ్యేలోపు ఇంకా ఎన్ని చిత్రాలో చూడాల్సి వస్తుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. 35 ఏళ్ల తర్వాత జనరల్ మహిళ..కోరుట్లరూరల్: కోరుట్ల మండలంలోని సంగెం పంచాయతీ 35 ఏళ్ల తర్వాత జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. 1990లో సంగెం సర్పంచ్ స్థానం జనరల్కు కేటాయించగా.. ఓసీ సామాజిక వర్గానికి చెందిన తీగల రాములు సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు. అనంతరం ఏడేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీసీ జనరల్ రిజర్వ్ అయ్యింది. తర్వాత ఎస్సీ మహిళకు కేటాయించారు. తర్వాత బీసీ జనరల్.. అనంతరం బీసీ మహిళ, 2019 ఎన్నికల్లో ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయ్యింది. 30ఏళ్లుగా జనరల్ ఆశావహులకు నిరాశనే మిగిలింది. తాజాగా ఈసారి జనరల్ మహిళకు రిజర్వు కావటంతో ఉత్కంఠ పోటీ జరిగే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోసారి అదృష్టం వరించాలని..జగిత్యాలజోన్: ఇప్పటికే సర్పంచ్లుగా పనిచేసిన పలువురు తిరిగి ఈసారి ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాము చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయనే ధీమాతో రంగంలోకి దిగుతున్నారు. రెండుమూడు సార్లు రిజర్వేషన్ అనుకూలించక పోటీకి దూరంగా ఉన్నవారు ప్రస్తుతం జనరల్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీగా పోటీ పడే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకపోతే ఐదేళ్లు ఆగాల్సి వస్తుందనే ఆలోచనతో పోటీకి సై అంటున్నారు. మాజీ సర్పంచ్లు తాను పోటీ చేస్తే బాగుంటుందా..? లేదా భార్య పోటీ చేస్తే బాగుంటుందా..? అనే విషయాలపై అనుయాయులతో మల్లాగుల్లాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ‘గడిచిన ఎన్నికల్లో నీకు సపోర్ట్ చేసి సర్పంచ్ను చేసినం.. ఎప్పుడూ నువ్వేనా..? ఈ సారీ నాకు అవకాశం ఇవ్వు..’ అంటూ తమ దగ్గరి అనుచరులే అడుగుతుండటంతో మాజీ సర్పంచ్లు కంగుతింటున్నారు. సర్పంచ్ బరిలో ఉంటున్నారా..! -
ఆర్డీవో కార్యాలయం ఎదుట అయ్యప్ప స్వాముల నిరసన
మెట్పల్లి: పోలీస్ ఉన్నతాధికారులు అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా వ్యవహరిస్తున్నారంటూ దీక్షాపరులు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. దీక్ష తీసుకుంటే సెలవు పెట్టాలంటూ పోలీసులు ఆదేశాలివ్వడం సరికాదన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ అయ్యప్ప దీక్షాపరులు డీజీపీ కార్యాలయం ముట్టడికి వెళ్తే అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్కు వినతిపత్రం ఇచ్చారు. గంగుల వివేక్, దొమ్మాటి ప్రవీణ్, అంకతి భరత్, బండారి మారుతి, అవుట్ల లక్ష్మణ్, బాశెట్టి హరీశ్, మర్రి నర్సయ్య ఉన్నారు. -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం నందిమేడారం బాలుర గురుకుల విద్యాలయంలో జరుగుతున్న 69వ ఎస్జీఎఫ్ అండర్– 14 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో గురువారం బాలబాలికలు హోరాహోరీగా తలపడ్డారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 244 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. కాగా ఈనెల 28 వరకు జరిగే పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సురేశ్, ఎంఈవో ప్రభాకర్, ప్రిన్సిపాల్ విద్యాసాగర్, వాలీబాల్ సంఘం అధ్యక్షుడు ముత్యాల రవీందర్, కార్యదర్శి తమ్మడవేని రాజయ్య, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణ్, క్రీడల పరిశీలకులు బాలు, మల్లేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు కొమురయ్య, కుమార్, సౌజన్య, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
మారుమోగిన అయ్యప్ప శరణు ఘోష
జగిత్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శరణుఘోషతో మారుమోగింది. అనంతరం భక్తులకు మహాభిక్ష చేశారు. గురుస్వాములు నీలం దశరథరెడ్డి, మానాల కిషన్, అడువాల లక్ష్మణ్, రాచకొండ నాగరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ అడువాల జ్యోతి, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. టీబీ నివారణకు కృషి చేయాలిమల్యాల: టీబీ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించాలని, వ్యాధి నిర్ధారణ, నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో ఎన్.శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం టీబీ అలర్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో టీబీ చాంపియన్లకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీబీ నిర్మూలన చర్యలు, లక్షణాలపై అవగాహన కల్పించాలన్నారు. టీబీని ప్రాథమిక దశలోనే గుర్తించాలన్నారు. మండల వైద్యురాలు మౌనిక, రవి,దత్తురామ్, శ్రీనివాస్, రమేశ్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో వైద్యురాలికి సీమంతంమెట్పల్లి: పట్టణంలోని సాయిరాంకాలనీ అంగన్వాడీ కేంద్రంలో స్థానిక అర్బన్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ వాణిరెడ్డికి గురువారం సీమంతం చేశారు. అంగన్వాడీ, వైద్య సిబ్బంది ఆమెకు సంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాణిరెడ్డి అవగాహన కల్పించారు. సూపర్వైజర్ ప్రతిభ, టీచర్ అమృత, సిబ్బంది సులోచన, సంకీర్తన, సుజాత తదితరులున్నారు. నేటి నుంచి జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు జగిత్యాల: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శనలను జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాలలో ఈనెల 28, 29న నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. ఈ మేరకు గురువారం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంతోపాటు వారిలోని సృజనాత్మకతను వెలికితీయడం కోసం వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మానక్ పోటీలను నిర్వహిస్తోందన్నారు. 2024–25కు సంబంధించి జిల్లాస్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్స్పైర్ అవార్డు మానక్), 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు ఏకకాలంలో నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు కొత్త ఆవిష్కరణలతో పాల్గొనాలన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సైన్స్ ఎగ్జిబిట్స్ బోధనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలన్నారు. -
నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి
కోరుట్లరూరల్: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని మోహన్రావుపేటలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలు నోటీస్బోర్డుపై ప్రదర్శించారా.. లేదా తెలుసుకున్నారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, రికార్డుల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులకు సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. డీపీవో రఘువరన్, ఆర్డీవో జివాకర్రెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ కృష్ణ చైతన్య తదితరులు ఉన్నారు. అయిలాపూర్లో ఎస్పీ.. మండలంలోని అయిలాపూర్, పైడిమడుగు గ్రామాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఎస్పీ అశోక్కుమార్ పరిశీలించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాటు చేయాలన్నారు. డీఎస్పీ రాములు, సీఐ సురేశ్కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన అబ్జర్వర్లు జగిత్యాల: ఎన్నికల అబ్జర్వర్లు జి.రమేశ్, మనోహర్ గురువారం కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ను కలిశారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, వ్యయం నిర్వహణపై చర్చించారు. -
నూకశాతం పెరిగిందని..
జగిత్యాలరూరల్: జిల్లాలో మూడురోజులు ధాన్యం కాంటా నిలిచిపోయింది. ధాన్యంలో నూకశాతం ఎక్కువగా వస్తోందంటూ దిగుమతి చేసుకునేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యం వరిపంటపై తీవ్ర ప్రభావం చూపింది. ఎకరాకు సుమారు 25 నుంచి 28 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా.. ఇప్పుడు 18 నుంచి 20 క్వింటాళ్లకు మించడం లేదు. పండిన ఆ ధాన్యంలో కూడా వాతావరణ పరిస్థితులతో నూకశాతం ఎక్కువగా వస్తోంది. 1.67లక్షల టన్నులే కొనుగోలు జిల్లాలో వానాకాలం సీజన్లో ఆరు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కానీ సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల టన్నులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. భారీవర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడి భారీగా తగ్గింది. పండించిన ధాన్యాన్ని హార్వెస్టర్లతో కోయించి నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కేంద్రాల్లో ఇప్పటివరకు 1.67లక్షల టన్నులు కొన్నారు. ఇంకా 2.30 లక్షల టన్నుల సేకరించాల్సి ఉంది. నూకశాతంతో మిల్లర్ల కష్టాలు రైస్మిల్లర్లకు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యం చేసి ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుత సీజన్లో రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యంలో నూకశాతం ఎక్కువగా వస్తుండటంతో మిల్లర్లు వెనుకంజ వేస్తున్నారు. జిల్లాలోని 89 పారాబాయిల్డ్ రైస్మిల్లులు, 10 రా రైస్మిల్లులకు ధాన్యం కేటాయించారు. వీరు ప్రస్తుతం క్వింటాలుకు రారైస్ 67 కిలోలు, పారాబాయిల్డ్ 68 కిలోలు ప్రభుత్వానికి అప్పగించేవారు. ఈ ఏడాది నూక శాతం 15 నుంచి 20 శాతం ఉండగా.. 40 శాతం బియ్యం వస్తోంది. మిల్లర్లతో సమావేశం ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో కలెక్టర్ సత్యప్రసాద్ మిల్లర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవాల్సిందేనని నచ్చజెప్పారు. ప్రతి మిల్లర్ ధాన్యాన్ని తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. దీనికి మిల్లర్లు అంగీకరించడంతో గురువారం నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● అదనపు కలెక్టర్ బీఎస్.లత సారంగాపూర్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మండలంలోని అర్పపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులతో ఉపాధ్యాయులు కలిసి భోజనం చేయాలని, దీని ద్వారా వారికి పౌష్టికాహారం అందుతుందా అనే విషయం తెలుస్తుందన్నారు. పాఠశాలకు రాని విద్యార్థిని పచునూరి అక్షిత ఇంటికి వెళ్లి ప్రతిరోజు బడికి పంపించాలన్నారు. అనంతరం కోనాపూర్, అర్పపల్లి, ధర్మనాయక్తండా, రంగపేట, నాగునూర్, లచ్చక్కపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్ వాహిదొద్దీన్, ఉపాధ్యాయులు ఉన్నారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు సారంగాపూర్ విద్యార్థినిసారంగాపూర్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని సీహెచ్.మైత్రీ ఎంపికై ంది. పదో తరగతి చదువుతున్న మైత్రీ ఈనెల 28 నుంచి 30 వరకు మెదక్ జిల్లా పటాన్చెరువులో జరిగే పోటీల్లో పాల్గొననుంది. మైత్రీ ఎంపికపై పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రవీందర్, ఉపాధ్యాయులు అభినందించారు. సారంగాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి మోసం చేసిందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండలంలోని పెంబట్లలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. ఇప్పుడు కేవలం 17 శాతానికి తగ్గించిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో రూ.200 కోట్లు ఖర్చు చేసి కుల గణన చేయడం డ్రామాగా పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు తేలు రాజు, విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, నాయకులు ఎండబెట్ల ప్రసాద్, కొండ ప్రభాకర్, భైరి మల్లేశం తదితరులు ఉన్నారు. -
ఇసుక టిప్పర్లు పట్టివేత
ధర్మపురి: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. మండలంలోని ఆరెపెల్లి, మగ్గిడి గోదావరి తీరం నుంచి గురువారం వేకువజామున ఇసుక తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకుని ఇసుకు తరలిస్తున్న ఆరు టిప్పర్లను పట్టుకొని ధర్మపురి పోలీస్ స్టేషన్కు తరలించారు. పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలిజగిత్యాలక్రైం: పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. ఎస్పీతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్లు, పోలింగ్ కేంద్రాలు, భద్రత ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తన, నియమావళి అమలు, క్రిటికల్ ప్రాంతాలపై పర్యవేక్షణ వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ముగిసేవరకు పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, గ్రామాల వివరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల అనంతరం విజేతలు ర్యాలీ నిర్వహించే అవకాశం ఉన్నందున భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ అశోక్కుమార్, అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీ వెంకటరమణ, సీఐలు శ్రీనివాస్, ఆరీఫ్అలీఖాన్, రఫీక్ఖాన్ పాల్గొన్నారు. -
పల్లెల్లో సందడి
జగిత్యాల:పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు కావడం.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామీణప్రాంతాల్లో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. రెండేళ్లుగా పల్లెల్లో పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధిపై ప్రభావం పడింది. ఏదైనా సమస్య వస్తే ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామంలో బల్బుపోయినా.. డ్రైనేజీలు తీయాలన్నా అందరికీ ఇబ్బందిగా ఉండేది. స్పెషల్ ఆఫీసర్లకు ఇన్చార్జి ఇవ్వడంతో సమస్యలు సక్రమంగా పరిష్కరించలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ రావడం.. నామినేషన్లు స్వీకరించనున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఇవే ముచ్చట్లు విన్పిస్తున్నాయి. ఎవరు పోటీ చేస్తున్నారు..? మహిళల రిజర్వేషన్లలో ఎవరిని నిలబెడుతున్నారన్న అంశంపై చర్చిస్తున్నారు. పార్టీలను పక్కన పెట్టి వ్యక్తిగత పలుకుబడితో పాటు, గ్రామంలో చేసిన సేవలను గుర్తించాలని కొందరు వ్యక్తులు పోటీ చేసేందుకు ముందుకెళ్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీల పరంగా జరగవు కాబట్టి వ్యక్తిగత చరిష్మా ఉన్న వారే గెలుపొందే అవకాశాలుంటాయి. అభ్యర్థుల కోసం పార్టీల అన్వేషణ పల్లెల్లో రాజకీయ సంగ్రామం మొదలైన నేపథ్యంలో పార్టీల నేతలు బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్టీలో బలంగా ఉన్నవారిని నిలబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలపై కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించే దిశగా ప్రయత్నిస్తుండగా.. బీఆర్ఎస్, బీజేపీ సీట్లు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలు పార్టీలగుర్తుపై జరగకపోయినప్పటికీ కార్యకర్తలను కాపాడుకోవాలని కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇందిరా మహిళాశక్తి చీరలు, వడ్డీలేని రుణాలు ప్రకటించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ.. ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఏ విధంగానైనా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను గెలుపించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. కుల, మహిళాసంఘాలు, యువతను ఇప్పటి నుంచే ఆకట్టుకునేలా ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి. మొదటి విడతలో జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆశావహులకు పెద్దగా సమయం లేనప్పటికీ, రెండు, మూడో విడతల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాత్రం ప్రణాళిక రూపొందించుకునేందుకు చాలా సమయం ఉంది. ఆ దిశగా ముందుకెళ్తున్నారు. -
ర్యాగింగ్తో భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
జగిత్యాలక్రైం: కళాశాల విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలని, ర్యాగింగ్తో భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు ర్యాగింగ్, డ్రగ్స్, మత్తు పదార్థాలపై వాటిల్లే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. స్నేహపూర్వక వాతావరణంలో చదువుకోవాలని, సీనియర్లు జూనియర్లను ప్రోత్సహించి మార్గనిర్దేశం చేయాలన్నారు. ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు, జైలుశిక్ష, కళాశాల నుంచి బహిష్కరణ, స్కాలర్షిప్ రద్దు, భవిష్యత్లో ఉద్యోగాలు కోల్పోవడం వంటి తీవ్ర శిక్షలు ఉంటాయన్నారు. ర్యాగింగ్ బాధితులు డయల్ 100కుగానీ, సమీప పోలీస్స్టేషన్కు గానీ సమాచారం అందించాలన్నారు. అనంతరం యాంటీర్యాగింగ్ పోస్టర్ ఆవిష్కరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ రఘుచందర్, టౌన్ సీఐ కరుణాకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సునిల్కుమార్, హెచ్వోడీ ఖాద్రి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పల్లె నుంచి అసెంబ్లీకి
సర్పంచ్లుగా మొదలై.. వార్డు సభ్యుడిగా తొలి అడుగు రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటకు చెందిన కటుకం మృత్యుంజయం 1981లో తొలిసారి గంభీరావుపేట వార్డుసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1983లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తండ్రీతనయులు సర్పంచులే హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు 1981 నుంచి 1994 వరకు సింగాపూర్ గ్రామ సర్పంచ్గా పనిచేశారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది 2006లో మంత్రిగా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన తనయుడు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ 1995 నుంచి 2001 వరకు సింగాపూర్ సర్పంచ్గా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లోనూ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సిరిసిల్ల: ఉమ్మడి జిల్లాలోని రాజకీయ దురందరులు అందరూ ఒకప్పటి సర్పంచులే. రాజకీయ తెరంగేట్రానికి తొలిమెట్టును ఆధారంగా చేసుకొని అంచెలంచెలుగా ఎదిగిని వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది ఉన్నారు. సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎమ్మెల్యేలుగా, జెడ్పీ చైర్మన్లుగా, మంత్రులుగా, స్పీకర్లుగా ఎదిగారు. ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా తొలి అడుగు మాత్రం పల్లె పెద్దగానే పడింది. తమ రాజకీయ జీవితాలకు సర్పంచ్ పదవిని పునాదులు వేసుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతల రాజకీయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సర్పంచ్ నుంచి మంత్రులుగా..జిల్లాకు చెందిన పలువురు నేతలు సర్పంచుల నుంచి మంత్రులయ్యారు. జువ్వాడి రత్నాకర్రావు, న్యాలకొండ రాంకిషన్రావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సుద్దాల దేవయ్యలు రాష్ట్ర మంత్రులుగా పనిచేయగా దుద్దిళ్ల శ్రీపాదరావు స్పీకర్గా సుదీర్ఘకాలం సేవలందించారు. ఇలా పల్లె రాజకీయాల్లో తొలి అడుగులు వేసిన నేతలు కాలక్రమంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేసి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా.. కరీంనగర్ ఎమ్మెల్యేగా 1989లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వెలిచాల జగపతిరావు అంతకు ముందు రామడుగు మండలం గుండి సర్పంచ్గా పనిచేశారు. దేవాదాయశాఖ మంత్రిగా.. ధర్మపురి మండలం తిమ్మాపూర్కు చెందిన జువ్వాడి రత్నాకర్రావు రెండుసార్లు సర్పంచ్గా గెలుపొందారు. 1981 నుంచి 1987 వరకు జగిత్యాల సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా బుగ్గారం నుంచి గెలుపొంది వైఎస్సార్ మంత్రివర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. జెడ్పీ చైర్మన్ వరకు.. మానకొండూరు సర్పంచ్గా రెండుసార్లు పనిచేసిన ఆరెపల్లి మోహన్ అనంతరం జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. 2009లో మానకొండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా పనిచేశారు. కమ్మరిఖాన్పేట సర్పంచ్గా.. ధర్మారం మండలం కమ్మరిఖాన్పేటకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి 1988 నుంచి 1995 వరకు సర్పంచ్గా పనిచేశారు. ధర్మారం మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా 1995లో ధర్మారం జెడ్పీటీసీగా గెలుపొందారు. 1999లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. గంగాధర సర్పంచ్గా.. గంగాధరకు చెందిన న్యాలకొండ రాంకిషన్రావు 1985 వరకు సర్పంచ్గా, సమితి ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. చొప్పదండి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలిచిన ఆయన 1995లోమంత్రి అయ్యారు. -
‘ఆమె’ చుట్టే రాజకీయం
సాక్షి పెద్దపల్లి: సర్పంచ్ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం. ఒకట్రెండు ఓట్లతోనే ఫలితాలు తారుమారవుతాయి. దీంతో ప్రతీ ఓటును ఒడిసి పట్టుకునేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో అతివల హవా నడుస్తోంది. హోరాహోరిగా సాగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా మారాయి. దాదాపుగా అన్ని గ్రామపంచాయతీల్లో వీరి ఓట్లే అధికంగా ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ‘ఆమె’ ఆశీస్సులపై దృష్టి పెడుతుస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేలా, తమకే ఓటేయాలని విజ్ఞాపనల్ని మహిళా లోకానికి వినిపిస్తున్నారు. ఆశావహుల ప్రయత్నాలు పోటీదారుల విజయావకాశాల్ని మార్చగలిగేలా సత్తా మహిళా ఓటర్లకు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు చీరలు, ఇతర బహుమతులను పంచేందుకు ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి తదితర మహిళ సంబంధింత పథకాలతో తమకే అతివలు పట్టం కడుతారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తుండగా, చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేసిన విషయాన్ని మహిళలకు తెలుపడంతో వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ, మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ తదితర పథకాలను అమలు చేయటం ద్వారా మహిళలకు పెద్దపీట వేశామని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పదవుల్లో సగం.. ఓట్లల్లో అధికం స్థానిక సంస్థల పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.కాగా మహిళ ఓట్లను గుంపగుత్తగా ప్రసన్నం చేసుకునేందుకు మహిళా సంఘాల వారీగా చీరలు, కుట్టు మిషన్స్, వంట పాత్రలు, టెంట్హౌస్ సామగ్రి తదితర నిత్యం ఉపయోగించుకునే వాటిని ఇచ్చేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు
జగిత్యాల మండలం అంతర్గాంకు చెందిన సుద్దాల దేవయ్య 1983లో సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1985లో జెడ్పీ చైర్మన్గా ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. 1994, 1999లో నేరెళ్ల ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2009లో చొప్పదండి నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. రుద్రవరం నుంచి సిరిసిల్ల దాకా.. వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన రేగులపాటి పాపారావు 1968 నుంచి 1981 వరకు గ్రామ సర్పంచ్గా పనిచేశారు. 1981 నుంచి 1986 వరకు వేములవాడ సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. 1999లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వెంకట్రావుపేట నుంచి అసెంబ్లీకి.. మెట్పల్లి మండలం వెంకట్రావుపేట సర్పంచ్గా 1968లో పనిచేసిన కొమురెడ్డి రాములు 2004లో మెట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భార్య కొమురెడ్డి జ్యోతి సైతం మెట్పల్లి ఎమ్మెల్యేగా అంతకుముందే గెలిచారు. మొగిలిపేట నుంచి జెడ్పీ చైర్మన్ వరకు మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చెందిన కె.వి.రాజేశ్వర్రావు సర్పంచ్గా 1959 నుంచి 1981 వరకు కొనసాగారు. సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎంపికవుతూ 2004లో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ధనువాడ నుంచి అసెంబ్లీ స్పీకర్గా.. ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధనువాడ సర్పంచ్గా పనిచేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు 1983, 1985, 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 వరకు శాసనసభ స్పీకర్గా ఉన్నారు. శ్రీపాదరావు మరణానంతరం అతని తనయుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు మంథని ఎమ్మెల్యేగా విజయం సాధించి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. రేకొండ నుంచి ఎమ్మెల్యే వరకు.. ప్రస్తుత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి రాజకీయ ప్రస్తానం సర్పంచ్గానే మొదలైంది. చిగురుమామిడి మండలం రేకొండ సర్పంచ్గా పనిచేసిన ఆయన జడ్పీటీసీగా, ఎంపీపీగా, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కరీంనగర్క్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. కరీంనగర్ హుస్సేనిపురకు చెందిన మహ్మద్ అమీర్ఖాన్ (18) మెకానిక్గా పనిచేస్తుంటాడు. బుధవారం రాత్రి షాపు మూసివేసి కార్ఖానాగడ్డకు రాగా, వెనకనుండి గుర్తు తెలియని వ్యక్తి వ్యాన్తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిమోర్తాడ్: మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారు పెద్దవాగుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్కు చెందిన పేర్ల కృష్ణ (44) తన స్నేహితుడు కోట సమ్మయ్యతో కలిసి ఆర్మూర్కు వెళుతుండగా వంతెనపై ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కృష్ణను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తిమృతి ఓదెల(పెద్దపల్లి): కొలనూర్–ఓదెల రైల్వేస్టేషన్ల మధ్యలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి(35), గుర్తు తెలియని రైలు నుంచి కిందపడి మృతిచెందినట్లు రామగుండం జీఆర్ఫీఎఫ్ హెడ్కానిస్టేబుల్ తెలిపారు. బ్లూ కలర్ టీషర్ట్, స్కై బ్లూకలర్ ప్యాంటు ధరించిన మృతుడి వద్ద చంద్రాపూర్ నుంచి తిరుపతికి వెళ్తున్నట్లు టిక్కెట్ ఉంది. ఇంకా ఎలాంటి ఆధారాలు, గుర్తింపు కార్డులు లేవు. మృతదేహాన్ని రామగుండం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. వివరాలకు 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని జీఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉరేసుకుని మహిళ ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లికి చెందిన బాలె మల్లీశ్వరి (38) గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. మల్లీశ్వరి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. వైద్యులకు చూపించినా నయం కాలేదు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుంది. ఆమె భర్త గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
నామినేషన్ వేస్తున్నారా.. ఒక్క నిమిషం!
జగిత్యాలజోన్: మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలు (షష్టి తీర్థాలు) నవంబర్లోనే ఉంటాయి. భక్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ.. డిసెంబర్ 20వరకు మందు, మాంసానికి దూరంగా ఉంటారు. ఈ సమయంలోనే సర్పంచ్ ఎన్నికలు రావడం.. పోటీచేసే అభ్యర్థులు విందులు ఇచ్చే ఆస్కారం ఉండడం మద్యంప్రియులకు సంకటంగా మారింది. షష్టివారాలు పూర్తయ్యాక దావత్ అడుగుదామంటే అప్పటికే మూడు విడతల ఎన్నికలు ముగుస్తాయి. తర్వాత ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. మద్యం, మాంసం తినని ఓటర్లు.. ‘ఇప్పుడు ఒక్కపొద్దులు ఉన్నాయి. మందు బాటిల్ పంపించు.. ఇప్పుడు దావత్ ఇస్తే రాలేను..’ అంటూ చెబుతున్నారు. మరోవైపు అభ్యర్థులు ఒక్కొక్కరికి బాటిల్ పంపిస్తే.. మిగతా ఓటర్ల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఓటర్ల కోరికలను చూసి తొలినాళ్లలోనే ఇలా ఉంటే ఎన్నికల తేదీ వరకు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందోనని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. జగిత్యాలజోన్: జిల్లాకేంద్రం చుట్టుపక్క గ్రామాల్లో సర్పంచ్స్థానాలకు భలే గిరాకీ ఏర్పడింది. శివారు పంచాయతీల్లో పోటీ చేసేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. ఎంత ఖర్చయినా ఫర్లేదు.. పోటీలో ఉండాల్సిందేనన్న ఊపుతో ఉన్నారు. జిల్లాకేంద్రం చుట్టూ ఏడెనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో భూముల ధరలు రూ.కోట్లు పలుకుతుండడమే దీనికి కారణమని పలువురు భావిస్తున్నారు. ‘ఓడితే అరెకరం.. గెలిస్తే ఐదెకరాలు’ అనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు. జగిత్యాలను ఆనుకుని ఉన్న జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్పన్నపేట జనరల్, హస్నాబాద్ జనరల్ ఉమెన్, ధరూర్ జనరల్ స్థానాలయ్యాయి. ఈ పంచాయతీల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. జగిత్యాల రూరల్ మండలంలోని తిమ్మాపూర్ జనరల్, తాటిపల్లి బీసీ జనరల్, మోరపల్లి జనరల్, లక్ష్మీపూర్ జనరల్ మహిళ, హన్మాజీపేట జనరల్ మహిళ, గుల్లపేట జనరల్, చల్గల్ జనరల్, అంతర్గాం జనరల్ మహిళ, అనంతారం జనరల్ మహిళగా రిజర్వేషన్ ఖారారైంది. ప్రధానంగా జనరల్, జనరల్ మహిళ స్థానాల్లో పోటీ ఉత్కంఠగా మారనుంది. ఎన్నికల నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలిజగిత్యాల: ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుధవారం కలెక్టర్తో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, జియో లొకేషన్ టీ పోల్ వెబ్సైట్ యాప్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ మొదటి విడతలో 7 మండలాల్లో 122 గ్రామపంచాయతీలు, రెండో విడతలో 144, మూడో విడతలో 119 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. రికార్డులు, ఎన్నికల నిర్వహణ పనితీరును తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎంపీడీవో విజయలక్ష్మీ, ఎంపీవో వాసవి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సిబ్బందికి ‘ఉపాధి’ఇప్పుడు షష్టి వారాలు..బాటిల్ పంపించు..ఆ సర్పంచ్ స్థానాలకు భలే గిరాకీఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలిరాయికల్: సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సర్పంచ్ స్థా నానికి పోటీచేసే అభ్యర్థులు నామి నేషన్ పత్రాల్లో అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలు.. -
మల్లన్నా.. శరణు శరణు
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేటలోగల దొంగమల్లన్న స్వామివారి జాతర వైభవంగా ప్రారంభమైంది. బుధవారం (దండివారం) కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉపవాసం ఉండి పట్నాలు వేసి కొత్తకుండలో బోనం వండి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు రాజేందర్, రఘునందన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. గొల్లకుర్మల ఢమరుక వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. గొల్లపల్లి, బుగ్గారం, సారంగాపూర్, వెల్గటూర్, ధర్మపురి పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టారు. డీఎస్పీ రఘుచందర్, సీఐలు రాంనర్సింహారెడ్డి, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి పర్యవేక్షించారు. మంగళవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. టికెట్ల ద్వారా రూ.84,860 ఆదాయం వచ్చినట్లు ఈవో విక్రమ్, ఫౌండర్ ట్రస్టీ శాంతయ్య తెలిపారు. ఎంపీడీవో రవీందర్రావు, ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, వైద్య, అగ్నిమాపక, విద్యుత్శాఖ, దేవాదాయ సిబ్బంది పాల్గొన్నారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయండి
రాయికల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. రాయికల్ మండలం కట్కాపూర్లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోళ్లు సజావుగా సాగడం లేదని రైతులు ఆయనకు ఫిర్యాదు చేయగా.. అధికారులతో మాట్లాడారు. కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సంబంధిత రైస్మిల్లులో దిగుమతి జరిగేలా చూడాలని సూచించారు. ఆయన వెంట నాయకులు సుధాకర్రెడ్డి, రాజమౌళి, లక్ష్మణ్, మండల నాయకులు గోపి రాజిరెడ్డి, తంగెళ్ల రమేశ్, మహిపాల్రెడ్డి, మహేందర్గౌడ్ పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిలో పూజలు జగిత్యాల: జిల్లా కేంద్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో నిర్వహించిన స్వామివారి కల్యాణంలో జీవన్రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నాయకులు కమటాల శ్రీనివాస్ ఉన్నారు. -
దీక్ష దివస్ విజయవంతం చేయాలి
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావుజగిత్యాల: దీక్ష దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని, 29న దీక్ష దివస్ సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో అంబేడ్కర్ సూర్యుడు అనే బుక్ను ఆవిష్కరించారు. రాజ్యాంగం వల్లే పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి
జగిత్యాలక్రైం: రాజ్యాంగానికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉందని, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందించాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఎస్సీ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడంతోపాటు ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా చట్టాలు పొందుపర్చారని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ.. న్యాయ వ్యవస్థ, చట్టసభలు, పాలన యంత్రాంగాల ద్వారా ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జీవనం సాగించేలా రూపొందించారని గుర్తు చేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, వేణు, సైదులు, ఆర్ఎస్సైలు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు. -
పల్లె‘పోరు’ షురూ..!
జగిత్యాల: పల్లెపోరు మొదలైంది. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. మొదటివిడత ఏడు మండలాల్లో నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకానుంది. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటిదశ మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 122 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం మొత్తం 39 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 47 మంది ఆర్వోలు, 47 మంది ఏఆర్వోలను నియమించారు. సమస్యలుంటే పరిష్కరించేందుకు కలెక్టరేట్లో సహాయకేంద్రాన్ని ప్రారంభించారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అమలు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై ఓటింగ్, పోస్టర్లు తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల గోడలపై రాతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే అధికారులపైనా చర్యలు తీసుకోనున్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకూ ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రశాంతంగా పూర్తిచేయాలి పంచాయతీ ఎన్నికల్లో లోటుపాట్లు రాకుండా చూ డాలని కలెక్టర్ రిటర్నింగ్ అధికారులకు సూచించా రు. వారికి కలెక్టరేట్లో బుధవారం శిక్షణ ఇచ్చారు. అభ్యర్థులు అఫిడవిట్లో వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుందని, లేనిచో తిరస్కరించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు కరపత్రాలు, వాల్పోస్టర్లు, ప్రచార వాహనాలకు అనుమతి తీసుకునేలా చూడాలన్నారు. నామినేషన్ ఒరిజినల్ పత్రాలను పంచాయతీలోని ఆర్వోల వద్ద పొందవచ్చని, జిరా క్స్ కాపీలు వాడొద్దన్నారు. అప్పీళ్లు ఉంటే ఆర్డీవోకు సమర్పించాలన్నారు. అనంతరం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఖర్చులు వినియోగించుకో వాలని, ప్రచార కరపత్రాలపై తప్పనిసరిగా ప్రింటర్ల సమాచారం ఉండాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు శాంతియుత వా తావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చేనెల 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో తొలివిడత ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎస్పీ అశోక్కుమార్ మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఎస్పీ అశోక్కుమార్, అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక నిఘా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు జిల్లా సరిహద్దుల్లో ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలకు గురిచేసే వారిపై దృష్టి సారించారు. జిల్లాలో 75 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ ప్రత్యేక నిఘా పెంచారు. ఫ్లయింగ్స్క్వాడ్ బృందాలు, సర్వైలైన్స్ బృందాలను నియమించారు. -
మోసగాళ్ల అరెస్ట్
కోనరావుపేట(మానకొండూర్): ఇంట్లో బంగారు నిధి ఉందని నమ్మించి దంపతుల నుంచి భారీ మొత్తంలో నగదు కాజేసిన మోసగాళ్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన దుగ్గు వేణు ఇంట్లో బంగారం నిధి ఉందని, ఎవరో మంత్రాలు చేశారంటూ పెద్దూరుకు చెందిన మేకల నరేశ్ నమ్మబలికాడు. తనకు తెలిసిన బాబా అయితే బంగారు నిధి తీసి ఇస్తాడని నమ్మించి సదుల దేవేందర్, పెద్దూరుకు చెందిన కడవంచ ప్రసాద్, సదుల రాజేశంను తీసుకెళ్లాడు. ఇలా నమ్మించి ఆ దంపతుల నుంచి విడతల వారీగా రూ.3వేలు, రూ.50వేలు, రూ.15వేలు, రూ.3.40 లక్షలు వసూలు చేశాడు. తర్వాత నరేశ్ ముఖం చాటేయడంతో మోసపోయానని గుర్తించిన వేణు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిజామాబాద్ శివారులో మేకల నరేశ్, కడవంచ ప్రసాద్, సదుల దేవేందర్ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3లక్షలు స్వాదీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఎస్సై ప్రశాంత్రెడ్డి ఉన్నారు. -
కలెక్టరేట్లో సహాయ కేంద్రం
జగిత్యాల: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సహాయ కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ ప్రారంభించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏవైనా సమస్యలుంటే 96662 34383 నంబర్లో సంప్రదించాలని, 24/7 సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నోడల్ అధికారులుగా జిల్లా సంక్షేమాధికారి నరేశ్, పౌరసంబంధాల శాఖ అధికారి నరేశ్, వ్యవసాయాధికారి భాస్కర్ను నియమించినట్లు పేర్కొన్నారు. ఎయిడ్స్ నివారణకు కృషిచేయాలిజగిత్యాల: ఎయిడ్స్ ప్రమాదకరమైన వ్యాధి అని, నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. బుధవారం వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎఫ్పీవో సభ్యత్య నమోదులో జిల్లా రెండో స్థానంజగిత్యాలఅగ్రికల్చర్: సొసైటీల్లో ఏర్పాటు చేస్తున్న ఎఫ్పీవో (ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్) సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో ఉందని సహకార అధికారి సీహెచ్.మనోజ్కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 52 సహకార సంఘాల్లో 16 సంఘాలను ఎఫ్పీవోగా తీర్చిదిద్దుతున్నామని, 16 ఎఫ్పీవోల్లో సభ్యత్య నమోదు వేగవంతం చేయాలని కోరారు. సంఘం వసూలు చేసిన మొత్తానికి.. నాబార్డు అంతే మొత్తంలో ఆర్థికసాయం చేస్తుందన్నారు. ఎఫ్పీవోల ద్వారా వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. సంఘ సీఈవోలు, సహకార శాఖ శిక్షణ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 28న వృద్ధులకు జెరియాట్రిక్ వైద్యసేవలుజగిత్యాల: సీనియర్ సిటిజన్స్కు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈనెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేకమైన జెరియాట్రిక్ వైద్యసేవలు అందించడం జరుగుతుందని జిల్లా సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు హరి అశోక్కుమార్ తెలిపారు. ప్రత్యేక నిపుణులచే పరీక్షలు చేస్తారని సీనియర్ సిటిజన్స్ వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రామాజీపేట విద్యార్థినిరాయికల్: మండలంలోని రా మాజీపేట జెడ్పీ ఉన్న త పాఠశా ల విద్యార్థిని ఎనుగంటి సాహిత్య రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ ప్రతాప్రెడ్డి తెలిపారు. నల్గొండలో డిసెంబర్లో జరిగే పోటీల్లో సాహిత్య పాల్గొననుంది. సాహిత్యను హెచ్ఎం గజ్జెల నరేందర్, గ్రామస్తులు అభినందించారు. జాతీయస్థాయి ఖోఖో పోటీలకు.. కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని బాదినేని శ్రావణి ఎస్జీఎఫ్ జాతీయస్థాయి అండర్–17 ఖో ఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం నల్ల రాజయ్య తెలిపారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో శ్రావణి ప్రతిభ చాటింది. శ్రావణిని పీడీ నవీన్, ఉపాధ్యాయులు అభినందించారు. -
జగిత్యాల
31.0/17.07గరిష్టం/కనిష్టంకలెక్టర్ను కలిసిన ఏఎస్పీ జగిత్యాల: జిల్లాకు నూతనంగా వచ్చిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. వాతావరణం ఉదయం పొగమంచు కురుస్తుంది. పొడి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. భక్తుల పుణ్యస్నానం ధర్మపురి: షష్ఠి మాసం సందర్భంగా బుధవారం ధర్మపురి గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మంగలిగడ్డ, సంతోషిమాత ఘాట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
ఫుట్బాల్ ఆడుతూ.. అనంతలోకాలకు..
పెద్దపల్లిరూరల్: తను చదువుకునే పాఠశాలలో సహచర విద్యార్థులతో కలిసి సంతోషంగా ఫుట్బాల్ ఆడుతూ కిందపడిపోయిన కొద్దిగంటల్లోనే మృతి చెందిన విషాద సంఘటన పెద్దపల్లి శివారు రంగంపల్లిలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి శివారు రంగంపల్లిలో నివాసముంటున్న కుమారస్వామి–సునీత దంపతుల కుమారుడు కనవేన ప్రతీక్(15) రంగంపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. లంచ్టైంలో సహచర విద్యార్థులతో కలిసి మంగళవారం ఫుట్బాల్ ఆడుతుండగా కిందపడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తల్లి సునీత వచ్చి విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లింది. కాసేపటికే వాంతులు చేసుకోవడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. తలలో రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతోందని, కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్కు తీసుకెళ్లి వైద్యం చేయిస్తుండగానే రాత్రి మృతి చెందాడు. తండ్రి కుమారస్వామి సూచన మేరకు లయన్స్క్లబ్ ఎలైట్ సహకారంతో కళ్లు దానం చేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
దర్శకుడు సంపత్ నందికి పితృవియోగం
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు సంపత్ నంది తండ్రి నంది కిష్టయ్య(75) మంగళవారం రాత్రి మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం ఓదెల గ్రామ శివారులో కిష్టయ్య అంత్యక్రియలు జరిగాయి. హైదరాబాద్కు చెందిన సినీపరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు, గ్రామస్తులు కిష్టయ్య అంత్యక్రజుయలకు హాజరయ్యారు. నివాళి అర్పించారు. ఆయనకు కుమారులు సంపత్ నంది, రమేశ్ ఉన్నారు. సదాశయఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్కుమార్, ప్రధానకార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి మేరు గు జ్ఞానేంద్రచారి సూచనతో కిష్టయ్య కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ భార్యకు ప్రసవం
కోల్సిటీ(రామగుండం): ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం పెంచుతూ.. అదే ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించిన సర్కారు వైద్యుడు దండె రాజు ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఇన్చార్జి ఆర్ఎంవో, ఆర్థోపెడిక్ సర్జన్, సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) అసిస్టెంట్ ప్రొఫెసర్గా దండె రాజు విధులు నిర్వహిస్తున్నారు. నెలలు నిండిన తన భార్య శివాణికి డెలివరీ చేయించడానికి తను పనిచేస్తున్న జీజీహెచ్లో బుధవారం అడ్మిట్ చేయించారు. సిజేరియన్ ద్వారా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో ఆస్పత్రి వాతావరణం ఆనందంతో నిండిపోయింది. ప్రభుత్వ వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా డాక్టర్ రాజు తన భార్యకు సర్కారు ఆస్పత్రిలోనే డెలివరీ చేయిండం ఆదర్శంగా నిలిచిందని వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజును గైనిక్, పీడియాట్రిక్, సర్జికల్, అనస్థీషియా తదితర విభాగాల ప్రొఫెసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం
వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందగా, రెండేళ్ల చిన్నారి అనాథగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు. వేములవాడ మండలం ఆరెపల్లి శివారులోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధా న రహదారిలో వేములవాడ నుంచి ఎదురుగా వస్తున్న లారీ, కరీంనగర్ నుంచి వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరీంనగర్కు చెందిన వసీమ్(27) అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య ఐఫా(22)ను అంబులెన్స్లో వేములవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు వదిలింది. వీరి రెండేళ్ల పాప మైవిష్ఫాతిమా కాలు విరిగింది. చిన్నారిని వేములవాడ ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్లలోని బంధువుల శుభకార్యం కోసం వస్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. అనాథగా మారిన రెండేళ్ల చిన్నారి -
కలప దొంగల అరెస్ట్
● జిల్లాలో మొదటిసారిగా డాగ్స్క్వాడ్తో తనిఖీలు ● పట్టుకున్న ఆరు టేకు దుంగలు రాయికల్: కలప దొంగలను పట్టుకునేందుకు మొదటిసారిగా డాగ్స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించగా.. ఇద్దరు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.92,279 విలువైన టేకు కలపను స్వాధీనం చేసుకున్నట్లు రాయికల్ ఎఫ్ఆర్వో భూమేశ్ తెలిపారు. బుధవారం రాయికల్ అటవీశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని బోర్నపల్లి అటవీ ప్రాంతం చింతలూరు సెక్షన్ పరిధిలో ఆరు టేకు చెట్లను నరికివేశారు. అదే సెక్షన్ పరిధిలో మూడు నెలల క్రితం కలపను అక్రమంగా రవాణా చేశారు. నిందితులను పట్టుకోవాలన్న ఉద్దేశంతో మొదటిసారిగా నిర్మల్ జిల్లా జన్నారం రేంజ్లోని కేటీఆర్ సర్కిల్ డాగ్స్క్వాడ్ బృందం సభ్యుల సహాయంతో తనిఖీలు చేపట్టారు. డాగ్స్క్వాడ్ బోర్నపల్లి గ్రామంలోని గంగరాజం, ఆంజనేయులు ఇంటి వద్ద ఆగిపోవడంతో అటవీశాఖ అధికారులు వారిని విచారించగా నిజం అంగీకరించారు. వారి నుంచి రూ.92,279 విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. వారు నరికిన చెట్ల విలువ మాత్రం రూ.1,82,494 ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాలోనే మొదటిసారిగా డాగ్స్క్వాడ్ సహాయంతో నిందితులను గుర్తించామని ఎఫ్ఆర్వో పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మ, జన్నారం డాగ్స్క్వాడ్ బీట్ ఆఫీసర్ అనిల్కుమార్, సెక్షన్ ఆఫీసర్ మల్లన్న, విజయ్కుమార్, బీట్ ఆఫీసర్ రత్నాకర్, బేస్క్యాంప్ వాచర్ బాపురావు పాల్గొన్నారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి
కరీంనగర్టౌన్: అత్యంత వెనుకబడిన మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని భారతీయ మత్స్యకార్మిక నంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వీవీఎస్ స్టాన్లీ డిమాండ్ చేశారు. నగరంలో జరుగుతున్న తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక నంఘం నాలుగో రాష్ట్ర మహానభల్లో రెండోరోజు బుధవారం ఆయన మాట్లాడారు. ప్రమాద సమయంలోనే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు అత్యవసర సాయం అందించాలని, భద్రత కోసం పరికరాలు, జీఎస్, లైఫ్ జాకెట్లు ఉచితంగా అందించాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ, కేరళ తరహాలో బీమా కల్పించాలని, ప్రమాదం, సహజ మరణం సంభవిస్తే రూ.20 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. రాష్త్రంలో 10 హోల్సేల్, 100 రిటైల్ చేపల మార్కెట్లు నిర్మించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. జలవనరులు కబ్జాకు గురికాకుండా శాటిలైట్ నర్వే ద్వారా ఎఫ్టీఎల్ హద్దులు నిర్ణయించాలన్నారు. రూ.100 కోట్లతో శిథిలావస్థలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు. నాయకులు వర్ణ వెంకట్రెడ్డి, మిల్కూరి వాసుదేవరెడ్డి, యు.శ్రీనివాస్, గీట్లముకుందరెడ్డి, ఎడ్ల రమేశ్, గంగాధర కనకయ్య, పిట్టల వెంకటేశ్, జునగరి గణేశ్, పప్పు సదానందం, మర్రి శశికళ, నాగుల అరుణ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వీవీఎస్ స్టాన్లీ -
భర్త వేధింపులు భరించలేక..
● భర్తను కత్తితో నరికి చంపిన భార్య ● మల్లాపూర్లో దారుణం మల్లాపూర్: భర్త వేధింపులు భరించలేక కత్తితో నరికి చంపిన ఘటన మండలకేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలకేంద్రానికి చెందిన పల్లికొండ మల్లయ్య, రాజు దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. అందరికీ పెళ్లి అయ్యింది. కొంతకాలంగా భార్యతో మల్లయ్య గొడవ పడుతున్నాడు. నిత్యం దుర్భాషలాడుతున్నాడు. వ్యవసాయం చేసే విషయమై మంగళవారం రాత్రి వాగ్వాదానికి దిగారు. బుధవారం ఉందయం కుమారుడు, కోడలు వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. అప్పటికే బయటకు వెళ్లి వచ్చిన మల్లయ్య.. భార్యతో గొడవపెట్టుకున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేక మల్లయ్య మెడపై కత్తితో నరికింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులకు లొంగిపోయింది. సీఐ అనిల్, ఎస్సై రాజు సిబ్బందితో వచ్చి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బోయినపల్లి(వేములవాడ): బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన వృద్ధుడు అంజయ్య(65) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. అంజయ్య వండ్రంగి పనులు చేస్తూ జీవనోపాధి పొందేవాడు. కొదురుపాక పాత గ్రామంలో ముంపునకు గురైన ఓ పాత ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య పద్మ, కూతురు మమత ఉన్నారు. అంజయ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..సిరిసిల్ల అర్బన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు క్తి మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరు డబుల్ బెడ్రూమ్ కాలనీకి చెందిన అలిశెట్టి మహేశ్(40) వేములవాడలోని ఓ టెంట్ హౌస్లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని సిరిసిల్ల బస్టాండ్లో బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఈక్రమంలోనే పెద్దూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య భవ్యశ్రీ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిలిచిన రిజిస్ట్రేషన్లు
రామగుండం: మంచిముహూర్తం కావడం, తెల్లవారితో మూఢాలు ఆరంభం కానుండడంతో ఆస్తుల క్రయ, విక్రయదారులు, ఇతరత్రా అవసరాలు ఉన్నవారు బుధవారం పెద్ద ఎత్తున స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందే వీరు స్లాట్ బుక్చేసుకుని ఉన్నారు. అయితే, రిజిస్ట్రేషన్ కార్యాలయం తెరిచిన గంటలోపే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. రోడ్ల విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాలతో వైర్లు తెగి ఇంటర్నెట్ సేవలు నిలిచినట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. 17 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం తమ వద్దకు వచ్చినట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. ఒక్కో డాక్యుమెంట్కు సుమారు ఐదురుగు తరలి రావడంతో కార్యాలయం కిటకిటలాడింది. ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్ తిరుపతినాయక్ డాక్యుమెంట్లు మాన్యువల్గా పరిశీలించారు. రాష్ట్రంలోని రామగుండం, భూపాలపల్లి, పటాన్చెరులో కొత్తగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రత్యామ్నాయ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేదని తెలిసింది. కానరాని వసతులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది కోసం వాష్రూమ్స్ నిర్మించారు. క్రయ, విక్రయదారులకు ఆ సౌకర్యం ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో గంటల కొద్దీ నిరీక్షించిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుభముహూర్తమని భారీగా తరలివచ్చిన జనం కార్యాలయం ఎదుట నిరీక్షించిన క్రయ, విక్రయదారులు సాంకేతిక సమస్యలే కారణమంటున్న అధికారులు -
వేలం వేస్తే జైలుకే..
సిరిసిల్ల: ఊరంతా ఐక్యంగా ఉంటూ అందరికీ ఆమోదయోగ్యమైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆదర్శం. ఎన్నికలతో పల్లెల్లో ప్రశాంతత చెదిరిపోతుందనే సదాశయంతో ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకుంటే స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పారితోషికంగా రూ.10లక్షలు ఇస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుంది. కానీ డబ్బు ఉన్న పెద్దలు పదవులకు వేలం పాడితే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. అలాంటి వారు శిక్షార్హులవుతారు. గతంలో ఇలాంటి సంఘటనలో పలువురు అరెస్ట్ అయ్యారు. వేలం వెర్రి గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు బహిరంగంగానే వేలంపాటలు నిర్వహించి ఎవరూ ఎక్కువ డబ్బులు ఊరికి చెల్లిస్తే వారే సర్పంచ్ అని వేలం పాడడం చట్టవిరుద్ధం. ధనబలం ఉన్న వారు పదవులను కొనుక్కుంటే ప్రజాస్వామ్యం స్ఫూర్తి గాడితప్పుతుంది. ఇలా గ్రామాల్లో వేలంపాటలు నిర్వహిస్తే ఆ ఎన్నిక చెల్లదు. వేలం నిర్వహించిన గ్రామపెద్దలు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. 2013 గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో వేలం పాటల ఘటనే ఇందుకు సాక్ష్యం. బస్వాపూర్లో ఏం జరిగింది? 2013లో గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే బస్వాపూర్లో ధనస్వామ్యం పడగవిప్పింది. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ పదవులకు వేలం నిర్వహించారు. వేలంలో పొన్నం రవి సర్పంచ్ పదవిని రూ.4.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఉపసర్పంచ్ స్థానాన్ని లక్ష్మారెడ్డి రూ.1.50 లక్షలకు దక్కించుకున్నారు. వార్డు సభ్యుల స్థానాలను రూ.25వేల చొప్పున అమ్మకానికి పెట్టారు. ఇది బహిరంగంగానే జరిగింది. ఈ సంఘటనపై అప్పట్లో శ్రీసాక్షిశ్రీ ఆధారాలతో బట్టబయలు చేసింది. జైలుకెళ్లిన బస్వాపూర్ పెద్దలు బస్వాపూర్ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు బహిరంగంగానే పంచాయతీ పదవులకు వేలం నిర్వహించారని నిర్ధారించారు. వారి ఎన్నిక చెల్లకపోగా.. వేలం పాటలు నిర్వహించిన పెద్దలు జైలుకు వెళ్లారు. ఐదేళ్ల అవినీతికి లైసెన్స్ వేలంలో లక్షలు పోసి పదవిని కొనుక్కున్న నాయకులు రేపు ఐదేళ్ల పదవీకాలంలో అడ్డదారులు తొక్కేందుకు గ్రామస్తులే అవకాశమిస్తున్నట్లు అవుతుంది. నిజాయితీగా పల్లెలో పనిచేయాల్సిన సర్పంచ్, వార్డు మెంబర్లను ఒక రకంగా అవినీతికి పాల్పడేందుకే ప్రజలే లైసెన్స్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికవడం, మంచి వ్యక్తులను అలా ఎన్నుకోవడం శుభ పరిణామం. కానీ, ఎవరెక్కువ డబ్బులు వెచ్చిస్తే వారికే పదవి అంటూ వేలం వేయడం అవినీతి పర్వానికి రాచబాటగా మారుతుంది. ఐదేళ్ల పదవీకాలంలో సర్పంచ్ అవినీతిపై నిలదీసి అడిగే దమ్మును ఓటరు కోల్పోతున్నాడు. స్ఫూర్తిదాయకం కావాలి ఏకగ్రీవ ఎన్నిక స్ఫూర్తిదాయకం కావాలి. కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 82 గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఇందులో 25 మంది మహిళా సర్పంచులు ఎన్నికవడం విశేషం. 2013లో జరిగిన ఎన్నికల్లో 40 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 2019 గ్రామపంచాయతీ ఎన్నికల్లో 13 గ్రామాల్లో ఏకగ్రీవమయ్యాయి. అందరూ కూర్చుని మంచివారిని ఎన్నుకోవడం ఆదర్శంగా ఉంటుంది. కానీ వేలం పాటలు నిర్వహించడం నేరమనే విషయాన్ని గుర్తించాలి. సర్పంచ్, పంచాయతీ పదవులకు బహిరంగ వేలం పాటలు 2013లె బస్వాపూర్లో సర్పంచ్ పదవికి రూ.4.10 లక్షలు ఉపసర్పంచ్కు రూ.1.50 లక్షలు వార్డు సభ్యులకు రూ.25 వేలు వేలం వేసిన పెద్దల అరెస్ట్ -
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
కొడిమ్యాల(చొప్పదండి): కొడిమ్యాల మండలకేంద్రంలోని శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్ తగిలి 11 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. అప్పటివరకు ఉత్సవాల్లో కోలా టం ఆడిన ఆ చిన్నారి.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిందన్న విషయం స్థానికులను కలచివేసింది. కొడిమ్యాలకు చెందిన తిప్పరవేణి నాగరాజు, మమత దంపతుల పెద్ద కూతురు మధుశ్రీని చెప్యాల గ్రామానికి చెందిన ఆమె పెద్దమ్మ భాగ్య పిల్లలు లేకపోవడంతో ఆమె ఇంటి వద్దనే ఉంచుకుంటోంది. స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి మంగళవారం ఉదయం మధుశ్రీ కొడిమ్యాల వచ్చింది. రాత్రి సమయంలో తల్లిదండ్రులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొంది. అక్కడ అందరితో కలిసి కోలాటం ఆడింది. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో సుమారు 11.30 గంటల సమయంలో ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన లైట్సెట్టింగ్కు సంబంధించిన విద్యుత్ తీగ చిన్నారి మెడకు తాకింది. దీంతో మధుశ్రీ అ క్కడికక్కడే అపస్మారక స్థితి లోకి వెళ్లింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే కూతు రు చనిపోవడంతో తల్లిదండ్రులతోపాటు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెద్దమ్మ భాగ్య గుండెలవిసేలా రోధించారు. నూరేళ్లు నిండాయా తల్లి అంటూ విలపించడంతో స్థానికులు, భక్తులు కంటతడిపెట్టుకున్నారు. నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా..? బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ లైటింగ్ కోసం పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి నేరుగా వైర్లు తగిలించి కనెక్షన్ ఇచ్చారు. నిర్లక్ష్యంగా.. ముదు జాగ్రత్త చర్యలు పాటించకుండా వేసిన ఆ కరెంట్ వైర్లే చిన్నారి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ఆలయ కమిటీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ చిన్నారి బంధువులు బుధవారం మృతదేహంతో ఆలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై సందీప్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బంధువులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. ఇలాంటి నిర్లక్ష్యపు కనెక్షన్లపై విద్యుత్ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ప్రమాదం జరిగేది కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. మధుశ్రీ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో అపశృతి కరెంట్ షాక్ తగిలి 11 ఏళ్ల చిన్నారి మృతి న్యాయం కోసం ఆందోళన -
రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడి మృతి
కొండగట్టులో ‘సమ్మక్క’సందడి మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో సమ్మక్క, సారలమ్మ జాతర సందడి మొదలైంది. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాత్రి కొండపైనే బస చేసి వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. మంగళవారం వేలాదిమంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు, భక్తులతో కిక్కిరిసిపోయాయి. లడ్డూ, పులిహోరా విక్రయాలకు అదనంగా మరో కౌంటర్ ఏర్పాటు చేశారు. భక్తుల ప్రత్యేక దర్శనం టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయాల ద్వారా ఆలయానికి రూ.5లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, ఏఈఓ హరిహరనాథ్ పర్యవేక్షించారు. రామడుగు(చొప్పదండి): రామడుగు మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు పూరెల్ల శ్రీకాంత్గౌడ్ (35) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంగళవారం ఉదయం మృతిచెందాడు. వివరాలు.. శ్రీకాంత్గౌడ్తో పాటు రామడుగుకు చెందిన వనపర్తి అరుణ్, పూరెల్ల సురేశ్ ద్విచక్రవాహనంపై షానగర్ నుంచి రామడుగు వెళ్తుండగా గుర్తు తెలియని టిప్పర్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో శ్రీకాంత్గౌడ్ రోడ్డుపక్కన పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య సుకృత ఫిర్యాదు మేరకు ఎస్సై రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి పరామర్శ శ్రీకాంత్గౌడ్ మృతి వార్త తెలుసుకున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ మంగళవారం ఉదయం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అతడి మృతదేహానికి నివాళి అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
ఖోఖోలో తృతీయస్థానం
చౌటుప్పల్రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న 69వ స్కూల్గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి. చివరి రోజు జరిగిన సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లను తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, యాదాద్రి భువనగిరి డీఈవో సత్యనారాయణ ప్రారంభించారు. బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు ప్రథమ స్థానంలో నిలువగా.. ద్వితీయస్థానంలో మహబూబ్నగర్, తృతీయ స్థానంలో నల్లగొండ జిల్లా జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్, ద్వితీయస్థానంలో రంగారెడ్డి, తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు అధికారులు బహుమతులు అందజేశారు. డిసెంబర్ 20న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల విద్యాధికారి గురువారావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాశ్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారా యణ, శ్రీనివాస్రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపా ల్, టి.సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్తాచాటిన ఉమ్మడి జిల్లా బాలుర క్రీడాకారులు ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు -
గ్రామాల్లో పండుగ వాతావరణం
జగిత్యాల/జగిత్యాలరూరల్/రాయికల్: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను కలెక్టరేట్లో పంపిణీ చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో 2,434 ఎస్హెచ్జీలకు రూ.2.12 కోట్ల రుణాలు పంపిణీ చేసిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు, 9 మందికి కల్యాణలక్ష్మీ చెక్కులు, ఏడుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రాయికల్ మండలంలోని అల్లీపూర్లో ఎస్సీ సబ్ప్లాన్ కింద రూ.15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. శివాజీరెడ్డి గార్డెన్స్లో 142 మందికి సీఎం రిలీఫ్ ఫండ్, 35 మందికి ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు, 11 మందికి షాదీముబాకర్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జగిత్యాల రూరల్ తహసీల్దార్ రాంమోహన్, ఎంపీడీవోలు రమాదేవి, విజయలక్ష్మీ, ఎంపీవో వాసవి, రాయికల్లో సింగిల్ విండో చైర్మన్లు ఏను గు మల్లారెడ్డి, రాజలింగం, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్రావు, మోర హన్మండ్లు పాల్గొన్నారు. -
‘హైబ్రీడ్’ సాగు చేస్తున్నారా..?!
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్లో విత్తనోత్పత్తికి అనువైన పొడి వాతావరణం జిల్లాలో ఉంటుంది. దీంతో పలు ప్రైవెట్ కంపెనీలు వరి, మొక్కజొన్న, ఆవాలు, నువ్వు పంటలు పండించి ఇతర రాష్ట్రాలకు విత్తనాలుగా ఎగుమతి చేస్తుంటాయి. వరి విత్తనోత్పత్తిని వెల్గటూర్, గొల్లపల్లి, ధర్మపురి మండలాల్లో చేస్తుండగా.. మొక్కజొన్నను జగిత్యాల, మేడిపల్లి, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో, ఆవాలను జగిత్యాల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మెట్పల్లి, కథలాపూర్ ప్రాంతాల్లో చేస్తుంటారు. నువ్వులను కోరుట్ల, సారంగాపూర్, మేడిపల్లి ప్రాంతాల్లో, సజ్జను మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ ప్రాంతాల్లో పండిస్తారు. యాసంగి సీజన్లో పెద్దగా వర్షాలు ఉండవు. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా 35 నుంచి 25 డిగ్రీల సెల్సియస్లో ఉంటాయి. పొద్దంతా పొడి వాతావరణం ఉంటుంది. పరాపరాగ సంపర్కం జరిగేందుకు అనువైన మధ్యాహ్న వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలనే విత్తనోత్పత్తికి కంపెనీలు ఎంపిక చేసుకుంటాయి. ఇలా జిల్లాలో 15వేల ఎకరాల వరకు వరి, 10వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఐదు వేల ఎకరాల్లో ఆవాలు, ఐదు వేల ఎకరాల్లో నువ్వులను విత్తనోత్పత్తిగా సాగు చేస్తున్నారు. కంపెనీ విత్తనాలే.. విత్తనోత్పత్తి చేసే రైతులకు కంపెనీలే విత్తనాలు ఇచ్చి.. సాగు చేయిస్తాయి. కంపెనీ ప్రతినిధులు 15 రోజులకొకసారి వచ్చి పంటలను పరిశీలిస్తారు. వరి, ఆవాల పంటల్లో ఆడ, మగ విత్తనాలు ఇచ్చి, పంట తర్వాత ఆడ విత్తనాలను కొనుగోలు చేస్తారు. మగ విత్తనాలను రైతులు అమ్ముకోవచ్చు. సాధారణ రకాలతో పోల్చితే హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేసే రైతులకు క్వింటాల్కు రూ.500 నుంచి రూ.1000 వరకు లాభం ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే కంపెనీలు చెప్పినట్లు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడాల్సి ఉంటుంది. హైబ్రిడ్ రకాలు కాకుండా సాధారణ రకాలను కూడా కంపెనీలు రైతులతో సాగు చేయిస్తాయి. వీటిని మాములు ధర కంటే రూ.200 నుంచి రూ.300 ఎక్కువ ధర పెట్టి సీడ్ప్రాసెసింగ్ చేసి ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్ కింద కూడా అమ్ముతున్నాయి. ఏజెంట్ల ద్వారా ఒప్పందాలు విత్తనోత్పత్తి చేసే కంపెనీలు గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుంటాయి. కంపెనీలు తమ విత్తనాలకు ఇంతమొత్తం డబ్బు ఇస్తామని రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటాయి. అయితే కొన్ని కంపెనీలు పంట చేతికొచ్చిన తర్వాత మార్కెట్లో ధర లేదని పత్తా లేకుండా పోతున్నాయి. దీంతో విత్తనోత్పత్తి చేసిన రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో రైతులు ఒక్కరిగా కాకుండా.. సంఘాలుగా కంపెనీలతో నేరుగా ఒప్పందాలు చేసుకోవాలి. ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు. కంపెనీలతోనే నిబంధనలు రాసుకోవాలి. ఏ ధర చెల్లిస్తారు..? ఎప్పుడు చెల్లిస్తారు..? వంటి విషయాలన్నింటిని రాసుకోవాలి. అవసరమైతే ఆ ఒప్పందాలను మండల వ్యవసాయాధికారి లేదంటే తహసీల్దార్ వంటి అధికారుల సమక్షంలో చేసుకోవడం ఉత్తమం. కంపెనీలు, ఏజెంట్లు చెప్పుడు మాటలు వినకుండా.. స్టాంప్పేపర్పై ఇద్దరు సాక్షుల మధ్య ఒప్పందం చేసుకోవడం మంచిది. విత్తనోత్పత్తి చేసే రైతులందరు ఉమ్మడిగా కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలి. అన్యాయం జరిగినప్పుడు కంపెనీపై న్యాయం పోరాటం చేసే అవకాశం రైతుకు ఉంటుంది. ఇస్తామన్న ధర, సాగులోని ఇబ్బందులను కూడా ఆ పత్రంలో రాసుకోవడం మంచిది. – వడ్డెపల్లి భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలో మంగళవారం అనుమానాస్పదస్థితిలో మహిళ మృతిచెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. రాచర్ల గొల్లపల్ల్లికి చెందిన అందె నీరజ(25) ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం తన కుమారుడిని స్కూల్కు పంపించి, ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. నీరజ ఆడపడచు వదినతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లగా ఎంతకూ తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన ఆమె కిటికిలో నుంచి చూడగా నీరజ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె పోలీసులు, బంధువులకు సమాచారం అందించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే నీరజ మృతి చెంది ఉంది. ఈమేరకు నీరజ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రెండుసార్లు యత్నించి.. మూడోసారి ఆత్మహత్య చేసుకుని.. ● సింగరేణి రిటైర్డ్ కార్మికుడి బలవన్మరణం గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ద్వారకానగర్కు చెందిన బండారి రాములు(65) అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మంగళవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాములు కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున మృతుడి భార్య భాగ్యలక్ష్మి నిద్రలేచి చూడగా ఇంట్లో సీలింగ్ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే తన కుమారుడికి ఫోన్చేసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ సురేందర్ కేసు నమోదు చేసుకున్నారు. -
భార్యను హతమార్చిన భర్త అరెస్ట్
సైదాపూర్(హుస్నాబాద్): మాజీ భార్యను హత్య చేసిన చింతకుంట్ల మహిపాల్రెడ్డి(46)ని అరెస్టు చేసినట్లు హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. వివరాలు.. సైదాపూర్ మండలం రాములపల్లికి చెందిన మహిపాల్రెడ్డికి చెల్పూర్ పంచాయతీ పరిధి తోకలపల్లికి చెందిన సుకృతతో 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు. నేర ప్రవృత్తి కలిగిన మహిపాల్రెడ్డి భార్య ఉండగానే 2002లో ఓ యువతిని ప్రేమ పేరుతో తీసుకెళ్లాడు. ఆమె బంధువులు వెతికి ఇంటికి తీసుకెళ్లగా అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంది. ఈక్రమంలో సుకృతను తరచూ వేధించడంతో తల్లిగారింటికి వెళ్లింది. దీంతో 2009లో మహిపాల్రెడ్డి రాములపల్లికి చెందిన రమాదేవిని పెళ్లి చేసుకోగా, సుకృత కేసులు పెట్టింది. కేసులు నడుస్తుండగానే సుకృతకు మహిపాల్రెడ్డి 20 గుంటల భూమి ఇవ్వగా, కూతురు పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. సదరు భూమి తిరిగి ఇవ్వాలని ఆమెతో గొడవపడుతున్నాడు. ఈ నెల 22న మధ్యాహ్నం పొలం వద్ద సుకృతపై పెట్రోల్ పోసి తగలబెట్టి పరారయ్యాడు. మంగళవారం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈసందర్భంగా ఎస్సై తిరుపతి, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
ముంబైలో చిత్రకళా ప్రదర్శన
రుద్రంగి(వేములవాడ): ముంబై మహానగరంలోని ప్రఖ్యాత జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ కాంప్లెక్స్–హిర్జీ గ్యాలరీలో తెలంగాణ యువకుడి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ సోమవారం ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మంచె శ్రీనివాస్ తన చిత్రకళను ఈనెల 24 నుంచి 30 వరకు ప్రదర్శించనున్నారు. బృహన్ ముంబై మహానగర పాలకసంస్థ అసిస్టెంట్ కమిషనర్ అల్లే చక్రపాణి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కమిషనర్ మాట్లాడుతూ శ్రీనివాస్ గీసిన చిత్రాలు సమాజానికి సందేశాన్నిచ్చేలా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమానికి అథితులుగా స్వయం కృషి ఫౌండేషన్ సభ్యులు పిల్లమారపు గంగాధర్, ద్యావరశెట్టి గంగాధర్, శ్రీపతి శ్రీనివాస్, దేవరశెట్టి శ్రీధర్, ఆడేపు రాంమోహన్, తాటికొండ శివకుమార్, పూల రామలింగం హాజరై పట్టుదల, కృషితో చిత్రకళలో జాతీయస్థాయిలో రాణిస్తూ నేటియువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మంచె శ్రీనివాస్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గడ్డం హరీష్, శ్రీధర్, సాయి పాల్గొన్నారు. ఆకట్టుకున్న చిత్రాలు -
బ్లాస్ట్ కాదు.. నాణ్యత లోపమే..?
సాక్షి పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల – పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మధ్య మానేరుపై చెక్డ్యాం ధ్వంసం కావడానికి నాణ్యత లోపమే కారణమని పోలీస్ విచారణలో తేలినట్లు సమాచారం. అందరూ ఊహించినట్లు ఇసుక మాఫియా హస్తం లేదని విచారణలో తేలినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి గుంపుల చెక్డ్యాం కూలిన విషయం తెలిసిందే. ఇసుక తోడుకునేందుకు ఇసుక మాఫియానే జిలెటెన్స్టిక్స్తో చెక్డ్యాంను పేల్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివెనుక ఇసుక అక్రమార్కుల హస్తం ఉందని ఏకంగా ఇంజినీరింగ్ అధికారులే జమ్మికుంట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో గుంపుల చెక్డ్యాం కూలిపోవడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. కాల్వశ్రీరాంపూర్కు చెందిన ముగ్గురు జాలరులను గుర్తించి ప్రశ్నించగా.. శుక్రవారం సాయంత్రం 6.30 ప్రాంతంలో చెక్డ్యాం కూలిపోయిందని చెప్పినట్లు సమాచారం. చెక్డ్యాం కుంగినప్పుడు అక్కడే తాము ఉన్నామని ఆ మత్స్యకారులు ఇచ్చిన వాంగ్ములం ఆధారంగా దీని వెనుక ఎవరిహస్తం లేదని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీనికితోడు డ్యాంను బాంబులతో కూల్చివేసినట్లు ఆనావాళ్లు కానరాలేదని, అదేవిషయం ఫోరెన్సిక్ నివేదికలోనూ వెల్లడైనట్లు సమాచారం. బాంబలతో పేల్చితే పేలుడు పదార్థాల అవశేషాలు, పరిసర ప్రాంతాల్లో ఉపయోగించిన రసాయనాల (నైట్రోజన్ సమ్మేళనాలు, టీఎన్టీ మొదలైనవి) లభి స్తాయి. అలాగే భారీ పేలుడు జరిగినచోట గొయ్యి ఏర్పడుతుంది. ముఖ్యంగా కాంక్రీట్ రంగు మారడం, పగుళ్లపొరలుగా ఊడిపోవడం, పేలుడు పరికరాల భాగాలు.. అంటే స్విచ్లు, వైర్లు, టైమర్లు, సర్క్యూట్ బోర్టుల వంటివి పేలుడు ప్రదేశంలో లభిస్తాయి. కానీ, ఇవేమీ డ్యాం కూలిన ప్రదేశంలో కనిపించలేదని పోలీస్, ఫోరెన్సిక్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. దీంతో కేవలం డిజైన్, నాణ్యత లోపమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఉపనదులు, వాగుల నీటి ప్రవాహాలను ఆపి, నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చెక్డ్యాంలను నిర్మించింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 16 చెక్డ్యాంలను రూ.128 కోట్లతో గత ప్రభుత్వం హయాంలో నిర్మించారు. అయితే, నిర్మాణ సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, డిజైన్ లోపాలు, నిర్మాణ ప్రదేశం ఎంపికలో లోపాలతో పలు చెక్డ్యాంలు వరదల సమయంలో కొట్టుకపోయాయని, ప్రస్తుత చెక్డ్యాం సైతం కూలిపోవడానికి అదే కారణమని అధికారులు చెబుతున్రాఉ. దీంతోనే పెద్దపల్లి నియోజకవర్గంలో 13 చెక్డ్యాంలు నిర్మిస్తే 8 చెక్డ్యాంలు కృంగిపోయాయని గుర్తించినట్లు సమాచారం. చెక్డ్యాంకు బాంబులు పెట్టి పేల్చిన ఆనవాళ్లు కనబడటంలేదని, డ్యాంకు మధ్య, ముందు భాగంలో బుంగలు ఏర్పడడంతో చెక్డ్యాం కూలిపోయిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీస్ ఉన్నాతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. గుంపుల చెక్డ్యాం కుంగుబాటుకు కారణం నాణ్యత లోపమే ఫోరెన్సిక్ నివేదికలో కానరాని బ్లాస్టింగ్ ఆనవాళ్లు పోలీస్ విచారణలో ప్రత్యక్ష సాక్షుల వాంగ్ములం -
జాతీయ కబడ్డీ పోటీలకు కీర్తన
కరీంనగర్స్పోర్ట్స్: హరియాణా రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరిగే 35వ జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీలకు కరీంనగర్ కోతిరాంపూర్లోని ప్రభు త్వ ఉన్నత పాఠశాల సవరన్ విద్యార్థిని కీర్తన ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ లింగారావు తెలి పారు. ఇటీవల రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి జాతీయ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో కీర్తనను హెచ్ఎం సతీశ్, ఉపాధ్యాయులు అభినందించారు. ధర్మపురి: ధర్మపురి మండలం జైనా సింగిల్ విండో సొసైటీ కార్యదర్శి సాగర్రావును సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి మనోజ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోని దమ్మన్నపేట కొనుగోలు కేంద్రాన్ని ఇటీవల అదనపు కలెక్టర్, పౌర సరఫరాల అధికారి సందర్శించారు. ఆ సమయంలో రైస్మిల్లులకు ధాన్యం తరలించే విషయమై కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనలో నిర్వాహకుడిని ఇప్పటికే తొలగించారు. తాజాగా సొసైటీ కార్యదర్శి సాగర్రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుప్త నిధుల పేరిట మోసంకోనరావుపేట(వేములవాడ): ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయంటూ, వెలికి తీయాలని రూ.4లక్షలు వసూలు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రశాంత్రెడ్డి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన దుగ్గు వేణు ఇంట్లో బంగారు నిధులు ఉన్నాయని సిరిసిల్ల శివారులోని పెద్దూరుకు చెందిన మేకల నరేశ్, కడవంచ ప్రసాద్, సదుల దేవేందర్, సదుల రాజేశం నమ్మబలికారు. వాటిని బయటకు తీయాలంటే ఖర్చు అవుతుందని నమ్మబలుకుతూ పలుమార్లు కలిపి రూ.4.08లక్షల వరకు వసూలు చేశారు. తర్వాత ముఖం చాటేయడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు కోనరావుపేట పోలీసులను మంగళవారం ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేశారు. చెరుకు తోట దగ్ధంబోయినపల్లి(చొప్పదండి): వరికొయ్యలు కాలు స్తున్న క్రమంలో మంటలు వ్యాపించడంతో రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం స్తంభంపల్లికి చెందిన పులి లక్ష్మీపతికి చెందిన ఆరు ఎకరాల చెరుకుతోట దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాలు. ఆరు ఎకరాల మేర చెరుకు తోట కోతకు వచ్చింది. సమీప పొలంలో వరికొయ్యలు కాల్చడంతో మంటలు చెరుకుతోటలోకి వ్యాపించాయి. ఆరు ఎకరాల మేర చెరుకుపంట కాలిపోయింది. స్థానికులు ఫైరింజన్కు సమాచారం ఇవ్వగా వారు వచ్చే వరకే మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోయింది. తనకు రూ.7లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు రోదిస్తూ తెలిపాడు. ‘ఓలా’ షోరూం ఎదుట ఆందోళన జగిత్యాలటౌన్: వాహన చట్టం ప్రకారం సర్వీస్ అందించని ఓలా కంపనీ అనుమతులు రద్దు చేయాలంటూ వినియోగదారులు జగిత్యాలలోని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూం ఎదుట ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాల నుంచి మంగళవారం షోరూంకు వచ్చిన కస్టమర్లు వాహన సర్వీస్ ఆలస్యంపై నిర్వాహుకులను నిలదీశారు. కంపెనీ నుంచి విడిభాగాలు సరఫరా కావడం లేదని వారు చెప్పడంతో ఆగ్రహంతో షోరూంషెట్టర్లు మూసి తాళం వేసి నిరసన తెలిపారు. నాలుగు నెలలుగా వాహనాలు మరమ్మతు చేయడం లేదని, షోరూంలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
పరిశ్రమలు కావు.. పక్కలో బాంబులు
సింగరేణి గనులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, ఓపెన్కాస్ట్ల వల్ల ఉపాధి సంగతేమో కానీ, మా గోదావరిఖని పరిసర ప్రాంతాల పక్కలో బాంబుల్లా మారాయి. ఆర్ఎఫ్సీఎల్ నుంచి లీకవుతున్న విష వ్యర్థాలు నీరు, గాలిలో కలుస్తున్నాయి. ఫలితంగా స్థానికులకు శ్వాసకోస, కేన్సర్ తదితర వ్యాధులు వస్తున్నాయి. ఓపెన్కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల వీర్లపల్లి వాసులకు వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా ప్రభావిత ప్రాంతాల్లో సింగరేణి, ఇతర సంస్థలు ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. ఆర్ఎఫ్సీఎల్ నుంచి విషవాయువులు వదిలినప్పుడు ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. – ప్రవీణ్, విఠల్నగర్, గోదావరిఖని -
రామగుండమా..! ఊపిరి పీల్చుకో!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రామగుండం.. అంటే ఇంతకాలం ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి గనులు, బసంత్నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలు, ఓపెన్కాస్ట్లు ప్రపంచానికి తెలిసింది ఇంతే! కొంతకాలంగా పెరుగుతున్న కేన్సర్ కేసులకు రామగుండం పారిశ్రామిక పాంతం నిలయంగా మారుతోందన్న విషయం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల రామగుండం ప్రాంతంలోని దాదాపు 10 గ్రామాల్లో ప్రజలకు వైద్యశిబిరాల ద్వారా ప్రభుత్వ సహకారంతో రక్తనమూనాలు సేకరించారు. ఇందులో దాదాపు 183 మందికి ప్రీకేన్సర్ లక్షణాలు కనిపించగా 30 మంది వరకు కేన్సర్ అనుమానిత కేసులు ఉన్నాయన్న ప్రచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో వాయుకాలుష్యం పెరిగిన మాట వాస్తవమే. ఫలితంగా వాయునాణ్యత రోజురోజుకు దిగజారిపోతుంది. సాధారణంగా వాయు నాణ్యత 5 ఏక్యూఐ యూనిట్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం సగటున రామగుండం పరిసరాల్లో 180 నుంచి 1,200 వరకు ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) యూనిట్లను తాకుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరిగింది? దాదాపు ఐదు దశాబ్దాలుగా రామగుండంలో వాయుకాలుష్యం సాధారణ విషయమే. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు, దాని ఆధారిత ఎన్టీపీసీ ప్రాజెక్టులు, వాటి నుంచి ఉత్పత్తి అవుతున్న ఫ్లైయాస్, ఓపెన్కాస్ట్ బ్లాస్టింగులు, సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల గాలిలోకి రోజుకు టన్నుల కొద్దీ కార్బన్యాకై ్సడ్, కార్బన్ మోనాకై ్సడ్, సల్ఫర్ తదితర విషవాయువులు వెలువడుతున్నాయి. వీటికితోడు ఇక్కడ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పలు కొత్త పవర్ ప్రాజెక్టులు, ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ పునఃప్రారంభంతో గాలిలోకి కార్బన్మోనాకై ్సడ్, అమోనియా లీకేజీలు పెరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ నుంచి రాత్రిపూట అమోనియా లీకై న సందర్భంలో పరిసరాల్లోని గోదావరిఖని, వీర్లపల్లి, ఎలకలపల్లి, ఎన్టీపీసీ, గౌతమినగర్ తదితర 10 గ్రామాల్లో ప్రజలకు ఊపిరి ఆడని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక వాతావరణంలోకి విడుదలవుతున్న వ్యర్థాల విషయంలో పీసీబీ పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నా.. పెద్దగా స్పందించిన దాఖలాలు కానరావడం లేదు. ఎక్కడెక్కడ రక్తపరీక్షలు నిర్వహించారు? పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో, రోహిణి ఫౌండేషన్, ఎన్టీపీసీ రామగుండం, స్థానిక పోలీసుల సహకారంతో రామగుండం ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో నోటి కేన్సర్ పరీక్షా శిబిరాలు నిర్వహించారు. శిబిరాల్లో మొత్తం 5,000 మందిని పరీక్షించగా, 183 మందిలో ప్రీకేన్సర్ లక్షణాలు, అలాగే 20 మందిలో కేన్సర్ అనుమానిత కేసులను గుర్తించారు. రోజురోజుకు పెరుగుతున్న వాయు, నీరు, నేల కాలుష్యాల కారణంగా ప్రభావితమవుతున్న ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు రామగుండం మండలం కుందన్పల్లి, మల్యాలపల్లి, బ్రాహ్మణపల్లి, లక్ష్మీపూర్, విఠల్నగర్, ఎల్కపల్లి, అంతర్గాం, నరసలపల్లి పరిసర గ్రామాల్లో నివసిస్తున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. పరీక్షల ఫలితాల అనంతరం అనుమానిత కేసులను తదుపరి పరీక్షలు, చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డెంటల్ ఓపీకి పంపించారు. ప్రమాదకరస్థాయిలో వాయుకాలుష్యం తీవ్రత జీవించడానికి వీలు లేకుండా వాయు నాణ్యత 170–1,200 యూనిట్లు తాకుతున్న ఎయిర్క్వాలిటీ ఇండెక్స్ పెరుగుతున్న కేన్సర్ కేసులతో ఆందోళనలో ప్రజలు రామగుండంలో 10 గ్రామాల్లో 5,000 మందికి రక్త పరీక్షలు 183 మందికి ప్రీక్యాన్సర్ లక్షణాలు గుర్తించిన రోహిణీ ఎన్జీవో -
సహస్ర లింగాలయంలో పూజలు
జగిత్యాలరూరల్: పొలాస శివారులోని సహస్ర లింగాల ఆలయంలో మంగళవారం శ్రీగురుదత్తాత్రేయస్వామి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నలమాసు గంగాధర్, భక్తులు పాల్గొన్నారు. వరి కొయ్యలు కాల్చితే భూసారానికి ముప్పుజగిత్యాలఅగ్రికల్చర్: వరి కొయ్యలు కాల్చితే భూసారానికి ముప్పు వాటిల్లుతుందని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ సూచించారు. జగిత్యాలరూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. వరి కొయ్యలు కాల్చడం ద్వారా భూమిని సారవంతం చేసే వానపాములు అధిక ఉష్ణోగ్రతల వల్ల చనిపోతాయన్నారు. రైతుల ఊపిరతిత్తులు, అలర్జీ ఇబ్బంది కలుగుతుందన్నారు. నీటి నిల్వ శక్తి తగ్గిపోతుందన్నారు. ఆయన వెంట జిల్లా ఉద్యానశాఖాధికారి శ్యాంప్రసాద్, టెక్నికల్ ఏడీ రాజులనాయుడు ఉన్నారు. మొరం, గ్రానైట్ తీస్తే చర్యలుజగిత్యాలరూరల్: అనుమతి లేకుండా మొరం, గ్రానైట్ తీస్తే చర్యలు తప్పవని జిల్లా మైనింగ్ అధికారి జైసింగ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సింగాపూర్లోని సర్వే నంబరు 437 పరిసర ప్రాంతాలు, ప్రభుత్వ భూముల నుంచి మొరం, గ్రానైట్ తీసేందుకు ఎలాంటి అనుమతులూ లేవని, ఎవరైనా తరలిస్తే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వ భూమిలో హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ వైద్యాధికారిగా జైపాల్రెడ్డిమెట్పల్లి: జిల్లా డిప్యూటీ వైద్యాధికారిగా జైపాల్రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఈయన జిల్లా మాతాశిశు సంరక్షణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదనంగా మెట్పల్లి డివిజన్ డిప్యూటీ వైద్యాధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు మంళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీపీవోగా రఘువరణ్జగిత్యాలరూరల్: డీపీవోగా డీఆర్డీఏ పీడీ రఘువరణ్ను నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీపీవో రేవంత్ శిక్షణలో ఉండడం.. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో రఘువరణ్కు పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రూ.10.69 కోట్ల వడ్డీలేని రుణంజగిత్యాల: సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు శుభవార్త ఇచ్చింది. గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీని విడుదల చేసింది. జిల్లాకు రూ.10.69 కోట్లు వచ్చాయి. ఈ వడ్డీ రాయితీ గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉండగా.. తాజాగా విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే ప్రభుత్వం విడుదల చేసింది. నియోజకవర్గాల వారిగా మంగళవారం నుంచే పంపిణీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కోడ్ రాకముందే రాయితీ సొమ్మును ఇస్తున్నారు. -
జగిత్యాల
32.0/16.07గరిష్టం/కనిష్టంరామగుండం.. అంటే ఇంతకాలం ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి గనులు, బసంత్నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలు, ఓపెన్కాస్ట్లు ప్రపంచానికి తెలిసింది ఇంతే! 8లోuవాతావరణం పొడి వాతావరణం ఉంటుంది. పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. సాయంత్రం చలిగాలులు వీస్తాయి. బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
పొలం.. నిస్సారం
గొల్లపల్లి: అన్నం పెట్టే అన్నదాతలు ప్రకృతిని పట్టించుకోవడం లేదు. పంట బాగా పండితే చాలన్నట్లు.. మోతాదును మించి ఎరువులు చల్లుతున్నారు. అధిక దిగుబడి కోసం యూరియాను అధికంగా వేస్తున్నారు. ఫలితంగా పర్యావరణానికి నష్టం కలగడంతోపాటు నేల నిస్సారంగా.. నీరు కలుషితం అవుతోంది. మరోవైపు చీడపీడలు పెరిగి పంట దిగుబడులూ తగ్గిపోతున్నాయి. పెట్టుబడి పెరిగి తిరిగి భారం పడుతున్నా.. ఆ విషయాన్ని మాత్రం రైతులు గమనించడం లేదు. కొన్నాళ్లుగా యూరియా అమ్మకాల తీరు చూస్తే రైతులు విచ్చలవిడిగా వాడుతున్నట్లు తేలింది. ఎకరానికి నాలుగైదు బస్తాలు.. జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉంది. ఇందులో అత్యధికంగా వరి 2.90 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. మొక్కజొన్న 42 వేల ఎకరాలు, మిగిలిన ఎకరాల్లో పత్తి, వేరుశనగ, మినుములు, కందులు, పెసలు వంటి పప్పుదినుసులతోపాటు కూరగాయల తోటలున్నాయి. వరి, మొక్కజొన్న పంటలకు రైతులు అత్యధికంగా యూరియా వినియోగిస్తున్నారు. వాస్తవానికి ఎకరాకు రెండునుంచి మూడు బస్తాల యూరియా వినియోగించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నా.. రైతులు మాత్రం ఏకంగా ఐదు నుంచి ఆరు బస్తాలు చల్లుతున్నారు. నానో యూరియా వినియోగించాలని చెప్పినప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. యూరియా సంప్రదాయ ఎరువుగా మారిపోయింది. రైతులు దీనికే అలవాటు పడి మోతాదుకు మించి వేస్తున్నారు. ఫలితంగా భూములు సారం కోల్పోయే ప్రమాదం ఉంది. పంట ఉత్పాదక శక్తి కూడా తగ్గుతుంది. నీరు, గాలి, నేల కలుషితం అవుతాయి. యూరియా ఎంత వేసినప్పటికీ కేవలం 30 శాతమే మొక్క తీసుకుంటుంది. రైతులు ఆలోచించి యూరియాను మోతాదులో వాడాలి. నానో యూరియాతో ప్రకృతికి నష్టముండదు. – భాస్కర్, డీఏవో -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
పెగడపల్లి: మహిళల ఆర్థికాభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో స్వశక్తి సంఘాల మహిళలకు రూ.78 లక్షల విలువైన వడ్డీలేని రుణాల చెక్కులను కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 11,825 సంఘాలకు రూ.10.69 కోట్లు వడ్డీలేని రుణాలు విడుదలయ్యాయని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఆర్డీవో మదుసూధన్, డీఆర్డీవో రఘువరన్, ఎంపీడీవో ప్రేమ్సాగర్, తహసీల్దార్ ఆనంద్కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలకు బీసీ సంఘాలు సహకరించాలి గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు బీసీ సంఘాలు సహకరించాలని మంత్రి కోరారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారంపై దృష్టి గొల్లపల్లి: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఇళ్ల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్లను మార్చేందుకు రూ.4.30కోట్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. మండలంలోని శ్రీరాములపల్లిలో రూ.60 లక్షలతో 33 కేవీ, 11కేవీ లైన్లు మార్పు పనులను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. లైన్ల మార్పుతో ప్రజల భద్రత, సౌకర్యం మరింత మెరుగవుతాయన్నారు. ఎస్ఈ సుదర్శనం, డీఈ గంగారం, విద్యుత్ శాఖ అధికారులు వరుణ్కుమార్, అబ్దుల్ మజీద్, రాకేష్కుమార్, ఏఈలు పాల్గొన్నారు. నిరుపేదల సంక్షేమానికి కృషి నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. మండలానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి కింద రూ.60 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరా మహిళ శక్తి చీరలను అందించారు. -
శిశుమరణాలు తగ్గించాలి
జగిత్యాల: శిశుమరణాలు తగ్గించాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. వైద్య కళాశాలలో మాతాశిశు సంరక్షణ నవజాత శిశువుల సంరక్షణపై మంగళశారం శిక్షణ ఇచ్చారు. శిశు మరణాల రేటు వెయ్యి సజీవ జననాలకు 24గా ఉందని, దీనిని 10లోపు తీసుకురావాలన్నారు. సీ్త్రలకు కౌమారదశ నుంచే ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. ప్రజల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఆశాకార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. గర్భధరించిన 12 వారాల్లోపు రిజిస్ట్రేషన్ చేసి ధనుర్వాతం రాకుండా నెల విరామంతో టేటానస్ డిప్తిరియా డోస్ ఇవ్వాలన్నారు. ఆకుకూరలు, కూరగాయలు తినాలని సూచించారు. డెలివరీ అయిన వెంటనే పిల్లలకు ముర్రుపాలు పట్టించేలా అవగాహన కల్పించాలన్నారు. మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ ఎంజీ.కృష్ణమూర్తి, అరుణకుమారి, జైపాల్రెడ్డి, స్వరూప పాల్గొన్నారు. -
భక్తుల కొంగుబంగారం ‘దొంగ మల్లన్న’
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేట శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. దొంగమల్లన్న, షష్ఠి మల్లన్నగా ప్రసిద్ధి చెందిన స్వామివారి జాతర ఏటా మార్గశిర మాస శుద్ధపంచమి నాడు ప్రారంభమవుతుంది. ఏడు వారాల పాటు కొనసాగుతుంది. ఇక్కడ తమ్మిడి కులస్తులు పూజలు చేస్తారు. బుధవారం దండివారంతో జాతర ప్రారంభమవుతుంది. 27న నాగవెల్లి, పెద్దపట్నం, అగ్ని గుండాలు, ఈనెల 30 నుంచి డిసెంబర్ 17వరకు ప్రతి ఆదివారం, బుధవారం ఉత్సవాలు నిర్వహిస్తారు. 18 మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, చండీహవనం, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. దొంగమల్లన్న జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు, ఈవో విక్రమ్, ఫౌండర్ ట్రస్టీ శాంతయ్య, ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్ తెలిపారు. -
కాంగ్రెస్ అంటేనే‘స్కాం’గ్రెస్
జగిత్యాల: కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అని, స్వా తంత్య్రానికి ముందు బ్రిటిష్వారు దోచుకుంటే.. వచ్చాక కాంగ్రెస్ దోచుకుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకొచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వం చేసిందేమీలేద న్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ను తిట్టడం, కాళేశ్వరంలో అవినీతి అంటూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఏం సాధించిందన్నారు. రియ ల్ ఎస్టేట్ బ్రోకర్లాగా సీఎం రేవంత్రెడ్డి భూముల ను అమ్మకానికి పెట్టడారన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమిలో ఎకరాకు రూ.100 కోట్ల స్కాం జరుగుతోందన్నారు. కేసీఆర్ ఫార్మాసిటీని 14 వేల ఎకరాల్లో పెడితే.. ఫ్యూచర్ సిటి అంటూ సీఎం అమ్ముతున్నాడని పేర్కొన్నారు. మొత్తంగా రూ.5లక్షల కోట్ల స్కాం చేస్తున్నాడని తెలిపారు. ఆయన వెంట చీటి వెంకట్రావు, సాయిరెడ్డి, దశరథరెడ్డి, చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. సెల్ఫోన్కు బదులు చెస్ ఆడాలి కోరుట్ల: విద్యార్థులు సెల్ఫోన్తో కాకుండా చెస్కు అలవాటుపడితే ఏకాగ్రత పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో చెస్బోర్డులు పంపిణీ చేశారు. చెస్ నెట్ వర్క్ ఫౌండేషన్ సహకారంతో 15మంది విద్యార్థులకు ఒక చెస్ బోర్డు అందిస్తామన్నారు. ఎంఈఓ గంగుల నరేశం, చెస్ నెట్ వర్క్ ఫౌండర్ సుదీర్ కోదాటి, రవి మయిరెడ్డి, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడల్లో రాణించాలి మెట్పల్లి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని మినీ స్టేడియంలో అస్మిత్ లీగ్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. అండర్–14, 16 విభాగాల్లో రన్నింగ్, షాట్ఫుట్, జావెలిన్ త్రో, హైజంప్, లాంగ్ జంప్ నిర్వహించారు. 680 మంది బాలికలు హాజరయ్యారు. డీఎస్పీ రాములు, ఎంఈఓ చంద్రశేఖర్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి ఉన్నారు. వృద్ధురాలిని చూసి చలించిన ఎమ్మెల్యే కోరుట్లరూరల్: పట్టణంలోని కల్లూర్ రోడ్ పక్కన తలదాచుకుంటున్న ఓ వృద్ధురాలిని చూసిన ఎమ్మెల్యే చలించిపోయారు. బాలికల పాఠశాలలో చెస్ బోర్డులు పంపిణీ చేసి వెళ్తూ.. ఓ భవనం వద్ద ఆరుబయట పాత బట్టలు, సామగ్రితో కూర్చున్న వృద్ధురాలిని గమనించి ఆమె వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకొన్నారు. కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామమని, భర్త మృతి చెందారని, పిల్లలెవరూ పట్టించుకోవటం లేదని, గ్రామంలో ఎవరూ తనకు ఇట్లు అద్దెకివ్వటం లేదని పేర్కొంది. కోరుట్లకు వచ్చి ఇక్కడే ఉంటున్నానని, ఎవరైనా భోజనం పెడితే తింటున్నా.. లేకుంటే పస్తులుంటున్నానని పేర్కొంది. దీంతో ఎమ్మెల్యే వెంటనే ఆర్డీవో జివాకర్రెడ్డికి ఫోన్ చేశారు. వృద్ధురాలికి న్యాయం చేయాలని, లేకుంటే షెల్టర్ హోంకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
అతివలకు అందలం
జగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికారులు గ్రామాలవారీగా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ నివేదికకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఆమోదం కూడా తెలిపింది. ఈ రిజర్వేషన్లలో ఈ సారి మహిళలకు పెద్దపీట వేసినట్లయ్యింది. జిల్లాలో మొత్తం 385 గ్రామపంచాయతీలు ఉండగా.. మహిళలకు 174 స్థానాలు కేటాయించారు. అలాగే జనరల్కు కేటాయించిన 211 స్థానాల్లోనూ పురుషులతోపాటు మహిళలు పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ లెక్కన అత్యధిక స్థానాల్లో మహిళలే పోటీ చేయనున్నారు. వార్డుల్లో కూడా మహిళల సంఖ్యనే ఎక్కువగా కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 3,536 వార్డులు ఉండగా మహిళలకు 1524 వార్డులు కేటాయించారు. అలాగే పురుషులతోపాటు మహిళలకు 2014 వార్డులు కేటాయించారు. మహిళా రిజర్వేషన్తోపాటు, జనరల్ స్థానాల్లోనూ పోటీకి అవకాశం ఉండటంతో వారు 50 శాతం కంటే మించి వార్డులు, సర్పంచ్ స్థానాలు దక్కించుకోనున్నారు. రాయికల్లో అత్యధిక పంచాయతీలు జిల్లాలో అత్యధిక గ్రా మపంచాయతీలు ఉ న్న మండ లంగా రాయికల్ నిలుస్తోంది. ఇక్కడ 32 గ్రామాలు ఉన్నాయి. రెండోస్థానంలో జగిత్యాలరూరల్ మండలం ఉంది. ఇక్కడ 29 గ్రామ పంచాయతీలున్నాయి. అతితక్కువ గ్రామపంచాయతీలు జగిత్యాల అర్బన్లో ఉన్నాయి. ఇక్కడ కేవలం ఐదు పంచాయతీలే ఉన్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి విడతలో కోరుట్ల, మేడిపల్లి (వేములవాడ నియోజకవర్గం) మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల్లో.. మూడో విడత ధర్మపురి నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. -
ఇళ్లు కేటాయించండి
నూకపల్లిలో డబుల్ ఇళ్లు కేటాయించాలంటూ పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చారు. అర్హత ఉన్నా త మకు ఇళ్లు రావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇందిరమ్మ స్థలాన్ని తీసుకుని ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చిన అధికారులు ప్రస్తుతం ఇళ్లు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. – డబుల్ ఇళ్ల ఆశావహులు ఎంపీటీసీ స్థానం ఇవ్వండి మాది మల్లాపూర్ మండలం ఓబులాపూర్. ధర్మాజిపల్లి, సంగెంశ్రీరాంపూర్, ఓబులాపూర్, ఓబులాపూర్ తండాలతో ఎంపీటీసీ స్థానం ఉంది. పరిధి, జనాభా అధికంగా ఉండటంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఓబులాపూర్, పక్కనేఉన్న తండాను కలిసి కొత్త ఎంపీటీసీ స్థానం ఏర్పాటు చేయండి. – ఓబులాపూర్ గ్రామస్తులు జీవనాధారం కోల్పోతున్నాం మాది సారంగాపూర్ మండలం నాగునూర్. ముదిరాజ్ కులస్తులు చేపల పెంపకానికి మా ప ట్టాభూముల్లో నీటిని నిల్వచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్వీకుల నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. సుమారు 40నుంచి 50ఎకరాల పట్టాభూములు కోల్పోయే ప్రమాదం ఉంది. పంట భూముల్లో నీరు నిల్వ చేయకుండా చూడండి. – నాగునూర్ రైతులు -
జగిత్యాల
31.0/16.07గరిష్టం/కనిష్టంకళాకారుల నృత్యనివేదన శివుడికి ప్రీతిపాత్రం నృత్యం. పరమేశ్వరుడు అంతగా ఇష్టపడే నృత్యనివేదనను కళాకారులు ఇటీవల కనులపండువగా నిర్వహించారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. నృసింహుని సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామివారి సన్నిధి సోమవారం భక్తులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
కొనుగోలు కేంద్రం పరిశీలన
వెల్గటూర్:ఎండపల్లి మండలం గుల్లకోటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. తూకం వేసి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డీఆర్డీవో రఘువరన్, తహసీల్దార్ అనిల్, కేంద్రాల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలుజగిత్యాలక్రైం:బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరుగురు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. సీఎంఆర్ సేకరణకు కేంద్రం గ్రీన్సిగ్నల్జగిత్యాలరూరల్: గత యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి రైస్మిల్లర్లకు అప్పగించిన విషయం తెల్సిందే. ఆ ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి కేంద్రం సీఎంఆర్ (కస్టమ్మిల్లింగ్ రైస్) సేకరించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మిల్లర్ల నుంచి సుమారు 1.90 లక్షల టన్నుల బియ్యాన్ని 2026 ఫిబ్రవరి 28 వరకు సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రోజులుగా బియ్యం అప్పగించేందుకు ఎదురుచూస్తున్న మిల్లర్లకు కేంద్రం నిర్ణయం ఊరటనిచ్చిట్లయ్యింది. మిల్లర్లంతా ఫిబ్రవరి 28లోపు ఎఫ్సీఐకి బియ్యం అప్పగించాలని జిల్లా అధికారులు సూచించారు. మైనార్టీ గురుకులం విద్యార్థుల ఆందోళన జగిత్యాలక్రైం: తమను ఇన్చార్జి ప్రిన్సిపాల్ రవికుమార్ ఇష్టారీతిన తిడుతున్నారని, ఒక్కోసారి కొడుతున్నారంటూ జిల్లా కేంద్రంలోని ఖిలాగడ్డలోగల మైనార్టీ బాలుర గురుకులం విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. పదో తరగతి విద్యార్థులు పాఠశాల ముందే ఆందోళనకు దిగారు. విద్యార్థులకు రవికుమార్ క్షమాపణ చెప్పినా వినిపించుకోలేదు. పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి పిల్లలకు నచ్చజెప్పి క్లాస్లకు పంపించారు. ఎన్నికల్లో విజయం సాధించాలిజగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల వారీగా పార్టీ పరిస్థితి, అభ్యర్థుల విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల సందర్భంలో పొరపాటుగా తొలగించిన ఓట్లను గుర్తించి అధికారులకు తెలియచేయాలన్నారు. ప్రజల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉందన్నారు. నాయకులు శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోడ తొలగించండి
జగిత్యాల మండలం తిప్పన్నపేట శివారు సర్వే నంబర్ 375లోని 93గజాల మా సొంత భూమిలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మించారు. హెచ్ఎంను సంప్రదిస్తే స్పందించడం లేదు. స్థలాన్ని ఎన్నాకుల సత్తయ్య నుంచి దస్తావేజు నంబర్ 2723/ 2023 తేదీ 25–05–2013ద్వారా కొనుగోలు చేశాం. ప్రైమరీ స్కూల్ వారు నా సొంత స్థలంలో నిర్మించిన గోడను తొలగించేలా చూడండి. – వావిలాల రమాదేవి జగిత్యాల ధాన్యంలో తరుగు వద్దు మాది మెట్పల్లి మండలం కోనరావుపేట. మెట్లచిట్టాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రంలో రైస్మిల్లర్, సొసైటీ చైర్మన్ కలిసి సంచికి 2కిలోల తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారు. తరుగు లేకుండా ధాన్యం సేకరించేలా చూడండి. – కోనరావుపేట గ్రామస్తులు లేబర్ కోడ్లతో భద్రత కరువు కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో అసంఘటిత రంగంలో ఉన్న మాకు ఉద్యోగ భద్రత కరువైంది. మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయండి. – మెడికల్ రిప్రజెంట్లు -
బీసీలకు తగ్గిన రిజర్వేషన్
జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఇటీవలే రిజర్వేషన్లు ఖరారైన విషయం తెల్సిందే. తాజాగా కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రతిపాదికన.. బీసీలకు డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియను రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలోనే చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 50 శాతం మించొద్దన్న కోర్టు ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. జిల్లాలో 20 మండలాలు.. 385 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ల స్థానాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిలో పూర్తి చేశారు. వాటి ఆధారంగా మహిళలకు రొటేషన్ పద్ధతిలో లాటరీ ద్వారా కేటాయించారు. గెజిట్ విడుదల.. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో జాబితాల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. నోటిఫికేషన్ రాగానే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగనుంది. ఆశావహుల్లో ఉత్సాహం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ఉత్సాహంతో ఉన్నారు. కొందరికి రిజర్వేషన్ కలిసి వచ్చినప్పటికీ.. మరికొందరికి శాపంగా మారాయి. పోటీ చేద్దామనుకున్న వారికి రిజర్వేషన్ కలిసిరాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. బీసీలకు మొదట 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే. రెండురోజుల పాటు నామినేషన్లను స్వీకరించారు. హైకోర్టు వాటిని రద్దు చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా 50 శాతం మించి రిజర్వేషన్ ఇవ్వకూడదన్న కోర్టు నిబంధన మేరకు బీసీలకు రిజర్వేషన్ స్థానాల సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా ఆశావహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. అప్పటి లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో పెద్దగా తేడా లేకపోయినప్పటికీ బీసీ కేటగిరీ స్థానాలు భారీగా తగ్గాయి. జనరల్ స్థానాలు మాత్రం పెరిగాయి. ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో అవకాశం వచ్చిన ఆశావహులు ఇప్పటినుంచే ప్రచారం చేస్తున్నారు. అన్నా.. ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రాధేయపడుతున్నారు. మొదటిసారి ఎన్నికలు వాయిదాపడటంతో కొంతమేర ఆశావహుల్లో ఆసక్తి తగ్గిపోయింది. మళ్లీ రిజర్వేషన్లు ఖరారై నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. గ్రామాల్లో సందడి -
ఇందిరమ్మ చీరల పంపిణీ
కథలాపూర్: స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. రేషన్కార్డు ఉన్న ప్రతి మహిళకూ చీరలు ఇస్తామన్నారు. ఈ ప్రాంతంలో లోవోల్టేజీ సమస్య ఉండొద్దని కొత్తగా 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేశామన్నారు. సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్పర్సన్ పులి శిరీష, డైరెక్టర్లు వాకిటి రాజారెడ్డి, జవ్వాజి చౌదరి, కాయితి నాగరాజు, విజయ్, లింగంగౌడ్ పాల్గొన్నారు. అర్హులందరికీ చీరలు మేడిపల్లి: అర్హులందరికీ ఇందిరా మహిళ శక్తి చీరలు అందిస్తామని విప్ అన్నారు. మేడిపల్లి, భీమారం మండలాల్లో చీరలు పంపిణీ చేశారు. 25 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించారు. పార్టీ మండలాల అధ్యక్షులు ఏనుగు రమేశ్ రెడ్డి, సింగిరెడ్డి నరేశ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు తదితరులుపాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ టెక్నికల్ డీఈగా అంజయ్యజగిత్యాలఅగ్రికల్చర్: ఎన్పీడీసీఎల్ టెక్నికల్ డీఈ గా ఎన్.అంజయ్య నియమితులయ్యారు. సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎధ్యీ సుదర్శనంను మర్యాదపూర్వకంగా కలిశారు. అంజయ్యకు ప లువురు శుభాకాంక్షలు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లతో కల సాకారం
గొల్లపల్లి: ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలకేంద్రానికి చెందిన ఆవుల సాయవ్వ సోమవారం గృహప్రవేశం చేయగా మంత్రి పాల్గొన్నారు. మాట్లాడారు. అర్హులందరికీ ఇల్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందన్నారు. ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని బిల్లులు పొందాలన్నారు. కలెక్టర్ బి.సత్యప్రసాద్తో కలిసి సాయవ్వ ఇంట్లో భోజనం చేశారు. అధికారులు, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం వెల్గటూర్: మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి అన్నారు. ఎండపల్లి మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేశారు. మహిళల ఆత్మగౌరవం పెంపొందించే లక్ష్యంతో చీరలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఏఎంసీ చైర్పర్సన్ గోపిక, ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరన్, తహసీల్దార్ అనిల్, ఎంపీడీవో కృపాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మోహన్రావుపేటలో..కోరుట్లరూరల్: మండలంలోని మోహన్రావుపేటలో కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు చీరలను మంత్రి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం చీరలు ఇస్తుండడం సంతోషమేనని, ఇందిరమ్మ చీరలని కాకుండా బతుకమ్మ చీరలుగానే కొనసాగిస్తే బాగుండేదన్నారు. మహిళలు, బాలింతలు, చిన్న పిల్లల ఆరోగ్యం కోసం పౌష్టికాహార న్యూట్రీషన్ కిట్ పథకం కొనసాగించాలని కోరారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఎంసీ చైర్మన్లు, సింగిల్విండో చైర్మన్లు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అధికారులూ.. మిల్లర్లతో మాట్లాడండి ధర్మపురి: రైతులకు సమస్యలు ఎదురైతే మిల్లర్లతో మాట్లాడే బాధ్యత అధికారులు తీసుకోవాలని మంత్రి అన్నారు. మండలంలోని నేరెల్లలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి నాయకులు బాలాగౌడ్, జాజాల రమేశ్, శేర్ల రాజేశం తదితరులున్నారు. -
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
జగిత్యాలటౌన్: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని సత్యసాయిబాబా మందిరంలో నిర్వహించిన సత్యసాయి శతవర్ష వేడుకల్లో పాల్గొన్నారు. సేవాసమితి సమకూర్చిన కుట్టు మిషన్లు, ట్రైసైకిళ్లు, వీల్చైర్స్ నిరుపేద మహిళలు, దివ్యాంగులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మానవసేవయే మాధవసేవగా భావించిన సత్యసాయి బాబా ట్రస్ట్ సేవలు ప్రపంచంలోని 200 దేశాల్లో సేవలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి కన్వీనర్ బట్టు రాజేందర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కేరళ తరహా గల్ఫ్ పాలసీ అమలు చేయాలి
జగిత్యాలటౌన్: కేరళ తరహాలో గల్ఫ్ పాలసీని అమలు చేసి బాధితులకు అండగా నిలవాలని వక్తలు డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు బూతుకూరి కాంత, బీఎన్రావు అధ్యక్షతన ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన గల్ఫ్గోస కార్యక్రమానికి రాజకీయ విశ్లేషకులు ప్రకాశ్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్, తెలంగాణ విఠల్, ప్రొఫెసర్ సూరపెల్లి సుజాత ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విదేశాల్లో మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలన్నారు. కార్మికుల సంక్షేమానికి పలు సూచనలు చేశారు. కేరళ తరహాలో గల్ఫ్ పాలసీని రూపొందించాలని, వయసుతో నిమిత్తం లేకుంగా గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రైతుబీమా తరహాలో రూ.5లక్షల పరిహారం అందించాలని సూచించారు. మృతదేహాలను స్వదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, రూ.500కోట్లతో అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని, గల్ఫ్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ స్వదేశానికి సమాచారం అందించేందుకు టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాని కోరారు. ఐఏఎస్ అధికారి అధ్యక్షతన గల్ఫ్ సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఫేక్ గల్ఫ్ ఏజెంట్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో గల్ఫ్ బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. -
జగిత్యాల
31.0/14.07గరిష్టం/కనిష్టంఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం చొప్పదండి ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం కాన్వాయ్ కొడిమ్యాల మండలం పూడూర్ వద్ద ప్రమాదానికి గురైంది.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలుధర్మపురి: ధర్మపురి పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మార్గశిర మాసం, ఆదివారంసెలవు దినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
కంకర అక్రమ రవాణాకు అడ్డుకట్ట
గొల్లపల్లి: క్వారీలు, క్రషర్ల ద్వారా నిత్యం భవన నిర్మాణాలు, రహదారులు, వాణిజ్య తదితర అవసరాలకు టన్నుల కొద్ది కంకరను రవాణా చేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొడుతూ వ్యాపారులు జేబులు నింపుకొంటున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఓవర్ లోడ్తో కంకరను తరలిస్తున్న వాహనాలు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. ఇటీవల చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఎంతోమంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో ప్రభుత్వం పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. టన్నుల కొద్దీ రవాణా జిల్లాలో సుమారు 16 వరకు క్రషర్లు ఉన్నాయి. వీటి నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం వందలాది టిప్పర్ల ద్వారా కంకర రవాణా అవుతోంది. నిబంధనల ప్రకారం 15 టన్నులు, 20 టన్నులు తరలించాల్సిన టిప్పర్లో 8 నుంచి పది టన్నులు అదనంగా తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ సీనరేజ్, రాయల్టీ, డీఎంఎఫ్టీ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని క్రషర్ల యజమానులు తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనిపించని వేబ్రిడ్జిలు, సీసీ కెమెరాలు జిల్లాలోని ఏ క్వారీలో చూసినా కనీసం వేబ్రిడ్జిలు మచ్చుకై నా కానరావడం లేదు. ఇక సీసీ కెమెరాల ఊసే లేదు. మరోవైపు అధికారుల పర్యవేక్షణలోపం కూడా తోడవుతోంది. క్వారీల్లో ఎంత మేర తవ్వుతున్నారు..? కంకర ఎంత తరలిస్తున్నారు..? అనే లెక్కలు తీయడం లేదు. వాస్తవానికి టన్ను కంకరకు రూ.150 రాయల్టీ (పర్మిట్, డీఎంఎఫ్, ఐటీ) చెల్లించాలి. మొరానికై తే రూ.40 చొప్పున గనుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. కాంటా వేసే వ్యవస్థ లేకపోవడం, తనిఖీలు నామమాత్రంగా నిర్వహించడంతో వ్యాపారులు రాయల్టీని కూడా అంతంత మాత్రంగానే చెల్లిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి క్రషర్లో వేబ్రిడ్జి, సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటిని నెల రోజుల్లో ఏర్పాటు చేయాలని అధికారులు క్రషర్ల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. యూనిట్ల ప్రకారం రాయల్టీ నెల రోజుల వ్యవధిలో ఒక్కో క్రషర్ నిర్వహణకు రూ.20 వేల విద్యుత్ ఖర్చయితే అందులో నాలుగో వంతు అంటే రూ.5వేలు, దీనికి సమానంగా అంటే ఐదు వేల టన్నులకు రాయల్టీ చెల్లించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక నుంచి రెట్టింపు జరిమానా విధిస్తారు. క్రషర్లో ఏర్పాటు చేసే వేబ్రిడ్జి జిల్లా గనుల శాఖ కార్యాలయానికి అనుసంధానమై ఉంటుంది. దీని ఆధారంగా కంకర ఎంత కాంటా వేశారు..? ఎంత తరలిస్తున్నారు..? అదనంగా ఏమైనా తరలిస్తున్నారా..? అనేది అధికారులు పర్యవేక్షించనున్నారు. పక్కాగా లెక్కలు క్వారీల నుంచి తీసిన రాళ్లు, బండల నుంచి ఎంత మొత్తంలో వ్యాపారులు క్రషర్ల ద్వారా కంకర తయారు చేయనున్నారో అధికారులు వద్ద ఇక పక్కాలెక్కలు ఉండనున్నాయి. ఈ మేరకు వ్యాపారుల నుంచి రాయల్టీ వసూలు చేయనున్నారు. డీజిల్తో నడిచే యంత్రాల ద్వారా కంకర తయా రు చేసినా మీటర్ ఏర్పాటు చేయాలనే నిబంధన విధించారు. క్రషర్ యూనిట్ల నుంచి కంకర తీసుకెళ్లే వాహనాల నంబర్లు, తూ కం వివరాలను గనుల శాఖ వెబ్సైట్లో అధికారులు అనుసంధానం చేయనున్నారు. ఈ విషయమై మైనింగ్ ఏడీ జైసింగ్ మాట్లాడుతూ.. క్వారీల్లో సీసీ కెమె రాలు ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యాలకు నోటీసులు అందించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. -
రైతుల కష్టం తెలుస్తోంది
స్వయంగా పంట పండించ డం ద్వారా రైతులు పడే క ష్టం విలువ అర్థమవుతోంది. రైతులకు అండగా ఉండేందుకు వ్య వసాయ విద్య అభ్యసిస్తున్నం. సాగులో మేం చేసిన పోరపాట్లు ఏమిటనే విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. – పర్ణశ, వ్యవసాయ విద్యార్థిని సాగులోని ప్రతి విషయాన్ని విద్యార్థులందరం చర్చిస్తాం. ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తే అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచన పాటించి అధిక దిగుబడి తీసేందుకు ప్రయత్నిస్తాం. పంట పండించి అమ్మడం కూడా నేర్చుకున్నాం. – సాయి రాహుల్, వ్యవసాయ విద్యార్థి సాగులోని ప్రతి విషయంపై విద్యార్థులకు అవగాహన కలి గించేందుకు పంటలు సాగు చే యమంటాం. కూలీలు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయాలని చెబుతాం. సమస్య వస్తే విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లం పరిష్కరిస్తాం. – పి.అరుణ్కుమార్, కోర్సు మేనేజర్ -
కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం
జగిత్యాలటౌన్: ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు తప్పదని, జైలుకెళ్లి కండలు పెంచాలన్న ఆయన కోరిక త్వరలో నెరవేరనుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ అనుమతి లభించడంతో రేపో.. ఎల్లుండో కేటీఆర్ అరెస్టు తప్పదని తేలడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు రూ.5లక్షల కోట్ల అవినీతి అంటూ కేటీఆర్, హరీశ్రావు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల కలెక్టరేట్లో ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌజ్కే పరిమితమయ్యారని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రజలు కేటీఆర్, హరీశ్రావుకు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ది రాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శిథిలం చేసి ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం నెట్టిందన్నారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనంతో పనిచేయాలని ఛీప్ పాలిటిక్స్ చేయొద్దని సూచించారు. కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీఆర్డీవో రఘువరణ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల విస్తరణ ఎప్పుడో..?
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి పట్టణంలో పలు రోడ్లు విస్తరణకు నోచుకోలేదు. ముఖ్యంగా జగిత్యాలకు ప్రధానమైన రోడ్డు యావర్రోడ్డు. ఇది ఎన్హెచ్–63 జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది. జిల్లా కేంద్రం కావడం, లక్షకు పైగా జనాభా ఉండటం నిత్యం పనులపై ఎంతోమంది ఇక్కడకు వస్తుంటారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం వచ్చి ఉపాధి పొందుతూ ఇక్కడే ఉంటున్నారు. ఫలితంగా రద్దీ అత్యధికంగా పెరిగిపోయింది. జగిత్యాలకు ప్రధానంగా రోడ్ల సమస్య ఉంది. ఐదేళ్లకోసారి ప్రజాప్రతినిధులు మారుతున్నా జగిత్యాల రూపురేఖలైతే మారడం లేదు. డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు ఈ యావర్రోడ్ ఇరుకుగా ఉండటంతో గతంలో బైపాస్రోడ్ను నిర్మించారు. జిల్లా కేంద్రం కావడంతో బైపాస్రోడ్ పూర్తి ట్రాఫిక్మయంగా మారిపోయింది. స్కూళ్లు, హోటళ్లు, వాణిజ్య వ్యాపారాలు ఆ రోడ్డుపై వెలవడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా ఉంటుంది. యావర్రోడ్డు విస్తరణ జరిగేనా..? జిల్లాకేంద్రంలో అతిపెద్ద సమస్య యావర్రోడ్డు. గతంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్ రోడ్డు విస్తరణ కోసం కృషి చేశారు. యావర్రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోటనే 100 ఫీట్ల రోడ్లు చేపట్టారు. మిగతావి కేసుల్లో ఉండటంతో అలాగే ఉండిపోయాయి. ఆక్రమణలు ఈ యావర్రోడ్డుగా ఉన్న నేషనల్ హైవే రహదారి చిన్నగా మారింది. 80 ఫీట్లతో ఇరుకుగా మారింది. పైగా వాణిజ్య వ్యాపారులు రోడ్డును ఆక్రమించుకుని ఎలాంటి సెట్బ్యాక్లు పాటించకుండా నిర్వహించడంతో ప్రజల రాకపోకలకు కష్టంగా మారుతోంది. వాహనాలు వెళ్లాలన్నా ప్రమాదకరంగా మారింది. ఇటీవల మాజీమంత్రి జీవన్రెడ్డి కూడా యావర్రోడ్డులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. బైపాస్ అంటేనే భయం జిల్లాకేంద్రం కాకముందు ప్రజల వెసులుబాటు కోసం బైపాస్రోడ్ను ఏర్పాటు చేశారు. గతంలోనే 100 ఫీట్ల బైపాస్రోడ్డు ఏర్పాటు చేస్తే బాగుండేది. ఇటు జనాభా, ట్రాఫిక్ పెరిగిపోవడంతో ఆ రోడ్డు ప్రస్తుతం ఇబ్బందిగా మారింది. ఇరుకై న రోడ్లే.. జిల్లా కేంద్రంలో ప్రదానమైన రోడ్లన్నీ ఇరుకుగానే ఉన్నాయి. 1983 నాటి మాస్టర్ ప్లానే అమలు కావడంతో రోడ్లు అభివృద్ధి కావడం లేదు. కొత్త మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడం, రోడ్లు విస్తరణ కాకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. కనీసం బైక్లు పెట్టుకుందామన్నా స్థలాలు లేని పరిస్థితి. ముఖ్యంగా తహసీల్ చౌరస్తా, టవర్ నుంచి కొత్తబస్టాండ్, గంజ్ ప్రాంతంలో కనీసం ఆటో కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి యావర్రోడ్తో పాటు, బైపాస్రోడ్ల విస్తరణ చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
‘ఇందిరమ్మ’లో చేతివాటం
‘ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే రోకలిబండతో కొట్టండి.. ఈ విషయంలో అవసరమైతే నేనే జైలుకు వెళ్తా.. ఇళ్ల పథకం మన హక్కు. ఎవరైనా అడ్డుకుంటే ఈడ్చికొట్టండి..’ ఇది రెండు రోజుల క్రితం మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేసిన వ్యాఖ్యలు. ఇళ్ల మంజూరు విషయంలో కొందరు డబ్బులు అడుగుతున్నారని ఆయనకు ఫిర్యాదులు రావడంతో ఆగ్రహం చెందిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. మెట్పల్లి: పేదల ప్రజలకు సొంతింటి కలను నిజం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతేడాది మార్చిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికింద ఇంటి నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారుకు రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అయితే కొందరు నాయకులు, ఉద్యోగులు ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు విషయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడిగినంత ఇస్తేనే లబ్ధి కలిగేలా చూస్తున్నారని, లేకుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు దశల్లో బిల్లుల చెల్లింపు ● ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు దశల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తోంది. ● మొదట బేస్మెంట్ పూర్తయిన తర్వాత రూ.లక్ష, గోడలు నిర్మించిన అనంతరం రూ.1.25లక్షలు, శ్లాబ్ పూర్తయిన తర్వాత రూ.1.75లక్షలు, మిగతా రూ.లక్ష ఇల్లు పూర్తి అయిన తర్వాత మంజూరు చేస్తోంది. అక్కడక్కడా డబ్బులు వసూలు.. ● ప్రభుత్వం పారదర్శకంగా పథకం అమలు చేసి పేదలకు తమ సొంతింటి కలను సాకారం చేయాలని నిర్ణయించినప్పటికీ.. కొందరు నాయకులు, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● లబ్ధిదారుగా ఎంపిక చేయడం కోసం రూ.50వేల చొప్పున.. బిల్లు మంజూరు చేసే సమయంలో రూ.10వేల చొప్పున అక్కడక్కడా కొందరు వసూలు చేస్తున్నట్లు వార్తలు విని పిస్తున్నాయి. ● కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్కు ఇలాంటి ఫిర్యాదులు రావడంతో ఆయన స్పందించారు. డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండని తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ● గతంలో ఓ లబ్ధిదారు నుంచి డబ్బులు వసూలు చేసిన మెట్పల్లి వార్డ్ ఆఫీసర్ను ధర్మపురి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు ఫిర్యాదు మేరకు కలెక్టర్ సస్పెండ్ చేశారు. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ప్రభుత్వం ఈ పథకం కింద 3500 ఇళ్లను మంజూరు చేసింది. మొత్తంగా 11,033 ఇళ్లను కేటాయించింది. ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల ద్వారా జిల్లావ్యాప్తంగా ఇళ్ల మంజూరుకు అనుగుణంగా ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. పథకం అమలుకు సంబంధించిన నిబంధనలు కఠినంగా ఉండడంతో ప్రారంభంలో ఆశించిన స్థాయిలో లబ్ధిదారులు పనులు ప్రారంభించడానికి ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం వాటిని సడలించడంతో ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు కేవలం ఏడు మాత్రమే పూర్తయ్యాయి. 7,634 ఇళ్లకు మార్కింగ్ ఇచ్చారు. 3,091 బేస్మెంట్ లెవల్లో ఉన్నాయి. 1031 గోడల లెవల్లో ఉన్నాయి. 783 రూప్ లెవల్ వరకు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం కోసం గృహ నిర్మాణ శాఖ ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబర్ 18005995991 ను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఇళ్లకు సంబంధించి, బిల్లుల చెల్లింపు విషయంలో ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే ఈ నంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
నేర్చుకోవాలి.. పంట పండించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు బృందాలుగా ఏర్పడి తాము చదువుకున్న కోర్సులో భాగంగా పంటలు సాగు చేయాల్సి ఉంటుంది. విత్తనం నాటింది మొదలు.. మార్కెటింగ్ వరకు వ్యవసాయ పనులన్నీ విద్యార్థులే చేయాల్సి ఉంటుంది. పొలాస వ్యవసాయ కళాశాలలో బీఎస్పీ అగ్రికల్చర్ నాలుగో ఏడాది విద్యార్థులు పాలిహౌస్లో కూరగాయలు సాగుచేస్తున్నారు. 14 మంది విద్యార్థుల బృందం ఒకే పంటపై ఆసక్తి ఉన్న 14 మంది విద్యార్థులు బృందంగా ఏర్పడ్డారు. వీరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.అరుణ్కుమార్ ఇన్చార్జిగా వ్యవహరించారు. వీరంతా కళాశాలను ఆనుకుని ఉన్న పాలిహౌస్లో క్యాబేజీ, కాలిఫ్లవర్, టమాట సాగు చేస్తున్నారు. కోర్సు మేనేజర్తో సమావేశమై పంట ప్రణాళికను రూపొందిస్తారు. రకరకాల కంపెనీల విత్తనాలను పరిశీలించి.. నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. సేంద్రియ ఎరువులు వేసి, విత్తనాన్ని నారుగా పోసి, మొక్కలు నాటి డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. సేంద్రియ పద్ధతిలో సాగు మొక్కలను నాటే ముందు వర్మి కంపోస్టు వేయడంతోపాటు, మొక్కలు పెరిగిన తర్వాత తెగుళ్లు, పురుగులు ఆశించకుండా వేపనూనె పిచికారీ చేస్తున్నారు. కలుపు మొక్కలు ఆశించకుండా.. వేర్లకు గాలి తగిలేలా మట్టిని కదిలిస్తూ ఉంటారు. సమస్య వస్తే విద్యార్థులంతా నిర్ణయం తీసుకుంటారు. చివరకు పంటను అమ్మి లాభాలు కూడా చూపించాల్సి ఉంటుంది. పొలాస వ్యవసాయ కళాశాల బ్రాండ్తో విక్రయిస్తుండటంతో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు రెండుమూడు టన్నుల వరకు కూరగాయలు విక్రయించారు. -
అంజన్న ఆలయ ఏఈవోగా హరిహరనాథ్
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ఏఈవోగా హరిహరనాథ్ను నియమిస్తూ దేవాదాయశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆలయ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఏఈవోగా పదోన్నతి కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల డివిజన్ ఎన్పీడీసీఎల్ డీఈగా గంగారాం నియమితులయ్యారు. ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఈ సుదర్శనంను మర్యాదపూర్వకంగా కలిశారు. డీఈని ఉద్యోగ, కార్మిక సంఘాలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మెట్పల్లి: పట్టణం నుంచి అరుణాచలం యాత్రకు వెళ్లేందుకు డిసెంబర్ 2న ఆర్టీసీ బస్సు నడిపించనున్నట్లు డిపో మేనేజర్ దేవరాజ్ తెలిపారు. మధ్యాహ్నం 2గంటలకు బయల్దేరి కాణిపాకం, గోల్డెన్టెంపుల్ దర్శనం చేసుకుని మూడో తేదీన రాత్రి అరుణాచలం చేరుకుంటుందన్నారు. 4న రాత్రి అక్కడి నుంచి బయల్దేరి మహానంది, జోగులాంబ ఆలయాల దర్శనం చేసుకుని 5న రాత్రి మెట్పల్లికి చేరుకుంటుందన్నారు. టిక్కెట్ ధర పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ.3760గా నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. జగిత్యాలటౌన్: ఫిరాయింపుదారులతో అభివృద్ధి ఎలా సాధ్యమని మాజీమంత్రి జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల పార్టీ మారిన నాయకులు నియోజకవర్గ అభివృద్ధి అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారని, కాంగ్రెస్ నాయకులతో సాధ్యం కాని అభివృద్ధి ఫిరాయింపుదారులకు ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో పార్టీ జిల్ల అధ్యక్షుడు గాజంగి నందయ్యను సన్మానించారు. మంత్రి అడ్లూరి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రి మాట్లాడుతూ ఆలస్యమైనా.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించి అవకాశం కల్పించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని కోరారు. జీవన్రెడ్డి మాట్లాడుతూ కన్నతల్లి వంటి కాంగ్రెస్ పార్టీ తన బిడ్డలను కాపాడుకోగలదని, తన పోటీ పక్క పార్టీల నుంచి వచ్చిన నాయకులతో కాదని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్తో పోటీపడ్డానని, పులివెందులకు ధీటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. నందయ్య నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు జయశ్రీ, పిప్పరి అనిత, యూత్ కాంగ్రెస్ నాయకులు రఘువీర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ
జగిత్యాలక్రైం: అదనపు ఎస్పీగా శేషాద్రినిరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ అశోక్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శేషాద్రినిరెడ్డిది నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని లింగారెడ్డి గూడెం. ఐఐటీ హైదరాబాద్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2020లో సివిల్స్ తొలి ప్రయత్నంలోనే 401వ ర్యాంక్ సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం తొలి పోస్టింగ్ వేములవాడ ఎస్డీపీవోగా బాధ్యతలు స్వీకరించారు. బదిలీల్లో అడిషనల్ ఎస్పీగా వచ్చారు. నేటి నుంచి అన్నప్రసాద వితరణమెట్పల్లి: పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ఆదివారం నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు దొమ్మాటి ప్రవీణ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగుల వివేక్, ఉపాధ్యక్షుడు అంకతి భరత్ తెలిపారు. జనవరి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, మధ్యాహ్నం 12.30 నుంచి మూడు గంటల వరకు భిక్ష ఉంటుందన్నారు. దీక్షాస్వాములు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నేడు ఎన్ఎంఎంఎస్ పరీక్షజగిత్యాల: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 23న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. జిల్లాలోని ఆరు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ఉంటుందని, జగిత్యాలలో మూడు, కోరుట్లలో రెండు, మెట్పల్లిలో ఒకటి చొప్పున పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, 1,474 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. చేపల పెంపకంతో మత్స్యకారులకు ఆదాయంధర్మపురి: చేపపిల్లల పెంపకంతో మత్స్యకారులకు ఆదాయం సమకూరుతుందని మత్స్యశాఖ అధికారి సురేశ్బాబు అన్నారు. మండలంలోని 25 గ్రామాల్లోని 42 చెరువుల్లో 4.20 లక్షల చేపపిల్లలను పంపిణీ చేశారు. ఆరు నెలల్లో చేపల్లో పెరుగుదల ఉంటుందని, వాటితో ఆదాయం సమకూర్చుకోవచ్చని సూచించారు. మండలానికో భూసార పరీక్ష కిట్జగిత్యాలఅగ్రికల్చర్: భూసార పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి మండలానికో కిట్ను అందించామని డీఏవో వడ్డెపల్లి భాస్కర్ తెలిపారు. వ్యవసాయ అధికారి కార్యాలయంలో శనివా రం ఏఈవోలకు కిట్లపై అవగాహన కల్పించారు. కరీంనగర్ సాయిల్ టెస్టింగ్ ల్యాబోరేటరీ ఏవోలు తిరుమలేశ్వర్, మమత ప్రయోగాత్మకంగా సాయిల్ టెస్టింగ్ కిట్ ఉపయోగించే టెక్నిక్స్, భూసార శాంపిలింగ్ విధానం, పరీ క్షా ఫలితాలు, రైతులకు ఇవ్వాల్సిన సిఫార్సులపై అవగాహన కల్పించారు. ఏడీఏ టెక్నికల్ రాజులనాయుడు, ఏఓలు పాల్గొన్నారు. చలికాలం జాగ్రత్తజగిత్యాల: ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. కూల్ వేవ్ కారణంగా శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, హైపోథర్మియా ఫాస్ట్ బైట్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు మీద పనిచేసే కార్మికులు, హోమ్లెస్ వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని, పూర్తిగా శరీరమంతా వేడిబట్టలు, మాస్క్లు ధరించాలన్నారు. జాతీయ డైమండ్ జూబ్లీ జంబూరికి విద్యార్థినులుపెగడపల్లి: స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్లో భాగంగా మండలంలోని సుద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి నలుగురు విద్యార్థినులు జాతీయ డైమండ్ జూబ్లీ జంబూరికి ఎంపికై నట్లు స్కౌట్ టీచర్ పద్మజ తెలిపారు. ఎస్.ఐశ్వర్య, ఎస్.చంద్రలాస్య, ఎన్.దీప్తి, జీ.హర్షిణితోపాటు మల్యాల నుంచి ఇద్దరు, జగిత్యాల నుంచి ఇద్దరు మొత్తంగా ఎనిమిది మంది విద్యార్థినులు ఎంపికయ్యారని, వీరు ఈ నెల 23 నుంచి 29 వరకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగే క్యాంపులో పాల్గొంటారని తెలిపారు. -
ముందుగా సర్పంచ్గా పోటీచేద్దాం..
రాయికల్: స్థానిక సంస్థల ప్రక్రియలో భాగంగా మొదట సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఇటీవల సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీల రిజ ర్వేషన్లను ఒకేసారి ప్రకటించి ప్రభుత్వం జాబితాను విడుదల చేసినప్పటికీ కోర్టు ఆంక్షలతో అది రద్దయిన విషయం తెల్సిందే. అప్పటినుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచ్ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆశావహులంతా ముందుగా సర్పంచ్గా పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. కలిసివస్తే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా.. సర్పంచుల రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ గ్రామాల రిజర్వేషన్లు దాదాపుగా పాతవే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్లు మారడంతో మొదటగా సర్పంచ్గా ఎన్నికై న తర్వాత ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే అప్పుడు చూద్దామంటూ ఇప్పుడు మాత్రం సర్పంచ్ ఎన్నికల వైపే మొగ్గుచూపుతున్నారు. రిజర్వేషన్లు కలిసివస్తే కుటుంబంలోని ఆశావహుల్లో ఒకరు సర్పంచ్, మరొకరు ఎంపీటీసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా అదృష్టం కలిసి వస్తే ఎంపీపీగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. యాదవుల కోసం ఉద్యమిస్తాం గొల్లపల్లి:జనాభా ప్రకారం యాదవులకు హక్కుల కోసం ఉద్యమిస్తామని సంఘం జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేశ్ అన్నారు. మండలంలోని బీబీరాజ్పల్లిలో సభ్యత్వ నమోదు చేపట్టారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. సమస్యల పరిష్కారం, న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధనకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య కార్యవర్గ సభ్యులు మ్యాదరవేని రామాంజనేయులు యాదవ్, మధుయాదవ్, బుచ్చిరాములు, నరేందర్, బీబీరాజ్పల్లి సంఘం నాయకులు కొమురయ్య, రాజయ్య, చిన్న నర్సయ్య, శ్రీనివాస్, రాజయ్య, లింగయ్య, రాజయ్య, మల్లేశ్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులడిగితే రోకలితో కొట్టండి మెట్పల్లిరూరల్/ఇబ్రహీంపట్నం/మల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే రోకలిబండతో కొట్టాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదా రులకు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరుకు కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన పనిలేదని, ఎవడైనా అడిగితే రోకలిబండతో తలపగులగొట్టి తన పేరు చెప్పాలని, అవసరమైతే తానే జైలుకు వెళ్తానని తెలి పారు. మెట్పల్లిలో ఎంపీడీవో సురేశ్, పంచాయతీ కార్యదర్శులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో మాజీ కో–ఆప్షన్ ఏలేటి చిన్నారెడ్డి, నేమూరి సత్యనారాయణ, జాజాల జగన్రావు, గుంటి దేవయ్య, సున్నం సత్యం పాల్గొన్నారు. మల్లాపూర్లో ప్యాక్స్ చైర్మన్లు వేంపేట నర్సారెడ్డి, బద్దం అంజిరెడ్డి, నేరళ్ల మోహన్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ పాల్గొన్నారు. పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యంకథలాపూర్: పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని తాండ్య్రాలలో వివిధ గ్రామాలకు చెందిన 40 మందికి కల్యాణలక్ష్మి, 52 మందికి సీఎమ్మార్ఎఫ్ చెక్కులు అందించారు. గంభీర్పూర్ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సూరమ్మ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ పనుల్లో భూములు కోల్పోయే రైతులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, తహసీల్దార్ వినో ద్, కాంగ్రెస్ నాయకులు కాయితి నాగరాజు, తొట్ల అంజయ్య, హరిప్రసాద్, జవ్వాజి చౌదరి, గడ్డం చిన్నారెడ్డి, జంగ రంజిత్, కూన అశోక్ పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు ఖరారు
ఆశావహుల్లో ఉత్సాహం జగిత్యాల/జగిత్యాలరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ కూడా రావడంతో ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ఇప్పటికే గ్రామపంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్లు మొత్తం సీట్లలో 50 శాతం మించకుండా అధికారులు ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావడమే ఆలస్యం. ఇప్పటికే బీసీ డెడికేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాయంత్రాంగం రిజర్వేషన్లు లెక్కించి కేటాయించింది. సర్పంచులు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించగా.. అక్కడి నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లడం, నామినేషన్లు తీసుకోవడం కూడా పూర్తయ్యింది. హైకోర్టు తీర్పుతో అవి రద్దు కావడంతో రిజర్వేషన్ల కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా ప్రకటించిన జాబితాలో ఎస్సీ, ఎస్టీ స్థానాలు అలాగే ఉండనుండగా.. బీసీ స్థానాల సంఖ్య మాత్రం తగ్గనుంది. బీసీలకు గతంలో ఉన్న 42 శాతంతోనే ఎన్నికలు జరగనుండగా.. వారిలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారులు బిజీబిజీ.. ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో నెల రోజులుగా కలెక్టరేట్లో బిజీబిజీగా ప్రక్రియ చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో మహిళాస్థానాలను డ్రా పద్ధతిలో రిజర్వేషన్లు కే టాయించారు. ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయాల ని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులంద రూ లీనమైపోయారు. రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్ రానున్న తరుణంలో అన్ని సిద్ధం చేస్తున్నారు. ఓటరు తుదిజాబితా సోమవారం ప్రకటించనున్నారు. ఇప్పటికే అధికారులు జిల్లాలో అన్ని పోలింగ్ బూత్లు, బ్యాలెట్ బాక్స్లు సిద్ధం చే సుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నం కానున్నారు. గ్రామాల్లో సందడి.. సర్పంచుల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావస్తు న్నా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో నాయకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. బీసీలకు 42 శాతం కేటాయిస్తూ ఇటీవల ముందుకెళ్లినప్పటికీ కోర్టు తీర్పుతో ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఆశావహులు ఏవైనా రిజర్వేషన్లు మారాయా..? అని చర్చించుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్లు మారగా మిగతావన్ని అలాగే ఉన్న ట్లు తెలుస్తోంది. కలెక్టరేట్లో రెండు రోజులుగా ఆశావహులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రాజకీయ నాయకుల సమక్షంలోనే రిజర్వేషన్లు తీయడంతో దాదాపు అందరికీ రిజర్వేషన్లు సైతం తెలిసిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అధికారికంగా రిజర్వేషన్లు రాకపోయినప్పటికీ దాదాపు అన్ని మండలాలకు చెందిన రిజర్వేషన్లు తెలిసిపోయాయి. రిజర్వేషన్లు ఇవే.. ఎస్టీలకు 22 స్థానాలు కేటాయించగా.. మహిళలకు 10, జనరల్ 12, జనాభా ప్రాతిపదికన జనరల్ 5, ఎస్సీలకు 72 కేటాయించగా మహిళలకు 31, జనరల్ 41, బీసీలకు 98 స్థానాలు కేటాయించగా.. మహిళలకు 44, జనరల్ 54 చొప్పున కేటాయించారు. జనరల్ స్థానాలు 188 కాగా.. ఇందులో మహిళలకు 89, జనరల్ 99 కేటాయించారు. మొత్తం మండలాలు 20 గ్రామపంచాయతీలు 385 వార్డులు 3536 మొత్తం ఓటర్లు 6,07,263 పురుషులు 2,89,702 మహిళలు 3,17,552 ఇతరులు 9 ఏర్పాట్లు పూర్తి జిల్లాలో 385 గ్రామ పంచాయతీలుండగా.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటరు జాబితా సిద్ధం అయ్యింది. పోలింగ్ బూత్లు, బ్యాలెట్ బాక్స్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి డీపీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు ఇప్పటికే తమ అనుచర వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి పోటీకి సన్నద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలించని వారు అయోమయంలో పడిపోయారు. తాము బలపర్చిన అభ్యర్థిని నిలబెట్టుకుని గెలిపించుకోవాలనే ఆలోచనలో మరికొందరు ఉన్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ అభ్యర్థులు ఏయేవార్డుల్లో ఎవరిని పోటీలో దింపాలన్న అంశంపై ఇప్పటికే చర్చలకు తెరలేపారు. గతంలో కంటే సర్పంచ్గా పోటీచేసే అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తుండడంతో అభ్యర్థులు అన్ని విధాలా సిద్ధమవుతున్నారు.


