breaking news
Jagitial District Latest News
-
భారీ పేలుళ్లతో భయం
మోతె, తిమ్మాపూర్ గ్రామాల మధ్య గ్రానైట్ వ్యాపారి నిత్యం సాయంత్రం వేళల్లో భారీగా బ్లాస్టింగ్లు పెడుతుండటంతో తీవ్ర భయాందోళన చెందుతున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు సాయంత్రం వేళల్లో బ్లాస్టింగ్లకు భయపడి ముందుగానే ఇంటికి చేరుతున్నారు. – చిర్రం భగవంతం, వార్డు మెంబర్, మోతె తిమ్మాపూర్ శివారులోని నల్లగుట్టకు గ్రానైట్ వ్యాపారి ఇష్టారాజ్యంగా గ్రానైట్ తీస్తూ భారీ ట్రక్కుల్లో పరిమితికి మించి ఓవర్లోడ్ పంపిస్తుండడంతో రోడ్లన్నీ ధ్వంసమై భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. తారురోడ్లు కూడా ధ్వంసం అవుతున్నాయి. – దుబ్బాక రమేశ్, వార్డు మెంబర్, తిమ్మాపూర్ జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారులోని నల్లగుట్టకు గ్రానైట్ తీసే వ్యాపారికి అనుమతులున్నాయి. రోడ్ల ధ్వంసంపై వ్యాపారికి సమాచారం ఇచ్చి మరమ్మతు చేయిస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా చూసేలా చర్యలు చేపడతాం. – జైసింగ్, జిల్లా మైనింగ్ అధికారి -
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
ధర్మపురి: నేరెళ్ల బస్టాండ్ సమీపంలో కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని నేరెళ్లకు చెందిన వేముల శివమణి ఆదివారం ద్విచక్రవాహనంపై జగిత్యాల వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా నేరెళ్ల బస్టాండ్ వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శివమణి తలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న జాజాల రమేశ్ వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి.. అక్కడినుంచి కరీంనగర్ తరలించారు. కొండగట్టుకు త్వరలో పవన్ కల్యాణ్?మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో తిరుమల తి రుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 96 గదుల సత్రం నిర్మించేందుకు రూ. 35.19కోట్లు మంజూరైన నేపథ్యంలో ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ము ఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరలో రానున్నట్లు తెలిసింది. జనవరి 3న కొండగట్టుకు రానున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధికారికంగా కార్యక్రమం ఖరారు కాలేదని అధికారులు తెలిపారు. -
అనుమతి కొంత.. తవ్వకాలు ‘కొండ’ంతా
నల్లగుట్ట జగిత్యాలరూరల్: రెండు గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించే నల్లగుట్టపై గ్రానైట్ వ్యాపారి కన్ను పడడంతో గుట్టను నిత్యం ధ్వంసం చేస్తున్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతె, రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని నల్లగుట్టపై ఓ గ్రానైట్ వ్యాపారి కన్నుపడి ప్రభుత్వ అనుమతి తీసుకుని విచ్చలవిడిగా గుట్టను ధ్వంసం చేస్తూ నామరూపం లేకుండా చేస్తున్నారు. నిత్యం భారీ ఎత్తున బ్లాస్టింగ్లు చేయడంతో తిమ్మాపూర్, మోతె గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద ఉండేందుకు జంకుతున్నారు. భారీ పేలుళ్లతో రెండు గ్రామాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అలాగే జగిత్యాల– గొల్లపల్లి ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులు కూడా బ్లాస్టింగ్ జరుగుతున్న సమయంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాన్నారు. సమీప ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాల్లో రాళ్లు పడి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులు ధ్వంసం గ్రానైట్ వ్యాపారి తన భారీ వాహనాల్లో పరిమితికి మించి గ్రానైట్ను తరలిస్తుండటంతో నల్లగుట్టకు వెళ్లే రహదారులు మొత్తం ధ్వంసమై రైతులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అలాగే తిమ్మాపూర్ నుంచి ధరూర్కు వచ్చే బైపాస్రోడ్పై ఓవర్లోడ్ ట్రక్కులు నడవడంతో తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీగా గుంతలు గ్రానైట్ వ్యాపారి గ్రానైట్ను భారీ లోతుగా తీయడంతో మోతె గుట్ట శివారులో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో మేతకు వెళ్లిన పశువులు ప్రమాదవశాత్తు గుంతల్లో పడి మృతిచెందుతున్నా వ్యాపారి మాత్రం తన ఇష్టారాజ్యంగా గ్రానైట్ తీస్తూ నల్లగుట్టను నాశనం చేస్తున్నాడు. -
సమాజహితమే అందరి లక్ష్యం కావాలి
కోరుట్ల: సమాజహితమే అందరి లక్ష్యం కావాలని కాళోజీ అవార్డు పురస్కార గ్రహీత కవి జయరాజ్ అన్నారు. ఆదివారం ఆయన కోరుట్లలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయనిజం అంటేనే సేవ అని గుర్తు చేశారు. ప్రకృతి ఒడిలో సేదదీరడంతో పాటు ప్రకృతికి హాని చేయకుండా మనుగడ సాగిస్తేనే మనిషి సదీర్ఘ ప్రయాణం కొనసాగుతుందన్నారు. రీజనల్ మీట్ చైర్పర్సన్గా వ్యవహరించిన గుంటుక సురేష్బాబు, ప్రసన్న రాణి దంపతులు హానికారకమైన ప్లాస్టిక్ను సమాజానికి దూరం చేసే క్రమంలో ఆహూతులందరికీ స్టీల్ బాటిల్స్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను స్టీల్ ప్లేట్ అందిస్తామని చెప్పి తమ లయనిజాన్ని చాటుకున్నారన్నారు. ప్రజాకవి జయరాజ్ తాను రాసిన పాటల్లోని ‘వందనాలమ్మా..తల్లీ వందనాలమ్మా’ను పాడటంతో సభికులు బావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ఎల్ఎన్ నాదిపెల్లి వెంకటేశ్వర్రావు, పీఎంజేఎఫ్ లయన్ మోర బద్రేశం, పీఎంజేఎఫ్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటుక చంద్రప్రకాశ్, లయన్ అనంతుల శివప్రసాద్, కార్యదర్శి సింగిరెడ్డి వాసుదేవ రెడ్డి, ట్రెజరర్ వెంకట్, సెక్రటరీ మధు, కో–ఆర్డినేటర్ పోతని ప్రవీన్కుమార్, లయన్స్ గండ్ర అజేందర్రావు, ప్రకాశ్కల్వార్, అల్లాడి ప్రవీన్, చాప కిషోర్, ఉషాకిరన్, మంచాల జగన్, మహేందర్, అన్నం అనిల్, లయన్ మీట్ ట్రెజరర్ కొమ్ముల జలపతిరెడ్డి పాల్గొన్నారు. కాళోజీ అవార్డు పురస్కార గ్రహీత, కవి జయరాజ్ -
ఇబ్బంది పడొద్దనే..
యూరియా కోసం రైతులు ఇబ్బంది పడొద్దనే యూరియా బుకింగ్ యాప్ రూపొందించాం. ఇంటి నుంచే సులువుగా బుకింగ్ చేసుకుని ఏ దశలో ఎంత యూరియా అవసరమో సులువుగా తీసుకెళ్చొచ్చు. ఈ విధానంతో రైతులు క్యూలో నిలబడే పరిస్థితికి ఆస్కారం ఉండదు. విలువైన సయమం వృథాకాదు. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ పెద్దపల్లి రైతులకు ఎంతో మేలు కలెక్టర్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన యూరియా బుకింగ్ యాప్ వినియోగంతో రైతులకు ఎంతో మేలు కలిగిస్తుంది. జిల్లాలో ఈనెల 1నుంచి 17వరకు ఈ యాప్ ద్వారా 27,110 బస్తాల యూరియా అమ్మకాలు జరిగాయి. యాప్ వినియోగంపై రైతులకు తమ శాఖ అధికారులు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్, డీఏవో, పెద్దపల్లి -
లోక్ అదాలత్లో 2010 కేసులు పరిష్కారం
జంటలను అభినందిస్తున్న న్యాయమూర్తులుమాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతిజగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఆదివారం జరిగిన లోక్ అదాలత్లో 2010 సివిల్, క్రిమినల్, మోటర్వాహనాల పరిహారం కేసులు పరిష్కారం అయ్యాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి, మొదటి అదనపు జిల్లాజడ్జి సుగళి నారాయణ, సబ్ జడ్జి, న్యాయసేవా సంస్థ కార్యదర్శి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారు తి, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఏకమైన రెండు జంటలు మెట్పల్లి: కాపురంలో ఏర్పడిన కలహాలతో దూరంగా ఉంటున్న రెండు జంటలు లోక్ అదాలత్లో ఏకమయ్యాయి. కోరుట్లకు చెందిన త్రివేణికి యూసుఫ్నగర్కు చెందిన పులి దివాకర్తో వివాహమైంది. మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. మెట్పల్లి మండలం ఆత్మకూర్కు చెందిన కీర్తనకు రుద్రంగి మండలం మానాలకు చెందిన పులి దివాకర్తో వివాహమైంది. వీరికి ఒక పాప. అదనపు కట్నం కోసం దివాకర్ వేధిస్తున్నాడని కీర్తన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టులో విచారణ జరుగుతోంది. లోక్ అదాలత్లో ఈ రెండు జంటలకు మేజిస్ట్రేట్లు నాగేశ్వర్రావు, అరుణ్కుమార్ కౌన్సెలింగ్ ఇచ్చారు. న్యాయవాదుల సమక్షంలో కేసులను ఉపసంహరించుకుని ఏకమయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్రెడ్డి, న్యాయవాదులు ఉన్నారు. జడ్జమ్మా.. నా కేసును పరిష్కరించమ్మా.. ‘జడ్జమ్మా.. నా కేసును పరిష్కరించమ్మా..’ అంటూ ఓ వృద్ధురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతిని వేడుకుంది. జిల్లా కోర్టులో ఆదివారం లోక్ అదాలత్లో కేసులు పరిష్కరిస్తున్నారన్న సమాచారం మేరకు జగిత్యాలరూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు వచ్చింది. తాను చాలా ఏళ్ల క్రితం కోర్టులో కేసు వేశానని, ఇప్పటికి పరిష్కారం కాలేదని, పరిష్కరించాలని కోరింది. న్యాయమూర్తి స్పందించి కేసు పూర్తి వివరాలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. -
నేడు యథావిధిగా ప్రజావాణి
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవా రం నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టరేట్కు వచ్చి అధికారులకు సమర్పించాలని సూచించారు. ‘వాట్సాప్’లో సాగు సమాచారంజగిత్యాలఅగ్రికల్చర్: రైతులు రకరకాల పంటలు సాగు చేస్తున్నప్పటికీ సరైన సలహాలు అందక దిగుబది పొందలేకపోతున్నారు. ఆదాయం రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్గా పనిచేసిన ఎల్.కిషన్ రెడ్డి రైతులకు సూచనలు అందించాలన్న లక్ష్యంతో వాట్సాప్లో సాగు సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నారు. రైతులు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యను తమ ఇంటి నుంచే 85002 23817 నంబర్కు మెసేజ్ పంపిస్తే.. వెంటనే తెలుగులో సరైన సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ అవకాశాన్ని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా రైతులు వినియోగించుకుంటున్నారు. ఉపాధి పథకాన్ని నీరుగార్చే కుట్రజగిత్యాలటౌన్: ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చే కుట్ర చేస్తోందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. ఉపాధి పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ.. ఆదివారం కాంగ్రెస్ శ్రేణులు జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. జీవన్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని తెచ్చిందన్నారు. గాంధీ పేరును తొలగించి శ్రీరాముని పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయం సరికాదన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజుల రాజేందర్, దుర్గయ్య, పుప్పాల అశోక్, శోభరాణి, రాదాకిషన్, గుండా మధు ఉన్నారు. గాయపడిన వ్యక్తికి సీపీఆర్జగిత్యాలజోన్: జగిత్యాల కొత్త బస్టాండ్ ఆవరణలో ఓ ద్విచక్రవాహనదారుడిని ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై రవీందర్రావు, హోంగార్డు చంద్రశేఖర్ గాయపడిన వ్యక్తికి సీపీఆర్ చేసి, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 24న గల్ఫ్ వలసలపై అవగాహన సదస్సుమల్లాపూర్: స్థానిక రైతువేదికలో ఈనెల 24న గల్ఫ్ వలసలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ప్రవాసీ మిత్ర లేబర్ యూని యన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, కార్యదర్శి సాయిండ్ల రాజరెడ్డి, కొశాధికారి నల్లాల జైపాల్, దామోదర్ తెలిపారు. గల్ఫ్ వెళ్లే ముందు మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విదేశాల్లో పనిచేసే సమయంలో ఎదురయ్యే పరిస్థితులు, అక్కడి చట్టాలు, సంస్కృతి, భద్రతా నిబంధనలు, వేతన ఒప్పంద వివరాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో పనిచేసి.. స్వగ్రామాలకు వచ్చిన వారు తమ అనుభవాలను గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని కోరారు. సదస్సులో కొత్తగా ఎంపికై న సర్పంచ్లు, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు గల్ఫ్ వలస నేపథ్యం కలిగిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనాలని కోరారు. -
రాష్ట్రానికే ‘పెద్ద’పల్లి ఆదర్శం
పెద్దపల్లిరూరల్: యూరియా కృత్రిమ కొరత సృిష్టించే అవకాశం లేకుండా.. రైతు తన అవసరాలకు మించి ఎరువును వినియోగించకుండా.. ఇంటి నుంచే బుకింగ్ చేసుకుని దుకాణం నుంచి సులువుగా తీసుకెళ్లేలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శ్రీయూరియా బుకింగ్యాప్శ్రీను అందుబాటులోకి తెచ్చారు. యాప్ను జిల్లాలో 15రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ ప్రయత్నం ఫలించడంతో విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. ఇంటి నుంచే సులువుగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్న ఈ యాప్ను శనివారం నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాల రైతులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఇంటినుంచే బుకింగ్ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆలోచనల్లో నుంచి పుట్టిన యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. యాప్ ద్వారా పట్టా పాసుపుస్తకం నంబరు నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్కు ఓటీపీ వస్తోంది. ఆ నంబరు నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంట వేశారు అనే వివరాలతో పాటు యూరియా ఎంతమేర అవసరమవుతుందనే సమాచారంతో బుకింగ్ ఐడీ వస్తుంది. వాటి ఆధారంగా సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు. ఐదెకరాల భూమికలిగిన రైతులు రెండు విడతల్లో, 20 ఎకరాల లోపుగలవారు మూడు దఫాలుగా, అంతకన్న ఎక్కువ ఉంటే నాలుగు దశల్లో యూరియా తీసుకెళ్లేలా యాప్ను రూపొందించారు. ఈ నెల 20 నుంచి పొరుగు జిల్లాలో.. పెద్దపలి జిల్లా నుంచి మొదలైన యూరియా బుకింగ్ యాప్ నమోదు ప్రక్రియ రాష్ట్రంలోని పొరుగు జిల్లాలకు పాకింది. ఈనెల 20న తొమ్మిది జిల్లాల్లో సాగింది. కొద్దిరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ను రైతులు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. పెద్దపల్లిలో ఈనెల 1నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేశారు. శనివారం నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్నగర్, వికారాబాద్, కరీంనగర్ జిల్లాలోనూ యూరియా బుకింగ్ ప్రక్రియ మొదలైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రానికి ఆదర్శం జిల్లా తొలి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అలగు వర్షిణి పాలనలో అమల్లోకి తెచ్చిన ‘సాండ్టాక్సీ పాలసీ’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ప్రస్తుత కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టం) పద్ధతిని విద్య, వైద్యశాఖల్లో అమలు చేసేలా యాప్ను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ఎరువుల కృత్రిమ కొరత రాకుండా యూరియా బుకింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. -
జగిత్యాల
24.0/10.0– 8లోసోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 20257గరిష్టం/కనిష్టంఅనుమతి కొంత తవ్వకాలు ‘కొండ’ంతారెండు గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించే నల్లగుట్టపై గ్రానైట్ వ్యాపారి కన్ను పడడంతో గుట్టను నిత్యం ధ్వంసం చేస్తున్నారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. పొగమంచు దట్టంగా కురిసే అవకాశం ఉంది. సాయంత్రం నుంచే చలిగాలులు కొనసాగుతాయి. -
.. అను నేను
జగిత్యాల/కోరుట్ల: పల్లె జనాలను మెప్పించి.. ఎన్నికల్లో గెలుపొంది.. వారి మేలు కోసం ఏదైనా చేయాలన్న బాధ్యతతో కొత్త సర్పంచులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుమారు రెండేళ్ల తర్వాత జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకూ బిజీగా ఉన్న అధికార యంత్రాంగం.. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ప్రమాణస్వీకారానికి పూర్తి ఏర్పాట్లు చేసింది. అధికార బాధ్యతలు కొత్తగా పల్లెల్లో ఎన్నికై న చాలామంది ప్రజాప్రతినిధులు ప్రమాణస్వీకారం అనంతరం తమ చేతికొచ్చిన అధికార బాధ్యతలతో గ్రామాల్లో చేపట్టే అభివృద్ధితోపాటు సంక్షేమం లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై తమ అనుయాయులతో ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు. గ్రామాల్లోని కీలక సమస్యలు, పంచాయతీపరంగా చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ఉప సర్పంచ్, వార్డుసభ్యులతో కలిసి ముందుకు వెళ్లి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కొత్త సర్పంచులపై ఉంది. గ్రామ పంచాయతీలను నిధుల లేమి కీలక సమస్యగా వేధిస్తున్నా.. ఎన్నికలు పూర్తి అయిన క్రమంలో త్వరలో నిధులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో తాము ఇచ్చిన హామీలు ఎలాగోలా నెరవేర్చుతామన్న నమ్మకంతో పంచాయతీలకు ఎన్నికై న కొత్త సారథులు ఆశల్లో ఉన్నారు. మౌలిక వసతులే కీలకం.. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు కీలకంగా మారాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి రెండేళ్లుగా నిధులు రాకపోవడంతో సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఇదే కీలకాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటు మంజూరు కాగానే వాటిని సద్వినియోగం చేయడంతోపాటు ఆదాయ వనరులు పెంచుకోవడంపై కొత్త ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, శివారు ప్రాంతాల్లో విద్యుద్ధీకరణ, టాయ్లెట్స్ వంటి అంశాలు కీలక సమస్యలు గా మారాయి. ప్రధానంగా పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరిచి పల్లె ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో కొనసాగిన రాజకీయాలు, గెలుపోటముల, పంతాలు పక్కన పెట్టి పల్లెల్లో ఒక్కతాటిపై నిలిచి గ్రామాభివృద్దికి పాటుపడతారని ఆశపడుతున్న పల్లె జనాల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఎంపికై న కొత్త ప్రజాప్రతినిధులపై ఉంది. రెండేళ్ల తరువాత కొలువుదీరనున్న పాలకవర్గాలు నేడు పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం గ్రామాల్లో కనీస సౌకర్యాలు మృగ్యం సర్పంచులకు సమస్యల చిట్టా స్వాగతం నిధులు లేమితో సతమతం 15వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులు వస్తే పండుగే15వ ఆర్థిక సంఘం నిధులపై కొత్త సర్పంచ్లు ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ నిధులు విడుదల కాలేదు. ప్రతి గ్రామానికి దామాషా ప్రకారం ఒక్కోక్కరికి రూ.900 నుంచి రూ.1400 చొప్పన నిధులు రావాల్సి ఉంది. మూడు వేల జనాభా ఉంటే రూ.27లక్షలు వస్తాయి. రెండేళ్లకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు పైప్రకారం చూస్తే రూ.54 లక్షలు రానున్నాయి. పంచాయతీల్లో జనాభా ఆధారంగా రూ.5లక్షల నుంచి రూ.80లక్షల వరకు నిధులు వచ్చే అవకాశం ఉంది. మార్చి చివరి నాటికి ఆర్థిక సంఘం గడువు ముగిసిపోనుంది. ఈ లెక్కన రెండేళ్లు నిధులు వస్తే కొత్త సర్పంచ్లకు ఊరట కలగనుంది. మొత్తంగా కేంద్రం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు ఎస్ఎఫ్సీ నిధులు వస్తనే పల్లెల అభివృద్ది పట్టాలు ఎక్కనుంది. కొత్త సర్పంచుల్లోనూ జోష్ కలుగనుంది. -
పాఠశాల అభివృద్ధికి కృషి
● హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవిధర్మపురి: పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి అన్నారు. మండలంలోని తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మాణం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట) సంస్థ ఆధ్వర్యంలో నిధులు మంజూరు కాగా ప్రహరీతోపాటు విద్యార్థులకు రక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. వీటిని హైకోర్టు న్యాయమూర్తి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ తదితరులు హాజరై ప్రారంభించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, ఇలాంటి కార్యక్రమంలో ప్లాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ముందుగా న్యాయమూర్తికి ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, సర్పంచ్ నలుమాసు పుష్పలత, ఆట కార్యవర్గ సభ్యులు, నిర్వాహకులు ప్రకాశ్రావు, ఆట ప్రెసిడెంట్ జయంత్ చల్లా, జిల్లా విద్యాధికారి రాము, ఎంఈవో సీతామహాలక్ష్మి, నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఎస్.దినేష్ తదితరులున్నారు. -
జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యం
కళాశాల ఆవరణలో విశాలమైన ఆటస్థలం ఉండడంతోపాటు 200 ట్రాక్ అందుబాటులో నిత్యం పీఈటీ సూచనలతో ప్రాక్టీస్ చేస్తున్న. ఇప్పటివరకు3 కిలోమీటర్ల పరుగు పందెం, 1500మీటర్ల పరుగు పందెం పోటీల్లో ఆరుసార్లు రాష్ట్రస్థాయిలో పాల్గొన్న. జాతీయస్థాయి అథ్లెటిక్స్లో రాణించడమే లక్ష్యం. – ఆర్.మనీష, ఇంటర్ ఫస్టియర్ నిత్యం ప్రాక్టీస్తో జాతీయస్థాయికి.. జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటేందుకు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్న. ఎస్జీఎఫ్–19 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాను. నిత్యం ప్రాక్టిస్ చేయడంతోపాటు, పిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక ప్రోత్సహిస్తుండడంతో ఆటల్లో రాణిస్తున్నాం. – హారిక, ఇంటర్ సెకండియర్ ప్రత్యేక శిక్షణతో ప్రతిభకు పదును విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం. విద్యార్థులకు నిత్యం కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగాసానాల్లో ప్రాక్టీస్ చేయిస్తున్నాం. ఆటలతో క్రమశిక్షణ, మానసికస్థైర్యం పెంపొందుతుంది. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ, వారి ప్రతిభకు పదును పెడుతున్నాం. – మధులిక, పీఈటీ, తాటిపల్లి గురుకుల కళాశాల -
గురుకులం విద్యార్థులు.. ఆటల్లో మెరికలు
మల్యాల: మల్యాల మండలం తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల 2018లో ఇంటర్మీడియేట్ కళాశాలగా అప్గ్రేడ్ అయింది. అప్పటినుంచి అటు పదో తరగతిలో.. ఇటు ఇంటర్లోనూ వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. చదువుతోపాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా, కరాటేలో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ఆటల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మానస నిత్యం పర్యవేక్షిస్తూ చదువులో సబ్జెక్టుల వారీగా వెనకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తూ.. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెంపొందిస్తూ.. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు నిత్యం కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్లో రాణించేందుకు పీఈఓ మధులిక ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తుండడంతో ఏటా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణింపు రాష్ట్రస్థాయిలో సత్తాచాటుతున్న వైనం -
● కళాకారులుగా.. ఉద్యోగులుగా.. వివిధ రంగాల్లో రాణించి ● సర్పంచ్లుగా ఎన్నికై న యువత
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి... పాలనలో ప్రత్యేకత చూపాలని భావిస్తున్నారు. మరో వైపు ఓటర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి యువతకు పట్టం కట్టారు. అభిమానం, సామాజిక సేవ, గౌరవం, తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో అవకాశం కల్పించారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు సర్పంచ్ల ప్రత్యేకతపై ఈ వారం సండే స్పెషల్..!! -
సర్పంచ్ అను నేను..
● ఈనెల 22న సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం రాయికల్: ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈనెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం పంచాయతీల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు చేసే ప్రమాణం ఇలా ఉంటుంది. ‘సర్పంచ్/వార్డు సభ్యుడు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం, విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని, భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను..’ అని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాణ పత్రంలో ఉండే అంశాలివే... ● నేను భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తానని ● నా విధులను నిజాయితి, నిస్పక్షపాతంగా భక్తితో నిర్వహిస్తానని ● గ్రామ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని, ● గ్రామపంచాయతీ ఆస్తులు, నిధులను జాగ్రత్తగా వినియోగిస్తాను. ● గ్రామ ప్రజలకు సేవ చేయడానికి అంకితంగా ఉంటానని, దీనికి సాక్షిగా ఈ ప్రమాణపత్రంపై సంతకం చేస్తున్నా. -
ఆయిల్ పాం విస్తీర్ణం పెంచాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: జిల్లాలో ఆయిల్ పాం సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలని, ఫిబ్రవరి వరకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం ఉద్యాన, వ్యవసాయ, సహకార తదితర శాఖలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పాంపై ఎలాంటి అపోహాలు వద్దని, గెలల కోత ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన రేటుకు కొనుగోలు చేస్తారని వివరించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఉద్యాన అధికారి శ్యామ్ప్రసాద్, వ్యవసాయ అధికారి భాస్కర్ పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
● బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల: రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కలెక్టర్తో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను జయప్రదం చేయాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ ధరించకపోవడం ద్వారా ఏటా చాలా మంది మరణిస్తున్నారని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్టీసీ, ఎడ్యుకేషన్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ● 900 గ్రాముల వెండి విగ్రహాలు.. ● 10 గ్రాముల బంగారం అపహరణ జగిత్యాలక్రైం: జగిత్యాలలోని కృష్ణానగర్లో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. కృష్ణానగర్కు చెందిన పబ్బ సాగర్ బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇటీవల తన తల్లిని కూడా బెంగళూరు తీసుకెళ్లాడు. శనివారం ఉదయం పని మనిషి వెళ్లేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో స్థానికులు సాగర్కు సమాచారం అందించారు. ఆయన సమాచారం మేరకు పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. ఇద్దరు దొంగలు తాళాలు పగులగొట్టి 900 గ్రాముల వెండి విగ్రహాలు, 10 గ్రాముల బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దొంగలిద్దరూ గ్లౌస్లు, మంకీక్యాప్లు ధరించినట్లు ఇంట్లో ఉన్న సీసీ పుటేజీల్లో రికార్డు అయ్యింది. సాగర్ బెంగళూరు నుంచి వచ్చాక ఇంట్లోని సామగ్రిని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
పుట్టిన ఊరుకు సేవ చేయాలని..
బుగ్గారం: మండలంలోని సిరికొండకు చెందిన పంచిత ధర్మరాజుయాదవ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యత మీదపడింది. ఈ క్రమంలో ఉపాధి కోసం గల్ఫ్బాట పట్టాడు. 15 ఏళ్లుగా దుబాయ్, ఖతార్ దేశాల్లో వివిధ కంపెనీల్లో పనిచేశాడు. ఖతార్ కంపెనీలో మంచి స్థాయిలో కుదురుకున్నాక తెలంగాణా ప్రజాసమితి స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ మరణించిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపించడం, జైళ్లలో ఉన్నవారికి న్యాయసహాయం అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టాడు. గ్రామంలోని యువకులకు వీసాలు పంపి గల్ఫ్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. తాను పుట్టిన ఊరుకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచాడు. గ్రామంలోని యువత, మహిళలు, రైతులు పూర్తి మద్దతు తెలుపడంతో సర్పంచ్గా విజయం సాధించాడు. -
యావర్రోడ్డు విస్తరించి తీరుతా..
జగిత్యాల: తాను రాజకీయాన్నీ రాజకీయంగానే చూస్తానని, ఎవరో ఏదో మాట్లాడారని స్పందించబోనని, జిల్లాకేంద్రంలోని ప్రధానమైన సమస్య యావర్రోడ్డును విస్తరించి తీరుతానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ప్రభుత్వ వైద్యసేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పల్లె దవాఖానాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లాకేంద్రంలో రూ.230కోట్లతో మరో ఆస్పత్రి మంజూరైందన్నారు. మెడికల్ కళాశాల పనులు 80శాతం పూర్తయ్యాయన్నారు. గతంలో బిల్లులు రాకనే కాంట్రాక్టర్ చేతులెత్తేశారని, సీఎం దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్రావు, వెంకటేశ్యాదవ్ పాల్గొన్నారు. -
జప్తుచేసిన సామగ్రికి కోర్టులో వేలం
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని లింగంపేటలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేయగా.. ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు ఆర్డీవో కార్యాలయంలోని సామగ్రిని కో ర్టు ఆదేశాల మేరకు జప్తు చేశారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు శనివారం కోర్టు ఆవరణలో సామగ్రికి వేలం వేశారు. ఆరుగురు వేలంలో పాల్గొనగా.. బుగ్గ సతీశ్ రూ.42 వేలకు దక్కించుకున్నాడు. కోర్టుకు డబ్బులు చెల్లించి సామగ్రి తీసుకెళ్లాడు. జాతీయ నాయకుల ఫొటోలకు రక్తాభిషేకంఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గొస్కె రాజేశం ఆ పార్టీ జాతీయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చిత్రపటాలకు శనివారం రక్తాభిషేకం చేశారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్లో కార్యకర్త నుంచి జిల్లా అధికార ప్రతినిధిస్థాయికి ఎదిగానని, అయినా, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తనకు మద్దతు ఇవ్వకుండా మరోవ్యక్తికి మద్దతు ఇచ్చి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మడక పంచాయతీ ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ చేశారని, 300 కుటుంబాలు కలిగిన తమకు అన్యాయం చేశారని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిని సర్పంచ్ చేశారని రాజేశం పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేశారని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పెద్దలు కాపాడరని ఆరోపించారు. అనంతరం రోడ్డుపై కాలనీవాసులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కరెంట్ షార్ట్సర్క్యూట్తో ఇల్లు కాలిపోయింది. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాలు. ఇందారపు విజయ్ ఇంటిలో రాచమల్ల శివకుమార్ అద్దెకు ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లిన క్రమంలో షార్ట్సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో సర్పంచ్ దండవేన సంధ్యబానేశ్ వెంటనే మంథని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వస్తువులు, బంగారం, నగదు, బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇంటి యజమానికి రూ.15లక్షలు, అద్దెకు ఉండే శివకుమార్కు రూ.5లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయిన శివకుమార్తోపాటు ఓనర్ విజయ్ను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కోరారు. వేలం వేసిన వస్తువులు -
క్రైస్తవుల సంక్షేమానికి కృషి
● మంత్రి అడ్లూరి ధర్మపురి: క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక ఎస్హెచ్ గార్డెన్లో శనివారం ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ లత, జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ముందుగా కేక్కట్ చేసి శభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందన్నారు. క్రిస్మస్ అంటే శాంతి, ప్రేమ, దయ, కరుణకు ప్రతీక అన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్లు తదితరులున్నారు. కొండగట్టుపై వీహెచ్పీ ధర్నామల్యాల: కొండగట్టు అంజన్న ఆలయ భూములు కాపాడాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆలయం ఎదుట దీక్ష చేపట్టారు. అటవీశాఖ చేపట్టిన హద్దుల వివాదం పరిష్కరించి, ఆలయ పరిధిలోని భూములన్ని ఆలయానికే చెందేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీహెచ్పీ నాయకులు రాధాకృష్ణ, మామిడాల రాములు, గాజోజు సంతోష్ కుమార్, యాగండ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పుట్టగొడుగుల పెంపకంపై సదస్సుజగిత్యాలఅగ్రికల్చర్: పుట్టగొడుగుల పెంపకంపై జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో తక్కళ్లపల్లిలో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ఎల్లాగౌడ్ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయంతోపాటు పుట్టగొడుగులు పెంచి ఆదాయం సంపాదించాలన్నారు. పుట్టగొడుగుల పెంపకంతో రైతులకు ఆదాయం వస్తుందన్నారు. ప్రొఫెసర్లు వేణుగోపాల్, తిరుపతి, రాజేంద్రప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. జగిత్యాల బల్దియాలో ఫీల్డ్ సర్వేజగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. సర్వే కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. నేషనల్ జియో స్పెషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హబిటేషన్ (నక్ష)లో భాగంగా సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ గ్రామీ ణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం అమలవుతుందని, అర్బన్ ఆస్తులకు సంబంధించిన నక్ష రూపొందిస్తామని తెలిపారు. గతంలో హెలి కాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించామ ని, మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఇంటి నంబర్లు, ఇంటి యజమానుల రిజిస్ట్రేషన్ పత్రాలు, సమాచార సేకరణకు ఈ సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు. పార్టీ మారలేదంటూ ఎమ్మెల్యే బుకాయింపుజగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారలేదంటూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్లోనే ఉన్నానంటారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్రెడ్డి అధికారంలో లేకున్నా పార్టీ కోసం కష్టపడ్డారని గుర్తు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాలకు వచ్చి మెడికల్ కళాశాలపై మాట్లాడితే ఇక్కడి ఎమ్మెల్యే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు గెలిపిస్తే పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. శీలం ప్రవీణ్, వొల్లం మల్లేశం, ఆనందరావు, గంగాధర్ పాల్గొన్నారు. -
అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా
ఇబ్రహీంపట్నం: కేశాపూర్ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో పోటీ చేశా. బీఎస్సీ, ఎంపీఎస్ చదివా. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోనే బీడీలు చేస్తున్న. మా అత్త రాజుబాయ్ ఎంపీటీసీగా గ్రామానికి సేవలందించారు. నాకు సర్పంచ్గా అవకాశం వచ్చినందున గ్రామంలో అవినితీ పాలన లేకుండా, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా. తీరిక సమయంలో బీడీలు చేస్తా. ఓదెల: మండలంలోని శానగొండ సర్పంచ్గా ఎన్నికై న జీల రాజుయాదవ్కు 23ఏళ్లు. శానగొండ అనుబంధ గొల్లపల్లి స్వగ్రామం. డిగ్రీ పూర్తిచేశాడు. గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నాడు. గ్రామస్తులకు నాణ్యమైన వైద్యం, విద్య అందించేలా చూస్తానన్నారు. ప్రజల సహకారంతో సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. -
మోడల్ విలేజ్గా..
మా ఆయన విజయ్కుమార్ సైన్యంలో చేరి దేశరక్షణ కోసం సేవలందించారు. ఆయన స్ఫూ ర్తి, ప్రోత్సాహంతో ప్రజా సేవ చేయాలన్న తపనతో సర్పంచ్గా పోటీచేశా. గ్రామస్తులంతా తనకే అండగా నిలవడంతో 1,124 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారు. ఎ మ్మెస్సీ కంప్యూటర్స్ చదివిన. గ్రామాభివృద్ధికి పాటుపడతా. గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతా. పెద్దపల్లి: భోజన్నపేట గ్రా మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఎంకాం, డీఈడీ, బీఈడీ చదువుకున్న. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ వర్తింప జేసేలా అధికారులను కోరుతా. గ్రామంలోని సమస్యలపై అవగాహన పెంచుకుని పరిష్కరిస్తా. ప్రజలకు మెరుగైన సేవలందిస్తా. -
పైడిపెల్లిలో రీపోలింగ్ నిర్వహించండి
వెల్గటూర్: తాము 50 ఏళ్ల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఆ పోరాటంలో తాము విజయం సాధించినా.. అధికారులు అడ్డుకున్నారని పేర్కొంటూ మండలంలోని పైడిపెల్లి గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఈనెల 17న నిర్వహించిన మూడో విడత ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని, మరోసారి పోలింగ్ నిర్వహించాలని సుమారు మూడు వందల మంది ట్రాక్టర్లలో తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నెల 22న జరగనున్న సర్పంచ్ ప్రమాణస్వీకారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ రోజు గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎంపీవో కృపాకర్కు వినతిపత్రం అందించారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మమత మాట్లాడుతూ గ్రామంలో ఒకే కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోందని, నియంతృత్వాన్ని సహించలేక ప్రజలంతా ఏకతాటిపై నిలబడినా కౌంటింగ్లో గోల్మాల్ చేసి తనను ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ పూర్తి కాకముందే తాను ఓడిపోయినట్లు ధృవీకరించి, బెదిరించి, బలవంతంగా తనతో సంతకం తీసుకున్నారని, తమకు న్యాయం చేయాలని, రీకౌంటింగ్ చేయాలని శాంతియుతంగా తాము నిరసన తెలిపితే పోలీసులు లాఠీచార్జ్ చేశారని కన్నీరుపెట్టుకున్నారు. ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కాల్పులు జరిపిన తర్వాతనే తాము ప్రాణ రక్షణకు రాళ్లు విసిరామని తెలిపారు. తమను కౌంటింగ్ కేంద్రానికి వందమీటర్ల దూరం ఉంచిన అధికారులు.. ప్రముఖ రాజకీయ నాయకుడి సోదరుడిని కౌంటింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారని, ఆయనకు కనీసం గ్రామంలో ఓటు కూడా లేదని తెలిపారు. తమకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ఎలుక రాజు, గాలి హరీశ్, మహిళలు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చిన గ్రామస్తులు ప్రమాణ స్వీకారం ఆపాలని వినతిపత్రం అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ -
దొంగమల్లన్న ఆదాయం రూ.23లక్షలు
గొల్లపల్లి: గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలోగల దొంగ మల్లన్న స్వామి ఆలయానికి ఈయేడు ఆదాయం భారీగా పెరిగింది. షష్టి వారాల జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను శనివారం అధికారులు లెక్కించారు. హుండీల ద్వారా రూ.23,08,733తో పాటు 7.500గ్రాముల మిశ్రమ బంగారం, 550 గ్రాముల మిశ్రమ వెండి, సేవా టికెట్లు, వివిధ రకాల పూజా కార్యక్రమాల ద్వారా రూ.7,08,720 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. హుండీ లెక్కింపులో జగిత్యాల డివిజన్ పరిశీలకులు రాజమొగిలి, ఫౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య, ఆలయ ఈవో ముద్దం విక్రమ్, పూజారి రాజేందర్, నాయకులు ముత్యాల స్వామి, లంబ లస్మయ్య, మద్దెల జగన్, దేవాదాయ శాఖ సిబ్బంది శివ కేశవ్, రవీందర్, శ్రీ లలితా సేవా ట్రస్ట్ సభ్యులు, లక్ష్మీపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
అసైన్మెంట్
సమస్యలపై అవగాహనతో.. బోయినపల్లి: మండలంలోని దుండ్రపల్లి గ్రామానికి చెందిన జంగం అంజయ్య లాయర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుగా ఎన్నికయ్యాడు. బీఏ ఎల్ఎల్బీ చేసి 2014 నుంచి లాయర్గా రాణిస్తున్నాడు. వేములవాడ కోర్టులో చురుకై న న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వకీల్గా సమస్యలపై ఉన్న అవగాహనతో రాజకీయాల్లో రాణిస్తానని చెప్పారు. కోనరావుపేట: మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన సింగం శ్రీహరి ఐదేళ్లుగా లాయర్గా కొనసాగుతున్నారు. రోజూ సిరిసిల్లకు వెళ్లి న్యాయవాద వృత్తినే కొనసాగిస్తున్న అతడు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచారు. గ్రామ సమస్యలు పరిష్కరించి, అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. రామగుండం: అంతర్గాం టీటీఎస్ గ్రామ సర్పంచ్గా గెలిచిన అంబోతు రవికుమార్ రాయ్పూర్ ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంతో నెలకు రూ.రెండున్నర లక్షల వేతనం పొందాడు. తనతో పాటు కొంతమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ఉద్యోగం వదిలేశాడు. మండల పరిధిలోని పేద కుటుంబాలకు చెందిన యువతకు తన సొంత ఖర్చుతో గ్రూప్స్, సివిల్స్లో శిక్షణ ఇప్పించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మించాడు. ప్రస్తుతం డైయిరీ ఫామ్ ఏర్పాటు చేసి అందులో పాడి రైతులకు ఉపాధి కల్పిస్తున్నాడు. -
లక్ష్యంతో ముందుకు సాగాలి
మల్లాపూర్/ మెట్పల్లిరూరల్: విద్యార్థులు లక్ష్యంతో ముందు కు సాగితే విజయం సొంతమవుతుందని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమా ర్ అన్నారు. మండలకేంద్రంతోపాటు సాతారం జెడ్పీ హైస్కూళ్లను శనివారం సందర్శించారు. చిటా, చెస్ నెట్వర్క్ అందించిన చెస్బోర్డులను విద్యార్థులకు పంపిణీ చేశారు. లక్ష్యం వైపు అడుగులు వేస్తే పాఠశాల, తల్లిదండ్రులు, పుట్టినఊరు పేరు నిలబడుతుందన్నారు. చెస్ నెట్వర్క్ ఫౌండర్లు సుధీర్ కోదాటి, రవి మయిరెడ్డి, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఎంఈవో దామోదర్రెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రమోహన్రెడ్డి, హెచ్ఎం శ్రీహరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. మెట్పల్లి మండలం వెల్లుల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు చెస్కిట్లను పంపిణీ చేశారు. హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, శంకర్గౌడ్ పాల్గొన్నారు. -
వడివడిగా ఎస్ఐఆర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లాలోని ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/ ఎన్నికల జాబితా విస్తృత సవరణ) ప్రక్రియ వడివడిగా ముందుకు సాగుతోంది. దేశంలో నిజమైన పౌరులను గుర్తింపే లక్ష్యంగా మొదలైన ఈ ప్రక్రియపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని వర్గాలు సర్వేను స్వాగతిస్తుండగా.. మరికొన్ని వర్గాలు సర్వేపై ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన కేంద్రం.. తెలంగాణలోనూ ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సర్వేపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఎవరు నిజమైన ఓటరు.. ఎవరు కాదు? ఎవరు కొత్త ఓటరు.. ఎంతకాలం నుంచి నివసిస్తున్నారన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఏమిటీ సర్వే? భారత పౌరుల ఓటరు నిర్ధారణకు ప్రారంభించిన సర్వే ఇది. ఇందులో 2002 ఓటరు జాబితా 2025 ఓటరు జాబితాను పక్కపక్కన పెట్టుకుని వివరాలు సరిపోలుస్తూ.. స్థానికంగా ఓటర్లు నివసిస్తున్నారా? లేదా.. ప్రస్తుత డేటాతో పాత డేటా మ్యాచ్అవుతుందా లేదా చూస్తున్నారు. దీన్ని మ్యాపింగ్ అని పిలుస్తున్నారు. 2002, 2025 ఓటర్ల జాబితాలో (రెండింటిలో) పేర్లు ఉన్నవారు మొదటి కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేకుండా 1987కు ముందు జన్మించిన వారు రెండో కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేని , 1987 నుంచి 2004కు మధ్యలో పుట్టిన వారు మూడో కేటగిరీగా, 2004 తరువాత జన్మించిన వారు నాలుగో కేటగిరీగా విభజించారు. ఉదాహరణకు 2002లో దంపతులకు ఓటు ఉందనుకోండి. వారికి పుట్టిన పిల్లలకు, వారి మనవలకు ఓటుపై ఎలాంటి వివాదం ఉండదు. ఇలాంటి ఓట్లను వివాదం లేని గ్రీన్ కేటగిరీలో వేస్తున్నారు. ఇందుకోసం పాత పోలింగ్ స్టేషన్, ఓటు నంబర్లను పోల్చి చూస్తున్నారు. వాటి ఆధారంగా పురుషులు, సీ్త్రలు, ట్రాన్స్జెండర్ల వివరాలను అప్డేట్ చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా ఓటర్ల వివరాలు నియోజకవర్గం ఓట్లు కరీంనగర్ 3,68,166చొప్పదండి 2,35,849మానకొండూరు 2,26,385హుజురాబాద్ 2,52,351రామగుండం 2,19,723మంథని 2,39,699పెద్దపల్లి 2,57,192కోరుట్ల 2,48,270జగిత్యాల 2,39,114ధర్మపురి 2,33,182సిరిసిల్ల 2,23,115వేములవాడ 2,13,284 ఆందోళన ఏమిటి? ఓటర్ల తనిఖీలో భాగంగా 2002లో ఉన్న ఇంటి పెద్దలు 2025లో ఉన్నారా? వారి పిల్లలు, మనవల పేర్లు చూస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, నేటి గ్లోబలైజేషన్ కాలంలో స్థిర నివాసాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవనోపాధి, వలసలు, వివాహా లు తదితరతో పలు కుటుంబాలు రెండు, మూ డు దశాబ్దాల్లో పలు చిరునామాలు మార్చాల్సి వస్తోంది. స్థానచలనంతో ఇళ్లు మారిన వారిలో ఆందోళన మొదలైంది. ఇలాంటి వారి ఓట్ల విషయంలో ఓటర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు అయి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి పేర్లు 2002 జాబితాలో సరిపోల్చే సమయంలో తమ ఓటర్లు మిస్సవుతాయని ఆందోళన చెందుతున్నారు. చాలామంది కూలీలు తమ పాత పోలింగ్ స్టేషన్, ఇంటి నంబరు వివరాలు చెప్పలేకపోతున్నారు. ఉమ్మ డి జిల్లాకు ఉన్న మరో ప్రత్యేకత సింగరేణి గనులు. ఇక్కడ పదవీ విరమణ పొందిన వేలాది మంది కార్మికులు ఉన్నారు. వీరిలో పావు వంతు రెండు పేర్లు కలిగి ఉన్నారు. వీరి ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొంది. ఈ వివరాలపై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నిచంగా అందుబాటులోకి రాలేదు. ఎస్ఐఆర్ సర్వే అనుకున్నంత వేగంగా కాకుండా వడివడిగానే సాగుతోంది. ఇప్పటివరకు కరీంనగర్లో 20 శాతం, పెద్దపల్లిలో 18 శాతం, జగిత్యాలలో 19 శాతం, సిరిసిల్లలో 16శాతం మేర పూర్తయింది. -
నాన్నా... నాకూ ఆడుకోవాలనుంది
కరీంనగర్: తన తోటి పిల్లలు ఆడుకుంటుంటే ‘నాన్నా.. నాకు కూడా ఆడుకోవాలని ఉంది’.. అన్న ఓ చిన్నారి మాటలు.. ఆ తండ్రి గుండెను పిండేశాయి. ఆ మాటలకు మౌనంగా రోదించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఇది ఒక్క రోజు వేదన కాదు.. ఆ బిడ్డను చూస్తున్న ప్రతిసారి ‘నేనేమీ చేయలేకపోతున్నానే’ అని ఆ తండ్రి ఆవేదన. పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బాలికకు ఆపరేషన్ కోసం రూ.6 లక్షలు అవసరం ఉంది. హమాలీ కార్మికుడైన తండ్రి తన శక్తి మేర చికిత్స చేయిస్తున్నా, దాతల సాయం కోసం ఎదురుచూడడం తప్ప తను అంత ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. వివరాలు.. కరీంనగర్లోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన హమాలీ కార్మికుడు మోతె హరీశ్, శ్రీలత దంపతుల జీవితం నిత్య పోరాటం. రోజూ కష్టపడితే తప్ప కడుపునిండని దుస్థితి. ఈ పేదరికానికి తోడు పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో జన్మించిన తమ పెద్ద కుమార్తె సిరిచందన (14)ను కంటికి రెప్పలా పెంచుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, 12 ఏళ్లు వచ్చే వరకు శస్త్రచికిత్స సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. అయితే తోటి పిల్లలలాగే తాను లేననే బాధతో ఆ చిన్నారి పాఠశాలకు సైతం సరిగా వెళ్లలేకపోతుంది. 12 ఏళ్ల వయసు పూర్తయినా ఆపరేషన్కు కావాల్సిన లక్షల రూపాయల ఖర్చు వారికి అడ్డంకిగా మారింది. ఆపరేషన్కు వైద్యులు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. పేదరికంలో జీవిస్తున్న ఆ కుటుంబానికి అది తలకు మించిన భారమే. అయినా తండ్రి వెనకడుగు వేయలేదు. చిన్నారి చికిత్స కోసం అప్పులు చేస్తూ, సాయం కోసం తలుపు తడుతూ ముందుకు సాగుతున్నాడు. ప్రజాప్రతినిధుల వద్దకూ వెళ్లినా ఇప్పటివరకు ఆశించిన స్పందన ఎక్కడా రాలేదు. రెండేళ్లుగా ‘ఎవరైనా దయగల హృదయులు స్పందిస్తారా?’ అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. తన కూతురు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే చూడాలన్న తండ్రి కల ఇంకా కలగానే ఉంది. చిన్నారి భవిష్యత్తు ఒక శస్త్రచికిత్సపై ఆధారపడి ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి స్పందన ఆమెకు కొత్త జీవితం ఇవ్వగలదు. దాతలు చేసే సాయం బాలిక జీవితాన్ని నిలబెట్టగలదు. స్పందించే దాతలు 99480 55713 నంబర్కు ఫోన్పే/గూగుల్ పే ద్వారా లేదా ఫోన్లోనైన తమను సంప్రదించాలని హరీశ్ వేడుకుంటున్నాడు. బాలికకు పుట్టుకతో వెన్నెముక సమస్య శస్త్ర చికిత్స కోసం చిన్నారి ఎదురుచూపు -
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేయాలి
ధర్మపురి: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మండలంలోని జైనా పీఏసీఎస్ పరిధిలోని దమ్మన్నపేట, రాజారం, నక్కలపేటలోని కొనుగోలు కేంద్రాలను నవంబర్ 21న అడిషనల్ కలెక్టర్ లత సందర్శించారని, ఆ సమయంలో రైతుల నుంచి సన్నరకం కొని దొడ్డు రకం కొన్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టి సీఈవోను మాత్రమే సస్పెండ్ చేసినా అసలు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సన్నాలకు బదులు.. దొడ్డు రకం అని రైతులకు ట్రక్షీట్స్ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై ధర్మారం మండలానికి చెందిన ఓ రైస్మిల్లర్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ జరిపి సీఈవోను సస్పెండ్ చేసి అసలు కారకులను వదిలిపెట్టారని వివరించారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను కోరారు. బీఆర్ఎస్ నాయకులు అయ్యోరి రాజేష్, సంగి శేఖర్, వొడ్నాల మల్లేశం, తరాల కార్తీక్, చిలువేరు శ్యామ్, అయ్యోరి వేణుగోపాల్, బండారి రంజిత్, అశోక్ ఉన్నారు. -
గదుల నిర్మాణానికి స్థల పరిశీలన
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆల య పరిసరాల్లో 96 గదుల సత్రం నిర్మాణానికి రూ.35.19కోట్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఇంజినీరింగ్ అధికారులు కొండగట్టులో స్థల పరిశీలన చేశారు. ఆలయ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, భవన నిర్మాణంపై చర్చించారు. కొండగట్టులో 96గదుల సత్రం భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసినట్లు ఇంజినీర్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, అధికారులు పాల్గొన్నారు. చలితీవ్రతకు వ్యక్తి మృతి రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని ఏ–పవర్హౌస్ చమన్ పరిసరాల్లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి చలితీవ్రతకు మృతిచెంది ఉంటాడని భాస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకుడు సలీంబేగ్ తెలిపారు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంధ్యారాణి శనివారం ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఉంటే 87126 56525 నంబరుకు ఫోన్చేసి సమాచారం అందించాలని ఎస్సై కోరారు. లారీ ఢీకొని ఒకరు..కోరుట్ల: కోరుట్ల బస్టాండ్ ఇన్గేట్ సమీపంలో రోడ్డు దాటుతుండగా లా రీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై చిరంజీ వి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన దశరథ్ సోనాజి ఉసరె శనివారం బస్టాండ్ ఇన్ గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో దశరథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన ఆయన కొంతకాలంగా కోరుట్లలో ప్లంబింగ్ పని చేస్తున్నాడు. బంధువుల ఫిర్యాదుమేకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడు.. సిరిసిల్లక్రైం: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ అలీ(70) అనేడు వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. పాతబస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తున్న మహబూబ్ అలీని బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మహబూబ్ అలీ మృతి చెందాడని అతని కుమారుడు రషీద్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాపీమేస్త్రీ ఆత్మహత్యసిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రానికి చెందిన తాపీమేస్త్రి చిద్రాల రవీందర్(45) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే వివాహాలు జరగగా, కుటుంబ పోషణకు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతోపాటు మరో కూతురి వివాహం ఎలా చేయాలనే ఆలోచనలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈక్రమంలోనే తాను మేస్త్రిగా పనిచేస్తున్న ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య లత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అదృష్టంగా భావిస్తున్నా
రామగుండం: అంతర్గాం మండలం విసంపేట సర్పంచ్ దారవేణి సాయికుమార్ వయసు 24ఏళ్లు. తను పుట్టిన ఏడాదిలోపే తల్లి, ఐదేళ్ల క్రితం తండ్రిని కోల్పోయాడు. సోదరుడి పెంపకంతో ప్రయోజకులయ్యారు. ఎంబీఏ (హెచ్ఆర్) పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం సర్పంచ్గా గెలిచాడు. తల్లిదండ్రుల ఆప్యాయతలకు నోచుకోలేదని, అయినా వందలాది మంది గ్రామస్తులు తనపై ప్రేమాభిమానాలు చూపి సర్పంచ్గా ఎన్నుకున్నారని తెలిపారు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్న తనకు ఊహించని విధంగా సర్పంచ్ పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. -
బీసీల
● స్థానిక సమరంలో సత్తా ● 600 జనరల్ స్థానాల్లో 329 చోట్ల గెలుపు ● ఎస్సీ, ఎస్టీలు కూడా జనరల్ స్థానాల్లో గెలిచిన వైనం ● పల్లెల్లో మారుతున్న రాజకీయ ముఖచిత్రంవిజయబావుటాపెద్దపల్లిజగిత్యాలసిరిసిల్లకరీంనగర్సాక్షి పెద్దపల్లి/జగిత్యాల: ‘బీసీల ఓటు బీసీలకే’ అన్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన కులాల అభ్యర్థులు సత్తా చాటారు. బలహీన వర్గాలకు కేటాయించిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లోనూ విజయాబావుటా ఎగురవేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఆ మేరకు ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఆ రిజర్వేషన్లను రద్దు చేసి 50 శా తం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని కోర్టు సూ చించింది. స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం.. మూ డుదశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. పెరిగిన చైతన్యం, బీసీ నినాదం విస్తరించడంతో జనరల్స్థానాల్లోనూ బీసీలు బరిలో నిలిచి గెలుపొందారు. జనరల్లోనూ పాగా ఉమ్మడి జిల్లాలో బీసీలకు కేటాయించిన 297 స్థానాలతోపాటు అదనంగా 600 జనరల్స్థానాల్లో బీసీలు పోటీచేసి 329 చోట్ల విజయం సాధించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించిన 1,226 పంచాయతీల్లో 51.06 శాతం సీట్లను బీసీలే దక్కించుకున్నట్లు అయ్యింది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో బీసీలు జనరల్స్థానాల్లో గెలుపొందగా, తర్వాతి స్థానాల్లో కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీలు సైతం జనరల్ స్థానాల్లో పోటీచేసి విజయం సాధించడం గమనార్హం. మంథని డివిజన్లోని జనరల్ స్థానాల్లో ఇద్దరు ఎస్సీలు, అంతర్గాం జనరల్లో ఒక ఎస్సీ మహిళ విజయం సాధించగా, పెద్దపల్లిలో ఒకరు, అంతర్గాంలో ఒక ఎస్టీ గెలుపొందారు. గత ఎన్నికలతో పోల్చితే తక్కువే.. ● 2019 పంచాయతీ ఎన్నికల్లో పెద్దపల్లిలోని 263 పంచాయతీల్లో 68 సీట్లు బీసీ స్థానాలతోపాటు, జనరల్స్థానాల్లో మరో 74మంది బీసీలు గెలుపొందారు. మొత్తంగా 142మంది విజయం సాధించారు. ● సిరిసిల్ల జిల్లాలోని 252 పంచాయతీల్లో 56 బీసీ రిజర్వ్ సీట్లతోపాటు జనరల్లో 80 మంది గెలవడంతో మొత్తంగా 136 మంది బీసీలు గెలిచినట్లయ్యింది. ● కరీంనగర్ జిల్లాలోని 313 పంచాయతీల్లో బీసీలకు కేటాయించిన 74 సీట్లతోపాటు జనరల్లో 120 మంది గెలుపొందగా బీసీలకు మొత్తంగా 194 సీట్లు దక్కాయి. ● జగిత్యాల జిల్లాలోని 379 గ్రామ పంచాయతీల్లో 94 బీసీ స్థానాలతోపాటు జనరల్లో బీసీలు 185 చోట్ల విజయం సాధించి మొత్తంగా చూసుకుంటే 279 మంది బీసీలు సర్పంచ్ కిరీటాలు దక్కించుకున్నారు. ● మొత్తంగా ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే.. గతంలో 751 మంది బీసీ సర్పంచులు కుర్చీ దక్కించుకుంటే.. ఈసారి 626 మంది బీసీలే సర్పంచులుగా ఎన్నికయ్యారు. గతంలో పోల్చితే బీసీల ప్రాతినిధ్యం తగ్గినట్లయ్యింది.గతంలో జనరల్ స్థానాల్లో ఓసీలు మాత్రమే పోటీచేయాలనే అపోహ ఉండేది. దీనికితోడు జనరల్లో పోటీ చేయాలంటే ఓసీలకు ఉండే డబ్బు, పలుకుబడితో బీసీలు పోటీపడేవారు కాదు. పెరిగిన రాజకీయ చైతన్యం, బీసీ నినాదంతోపాటు, అధికార వ్యవస్థలపై అవగాహన పెరగడం, బీసీల్లో చదువుకున్న వారిసంఖ్య అధికం కావడం, ఖర్చుకు కూడా వెనుకాడని పరిస్థితులు రావడం, చాలాగ్రామాల్లో కొన్నేళ్లుగా పాతుకుపోయిన పెత్తందారీ వ్యవస్థకు చెక్పెట్టేలానే భావన బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాల్లో రావడంతో చాలాచోట్ల జనరల్ అభ్యర్థులను ఢీకొట్టి బీసీ నేతలు విజయం సాధించారు. ఇదే ఒరవడిని కొనసాగించి వచ్చే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటుతామని ఆ పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.గెలిచినవి మొత్తంజనరల్లో బీసీలుబీసీరిజర్వ్ -
క్షీరాభిషేకం, పుష్పాలంకరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం చేసి పూలతో అలంకరించారు. ప్రసూతి సేవలు పెంచాలిపెగడపల్లి(ధర్మపురి): ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసూతి సేవలు పెంచాలని జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్రెడ్డి సూచించారు. శుక్రవారం పెగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. బీపీ, మధుమేహం, క్యాన్సర్ తదితర వాధ్యులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరై మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వైద్యాధికారి నరేశ్, సీహెచ్వో సందీప్, సిబ్బంది పాల్గొన్నారు. కూరగాయల రైతులకు ప్రోత్సాహకంజగిత్యాలఅగ్రికల్చర్: కూరగాయలు సాగు చేసే రైతులకు ఉద్యానశాఖ తరుఫున ప్రోత్సాహకాలు అందిస్తామని జిల్లా ఉద్యానశాఖాధికారి గడ్డం శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో పాలెపు వసంత 10 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తుండగా, శుక్రవారం పంట పొలాలను జిల్లా ఉద్యానశాఖాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, డ్రిప్, మల్చింగ్ పద్ధతిలో బీర, టమాట, కాకర, సోర, దోస వంటి కూరగాయలు సాగు చేస్తుండడం అభినందనీయమన్నారు. కూరగాయలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ఖర్చుల కోసం ఎకరాకు రూ.9,600 సబ్సిడీ ఇస్తున్నట్లు వివరించారు. జగిత్యాల నియోజకవర్గ ఉద్యానశాఖాధికారి కె.స్వాతి, ఉద్యాన విస్తరణ అధికారి అనిల్, రైతులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికకథలాపూర్(వేములవాడ): మండలంలోని గంభీర్పూర్ జెడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థులు మ్యాకల వర్షిత్, మెట్టు గీతాంజలి జాతీయస్థాయి అత్య పత్య పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం సుధాకర్రెడ్డి శుక్రవారం తెలిపారు. చంఢీఘర్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో మన రా ష్ట్ర జట్టు తరుఫున పాల్గొంటారని పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులను అత్య పత్య క్రీడల జిల్లా అధ్యక్షుడు వాసం నవీన్కుమార్, కార్యదర్శి రాజేశ్, రవీందర్ అభినందించారు. నక్షతో భూముల లెక్క పక్కాజగిత్యాల: భూములకు పక్కాగా లెక్కలుండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద జగిత్యాల మున్సిపాలిటీ ఎంపికై ంది. గతంలోనే ఈ కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా జాప్యం జరిగింది. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నక్ష కార్యక్రమంతో భూములకు రక్షగా ఉంటుందని, డ్రోన్లతో చిత్రీకరించి ప్రతి ఒక్క ఆస్తికి అక్షాంశాలు, రేఖాంశాలు గుర్తించడం జరుగుతుందన్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఐ విఠల్ పాల్గొన్నారు. -
ఆస్తి పన్ను కట్టం
కోరుట్ల: ఐదేళ్ల క్రితం కోరుట్లలో విలీనమైన ఎఖీన్పూర్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని నిరసన తెలుపుతూ గ్రామస్తులు మున్సి పల్ పన్ను కట్టేందుకు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం పన్ను వసూలు కోసం విలీన గ్రామానికి మున్సిపల్ ఉద్యోగులు వెళ్లిన సందర్భంగా ఈ విషయమై నిలదీశారు. ఐదేళ్లుగా మున్సిపాల్టీకి ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లి స్తున్నా, అభివృద్ధి కోసం నిధుల కేటాయింపులో వి వక్ష కనిపించిందని గ్రామానికి చెందిన శంకర్ అన్నారు. పంచాయితీగా ఉన్నప్పుడు పన్ను తక్కువగా ఉండేవన్నారు. మున్సిపల్ పరిఽధిలోకి రావడంతో పెద్ద మొత్తంలో పన్ను కడుతున్నామని, అయినా ఎలాంటి ప్రగతి కనిపించడం లేదన్నారు. ఇప్పటికై నా గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణానికి నిధులు కేటాయించాలని, లేకుంటే పన్ను చెల్లింపులో నిరాకరణ కొనసాగిస్తామని యువజన సంఘాల ప్రతినిధి జాగిలం భాస్కర్ తెలిపారు. -
కొత్తదనం.. సమస్యల స్వాగతం
జగిత్యాల: పదిహేను రోజుల పాటు రసవత్తరంగా సాగిన గ్రామపోరు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 385 పంచాయతీలు, 3,536 వార్డులకు ఎన్నికలు పూర్తయ్యాయి. చిన్న గ్రామాల్లో రూ.5లక్షల నుంచి 10 లక్షలు, మేజర్ పంచాయతీల్లో రూ.80 లక్షల వరకు ఖర్చు పెట్టి ఎలాగోలా పదవులను దక్కించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోటీ తీవ్రంగా నెలకొంది. అప్పుడు బరిలో ఉన్న అభ్యర్థులు అనుభవపూర్వకంగా చాలా మంది తప్పుకున్నారు. కొందరు ఖర్చులకు భయపడి, మరికొందరు తెచ్చిన అప్పులు తీర్చకపోగా, గత ప్రభుత్వంలో బిల్లులు రాకపోవడంతో చాలా మంది పోటీలో నిలవలేదు. దీంతో చాలా మంది కొత్తవారు బరిలో నిలిచారు. జిల్లాలో 385 సర్పంచ్ స్థానాలకు గాను దాదాపు 90 శాతం కొత్తవారే గెలుచుకున్నారు. కొన్ని చోట్ల గతంలో భర్తలు పోటీ చేసిన స్థానంలో మహిళలకు రిజర్వేషన్ రావడంతో భార్యలను నిలబెట్టి ఐదు శాతం మాత్రం గెలిపించుకున్నారు. పాత స్థానాల్లో నిలబడి గెలిచిన వారు ఐదు శాతం వరకు ఉంటారు. గ్రామాల్లో మార్పు వచ్చేనా.. జిల్లాలోని పంచాయతీల్లో కొంత కొత్త, పాతవారు ఉన్నా తొలిసారి ఎన్నికై నవారే అత్యధికంగా సర్పంచులు ఉన్నారు. 90 శాతం గెలిచిన కొత్తవారిలో ఎక్కువగా యువత, మహిళలున్నారు. గ్రామ బాగోగులు చూడటంతో పాటు, ప్రతీ సమస్యపై స్పందించాల్సిన బాధ్యత సర్పంచులపై ఉంటుంది. రెండు నెలలకోసారి పాలకవర్గం సమావేశం నిర్వహించుకోవడం, గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి కోసం కృషి చేయాల్సి ఉంటుంది. రైతులను సంఘటితం చేస్తూ పంటల సాగుపై అధి కారులతో కలిసి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా గ్రామాల్లో డ్రెయినేజీలు, పారిశుధ్యం ప్రతీ స ర్పంచ్, వార్డు సభ్యులు దృష్టి సారించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పల్లెల్లో ఆదాయ వనరులపై దృష్టి పెట్టి పంచాయతీకి ఆదాయం పెంచుకునేలా ఈ నూతన సర్పంచులు బాధ్యతలు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వచ్చినప్పటికీ అవి జనాభాను బట్టి విడుదలవుతాయి. పాలకవర్గాల తీర్మానంతోనే పనులు చేపట్టాలి. సవాళ్లే అధికం గ్రామ పంచాయతీలను రెండేళ్లుగా నిధుల కొరత వేధిస్తోంది. ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులకు గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పంచాయతీ ఖాతాల్లో నిధులు అందుబాటులో లేవు. రెండుళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది. ముఖ్యంగా కోతులు, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో పాఠశాలలు శిథిలావస్థలో ఉండడం, టాయిలెట్స్ లేకపోవడం, సరైన బెంచీలు, కరెంట్ లేక చాలాచోట్ల ఇబ్బందులున్నాయి. గత ప్రభుత్వంలో మన ఊరు– మన బడి పథకం కింద మరమ్మతులు చేసినా ఆశించిన స్థాయిలో పూర్తి కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి మరమ్మతులు చేపట్టారు. కొత్త సర్పంచులు వాటిపై శ్రద్ధపెట్టి పనులు పూర్తి చేయాల్సిన అవసరముంది. అలాగే గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తదితర సమస్యలపై చర్యలు తీసుకోవాలి. -
ప్రజాపాలనకు నిదర్శనం
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుజగిత్యాల: పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్లో మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేయడం జరిగిందన్నారు. జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలవడం ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో దోచుకోవడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరిట దోచుకున్నారని ఆరోపించారు. రెండేళ్లలో ఏ సీఎం చేయని పనులు సీఎం రేవంత్రెడ్డి చేశారని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికల ప్రక్రియలో అనేక ఇబ్బందులు పెట్టేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాఫీగా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగిందని, ఎలాంటి భయాందోళనకు గురిచేయలేదన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంక్షేమశాఖ మంత్రిగా ఉండి ఒక్క హాస్టల్కు పక్కా భవనం నిర్మించలేదన్నారు. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ధర్మపురిలో బస్డిపో, డివిజన్ కేంద్రం ఇలా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. మాజీ మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడొద్దని హెచ్చరించారు. రోళ్లవాగుపై సీఎం దృష్టికి తీసుకెళ్లి అటవీశాఖ అనుమతితో గేట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.60 కోట్ల ప్రాజెక్ట్ పనిని రూ.160 కోట్లకు పెంచేలా మాజీమంత్రి చూశారని ఆరోపించారు. హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి: నందయ్య కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల ఎమ్మెల్యేపై అనవసరపు ఆరోపణలు చేశారని, హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడింది విద్యాసాగర్రావు కాదా అని ప్రశ్నించారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన కోరుట్లలో చేసిందేమీలేదన్నారు. ఇకనైనా జగిత్యాల ఎమ్మెల్యేపై ఆరోపణలు మానుకోవాలన్నారు. -
సమన్వయంతో ఎన్నికలు విజయవంతం
జగిత్యాల: అధికారుల సమన్వయంతోనే పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అన్ని శాఖల అధికారులు కలెక్టర్ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి పూర్తయ్యే వరకు మూడు దశల్లో ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి 2027 జూలైలో గోదావరి పుష్కరాలను కుంభమేళాగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి మాస్టర్ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. లక్షలాది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తారని, తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకే రోజు 2 లక్షల మంది పుష్కరఘాట్లకు తరలివచ్చినా ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి జగిత్యాల మున్సిపాల్టీలో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్ను కోరారు. అభివృద్ధి పనుల్లో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, డబుల్బెడ్రూం వద్ద మౌలిక వసతులు కల్పించేలా చూడాలన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి, డీపీవో రఘువరణ్, ఆర్డీవో మధుసూదన్, కన్నెం హారిణి, మోహన్, కలెక్టరేట్ ఏవో హకీం పాల్గొన్నారు. -
మేడారం జాతరకు 700 బస్సులు
కరీంనగర్టౌన్: వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర కోసం రీజియన్ పరిధిలోని డిపోల నుంచి 700 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. శుక్రవారం బస్స్టేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీజియన్ పరిధిలో గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని డిపోల నుంచి జాతర బస్సులు ఉంటాయని తెలిపారు. ఆరు ఆపరేటింగ్ పాయింట్ల వద్ద అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, ఎంపిక చేసిన బస్సులకు అవసరమైన మరమ్మతులు, జాతర విధులు నిర్వర్తించే సిబ్బంది ఎంపిక, భక్తుల సురక్షిత ప్రయాణం తదితర అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్. భూపతి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు నాగభూషణం, వెంకన్న, రవీంద్రనాథ్, విజయమాధురి, ఎం.శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, కె. కల్పన, ఎస్.మనోహర్, దేవరాజు, ప్రకాశ్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘పంచాయతీ’ కిక్కు
జగిత్యాలక్రైం: స్థానిక సంస్థలు అంటేనే పల్లెల్లో హంగామా ఉంటుంది. దీనికి తోడు పోటీచేసిన ప్రతీ అభ్యర్థి ఓటరును ప్రలోభ పెట్టేలా మందుతో పాటు, విందులు, నగదు పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో మద్యం లేనిదే గ్రామాల్లో ప్రచారం, సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు జనం రారు. ఈనేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన ప్రతీ అభ్యర్థి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి ఓటర్లకు పంపిణీ చేస్తూ తమ ఓటును వేయించుకునేలా ప్రలోభపెట్టారు. 17 రోజుల్లో రూ.42.67 కోట్ల అమ్మకాలు జిల్లాలో 385 గ్రామపంచాయతీలు, 3,536 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు భారీగా మద్యం కొనుగోలు చేసి ఓటర్లకు పంపకాలు చేపట్టారు. దీంతో కేవలం ఈనెలలో 17 రోజుల్లో రూ.42,67,39,850 అమ్మకాలు జరిగాయి. నవంబర్తో పాటు, డిసెంబర్లో భారీగా మద్యం విక్రయించారు. దీంతో కొత్త దుకాణదారులకు స్థానిక ఎన్నికల సందడితో భారీగా వ్యాపారం జరిగింది. గతేడాది విక్రయాలు.. గత సంవత్సరం 2024 నవంబర్లో లిక్కర్ బాక్స్లు 50,073, బీర్ బాక్స్లు 1,31,761 విక్రయించారు. మొత్తం రూ.36,31,69,739 విక్రయాలు చేపట్టారు. అలాగే డిసెంబర్లో లిక్కర్ బాక్సులు 64,640, బీర్ బాక్స్లు 1,34,653 విక్రయించారు. మొత్తం రూ.50,18,41,471 విలువ గల మద్యం విక్రయించారు. నవంబర్, డిసెంబర్లో 17 రోజుల్లోనే.. ప్రస్తుతం నవంబర్లో జిల్లాలో 54,712 లిక్కర్ బాక్స్లు, 98,759 బీర్ బాక్స్లు విక్రయించారు. వీటి ద్వారా రూ.43,29,58,258 ఆదాయం సమకూరింది. అలాగే డిసెంబర్ 1 నుంచి 17 వరకు 50,700 లిక్కర్ బాక్స్లు, 71,202 బీర్బాక్స్లు విక్రయించగా రూ.42,67,39,850 ఆదాయం సమకూరింది. దీంతో ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. -
వేడినీళ్లు.. నోరూరించే టిఫిన్లు
పెద్దపల్లిరూరల్: గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సిబ్బంది వసతి, సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నారు. పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విధులను నిర్వహించేందుకు వచ్చిన పోలింగ్ అధికారులు, ఓపీవోలు, మెడికల్, పోలీసు, తదితర సిబ్బందికి అవసరమైన వసతీసౌకర్యాలు మెరుగ్గా కల్పించారు. 85 పంచాయతీల్లో ఎన్నికలు.. జిల్లాలో ఆఖరువిడత పంచాయతీ ఎన్నికల్లో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాల కోసం నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో 128 మంది పోలింగ్ అధికారులు, 166 మంది ఓపీవో తదితర సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను ఆయా కేంద్రాల సమీపంలో కల్పించారు. వణికిస్తున్న చలిలో ఉదయమే స్నానం చేసేందుకు వీలుగా వేడినీటిని కూడా అందించారు. నోరూరించే అల్పాహారం, రుచికరమైన భోజనం అందించినట్లు పలువురు ఎన్నికల సిబ్బంది చెప్పారు. ఏర్పాట్లపై కొందరిని పలుకరించగా.. కడుపునిండా రుచికరమైన భోజనం ఎన్నికల విధుల నిర్వహణ తృప్తినిచ్చింది పోలింగ్, లెక్కింపు కేంద్రాల్లో సౌకర్యాలు భేష్ స్థానిక అధికారుల సహకారంతో సమస్యలు దూరం ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల మనోగతం -
బుధవారంపేటను స్వాధీనం చేసుకోవాలి
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ ఓసీపీ–2 విస్తరణలో భాగంగా బుధవారంపేట గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం సర్వేకు వచ్చిన సింగరేణి అధికారులను వారు అడ్డుకున్నారు. సుమారు 15ఏళ్లుగా సింగరేణి సంస్థ తమ గ్రామంపై వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. తమ పంచాయతీ పరిధిలోని మొత్తం వ్యవసాయ భూములు, గ్రామాన్ని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుని మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ద్వారా అన్ని వసతులతో కొత్త గ్రామాన్ని నిర్మించి తగిన న్యాయం చేయకుంటే సింగరేణి సంస్థ నిర్వహించే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని సౌకర్యాలు కల్పిస్తేనే సర్వేకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. అప్పటివరకు అధికారులు, సింగరేణికి సహకరించేది లేదని హెచ్చరించారు. చేసేదిలేక సర్వేకు వెళ్లిన అధికారులు వెనక్కి వచ్చేశారు. -
వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని బిర్లా ఓపెన్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది. ఈమేరకు గురువారం స్కూల్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, యూనివర్సిటీ ప్రతినిధి వినోద్లు ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాధారిత విద్యతో పాటు భవిష్యత్ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో వాక్సెన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కలిసి విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో విద్యాబోధన అందుబాటులోకి వస్తుందన్నారు. వాక్సెన్ యూనివర్సిటీ ప్రతినిధి వినోద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. బిర్లా స్కూల్ అమలు చేస్తున్న విద్యాప్రమాణాలు, వినూత్న కార్యక్రమాలను అభినందించారు. -
15ఏళ్ల బాలుడికి బ్లడ్ కేన్సర్ నుంచి విముక్తి
కరీంనగర్: కరీంనగర్కు చెందిన 15ఏళ్ల బాలుడు బ్లడ్ కేన్సర్తో బాధపడుతుండగా సోమాజిగూడ యశో ద హాస్పిటల్స్లో అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించినట్లు హెమటో– అంకాలజీ– బీఎంటీ వైద్యుడు కె.అశోక్కుమార్ తెలిపారు. ప్రస్తు తం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. గురువారం కరీంనగ ర్ యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్లోని హెమటాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో లుకేమి యా, లింఫోమాస్, మల్టీపుల్ మైలో మా, అప్లాస్టిక్ అనీమియా, తలసే మియా, సికిల్ సెల్ డిసీజ్ వంటి కేన్సర్, రక్త రుగ్మతలకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో ఇప్పటివరకు 400కు పైగా విజయవంతమైన బీఎంటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి హెమటాలజీ సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. -
తెలుగులో తీర్పుతో గుర్తింపు
1986 నుంచి కరీంనగర్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే 1992లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలో విజయం సాధించారు గొట్టె రవీందర్. ఆదిలాబాద్, సిర్పూర్, వరంగల్లో విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై సీనియర్ ఏపీపీగా నర్సంపేటలో బాధ్యతలు నిర్వహిస్తూ 2004లో తిరిగి జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. కర్నూలు, డోన్లో పనిచేశారు. సీనియర్ సివిల్ జడ్జిగా 2013లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, నాంపెల్లి కోర్టులో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. తెలుగులో తీర్పునిచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. – గొట్టె రవీందర్, విశ్రాంత న్యాయమూర్తి సేవ చేయాలన్న సంకల్పంతో... విద్యార్థి దశ నుంచే నెహ్రూ యువకేంద్రం ద్వారా సామాజిక సేవలపై ఆసక్తి పెరిగింది ఆసాని జయశ్రీకి. టీచర్గా పనిచేసిన తండ్రి రాజారెడ్డి స్వచ్ఛంద సేవలే స్ఫూర్తిగా న్యాయవిద్యను పూర్తి చేశారు. 1996లో న్యాయవాదిగా నమోదై.. మెట్పల్లిలో నాలుగేళ్లపాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం కుటుంబంతోపాటు కరీంనగర్కు షిఫ్ట్ అయ్యారు. స్థానికసంస్థల్లో సర్పంచ్లు, వార్డుసభ్యులకు పలు మార్లు శిక్షణ ఇచ్చారు. జ్యుడీషియల్ శాఖలోకి 2015లో అడుగుపెట్టి పెద్దపల్లి, కరీంనగర్, ప్రస్తుతం సిరిసిల్లలో విధులు నిర్వహిస్తున్నారు. – ఆసాని జయశ్రీ, స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ -
వకీల్పల్లి
తంగళ్లపల్లి నుంచి అనేక మంది న్యాయవాదులుగా రాణిస్తున్నారు. దోర్నాల లక్ష్మారెడ్డి న్యాయవాద వృత్తిలో ఉంటూనే టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో క్రియాశీల రాజకీయ నాయకుడిగా కొనసాగారు. పాతికేళ్ల క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా సేవలందించారు. ప్రస్తుతం సబ్బని రవీందర్, కోడం సత్యనారాయణ, కోడం సురేశ్, దోర్నాల సంజీవ్రెడ్డి, దోర్నాల జనార్దన్రెడ్డి, కోడి లక్ష్మణ్, సబ్బని రమేశ్ (కరీంనగర్), బండి చైతన్యగౌడ్, ిసీనియర్ న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. ఇటీవల పలువురు జూనియర్ న్యాయవాదులు తక్కళ్ల సారిక, సుహాసిని, వినీత, ఆకుల శ్రీనివాస్, బొల్లారం ప్రదీప్, గజభీంకార్ సృజన, పసుల వంశీ ఇటీవలనే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాణించిన న్యాయవాదులు -
పూత ఇంకా రాలేదు
మామిడి తోటలో ఇంకా పూత రాలేదు. పూత వస్తుందనే ఆలోచనలతో తోటలో ఇప్పటికే ఎకరాకు రూ.20వేల వరకు ఖర్చు పెట్టి.. అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించాను. పురుగుమందులు కూడా పిచికారీ చేయించాను. మూడేళ్లుగా పూత లేదు. ఈ సారి ఏమి చేస్తుందో చూడాలి. – సాయిరెడ్డి, సింగరావుపేట, రాయికల్(మం) గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం మామిడి పూతపై ప్రభావాన్ని చూపుతాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతోపాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పూత వచ్చే అవకాశం ఉంది. పూత సమయంలో తోటలో ఎలాంటి పనులు చేయవద్దు. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి -
60 ఏళ్ల ప్రాక్టీస్
వైద్య ఉమాశంకర్ ఊరిలో తొలి న్యాయవాది. 1965 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మక్తల్ తహసీల్దార్గా వ్యవహరించిన తండ్రి వీరప్ప తన ఆరేళ్ల వయసులో కన్నుమూశారు. ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు, పురిటిగడ్డను వీడకుండా న్యాయవాద వృత్తిని ఎంచుకుని సివిల్ కేసుల్లో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. నిరంతర శ్రమతో సామాన్యులకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో సాధన చేస్తే మంచి అడ్వకేట్గా మారొచ్చు అనేది ఈ తరానికి ఆయన ఇచ్చే సందేశం. – వైద్య ఉమాశంకర్ ఉద్యమస్ఫూర్తితో.. 1988లో న్యాయవాదిగా నమోదై.. ఆరేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1994 మేలో పీపీగా, జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. నంద్యాలలో తొలి పోస్టింగ్. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ న్యాయమూర్తుల సంఘాన్ని స్థాపించి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉద్యమాలకు నేతృత్వం వహించారు. పదేళ్లపాటు హైకోర్టు ఉమ్మడిగా ఉండాలన్న నిర్ణయంపై.. న్యాయవ్యవస్థ కూడా వేరుపడాలని 2015లో సుప్రీంకోర్టులో రిట్వేశాం. 2016లో 250 మంది న్యాయమూర్తులు కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో సస్పెన్షన్కు గురయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు, అప్పటి గవర్నర్ చొరవతో నెల రోజుల తరువాత సస్పెన్షన్ ఎత్తేశారు. తీవ్రమైన న్యాయ సంక్షోభాన్ని సృష్టించడంతో రెండు నెలల్లో న్యాయవ్యవస్థను విభజించాలంటూ 2018 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 2019లో అమలులోకి వచ్చింది. 2024 జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. – వైద్య వరప్రసాద్, విశ్రాంత న్యాయమూర్తి -
మామిడి పూత.. రైతుల్లో చింత
జగిత్యాలఅగ్రికల్చర్: ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితులు మామిడికి ప్రతికూలంగా మారుతున్నట్లు కనబడుతున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో రావాల్సిన మామిడి పూత ఇప్పటికీ ఇంకా చెట్లపై కనబడటం లేదు. పూత వస్తుందనే ఆలోచనలతో ముందుగానే తెగుళ్లు, పురుగులు ఆశించకుండా మామిడితోటల్లో రైతులు రసాయన ముందులు పిచికారీ చేస్తున్నారు. కొన్ని రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండటం.. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటుండటం మామిడి రైతులకు కొంత ఆందోళనకరంగా మారుతోంది. 37 వేల ఎకరాల్లో మామిడి సాగు జిల్లాలో దాదాపు 37 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మామిడి మార్కెట్ ఉండటం.. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు నేరుగా ఢిల్లీ వంటి నగరాలకు తరలించడం.. తోటలను లీజుకు తీసుకున్న వ్యాపారులు కూడా పెరగడంతో మామిడికి మంచి రేటు వస్తుందని రైతులు ఆశపడ్డారు. ఈ క్రమంలో ఐదేళ్లలో మామిడితోటల విస్తీర్ణం కూడా బాగానే పెరిగింది. అయితే నాలుగేళ్లుగా మామిడికి పూత రాకపోవడం, పూత వచ్చినా నిలవకపోవడం.. విపరీతంగా తేనేమంచు పురుగు ఆశించడంతో రైతుకు ఏ మాత్రం దిగుబడులు రాలేదు. దీంతో కొంతమంది రైతులు ఇప్పటికే మామిడి తోటలను తొలిగించారు. మరికొంత మంది రైతులు ఈ ఏడాది పంట దిగుబడి బట్టి నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. మామిడి పూతకు సమయమిదే మామిడి పూత సాధారణంగా నవంబర్ చివరి నుంచి ప్రారంభమై డిసెంబర్, జనవరి మొదటి వారం వరకు వస్తుంటుంది. మామిడి సాగులో 8 నెలల పాటు చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తైతే.. పూత నుంచి కోత వరకు నాలుగు నెలల పాటు యాజమాన్య పద్ధతులు మరో ఎత్తు. ఇప్పటికే ఎకరాకు రూ.20వేల విలువ గల రసాయన మందులను రైతులు పిచికారీ చేశారు. రెండేళ్లుగా వర్షాలు సెప్టెంబర్, అక్టోబర్ వరకు కురవడంతో భూమి తేమతో కూడి ఉంది. దీనికి తోడు వాతావరణంలో మార్పులు ఏర్పడి పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీగా వ్యత్యాసం ఉండటం కూడా పూతపై ప్రభావం చూపిస్తోంది. పూత విచ్చుకునే దశలో చలి ప్రభావంతో పాటు తుపాన్ల ప్రభావంతో పొడి వాతావరణం ఉండటం లేదు. గతేడాది ఆలస్యంగా పూతరావడం, పూత వచ్చే సమయానికి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేడి వాతావరణంతో పూత సగం రాలిపోయింది. తేమ వాతావరణం ఉండటంతో తేనేమంచు పురుగు కూడా ఆశించింది. అక్కడక్కడ కొంతమేర వచ్చిన పూతలోని రసాన్ని పీల్చుతున్నాయి. దీంతో పూత ఎండిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. ఈ ఏడాది తేమ వాతావరణం ఉండటం వల్ల పూత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఉద్యాన అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ చివరికి వచ్చినా పూత ప్రారంభం కాకపోవడంపై రైతులు ఆందోళన పడుతున్నారు. మూడేళ్లుగా పూత సరిగ్గా రాకపోవడంతో కొంతమంది రైతులు మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టడం లేదు. -
ఏర్పాట్లు బాగున్నాయ్
విధులు నిర్వహించేందుకు ఎలిగేడు మండలం నర్సాపూర్ వచ్చా. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చినం. రాత్రిబస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. – భాగ్యలక్ష్మి, జూనియర్ లెక్చరర్ సంతృప్తిగా ఉంది సామాగ్రితో ముందురోజు మధ్యాహ్నం వరకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాం. ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు కలెగకుండా స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు ఎంతో సంతృప్తినిచ్చాయి. –సామ శిరీష, ఉప్పట్ల, మంథని -
అటవీశాఖ అధికారిపై దాడి
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సెక్షన్ అధి కారి సాంబయ్యపై దాడి జరిగినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రవికుమార్ తెలిపారు. రంగపేట అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా సాంబయ్య అడవిలోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి గొడ్డలితో కన్పించగా సాంబయ్య అతడిని మందలించాడు. దీంతో కోపంతో రాకేశ్ గొడ్డలితో సాంబయ్యపై దాడిచేశాడని, ఘటనలో సాంబయ్య చేతివేళ్లకు గాయాలయ్యాయని తెలిపారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులురాయికల్: రాయికల్ పట్టణంలో ఓ బాల్య వివాహాన్ని 1098 ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో పట్టణానికి చెందిన అబ్బాయి, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి వధూవరుల వయసును పరిశీలించారు. వధువు వయసు తక్కువగా ఉండటంతో మేజర్ అయ్యేంత వరకు వివాహం చేయొద్దని 1098 కౌన్సిలర్ శ్రీనివాస్, సోషల్ వర్కర్ రాణి, గంగాధర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా పడింది. షార్ట్సర్క్యూట్తో సామగ్రి దగ్ధంజగిత్యాలక్రైం:జగిత్యాల పట్టణంలోని చిలుకవాడలో తాళం వేసిన ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలు అంటుకుని సామగ్రి దగ్ధమైంది. చిలుకవాడకు చెందిన దామెర తిరుపతి తన భార్య లక్ష్మీతో కలిసి గురువారం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. సాయంత్రం 7.30 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో చేరుకుని మంటలు ఆర్పేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న సామగ్రి, నిత్యావసర వస్తువులు, బట్టలు కాలిపోయాయి. -
గ్రంథాలయం పనులు వేగవంతం చేస్తాం
● ఎడ్యుకేషనల్ ఏఈ శశికుమార్ రాయికల్: రాయికల్లోని గ్రంథాలయం పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపడతామని ఎడ్యుకేషనల్ ఏఈ శశికుమార్ అన్నారు. ‘పునాదులు దాటని గ్రంథాలయ భవనం’ శీర్షికన గురువారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి శశికుమార్ స్పందించారు. అర్ధాంతరంగా ఆగిపోయిన గ్రంథాలయం పనులను పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేశామని, త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని వెల్లడించారు. వణికిస్తున్న చలిజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాను కొద్ది రోజులుగా చలి వణికిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గురువారం నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. బీర్పూర్ మండలం కొల్వాయిలో 10.3, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 10.5, ఎండపల్లి మండలం గుల్లకోటలో 10.6, కథలాపూర్లో 10.7, మల్లాపూర్లో 10.7, భీమారం మండలం మన్నెగూడెంలో 10.8, మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో 10.8, భీమారం మండలం గోవిందారంలో 10.8 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 108 అంబులెన్స్లో ప్రసవంమెట్పల్లి: పట్టణంలోని చావిడి ప్రాంతానికి చెందిన అంజలి 108 అంబులెన్స్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం ఉదయం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బంది సతీశ్, అభిలాష్ చేరుకుని ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆసుపత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డీఎంహెచ్వోగా శ్రీనివాస్జగిత్యాల: జిల్లా వైద్యశాఖ అధికారిగా డాక్టర్ ఆకుల శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన ప్రమోద్కుమార్ డిప్యూటేషన్పై పెద్దపల్లి జిల్లాకు వెళ్లారు. శ్రీనివాస్ కలెక్టర్ సత్యప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆయన అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్ను కలిశారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, రవీందర్, సత్యనారాయణ ఉన్నారు. కుష్ఠు నివారణకు కృషి చేయాలిజగిత్యాల: కుష్ఠువ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పరిశీలకులు, సీనియర్ డాక్టర్ సుజాత అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపడుతున్న సర్వేను పరిశీలించారు. రెండు విడతల్లో ఇంటింటి సర్వే చేపడతామని, ఈనెల 31న జరిగే సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, డాక్టర్ శ్రీనివాస్, కుష్ఠువ్యాధి నివారణ అధికారి శ్రీనివాస్, జైపాల్రెడ్డి పాల్గొన్నారు. -
జగిత్యాల
27.0/10.07గరిష్టం/కనిష్టంఘనంగా మహా లింగార్చనధర్మపురి: శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. రుద్రనమకం, మాన్యసూక్తం, లక్ష్మీసూక్తం, పురుషసూక్తం వంటి పూజలు చేశారు. వాతావరణం పొడి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. పొగమంచు అధికంగా కురుస్తుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. మాస శివరాత్రి పూజలుజగిత్యాలరూరల్: పొలాస శివారులోని సహస్రలింగాల దేవాలయంలో మాస శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు.శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
సంక్షేమ పథకాలతోనే పట్టంగట్టారు
ధర్మపురి: కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ప్రజలు పట్టంగట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్త సర్పంచులను సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో 140 సర్పంచ్ స్థానాలకు 109మందిని గెలిపించారని తెలిపారు. పాలకవర్గం ఏకతాటిపై నిలిచి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, చీపిరిశెట్టి రాజేష్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, నూతన సర్పంచులు కాసారపు బాలాగౌడ్ రాందేని మొగిలి తదితరులున్నారు. -
వైభవంగా ముగిసిన దొంగ మల్లన్న జాతర
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేటలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో ఏడు వారాలుగా నిర్వహిస్తున్న జాతర ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు రాజేందర్ శాస్త్రోక్తంగా హోమగుండం వద్ద పూజలు నిర్వహించారు. చండీయాగం చేశారు. ముగింపు ఉత్సవాల సందర్భంగా మల్లన్నపేట భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాలు విజయవంతానికి సహకరించిన భక్తులు, అధికారులు, గ్రామస్తులకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి విక్రమ్ పాల్గొన్నారు. -
కుట్రపూరిత రాజకీయాలతో వేధింపులు
జగిత్యాల: నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలతో ఈడీ దాడులతో సోనియాగాంధీ, రాహూల్గాంధీని వేధిస్తోందని, ఢిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా బీజేపీకి కనువిప్పు కలగాలని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. గురువారం ఇందిరాభవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన కుటుంబాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా వేధిస్తున్నారని, ఢిల్లీ హైకోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. మహాత్మగాంధీ పేరిట కొనసాగుతున్న ఉపాధి పథకం పేరును మార్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య మాట్లాడుతూ.. భారతీయుల స్వేచ్ఛ, సమానత్వం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారన్నారు. కాంగ్రెస్ నాయకులు కొత్తమోహన్, బండ శంకర్, మాజీ కౌన్సిలర్లు దుర్గయ్య, అనిత పాల్గొన్నారు. -
నెలరోజులుగా కేంద్రాల్లోనే మక్కలు
కథలాపూర్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను విక్రయిద్దామంటే అన్నదాతలకు అష్టకష్టాలు తప్పడంలేదు. కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామశివారులో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతామని రైతులకు సమాచారం ఇవ్వడంతో రైతులు మక్కలు పోశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్ధతు ధర రూ.2,400 వస్తుందని సుమారు నెల రోజుల నుంచి పెగ్గెర్ల, ఊట్పెల్లి గ్రామాల రైతులు పెగ్గెర్ల కొనుగోలు కేంద్రంలో మక్కలు పోసి ఆరబెడుతున్నారు. ఇప్పటికీ తూకం వేయడంలేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు కథలాపూర్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఎప్పటికప్పుడు తూకం వేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. పెగ్గెర్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఇప్పటికి తూకం ప్రారంభించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. నిర్లక్ష్యం ఎవరిదో కానీ తాము కొనుగోలు కేంద్రంలోనే రోజులతరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
యువతరానికే పట్టం
జగిత్యాల: గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అలాంటి పల్లెల్లో గతంలో సర్పంచులుగా పోటీ చేయాలంటేనే ప్రతిఒక్కరూ భయాందోళనకు గురయ్యేవారు. గ్రామాల్లో పెత్తనం చేసేవారే ఎక్కువగా పోటీచేసే వారు. పరిస్థితులు మారాయి. యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి సై అంటోంది. గతంతో పోల్చితే ఈ సారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో యువతే ఎక్కువగా బరిలో నిలిచింది. ప్రజలు కూడా వారినే ఆదరించారు. జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులు ఉన్నాయి. ఇందులో దాదాపు 90 శాతం మంది 40 ఏళ్లలోపు వారే బరిలో నిలిచి విజయం సాధించారు. గ్రామీణ ప్రజలు కూడా మార్పు కోరుకుంటూ యువతకు పట్టంకట్టారు. వీరిలో చాలామంది అండర్గ్రాడ్యుయేట్లు 200 మంది వరకు.. గ్రాడ్యుయేట్లు దాదాపు 45మందికి పైగానే ఉన్నారు. పోస్ట్గ్రాడ్యుయేట్లు 12 మంది ఉన్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు.. ప్రైవేటు ఉద్యోగాలు వదిలి పంచాయతీ బరిలో నిలిచి సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు, మద్యం ఏరులై పారినప్పటికీ తామేం తక్కువ కాదంటూ యువత ముందుకొచ్చి మొత్తానికి పోటీలో నెగ్గారు. సమస్యలతోనే స్వాగతం.. గ్రామీణ ప్రాంతాల్లో గత పాలకవర్గం ముగిసి రెండేళ్లయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేకపోయింది. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అయితే గెలిచిన సర్పంచులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామాల్లో రోడ్లు, వైకుంఠదామాలు, మురికికాలువలు అధ్వానంగా మారాయి. పాఠశాలలు, కమ్యునిటీ హాల్స్, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక ఇబ్బందిగా ఉంది. వాస్తవానికి గ్రామాల్లో ప్రధానమైన సమస్య కోతులు, కుక్కల బెడద. ఎక్కడ చూసినా వాటి సంచారం అత్యధికంగా ఉంది. వీటిని నిర్మూలించే బాధ్యత కొత్త సర్పంచులపై ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పెంకుటిళ్లు కోతులతో దాదాపుగా చెడిపోయాయి. వీధికుక్కలు గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. కనిపించిన చిన్నపిల్లలు, వృద్ధులను కాటేస్తున్నాయి. వీటి నివారణకు కొత్త పాలకవర్గం చర్యలు చేపట్టాల్సి ఉంది. పశువైద్యం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరో ప్రధాన సమస్య వీధిలైట్లు. చాలాచోట్ల ఏర్పాటు చేసినప్పటికీ ఎక్క డా వెలగడం లేదు. వీధి దీపాలు బిగించిన వారంవెలుగుతున్నాయి. తర్వాత ఎగిరిపోతున్నాయి. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కాలనీలన్నీ చీకటిమయంగానే మారాయి. గత పాలకవర్గం హయాంలో పనులు చేసినప్పటికీ బిల్లులు రాక అనేకమంది కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్లు రాని వారికి, వృద్ధులకు సంబంధించిన సమస్యలు, మహిళల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ సమస్యలన్నీ కొత్త సర్పంచులకు భారంగా మారనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్ల కొనుగోలు చేశారు. వాటి నెలవారి అద్దెలు బ్యాంకుల్లో కట్టలేక ట్రాక్టర్లు మూలనపడ్డాయి. వాటిని వినియోగంలోకి తేవాల్సి ఉంది. కొత్త పాలకవర్గాలు ఏర్పాటు గ్రామపంచాయతీ మూడు విడతల ఎన్నికలు ముగియగా.. మరో 4–5 రోజుల్లో పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరుడు కావడంతో గ్రామంలోని సమస్యలను చూడాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. మరో 2–3 రోజుల్లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
లోక్ అదాలత్కు న్యాయవాదులు సహకరించాలి
జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్కు న్యాయవాదులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. జల్లా కోర్టు ఆవరణలో గురువారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై న్యాయవాదులతో సమావేశమయ్యారు. రాజీకి అనుకూలమైన కేసుల్లో కక్షిదారులు ముందుకొస్తే కేసులు కొట్టేస్తామన్నారు. మోటార్ వాహనాల కేసులపై ఇన్సూరెన్సు కంపెనీ ప్రతినిధులు, మధ్యవర్తిత్వ న్యాయవాదులతో చర్చించామన్నారు. లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్, మోటార్వాహనాలు, ఆస్తి తగాదాలు, చెక్ బౌన్స్, భార్యాభర్తలు, కుటుంసభ్యుల మధ్య ఉన్న కేసులను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ మాట్లాడుతూ కక్షలతో సాధించేది ఏమీ లేదని, రాజీకి వచ్చి కేసులు కొట్టేయించుకోవాలని కోరారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్రనాథ్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
అక్కడ పులి.. ఇక్కడ అప్రమత్తం
మెట్పల్లిరూరల్: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కామారెడ్డి ప్రాంతంలోని దోమకొండ పాతతాలుకా పరిధిలో గల మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూర్ మండలాల్లో పెద్దపులి సంచరించి మూగజీవాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల అడవుల నుంచి పెద్దపులి సిరికొండ, కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ల పరిధిలోని అటవీ ప్రాంతం ద్వారా జిల్లాలోకి ప్రవేశిస్తుందేమోనన్న అనుమానంతో అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. మెట్పల్లి మండలంలోని రంగారావుపేట, కేసీఆర్తండా, పాటిమీది తండా, అందుబొందుల తండా, ఆత్మనగర్, ఆత్మకూర్ గ్రామాల్లో పంట పొలాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని గురువారం మైకుల ద్వారా చెప్పించారు. ఎక్కడైనా పులి కనిపించినా.. వాటి పాదముద్రలు కనిపించినా.. మూగజీవాలపై దాడులు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నా.. తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాచారం ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న చోటు నుంచి ఇక్కడి అటవీప్రాంతానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరం ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పెద్దపులి రోజుకు సుమారు 50 కిలోమీటర్లు నడిచే అవకాశం ఉంటుందని భావిస్తున్న అధికారులు.. మధ్యలోనే దానికి కావాల్సిన ఆహారం దొరికితే ఆ ప్రాంతంలోనే ఉంటుందా..?లేక ఇటువైపు వస్తదా..? తిరిగి వెనక్కే వెళ్తుందా..? అనేది చూడాల్సి ఉందని, ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. -
మారుమోగిన అయ్యప్ప నామ స్మరణం
కోరుట్లరూరల్: గురుస్వాముల భజనలు.. కన్నెస్వాముల శరణు ఘోషతో కోరుట్ల మండలంలోని నాగులపేట నాగులమ్మ ఆలయం మారుమోగింది. ఆలయం ఆవరణలో అయ్యప్ప పడిపూజను గురువారం వైభవంగా నిర్వహించారు. గూడెం గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, గురుస్వాములు చిద్రాల నారాయణ, అంబటి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, భూమయ్య, తాజా సర్పంచులు కేతిరెడ్డి గంగజల, చీటి స్వరూపారాణి, ఎంపీడీఓ రామకృష్ణ, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. -
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ● కొత్త సర్పంచులకు సన్మానం ధర్మపురి: పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కొత్త సర్పంచులు, వార్డుసభ్యులను ధర్మపురిలో గురువారం సన్మానించారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, నాయకులు అయ్యోరి రాజేశ్ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి పెగడపల్లి: గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని కొప్పుల అన్నారు. పెగడపల్లిలో మండలంలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్, మాజీ సర్పంచులు రాజేశ్వర్రావు, లక్ష్మన్, నాయకులు రాజశేఖర్గౌడ్, తిరుపతి, అంజి, హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అసలైన ఓటు చోరీ కాంగ్రెస్ పార్టీయే జగిత్యాల: దేశంలో ప్రజాదరణ కోల్పోగానే ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ అసత్యపు ప్రచారం చేస్తోందని బీజేపీ జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి ఓటు చోరీ అంటూ రోడ్లపై తిరుగుతున్నారని, నెహ్రూ కాలం నుంచి అసలైన ఓటు చోరీకి పాల్పడింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొన్ని రాష్ట్రాల్లో ఓటు చోరీ ఎలా జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్యారంటీ, వారంటీ అయిపోయిందని, మతిబ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, కార్యదర్శి తిరుపతి, శ్రీనివాస్, పిల్లి శ్రీనివాస్, దివాకర్, లక్ష్మీనారాయణ, కళావతి, లవన్ పాల్గొన్నారు. -
విద్యే నిజమైన సంపద
కోరుట్ల/మెట్పల్లి: విద్యనే నిజమైన సంపద అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల, మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు సంజయ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని టీ–హబ్ను సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలన్నారు. టి–హబ్, టి–వర్క్స్ కల్పిస్తున్న స్టార్టప్, స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
తూకం వేయడంలేదు
ఎకరంన్నర పంట సాగు చేసిన. పెగ్గెర్లలో కొనుగోలు కేంద్రం ఉంటుందని తెలపడంతో రైతులందరం తీసుకొచ్చి పోసినం. ప్రతిరోజూ ఉదయం వచ్చి ఆరబెడుతున్న. రాత్రివేళ మక్కల కుప్పపై టార్ఫాలిన్ కవర్లు కప్పుతున్న. ఇప్పటికీ తూకం వేస్తలేరు. రైతుల గురించి పట్టించుకోవాలి. – ఎల్లాల నారాయణ, రైతు, పెగ్గెర్ల. కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం మక్కలు పోసిన. రోజు మక్కలు ఆరబెడుతున్నాం. తూకం ఎప్పుడు వేస్తరో చెప్పడంలేదు. సిబ్బందిని అడిగితే రేపు అంటూ ఇలా కాలం వెల్లదీస్తున్నారు. రైతులను తిప్పలు పెట్టకుండా త్వరగా తూకం వేయాలి. నాయకులు చొరవ చూపాలి. – గడ్డం బక్కయ్య, రైతు, పెగ్గెర్ల. -
గెలుపు సంతోషం.. అప్పుల భయం
జగిత్యాల: పంచాయతీ పోరు ముగిసింది. జిల్లాలోని 385 సర్పంచ్, 3,536 వార్డు స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. త్వరలోనే పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో మేజర్ గ్రామపంచాయతీల్లో ఏకంగా రూ.50 నుంచి రూ.90 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ప్రతి గ్రామంలో రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఖర్చు పెట్టారంటే అతియోశక్తి కాదు. గెలుపే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లకు అనేక హామీలు ఇచ్చారు. కొందరు ఏకంగా బాండ్ పేపర్లు రాసిచ్చిన సంఘటనలున్నాయి. ప్రస్తుతం గెలిచిన సర్పంచులకు పదవి సవాల్గానే ఉండనుంది. గత పాలకవర్గం ముగిసి.. రెండేళ్లపాటు స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే కొనసాగాయి. అభివృద్ధి మాత్రం పూర్తిగా కుంటుపడింది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య, గ్రామపంచాయతీ నిర్వహణ, పాఠశాలల సమస్యలు, పారిశుధ్యం, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. గతంలోనే నిధులు లేక కొందరు సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. సర్పంచ్ హోదా అనేది ఒక స్టేటస్గా ఉండటంతో పోటీ చేసిన అభ్యర్థులు లక్షల్లో ఖర్చు పెట్టారు. ఐదేళ్లలో ఒక చిన్న గ్రామానికి కూడా కనీసం అంత రెవెన్యూ రాదు. విజయమే లక్ష్యంగా ముందుకెళ్లారే తప్ప అసలు ఆ గ్రామం రెవెన్యూ ఎంత..? ఎలా పనులు చేయిస్తాం..? అన్నది ఆలోచించకుండానే రూ.కోట్లు కుమ్మరించారు. గెలిచిన సర్పంచులు ముందున్న సమస్యను ఎలా పరిష్కరిస్తారో..? ఈ వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారో..? చూడాల్సిందే. గతంలో రిజర్వేషన్ అనుకూలించే వారు భార్యలను నిలబెట్టి గెలిపించుకున్నారు. 385 గ్రామాల్లో ఒక గ్రామానికి ఒక అభ్యర్థి రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేసుకున్నా రూ.3 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుంది. ఒక్కో గ్రామంలో ఐదారుగురు అభ్యర్థులు నిల్చున్నారు. కొన్ని చోట్ల అత్యధికంగా ఖర్చు చేశారు. అభివృద్ధి మాట దేవుడెరుగు... ప్రతి సర్పంచ్ అభ్యర్థి లక్షల్లో ఖర్చు పెట్టుకోవడంతో అభివృద్ధి కన్నా ముందు ఆ డబ్బులు ఎలా వస్తాయన్నది ఆలోచిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి ఖర్చు చేసి ఓడిపోయిన అభ్యర్థులేమో ఆందోళనలో ఉండగా.. గెలిచిన అభ్యర్థులు లోలోన సంతోషంగా లేరు. సర్పంచ్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని కొందరు ఆస్తులు, ఆభరణాలు అమ్ముకోగా.. మరికొందరు భూములు, ఇతర ఆస్తులను అమ్ముకున్నారు. అప్పుల భయం చాలామంది అభ్యర్థులు ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఓటర్లకు పంచిపెట్టి గెలుపొందారు. ఇంకొందరు ఓడిపోయారు. ఆ అప్పులన్నీ మీద పడటంతో ఎలా కట్టాలన్నదానిపై ఆందోళన చెందుతున్నారు. గెలిచిన వారంతా కొద్దిమేర సంతోషంగా ఉన్నప్పటికీ ఎలా అప్పులు కట్టాలన్నదానిపై ఆందోళన చెందుతున్నారు. గెలిచిన వారికి హామీలు నెరవేర్చడంతో పాటు, అటు అప్పులు కట్టాల్సిన బాధ్యత ఉంటుంది. -
ఒక్క ఓటూ కీలకమే..
కరీంనగర్అర్బన్/ ముస్తాబాద్/ ఎల్లారెడ్డిపేట/ బు గ్గారం/సుల్తానాబాద్ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మూడు విడతల్లో జి ల్లావ్యాప్తంగా ఎన్నికలు జరగగా బుధవారంతో తు ది సమరం ముగిసింది. ఒక్కో విడతలో ఐదు మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఫలితాలు ఆసక్తికరంగా ఉండటం విశేషం. ఒక్క ఓటూ ఎంత కీలకమో స్పష్టం చేసింది. మెజారిటీ అటుంచితే విజయమే అతి కష్టంపై వరించింది. టై: కరీంనగర్ రూరల్ మండలంలోని బహుదూర్ఖాన్పేట గ్రామ పంచాయతీ 1వ వార్డులో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులకు సమాన ఓట్లు లభించగా టై అయింది. మొత్తం 86 ఓట్లుండగా 83 ఓట్లు పోల్ కాగా బుర్ర మారుతి, బుర్ర సంపత్కుమార్, బుర్ర తిరుపతిలకు 27 ఓట్లు సమానంగా వచ్చాయి. డ్రా తీయగా మారుతి గెలుపొందారు. 01: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పెద్దూరుపల్లి గ్రామ సర్పంచిగా పోటీచేసిన రామడుగు హరీశ్ ప్రత్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ సర్పంచ్గా పొన్నాల సంపత్ ఒకే ఓటు ఆధిక్యతతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థికి ఏకానందంకు 642 ఓట్లు రాగా సంపత్కు 643 ఓట్లు పోలయ్యాయి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండలో సర్పంచ్ అభ్యర్థులు అంజిత్రావుకు 437 ఓట్లు, ధర్మరాజుకు 438 ఓట్లు వచ్చాయి. ధర్మరాజును ఒక్కఓటు తేడాతో విజయం వరించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లిలో ఉమ్మెంతల శోభకు 213, పల్లెలక్ష్మికి 212 ఓట్లు రాగా.. ఒక్కోటు తేడాతో శోభ గెలిచింది. 02: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ సర్పంచిగా గోదరి శోభారాణి గెలుపొందారు. సమీప ప్రత్యర్థిఽ కనకలక్ష్మిపై 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శోభారాణికి 324 ఓట్లు పోలవగా కనకలక్ష్మికి 322 ఓట్లు పోలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో కాశోల్ల పద్మకు వంద ఓట్లు రాగా, రొడ్డ భాగ్యకు 102 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల తేడాతో భాగ్య సర్పంచ్గా విజయం సాధించారు. 03: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట గ్రామ సర్పంచ్గా శ్రీలత ఎన్నికయ్యారు. అగ్గని శ్రీలతకు 505 ఓట్లు పోలవగా రాసమల్ల అనూషకు 502 ఓట్లు పోలయ్యాయి. కేవలం మూడు ఓట్లతో శ్రీలత గెలుపొందారు. 06: చొప్పదండి మండలంలోని రేవెల్లి గ్రామ సర్పంచ్గా బందారపు అజయ్కుమార్ 6 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి రాజిరెడ్డిపై గెలుపొందారు. అజయ్కుమార్కు 385 ఓట్లురాగా ప్రత్యర్థి రాజిరెడ్డికి 379 ఓట్లు పోలయ్యాయి. రామడుగు మండలంలోని కిష్టాపూర్ గ్రామ సర్పంచిగా వేల్పుల మల్లేశం తన ప్రత్యర్థిఽ తిరుమల్పై ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మల్లేశంకు 145 ఓట్లు రాగా తిరుమల్కు 139 ఓట్లు పోలయ్యాయి. 07: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో కల్లూరు బాపురెడ్డి ఏడు ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందాడు. తన సమీప ప్రత్యర్థి నమిలికొండ శ్రీనివాస్పై 7 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 08: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లెలో సర్పంచ్గా చొప్పరి శైలజ ప్రత్యర్థి పన్నాల స్వరూపపై 8 ఓట్ల తేడాతో గెలుపొందింది. 10: జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం భర్తీపూర్ గ్రామ సర్పంచిగా సంఘం అమృత సమీప ప్రత్యర్థిపై 10ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. -
పెన్షనర్లకు కొడుకులా అండగా ఉంటా
మెట్పల్లి/కోరుట్లటౌన్: పెన్షనర్లకు కొడుకుగా అండగా ఉండి సేవలందిస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో బుధవారం జరిగిన పెన్షనర్స్ వేడుకల్లో పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రతిఒక్కరూ ప్రశాంతంగా గడపడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పెన్షనర్ల సమస్యలను అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. డీఏ, పీఆర్సీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. అనంతరం 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెట్పల్లి అధ్యక్షుడు రాజేశ్వర్రావు, నందగోపాల్, చిన్నయ్య, దువ్వ నర్సయ్య, పంజాల గంగాగౌడ్, కొండ రాములు, అంజయ్య, వెంకటస్వామి, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, ఉపాధ్యక్షులు ఎండీ. సైఫోద్దీన్, గుంటుక సాంబమూర్తి, చిలుక గంగారాం, లక్ష్మీనారా యణ, భూమయ్య, రాజయ్య, ఈశ్వర్ప్రసాద్, సాబిత్ అలీ, లక్ష్మీకాంతం పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ట్రెటా ఆధ్వర్యంలో ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించారు. -
గ్రామాలను అభివృద్ధి చేయండి
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలరూరల్/రాయికల్: కొత్తగా గెలిచిన సర్పంచులు గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలంలోని తక్కళ్లపల్లి సర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, పథకాల అమలుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లచ్చన్న, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన బీఆర్ఎస్ నాయకులు రాయికల్ మండల బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు స్పందన, అల్లీపూర్ మాజీ ఉపసర్పంచ్ సాగర్రావు బుధవారం ఎమ్మెల్యే సంజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వారి వెంట మాజీ కో–ఆప్షన్ సభ్యుడు ముఖీద్ ఉన్నారు. పెన్షనర్లకు సత్వర సేవలుజగిత్యాల: పెన్షనర్లకు సత్వర సేవలందిస్తామని అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఎస్.మధు అన్నారు. బుధవారం కార్యాలయంలో పెన్షనర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. పెన్షనర్లు సమస్యలుంటే తన దృష్టికి తీసుకుస్తే పరిష్కరిస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్ మాట్లాడుతూ పెన్షనర్స్ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, పెన్షనర్స్ బకాయిలను వెంటనే చెల్లించేలా చూడాలని కోరారు. -
జగిత్యాల
29.0/12.07ఆండాళమ్మకు పంచామృతాభిషేకం మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలోని ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పంచామృతాభిషేకం నిర్వహించారు. తిరుప్పావై స్త్రోత్రాలు పఠించారు. ప్రధాన అర్చకులు రఘు, స్థానాచార్యులు కపీందర్, భక్తులు పాల్గొన్నారు. లక్ష తులసి అర్చన జగిత్యాలరూరల్: పొలాస శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో బుధవారం శివకేశవులకు లక్ష తులసి ఆకులు సమర్పించారు. భక్తులు స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నలమాసు గంగాధర్, భక్తులు పాల్గొన్నారు. గరిష్టం/కనిష్టంవాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. రాత్రి చలిగాలులు కొనసాగుతాయి. గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ముగిసిన ‘పల్లెపోరు’మూడో విడత ఎన్నికల వివరాలు.. మండలాలు : బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మొత్తం ఓటర్లు : 1,71,920పోలైన ఓట్లు : 1,36,917పోలింగ్ శాతం : 79.64 శాతం అత్యధికం: వెల్గటూర్లో 84.15 శాతం అత్యల్పం: ధర్మపురిలో 73.05 శాతం -
కేసుల రాజీకి న్యాయవాదులు చొరవ తీసుకోవాలి
మెట్పల్లి: ఈ నెల 21న నిర్వహించే లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని మెట్పల్లి సీనియర్ సివిల్ మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలో బుధవారం లోక్అదాలత్పై సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారుల మధ్య రాజీ కుదిరితే లోక్ అదాలత్లో వాటిని సత్వరమే పరిష్కరించనున్నట్లు తెలిపారు. అంతేగాకుండా క్రిమి నల్ కేసుల్లో అప్పీల్కు వెళ్లడానికి అవకాశముండదని, సివిల్ కేసుల్లో చెల్లించిన కోర్టు ఫీజును వెనక్కి తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్రెడ్డి, అడిషనల్ పీపీ ఆనంద్గౌడ్, అసిస్టెంట్ పీపీ ప్రణయ్, న్యాయవాదులు ఉన్నారు. పేర్ల మార్పుతో ఫలితం ఉండదుజగిత్యాలటౌన్: పథకాల పేర్ల మార్పుతో ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, మాహాత్ముడి గౌరవాన్ని తగ్గించేలా ఉపాధి హామీ పథకం పేరు మార్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కుట్ర పూరితంగా మహాత్ముడి పేరును తొలగించాలనుకుంటే దేశప్రజలు క్షమించబోరని తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, చల్గల్, ధరూర్ సర్పంచులు జున్ను రాజేందర్, సురేందర్ ఉన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తిద్దాంజగిత్యాల: కుష్ఠువ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు గురువారం నుంచి సర్వే నిర్వహించనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. ఈనెల 30 వరకు ఇంటింటి సర్వే చేపడతామన్నారు. ఏటా రెండుసార్లు సర్వే చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది సర్వే చేస్తారని, ఇందులో 735 మంది ఆశా కార్యకర్తలు, 247 మంది వైద్య సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. చర్మంపై మచ్చలు కన్పించినా.. కాళ్లు, చేతులు చచ్చుబడినా వైద్యులను సంప్రదించాలన్నారు. 12 నెలల పాటు చికిత్స అందిస్తామని, మందులుఉచితంగాపంపిణీ చేస్తామని వెల్లడించా రు. డాక్టర్ అర్చన, సత్యనారాయణ పాల్గొన్నారు. నేడు చలో హైదరాబాద్జగిత్యాలటౌన్: కార్మికుల హక్కులు కాలరాసేలా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి 1976 ఎస్పీఈ చట్టాన్ని పునరుద్ధరించాలని గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్కులో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునీల్, అరవింద్ తెలిపారు. జిల్లాకేంద్రంలో చలో హైదరాబాద్ పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. కరోనా సమయంలో దేశ ప్రజలు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న వేళ కేంద్రం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందన్నారు. కోడ్ల ప్రకారం 44 కార్మిక చట్టాల నుంచి 15 చట్టాలను తొలగించారని తెలిపారు. దీంతో ఉద్యోగ భద్రత కరువైందన్నారు. మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు జి.ప్రణీత్, కె.నాగరాజు, జి.శ్రీనివాస్, కే.వెంకటేష్, డి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
మెటీరియల్స్ సమకూర్చాలి
రాయికల్లోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నిరుద్యోగులకు సరైన మెటీరియల్ లేక జిల్లాకేంద్రానికి వెళ్తున్నారు. నూతన గ్రంథాలయంలో వసతులతోపాటు, అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. – చంద్రశేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాంట్రాక్టర్తో పనులు చేయిస్తాం గ్రంథాలయ పనులను వేగవంతం అయ్యేలా చర్యలు చేపడతాం. పాఠకులకు అన్ని రకాల వసతులు కల్పించడంతోపాటు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా మెటీరియల్స్ సమకూర్చుతాం. – మనోహర్గౌడ్, మున్సిపల్ కమిషనర్, రాయికల్ -
పునాదులు దాటని గ్రంథాలయ భవనం
రాయికల్: రాయికల్లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో టీయూఎఫ్ఐడీసీ నిధుల ద్వారా రూ.32 లక్షల వ్యయంతో చేపడుతున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులు పునాదులు కూడా దాటడం లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పూర్తి చేయకపోవడంతో నత్తనడకన సాగుతున్నాయి. రాయికల్పట్టణంతోపాటు.. మండలంలోని 32 గ్రామాలకు చెందిన యువత పుస్తక పఠనం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గ్రంథాలయాలు ఎంతో తోడ్పడుతాయి. అయితే పట్టణంలోని గ్రంథాలయంలో సరైన వసతులు లేకపోవడంతో ఇక్కడకు రావాలంటేనే నిరుద్యోగులు, యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. నత్తనడకన సాగుతున్న పనులు గ్రంథాలయం నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 26 రూ.32 లక్షల వ్యయంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ భూమిపూజ చేశారు. నాటి నుంచి నేటి వరకు గ్రంథాలయ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పూర్తి చేయకపోవడంతో దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ పునాదులకే పరిమితవుతోంది. కేవలం ఆరునెలల్లో గ్రంథాలయ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా పూర్తి కాకపోవడంతో పాఠకులు అద్దె గదుల్లో ఉంటున్న గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు, దినపత్రిక పఠనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు కావాల్సిన మెటిరియల్స్ లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికై నా గ్రంథాలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి నిరుద్యోగులకు, పాఠకులకు నూతన భవనంలో మౌళిక వసతులు కల్పించాలని పాఠకులు కోరుతున్నారు. -
నియామవళిని పకడ్బందీగా అమలు చేయాలి
పెగడపల్లి: ఎన్నికల నియామవళిని పకడ్బందీగా అమలు చేయాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెగడపల్లి మండల కేంద్రలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ కేంద్రాన్ని ఆర్డీవో మధుసూదన్తో కలిసి పరిశీలించారు. సామగ్రి పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లు, సిబ్బంది వసతులపై ఆరాతీశారు. మూడో విడుత ఎన్నికల సందర్భంగా విధుల నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామగ్రిని వేర్వేరు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీపీవో రఘువరన్, జిల్లా నోడల్ అధికారులు మదన్మోహన్, రవికుమార్, డీఎస్పీ రఘుచందర్, ఎంపీడీవో ప్రేమ్సాగర్, తహసీల్దార్ ఆనంద్కుమార్, ఎంపీవో శశికుమార్రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
సర్పంచులకు అండగా ఉంటాం
జగిత్యాలటౌన్: కొత్తగా ఎన్నికై న సర్పంచులకు అండగా ఉంటూ.. అభివృద్ధికి నిధులు ఇస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మాజీమంత్రి జీవన్రెడ్డి మద్దతుతో జగిత్యాల నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులు, వార్డుసభ్యులకు మంగళవారం జిల్లాకేంద్రంలోని పొన్నాల గార్డెన్లో అభినందన సభ నిర్వహించారు. సర్పంచులు మంత్రి అడ్లూరి, జీవన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్యను సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరగనివ్వబోమని తెలిపారు. జీవన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటారని అన్నారు. జగిత్యాలలో ఒరిజనల్ కాంగ్రెస్ నాయకులు గెలువకూడదని మధ్యలో వచ్చిన నాయకులు అడ్డుకున్నారని, వ్యక్తిగత స్వార్థం, తన పొట్ట నింపుకొనేందుకు పార్టీలోకి వచ్చి తనను కలిస్తేనే నిధులు అంటూ సర్పంచులను బెదిరిస్తున్నాడని, అభివృద్ధి అతని దగ్గర కాదని, ప్రభుత్వం వద్ద ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, బీర్పూర్ మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తన వల్ల చెడ్డపేరు వస్తే రాజీనామా క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా.. జీవన్రెడ్డికి ప్రధాన అనుచరుడిగా 40ఏళ్లుగా పనిచేస్తున్నానని, తన వల్ల పార్టీకిగానీ.. జీవన్రెడ్డికిగానీ చెడ్డపేరు వస్తే అరగంటలో తన పదవికి రాజీనామా చేస్తానని డీసీసీ అధ్యక్షుడు నందయ్య అన్నారు. ఎమ్మెల్యే సంజయ్తో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయనపై వచ్చిన ఆరోపణలపై పై విధంగా స్పందించారు. తాను కరుడుగట్టిన కాంగ్రెస్వాదినని, జీవన్రెడ్డికి నమ్మిన బంటునని, అలాంటి తనకు పదవి ఉన్నా.. లేకపోయినా ఒకటేనని స్పష్టం చేశారు. రాజీనామా పత్రం జేబులోనే ఉందని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే ఇదే వేదికపైనే రాజీనామా చేసి వెళ్లిపోతానని తేల్చి చెప్పారు. -
కొండగట్టులో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యా యి. గోదాదేవికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తులసీదళార్చనతో పూజలు చేశారు. తిరుప్పావై గానం చేశారు. ఽఅమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు. 30రోజులపాటు అమ్మవారికి నిత్యపూజలు ఉంటాయని అర్చకులు తెలిపారు. ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, ప్రధాన అర్చకుడు జితేంద్రస్వామి, రామకృష్ణ, రఘు, స్థానాచార్యులు కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, భక్తులు పాల్గొన్నారు. ఎకరాకు రూ.50 లక్షలు ఇవ్వాల్సిందే..కథలాపూర్: మండలంలోని సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని బీజేపీ కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో బీజేపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయాన్ని నమ్ముకొని సాగు చేస్తున్న రైతులు భూములు కోల్పో తే ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం మార్కెట్లో భూములకు అధిక ధర ఉందని, ఈ క్ర మంలో నిర్వాసితులకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కో రారు. లేనిపక్షంలో భూమికి బదులు సారవంతమైన భూమి కేటాయించాలన్నారు. యాసంగి పంటలకు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఆయన వెంట నాయకులు ఏనుగు తిరుమల్రెడ్డి పాల్గొన్నారు. మామిడి పూత దశలో జాగ్రత్తలు తీసుకోవాలిగొల్లపల్లి: మామిడి పూత దశలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కాత సమయంలో చీడపీడల ఉధృతి తక్కువగా ఉండి దిగుబడి పొందవచ్చని ఉద్యానవన అధికారి గడ్డం శ్యామ్ప్రసాద్ అన్నారు. మండలంలోని శ్రీరాములపల్లిలోగల మామిడితోటలను మంగళవారం పరిశీలించారు. గత సంవత్సరంతో పోల్చితే ఇప్పటివరకు కేవలం 5 నుంచి 10 శా తం మాత్రమే తోటల్లో పూత కనిపిస్తోందన్నా రు. దీనికి వాతావరణ మార్పులే కారణమన్నా రు. క్రమం తప్పకుండా కొమ్మ కత్తిరింపులు చే సుకున్న వారి తోటల్లో పూత వచ్చిందన్నారు. ఆయన వెంట ఉద్యానవన అధికారి అర్చన, అధికారులు వంశీకృష్ణ, అన్వేష్, రైతులు పాల్గొన్నారు. ఆయిల్ పాం సాగుతో ఆర్థిక వృద్ధిరాయికల్: ఆయిల్ పాం తోటలతో ఆర్థికంగా వృద్ధి సాధించవచ్చని ఉద్యానవన విస్తరణాధికారి రాజేశ్ అన్నారు. మంగళవారం బో ర్నపల్లిలోని ఆయిల్ పాం తోటలను పరిశీలించారు. ఆసక్తి గల రైతులు సంబంధిత ఏఈ వోలను సంప్రదించాలన్నారు. ఆయన వెంట లోహియా సంస్థ మేనేజర్ విజయ్, ఫీల్డ్ ఆఫీ సర్ రాజేశ్, రైతులు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల సందర్శన బుగ్గారం: పంచాయతీ ఎన్నికలు జాగ్రత్తగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై ఎంపీడీవో సుమంత్ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో మొత్తం 96 వార్డుల్లో 13 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీవో తెలిపారు. ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో పోలీస్బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు తదితరులున్నారు. -
చివరి విడతకు సర్వం సిద్ధం
జగిత్యాల: గ్రామపంచాయతీ చివరిదశ ఎన్నికలకు జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే మొదటి, రెండోవిడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడోవిడతలోనూ ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పెగడపల్లి, ధర్మపురిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది గ్రామాలకు చేరుకున్నారు. మూడో విడతలో 119 పంచాయతీలు, 1088వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే ఆరు సర్పంచులు, 228 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 113 పంచాయతీలు, 860 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ బూత్లకు తరలివెళ్లారు. భారీ బందోబస్తు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ అశోక్కుమార్ ఇప్పటికే పోలీసులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మండలాలు: ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి గ్రామపంచాయతీలు : 119వార్డులు : 1,088ఓటర్లు : 1,75,024పీవోలు : 1306వోపీవోలు : 1703పోలింగ్ కేంద్రాలు : 1088ఏకగ్రీవమైన సర్పంచులు : 6ఏకగ్రీవమైన వార్డుమెంబర్లు : 228ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలు : 113ఎన్నికలు జరిగే వార్డులు : 860 -
ఆఖరి పోరాటం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: గ్రామపంచాయతీ తుది పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మమైన ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఆదినుంచీ అధికార కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రతిపక్ష బీఆర్ఎస్పై ఆదినుంచీ తన పైచేయి సాధిస్తూ వస్తోంది. ఇప్పటివరకూ రెండువిడతల ఎన్నికల్లో ఇదే దృశ్యం కనిపించింది. కీలకమైన మూడోవిడతలోనూ అదే సీన్ రిపీట్ అయ్యేలా కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఇక ఆఖరి పోరాటంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకుని గట్టి పోటీ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భావిస్తుండగా.. ఇప్పటి వరకూ 64 సీట్లు గెలిచిన బీజేపీ.. 100 సీట్లకుపైగా గెలుపొంది సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మొత్తానికి మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డేందుకు ఆఖరి ఎన్నికల బరిలోకి దిగాయి. ఆగని డబ్బు, మద్యం పంపిణీ.. తొలి రెండువిడతల్లో మద్యం, డబ్బు పంపిణీతో అభ్యర్థులు చేతులు కాల్చుకున్నా.. మూడోవిడతలోనూ అవే దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. సర్పంచ్ బరిలో ఉన్నవారు ఎక్కడా తగ్గడం లేదు. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. ఓటర్లకు తాయిలాలిచ్చి ప్రలోభాలకు గురిచేయడంలో ఎక్కడా తగ్గడం లేదు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లిలో అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీకే పరిమితమవగా.. జగిత్యాల జిల్లాలో ఒకడుగు ముందుకేసి ఓటర్లకు ఏకంగా వెండి నాణేలు పంచుతుండడం విశేషం. ఇంత పంపిణీ జరుగుతున్నా.. అభ్యర్థులు ఓటర్లను పెట్టే ప్రలోభాలను పోలీసులు పూర్తిస్థాయిలో నియంత్రించడం లేదన్న విమర్శలు ఆగడం లేదు.ఇప్పటి వరకూ తొలివిడత 398 గ్రామాలు, రెండోవిడతలో 418 పంచాయీల్లో ఎన్నికలు జరిగాయి. రెండువిడతల్లో కలిపి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 436 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ మద్దతిచ్చిన చోట 224 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇక బీజేపీ సపోర్ట్తో 64 మంది సర్పంచులుగా గెలిచారు. ఇతరులు 87 మంది స్వతంత్ర సర్పంచులుగా ఎన్నికయ్యారు. కీలకమైన మూడోవిడతలో 436 స్థానాల్లో కనీసం 300 వరకు స్థానాలను వశపరచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక సగానికిపై సీట్లు గెలవాలని బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. రెండువిడత ఎన్నికల్లో గెలిచిన స్వతంత్రులు, బీఆర్ఎస్, బీజేపీల నుంచి వచ్చిన వారిని, మూడోవిడతలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో కలిపి 800 వరకు సర్పంచుల సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఉమ్మడి జిల్లాలోని 408 గ్రామాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
సత్వర న్యాయం కోసమే ‘లోక్ అదాలత్’లు
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతిజగిత్యాలజోన్: కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకే జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. ఈనెల 21న జిల్లా కోర్టులో నిర్వహించే జాతీయ మెగా లోక్అదాలత్పై మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టులో 17,074 కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఇందులో సివిల్ 5,134, క్రిమినల్ కేసులు 11,940 ఉన్నాయని, ప్రతిరోజు కొత్త కేసులు వచ్చి చేరుతున్నాయని, తద్వారా కోర్టులపై కేసుల భారం పడుతోందని తెలిపారు. పెండింగ్ కేసులు తగ్గిస్తూ.. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని వివరించారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల కోర్టుల్లో 7,277 క్రిమినల్ కేసులు, 5,134 సివిల్ కేసులు రాజీకి అనుకూలంగా ఉన్నాయని, వీటిని ఈనెల 21న లోక్అదాలత్లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మోటార్ వాహనాల నష్టపరిహారం కేసులకు సంబంధించి ఇన్సూరెన్సు కంపెనీ ప్రతినిధులు, కంపెనీ లాయర్లు.. పోలీసు అధికారులతో సమావేశం అయినట్లు తెలిపారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ మాట్లాడుతూ కుటుంబ తగాదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలతో సాధించేది ఏమీ లేదని, వాటిని సామరస్యపూర్వకంగా లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ రాజీకి అనుకూలమైన అన్ని కేసులను లోక్అదాలత్లో పరిష్కరించనున్నట్లు వివరించారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
జగిత్యాలరూరల్: సర్పంచులంటేనే గ్రామాల్లో ఒకరకమైన ప్రత్యేకత. గ్రామాల్లో ఎలాంటి పనులు చేయాలన్నా మొదట పంచాయతీ పాలకవర్గం ఆమోదం పొందాల్సిందే. పాలకవర్గం ఆమోదం తెలిపిన పనులను చేపట్టి ఇంజినీరింగ్ అధికారులు రికార్డు చేసిన తర్వాతే నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది. గత సర్పంచుల పదవీకాలం ముగిసి.. గ్రామాల్లో దాదాపు 22నెలలపాటు ప్రత్యేక అధి కారుల పాలన సాగింది. ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ ఖాతాల్లోని డబ్బును పూర్తిగా డ్రా చేశారు. దీంతో ప్రస్తుతం కొత్త సర్పంచులకు ఖాతాల్లో బ్యాలెన్స్ లేకపోవడంతో ఏ పని చేద్దామన్నా వెనుకంజ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీల్లో ఏర్పాట్లకు కష్టమే.. గ్రామ సర్పంచులుగా ఎన్నికై న వారు ఈనెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే పంచాయతీ కార్యాలయాలకు రంగులు, ఫర్నిచర్ కోసం కొత్త సర్పంచులు పంచాయతీ కార్యదర్శులను కోరుతుండగా.. నిధులు లేకపోవడంతో వారు ఏం చెప్పాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రతి గ్రామపంచాయతీకి సర్పంచులు కలర్లు వేయించడంతో పాటు, కొత్తగా ఫర్నిచర్ కొనుగోలు చేసి ఆఫీసులను ముస్తాబు చేసిన తర్వాతే ప్రమాణస్వీకారం చేయాలని ఆలోచన చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వస్తేనే పనులు చాలాకాలంగా స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదల నిలిపివేశాయి. దీంతో చాలా గ్రామపంచాయతీలు నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులు విడుదల చేస్తేనే కొత్త సర్పంచులు ఏదైనా గ్రామాల అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంది. జగిత్యాల: కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను పార్టీ కార్యాలయంలో మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రామపంచాయతీ అకౌంట్లలోకి నిధులు వస్తాయని, సర్పంచ్, పాలకవర్గం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేంతవరకు కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎళ్లవేళలా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పంచాయతీల్లో ఖజానా ఖాళీ -
‘మూడోవిడత’కు భారీ బందోబస్తు
జగిత్యాలక్రైం: జిల్లాలో బుధవారం నిర్వహించే మూడోవిడత పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బందితోపాటు సామగ్రిని ఆయా ప్రాంతాలకు పోలీస్ బందోబస్త్ మధ్య తరలించామని తెలిపారు. బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాలలో మొత్తం 119 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 45 రూట్లలో సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, ఎస్సైలు, పెట్రోలింగ్ టీమ్స్ కలిపి 853 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు సెల్ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్తో పోలింగ్ బూత్లోకి రావొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీలు దిగడం నిషేధమన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికలు ముగిసే వరకు కోడ్ అమలులో ఉంటుందని, విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాలు కాల్చడం, బైక్ర్యాలీలు, డీజేలు పూర్తిగా నిషేధమన్నారు. -
నాడు భర్త.. నేడు భార్య సర్పంచ్
జగిత్యాలరూరల్: సర్పంచ్ ఎన్నికల్లో వరుసగా భార్యాభర్తలను ఆదరించారు ఓటర్లు. వరుసగా సర్పంచ్గా గెలిపించారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట సర్పంచ్గా 2019 ఎన్నికల్లో బొడ్డు దామోదర్ ఎన్నికయ్యారు. తాజాగా ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య బొడ్డు గంగవ్వను సర్పంచ్గా ఎన్నుకున్నారు. అలాగే జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి సర్పంచ్గా 2019 ఎన్నికల్లో అంకతి మల్లవ్వ సర్పంచ్గా గెలుపొందగా.. ప్రస్తుతం ఆమె భర్త అంకతి మల్లయ్య సర్పంచ్గా విజయం సాధించారు. అంకతి మల్లయ్యఅంకతి మల్వవ్వ గంగవ్వ దామోదర్ -
‘మూడో విడత’ ప్రలోభాలు
జగిత్యాల: మూడో విడత ప్రచారానికి జిల్లాలో గడువు ముగిసింది. దీంతో ప్రలోభాల పర్వం మొదలైంది. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలతో పోల్చితే మూడో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. చివరి రోజు ప్రతి ఒక్క అభ్యర్థి డబ్బు, మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మొదటి, రెండోవిడతల్లో ఓడిపోయిన, గెలుపొందిన అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి..? ఎలా అయితే గెలుస్తాం..? అని వారి అనుభవాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఒక్కో ఇంటికి తిరుగుతూ ప్రతిసారి గుర్తులను గుర్తుచేస్తూ.. తమను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. సమయం అధికంగా ఉండటంతో వీరు చాలాసార్లు ఓటర్లను కలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కుల సంఘాలు, మహిళ సంఘాలను కలిసి ఓట్లు వేయాలని కోరడంతో పాటు, వారికి డబ్బులు సైతం పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని గ్రామాల్లో మహిళలకు, చీరలు, ఆభరణాలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. కచ్చితంగా గెలవాలన్న ఉద్దేశంతో సంఘాల నాయకులను గంప గుత్తగా మాట్లాడుతూ డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 అందిస్తున్నారు. రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలోనే రెండు గ్రామాల్లో ఒక్కో అభ్యర్థి కోటికి పైగానే ఖర్చు చేశారంటే సర్పంచ్ పదవికి ఎంత గిరాకీ ఉందో తెలుస్తుంది. ఒక వర్గం వారు వెయ్యి ఇచ్చారంటే మరో వర్గం వారు వెళ్లి రూ.1500 ఇచ్చి వస్తున్నారు. ఒక వైపు గ్రామాల్లో ఓటర్లకు హామీలు ఇవ్వడంతో పాటు, డబ్బులు పంపిణీ చేయడంతో గెలిచిన తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ఇంటింటికీ డబ్బులు, మద్యం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో డబ్బు, మద్యం, మాంసంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ముందుకెళ్తున్నారు. వలస వెళ్లిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వాహనాలను సమకూర్చుతున్నారు. ఒక్కో అభ్యర్థి ఐదు నుంచి రూ.10 లక్షల ఖర్చు చిన్న గ్రామపంచాయతీల్లో పెడుతుండగా.. మేజర్ గ్రామపంచాయతీల్లో అయితే రూ.80 నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి ఆ గ్రామాలకు వచ్చే నిధులు సైతం అంతగా ఉండవు. సర్పంచ్ హోదా కోసమే తప్ప చేసేదేమీలేదు. దీంతో పాటు, గ్రామాల్లో హామీలు ఇచ్చామంటే నెరవేర్చకపోతే ప్రజలు మరోసారి తిరస్కరించే అవకాశం ఉంటుంది. రెబల్స్తో ఫలితాలు తారుమారు జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు లభించాయి. అయితే కాంగ్రెస్లోనే చాలా మంది రెబల్స్ ఓడిపోయారు. బీఆర్ఎస్, బీజేపీలో రెబెల్స్ బెడద అంతంతమాత్రంగానే ఉంది. ఈ భయం మూడో విడతలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. బుధవారం జరగనున్న ఆరు మండలాల సర్పంచుల్లో అన్ని మండలాలు ధర్మపురి నియోజకవర్గం కిందకే వస్తాయి. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి లక్ష్మణ్కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నది తెలిసిందే. ఇప్పటికే జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్కు సీట్లు రాగా ధర్మపురిలో సైతం కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయి. మంత్రి ఇలాకాలో సైతం అనేక మంది రెబల్స్ ఉన్నారు. ఎవరిది పైచేయిగా నిలుస్తుందో వేచి చూడాల్సిందే. -
కలగానే ఉద్యాన పరిశోధన కేంద్రం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల వ్యవసాయాధారిత జిల్లా కావడంతో వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలతో పాటు మామిడి, అరటి, బొప్పాయి, పసుపు తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇటీవల అభ్యుదయ రైతులు డ్రాగన్ప్రూట్, జామ, దానిమ్మ వంటి లాభదాయక పంటలు వేస్తున్నారు. కొత్తగా ఆయిల్పాం తోటలను దాదాపు 5 వేల ఎకరాల్లో సాగు చేశారు.అయితే, ఉద్యాన రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే శాస్త్రవేత్తలు మాత్రం అందుబాటులో లేరు. 60 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు జిల్లాలో దాదాపు 60 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. సుమారు 30 వేల ఎకరాల్లో మామిడి, బత్తాయి, అరటి, 6 వేల ఎకరాల్లో మిర్చి, టమాట, పసుపు వంటి వాణిజ్య పంటలను 25 వేల ఎకరాల్లో, గులాబీ, బంతి, చామంతి తోటలను 500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. హామీలన్నీ ఉత్తమాటలే.. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని విడదీయడంతో ఇక్కడ పనిచేసే ఉద్యాన శాస్త్రవేత్తలు నిజమాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రానికి వెళ్లారు. అప్పటి నుంచి జిల్లాలో ఒక్క ఉద్యాన శాస్త్రవేత్త లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అప్పటి మంత్రి జీవన్రెడ్డి చల్గల్లోని ప్రదర్శన క్షేత్రంలో ఉద్యాన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో గల ఉద్యాన విశ్వవిద్యాలయ అధికారులు 2009 ఫిబ్రవరి 6న పరిశీలించి వెళ్లారు. అనంతరం వైఎస్సార్ మరణంతో ఆ ప్రతిపాదనలు ముందుకు కదలలేదు. తర్వాత కిరణ్కుమార్రెడ్డి హయాంలోను ఉత్తర తెలంగాణలో వ్యవసాయాధికారులు, రైతులకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించగా, అదీ నెరవేర లేదు. చల్గల్లో మామిడి పరిశోధన కేంద్రం చల్గల్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ను ఆనుకుని స్థలం ఉండటంతో అందులో మామిడి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని స్వయనా అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదీ సైతం అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే ప్రదర్శన క్షేత్రంలో సపోట, మామిడి వంటి పండ్ల తోటలతో పాటు గులాబీ తోటలున్నాయి. ఉద్యాన పంటలపై పరిశోధనలకు ఈ ప్రదర్శన క్షేత్రం అనువుగా ఉంటుందని గతంలో వ్యవసాయ మంత్రులుగా ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డి, నిరంజన్రెడ్డికి అన్ని పార్టీల నాయకులు విన్నవించినా ఫలితం లేదు. ధారాదత్తం చేస్తుండడంపై ఆందోళన చల్గల్ ప్రదర్శన క్షేత్రంలో 150 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఇప్పటికే 20 ఎకరాలు మామిడి మార్కెట్, 5 ఎకరాలు రైల్వే లైన్కు, 6 ఎకరాలు మార్క్ఫెడ్ గోదాంలు, ఎకరం వరకు విద్యుత్ సబ్ స్టేషన్కు ఇచ్చారు. మామిడి మార్కెట్లో షెడ్లు నిర్మిస్తున్నందున మరో 10 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనైనా ఉద్యాన పరిశోధన కేంద్రం లేదా క్రిషి విజ్ఞాన కేంద్రం వస్తుందనే ఆశతో జిల్లా రైతులు ఉన్నారు. -
ఓట్ల వేటలో ‘పంచాయతీ’ అభ్యర్థులు
పెగడపల్లి: మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. సర్పంచ్, వార్డు సభ్యుల బరిలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. పెగడపల్లి మండలంలో 23 పంచాయతీలకు రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 216 వార్డుల్లో 52 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డుస్థానాలకు ఈనెల 17న ఎన్నికలు జరగనున్నాయి. మండలంలో 35,869 మంది ఓటర్లున్నారు. అత్యధికంగా బతికపల్లిలో 4,559 మంది, అత్యల్పంగా మ్యాకవెంకయ్యపల్లిలో 533 మంది ఓటర్లున్నారు. 21 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 91 మంది, 164 వార్డుల్లో 480 మంది పొటీ పడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా పెగడపల్లి, బతికపల్లి.. అన్ని పార్టీలూ మండలకేంద్రమైన పెగడపల్లితోపాటు బతికపల్లి సర్పంచ్ స్థానాలనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మాజీమంత్రి జీవన్రెడ్డి స్వగ్రామమైన బతికపల్లి కాంగ్రెస్కు పెట్టిందిపేరు. ఇప్పటివరకు ఈ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ ఆధీనంలోనే ఉంది. ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో తన ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా పట్టు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెగడపల్లి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈసారి ఈ స్థానాన్ని ‘చే’జారిపోవద్దన్న రీతిలో కాంగ్రెస్.. తమ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్.. ఎలాగైనా గెలవాలని బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా ముమ్మరంగా ప్రచారం కొనసాగించారు. యువజన, కుల సంఘాలను తమ వైపు తిప్పుకునేందుకు ఓటర్లకు తాయిళాలు ప్రకటిస్తూ గెలుపు కోసం రహస్య మంతనాలు కొనసాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఓటరు జాబితా ఆధారంగా ఇతర ప్రాంతాల్లోని వారిని రప్పించేందుకు పోన్లు చేస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఓటర్లకు మందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. -
ఓటమితో కుంగిపోవద్దు
● ఓడిన అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది ● పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావుమల్లాపూర్: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలుపునకు పొంగిపోవద్దని, ఓటమికి కుంగి పోవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. మండలంలోని ముత్యంపేట, సిరిపూర్, రత్నాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఆయన ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మల్లాపూర్, రాఘవపేటలో గెలిచిన సర్పంచ్లు చిట్యాల లక్ష్మణ్, తోట శ్రీనివాస్, వార్డుసభ్యులను సన్మానించారు. సర్పంచులు ప్రజలందరినీ కలుపుకొని గ్రామాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులకు పార్టీ అండగా ఉంటుందని, పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు కమిటీ జిల్లా మాజీ సభ్యుడు దేవ మల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముద్దం శరత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జగిత్యాల
29.0/14.07గరిష్టం/కనిష్టంవాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. లాభాల ‘పుట్ట’ పుట్టగొడుగులకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు పెంచేందుకు ముందుకు వస్తున్నారు. పొలాస కళాశాల విద్యార్థులు తమ ప్రాజెక్టులో భాగంగా వాటిని పెంచుతున్నారు. మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
పోస్టల్ బ్యాలెట్కు ఆసక్తి చూపని ఉద్యోగులు
రాయికల్: గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు. వీరు సర్పంచ్, వార్డు సభ్యులకు ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా లెక్కిస్తారు. అయితే తాము ఓటు ఎవరికి వేశామో తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఓటు వేసేందుకు ఉద్యోగులు ఇష్టపడలేదు. రాయికల్ మండలంలోని 30 గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్కు 38, వార్డు సభ్యులకు 32 మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాయికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఉద్యోగి మహేశ్ -
డబ్బులు పాయే.. ఓట్లూ రాకపాయే..
రాయికల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేలడంతో సర్పంచ్ పీఠం దక్కించుకున్న నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. ఓడిపోయిన అభ్యర్థులు నిరుత్సాహంగా ఉన్నారు. రాయికల్ మండలంలోని మేజర్ గ్రామమైన అల్లీపూర్లో కేవలం నలుగురు అభ్యర్థులు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని మరికొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఖర్చు చేశారు. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టారు. తీరా ఓటమి పాలైన అభ్యర్థులు తాము ఎన్నికల్లో పెట్టిన ఖర్చును ఏ విధంగా భర్తీ చేయాలని అంతర్మథనం పడుతున్నారు. తమ లెక్కలు తలకిందులు కావడంతో కొన్ని గ్రామాల్లోని కులాలకు చెందిన సంబంధించిన ఓట్లు రాకపోవడంతో బూతుపురాణం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. -
గొల్లపల్లి మండల అభివృద్ధే ధ్యేయం
గొల్లపల్లి: మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని చందోలి, గొల్లపల్లిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం గ్రామస్థాయికి పూర్తిగా చేరాలంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కస్టమర్ చార్జీలు వసూలు చేయండికథలాపూర్: వ్యవసాయ మోటార్లకు సంబధించి విద్యుత్ కస్టమర్ చార్జీలను ఈ నెలాఖరులోగా 100 శాతం వసూలు చేయాలని ట్రాన్స్కో మెట్పల్లి డీఈ మధుసూదన్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. విద్యుత్ బిల్లులు ఏ మేరకు వసూలు చేశారనే విషయాలపై సిబ్బందితో చర్చించారు. మెట్పల్లి డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో 57,885 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, కస్టమర్ చార్జీలు రూ.2.09 కోట్ల బకా యిలు రావాల్సి ఉందని తెలిపారు. బిల్లుల వసూలులో కథలాపూర్ సెక్షన్ మొదటి స్థానంలో ఉందన్నారు. ఆయన వెంట కథలాపూర్ ఏ ఈ దివాకర్రావు, విద్యుత్ సిబ్బంది ఉన్నారు. నిర్వాసితులకు పరిహారం పెంచండికథలాపూర్: సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్నవారికి పరిహారం పెంచి ఇవ్వాలని బాధిత రైతులు కోరుట్ల ఆర్డీవో జివాకర్రెడ్డికి విన్నవించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో తాండ్య్రాల, పోసానిపేట గ్రా మాల భూ నిర్వాసితులతో ఆర్డీవో సమావేశమయ్యారు. రెండు గ్రామాల పరిధిలో 65 ఎకరాలు కోల్పోతున్నామని, ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఎకరానికి రూ.10లక్షలు సరిపోవని, మార్కెట్ ప్రకారం చెల్లించాలని రైతులు కోరారు. విషయాన్ని ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో తెలిపా రు. తహసీల్దార్ వినోద్, రైతులు పాల్గొన్నారు. -
పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి
చల్గల్లో ఉద్యాన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. జిల్లాను ఆనుకుని ఉన్న నాలుగైదు జిల్లాల్లో పండ్ల తోటలతో పాటు పసుపు పంట ఎక్కువగా ఉన్నందున పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కనీసం మామిడి పరిశోధన కేంద్రానైనా ఏర్పాటు చేయాలి. – వెల్ముల రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు, పూడూరు అన్నిరకాల పండ్ల తోటలకు అనుకూలం అన్నిరకాల పండ్ల తోటలకు ఇక్కడి నేలలు అనుకూలం. ఉత్తర తెలంగాణలో పెద్ద మామిడి మార్కెట్ ఉంది. కాబట్టి ఉద్యాన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. – బందెల మల్లయ్య, రైతు సంఘం నాయకుడు, చల్గల్ -
మూడో ర్యాండమైజేషన్ పూర్తి
జగిత్యాల: మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్లో సమీక్షించారు. ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ర్యాండమైజేషన్లో పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. 1306 పీవోలు, 1706 ఏపీవోలను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలన్నారు. ఆరు మండలాల్లోని గ్రామ పంచాయతీలకు బ్యాలెట్బాక్స్లు, పోలింగ్ బ్యాలెట్లు తరలించామని తెలిపారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఎన్నికల అబ్జర్వర్ రమేశ్ పాల్గొన్నారు. -
శ్రీరాంనగర్లో మహిళా పాలకవర్గమే..
రాయికల్: మండలంలోని శ్రీరాంనగర్ పంచాయతీలోని నాలుగు వార్డుల్లో నలుగురూ మహిళలే విజ యం సాధించారు. సర్పంచ్గా రాధికగౌడ్, ఒకటో వార్డు సభ్యురాలిగా కూస దేవమ్మ తన ప్రత్యర్థి జోగుల సరితపై విజయం సాధించారు. రెండో వార్డు సభ్యురాలుగా శేర్ కిష్టమ్మ ఏకగ్రీవమయ్యా రు. మూడో వార్డు సభ్యురాలిగా కొంపల్లి సుమలత తన ప్రత్యర్థి జానయ్యపై గెలిచారు. అలాగే నాలుగో వార్డు సభ్యురాలిగా కొంపల్లి ప్రియాంక తన ప్రత్యర్థి లక్ష్మీపై గెలుపొందారు. వీరిలో ఉపసర్పంచ్గా కొంపల్లి ప్రియాంకను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరిక సర్పంచ్, వార్డు సభ్యులు బీజేపీని వీడి ఎమ్మెల్యే సంజయ్కుమార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
నృసింహుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని ఆదివారం జిల్లా జడ్జి రత్నపద్మావతి, ప్రిన్సిపల్ జిల్లా మేజిస్ట్రేట్ లావణ్య దర్శించుకున్నారు. ముందుగా ఆలయం పక్షాన మేళతాళాలు, సాంప్రదాయ రీతుల్లో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, అర్చకులు తదితరులున్నారు. గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలుధర్మపురి: షష్టి మాసం, ఆదివారం సెలవు దినం సందర్భంగా గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మంగలిగడ్డ, సంతోషిమాత ఘాట్లు కిటకిటలాడాయి. మల్ల న్న పట్నాల సందర్భంగా తమ తమ దేవుళ్లను భక్తులు గోదావరి నీటితో శుభ్రం చేశారు. దత్తాత్రేయ ఆలయానికి రూ.5లక్షల విరాళంకోరుట్ల: కోరుట్ల సాయిబాబా ఆలయంలో నిర్మిస్తున్న దత్తాత్రేయ ఆలయం, రమాసత్యనారాయణ స్వామి, లలితాంబిక ఆలయాల నిర్మాణం కోసం వ్యాపారవేత్త, సామాజిక వేత్త సంకు సుధాకర్ రూ.5 లక్షల విరాళం అందించారు. ఆలయ నిర్మాణానికి సుమారు రూ.3 కోట్ల వ్యయం అవుతుందని సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ బాలె నర్సయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు రాచకొండ దేవయ్య, నేమూరి భూమయ్య తెలిపారు. సుధాకర్ను కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండిబుగ్గారం: బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం బుగ్గారం మండలకేంద్రంలో పాటు గోపులాపూర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సర్పంచులకు సన్మానంమల్లాపూర్: నూతనంగా ఎన్నికై న సర్పంచులు తోట శ్రీనివాస్, చిట్యాల లక్ష్మణ్ను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సన్మానించారు. గ్రామాల్లో నిధుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు కమిటీ జిల్లా మాజీ స భ్యుడు దేవ మల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ ముద్దం శరత్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, మాజీ ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ఉప సర్పంచ్ @ రూ.25 లక్షలు
కాంగ్రెస్ మద్దతుదారులకు అండగా నిలవండిపెగడపల్లి/వెల్గటూర్/బుగ్గారం: గ్రామాల అభివృద్ధికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించుకుని తద్వారా మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పెగడపల్లి, వెల్గటూర్, బుగ్గారం మండలాల్లోని పలు గ్రామాలోల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్మదర్శి శోభారాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, వెల్గటూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, నాయకులు రాంమోహన్రావు, ఉదయ్, మురళి, సందీప్, శ్రీకాంత్రావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్కు జాయింట్ చెక్ పవర్ ఉండటంతో ఈసారి ఆ పదవికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి రిజర్వేషన్ అనుకూలంగా రాని చోట్ల చాలామంది కీలక నేతలు వార్డు మెంబర్లుగా పోటీచేశారు. ఉప సర్పంచ్ పదవి దక్కించుకుని తమ ప్రాధాన్యతను చాటుకోవాలన్న ఉద్దేశంతో ఎంత ఖర్చుకై నా వెనుకాడటం లేదు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. చాలాచోట్ల ఉప సర్పంచ్ పదవికి వేలం వేసి దక్కించుకున్నారు. రూ.5లక్షల నుంచి.. మొదటి విడత ఎన్నికల్లో కొన్ని గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్కు రూ.5లక్షల నుంచి రూ.20 లక్షలు వెచ్చించడం విస్మయం కలిగించింది. కోరుట్ల మండలంలో ఓ మేజర్ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ పదవికి ఒక్కోవార్డు మెంబర్కు రూ.2 లక్షల చొప్పున రూ.25 లక్షలు వెచ్చించాడు. కథలాపూర్ మండలంలోని ఓ గ్రామంలో ఉప సర్పంచ్ పదవికి రూ.20 లక్షలు చెల్లించారు. మరో గ్రామంలో రూ.8 లక్షలు వార్డు మెంబర్లకు చెల్లించారు. మల్లాపూర్ మండలంలో రూ.5 లక్షలు వెచ్చించారు. మెట్పల్లి మండలంలోని ఓ గ్రామంలో రూ.12 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇలా నియోజకవర్గంలో 23 గ్రామాల్లో ఉప సర్పంచ్ పదవి పొందడానికి డబ్బులు వెచ్చించడం గమనార్హం. అవిశ్వాసం వస్తే.. ఉప సర్పంచ్ పదవికి రెండున్నరేళ్ల తరువాత మళ్లీ అవిశ్వాసం పెట్టవచ్చు. ఇపుడు డబ్బులు చెల్లించి ఉప సర్పంచ్ పదవిని దక్కించుకున్న వాళ్లు రెండున్నర ఏళ్ల తరువాత అవిశ్వాస గండం ఎదుర్కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం వార్డు మెంబర్లకు డబ్బులు ఇచ్చి ఉప సర్పంచి పదవిని దక్కించుకున్న వారు మళ్లీ రెండున్నర ఏళ్లకు అవిశ్వాసం పెట్టరాదన్న ఒప్పందంతో డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. కానీ రెండున్నర ఏళ్ల వరకు గ్రామంలో పరిస్థితులు ఏలా ఉంటాయో..? అప్పటికి అవిశ్వాసం ప్రస్తావన వస్తే ఇప్పుడు ఇచ్చిన డబ్బులు.. చేసుకున్న ఒప్పందాలు ఉత్తవే అవుతాయన్న సంశయం ఉప సర్పంచి పదవిని దక్కించుకున్న వారిని వెంటాడుతోంది. -
జగిత్యాల
29.0/13.07గరిష్టం/కనిష్టంప్రభుత్వ జూనియర్ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. అయ్యప్ప పడిపూజమెట్పల్లి: పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ఆదివారం మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్ 18వ దీక్ష చేపట్టిన సందర్భంగా మహా పడిపూజ నిర్వహించారు. సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి
బుగ్గారం: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. ఎన్నికలలో ప్రతి ఓటు కీలకం కానుండడంతో పోటీ చేస్తున్న అభ్యర్థులు గ్రామాల నుంచి వలసవెళ్లిన వారి సమాచారం సేకరిస్తూ ఓటింగ్ రోజు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్క ఓటుతోనే విజయాలు తారుమారవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు వలసవెళ్లిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. స్థానిక నాయకులకు బాధ్యతలు వలస ఓటర్ల వివరాలు సేకరించడానికి గ్రామాల్లో అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారికి బాధ్యతలు అప్పగించారు. వారు రంగంలోకి దిగి తమ ఊరి నుంచి ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు..? వారిని ఎలా రప్పించాలి..? అనే విషయాలపై ప్రణాళిక వేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన ఖర్చులన్నీ తామే భరిస్తామని హామీ ఇస్తూ పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒక చోటు నుండి వచ్చే అవకాశం ఉన్నవారి కోసం వాహనాలు సమకూర్చడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ముఖ్యంగా ముంబాయి, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో అనేక మంది ఉద్యోగ, ఉపాధి రీత్యా నివాసం ఉంటున్నారు. అటువంటి వారిని రప్పిస్తే తమకు ప్రయోజనం కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
‘కోరుట్ల ఎమ్మెల్యే.. నీ నియోజకవర్గాన్ని చూసుకో..’
జగిత్యాల: కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్.. మొదట మీ నియోజకవర్గ అభివృద్ధిని చూసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్సంజయ్కుమార్ అన్నారు. కోరుట్ల ఆస్పత్రిలో కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతూ జగిత్యాలకు వస్తున్నారని, ఒకవేళ చేతకాకపోతే తన వద్దకు వస్తే సీఎం, మంత్రితో మాట్లాడి నిధులు ఇప్పిస్తానని పేర్కొన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. మెడికల్ కళాశాలను సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే 20 శాతం పనులు చేయలేకపోతున్నారని ఆరోపించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కళాశాలలు ఇస్తే అందులో జగిత్యాలకు వచ్చేలా కృషి చేశానని, సీఎం రేవంత్రెడ్డిని కలిసి మెడికల్ కళాశాలకు రూ.40 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. దమ్ముంటే కోరుట్లలో 100 పడకల ఆస్పత్రిని తీసుకురావాలని, మెట్పల్లి ఆస్పత్రికి మరమ్మతులు చేయించాలన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ ఎన్ని అభివృద్ధి పనులు చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అధిక నిధులు మంజూరైంది జగిత్యాలకేనని, ఆ అభివృద్ధి ప్రజల కళ్లకు కట్టినట్లు కన్పిస్తుందన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్, క్యాదాసు నాగయ్య, చెట్పల్లి సుధాకర్, జగన్, కూసరి అనిల్, పంబాల రాము పాల్గొన్నారు. -
రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశామని, 853 మంది సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు. 57 రూట్స్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, ఎస్సైలతో పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని, గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన జగిత్యాలరూరల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రమేశ్ తెలిపారు. శనివారం జగిత్యాల అర్బన్ మండలంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్చేసుకుని ప్యాక్ చేయాలని సూచించారు. ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా నోడల్ అధికారులు నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మలి దశకు వేళాయె..
జగిత్యాల/జగిత్యాలరూరల్/రాయికల్: జిల్లాలో రెండో విడత పోలింగ్ నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు, ఉద్యోగులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి గ్రామాలకు తరలివెళ్లారు. ప్రతీ మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేసి పోలింగ్ సామగ్రిని ఆయా బూత్లకు తరలించారు. రెండో విడత జిల్లాలో మొత్తం 144 పంచాయతీలకు 10 ఏకగ్రీవం కాగా 134 సర్పంచ్ స్థానాలకు, 1,276 వార్డులకు 330 ఏకగ్రీవం కాగా, 946 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ సిబ్బందిని సైతం అదనంగా 10 శాతం రిజర్వ్లో ఉంచారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కెమెరాలు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగగా, రెండో విడత సజావుగా నిర్వహించేందుక భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడత ఎన్నికల్లో పోలింగ్ సరళి నెమ్మదిగా సాగడంతో ఒంటి గంటకు ముగియాల్సిన పోలింగ్ కొన్ని గ్రామాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగడంతో చాలా గ్రామాల్లో కౌంటింగ్ లేట్గా జరిగింది. ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. అయితే అధికారులు ఈసారి తొందరగా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రెండో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల సిబ్బంది నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సిబ్బందికి పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించాలి: ఆర్డీవో ఎన్నికల అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. శనివారం ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జగిత్యాల రూరల్ మండలం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలన్నారు. డీపీవో రఘువరణ్, ఎంపీడీవో రమాదేవి, రూరల్ తహసీల్దార్ వరందన్, ఎంపీవో రవిబాబు, సూపరింటెండెంట్ గంగాధర్, డెప్యూటీ తహసీల్దార్ అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాయికల్ మండలంలోని 30 గ్రామాల్లో ఆదివారం జరిగే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద నుంచి సామగ్రిని పంపిణీ చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ రమేశ్ పరిశీలించారు. ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీవో సుష్మ, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్, ఎంఈవో రాఘవులు, కమిషనర్ మనోహర్గౌడ్ పాల్గొన్నారు. రెండో విడత పోలింగ్ వివరాలు.. మండలాలు 7 గ్రామపంచాయతీలు 144 వార్డులు 1,276 ఏకగ్రీవమైన జీపీలు 10 ఏకగ్రీవమైన వార్డులు 330 పోలింగ్ కేంద్రాలు 1,276 ఓటర్లు 2,12,092 పీవోలు 1,531 వోపీవోలు 2,041 -
జగిత్యాల
28.0/13.07గరిష్టం/కనిష్టంఅయ్యప్ప గిరి ప్రదక్షిణ కోరుట్ల: పట్టణంలోని అయ్యప్ప గుట్టపై గల జ్ఞాన సరస్వతి శనేశ్వర సహిత అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరి ప్రదక్షిణ చేశారు. నృసింహుని సన్నిధిలో రద్దీ ధర్మపురి: మార్గశిరమాసం శనివారం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారలను దర్శించుకున్నారు. వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలి
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ విభాగం కీలకమని, ఇందులో యువతను చేర్పించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి కోరారు. టీపీసీసీ సేవాదళ్ సెక్రెటరీ బాగోజి ముఖేశ్ఖన్నా ఆధ్వర్యంలో చేపట్టిన ఆన్లైన్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని పట్టణంలోని ఇందిరాభవన్లో శనివారం డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్యతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీని నమ్ముకుని పని చేసే కార్యకర్తలు, నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, సలీం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మహాభారత ప్రవచనంలో మాజీమంత్రి జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ శివారులోని రెడ్డి కల్యాణ మండపంలో శృంగేరి పీఠ ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్కుమార్శాసీ్త్ర నిర్వహిస్తున్న మహాభారత ప్రవచన మహాయజ్ఞంలో మాజీమంత్రి జీవన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కనీస అభివృద్ధి జరగడం లేదని, హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని, విజయోత్సవాలు ఎవరి కోసం చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. కోరుట్ల, మెట్పల్లి ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, ప్రజలు అసిహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో జగిత్యాల అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. ధర్మపురిలో వ్యవసాయ కళాశాల మంజూరుతో పా టు, 40 ఎకరాల భూమి కేటాయిస్తే తక్కువ అడ్మిషన్లు ఉన్నాయని దానిని జగిత్యాలకు తరలించారన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ పాలన అధ్వానంగా ఉందన్నారు. విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో చె ప్పాలని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మీ, తులం బంగా రం ఇచ్చినందుకా అని హేళన చేశారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్, యావర్రోడ్ కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. మాజీమంత్రి గొడిశెల రాజేశంగౌడ్, ఎ ల్లాల శ్రీకాంత్రెడ్డి, లోక బాపురెడ్డి, దేవేందర్నా యక్, శీలం ప్రవీణ్, వొల్లం మల్లేశం పాల్గొన్నారు. -
ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్
జగిత్యాల: పంచాయతీ ఎన్నికల్లో విధులకు హాజరుకానందున ముగ్గురిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో 89 మంది అధికారులు విధులకు హాజరు కాకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులు హేమ, రాధ, రఘుపతిరావును సస్పెండ్ చేశారు. ప్రశాంతంగా నవోదయ పరీక్షజగిత్యాల/ధర్మ పురి: జిల్లాలో శని వారం జవహర్లా ల్ నవోదయ ప్రవే శ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని శ్రీనిధి, గౌతమి, చైతన్య, పురాతన పాఠశాల, ధర్మపురిలోని బాలికల ఉన్నత పాఠశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో సెంటర్లను అదనపు కలెక్టర్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట డీఈవో రాము, అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్ ఉన్నా రు. ధర్మపురిలో చీఫ్ సూపరింటెండెంట్ శంకర య్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో సీతామహాలక్ష్మి తదితరులు కేంద్రాన్ని పర్యవేక్షించారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టిరాయికల్(జగిత్యాల): గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని మెట్పల్లి డీఎస్పీ రాములు అన్నారు. శనివారం రాయికల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించామని, ఎవరైనా ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై సుధీర్రావు ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం సందర్శనజగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పీ డెప్యూటీ సీఈవో నరేశ్ అన్నారు. శనివారం జగిత్యాల అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి గ్రామంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. రూరల్ సీఐ సుధాకర్, తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో వాసవి పాల్గొన్నారు. వయోవృద్ధులకు ఆసరా టాస్కా జగిత్యాల: వయోవృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్ అన్నారు. 9వ టాస్కా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం భవనంలో వేడుకలు నిర్వహించారు. వయోవృద్ధులను నిరాదరిస్తే మూడు నెలల జైలుశిక్ష, జరిమానా ఉంటుందన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ను సత్కరించారు. విశ్వనాథం, ప్రకాశ్రావు, హన్మంతరెడ్డి, దేశాయి, బొల్లం విజయ్ పాల్గొన్నారు. 15న జాబ్మేళాజగిత్యాల: రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 15న జాబ్మేళా నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. మేళాకు సంబంధించిన పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. జాబ్మేళాలో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టెక్ మహేంద్రతో పాటు, ఇతర బహుళజాతి కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. మిగతా వివరాలకు 84998 07141 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి
ధర్మపురి: కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రాయపట్నం, కమలాపూర్, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గ్రామాలను మరింత అభివృద్ధి దిశలో తీసుకుపోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ కుటుంబానికి అందుతున్నాయని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నాయకులు, ఆయా గ్రామాల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. -
పంపకాలపైనే దృష్టి
మా పైసలు మాకివ్వండి!సాక్షిప్రతినిధి, కరీంనగర్: నోటుకు రాలవు ఓట్లు.. అనేది మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయింది. తొలి విడత ఫలితాలు మూడో విడత అభ్యర్థులకు గుణపాఠమైంది. గ్రానైట్, రెవెన్యూ గ్రామాల్లో తొలివిడత ఎన్నికల్లో పోటాపోటీగా పంపకాలు చేసిన అభ్యర్థులు అప్పుల పాలయ్యారు. ఒక్కో గ్రామంలో రూ.30 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పంపకాలు జరగడం గమనార్హం. రూ.లక్షలు ఖర్చుచేసినా ఓటమి తప్పకపోవడంతో తొలివిడత గ్రామాల్లోని పరాజితులు ఎక్కడ మిస్సయ్యిందని లెక్కలేసుకుంటున్నారు. కాగా.. ఎన్నికల్లో విజయం సాధించిన.. పరాజయం పొందిన ఇద్దరి జేబులు ఖాళీ అయ్యాయి. పైగా అప్పులపాలయ్యారు. విజయం సాధించిన అభ్యర్థి సంపాదించుకుంటాననే నమ్మకంతో ఉండగా పరాజయం పొందిన అభ్యర్థులు, వారి అనుచరులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు చేశారో, ఏ ప్రాంతంలో ఓట్లు రాలేదో తెలుసుకుని ‘మా డబ్బులు వెనక్కియ్యండంటూ’ ఆయా ప్రాంతాల ఓటర్ల వద్దకు వెళ్లి జబర్దస్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు ఇంతని ఇచ్చినా కూడా ఓటర్లు ముఖం చూడకపోవడంతో అభ్యర్థుల ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ‘ఒక్కో ఇంటికి పెద్దమొత్తమే ఇచ్చినం.. అయినా అక్కడ నాలుగు ఓట్లు కూడా పడలేదంటూ’ తిట్లపురాణం మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. మూడో విడతకు గుణపాఠం తొలివిడత ఎన్నికల్లో ఓటర్లు నేర్పిన పాఠం మూడో విడత అభ్యర్థులకు గుణపాఠం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండోవిడతకు సంబంధించిన పంచాయతీల్లోనూ ప్రలోభాల పర్వం జోరుగానే సాగింది. చాలామంది ఓటర్లూ.. ఓటుకు నోటును ఆశిస్తుండటమూ కనిపించింది. ఓట్లు వేస్తారా.. లేదా.. తెలియదు కానీ.. పైసలైతే పంచాల్సిందే అని అభ్యర్థులే చెబుతుండటం గమనార్హం.గ్రామాలకు చేరిన యువ ఓటర్లు జగిత్యాలరూరల్: కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ఓటు వేసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత చదువులు చదువుతూ ఎంతో దూ రంలో ఉన్నవారు కూడా గ్రామాలకు చేరుకున్నా రు. గ్రామాల్లో రెండో విడత జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ రిత్యా ఉన్నత విద్య కోసం హైదరాబాద్, బెంగుళూరు, పూణె, ఢిల్లీ, ముంబాయ్ ప్రాంతాల్లో ఉన్న యువ ఓటర్లను అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ ఫోన్ల ద్వారా సంప్రదించి గ్రామాలకు రప్పించుకున్నారు. జగిత్యాల: రెండోవిడత పోలింగ్ ఆదివారం జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థులు పంపకాలపైనే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు నిఘా పెట్టినప్పటికీ విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతోంది. ప్రచారం ముగియడంతో పోల్మేనేజ్మెంట్పై దృష్టి పెట్టారు. డబ్బుల పంపిణీపై దృష్టి పెట్టారు. అధికారులు నిఘా ఉన్నా పంపకాలు మాత్రం ఆగడం లేదు. చావో రేవో... రెండో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫలి తాలు నేటితో తేలనున్నాయి. బరిలోకి దిగినవారు ఎలాగైనా గెలవాలన్న నేపథ్యంలో ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేశారు. చిన్న గ్రామపంచాయతీలోనే రూ.5లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు చేయగా మేజర్ గ్రామపంచాయతీల్లో ఖర్చులకు చెప్పనక్కరలేదు. మహిళ సంఘాలు, కుల పెద్దల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉండగా, దూర ప్రాంతాల్లో ఉన్నవారి కోసం డబ్బులు ఖర్చు పెట్టి వాహనాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే కావడంతో ప్రతీ ఓటర్ను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బరిలోకి దిగిన అభ్యర్థులు ఖర్చు ఎంతైనా సరే గెలవాలన్న ఒక స్టేటస్తోనే వెళ్తున్నారు. ‘మొదటి విడత రిజర్వేషన్లు వచ్చిన పలు గ్రామాల్లో కొందరు పెట్టుబడిదారులు సర్పంచ్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు. సదరు అభ్యర్థులు ఓడిపోవడంతో తిరిగి డబ్బు వసూలు చేసే పనిలో పడ్డారు.’‘కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామంలో దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ సర్పంచ్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు. తమ నాయకుడు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను అతని అనుచరులు వేధిస్తున్నారు.’‘కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఓ రెవెన్యూ గ్రామ పంచాయతీలో రూ.80 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ అభ్యర్థి దారుణంగా ఓడిపోవడంతో ఆస్తులు అమ్ముకునేందుకు సిద్ధం అయ్యాడు’. -
‘కిసాన్’ సంబురం
పెద్దపల్లి: ఈ ఏడాది రెండో విడతను కిసాన్ సమ్మాన్ నిధులను కేంద్రప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున చెల్లించింది. పథకం ఏడాదికి మూడు విడతల్లో రూ.2వేల చొప్పున సాయం అందిస్తోంది. తగ్గిన రైతుల సంఖ్య జిల్లాలోని 65,757 మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోంది. అంతకుముందు 73,400 మంది రైతులకు సాయం అందించగా.. అనేక కారణాలు, అనర్హులను తొలగిస్తూ 65,757మందిని అర్హులుగా తేల్చింది. వీరికే రెండోవిడత నిధులు జమచేసింది. పొరపాట్లు సరిచేయండి జిల్లాలో కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 65,757 మంది రైతులకు రూ.2వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తున్నారు. మిగిలిన వారు బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబరులో పొరపాట్లు సవరించి తమ వివరాలను సమర్పిస్తే.. వారికి కూడా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంది. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి -
యాచకుల రహిత రామగుండం లక్ష్యం
కోల్సిటీ(రామగుండం): యాచకుల రహిత రామగుండం నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతీఒక్కరు సహకరించాలని బల్దియా కమిషనర్ అరుణశ్రీ కోరారు. స్మైల్ ప్రాజెక్ట్ (సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ ఎంటర్ ప్రైజెస్) నిర్వాహక సంస్థ శ్రీవినాయక విమెన్(అర్బన్) త్రిఫ్ట్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు రూపొందించిన పోస్టర్ను శుక్రవారం బల్దియాలో ఆవిష్కరించారు. కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా అమలవుతున్న ఈ ప్రాజెక్ట్లో యాచకులను గుర్తించి పునరావాసం కల్పిస్తుందన్నారు. గోదావరిఖని తిలక్నగర్ డౌన్లో స్మైల్ ప్రాజెక్ట్ పునారావాస కేంద్రాన్ని మెప్మా నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో ఉచిత వసతి, మూడు పూటలా భోజనం, ఆసక్తి గలవారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తుందని వివరించారు. యాచకులు కనిపిస్తే 70135 84588, 86397 17597 నంబర్లకు ఫోన్చేసి సమాచారం అందించాలని ఆమె కోరారు. ఈ అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, మెప్మాటౌన్ మిషన్ కో ఆర్డినేటర్ మౌనిక, సీవో ఊర్మిళ, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు నూనెలతా మోహన్, నిర్వాహకులు శరత్ మోహన్, మమత తదితరులు పాల్గొన్నారు. -
హామీల బాండ్ పేపర్ విడుదల
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి ఆకుల మణక్క తాను గెలిస్తే సమస్యలు పరిష్కరిస్తామని బాండ్ పేపర్ విడుదల చేశారు. సర్పంచ్గా పోటీచేస్తున్న ఆమె.. అభివృద్ధి పనులు చేపడతామని శుక్రవారం బాండ్ పేపర్పై రాసి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ 40 ఏళ్లుగా గ్రామంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, తనను గెలిపిస్తే ఐదేళ్లలోనే 14 సమస్యలు పరిష్కరిస్తానని బాండ్ పేపర్ రాశారు. ఆ పేపర్ను అభిమానులు, ఓటర్ల మధ్య విడుదల చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. -
డ్రా పద్ధతిలో వార్డుమెంబర్ గెలుపు
కథలాపూర్(వేములవాడ): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కథలాపూర్ మండలం ఇప్పపెల్లిలో ఒకటో వార్డు బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతిలో గెలుపును నిర్ధారించారు. ఒకటో వార్డులో పూదరి గంగు, పానుగంటి లక్ష్మి బరిలో ఉన్నారు. ఇద్దరికీ 51 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా తీయగా పూదరి గంగు విజయం సాధించారు. మృతశిశువుతో ఆందోళనహుజూరాబాద్: హుజూరాబాద్ ఆస్పత్రి ఎదుట మృత శిశువుతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన దాట్ల లత ఎనిమిది నెలల గర్భిణీ. హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గురువారం పరీక్షలు చేయించుకుని ఇంటికి వెళ్లింది. సాయంత్రం కడుపునొప్పి వచ్చింది. జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా గర్భస్రావమైంది. వైద్యులు పరీక్షించి శిశువు చనిపోయి రెండురోజులు అవుతుందని చెప్పారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు హుజూరాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులో పాప చనిపోయిందని ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరుగుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి తెలిపారు. హత్యాయత్నం కేసులో ఒకరి రిమాండ్ వేములవాడ: మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నలుగురిపై కేసు నమోదు చేసి, ఒకరిని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. నాగయ్యపల్లి సర్పంచ్ స్థానానికి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చింతపంటి మల్లేశం సర్పంచ్గా గెలుపొందగా సమీప అభ్యర్థి గోపు మధు ఓడిపోయారు. అతని భార్య గోపు మాలతి సైతం వార్డ్మెంబర్గా ఓడిపోయారు. తమ ఓటమికి అదే గ్రామానికి చెందిన ఏఎంసీ చైర్మన్ రొండి రాజు కారణమని కక్ష పెంచుకుని గుంటి శివ, గుంటి నగేశ్, మరో ఇద్దరితో కలిసి దాడికి పాల్పడ్డారు. బాధితుడు రాజు ఫిర్యాదుతో వేములవాడరూరల్ పోలీస్స్టేషన్లో గోపు మధు, గోపు మాలతి, గుంటి శివ, గుంటి నగేశ్పై హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గోపు మధును శుక్రవారం రాత్రి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. డీఎస్పీ ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. -
సైబర్ మోసం.. రూ.3.3లక్షలు మాయం
ధర్మపురి: సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి ఓక వేద పండితుడు మోసపోయిన ఘటన ధర్మపురిలో జరిగింది. ధర్మపురికి చెందిన కొరిడె చంద్రశేఖర్ యూనియన్ బ్యాంకులో ఖాతాదారు. శుక్రవారం తన సెల్ఫోన్లో వచ్చిన వ్యోమ్ యాప్ను డౌన్లోడ్ చేయగా బ్యాంకు అధికారుల పేరుతో సైబర్ మోసగాడు లైన్లోకి వచ్చి బ్యాంకు వివరాలు, డెబిట్ కార్డు నంబర్ తెలుపాలని సూచించాడు. బాధితుడు డెబిట్కార్డు నంబర్ తెలుపగా 2 గంటల్లో నీ పని పూర్తి అవుతుందని సైబర్ మోసగాడు పేర్కొన్నాడు. ఈక్రమంలో చంద్రశేఖర్ బ్యాంకు ఖాతాలోని రూ.3,03,300 లక్షలు మాయం కాగా, బాధితుడు జగిత్యాల సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్యముస్తాబాద్(సిరిసిల్ల): భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని.. జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ కథనం మేరకు వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాల్పల్లికి చెందిన బోదాసు దేవరాజు(37) ఏడాదిగా సోదరి గ్రామం గూడెంలో ఉంటున్నాడు. కూలీ పనులకు వెళ్తున్నానని గురువారం ఇంట్లో నుంచి వెళ్లిన దేవరాజు ఇంటికి తిరిగిరాలేదు. శుక్రవారం కుటుంబ సభ్యులు వెతకగా గూడెం శివారులో చెట్టుకు ఉరివేసుకుని దేవరాజు విగతజీవిగా కనిపించాడు. ఏడాది క్రితం దేవరాజు భార్యతో గొడవపడుతున్నాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో దేవరాజు మద్యానికి బానిసయ్యాడు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుని తండ్రి బోదాసు నర్సయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం పట్టివేతరాయికల్(జగిత్యాల): మండలంలోని కట్కాపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి రంజిత్కుమార్ అనే యువకుడు మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎఫ్ఎస్టీ సభ్యులు పట్టుకున్నారు. రూ.4,500 విలువ గల 12 బీర్లు, 12 క్వార్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఎస్టీ సభ్యులు పద్మయ్య, రంజిత్కుమార్, తిరుపతి పాల్గొన్నారు. -
దీపావళికి గుర్తింపుపై సంబరాలు
దీపావళికి సాంస్కృతిక వారసత్వ జాబితాలో యునెస్కో చోటునివ్వడాన్ని హర్షిస్తూ అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో శుక్రవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేర్చుతూ నిర్ణయించడం పట్ల దీపాలు వెలిగించి..టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి , రిటైర్డ్ ప్రిన్సిపల్ డా.మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. – కొత్తపల్లి(కరీంనగర్) -
ఓట్ల లెక్కింపుపై ఫిర్యాదులు
మంథని: సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగలేదని పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మెండె రాజయ్య ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఓట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఓట్ల లెక్కింపు క్రమంలో తనకు ప్రత్యర్థి కన్నా అదనంగా ఒకఓటు వచ్చిందని, దీంతో గెలుపు తనదేనని ప్రకటించిన కొద్దిసేపటికే ఓటు చెల్లదని అధికారులు ప్రకటించడం అనుమానాస్పదంగా ఉందన్నారు. అంతేకాకుండా ఆగమేఘాలపై అధికారులు తనను అయోమయానికి గురిచేసి డ్రా పద్ధతిన ప్రత్యర్థిని గెలిచినట్లు ప్రకటించారని అన్నారు. ఓట్ల లెక్కింపుల్లో అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన ఫిర్యాదులో కోరారు. పెగడపల్లి సర్పంచ్ ఎన్నికపై.. పెద్దపల్లి: కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి పంచాయతీ ఎన్నికల్లో అనుమానాలు ఉన్నాయని సర్పంచ్ అభ్యర్థి అల్లం సదయ్య పెద్దపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ బండిళ్లపై గుర్తు కనిపించలేదని, లెక్కింపు సమయంలో తమ ఏజెంట్లను ఓట్ల ధ్రువీకరణకు అనుమతివ్వలేదని, కౌంటింగ్ విధానం సరిగా చేయకుండానే ఫలితాలు ప్రకటించారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని, రీకౌంటింగ్ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ నూనేటి సదయ్య యాదవ్, మాజీ జెడ్పీటీసీలు వంగళ తిరుపతిరెడ్డి, గంట రాములు యాదవ్ తదితరులు ఉన్నారు. -
ఆ రెండు పంచాయతీలు పవర్ఫుల్
రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి, టీటీఎస్ అంతర్గాం పవర్ఫుల్ పంచాయతీలు. కుందనపల్లి ఓటర్లు 1,850 మంది ఉన్నారు. ఆరుగురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. ఎన్టీపీసీ నిర్వాసిత గ్రామం. వసతుల కల్పనకు ఎన్టీపీసీ సీఎస్ఆర్ ద్వారా నిధులు కేటాయిస్తుంది. ఎన్టీపీసీ బూడిద చెరువు కూడా ఉంది. బూడిదకు డిమాండ్ ఏర్పడింది. ఐవోసీఎల్, హెచ్పీసీఎల్ డిపోలతో పాటు ఐవోసీ, హెచ్పీ, ఐబీపీ పెట్రోల్ బంకుల స్థిరాస్థుల నుంచి అత్యధికంగా పన్నుల రూపేణా నిధులు సమకూరుతాయి. ఏటా సుమారు రూ.కోటి వరకు పంచాయతీ ఖజానాకు జమవుతుంది. దీంతో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీపడుతున్నారు. టీటీఎస్ అంతర్గాంలో 600 ఎకరాలు.. టీటీఎస్ అంతర్గాం పరిధిలో సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అన్ని గ్రామాలకు జంక్షన్. విమానశ్రయం, పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు ఉండడంతో సర్పంచ్ పదవిపై ప్రతీఒక్కరి దృష్టి పడింది. దీంతో ఎలాగైనా సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఈ గ్రామంలో 1,302 మంది ఓటర్లు ఉండగా, ఏడుగురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రామగుండం: శీతాకాలంతోపాటు సంక్రాంతి పండుగ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. హైదారాబాద్–గోరఖ్పూర్(07075) మధ్య ఈనెల 16, జనవరి 23వ తేదీల్లో నడుస్తుంది. గోరఖ్పూర్–హైదరాబాద్(07076) మధ్య ఈనెల 18, జనవరి 25వ తేదీ నడుస్తుంది. మచిలీపట్నం–అజ్మీర్(07274) ఈనెల 21న ఉదయం పదిగంటలకు బయలు దేరుతుంది. అదేరైలు తిరుగు ప్రయాణం(07275)లో అజ్మీర్–మచిలీపట్నం ఈనెల 28న ఉదయం 8.25 గంటలకు అజ్మీర్లో ప్రారంభమవుతుంది. రోడ్డుపై పడి వ్యక్తి మృతిసిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడుకు చెందిన ఏస పర్శరాములు(55) గురువారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. పర్శరాములు గత ఆరు నెలలుగా సిరిసిల్లలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. రాత్రి 10 గంటలకు పని ముగించుకొని నడుచుకుంటూ రగుడు వెళ్తుండగా చంద్రంపేట చౌరస్తా వద్ద రోడ్డు పక్కన ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. మృతునికి భార్య వనజ, కుమారులు సాయిదీప్, శ్రీనివాస్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పొలంలో పడి రైతు..రామడుగు: రామడుగు మండలంలోని వెదిర గ్రామానికి చెందిన శనిగరపు అంతయ్య(65) గుండెపోటుతో వ్యవసాయ పొలంలో పడి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం అంతయ్య శుక్రవారం ఉదయం పొలంలో పనులు చేస్తుండగా గుండెపోటుకు గురై పొలంలో పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్కు తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. గీత కార్మికుడు..రామడుగు: రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన మల్లారపు శంకరయ్య(70) అనే గీతకార్మికుడు గుండెపోటుతో చనిపోయాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం కల్లు గీసేందుకు వెళ్లి ఇంటి వచ్చాడు. కాసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. పత్తిమిల్లులో అగ్ని ప్రమాదం కోనరావుపేట(వేములవాడ): మండలంలోని సుద్దాల గ్రామంలోని పత్తిమిల్లులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ శివారులోని మిల్లులో అగ్ని ప్రమాదం ఏర్పడింది. మిల్లులో పనిచేస్తున్న కార్మికులు, హమాలీలు సిలిండర్ల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వేములవాడలోని ఫైర్స్టేషన్కు సమాచారం అందించడంతో వాహనం వచ్చి మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చింది. మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన పత్తి నిల్వలు ఉన్నాయి. ఎలాంటి నష్టం జరగకపోవడంతో యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆధిపత్య ఆరాటం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిఘట్టం ముగిసింది. తొలివిడతలో 397 గ్రామాలకు ఎన్నికలకు జరగ్గా 51శాతానికి పైగా (205) స్థానాలు కై వసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక 29శాతం (116) సీట్లు దక్కించుకుని బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలవగా, బీజేపీ 9శాతం (35) సీట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఉమ్మడి జిల్లాలో తొలివిడతలో 398 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట గ్రామం ఎన్నిక కోర్టు కేసు నేపథ్యంలో వాయిదా పడింది. మొత్తంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. బీఆర్ఎస్, బీజేపీలు చెప్పుకోదగ్గ సీట్లు సాధించాయి. నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఏయే గ్రామాల్లో ఎవరు ఎన్ని ఓట్లు సాధించారు? ఎంత వ్యత్యాసంతో ఓటమి చెందారు? ఏ కారణాలు విజయావకాశాలను ప్రభావితం చేశాయన్న విషయాలపై పార్టీలపరంగా ఆలోచనలు చేస్తున్నారు. బీజేపీ అనూహ్య ఫలితాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీజేపీ బలపరచిన దాదాపు 35 మంది సర్పంచులు గెలిచారు. మరో 35మంది వరకు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ ప్రభావం కనిపించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కరీంనగర్లో 14, సిరిసిల్లలో 07 స్థానాలు గెలచుకుని సత్తా చాటింది. జగిత్యాలలోనూ 14 స్థానాలు కై వసం చేసుకుని మొత్తంగా 35 సర్పంచులను గెలిపించుకుంది. ఈ విజయానికి రెండో, మూడో విడతలను వేదికగా చేసుకోవాలని పథకాలు రచిస్తోంది. వాస్తవానికి ఒక్క కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లోనే తాము బలపరిచిన 50 మంది సర్పంచ్గా గెలిచారంటూ ప్రకటించడం విశేషం. మొత్తానిక బీజేపీ అనూహ్య ఫలితాలు ఆ పార్టీలో సరికొత్త జోష్ నింపింది. 10శాతం ఇతరులపై అధికార పార్టీ కన్ను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలివిడతలో 44 మంది అభ్యర్థులు ఇతరులు/ స్వతంత్రులు ఉన్నారు. వీరందరినీ ఇప్పటికే అధికార పార్టీ తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది. దాదాపుగా వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మిగిలిన బీఆర్ఎస్ నుంచి గెలిచిన 116 మంది సర్పంచుల్లో పలువురితో అధికార పార్టీ మంతనాలు మొదలుపెట్టింది. గెలిచిన వారంతా మనోళ్లే అన్న సిద్ధాంతంతో అధికార పార్టీ ముందుకు వెళ్తుండగా.. అప్పులు చేసి గెలిచిన వాళ్లు, అధికార పార్టీతో మనకెందుకు అన్న ఆందోళనలో ఉన్న వారంతా హస్తం తీర్థం పుచ్చుకునే ఆలోచిస్తున్నారు. వీరంతా తోడైతే అధికార పార్టీ మద్దతు ఉన్న సర్పంచుల సంఖ్య అమాంతం పెరగనుంది. తొలివిడతలో పెద్దపల్లిలో కాంగ్రెస్ 90 గ్రామాల సర్పంచ్ స్థానాలకుగాను 70 స్థానాలు గెలిచి పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. కరీంనగర్లో 92 స్థానాలకు కాంగ్రెస్ 44 గెలవగా, 24 చోట్ల కారు పార్టీ విజయం సాఽధించింది. జగిత్యాలలో 122కి 52 సర్పంచులను కాంగ్రెస్ గెలవగా.. 42 సర్పంచు సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుని గట్టిపోటీ ఇచ్చింది. సిరిసిల్ల్లలోనూ 85 సర్పంచి స్థానాలలో 39 కాంగ్రెస్ దక్కించుకోగా.. 28 బీఆర్ఎస్ వశపరచుకుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా.. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీగా సర్పంచి స్థానాల కోసం పోటీ పడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్, కోరుట్లలో బీఆర్ఎస్ చక్కటి ఫలితాలు సాధించింది. 14వ తేదీన జరగనున్న రెండో విడత, 17వ తేదీన జరిగే మూడో విడతలో మరిన్ని సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. -
కాపర్వైరు దొంగలను గుర్తించాలి
ధర్మపురి: లిఫ్ట్ సబ్స్టేషన్లో చోరీకి పాల్పడిన కాపర్వైరు దొంగలను పోలీసులు గుర్తించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలంలోని రాయపట్నం గ్రామంలో గోదావరి తీరాన ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి సబ్స్టేషన్ శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట పొలాల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ సబ్స్టేషన్లోని కాపర్ వైరును దొంగలు ఎత్తుకెళ్లడం బాధాకరమని, వారిని తక్షణం గుర్తించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కాపర్వైరు చోరీతో విద్యుత్ సబ్స్టేషన్ నడవని పరిస్థితి నెలకొందన్నారు. సంబంధిత ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జాతో ఫోన్లో సంప్రదించి కొత్త సామగ్రి ఏర్పాటుకు అవసరమైన నిధులు వారంలోగా విడుదల చేయాలని సూచించారు. సబ్స్టేషన్ లేదని రైతులు అధైర్యపడవద్దని, అన్నదాతల సంక్షేమం కోసం నేనున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. -
ఇక ఓటర్లకు ఎర
జగిత్యాల: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. ఇప్పటికే ప్రచారానికి తెరపడగా, ఇక ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అభ్యర్థులు నానా తిప్పలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో డబ్బు, మందు, మాంసంతో ప్రలోభాలకు గురిచేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతీ అభ్యర్థి వెంట నిత్యం ఓ వందమంది మద్దతుదారులు ఉంటూ ఇంటింటా వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరికి ఉదయం టిఫిన్ నుంచి మొదలు మధ్యాహ్నం, రాత్రి వరకు భోజనాలు పెడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపైడెంది. కాగా, మొదటి విడత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు పెద్దగా ఖర్చు లేనప్పటికీ 2,3 విడతల్లో అభ్యర్థులకు సమయం ఎక్కువగా ఉండటంతో వారు ఖర్చుకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపంచాయతీల్లో సైతం రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు పెడుతుండగా, మేజర్ పంచాయతీల్లో ఖర్చుకు లెక్కలేకుండా పోతోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. చాలా పంచాయతీల్లో అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తుంటాయి. ఈనేపథ్యంలో లక్కీ డ్రాలో ఎవరి అదృష్టం బాగుంటే వారిని వరిస్తుంది. దీంతో ప్రతీ ఓటును రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానుపోను వాహనాలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇస్తున్నారు. గెలుపు కోసం తంటాలు ఆదివారం జరుగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడినప్పటికీ గెలుపు కోసం అభ్యర్థులు ప్రతీ ఇంటి తలుపు తడుతూ శ్రీఅవ్వ ఓటు వేయాలి, అన్న ఓటు వేయాలిశ్రీ అంటూ బతిమిలాడుతున్నారు. కాగా ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ, చాలా గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లో రెబల్స్ గొడవ అత్యధికంగా ఉంది. దీంతో గెలుపు ఓటములపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక అభ్యర్థులు మద్దతుదారులను కలుస్తూ ఓటు వేయాలంటూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల మహిళ సంఘాలకు, కుల సంఘాలకు అనేక హామీలు ఇచ్చారు. గంపగుత్తగా పడే ఓట్లైన మహిళ సంఘాలు, రైతు సంఘాలు, యువత, కుల సంఘాలు వీటిపై దృష్టి సారిస్తున్నారు. ఇక పంపకాలే.. ఇన్నిరోజులు ప్రచారం చేసి ఓట్లు వేయాలని అభ్యర్థించినా పంపకాలు మాత్రం ఆగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రచారంలో పాల్గొన్న వారితో పాటు, ఇంటింటికీ హామీ ఇవ్వడంతో పాటు, అటు డబ్బులు సైతం పంపకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మొదటి విడతలో ఓ వ్యక్తి డబ్బులు ఇస్తూ రెడ్హ్యాండెడ్గా దొరికిన విషయం తెలిసిందే. అభ్యర్థుల ఆందోళన రెండో విడతకు ఒకరోజే సమయం ఉండటంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పోటీలో నిలవడంతో చాలా మంది అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడకుండా అప్పులు తెచ్చి మరీ బరిలో నిలిచారు. గెలుపోటములు సహజం అయినా ఎవరో ఒకరికి ఓటమి తప్పదు. కానీ, ఖర్చు మాత్రం ప్రతీ అభ్యర్థికి ఉంటోంది. కొందరు అభ్యర్థులైతే ఏకంగా భూములు కుదవపెట్టుకుని, వాహనాలను అమ్ముకుని, బంధువుల వద్ద అప్పు తెచ్చుకుని మరీ పోటీ చేస్తున్నారు. ఓడిపోతే ఎలా అంటూ ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. -
సాధారణ ప్రసవాలు పెంచాలి
రాయికల్/మల్లాపూర్: ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలని డెప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి సూచించారు. శుక్రవారం రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ హెల్త్కవరేజ్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్, డయాలసిస్ వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. గైనాలజిస్ట్ డాక్టర్ ఒడ్నాల రజిత, డాక్టర్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ప్రజారోగ్యమే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ పీహెచ్సీని సందర్శించారు. బీపీ, షుగర్ రోగులకు సకాలంలో మందులు అందించాలన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏఎన్ఎం లచ్చమ్మపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. వైద్యాధికారి డాక్టర్ వాహిని, సీహెచ్వో రామ్మోహన్, హెల్త్ సూపర్వైజర్లు శకుంతల, విజయ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి సహకారమందిస్తా
● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి/ఇబ్రహీంపట్నం: గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికై న సర్పంచ్లకు అన్ని విధాలుగా సహకారమందిస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్లు పలువురు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నా రు. కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీలకతీతంగా ప్రతీ సర్పంచ్కు గ్రామాల అభివృద్ధిలో తన వంతు సహకారమందిస్తానన్నారు. సర్పంచులుగా సింగిల్ విండో చైర్మన్లుఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఇబ్రహీంపట్నం సింగిల్విండో చైర్మన్ బద్దం గోపి, తిమ్మాపూర్ విండో చైర్మన్ బాస శ్రావణ్ సర్పంచులుగా గెలుపొందారు. సర్పంచ్ పదవులకు జనరల్గా రిజర్వేషన్ కేటాయించడంతో బరిలో నిలిచి గెలిచారు. సింగిల్విండో పదవికి 15 రోజుల్లో రాజీనామా చేయనున్నారు. -
హెచ్పీవీ వ్యాక్సినేషన్పై ప్రజలకు వివరించాలి
జగిత్యాల: హెచ్పీవీ వ్యాక్సినేషన్ గురించి ప్రజలకు వివరించాలని, ఇది అత్యంత కీలకమైందని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. శుక్రవారం ఫార్మసీ అధికారులు, వైద్యాధికారులకు శిక్షణ కల్పించారు. దేశంలో సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరణాలను ఈ వ్యాక్సిన్ ద్వారా తగ్గించవచ్చని పేర్కొన్నారు. సమాజంలో అవగాహన, ఎర్లీ వ్యాక్సినేషన్, తల్లిదండ్రుల పాత్ర అత్యవసరమన్నారు. ఇమ్యునైజేషన్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, హ్యూమన్ పాపిలోమ వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ జననేంద్రియాలపై పులిపిర్లు వస్తుంటాయని, ఈ వ్యాక్సిన్ వల్ల రక్షణ ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆరోగ్య సిబ్బంది కలిసి పనిచేస్తే విజయవంతం చేయవచ్చన్నారు. డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ మాట్లాడుతూ, కుష్టువ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ఆశా కార్యకర్తలు సర్వే చేయాలని, ఎర్రని రాయిరంగు, గోధుమరంగు మచ్చలు ఉంటే రెఫర్ చేయాలని సూచించారు. ప్రజలకు సేవలందించాలి ప్రజలు ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి సేవలు అందించాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. శుక్రవారం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో విశ్వ జనని ఆరోగ్య పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లా లీగల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని, వైద్యం వారి హక్కు అని, వారికి కావాల్సిన వైద్యసే వలు అందించాలన్నారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, లీగల్ అడ్వైజర్ చంద్రమోహ న్, డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, ప్రోగ్రాం అధి కారి శ్రీనివాస్, ఆర్ఎంవోలు శ్రీపతి పాల్గొన్నారు. -
రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలి
మెట్పల్లి(కోరుట్ల): ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది నాణ్యమైన సేవలందించాలని సీనియర్ సివిల్ మెజిస్ట్రేట్ నాగేశ్వర్రావు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొని ఆయన మాట్లాడారు. రోగులకు సేవలే కాకుండా వైద్య విజ్ఞాన్ని కూడా అందించాల్సిన అవసరముందన్నారు. అనంతరం ఆసుపత్రిలోని పలు గదులను పరిశీలించారు. నిధులు మంజూరు కాక నూతన భవన నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని ఆయనకు తెలుపగా, రాతపూర్వకంగా కలెక్టర్ దృష్టికి తీసుకపోతానని స్పష్టం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్రెడ్డి, న్యాయవాదులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికవెల్గటూర్(ధర్మపురి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. నవంబర్ 16న హ్యాండ్బాల్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లాల్బహదూర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ సీనియర్ విభాగంలో ప్రతిభ కనబరిచిన ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన జైనపురం సాయికుమార్, హుజూరాబాద్ పెంచికల్పేటకు చెందిన చిలుముల సుమన్లు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 15 నుంచి 20 వరకు వెస్ట్బెంగాల్లో జరిగే 54వ జాతీయస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, ట్రెజరర్ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ అశోక్, అసోసియేషన్ బాధ్యులు శ్రీనివాస్, అనూప్రెడ్డి, వీర్పాల్, రాజ్కుమార్, మహేశ్ తదితరులు అభినందించారు. షెడ్ల కేటాయింపుపై సర్వేజగిత్యాల: జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా పాతబస్టాండ్ నుంచి గొల్ల్లపల్లి రోడ్లో, సివిల్ ఆస్పత్రి వద్ద షాపులు కోల్పోయిన వీధి వ్యాపారులకు గొల్లపల్లి రోడ్లో 37 షెడ్లను నిర్మించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు. సర్వే ఆధారంగా అర్హులను గుర్తించి వివరాలు సిద్ధం చేసినా ఆర్డర్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోయిన అర్హులైన వీధివ్యాపారులకు షెడ్ల కేటాయింపు పారదర్శకంగా జరిగేందుకు తుది జాబితా కోసం అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12 నుంచి 19 వరకు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని వివరించారు. అలాగే కొందరికి ఇప్పటికే కేటాయించినప్పటికీ వారు వేరే వ్యక్తులకు ఇవ్వడం లేదా, తాళం వేసి ఉపయోగించకుండా ఉండటాన్ని గుర్తించడం జరిగిందన్నారు. వెంటనే వాటిని వినియోగంలోకి తెచ్చుకోవాలని సూచించారు. పశువైద్య కేంద్రం తనిఖీజగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం పొలాస పశువైద్య ఉప కేంద్రాన్ని జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి బొల్లం ప్రకాశ్ శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలో సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించి పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి శుభ్రంగా, అన్ని వసతులు ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. వెటర్నరి లైవ్స్టాక్ ఆఫీసర్ కందుకూరి పూర్ణచందర్ ఉన్నారు. -
మూడో ర్యాండమైజేషన్ పూర్తి
జగిత్యాల: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వారీగా ర్యాండమైజేషన్లో పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. పోలింగ్ అధికారులు 1,531, ఇతర అధికారులు 2,031 మంది రెండో విడత కోసం కేటాయించినట్లు వివరించారు. 7 మండలాల్లో బ్యాలెట్ బాక్స్లు, పోస్టల్ బ్యాలెట్స్ తరలింపు, ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, అబ్జర్వర్ రమేశ్ పాల్గొన్నారు. గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉండాలి ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ధరూర్ క్యాంప్లోనీ ఈవీఎం గోదాములను పరిశీలించారు. ప్రతినెలా తనిఖీల్లో భాగంగా గోదాములను పరిశీలించడం జరిగిందని, ఈవీఎంల భద్రత, సీసీకెమెరాల పనితీరు, గోదాముల వద్ద ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఏవో హకీం, తహసీల్దార్ రామ్మోహన్ పాల్గొన్నారు. -
చలిలోనూ తగ్గని ప్రచార వేడి
జగిత్యాల: పంచాయతీల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లాలో 385 పంచాయతీలు, 3,536 వార్డులున్నాయి. మొదటి విడత ఎన్నికలు గురువారంతో ముగిశాయి. రెండోవిడత ఈనెల 14న, మూడో విడత ఈనెల 17న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామాల్లో ఓటరు నాడీ దొరకాలంటే అభ్యర్థులు ఆలోచించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులంతా తెలిసిన వారే కావడంతో ప్రతి ఒక్కరికి ఓటు వేస్తామని హామీ ఇస్తుంటారు. అందరికీ ఒకే రకమైన భరోసా ఇస్తూ.. ఎక్కడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థులు కుల సంఘాలు, యూత్ సభ్యులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. అయినప్పటికీ గెలుపోటముల్లో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మొదలైన టెన్షన్ పోలింగ్ దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. సర్పంచ్, వార్డు మెంబర్లలో కలవరం మొదలైంది. రెండో విడత పోలింగ్ ఈ నెల 14న ఉండటంతో ప్రచారానికి కేవలం ఒకరోజు సమయం మాత్రమే ఉంది. మూడో విడత వారికి కొంత సమయం ఉంది. ఇన్ని రోజులు ఉపసంహరణలు, రెబల్స్ను బతిమిలాడుకోవడంతోనే సమయం పోగా, ఇక మిగిలిన సమయంతో ఓటర్లను గాలం వేసేలా చూస్తున్నారు. ఒక వైపు తాయిలాలు అందజేస్తూ సాయంత్రం పూట విందులు ఇస్తూ ముందుకెళ్తున్నారు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ పల్లెల్లో రాజకీయాలు వేడెక్కాయి. గ్రామాల్లో ఎటు చూసినా ఎన్నికలపైనే చర్చ కొనసాగుతోంది. ఓటర్లు ప్రధాన కూడళ్లు, వీధుల్లో ఎవరినీ అడిగినా ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. కొందరికై తే కార్లు, వెహికిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామపంచాయతీలో ఒక్క ఓటు సైతం కీలకం కావడంతో ఆరోజు ఎన్ని పనులు ఉన్నా వచ్చి ఓటు వేసి వెళ్లాలని అభ్యర్థులు మొర పెట్టుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభ్యర్థుల ప్రచారం మిన్నంటింది. ఎన్నికలపై గ్రామాల్లో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నారు. మరికొంత మంది యువత మాత్రం ప్రత్యేకమైన గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎలాంటి వారికి ఓటు వేయాలి, మంచి వారిని ఎన్నుకోవాలంటూ సందేశాలు ఇస్తున్నారు. ఎన్నికల వేళ ఈ పరిస్థితి నెలకొంది. ఖర్చుకు ఆందోళన రెండు, మూడో విడతకు మరికొంత సమయం ఉండటంతో అభ్యర్థులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నిత్యం వందమందిని వెంటేసుకుని ప్రచారానికి తిరిగితే చాయ్లు, టిఫిన్లు, భోజనాలకు విపరీతంగా ఖర్చు పెరిగిపోతోంది. సాయంత్రం అయిందంటే కచ్చితంగా మందు ఏర్పాటు చేయాల్సి వస్తోందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గుర్తులతో కష్టమే... సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు ఇబ్బందికరంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల లాగా అభ్యర్థి ఫొటోలు ఉండవు. సర్పంచ్కు సంబంధించిన ఎన్నికల్లో గుర్తులు తికమకగానే ఉన్నాయి. టూత్పేస్ట్లు, ఉంగరాలు, గ్యాస్స్టౌవ్లు ఇలాంటి ఉండటంతో ఓటు వేసేవారు గుర్తు పెట్టుకుంటేనే ఓ టు వేయవచ్చు. పెద్దమనుషులు, మహిళలు వారికి ప్రత్యేకంగా వివరించాల్సి న అవసరం ఉంటుంది. రెండు, మూడో విడతలకు అభ్యర్థుల ప్రచారం ఓటర్లకు గాలం వేసేందుకు శతవిధాలా ప్రయత్నం గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్న వైనం -
తొలివిడత ప్రశాంతం
జగిత్యాల: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చలి తీవ్రత అధికంగా ఉన్నా.. వృద్ధులు, మహిళలు, యువత ఓటు హక్కు వినియోగించుకున్నారు. మల్లాపూర్లో 80.07శాతం పోలింగ్ నమోదుకా గా.. అత్యల్పంగా కథలాపూర్లో 74.75 శాతంగా నమోదైంది. మిగిలిన మండలాల్లో 77శాతానికి పై గానే నమోదైంది. జిల్లాలోని 122 పంచాయతీలకు నాలుగు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 118 పంచాయతీలు, 1,172 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందుకోసం మొత్తం 1172 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2005 మంది అధికారులను నియమించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధులు కేటాయించిన 81 మంది హాజరుకాకపోవడంతో కలెక్టర్ సత్యప్రసాద్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మెట్పల్లిలో 77.30 శాతం ఓటింగ్ మెట్పల్లిరూరల్: మండలంలోని 23 గ్రామాల్లో 77.30 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. బండలింగాపూర్, వేంపేట, వెల్లుల, జగ్గాసాగర్ మేజర్ గ్రామాల్లో ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు. వేంపేటలో 101 ఏళ్ల వృద్ధురాలితో ఓటు వేయించారు. బండలింగాపూర్ పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ లత సందర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. వేంపేటలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. జగ్గాసాగర్ పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్ మల్లాపూర్: మల్లాపూర్లోని జెడ్పీ హైస్కూల్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు రమేశ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ బి.రాజాగౌడ్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, ఆర్డీవోలు శ్రీనివాస్, జివాకర్రెడ్డి, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో జగదీష్ ఉన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు కథలాపూర్: కథలాపూర్ మండలంలో 18 సర్పంచ్ స్థానాలు, 157 వార్డుస్థానాలకు ఎన్నికలు జరిగా యి. ఇక్కడ పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటుహక్కు వినియోగించుకోవడం విశేషం. ఇబ్రహీంపట్నంలో..ఇబ్రహీంపట్నం: మండలంలో 17 గ్రామ పంచాయతీలకుగాను మూలరాంపూర్, యామపూర్ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 15 గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 62.9 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. కోరుట్లలో.. కోరుట్లరూరల్: కోరుట్ల మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 78.79 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎంపీడీఓ రామకృష్ణ తెలిపారు. 77.68 శాతం పోలింగ్ మొత్తం ఓటర్లు 2,18,194 మంది పోలైన ఓట్లు 1,60,759 మల్లాపూర్లో అత్యధికంగా 80.07శాతం అత్యల్పంగా కథలాపూర్లో 74.75 శాతం పోలింగ్ 89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ధర్మపురి: కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమఫలాలు అందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోల్లవాగు ప్రాజెక్టు పనులను పూర్తి చేయిస్తానని అన్నారు. గోదావరి పుష్కరాలు విజయవంతం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీపీ సౌల్ల భీమయ్య, జైనా సహకార సంఘం చైర్మన్ సౌల్ల నరేష్, మొగిలి శేఖర్, గడ్డం సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
గ్రామపంచాయతీలకు ఆర్థిక వనరులివే..
రాయికల్: గ్రామ పంచాయతీల్లో మరో వారం రోజుల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉండే ఆర్థిక వనరులు ఏమిటో తెలుసుకునేందుకు కొత్త పాలకవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులే ప్రధాన ఆదాయం. సాధారణ నిధులు గ్రామాభివృద్ధికి తోడ్పడనున్నాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్రం జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చేస్తుంది. నెలకు ఒక్కో వ్యక్తికి రూ.80 నుంచి రూ.90 చొప్పున కేటాయిస్తుంది. ఈ నిధులు ప్రతి మూడునెలలకోసారి ఏడాదిలో నాలుగు విడతలుగా అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు క్రమం తప్పకుండా మంజూరు చేయాల్సి ఉంటుంది. గ్రామంలోని జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చేస్తా రు. ఈ నిధులను మల్టీపర్పస్ వర్కర్లకు వేతనా లు, విద్యుత్ బిల్లులకు చెల్లించే అవకాశం ఉంది. సాధారణ నిధులు పంచాయతీలు సొంతంగా నిధులు సమకూర్చుకునే వాటిని సాధారణ నిధుల కింద గుర్తిస్తారు. ఈ నిధులు పెంచుకోవడానికి పంచాయతీల్లో ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ నిధులు గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టిన ఉపాధిహామీ పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. కూలీలు చేసే పనులకు 60 శాతం, మరో 40 శాతం నిధులు మెటిరియల్, కంపోనెంట్ కింద మంజూరు చేస్తారు. ఈ నిధులతోనే గ్రామాల్లో సీసీరోడ్లు, మురికికాలువలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడతారు. పన్నుల ద్వారా ఆదాయం గ్రామపంచాయతీల పరిధిలో గృహ, ఇంటి నిర్మాణ అనుమతుల ద్వారా, ఆస్తిమార్పిడి, గ్రంథాలయ పన్ను ద్వారా గ్రామాలకు నిధులు సమకూరుతాయి. -
ఆద్యంతం.. ఉత్కంఠ భరితం
● జగ్గాసాగర్, వెల్లుల్ల మేజర్ పంచాయతీల్లో అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు ● ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన జనం మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం జగ్గాసాగర్, వెల్లుల మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచే లెక్కింపు ప్రారంభమైనప్పటికీ ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. జగ్గాసాగర్ సర్పంచ్గా పుల్ల సాయగౌడ్(జగన్గౌడ్) గెలుపొందారు. తన సమీప అభ్యర్థి ముదాం నర్సయ్యపై 85 ఓట్ల మెజార్టీ సాధించారు. వెల్లుల సర్పంచ్గా గూడురు తిరుపతి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి గోపిగౌడ్పై 296 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆద్యంతం..ఉత్కంఠభరితం అన్నట్లుగా ఈ రెండు గ్రామాల్లోని ఎన్నికలు, ఫలితాల విషయంలో అదే తరహా జరగడం విశేషం. మెరుగైన వైద్య సేవలు అందించాలివెల్గటూర్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ అన్నారు. గురువారం వెల్గటూర్, అంబరిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఇమ్యునైజేషన్ అధికారి శ్రీనివాస్తో కలిసి తనిఖీ చేశారు. ఓపీ, ఫార్మసీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. హాస్పిటల్ పరిశుభ్రతను పరిశీలించారు. వెల్గటూర్, అంబరిపేట వైద్యాధికారులు తేజశ్రీ, లవకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదించాలిజగిత్యాలటౌన్: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లుకు సుముఖంగా ఉన్నందున ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఉభయసభల్లో చర్చకు తెచ్చి ఆమోదం పొందేలా కృషి చేయాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీసీ బిల్లుపై చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆర్.కృష్ణయ్యకు లేఖ రాశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు పాల్గొన్నారు. 7.5 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు గురువారం 7.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఎండపల్లి మండలం గుల్లకోటలో 7.5, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 8, ధర్మపురి మండలం నేరెళ్లలో 8.1, భీమారం మండలం మన్నెగూడెం, గోవిందారంలో 8.2, కథలాపూర్లో 8.2, కోరుట్ల మండలం అయిలాపూర్లో 8.5, రాయికల్లో 8.7, మల్లాపూర్లో 8.8, మల్యాలలో 8.8, మేడిపల్లిలో 8.9, జగిత్యాలలో 9 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఎన్హెచ్ 563 అంబారిపేట, అంతర్గాం గ్రామాల వద్దౖ ఫ్లెవర్, అండర్ పాస్, ఎన్హెచ్–63 రోడ్లో అనంతారం వద్ద హైలెవల్ వంతెన, ఎన్హెచ్–61 రోడ్లో చల్గల్, సింగరావుపేట, ఇటిక్యాల వద్ద హైలెవల్ బ్రిడ్జి, బోర్నపల్లి, జగన్నాథపూర్ హైలెవల్ వంతెనకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఎంపీ స్పందించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. -
హస్తం హవా
కరీంనగర్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 398స్థానాలకు గానూ 203 స్థానాలు కై వసం చేసుకొని అధికార పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 121స్థానాలతో పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 37 స్థానాలతో మూడో స్థానం దక్కించుకుంది. గత ఎన్నికలతో పోల్చినప్పుడు కాంగ్రెస్ మొదటి స్థానంలోకి దూసుకురాగా, బీజేపీ తన స్థానాలను మెరుగుపరుచుకొని మూడో స్థానంలో నిలిచింది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 99 స్థానాలకు గానూ కోర్టు వ్యవహారంతో పెద్దంపేట ఎన్నికల నిలిచిపోయింది. జూలపల్లి, కమాన్పూర్ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. నాలుగు గ్రామాలను కాంగ్రెస్ ఏకగ్రీవంతో ఎగరేసుకుపోయింది.ఉమ్మడి జిల్లాలో పార్టీల పరంగా గెలిచిన మద్దతుదారులు జిల్లా గ్రామాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు కరీంనగర్ 92 44 24 14 10 పెద్దపల్లి 99 69 21 00 06 జగిత్యాల 122 51 48 16 07 సిరిసిల్ల 85 39 28 07 11 మొత్తం 398 203 121 37 34 -
పోలింగ్ బూత్లోకి పోలీసులకు అనుమతి లేదు
టెండర్డ్ ఓటు విధానంజగిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఒక వ్యక్తి నిర్దిష్టమైన ఓటరుగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు.. అతని ఓటు ఇంతకుముందే ఎవరైనా వేసినట్లు మార్క్కాపీలో రికార్డు అయి ఉంటే ప్రిసైడింగ్ అధికారి అతని గుర్తింపుపై సంతృప్తి చెందితే.. ఇతర ఓటర్లకు ఇచ్చిన విధంగానే తన ఓటు మార్క్ చేయడానికి బ్యాలెట్ పేపరు ఇవ్వాల్సి ఉంటుంది. రాయికల్: సర్పంచ్.. గ్రామానికి ప్రథమ పౌరుడు. గ్రామంలో ఎలాంటి అధికార కార్యక్రమాలు చేపట్టినా ప్రొటోకాల్ ప్రకారం సర్పంచ్ను ఆహ్వానిస్తారు. వీరికి గౌరవ వేతనం కింద రూ.6,500 ప్రభుత్వం చెల్లిస్తుంది. సర్పంచ్ పదవిలో ఉన్న వారికి కొన్ని అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. నెలకోసారి పంచాయతీ పాలకవర్గంతో కలిసి సమావేశం ఏర్పాటు చేయించాలి. రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీల్లో ఆదాయ, వ్యయాల ఖాతాలు తనిఖీ చేయాలి. గ్రామాభివృద్ధికి సక్రమంగా నిధులు వినియోగించేలా చూడాలి. మొక్కలు నాటించి.. వాటిలో 85 శాతం మొక్కలు బతికేలా చూడాలి. ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించుకునేలా.. వాటిని వినియోగంలోకి తెచ్చుకునేలా చూడాలి. చెత్తాచెదారం రోడ్లపై వేస్తే రూ.500 జరిమానా విధించే అధికారం కూడా సర్పంచ్కు ఉంది. ఉపసర్పంచ్కు గౌరవ వేతనం లేదు ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు పారితోషికం, గౌరవ వేతనం ఉండదు. ప్రజల మనసుల్లో స్థానం సాధించుకునేందుకు ఈ పదవులు దోహదపడతాయి. సమావేశాలకు హాజరుకాకపోతే అనర్హులు సర్పంచ్ తన విధులను సక్రమంగా నిర్వహించకపోయినా.. రెండు నెలలకోసారి చొప్పున మూడుసార్లు గ్రామసభ చేపట్టకపోయినా చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం తన పదవిని కోల్పోతారు. అవినీతి ఆరోపణలు నిరూపణ అయితే ప్రజాప్రతినిథ్య చట్టం 1951 సెక్షన్ 8 కింద పదవి నుంచి తొలగిస్తారు. గ్రామపంచాయతీ ఆడిట్ లెక్కలు పూర్తి చేయకపోతే సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. వార్డు సభ్యులు మూడు సమావేశాలకు.. మహిళాసభ్యులు ఆరు సమావేశాలకు వరుసగా హాజరు కాకపోతే కలెక్టర్ వారిని పదవి నుంచి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. అంధత్వం, ఆశక్తి ఓట్లను రికార్డు చేయడం ఇలా..జగిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో అంధత్వం, ఏదైనా ఇతర శారీరక ఆశక్తత కారణంగా ఓటరు బ్యాలెట్ పేపర్పై ఉన్న గుర్తులను గుర్తించలేకపోయినప్పుడు.. ఇతరుల సహాయం లేకుండా బ్యాలెట్ పేపర్పై ముద్ర వేయలేరని ప్రిసైడింగ్ అధికారి సంతృప్తి చెందినప్పుడు.. ఆ ఓటరు తరఫున బ్యాలెట్ పేపర్పై అతని అభీష్టం మేరకు ఓటు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. అవసరమైతే బ్యాలెట్ పేపర్ను మడతపెట్టి దానిని బ్యాలెట్ బాక్స్లో వేయడానికి.. ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి 18 ఏళ్ల పైబడిన ఓ సహాయకుడిని తనతో తీసుకెళ్లడానికి ఓటరుకు అనుమతిస్తారు. జగిత్యాలజోన్: ఎన్నికల నిబంధన ప్రకారం పోలింగ్ బూత్లోకి వెళ్లేందుకు పోలీసులకు కూడా అనుమతి లేదు. శాంతిభద్రతలు, ఇతర కారణాలతో సంబంధిత పోలింగ్ అఽధికారి పిలిస్తే తప్ప.. యూనిఫాం వేసుకున్న, సాధారణ దుస్తులు వేసుకున్న పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది పోలింగ్ బూత్లోకి వెళ్లరాదు. అలాగే ఓటు వేయడానికి వచ్చే అభ్యర్థికి లేదా ఓటరుకు భద్రతగా వచ్చే పోలీస్ సిబ్బందికి కూడా పోలింగ్ స్టేషన్లోకి అనుమతి లేదు. గన్మెన్ ఉన్న వ్యక్తిని పోలింగ్ ఏజెంట్గా నియమించరాదు. పోలింగ్ స్టేషన్లోకి కేవలం పోలింగ్ అధికారులు, పోటీ చేస్తున్న అభ్యర్థి, అతని ఏజెంట్, ఎన్నికల సంఘం అనుమతించిన వ్యక్తులు, ఎన్నికల సంఘం నియమించిన పర్యవేక్షకులు, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న వ్యక్తులు, ఓటరుతోపాటు ఆమె ఎత్తుకున్న చిన్నపిల్లలు, ఇతరుల సహాయం లేకుండా ఓటు వేయలేని వారు, ఓటర్లను గుర్తించే నిమిత్తం ప్రిసైడింగ్ ఆఫీసర్ నియమించుకున్న వ్యక్తులు మాత్రమే పోలింగ్ స్టేషన్లోకి అనుమతించబడతారు. వేసిన ఓటు ఫొటో తీయడం నిషేధంజగిత్యాలజోన్: పోలింగ్ బూత్లో ఎవరైనా వేసిన ఓటును ఫొటో తీయడం నిషేదం. ఓటరు, అభ్యర్థి, ఏజెంట్ మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడం కూడా నిషేధం. పోలింగ్ కేంద్రంలో పొగతాగరాదు. ఓటు వేసేందుకు వచ్చి పోలింగ్ కేంద్రం బయట, లైన్లో నిలబడిన ఓటర్లతో మాట్లాడటానికి, ఫొటోలు తీసుకోవడానికి మీడియా ప్రతినిధులకు ఆంక్షలు లేవు. మీడియా ప్రతినిధులు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి ఫొటోలు తీసుకోరాదు. ఓటర్ కాని వ్యక్తిని పోలీంగ్ స్టేషన్ లోపలికి అనుమతించడానికి జిల్లా ఎన్నికల అధికారికి కూడా అధికారం లేదు. గిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఒక్కోవార్డుకు ఒక్కో పోలింగ్ కేంద్రం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలు పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారికి పోలింగ్ బ్యాలెట్ బాక్స్లను అప్పగించాలి. అలాగే వారు పోలింగ్ కేంద్రాల్లో వినియోగించిన పేపర్లు, సామగ్రిని అధికారికి అప్పగించాలి. మొదట లెక్కించాల్సింది పోస్టల్ బ్యాలెట్ పేపర్లుజగిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటింగ్ లెక్కింపు సమయంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లనే లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ల్లో ఉన్న ఓట్లను లెక్కించి రిటర్నింగ్ అధికారి సమక్షంలో లెక్కింపు పూర్తి చేస్తారు. సర్పంచ్ గౌరవ వేతనం రూ.6,500రిటర్నింగ్ అధికారికే బ్యాలెట్ బాక్స్ల అప్పగింత -
ప్రశాంత వాతావరణంలో ఓటేయండి
మొదటి విడత పోలింగ్లో ఎంతమంది సిబ్బందిని నియమించారు..? ఎన్నికల సామగ్రి పంపిణీ..? పోలింగ్ కేంద్రాల వద్ద..? ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి చర్యలు చేపట్టారు..? పోలింగ్ సిబ్బందికి శిక్షణ..? సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో చర్యలు? ఎన్నికల నియామవళి అమలుకు చర్యలు..? పోలింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారా? జగిత్యాల: జిల్లాలో మొదటి విడత పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. అవసరమైన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించామని వివరించారు. పోలింగ్ బాక్స్లు, బ్యాలెట్పత్రాలు సిద్ధం చేశామన్నారు. మొదటి విడత పోలింగ్ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. మొదటి విడత ఎన్ని మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు..? ప్రలోభాలకు లొంగకూడదు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభం ‘సాక్షి’తో కలెక్టర్ సత్యప్రసాద్ -
ఎన్నికల సిబ్బందికి వసతులు కల్పించాలి
ఇబ్రహీంపట్నం: పోలింగ్ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని మోడల్స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ కేంద్రాన్ని కలెక్టర్, అడిషినల్ కలెక్టర్ లత, అబ్జర్వర్ రమేశ్ వేర్వేరుగా పరిశీలించారు. ఆర్వోలు, పీవోలు గైర్హాజరు అయితే సమాచారం అందించాలని తెలిపారు. సిబ్బంది ప్రత్యేక బస్సుల్లో వెళ్లగానే పోలింగ్ స్టేషన్ల వద్ద వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చిప్ప గణేశ్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈవో మధు, తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో అభ్యర్థి మృతి
మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడిగా పోటీలో నిలిచిన ముత్యాల చంద్రారెడ్డి(46) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. చంద్రారెడ్డికి వార్డు సభ్యుడిగా పోటీచేసే అవకాశం రావడంతో గ్రామంలోని 8వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అప్పటినుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నిలిచారు. బుదవారం ఉదయం కూడా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గుండెపోటుకు గురై చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పిచ్చి కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలో బుధవారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ఈదునూరి బానేశ్, భాగ్య, దుర్గమ్మ, రుద్ర, నర్మదపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి రుద్ర, మరో నలుగురిని కొరికింది. ఇందులో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. గాయపడినవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లగా సిబ్బంది వైద్యం అందిస్తున్నారు. పిచ్చి కుక్కల బారినుంచి తమను రక్షించాలని కాలనీవాసులతోపాటు సీపీఎం నాయకులు రామాచారి, భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, మల్లేశ్, నాగలక్ష్మి డిమాండ్ చేశారు. -
మీ పల్లెను మాట్లాడుతున్నా..
సిరిసిల్ల: అప్పుడే తెల్లారుతోంది. మంచుతెరలు కమ్ముకున్నాయి. సూర్యుడి లేలేత కిరణాలు పల్లెముంగిలికి చేరుతున్నాయి. ఈరోజు ఓట్ల పండగ. ఈ ఒక్క రోజు నువ్వే రారాజువి. పోటీ చేసిన అభ్యర్థులంతా నీ చుట్టూ చేరి చేతులు జోడించి ఓట్లు అడుగుతున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే అరుదైన అవకాశం ఇది. బయలుదేరు.. ఓటు అస్త్రాన్ని సంధించు. ఊరికి ఉపకారం చేసే అభ్యర్థిని సర్పంచిగా గెలిపించు. వంగి వంగి దండాలు పెట్టిన అభ్యర్థులంతా మట్టి కరువాలి. మన తలరాతలను మార్చే మంచోడికి ఓటేయ్యి. ఎన్నికల రోజు కాబట్టి నా మనసు ఊరుకో లేక.. మీకో లేఖ రాస్తున్నా..! ఊరుకు సర్పంచే సుప్రీం ఒక్కసారి ఆలోచించండి. ఊరికి సర్పంచే సుప్రీం. పల్లె మారాలి.. ప్రగతి పల్లవించాలంటే మీ ఓటుతోనే సాధ్యం. సర్పంచిగా పోటీచేసిన అభ్యర్థులు చెప్పే మాయమాటలు నమ్మకండి. అరచేతిలో వైకుంఠం.. చూపించే మాటల గారడి అభ్యర్థుల సంగతి చూడండి. ఐదు వందలకో, వెయ్యికో, రెండు వేలకో.. మద్యం సీసాకో, ఓ చీరకో ఓటును అమ్మకండి. ఆ నవ్వు వెనక నయవంచనను గుర్తించండి గతంలో ఏం జరిగిందో ఆలోచించండి. ‘నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రలు అయినట్లు.’ మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు.. వాళ్లు అబద్ధపు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఏవేవో ఇస్తామని ఆశలు పెడుతుండ్రు. కులం, మతం, వాడకట్టు పాటలు పాడి మీ ముందుకొచ్చిన నేతల అసలు రూపం ఏంటో నా కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆ నవ్వు వెనక ఉన్న నయవంచనను గుర్తించండి. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. ఎన్నెన్నో చెప్పి గెలిచాక ఊరి అభివృద్ధిని మరిచి గ్రామసభలు పెట్టకుండా.. సమస్యల ప్రాధాన్యతను గుర్తించకుండా.. ప్రజల బాధలను పట్టించుకోకుండా కాంట్రాక్టులు చేసి సంపాదించుకునే వారిని, కమీషన్లు దండుకునే వారిని ఎన్నుకోవాలా? ఏదైనా పని పడి వెళ్తే ఇంటి గేటవుతల నిలబెట్టే వారిని గెలిపించాలా? ఇకనైన కళ్లు తెరవండి. దండం పెట్టాడని ఓటేస్తే... మళ్లీ ఓట్ల సీజన్ దాకా కనిపించడు. ఆత్మసాక్షిగా ఓటేయండి మీకు అందుబాటులో ఉండి సేవ చేసే నిస్వార్థ నాయకున్ని ఎన్నుకోండి. ఆత్మసాక్షిగా ఓటేయండి. గతంలో ఊరి సర్పంచులుగా ఎన్నికై న వారు ఏం చేశారో ఆలోచించండి. అందుకే ఎన్నికల వేళ మీ అందరికీ ఓ విన్నపం. మీకు మంచి పనులు చేసే సర్పంచిని, వార్డు సభ్యులనే ఎన్నుకోండి. మీకు మేలు చేసే వారిని మరవద్దు. తెలంగాణలో ఓ సామెత ఉంది. కళ్ల ముందు కనిపించే కూట్లో రాయి తీయనోడు.. ‘ఎక్కడో ఉండే ఏట్లో రాయి తీస్తడా..’ అని. ఇవన్నీ మీకు తెలియనివి కావు. కానీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ‘తిన్న రేవును తలవాలంటారు’ అందుకే చెబుతున్నా. మీకు మంచి చేసిన వారిని విస్మరించొద్దు. కులమనో.. ప్రాంతమనో... ఓటు వేస్తే ఫలితం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఊరందరి సమస్యలను తనవిగా భావించే వారినే ఎన్నుకోండి. గతంలో సర్పంచులుగా పనిచేసిన వారు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దిగమించిన సంగతి మీకు తెలుసు. పింఛన్ కోసం వెళ్తే పైసలు గుంజిన సంగతి ఎరుకే. అన్నింటికి మించి తాగేందుకు నీరు ఇవ్వని వారు.. ఒక్క వీధిదీపమైనా పెట్టని వారు.. ఎందరో ఉన్నారు. సహజ సంపదను దోచెటోళ్లు వాగు ఇసుకను, గుట్టల రాళ్లను, మొరం, అడవులను దోచి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి సంపాదించినోళ్లూ ఉన్నారు. మీ క్షేమం.. నా సంక్షేమాన్ని చూసుకునే మంచి వారు అందలమెక్కాలి. ఇక లెవ్వు.. చలి కాలమని.. పనికాలమని ఓటు వేయకుండా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఉండొద్దు. మీ ఓటే వజ్రాయుధం. నీతివంతులకు పట్టం కడితే... మీ ఊరూ, వాడ బాగవుతుంది. అవినీతిపరులను, డబ్బులిచ్చినోడికి ఓటేస్తే ఇక ఐదేండ్లు అతడి అవినీతికి లైసెన్సిచ్చినట్లవుతుంది. ఇంకో మాట ఈ రోజు పోలింగ్ పగలు ఒంటిగంట వరకు ఉంటది. ఈలోగా నువ్వు పోలింగ్ కేంద్రానికి వెళ్తేనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆలస్యమైతే అంతే.. సంగతి.. ఇంకో మాట ఈ సారి రెండు ఓట్లు ఉంటయి. బ్యాలెట్ పత్రాలు రెండు ఇస్తారు. ఒక్క గులాబి రంగు సర్పంచి ఓటు.. ఇంకోటి తెల్లరంగు పత్రం వార్డు సభ్యుడి ఓటు సరిగ్గా గుర్తును చూసి ఓటేయండి.. మీ బాగోగులు చూసుకునే ఆత్మీయుడికి పట్టం కట్టండి. మీ అంతరాత్మ ‘సాక్షి’గా ఓటు వేయండి. ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా మొర ఆలకించినందుకు మీ అందరికీ నా దండాలు.. ఇక ఉంటాను. ఇట్లు మీ అందరి సంక్షేమాన్ని కోరే మీ పల్లె తల్లి -
ఊరు రమ్మంటోంది..
తొలి విడత పోలింగ్: ఈనెల 11(నేడే) పోలింగ్ జరిగే సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం: అదే రోజు ● సమగ్ర కుటుంబ సర్వేను మరిపించమంటోంది.. ● ఒక్క ఓటూ కీలకమే.. ● శత శాతం ఓటింగ్తోనే ప్రజాస్వామ్యం ● నచ్చకుంటే ‘నోటా’ ఉందిగా..కరీంనగర్ అర్బన్: దసరా వచ్చిందంటే.. రెక్కలు కట్టుకొని సొంతూళ్లో వాలిపోతాం. సంక్రాంతి ఇంకా నెల ఉందనగానే పుట్టిన పల్లెకు పోవడానికి ముందే టికెట్లు బుక్ చేసుకుంటాం. ఏడాదిలో వచ్చే అనేక వేడుకలు, శుభకార్యాలకు గ్రామానికి వస్తాం. బంధువులను పలకరించి.. అయినవాళ్లతో హాయిగా గడిపి మళ్లీ వెళ్లిపోతాం. మరి ఈనెల 11, 14, 17 తేదీల్లో మీమీ జన్మస్థలాల్లో గొప్ప కార్యం జరగబోతోంది. దానికి అందరూ తప్పకుండా రావాలని ఊరు పిలుస్తోంది. ఓటు తలస్తోంది. అదే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వజ్రాయుధం. మిగతా సంబురాల్లాగానే దీనికి తప్పకుండా వచ్చి ఓటేసి సొంత గడ్డపై ఒకరోజు హాయిగా సేదదీరి వెళ్లాలని కోరుతోంది. ఓటేసి పొమ్మంటోంది. ● ఒక్క ఓటూ కీలకమే.. దేశ, రాష్ట్రంలోనే కాదు.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక్క ఓటు కీలకమైంది. అందుకు గత ఎన్నికలే నిదర్శనం. గంగాధర మండలం మల్లాపూర్లో కిషన్, అంజయ్య పోటీ పడగా.. ఇద్దరికి 471 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీసి అంజయ్యను సర్పంచ్గా ప్రకటించారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో కల్పన, మాధవి పోటీ పడగా.. ఇద్దరికి 1,250 ఓట్లు వచ్చాయి. అధికారులు మూడుసార్లు ఓట్లను లెక్కించినా.. అదే ఫలితం రావడంతో టాస్ వేసి కల్పనను విజేతగా ప్రకటించారు. జిల్లాలో 318 గ్రామాలకు గానూ 316 గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పావువంతు గ్రామాల్లో నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఈక్రమంలో ఒక్క ఓటూ ఫలితాన్ని మార్చనుంది. ● పలు రాష్ట్రాల్లో ఓటర్లు జిల్లాలోని చాలామంది విద్య, వ్యాపారం, ఉపాధిరీత్యా దేశం నలుమూలలా ఉంటున్నారు. ఉద్యోగులు బదిలీపై పొరుగు జిల్లాలకు వెళ్లి నివసిస్తున్నారు. చేనేత కార్మికులు వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఇలా అనేక వర్గాల ప్రజలు మరోచోట ఉన్నా.. ఓటు మాత్రం సొంతూళ్లోనే ఉంది. ఇతర రాష్ట్రాల్లోని వారు ఒకరోజు సెలవు పెట్టుకొని వస్తే ఓటేయొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులను చూడొచ్చు. పలకరించొచ్చు. ఉత్సవాలను ఆత్మీయుల మధ్య చేసుకొని ఓ ప్రజాస్వామ్య పండగ్గా భావించి పోలింగ్ రోజును ఘనంగా నిర్వహించుకోండి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సకల సౌకరా్యాలు కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా.. ఒకరోజు ముందే వస్తే మంచిది. ● యాది చేసుకోండి.. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. అప్పుడు బయట ఉండేవారంతా రెక్కలు కట్టుకొని వచ్చి వాలారు. అలాగే ఓటు వేడుకకూ తరలొచ్చి నచ్చిన వారికి ఓటేసి వెళ్తే ప్రజా స్వామ్య యజ్ఞంలో పాలుపంచుకున్న తృప్తి ఉంటుంది. నాకెందుకులే అనుకోవద్దు. నీ ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయించొచ్చు. కీలకంగా మా రొచ్చు. మీరు ఎన్నుకున్న వ్యక్తి వల్ల ఊరు బాగు ప డిందంటే అభివద్ధిలో మీ భాగస్వామ్యం ఉన్నట్టేగా. ● ప్రలోభాలకు లొంగొద్దు ఇప్పుడు పలు రాజకీయ పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లపై దృష్టి పెట్టాయి. ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి బూత్ కమిటీలతో ఆరా తీసి ఇప్పటికే ఫోన్లు చేశారు. దారి ఖర్చులతోపాటు ఇతర ఖర్చులను భరిస్తామని ప్రలోభపెడుతున్నారని సమాచారం. పోలింగ్ తేదీన రప్పించడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎవరి మాటలూ నమ్మకుండా స్వేచ్ఛగా ఓటెయ్యండి. విద్యార్థులు: ఢిల్లీ, చైన్నె, హైదరాబాద్, కర్నాటక, పంజాబ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు: బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, తిరువనంతపురం, ముంబయి, ఢిల్లీ చేనేతలు: సూరత్, భీవండి, అహ్మదాబాద్, ముంబయి ఉద్యోగులు: కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి వ్యాపారులు: హైదరాబాద్తోపాటు అనేక జిల్లాలు, ఇతర రాష్ట్రాలు కార్మికులు: ముంబయి, హైదరాబాద్ -
ఘనంగా మల్లన్నస్వామి జాతర ఉత్సవాలు
కథలాపూర్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎన్నికల సామగ్రిని సరిచూసుకుంటున్న సిబ్బందిగొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేట శ్రీమల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం దండివారం సందర్భంగా సుమారు 18 వేల మంది భక్తులు బోనాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్.సుప్రియ, జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమౌళి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.65,270 ఆదా యం సమకూరింది. ఫౌండర్ ట్రస్టీ కొండూరి శంతయ్య, ఈవో ముద్దం విక్రం, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, ధర్మపురి ఎస్సై మహేశ్, అర్చకులు రాజేందర్, పోలీస్ సిబ్బంది, సిబ్బంది పెడివెల్లి నర్సయ్య, రాజేందర్, శివకేశవ్, గంగాధర్ పాల్గొన్నారు. -
అందుబాటులోకి ‘మ్యాంగోమాస్టర్’
జగిత్యాలఅగ్రికల్చర్: తెగుళ్ల బారి నుంచి మామిడి తోటలను కాపాడుకునేందుకు రైతులు నాలుగైదుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తుంటారు. చెట్లు ఎత్తుగా ఉంటే పిచికారీ చేయడం చాలా ఇబ్బంది. ఈ క్రమంలో రైతుల ఇబ్బందులు తప్పించేందుకు మ్యాంగో మాస్టర్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రం 42 హెచ్పీ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్కు బిగించుకోవచ్చు. యంత్రం ద్వారా పొగమంచులాగా నీటి బిందువులు మామిడి ఆకులపై పడతాయి. చెట్టు ఎంత ఎత్తు ఉన్నా మందును సమంగా పిచికారీ చేస్తుంది. 25 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల అడ్డంతో మందును సమర్థవంతంగా పిచికారీ చేస్తుంది. యంత్రం బరువు 220 కిలోలు. గంటకు 3 వేల లీటర్ల మందును చెట్లపై పిచికారీ చేస్తుంది. యంత్రానికి కంప్యూటరైజ్డ్ బ్యాలెన్స్డ్ ఫ్యాన్ సిస్టం రివర్స్గా ఉంటుంది. తద్వారా యంత్రం నడిచేటప్పుడు చెట్ల ఆకులు, భూమి మీది గడ్డిని ఫ్యాన్లలోకి లాక్కోకుండా ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వద్ద కంప్యూటరైజ్డ్ ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. కూలీల అవసరం లేకుండానే మందు పిచికారీ చేసుకోవచ్చు. దీని ధర రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఉంటుంది. మామిడి తోటల్లో పిచికారీ యంత్రం కూలీల సమస్యకు చెక్ -
అప్పుడు నో.. ఇప్పుడు సై..
● 2019లో ఎన్నికలను బహిష్కరించిన గొల్లపల్లి గ్రామస్తులు ఇల్లంతకుంట(మానకొండూర్): తమ గ్రామ ఓట్లు తమ గ్రామం నుంచి విడిపోయి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీలో కలవడాన్ని నిరసిస్తూ.. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను గొల్లపల్లి గ్రామస్తులు బహిష్కరించారు. అదే సంవత్సరం మూడు నెలల తర్వాత మళ్లీ గొల్లపల్లి గ్రామానికి రీనోటిఫికేషన్ వేశారు. సర్పంచ్, వార్డులకు నామినేషన్లు అభ్యర్థులు వేశారు. తీరా ఓటర్ లిస్టు పరిశీలించగా.. తమ గ్రామం నుంచి విడిపోయిన 148 ఓట్లు కలవకపోవడంతో మళ్లీ బహిష్కరించారు. గ్రామ పరిపాలన అప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్చార్జి అధికారులే నిర్వహిస్తూ వచ్చారు. సంవత్సర క్రితం జరిగిన రీసర్వేలో తమ గ్రామ ఓట్లు 150, సరిహద్దులు తమ గ్రామంలో మళ్లీ కలవడంతో.. ఆరేళ్ల అనంతరం తిరిగి ఈసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పాల్గొంటున్నారు. గ్రామంలో 620 ఓటర్లున్నారు. 8 వార్డులుండగా.. మూడు, నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళ రిజర్వేషన్ కాగా.. రడం లక్ష్మి, కడగండ్ల శిరీష పోటీ చేస్తున్నారు. శిరీష అంగన్వాడీ ఆయా పోస్టుకు రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలబడ్డారు. -
తొలివిడత పోలింగ్కు సిద్ధం
జగిత్యాల: జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని 122 గ్రామపంచాయతీల్లో ఓటింగ్ జరగనుంది. మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. సామగ్రితో సిబ్బంది ఆయా గ్రామాలకు తరలివెళ్లారు. ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ పకడ్బందీ నిఘా పెట్టారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ చేపట్టి తర్వాత ఫలితాలు ప్రకటించనున్నారు. భారీ బందోబస్తు మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటికే ఎస్పీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు విధులు కేటాయించారు. ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను నియమించారు. గ్రామాల్లో సందడి.. మొదలైన పంపకాలు తొలిదశ ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో అధికారికంగా ప్రచారం ముగిసినప్పటికీ కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై రాత్రి నుంచే గ్రామాల్లో జోరందుకుంది. మొదటి విడత ఏడు మండలాల్లోని 122 గ్రామ పంచాయతీల్లో తాయిలాల పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నారు. పోలీసు నిఘా ఏర్పాటు చేసినప్పటికీ రంగంలో ఉన్న అభ్యర్థులు మాత్రం ప్రతి ఓటరును కలుస్తున్నారు. పొరపాట్లు జరగనీయొద్దు: కలెక్టర్ సత్యప్రసాద్ మల్లాపూర్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షప్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికలను సజావుగా జరిపించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారించుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు సరఫరా ఉండేలా చూడాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు సామగ్రితో గ్రామాలకు తరలిన సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ రెండు గంటల నుంచి కౌంటింగ్.. ఫలితాల ప్రకటనమండలాలు : మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్న మల్లాపూర్ పంచాయతీలు : 122 వార్డులు : 1172 పోలింగ్ కేంద్రాలు : 1172 ఓటర్లు : 2,20,147 వోపీవోలు : 2005 బ్యాలెట్ బాక్స్లు : 1406 -
మెడికల్ కళాశాల పూర్తయ్యేదెప్పుడు..?
జగిత్యాల: జిల్లాకో మెడికల్ కళాశాల ఉండాలనే విజన్తో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, ఇందులో భాగంగా జగిత్యాలకు వైద్య కళాశాల మంజూరు చేసి 80శాతం పనులు పూర్తి చేసినా.. మిగిలిన 20శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలను బుధవారం సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కడికో వెళ్లి చదువుకోకుండా ఇక్కడే కళాశాలను ప్రారంభించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మెడికల్ కళాశాలలో హాస్టల్, కళాశాల, ల్యాబ్లు పూర్తి కాలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ 80శాతం కేసీఆర్ పూర్తి చేశారని, మిగతా 20 శాతం రెండేళ్లయినా పూర్తి చేయడంలేదని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీకి తాము మద్దతు ఇస్తామని, అదే సమయంలో మెడికల్ కళాశాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. కేసీఆర్ హయాంలోనే 80 శాతం పూర్తి 20 శాతం పనులు కూడా చేపట్టలేకపోతున్నారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
అందుబాటులోకి సర్వైకల్ వ్యాక్సిన్
● డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ జగిత్యాల: సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించిన వ్యాక్సిన్ ప్రభుత్వం ద్వారా త్వరలోనే పంపిణీ చేస్తామని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఐఎంఏ హాల్లో సూపర్వైజర్లకు వ్యాక్సిన్కు సంబంధించి శిక్షణ కల్పించారు. 14 ఏళ్లలోపు అమ్మాయిలకు ఈ సర్వైకల్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని, ప్రస్తుతం ఇది ప్రైవేటులోనే అందుబాటులోనే ఉందని, తాజాగా ప్రభుత్వం కూడా పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రతి మహిళ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. సూపర్వైజర్లకు ఈ వ్యాక్సిన్ ఎలా వేయాలన్న అంశంపై పూర్తిస్తాయిలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు పాల్గొన్నారు. పీవో, ఏపీవోల పాత్ర కీలకం● అడిషనల్ కలెక్టర్ లతమెట్పల్లిరూరల్: ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. పీవో, ఏపీవోతోపాటు ఇతర అధికారులకు పలు విషయాలపై వివరించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని సూచించా రు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. అలాగే ఎన్నికల అబ్జర్వర్ రమేశ్, డీపీవో రఘువరన్ డిస్ట్రిబ్యూషన్ తీరు ను పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీ ల్దార్ నీత, ఎంపీడీవో సురేశ్, ఎంపీవో మహేశ్వర్రెడ్డి, ఆర్ఐ కాంతయ్య పాల్గొన్నారు. కూర లేక ఇబ్బందులు పడ్డ ఎన్నికల సిబ్బందిఇబ్రహీంపట్నం : మండలకేంద్రంలోని మోడల్స్కూల్ వద్ద ఎన్నికల డిస్టిబ్యూటర్ కేంద్రంలో బుధవారం పోలింగ్ కేంద్రాల సామగ్రిని తీసుకుని భోజనం చేసేందుకు సిబ్బంది వెళ్లగా కూర లేక ఇబ్బంది పడ్డారు. ముందుగా భోజనం చేసిన సిబ్బందికి మాత్రమే కూరలు సరిపోవడంతో చివరిలో భోజనం చేసేందుకు వచ్చిన సిబ్బందికి కూరలు లేకపొవడంతో అన్నం పెట్టుకుని, కొందరు పెరుగుతో, మరికొందరు తెల్ల అన్నంనే తిని కడుపునింపుకున్నారు. కొందరు ఉపాధ్యాయులు అయితే సరిపడా ఎందుకు వంటలు వండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమ్యూనరేషన్ ఒకేలా ఇవ్వాలని వినతికోరుట్లటౌన్: ఎన్నికల సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా ఒకేలా రెమ్యూనరేషన్ ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్కు ఆర్టీపీపీ రాష్ట్ర సహాధ్యక్షుడు వేల్పుల స్వామి యాదవ్ విన్నవించారు. కోరుట్ల ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వినతి పత్రం అందించారు. ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట ఓ టింగ్, కౌంటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ఎన్నికల మరుసటి రోజు ఓడి కల్పించాలని అదనపు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కార్మికులకు వేతనంతో కూడిన సెలవుజగిత్యాలటౌన్: పంచాయితీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులకు కార్మిక సహాయ కమిషనర్ సురేందర్ సూచించారు. సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేలా కార్మికులకు ఒకరోజు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై 1988 సెక్షన్(13) కార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కేటీఆర్ కాన్వాయ్ తనిఖీ
తంగళ్లపల్లి: సిరిసిల్లలో పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు కాన్వాయ్ను బుధవారం జిల్లా శివారులోని జిల్లెల్ల చెక్పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నిబంధనల ప్రకారం కేటీఆర్ కాన్వాయ్ వాహనాలను తనిఖీ చేసి తర్వాత అనుమతించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కారు దిగి అధికారులకు సహకరించారు. 14న తేజస్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని తేజస్ ఐఐటీ/నీట్ అకాడమీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఈనెల 14న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు తేజస్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్–2025ను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ సీహెచ్ సతీశ్రావు తెలిపారు. కొత్తపల్లిలోని తేజస్ జూనియర్ కళాశాలలో బుధవారం పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో 10 నుంచి 50 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వివరాలకు 81063 10960, 81063 66661, 98494 66661లో సంప్రదించాలని తెలిపారు. ప్రిన్సిపాల్ జి.కిషన్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు
మెట్పల్లిరూరల్: పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. పట్టణంలోని పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి గ్రామాలకు ఎన్నికల సామగ్రిని పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య తరలించామని, ఇందుకోసం ప్రత్యేకంగా రూట్ మొబైల్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్కార్ట్ సహాయంతో పోలింగ్ సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించామన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్బాటిళ్లు తీసుకెళ్లరాదని, సెల్ఫీలు దిగడం నిషేధమని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ రాములు, సీఐ అనిల్, ఎస్సై కిరణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ అశోక్కుమార్ -
మెడికల్ రిప్ ఆత్మహత్య
● వెంటాడిన బట్టల షాపు అప్పులు ● వడ్డీలు కట్టలేక మనస్తాపం చొప్పదండి: పట్టణంలోని మసీద్ రోడ్డుకు చెందిన కటుకం శరత్చంద్ర(39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. చొప్పదండికి చెందిన సత్యనారాయణ కుమారుడు శరత్చంద్రకు దివ్యతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్లుగా కుటుంబంతో కరీంనగర్లో కిరాయికుంటున్న శరత్ మెడికల్ రిప్గా పని చేస్తున్నాడు. శరత్ తల్లిదండ్రులు కూడా కరీంనగర్లోనే నివాసముంటున్నారు. గతంలో కరీంనగర్లోని విద్యానగర్లో బట్టల షాపు పెట్టి శరత్ నష్టపోయాడు. అప్పుల బారిన పడ్డాడు. లోన్ యాప్స్, ముత్తూట్ ఫైనాన్స్ ద్వారా బంగారం కుదువబెట్టి అప్పులు చేశాడు. మెడికల్ రిప్గా పని చేస్తూ మిత్తీలు కూడా కట్టకపోవడంతో ప్రస్తుత సంపాదనతో అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పేవాడు. ఈనెల 9న డ్యూటీ మీద హుజూరాబాద్ వెళ్తున్నానని చెప్పి శరత్ వెళ్లిపోయాడు. ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసినా కలవకపోవడంతో బుధవారం చొప్పదండిలోని మృతుడి స్నేహితులకు శరత్ భార్య దివ్య ఫోన్ చేసి ఇంటికెళ్లి చూడాలని చెప్పింది. అప్పుల బాధకు మనస్తాపం చెందిన శరత్ మంగళవారం రాత్రి చొప్పదండికి చేరుకొని ఉరేసుకున్నాడు. చొప్పదండిలోని ఇంటికి వచ్చి స్నేహితులు చూసేసరికి మృతిచెంది కనిపించాడు. మృతుడి భార్యకు సమాచారమందించారు. శరత్ సూసైడ్ నోట్ రాసి చనిపోగా.. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్రెడ్డి తెలిపారు. కోరుట్లరూరల్: సంగెం గ్రామానికి చెందిన గోపిడి హన్మక్క(81) చీర కొంగుకు నిప్పంటుకొని సజీవ దహనమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. హన్మక్క ఆదివారం ఉదయం కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా చీర కొంగుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో చీర పూర్తిగా కాలి శరీరానికి నిప్పంటింది. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్లో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొదుతూ బుధవారం మృతిచెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
స్తంభంపల్లిలో మహిళ దారుణ హత్య
వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నరేశ్ మంచిర్యాలలో పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తున్న అలివేలు అనే మహిళతో నరేశ్ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. నరేశ్ మంగళవారం సాయంత్రం గ్రామానికి రాగా.. కొద్దిసేపటికి సదరు మహిళ కూడా చేరుకుంది. ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆవేశంలో నరేశ్ ఆ మహిళను రోకలిబండతో తలపై మోదాడు. అనంతరం కత్తితో మెడకోసి పారిపోయాడు. నరేశ్ గతంలో మంచిర్యాల ప్రాంతంలో ఓ మహిళను హత్య చేసి బంగారం దోచుకున్న కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. నరేశ్ నేర ప్రవృత్తి తెలిసి భార్యాపిల్లలు వదిలేసి వెళ్లారని సమాచారం. ఆ హత్యలో సహకరించిన అలివేలుతో అప్పటినుంచే నరేశ్ సహజీవనం చేస్తున్నాడని సమాచారం. హత్య విషయం తెలుసుకున్న సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కరీంనగర్క్రైం: కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో బిక్షాటన చేసుకుంటూ ఉండేవాడని వివరాలు తెలిస్తే టూటౌన్ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని సూచించారు. రాయికల్: రాయికల్కు చెందిన తాటిపాముల దేవక్క (82) మానసికస్థితి సరిగా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. దేవక్క కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పైగా మానసిక స్థితి సరిగా లేదు. మంగళవారం ఉదయం నుంచి కనిపించలేదు. కుటుంబ సభ్యులు దేవక్కకోసం గాలిస్తుండగా.. ఇంటి సమీపంలోని బావిలో శవమై తేలింది. దేవక్క కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ధర్మపురి: మానసికంగా బాధపడుతున్న ఓ వ్యక్తి మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మేడిశెట్టి తిరుపతి (35)కి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు. వైద్యులను సంప్రదించి మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో ఊరుచివర డంపింగ్యార్డులో ఉరేసుకున్నాడు. తిరుపతికి భార్య మహేశ్వరి, ఇద్దరు పిల్లలున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి లక్ష్మి (45) అనారోగ్యం బాధ భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు.. లక్ష్మి కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండగా, భర్త ముత్యం సెస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. లక్ష్మి గతంలో అనారోగ్యానికి గురికాగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయినా నయం కాలేదు. మంగళవారం ముత్యం అనారోగ్యంతో ఆపరేషన్ కోసం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లగా, ఇంట్లో లక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
రాములపల్లి సర్పంచ్గా లక్ష్మీనారాయణ
పెగడపల్లి: మండలంలోని రాములపల్లి సర్పంచ్గా అమిరిశెట్టి లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వ్ కావడంతో నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. ముగ్గురు అభ్యర్థులు మంగళవారం ఉపసంహరించుకోవడంతో లక్ష్మీనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది. పెగడపల్లి: మండలంలోని రాజరాంపల్లి సర్పంచ్గా ఇస్లావత్ రమేశ్నాయక్ ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ స్థా నం ఎస్టీ జనరల్కు రిజర్వ్ అ యింది. ఇద్దరు నామినేషన్ వేయగా.. తిరుపతినాయక్ తన నామినేషన్ ఉప సంహరించకున్నారు. దీంతో రమేశ్నాయక్ ఏకగ్రీవమయ్యారు. -
పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’
పంచాయతీ ఎన్నికల్లో మద్యం ప్రధాన ఇంధనంగా మారింది. ఇంటింటి ప్రచారంతో అలసి, సొలసిన మద్దతుదారులకు, పార్టీ కార్యకర్తలకు మందుతోనే స్వాంతన లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల వేళ చీప్ లిక్కర్, బాంద్రి, విస్కీ, కల్లు పంపిణీ చేసి ఓటర్లను మత్తులో ముంచేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మందు విక్రయాలు బాగా పెరిగి పల్లెలు మత్తులో జోగుతున్నాయి. పోలీసు యంత్రాంగం దాడులతో ‘బెల్టు’ షాపులకు తాళాలు పడగా, గతంలో ఎన్నడూ లేనంతగా బెల్టుషాపులను నియంత్రించారు. కానీ, దొంగచాటుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఓటర్లను మత్తులో ముంచేందుకు అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు.సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీలతో, పార్టీ గుర్తులతో, బీ–ఫామ్లతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సత్తా చాటుకోవాలని చూస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలను సవాల్గా తీసుకున్నాయి. పార్టీల రంగులు, జెండాలు పల్లె పొలిమెరల్లోనే రెపరెపలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పల్లెలను ‘పంచభూతాలు’ ఆవహించాయి. ఎన్నికలను అవి శాసిస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే శక్తిని ప్రదర్శిస్తున్నాయి. హామీలను ఎరగా వేసి ఓట్లను బుట్టలో వేసుకునేందుకు అభ్యర్థులు ఆఖరు ప్రయత్నాలు ప్రారంభించారు. రాజకీయాలంటేనే ప్రజాసేవ అనే ధోరణి మారిపోయి లాభసాటి వ్యాపారంలా పరిణమించాయి. ఎంత వెచ్చించాం, ఎంత సంపాదించామనే వ్యాపార లక్షణం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. ఓటర్లకు నేరుగా డబ్బు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలువాలనేది అభ్యర్థుల లక్ష్యంగా మారింది. నిన్న మొన్నటి వరకు ప్రచారం చేసిన అభ్యర్థులు అసలు కార్యానికి తెరలేపారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2,000 పంపిణీ చేసేందుకు డబ్బు సంచులను సిద్ధం చేశారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు, కులసంఘాల పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా అనేక మంది ఎన్నికల్లో ఉండడంతో డబ్బుకు వెనకాడకుండా వెదజల్లుతున్నారు. ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు.పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎజెండాలు ఏమీ లేకుండా సొంత ఎజెండాలతో అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఊరిలో సొంత ఖర్చులతో ఫ్యూరీఫైడ్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, ఉచితంగా మంచినీరు అందిస్తామని, ఊరిలో ఆడపిల్ల పుడితే.. రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్, ఊరందరికీ డిష్ బిల్లు లేకుండా ఫ్రీగా టీవీ కనెక్షన్లు, పల్లె దవాఖానా నిర్మిస్తామని, ఇంటింటికీ సీసీ రోడ్డు వేస్తామని సొంత ఎజెండాలతో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే ‘మీ సామాజిక వర్గానికి భవనాలను కట్టిస్తాం’ అని రకరకాల హామీలిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు నేతలు యథాశక్తిగా ప్రయత్నిస్తున్నారు.అనుకూలంగా, అందుబాటులో ఉండే అనుయాయులకు సీసీ రోడ్డు పనులు కాంట్రాక్టు ఇప్పించి కాసులు దోచిపెడుతామంటూ నేతలు హామీలిస్తున్నారు. ఊరిలో ఏం చేయాలన్నా పంచాయతీ తీర్మానాలు ఇస్తామని చెబుతున్నారు. ‘గెలిస్తే చాటుగా మీ అందరికి నేనున్నా’ అంటూ అనుచరులకు నమ్మబలుకుతున్నారు. క్షేత్రస్థాయిలో ఓట్లను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటికప్పుడు సెల్ఫోన్లు కొనిస్తూ, ద్విచక్ర వాహనాలు సమకూర్చుతూ ఎన్నికల ప్రచారానికి యువతరాన్ని వినియోగించుకుంటున్నారు. ‘నేను గెలిస్తే భవిష్యత్ ఉంటుందంటూ ఆశలురేపుతూ బరిలో నిలిచిన అభ్యర్థులు హామీలతో ఎన్నికల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ పంచభూతాలు ఎన్నికల్ని ఆవహించి ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వివిధ రకాల కుల సంఘాలు, వృత్తిసంఘాలు, యువజన సంఘాలకు గాలమేస్తూ హామీలు గుప్పిస్తున్నారు. యువకులకు క్రికెట్ కిట్లు ఇస్తూ, యువజన సంఘాలు కట్టిస్తామని, ఓపెన్జిమ్లు నిర్మిస్తామని, కోతులను తరిమేస్తామని, సామాజిక భద్రత కల్పిస్తామని హామీలిస్తున్నారు. యువకులను గోవా లాంటి ప్రాంతాలకు విహార యాత్రలకు తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇలా పల్లెల్లో సెల్ఫోన్ మెస్సేజ్లు చేస్తున్నారు. ‘చెప్పిన పనులు చేయకుంటే చెప్పులు మెడలో వేసుకుంటాం, గాడిదమీద ఊరేగించండి’ అని బాండు పేపర్లు రాసిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను ఆవహించిన ప్రలోభాలు గెలుపే లక్ష్యంగా ఎత్తులు.. పైఎత్తులు సొంత ఎజెండా.. అభివృద్ధికి హామీలు.. బాండు పేపర్లు గ్రామాల్లో పట్టు కోసం నేతల ప్రయత్నాలు -
అండర్– 19 వైస్ కెప్టెన్గా శ్రీవల్లి
కరీంనగర్స్పోర్ట్స్: హైదరాబాద్ మహిళల అండర్– 19 క్రికెట్ జట్టుకు కరీంనగర్కు చెందిన కట్ట శ్రీ వల్లీ వైస్ కెప్టెన్గా ఎంపికై ంది. ఫాస్ట్ బౌలర్గా రాణిస్తున్న శ్రీవల్లీ గతంలో అండర్–20 జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. తాజాగా హెచ్సీఏ అండర్ 19 జట్టును ప్రకటించగా శ్రీవల్లీని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈనెల 13 నుంచి నుంచి లక్నో వేదికగా బీసీసీఐ అండర్–19 ఉమెన్ వన్డే ట్రోపీ జరుగనుంది. శ్రీవల్లి ఎంపికపై తల్లిదండ్రులు కట్ట ఉమా లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తల్లి బాగోగులు చూసుకోవడం లేదని ఫిర్యాదుచొప్పదండి: పట్టణానికి చెందిన వృద్ధురాలి బాగోగులు పెద్ద కుమారుడు చూసుకోవడం లేదని ఆర్డీవో కార్యాలయంలో, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తల్లితండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులను అనుభవిస్తూ, రెండు నెలలుగా నడవలేని స్థితిలో ఉన్న తల్లిని పెద్ద కుమారుడు పట్టించుకోవడం లేదని, తల్లితండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని తిరిగి తల్లికి స్వాధీనం చేయాలని బాధితురాలి తరుఫున ఫిర్యాదులో పేర్కొన్నారు. కుక్కను తప్పించబోయి ఆటో బోల్తామానకొండూర్ రూరల్: మండల కేంద్రంలో మంగళవారం కరీంనగర్–వరంగల్ రహదారిపై కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నర్సంపేట జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందినవారు వేములవాడ దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మానకొండూర్ శివారు తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఎదురుగా కుక్క అడ్డు రాగా.. తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముత్యాల కవిత, పెండ్లి యాదమ్మ, పెండ్లి నీల, పెండ్లి లక్ష్మి, పెండ్లి సుధాకర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సిమ్స్లో దేహదాతకు నివాళి అర్పించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి(92) ఈనెల 6న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు శ్యాంసుందర్రెడ్డి తనతండ్రి పార్ధివదేహాన్ని సిమ్స్కు దానంచేశారు. ఆయన మనుమరాలు వర్ష, మనుమడు వర్షిత్కు ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు.అనాటమీ విభాగం హెచ్వోడీ డాక్టర్ శశికాంత్ కిరాగి,డాక్టర్ కల్పన ఉన్నారు. -
రెండోసారి..
సైదాపూర్(హూజూరాబాద్): ఆరెపల్లి పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. గ్రామస్తులు పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికి తీర్మానించుకున్నారు. ఆరెపల్లి సర్పంచ్ స్థానం జనరల్ మహిళ కాగా.. లొల్లేటి కల్యాణి, వర్నె లావణ్య, వెంగళ కోమల పోటీ పడ్డారు. ఏకగ్రీవానికి గ్రామంలో తీర్మానించుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా వర్నె లావణ్య ఒక్కరే నామినేషన్ వేశారు. 5వ వార్డు సభ్యుడు వెంగళ రవిని ఉప సర్పంచ్గా గ్రామంలో తీర్మానించుకున్నారు. 1వ వార్డుకు ఆవునూరి సుజాత, 2వ వార్డుకు లొల్లేటి కల్యాణి, 3వ వార్డుకు వెంగళ కుమార్, 4వ వార్డుకు గుంటి అయిలయ్య, 6వ వార్డుకు మొగిలి లచ్చమ్మ, 7వ వార్డుకు గోంగూల మల్లేశ్వరి, 8వ వార్డుకు వర్నె సతీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కేసీఆర్ కృషితోనే తెలంగాణ రాష్ట్రం
మెట్పల్లి: కేసీఆర్ కృషితోనే రాష్ట్రం ఏర్పాటైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం విజయ్ దివస్ వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమా ల వేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగా ణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. కా ర్యక్రమంలోపలువురు నాయకులు పాల్గొన్నారు. కోరుట్లలో విజయ్ దివస్ కోరుట్ల: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పూలమాల వేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అవినీతిని నిర్మూలిద్దాం.. జగిత్యాల: అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని, 1064 టోల్ఫ్రీ నంబర్తో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్ను ఎస్పీ అశోక్కుమార్తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉంటూ బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ఉద్యోగులు నిబద్ధతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం ఇవ్వాలని వేధిస్తే 1064 టోల్ఫ్రీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. -
సోనియాతోనే ప్రత్యేక రాష్ట్రం
ధర్మపురి: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఇచ్చిన మాటను సోనియా నిలబెట్టుకున్నారని తెలిపారు. నాయకులు వేముల రాజు, చీపిరిశెట్టి రాజేశ్, కుంట సుధాకర్, చిలుముల లక్ష్మణ్, రాందేని మొగిలి తదితరులున్నారు. రాష్ట్ర ఏర్పాటు ఘనత సోనియాగాంధీదే జగిత్యాలటౌన్: ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సోనియా సాహసోపేత నిర్ణయం తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దు ర్గయ్య, గాజుల రాజేందర్, హనుమండ్ల జయ శ్రీ, రాంచంద్రారెడ్డి, రఘువీర్గౌడ్ ఉన్నారు. ఎన్నికల సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తిజగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికలకు ర్యాండమైజేషన్ విధానంలో సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యప్రసాద్ తెలిపారు. మొదటి విడత ఎన్నికకు పోలింగ్ అధికారులు 1406, ఇతర అధికారులు 2005 మందిని నియమించినట్లు పేర్కొన్నారు. సిబ్బంది ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్లు, పోస్టల్ బ్యాలెట్ తరలింపు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఎస్పీ అశోక్కుమార్, అబ్జర్వర్లు రమేశ్, డీపీవో రఘువరణ్ పాల్గొన్నారు. పెరుగుతున్న చలిజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఫలితంగా చలి తీవ్రత పెరిగింది. మంగళవారం నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. భీమారం మండలం మన్నెగూడెంలో 9.1, కథలాపూర్లో 9.1, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 9.3, కోరుట్ల మండలం అయిలాపూర్లో 9.4, ఎండపల్లి మండలం గుల్లకోటలో 9.5, మల్లాపూర్లో 9.5, పెగడపల్లిలో 9.6, మేడిపల్లిలో 9.6, ధర్మపురి మండలం నేరేళ్లలో 9.6, భీమారం మండలం గోవిందారంలో 9.7, మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో 9.8, రాయికల్లో 9.8, కొడిమ్యాల మండలం పూడూరులో 9.9, ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 9.9 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఆలయ అభివృద్ధికి సహకరించండిధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ విస్తరణకు పట్టణ ప్రజలు సహకరించాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మంగళవారం పట్టణానికి చెందిన ఇళ్ల యజమానులతో సమావేశమయ్యారు. ఆల య అభివృద్ధికి 2.07 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇళ్లు కోల్పో యే వారికి పునరావాసం కల్పిస్తామని, ఆలయ పరిసరప్రాంత ప్రజలు అభివృద్ధి పనులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ తదితరులున్నారు.


