Jagitial District Latest News
-
జనాలను పిచ్చోళ్లను చేసే బడ్జెట్
కోరుట్ల: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ జనాలను పిచ్చోళ్లను చేసే బడ్జెటే తప్ప ఎలాంటి కొత్తదనం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీల ఊసే లేదు. మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 వరకు పింఛన్ పెంపుపై ఎలాంటి కేటాయింపులు లేవు. రాజీవ్ యువవికాసం కోసం గత బడ్జెట్లో రూ.6,000 కోట్లు కేటాయించి ఒక్కపైసా ఖర్చు చేయలేదు. మళ్లీ ఈ బడ్జెట్లో అదే రూ.6,000 కోట్లు కేటాయింపులు చూపించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎలాంటి కేటాయింపులు లేకపోవడం బాధాకరం. రిటైర్డ్ ఎంప్లాయీస్కు చెల్లించే సెటిల్మెంట్లపై ఎం కేటాయించలేదు. ఆరు గ్యారంటీలకు చెల్లు చీటి పెట్టారు. మొత్తానికి ఈ బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. – కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్యే, కోరుట్ల -
బీమా..
అల్పాహారం!ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాప్రతీ కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా ప్రస్తుతం 41 లక్షల కుటుంబాలు (2011 ప్రకారం.. 37 లక్షలు) ఇందిరమ్మ బీమా పొందే కుటుంబాలు: 8,00,000ఉమ్మడి జిల్లాకు కనీస అంచనా రూ.400 కోట్లుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: 2026–27 రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం విద్యార్థులు, పేదలకు పెద్దపీట వేసింది. అల్పాహారం, కుటుంబ బీమాలతో ఉమ్మడి జిల్లాలో లక్షలాదిమంది లబ్ధిదారులుగా మారనున్నారు. అల్పాహారం పథకంతో 2.01లక్షల మంది పాఠశాల విద్యార్థులు, 33 వేల మందికిపైగా ఇంటర్ విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. పథకం సమర్థంగా అమలు చేస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో వరదకాలువకు రూ.249 కోట్లు, ఎల్లంపల్లికి రూ.449 కోట్లు చొప్పున కేటాయించింది. ఉమ్మడి జిల్లా నీటిపారుదలకు దాదాపు రూ.700 కోట్లు కేటాయించింది. శాతవాహన వర్సిటీకి ఏకంగా రూ.25 కోట్లు, ఏడాది జరగనున్న పుష్కరాలకు రూ.500 కోట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని ఽగోదావరి తీరాన ఉన్న ధర్మపురి, కోటిలింగాల, గోదావరిఖని, మంథని ఘాట్లలో సదుపాయాలు కల్పనకు త్వరలోనే పనులు మొదలు కానున్నాయి.హైదరాబాద్– కరీంనగర్ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్కు ఎంత నిధులు ఇచ్చారన్నది స్పష్టం చేయలేదు. జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కు నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్పై ప్రకటన, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
యుద్ధంతో పసుపు ధరలు పతనం
జగిత్యాలఅగ్రికల్చర్: పసుపు పంటకు అంతర్జాతీయంగా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. జిల్లా రైతులు ఎక్కువగా మహారాష్ట్రలోని సాంగ్లీతో పాటు నిజామాబాద్, జిల్లాలోని మెట్పల్లి, జగిత్యాల మార్కెట్కు తరలిస్తారు. ప్రస్తుతం ఆయా మార్కెట్లలో పసుపు ఉత్పత్తులకు పలుకుతున్న ధరలు చూసి రైతులు కంగు తింటున్నారు. ఈ ఏడాది ఆశాజనకంగా పసుపు క్వింటాల్కు రూ.12– రూ.13 వేల ధర పలికినా, పశ్చిమాసియా యుద్ధంతో క్వింటాల్కు రూ.2 వేలు పడిపోయి, రూ.10 వేల నుంచి రూ.11 వేలు మాత్రమే పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. రెండో స్థానంలో జగిత్యాల రాష్ట్రంలో పసుపు సాగులో నిజామాబాద్ తర్వాత జగిత్యాల జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలో 25 వేల ఎకరాలకు పైగా పంట సాగు చేయగా, ఎకరాకు సగటున 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 7–8 లక్షల క్వింటాళ్ల పసుపు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం 1–2 లక్షల క్వింటాళ్ల వరకే పంట విక్రయించగా, రైతుల వద్దే ఇంకా 5–6 లక్షల క్వింటాళ్లు ఉంది. ప్రపంచ పసుపు పంట సాగులో 70 శాతం వాటా ఇండియాదే. తర్వాత చైనా 8 శాతం, బంగ్లాదేశ్ 3.5, నైజీరియా 3, ఇథియోపియో 3.1, వియత్నాం 2, థాయ్లాండ్లో 2 శాతం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పెరు, తైవాన్, జమైకా, హైతి, కోస్టారికా దేశాల్లో సాగు చేస్తున్నారు. ఇక దేశంలోని తెలంగాణలో 24 శాతం, ఆంధ్రప్రదేశ్ 22, తమిళనాడు 15, ఒడిశా 13, అస్సాం 6, మహారాష్ట్ర 4, కేరళ 4, కర్ణాటక 3, సిక్కింలో 1 శాతం సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్లో పసుపు సాగు చేస్తున్నారు. ఎగుమతులపై ప్రభావం మన దేశంలో పండిన పసుపును ఎక్కువగా గల్ఫ్ దేశాలైన ఇరాన్, యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, జర్మనీ, జపాన్, బ్రిటన్, అమెరికా, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేస్తారు. ఏటా దాదాపు రూ.2,000 కోట్ల విలువ గల పంట ఎగుమతి అవుతుంటుంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. భద్రత కారణాలు, రవాణా కష్టాల వల్ల పసుపు ఎగుమతిని ఎక్స్పోర్టర్లు నిలిపేశారు. ఎగుమతుల్లో డీలా ఏర్పడి, దేశీయంగా ధరలు తగ్గుతున్నాయి. అలాగే మార్కెట్లోకి కొత్త పసుపు భారీగా వస్తుండడం, యుద్ధం ప్రభావంతో వ్యాపారులు కొనుగోలు చేసిన పసుపు నిల్వలు పేరుకుపోవడం, గతేడాది నిల్వలు కూడా ఉండిపోవడం, ఏదో కారణం చెప్పి వ్యాపారులు సిండికేట్ అయి ధరలు తగ్గిస్తుండటం తదితర కారణాలతో పసుపు ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. గోదాంలకు తరలింపు పసుపు పంటకు ఎలాగైనా డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది రైతులతో పాటు తక్కువ ధరకు పంట కొనుగోలు చేసిన వ్యాపారులు నిల్వ చేసేందుకు కోల్ట్ స్టోరేజీలు, గోదాంలకు తరలిస్తున్నారు. రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయనే ఆశతో కొందరు నిల్వ చేస్తుంటే, మరికొందరు రైతులు ఏదో ధరకు అమ్ముకుంటున్నారు. అయితే, యుద్ధం ఆగిపోయి ఆయా దేశాలు మళ్లీ పసుపును దిగుమతి చేసుకుంటేనే ధరల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. క్వింటాల్కు రూ.3 వేల నష్టం మొన్నటి వరకు క్వింటాల్కు రూ.13 వేలు పలికిన పసుపు, ప్రస్తుతం యుద్ధ వాతావరణంతో రూ.3 వేల వరకు నష్టపోవాల్సి వస్తుంది. నిల్వ చేస్తామంటే ఎప్పుడు యుద్ధం ఆగుతుందో, రేట్లు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి. – ఎల్క కమలాకర్, సంగెం శ్రీరాంపూర్ -
వేంకటేశ్వరునికి క్షీరాభిషేకం
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీని వాసచార్యులు మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. విద్యకు సరిపోని కేటాయింపులుజగిత్యాల: జనాకర్షణ పథకాలే తప్ప ప్రస్తుత విద్యావ్యవస్థను బాగు చేసేలా బడ్జెట్ కేటాయింపు లేదని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి మచ్చ శంకర్ అన్నారు. శుక్రవారం జిల్లా శాఖ కార్యాలయంలో మాట్లాడారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.3,24,234 కోట్ల బడ్జెట్లో విద్య, మానవ వనరులకు కేటాయించింది రూ.26,670 కోట్లు మాత్రమేనని, ఇది బడ్జెట్లో 8.2 శాతమేనన్నారు. ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్న ప్రతిపాదన ఆహ్వానించదగిందే కానీ, పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంపు గురించి అదనపు నిధుల కేటాయింపు ప్రస్థావన లేదని, గతేడాది 7.58 శాతం కేటాయించగా, ఈసారి 8.22 శాతమే కేటాయించారన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బైరం హరికిరణ్, శివరామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్, ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్ పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలిజగిత్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన అదనపు కలెక్టర్ రాజాగౌడ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వృద్ధులు, యువత, ఒంటరి మహిళలలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతిలో నమోదు చేసుకున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు గ్రామాల మధ్య భూ వివాదంజగిత్యాలక్రైం: బీర్పూర్ మండల శివారులోని ఓ స్థలంపై రెండు గ్రామాల మధ్య వివాదం నెలకొంది. దీంతో బీర్పూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివరాలు.. బీర్పూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో నర్సింహులపల్లి గ్రామానికి చెందిన కొందరు ప్రార్థన మందిరం ఏర్పాటు చేయడంతో బీర్పూర్ గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో గ్రామానికి చెందిన వారు తమ గ్రామంలో ప్రార్థన మందిరం ఏర్పాటు చేసుకోవడంపై బీర్పూర్ వాసులు ఆందోళన చేపట్టారు. కాగా, పోలీసు, రెవెన్యూ అధికారులు అక్కడకు వెళ్లి రెండు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. బీర్పూర్ గ్రామ శివారులోని 242 సర్వే నంబరులో ఉన్నది ప్రభుత్వ భూమి అని, ఆ భూమిలో ఎవరూ మతపరమైన కట్టడాలు నిర్మించవద్దని బీర్పూర్ గ్రామస్తులు ఆందోళన చేస్తూ బైఠాయించారు. -
ఉమ్మడి జిల్లాలో అల్పాహారం పథకం వివరాలు
స్కూళ్లుసిరిసిల్ల1,82021జగిత్యాల11పెద్దపల్లి8,7001215,000కరీంనగర్ 651పెద్దపల్లి 527కరీంనగర్సిరిసిల్ల 403387108,300కళాశాలలు -
ఉద్యోగ, కార్మిక వ్యతిరేక బడ్జెట్
జగిత్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కార్మిక వర్గాన్ని మరోసారి నిరాశకు గురిచేసింది. గత బడ్జెట్ కన్నా రూ.20వేల కోట్లు పెంచినా ఇందులో రాష్ట్ర ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు లేకపోవడం శోచనీయం. సమగ్ర బీమా పథ కం పేరుతో ఉద్యోగులు, పెన్షనర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.3,143 కోట్లు కేటాయించినా అంగన్వాడీ టీచర్లు, ఆయాల పారితోషికం పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లక్షలాది కార్మికుల ఆశలు, వారి ఆకాంక్షలను నెరవేర్చకపోగా ప్రజలపై మరింత భారం మోపారు. – కోమటి చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గల్ఫ్ కార్మికులకు మరోసారి మోసం రాయికల్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గల్ఫ్ కార్మికులను మరోసారి మోసం చేసింది. ఎన్నికలకు ముందు కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్యాకేజీ కేటాయించి, గల్ఫ్ పాలసీ ప్రకటిస్తామని మేనిఫెస్టో ప్రకటించి విస్మరించారు. గల్ఫ్లో ఉంటున్న 15 లక్షల మంది కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. – రాధారపు సతీశ్, బహ్రెయిన్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు -
ఫ్లడ్ ఫ్లో కెనాల్ రూ.249.85 కోట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రూ.449.66 కోట్లు బొక్కలవాగు రూ.34 లక్షలు గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు (మొత్తం రాష్ట్రానికి) శాతవాహన యూనివర్సిటీ రూ.25 కోట్లు టీఎస్ స్పోర్ట్స్ స్కూల్ వరంగల్ అండ్ కరీంనగర్ రూ.42.80
దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్రబిందువుగా చేసుకుని సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూపొందించిన 2026–27 బడ్జెట్ సమగ్రాభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించి న సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యాలను ప్రతిబింబించే బడ్జెట్. – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ సంచలన స్కీంను ప్రారంభించింది. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువత సాధికారత, ఆర్థిక క్రమశిక్షణల మధ్య సమతుల్యం దిశగా ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. – సత్తు మల్లేశ్, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ అల్పాహారం పథకం పేద,మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వరం. మఽ ద్యాహ్న భోజన పథకానికి ఇది తోడవడంతో డ్రాపౌ ట్స్ మరింత తగ్గుతాయి. ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకూ వర్తింపజేయడం సాహసోపేతమైన నిర్ణయం. విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – డాక్టర్ సూరేపల్లి సుజాత, విద్యా కమిషన్ సభ్యురాలు -
మైనార్టీల సంక్షేమానికి కృషి
ధర్మపురి: ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా స్థానిక ఎస్హెచ్ గార్డెన్లో ముస్లింలకు తోఫాలు పంపిణీ చేశారు. గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి, పుష్కరాల వరకు ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, ఏఎంసీ చైర్ పర్సన్ చిలుముల లావణ్య, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లిం కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఆ గ్రామంలో మొదటిసారి పంచాంగ శ్రవణంరాయికల్: మండలంలోని మారుమూల గిరి జన గ్రామం జగన్నాథపూర్ 25 ఏళ్ల క్రితం పంచాయతీగా ఏర్పడింది. ఉగాదికి పంచాంగ శ్రవణమే తెలియదు. మొదటిసారి సర్పంచ్ పరంచ శంకర్ గ్రామంలో ఉగాది వేడుకలతోపాటు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. మల్లాపూర్ మండలం కుస్తాపూర్కు చెందిన అర్చకులు రమేశ్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేయించారు. నాయకులు పటేల్ సుధాకర్, సిడెం భీం పాల్గొన్నారు. ఇంటర్ మూడో మూల్యాంకనం ప్రారంభంజగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) జూనియర్ కళాశాలలో శుక్రవా రం నుంచి మూడో విడత మూల్యాంకనం ప్రారంభమవుతుందని నోడల్ అధికారి నారా యణ తెలిపారు. అధ్యాపకులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పేర్కొన్నారు. -
‘పరాభవం’లో అన్ని శుభాలే
మున్సిపల్ కార్యాలయంలో పంచాంగ శ్రవణంలో వేద పండితులు కొండగట్టులో పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ధర్మపురిలో ఉత్సవమూర్తులకు అర్చకుల పూజలు పంచాంగ శ్రవణంలో జీవన్రెడ్డి తదితరులు జగిత్యాల/మల్యాల/జగిత్యాలటౌన్/ధర్మపురి: పరాభవం నామ సంవత్సరంలో అన్ని శుభాలే కలుగుతాయని వేద పండితులు నంబి వేణుగోపాలాచార్య అన్నారు. జగిత్యాల బల్దియా ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. చైర్పర్సన్ సమిండ్ల వాణి మాట్లాడుతూ పట్టణాభివృద్ధి, సంక్షేమం నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. మాజీమంత్రి జీవన్రెడ్డి నివాసంలో పాలెపు చంద్రశేఖర్శర్మ పంచాంగ శ్రవణం చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు జీవన్రెడ్డి ఉగాది పచ్చడి అందించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత పాల్గొని ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. విశ్వహిందూ పరిషత్ వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకులు ఏసీఎస్.రాజు, వీహెచ్పీ నాయకులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఆకాంక్షించారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో బుగ్గారపు రాజేంద్రప్రసాద్ పంచాంగశ్రవణం చేశారు. ●● -
అందని మాతాశిశు సేవలు
ధర్మపురి: ధర్మపురిలోని మాతాశిశు ఆస్పత్రి సేవలకు మోక్షం కలగడం లేదు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందాలన్నా.. అప్పుడే పుట్టిన శిశువులకు అవసరమైన చికిత్స అందించాలన్నా.. పరిసర గ్రామాల ప్రజలు అయితే జగిత్యాల.. లేకుంటే కరీంనగర్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో స్థానికంగానే ప్రసూతి, వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 2022 మే నెలలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8.50కోట్లు వెచ్చించి 50పడకల మాతాశిశు ఆస్పత్రికి శ్రీకారం చుట్టింది. ఆ నిధులతో పనులు చేపట్టినా.. ఇంకా కొన్ని పనులు పూర్తికాకపోవడంతో రెండో విడత కింద మరో రూ.రెండు కోట్లు వెచ్చించింది. అన్ని నిధులతో సుమారు 90శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగేళ్లుగా సాగుతున్న పనులు పట్టణంలోని కస్తూరిబా గురుకులం పాఠశాల వెనుక భాగంలో ఈ మాతాశిశు ఆస్పత్రి నిర్మించారు. 2022లో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతులమీదుగా నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ 17,735 స్క్వైర్ ఫీట్లు, మొదటి అంతస్తు 17000 స్క్వైర్ ఫీట్లతో అన్ని సౌకర్యాలతో నిర్మించారు. మొదటి, రెండో అంతస్తులో పనులన్నీ పూర్తయ్యాయి. అయితే కొద్దిపాటి పరికరాలు మాత్రమే వచ్చాయి. వాటితో వైద్యం అందించే వీలు లేకపోవడం.. ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అప్పటినుంచి ఈ ఆస్పత్రిని పట్టించుకున్న వారు లేరు. ● మాతాశిశు ఆస్పత్రి పనులు పూర్తయిన నేపథ్యంలో సిబ్బందిని నియమిస్తే తల్లీబిడ్డలకెంతో సౌకర్యంగా ఉంటుంది. ● ఆస్పత్రిలో సిబ్బందిని నియమించేందుకు అధికారులు వైద్య విధాన పరిషత్కు ప్రతిపాదనలు పంపారు. ● గ్రౌండు ఫ్లోర్లో మొత్తం 8 గదులున్నాయి. ఇందులో ఓపి బ్లాక్, డెలివరీ గది, ట్రమేజ రూం (డెలివరీ తీవ్రతను నిర్ధారించే గది), మత్తు గది, ఈసీజీ, ఎక్స్రే, ఆల్ట్రాసౌండ్, గైనకాలజిస్ట్ గదులు పూర్తయ్యాయి. ● ఫస్ట్ఫ్లోర్లో మూడు ఆపరేషన్ థియేటర్లు నిర్మించారు. ఇందులో ఒకటి సెప్టెక్ ఓటీ, రెండు మేజర్ ఓటీ గదులు. ఆస్పత్రిలోని 50 బెడ్లలో 40 గర్భిణులు, మిగిలిన పది నవజాత శిశువుల కోసం కేటాయించారు. ● ఆస్పత్రి సిబ్బంది, పరికరాలు, ఫర్నిచర్, కాంపౌండ్వాల్ పూర్తిచేస్తే సేవలు వినియోగంలోకి రానున్నాయి. ● ఆస్పత్రి వినియోగంలోకి వస్తే ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని బీర్పూర్, సారంగపూర్ మండలాలవాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ధర్మపురిలోని ఎంసీహెచ్ ఆస్పత్రి పనులను పూర్తి చేసి టీఎస్ఎంఐడీసీ వారు అప్పగించారు. తదుపరి వైద్య సిబ్బంది కోసం వైద్య విధాన పరిషత్కు నివేదిక పంపించాం. వైద్య సిబ్బంది నియామకమై అందుబాటులోకి రావడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశముంది. – రామకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
భట్టి బడ్జెట్పై ఆశలు..!
● హుజూరాబాద్ నియోజకవర్గం రైతుల చిరకాలవాంఛ అయిన కల్వల ప్రాజెక్టు రూ.70 కోట్ల ప్రతిపాదనలతో నిర్మాణానికి ఇటీవల డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ బడ్జెట్లో ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి ప్రకటన ఉంటుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాసనసభలో నేడు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న పలు ప్రధాన ప్రాజెక్టులకు ఈసారైనా మోక్షం లభించేనా..? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ – కరీంనగర్ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేలైన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కి నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్పై ప్రకటన, కల్వల ప్రాజెక్టు నిర్మాణాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.● వేములవాడ ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ ప్లాన్ అమలు కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఇప్పటి వరకు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేసింది. మాస్టర్ప్లాన్ సమగ్ర అమలు, ఆలయ నిర్మాణం పూర్తవాలంటే.. మరో రూ.200 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా.● జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట దక్క న్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్ర భుత్వం నుంచి ప్రకటన కోసం స్థానిక రైతులు ఎదురుచూస్తున్నారు. 2015లో మూ తబడిన ఈ పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ రూ.172 కోట్ల బ కాయిలు చెల్లించింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం దాదాపు రూ.250 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేసింది. 2025లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. నేటి బడ్జెట్లో ఆ మేరకు నిధులు కేటాయిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.● మనోహరాబాద్ నుంచి కొ త్తపల్లి వరకు రూ.2,780 కోట్లతో రైల్వేప్రాజెక్టు లైన్ పనులు నడుస్తున్నాయి. సిరిసిల్ల వరకు లైన్ పూర్తవగా.. సిద్ధిపేట – సికింద్రాబాద్ వరకు రైలు అందుబాటులోకి వచ్చింది. మిడ్మానేరులో బ్రిడ్జి పనులు ఇటీవల మొదలయ్యాయి. ఇక వేములవాడ, వెదిర, కొత్తపల్లి వరకు పనులు సాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు, భూసేకరణ వంటి సమస్యలతో పనులు జాప్యమవుతున్నాయి. ఈ రైల్వేలైన్ పూర్తయితే.. ఉత్తర తెలంగాణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఉమ్మడి జిల్లాకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరుగుతుంది.● రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారంతో దాని నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈఎస్ఐ ఆస్పత్రి పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 60వేల మంది కార్మికులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం రూ.150 కోట్లు నిధులు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో భూ కేటాయింపులు, తదితర పనుల జాప్యంతో ముందుకు సాగడం లేదు.● రామగుండం బీ థర్మల్ పవర్ ప్లాంట్ మూసివేత అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల మంత్రివర్గంలో మంత్రుల బృందం ఎన్టీపీసీ, జెన్కో సంస్థల్లో ఏది తక్కువ వ్యయంతో ప్లాంట్ నిర్మించి, తక్కువ రేట్కు కరెంట్ ఇచ్చే సంస్థకు నిర్మించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని, నిధులు కేటాయిస్తేనే ఈ ప్రాంతవాసుల కోరికై నా ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ప్రస్తుతం పాత బీ థర్మల్ ప్లాంట్ మిషనరినీ తుక్కు కింద విక్రయించేందుకు వివిధ విభాగాల అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు.● పెద్దపల్లితోపాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు ప్రతిపాదించిన శ్రీలక్ష్మీనరసింహ పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి నిధుల విడుదలపై ఉమ్మడి జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మూడు నుంచి ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పత్తిపాక రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గాల్లోని 2.40 లక్షల ఎకరాలతోపాటు కొత్తగా 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చు. -
జనగణనకు ఏర్పాట్లు
జగిత్యాల: కేంద్రప్రభుత్వం జనగణనకు నిర్ణయించడంతో ఆ మేరకు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చార్జ్ సెన్సెస్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో హౌస్లిస్టింగ్, ఎన్యుమరేషన్, బ్లాక్స్ నిర్ణయించే అవకాశం ఉంది. ప్రతిఇంటికీ ప్రత్యేకంగా ఓ సంఖ్య కేటాయించనున్నారు. ఇప్పటికే జనగణన కసరత్తులో భాగంగా జిల్లా, డివిజన్, మండలస్థాయిలో చార్జ్ సెన్సెస్ అధికారులను నియమించి కలెక్టరేట్లో శిక్షణ కల్పిస్తున్నారు. సెన్సెస్ అధికారిగా అదనపు కలెక్టర్ లత వ్యవహరించనున్నారు. మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు హౌస్లిస్టింగ్, హౌస్ సెన్సెస్ అధికారులకు శిక్షణ కల్పించారు. 15 ఏళ్లు తర్వాత... 2011లో జనగణన చేశారు. వాస్తవానికి 2021లో జనగణన చేపట్టాల్సి ఉండగా కరోనాతో ఆగిపోయింది. అప్పటి నుంచి అడుగు ముందుకు పడలేదు. జగిత్యాల జిల్లాగా 2016లో ఆవిర్భవించింది. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి జనగణన చేపడుతున్నారు. ఈ లెక్కన జిల్లా గణాంకాలు పూర్తిగా వెలవడనున్నాయి. గతంలోకంటే జనాభా ఇప్పుడు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు రావడం, విద్య, ఉద్యోగాల నిమిత్తం చాలామంది ఇక్కడే నివాసం ఏర్పర్చుకున్నారు. పూర్తి ఆధారాలతో... ఈసారి జనగణన డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్ యాప్లో సమాచారం నమోదు చేయనున్నారు. ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్య, ఉద్యోగం, అన్ని యాప్లో నమోదు చేయనున్నారు. మొత్తం రెండు విడతల్లో జనగణన నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జనగణన ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తొలిదశలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ అధికారులకు శిక్షణ కల్పించాం. భవిష్యత్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికకు అవసరమైన గణాంకాలు సిద్ధమవుతాయి. – లత, అదనపు కలెక్టర్ మున్సిపాలిటీలు : 5మండలాలు : 20రెవెన్యూ గ్రామాలు : 286గ్రామాలు : 386మొత్తం జనాభా : 9,83,414అక్షరాస్యత : 54.53 శాతం -
2.25 లక్షల మంది.. రూ.243.32 కోట్లు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతు భరోసా కింద ఎకరాకు రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. యాసంగి సీజన్కు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. తొలుత ఈనెల 22న ఎకరం ఉన్నవారికి.. తర్వాత విడతల వారీగా ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలో 2,25,406 మంది రైతులు రైతుభరోసాకు అర్హత సాధించారు. వారి వివరాలను ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపించింది. ఈ లెక్కన జిల్లా రైతులకు రూ.243,32,69,106 జమ కానున్నాయి. మూడు విడతలుగా రైతు భరోసా గతంలో ఎకరం లోపు వారికి, తర్వాత రెండెకరాలు.. ఇలా ఎకరాల వారీగా రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. యాసంగి సీజన్కుగాను మొదటి విడత ఎకరం వరకు ఈనెల 22న, 20రోజుల తర్వాత ఏప్రిల్ 15 వరకు రెండో విడత కింద ఐదారు ఎకరాల వరకు, మూడో విడత కింద ఐదారు ఎకరాలపైన ఉండే రైతులందరికి ఏప్రిల్ 30వరకు రైతుభరోసా అందే అవకాశం ఉంది. జిల్లాలో అత్యధికంగా మెట్పల్లి మండలంలోని 15,516 మంది రైతులకు రూ.16.71 కోట్లు రైతు భరోసా అందనుంది. అలాగే అత్యల్పంగా జగిత్యాల అర్బన్ మండలంలో 4,744 మంది రైతులకు రూ.2.78 కోట్లు అందనున్నాయి. రైతుభరోసా డబ్బులు రైతులను ఆపదలో ఆదుకుంటాయి. డబ్బులు వస్తే యాసంగి ఖర్చులకు ఉపయోగపడతాయి. కూలీల, రసాయన ఎరువుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. – గణపతి, దొంతాపూర్, ధర్మపురి(మం) అర్హుల జాబితా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంది. ఆ మేరకు విడతల వారీగా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సీజన్లో 2.25 లక్షల మందికి, రూ.243 కోట్ల వరకు రైతు భరోసా అందే అవకాశం ఉంది. – భాస్కర్, డీఏవో -
10 సిలిండర్లు పట్టివేత
కరీంనగర్ అర్బన్: వంటగ్యాస్ అక్రమ వినియోగంపై సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరంలోని హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వాడుతుండటంపై కన్నెర్ర చేశారు. సివిల్ సప్లయ్ డీటీ సురేందర్, ఎఫ్ఐ శ్రీనివాస్రెడ్డి జ్యోతినగర్, మల్కాపూర్ రోడ్డు ప్రాంతాల్లోని హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లను తనిఖీ చేసి 10 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వంటగ్యాస్ వాడితే కేసులు నమోదు చేస్తామని వివరించారు. జగిత్యాలలో 17 సీజ్..● 6ఏ కేసు నమోదు జగిత్యాలక్రైం: పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆ శాఖ అధికారులు బుధవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 17 సిలిండర్లను పట్టుకున్నారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేశామని డీఎస్వో జితేందర్రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాలకు చిక్కిన పెద్దపులి● ఆవాసం ఏర్పర్చుకుందంటున్న గ్రామస్తులు కొడిమ్యాల: మండలంలోని సూరంపేట, దమ్మాయిపేట శివారు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి ఇక్కడే ఆవాసం ఏర్పర్చుకున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం రైతు నరహరికి చెందిన ఆవును.. సోమవారం తేజావత్ గోరికి చెందిన చూడి ఆవును చంపిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో పులి మొదట చంపిన ఆవు కళేబరం వద్దకు మళ్లీ వచ్చింది. ఈ దృశ్యం సీసీ టీవీ పుటేజీలో రికార్డయ్యింది. పులి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండడంతో ఇక్కడే ఆవాసం ఏర్పరచుకుందని సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా.. అలాంటిదేం లేదని రెండు రోజుల్లోగా పులి వేరేచోటుకు వెళ్లిపోతుందని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి● ఎమ్మెల్సీ రమణ జగిత్యాల: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ రమణ కోరారు. శాసనమండలిలో మాట్లాడుతూ.. జగిత్యాల నియోజకవర్గంలో నిరుపేదలకు అందించిన ఇళ్ల వద్ద వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని, రవాణా సౌకర్యం కల్పించి పేదలను ఆదుకోవాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ లేక ప్రజలు ఓటు వేసేందుకు కూడా రాలేదన్నారు. డంపింగ్యార్డు కారణంగా ప్రజలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. లింగ నిర్దారణ చేస్తే చర్యలు● ప్రోగ్రాం అధికారి జైపాల్రెడ్డి జగిత్యాల: లింగ నిర్ధారణ చేస్తే చర్యలుంటాయని ప్రోగ్రాం అధికారి జైపాల్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు స్కానింగ్ సెంటర్లను బుధవారం తనిఖీ చేశారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమన్నారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ప్రతినెలా 5లోపు ఫాం ఎఫ్ను సబ్మిట్ చేయాలన్నారు. సెంటర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. లింగ నిర్ధారణ చేస్తే మూడు నెలల జైలు, రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు. ఆయన వెంట భూమేశ్వర్, శంకర్, రాజేశం పాల్గొన్నారు. -
కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య
కరీంనగర్క్రైం: కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుందని వన్టౌన్ సీఐ రాంచందర్రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం నగరంలోని హనుమాన్నగర్లో నివాసం ఉంటూ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్ చంద్రశేఖర్ భార్య దివ్య(30) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బాధ భరించలేక మంగళవారం మధ్యాహ్నం గన్నేరుపువ్వుల రసం తాగింది. ఈ విషయం పోలీసుస్టేషన్కు వెళ్లిన చంద్రశేఖర్కు ఫోన్చేసి చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. దివ్య తండ్రి తెడ్ల చిన్నసమ్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఉరేసుకుని యువకుడు..జమ్మికుంట: ఆర్థిక సమస్యలతో ఓ యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన పాతకాల కిషన్(30) ప్రైవేటు సీడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి పాతకాల రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
నీడలేక.. నిలబడలేక..
రాయికల్: పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో సౌకర్యాలు లేక మండలంలోని 32 గ్రామాల ప్రయాణికుల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాయికల్ మున్సిపాలిటీగా మారి ఆరున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ పాతబస్టాండ్లో మాత్రం కనీసం షెడ్ల నిర్మాణం లేకపోవడంతో ఎండాకాలంలో ఎండుతూ.. వర్షకాలంలో నానుతూ ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు కూర్చునేందుకు కనీసం బెంచీలు లేకపోవడంతో పరిసర దుకాణాల్లో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మూలుగుతున్న రూ.30 లక్షల నిధులు బల్దియాలో బస్షెల్టర్ నిర్మాణం కోసం ఎన్సీసీఎల్ కింద రూ.30 లక్షలు మంజూరయ్యాయి. మున్సిపల్ మొదటి చైర్మన్ మోర హన్మండ్లు అప్పటి సింగరేణి సీఎండీ శ్రీధర్ను కలిసి పట్టణంలో ఎన్సీసీఎల్ పథకం కింద రూ.30 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధుల ద్వారా బస్షెల్టర్, ఓపెన్జిమ్, పార్క్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. కానీ.. ఖర్చు చేయకపోవడంతో నిధులు బ్యాంక్లోనే మూలుగుతున్నాయి. మున్సి పల్ అధికారులు సంబంధిత అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు పంపించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. మరోవైపు ఆర్టీసీ కోరుట్ల, జగి త్యాల డిపో ల అధికారులు బస్షెల్టర్ నిర్మాణం కోసం పలు మార్లు పరిశీలించినప్పటికీ అది కాగి తాలకే పరి మితమయ్యాయి. నూతన పాలకవర్గ సభ్యులైనా పాతబస్టాండ్పై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ ప్రాంతంలో షెల్టర్ నిర్మాణం చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రాయికల్ పాతబస్టాండ్లో ప్రయాణికుల అవస్థలు షెల్టర్ కోసం రూ.30 లక్షలు మంజూరు అధికారుల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం నూతన పాలకవర్గంతోనైనా మోక్షం లభించేనా..? -
ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలు సమకూర్చండి
కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి వైద్య పరికరాలు సమకూర్చాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్ అన్నారు. కోరుట్ల, మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, పరికరాల కొరతపై ఎమ్మెల్యే బుధవారం శాసనసభలో ప్రస్తావించారు. రెండున్నరేళ్లుగా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోవటం లేదన్నారు. కోరుట్ల ఆసుపత్రిలో ఈఎన్టీ సర్జన్, జనరల్ సర్జన్ ఉన్నప్పటికీ అవసరమైన పరికరాలు లేక రోగులకు సరైన వైద్య అందటం లేదన్నారు. వెంటనే పరికరాలు సమకూర్చాలని కోరారు. మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పాత భవనం శిథిలావస్థలో ఉందని, ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందని, కొత్త భవనం 90శాతం పూర్తయినా వినియోగంలోకి తేలేకపోతున్నారని తెలిపారు. మిగిలిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్ -
పార్టీ మారొద్దు..!
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీతో సుధీర్ఘ అనుబంధం కలిగిన జీవన్రెడ్డి పార్టీ వీడాలనుకోవడం బాధాకరమని, చివరి నిమిషంలో అద్భుతం జరిగి ఆయన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఏఐసీసీ పరిశీలకులు కత్తి వెంకటస్వామి అన్నారు. అవమానాలు భరించలేక కాంగ్రెస్ను వీడుతున్నట్లు ప్రకటించిన జీవన్రెడ్డిని బుజ్జగించేందుకు బుధవారం జగిత్యాలలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్లోనే కొనసాగాలని కోరారు. దాదాపు గంటపాటు జరిగిన భేటీ అనంతరం వెంకటస్వామి మాట్లాడుతూ జీవన్రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడడం పార్టీకి ఆశనిపాతం అవుతుందన్నారు. జీవన్రెడ్డి పార్టీలో కొనసాగాలని రాహుల్గాంధీ కోరుకుంటున్నారని తెలిపారు. ఆయనను ఒప్పించి పార్టీలో కొనసాగాలని కోరేందుకే పార్టీ దూతగా తాను వచ్చినట్లు తెలిపారు. ఆయన ఎంతో ఆవేదన చెందితే తప్ప పార్టీతో ఉన్న సుధీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవాలని కోరుకోరని, పార్టీ కూడా అలాంటి నాయకుడిని వదులుకునేందుకు సిద్ధంగా లేదని వివరించారు. జీవన్రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో ఏదైనా అద్బుతం జరిగే అవకాశం లేకపోలేదన్నారు. ● మాజీమంత్రి జీవన్కు బుజ్జగింపులు ● ఆఖరి నిమిషంలో అద్భుతం జరగొచ్చు ● ఏఐసీసీ పరిశీలకుడు కత్తి వెంకటస్వామి -
అవినీతి కేసులో ఇద్దరి అరెస్టు
కరీంనగర్క్రైం/జగిత్యాలక్రైం: అవినీతి కేసులో ఎకై ్సజ్ సీఐతో పాటు సహకరించిన ఉపాధ్యాయుడిని ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో మామూళ్లు తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా దర్యాప్తు చేశారు. రాము ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.20 లక్షలు లభ్యమైంది. ఈ విషయంపై ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపారు. ఎకై ్సజ్ సీఐ ఇంట్లో సోదాలు ఏసీబీ అధికారులకు పట్టుబడిన కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ రాములుకు చెందిన జగిత్యాలలోని భవానీనగర్లోని ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. రాములుది జగిత్యాల జిల్లా భీమారం మండలకేంద్రం. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బినామీ పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. -
అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త అరెస్ట్
కోరుట్లరూరల్: అదనపు కట్నం కోసం గర్భవతి అయిన భార్య వైష్ణవిని కత్తితో పొడిచి, గొంతు నులిమి అతి దారుణంగా చంపిన ఆమె భర్త చిత్తరి హరిబాబును కోరుట్ల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీఎస్పీ అడ్లూరి రాములు వివరాలు వెల్లడించారు. మాదాపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ కూతురు వైష్ణవిని హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత హరిబాబుకు కట్నం కింద రూ.ఐదు లక్షల నగదు, మాదాపూర్లో రెండు గుంటల భూమి ఇచ్చారు. అదనంగా మరో రూ.5 లక్షలు కట్నం కావాలని హరిబాబు తల్లి లక్ష్మీ, సోదరులు ఆనంద్, అశోక్ ప్రోద్బలంతో కొంతకాలంగా హరిబాబు వైష్ణవిని వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి వైష్ణవి, హరిబాబు గొడవపడ్డారు. వైష్టవి నిద్రించిన తర్వాత హరిబాబు ఆమె మెడపై కత్తితో పొడిచి, గొంతు నులిపి చంపేసి పారిపోయాడు. వైష్ణవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తుండగా.. కోరుట్ల శివారు కోనరావుపేట రోడ్లోగల డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఉండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఉపయోగించిన ద్విచక్రవాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, పోలీసులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాములు నిందితుడిని రిమాండ్కు తరలింపు -
విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి
జగిత్యాల: విద్యార్థులు నైపుణ్యం పెంచుకుంటే అన్నిరంగాల్లో విజయం సాధించవచ్చని టీఎస్కేసీ కో–ఆర్డినేటర్ నీరజ అన్నారు. బుధవారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో నాంది ఫౌండేషన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో మూడురోజులు శిక్షణ కల్పించారు. విద్యార్థులకు సంఖ్య వాచక సంబంధాలు, రక్త సంబంధాలు, దిశలపై శిక్షణ కల్పించారు. విశ్లేషనాత్మక నైపుణ్యాలు పెరిగి విద్యార్థులు పోటీ పరీక్షల్లో వచ్చే పరీక్షలకు సులభంగా జవాబు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రమోద్కుమార్, వైస్ ప్రిన్సిపల్ చంద్రయ్య, సంగీత, సాగర్, పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలను పెంచాలి
● అదనపు కలెక్టర్ రాజాగౌడ్ జగిత్యాల: ఉపాధి హామీ పథకంలో కూలీలను పెంచాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. బుధవారం ఎంపీడీవోలు, అసిస్టెంట్ ఇంజినీర్లు, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, సీసీరోడ్లు, పశువుల పాకలు, కోళ్ల పాకలు మొదలైన పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రఘువరణ్, ఏఈ లక్ష్మణ్రావు, పాల్గొన్నారు. -
వేతనాలు చెల్లిస్తాం
కార్మికులకు వేతనాలు చెల్లించాలని అధికారులకు ఇప్పటికే సూచించాం. బుధవారం వరకు పెండింగ్ వేతనాలు చెల్లిస్తారు. ఈవిషయంపై అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపాం. మరోసారి వారితో సమావేశమై సమీక్షిస్తాం. ఆస్తిపన్ను వసూలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం. – మహంకాళి స్వామి, మేయర్, రామగుండం రెండురోజుల్లో చెల్లింపులు కార్మికులందరికీ రెండురోజుల్లోగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆస్తిపన్ను 100 శాతం వసూలయ్యేలా ప్రతీరోజు సమీక్షిస్తున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్, నల్లాబిల్లులు, ట్రేడ్లైసెన్స్ వసూళ్లపై ప్రతీరోజూ ప్రత్యేకంగా సమీక్షిస్తూనే ఉన్నాం. – అరుణశ్రీ, కమిషనర్, రామగుండం -
అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదు
కరీంనగర్టౌన్: అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, అన్నదాతలను విస్మరిస్తే మూల్యం చెల్లించక తప్పదని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, ఓసీ జేఏసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భగత్నగర్లో ఉమ్మడి జిల్లా రైతు గర్జన సమరభేరీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధనకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28న ఓసీ ఐకాస, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో లక్షమందితో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. నాయకులు పెండ్యాల కేశవ రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, జున్నూతుల రాజిరెడ్డి, అయిత నాగరాజు, బండ గోపాల్ రెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి, బుర్రా శ్రీనివాస్ గౌడ్, చాడ రవీందర్ రెడ్డి, చింతల శ్రీనివాస్, కొత్తకొండ రవీందర్ రావు, గౌతమ్ శర్మ, చందుపట్ల జనార్ధన్, స్వామి పాల్గొన్నారు. రైతు మహా గర్జన సమరభేరి సభకు వేలాదిగా తరలి రావాలి రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పొలాడి రామారావు ఓసీ ఐకాస జాతీయ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి -
ఆర్థిక సంక్షోభం!
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. అధికారుల ముందుచూపు లేకపోవడం ఇందుకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఉగాది, రంజాన్ పండుగల వేళ వేతనాలు అందక అవుట్ సోర్సింగ్ కార్మికులు, వారి కుటుంబాలు పస్తులు ఉండే దుస్థితి నెలకొనడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణంగా ప్రతీనెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించే ఆనవాయితీ ఉంది. ఈనెల మూడోవారం గడుస్తున్నా చెల్లింపులు లేవు. దీంతో పండుగలు ఎలా జరుపుకోవాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 600 మంది పడిగాపులు... కార్పొరేషన్లోని శానిటేషన్ విభాగంలో 448 మంది, ఆఫీసులోని పలు విభాగాల్లో మరో 125 మందితోపాటు మరికొందరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు వేతనాల కోసం పడిగాపులు గాస్తున్నారు. వేతనాల కోసం సుమారు రూ.కోటి 30 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంది. ఆదాయం తగ్గి.. నిర్వహణ కష్టాలు.. బల్దియాకు ప్రధాన ఆదాయం ఆస్తిపన్ను, నల్లాబిల్లులే. అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, విద్యుత్ చార్జీలు వంటి ఖర్చులు సాధారణ నిధుల నుంచే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను 60శాతం కూడా వసూలు కాలేదు. నల్లా బిల్లుల్లో సాంకేతిక సమస్యలు నల్లావివరాలు ఆన్లైన్లో అందుబాటులో లేవు. బకాయిలు వసూలు కావడంలేదు. తాజా బిల్లులు స్వీకరిస్తున్నారు. ఆఫ్లైన్ చెల్లింపులకు వచ్చిన వినియోగదారుల నుంచి కూడా డబ్బులు తీసుకోడంలేదు. దీంతో బల్దియా ఆదాయానికి బ్రేక్ పడింది. మొత్తంగా ఆస్తిపన్ను, నల్లాబిల్లులు దాదాపు రూ.10 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. పర్యవేక్షణ లోపం వసూళ్ల కోసం సిబ్బంది పెద్దసంఖ్యలోనే ఉన్నారు. పర్యవేక్షణ లేక ఫలితాలు కనిపించడం లేదు. లక్ష్యం ఉన్నా, అమలులోనే లోపం తలెత్తింది. మళ్లించిన నిధులు.. ఇప్పుడు భారంగా... ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదాడి క్రితమే స్టాంప్ డ్యూటీ ద్వారా రూ.16 కోట్లు విడుదల చేసింది. ఇందులో అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లుల వినియోగంతోపాటు అవసరైనతే వేతనాలకు ఆరు నెలలకు సరిపడా నిధులు నిల్వ చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. ముందుచూపు లేకుండా అధికారులు వీటిని ఇతర అవసరాలకు మళ్లించారు. పర్యవసాణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ఆరోపణలు వస్తున్నాయి. మార్చిలోనే సంక్షోభం సాధారణంగా మార్చి, ఏప్రిల్లో బల్దియా ఆదా యం పెరుగుతుండడంతో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదు. ఈసారి మార్చిలోనే సంక్షోభం రావడం విస్మయం కలిగిస్తోంది. మూడోవారం గడుస్తున్నా కార్మికులకు అందని వేతనాలు ఏడాది క్రితమే రామగుండానికి రూ.16 కోట్ల స్టాంప్ డ్యూటీ వేతనాలకు సరిపడా నిధులు నిల్వ ఉంచాలని ఉత్తర్వులు ఇవేమీ పట్టించుకోకుండా అధికారుల ఎడాపెడా ఖర్చులు బల్దియా కార్మిక కుటుంబాలకు పండుగపూట తప్పని పస్తులు -
కౌలు రౌతు ఆత్మహత్య
రామడుగు/కొత్తపల్లి: వ్యవసాయంలో అప్పులు, అనారోగ్యంతో కొత్తపల్లికి చెందిన కౌలు రైతు చెక్కల అంజయ్య(65) క్రిమిసంహారక మందుతాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రామడుగు ఎస్సై కె.రాజు వివరాల మేరకు కొత్తపల్లి చెందిన కౌలు రైతు అంజయ్య పంటనష్టం, అప్పులు, అనారోగ్యంతో రామడుగు మండలం దేశ్రాజ్పల్లి శివారులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య ధర్మారం: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన గుమ్మడి వెంకటేశ్(37) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ధర్మారం ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. వెంకటేశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల స్వగ్రామం వచ్చినా మద్యం తాగడం ఆపలేదు. ఇందుకోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చే దారిలేకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్నాడు. గ్రామశివారులో పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగానే మంగళవారం మరణించాడు. ఈమేరకు మృతుడి భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దొంగతనం కేసులో ఒకరి అరెస్టు మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్స్టేషన్ పరిధిలోని ఒకఇంట్లో దొంగతనం చేసిన తిరునాహరి రాజును మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రమేశ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుడి నుంచి 9.30 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కానిస్టేబుళ్లు అనిల్, శివకుమార్, నితిన్, రామకృష్ణ, వంశీ పాల్గొన్నారు. హత్యాయత్నం చేసిన భర్త రిమాండ్ ధర్మపురి: క్షణికావేశంలో భార్యపై పెట్రోలు పోసి నిప్పటించిన కేసులో భర్తను అరెస్టు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ధర్మపురిలోని ఎస్సీకాలనీకి చెందిన బడగు నవీన్కు మండలంలోని తుమ్మెనాలకు చెందిన మసీదు రమ్యతో నాలుగేళ్ల క్రితం ప్రేమ వివా హం జరిగింది. కొద్దిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడి రమ్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రమ్యపై భర్త కోపం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి నవీన్, రమ్య వద్దకు వెళ్లి ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. వెంటనే స్థానికులు 108లో జగిత్యాల, పరిస్థితి విషమించడంతో వరంగల్కు తరలించారు. బాధితురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి నవీన్ను రిమాండ్కు పంపినట్లు ఎస్సై తెలిపారు. -
మైనర్ల మధ్య ఘర్షణ.. కత్తిపోటు ఘటన
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్లో సోమవారం రాత్రి మైనర్ల మధ్య ఘర్షణ జరిగి కత్తిపోటు ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జన్మదిన వేడుకల సందర్భంగా ఒకేచోట చేరిన పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా కొందరు కత్తులతో దాడికి దిగినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఎనిమిది మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసులో సంబంధిత మైనర్లతో పాటు ఘటన సమయంలో అక్కడ ఉన్న వారందరినీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు పంపినట్లు టౌన్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. 26 నుంచి ఆర్టిజన్ల ఉద్యమంరామగుండం/పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్రేట్ కార్మికుల సమస్య లు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్(టీవీఏఈ జేఏసీ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ తూళ్ల నాగరాజు కోరారు. ఈమేరకు విద్యుత్ సంస్థల సీఎండీ, మేనేజింగ్ డైరెక్టర్ హరీశ్, టీజీట్రాన్స్కో, టీజీఎస్పీడీసీఎల్, టీసీఎన్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్లకు సమ్మె నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 26న డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నా, 30న రెండోసారి ధర్నా, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల ఎదుట ధర్నా, వంటావార్పు, ఏప్రిల్ 4న కేటీపీఎస్–పాల్వంచ జెన్కో విద్యుత్ కేంద్రం ఎదుట ధర్నా, ఏప్రిల్ 7న ‘చలో వరంగల్’తో టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తామన్నారు. అయినా, యాజమాన్యా లు, ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 8న నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. -
తెలుగులో 99 మార్కులు.. తిరుమల తీసుకెళ్లిన అధ్యాపకుడు
మానకొండూర్: తెలుగు భాషను ప్రోత్సహించేందుకు ఓ అధ్యాపకుడు వినూత్న ఆలోచన చేశాడు. ఇంటర్లో తెలుగు సబ్జెక్టులో 99 మార్కులు తెచ్చుకున్న వారిని తిరుమల వెంకన్న దర్శనానికి తీసుకెళ్తానని చెప్పాడు. ఎనిమిది మంది 99 మార్కులు తెచ్చుకోగా ఇచ్చిన మాట ప్రకారం వెంకన్న దర్శనం చేయించాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన బోళ్ల ప్రవీణ్కుమార్ కామారెడ్డి మైనారిటీ బాలుర జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. తాను బోధించే విద్యార్థులకు తెలుగు సబ్జెక్టుపై మక్కువ పెంచేలా వినూత్నంగా ఆలోచన చేశాడు. తెలుగులో 99 మార్కులు తెచ్చుకుంటే తిరుమల తీసుకెళ్తానని విద్యార్థులతో చెప్పాడు. గతేడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసిన 40 మందిలో 8మంది 99 మార్కులు తెచ్చుకున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో తిరుమల తీసుకెళ్లడం వీలుకాకపోవడంతో సదరు విద్యార్థులను ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన మరునాడు తిరుమల తీసుకెళ్లాడు. శనివారం వెంకన్న దర్శనానికి వెళ్లిన విద్యార్థులు మంగళవారం కామారెడ్డికి చేరుకున్నారు. వీరితో అధ్యాపకులు బాలమల్లు శ్రీకర్, రవి ఉన్నారు. -
సీసీ కెమెరాకు చిక్కిన పెద్దపులి
కొడిమ్యాల : మండలంలో గతనెల రోజులుగా అడవిలో తిరుగుతూ పశువులపై దాడి చేసిన పులి సోమవారం రాత్రి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఆవును చంపిన పులికొంత భాగం తిని వదిలేసింది. మిగిలిన మాంసం కోసం మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున అటవీ శాఖ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. సోమవారం అర్ధరాత్రి తిరిగి మరోసారి ఆవు మాంసాన్ని తింది. పులి వయసు నాలుగున్నరేళ్లు ఉంటుందని తెలిపారు. పులిని ట్రాక్ చేసేందకు మూడు బృందాలను నియమించామని, పశువుల కాపరులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి రవి ప్రసాద్ తెలిపారు. పులి ఆకలి తీర్చుకునేందుకు మరోసారి చనిపోయిన ఆవు వద్దకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎఫ్ఆర్ఓ గులాం మొయినద్దీన్, డీఎఫ్ఆర్వో ముషీర్, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. -
కల్వర్టును ఢీకొన్న కారు
పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ బస్టాండ్ సమీపంలో ఫోర్లైన్ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో దంపతులు ఎడ్ల శ్రీనివాస్(44), రజిత(40) దుర్మరణం చెందారు. బసంత్నగర్ ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడ్ల శ్రీనివాస్ తన భార్య రజితతో కలిసి ఈనెల 15న హైదరాబాద్లోని తమ బంధువుల గృహ ప్రవేశ వేడుకకు కారులో వెళ్లారు. ఈనెల 16న సాయంత్రం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని కరీంనగర్లో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుచున్న తన కూతురు రిషిత వద్దకు వెళ్లారు. ఆమెతో కాసేపు సరదాగా గడిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తమ కారులో మంచిర్యాలకు బయలుదేరారు. బసంత్నగర్ బస్టాండ్ దాటిన తర్వాత ఫోర్లేన్ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డుపక్కన కల్వర్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు హెచ్కేఆర్ టోల్ప్లాజా అంబులెన్స్ సిబ్బంది, ఎస్సై శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. మృతదేహాలను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కూతురు రిషిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా మృతులకు రిషిత ఒక్కగానొక్క కూతురు. తల్లిదండ్రులను కోల్పోయిన రిషిత రోదనలు మిన్నంటాయి. దంపతుల దుర్మరణం -
ఆన్లైన్లో ‘ఎల్సీ’
వీణవంక: విద్యుత్ సమస్యలు పరిష్కరించే క్రమంలో సమన్వయ లోపంతో చాలా మంది సిబ్బంది కరెంటు స్తంభంపైనే ప్రాణాలు వదిలారు. సిబ్బంది రక్షణ, విద్యుత్ ప్రమాదాల నివారణ, గంటల తరబడి అంతరాయం కలగకుండా ఉండేందుకు టీజీఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తితే విద్యుత్ సబ్స్టేషన్లో ఉన్న ఆపరేటర్కు ఫోన్చేసి ఎల్సీ(లైన్ క్లియర్) తీసుకొని మరమ్మతు చేసేవారు. దీంతో గంటల తరబడి అంతరాయం ఏర్పడేది. ఆపరేటర్, క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది మధ్య సమస్వయ లోపంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని టీజీ ఎన్పీడీసీఎల్ ఆన్లైన్ ఎల్సీకీ శ్రీకారం చుట్టింది. ఎల్సీ తీసుకోవాలంటే ఆన్లైన్ అనుమతి తప్పనిసరి చేశారు. విద్యుత్ వైర్లు, ఫీడర్, ఫీజు సరి చేయాలంటే లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్స్థాయి అధికారి ఆన్లైన్లో వివరాలు అప్లోడ్ చేస్తే ఏఈ పరిశీలించి అనుమతిస్తారు. అప్పుడే సంబంధిత విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ ఎల్సీ ఇస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారికి సమాచారం ఇస్తారు. తద్వారా క్షేత్రస్థాయిలో ప్రమాదాలను తగ్గించడంతో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలోని గ్రామాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఆన్లైన్ ఎల్సీ ఇలా.. జిల్లావ్యాప్తంగా 318 గ్రామపంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 200కు పైగా విద్యుత్ సబ్స్టేషన్లున్నాయి. గతంలో గ్రామాల్లో విద్యుత్ పోలు, వైర్లు, ఫీడర్లు, ఫీజులు తదితర సమస్యలు తలెత్తితే సంబంధిత సబ్స్టేషన్ ఆపరేటర్కు ఫోన్ చేసి ఎల్సీ తీసుకునేవారు. ఆపరేటర్కు క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి మాత్రమే ఈ సమచారం ఉండేది. ఫై స్థాయి అధికారులకు సమాచారం లేకపోవడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడేది. ఇప్పుడు ప్రతి సబ్స్టేషన్లో డేటా సిస్టం ఏర్పాటు చేసి కిందిస్థాయి సిబ్బంది నుంచి సీఎండీ వరకు ఎల్సీ సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారు. ఏదైన సమస్య తలెత్తితే ఆన్లైన్లో సమస్య ఫొటో అప్లోడ్ చేయాలి. ఏఈ పరిశీలించి ఆపరేటర్కు అనుమతి ఇస్తాడు. అప్పుడు సబ్స్టేషన్లో సరఫరా నిలిపివేస్తూ, ఆ ఫొటోను ఆపరేటర్ ఆప్లోడ్ చేస్తాడు. మరమ్మతు పూర్తయిన తర్వాత మళ్లీ సిబ్బంది ఫొటో తీసి ఆన్లైన్లో పెడతారు. వెంటనే ఆపరేటర్ సరఫరా పునరుద్ధరిస్తారు. దీంతో ఎన్నిసార్లు ఎల్సీ తీసుకున్నారో పైస్థాయి అధికారులకు తెలిసిపోతుంది. మరమ్మత్తు 2గంటల లోపు ఉంటే ఏఈ, 2గంటల పైన అవసరముంటే డీఈఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన విద్యుత్ ఉద్యోగి ఏడాది క్రితం విద్యుత్ వైర్లు సరి చేసేందుకు సబ్స్టేషన్లో ఉన్న ఆపరేటర్కు ఫోన్ చేసి ఎల్సీ తీసుకున్నాడు. మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగింది. షాక్ తగిలి విద్యుత్ పోలు నుంచి కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకారం చుట్టిన టీజీఎన్పీడీసీఎల్ క్షేత్రస్థాయిలో మరమ్మతుకు ఆన్లైన్ ఆనుమతి తప్పనిసరి విద్యుత్ ప్రమాదాల నివారణకు అధికారుల చర్యలు ఏజేఎల్ఎం నుంచి సీఎండీ వరకు యా్ప్లో పరిశీలించే అవకాశం -
ఎల్ఎండీ శ్రీవేంకటేశ్వరాలయంలో చోరీ
తిమ్మాపూర్: మండలంలోని ఎల్ఎండీ కాలనీ అండాల్ పద్మావతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఇటీవలే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవార్లకు అర్చకులు ఆభరణాలు అలకంరించారు. ఈ విషయం గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం గుడికి తాళం వేసి అర్చకులు ఇంటికి వెళ్లారు. మంగళవారం వేకువజామున శుభ్రపరచడానికి వచ్చిన సిబ్బంది తాళాలు పగలగొట్టబడి ఉండటం గమనించారు. వెంటనే అర్చకులకు సమాచారం అందించారు. అర్చకులు వచ్చి చూడగా స్వామి కిరీటం, అమ్మవారి నగలు, ఇతర ఆభరణాలు కనిపించలేదు. ఆలయంలో గునపం, వాటర్ బాటిల్... చోరీకి వచ్చిన దొంగలు వెంట గునపం, వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు. గునపంతో తాళం పగలగొట్టి లోకిని ప్రవేశించి ఆభరణాలు అన్నీ మూటగట్టుకుని వెళ్లారు. చోరీ అయిన సొత్తు విలువ దాదాపు రూ.10 లక్షల పైగా ఉంటుందని అర్చకులు తెలిపారు. ఎల్ఎండీ పోలీసులు స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్, క్లూ టీమ్లకు సమాచారం అందించి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రూ.10 లక్షల విలువగల ఆభరణాలు అపహరణ -
మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాయికల్(జగిత్యాల): మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలో మంగళవారం ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం రేవంత్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, మాజీ చైర్మన్ మోర హన్మాండ్లు, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, కమిషనర్ కీర్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వపరంగా నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమానికి రాయికల్ పట్టణంతో పాటు మండలంలోని మైనార్టీలకు ఎలాంటి సమాచారం లేదని మైనార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మందికి మాత్రమే పరిమితమయ్యేలా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మైనార్టీ తోఫా ఇవ్వకపోవడం బాధాకరం జగిత్యాల: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీల తోఫా ఇవ్వకపోవడం బాధాకరమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రతి ఏడాది తోఫా ఇచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. గత పాలనలో జగిత్యాల నియోజకవర్గంలో 4 వేల తోఫాలు ఇస్తే ప్రస్తుతం 1,200 తోఫాలతో సరిపెట్టి కుట్ర చేస్తుందన్నారు. గతంలో కల్యాణలక్ష్మి రూ.1.16 లక్షలు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుత పాలనలో అన్ని వర్గాలవారు నష్టపోతున్నారన్నారు. -
భవంతి మెడలో గజమాల..!
ఈ బంగ్లాను చూస్తుంటే ఏదో శుభకార్యానికి అందంగా ముస్తాబు చేసినట్లు కనిపిస్తుంది కదూ. ఎంతో ఆకర్షణీయంగా ఎగబాకిన రాధాకృష్ణ పూల తీగ భవంతి మెడలో అలంకరించిన గజమాలను తలపిస్తోంది. జగిత్యాల పట్టణంలోని రాజీవ్ బైపాస్ రోడ్డులోని సాజిద్ అలీ ఇంటిపైకి ఎగబాకిన రాధాకృష్ణ చెట్టు తీగకు విరబూసిన పూలతో ఆ భవంతి.. ప్రకృతి అందాలు హారంగా అలంకరించినట్లు కనిపిస్తోంది. రోడ్డుపై వెళ్లే వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ఇంటి యజమాని మహ్మద్ సాజిద్ అలీ ఆఫ్రికన్ ప్యారెట్ జాతి చిలుకను పెంచుతున్నాడు. చిలుక తింటూ కింద పడేసిన సన్ఫ్లవర్ గింజ మొలకెత్తి సన్ఫ్లవర్ పూవు విరబూసింది. దీంతో ఇంటి ఆవరణ మరింత సుందరంగా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. – జగిత్యాలటౌన్ -
దర్జాగా దోపిడీ..!
రాయితీ పక్కదారి..హోటళ్లలో రాయితీ సిలిండర్లు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సిలిండర్లు దొరకడం లేదంటూ జనం ఆందోళన చెందుతుంటే.. మరోవైపు దర్జాగా రాయితీ సిలిండర్లను వినియోగిస్తూ హోటళ్లను నడిపిస్తున్నారు. అధికారుల తనిఖీలో నిత్యం బయట పడుతున్నాయి. అధికారుల నిఘా పెడితే మరిన్ని సిలిండర్లు సైతం బయటపడే అవకాశముంది. జగిత్యాల: ముందస్తు జాగ్రత్తగా ప్రజలు 2 రోజులుగా సిలిండర్ల కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో సైతం పెట్రోల్ రావడం లేదని కొందరు పేర్కొనడంతో.. వాహనాల్లో ముందు జాగ్రత్తగా పెట్రోల్ నింపుకుంటున్నారు. ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం సైతం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో గృహావసరాలు, అత్యవసర సేవలకందించే ఆస్పత్రులకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. దీంతో సిలిండర్లు దొరకడం లేదనే పుకార్లు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2 రోజులుగా గ్యాస్ సిలిండర్ల కోసం టోల్ఫ్రీ నంబర్లు, గ్యాస్ సిలిండర్ల యాప్ల ద్వారా బుక్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుక్ కాకపోవడంతో ప్రజలు సిలిండర్లు రావేమోనని భయాందోళనకు గురవుతున్నారు. సిలిండర్ షాపుల నిర్వాహకులు మాత్రం సరఫరా కొంత స్లోగా ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేవని, సాధారణంగానే కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం హాస్టళ్లు, కళాశాలలకు 19 కిలోల గ్యాస్ సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్లే ఈ పరిస్థితులు వచ్చినట్లు భావిస్తున్నారు. రావేమోనని.. చిన్న, మధ్యతరగతి కుటుంబాలు సిలిండర్లు బుక్ కాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక సిలిండర్ వీరికి 3 నెలలు వస్తుంటుంది. చాలామంది ఒకసారి బుక్ చేసుకున్న అనంతరం నెల, 2 నెలల తర్వాత బుక్ చేసుకుంటారు. కానీ ఈ మధ్య సర్వర్ స్లోగా ఉందో లేదో తెలియదు కానీ సిలిండర్లు రిఫిల్ బుకింగ్ మాత్రం కావడం లేదు. ఒకవైపు సోషల్ మీడియా, దిన పత్రికల్లో మాత్రం గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం సైతం ఆంక్షలు విధిస్తున్నట్లు రావడంతో.. ఎక్క డ బందవుతాయోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దాదాపు గ్రామీణ, పట్టణం అనే తేడా లేకుండా 99 శాతం సిలిండర్లే వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ఒకవేళ బందయితే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొంటాయి. ఇప్పటికే మహా నగరాల్లో వాణిజ్య సిలిండర్లు రాకపోవడంతో హోటళ్లను సైతం మూసేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను సైతం ఆదేశించింది. ఈ విషయంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎస్మా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఒకవైపు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ సరఫరా నిలిచిపోతుందనే భయాందోళనకు గురవుతుంటే.. రాయితీ సిలిండర్లు మాత్రం పక్కదారి పడుతున్నాయి. హోటళ్లలో చిన్నచిన్న సెంటర్లలో గృహావసరాలకు సంబంధించిన సబ్సిడీ సిలిండర్లను వినియోగిస్తున్నారు. జిల్లాలో ప్రతీ హోటల్, స్వీట్ హౌస్, రెస్టారెంట్లలో సబ్సిడీ సిలిండర్లు వాడుతున్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తోపుడు బండ్లు, టీకొట్లు నిర్వాహకులు వీటినే వినియోగిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
రెండో రోజూ ‘ఆశ’ల ఆందోళన
జగిత్యాలటౌన్: సమస్యలు పరిష్కరించాలని, రాబోయే బడ్జెట్లో హెల్త్ మిషన్కు సరిపడా నిధులు కేటాయించాలని ఆశ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన మంగళవారం రెండో రోజు కొనసాగింది. కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగి తమను కలెక్టరేట్ లోపలికి అనుమతించాలని కోరగా.. సిబ్బంది నిరాకరించడంతో కలెక్టరేట్ గేట్ ఎక్కేందుకు య త్నించారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పందించిన జిల్లా వైద్యాధికారి, ఉప వైద్యాధికారి వారితో మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి యత్నిస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇందూరి సులోచన మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్లో ఆశావర్కర్లకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనంతోపాటు ఇతర సమస్య ల పరిష్కారం కోసం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కు సరిపడా నిధులు కేటాయించాలని కోరారు. ఆశావర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు రాయికంటి దివ్య, ప్రేమలత, బత్తిని వసంత తదితరులు పాల్గొన్నారు. -
ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానంతో కేసుల నమోదు
జగిత్యాలక్రైం: ప్రజలకు మ రింత వేగవంతమైన, సౌకర్యవంతమైన పోలీస్ సేవలందించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసిందని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానాన్ని జిల్లావ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. నేరం జరిగిన తరువాత శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు పోలీస్ స్టేషన్కు వెళ్లడం ఒక భారంగా మారొద్దనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ విధానం అమలులో ఉందన్నారు. ఇప్పటికే ఈ విధానం ద్వారా జిల్లాలో 5 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సమాచారమందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల వద్ద నుంచే ఫిర్యాదు స్వీకరిస్తారన్నారు. ఈ విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దొంగతనాలు, భార్యాభర్తల వివాదాలు, వేధింపులు, అనుమానాస్పద మృతులు వంటి కేసులను సంఘటనా స్థలంలోనే తక్షణం నమోదు చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించేలా పోలీస్ స్టేషన్ పరిసరాలుండాలని ఎస్పీ అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రేమిసెస్ మెయింటెనెన్స్–క్లీన్–గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లో చెత్త తొలగించడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. -
పైడిమడుగు పీఏసీఎస్కు జాతీయ అవార్డు
కోరుట్ల రూరల్: పైడిమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జాతీయస్థాయిలో ఉత్తమ సహకార సంఘంగా మూడోస్థానం దక్కించుకోగా.. మంగళవారం సిక్కీం రాజధాని గంగ్టాక్లో అవార్డు అందజేశారు. రూ.లక్ష5వేల నగదు పారితోషికం అందించారు. సంఘం సీఈవో బద్దం రాజేందర్, పర్సన్ ఇన్చార్జి అసద్ అవార్డు అందుకున్నారు. 2024–25 సంవత్సరానికి గాను నేషనల్ ఫెడరేషన్ కోఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సిఫారసుతో నిర్వహించిన సర్వేలో అఖిల భారత స్థాయిలో మూడో బహుమతికి ఎంపికై ంది. ప్రాథమిక సహకార సంఘాల పని తీరు, ఆర్థిక లావాదేవీలు, రుణాల రీషెడ్యూల్, ఇతర సేవల నిర్వహణలో సమగ్రంగా పరి శీలించి అవార్డుకు ఎంపిక చేశారు. కేడీసీసీబీ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఉన్నారు. మార్కెట్ యార్డుకు సెలవులుజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల మార్కెట్ యార్డులకు అమవాస్య, ఉగాది, రంజాన్, ఆదివారం సందర్భంగా ఈనెల 18, 19, 21, 22 తేదీల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్రావు తెలిపారు. సెలవుల మధ్యలో 20న మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు జరుగుతాయని, తిరిగి సోమవారం నుంచి యధావిధిగా మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని చెప్పారు. గాలికుంటుతో పాల ఉత్పత్తి తగ్గుముఖంపెగడపల్లి: గాలికుంటు వ్యాధి సోకిన పాడి పశువుకు పాల ఉత్పత్తి తగ్గుతుందని జిల్లా పశు వైద్యాధికారి ప్రకాశ్ అన్నారు. మండలంలోని మద్దులపల్లిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని సందర్శించారు. వాధి సోకడం వల్ల చూడి పశువుల్లో గర్భస్రావం జరుగుతుందని, కోలుకున్న తర్వాత పశువులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడే అవకాశముందన్నా రు. జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల పశువులుండగా ఇప్పటి వరకు 12వేల పశువులకు వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. సర్పంచ్ వెల్మ బలరామ్రెడ్డి, మండల పశువైద్యాధికారి కిరణ్రెడ్డి, ఉప సర్పంచ్ పెంటల తిరుపతి, గోపాలమిత్ర సూపర్వైజర్ నర్సయ్య పాల్గొన్నారు. పన్ను వసూళ్లు వేగవంతం చేయాలిజగిత్యాల: పన్నుల వసూళ్లు వేగవంతం చేసి వంద శాతం లక్ష్యం సాధించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. కలెక్టరేట్లో జగిత్యాల చైర్పర్సన్ సమిండ్ల వాణి సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రాబోయే రోజుల్లో వసూళ్లు వేగవంతం చేసి 100శాతం లక్ష్యం సాధించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు వంద శాతం లక్ష్యం తప్పనిసరి అన్నారు. చైర్పర్సన్ వాణి మాట్లాడుతూ, 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.14 కోట్ల డిమాండ్ ఉండగా, సుమారు 6 కోట్లు వసూలయ్యాయని, ఇంకా రూ.8 కోట్లు వసూళ్లు చేయాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సుమారు రూ.4 కోట్లు వసూలు చే యాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులందరూ సమష్ఠిగా లక్ష్యం పూర్తి చేయాలన్నారు. కమిషనర్ స్పందన మాట్లాడుతూ, ప్రత్యేక డ్రైవ్, డోర్ టు డోర్ వసూళ్లు, వార్డుల వారిగా టార్గెట్లు అమలు చేస్తున్నామన్నారు. -
అంతర్జాతీయ విషయాలపై అవగాహన
జగిత్యాల: విద్యార్థులకు అంతర్జాతీయ విషయాలపై అవగాహన పెంపొందించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో విద్యార్థులకు అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించేందుకు విద్యాశాఖ జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో నమూనా ఐక్యరాజ్య కార్యక్రమం నిర్వహించారు. వనరులపై ఆధిపత్యం కోసమే అనేక యుద్ధాలు జరిగాయని, ప్రస్తుతం కూడా చమురుపై ఆధిపత్యంపై యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. ఇతరులపై ఆధారపడకుండా ప్రతీ గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా విద్యార్థులందరూ కృషి చేయాలని అన్నారు. అదపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. డీఈవో రాము మాట్లాడు తూ.. తక్కువ సమయంలో విద్యార్థులను సిద్ధం చేసి పిల్లలకు మంచి మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 50 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి పాల్గొని దేశాల ప్రతినిధులుగా ప్రసంగించారు. సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ చంద్రశేఖ ర్రెడ్డి, సత్యనారాయణ, నీరజ, మహేశ్, రవి, రా మస్వామి, బోనగిరి దేవయ్య, మహేశ్ పాల్గొన్నారు. భూసర్వేకు సహకరించాలి రాయికల్: భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి భూసర్వే కార్యక్రమంలో భాగంగా దావన్పల్లిలో చేపడుతున్న రీసర్వేకు గ్రామస్తులు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. దావన్పల్లి గ్రామంలో రీసర్వే కార్యక్రమంపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెల 23 నుంచి రీసర్వే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, ముందుగా గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వ భూమి, పట్టాదారు భూమి వంటి భూసమస్యలపై రీసర్వే చేపడతామన్నారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ నాగార్జున, సర్పంచ్ ప్రసాద్, ఏడీ సర్వే కిషన్ప్రసాద్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ విఠల్రావు, ఆర్ఐ పద్మయ్య, సర్వేయర్ నరేందర్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి
కోరుట్ల రూరల్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అబివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లాపరిషత్ సీఈవో గౌతమ్రెడ్డి అన్నారు. కోరుట్ల మండల పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఫైళ్లు పెండింగ్లో ఉండకూడదని సూచించారు. ఎంపీడీవో ఓదెల రామకృష్ణ, కోట చ క్రాధర్, సుచరిత్, రాజశేఖర్, మమత పాల్గొన్నారు. జీతం పెరిగినా.. హోదా మారదుజగిత్యాల: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంపన్న శ్రేణి వర్తించదని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మాట్లాడారు. ఉద్యోగుల్లో సంపన్నశ్రేణి రిజర్వేషన్ల వర్తింపుపై జీతం పెరిగినా హోదా పెరగదని, ఆదాయం ఒక్కటే సంపన్న శ్రేణికి కొలమానం కాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చిన నేపథ్యంలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ల జారీ, సంపన్న శ్రేణిపై అవగాహన ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదని అన్నారు. గ్రూప్–3, గ్రూప్–4 స్థాయిలో మొదటి ఉద్యోగం పొంది పదోన్నతి ద్వారా వార్షిక ఆదాయం రూ.8లక్షలు దాటిన వారు క్రిమిలేయర్ కిందకు రారని, వారి పిల్లలు ఓబీసీలుగా పరిగణించబడతారన్నారు. గ్రూప్–1, గ్రూప్–2 స్థాయి ఉద్యోగాల్లో నియామకమైన వారి పిల్లలు మాత్రమే సంపన్న శ్రేణిలోకి వస్తారని అన్నారు. రిటైర్డ్ తహసీల్దార్ హన్మంతరెడ్డి, విశ్వనాథం, విజయ్, అశోక్రావు పాల్గొన్నారు. -
రాంపల్లి పంచాయతీలో స్టీల్ బ్యాంకు
● ప్లాస్టిక్ భూతాన్ని తరిమేసిన గ్రామస్తులు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికై న రాంపల్లి పంచాయతీ సర్పంచ్ కనపర్తి సంపత్రావుతో పాలకమండలి సభ్యులు తీసుకున్న నిర్ణయాలకు దాతలు సహకారం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. సోమవారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో విత్తనసంస్థ ప్రతినిధులు 600 స్టీలు ప్లేట్లు, స్టీలు గ్లాసులను సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై మల్లేశ్, ఎంపీడీవో శ్రీనివాస్ సమక్షంలో అందజేశారు. ఏకగ్రీవ పంచాయతీ తొలి సమావేశంలోనే ప్లాస్టిక్ భూతాన్ని గ్రామంలో నుంచి తరిమేయడంతో పాటు మద్యనిషేధం అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులను గ్రామంలో నిషేధించడంతో అందుకు ప్రత్యామ్నాయంగా పంచాయతీ ఆఫీసు ద్వారానే స్టీల్ ప్లేట్లు, గ్లాసులను అందుబాటులో ఉంచాలని సర్పంచ్ నిర్ణయించారు. ఇందుకు ఓ విత్తన సంస్థ ప్రతినిధులు స్టీల్సామగ్రిని విరాళంగా సమకూర్చారు. దీంతో పంచాయతీలో ‘స్టీల్బ్యాంకు’ ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పంచాయతీ ఆఫీసు నుంచి సామగ్రి తీసుకెళ్లి తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్టు సర్పంచ్ తెలిపారు. పంచాయతీ పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. డొమెస్టిక్ సిలిండర్లు సీజ్జమ్మికుంట: పట్టణంలోని పలు హోటళ్లు, టీస్టాళ్లలో డీటీసీ ఎస్.వసంతరావు, ఎఫ్ఐ వినోద్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం దాడులు నిర్వహించారు. హోటల్లో వాడుతున్న 18 డొమెస్టిక్ సిలిండర్లును సీజ్ చేశారు. నిర్వాహకులపై 6ఏ కేసు నమోదుకు కరీంనగర్ సివిల్ సప్లై ఉన్నతాధికారులు నివేదిస్తామన్నారు. -
శాప్ ఇన్నోవేషన్లో జ్యోతిష్మతి విద్యార్థుల ప్రతిభ
తిమ్మాపూర్: హైదరాబాద్లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈనెల 13న ఎడునెట్ ఫౌండేషన్, టాస్క్, శాప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శాప్కోడ్ ఉన్నతి ఇన్నోవేషన్ మారథాన్ 2025–26 లో జ్యోతిష్మతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విద్యాసంస్థల విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా జరిగింది. కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ మారథాన్కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. తె లంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ విద్యాసంస్థల నుంచి మొత్తం 560 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా..109 టీంలు క్వార్టర్ ఫైనల్కు ఎంపికయ్యాయి. వాటిలో 64 టీంలు సెమీఫైనల్కు చేరుకున్నాయి. చివరగా 29 టీంలు ఫైనల్ రౌండ్కు ఎంపికయ్యాయి. తుది ఫలితాలలో జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులు షేక్ జోహైబ్ ఉర్ రహ్మాన్, పనుగంటి వర్షిణి విజేతలుగా నిలిచారు. ప్రాజెక్ట్ వినూత్నత , ఆచరణాత్మక ఉపయోగం కారణంగా ప్రత్యేకంగా నిలి చింది. ఈ సందర్భంగా జ్యోతిష్మతి చైర్మన్ జువ్వాడి సాగర్ రావు , సెక్రటరీ, కరస్పాండెంట్ జె. సుమిత్సాయి విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ టి. అనిల్ కుమార్, డీన్ (అకాడెమిక్స్) పీకే వైశాలీ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. -
ప్రకృతి వనరులపై అవగాహన
కోరుట్ల: పట్టణంలోని రష్మీదర్ తేజ ఎలిమెంటరీ ఉపాధ్యాయ, బీఎడ్ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల విద్యార్థులకు సోమవారం తెలంగాణ జాతీయ హరిత దళం ఆధ్వర్యంలో ప్రకృతి వనరులపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి. వేణుగోపాల్ నూ తన సాంకేతికతలపై వివరించారు. అధ్యాపకులు శ్రీనివాస్, అజీబ్, బోదనపు నటరాజ్ హాజియా, రాజేంద్రప్రాసాద్, లక్ష్మీనారాయణ, పద్మ, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. కారోబార్పై ఎంపీడీవోకు ఫిర్యాదు కోరుట్ల రూరల్: మండలంలోని మోహన్రావుపేట కారోబార్ రంగు రాజేశ్పై ఆ గ్రామ ఉప సర్పంచ్ సహ పలువురు వార్డు సభ్యులు ఎంపీడీవో రామకృష్ణకు సోమవారం ఫిర్యాదు చేశారు. కారోబార్ గ్రామంలో ఎలాంటి పనులు చేయటం లేదని, పరిసరాలు పరిశుభ్రం విషయంలో పట్టించుకోవటం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. కారోబార్ను విదుల నుంచి తొలగించాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదులో కోరారు. ఉన్నత చదువులు చదివి గొప్పస్థాయికి ఎదగాలి వెల్గటూర్: విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గొప్పస్థాయికి ఎదగాలని ఎస్సై ఉదయ్కుమార్ అన్నారు. మండలంలోని స్తంభంపల్లి మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో చట్టాలపై అవగాహన నిర్వహించారు. పోలీసు చట్టాలు, షీ టీమ్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, గంజాయి నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థుల క్రమశిక్షణ, డయల్100 వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల అధ్యాపక బృందం, పోలీస్ కళాబృందం పాల్గొన్నారు. ఎంఐఎం సభ్యుల వాకౌట్ సిగ్గుచేటు కోరుట్ల: రాష్ట్ర శాసనసభలో వందేమాతర గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో శాసన సభ నుంచి ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేయటం సిగ్గు చేటని బీజేపీ మాజీ కౌన్సిలర్ పెండెం గణేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దేశంలో ఉంటూ చట్ట సభల్లో పదవులు అనుభవిస్తూ వందేమాతర గీతాన్ని అవమాన పర్చటం సరికాదని అన్నారు. అలాంటి సభ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి కేసులో అరెస్టుకరీంనగర్క్రైం: కాంట్రాక్టుర్లు, పలువురు ఉద్యోగుల వద్ద బీనామీ అకౌంట్ ద్వారా లంచం తీసుకున్న కేసులో తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో ఉన్న కరీంనగర్ వర్క్ అకౌంట్స్ జాయింట్ కార్యాలయ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్ను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. -
వేంపేటలో దొంగల హల్చల్
మెట్పల్లిరూరల్: మండలంలోని వేంపేటలో దొంగలు హల్చల్ సృష్టించారు. గ్రామంలోని మూడు ఆలయాలు, ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గంగమ్మ, రామాలయం, శివాలయంలో బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. కల్లెడ లత ఇంట్లో చోరీ చేశారు. ఎర్ధండిలోని తన తల్లిగారింటికి వెళ్లిన లత.. సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి 8 గ్రాముల బంగారం, 9 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. బస్సు ఢీకొని.. మల్యాల: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మల్యాల ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం..మల్యాల మండలం ముత్యంపేట శివారులోని జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై దిగువ కొండగట్టు బస్ స్టేజీ వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు చేరుకొని, మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విశారదన్ మహారాజ్ అరెస్టుపై నిరసనజగిత్యాలటౌన్: విశారదన్ మహారాజ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం జగిత్యాల తహసీల్ చౌరస్తాలో జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. జాక్ జిల్లా అధ్యక్షుడు కిషన్, ముసిపట్ల లక్ష్మీనారాయణ, గొల్లపల్లి శ్రీకాంత్గౌడ్, దువ్వాక శివమహారాజ్ పాల్గొన్నారు. చెన్నకేశవనాథ ఆలయ హుండీ లెక్కింపు రాయికల్: పట్టణంలోని చెన్నకేశవనాథ ఆలయ హుండీని సోమవారం లెక్కించగా రూ.82,535 ఆదాయం వచ్చినట్లు అధ్యక్షుడు మచ్చ శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు సతీశ్శర్మ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి మంతెన మహేందర్రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి అశోక్, ప్రచార కార్యదర్శి నిరంజన్ పాల్గొన్నారు. -
రైతుల ఆత్మీయ బంధువు సీఎం
మల్లాపూర్: రాష్ట్రంలో అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే రూ.2లక్షల రుణాలను మాఫీ చేసి సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఆత్మీయ బంధువయ్యాడని ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ కంచ రాజు అన్నారు. సోమవారం గొర్రెపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజును కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పోతు శేఖర్, వేంపల్లి మాజీ సర్పంచ్ మిట్టపెల్లి జలపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కనుక లక్ష్మణ్, సకినపెల్లి రాజేశ్, నూతిపెల్లి వెంకటేశ్, అబ్బురి నాగరాజు, మహేశ్, సంజీవ్, రవీందర్, రాజరెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హామీలు అమలు చేయాలి కథలాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కథలాపూర్లో రోడ్డుపై సోమవారం బీజేపీ నాయకులు ధర్నా చేశారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, సామాజిక పింఛన్ల డబ్బుల పెంపు, రైతు భరోసా వంటి హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తహసీల్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్రెడ్డి, నాయకులు బద్రి సత్యం, ఆనంద్రెడ్డి, నరెడ్ల రవి, కథలాపూర్ మహేశ్, ప్రతాప్, జీవన్రెడ్డి, ప్రశాంత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మల్లాపూర్లో.. మల్లాపూర్: ప్రజలు, రైతులకిచ్చిన అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం తహసీల్ కార్యాలయం ఎదుట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆర్ఐ రాజేశ్కు వినతిపత్రం అందించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి, యువ మోర్చా మండల అధ్యక్షుడు పందిరి నాగరాజు, వేంపల్లి సర్పంచ్ గుగ్లావత్ రాజేందర్, నాయకులు మొరపు జలపతి, ఇల్లెందుల కాంతాయ్యచారి, ఎర్ర రాజు, ముష్కరి రాజ్కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడిపల్లిలో.. మేడిపల్లి: హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని భీమారం, మేడిపల్లి మండలాల బీజేపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. చిట్యాల సురేశ్, నాగం శివకుమార్, క్యాతం దశరధరెడ్డి, తొగరి లక్ష్మిపతి, ముంజ శ్రీనివాస్, దుంపల మనోజ్రెడ్డి, ఎనుగుల లచ్చన్న, కోటగిరి లింగగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఎంపిక పోటీలు జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలస్థాయి క్రీడాపాఠశాలలో 4వతరగతి ప్రవేశాల కోసం ఈనెల 17న సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి కిశోర్ తెలిపారు. విద్యార్థులు విద్యార్హతలు, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో ఉదయం పాఠశాలలో హాజరు కావాలన్నారు. -
గ్రైండర్ యాప్ ద్వారా బుక్ చేసుకుని..
కరీంనగర్రూరల్: హోమో సెక్స్ కోసం ఓ యువకుడిని కరీంనగర్కు పిలిపించి దాడికి పాల్పడి డబ్బులు దోచుకున్న ముగ్గురిని కరీంనగర్రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ ఏసీపీ విజయ్కుమార్ సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడుపేటకు చెందిన రమిల్లా కృష్ణమూర్తిని గ్రౌండర్ డేటింగ్ యాప్ ద్వారా కరీంనగర్కు చెందిన జుమైర్ బుక్ చేసుకున్నాడు. హోమోసెక్స్, మసాజ్ చేయాలని, డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో ఈ నెల 14న బెల్లంపల్లిలో రైలెక్కి కరీంనగర్ రైల్వేస్టేషన్కు వచ్చాడు. కృష్ణమూర్తిని బైక్పై ఎక్కించుకున్న జుమైర్ బొమ్మకల్ బైపాస్లోని ఓ ఫంక్షన్హాల్ వెనుకభాగం తీసుకెళ్లాడు. కృష్ణమూర్తిని హోమోసెక్స్ చేయాలని బలవంతం చేస్తున్న క్రమంలో రేకుర్తికి చెందిన సయ్యద్ అబ్బాస్ అలియాస్ అర్బస్, కిసాన్నగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ఖాన్ అక్కడికి వచ్చారు. హోమో సెక్స్ చేసి ఎంత డబ్బు సంపాదిస్తున్నావంటూ కృష్ణమూర్తిని ప్రశ్నించారు. తన దగ్గర ఉన్న డబ్బులివ్వకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. భయపడిన కృష్ణమూర్తి రూ.1,500 నగదుతోపాటు సెల్ఫోన్ అప్పగించాడు. అనంతరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం తీగలగుట్టపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. కేసును ఛేదించిన సీఐ నిరంజన్రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్ను సీపీ గౌస్ అలం, ఏసీపీ అభినందించారు. హోమో సెక్స్కు పిలిచి దాడి ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు -
పంథా మార్చిన ఇసుక మాఫియా
మెట్పల్లిరూరల్: జిల్లాలో నిత్యం ఏదోచోట ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక వాహనాలు పట్టుకుంటూనే ఉన్నారు. మరోవైపు రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్న ఇసుక డంపులను సీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. ఇసుక తవ్వకాలు, రవాణా విషయంలో ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తుండడంతో.. తమ రూటును మార్చిన ఇసుకాసురులు పంథాను మార్చుకుని దందా చేస్తున్నారు. సెలవు దినాల్లో వాగుల్లోకి ట్రాక్టర్లను పంపించి ఇసుకను తరలిస్తున్నారు. మెట్పల్లి మండలంలో అధికారులు ఇసుక విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దందా మాత్రం ఆగడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలవు దినమంటూ ఇష్టారాజ్యం ఇసుక విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో తమ రూటు మార్చిన మాఫియా సెలవు దినాల్లోనే వాగుల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఆదివారం సెలవు దినమంటూ.. అధికారులెవరూ అందుబాటులో ఉండరంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అడ్డగోలుగా తవ్వుతున్న ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించడంతోపాటు డంప్ చేస్తున్నారు. గత ఆదివారం మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో సుమారు 50కి పైగా ట్రాక్టర్లను వాగులోకి పంపించి ఇసుక రవాణా చేశారు. తాజాగా ఈ ఆదివారం కూడా వాగులోకి ట్రాక్టర్లను పంపించి ఇసుక తరలించారు. వేకువజాము నాలుగు గంటలకు ప్రారంభమైన ఇసుక తవ్వకాలు.. మధ్యాహ్నం వరకు కొనసాగాయి. అధికారులకు ఫిర్యాదు వెళ్లగా వారంతా అక్కడికి చేరుకునేసరికి తవ్వకాలు నిలిపివేశారు. ఇసుకలోడ్తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ను పట్టుకుని సీజ్ చేశారు. మెట్పల్లి మండలం నుంచి యథేచ్ఛగా రవాణా సెలవు దినాల్లోనే అక్రమంగా తవ్వకాలు అధికారులు అందుబాటులో ఉండరని ఇష్టారాజ్యం వాగుల్లో ఎటుచూసినా ఇసుక ట్రాక్టర్లే..ఒక్కో ట్రిప్పుకు రూ.వెయ్యి వసూలుఆత్మకూర్ పెద్దవాగులో ఇసుక తవ్వకాలు వీడీసీ ఆధ్వర్యంలో కొనసాగగా.. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.వెయ్యి వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ఓ ఆలయానికి సంబంధించిన పేరు ఉన్న రశీదు ఇస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ఇసుక తవ్వకాల విషయంపై పోలీసులు ఆత్మకూర్ వీడీసీ సభ్యులను పిలిపించి హెచ్చరించారు. అయినప్పటికీ వీడీసీకి చెందిన పలువురు వాగులో ఉండి ఇసుకకు డబ్బులు వసూలు చేయడం గమనార్హం. తరలిస్తే సమాచారం ఇవ్వాలి ఇసుకను అక్రమంగా తవ్వకాలు చేపడితే సమాచారం ఇవ్వాలి. గ్రామాల్లో జీపీవోలతో నిఘా ఉంచాం. మాకు ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలు ట్రాక్టర్లు పట్టుకోవడంతోపాటు డంపులు సీజ్ చేశాం. – నీత, తహసీల్దార్, మెట్పల్లి కేసులు నమోదు చేస్తున్నాం ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఇటీవల 5 ఇసుక లారీలు, ట్రాక్టర్లను పట్టుకున్నాం. వాటి యజమానులపై కేసులు నమోదు చేశాం. రాత్రివేళ ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిఘా పెంచుతాం. ప్రజలు సమాచారం ఇవ్వాలి. – కిరణ్కుమార్, ఎస్సై, మెట్పల్లి -
డీఆర్సీ.. ఉన్నచోట కాదని
రాయికల్ బల్దియా ఇంజినీరింగ్ అధికారుల అనాలోచిత నిర్ణయం చర్చకు దారితీసింది. ఇప్పటికే ఉన్న డీఆర్సీ (డ్రై రీసెర్చ్ సెంటర్)ని వినియోగంలోకి తేవాల్సింది పోయి కొత్తగా మరోచోట నిర్మించేందుకు రూ.40లక్షలతో ప్రతిపాదనలు రూపొందించారు. పైగా ఈ అంశాన్ని సోమవారం నిర్వహించే సాధారణ సమావేశంలో ఆమోదింపజేందుకు సంకల్పించడం చర్చనీయాంశంగా మారింది. రాయికల్: బల్దియాలో 12వార్డులున్నాయి. ఈ వార్డుల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను వేరుచేసేందుకు రెండేళ్ల క్రితం పట్టణంలోని ఒడ్డెరకాలనీ సమీపంలోని డంపింగ్యార్డు వద్ద డీఆర్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను వేరుచేసి తడి చెత్తను కంపోస్టు ఎరువుగా.. పొడిచెత్తను రీసైక్లింగ్ చేయాల్సి ఉంది. తడిచెత్త ద్వారా కంపోస్టు ఎరువు తయారీ ద్వారా మున్సిపల్కు ఆదాయం సమకూరుతుందని భావించారు. కానీ.. అధికారుల నిర్లక్ష్యంతో సదరు డీఆర్సీ కేంద్రం నిరుపయోగంగా మారింది. రెండేళ్లుగా దాని నిర్వహణ పట్టించుకోవడం లేదు. వినియోగంలోకి తీసుకురావాల్సిన అధికారులు.. తాజాగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.40లక్షల వ్యయంతో డీఆర్సీ నిర్మాణానికి మైతాపూర్ రోడ్లోగల ఓపెన్వెల్ పక్కన ఖాళీ స్థలాన్ని గుర్తించారు. కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కనే బావి.. డీఆర్సీ ఏర్పాటుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతి పాదించిన స్థలం సమీపంలోనే తాగునీటి బావి ఉంది. ఆ బావి నుంచి మున్సిపల్ ప్రజలకు ప్రతిరోజూ నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ కేంద్రం నిర్మిస్తే వర్షాకాలంలో చెత్త అంతా బావిలోకి చేరే అవకాశం ఉంది. పైగా మురుగు నీరంతా గ్రామంలోని చెరువులోకి.. పక్కనే ఉన్న బావిలోకి చేరి కలుషితం అవుతుంది. పైగా మైతాపూర్ గ్రామ సరిహద్దులో ఉండడం ద్వారా మైతాపూర్, రాయికల్కు చెందిన రైతుల పంట పొలాలు తీవ్రంగా నష్టపోతారని స్థానికులు చెబుతున్నారు. చైర్మన్కు తెలియకుండానే..? మున్సిపాలిటీ సాధారణ సమావేశాల అంజెండా అంశాలు మున్సిపల్ చైర్మన్ కట్కం రవికి తెలియకుండానే రూపొందించడం చర్చనీయాంశంగా మారింది. డీఆర్సీసీ కేంద్రం ఏర్పాటుపై ఇంజినీరింగ్ అధికారులు కనీసం మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లకుండానే ప్రతిపాదనలు రూపొందించడమేంటని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై పాలకమండలి సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పనితీరును తప్పుపడుతున్నారు. మున్సిపల్ ఎజెండాలో ఈ అంశం పెట్టినప్పటికీ వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే చర్చ నడుస్తోంది. మున్సిపల్ చైర్మన్ రవి, పాలకమండలి సభ్యులు స్పందించి బావి పక్కన ఏర్పాటు చేయాలని భావిస్తున్న డీఆర్సీసీ కేంద్రం ప్రతిపాదనను తోసిపుచ్చాలని, ఇప్పటికే ఉన్న డీఆర్సీసీ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. రాయికల్లో రెండేళ్ల క్రితమే కేంద్రం ఏర్పాటు వినియోగంలోకి తేలేక మరోచోట నిర్మాణానికి నిర్ణయం రూ.40లక్షలతో ఇంజినీరింగ్ అధికారుల ప్రతిపాదనలు నేటి కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆమోదానికి.. -
కాన్షీరాంకు నివాళి
జగిత్యాలటౌన్: బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాన్షీరాం జయంతిని జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశారదన్ మహారాజ్ నాయకత్వంలో కాన్షీరాం కలలు కన్న బహుజన రాజ్యాన్ని సాధిస్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు మానాల కిషన్, పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీకాంత్గౌడ్, దువ్వాక శివ, ముసిపట్ల లక్ష్మీనారాయణ, సల్లూరి రాజగౌడ్, జలజ, లక్ష్మి పాల్గొన్నారు. ఇఫ్తార్తో సోదరభావం పెంపుకోరుట్ల: ఇఫ్తార్ విందులు సోదరాభావం పెంపొందిస్తాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 14 వవార్డులో జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిఒక్కరూ ప్రేమ, అభిమానం పంచుకోవాలన్నారు. -
కార్పొరేట్ గాలం
జగిత్యాల: పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటినుంచే అడ్మిషన్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. పరీక్షలు ముగియకముందే విద్యార్థులను మభ్యపెట్టి కళాశాలల్లో చేర్పించుకోవడంపై దృష్టి సారించాయి. ఇప్పటికే కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పీఆర్వోలను నియమించుకుని ప్రచారం చేస్తున్నాయి. ప్రతి విద్యార్థికి సంబంధించిన అడ్రస్లు సేకరించి వారి తల్లిదండ్రులను కలిసి తమ కళాశాలలో మెరుగైన విద్య, ఫీజులు తక్కువ అని చెబుతూ ఎలాగైనా అడ్మిషన్ తీసుకునేలా ప్రయత్నిస్తున్నాయి. మొదటి సంవత్సరం మంచి మార్కులు సాధిస్తే రెండో సంవత్సరం ఫీజు కట్టనవసరం లేదంటూ పేర్కొంటున్నాయి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, విజయవాడ వంటి పెద్దపెద్ద నగరాల్లో ఉన్న కార్పొరేట్ కళాశాలలు కూడా ఇలాగే ప్రచారం చేస్తుండడం గమనార్హం. పీఆర్వోల ద్వారా అడ్మిషన్లు తెప్పించుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. కరపత్రాల పంపిణీ పరీక్షల సమయంలో ఇంటి వద్దనున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి కార్పొరేట్ కళాశాల కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. మొదటి నుంచి ఎంసెట్, ఐఐటీ, జేఈఈ లాంటి కోర్సుల్లో చదువు ఉంటుందని, జాయిన్ కావాలని ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఫొటోలు చూపిస్తూ తమ కళాశాలల్లో చదివారని, వారు పెద్ద పొజి షనలో ఉన్నారని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. అప్పు చేసైనా కార్పొరేట్ కళాశాలలోకి.. పీఆర్వోల మాటలు, వారి ఆకర్షణీయమైన పాంప్లెంట్ల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ముందస్తుగా కొద్దిగా డబ్బు చెల్లిస్తే చాలు అడ్మిషన్ అయినట్లేనని భావిస్తున్నారు. గతంలో విద్యార్థులను బలవంతంగా కార్పొరేట్ కళాశాలలో చేర్పిస్తే చాలామంది ఒత్తిడికి లోనైన సంఘటనలున్నాయి. అక్కడి వాతావరణం నచ్చకుంటే విద్యార్థులు తిరిగి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ.. సదరు కళాశాళలు ఫీజులు మాత్రం రిటర్న్ ఇవ్వరు. ముందుగా ఆ కళాశాల గురించి తెలుసుకుని, అందులో ఎలాంటి ఉపాధ్యాయులున్నారు..? విద్యాబోధన ఎలా ఉంది..? తెలుసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. వారి మాటలు నమ్మి వెంటనే అడ్మిషన్ పొందవద్దని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆచీతూచి వ్యవహరించాలని పేర్కొంటున్నారు. ప్రతి ఇంటికి ఫోన్ కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు ప్రతి ఒక్కరి ఫోన్ నంబరు సేకరించి ఉదయం కాగానే తమ కళాశాలలో చేర్పించండి.. మంచి విద్య, ఫీజులు తక్కువగా ఉంటాయంటూ పేర్కొంటున్నారు. అడ్రస్లు కూడా తెలుసుకుని ఇంటికి వెళ్తూ తమ కళాశాలలో చేర్పిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నమ్మ బలుకుతున్నారు. పదో తరగతి పరీక్షలు ఇంకా ముగియకముందే అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ఇంటర్ అడ్మిషన్ల దందా ఇప్పటి నుంచే షురూ ఆఫర్లు ప్రకటిస్తున్న పీఆర్వోలు -
‘వైఐఐఓఈ’గా కేజీబీవీలు
కథలాపూర్(వేములవాడ): కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన, వసతులతో కూడిన విద్య అందిస్తుండటంతో బాలికలకు వరంగా మారాయి. జిల్లాలో 16 కేజీబీవీలు ఉండగా.. 12చోట్ల ఇంటర్ వరకు.. మిగి లిన నాలుగింటిలో పదో తరగతి వరకు మాత్రమే బోధిస్తున్నారు. ఇక్కడ ఆరు నుంచి పదో తరగతి వరకు నేరుగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్(వైఐఐఓఈ) గా గుర్తించారు. వీటిలో ఇంటర్తోపాటు పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారని అధికారులు చెబుతున్నారు. మూడు కేజీబీవీలు వైఐఐఓఈగా మార్పు జగిత్యాల, కోరుట్ల, ఇబ్రహీంపట్నంలోని కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్(వైఐఐఓఈ)గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాలలో నీట్, కోరుట్లలో జేఈఈ, ఇబ్రహీంపట్నంలో క్లాట్కు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకోలేని పరిస్థితి. పైగా లక్షల ఖర్చు చేసే ఆర్థిక స్థోమత లేని దృష్ట్యా ఎంపిక చేసిన కేజీబీవీల్లోనే శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మూడు కేజీబీవీల్లో ఇంటర్ ఫస్టియర్కు అడ్మిషన్లు స్వీకరించనున్నారు. ఇందులో ప్రవేశాలకు విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఈనెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష మే 3న టీజీఆర్జేసీ సెట్ –2026 ద్వారా నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఇందులో అవకాశం కల్పిస్తారని జీసీడీవో నీరజ తెలిపారు. పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ జిల్లాలో మూడు విద్యాలయాల ఎంపిక -
పంటలు దెబ్బతింటాయి
మైతాపూర్ రోడ్లోని ఓపెన్వెల్ వద్ద డీఆర్సీసీ కేంద్రం నిర్మిస్తే పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటాయి. అంతేకాకుండా నీరంతా కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సెంటర్ నిర్మిస్తే రైతుల పక్షాన ఉద్యమిస్తాం. – పడాల శ్రీను, రైతు ఉద్యమం చేస్తాం డీఆర్సీసీని బావి పక్కన నిర్మిస్తే పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడతా రు. చెరువు నీరు కలుషితమై రైతుల పంట పొలాలు దెబ్బ తింటాయి. డీఆర్సీసీ ప్రతిపాదనను నిలిపివేయాలి. లేకుంటే బీజేపీ పక్షాన ఉద్యమిస్తాం. – కల్లెడ ధర్మపురి, బీజేపీ ఫ్లోర్ లీడర్ -
నేటి నుంచి ఒంటి పూట బడి
● రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ● విద్యార్థుల అవస్థలకు చెల్లుకోరుట్ల: మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు మంటపుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒక్కపూట నడిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పెరిగిన వేడి నుంచి విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఉపశమనం దొరకనుంది. ఏప్రిల్ 23 వరకు బడులు ఒంటిపూటనే కొనసాగనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఉదయం 8 గంటల నుంచి.. ఒంటిపూట బడులు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగనున్నాయి. 12.30గంటలకు మధ్యాహ్న భోజనం ముగిశాక విద్యార్థులు ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకే తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇప్పటికే తగిన విధంగా క్లాసుల వేళల్లో మార్పులు చేసుకున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారంరోజులుగా ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం 480 ప్రాథమిక పాఠశాలలు, 240 ప్రాథమికోన్నత పాఠశాలలు, 347 ఉన్నత పాఠశాలల్లో తొమ్మిదో తరగతి లోపు విద్యార్థులు మొత్తం 98,200 మంది చదువుతున్నారు. చాలాచోట్ల వసతులు సరిగా లేవు. కొన్నిట్లో తాగునీటికీ ఇబ్బంది ఉంది. ఎండవేడి నుంచి పిల్లలకు ఉపశమనం కలిగించేందుకు అవసరమైన ఫ్యాన్లు ఇతరత్రా ఏర్పాట్లు లేకపోవడం గమనార్హం. కొన్ని పాఠశాలల్లో తరగతి గదుల్లోకి గాలి, వెలుతురు సరిగా రాక ఉదయం 11 గంటలకే విద్యార్థులు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. దీంతో పాటు ఉదయం 9 గంటలకే వేడి పెరిగిపోవడం విద్యార్థుల ఆరోగ్యరీత్యా సమస్యలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒంటి పూట బడులతో విద్యార్థులకు చక్కని ఉపశమనం దక్కుతుంది. అంజన్న సన్నిధిలో రాజస్థాన్ ఎస్పీ పూజలుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని ఆదివారం రాజస్థాన్ రాష్ట్రం శిఖర్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆయన వెంట రాష్ట్ర సీఐడీ ఏఎస్పీ బాలకోటి ఉన్నారు. సమాజ హితం కోరేది బ్రాహ్మణులేధర్మపురి: బ్రాహ్మణులు నిత్యం సమాజహితం కోరుకుంటారని, అలాంటి వారిని ఓ ఎమ్మెల్యే కించపరిచేలా మాట్లాడడం సరికాదని బ్రాహ్మణ సంఘం నాయకులు, మహిళలు డిమాండ్ చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం పట్టణంలో నిరసన చేపట్టారు. బ్రాహ్మణులను కించపరిచేలా అసభ్య పదజాలంతో మాట్లాడడాన్ని ఖండించారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఇందారపు రామన్న, మహిళలు తాడూరు, కొరిడె రమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్ సంతోషి, శారద మహిళామండలి సభ్యులు తదితరులున్నారు. -
పైరవీలతో తిష్ట!
కోరుట్లరూరల్: ఉద్యోగులు పారదర్శకంగా విధులు నిర్వహించడంతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే నిబంధనలకు విరుద్ధంగా కోరుట్ల మండలంలో పలువురు ఉద్యోగులు ఒకేచోట ఏళ్ల తరబ డి కొనసాగుతున్నారు. బదిలీల ఆర్డర్లు వచ్చినా ఉన్నచోటే తిష్ట వేస్తున్నారు. ఇలాంటి అధికారులు అన్ని శాఖల్లో ఉన్నా ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో ఓ ఉద్యోగి, వ్యవసాయ శాఖలో ఓ మండల స్థాయి అధికారి ఏళ్ల తరబడి తిష్ట వేశారనే విమర్శలు ఉన్నాయి. గెజిటెడ్ ఉద్యోగి గరిష్టంగా ఐదేళ్ల లో పు, నాన్ గెజిటెడ్ ఉద్యోగి 8 ఏళ్లలోపు బదిలీ కావా లనే ప్రభుత్వ నిబంధన ఉంది. కొందరు ఉద్యోగులు ఆరోగ్య, ఇతర కారణాలు చూపి ఉన్నచోటే ఎక్కువ రోజులు కొనసాగుతూ ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిసిస్తున్నాయి. పారదర్శకంగా ఉద్యోగ నిర్వహణతో పాటు, జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు.. ప్రజల అవసరాలు, వ్యక్తిగత సమస్యలు, వైఫల్యాలు గుర్తెరిగి వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. ఆ అధికారి రూటే సెపరేటు.. మండలంలోని ఓ మేజర్ గ్రామపంచాయితీకి కార్యదర్శిగా ఉన్న ఉద్యోగి ఆరెడేళ్లుగా అక్కడే కొనసాగుతున్నారు. సదరు ఉద్యోగిపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారుల నుంచి పలుమార్లు షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నాడు. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ ఇక్కడే కొనసాగుతున్నట్టు తెలి సింది. అధిక ఆదాయం ఉన్న మేజర్ పంచాయతీ కావడంతో సదరు ఉద్యోగికి జిల్లాస్థాయిలో కూడా గుర్తింపు ఉంది. గతంలో ఓ జిల్లా స్థాయి అధికారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆ అధికారి కోరిక మేరకు ఇదే పంచాయతీ సెక్రటరీ ఓ దినపత్రికలో యాడ్ ఇచ్చి తన విధేయతను చాటుకున్నాడు. ఇలా జిల్లాస్థాయి అధికారులను ప్రసన్నం చేసుకుంటుండడంతో ఆ ఉద్యోగిపై ఆరోపణలు ఉన్నా బదిలీ చేయడం లేదని తెలిసింది. వ్యవసాయశాఖలో మండలస్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారి కూడా సుమారు ఆరేడేళ్ల నుంచి ఇక్కడనే కొనసాగుతున్నారు. గెజిటెడ్ అధికారి కావడంతో 5 ఏళ్ల నిబంధన ఉన్నా మెడికల్ సర్టిఫికెట్తో బదిలీ నుంచి మినహాయింపు పొందినట్టు తెలిసింది. కాగా అధికారులు ఎక్కువ కాలం పాటు ఒకేచోట ఉండటం వల్ల ప్రజలకు పారదర్శక సేవలు అందకపోవడంతో పాటు జవాబుదారీ తనం కరువైంది. ఏళ్ల తరబడి ఉన్న చోటే ఉద్యోగం ఇష్టారాజ్యంగా విధులు -
కొండకు కాషాయ దండు
కరీంనగర్/కొత్తపల్లి/రామడుగు/కొడిమ్యాల/మల్యాల: ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠాన్ని అప్పగిస్తే తన పార్లమెంట్ పరిధిలో ఎన్నికై న బీజేపీ ప్రజాప్రతినిధులందరితో కలిసి కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకుంటానన్న మాటను సంజయ్ నిలబెట్టుకున్నారు. దాదాపు 40 డిగ్రీల మండుటెండను సైతం లెక్క చేయకుండా వేలాదిమంది కార్యకర్తలతో కలిసి 40 కిలోమీటర్లు నడిచి రాత్రి 10 గంటలకు అంజన్న ఆలయ సన్నిధికి చేరుకున్నారు. బైంసా మున్సిపల్ ఛైర్మన్ తుమ్మల దత్తాత్రితోపాటు కౌన్సిలర్లంతా పాదయాత్రలో కలిసి నడిచారు. ట్రాఫిక్ జాం కాకుండా యాత్ర ఉదయం 9.30 గంటలకే పదో తరగతి పరీక్ష ఆరంభం కావడం... అదే సమయంలో సంజయ్ చేపట్టిన పాదయాత్ర కరీంనగర్ జగిత్యాల హైవేపైకి రావడంతో ట్రాఫిక్ జాం అవుతుందనే ఆందోళన కన్పించింది. పాదయాత్ర రక్షక దళం, ఇటు పోలీసుల సాయంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పాదయాత్రను కొనసాగించారు. అడుగడుగునా నీరాజనం నగరంలోని 23వ డివిజన్ సీతారాంపూర్లో మహిళలు మంగళహారతులు ఇచ్చి పూలవర్షం కురిపించారు. 19వ డివిజన్ రేకుర్తి చౌరస్తాలో కార్పొరేటర్ సుదగోని మాధవికృష్ణగౌడ్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కొత్తపల్లి రామాలయం వద్దకు చేరుకోగాలనే కమిటీ సభ్యులు గజమాలతో సత్కరించారు. కొత్తపల్లి మార్కండేయ ఆలయం వద్ద 17,18 డివిజన్ల కార్పొరేటర్లు వేముల కవితచంద్రశేఖర్, వాసాల రమేశ్ స్వాగతం పలకగా, మహిళలు మంగళహారతులిచ్చి పూలవర్షం కురిపించారు. రామడుగు మండలం వెదిర, గంగాధర మండలంలోని పలు గ్రామాలతో పాటు కొడిమ్యాల మండలం పూడూరులో మంగళహారతులతో నీరాజనం పలికారు. తుర్కాశీనగర్ చేరుకోగానే ముస్లిం పెద్దలు, యువకులు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి ఆహ్వానించారు. పూడూర్లో గజమాలతో స్వాగతం పలికారు. తేనెటీగల కలకలం యాత్ర రామడుగు మండలం కోనరావుపేట వద్దకు రాగానే.. కొందరు కార్యకర్తలు డ్రోన్ ఎగరేయడంతో చెట్టుపైనున్న తెనేతుట్టె కదిలింది. తేనెటీగల దాడిలో ముగ్గురు కార్పొరేటర్లు, మరో ముగ్గురు బీజేపీ శ్రేణులు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. పాదయాత్రలో డాక్టర్లు బండి సంజయ్కు సాధారణ హెల్త్ చెకప్ చేశారు. గంగాధరలో లంచ్ బ్రేక్ గంగాధరలోని వీఏఎస్ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం 3.30 గంటలకు బీజేపీ శ్రేణులకు భోజన ఏర్పాట్లు చేశారు. బండి సంజయ్ సైతం అక్కడే ఓ కార్యకర్త ఇంట్లో భోజనం చేసి కాసేపు సేదదీరారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాయపల్లి, పూడూరు, దొంగల మర్రి మీదుగా రాత్రి 10గంటల వరకు కొండగట్టు అంజన్న ఆలయం చేరుకుని ‘అంజన్న ఆశీ ర్వాద యాత్ర’ను దిగ్విజయంగా ముగించారు. సంజయ్ కొండకు చేరుకునే సమయానికి ఆలయం మూసివేయడంతో సింహద్వారం ఎదుట కొబ్బరికాయ కొట్టి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. యాత్ర ప్రారంభమైందిలాశనివారం ఉదయం 7 గంటలకు బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించి అంజన్న ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. నూతనంగా ఎన్నికై న బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు వేలాది మంది కాషాయ శ్రేణులతో కలిసి కాలినడకన బయల్దేరారు. రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఆధ్యాత్మిక యాత్ర కావడంతో సంజయ్ కేవలం సాక్సులతోనే నడక కొనసాగించారు. -
బాలికలకు హెచ్పీవీ టీకాలు తప్పనిసరి
రాయికల్: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ముందస్తు చర్యగా 13 ఏళ్ల వయసున్న బాలికలందరికీ తప్పనిసరిగా హెచ్పీవీ టీకాలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నా రు. శనివారం రాయికల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి, టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో బాలికలు ప్రా ణాంతక సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ఈ వ్యాక్సిన్ ఎంతో రక్షణ కల్పిస్తుందన్నారు. కోరుట్ల, మెట్పల్లి, రాయిక ల్, ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో ఈ హెచ్పీవీ టీకాలను ఉచితంగా వేస్తున్నట్లు తెలిపా రు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాయికల్ సీహెచ్సీ వైద్యాధికారి శ్రీకాంత్, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, డీఈవో పవన్ కుమార్, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జేఎన్టీయూలో ముగిసిన శిక్షణకొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో మూడురోజులపాటు నిర్వహించిన ‘సి డేటా స్ట్రక్చర్స్’ ప్రోగ్రామింగ్ స్కిల్స్ శిక్షణ శనివారం ముగిసింది. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీస్, టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ముగింపులో ప్రిన్సిపాల్ నర్సింహా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు అకడమిక్ చదువులతోపాటు నైపుణ్యాభివృద్ధిని పెంచుకోవాలన్నారు. విద్యార్థులకు మూడు రోజులపా టు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ద్వారా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలపై రమేశ్ శిక్షణ ఇచ్చారు. టెక్నికల్ ఇంటర్వ్యూలలో డేటా స్ట్రక్చర్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ప్లేస్మెంట్ కో–ఆర్డినేటర్లు , వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షణతో సాంకేతిక నైపుణ్యాలపై ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థులు తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలిజగిత్యాలటౌన్: వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అఖిల బ్రాహ్మణ సేవాసంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. సామేల్ వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం స్థానిక తహసీల్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఆయన చిత్రపటాన్ని దహనం చేశారు. గాంధీభవన్లో ఈనెల 12న కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం సందర్భంగా బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం చేశారని, ఎమ్మెల్యే సామేల్ మాత్రం బ్రాహ్మణులపై పరుష పదజాలంతో మాట్లాడారని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పదవి ఉందని నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆదిజాంబవ పరియోజన ప్రాంత ప్రముఖ్ అలగుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ సీ గ్రూపునకు చెందిన సామేల్ ఎస్సీ సర్టిఫికెట్పై ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆరోపించారు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మోతె ఉమాకాంత్శర్మ, నాయకులు సిరిసిల్ల రాజేందర్శర్మ, మేడిపెల్లి శ్రీనివాస్శర్మ, నేరెళ్ల శ్రీనివాసాచారి, మెట్ట కిరణ్భాస్కర్, కొత్తపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల వేణుగోపాల్ పాల్గొన్నారు. -
సంస్కృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత
జగిత్యాలటౌన్: భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు బూర్ల దక్షిణామూర్తి అన్నారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి సందర్భంగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉగాది ఉత్సవం నిర్వహించారు. స్వయం సేవకులు పథసంచలన్ చేపట్టారు. దారి పొడవునా మహిళలు స్వాగతం పలికారు. విద్యానగర్ రామాలయం మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దక్షిణామూర్తి మాట్లాడారు. మన అనైక్యతతో విదేశీయులు పరిపాలించారని, గ్రీకులు, హునులు, కుషానులు, శకులు, మొగలులు, ఆంగ్లేయులను ఎదిరించిన శాలివాహనుడు, విక్రమాదిత్య మహారాజ్, రాణాప్రతాప్, శివాజీ మహారాజ్ వంటి మహావీరులు మన దేశాన్ని కాపాడారని గుర్తుచేశారు. రామకృష్ణ పరమహంస, దయానందసరస్వతి, వివేకానంద, ఆదిశంకరాచార్య లాంటి మహామహులు సనాతన హిందు ధర్మాన్ని కాపాడారని, హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను వందేళ్ల క్రితం ప్రారంభించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైద్యులు ఓరుగంటి నితిన్రావు, భీమనాతిని శంకర్, ఆకుతోట శ్రీనివాస్రెడ్డి, నగర సంచాలక్ జిడిగె పురుషోత్తం, 500మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. -
జీవన్రెడ్డి పయనమెటో..?
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్రెడ్డి పయనమెటో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయన పార్టీ మారబోతున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ విషయాలను జీవన్రెడ్డి కొట్టిపడేస్తున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా జీవన్రెడ్డి కాంగ్రెస్లో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కాంగ్రెస్ నుంచి ఒకేఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వ విధానాలపై పోరాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో జీవన్రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి సంజయ్కుమార్పై ఓడిపోయారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్కుమార్ అభివృద్ధి కో సం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ కాంగ్రెస్ వైపు ఉంటున్నారు. ఇది రుచించని జీవన్రెడ్డి మొదటి నుంచి సంజయ్ విధానాలను బహిరంగంగా నే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతో జగిత్యాలలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి వెళ్లాయి. జగిత్యాల మున్సిపాలిటీలో 50 స్థానాలు, రాయికల్లో 12స్థానాలకు సంబంధించిన బీఫాంలలో ఎక్కువగా ఎమ్మెల్యే సంజయ్కుమార్కు ప్రా ధాన్యం ఇచ్చారు. ఆ సమయంలో జీవన్రెడ్డి జగిత్యాలలో అతని అనుచరవర్గాలను ఇండిపెండెంట్గా నిలబెట్టి దాదాపు 16 మందిని గెలిపించుకున్నారు. అధిష్టానం ఇద్దరినీ పిలిచి ఎవరికి చైర్పర్సన్ ఇచ్చినా ఒప్పుకోవాలని నిర్ణయించింది. జీవన్రెడ్డి మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ జెండా పట్టిన వారికే పీఠం ఇవ్వాలని పట్టుబట్టారు. అయినప్పటికీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన సమిండ్ల వాణికే చైర్పర్సన్ పదవి కేటాయించారు. అప్పటినుంచి జీవన్రెడ్డి కాంగ్రెస్లో కొనసాగే పరిస్థితి లేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడుతున్నట్లు పుకార్లు వె ల్లువెత్తుతున్నాయి. జీవన్రెడ్డి స్వయంగా అనడంతో ఈ పుకార్లకు బలం చేకూరుతోంది. సో షల్ మీడియాతోపాటు కొన్ని చానళ్లలో బీఆర్ఎస్లోకి వెళ్తున్నారని, ఈనెల 25న రాజీనామా చేస్తారని ప్రసారం కావడం చర్చకు దారితీస్తోంది. దీనిపై జీవన్రెడ్డి మాట్లాడుతూ.. అలాంటిదేమీ లేదని కొట్టిపడేస్తున్నారు. ఏదైనా ఉంటే నాయకులు, కార్యకర్తలతో చర్చించిన అనంతరమే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. -
తుర్తి అడవుల్లో పులి సంచారం
కథలాపూర్(వేములవాడ): మండలంలోని తుర్తి అటవీప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మొన్నటివరకు పులి నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ శివారులో రాళ్లవాగు ప్రాజెక్టు ప్రాంతంలో సంచరించిందని, అక్కడి నుంచి కథలాపూర్ మండలం వైపు వచ్చినట్లు తెలిపారు. సూరమ్మ ప్రాజెక్టు ప్రాంతం నుంచి తుర్తి అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు పులి పాదముద్రల ఆధారంగా గుర్తించామన్నారు. రైతులు, మేకల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పు లి ఎటువైపు వెళ్లిందో గుర్తిస్తామని మెట్పల్లి ఎఫ్ఆర్వో పద్మారావు, వేములవాడ ఎఫ్ఆర్వో ఖలీలొద్దిన్, సెక్షన్ ఆఫీసర్ ఎండీ.ముస్తాక్ ఆలీ, బీట్ ఆఫీసర్లు శ్రావణ్, సాయిరాం తెలిపారు. -
ఎన్హెచ్–63 భూ నిర్వాసితులకు నిధులు జమ
జగిత్యాలరూరల్: ఆర్మూర్ నుంచి జగ్దల్పూర్ వరకు ఇంటర్ కారిడార్ (ఐసీఆర్) ఎన్హెచ్–63తోపాటు ఎన్హెచ్–563 నిర్మాణానికి జిల్లాలో రెవెన్యూ అధికారులు భూసేకరణ పూర్తి చేశారు. రైతులకు నేరుగా పరిహారం అందించేందుకు గతంలో దరఖాస్తులు కూడా స్వీకరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యింది. 240 మంది రైతుల నుంచి 250 హెక్టార్ల భూసేకరణ చేశారు. ఎన్హెచ్–63లో భూములు కోల్పోతున్న రైతులకు రూ.188.23 కోట్లు, ఎన్హెచ్–563లో భూములు కోల్పోతున్న రైతులకు రూ.111.58 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. పరిహారం విడుదల కావడంతో రహదారుల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొదటి విడత విడుదలైన నిధులను భూములు కోల్పోతున్న రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. టెండర్ల ఆహ్వానానికి సిద్ధం ఆర్మూర్–జగ్దల్పూర్ వరకు ఎన్హెచ్–63, జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు ఎన్హెచ్–563 రహదారుల నిర్మాణానికి టెండర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. టెండర్లు పూర్తికాగానే రెండు నేషనల్ హైవేల పనులు వేగవంతంగా కొనసాగనున్నాయి. పనులు పూర్తయితే ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు తొలగనున్నాయి. జిల్లాలో 71.13 కిలోమీటర్లు జిల్లాలో నేషనల్ హైవే–63ని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి జగ్దల్పూర్ వరకు నిర్మించనున్నారు. ఇది జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం నుంచి నుంచి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి వరకు 71.13 కిలోమీటర్లుగా ఉంది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి నేషనల్ హైవే–63 ని ర్మాణం కోసం భూసేకరణ పూర్తయ్యింది. భూములు కోల్పోయిన రైతుల ఖాతా ల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ఎన్హెచ్–563లో భూములు కోల్పోతున్న రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతున్నాయి. – మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల -
మోగని నీటిగంట
జగిత్యాల: గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు తప్పనిసరిగా గంటకోసారి నీరు తాగాలని వాటర్బెల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేరళలో నీటిగంట మూడుసార్లు ఏర్పాటు చేయగా అదే పద్ధతిలో ఇక్కడ కూడా అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. కానీ, అది పెద్దగా అమలులోకి రాలేదు. విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలోనే ఉంటారు. వీరు ఇంటర్వేల్లో తప్ప నీరు తాగరు. వాస్తవంగా దానిపై పెద్దగా శ్రద్ధచూపరు. అయితే బడి వేళల్లోనే సుమారు 1.5 లీటర్ల నీటిని విద్యార్థులు తీసుకుంటే మేలని వైద్యులు పేర్కొంటున్నారు. సమయాన్ని బట్టి 3–5 సార్లు కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫస్ట్బెల్, సెకెండ్బెల్, ఇంటర్వల్, ఇంటిబెల్.. ఇలా ఉన్నప్పటికీ దీనిని పెద్దగా అమలు చేయడం లేదు. కేరళ, కర్నాటకలో దీనిని ప్రారంభించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులు తగిన మోతాదులో నీటిని తీసుకోకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. గతంలో అమలు చేసినా.. విద్యార్థి దశ నుంచి పిల్లలు తగినంత నీరు తాగేలా గతంలో జిల్లాలో అక్కడక్కడ వాటర్ బెల్ అమలు చేసినా, తర్వాత అది మరుగునపడింది. సాధారణ రోజుల్లో ఇంటర్వెల్, లంచ్ బ్రేకులతో పాటు ఉదయం 10.30గంటలకు, మధ్యాహ్నం 2.30కు వాటర్ బెల్ మోగించాలి. ఒంటి పూట బడుల సమయంలో ఉదయం 9.30, మళ్లీ 11గంటలకు మోగించాలి. తద్వారా విద్యార్థులు ఎక్కువ నీరు తాగేలా ప్రోత్సహించి, అనారోగ్యం బారిన పడకుండా చూడవచ్చు. జిల్లాలోని పాఠశాలల్లో ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కానీ, వాటర్ బెల్ అమలు చేయకపోవడంతో విద్యార్థులు తగినంత నీరు తీసుకోవడం లేదని తెలుస్తోంది. నీరు తాగకుంటే సమస్యలు ప్రస్తుతం వేడి గాలులు సైతం వీస్తున్నాయి. ఇప్పుడు నీరు లేకపోతే విద్యార్థులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. చిన్నపిల్లలు ముఖ్యంగా డీహైడ్రేషన్కు గురవుతారు. నీటి మోతాదు తగ్గితే మూత్రపిండాల్లో రాళ్లు, అపెండెక్స్, జ్వరం, మలబద్దకం, మూర్చ, కాలేయ, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తాగే అవకాశం ఉన్నా.. ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. తాగే అవకాశం ఉన్నప్పటికీ విద్యార్థులకు అవగాహన లేక నీటిని తీసుకోవడం లేదు. వాటర్కు కాలం అనేది లేదు. శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి, ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ నీటిని తీసుకోవాలి. స్కూళ్లలో నీటి వసతి ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువగా తాగడం లేదని తెలుస్తోంది. అమలుకు నోచుకోని వాటర్బెల్ ముదిరిన ఎండలతో పిల్లల్లో డీహైడ్రేషన్ సమస్యలు నీరు తాగేలా ప్రోత్సహిస్తేనే పిల్లల ఆరోగ్యానికి మేలు ప్రాథమిక పాఠశాలలు 480 విద్యార్థులు 22,756 ప్రాథమికోన్నత పాఠశాలలు 240 విద్యార్థులు 28,061 హైస్కూల్స్ 347 విద్యార్థులు 98,200 (సుమారు)జిల్లాలో.. -
అడ్డగోలు ఖర్చుపై రసాభాస
కోరుట్ల: కోరుట్ల మున్సిపల్ బడ్జెట్, సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ తిరుమల వసంత ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ సుమారు రూ.55.54 కోట్ల వ్యయంతో బడ్జెట్కు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది క్యాపిటల్ గ్రాంట్స్ రూ.38 కోట్లు, జనరల్ ఫండ్ ఆదాయం రూ.16 కోట్లుగా అంచనా చూపారు. బడ్జెట్ సమావేశంపై తమకు సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లకు బడ్జెట్పై అవగాహన లేదని, వారికి సరైన సమయం ఇవ్వకుండా ఆదరాబాదరగా బడ్జెట్ సమావేశం ఏర్పాటును నిరసిస్తూ కౌన్సిలర్లు గడ్డమీద పవన్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అన్నం లావణ్య, యాటం పద్మ, రహీం, తోట గంగాధర్ కౌన్సిల్ సమావేశం నుంచి బాయ్కాట్ చేశారు. 34 అంశాలకు ఆమోదం సమావేశంలో మొత్తం 35 అంశాలకు గాను 34 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ మీటింగ్ సమాచార లోపం, మహిళా దినోత్సవం, 2 కే రన్కు అడ్డగోలు ఖర్చులు పెట్టడం సరికాదని కౌన్సిలర్ గడ్డమీద పవన్ శ్రీసాక్షిశ్రీ పత్రికను ఎత్తిచూపుతూ నిరసన వ్యక్తం చేశారు. చైర్పర్సన్ చాంబర్ ఫర్నిచర్ కోసం రూ.5 లక్షల ఖర్చు ఎందుకని బీఆర్ఎస్ కౌన్సిలర్ వసీం ప్రశ్నించగా, చాంబర్తో అధికారుల గదుల్లోనూ ఫర్నిచర్ మార్పునకు ప్రతిపాదన ఉందని 14వ వార్డు కౌన్సిలర్ రెంజర్ల కల్యాణి సర్దిచెప్పారు. ఒకే వార్డుకు రూ.3.50 లక్షలు ఎలా ఇచ్చారని కౌన్సిలర్ సోగ్రాబీ, టేకుల శిరీష, జాల మాధవి అధికారులను నిలదీశారు. కౌన్సిలర్ సోగ్రాబీ స్టేజీ వద్ద భైఠాయించి నిరసన తెలుపగా, అన్ని వార్డుల్లోనూ సుమారు రూ.4 లక్షల నిధులు కేటాయించారు. ట్యాంక్బండ్లో రూ.10 లక్షలు వెచ్చించి బోటింగ్ ప్రతిపాదించగా సభ్యులు తిరస్కరించారు. కౌన్సిలర్ ఇందూరి తిరుమలవాసు మాట్లాడుతూ, మున్సిపల్ తరఫున ఒకే వర్గం పండుగ కాకుండా అన్నివర్గాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులను సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని కౌన్సిలర్ సోగ్రాబీ నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్, కౌన్సిలర్లు మేడిపల్లి శిరీష, తెడ్లు శ్రీజ, పుప్పాల ఉమాదేవి, కమిషనర్ రవీందర్, డీఈ సురేశ్ పాల్గొన్నారు. నిలదీసిన కౌన్సిల్ సభ్యులు ముందస్తు సమాచారం లేదని.. ఐదుగురు కౌన్సిలర్ల బాయ్కాట్ చివరికి రూ.55 కోట్ల బడ్జెట్ ఆమోదం దుబారా ఖర్చులపై ‘సాక్షి’ కథనం ప్రదర్శన -
యుద్ధం ఆపేందుకు ప్రయత్నించాలి
జగిత్యాలటౌన్: అమెరికా సామ్రాజ్యవాదంతో ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధంతో గల్ఫ్ కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయని, గ్యాస్ కొరత సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఇందిరాభవన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వంటగ్యాస్ సబ్సిడీని ఎలాంటి అవాంతరాలు లేకుండా అందించి ఆడబిడ్డలకు అండగా నిలవాలని కోరారు. 2005లో కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధర రూ.250 నుంచి రూ.300 పెంచగా పెరిగిన రూ.50 భారాన్ని అప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వమే భరించి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్బేస్లపై ఇరాన్ దాడి చేస్తుండడంతో ఆ ప్రభావం భారత్పై పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కొరత రాకుండా చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో యుద్ధం ఆపాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి సమస్య తీవ్రతను ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, చందా రాధాకిషన్, రఘువీర్గౌడ్, గుండ మధు, ముఖేశ్ఖన్నా, వేణురావు పాల్గొన్నారు. -
మహిళలు స్వయం శక్తితో ఎదగాలి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: మహిళలు స్వయం శక్తితో ఎదగాలని, సమాజానికి స్ఫూర్తినివ్వాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శుక్రవారం కలెక్టరేట్లో అవార్డులు ప్రదానం చేసి మాట్లాడారు. మహిళలకు శక్తి సామర్థ్యాలు అనంతమని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ, మహిళలు వంటింటికే పరిమితం కాకుండా పార్లమెంట్కు వెళ్తున్నారని, మహిళల్లో ఉన్న అంతర్గత శక్తిని చూసి కొందరు భయపడుతున్నారన్నారు. మహిళలు ధైర్యంగా ఉండి తోటివారికి అండగా నిలవాలన్నారు. ఆలోచనల్లో ఆధునీకత ఉండాలే కానీ, అది కేవలం చదువు వల్ల రాదని, మనుసు నేర్చుకోవడం ద్వారా వస్తుందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 10 మంది మహిళలకు అవార్డులు అందజేశారు. జగిత్యాల, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్లు సమిండ్ల వాణి, వేముల నాగలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి రాజ్కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి సునీత, మెప్మా ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు. క్షయ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిజగిత్యాల: క్షయ బాధితులు వైద్యసేవలు వినియోగించుకోవాలని క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మాతాశిశు సంక్షేమ కేంద్రంలో నిర్వహించిన టీబీ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. క్షయపై అవగాహన కల్పించి, బాధితులకు ప్రత్యేక పరీక్షలు, మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులున్నాయని వారికి వివరించాలన్నారు. కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ సునీత, వైద్యాధికారులు పాల్గొన్నారు. బ్రిడ్జి పనులు పూర్తి చేయండి జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం పెంబట్ల–కొనాపూర్ మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శుక్రవారం బ్రిడ్జి వద్ద ధర్నా చేపట్టారు. పనుల్లో జాప్యం కారణంగా తాము రవాణా కష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్ వారి వద్దకు వెళ్లి సమస్య తెలుసుకున్నారు. బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం అక్కడికక్కడే సంబంధిత ఎగ్జి క్యూటివ్ ఇంజినీర్, కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే రాయికల్ మండలం రామాజీపేట, మైతాపూర్ బ్రిడ్జి వద్ద ఉన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
మనువాడిన మామిడి
కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెంచిన మామిడిచెట్లకు శుక్రవారం పెళ్లి జరిపించారు. గ్రామశివారులో ముదిరాజ్ సంఘం తరఫున 5 ఎకరాల మామిడితోట నిర్వహిస్తున్నారు. మామిడిచెట్లకు పెళ్లి జరిపిస్తే కాయలు బాగా కాస్తాయనేది వారి నమ్మకం. దీంతో సంఘం సభ్యులు అల్లనేరేడు, మామిడిచెట్లకు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. అనంతరం సంఘం సభ్యులు సామూహిక భోజనాలు చేశారు. అర్చకులు పులికాంత ప్రమోద్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. – కథలాపూర్(వేములవాడ) -
పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్
● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ చట్టం అమలు చేస్తున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. జిల్లాలో 68 పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు 163 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు గుంపుగా ఉండరాదని సూచించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించరాదన్నారు. పరిసరాల్లో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మూసివేయాలని సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
మెట్పల్లి వార్షిక బడ్జెట్ రూ.40.54కోట్లు
● ఆమోదించిన కౌన్సిల్ మెట్పల్లి(కోరుట్ల): మెట్పల్లి మున్సిపల్లో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రూపొందించిన వార్షిక బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ సమావేశ మందిరంలో శుక్రవారం చైర్మన్ మైలారపు లింబాద్రి అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రూ.40.58కోట్ల అంచనా ఆదాయం, రూ.40.54 కోట్ల అంచనా వ్యయం, రూ.4.36లక్షల మిగులుతో రూపొందించిన బడ్జెట్ను సభ్యుల ముందు ఉంచగా, వారు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇందులో వేతనాలకు రూ.4.80కోట్లు, పారిశుధ్య నిర్వహణకు రూ.1.50 కోట్లు, గ్రీన్ బడ్జెట్కు రూ.1.15 కోట్లు, విద్యుత్ చార్జీలకు రూ.1.93 కోట్లు కేటాయించారు. అనంతరం పలువురు సభ్యులు వార్డుల్లో నెలకొన్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశానికి ముందు బీజేపీ సభ్యులు స్థానిక చెన్నకేశవనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎంపీ అర్వింద్ చిత్రపటాలతో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం వాటిని సమావేశ మంది రంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, కమిషనర్ స్పందన, డీఈఈ నాగేశ్వర్రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
భయం వీడితే విజయం మీదే
ఒత్తిడికి గురికావద్దు విద్యార్థులు పోషకాహారం తీసుకోవాలి. ఒత్తిడికి గురికావద్దు. చదువుకునే సమయంలో మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుని చదివితే ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలను జీవితంలో ఒక దశగా మాత్రమే పరిగణించాలి. స్వేచ్ఛయుత వాతవారణంలో పరీక్షలు రాయాలి. – జి.సంతోష్కుమార్, న్యూరో, సైకియాట్రిస్ట్ జగిత్యాల: పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు భయం వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రణాళికతో ముందుకెళ్తే విజయం వరిస్తుందని పేర్కొంటున్నారు. కొందరు విద్యార్థులు పరీక్షలంటే ఎక్కువ ఆందోళనకు గురవుతుంటారు. ఆత్మ విశ్వాసమే విజయానికి పునాది అని, పట్టుదల, సంకల్పం, ఏకాగ్రత ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. ఒత్తిడిని తగ్గించే మార్గాలు -
అక్కడ వార్.. ఇక్కడ బేజార్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పశ్చిమాసియాలోని యుద్ధం వెతలు ఇన్నిన్ని కాదయా.. ఇంటింటా వంటింటా తిప్పలేనయా! అన్నట్లుగా ఉంది పరిస్థితి. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణాకు ఇబ్బందులు ఏర్పడి ఎల్పీజీ సరఫరాలో తలెత్తిన అంతరాయం ఉమ్మడి జిల్లాపై భారీగానే పడింది. గృహాలతోపాటు వాహనాలు, హోటళ్లు, మెస్లు, హాస్టళ్లు, హాస్పిటళ్లను సైతం ఎల్పీజీ కొరత ముప్పు వెంటాడుతోంది. యుద్ధం ప్రభావంతో ఇప్పటికే గృహ(రూ.60), కమర్షియల్ సిలిండర్ (రూ.115) ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన ఎల్పీజీ సరఫరా మునుపటిస్థాయిలో ఉండటం లేదని డీలర్లు అంటున్నారు. కొరతతో అనివార్యంగా ధరలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా వాహనాలకు విక్రయించే ఎల్పీజీ గ్యాస్ కేవలం వారం రోజుల్లోనే లీటరుకు రూ.30కిపైగా పెరగడం పరిస్థితికి నిదర్శనం. నిండుకుంటున్న గ్యాస్ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలలో 50కిపైగా ఎల్పీజీ స్టేషన్లు ఉన్నాయి. ప్రతీరోజూ ఆటోలు, కార్లు తదితర వాహనాలు 50వేల లీటర్ల వరకు ఎల్పీజీ నింపుకొంటున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు లీటరుకు రూ.55గా ఉన్న ఎల్పీజీ తాజాగా గురువారం లీటరు రూ.86కు పెరిగింది. ఈ లెక్కన ప్రతీరోజూ ఉమ్మడి జిల్లా ఎల్పీజీ వాహనాలపై రూ.కోటిన్నర వరకు భారం పడుతోంది. యుద్ధం మరింత ముదిరితే ఎల్పీజీ ధర లీటరుకు రూ.100 పెరిగినా ఆశ్చర్య పోనవసరం లేదని గ్యాస్ స్టేషన్ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. పెట్రోలుతో పోలిస్తే.. గ్యాస్ ధర చవక, అధిక మైలేజీ ఇవ్వడం, పర్యావరణ హితంగా ఉండటంతో కొన్నాళ్లుగా ఎల్పీజీ వాహనాలకు డిమాండ్ పెరిగింది. హోటళ్లు, హాస్పిటళ్ల జాగ్రత్తలు యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా తగ్గిపోతుండటంతో ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ హోటళ్లు, హాస్పిటళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లు ముందు జాగ్రత్తగా వంటచెరుకు, చార్కోల్ తదితర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారంతో ఇంటర్ పరీక్షలు ముగియడంతో రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. పదోతరగతితో పాటు పాఠశాల విద్యార్థులకు మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక సాధారణ ప్రజలు ముందు జాగ్రత్తగా ఎలక్ట్రిక్ కుక్కర్లకు డిమాండ్ పెరిగింది. మూలన పడిన పాత స్టవ్ను రిపేర్లకు బయటికి తీస్తున్నారు. ఒకవేళ ఎల్పీజీ కొరత ముదిరి సంక్షోభంలా మారితే.. హోటళ్లు మూతబడితే.. అందులో పనిచేసే వారు ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. గ్రానైట్ పరిశ్రమపై దెబ్బ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న కరీంనగర్ జిల్లాపై యుద్ధం ప్రభావం తీవ్రంగా పడింది. కరీంనగర్ నుంచి ఆంధ్రా మీదుగా చైనా, ఇటలీకి వెళ్లే కరీంనగర్ గ్రానైట్కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కారణంగా షిప్పింగ్ ఛార్జీలు పెరగడం ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా కంటైనర్కు 21 డాలర్లుగా ఉన్న ధర ప్రస్తుతం 28 డాలర్లకు పెరిగింది. రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, క్వారీల్లో వాడే యంత్ర పరికరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో 250 రూపాయలు ఉన్న డ్రిల్లింగ్ బిట్టు ధర ఇప్పుడు ఏకంగా 1200 రూపాయలకు చేరడం పరిశ్రమ దీనస్థితికి అద్ధం పడుతోంది. మరోవైపు, క్వారీలను నడపడానికి అత్యంత కీలకమైన డీజిల్ సరఫరాపై కూడా ఆందోళన నెలకొంది. ప్రతి క్వారీకి రోజుకు సగటున 1000 లీటర్ల డీజిల్ అవసరం కాగా, పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా పెరిగితే.. అందులో పనిచేసే వేలాది మంది ఉత్తరాది కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు -
‘ఇందిరమ్మ’ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
పెగడపల్లి: గూడులేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ పథకం కింద ఇంటిని నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని నంచర్లలో సాయిళ్ల సూరమ్మ, ముని దంపతులు నిర్మించిన ఇంటిని గురువారం ప్రారంభించారు. నియోజకవర్గంలో మొదటి విడత 3500 గృహాలు మంజూరు చేశామని, అవన్నీ పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని సూచించారు. నంచర్ల నుంచి పెగడపల్లి యాపల్ చెరువు ఉన్న రహదారితోపాటు శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణమండపం, వంటశాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్, సర్పంచ్ కుంటాల వనజ, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఏఈ జ్యోతి, ఉప సర్పంచ్ ఎడ్ల శ్యాంసుందర్రెడ్డి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం ధర్మపురి: గ్రామీణులకు సేవలందిస్తున్న ఆశవర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశవర్కర్ల తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ప్రతిఒక్కరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. -
8 గంటలు.. 40 కిలోమీటర్లు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కేంద్రహోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన మహా పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మేర వేడి ఉండబోతున్నట్లు వాతావరణశాఖ చెబుతున్నప్పటికీ 8గంటల్లో 40కిలోమీటర్లు నడిచి కొండగట్టుకు చేరేందుకు సిద్ధమయ్యారు. పాదయాత్ర పొడవునా మంచి నీళ్లు, మజ్జిగ, పులిహోర సహా అన్ని ఏర్పాట్లు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, భక్త మండళ్లు ముందుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కరీంనగర్ బాట పడుతున్నారు. పార్టీ సీనియర్ నేత డాక్టర్ గంగిడి మనోహర్రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇన్చార్జి బండారి శాంతికుమార్, మోహన్రెడ్డి, జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో, కొండగట్టు వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. పది పరీక్షలకు ఇబ్బంది లేకుండా శనివారం టెన్త్ పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాదయాత్ర సందర్భంగా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా, రోడ్డుపై ట్రాఫిక్ జాం కా కుండా యాత్రను సాగించాలని బండి సంజయ్ కా షాయ శ్రేణులను కోరారు. పాదయాత్రలో పాల్గొనే వారంతా ఈ14న ఉదయం 6 గంటలకే మహాశక్తి ఆలయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర సాగుతుందిలా.. ఈనెల 14న ఉదయం 6 గంటలకు కరీంనగర్లోని మహా శక్తి ఆలయానికి బండి సంజయ్ చేరుకుంటారు. కార్యకర్తలతో కలిసి కొండగట్టుకు బయల్దేరుతారు. రామడుగు, వెదిర, కురిక్యాల మీదుగా గంగాధర చేరుకుంటారు. అక్కడి వీఏఎస్ ఫంక్షన్ హాలులో భోజనం చేస్తారు. వెంకటాయపల్లి, పూడూరు, దొంగలమర్రి, మీదుగా కొండగట్టు ఘాట్ రోడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అంజన్న ఆలయం వద్దకు వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకుంటారు. -
జగిత్యాల బల్దియా బడ్జెట్ రూ.83.99 కోట్లు
జగిత్యాల: పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రమైన బల్దియా లక్ష్యంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపొందించినట్లు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి తెలిపారు. చైర్పర్సన్ సమిండ్ల వాణి అధ్యక్షతన గురువారం మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రూ.83.99కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. పట్టణంలో గ్రీన్ కవరేజీ పెంచడానికి రూ.3.37 కోట్లు, పారిశుధ్య నిర్వహణకు రూ.3.9 కోట్లు, వసతుల కల్పన, పార్క్లు, మురికివాడల అభివృద్ధి, ఆటస్థలాలు, పబ్లిక్ టాయిలెట్స్, ఓపెన్ జిమ్స్, స్ట్రీట్ వెండర్స్, జంతువధశాలల నిర్మాణాలకు రూ.8.53 కోట్లు కేటాయించారు. మిగులు బడ్జెట్లో 1/3 వంతు నిధులు రూ.2.84 కోట్లు వెనుకబడిన తరగతులు, మైనార్టీలు, మురికివాడలు, అభివృద్ధి దశలో ఉన్న ప్రాంతాలు, కొత్తగా విలీనమైన ప్రాంతాలకు కేటాయించారు. జగిత్యాలకు అత్యధిక నిధులు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటికీ రానన్ని జగిత్యాలకు తెచ్చామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. వాటితో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని, పన్నులు సకాలంలో చెల్లించేలా చూడాలని అధికారులు పేర్కొన్నారు. ప్రణాళికబద్ధంగా చెరువులు, కుంటలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ ప్రాధాన్యక్రమంలో నిధులు వెచ్చిస్తూ మున్సిపాలిటీని అభివృద్ధిపర్చాలని, పన్నుల వసూళ్లకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, అకౌంట్స్ ఆఫీసర్ గణేశ్, డిప్యూటీ ఈఈ ఆనంద్, టౌన్ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, ఏఈలు అనిల్, లక్ష్మీ పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం జగిత్యాలటౌన్: క్రీడలు మానసికోల్లాసం కలి గిస్తాయని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి అస్మి త లీగ్ పోటీలను ప్రారంభించారు. క్రీడల అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. ఇండోర్ స్టేడియంలో బాక్సింగ్, షటిల్ కోసం వసతులు కల్పించామన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, యువజన, క్రీడల అధికారి రవికుమార్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, సిరిసిల్ల శ్రీనివాస్, పీడీలు విశ్వప్రసాద్, పీఈటీలు క్రిష్ణప్రసాద్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రజాధనం దుబారా..!
● ఓ కేకు.. స్టేజీ.. డీజే సాంగ్స్.. ఇలా చిన్నపాటి ఖర్చులు లెక్కిస్తే మొత్తం అక్షరాల రూ.లక్ష. ఇదంతా కేవలం ఒక్కరోజు మహిళా దినోత్సవం నిర్వహించడానికి వెచ్చించిన ఖర్చు. ● 50మందికి టోపీలు..బనియన్లు ఇచ్చి పట్టణ ప్రగతి ప్రణాళిక పేరిట 2కే రన్ నిర్వహించి దాని కోసం చేసిన ఖర్చు రూ.70 వేలు. కోరుట్ల: ఇళ్లల్లో లేని నల్లాలకు బిల్లులు వసూలు చేసి.. ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి ఆస్తిపన్ను వసూళ్లలో పక్కాగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు.. వచ్చిన ఆదాయాన్ని ఆదా చేయడంలో విఫలమవుతున్నారు. దీనికి ఇటీవల నిర్వహించిన మహిళా దినోత్సవం.. 2కే రన్ కార్యక్రమాలు. రూ.లక్ష ఖర్చు చేశారా..? మహిళలను ప్రోత్సహించడానికి మహిళా దినో త్సవం ఘనంగా నిర్వహించాల్సిన అవసరముంది. బల్దియా ఆవరణలో ఈనెల 8న వేదిక ఏర్పాటు చేశారు. మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఆర్పీలు ఇతరత్రా అంతా కలిసి 70 మంది వరకు పాల్గొన్నారు. మున్సిపల్ ఆవరణలో ఓ టెంట్, స్టేజీ, కుర్చీలు వేసి కేక్ కట్ చేశారు. డీజే ఏర్పాటు చేశారు. ఆర్పీలకు చీరలు పంపిణీ చేశారు. మొత్తం ఖర్చు ఏతావాతా రూ.40వేల నుంచి రూ.60 వేలలోపు ఉంటుందని సమాచారం. దీనికి మున్సిపల్ అధికారులు మాత్రం మొత్తం రూ.లక్ష ఖర్చు చూపినట్లు సమాచారం. 2కే రన్కు రూ.70 వేలు మూడు రోజుల క్రితం పట్టణంలోని 2కే రన్ నిర్వహించారు. కృష్ణాలయం నుంచి నంది చౌరస్తా వరకు చేపట్టారు. ఈ రన్లో పాల్గొన్న వారికి టోపీలు, బనియన్లను మున్సిపల్ తరఫున అందించారు. వీటికి ఖర్చు మొత్తంగా రూ.70 వేలుగా చూపారు. ఈ బిల్లుల ఆమోదం కోసం శుక్రవారం నిర్వహించే సమావేశం అజెండాలో ఈ అంశాలను చేర్చారు. వీటిని చూసిన కౌన్సిలర్లు ఇవేమి ఖర్చులని నివ్వెరపోయినట్లు సమాచారం. గతంలో స్పాన్సర్లను ఏర్పాటు చేసుకుని బల్దియాపై భారం లేకుండా చూసేవారు. ఖజానా అంతంత మాత్రంగానే ఉండగా.. ఆచితూచి ఖర్చు చేయాల్సింది పోయి అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మహిళా దినోత్సవం ఖర్చు అక్షరాలా రూ.లక్ష 2 కే రన్కే రూ.70వేలు వెచ్చింపు కోరుట్ల బల్దియాలో అడ్డగోలు లెక్కలు -
బల్దియాను అభివృద్ధి చేస్తా
● చైర్మన్ మైలారపు లింబాద్రి మెట్పల్లి: మెట్పల్లి మున్సిపాలిటీని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని 1, 11వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో చైర్మన్ పాల్గొన్నారు. ఒకటో వార్డులోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కౌన్సిలర్లు, సిబ్బందితో కలిసి పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించారు. వెంకట్రావ్పేటలో పారిశుధ్య పనులు పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు. వైస్చైర్మన్ ఓంకార్ నవీన్, కౌన్సిలర్లు రెబ్బాస్ మహేశ్, అజీం, బత్తుల నరేష్, దొనికెల శిరీష, నునుగొండ నరేష్, పందిరి రమేశ్, మాసుల ప్రవీణ్ తదితరులున్నారు. మెరుగైన వైద్యం అందించాలికథలాపూర్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్వో సుజాత అన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గురువారం మెగా ఉచిత వైద్యశిబిరం ప్రారంభించారు. ప్రత్యేక వైద్య నిపుణులు 194 మందికి చికిత్స అందించారు. వీరిలో 28 మందిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి పంపించినట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీవో శంకర్, వైద్యాధికారులు సింధూజ, రజిత, సీహెచ్వో వేణు, సర్పంచ్ శేఖర్, ఉపసర్పంచ్ ప్రసాద్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. కొండగట్టులో కేంద్ర గణాంక శాఖ అధికారుల పూజలుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని కేంద్ర గణాంక శాఖ అధికారులు గురువారం దర్శించుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర సునీత, జాతీయ గణాంక ఉప ప్రాంతీయ కార్యాలయం అధికారి డి.వర్మ, గోవర్ధన శ్రీని వాస్ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారి కి స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. బల్దియాలో పారిశుధ్యానికి ప్రాధాన్యంరాయికల్: రాయికల్ బల్దియాలో పారిశుధ్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ కట్కం రవి అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాతబస్టాండ్లో గురువారం పారిశుధ్య సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. పారిశుధ్యంతోనే పట్టణంలో రోగాల నియంత్రణ చేపట్టవచ్చని తెలిపారు. వైస్ చైర్మన్ తురగ సౌజన్య, మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు పాల్గొన్నారు. -
టెన్షన్ వద్దు..!
జగిత్యాల: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈవో రాము తెలిపారు. గతేడాది టెన్త్ ఫలితాల్లో నాలుగో స్థానంలో నిలిచామని, ఈసారి మొదటిస్థానం సాధించేలా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే జయీభవ విజయీభవ 2.0 లేఖ ద్వారా కలెక్టర్ సందేశాలు పంపించారని, 10న విద్యార్థులతో జూమ్ ద్వారా ముఖాముఖి మాట్లాడారని పేర్కొన్నారు. ప్రణాళిక, ఆరోగ్యం, పూర్వ ప్రశ్నపత్రాల సాధన, ఒత్తిడికి దూరంగా, రాత నైపుణ్యం ఎలానో వివరించారని తెలిపారు. విద్యార్థులు కేంద్రానికి అరగంట ముందే చేరుకుంటే ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చన్నారు. వేసవికాలం కావడంతో అన్ని వసతులు కల్పించామని వివరించారు. ఈనెల 14 నుంచి ప్రారంభంకానున్న టెన్త్ పరీక్షల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో పలు విషయాలు వెల్లడించారు. -
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సునీల్రావు
కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావును నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆదేశాలు జారీచేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించి న రామచందర్రావు, కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్కుమార్కు సునీ ల్రావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు.బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలిధర్మపురి: గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ను బాలికలు వేసుకోవాలని డిప్యూటీ డీఎంఅండ్ హెచ్వో శ్రీనివాస్ అన్నా రు. 14ఏళ్లు దాటిన బాలికలకు పట్టణంలోని ఆస్పత్రిలో బుధవారం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సిన్ను అందించారు. వైద్యులు, సిబ్బంది తదితరులున్నారు. ‘ఆత్మ’ చైర్మన్గా కాటిపెల్లి గంగారెడ్డిరాయికల్: అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) చైర్మన్గా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన కాటిపెల్లి గంగారెడ్డి నియామకమయ్యారు. గంగారెడ్డి ఎమ్మెల్యే సంజ య్ కుమార్ను బుధవారం మర్యాదపూర్వకంగా కలవగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, మాజీ సర్పంచులు శ్రీని వాస్, సామాల్ల వేణు, రవీందర్రావు, శ్రీని వాస్, శేఖర్రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన స్పీకర్ కథలాపూర్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి అన్నారు. కథలాపూర్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కి పాలిస్తోందన్నారు. కాంగ్రెస్లో చేరినట్లు ఆధారాలున్నా.. స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని, గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండిమెట్పల్లి: ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆర్డీఓ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందించారు. మక్కలకు బహిరంగ మార్కెట్లో వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తున్నారని, తద్వారా రైతులకు నష్టం జరుగుతోందని, ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మారు మురళీధర్రెడ్డి, క్యాతం సంజీవ్రెడ్డి, అల్లూరి అక్కిరెడ్డి, సార్ల రవి తదితరులున్నారు. -
నిబంధనలు తూచ్..!
కోరుట్ల: కోరుట్ల మున్సిపల్ మొట్టమొదటి బడ్జెట్ సమావేశం ఏర్పాటులోనే బల్దియా అధికారులు నిబంధనలు విస్మరించారని ఆరోపిస్తూ పలువురు కౌన్సిలర్లు అదనపు కలెక్టర్ రాజాగౌడ్కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త పాలకవర్గం ఏర్పాటు అనంతరం ఈనెల 13న మొదటిసారి బడ్జెట్ సమావేశం ఏర్పాటుకు కమిషనర్ రవీందర్ నిర్ణయించారు. సాధారణంగా ప్రతి మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశం అత్యంత కీలకం. బల్దియాకు వస్తున్న ఆదాయం, ఖర్చులు, పన్నులు, ఇతరత్రా పథకాల ద్వారా సమకూరిన నిధులను ఎలా సద్వినియోగం చేయాలన్న విషయంలో పూర్తి చర్చకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో బడ్జెట్ ప్రతులను సమావేశానికి ఏడు రోజులు ముందుగానే కౌన్సిలర్లకు అందించాలన్న నిబంధన ఉంది. ఈ ఏడు రోజులు కూడా పనిదినాలుగానే ఉండాలి. ఏడు రోజులు ముందుగా బడ్జెట్ ప్రతులు అందితే.. కౌన్సిలర్లు వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుని మంచిచెడుపై సమావేశంలో అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఆస్కారం చిక్కుతుంది. ఆ ఉద్దేశంతోనే వారం ముందుగా సమాచారం ఇవ్వాలన్న నిబంధన రూపొందించారు. దీనికితోడు ప్రస్తుత పాలకవర్గంలో మూడోవంతు కౌన్సిలర్లు కొత్తవారు కావడంతో వీరికి బడ్జెట్ నిధుల కేటాయింపు వంటి అంశాలపై అవగాహనకు సమయం అవసరం. కనీస అవగాహనకు అవకాశం ఇవ్వకుండా ఆదరాబాదరాగా బడ్జెట్ సమావేశం పెట్టడంపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లతోపాటు కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. నిబంధనలు బేఖాతరు.. అత్యంత కీలక సమావేశం నిర్వహణలో అధికారుల ఏమరుపాటు ఇబ్బందికరంగా మారింది. కోరుట్ల మున్సిపల్ అధికారులు ఈనెల 13న బడ్జెట్ సమావేశం ఉంటుందని నిర్ణయించారు. ఈ సమావేశానికి సంబంధించిన ప్రతులపై 9వ తేదీగా ముద్రించి 10వ తేదీ సాయంత్రం కౌన్సిలర్లకు బడ్జెట్ మీటింగ్ ప్రతులను పంపించారు. ఈ లెక్కన కేవలం మూడు రోజుల ముందుగా బడ్జెట్ మీటింగ్ సమాచారం కౌన్సిలర్లకు అందించినట్లు లెక్క. నిబంధనలను పక్కన పెట్టి ఆలస్యంగా బడ్జెట్ మీ టింగ్ సమాచారం కౌన్సిలర్లకు ఇవ్వడం వెనుక ము న్సిపల్ అధికారుల ఆంతర్యం ఏమిటన్న విషయంలో స్పష్టత చిక్కడం లేదు. డీఎంఏ కార్యాలయం నుంచి బడ్జెట్ మీటింగ్ ఈనెల 15లోపు నిర్వహించాలని సమాచారం ఇచ్చారని, ఆ మేరకు తాము అత్యవసరంగా సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేశామని మున్సిపల్ అధికారులు చెబుతుండడం గమనార్హం. డీఎంఏ కార్యాలయం నుంచి బడ్జెట్ సమావేశం సమాచారం వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం వారం గడువు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అఽధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే ఈ దుస్థితి తలెత్తిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సమీకృత సాగు విధానంతో లాభాలు
మెట్పల్లిరూరల్: సమీకృత సాగు విధానంతో రైతులు లాభాలు గడించవచ్చని డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ నారాయణ అన్నారు. మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్, విట్టంపేట గ్రామాల్లో సెర్ప్, వాస న్ ఎన్జీవో ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు వ్యవసాయ విధానంపై బుధవారం అవగాహన కల్పించారు. పశుపోషణ, సాగు, చేపలు, పౌల్ట్రీ తదితర ఉత్పాదకతలను పెంచడమే దీని లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, ఏపీఎంలు అహ్మద్ హుస్సేన్, అశోక్, వాసన్ ఎన్జీవో డైరెక్టర్ భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్ నారాయణ, సమాఖ్య అధ్యక్షురాలు లత పాల్గొన్నారు. -
జనగణన పారదర్శకంగా చేపట్టాలి
జగిత్యాల: జనగణన ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. బుధవారం జనగణన తొలిదశ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణలో డేటా సేకరణ విధానం, డిజిటల్ పరికరాల వినియోగం, ఫీల్డ్ స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. భవిష్యత్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికకు కచ్చితమైన గణాంకాలు సిద్ధమవుతాయన్నారు. ఎస్సెస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీఎస్.లత అన్నారు. బుధవారం విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. డీఈవో రాము, జిల్లా పరీక్షల విభాగం అధికారి నరేందర్ పాల్గొన్నారు. -
మంట
మార్చిలోనే జగిత్యాలఅగ్రికల్చర్: మార్చి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 38 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దంతా వేడితో ఉక్కపోత ఉంటున్నప్పటికీ.. ఉదయం సమయానికి వాతావరణం చల్లగా మారుతుండటం విశేషం. ప్రధానంగా యాసంగిలో సాగుచేసిన పంటలపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఉత్తర, వాయువ్యం నుంచి వీచే వేడిగాలులతోపాటు శీతాకాలంలో చల్లదనాన్ని ఇవ్వడంలో క్రీయాశీలకంగా వ్యవహరించే పశ్చిమ దిశగా వీచే గాలులు బలహీనపడ్డాయి. దీనికితోడు ఎప్పటికప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులతో మార్చిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతున్నాయిని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశం నిర్మలంగా ఉండటం, వర్షపాతం తగ్గడం.. ఆకాశంలో మేఘాలు లేకపోవడం.. సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడడంతో భూమిని వేడి చేస్తున్నాయి. మార్చిలో సాధారణంతో పోల్చితే 3నుంచి 7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పెరుగుతున్న భూతాపం వల్ల చలికాలం తగ్గి, ఏప్రిల్, మే నెలల్లో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదు కావడానికి కారణమవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీల సెల్సియస్గా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 20 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతున్నాయి. బీర్పూర్ మండలం కొల్వాయి, కోరుట్ల మండలం అయిలాపూర్, మల్లాపూర్, సారంగాపూర్, కథలాపూర్, వెల్గటూర్, మల్లాపూర్ మండలం రాఘవపేట, ఇబ్రహీంపట్నం గోధూర్, ధర్మపురి మండలం జైనా, రాయికల్ మండలం అల్లీపూర్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాలరూరల్ మండలాల్లో బుధవారం 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి కొద్ది రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లేవారు తేలికపాటి దుస్తులు ధరించడంతో పాటు వీలైనంత ఎక్కువ నీటిని తాగడం, సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలని, టోపి, టవల్స్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం రానున్న ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35నుంచి 37, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 24 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమ ఉదయం 68 నుంచి 75 శాతం, మధ్యాహ్నం 51 నుంచి 59శాతం నమోదవుతాయి. వడగాలులు గంటకు రెండు పది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. – బి.శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస పంటలపై తీవ్ర ప్రభావం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతల్లో పెరుగుదలతో వరిలో కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు ఆశిస్తుంది. నువ్వు పంటలో రసం పీ ల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంది. అన్ని రకాల ఆరుతడి, పండ్ల, కూరగాయల పంటలకు వారం వ్యవధితోనే సాగు నీటిని ఇవ్వాలి. – హరీష్కుమార్ శర్మ, పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస ఈ ఏడాది సాధారణానికి మించి..జిల్లాలో ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఒకటిరెండు డిగ్రిలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల వాతావరణంలో వేడితోపాటు వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రధాన కారణంగా గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా ఉపయోగించడం ద్వారా గ్రీన్హౌస్ వాయువులైన కార్బన్డయాకై ్సడ్, మిథేన్ వాతావరణానికి హానికరంగా మారుతున్నాయి. -
‘ప్రగతి ప్రణాళిక’ విజయవంతం చేద్దాం
జగిత్యాల: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్లో మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులకు శిక్షణ కల్పించారు. 10 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయాలని, కలెక్టర్ ప్రతిరోజూ సమీక్ష నిర్వహించాలని సూచించారు. పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, వీధిదీపాలు, తాగునీటి అంశాలపై ప్రతినిధులు భాగస్వామ్యం కావాలన్నారు. పుష్కరాలకు ప్రత్యేక నిధులు గోదావరి పుష్కరాలకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని పనులు పూర్తయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాగునీటి సమస్య పరిష్కారానికి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో కలిసి నిధులు తేవడానికి కృషి చేస్తానన్నారు. అన్ని గిరిజన గ్రామాలు, తండాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. చల్గల్లో ఉన్న ప్రభుత్వ భూములను కేంద్రీయ విద్యాలయం లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కేటాయిస్తామన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి కొత్తగా ఎన్నికై న చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు సామాజిక బాధ్యతతో పనిచేసి అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మున్సిపల్ పరిధిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి కొత్తగా ఎన్నికై న ప్రతినిధులు వారి హక్కులు తెలుసుకుని అభివృద్ధి చేయాలని, ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో సమన్వయంతో పనిచేయాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ప్రణాళికబద్ధంగా చర్యలు ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం కోసం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. నిత్యం శాఖల వారీగా సమీ క్షిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికా రులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. మున్సిపాలిటీల చైర్మన్లు సమిండ్ల వాణి, వేముల నాగలక్ష్మి, లింబాద్రి, వసంత పాల్గొన్నారు. -
క్షయ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి
మల్యాల: క్షయవ్యాధి నివారణలో అందరూ భాగస్వామ్యం కావాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డిజిటల్ మొబైల్ ఎక్స్రే యంత్రాన్ని ప్రారంభించారు. క్షయ నిర్ధారణ శిబిరంలో పరీక్షలు నిర్వహించారు. దగ్గు, జ్వరం ఉంటే తక్షణమే క్షయ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. మండల వైద్యాధికారి మౌనిక, సిబ్బంది రమేశ్, రాజమ్మ, శ్రీనివాస్, వికాస్, రాజీవ్ పాల్గొన్నారు. పశువులకు గాలికుంటు నివారణ టీకాలుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా ఏప్రిల్ 9 వరకు పశువులకు గాలికుంటూ నివారణ టీకాలను ఉచితంగా వేయనున్నట్లు పశువైద్యాధికారి బొల్లం ప్రకాశ్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో మంగళవారం టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎద్దులు, ఆవులు, లేగదూడలు 32,534, బర్రెలు 85,200 ఉన్నాయని, వీటికి టీకాలు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కట్టా రాజేందర్, మండల పశువైద్యాధికారి గడ్డం నరేష్రెడ్డి, ఎల్ఎస్ఎలు పాల్గొన్నారు. పెద్దాపూర్ మల్లన్న ఆలయ హుండీ లెక్కింపుమెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం పెద్దాపూర్లో ఆదివారం జరిగిన మల్లన్న జాతర సందర్భంగా భక్తుల ద్వారా హుండీలకు రూ.14,03,544 సమకూరినట్లు ఆలయ ఈవో విక్రమ్ తెలిపారు. మిశ్రమ వెండి 560 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. పరిశీలకులు రాజమొగిలి, ఆలయ చైర్మన్ తిరుపతిరెడ్డి, సర్పంచ్ సుమలత, ఉపసర్పంచ్ చిన్నమల్లేశ్, కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈవీఎంల గోదాం తనిఖీజగిత్యాల: ఈవీఎంల వద్ద పటిష్ట భద్రత ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం ఈవీఎం గోదాంలను పరిశీలించారు. గోదాం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, కలెక్టరేట్ ఏవో హకీం, అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్ ఉన్నారు. -
ప్రజాపాలన పచ్చి మోసం
జగిత్యాల/జగిత్యాలటౌన్: ప్రజలను మోసం చేయడానికే ప్రభుత్వం మరో ప్లాన్తో ముందుకొచ్చిందని, 99 రోజుల యాక్షన్ ప్లాన్ పచ్చి మోసమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలో మాట్లాడుతూ ప్రగతి ప్రణాళిక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. జెండా, ఎజెండా లేకుండా ఇష్టారీతిన పాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజాపాలనకు జిల్లాలోనే రెండు లక్షల దరఖాస్తులు వస్తే ఏమయ్యాయని ప్రశ్నించారు. రాజీవ్ యువ వికాస్ పేరిట 4 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకుంటే నయా రూపాయి ఇవ్వలేదన్నారు. 99 డేస్ ప్రగతా... ప్రణాళికణా స్పస్టం చేయాలన్నారు. రైతు భరోసా ఎక్కడ అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్ బీఆర్ఎస్లోనే ఉన్నా అంటాడని, పక్కన మాత్రం కాంగ్రెస్ కండువాలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, కౌన్సిలర్లు దేవేందర్, హరీశ్, ఆనందరావు, గంగాధర్, ప్రవీణ్, కమలాకర్ పాల్గొన్నారు. -
యువతే దేశ సంపద
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాల: నేటి యువతే దేశానికి సంపద అని, యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఏటీసీ సెంటర్లో మరో ఆరు కోర్సులను ప్రారంభించారు. యువత ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశంతో టాటా కంపెనీతో కలిసి ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయించామన్నారు. సీఎంఆర్ఎఫ్ వినియోగించుకోవాలి సీఎంఆర్ఎఫ్ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని 42వ వార్డుకు చెందిన వెంకటేశ్కు రూ.2లక్షలు, గాంధీనగర్కు చెందిన లక్ష్మయ్యకు రూ.2లక్షల విలువైన చెక్కులు అందించారు. హైమాస్ట్ లైట్లు ప్రారంభం జిల్లాకేంద్రంలోని ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి ఉన్నారు. ముస్లింలకు ఇఫ్తార్ జగిత్యాలలోని జమాత్ ఏ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగా.. ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఫజల్ బేగ్, ఖాలిద్, సోయబ్ ఉల్ హక్, హరికిరణ్రావు, దామోదర్రావు ఉన్నారు. ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా చేపట్టాలిజగిత్యాల: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. జూన్ 12వరకు పకడ్బందీగా అమలు చేయాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. పారిశుధ్యం, ఫైల్స్ క్లియరెన్స్పై దృష్టి సారించాలన్నారు. 12న మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి, డీపీఆర్వో నరేశ్, డీపీవో మదన్మోహన్ పాల్గొన్నారు. -
వైభవంగా ఎల్లమ్మ తల్లి పట్నాలు
వెల్గటూర్: మండల కేంద్రంలోని గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ పట్నాల ఉత్సవం నిర్వహించారు. మంగళవారం ఎల్లమ్మ తల్లి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు బైండ్ల వారి పాటలు, జమిడిక మోతలు, డప్పు చప్పుళ్లతో, మహిళలు బోనాలు ఎత్తుకొని వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కార్యక్రమం చివరలో 11 మంది గౌడ సంఘం సభ్యులు ఒకే తాటిచెట్టు పైకి ఎక్కి చేతులతో కల్లు కిందకు దింపి అమ్మవారికి సమర్పించారు. -
మందులు పిచికారీ చేసిన
నాలుగెకరాల్లో కర్బూజ సాగు చేశా. సీంఎంఆర్ పద్ధతిలో మట్టిని పంటపై స్ప్రేచేశా. ఇప్పటికే ఏడెనిమిది సార్లు రసాయన మందులు పిచికారీ చేసినా ఫలితం కనబడలేదు. పంట నష్టం తీవ్రంగా జరిగింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. – బండారి వెంకటేశ్, పెంబట్ల, సారంగాపూర్ మామిడికి పెద్ద దెబ్బ ఈసారి మామిడిని పురుగులు దెబ్బతీశాయి. పూత దశ నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు మందులు కొట్టినా. కాయ నిలబడితేనే రైతుకు లాభం. ఉష్ణోగ్రతలు, పురుగుల ఉధృతి పెరుగుతున్న కొద్ది పిందెలు ఏమేరకు ఆగుతుందో అర్థం కావడం లేదు. – కిష్టంపేట రమేష్ రెడ్డి, శ్రీరాముల పల్లె, గొల్లపల్లి(మం) -
డ్రైనేజీ నీరు చెరువుల్లోకి..!
జగిత్యాల: జిల్లా కేంద్రం చుట్టూ మోతె చెరువు, కండ్లపల్లి చెరువు, లింగం చెరువు, ముప్పారపు చెరువులు ఉన్నాయి. అయితే అండర్ డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో ఇళ్లనుంచి వెలువడే మురుగునీరంతా ఈ చెరువుల్లోకే చేరుతోంది. ఫలితంగా నీరంగా పూర్తిగా కలుషితమవుతోంది. భూగర్భజలాలు పెంచాల్సిన ఈ చెరువులు కలుషితమై ప్రజలకు లేని రోగాలను తెచ్చిపెతున్నాయి. సివరేజీ ట్రిట్మెంట్ ప్లాంట్లు లేకపోవడం, అండర్ డ్రైనేజీ సిస్టం లేకపోవడం ఇబ్బందిగా మారింది. మున్సిపాలిటీ పరిధిలోని ఏ డ్రైనేజీ నుంచి వచ్చిన నీరైనా ముప్పారపు, మోతె చెరువుల్లోకే వెళ్తోంది. గతంలో ఈ చెరువుల్లోకే కాలువలు ఏర్పాటు చేయడం గమనార్హం. అక్కడ సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే నీరు కలుషితం కాకుండా ఉండే అవకాశం ఉంది. గొల్లపల్లి రోడ్లో గల సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటిక వద్ద డ్రైనేజీలో వ్యర్థాలు పడేస్తుండటంతో దుర్వాసన వ్యాపించి ప్రజలు అనారోగ్యానికి గురికావడంతోపాటు, ఈ చెత్తంతా ముప్పారపు చెరువులో కలిసి కలుషితం అవుతోందని కౌన్సిలర్ సిరికొండ పద్మ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నిత్యం ఇలా చాలా మంది చెరువులు కలుషితంతో పాటు, కబ్జాకు గురవుతున్నాయని వాపోతున్నారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణలు ఎక్కువ ఈ కాలువలు సక్రమంగా లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ మురికినీరు నిలిచిపోతోంది. పైగా కాలువలు ఆక్రమణలకు గురికావడంతో మురుగు నీరంతా చెరువులోకే పోతోంది. చుట్టూ శివారు ప్రాంతాలతో పాటు చెరువుల సమీపంలో ఉన్న భూములు రేట్లు అధికంగా పలకడంతో ఆక్రమణలకు గురవుతున్నాయి. బఫర్ జోన్ సమీపంలో ఉన్న గానీ ఆక్రమణలు చేస్తూ మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. చెరువులు కబ్జా.. వాస్తవానికి చెరువులు తాగునీటి అవసరాలకు.. భూగర్భజలాల పెంపు కోసం ఉపయోగపడాలి. కానీ.. జిల్లాకేంద్రం నుంచి వెలువడే వ్యర్థపు నీరంతా ఇందులోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు మిషన్ కాకతీయ అంటూ చెరువుల్లో పూడికతీస్తున్నా.. గ్రామాలను కాపాడుకుంటున్నా జిల్లాకేంద్రంలోని నాలుగు చెరువులు మాత్రం కబ్జాకు గురవుతున్నాయి. చికెన్ వ్యర్థాలు, మానవుల మలవిసర్జన, పట్టణంలోని మురికినీరు, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ చెరువులోకే వెళ్తున్నాయి. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎప్పుడు? మురికినీరు కలుషితం కాకుండా దానిని శుభ్రం చేసి బయటకు పంపేందుకు చెరువులవద్ద గానీ, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ జిల్లా కేంద్రం అయినప్పటికీ ఎక్కడ కూడా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు లేవు. ఇటీవలే ఆస్పత్రిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. అలాగే చెరువుల వద్ద అవసరమున్న చోట్లలో ఈ డ్రైనేజీ నీటిని శుద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని పట్టణప్రజలు కోరుతున్నారు. చేపలకు కలుషిత ఆహారం ఈ చెరువుల్లో మత్స్యకారులు ఎక్కువగా చేపలు వేసుకుని పెరిగాక పట్టుకుని అమ్ముకుంటూ జీవిస్తుంటారు. డ్రైనేజీ నీరంతా అందులోకే వెళ్లడంతో చేపలు కొనేందుకు కొందరు సంశయం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలలో ఎక్కువగా ఈ చెరువుల్లో పెంచిన వాటినే అమ్ముతుంటారు. నీరు అందులో కలుషితం కావడంతో చేపల వ్యాపారం కూడా తగ్గుతోందని ఇటీవల మాజీమంత్రి జీవన్రెడ్డికి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్చార్జి రజినీకాంత్ వినతిపత్రం అందించారు. చెరువులను కాపాడటంతో పాటు, హైదరాబాద్లో లాగా ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి పట్టణంలోని గోవిందుపల్లిలోని తుమ్మలకుంట, మోతెచెరువు, ముప్పారపు చెరువు, కర్నకుంట చెరువులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎక్కడ? నిధులు మంజూరయ్యాయిచెరువులు శుభ్రం చేసేందుకు నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటాం. కలుషితం కాకుండా చూస్తాం. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్ రెండేళ్ల జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. అయినా డ్రైనేజీలే సక్రమంగా లేకుండా పోతున్నాయి. దీంతో చెరువులకు శాపంగా మారింది. శివారు ప్రాంతాల్లో అత్యధికంగా ఇళ్లు పూర్తవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజల సౌకర్యార్థం డ్రైనేజీలు నిర్మిస్తున్నారుగానీ ఆ నీరంతా ఎక్కడికి పంపించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఆ నీరు నాలుగు చెరువుల్లోకి చేరుతోంది. -
పండ్లతోటలకు తెగుళ్లు
జగిత్యాలఅగ్రికల్చర్: ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు పండ్లతోటలకు ప్రతికూలంగా మారాయి. పూత, పిందె దశ నుంచే తెగుళ్లు ఆశిస్తున్నాయి. మామిడి, కర్బూజ, దోసకాయ వంటి పంటలను పురుగులు ఆశించడంతో పూత, పిందె రాలిపోతోంది. తోటలకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పురుగులకు అనువైన వాతావరణం జిల్లాలో మామిడి 40వేల ఎకరాల్లో సాగవుతోంది. కర్బూజను సుమారు 6 వేల ఎకరాలు, దోస రెండు వేల ఎకరాల్లో సాగు చేశారు. పండ్ల తోటలను పూత దశ నుండే బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు, తామర పురుగులు(త్రిప్స్), పండు ఈగలు, తేనెమంచు వంటి పురుగులు ఆశించి భారీగా నష్టం చేస్తున్నాయి. పండ్లతోటల్లో పూత నుండి పిందెకు మారే దశ కీలకం. ఈ సమయంలోనే పురుగులు ఆశించి పూతలోని రసాన్ని పీల్చివేస్తున్నాయి. పూత ఎండిపోయి, రాలిపోతోంది. పచ్చగా ఉన్న ఆకులు ఎరుపు రంగులోకి నిర్జీవంగా మారుతున్నాయి. పిందెలు కాయలుగా మారడం లేదు. కాయలు పెద్దగా కావడం లేదు. దీనంతటికి వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చలికాలం నుంచి ఎండకాలానికి మారే దశలో పురుగులు మొక్కలోకి చొచ్చుకెళ్లేందుకు అనువైన వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలో బూడిద తెగులు, తామర పురుగుల ఉధృతి పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినా.. ఒక్కసారిగా పడిపోయినా పురుగులు, తెగుళ్లకు అనువైన వాతావరణం ఏర్పడి పండ్లతోటలపై పంజా విసురుతాయి. పురుగులు సన్నగా, చిన్నగా ఉండి పూ మొగ్గలు, కొత్త చిగుర్ల చివరలో దాగి ఉండి, పంటకు నష్టం కలిగిస్తాయి. తేమతో కూడిన అనువైన వాతావరణం కొన్ని పురుగుల విజృంభనకు కారణమైతే.. పొడి వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరికొన్ని పురుగుల విజృంభణకు ప్రధాన కారణంగా మారాయి. ఆయా సమయాల్లో పురుగులు తమ సంతతిని వృద్ధి చేసే అవకాశం ఉంటుంది. రసాయనాల పిచికారీ రైతులు తమ పండ్లతోటలను కాపాడుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి, రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. ఇప్పటివరకు మామిడి రైతులు ఐదుసార్లు, కర్బూజ రైతులు ఆరుసార్లు, దోస రైతులు ఐదుసార్ల చొప్పున రసాయనాలను మార్చుతూ పిచికారీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఒక్కసారి పిచికారీకి రూ.20 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన ఇప్పటివరకు మామిడి రైతులు అన్ని ఖర్చులు కలుపుకొని ఎకరానికి దాదాపు రూ.80 వేల వరకు ఖర్చు పెట్టారు. కర్బూజ రైతులకు దాదాపు రూ.60వేల వరకు, దోస రైతులకు రూ.15వేల వరకు ఖర్చు చేశారు. కొందరు రైతులు సేంద్రియ పద్ధతిలో పురుగులను అదుపులోకి తీసుకొచ్చే ప్ర యత్నం చేసినా సాధ్యం కాకపోవడంతో తోటలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
తడి, పొడి చెత్త వేరుచేయాలి
జగిత్యాల: జిల్లాకేంద్రంలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని, తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం డంపింగ్యార్డు, డ్రైనేజీలను పరిశీలించారు. నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, గంజ్నాలాలో సిల్ట్ను పూర్తి గా తొలగించాలని సిబ్బందికి సూచించారు. డంపింగ్యార్డులో తరుచూ మంటలు అంటుకోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు స్వప్న, శానిటరి ఇన్స్పెక్టర్ లత, రాము, ఈఈ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ప్రైవేట్ భూముల్లో చెత్త వేస్తే జరిమానా
రాయికల్: బల్దియాలోని ప్రైవేటు భూములు అపరి శుభ్రంగా ఉన్నా.. చెత్త వేసినా వెంటనే భూ య జమానులకు జరిమానా విధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. రాయికల్ పట్టణంలోని మూ డో వార్డులో మంగళవారం పారిశుధ్య పనులను పరిశీలించారు. మాదిగకుంటను పరిశీలించి నిల్వ ఉన్న నీటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని ము న్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇటిక్యాల గ్రా మంలో నిర్మాణంలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, జెడ్పీహెచ్ఎస్ భవనాలను పరి శీలించారు. పనులు వేగవంతం చేయాలన్నారు. ఆ యన వెంట ఆర్డీవో మధుసూదన్, డీఈవో రాము, మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, కౌన్సిలర్లు రాకేశ్నాయక్, పుర్రె శ్రీధర్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఇటిక్యాల సర్పంచ్ నీరటి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా చదవాలిజగిత్యాల: పదో తరగతి విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా చదివి సమాధానాలు స్పష్టంగా.. క్రమబద్ధంగా రాయాలని కలెక్టర్ సత్యప్రసద్ అన్నారు. జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, అరగంట ముందే కేంద్రానికి చేరుకుంటే ఒత్తిడి ఉండదన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు. -
న్యాయసేవా కేంద్రాలను వినియోగించుకోవాలి
మెట్పల్లి: చట్టపరమైన రక్షణ కోసం మహిళలు న్యాయసేవా కేంద్రాలను వినియోగించుకోవాలని మెట్పల్లి సీనియర్ సివిల్ కోరుట్ల మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ.. పని చేసే చోట అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టపరమైన రక్షణ కోసం న్యాయ సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు. అంతకు ముందు మహిళా న్యాయవాదులతో కలిసి కేకట కట్ చేశారు. జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్కుమార్, అడిషనల్ పీపీ చెర్లపల్లి ఆనంద్, పసునూరి శ్రీనివాస్, పడిగెల శ్రీనివాస్, బిగుల్లా శంకర్ తదితరులున్నారు. -
మక్కల ధర పతనం
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే మార్కెట్కు వస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.2400 వరకు ఉండగా.. ఓపెన్ మార్కెట్లో మాత్రం రూ.1700 నుంచి రూ.1800కు మించడం లేదు. ఫలింగా రైతులు ఒక్కో క్వింటాల్పై కనీసం రూ.700వరకు నష్టపోతున్నారు. మద్దతు ధరతో పోల్చితే జిల్లా రైతులు దాదాపు రూ.49 కోట్ల మేర లాస్ అవుతున్నారు. 35 వేల ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ సీజన్లో 35వేల ఎకరాల్లో మక్క సాగు చేసారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఎకరాకు సగటున 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు 7 నుంచి 8 లక్షల క్వింటాళ్ల దిగుబది వచ్చే అవకాశం ఉంది. వానాకాలంలో వరి సాగు చేసిన పొలాల్లో యాసంగిలో మొక్కజొన్న వేసారు. హైబ్రిడ్ విత్తనాలు వాడటం, ఎరువుల, సాగునీటి యాజమాన్యం పాటించడంతో మంచి దిగుబడి వచ్చింది. మొన్న రూ.2800, ఇప్పుడు రూ.1700 మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.2400. మొన్నటివరకు మద్దతు ధరను మించి క్వింటాల్కు రూ.2800 నుంచి రూ.3వేలు ధర పలికింది. రైతుల చేతికి పంట రాగానే రూ.వెయ్యి వరకు వరకు పడిపోయి.. ఏకంగా రూ.1700 నుంచి రూ.1800కి చేరింది. మక్కలు పూర్తిస్థాయిలో మార్కెట్కు వస్తే వ్యాపారులు రేటు మరింత తగ్గించే అవకాశాలు ఉన్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం.. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు. వ్యాపారులు పెట్టిందే రేటు మొక్కజొన్నను బిస్కెట్ పరిశ్రమలో.. కోళ్ల దాణాగా ఉపయోగిస్తుండటంతో డిమాండ్ ఉంది. ఇక్కడి కంటే తక్కువ రేటుకే ఇతర రాష్ట్రాల నుంచి వస్తోందంటూ దళారులు రేటు తగ్గిస్తున్నారు. వాస్తవంగా ఎకరా మొక్కజొన్న సాగుకు కనీసం రూ.25వేల నుంచి 30వేలు పెట్టుబడి అవుతుంది. వ్యాపారులు సిండికేట్గా మారి ఒకే రేటుపై ఉండటం, రైతుల్లోని అనైక్యతను ఆసరాగా చేసుకుని ఇష్టం వచ్చిన రేటు పెడుతుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ రైతుల నుండి కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగితే, కనీసం వ్యాపారులు ఆ రేటు వరకై నా గ్రామాల్లో కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. రైతుల నిరసనలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తోపాటు కలెక్టర్ సత్యప్రసాద్కు వినతిపత్రం ఇచ్చారు. ప్రతి మండల కేంద్రాల్లో ఆందోళనలు చేసి, జిల్లాస్థాయిలో ఉద్యమించేందుకు రైతు నాయకులు సిద్ధం అవుతున్నారు. -
విద్యార్థుల చేతుల్లోనే దేశభవిష్యత్
జగిత్యాల: విద్యార్థుల చేతుల్లోనే దేశభవిష్యత్ ఉందని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) డిగ్రీ కళాశాలలో సోమవారం వికసిత్ భారత్–2047 యువ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రాజ్యాంగం, చట్టాలు, పౌరుల హక్కులు, కర్తవ్యాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎమర్జెన్సీ కాలంలో దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవని, అది ప్రజాస్వామ్య వ్యవస్థకు పరీక్షగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో పౌరుల పాత్ర ముఖ్యమని, యువత చైతన్యంతో ముందుకు రావాలన్నారు. దేశాభివృద్ధికి కృషి చేయడం, రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం వ్యక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్, యువజన క్రీడల అభివృద్ధి అధికారి రవికుమార్, ప్రొఫెసర్ శ్రీనివాస్, ఎన్సీసీ అధికారి రాజు, భూమేశ్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఫోన్ ఇన్ జగిత్యాల: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు సందేహాలుంటే తీర్చేందుకు ఆయా సబ్జెక్ట్ల్లో నిపుణులైన 18 మంది ఉపాధ్యాయులను నియమించామని డీఈవో రాము తెలిపారు. ఎస్సెస్సీ పరీక్షలు సమీపిస్తున్న క్రమంలో ఈనెల 13 వరకు ఫోన్ఇన్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.15 వరకు ఏ సందేహాలున్నా తెలుసుకోవచ్చన్నారు. త్వరలో పాఠశాల ప్రహరీ క్లబ్లు పాఠశాలల్లో మత్తు పదార్థాల నిర్మూలనకు త్వ రలో పాఠశాల ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. భావితరాల ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సైకియాట్రిస్ట్ డింపుల్, సీసీపీసీ ఎస్సై కె.రాజు, సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. రైతుమేళాకు తరలిన రైతులుజగిత్యాలఅగ్రికల్చర్: హైదరాబాద్లోని వ్యవసాయ వర్సిటీలో జరుగుతున్న రైతుమేళాకు జిల్లా నుంచి రైతులు సోమవారం తరలివెళ్లారు. అల్లీపూర్, పొలాస, సారంగాపూర్, గు ల్లపేట గ్రామాల నుంచి రైతులు రైతుమేళాలో పాల్గొన్నారు. అక్కడ ప్రదర్శించిన స్టాల్స్ను తి లకించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆ ధునిక యంత్రాలను పరిశీలించారు. వ్యవసా య అనుభవం కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థులు తేజస్విని, అర్చన, నవ్యశ్రీ, రాజ శ్రీ, హిమబిందు, గణేశ్వరి, వర్ష పాల్గొన్నారు. శాస్త్రవేత్త ఎన్.సుమలత, అగ్రి హబ్ అసిస్టెంట్ దివ్య, అల్లీపూర్ ఎఫ్ఈవో చైర్మన్ శంకర్, పొ లాస మాజీ సర్పంచ్ శంకరయ్య పాల్గొన్నారు. ‘రాళ్లవాగు’ కుడికాలువకు నీటి విడుదలకథలాపూర్: మండలంలోని భూషణరావుపే ట, కథలాపూర్ గ్రామాలకు రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువ నుంచి సోమవారం నీరు వది లారు. నీరు విడుదల చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు ఆదేశాలివ్వడంతో వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ వాకిటి రాజారెడ్డి ఆధ్వర్యంలో గేట్లు ఎత్తారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కూన శ్రీనివాస్ ఉన్నారు. -
మైనార్టీల సంక్షేమానికి కృషి
ధర్మపురి: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కుట్టుమిషన్లతో కుటుంబంతోపాటు ఇతరులకు జీవనోపాధి కలుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగుల వసతులపై అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో స్వచ్ఛతను పరిశీలించారు. పుష్కరాలకు భూములు సేకరించాలి గోదావరి పుష్కరాలకు భూములు సేకరించాలని మంత్రి అధికారులకు సూచించారు. పుష్కరాలపై ఆలయ కార్యాలయంలో కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య తదితరులున్నారు. -
‘సమగ్రశిక్ష’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
జగిత్యాల: పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కేజీబీవీ, యూఆర్ఎస్, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా ఉన్నాయన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. వోఎస్లను ప్రిన్సిపల్స్, పీజీ సీఆర్టీలను జూనియర్ లెక్చరర్లుగా నియమించాలని, కేజీబీవీల్లో కేర్ టేకర్లను నియమించాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 16న జిల్లా కేంద్రంలో.. 20న ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కవిత, కమల, ప్రణీత, గౌతమి, శ్రీలత, నారాయణ, రవీందర్, శ్రీనివాస్, ఫారూక్ పాల్గొన్నారు. -
మోసపోతే 1930కి ఫిర్యాదు చేయండి
● సైబర్ క్రైం డీఎస్పీ వెంకటరమణ జగిత్యాలక్రైం: సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం డీఎస్పీ వెంకటరమణ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై సోమవారం అవగాహన కల్పించారు. మహిళలు, విద్యార్థినులు వివి ధ రకాల మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నా రు. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపడం, వేధించడం, బెదిరించడం వంటివి సైబర్ నేరాల పరిధిలోకి వస్తాయన్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలన్నారు. నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు అడగడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. డబ్బులు పోతే బాధితులు ఆలస్యం చేయకుండా సమాచారం అందిస్తే తిరిగి పొందే అవకాశాలు ఉంటాయన్నారు. సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. టౌన్ సీఐ కరుణాకర్, సైబర్ క్రైం ఎస్సైలు కృష్ణ, దినేష్, టౌన్ ఎస్సై సుప్రియ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ఆక్రమిస్తున్నారు
తొంబర్రావుపేట నుంచి కట్లకుంట వెళ్లే దారిని ఆక్రమించుకుని రాకేష్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా చేపట్టిన ఆ అక్రమ నిర్మాణంతో దారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రోడ్డు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోండి. – తొంబర్రావుపేట సర్పంచ్, సభ్యులు హైడ్రా తరహా వ్యవస్థ తెండి హైడ్రా వంటి వ్యవస్థను తెచ్చి జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు రక్షించండి. కొందరు అక్రమార్కులు చెరువులు, కుంటలను ఆక్రమించి రియల్ వెంచర్ల పేరిట అమాయకులకు అంటగట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హైడ్రా తరహాలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి చెరువులు, కుంటలకు హద్దులు ఏర్పాటు చేయాలి. – తోపారపు రజనీకాంత్, మత్స్య పారిశ్రామిక సంఘం పర్సన్ ఇన్చార్జి విద్యుత్ సౌకర్యం కల్పించండి జిల్లాకేంద్రంలోని జాంబాగ్ కబరస్తాన్లో ఏడాది క్రితం హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసిన బల్దియా అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. ము న్సిపల్ కమిషనర్ను సంప్రదించినా స్పందన లే దు. రంజాన్ సందర్భంగానైనా విద్యుత్ కనెక్షన్ ఇప్పించండి. – నూర్భాషా సంక్షేమ సంఘం జగిత్యాల -
ఇసుక తవ్వకాలపై ఆరా
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో ఇసుక తవ్వకాలపై రెవెన్యూ, పోలీసు అధికారులు దృష్టి సారించారు. ‘పెద్దవాగులో అడ్డగోలు తవ్వకాలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్ర చురితమైన కథనానికి స్పందించారు. ఆత్మకూర్ శివారులోని పెద్దవాగు వద్దకు తహసీల్దార్ నీత ఆదేశాలతో వెళ్లిన రెవెన్యూ సిబ్బంది.. మళ్లీ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారా..? లేదా..? అని పరిశీలించారు. వీడీసీ సభ్యులను పిలిపించి ఇసుకకు సంబంఽధించి వైరలవుతున్న వీడీసీ అధ్యక్షుడి ఆడియోపై ప్రశ్నించారు. గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ) సభ్యులు చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సీజ్ చేసిన నాలుగు ఇసు క ట్రాక్టర్లకు జరిమానా విధించనున్నట్లు తహసీల్దా ర్ నీత తెలిపారు. ఎక్కడైనా అక్రమ ఇసుక తవ్వకా లు చేపడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. -
కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. మద్దతు ధరకు మక్కలు కొనాలి. ప్రభుత్వం పట్టించుకోకపోతే.. రైతులంందరితో కలిసి ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తాత్సారం చేస్తుండటంతో వ్యాపారులు తక్కువ రేటు పెడుతున్నారు. – పన్నాల తిరుపతిరెడ్డి, రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు తక్కువకు కొంటున్నరు ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే వ్యాపారులు మరింత తక్కువ ధరకు కొనే అవకాశం ఉంది. పంట పండించినప్పటికి రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు చొరవ చూపాలి. – మారు మురళీధర్ రెడ్డి, జిల్లా రైతు ఐక్యవేదిక నాయకుడు -
ఆగని ఆక్రమణలు.. తరచూ ప్రమాదాలు
జగిత్యాల: జిల్లా కేంద్రం.. శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఆస్పత్రులు, సూపర్మార్కె ట్లు, కిరాణంషాపులు, స్కానింగ్ సెంటర్లు, వాణిజ్య వ్యాపారాలు అత్యధికంగా వెలుస్తున్నాయి. కొత్తబస్టాండ్ నుంచి టవర్సర్కిల్ వరకు.. తహసీల్ చౌరస్తా నుంచి జంబిగద్దె వరకు.. జంబిగద్దె, పాతబస్టాండ్ ఏరియాల్లో అత్యధికంగా వాణిజ్య సముదాయాలు వెలిశాయి. సదరు షాపుల యజమానులు దుకాణాల ముందు మామూలు బోర్డులతోపాటు రోడ్డు ఆక్రమించి పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పొద్దంగా రోడ్డుపై పెట్టి రాత్రిపూట షాపుల్లో పెట్టుకుని వెళ్తున్నారు. మరికొందరు వాటిని తొలగించకుండా పకడ్బందీగా పాతి మరీ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొందరు రేడియం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాత్రిపూట అవి రిఫ్లెక్షన్స్తో ప్రమాదాలు జరుగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ ఎక్కడ? రోడ్లను ఆనుకుని బోర్డులను ఏర్పాటు చేస్తున్నా టౌన్ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే వెంటనే కూల్చివస్తారు గానీ బోర్డులు ఏర్పాటు చేస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎక్కడపడితే అక్కడ బోర్డులమయంగా మారింది. ఫ్లెక్సీల కారణంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసుకునేందుకూ ఇబ్బందిగా మారింది. పార్కింగ్ ఇబ్బంది రోడ్లను ఆనుకుని బోర్డులు ఏర్పా టు చేయడంతో ఆస్పత్రులకు, ఇతర పనులకు వ చ్చే వాహనదారులకు వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలి యక ఇబ్బందులకు గురవుతున్నా రు. కారు, జీపు, ఆటోలు వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆస్పత్రుల ఏరియాల్లో వారి ఆస్పత్రికి సంబంధించిన నేమ్ బోర్డులను ఎక్కడబడితే అక్కడ పెడుతున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. స్థలాలు కబ్జా రోడ్లను దర్జాగా కబ్జా చేస్తున్నారు. షాపుల ముందు కాకుండా రోడ్డుపై వరకు వచ్చి బోర్డులను పెట్టడంతోపాటు రేకులషెడ్లను కూడా నిర్మిస్తున్నారు. వాస్తవానికి షెటర్లు, బిల్డింగ్ ఉన్న వరకే బోర్డులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ.. బిల్డింగ్ల ముందుభాగం వరకు రేకులషెడ్లు వేయడం, ఆపై సైన్బోర్డులను పెడుతున్నారు. అధికారులు స్పందించి ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ చిత్రంల జిల్లాకేంద్రంలోని జంబిగద్దె ప్రాంతంలో ప్రధాన రోడ్డు. ఇక్కడ అనేకం ఆస్పత్రులు, వాణిజ్య వ్యాపారాలు ఉన్నాయి. ఆస్పత్రులకు సంబంధించిన సైన్బోర్డులు, ఫ్లెక్సీలు రోడ్డుపైనే ఏర్పాటు చేయడం.. ఆస్పత్రులకు పార్కింగ్ లేకపోవడంతో వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండడం ఇబ్బందిగా మారింది. టౌన్ప్లానింగ్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి సైన్బోర్డులను తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్. ఈ బస్టాండ్ నుంచే ధర్మపురి వైపు బస్సలు వెళ్తాయి. నిత్యం వందలాది మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్లను ఆక్రమించుకుని దర్జాగా షాపులు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంమీదుగా వాహనాలు వెళ్లాలంటేనే చాలా ఇబ్బందిగా మారింది. -
స్లాబ్ కల్వర్ట్ నిర్మించండి
జిల్లాకేంద్రంలోని గొల్లపల్లిరోడ్డులోగల సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటిక వద్ద డ్రైనేజీలో వ్యర్థాలు పడవేస్తుండటంతో దుర్వాసన వ్యాపించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. డ్రైనేజీ వ్యర్థాలు ముప్పాల చెరువులో కలుస్తుండటంతో నీరు కలుషితమవుతోంది. మురుగు నీటి నియంత్రణకు జాంబాగ్ ప్రాంతంలో స్లాబ్తో కూడిన కల్వర్టు నిర్మించి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించండి. – సిరికొండ పద్మసింగరావు, 21వ వార్డు కౌన్సిలర్, జగిత్యాల పోషించమంటే చంపుతానంటుంది మాది కొడిమ్యాల మండలం కోనాపూర్. నా భర్త మరణంతో కారుణ్య నియామకం కింద నా మూడో కూతురు ఆటకారి సరిత ఉద్యోగం పొందింది. డబ్బు, బంగారంతో అత్తగారింటికి వెళ్లిపోయింది. ఉద్యోగం పొందేటప్పడు పెద్ద మనుషుల సమక్షంలో నా సంరక్షణ భారం చూసుకుంటానని చెప్పింది. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అడిగితే నన్నే చంపుతానంటూ బెదిరిస్తోంది. పెద్ద మనుషుల వద్దకు పిలిపిస్తే నాతో సంబంధం లేదంటోంది. ఉద్యోగం నుంచి ఆమెను తొలగించి.. నా బంగారం, డబ్బులు ఇప్పించండి. – ఎండ్రికాయల గంగవ్వ, కోనాపూర్, కొడిమ్యాల -
శత లక్ష్యం.. జాప్యం
జగిత్యాల/మెట్పల్లి: జిల్లాలోని మున్సిపాలిటీలు ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకబడ్డాయి. ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. కానీ, ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఆస్తి పన్ను వసూలు కాలేదు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా వసూళ్లలో జగిత్యాల చాలా వెనుకంజలో ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 23 రోజులు ఉన్నాయి. కాగా, మున్సిపల్ ఎన్నికలు వసూళ్లపై తీవ్ర పభావం చూపాయని అధికారులు చెబుతున్నారు. సిబ్బంది అంతా ఎన్నికల పనుల్లో నిమగ్నం కావడంతో సుమారు నెలన్నర పాటు పన్ను వసూళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఈ నెలాఖరులోగా వంద శాతం వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రచారం కరువు మొండి బకాయిదారులకు నోటీసులు వంద శాతం పన్ను వసూళ్ల లక్ష్యానికి అడ్డుగా ఉన్న మొండి బకాయిదారులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకంజ దగ్గరపడుతున్న ఆర్థిక సంవత్సరం వసూళ్లపై మున్సిపల్ ఎన్నికల ప్రభావం లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారుల ప్రయత్నాలుజిల్లాలో వసూళ్లు ఇలా.. (రూ.కోట్లలో) మున్సిపాలిటీ మొత్తం ఇళ్లు లక్ష్యం వసూలైంది జగిత్యాల 27,877 14.03 5.59కోరుట్ల 19,714 5.70 4.78మెట్పల్లి 13,823 4.78 3.32ధర్మపురి 4,849 1.87 56.59(లక్షలు) రాయికల్ 5,527 1.34 88.47(లక్షలు) మొత్తం 71,790 27.72 15.13 -
వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర అమోఘం
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయరంగంలో మహిళా రైతుల పాత్ర అమోఘమని వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్కుమార్శర్మ అన్నారు. ఆదివారం జగిత్యాలరూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో మహిళా రైతు కిసాన్మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగురంగం ఎప్పటికప్పుడు కొంత పుంతలు తొక్కుతుందని, ఆ మేరకు మహిళా రైతులు ముందుకు రావాలన్నారు. ప్రస్తుతం సాగులో సంప్రదాయకతకు పెద్దపీట వేస్తూ ఆధునిక సాంకేతిక పద్ధతులను ఆచరించాలని సూచించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నీరజ మాట్లాడుతూ, వ్యవసాయంలో వస్తున్న నూతన పోకడలను మహిళా రైతులు పసిగట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలపై డాక్టర్ సరిత, పుట్టగొడుగుల పెంపకంపై డాక్టర్ ఎల్లాగౌడ్, వరి విత్తనోత్పత్తిపై డాక్టర్ మధుకర్, కూరగాయల పెంపకంపై డాక్టర్ స్వాతి రైతులకు వివరించారు. అలాగే, విద్యార్థినులు పలు రకాల విత్తనాలను ప్రదర్శనగా ఉంచారు. పలు పంటలపై శాస్త్రవేత్తలు రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కోరుట్ల ఏడీఏ రమేశ్, రైతులు పాల్గొన్నారు. -
పెద్దవాగులో అడ్డగోలు తవ్వకాలు
మెట్పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డగోలుగా జరగుతున్నాయి. ఆదివారం ఉదయాన్నే వాగులోకి భారీగా వచ్చిన ట్రాక్టర్లు పెద్ద ఎత్తున్న ఇసుకను తరలించాయి. ఒక్కసారిగా 50కి పైగా ట్రాక్టర్లు రాగా, ట్రిప్పునకు రూ.1,000 చొప్పున వీడీసీ వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఇసుక అక్రమ రవాణా విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆదివారం పెద్దాపూర్ మల్లన్న జాతర ఉందని అధికార యంత్రాంగం అక్కడే ఉండిపోతుందని భావించిన వీడీసీ సభ్యులు ముందుగానే ఇసుక వ్యాపారులకు ఫోన్ చేసి ఇసుక తీస్తున్నట్లు చెప్పినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇసుక కోసం భారీగా ట్రాక్టర్లు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇసుక తవ్వకాలు, రవాణా విషయంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆ ప్రాంతానికి సిబ్బందిని పంపించారు. ఇది గమనించిన ఇసుక వ్యాపారులు కొందరు అక్కడి నుంచి జారుకోగా, నాలుగు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. కాగా, ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఆత్మకూర్ వీడీసీ అధ్యక్షుడి ఓ ఆడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. -
భక్తిరథం
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఆదివారం సాయంత్రం మువ్వురు స్వాముల రథోత్సవ వేడుకలను కన్నులపండువగా జరిపించారు. లక్ష్మీనృసింహునితో పాటు శ్రీవేంకటేశ్వర, రామలింగేశ్వరస్వాములను ఆలయం ఎదుట రథాలపై ఆసీనులు చేయగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి నంది కూడలి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. తర్వాత ఉత్సవమూర్తులను గోదావరినదికి తీసుకెళ్లి చక్రస్నానం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ స్వామివారలను దర్శించుకున్నారు. పది రోజుల నుంచి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడం జరిగిందని, రానున్న గోదావరి పుష్కరాలను ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. – ధర్మపురి -
సాగునీరు విడుదల చేయాలి
కథలాపూర్(వేములవాడ): రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువ ద్వారా కథలాపూర్ మండలం భూషణ రావుపేట, కథలాపూర్ గ్రామాలకు నీరు విడుదల చేయాలని రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశా రు. రాళ్లవాగు ప్రాజెక్టులో పంటలకు సరిపడా నీళ్లున్నప్పటికీ కాలువల ద్వారా నీరు వదిలే విషయాన్ని అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. వరి పొట్టదశకు వచ్చిందని, కాలువలో చు క్కనీరు లేక పంటలు ఎండిపోయే ప్రమాదముందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి నీరు వదిలి పంటలను కాపాడాలని కోరారు. సర్పంచ్ బద్దం మహేందర్రెడ్డి, రైతు నాయకులు గడ్డం శేఖ ర్రెడ్డి, పూండ్ర జనార్ధన్రెడ్డి, పర్కుటపు గంగారెడ్డి, బోడ మాధవరెడ్డి, శ్రీపాల్రెడ్డి, కూన శ్రీనివాస్, ఏలేటి రాజారెడ్డి, పూల్సింగ్ పాల్గొన్నారు. -
మహిళలను అణగదొక్కే కుట్ర
జగిత్యాలటౌన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటూ వేదికలపై ప్రకటనలు చేస్తున్న నాయకులు జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఆరోపించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదన్న ఎమ్మెల్యే మాటలు సత్యదూరమన్నారు. నగర్వాన్ యోజన కింద జగిత్యాల నియోజకవర్గానికి రూ.2కోట్లు మంజూరయ్యాయన్నారు. మొదటి విడతలో రూ.1.4కోట్లు విడుదలవగా దానికి సంబందించిన ఖర్చుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించకపోవడంతోనే మిగతా నిధులు విడుదల కాలేదన్నారు. నియోజకవర్గానికి ఎంపీ అరవింద్ మంజూరు చేయించిన రూ.60కోట్ల నిధులు ఎక్కడికి పోయాయో తెలియడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని, ప్రజల ఆశీశిర్వాదంతో తాను నిలబడి కలబడతానని పేర్కొన్నారు. కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, గట్టిపెల్లి మానస, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, సిరికొండ రాజన్న, ఇట్యాల రాము, పవన్సింగ్, కడార్ల లావణ్య, సింగం పద్మ, మామిడాల కవిత ఉన్నారు. -
మల్లన్న జాతర.. సమస్యల పరంపర
కోరుట్ల: దాదాపు లక్ష మంది భక్తులు.. 40 వేల బోనాలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి తరలివచ్చిన భక్తులు. ఇంత మందికి సౌకర్యాలు కల్పించడంలో ముందు జాగ్రత్త వహించాల్సిన దేవాదాయ శాఖ నిర్లిప్తంగా వ్యవహరించిన ఫలితంగా వేలాది మంది తిప్పలు పడ్డారు. పెద్దాపూర్ జాతరకు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, కార్లు, ఆటోల్లో వచ్చే వారు ఉంటారు. పార్కింగ్ పరేషాన్ పెద్దాపూర్ మల్లన్న జాతరకు వెళ్లేందుకు నాలుగు దారులు ఉన్నాయి. కోరుట్ల, ఇస్కాన్ టెంపుల్, కెనాల్ బ్రిడ్జి, కోరుట్ల–కోనరావుపేట రోడ్డు, రాంరావుపల్లి బ్రిడ్జి వెంట మరో రూట్ ఉంది. దీనికి తోడు మెట్పల్లి– ఆరపేట మీదుగా పెద్దాపూర్ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ఉండటం సమస్యాత్మకంగా మారింది. వాహనాలు అంత దూరంలో పార్క్ చేసి ముల్లెమూటలతో భక్తులు ఎండలో నడిచివెళ్లడం ఇబ్బందికరంగా మారింది. దేవాదాయ శాఖ అధికారులు ముందుజాగ్రత్తగా పార్కింగ్ స్థలాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పంటలు సాగు చేసే రైతులకు సీజన్కు సరిపడా డబ్బు చెల్లిస్తే భక్తుల ఇక్కట్లు తప్పేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీస వసతులు కరువు మల్లన్న సన్నిధిలో భక్తిశ్రద్ధలతో బోనాలు వండి నైవేద్యం సమర్పించి మొక్కు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. సుమారు లక్ష మంది భక్తులు హాజరు కావడంతో పాటు 40వేల వరకు బోనాలు తీయడం జరుగుతోంది. బోనాల నైవేద్యం సిద్ధం చేయడానికి దేవాదాయ శాఖ భక్తులకు అరకొరగా టెంట్లు ఏర్పాటు చేసింది. దీంతో ఏటా భక్తులు చెట్ల నీడలో, గ్రామంలోని ఇళ్ల చూరు నీడలో, మురికి కాల్వల పక్కన బోనాలు సిద్ధం చేసుకోవాల్సిన దుస్థితి. ఆలయానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న వసతులు కల్పించాలన్న ధ్యాస ఎవరికి లేకపోవడం గమనార్హం. కాగా, ఆలయానికి వెళ్లే దారివెంట వందలాది షాపులకు అనుమతులు ఇచ్చి కనీసం భక్తులు నడవడానికి రోడ్డు లేని పరిస్థితి కల్పించారు. ఇక నీటి వసతి జాడలేదు. అంబులెన్స్ ఎక్కడ ఉంటుందో కనిపించదు. వైద్య సిబ్బంది మొత్తం ఓ గదిలో అడ్జస్ట్ అయిపోయి ఎవరికి కనిపించకుండా, ఎండ తగలకుండా కాలం గడిపేస్తారు. ముదిరిన ఎండలకు భక్తులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎక్కడి వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. పట్టించుకోని నేతలు ఏళ్ల తరబడి మల్లన్న సన్నిధిలో ఇదే పరిస్థితి ఉన్నా కోరుట్ల నియోజకవర్గ నాయకులు ఎవరికి పట్టింపులేకపోవడం గమనార్హం. కేవలం ఫ్లెక్సీలు పెట్టుకుని, ఆలయం చుట్టూ అసలే ఇరుకుగా ఉన్న తోవల్లో పెద్ద కార్లలో అనుచరగణం వేసుకుని రావడం..మట్టి, దుమ్ము లేచి భక్తులు చేసుకునే నైవేద్యాల్లోకి చేరడం..కళ్లల్లోకి చేరి అవస్థలు పడటం జరుగుతోంది. కళ్ల ముందు భక్తులు పడుతున్న అవస్థలు కనిపిస్తున్నా, నేతలు మాత్రం తమ దారిని తాము వచ్చి వెళ్లిపోవడం తప్ప మార్పు, అభివృద్ధి అనే అంశాలపై దృష్టి పెట్టకపోవడం విడ్డూరంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల కింద వంటలుముల్లెమూటలతో నడిచి వెళ్తున్న భక్తులు పెద్దాపూర్లో గుడికి దూరంగా పార్కింగ్ ముల్లెమూటలతో భక్తుల కాలినడక వంటావార్పునకు చెట్లనీడనే దిక్కు పట్టించుకోని నేతలు -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
వెల్గటూర్(ధర్మపురి): మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్, గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన మహిళా శక్తి సంఘ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. సంఘాల ద్వారా బస్సులను నడిపించడం, పెట్రోల్ బంక్లు, వ్యాపారరంగంలో ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను చేపట్టి, స్వయం ఉపాధి అవకాశాలు చూపించి సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, డీఆర్డీవో రఘువరణ్, సర్పంచ్ సంగ రమేశ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మద్దుల గోపాల్రెడ్డి, మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
స్వయం కృషి.. ఆర్థిక స్వావలంబన
ధర్మపురి: కుటుంబ పోషణలో భర్తలకు దీటుగా పని చేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్న పలువురు మహిళలు మహారాణులుగా ఎదుగుతున్నారు. ఒకరి వద్ద పని చేసేకంటే స్వయంకృషితో పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ధర్మపురికి చెందిన కొల్లూరి లక్ష్మి, వీరబాబు దంపతులు చిన్నపాటి పూజాసామగ్రి దుకాణంతో కుటుంబాన్ని నడిపించారు. వీరికి కూతురు, కొడుకు సంతానం. బీటెక్, డిగ్రీ చదువుతున్నారు. ఖర్చులు పెరగడంతో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ఈనేపథ్యంలో లక్ష్మి ఆలోచనతో పట్టణంలోని గోదావరి ఒడ్డున అగరుబత్తీలు తయారు చేసే కుటీర పరిశ్రమను ప్రారంభించారు. ఇందుకు మహిళా సంఘం నుంచి రూ.2లక్షలు రుణం తీసుకున్నారు. పిల్లలు తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే చదువుకుంటున్నారు. రోజూ రెండురకాలైన 10 కిలోల అగరుబత్తీలు తయారు చేసి పట్టణంలోని దుకాణాల్లో విక్రయిస్తారు. అగర్బత్తీల తయారీకి ఆలయంలో వాడిన పూలను తీసుకొచ్చి ఎండబెట్టి వాటి పౌడర్ను వినియోగిస్తారు. ప్రస్తుతం రెండు చిన్నపాటి మిషన్లతో పాటు ఒక పండి గిర్నీ నడిపిస్తున్నారు. కుటుంబమంతా పని చేస్తూ రోజూ రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకానికి నోచుకోలేదని, సబ్సిడీ ఇస్తే కుటిర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి నలుగురికి ఉపాధి కల్పిస్తానని లక్ష్మి తెలిపారు. -
మీ సేవలతోనే ప్రజారోగ్యం
కోరుట్ల: మీరు చేసే సేవలతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు.. అలాంటి మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం.. ఏమైనా సమస్యలు ఉంటే నాతో నేరుగా చెప్పండి.. పరిష్కారానికి కృషిచేస్తాను.. అంటూ కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత–గంగాధర్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీసాక్షిశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిబేట్లో మహిళా పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. కార్మికుల మంచి, చెడు తెలుసుకున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడి మున్సిపల్ తరఫున అందాల్సినవి అందుతున్నాయో.. లేదో తెలుసుకున్నారు. మహిళా కార్మికులకు మున్సిపల్ తరఫున ప్రతీ మూడు నెలలకోసారి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాత్రి వేళ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరికి ఆఫ్రన్, చీరలు, పార, తట్టలు ఎప్పటికప్పుడు కొత్తవి ఇస్తామన్నారు. ఎవరికై నా ఆఫ్రన్లు, చెప్పులు అందకుంటే తనకు తెలపాలని సూచించారు. స్థానికంగా నయంకాని అనారోగ్య సమస్యలు ఉంటే హైదరాబాద్లో ఈఎస్ఐ ఆస్పత్రి సౌకర్యాలు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. మున్సిపల్లో పనిచేస్తున్న 40 మంది మహిళా కార్మికులకు ఈఎస్ఐ వసతి ఉందని తెలిపారు. ఇటీవల ఓ మహిళా కార్మికురాలికి అక్కడే ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించండి ఈ సందర్భంగా పలువురు మహిళా పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ.. తమకు ఆరోగ్యపరంగా ఏమైనా పెద్ద సమస్యలు వస్తే సాయం చేయాలని కోరారు. కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డులు, పింఛన్లు ఇప్పించాలని విన్నవించారు. స్పందించిన చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ మహిళా కార్మికులకు ఎలాటి సమస్యలు ఉన్న తనను నేరుగా కలిసి చెప్పుకుంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇల్లు లేని వారందరికీ ఇండ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాలు వర్తించేలా చూస్తామన్నారు. ఊరు బాగు కోసం పనిచేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులకు ఓ మహిళా చైర్పర్సన్గా తనవంతుగా పూర్తి సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. సాక్షి డిబేట్లో కోరుట్ల చైర్పర్సన్ వసంత మీకు సమస్యలు ఉంటే నాతో చెప్పవచ్చు పారిశుధ్య కార్మికులతో మాటముచ్చట -
దుబాయ్లో కోమాలో జగిత్యాల జిల్లా వాసి
జగిత్యాలక్రైం: దుబాయ్లో కోమాలో ఉన్న జగిత్యాల జిల్లా వాసిని ఆదుకుని, ఆస్పత్రి బిల్లు మాఫీ చేసి స్వదేశానికి రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన నిరుపేద యువకుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. లక్షల్లో పేరుకుపోతున్న బిల్లులు కట్టలేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్పల్లికి చెందిన కొండ్ర రాజేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఇటీవల సోరియాసిస్తో ఫిబ్రవరి 27న దుబాయ్లోని ఆస్టర్ హాస్పిటల్లో చేరిన ఆయన, చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లిపోయాడు. మార్చి 3వ తేదీ నాటికే ఆసుపత్రి బిల్లు ఏకంగా రూ.13,23,383 చేరుకుంది. అంత భారీ మొత్తంలో బిల్లు చెల్లించే స్థోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు యువజన నాయకుడు తలారి రాజేశ్తో కలిసి జగిత్యాలలో మాజీ మంత్రి టి.జీవన్రెడ్డిని ఆశ్రయించారు. స్పందించిన జీవన్రెడ్డి ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్చైర్మన్ మంద భీంరెడ్డితో మాట్లాడి బాధితుడికి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు రాజేశ్ భార్య అనూష శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణికి దరఖాస్తు చేసుకున్నారు. బాధితుడి వివరాలను కేంద్ర ప్రభుత్వ మదద్ పోర్టల్ ద్వారా దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లారు. -
గుర్తు తెలియని మృతదేహం
కరీంనగర్క్రైం: కరీంనగర్ కలెక్టరేట్ రోడ్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కిందపడిపోగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఈనెల 6వ తేదీన మధ్యాహ్నం కలెక్టరేట్ రోడ్లో ఓ వ్యక్తి కిందపడిపోగా అతడిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతదేహం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. వ్యక్తి వయసు సుమారు 55ఏళ్లకు పైగా ఉంటుందని, గుర్తు పట్టినవారు వన్టౌన్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. -
నాడు బీడీకార్మికురాలు.. నేడు అధ్యాపకురాలు
కరీంనగర్సిటీ: వారిది నిరుపేద చేనేత కుటుంబం.. తల్లీ బీడీ కార్మికురాలు.. తల్లికి చేదోడువాదోడుగా బీడీలు చేస్తూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన శ్రీవాణి. ఆమె చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ర్యాంకులు, బంగారు పతకాలతో సాగింది. ఎలిగేడు జెడ్పీ స్కూల్లో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో, కరీంనగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అన్ని సబ్జెక్టుల్లో మొదటి ర్యాంకు సాధించింది. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 9వ ర్యాంకు, ఎంఏ ఎకనామిక్స్లో ఫస్ట్ ర్యాంకుతో 3 బంగారు పతకాలు కై వసం చేసుకుంది. ఒకే ఏడాదిలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో అర్థశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీవాణి విద్యారంగంలో అత్యున్నతంగా రాణిస్తున్నందుకు పలు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఈసందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక కారణాలతో చాలామంది మట్టిలో మాణిక్యాలు బయటి ప్రపంచానికి రాలేకపోతున్నారని, అలాంటివారిని గుర్తించి విద్యా పరిశోధనా రంగంలో తీర్చిదిద్దుతానని, శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. -
మసాలా సు‘చరిత’
● 2019లో ప్రారంభించి.. 15 మందికి ఉపాధి ● ఆదర్శంగా నిలుస్తున్న సుచరిత జమ్మికుంట(హుజూరాబాద్): స్వయంకృషితో చిరుపరిశ్రమ ప్రారంభించి పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జమ్మికుంట పట్టణానికి చెందిన సుచరిత. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లికి చెందిన వర్మని సుచరిత, రమేశ్ దంపతులు. రమేశ్ ఎలక్టీషియన్. జీవనం కష్టంగా ఉన్న రోజుల్లో చిన్న ఆలోచనతో పెద్ద విజయం సొంతమైంది. కీర్తన మసాల తయారీ, రిటైల్ అండ్ హోల్సేల్ పరిశ్రమను 2019లో ప్రారంభించారు. మొదట ముగ్గురు కుటుంబ సభ్యులు, రూ.3వేల పెట్టుబడితో మసాల ప్యాకెట్లు తయారు చేసి జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లోని కిరాణం షాపుల్లో హోల్సేల్గా విక్రయించారు. మెప్మా, నెహ్రూ గ్రూపుల సాయంతో 2022లో రూ.లక్ష రుణంతో వ్యాన్ కొనుగోలు చేశారు. పీఎంజీ ద్వారా రూ.5లక్షలు రుణంతో మిషన్ కొని మసాలాలు ప్యాకింగ్ చేసి వరంగల్, కరీంనగర్, జనగాం, పెద్దపల్లి, గోదావరిఖని తదితర పట్టణాల్లో హోల్సేల్గా విక్రయిస్తున్నారు. ఏడాదిలో రూ.లక్షల్లో టర్నోవర్ చేస్తూ 15 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. నెలకు రూ.50 వేల ఆదాయం మసాలా తయారీ, అమ్మకంతో నెలకు ఖర్చులు పో నూ రూ.50వేల వరకు ఆ దాయం వస్తుంది. మసాలా తయారీ, ప్యాకింగ్ కో సం 15 మంది మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.10వేల వరకు జీతం ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నాం. స్వయంకృషితో తమ కుటుంబంతో పాటు పలువురికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది. – సుచరిత, కీర్తన మసాలా చిరు పరిశ్రమ, జమ్మికుంట -
కూతురుంటే గర్వపడాలి
కరీంనగర్ అర్బన్: మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మన ఆలోచనా ధోరణే కారణం. ఇందులో మొదటిది ఆడ, మగా అనే వివక్ష. కొడుకు, కూతురు మధ్య వివక్షత చూపొద్దు. చిన్నప్పటి నుంచే ఇద్దరూ సమానమేనని తెలిసేలా పెంచండి. పరిపాలనా పరంగా మహిళలకు అన్ని విషయాల్లో యంత్రాంగం తోడుంటుంది. మహిళలు, పిల్లల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తాం. సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ ద్వారా చిన్నారుల శారీరక పటిష్టతకు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత ద్వారా తోడ్పాటునిస్తాం. – చిత్రామిశ్రా, కలెక్టర్, కరీంనగర్ -
‘సాక్షి’ చక్కటి అవకాశం కల్పించింది
డబుల్బెడ్రూమ్ కాలనీలో సమస్యలు తెలుసుకున్న. సాక్షి యాజమాన్యం నన్ను స్టార్ రిపోర్టర్గా ప్రజల మధ్యకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడి సమస్యలు తెలుసుకున్న. తాగునీరు, వైకుంఠధామాలు లేక ఇబ్బందులు పడుతుండ్రు. పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం తదితర సమస్యలను ఎమ్మెల్యే కే.తారకరామారావు, కలెక్టర్ గరీమా అగ్రవాల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. మున్సిపల్ నుంచి ప్రత్యేక దృష్టి సారిస్తాం. మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం కృషి చేస్తుంది. – జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్, సిరిసిల్ల -
నిత్య జనగణమనతో దేశభక్తి, జాతీయభావం
జగిత్యాలటౌన్: నిత్య జనగణమనతో ప్రజల్లో జాతీయభావం, దేశభక్తి పెరుగుతుందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన నిత్య జనగణమన కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఊటూరి గంగారాంసరోజనల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్కూలర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ భావం పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన నిత్య జనగణమన మిత్రబృందం ప్రతినిధులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలతో నేను నా దేశం అనే భావం పెంపొందుతుందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, నాయకులు గోలి శ్రీనివాస్, మల్లికార్జున్, డిష్ జగన్, కొలగాని సత్యం, రేపల్లె హరికృష్ణ, బొడ్ల జగదీశ్, జ్ఞానేశ్వర్, నిత్య జన గణ మిత్ర బృందం సభ్యులు ఉత్తూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఠాణాలో వెంకన్నకు ఘన పూజలు
ధర్మపురి: బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం శ్రీవేంకటేశ్వరస్వామికి దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధర్మపురి పోలీస్స్టేషన్లో శనివారం స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్నర్సింహారెడ్డి, ఎస్సై మహేశ్ ప్రత్యేక పూజలు చేశారు. దిగ్యాత్రల సందర్భంగా దేవస్థానం నుంచి పోలీస్ స్టేషన్ వరకు అశ్వవాహనంపై శోభాయాత్రగా తీసుకెళ్లారు. పోలీస్స్టేషన్ ఆవరణలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి స్వామివార్లను ఆశీనులు చేసి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని ఉత్తర దిగ్యాత్ర సందర్భంగా స్థానిక ఉసిరికవాగు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
క్యాష్లెస్ లావాదేవీల్లో ‘నిర్మల’
యైటింక్లయిన్కాలనీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు డిజిటల్ చెల్లింపులపై రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ అల్లూరు గ్రామానికి చెందిన చిరు కిరాణా వ్యాపారి బాలసాని నిర్మల శ్రద్ధపెట్టారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించి, అత్యధికంగా రూ.5,340 క్యాష్ బ్యాక్ పొంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దృఢసంకల్పానికి అబ్బురపడిన కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. నిర్మల తన భర్త బాలసాని రవికుమార్ గౌడ్తో కలిసి ఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ చేతుల మీదుగా సత్కారం పొందారు. స్వనిధి రుణంతో నవచైతన్యం నిర్మల నవ చైతన్యం–2020లో సీఎం స్వనిధి పథకంలో తొలి విడతగా రూ.10వేలు రుణం పొంది ఇంట్లో కిరాణం ప్రారంభించారు. క్రమం తప్పకుండా రుణ వాయిదాలు డిజిటల్ రూపంలో చెల్లించడంతో ప్రభుత్వం రెండో విడతగా రూ.20 వేలు మంజూరు చేసింది. ఆ మొత్తంతో కిరాణంతో పాటు చీరల వ్యాపారం, కుట్టు మిషన్, మగ్గంవర్క్ ప్రారంభించి సక్సెస్ అయ్యారు. మూడోవిడత రూ.50వేలు రుణం పొంది ఆదర్శంగా నిలిచారు. -
మెరుగైన ఫలితాలు రావాలి
కొడిమ్యాల: మండల కేంద్రం, ధమ్మాయిపేట, నాచుపల్లి గ్రామంలో కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నాచుపల్లి జెడ్పీహెచ్ఎస్ను సందర్శించారు. వంట గది పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించిన తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదోతరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రణాళిక ఏర్పర్చుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రం, ధమ్మాయిపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులు, గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్ర భవనం తదితర అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్, జిల్లా హౌసింగ్ అధికారి ప్రసాద్, డీఈవో రాము, ఎమ్మార్వో కిరణ్కుమార్, ఎంపీడీవో స్వరూపరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విశ్వఖ్యాతి
నారీశక్తి..ఆమెకు భయం ఎక్కువే.. కానీ భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది. ఆమెకు బాధా ఎక్కువే.. కానీ.. అన్ని బాధ్యతలు మోస్తుంది. కుటుంబానికి చేదోడుగా ఉంటూ.. ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన అతివలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా.. ఏ రంగాన్ని ఎంచుకున్నా అగ్రపథాన నిలుస్తున్నారు. ఆనాడు అక్షరాలు అంటే తెలియని మహిళలు నేడు డిజిటల్ మార్కెటింగ్లో రికార్డు సృష్టిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని, పిల్లలను ఉన్నతంగా చవిదించి, జీవితంలో స్థిరపడేలా చేస్తున్నారు. ఒకప్పుడు పోలీసు అంటేనే భయపడేవారు.. ఇప్పుడు ఆ రంగంలో ఉత్సాహంగా రాణిస్తున్నారు. ఐపీఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు బాధితులకు అండగా నిలుస్తున్నారు. బీడీలు చుట్టిన చేతులు పిల్లలకు ఓనమాలు నేర్పిస్తున్నాయి. పల్లెల్లో వ్యవసాయ పనుల్లో వినిపించిన గొంతులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచ గుర్తింపు పొందుతున్నాయి. పలువురు మహిళలు ఉమ్మడిగా ఏర్పడి ప్రారంభించిన హోంఫుడ్స్ ఖండాంతరాల్లో రుచులు పంచుతున్నాయి. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు ఆదర్శ మహిళలపై ప్రత్యేక కథనం..!! మహిళల భద్రతకు పెద్దపీట విద్య, వ్యాపారం, ఉద్యోగంలో అతివల ప్రతిభ కుటుంబ బాధ్యతలు మోస్తూ పిల్లలను తీర్చిదిద్దుతున్న వైనం ఖాకీ చొక్కా వేసుకుని బాధితులకు సత్వర న్యాయం పల్లెపాటల గొంతుకు ప్రపంచ గుర్తింపు అమ్మచేతి వంటకు విదేశాల్లో అభిమానులు ఆదర్శం.. ఉమ్మడి జిల్లాలోని పలువురు అబలలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
4
4452● ధైర్యంగా ఫిర్యాదు చేస్తే సత్వర న్యాయం ● పోలీసుశాఖలోకి యువతులు రావాలి ● కుటుంబం అండతో ఉద్యోగంలో రాణిస్తున్నా ● ‘సాక్షి’తో ఏసీపీ వాసంశెట్టి మాధవిఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రస్తుత సమాజంలో వారికున్న స్వేచ్ఛ, సమానత్వం, నిర్ణయాలు.. తదితర అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా.. 100మంది మహిళలు చెప్పిన సమాధానాలు ఇలా.. 25%కరీంనగర్క్రైం/హుజూరాబాద్: ‘అతివల భద్రతకు పోలీసుశాఖ పెద్దపీట వేస్తోంది. ఏ విషయంలోనైనా అన్యాయానికి గురైతే పోలీసుస్టేషన్కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయండి. నిందితులపై చర్యలు తీసుకుని, సత్వర న్యాయం అందేలా చూస్తాం. యువతులు భద్రత లేని ప్రైవేటు ఉద్యోగాల కన్నా పోలీసు ఉద్యోగంలోకి రావాలి. శివంగుల్లా నేరస్తుల భరతం పట్టాలి’. అని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి. కుటుంబం అండగా ఉండడంతో పోలీసు ఉద్యోగంలో రాణిస్తున్నాని వెల్లడించారు. ధైర్యంగా ముందడుగు వేస్తేనే విజయం సాధిస్తామని సూచిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.మహిళల భద్రతకు పోలీసింగ్లో మార్పులు పోలీసుశాఖలోని షీటీంలు మహిళల కోసం పని చేస్తాయి. సైబర్క్రైం యూనిట్ల ద్వారా నిందితులను త్వరగా పట్టుకుంటున్నాం. స్పెషల్ ఉమెన్ స్టాల్స్, మహిళా బ్లూకోల్ట్స్, హ్యాక్ఐ యాప్, సీసీ కెమెరాలు, భరోసా సెంటర్, షీ బాక్కులు, హెల్ప్లైన్ సెంటర్లు మహిళల కోసం ఏర్పాటు చేసినవే. మహిళలు రాత్రివేళలలో వెళ్లేప్పుడు సురక్షిత మార్గాలు ఎంచుకోవాలి. ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తే వాహన నంబర్లు కుటుంబసభ్యులకు మెసేజ్ చేయాలి. లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, 181, 8712670759 ఫోన్ నంబర్ను సంప్రదించాలి. నేరాలు పెరుగుతున్నాయి గృహహింస, సైబర్నేరాలు, స్టాకింగ్, లైంగికదాడి కేసులు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, మైనర్లపై ప్రేమపేరుతో జరుగుతున్న మోసాలపై బాధితులు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫొటో, వీడియో మార్ఫింగ్ కేసులు పెరుగుతున్నాయి. గృహహింస కేసుల్లో బాఽధితులు ఫిర్యాదు చేసిన తర్వాత కుటుంబ ఒత్తిడి, వారి పిల్లల భవిష్యత్తు, ఆర్థికపరమైన ఇబ్బందులు భరించలేక చాలామంది కేసుల్లో రాజీ పడుతున్నారు. దీంతో నిందితులకు శిక్ష పడే అవకాశం తక్కువగా ఉంటుంది. మహిళలకు స్వేచ్ఛగా వారి సమస్యను తోటి మహిళా అధికారికి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితులు స్వయంగా పోలీసుల సాయం తీసుకోవచ్చు. పోలీసు ఉద్యోగం సవాలే పోలీసుశాఖలో క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ధైర్యం, నిబద్ధత, పారదర్శకతతో పనిచేయడం ద్వారా ఎన్ని సవాళ్లైనా ఎదుర్కోవచ్చు. పోలీసు ఉద్యోగం ప్రతిరోజు సవాల్గానే ఉంటుంది. నేను వ్యక్తిగతంగా ఇప్పటి వరకు ఎలాంటి సవాళ్లు ఎదుర్కోలేదు. నా 30ఏళ్ల సర్వీసులో ఎస్సై, సీఐ, ప్రస్తుతం ఏసీపీగా కొనసాగుతున్నా పోస్టింగ్లో మహిళ అన్న వ్యత్యాసం ఎక్కడా చూడలేదు. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నా. డిపార్డుమెంటులో చేరేందుకు యువతులు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి రక్షణలేని కాల్సెంటర్లు, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం కన్నా ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుశాఖలోకి రావాలి. ఈ ఉద్యోగంతో మానసికంగా, శారీరకంగా బలంగా ఉండొచ్చు. నన్ను కదిలించిన ఘటన అదే.. ప్రేమపేరుతో మోసపోయి, లైంగికదాడికి గురైన ఓ బాధితురాలు పిచ్చిదైపోయింది. ఆ ఘటన ఆమె జీవితాన్నే మార్చింది. మానసిక వైకల్యం కింద నెలనెలా పెన్షన్ తీసుకోవడం నాకు బాధనిపించింది. ఆ కేసులో నిందితుడికి శిక్షపడేలా చేశాను. బాధితురాలికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కింద రూ.5 లక్షలు ఇప్పించేందుకు ముందుండి పనిచేశాను. తనుకు చేసిన తరువాత సాయం నాకు గర్వంగా అనిపించింది. ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు చిన్నపిల్లల తల్లులు ఓటువేసి వచ్చే వరకు, పిల్లలను లాలించడం ఆనందంగా అనిపించేది. ధైర్యంగా ముందుకు సాగాలి మహిళలు బాధితులుగా ఉన్న కేసుల్లో సామాజిక అవగాహన లోపం, లేట్ రిపోర్టింగ్తో నిందితులకు త్వరగా శిక్ష పడడం లేదు. కొన్ని కేసుల్లో సాక్ష్యులను కోర్టుకు రప్పించడంలో కష్టమైనా ముందుకు వెళ్తున్నాం. స్పీడ్ ట్రయల్ నడిపిస్తూ ముందుకు సాగుతున్నాం. మహిళలు ధైర్యంగా ఉండాలి. తమ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండి, ఆపద సమయంలో పోలీసులసాయం పొందాలి. అందరికీ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.8 మంది100%50%40 మంది252 మందిస్నేహితుల సూచనతల్లిదండ్రుల నిర్ణయం8మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును సొంత నిర్ణయంతో చేస్తున్నారా?సొంత నిర్ణయంలేదు90మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంతమేర మద్దతు లభిస్తుంది?కొద్దిమేరపూర్తిగాసమాజంఒక సీ్త్ర స్వతంత్రంగా ముందుకు వెళ్లాలంటే ఎవరి సహకారం ఎక్కువ అవసరం?93కుటుంబం3స్నేహితులు– సప్తగిరికాలనీ(కరీంనగర్)తన పిల్లలతో బట్టు మంగవ్వమామిడి కొనాల మీన.. జానపదాలతో ట్రెండింగ్లో నాగవ్వ సాక్షి, కరీంనగర్ డెస్క్: యక్షగానంతో ఆమె ప్రస్థానం ప్రారంభించింది. నాన్న పాటలను కై కట్టి నేర్చుకుంది. చదువుకోకున్నా జానపదాన్ని ఒంట పట్టించుకుంది. పంటపొలాల సాక్షిగా తన పాటలను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘తిరుపతి రెడ్డి’ అంటూ మొదలు పెట్టి ‘మోహన లా లి’ పాటతో పాపులర్ అ య్యింది. మంగ్లీతో జతకట్టి ‘బాయిలోనే బల్లి పలికే’ పాటతో వరల్డ్ ఫేమస్ కాగా.. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాటతో యూట్యూబ్లో ట్రెండింగ్ సృష్టిస్తోంది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోటకు చెందిన నాగవ్వ. యక్షగానంతో ప్రారంభమై.. తల్లిగారి ఊరైన అంబారిపేటలో యక్షగానంతో నాగవ్వ పాట ప్రారంభమైంది. తండ్రి యక్షగానం వింటూ పెరగడంతో పాటు తనూ బతుకమ్మ పాటలు, జానపదాలు, కాముని పాటలు పాడేది. పెళ్లి తరువాత అత్తగారిల్లు గుల్లకోటకు వచ్చాక కూడా పాటను మర్చిపోలేదు. తన భర్త భజన పాటలు పాడుతూ.. నాగవ్వను కూడా గొంతు బాగుంటుందని ప్రోత్సహించడంతో పాటు కొడుకులిద్దరూ కలిసి ‘సీఎంఎస్ చానెల్’ పెట్టి జానపదాలు పాడించారు. అలా తను తొలిపాట ‘తిరుపతి రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘మోహనలాలి’ పాటతో మరింత దగ్గరైంది. ‘సారంగదరియా షో’లో మూడు ఎపిసోడ్లలో పాల్గొంది. మంగ్లీతో కలిసి ‘కొప్పులోని పువ్వమ్మ బాయికాడి బతుకమ్మ’ పాట పడింది. తరువాత ‘బాయిలోనే బల్లి పలికే’ పాట ప్రపంచాన్ని ఊర్రూతలూగించింది. లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాట సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. వ్యూస్లో లక్షల్లో దూసుకెళ్తుంది. తనకు గుర్తింపు రావడానికి తన కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉందని నాగవ్వ చెబుతోంది. ముఖ్యంగా కొడుకులిద్దరూ తాను పాడడాన్ని ఎంతో ప్రోత్సహిస్తారని వివరించింది. మీరు తీసుకునే రోజూవారి నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు? -
ఊరూరా ఉప్పు అమ్మి.. ఉజ్వల భవితనిచ్చి
వీర్నపల్లి(సిరిసిల్ల): ఆమె చదువుకోలేదు. కానీ చదువు విలువ తెలుసు. ఆమెకు ఆస్తులు లేకున్నా పిల్లలే తన ఆస్తి అనుకుంది. ఉప్పు తట్ట మోసింది. ఎడ్ల బండిపై ఊరూరా తిరుగుతూ ఉప్పు అమ్మింది. భర్త దూరదేశం వెళ్లినా అధైర్యపడలేదు. కూరగాయలు అమ్మి బిడ్డలు సమాజంలో ఉన్నతస్థానాల్లో నిలబెట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని భావుసింగ్నాయక్ తండాకు చెందిన బట్టు మంగవ్వ. నలుగురు సంతానం మంగవ్వ– హరిచంద్ దంపతులకు నలుగురు సంతానం. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో హరిచంద్ గల్ఫ్దేశాలకు వెళ్లాడు. కుటుంబ భారం మంగవ్వపైనే పడింది. తాను గంజినీళ్లు తాగినా పిల్లలకు మంచి చదువు చెప్పించింది. పెద్ద కొడుకు బట్టు విజయ్కుమార్ ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడు. నిర్మల్లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరి, ఆరు నెలల్లోనే అక్కడే ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించాడు. కూతురు సుజాత తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో మ్యూజిక్లో (ఎం.ఏ) పూర్తి చేసి, మణుగూరు ఏకలవ్య పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మరో కొడుకు రాజేష్ ఎన్ఏసీలో ల్యాండ్ సర్వేయర్గా శిక్షణ పొంది, కరీంనగర్ కలెక్టరేట్లో సర్వేయర్గా సేవలందిస్తున్నారు. చిన్న కుమార్తె సరిత ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఒకప్పుడు ఉప్పు అమ్మితే కానీ పూట గడవని స్థితి నుంచి నేడు నలుగురు పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో ఉండటం చూసి తండావాసులు మంగవ్వను అభినందిస్తున్నారు. -
పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత
జగిత్యాల: పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం ప్ర జాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పనులు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింద ని, అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నా రు. కార్యాచరణలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. వార్డుల్లో డ్రెయినేజీలు, నీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. ప్రజలు కూడా అధికారులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ప్రత్యేకంగా పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపర్చడం, డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించడం, కార్యాలయాల పరిశుభ్రత, పన్ను వసూళ్లు, ఫైల్స్ క్లియరెన్స్, నిరంతరం తాగునీటి సరఫరా చేసేలా కృషి చేయాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, లత, కమిషనర్ స్పందన తదితరులు పాల్గొన్నారు. -
సామరస్యంగా పరిష్కరించుకోవాలి
మెట్పల్లిరూరల్(కోరుట్ల): గ్రామాల మధ్య సరిహద్దు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తహసీల్దార్ నీత, సీఐ అనిల్ అన్నారు. ఈ నెల 5న ‘సాక్షి’లో ‘సరిహద్దు పంచాయితీలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం మెట్పల్లి మండలం చెర్లకొండాపూర్, రాజేశ్వర్రావుపేట గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల ప్రజలతో చర్చించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని, గ్రామంలో వీడీసీ ఆంక్షలు విధించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అది నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీవో సురేశ్, ఎస్సై నవీన్, ఎంపీవో మహేశ్వర్రెడ్డి, ఆర్ఐలు ఉమేశ్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. ‘భోగ శ్రావణి అవినీతిపరురాలు’జగిత్యాలటౌన్: భోగ శ్రావణి పెద్ద అవినీతి పరురాలని, ఆమెను చూసి ఏం నేర్చుకోవాలో ఎంపీ అరవింద్ చెప్పాలని బీజేపీ బహిష్కృత నేతలు ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాట్లాడారు. బల్దియా ఎన్నికల్లో అభ్యర్థుల డబ్బు రూ.60లక్షలు నొక్కేస్తే ఆమైపె ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం కమిటీ కూడా వేయలేదన్నారు. పార్టీని భ్రష్టు పట్టిస్తే సరిదిద్దాల్సిన పెద్దలే వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల పట్టణంలో పార్టీకి 20వేల ఓట్లు వస్తే మున్సిపల్ ఎన్నికల్లో 11వేలకు ఎందుకు పడిపోయిందో చెప్పాలన్నారు. కనీసం సొంత వార్డులో కూడా పార్టీని గెలిపించుకోలేని శ్రావణిని చూసి ఏం నేర్చుకోవాలో ఎంపీ చెప్పాలని ఎద్దేవా చేశారు. ఎంపీ అరవింద్ తమను కాల్చి పారేస్తామంటే తాము గాజులు తొడుక్కుని కూర్చుంటామా అని ప్రశ్నించారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకుని పోరాటం చేసిన తాము అరవింద్ తాటాకు చప్పుళ్లకు భయపడమని స్పష్టం చేశారు. సమావేశంలో బహిష్కృత (సీనియర్) నాయకులు ఏసీఎస్ రాజు, సీపెల్లి రవీందర్, లింగంపేట శ్రీనివాస్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, ఆంకారి సుధాకర్, ప్రమోద్గౌడ్, బిట్టు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సాగుపై అవగాహన జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో శుక్రవారం రైతులు, శాస్త్రవేత్తల చర్చావేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల నిర్వహణ, తెగుళ్లపై అవగాహన కల్పించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న బీపీటీ–5204, జై శ్రీరామ్, జేజీఎల్–1798, కేఎన్ఎం–1638, హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్–15048 వంటి సన్న రకాలను సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ సూచించారు. ఆత్మ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ తనిఖీ జిల్లా కేంద్రంలోని హస్నాబాద్లో గల శైల సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ను శుక్రవారం డీఏవో భాస్కర్ తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించడం లేదని తేలడంతో అమ్మకాలు నిలిపివేయాలని సంస్థ యజమానికి అదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకుండా విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. మండల వ్యవసాయాధి కారులు తిరుపతినాయక్, వినీల పాల్గొన్నారు. -
నేషనల్ అవార్డుకు నర్సింహునిపేట నామినేట్
● ముస్తాబవుతున్న గ్రామం పెగడపల్లి(ధర్మపురి): మండలంలోని నర్సింహునిపేట గ్రామ పంచాయతీని అధికారులు నేషనల్ అవార్డుకు నామినేటెడ్ చేయడంతో గ్రామం కొత్త శోభ సంచరించుకుంటుంది. గార్మంలో 718 జనాభా, 563 మంది ఓటర్లు, సుమారు 207 కుటుంబాలు, 19 మహిళా సంఘాలున్నాయి. ‘దీన్ దయాళ్ ఉపాద్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్’లో భాగంగా పేదరిక నిర్మూలన గ్రామం కింద జాతీయస్థాయి అవార్డు ఎంపిక కోసం నామినేట్ చేశారు. దీంతో గ్రామస్తుల సహకారంతో వారం రోజులుగా మండలస్థాయి అధికారులు, సర్పంచ్ సంది రాజమణి, పాలకవర్గ సభ్యులు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పంచాయతీ భవనానికి రంగులు వేసి, కార్యాలయం చుట్టూ మొక్కలు నాటారు. కేంద్ర బృందం సభ్యులు గ్రామాన్ని సందర్శించి వారిచ్చిన మార్కుల ఆధారంగా అవార్డుకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని ఎంపీవో శశికుమార్రెడ్డి తెలిపారు. ఈ గ్రామం అవార్డుకు ఎంపికై తే ప్రైజ్ మనీ కింద మొదటి బహమతి రూ.కోటి, రెండో బహుమతి రూ.50 లక్షలు, 3వ బహుమతిగా రూ.25 లక్షలు అందుతాయి. -
నిరుపయోగంగా ఎఫ్ఎస్టీ ప్లాంట్
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని డంపింగ్యార్డులో ఏ ర్పాటు చేసిన ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ) నిరుపయోగంగా మారింది. దాదా పు రూ.5 కోట్లతో ఎఫ్ఎస్టీపీ నెలకొల్పారు. బల్దియాలోని గృహాల నుంచి మానవ వ్యర్థాలను ట్యాంకుల ద్వారా తీసుకువచ్చి ఇందులో పోసి ఎరువులు తయారుచేస్తుంటారు. కాగా, డంపింగ్ యా ర్డు పట్టణానికి దూరంగా ఉండడంతో వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్లే కొందరు నిర్వాహకులు శివారు ప్రాంతాల్లో వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సమీపంలోని నివాస గృహాలవారికి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. ఈ అంశంపై అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో డంప్.. నివాస గృహాల్లోని సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాలను మున్సిపాలిటీల ద్వారా లైసెన్స్ పొందిన స్లడ్జింగ్ ఆపరేటర్లు నేరుగా ఎఫ్ఎస్టీ ప్లాంట్కు తరలిస్తారు. అక్కడ దానిని ఎరువుగా తయారుచేసి మున్సిపాలిటీలోని మొక్కలకు ఉపయోగించడంతో పాటు, రైతులకు విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొందరు ప్రైవేటు ఆపరేటర్లు వ్యర్థాలను సేకరించి బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేయడంతో వాతావరణం కలుషితం అవుతోంది. జగిత్యాల బల్దియాలో ఐదుగు రు లైసెన్స్ ఆపరేటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాస్తవంగా సెప్టిక్ ట్యాంక్ నుంచి వ్యర్థాలను లైసెన్స్డ్ ఆపరేటర్లే సేకరించాలి. ఇతరులు సేకరించడం, బహిరంగ ప్రదేశాల్లో పోయడం నిషేధం. ప్లాంట్ ఉన్నట్టా.. లేనట్టా.. జిల్లా కేంద్రంలోని ఎఫ్ఎస్టీ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. నెలలో ఒకసారి మాత్రమే మానవ వ్యర్థాలను ఎరువుగా తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు సపదించి పూర్తిస్థాయిలో ఎఫ్ఎస్టీ ప్లాంట్ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం ఎఫ్ఎస్టీ ప్లాంట్ రన్ అవుతుంది. కొంత మేర ఇబ్బందులున్నప్పటికీ పూర్తిస్థాయిలో కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నాం. పట్టణ శివారుల్లో మానవ వ్యర్థాలను పోస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల -
అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం
వైభవంగా ఉత్తర దిగ్యాత్ర బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మీనృసింహుని ఉత్తర దిగ్యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయం నుంచి ఉసిరిక వాగు వద్దకు స్వామివార్లను అశ్వవాహనంపై శోభాయాత్రగా తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామివారలను ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారల కల్యాణం అనంతరం దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలుగా బయలుదేరుతుంటారని పండితులు తెలిపారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – ధర్మపురి కమనీయం.. కల్యాణం -
మార్కెట్లో వసతులు కల్పించాలి
● డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి మెట్పల్లి: మార్కెట్ యార్డులో రైతులకు వసతులు కల్పించాలని మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి స్థానిక అధికారులకు సూచించారు. మార్కెట్ను ఆమె గురువారం సందర్శించారు. పసుపు కొనుగోళ్ల తీరుపై రైతులు, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. టాయ్లెట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆమెకు వివరించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్ ఉన్నారు. -
ధాన్యం కమీషన్ డబ్బుల వివాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో వరి ధాన్యం కమీషన్ డబ్బులపై వివాదం నెలకొంది. సర్పంచ్ మేడిశెట్టి పద్మ, ఉపసర్పంచ్ గొట్టే శ్రీకాంత్ సమక్షంలో గురువారం ఏర్పాటు చేసిన గ్రామసభలో రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తుల మధ్య కమీషన్ డబ్బులపై వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామంలో పదేళ్లుగా రైతుల నుంచి ధాన్యం సేకరించగా వచ్చిన కమీషన్ లెక్కలు చెప్పాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. పదేళ్లుగా కమీషన్ డబ్బుల వివరాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక పంటకు రూ.3.30లక్షల చొప్పున కమీషన్ వచ్చిందని, 20 పంటల కమీషన్ డబ్బుల లెక్కలు తేల్చాల్సి ఉందన్నారు. దాదాపు రూ.66లక్షల కమీషన్ డబ్బులను సీఏలే సొంతంగా వాడుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇదే సమయంలో మహిళా సంఘాల సభ్యులు కూడా తమ వాదనను వినిపించడంతో సమావేశం వేడెక్కింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ మేడిశెట్టి పద్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు కొందరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. పదేళ్ల లెక్కలు చెప్పాలంటూ గ్రామస్తుల డిమాండ్ సీఏలే సొంతంగా వాడుకున్నారని ఆరోపణలు -
రోడ్లు ఛిద్రం.. పనులు గగనం
● నత్తనడకన అమృత్–2 పనులు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు ● ఇబ్బందుల్లో పట్టణ ప్రజలురాయికల్: రాయికల్ బల్దియాలో అమృత్–2 పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేయడంతో పట్టణంలోని సీసీ రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ధ్వంసం చేసిన సీసీరోడ్లకు మరమ్మతు చేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయికల్ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు కేంద్రప్రభుత్వం అమృత్ 2.0 పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బల్దియాకు రూ.15.25 కోట్లు మంజూరయ్యాయి. 20 కిలోమీటర్ల మేర ఉన్న 12 వార్డుల్లోని సీసీరోడ్లలో పైప్లైన్ హౌస్ కలెక్షన్, ఫీడర్ లైన్, డిస్ట్రిబ్యూషన్ లైన్ వంటి పనులు చేయాల్సి ఉంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పట్టణంలో ఇప్పటివరకు సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో పలు వార్డుల్లోని సీసీరోడ్లను ధ్వంసం చేస్తూ నామమాత్రంగా పనులు చేస్తున్నాడు. హౌసింగ్ కనెక్షన్, పైప్లైన్ కనెక్షన్ సరిగా బిగించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తవ్విన సీసీరోడ్ల వద్ద ఈ పనులు పూర్తి గా చేపట్టి యథావిధిగా రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ పనులు చేపడుతున్నారని ఆయా వార్డుల కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కనీసం పైప్లైన్ కోసం తవ్విన మట్టిని తొలగించి పనులు చేపట్టాలని కోరినప్పటికీ పట్టించుకోవడం లేదంటునానరు. సంబంధిత వార్డు కౌన్సిలర్లే ధ్వంసం చేసిన సీసీరోడ్లపై ఉన్న మట్టిని తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్లలో తరలించారు. మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, కమిషనర్ నాగరాజు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు చేపట్టి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. భూమి ఇచ్చేందుకు ససేమిరా.. పట్టణానికి అమృత్ 2.0 పథకానికి భూమి ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. ఇటీవల రెవెన్యూ, మున్సిపల్ అధికారులు 20 గుంటల భూమి గుర్తించినప్పటికీ ఆ భూమిని రైతులు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. మరోవైపు అమృత్ 2.0 పథకం కోసం రోడ్లను తవ్వి మరమ్మతు చేయని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
రాజన్న బ్రహ్మోత్సవాలు షురూ..
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో స్వామి వారికి ఏకాంతంగా పూజలు చేశారు. ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ పార్కింగ్ ప్రాంగణంలోని శివార్చన వేదికపై కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 8న రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. 9న అవబృత స్నానం, ఏకాదశ ఆవరణాలతో శివకళ్యాణ మహోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. యాగశాలలో అర్చకులు, వేద పండితులకు వర్ని సమర్పించారు. రాజన్నకు ఏకాంత సేవలు ప్రచారరథం ముందు ప్రత్యేక పూజలు రాజగోపురం ముందు హోమాలు -
నేడు ప్రజాపాలనపై సమీక్ష
● హాజరుకానున్న మంత్రి తుమ్మల కరీంనగర్ అర్బన్: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణపై కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమీక్షించనున్నారు. శుక్రవారం జిల్లాకు రానుండగా కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా సమావేఽశం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ‘ప్రతిమ’ ఆర్థో వైద్యుడికి అవార్డుకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్ధలో ఆర్థోపెడిక్ ఫ్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్రెడ్డి నూకలకు ప్రతిష్టాత్మక ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ –2025 కన్సల్టెంట్ విభాగంలో బెస్ట్ పేపర్ అవార్డు అందుకున్నారు. డాక్టర్ శ్రీనివాస్రెడ్డి ఇప్పటివరకు 2 వేలకు పైగా ఇలిజారోవ్ శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాన్ ఇజ్రాయిల్, సీఏవో రాంచందర్రావు, రిజిస్ట్రార్ ప్రసాద్రావు, సూపరింటెండెంట్ సీఎన్ ప్రసాద్, ఏవో కల్యాణ్ చక్రవర్తి, హెచ్వోడీలు మోతిలాల్, నిఖిల్, వరుణ్కృష్ణ, అభిలాష్, నరేశ్, అనిల్కుమార్, తిరుపతి, ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ అధికారుల వైఖరిపై నిరసన
● హిందూసంఘాల ఆందోళన మెట్పల్లి:పట్టణంలోని ఆర్టీసీ ఇన్ గేట్ పక్కన ఉన్న హనుమాన్ ఆలయం వద్ద నిర్మిస్తున్న గద్దెను ఆర్టీసీ అధికారులు తొలగించే ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రి హిందూ సంఘాలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గద్దె నిర్మాణంతో ఎలాంటి ఇబ్బందులూ లేకపోయినప్పటికీ అధికారులు దానిని తొలగించేందుకు యత్నించడం సరికాదన్నారు. ఆందోళనతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అక్కడి చేరుకొని వారితో మాట్లాడారు. కొద్దిసేపటికి ఎంపీ అర్వింద్ అక్కడకు వచ్చి గద్దెను పరిశీలించారు. గద్దెతో ట్రాఫిక్కుగాని, ఇతర ఎలాంటి సమస్యకు దారి తీసే అవకాశం లేకపోయినప్పటికీ ఎందుకు తొలగిస్తున్నారని డీఎం సరస్వతీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని, నిర్మాణానికి సహాకరించాలని ఆమెకు సూచించారు. -
మరణంలోనూ వీడని బంధం
పెగడపల్లి: కలకాలం కలిసి ఉంటామని బాస చేసిన ఆ దంపతులు మరణంలోనూ కలిసేపోయారు. ఈ విషాద ఘటన పెగడపల్లి మండలం మద్దులపల్లిలో విషాదం నింపింది. బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సురకంటి చుక్కారెడ్డి, శంకరమ్మ భార్యాభర్తలు. వీరిది వ్యవసాయ కుటుంబం. కుమారుడు, కూతురు సంతానం. వృద్ధాప్యం దరిచేరడంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చుక్కారెడ్డి బుధవారం రాత్రి సమయంలో మృతిచెందాడు. ఆయన మృతిని తట్టుకోలేని శంకరమ్మ కూడా గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. దంపతులిద్దరూ ఒకేరోజు మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. గురువారం ఒకేసారి ఇద్దరికి అంత్యక్రియలు పూర్తి చేశారు. వీరి కుమారుడు సురకంటి సత్తిరెడ్డి ప్రస్తుతం పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. విషయం తెలుసుకున్న పలు గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఒకేరోజు భార్యాభర్తల మృతి మద్దులపల్లిలో విషాదం -
పెళ్లి జరగాల్సిన ఇంట్లో మహిళ దారుణ హత్య
రామడుగు: పెళ్లి జరగాల్సిన ఇంట్లో మహిళ దారుణ హత్య రామడుగులో సంచలనం రేపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఈరెల్లి గౌరమ్మ(65)కు ఇద్దరు కుమారులు. పదిహేను రోజుల క్రితం గల్ఫ్ నుంచి వచ్చిన పెద్ద కుమారుడు మహేశ్కు గ్రామానికి చెందిన అమ్మాయితో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. బట్టలు తీసుకోనేందుకు మహేశ్ కరీంనగర్ వెళ్లాడు. మృతురాలి భర్త కొంరయ్య గ్రామంలోని ఓ పెళ్లికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న గౌరమ్మను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో మెడకోసి పరారయ్యారు. భర్త ఇంటికి వచ్చేసరికి భార్య రక్తపుమడుగులో పడిఉంది. చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సమీప బంధువులే హత్య చేసినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్కు తరలించారు. హత్యలో గౌరమ్మ చిన్నకుమారుడు అనిల్ను అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గొంతుకోసి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు సమీప బంధువుల పనేనని అనుమానం? సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు -
ట్రాక్టర్లతో మట్టిని తరలించాం
9వ వార్డులో అమృత్ 2.0 పథకం కోసం కాంట్రాక్టర్ రోడ్లను తవ్వాడు. రోడ్లపై ఉన్న మట్టిని తొలగించలేదు. పైప్లైన్కు మరమ్మతు చేయలేదు. కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. కాలనీవాసుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ట్రాక్టర్లు, కూలీల సహకారంతో సీసీరోడ్లపై ఉన్న మట్టిని తొలగించాం. – బత్తిని మహేశ్వరి, 9వ వార్డు కౌన్సిలర్ చర్యలు తీసుకుంటాం పట్టణంలో అమృత్ 2 పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మా దృష్టికి కూడా వచ్చింది. కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసి పనులు చేపట్టకపోతే చర్యలు తీసుకుంటాం. అలాగే రాయికల్ పట్టణంలో 20 గుంటల స్థలం ఇవ్వడానికి రైతులు విముఖత చూపడం కూడా మా దృష్టికి వచ్చింది. – నాగరాజు, మున్సిపల్ కమిషనర్ -
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి
● ‘నవోదయ’ వార్షికోత్సవంలో ఎంపీ అర్వింద్ కోరుట్ల: నవోదయ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పట్టణంలోని నవోదయ విద్యాలయం మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు తిలకించారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో మంచిస్థానాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ముందుగా ఎంపీ సంగెం రోడ్లో నవోదయ విద్యాలయం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి, విద్యాలయ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. -
విద్యార్థుల చదువు ఇదేనా..!
● హెచ్ఎంపై కలెక్టర్ ఆగ్రహంమెట్పల్లి: ‘విద్యార్థుల చదువు ఇదేనా.. ఏం బోధిస్తున్నారు..? ఏం చేస్తున్నారు..’ అని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్పల్లి పట్టణంలోని చావిడి వద్ద ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించారు. తొమ్మిదో తరగతిలోకి వెళ్లి ఓ విద్యార్థిని చదవాలని కోరాగా.. సరిగా చదవలేకపోయాడు. దీంతో ప్రధానోపాధ్యాయురాలిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీసం చదవడం, రాయడం వంటి నైపుణ్యం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. నెలరోజుల్లో మరోమారు పాఠశాలకు వస్తానని, ఆ లోపు విద్యార్థుల పరిస్థితి మెరుగుపడకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యమైన భోజనం అందించాలి అనంతరం కలెక్టర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించారు. పరిశుభ్రతను పాటించడంతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. సౌకర్యాలు, సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వద్దు అనంతరం కలెక్టర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. పన్నుల వసూళ్లపై తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్తి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి మెట్పల్లిరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ అన్నారు. మెట్పల్లి మండలం వెల్లులలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు ఉండాలని సూచించారు. అధికారులు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. హౌసింగ్ పీడీ ప్రసాద్, ఎంపీడీవో సురేశ్, ఎంపీవో మహేశ్వర్రెడ్డి, కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. -
మహిళా ఆరోగ్యానికి 100 రోజుల హెల్త్ మిషన్
● డీఎంహెచ్వో గుజ్జుల సుజాతజగిత్యాల: మహిళాఆరోగ్యానికి 100 రోజుల హెల్త్ మిషన్ కార్యక్రమం చేపడుతున్నామని, 30 రకాల వైద్య పరీక్షలు చేసి ప్రతిఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇస్తామని డీఎంహెచ్వో సుజాత అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ మిషన్ 100 పేరుతో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీ డయోగ్నోస్టిక్ హబ్ సెంటర్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రోగ నిర్ధారణ చేపడతామన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 9 వరకు నాలుగు దశల్లో ఈ సేవలు నిర్వహిస్తామన్నారు. మొదటి దశలో మెడిసిన్, గైనకాలజీ, పిడియాట్రిక్, కంటి, ఎముకలు, రెండో దశలో క్యాన్సర్, మూడో దశలో వడదెబ్బ, అతిసారం, నాలుగో దశలో ఫుడ్సేఫ్టీ మేళా నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు రవీందర్, భూమేశ్వర్ పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహుని దక్షిణ దిగ్యాత్ర గురువారం విజయవంతంగా సాగింది. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. దిగ్యాత్రలో భాగంగా స్వామివారు ధర్మపురి పోలీస్స్టేషన్ను సందర్శించారు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు స్వామివారికి స్వాగతం పలికారు. స్టేషన్లో రికార్డులు పరిశీలించిన అనంతరం వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయం నుంచి పోలీస్ స్టేషన్వరకు అశ్వవాహనంపై స్వామివార్లను శోభయాత్రగా తీసుకెళ్లారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, ఎస్సైలు మహేశ్, రమేశ్, ఉదయ్కుమార్, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. దిగ్విజయంగా దక్షిణ దిగ్యాత్ర -
జేఎన్టీయూలో వర్క్షాప్
కొడిమ్యాల: నాచుపల్లి జేఎన్టీయూలో సీఎస్పీ విభాగం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ 4.0 ఎస్సెన్షియల్ ఆన్ ట్రైనింగ్ ఇన్ ఏఐ, ఐవోటీ, ఏడబ్ల్యూఎస్ అంశంపై గురువారం నుంచి మూడు రోజులపాటు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ నరసింహ తెలిపారు. ఎడ్యుటెక్ సంస్థకు చెందిన కల్యాణ్, శ్రీచరణ్ బృందం విద్యార్థులకు ఏఐ, ఐవోటీ, ఏడబ్ల్యూఎస్ వంటి ఆధునిక సాంకేతికలపై శిక్షణ అందిస్తున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, సీఎస్సీ హెచ్వోడీ చత్రపతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ భాస్కర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అంజన్న ఆలయ అభివృద్ధికి కృషి● ఇన్చార్జి ఈవో రమాదేవి
ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ జగిత్యాలరూరల్: ఇంటర్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని బోర్డు అబ్జర్వర్ నరేంద్ర కుమార్ అన్నారు. బీర్పూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని గురువారం సందర్శించారు. కేంద్రంలోని సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఘనంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవంమెట్పల్లి: పట్టణంలోని అయ్యప్ప ఆలయ 30వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. యజ్ఞ అర్చకులు నారబట్ల హరిప్రసాద్ చేతులమీదుగా గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప, పంచముఖ ఆంజనేయస్వామికి 108పాదుకలతో అభిషేకం చేశారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పా టు చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, ఆలయ కమిటీ సభ్యులు గంగుల వివేక్, దొమ్మాటి ప్రవీణ్, అంకతి భరత్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు జగిత్యాలరూరల్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే పంపించనున్నట్లు కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శివాజీ తెలిపారు. ఈనెల 27న జరగనున్న స్వామివారి కల్యాణానికి సంబంధించిన తలంబ్రాలను దేవాదాయ శాఖ సహకారంతో పోస్టల్ శాఖ భక్తులకు అందిస్తోందన్నారు. భద్రాచలం వెళ్లి స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తులు.. తమ ఇళ్ల వద్దనే ఉంటూ తలంబ్రాలు పొందేందుకు వీలుగా అన్ని పోస్టాఫీసులలో బుకింగ్ సదుపాయాన్ని తెచ్చామన్నారు. రూ.450 చెల్లించి ప్యాకేజీ బుక్ చేసుకున్న వారికి తలంబ్రాలు, ముత్యం, కుంకుమపు వ్వు, పటికబెల్లం, జీడిపప్పు ప్రసాదంగా అంది స్తామని, రూ.151 చెల్లిస్తే ముత్యాల తలంబ్రాలు మాత్రమే అందుతాయని పేర్కొన్నా రు. ఈనెల 20లోపు సమీపంలోని పోస్టాఫీస్లో సంప్రదించి బుక్ చేసుకోవాలని సూ చించారు. శ్రీరాముడిభక్తులంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
భూ పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమ
● అదనపు కలెక్టర్ బీఎస్.లత మల్యాల: జాతీయ రహదారి 563 విస్తరణలో భూములు కోల్పోతున్న మండలంలోని రాజారం గ్రామస్తులతో అదనపు కలెక్టర్ బీఎస్.లత గ్రామసభ నిర్వహించారు. రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న వారి సందేహాలు నివృత్తి చేశారు. బాధితుల జాబితా తయారు చేశామని, భూ విస్తీర్ణాన్ని బట్టి పరిహారం చెల్లిస్తామని, బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం విజయ్, తహసీల్దార్ వసంత, ఆర్ఐ తిరుపతి, కార్యదర్శి ఉపేంద్ర, ప్రజలు పాల్గొన్నారు. -
బీజేపీలో ముదిరిన లొల్లి
● ఎంపీ పర్యటన నేపథ్యంలో గొడవ ● ఫర్నిచర్ ధ్వంసం, గ్రీన్మ్యాట్ల చించివేత ● అదుపులోకి తీసుకున్న పోలీసులు ● పదిమందిపై కేసు నమోదుజగిత్యాల: జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీలో వర్గపోరు ముదురుతోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన బోగ శ్రావణి.. మరోవర్గానికి కొన్నిరోజులుగా పడటం లేదు. ప్రతి విషయంలో శ్రావణి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని మరోవర్గం వారు గొడవకు దిగుతున్నారు. ఎంపీ అర్వింద్ వర్గానికి చెందిన శ్రావణి పార్టీలో సీనియర్లను విస్మరిస్తున్నారని, కొత్తవారికి పెద్దపీట వేస్తున్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు, సీనియర్లకు టికెట్లు ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారని ఇటీవల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ రెబల్స్గా బరిలో నిలిచి గెలిచారు. వారిని పార్టీ సస్పెండ్ చేసింది. గురువారం ఎంపీ అర్వింద్ జిల్లాకు వస్తున్నారన్న సమాచారంతో సీనియర్ నేతలు బోగ శ్రావణి ఇంటి వద్ద హల్చల్ చేశారు. అక్కడున్న కుర్చీలు, మ్యాట్లు ధ్వంసం చేశారు. శ్రావణి భర్త ప్రవీణ్ను దుర్భాషలాడారు. విషయం తెలుసుకున్న సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే ఎన్నికల నుంచే.. జగిత్యాల బల్దియాలో బీఆర్ఎస్ తరఫున చైర్మన్గా కొనసాగిన బోగ శ్రావణిని బీజేపీలోకి తీసుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించారు. ఆమె 40వేలకు పైగా ఓట్లు సాధించినా ఓడిపోయారు. తన ఓటమికి కారణం కొందరంటూ అప్పుడే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. త్రీమెన్ కమిటీ వేయగా.. వారు కూడా కొందరు సీనియర్లు శ్రావణికి కాకుండా వేరేవారికి మద్దతు ఇచ్చినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి గొడవ ముదురుతూ వస్తోంది. దాడి సరికాదు.. తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని, మహిళ అని కూడా చూడకుండా తనపై దాడిచేశారని శ్రావణి అన్నారు. ఎంపీ పర్యటన నేపథ్యంలో సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ సస్పెండ్ అయిన కొందరు తన ఇంటిపై దాడి చేశారని, తన భర్త ప్రవీణ్ను చంపేస్తామని, అంతు చూస్తామని దుర్భాషలాడారని పేర్కొన్నారు. సీఐ సంఘటన స్థలానికి చేరుకుని గొడవ లేకుండా చూశారని, ఆందోళన చేసిన వారిపై కలెక్టర్, ఎస్పీలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బోగ శ్రావణి ఇంటి వద్ద గొడవ చేస్తున్న బీజేపీ రెబల్స్అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు నేను వచ్చాక దాడి చేస్తే నా అంగరక్షకులే కాల్చిపారేసేవారు: ఎంపీ అర్వింద్ జగిత్యాలటౌన్: కోవర్టు రాజకీయాలు తనకు కొత్త కాదని, ఇవి తన ముందు నడవవని, కోవర్టులను ఇప్పటికే బయటకు పంపించామని, ఎవరైనా ఉంటే ఏరిపారేస్తామని ఎంపీ అర్వింద్ అన్నారు. శ్రావణి నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. పార్టీని బలోపేతం చేస్తున్న శ్రావణి కోవర్టులకు శత్రువులా కనిపిస్తున్నారని, అందుకే దాడులకు పాల్పడుతున్నారని, తాను వచ్చాక అటాక్ చేసి ఉంటే తన అంగరక్షకుడే కాల్చిపారేసేవాడని పేర్కొన్నారు. సస్పెండ్ అయిన వారి గురించి ఆరేళ్ల తర్వాత ఆలోచిస్తామన్నారు. రాజకీయాలు మానుకుని కేంద్రీయ విద్యాలయానికి చల్గల్లో పదెకరాల స్థలం కేటాయించాలన్నారు. రాబోయే రోజుల్లో జగిత్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10 మందిపై కేసు నమోదు జగిత్యాలక్రైం: బోగ శ్రావణి ఇంటి వద్ద హంగామా సృష్టించిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఎంపీ అర్వింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. బీజేపీ రెబల్స్ సీపెల్లి రవీందర్, సిరికొండ శ్రీనివాస్, సుధాకర్, ప్రజోత్, కమలాకర్, ప్రమోద్, కిశోర్సింగ్, సతీశ్, మరికొంత మంది ఆందోళన చేశారు. వారిపై పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
పేదలకు అండగా ప్రభుత్వం
జగిత్యాలరూరల్: పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్కు చెందిన కొత్తపల్లి లింగం, ప్రణీత దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రణీతకు చీరను కానుకగా అందించారు. సర్పంచ్ శీలం సురేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, ఉప సర్పంచ్ బాలే శ్రీనివాస్, ఎంపీఓ వాసవి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ ఆంక్షలు సడలించాలి ఉపాధి హామీ పథకంపై విధించిన ఆంక్షలను సడలించాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల అర్బన్ ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులకు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రం తీరు సరికాదన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మారుతాయన్నారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్, పీఆర్ ఏఈ విజయ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినయ్, హౌసింగ్ ఏఈ భార్గవ్, సర్పంచులు మహేష్, గంగాధర్, సురేందర్ పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ వినియోగించుకోవాలి జగిత్యాల: సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. పురాణిపేటకు చెందిన చిట్యాల జ్యోత్స్నకు మంజూరైన రూ.25వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది పేదలకు వరమని, ప్రతి ఒక్కరు దీనిని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలె శంకర్, నవీన్, మహేశ్ పాల్గొన్నారు. -
గోదావరి పుష్కరఘాట్ల పరిశీలన
మల్లాపూర్: మండలంలోని గోదావరి తీరప్రాంతా లైన మొగిలిపేట, ఒబులాపూర్, కొత్తదాంరాజుపల్లి, పాతదాంరాజుపల్లి, వాల్గొండ, వీవీరావుపేట గ్రామాల్లోని పుష్కర ఘాట్లను మెట్పల్లి డీఎస్పీ రాములు బుధవారం పరిశీలించారు. వాల్గొండ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఘాట్ల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా తీసుకోవా ల్సిన చర్యలను పరిశీలించారు. స్టాళ్లు, తాగునీ రు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్ ఇతర ఏర్పాట్లపై ఆరాతీశారు. ఘాట్ల వద్ద మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడకుండా చూస్తామని, బారీకేడ్లు, సీసీ కెమెరాలు, లైటింగ్, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, మళ్లింపు వంటి అంశాలపై దృష్టి సారించామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో జగదీశ్, సర్పంచ్లు గోల్కోండ కళ, తోట మాధూరి, ఎగ్యారపు లింబా ద్రి, రొండ్ల రాజేశ్వరి, తోపారపు వసంత, ధరంసోత్ సురేష్, కనుముల వెంకటేశ్, ఎస్సై అనిల్ పాల్గొన్నారు. -
జనగణనలో కులగణన చేయాలి
● మాజీ మంత్రి జీవన్రెడ్డి జగిత్యాలటౌన్: దేశంలో చేపట్టనున్న జనగణనలో కులగణన చేసి బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉద్యోగకల్పనతోపాటు సామాజిక న్యాయం చేయాలని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. దేశ జనాభా లెక్కలు తేల్చేందుకు జనగణన చేపట్టబోతున్నామని గతంలో కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో కులగణన కూడా చేపట్టాలన్నారు. కేవలం జనగణనతో ఆశించిన ఫలితాలు రావన్నారు. కులగణన అంశాన్ని అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల మద్దతుతో కేంద్రానికి నివేదిక పంపాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో జనగణనలో కులగణన జరిపేలా ప్రస్తావించాలన్నారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజుల రాజేందర్, జున్ను రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, దేవేందర్రెడ్డి, అబ్దుల్ బారి, చాంద్ పాష ఉన్నారు. -
కీలక పోస్టులు ఖాళీ
జగిత్యాల: జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో కీలకపోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఐదేళ్లకోమారు ప్రజాప్రతినిధులు, బదిలీపై అధికారులు మారుతున్నా.. పోస్టులు మాత్రం భర్తీకి నోచుకోవడం లేదు. ఫలితంగా బల్దియా అభివృద్ధి కుంటుపడుతోంది. ఖాళీ పోస్టుల ప్రభావం ముఖ్యంగా శానిటేషన్పై ప్రభావం చూపుతోంది. పట్టణంలో ఎక్కడ చూసినా శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భర్తీకి ప్రతిపాదనలు బల్దియాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేసే లా చూడాలని కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ డైరెక్టర్కు ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఆలస్యమవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి జగిత్యా ల మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో నియమించి అభివృద్ధికి తోడ్పడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటిలో కీలకమైన పోస్టులు ఖా ళీగా ఉండడంతో అభివృద్ధి పనులు ముందుకు కదలడం లేదని భావించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ డైరెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. పోస్టులు ఖాళీగా ఉండడంతో జిల్లాకేంద్రంలో శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో పర్యవేక్షించేవారు కరువై రోడ్లన్నీ డంపింగ్యార్డులుగా దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీలను వారంలో ఒకసారి కూడా తీయడం లేదు. మురికి కాలువలన్నీ సిల్ట్తో నిండి నీరంతా బయటకు వచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. శానిటరీ ఇన్స్పెక్టర్ను నియమించి ఆ వ్యవస్థను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.శానిటేషన్ అస్తవ్యస్తం


