-
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
● నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్సారంగాపూర్: తాను ఈ ప్రాంతానికే కొత్త అని, రాజకీయాలు, ప్రజాసేవకు కొత్త కాదని, అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ బీ ఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం మండలంలోని పెంబట్ల, కోనాపూర్లో కార్నర్మీటింగ్లో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, దొంగ హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఆరుగ్యారంటీలు అమలు చేయలేక చతికిల పడిందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలోనే చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నయని, జగిత్యాల ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. రాముని పేరుతో ఓట్లు అడిగే పరిస్థితి బీజేపీదన్నారు. మాజీ మంత్రి రాజేశంగౌడ్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్
● ఆరు గ్యారంటీలు ఎక్కడ..? ● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి సారంగాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, ఇప్పటివరకు ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి అన్నారు. సోమవారం సారంగాపూర్ మండలం అర్పపల్లి, లక్ష్మీదేవిపల్లి, పెంబట్లతండాల్లో పర్యటించి స్థానిక మహిళలతో మాట్లాడారు. దేశంమొత్తం ప్రధాని మోదీ పాలన కోరుకుంటోందన్నారు. త్రిపుల్ తలాక్ రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలు కూడా ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారని తెలిపారు. ఎంపీగా ధర్మపురి అర్వింద్ గెలుపే ధ్యేయంగా కృషి చేయాలన్నారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు వరుణ్కుమార్, బొమ్మకంటి ప్రసాద్, గంగరాజు, జమున, శేఖర్, నరేశ్ పాల్గొన్నారు. -
గల్ఫ్ ట్రావెల్స్పై నిఘా కరువు
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని అదునుగా తీసుకుంటున్న కొంతమంది ట్రావెల్స్ యజ మానులు గల్ఫ్ ఏజెంట్ల అవతారం ఎత్తుతున్నారు. గల్ఫ్ పంపిస్తామంటూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లేవారి సంఖ్య రెండేళ్లుగా పెరుగుతోంది. అదేస్థాయిలో జిల్లాలో సుమారు 160 ట్రావెల్స్ అనధికారికంగా కొనసాగుతున్నాయి. సదరు ట్రావెల్స్ యజమానులు గ్రామీణులు, పట్టణ ప్రాంతాలంటూ తేడా లేకుండా ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాలతోపాటు 20 మండలాల్లో గల్ఫ్ ట్రావెల్స్ పేరున సుమారు 160 ట్రావెల్స్ ఉన్నాయి. వీరు వాస్తవానికి విమాన టికెట్స్ బుకింగ్ చేసేందుకే అనుమతి తీసుకుంటాయి. కానీ.. నిరుద్యోగుల అవకాశాన్ని ఆసరా చేసుకుని ఉపాధి కల్పిస్తామని చెప్పి నమ్మిస్తాయి. వారి నుంచి పాస్పోర్టులు తీసుకొని ఇంటర్వ్యూలకు హాజరుపరుస్తూ వీసా వచ్చిందని నమ్మిస్తూ అందినంతా దండుకుంటున్నాయి. అదే ట్రావెల్స్లో అనుమతులు లేకుండానే మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. నిరుద్యోగులు కూడా స్థానికంగా ఉన్న ట్రావెల్స్లకు లైసెన్స్ లేదని తెలిసినా.. వారిని నమ్మి లక్షలాది రూపాయలు చేతిలో పెట్టి మోసపోతున్నారు. 26 మందికే లైసెన్స్ జిల్లాలో గల్ఫ్ పంపించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కేవలం 26 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్లు తీసుకుని ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. మరో ముగ్గురు లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారు అనుమతులు లేకుండానే ట్రావెల్స్, ఏజెంట్లుగా చలామణి అవుతూ నిరుద్యోగులకు వీసాల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. లైసెన్స్ లేకున్నా ఇంటర్వ్యూలు గల్ఫ్ ఏజెంట్లు, ట్రావెల్స్ నిర్వాహకులు లైసెన్స్ ఉ న్నప్పటికీ ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసులకు స మాచారం అందించి ఇంటర్వ్యూలు నిర్వహించాలి. కానీ వారు పోలీసులకు ఎలాంటి సమాచారం లే కుండానే ఇష్టారీతిలో జిల్లాకేంద్రంలోనే పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ముంబయ్, చైన్నె, ఢిల్లీలో ఉన్న ట్రావెల్స్ యజమానులతో కలిసి ఈ తతంగం కొనసాగిస్తున్నారు. ని రుద్యోగులను ఇంటర్వ్యూలకు పిలిపించి అర్హత సా ధించారంటూ పాస్పోర్టులు తీసుకుంటున్నారు. అ నంతరం వారికి ఏదో ఒక వీసా అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పత్రికల ప్రకటనలు కూడా ఇస్తూ నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా వాట్సా ప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాల్లో ట్రావెల్స్ నిర్వాహకులు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. వారు ప్రచారానికి వాడే ప్రచార లైసెన్స్లు మాత్రం హైదరాబాద్, ముంబయ్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు చెందిన ట్రావెల్స్ల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. యూరప్ దేశాలకూ ఇంటర్వ్యూలు లైసెన్స్ ఉన్న ట్రావెల్స్ యజమానులు గల్ఫ్ దేశాలకు మాత్రమే నిరుద్యోగ యువకులను పంపించేవారు. కానీ ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా లైసెన్స్లు ఉన్న వారు, లేని వారు నిరుద్యోగులను యూరప్ దేశాల్లో ఉద్యోగాలున్నాయని సుమారు రూ.రెండు లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం పోలీసు శాఖ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటంతో ఇదే అదునుగా చూస్తున్న ఏజెంట్లు, ట్రావెల్స్ నిర్వాహకులు వారంరోజులుగా జోరుగా గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వీసా వచ్చిందని, (మెడికల్) వైద్య పరీక్షలు పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా అర్హత లేని ట్రావెల్స్ అనుమతులు లేకుండానే ఇంటర్వ్యూలు మెడికల్ టెస్ట్ పేరుతో వసూళ్లు నకిలీ వీసాలు అంటగట్టి మోసాలు జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సొంతూరులో ఉపాధి కరువవడంతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. వీరి అవకాశాన్ని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆసరాగా చేసుకుని రూ.లక్ష తీసుకుని ఏడాది కాలంగా విదేశాలకు పంపించకుండా మోసానికి పాల్పడ్డాడు. బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన ఇద్దరు యువకులు మంచిర్యాల జిల్లా కడెం మండలానికి చెందిన ఓ యువకుడు నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లికి చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్కు యూరప్ దేశానికి వెళ్లేందుకు రూ.9 లక్షలు చెల్లించాడు. ఏడాది గడుస్తోంది. దీంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లే వారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఎమిగ్రేషన్ చట్టబద్ధత ఉన్నవారి నుంచే వీసాలు పొందాలి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. బాధితులు ఫిర్యాదు చేస్తే మోసగాళ్లపై కేసులు నమోదు చేస్తాం. – సన్ప్రీత్సింగ్, ఎస్పీ -
నాణ్యమైన ధాన్యం కొనాలి
బుగ్గారం/సారంగాపూర్: నాణ్యమైన ధాన్యాన్ని కొనాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. బుగ్గారం మండలం యశ్వంతరావుపేట, సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి పోతారం గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని రైతులకు నీడ, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆయన వెంట ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. నంచర్లలో శ్రీరాముడి రథోత్సవంపెగడపల్లి: మండలంలోని నంచర్లలోగల శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో ఐదురోజులుగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలు ముగిశాయి. సోమవారం స్వామివారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. జై శ్రీరాం జైజై శ్రీరాం..అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మండలం చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఎంపీపీ శోభ, ఆలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి వెంకన్న, మంత్రి హరిగోపాల్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీడీ టేకేదారుల కమీషన్ పెంచాలికోరుట్ల: బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న టేకేదారులకు కమీషన్ పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ టేకేదారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సుతారి రాములు కోరారు. పట్టణంలో సోమవారం టేకేదారులు సమావేశమయ్యారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి బీడీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయని, రెండేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం గడువు కూడా ముగిసిందని, ఈ క్రమంలో వెయ్యి బీడీల కమీషన్ రూ.18 నుంచి రూ.30కి పెంచాలని కోరారు. కార్యక్రమంలో టేకేదారులు సాంబయ్య, శంకర్, రవి, నర్సయ్య, సత్తయ్య, బాబురావు, బలరాం, భూమన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో ఆర్డీవో సమావేశంకోరుట్ల: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఆనంద్ కుమార్ సోమవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఓటరు సమాచార స్లిప్పులు, పోలింగ్ స్టేషన్ల లొకేషన్ మార్పుపై వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, బీజేపీ నాయకుడు ఆర్.సాయికృష్ణ, సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఎండీ.రషీద్ఖాన్, బీఆర్ఎస్ నాయకుడు జిందం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సరిహద్దు చెక్పోస్ట్ వద్ద తనిఖీలుసారంగాపూర్: మండలంలోని కమ్మునూర్ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్ట్ను అదనపు ఎస్పీ (ఏఆర్) భీంరావు సోమవారం తనిఖీ చేశారు. అనుమతిపత్రాలు లేకుండా వస్తువులు, నగదు తీసుకెళ్తే సీజ్ చేసి కేసు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎస్సై గౌతంపవార్ ఉన్నారు. -
నిజామాబాద్ లోక్సభకు 12 నామినేషన్లు
ఖలీల్వాడి: నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సోమవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్ మూడోసెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి కండెల సుమన్, స్వతంత్ర అభ్యర్థి ఆర్.రాజేందర్, రాపెల్లి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ అస్గర్ రెండోసెట్ నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు 28 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నాలుగోరోజు.. 14మంది నామినేషన్సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నాలుగో రోజు సోమవారం 14మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖల చేశారు. పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్కు వారు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంద రమేశ్, స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య,, ఆర్నకొండ రాజు, గడ్డం మారుతి, రాముల కార్తీక్, జుమ్మిడి గోపాల్, అంబాల మహేందర్, జనగామ నరేశ్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, దాగం సుధారాణి, జాడి ప్రేమ్సాగర్, అక్కపాక తిరుపతి ఒక్కోసెట్ నామినేషన్ పత్రం దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గద్దల వినయ్కుమార్, బొట్ల చంద్రయ్య రెండేసి సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 25 మంది అభ్యర్థులు మొత్తంగా 31 సెట్ల నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ అధికారంలోకొస్తే గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. రైతులను బీఆర్ఎస్, బీజేపీ పట్టించుకోలేదని, పసుపుబోర్డుపై అర్వింద్ ఉత్తర్వులతో సరిపెట్టారని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులు మృతిచెందితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. పసుపుబోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేస్తారా..? లేక అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తారా..? స్పష్టం చేయాల్సిన బాధ్యత అర్వింద్, బీజేపీపై ఉందన్నారు. నిజామాబాద్కు స్మార్ట్సిటీ తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. -
జైబోలో హనుమాన్కీ..
● హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం ● భక్తులతో పులకించిన కొండగట్టు పుణ్యక్షేత్రం ● అంజన్న నామస్మరణతో మార్మోగిన ఆలయంకొండగట్టు/జగిత్యాల: ‘రామలక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్కీ..’ అంటూ కొండగట్టులోని అంజన్న ఆలయం పులకించిపోయింది. హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమాన్ దీక్షాపరులు మాల విరమణకు వేల సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం స్వామివారి జయంతి కావడంతో సుమారు 1.50లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు తెలిపారు. కొండపైకి వచ్చిన భక్తులు ముందుగా క్యూలైన్ ద్వారా స్వామి వారిని దర్శించుకోవాలని, ఇరుముడులను ఆలయంలో ఏర్పాటు చేసిన జాలీల్లో సమర్పించాలని, పాత కోనేరు ఎదురుగా ఉన్న మెట్ల నుంచి కల్యాణకట్ట వద్ద ఏర్పాటు చేసిన లైన్ల ద్వారా మండపంలోకి వెళ్లి మాల విరమణ చేసుకోవాలని, శ్రీరామకోటి స్తూపం వద్దగల షెడ్డులో తలనీలాలు సమర్పించాలని, కోనేరులో పుణ్యస్నానం ఆచరించి.. చివరగా ప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణం కావాలని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వొద్దని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. కొండగట్టులో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ప్రసాదం తీసుకునేందుకు 12 క్యూలైన్లు, ప్రత్యేక దర్శనం, మాల విరమణ, కేశఖండన టికెట్లకు ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. -
కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్నారు
మల్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మల్యాలలో సోమవారం రాత్రి రోడ్షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నవోదయ పాఠశాల ఎందుకు తీసుకురాలేదంటూ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్కుమార్ను గెలిపించుకోవాలని కోరారు. స్మార్ట్ సిటీ, ట్రిపుల్ ఐటీ తెచ్చిన ఘనత వినోద్కే దక్కిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలని అన్నారు. జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, మిట్టపల్లి సుదర్శన్, జనగాం శ్రీనివాస్, బోయినపల్లి మధుసూదన్రావు, సాగర్ రావు పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మల్యాలలో రోడ్షో -
అంజన్నకు బీఆర్ఎస్ అభ్యర్థి ముడుపు
పూజలు చేస్తున్న జీవన్రెడ్డి, కుటుంబ సభ్యులుకొండగట్టు(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయ స్వామి వారిని సోమవారం నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ దర్శించుకున్నారు. రానున్న ఎన్నికల్లో స్వామివారి దయతో గెలవాలని ముడుపు కట్టారు. ఆయన వెంట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీమంత్రి రాజేశంగౌడ్ ఉన్నారు.జగిత్యాల: నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆయన నిజామాబాద్లోని కంఠేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనను సత్కరించారు. -
చైతన్యంతోనే కుల సంఘాలు బలోపేతం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కథలాపూర్(వేములవాడ): ప్రజలు చైతన్యంగా ఉంటేనే కుల సంఘాలు బలోపేతమవుతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో యాదవసంఘం భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. సంఘ భవనం కోసం ప్రభుత్వం నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. అనంతరం విప్ను యాదవ సంఘం సభ్యులు సన్మానించారు. కాంగ్రెస్ నాయకులు కాయితి నాగరాజు, పులి హరిప్రసాద్, పాల్తెపు గంగారాం, కారపు గంగాధర్, మార్గం శ్రీనివాస్, గంగమల్లయ్య, గంగాధర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనంగా తూకం వేస్తున్న విషయాలపై మండలంలోని భూషణరావుపేట, పెగ్గెర్ల గ్రామాల రైతులు విప్ ఆదికి వినవ్నించారు. 40 కిలోల బస్తాకు అదనంగా కిలోన్నర, రెండు కిలోలు తూకం వేస్తేనే రైస్మిల్లర్లు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈసందర్భంగా విప్ జిల్లా సివిల్ సప్లయ్ అధికారితో ఫోన్లో మాట్లాడారు. మిల్లర్లతోపాటు రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. -
నిబంధనల మేరకు ధాన్యం తూకం వేయాలి
కథలాపూర్(వేములవాడ): మండలంలోని సిరికొండ, దూలూర్, బొమ్మెన, తక్కళ్లపెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్ రాంబాబు పరిశీలించారు. కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, తూకం వేసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. నిబంధనల మేరకు ఆరబెట్టిన ధాన్యం తూకం వేయాలని, అదనంగా తూకం వేస్తే ని ర్వాహకులపై చర్యలుంటాయన్నారు. ఆయన వెంట ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. నేడు మార్కెట్యార్డుకు సెలవుజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల మార్కెట్ యార్డుకు శనివారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. యార్డుకు అత్యధికంగా ధాన్యం రావడంతో అడ్తీ, ఖరీదుదారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి సోమవారం కొనుగోళ్లు యథావిధిగా ప్రారంభమవుతాయని, రైతులు గమనించాలని కోరారు. పంటల పరిశీలనజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం శుక్రవారం రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో నువ్వులు, పెసర, కూరగాయల తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా రై తులకు పలు సూచనలు చేశారు. నువ్వుల రకా ల్లో జేసీఎస్–1020, జేసీఎస్–2454, శ్వేత రకా ల్లో విత్తనోత్పత్తి ఎలా సాగుతుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే చిరు సంచుల దశలో ఉన్న నల్లగింజ రకం జేసీఎస్–3287 ను వ్వుల తోటలను పరిశీలించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ పద్మజ, బలరాం, రజి నీదేవి, స్వాతి, శ్రీలక్ష్మి, రైతులు పాల్గొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలిజగిత్యాల: విద్యార్థులు చిన్నతనం నుంచే ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు పద్ధతులు అలవర్చుకోవాలని డీఈవో జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించిన వివిధ పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చి న విద్యార్థులను అభినందించి మాట్లాడారు. ఇటీవల కాలంలో ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాసరచనలో జెడ్పీహెచ్ఎస్ ధరూర్ క్యాంప్నకు చెందిన సురేంద్ర, స్లోగన్ రైటింగ్లో ఆంజనేయులు, డ్రాయింగ్ పోటీల్లో రామన్నపేటకు చెందిన వర్షిని ప్రథమస్థానం సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సంపత్రావు, సెక్టోరియల్ అధికారి కొక్కుల రాజేశ్, పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలి జగిత్యాలక్రైం: పాఠశాలల వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయించాలని జిల్లా రవాణా శాఖ అధికారి వంశీధర్ అన్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, ప్రతి పాఠశాల వాహనానికి ఇన్సూరెన్స్, డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా యా జమాన్యాలు చూసుకోవాలన్నారు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంవీఐలు రామారావు, వెంకన్న, ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు. -
కేంద్ర బలగాల కవాతు
కథలాపూర్(వేములవాడ): మండల కేంద్రంలో శు క్రవారం సాయంత్రం కేంద్ర పోలీస్ బలగాల ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. మెట్పల్లి డీఎస్పీ ఉ మామహేశ్వర్రావు, ఎస్సైలు నవీన్కుమార్, కిరణ్ కుమార్, అనిల్, కిరణ్, పోలీసులు పాల్గొన్నారు. 21 నుంచి 23 వరకు నీటి సరఫరా బంద్జగిత్యాల: జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ అవుట్ గేట్ సమీపంలో ప్రధాన పైప్లైన్ లీకవుతున్న నేపథ్యంలో దాని మరమ్మతుకు ఈనెల 21 నుంచి 23 వరకు మంచినీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అనిల్బాబు తెలిపారు. కొత్తబస్టాండ్ వాటర్ ట్యాంక్ పరిధిలోని అరవింద్నగర్, పురాణిపేట, మోతెమాలవాడ, శ్రీరాంనగర్, ఎల్జీరామ్లాడ్జ్, వాణీనగర్, బీట్బజార్, తులసీనగర్, భాగ్యనగర్, అటవీశాఖ కార్యాలయం, కృష్ణానగర్, సాయిరాంనగర్, బస్డిపో ఏరియా, టవర్ ఏరియా, మోచీ బజార్, కరీంనగర్రోడ్, ఇస్లాంపుర, అంగడిబజార్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, ఈనెల 24 నుంచి యథావిధిగా సరఫరా చేస్తామని పేర్కొన్నారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
కథలాపూర్/మేడిపల్లి: అకాల వర్షంతో రైతులు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం సాయంత్రం మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలు చోట్ల ధాన్యం తడిసింది. వర్షం కురియగానే కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలకు పరుగెత్తారు. ఇళ్లలో ఉన్న రైతులు పరుగెత్తి ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్ కవర్లు కప్పారు. అప్పటికే కొందరి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. కుప్పలపై కప్పిన టార్ఫాలిన్ కవర్లపై వాననీరు నిల్వడంతో రైతులు వాటిని పారబోశారు. భూషణరావుపేటలో కవర్లపై వర్షపునీరు బీమారంలో నీటిని ఎత్తిపోస్తున్న మహిళా రైతు -
ఓటు హక్కు వినియోగించుకోవాలి
జగిత్యాల: అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో స్వీప్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటింగ్శాతం ఎక్కడైతే తక్కువగా ఉందో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేలా చూడాలని ఆదేశించారు. ఈనెల 20 నుంచి వ చ్చే నెల 11 వరకు రోజువారీ కార్యక్రమాలతో ప్రణాళిక రూపొందించి అవగాహన కల్పించాలన్నారు. వేసవి దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ఉన్నందున యువత తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, దివాకర, ఆర్డీవో మధుసూదన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ రూం పరిశీలన కలెక్టరేట్లోని కంట్రోల్ రూంను పెద్దపల్లి పార్లమెంట్ వ్యయ పరిశీలకులు సమీర్ నరైంతర్ పరిశీలించారు. శుక్రవారం ఆయన జగిత్యాలకు రాగా కలెక్టర్ యాస్మిన్బాషా స్వాగతం పలికారు. ● కలెక్టర్ యాస్మిన్ బాషా -
వసతుల లేమి
మామిడి మార్కెట్తో ఉపాధి వలస కూలీ.. జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల మండలం చల్గల్ మామిడి మార్కెట్ కూలీలకు ఉపాధి మార్గంగా మారింది. మామిడి సీజన్లో ఇక్కడ పని చేసేందుకు స్థానిక కూలీలే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ నుంచి వస్తుంటారు. అయితే, వేల సంఖ్యలో కూలీలు వస్తుండగా.. వారితో పని చేయించుకునే వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ వారు పట్టించుకోకపోవడంతో కూలీలకు కనీస వసతులు కరువయ్యాయి. వేల సంఖ్యలో కూలీలు మామిడి సీజన్ ఏప్రిల్, మే నెలల్లో కొనసాగుతుంటుంది. ఈ సీజన్లో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలో రోడ్ల వెంట వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకుని, రైతుల నుంచి మామిడికాయలు కొనుగోలు చేస్తుంటారు. కొనుగోలు చేసిన వాటిని ట్రాక్టర్ నుంచి దింపి, గ్రేడింగ్తో పాటు అట్ట పెట్టెల్లో ప్యాకింగ్ చేసి లారీల్లో లోడ్ చేసేందుకు ఎక్కువ సంఖ్యలో కూలీలు అవసరమవుతారు. దీనికి తో డు, తోటల్లో కాయలు తెంపేందుకు సైతం కూలీల అవసరం ఎక్కువ. అయితే, ఈ పనులు చేసేందుకు స్థానికంగా కూలీలు దొరక్కపోవడంతో ఇతర రాష్ట్రాల వారిని రప్పిస్తుంటారు. ఒక్కో వ్యాపారి దుకాణంలో 50 మంది వరకు పనిచేస్తుంటారు. నెల రోజుల్లో.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలను మామిడికాయలు తెంపేందుకు, లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు వ్యాపారులు ఉపయోగించుకుంటారు. అలాగే, ఢిల్లీ, రాజస్తాన్ నుంచి వచ్చినవారిని మామిడిని గ్రేడింగ్, ప్యాకింగ్ చేసేందుకు వినియోగించుకుంటారు. కూలీలు గ్రూపుగా ఏర్పడి ఒక్క టన్ను అన్లోడ్ చేస్తే రూ.250 వరకు చెల్లిస్తారు. అలాగే, గ్రేడింగ్, ప్యాకింగ్ చేసే వారికి ట్రేకు రూ.15, ప్యాకింగ్ చేసిన పెట్టెలను లారీల్లో లోడ్ చేస్తే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, కాయలు తెంపడానికి వెళ్తే రూ.500 చెల్లిస్తారు. ఒక వ్యాపారి దుకాణానికి వచ్చిన కాయలను బట్టి ఒక్కో కూలీ కనీసం 30–40 రోజుల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదిస్తారు. ఆయా రాష్ట్రాల్లో వేసవి సీజన్లో పనులు లేకపోవడంతో మామిడి మార్కెట్లో పనుల కోసం ఇక్కడికి వస్తుంటారు. జిల్లాకు కనీసం 5 వేల నుంచి 6 వేల మంది కూలీలు రాగా, ఒక్క జగిత్యాల మామిడి మార్కెట్లోనే కనీసం 3 వేల నుంచి 4 వేల మంది ఉంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల మంది కూలీల రాక సౌకర్యాల కల్పనలో వ్యాపారుల నిర్లక్ష్యంవసతులు అంతంతే.. మామిడి మార్కెట్లో కూలీల చేత పనులు చేయించేందుకు చూపుతున్న శ్రద్ధ, వారికి కనీస వసతులు కల్పించడంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అసలే మండే వేసవిలో మార్కెట్ పక్కనున్న వ్యవసాయ భూముల్లో ప్లాస్టిక్ కవర్లతో గుడారాలు వేసుకుని ఉండటం, షెడ్ల కింద పడుకోవడంతో పాటు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కనున్న చెట్ల కింద సేద తీరుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. -
వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలి
జగిత్యాలజోన్: విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగులకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా శుక్రవారం వరంగల్ హెచ్ఆర్డీ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ పాల్గొని ఉద్యోగులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ సంస్థ అభివృద్ధి కోసం సంస్థలో పనిచేస్తున్న ఆపరేషన్స్, మెయింటనెన్స్ విద్యుత్ సిబ్బందికి, జూనియర్ లైన్మెన్ నుంచి ఫోర్మెన్ క్యాడర్ వరకు అంతర్గత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపా రు. విద్యుత్ లైన్ పనులు చేస్తున్నప్పుడు స్పా ట్ ఎర్తింగ్ చేసుకుని ప్రమాదాలు జరగకుండా పనులు చేయాలని సూచించారు. వినియోగదారులకు నా ణ్యమైన సేవలందిస్తూ సంస్థకు మంచిపేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారా యణ, డీఈలు గంగారాం, రవీందర్, ఏడీఈ లు నగేశ్కుమార్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏటా వస్తాం
ఏటా మామిడి సీజన్లో జగిత్యాలకు వస్తుంటాం. నెల రోజుల పాటు ఇక్కడ పనిచేస్తాం. కనీసం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తాం. మహారాష్ట్రలో పనులు లేకపోవడంతో ఉపాధి కోసం ఇక్కడకు వస్తాం. – సేవాలాల్, మహారాష్ట్ర ప్యాకింగ్ కోసం.. మామిడికాయలను గ్రేడింగ్ చేసి, ప్యాకింగ్ చేసేందుకు ఇక్కడకు వస్తాం. మా రాష్ట్రం నుంచి కనీసం 500 మంది వరకు వచ్చారు. మామిడి మార్కెట్లో ఏదో పని దొరుకుతుందనే ఆశతో వచ్చి, ఎంతో కొంత సంపాదించుకుని వెళ్తాం. – గుడ్డె, ఉత్తరప్రదేశ్ కనీస వసతులు కల్పిస్తున్నాం మామిడి మార్కెకు అన్ని రా ష్ట్రాలకు సంబంధించి 4వేల నుంచి 5 వేల మంది వచ్చా రు. కాయలు తెంపడం నుంచి గ్రేడింగ్ చేసి, ట్రేలలో ప్యాకింగ్ చేయడం, లారీల్లో నింపడం చేస్తుంటారు. వారికి కనీస వసతులు కల్పిస్తున్నాం. – ఎండీ.మోయిన్, వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, జగిత్యాల -
రెండో రోజు ఏడు నామినేషన్లు
సుభాష్నగర్(నిజామాబాద్): నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి రెండోరోజు శుక్రవారం ఆరుగురు అభ్యర్థులు మొత్తం ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తాతో కలిసి ఒక సెట్ నామినేషన్ వేశారు. మరో సెట్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో పాటు జగిత్యాల్ ఎమ్మెల్యే సంజయ్కుమార్, బోధన్ బీఆర్ఎస్ ఇన్చార్జి అయేషా ఫాతిమాతో కలిసి దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి దేవతి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి శ్రీనివాస్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్, స్వతంత్ర అభ్యర్థిగా రాగి అనిల్ నామినేషన్ పత్రాలు సమర్పించారని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు వివరించారు. కాగా రెండు రోజుల్లో మొత్తం మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి అర్వింద్.. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు రైతులతో కలిసి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మెడలో పసుపు కొమ్ముల దండ, స్వయంగా కారు నడుపుతూ నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. పసుపు రైతుల సమక్షంలో, వారి ఆశీర్వాదంతో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. పసుపు రైతులు సమకూర్చి ఇచ్చిన డబ్బుతో నామినేషన్ డిపాజిట్ చెల్లించానని పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైతులు పండించే పసుపు, వరి, మామిడి, మొక్కజొన్న, చెరుకు, ఇతరత్రా పంటలకు విత్తనాల నుంచి మార్కెటింగ్ సౌకర్యం వరకూ అన్ని చర్యలకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయా పంటల ప్రాసెసింగ్, ప్యాకేజీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామని, స్వయం ఉపాధి మహిళలకు వాల్యూయాడెడ్ సర్వీస్లో భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. దేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా మారుస్తామని, తద్వారా యువతకు ఉపాధి పెరుగుతుందని వివరించారు. గల్ఫ్ వలసలు ఆపుతామని, అక్కడ ఉన్న వారందరికీ ఉపాధి కల్పించి వాపస్ వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పసుపు రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. రెండు సెట్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పసుపు రైతులతో కలిసి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి అర్వింద్.. -
ఎంపీగా అర్వింద్ చేసిన అభివృద్ధి శూన్యం
కోరుట్ల: నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని జువ్వాడి భవన్లో మాట్లాడారు. బీజేపీ నాయకులు దేవుడి పేర్లు చెప్పి ఓట్లు అడుక్కోవడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. తాము కూడా రోజూ దేవుని పూజ చేస్తామన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే కొన్ని అమలు చేశామని మరి కొద్ది రోజుల్లోనే పూర్తి హామీలు అమలు చేస్తామన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి ఈ ప్రాంత సమస్యలపై పూర్తి పట్టున్న వ్యక్తి అని, అతడిని గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 21న జీవన్రెడ్డి నిజామాబాద్లో నామినేషన్ వేస్తారని కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, నాయకులు కొమిరెడ్డి కరమ్, కాటిపెల్లి శ్రీనివాస్రెడ్డి, జువ్వాడి కృష్ణారావు, పట్టణ, మండల అధ్యక్షులు గంగాధర్గౌడ్, రాజం తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్ -
No Headline
కేసీఆర్ నుంచి బీఫాం అందుకుంటున్న బాజిరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్. నాయకులుజగిత్యాల: నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్దన్ను గెలిపించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతులమీదుగా గోవర్దన్ బీఫాం అందుకున్నారు. సంజయ్ మాట్లాడుతూ.. గోవర్దన్ను భారీమెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ ఎమ్మెల్యేలు గణేశ్గుప్తా, జీవన్రెడ్డి, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి పాల్గొన్నారు. -
పెద్దపల్లిలో కాంగ్రెస్ గాలి వీస్తోంది
ధర్మపురి: అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ వశమైందని, అదే ఊపుతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ది శూన్యమన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం దొంగ దీక్షలు చేపడుతున్న ఈశ్వర్ తీరును ప్రజలు గమనించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణకు 50వేల మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కంకణం కట్టుకోవాలన్నారు. ఎమ్మెల్సీ, నిజా మాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు శాయాశక్తులా కృషి చేస్తామని పెద్దపల్లి, రామగుండం, చెన్నూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాగూర్, గడ్డం వివేక్, ప్రేమ్సాగర్రావు, కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తకు ఫిట్స్.. మంత్రి శ్రీధర్బాబు ప్రసంగిస్తున్న సమయంలో ఓ కాంగ్రెస్ కార్యకర్తకు ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే మంత్రి ప్రసంగాన్ని ఆపివేశారు. విప్ లక్ష్మణ్ అతడిని ఆస్పత్రికి తరలించారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం ధర్మపురి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు -
పార్టీ విజయానికి పాటుపడాలి
రాయికల్/సారంగాపూర్/మెట్పల్లి: కాంగ్రెస్ అభ్యర్థి అయిన తన గెలుపునకు కార్యకర్తలు అండగా ఉండాలని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణ ఆర్ఎంపీలు జీవన్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించాలన్నారు. ఆర్ఎంపీలు అస్లాం, దాసరి గోవర్దన్, బైరి సుకేశ్, సద్దుల సంతోష్, దాసరి విద్యాసాగర్, పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్ పాల్గొన్నారు. సారంగాపూర్ మండలం రేచపల్లి మాజీ సర్పంచ్ ఎడమల జయ, లక్ష్మారెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఈనెల 22న నామినేషన్ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయాలన్నారు. విండో చైర్మన్ ఏలేటి నర్సింహ్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ భూక్య సరళ, ఎడమల శైలేందర్రెడ్డి, బేర మహేశ్ పాల్గొన్నారు, మెట్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బర్ల సాయన్న తన అనుచరులతో కాంగ్రెస్లో చేరగా జీవన్రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం చెప్పినా బీఆర్ఎస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. -
సెర్ప్ కేంద్రం తనిఖీ
మేడిపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని, తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకి పంపాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అన్నారు. మండలంలోని ఈదులలింగంపేట సెర్ప్ కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లపై ఆరా తీశారు. ఆకస్మికంగా వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎండవేడిమి అధికంగా ఉండటంతో హమాలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం వారికి మజ్జిగ ప్యాకెట్లు అందించారు. కట్లకుంటలో డీఆర్డీవో మదన్మోహన్ పర్యటించారు. వారితోపాటు ఏపీఎం అశోక్, వ్యవసాయ అధికారి త్రివేదిక, ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. మోదీతోనే దేశాభివృద్ధిరాయికల్: ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పడాల తిరుపతి అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లిలో గురువారం గడపగడపకూ బీజేపీ కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ధర్మపురి అర్వింద్ను ఎంపీగా.. మోదీని ప్రధానిగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉడుత రవీందర్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ఉడుత రాంసురేశ్, నాయకుల పంచతి నరేశ్, పాలడుగు రవీందర్, దువ్వాక నరేశ్, కొడిమ్యాల శేఖర్, నాగరాజు, పాలిక శేఖర్, పంచతి రాజు, బొమ్మకంటి రవి, కొడిమ్యాల రాజశేఖర్ పాల్గొన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతు తరుచూ చేయాలిజగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ లైన్ల మరమ్మతు తరుచూ చేస్తూ.. సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. జిల్లాకేంద్రంలోని ఇంజినీర్స్ భవన్లో గురువారం విద్యుత్ లైన్ల మరమ్మతు, ప్రమాదాలు, సంస్థ అభివృద్ధిపై అంతర్గత శిక్షణ ఇచ్చారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవా లని, ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను సిద్ధం చేయాలని, విద్యుత్ మోటార్ల కు కెపాసిటర్లు బిగించుకునేలా చూడాలని సూచించారు. విద్యుత్ బిల్లులు ఆన్లైన్లో చెల్లించేలా చూడాలన్నారు. విద్యుత్ అధికారులు తిరుపతయ్య, గంగారాం, రాజిరెడ్డి, తిరుపతి, రవీందర్, లక్ష్మణ్, నగేష్కుమార్, వెంకటేశ్వర్లు, జవహర్ నాయక్, హరీష్, రాజు పాల్గొన్నారు. శ్రీరాముడికి పట్టాభిషేకం పెగడపల్లి: మండలంలోని నంచర్ల, నామాపూర్, ఎల్లాపూర్, అయితిపల్లిలో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. భక్తుల శ్రీరామనామ స్మరణ మధ్య పట్టాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. నామాపూర్లో 108 హోమగుండాలతో యజ్ఞం నిర్వహించారు. రోటీగూడెం మౌనస్వామి గీతో పదేశం చేశారు. రామ భక్తులు, దీక్షాపరులు శోభాయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, జెడ్పీటీసీ రాజేందర్రావు స్వామివారిని దర్శించుకున్నారు. -
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలి డీఈవో జగన్మోహన్రెడ్డి అన్నారు. వెల్గొండ జెడ్పీహెచ్ఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల నమోదుకు హెచ్ఎంలు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేసి విద్యార్థుల అభివృద్ధికి ప్రయత్నిస్తే ప్రభుత్వ పాఠశాలలో నమోదులు పెరుగుతాయని పేర్కొన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాళ్ల అమర్నాథ్రెడ్డి, ఆనందరావు, వెల్గొండ హెచ్ఎం చంద్రశేఖర్రెడ్డి, దశరథరెడ్డి, శ్రీనివాస్, కిరణ్ పాల్గొన్నారు. డీఈవో జగన్మోహన్రెడ్డి -
44.0/29.0
7తాగునీటికి గోస గోస.. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు ఇస్తున్నామని పాలకులు, ప్రజాప్రతినిధులంటున్నా.. రాజారాంతండా గ్రామంలో మాత్రం నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గరిష్టం/కనిష్టంవాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఎండ తీవ్రత అధికమవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతంది. వేడిగాలులు కొనసాగుతాయి. 9లోu 8లోu -
తప్పేను నీటిచింత
జగిత్యాల: మున్సిపాలిటీల్లో జల సంరక్షణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎండలు ముదిరిపోవడంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీనికి విరుగుడుగా ఇంకుడుగుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలన్న నిర్ణయం పాతదే అయినా.. కొద్దిరోజులుగా దీనిపై పట్టింపు కరువైంది. ఈ నేపథ్యంలో దానికి పక్కాగా అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే వార్డుల్లో వ్యక్తిగత, వాణిజ్య, అపార్ట్మెంట్ల వారీగా సర్వే చేపడుతున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈ సర్వే కొనసాగుతోంది. ప్రధానంగా 300 చదరపు మీటర్లు కలిగిన ఇంటితోపాటు ఇతర ఏ కట్టడమైనా ఇంకుడుగుంత ఉండేలా చూడాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్ అధికారులు కమిటీగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. నిబంధనలు ఎక్కడ..? గతంలోనూ ఇంటి నిర్మాణం చేపట్టుకునే వారు ఇంకుడుగుంత నిర్మిస్తేనే అనుమతి ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి నిబంధన ఉన్నప్పటికీ అమలులో మాత్రం ఆచరణకు లేదు. టీఎస్బీపాస్ చట్టం ప్రకారం ఇంటి నిర్మాణానికి అనుమతి పొందాలంటే ఆన్లైన్లో ఇంటి నిర్మాణంతోపాటు, ఇంకుడు గుంతకు సైతం ప్రత్యేక రుసుం కింద రూ.2 వేలు చెల్లించాలి. ఇంకుడు గుంతలకు డబ్బులు ప్రతిఒక్కరూ చెల్లిస్తున్నారుగానీ ఎవరూ నిర్మించడం లేదు. ఇంకుడు గుంత నిర్మిస్తే తిరిగి ఆ రూ.2 వేలు పొందే అవకాశం ఉంది. అది ఎక్కడ కూడా అమలుకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీల్లో రుసుం ఈ ఇంకుడు గుంతల నిర్మాణం కోసం ప్రతిఇంటి యజమాని రూ.2 వేలు చెల్లిస్తుంటారు. ఇంటి నిర్మాణం పూర్తయిన అనంతరం ఇంకుడుగుంతను చూపించి ఆ రూ.2 వేలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై సరైన అవగాహన లేకనో..? లేక ఇంకుడుగుంత నిర్మించకపోవడమో..? మరే కారణమోగానీ మున్సిపాలిటీల్లోనే ఆ నిధులు మూలుగుతున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో గతేడాది 650 ఇళ్ల నిర్మాణాలు జరుగగా.. ఇంటికి రూ.2వేల చొప్పున నిధులు బల్దియాలోనే మూలుగుతున్నాయి. ఇలా ఏటా రూ.లక్షల్లో ఇంకుడుగుంతల ఫీజు అలానే ఉండిపోతోంది. గతంలో వీటి నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. నిర్వహణ ఎక్కడ..? 2018లో ప్రభుత్వం ప్రతి జిల్లా కార్యాలయంలో ఇంకుడుగుంతలు ఉండాలని ప్రత్యేక నిధులు మంజూరుచేయగా.. ప్రతి కార్యాలయంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. కానీ నిర్లక్ష్యంతో అవి కాస్త మరుగున పడిపోయాయి. ప్రతి మున్సిపాలిటీతోపాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్మించగా పిచ్చిమొక్కలు, పూడికతో నిండిపోయాయి. తాత్కాలికంగా మరమ్మతు చేపడితే ఇంకుడు గుంతలు ఉపయోగంలోకి వచ్చే అవకాశాలుంటాయి. ఇంకుడు గుంతలతో మేలు ఇంకుడుగుంతల నిర్మాణాలతో భూగర్భజలాలు పెంపొందించుకునే అవకాశాలుంటాయి. ప్రతి చోటా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడితే వర్షకాలంలో వృథాజలాలు సాధ్యమైనంత మేర భూమిలోకి ఇంకి తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి ఇంటి ఆవరణలో ‘జలసంరక్షణ’ తప్పనిసరి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ప్రారంభమైన సర్వే పాతదే అయినా పక్కాగా అమలుకు నిర్ణయం
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement