Krishna
-
ఉన్నత ప్రమాణాలతో చేరువవుతోన్న ‘ఇగ్నో’
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులకు మరింత చేరువవుతోందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి అన్నారు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 39వ స్నాతకోత్సవం విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య మధుమూర్తి స్నాతకోపన్యాసం చేశారు. ఇగ్నో 40ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా ఉన్నత విద్యనూ అన్నీ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచిందన్నారు. జాతీయ స్థూల నమోదు నిష్పత్తినీ పెంపొందించేందుకు కృషి చేస్తూ ‘మీ ఇంటి వద్దకే విద్య’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 70 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా డిగ్రీలను ప్రధానం చేశారు. రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత నివేదికను సమర్పిస్తూ దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా డిగ్రీలను ఈ స్నాతకోత్సవంలో అందుకోనున్నారని చెప్పారు. అలాగే విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 1,626 మంది విద్యార్థులు డిగ్రీలు తీసుకునేందుకు అర్హత సాధించారన్నారు. ప్రాంతీయ కేంద్రం పరిధిలో పలు నూతన కోర్సులతో పాటు నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో నూతన అధ్యయన కేంద్రాలను రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇగ్నో డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రసాద్బాబు, ఇగ్నో అధికారులు డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ మమత, చెన్ను బాల చందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి -
క్వాంటం వ్యాలీకి భూములివ్వం
కోమటిగుంట రైతులు ఎ.కొండూరు: క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు కోసం వ్యవసాయ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని ఎ.కొండూరు మండలం కోమటికుంట గ్రామ రైతులు స్పష్టం చేశారు. తహసీల్దార్ ఉదయ్ భాస్కరరావును మంగళవారం కలిసిన రైతులు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోమటిగుంట రైతులు మాట్లాడుతూ ముత్తాతలు, తాతలు, తండ్రుల కాలం నుంచి వందల ఏళ్లుగా ఈ భూములను సాగు చేస్తున్నామని తెలిపారు. ప్రాణంగా భావించే సాగు భూములను ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం సేకరించాలని చూడటం సరికాదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు వదులుకోబోమని వారు తేల్చిచెప్పారు. టీడీపీ సీనియర్ నేత గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ భూ సమీకరణ విషయంలో రెవెన్యూ అధికారులు రైతులకు స్పష్టమైన హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు భూపరిశీలనకు రావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆయన వివరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలని, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులను కోరారు. వారి క్షేమమే ముఖ్యమని ఆయన తెలిపారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ ఏపీఐఐసీ ద్వారా క్వాంటం వ్యాలీ ప్రతినిధులు భూములను కేవలం పరిశీలించడానికి మాత్రమే వచ్చారని తెలిపారు. పూర్తి వివరాలకు రైతులు కలెక్టర్ను కలిసి మాట్లాడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రైతులు వేములకొండ భాస్కరరావు, వేములకొండ సాంబశివరావు, కె. సురేష్, సీహెచ్ వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. -
కోడికి
కృష్ణాజిల్లాబుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పౌల్ట్రీపై వివక్ష మద్దతు ధర ఇవ్వండి మచిలీపట్నంఅర్బన్: స్వర్ణాంధ్ర విజన్ అమలును అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించింది. నగరంలోని కలెక్టరేట్ ‘మీకోసం’ సమావేశ మందిరంలో కేంద్ర బృంద సభ్యులు వికాస్ కిచి (విద్యుత్), సంతోష్ ప్రసాద్ (పరిశ్రమలు, అంతర్గత వ్యాపార ప్రోత్సాహం) కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో కీలక పనితీరు సూచికలు (కేపీఐ) మానిటరింగ్, స్వర్ణాంధ్ర విజన్ అమలు విధానంపై వివరాలు తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా జిల్లా విజన్ కార్యాచరణ ప్రణాళిక, నియోజకవర్గాల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుతో పాటు కేపీఐల నెలవారీ నమోదు విధానాలను వారు పరిశీలించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: స్థానిక లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని మంగళవారం రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) నాగమణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మూల్యాంకన ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. మూల్యాంకనం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఉపాధ్యాయులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జి.కొండూరు: ప్రభుత్వం తీరుతో పౌల్ట్రీ పరిశ్రమ ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కార్ వచ్చినప్పటి నుంచి ‘కోడి’కి భరోసా కానరావడం లేదు. గత ఏడాది ఫిబ్రవరిలో బర్డ్ప్లూ వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇది వ్యాపించకుండా చేపట్టిన భద్రతా చర్యల్లో భాగంగా కోళ్లు మృత్యువాత పడిన కోళ్లఫారాల్లో బతికి ఉన్న కోళ్లతో పాటు గ్రామాల్లో బతికి ఉన్న నాటుకోళ్లను సైతం కల్లింగ్ చేశారు. జిల్లాలో గంపలగూడెంలోని అనుముల్లంక గ్రామంలో అత్తునూరి పద్మారెడ్డికి చెందిన కోళ్ల ఫారంలో 15వేల కోళ్ల వరకు మృత్యువాత పడ్డాయి. ఎ.కొండూరు మండల పరిధి దీప్లానగర్ హనుమాన్ ఫౌల్ట్రీ కోళ్ల ఫారంలో 3వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. పద్మారెడ్డి కోళ్ల ఫారంలో మిగిలి ఉన్న కోళ్లతో పాటు, అదే గ్రామంలో 70మంది రైతులు ఇళ్ల వద్ద పెంచుకునే కోళ్లతో కలిపి 7500ను అధికారులు కల్లింగ్ చేశారు. వీటి వరకు నష్ట పరిహారంగా రూ.3,20,000 అందజేశారు. దీప్లానగర్ హనుమాన్ పౌల్ట్రీఫారంలో బతికి ఉన్న కోళ్లతో పాటు అదే గ్రామంలో 12మంది రైతులకు చెందిన మొత్తం 300కోళ్లను అధికారులు కల్లింగ్ చేశారు. నష్ట పరిహారంగా రూ.44వేలను అందజేశారు. కల్లింగ్ చేసిన ఒక్కొక్క కోడికి రూ.135చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా దీనిలో కోత విధించి నిర్వహకులకు వెన్నుపోటు పొడి చారు. పరిహారం విషయంలో ప్రభుత్వ తీరుతో రూ.50 లక్షల వరకు బాధిత కోళ్ల ఫారాల నిర్వాహకులు నష్టపోయారు. బర్డ్ఫ్లూతో ఎన్టీఆర్ జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం పడింది. వైరస్ వ్యాప్తితో అధికారికంగా రెండు కోళ్ల ఫారాల్లో మాత్రమే కోళ్లు మృత్యువాత పడినా మిగిలిన ఫారాల్లో వేల సంఖ్యలో మృత్యువాత పడినట్లు తెలిసింది. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం మొండిచేయి చూపడంతో కోళ్ల పెంపకం తగ్గుముఖం పట్టింది. వైరస్ వచ్చి పోయిన ఏడాది కాలంలోనే 29 బ్రాయిలర్ కోళ్ల ఫారాల నిర్వహణ నిలిచిపోయి 3,34,500 కోళ్ల పెంపకం తగ్గింది. మూడు నాటుకోళ్ల ఫారాలు తగ్గిపోయి 1100 వరకు కోళ్ల పెంపకం తగ్గిపోయింది. ఇటీవల మార్చిలో మళ్లీ బర్డ్ ప్లూ వ్యాప్తి చెందుతుందని పుకార్లు వచ్చాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేక పెట్టుబడి పెరిగిపోయి ఉత్పత్తి తగ్గడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి కోళ్లు పెంచేందుకు నిర్వాహకులు పూర్తిగా వెనకడుగు వేశారు. ఎ.కొండూరు: అధికారులకు మొక్కజొన్న రైతు సెగ తగిలింది. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కేలా చూడాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఎ.కొండూరు తహసీల్దార్ కార్యాలయాన్ని రైతులు మంగళవారం ముట్టడించారు. రైతు సంఘం నేత ఆళ్ల అమ్మిరెడ్డి ఆధ్వర్యాన పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. రైతు సంఘం నేత అమ్మిరెడ్డి మాట్లాడుతూ మండలంలో సుమారు 8వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం దారుణమన్నారు. అతి తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందిరైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు అతి తక్కువ ధరకే అమ్ము కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2,400 మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు జెట్టి వెంకటేశ్వరావు మాట్లాడుతూ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని పది రోజులుగా శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఇప్పటికే పంట అమ్ముకున్న రైతులకు బోనస్ ప్రకటించాలని కోరారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పానెం ఆనందరావు, రావుల రామకృష్ణ, సోమా యోహాను, పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 7 గతేడాది జిల్లాలో బర్డ్ఫ్ల్లూతో 18వేలకు పైగా బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత కల్లింగ్ చేసిన కోళ్లకే పరిహారం అందించి చేతులు దులుపుకొన్న ప్రభుత్వం ప్రభుత్వ భరోసా లేక జిల్లాలో ఏడాదికే తగ్గిన 3.35లక్షల కోళ్ల పెంపకం రూ.3.64 లక్షల పరిహారంతో సరి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన మొక్కజొన్న రైతులు మద్దతు ధర రూ.2,400 చెల్లించాలి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి రైతు సంఘం నేతలుమచిలీపట్నంఅర్బన్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం బందరులో ర్యాలీ చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రేమ్చంద్ పాల్గొన్నారు.కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మంగళవారం బందరులో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
ధర లేక.. దిక్కు తోచక!
–జాజి గోపి, రైతు, శింగవరం, వత్సవాయి మండలం –ఏలూరి శివాజీ, వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు గిట్టుబాటు ధర లేక... కొనుగోలు కేంద్రాలు ఏవీ! మార్క్ఫెడ్తో కొనుగోళ్లు చేయించండి కొనుగోలు కేంద్రాలు లేవు మద్దతు ధర రూ.2,400.. వ్యాపారులిచ్చేది రూ.1700 వర్షాలకు నేలకొరిగిన పంట కోతకు అదనపు ఖర్చు వర్షాలు పడతాయన్న సూచనలతో రైతన్న ఆందోళన -
చారిత్రక బావి.. చెత్తగా మారి!
గన్నవరం రూరల్: ముస్తాబాద శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం కోరట బావి. దీనిలోని నీరు అమృతతుల్యమని ఏళ్లుగా ప్రతీక. మండలంలోని ముస్తాబాద తూర్పు భాగంలో కొండ పక్కన కోరట బావి శతాబ్దాల క్రితం గ్రామస్తుల దాహార్తిని తీర్చేది. ఈ బావి నీరు అత్యంత ప్రశస్తమైనదిగా భావించిన పూర్వీకులు మంచినీటి అవసరాల కోసం ఇక్కడి నుంచి నీటిని తీసుకుని వెళ్లేవారు. అంతేగాక సూరంపల్లి, ముస్తాబాద, పురుషోత్తపట్నం, కొండపావులూరు, గోపవరపుగూడెం గ్రామాల నుంచి రైతులు, మొకాసా దారులు ఈ నీటిని తీసుకువెళ్లేవారు. ఈ ప్రాంత రైతులు పొగాకును పండించేవారు. దొర పొగాకును ఉత్పత్తి చేస్తూ ఎన్నో దశాబ్దాలుగా అప్పటి మద్రాసులో కంపెనీలు నిర్వహించేవారు. అక్కడికి ఈ కోరట బావి నీటిని వారు రైళ్లల్లో తీసుకు వెళ్లి మంచినీళ్లుగా వినియోగించటం జరిగేదని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఔషధగుణాలు.. కోరట బావి నీరు అమృతతుల్యమని భావిస్తారు. ఈ నీరు తాగితే మోకాళ్ల నొప్పులు రావని, తగ్గుతాయని చెప్పుకుంటారు. అంతేగాక దీర్ఘ రోగాలు తగ్గుతాయని భావిస్తారు. శతాబ్దాల ముస్తాబాద చరిత్రలో కోరట బావి పరిసరాల్లో సాధువులు, మహర్షులు బస చేసేవారని చెబుతారు. రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి దీర్ఘకాల రోగులను ఇక్కడికి తీసుకువచ్చి నెలల తరబడి ఉంచి, కోరట బావి నీరు అందిస్తే వారి రోగాలు తగ్గి వెళ్లే వారని గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. కాలగర్భంలో కలిసిపోతూ.. అటువంటి చరిత్రగల కోరట బావి నీరు అడుగంటింది. కాలగర్భంలో కలసిపోయే విధంగా మొక్కలు అల్లుకుపోయాయి. 1965లో గ్రామానికి చెందిన యువక బృందం కోరట బావిని ఆధునికీకరించి అప్పటి పంచాయతీ సమితి అధ్యక్షుడు డాక్టర్ సీఎల్ రాయుడుతో ప్రారంభోత్సవం చేయించిన శిలాఫలకం నేటికి కనిపిస్తోంది. కోరట బావి నీరు అనంతర కాలంలో బావికి సమీపంలో ప్రభుత్వం హ్యాండ్ బోరు నిర్మించగా అక్కడ ఆ జల కనిపించింది. దీంతో ఊపిరిపీల్చుకున్న పలు గ్రామాల ప్రజలు నిరంతరం కోరట బావి నీటిని ఈ హ్యాండ్ బోరు ద్వారా తీసుకువెళుతున్నారు. ముస్తాబాద శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న కోరట బావి ప్రాంతాన్ని ప్రభుత్వం రక్షించాలని, దాని విశిష్టతను భావితరాలకు తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోరట బావి జల పాయ నుంచి హ్యాండ్ బోరు ద్వారా నీటిని తీసుకువెళుతున్న గ్రామస్తులు చెట్ల వేళ్లతో పూడుకుపోయిన కోరట బావి కోరట బావి చరిత్రను భావితరాలకు తెలియజేయాలి. అందుకు దీనిని సంరక్షించాలి. బాగు చేసి, చారిత్రక సంపదగా పరిగణించాలి. దీనిలోని నీరు ఔషధ గుణాలు కలిగినదిగా చెబుతారు. అందుకే ఇప్పటికీ పరిసరాల్లోని 5గ్రామాల ప్రజలు మంచినీటిని ఇక్కడి నుంచి తీసుకువెళతారు. – షేక్ గోరా మస్తాన్, రైతు, ముస్తాబాద -
ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య
విస్సన్నపేట: ఒక ప్రైవేటు కళాశాలలో డీఫార్మసీ చదువుతున్న విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇవి.. మండలంలోని తాతకుంట్ల గ్రామానికి చెందిన మల్లాది కార్తీక్(22) స్థానిక పుట్రేలరోడ్డులోని ఫార్మసీ కళాశాలలో డీఫార్మసీ మొదటి సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వెళ్లిన కార్తీక్ను తన తండ్రి సోమవారం ఉదయం కళాశాలలో దిగబెట్టి వెళ్లాడు. కాగా మంగళవారం తెల్లవారుజామున తన పక్క రూంలో ఉండే విద్యార్థులు వాష్ రూం కని వెళ్లగా.. దాని పక్కనే ఖాళీగా ఉండే ఒక గదిలో ఫ్యాన్ హుక్కు కార్తీక్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. మృతికి గల కారణం తెలియరాలేదు. ఈ మేరకు మృతుడి తండ్రి బాలక్రిష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ అలివేలు మంగ తెలిపారు. హాస్టల్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. విస్సన్నపేట సీహెచ్ిసీలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కృత్తివెన్ను: మండల పరిధిలోని లక్ష్మీపురం వద్ద 216 నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఒడుగు నాగేశ్వరావు (45) మృతి చెందగా, కుమారుడు కార్తీక్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో నరసాపురం వైపు వెళ్తున్న కారు బంటుమిల్లి వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న నాగేశ్వరరావు, కార్తీక్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్లో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన తండ్రి ఆస్పత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడికి చికిత్స జరుగుతుందన్నారు. బాధితులు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు లాంచీల రేవు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏ పైడిబాబు తెలిపారు. జి.కొండూరు: తల్లిదండ్రులు లేని చిన్నారిని మేనత్త వేధిస్తున్న ఘటన కట్టుబడిపాలెం గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దళిత బహుజన రిసోర్స్సెంటర్ క్లస్టర్ కోఆర్డినేటర్ నందేటి అనిత జి.కొండూరు పోలీసులను ఆశ్రయించారు. వివరాలలోకి వెళ్తే.. బీహర్ రాష్ట్రానికి చెందిన నిబాకుమారి, శివనత్దాస్ దంపతులు తమ ముగ్గురు కుమారులతో కలిసి ఐదేళ్ల కిందట జి.కొండూరు మండల పరిధి కట్టుబడిపాలెం గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నారు. కాగా నిబాకుమారి తన అన్నా, వదినలు బీహార్లోనే మృతి చెందగా వారి కుమార్తె ఆర్తీకుమారి(6)ని గత కొంతకాలంగా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఆర్తీకుమారిపై మేనత్త నిబాకుమారి నిత్యం భౌతిక దాడి చేయడంతో పాటు సక్రమంగా అన్నం పెట్టక అనారోగ్యానికి గురైంది. చిన్నారిపై మేనత్త వేధింపుల విషయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న దళిత బహుజన రిసోర్స్ సెంటర్ క్లస్టర్ కోఆర్డినేటర్ నందేటి అనిత కట్టుబడిపాలెం వెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో గ్రామ మహిళా కానిస్టేబుల్ సాయంతో 108 అంబులెన్స్లో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అనిత జి.కొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జి.కొండూరు ఎస్ఐ సతీష్కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. -
ఉత్తమ నైపుణ్యం కలిగిన వైద్యులుగా తీర్చిదిద్దుతాం
గుంటూరు మెడికల్: ప్రముఖ జాయింట్ రీప్లేస్ మెంట్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ విభాగాలు కలిగిన సాయి భాస్కర్ హాస్పిటల్కు ఆర్థో విభాగంలో రెండు డీఎన్బీ సీట్లు కేటాయిస్తూ ఎన్.బి.ఇ.ఎం.ఎస్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్(ఎన్.బి.ఇ.ఎం.ఎస్ ) సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను జాతీయస్థాయిలో ఆర్థోపెడిక్ పీజీ ట్రైనింగ్ సెంటర్గా గుర్తిస్తూ డిప్లమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్బీ) సీట్లను కేటాయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్లో గుజరాత్కు చెందిన డాక్టర్ జీల్ కటిరా, రాజస్థాన్కు చెందిన డాక్టర్ యశా జైన్లు సాయి భాస్కర్ హాస్పిటల్ను ఎంపిక చేసుకున్నారు. మంగళవారం అరండల్ పేటలోని హాస్పిటల్లో డాక్టర్ నరేంద్రరెడ్డి ఎదుట తమ తొలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డీఎన్బీ సీట్లను తమ హాస్పిటల్కు కేటాయించడం గర్వంగాను, ఆనందంగానే ఉందని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు డీఎన్బీలో విద్యను అభ్యసించాల్సి ఉంటుందన్నారు. ఎముకలు కీళ్ల విభాగంలో అన్ని విధాలా మెరుగైన విద్యను, ప్రాక్టికల్స్ను అందించి ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది తద్వారా జాతీయస్థాయిలో గుంటూరుకు గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని డాక్టర్ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ కొనకల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
గుడివాడ రూరల్: రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి తర్వాత మొక్కజొన్నే అధికంగా సాగు చేశారని చెప్పారు. అకాల వర్షాల వల్ల మొక్కజొన్న పంట పాడై.. రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఉన్న కొద్దిపాటి పంటకు సైతం సరైన ధర లేకపోవడం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. వీరందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరా రు. లేదంటే వారికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి -
హస్త కళాకృతులకు డిమాండ్
పెడన: గుర్రపు డెక్కతో తయారుచేసిన వివిధ రకాల హస్త కళాకృతులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అందుకు తగ్గట్టుగా అందించడానికి కృషి చేస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఆయన మంగళవారం పెడన మండలం చేవేండ్ర, బంటుమిల్లి మండలం మణిమేశ్వరం పంచాయతీ లేళ్లగూడెం గ్రామాల్లో పర్యటించారు. సెర్ఫ్, డీఆర్డీఏ, వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపుడెక్కతో వివిధ హస్త కళాకృతుల తయారీలో శిక్షణ ఇస్తున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలకు శిక్షణ.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడాది క్రితం అసోం నుంచి కళాకారులను జిల్లాకు పిలిపించామని వారు మచిలీపట్నం మండలం చిన్నాపురంలో స్వయం సహాయక సంఘాల మహిళలు 30 మందికి గుర్రపు డెక్కతో వివిధ రకాల బుట్టలు, చాపలు వంటి హస్త కళాకృతులు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. శిక్షణ తీసుకున్న డ్వాక్రా మహిళలు ఉత్పత్తి బాగా చేస్తుండటం గుర్తించామని, తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేశామన్నారు. చిన్నాపురంలో శిక్షణ పొందిన వారితో పలు ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం 20 రోజుల్లోనే బుట్టలు చాపలు వంటి అల్లికలు బాగా చేశారని కలెక్టర్ మహిళలను అభినందించారు. అనంతరం కలెక్టర్ లేళ్లగూడెం 9వ తరగతి విద్యార్థులతోనూ, వలంటీర్లతో ముఖాముఖీ మాట్లాడారు. ఈ పర్యటనలో డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్, పెడన ఇన్చార్జి తహసీల్దార్ అనిల్ కుమార్, పెడన ఎంపీడీవో అరుణకుమారి, వెలుగు ఏపీఎం శ్రీదేవి, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీ -
పాఠశాలలో తనిఖీలు
రెడ్డిగూడెం: మండలంలోని రంగాపురం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆర్. రమేష్బాబు(ఏపీసీ) మంగళవారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని కిచెన్, క్లాస్ రూమ్స్, లైబ్రరీ, స్టాక్ రూమ్లను పరిశీలించారు. ఎస్వో, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థినులతో ముచ్చటించారు. జిల్లా కోఆర్డినేటర్ జీసీడీఓ, మండల విద్యాశాఖ అధికారి–2 పి. రమేష్బాబు, మండల ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (డీఈఈసెట్) నోటిఫికేషన్ విడుదలైనట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ మార్చి 31 నుంచి ఏప్రిల్ 15వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు రూ.1,000 ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు భారతీయ పౌరులు అయి ఉండాలని, ఇంటర్మీడియెట్ లేదా సమాన అర్హతలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. సాధారణ వర్గాలకు కనీసం 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు అవసరమని తెలిపారు. అభ్యర్థులు కనీసం 17ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని సూచించారు. పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పార్ట్–ఏకు 60 మార్కులు (సాధారణ అంశాలు), పార్ట్–బీకు 40 మార్కులు (ఎంపిక చేసిన సబ్జెక్ట్) ఉంటా యన్నారు. ప్రభుత్వ డీఈఈటీ కళాశాలలు, ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో ర్యాంక్ ప్రకారం సింగిల్ విండో విధానంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. హాల్ టికెట్లు, పరీక్ష తేదీలు తదితర వివరాలు త్వరలో అధికారిక వెబ్సైట్లలో వెల్లడిస్తామని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్ పూర్తిగా చదవాలని, సరైన ఫొటో, వివరాలను మాత్రమే అప్లోడ్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://cse.ap.gov.in,https://apdeecet. apcfss.in వెబ్సైట్లను పరిశీలించాలని చెప్పారు. రాష్ట్ర మంత్రి నారాయణ పెనమలూరు: మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, డ్రెయినేజీలు అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ కింద ఉన్న రోడ్లు నిర్మాణానికి రూ.103 కోట్లతో ఆయన మంగళవారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రోడ్లు, డ్రెయిన్లు, వేస్ట్ ఎనర్జీ ప్లా్ంట్స్ ఏర్పాటుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. మొదటి దశగా అన్ని మునిసిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పన చేస్తామన్నారు. ఆ తరువాత పార్కులు, భవనాల నిర్మాణాలు, స్కూల్ ఏర్పాటుకు నిధులు ఇస్తానన్నారు. కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి శుభాష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. గుడివాడరూరల్: అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమె మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.30వేలు అపరాధ రుసుమును విధిస్తూ 11వ జిల్లా అదనపు జడ్జి జి.సుబ్రహ్మణ్యం తీర్పు వెల్లడించినట్లు గుడి వాడ తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు మంగళవారం తెలిపారు. మండలంలోని వలివర్తిపాడు గ్రామానికి చెందిన బల్లవరపు సుధాకర్, సిమ్మతి అనూషను 2013లో వివాహం చేసుకున్నాడు. వివాహం తదనంతరం అదనపు కట్నం కోసం సుధాకర్, అతని కుటుంబ సభ్యులు సుభాషిణి, సుధాంజలి, మేరమ్మ, భాస్కరరావు, ప్రభాకరరావు వేధించడంతో అనూష ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు తన కుమార్తె మృతికి కారణమైన వారిపై తాలూకా పోలీస్ స్టేషన్లో మృతురాలి తల్లి మరియమ్మ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన అప్పటి డీఎస్పీ విచారించి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ పీపీ కంభంపాటి రవి సాక్ష్యాలను న్యాయమూర్తి ముందు సమర్పించడంతో నేరం రుజువు అయ్యింది. దీంతో మృతురాలి ఆత్మహత్యకు కారణమైన భర్త సుధాకర్కు ఐపీసీ–306 సెక్షన్ ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20వేల అపరాధ రుసుము, 498ఐపీసీ కింద రెండేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధించారు. -
సుబ్రహ్మణ్యునికి కిలో వెండి బిస్కెట్లు సమర్పణ
మోపిదేవి: Ý린MýS }Ð]l-ÎÏ-§ól-Ð]l-õܯ]l çÜÐól$™èl çÜ${ºçßæÃ-×ôæÅ-ÔèæÓ-Æý‡-ÝëÓ-Ñ$MìS EĶæÊÅÆý‡$ Ð]l$…yýlÌS… BMýS$¯]l*Æý‡$ {V>Ð]l*°MìS ^ðl…¨¯]l ÐðlÌSVýS-ç³Nyìl ÌS„îSà {ç³Ýë§Šæ MóSi ºÆý‡$OÐðl¯]l 5 Ððl…yìl ¼òÜPr$Ï Ð]l$…VýSâýæ-ÐéÆý‡… çÜÐ]l$-Ç-µ…-^èl$-MýS$-¯é²Æý‡$. E§ýlĶæ$… BÌS-Ķæ*-°MìS ^ólÆý‡$MýS$¯]l² ÐéÆý‡$ ™öË$™èl ÝëిÓÑ$Ðéǰ- §ýlÇØ…-^èl$MýS$° {ç³™ólÅMýS ç³NfË$, AÀõ-ÙMýS… ^ólÔ>Æý‡$. A¯]l…-™èlÆý‡… BÌSĶæ$ yðlç³NÅsîæ MýSÑ$-çÙ-¯]lÆŠ‡ §éçÜÇ }Æ>Ð]l$ Ð]lÆý‡{ç³-Ýë-§ýl-Æ>-Ð]l#MýS$ Ððl…yìl ¼òÜPr$Ï A…§ýl-gôæ-Ô>Æý‡$. §é™èl MýS$r$…º çÜ¿¶æ$Å-ÌS¯]l$ BÌSĶæ$ Ð]l$Æ>Å-§ýl-ÌS™ø çÜ™èlP-Ç…-^éÆý‡$. -
బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి జగనన్న కాలనీ(ఈలప్రోలు)లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ కాలనీ వాసులు కొండపల్లి మునిసిపాలిటీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలు, బకెట్లతో సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసి లక్ష్మీదేవి మాట్లాడుతూ కాలనీలో కనీసం తాగునీరు లేదని ఆరోపించారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. గుంతల రోడ్డులో నడుస్తూ కిందపడి ఆస్పత్రుల పాలవుతున్నట్లు వివరించారు. కనీసం గ్రావెల్ రోడ్లు వేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ దృష్టికి కాలనీ సమస్యలు పలుమార్లు తీసుకెళ్లినా ఆయనలో స్పందన లేదని విమర్శించారు. కాలనీలోని ఇళ్లకు ఇంటి పన్నులు వేస్తే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, పాఠశాల, వైద్యశాల సైతం నిర్మించాలని కోరారు. సీపీఎం సంఘీభావం.. కాలనీ వాసులకు సంఘీభావంగా నిలిచిన సీపీఎం పట్టణ కార్యదర్శి ఎం.మహేష్ మాట్లాడుతూ కొండపల్లి మునిసిపాలిటీలో అనేక రకాల సమస్యలు ఉన్నాయన్నారు. జగనన్న కాలనీలో ప్రధానంగా రోడ్లు, తాగునీరు డ్రెయినేజీ సమస్యలు ఉన్నాయన్నారు. తాగునీటి పైప్లైన్కు గతంలో రూ.10లక్షలు మంజూరు అయినట్లు మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు చెప్పారని, ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. మున్సిపల్ పాలకవర్గం సభ్యులు కాలనీని సందర్శించినప్పటికీ సమస్య పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. మునిసిపాలిటీలో మద్యం ఏరులైపారుతున్నప్పటికీ కృష్ణానది ఒడ్డున ఉన్న కొండపల్లి మునిసిపాలిటీకి తాగునీరు అందించలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కలెక్టర్ లక్ష్మీశ, గత ఆర్డీవో కావూరి చైతన్య, తహసీల్లార్ వెంకటేశ్వర్లుకు కాలనీలో సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు.కొండపల్లి మునిసిపల్ కార్యాలయం వద్ద ప్రజల ఆందోళన -
నీటి భద్రత.. సాగునీటి సంఘాల బాధ్యత
విజయవాడ ఎంపీ శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నీటి వనరుల పరిరక్షణ, సమర్థ వినియోగం, భవిష్యత్ తరాలకు తగిన నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభమైన జలధార–నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా ముందడుగు వేద్దామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి దార్శనికతతో నీటి భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించారని.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పటిష్ట కార్యాచరణతో జల వనరుల పరిరక్షణకు కృషి చేద్దామన్నారు. ఇప్పటికే జల భద్రతకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేద్దామని పేర్కొన్నారు. 100 రోజుల ప్రత్యేక కార్యచరణ.. కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల కార్యక్రమం జరగనుందన్నారు. నీటి సంరక్షణ, భూగర్భ జల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టిసారించి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమీకృత నీటి నిర్వహణ, చెరువులు – కాలువల పునరుద్ధరణ, చెరువుల అనుసంధానం, నీటి సంరక్షణ విధానాలు, పచ్చదనం పెంపొందించడం, గ్రామ నీటి బడ్జెట్ లక్ష్యాలతో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా నీటి వనరుల అధికారి (డీడబ్ల్యూఆర్వో) పి.రామచంద్రరావు, ఈఈ రామకోటయ్య, డీఈ బాబురావు, జల వనరుల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ కిచెన్ల పేరుతో మమ్మల్ని రోడ్డున పడేయొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్మార్ట్ కిచెన్ల పేరుతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుకు అప్పగించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్మార్ట్ కిచెన్ల పేరుతో కార్మికులను రోడ్లపై పడేయొద్దంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పథకాన్ని ప్రైవేటుకు అప్పగించొద్దంటూ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమం జరిగింది. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సుశీల, ఎన్సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక నిర్వహణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ప్రభుత్వ బాధ్యత లేకుండా ప్రైవేటుకు అప్పగిస్తే నాణ్యత లోపిస్తుందన్నారు. ఇప్పటికే ప్రైవేటు సంస్థలైన అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న చోట పిల్లలు చల్లారి పోయిన, చప్పటి భోజనం తినలేక పడేస్తున్నారన్నారు. ప్రధాన డిమాండ్లు ఇవి.. రాష్ట్ర వ్యాప్తంగా కిచెన్ షెడ్లు లేని పాఠశాలలో కిచెన్ షెడ్లు నిర్మించాలని, పథకం అమలుకు మౌలిక సౌకర్యాలు (మంచినీరు, గౌజులు, మాస్కులు, యాప్రాస్) కల్పించాలని, పథకం నిర్వహిస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ. 10వేల వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఒక్కో విద్యార్థికి రూ.20 మెస్ చార్జీలు ఇవ్వాలన్నారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎ. వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు డి.పద్మ, దుర్గాభవానీ, కె. రాజేశ్వరి, కుమారి, సావిత్రి, మహేశ్వరి, దుర్గ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ డిమాండ్ -
కలెక్టరేట్ వద్ద కార్మికుల ధర్నా
మచిలీపట్నంఅర్బన్: కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే పోరాటాలకు సిద్ధమని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్లపల్లి వేణుగోపాలరావు హెచ్చరించారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద భవన నిర్మాణ కార్మికులు సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయకపోతే భవన నిర్మాణ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని స్పష్టం చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని విమర్శించారు. గతంలో అమలులో ఉన్న పెళ్లి కానుక, డెలివరీ బెనిఫిట్, ఆసుపత్రి ఖర్చులు, అంగవైకల్య భత్యం, విద్యా స్కాలర్షిప్, సహజ మరణం, ప్రమాద మరణం, అంత్యక్రియలు, నమోదు కాని ప్రమాద మరణాలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 1 నుంచి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం, చివరికి కేవలం నాలుగు పథకాలకే పరిమితం కావడం భవన నిర్మాణ కార్మికులకు చేసిన ఘోర మోసమని మండిపడ్డారు. వెల్ఫేర్ బోర్డులో వేల కోట్ల రూపాయల నిధులు నిల్వ ఉన్నప్పటికీ, కార్మికులకు కనీస భద్రత కూడా కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో ప్రమాద మరణానికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం వివాహ కానుక, ప్రసవ కానుక, సహజ మరణం, మట్టి ఖర్చులకే పరిమితం చేయడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. అర్హులైన కార్మికుల నుంచి స్వీకరించిన అన్ని అప్లికేషన్లకు సంబంధించిన క్లెయిమ్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా క్లెయిములు అమలు కాకపోవడంతో అనేక మంది కార్మికులు వెల్ఫేర్ బోర్డులో రెన్యూవల్స్ చేయించుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త సభ్యత్వాలు చేపట్టి, గతంలో సభ్యులుగా ఉండి రెన్యూవల్ గడువు ముగిసిన వారికి మళ్లీ అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజనాల సురేష్, కోశాధికారి వేము పెదబాల, సీఐటీయూ నాయకులు జయరావు, చంద్రపాల్, మీరావలి, టి.నాగ, ఆర్.కొండ, కె.రాణి, పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. -
అతలాకుతలం
‘అకాల’ దెబ్బకు అకాల వర్షంతో రబీసాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న నేలవాలి తీవ్రంగా నష్టపోయిన రైతులకు సోమవారం మధ్యాహ్నం సమయంలో తీవ్ర పెనుగాలులతో కూడిన వర్షం కురవడంతో కోతలు పూర్తయి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాల్లో 4,496హెక్టార్లలో రబీ మొక్కజొన్న సాగవుతుండగా, 31,790టన్నుల మొక్కజొన్నలు దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అయితే ఇప్పటికే ఎనభైశాతం కోతలు పూర్తి కల్లాల్లో ఆరబోసి ఉండడంతో వర్షానికి తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు మండలాల్లో 250వరకు ఇటుక బట్టీలను నిర్వహిస్తుండగా వర్షం దెబ్బతో రూ.కోట్లల్లో నిర్వాహకులు నష్టపోయారు. అలాగే మామిడి కోతలు కోసే సమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణాజిల్లా హనుమాన్జంక్షన్లో మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. – జి.కొండూరు/హనుమాన్జంక్షన్ రూరల్ -
ప్రారంభమైన పదో తరగతి ‘స్పాట్’
నల్ల రిబ్బన్లతో స్పాట్కు హాజరైన ఉపాధ్యాయులు మచిలీపట్నం అర్బన్: ఉపాధ్యాయులు నిబద్ధతతో, పారదర్శకంగా తమ బాధ్యతలను నిర్వహించడంతో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. సోమవారం లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్పాట్ వాల్యుయేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పర్యవేక్షణలో మొత్తం 763 మంది ఉపాధ్యాయులు పాల్గొని జవాబుపత్రాలను మూల్యాంకనం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కచ్చితత్వంతో పాటు సమయపాలనకు ప్రాధాన్యతనిస్తూ మూల్యాంకనం కొనసాగుతోందని తెలిపారు. కేంద్రంలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. నల్ల బ్యాడ్జీలతో ఫ్యాప్టో నిరసన.. ఉపాధ్యాయులు, పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన వ్యక్తం చేశారు. -
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
‘మీ కోసం’లో కలెక్టర్ డీకే బాలాజీమచిలీపట్నంఅర్బన్: ‘మీ కోసం’ కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీదారునికి శాశ్వత పరిష్కారం అందేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ కోసం’ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్, డీఆర్ఓ కె. చంద్రశేఖరరావు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతు రాజు, బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ధర్మేంద్రతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. యంత్రాంగం ప్రధాన బాధ్యత ఇదే.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆశతో కలెక్టరేట్కు వస్తారని, అందువల్ల ప్రతి అర్జీని సున్నితంగా, బాధ్యతతో, మానవతా దక్పథంతో పరిశీలించాలని సూచించారు. కేవలం అర్జీ స్వీకరణతో సరిపెట్టకుండా సమస్య స్వభావాన్ని అర్థం చేసుకుని, ఫీల్డ్ స్థాయిలో పరిశీలన జరిపి, సమగ్రంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, జాప్యం లేదా నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ నిఖిల, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఎన్. పద్మావతి, జె. జ్యోతి, డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజు, జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి. శివరాం ప్రసాద్, డీఎస్ఓ జి. మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. -
రైలులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణంలో గర్భిణికి నొప్పులు రావటంతో తక్షణమే స్పందించిన మహిళా టీటీఐ అందుబాటులో ఉన్న ఇతరుల సహకారంతో రైలులోనే సుఖప్రసవం చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలివి.. ఆదివారం అలప్పుజ–ధన్బాద్ ఎక్స్ప్రెస్ (13352)లో బీ1 కోచ్లో తన కుటుంబంతో కలసి గర్భిణి ప్రయాణిస్తోంది. రైలు అన్నవరం స్టేషన్ దాటిన కొద్ది సేపటికే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు విధుల్లో ఉన్న మహిళా టీటీఐ జి.జ్యోతికి విషయం చెప్పారు. వెంటనే ఆమె స్పందించి కమర్షియల్ కంట్రోలర్తో సమన్వయం చేసుకుంటూ, వైద్యుల సూచనలను పాటిస్తూ అందుబాటులో ఉన్న మహిళల సహకారంతో గర్భిణికి ప్రసవం చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రైలును యలమంచిలి స్టేషన్లో అత్యవసరంగా నిలిపివేసి 108లో తల్లి, బిడ్డను యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారు ఆరోగ్యంగా ఉన్నారు. దీనికి సహకరించిన మహిళా టీటీఈ, సీనియర్ సీసీటీసీ బిపుల్కుమార్, జుబేర్ ఖాన్లను రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా అభినందించారు. -
కొనుగోలు–అమ్మకందారుల మేళాకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడలో ఈ నెల 9, 10 తేదీలలో నిర్వహించనున్న కొనుగోలుదారులు–అమ్మకందారుల సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే అంశంపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించే ఉద్దేశంతో విజయవాడ గాంధీనగర్లోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ పథకాల ద్వారా అనేక మంది మహిళలకు బ్యాంకు రుణాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఒక ప్రోమో వీడియోను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. జిల్లాలోని హోల్సేల్, రిటైల్ వ్యాపారులు ఈ సమ్మేళనంలో పాల్గొని మహిళలు తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తులను పరిశీలించి ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. మహిళా వ్యాపారవేత్తలకు ఇచ్చే ఒక్క ఆర్డర్ వారి జీవితాలను మార్చగలదని, అందువల్ల వారిని ప్రోత్సహించాలని అన్నారు. గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, డీఐసీ జీఎం వెంకటరావు, ఉద్యాన అధికారి జె.జ్యోతి, వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ సౌమ్య, ఆహార తనిఖీ అధికారి గోపాలకృష్ణ, ప్రొబేషనరీ డెప్యూటీ కలెక్టర్ నిఖిలశ్రీ , ఏడీఐఓ సెల్వినా తదితరులు పాల్గొన్నారు. -
ఈత పోటీల్లో జిల్లా చాంపియన్గా డీఎస్ఏ ఘన విజయం
జగ్గయ్యపేటఅర్బన్: జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ సహకారంతో ఈనెల 5 వ తేదీన పేటలోని మున్సిపల్ స్విమ్మింగ్ పూల్లో నిర్వహించిన డీఎస్ఏ స్విమ్మింగ్ చాంపియన్స్– 2026 పోటీలలో జగ్గయ్యపేటకు చెందిన డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్(డీఎస్ఏ) ఘన విజయం సాధించి ఎన్టీఆర్ జిల్లా చాంపియన్ షిప్ను కై వసం చేసుకుంది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం 19 జిల్లాలకు చెందిన 215 మంది స్విమ్మర్లు పాల్గొన్నారు. 25 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయస్సు గల క్రీడాకారులు పాల్గొనడం విశేషం. ఇందులో 52 శాతం మహిళలు పాల్గొనడం గమనార్హం. ముఖ్యంగా 87 ఏళ్ల వయస్సు గల ఒక మహిళ స్వర్ణ పతకం గెలుచుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా నుంచి 31 మంది మహిళలు, 40 మంది పురుషులు కలిసి మొత్తం 66 మంది పాల్గొని 101 స్వర్ణ పతకాలు, 56 రజత పతకాలు, 52 కాంస్య పతకాలు కలిపి మొత్తం 209 పతకాలు సాధించారు. దీనిలో జగ్గయ్యపేట డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ నుంచి 26 మంది మహిళలు, 13 మంది పురుషులు మొత్తం 39 మంది పోటీలలో పాల్గొని 78 స్వర్ణ, 34 రజత, 25 కాంస్యం కలిపి మొత్తం 137 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన బహుమతి ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం తేజస్వి పొడపాటి మాట్లాడుతూ 85 ఏళ్లు పైబడిన మహిళలు కూడా పాల్గొని పతకాలు సాధించడం తనకు ప్రేరణ ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లెల సీతమ్మ, మున్సిపల్ కమిషనర్ డీటీవీ కృష్ణారావు, సీఐ పి.వెంకటేశ్వర్లు, డీఎస్ఏ నిర్వహణ కమిటీ, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
డ్రగ్స్ కేసులో దొరికితే జీవితం నరకమే
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): డ్రగ్స్పై దండయాత్ర అంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటున్నారని.. డ్రగ్స్ కేసులో దొరికితే సహించేది లేదని.. చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. వాంబేకాలనీలోని వీఎంసీ కల్యాణమండపంలో ‘డ్రగ్స్పై దండయాత్ర 2.0’ కార్యక్రమం సోమవారం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్పై సైకిల్ యాత్ర మంచి ప్రభావం చూపిందన్నారు ఇప్పటి వరకు ప్రేమతో చెప్పాం.. బతిమాలి చెప్పి చూశాం.. ఇంకా మార్పు రాకపోతే ఈసారి తప్పకుండా దండించి తీరుతామన్నారు. డ్రగ్స్ మహమ్మారి ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా వారి కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లానే ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తుందని.. అందుకే ప్రత్యేక కిట్లతో ఈ డ్రగ్స్ పరీక్షలను పోలీసులు, వైద్యుల సమక్షంలో జరుపుతున్నామన్నారు. డ్రగ్స్ తీసుకొని ఆరు నెలల సమయం గడిచినా కూడా ఈ పరీక్షల్లో కనిపిస్తుందని చెప్పారు. 149 హాట్ స్పాట్లు.. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 149 హాట్ స్పాట్స్లను గుర్తించామని ఈ హాట్ స్పాట్స్లలో 30 రోజుల పాటు 3000 డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ద్వారా రోజుకు 100 మంది చొప్పున డ్రగ్స్ టెస్ట్ చేస్తామన్నారు. స్వచ్ఛందంగా వచ్చి తనిఖీ చేసుకున్న వారిలో పాజిటివ్ వస్తే వారిని అడిక్షన్ సెంటర్కు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. డ్రగ్స్పై దండయాత్ర కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రచార వాహనాలను జెండా ఊపి వారు ప్రారంభించారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, డ్రగ్ కంట్రోల్ ఏడీ శ్రీరామ్మూర్తి, డీఎంహెచ్ఓ సుహాసిని, డీసీపీలు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ‘మీకోసం’
కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మీకోసం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. వృద్ధులు, వికలాంగులతో మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎస్పీ మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరికొన్ని అర్జీలను ఫోన్లలో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అన్యాయానికి గురైన బాఽధితులకు న్యాయం చేయటమే పోలీసుల కర్తవ్యమని అన్నారు. మీకోసంలో అందిన ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపుతామన్నారు. న్యాయం కోసం వచ్చే బాధితుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా మసలుకోవాలన్నారు. మీకోసంలో 35 అర్జీలు అందినట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిలుకూరు(ఇబ్రహీంపట్నం): గేదెలు కాసేందుకు వెళ్లిన వ్యక్తి తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మేతకు వెళ్లిన గేదెలు సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి రాగా, వాటిని తోలుకెళ్లిన యజమాని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ముళ్ల పొదల మాటున ఓ ప్రాతంలో ముఖం, శరీరంతో పాటు ప్రైవేట్ పార్ట్ల వద్ద గాయాలతో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. అతని పక్కన పెద్దసైజు బండ రాళ్లు ఉండటంతో రాళ్లతో కొట్టి చంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సేకరించిన వివరాల మేరకు మండలంలోని చిలుకూరు గ్రామానికి చెందిన గుడిశ అమరలింగేశ్వరావు(48) కుటుంబ పోషణ కోసం లారీ డ్రైవర్గా పనిచేస్తూనే గేదెలను పెంచుతుంటాడు. ప్రతిరోజు అతని భార్య గేదెలను మేతకు తోలుకెళ్తుంటుంది. ఆమెకు వేరే పని ఉండటంతో సోమవారం ఆమె భర్త అమరలింగేశ్వరరావు గేదెలు తోలుకెళ్లాడు. సాయంత్రం గేదెలతో పాటు అతను ఇంటికి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని ముళ్లపొదల్లో గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న గంజాయి బ్యాచ్ హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, యుక్త వయస్సు వచ్చిన ఇద్దరు కుమారులు ఉన్నారు. జి.కొండూరు: మండలంలోని భీమవరప్పాడు గ్రామానికి చెందిన ట్రాక్టరు కోడూరు వైపు నుంచి వస్తూ టైరు పగలడంతో అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో ట్రక్కు మాత్రమే పక్కకి బోల్తాపడి ఇంజిన్ పడకపోవడంతో ట్రాక్టరు నడుపుతున్న రాము అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ట్రాక్టరు ట్రక్కులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
కార్పొరేషన్ ఉద్యోగి అనుమానాస్పద రీతిలో మృతి
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విజయవాడ కార్పొరేషన్ ఉద్యోగి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై కొత్తపేట పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ రూరల్ మండలం అంబాపురానికి చెందిన సవలం విఠల్ కిషోర్, సాయినాగ రేణుక భార్యభర్తలు. విఠల్ కిషోర్(34) విజయవాడ నగర పాలక సంస్థలో చెత్త లారీ డ్రైవర్గా ఉద్యోగం చేస్తుంటాడు. ఈ నెల 4వ తేదీన విఠల్ కిషోర్ ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లి తిరిగి రాలేదు. మధ్యాహ్నం విఠల్ కిషోర్కు భార్య ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిని విచారించినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం బంధువు కొర్రపాటి గాంధీ ఫోన్ చేసి పాముల కాల్వ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని చెప్పాడు. దీంతో పాముల కాల్వ వద్దకు చేరుకున్న రేణుక బంధువుల సాయంతో ఆ మృతదేహాన్ని పరిశీలించి అది తన భర్త విఠల్ కిషోర్దిగా గుర్తించారు. దీంతో ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి చర్యలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి శాప్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్దిడానికి ఖేలో ఇండియా నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), విజయవాడ నగర పాలక సంస్థ సంయుక్తంగా పనులు చేపట్టనున్నారు. ఈ స్టేడియంలో వివిధ క్రీడాంశాలకు సంబంధించిన కోర్టులను నిర్మాణం చేయడానికి గాను రూ.60 కోట్ల విలువైన పనులను చేయాలని శాప్ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించారు. ఈ అభివృద్ధి పనులకు ఖేలో ఇండియా నుంచి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. ఈనెల 8వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. మూడు దశలు... రూ.60 కోట్లతో పనులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని రూ.60 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.20 కోట్లను ఖేలో ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన రూ.40 కోట్లను శాప్, విజయవాడ నగరపాలక సంస్థ ఖర్చు చేయనున్నాయి. మొదటి దశలో స్టేడియం లోపలి భాగంలో ఫుట్బాల్ గ్రీన్ ఫీల్డ్ కోర్టు, 4–టెన్నిస్ కోర్టులు, 2–వాలీబాల్ కోర్టులు, 2–బాస్కెట్ బాల్ కోర్టులు, హ్యాండ్బాల్ కోర్టులు, 400, 200 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్స్ నిర్మాణం చేస్తారు. రెండో దశలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, మూడో దశలో పరిపాలన భవనాలు, జిమ్తో పాటుగా ఫిజియోథెరఫీ సెంటర్ నిర్మాణం చేయనున్నారు. మొదటి దశ పనులకు సంబంధించి బుధవారం భూమి పూజ జరుగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం స్థలం కార్పొరేషన్ ఆధీనంలో ఉండటంతో కార్పొరేషన్తో శాప్ ఒప్పందం చేసుకుని కార్పొరేషన్, శాప్ సంయుక్తంగా ఈ పనులను చేపట్టనున్నాయి. -
జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శేషగిరిరావు
మైలవరం: ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వై.శేషగిరిరావు ఎన్నికయ్యారు. మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇండోర్ స్టేడియంలో సోమవారం ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా ఐ.మురహరి వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వై.శేషగిరిరావు, ఉపాధ్యక్షులుగా ఆర్.రమేష్, ఎస్.సుబ్బారావు, కార్యదర్శి పి.బుజ్జి(ఏకగ్రీవం), సంయుక్త కార్యదర్శులుగా ఎల్.సతీష్ వర్మ, కె.రవిశంకర్, కోశాధికారిగా బి.చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా వై.హేమాంబిక, ఎం.మాధవీలత, బి.భారతి ఎన్నికయ్యారు. ఎన్నిక తదనంతరం జనరల్ బాడీ సమావేశంలో పది క్లబ్ ప్రతినిధులు, గౌరవ అధ్యక్షుడిగా పి.అజయ్కుమార్, చైర్మన్గా రానాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కోఆప్షన్ సభ్యులుగా బి.ప్రేమ్ తేజా, మౌనిక, హర్షలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 33 శాతం సీ్త్రలకు, 25 శాతం క్రీడా సంబంధిత వ్యక్తులను అసోసియేషన్ ద్వారా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి మురహరి తెలిపారు. కంకిపాడు: జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం...విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న సిమెంటు లోడు లారీ కంకిపాడు బైపాస్ మార్గంలోకి రాగానే లారీ టైరు పంక్చర్ అయ్యింది. దీంతో లారీ డ్రైవరు లారీని నిలిపివేశాడు. ఇదే మార్గంలో కంకరు లోడుతో వెళ్తున్న టిప్పరు సిమెంటు లోడు లారీని వెనుకగా వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో టిప్పరు ఇంజిను భాగం పూర్తిగా ధ్వంసమైంది. లారీ డ్రైవరు కేబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సుమారు అరగంట పాటు కష్టపడి కేబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవరును అతికష్టం మీద బయటకు లాగారు. గాయాలపాలైన డ్రైవరు ఘంటసాల మండలం అచ్చంపాలెంకు చెందిన తుమ్మపూడి నవీన్ (32)ను 108 అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. స్థానిక పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. -
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చిట్టూరు గ్రామానికి చెందిన జి. వెంకటరమణ, పార్వతీ దంపతులు సోమవారం రూ. 1,00,116 విరాళంగా సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. చల్లపల్లి: ఇటీవల చల్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న పోలీసులను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మార్చి 31వ తేదీన పోలీస్ స్టేషన్లో మందుగుండు సామగ్రి తరలిస్తుండగా అట్టపెట్టెలో నుంచి ఉల్లి బాంబులు జారిపడి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదంలో ఎస్ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా, ఎస్ఐ కార్ డ్రైవర్ డి.నాగరాజు తీవ్రంగా గాయపడగా వారిని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు హోమ్ మంత్రి అనితకు వివరించారు. అనంతరం ఆమె వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం అండగా ఉంటుందని గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం బంగారు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. విజయవాడ ఆచార్యరంగానగర్కు చెందిన జి.శరత్బాబు కుటుంబం సుమారు 22 గ్రాముల బంగారంతో తయారు చేయించిన రెండు మంగళ సూత్రాలను ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్పై కారు దగ్ధం వన్టౌన్(విజయవాడపశ్చిమ): పోలీసు శాఖకు చెందిన ఒక కారు నుంచి మంటలు చెలరేగిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కార్యాలయం ఉండేది. అయితే ఆ కార్యాలయాన్ని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం అమరావతికి తరలించింది. దాంతో పాత కార్యాలయం ప్రాంగణంలో ఉన్న వాహనాలను సైతం సిబ్బంది అమరావతికి తరలిస్తున్నారు. ఆ క్రమంలో అక్కడి నుంచి ఒక కారును అమరావతికి తరలిస్తుండగా కనకదుర్గ ఫ్లైఓవర్ పైన హెడ్ వాటర్ వర్క్స్ సమీపానికి వచ్చిన సమయంలో అందులో నుంచి మంటలు చెలరేగాయి. దాంతో అందులో ఉన్న డ్రైవర్ అప్రమత్తమై కారును నిలిపివేసి పక్కకు వచ్చేశాడు. అనంతరం అగ్నిమాపక శాఖకు, ఉన్నతాధికారులకు సమాచారమందించాడు. అగ్నిమాపక శాఖ వాహనం అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసింది. -
తాగు, సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలి
కోనేరుసెంటర్: రాబోయే రోజుల్లో తాగు, సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత నీటి సంఘాలు, ప్రజలపై ఉందని రాష్ట్ర గనులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి బందరు మండలంలోని పొట్లపాలెం గ్రామ పంచాయతీలోని కొత్తపూడి గ్రామ చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని చెరువులను గుర్తించి అందులో పూడిక తీత పనులను చేపట్టాలన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ చెరువుల్లో నీటిని నింపుకోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాల మట్టం పెరుగుతుందన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని నీటిని నిలువ చేసుకొని శుద్ధిచేసి పొదుపుగా ప్రతి ఇంటికి సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శివప్రసాద్, జలవనరుల శాఖ ఎస్ఈ గుణకర్, భూగర్భ జల శాఖ డీడీ బిందుశ్రీ, జలవనరుల శాఖ ఈఈ రవికిరణ్, డీఈఈ అపర్ణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ సుధాకర్, ఏఈ సుగుణ, తహసీల్దారు నాగభూషణం, డెప్యూటీ ఎంపీడీవో బాలకృష్ణరావు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, జిల్లా నీటి సంఘాల అధ్యక్షుడు దేవన బోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ గణేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, స్థానిక నాయకులు, పలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఏపీలో పంచాయతీ కార్యదర్శులకు కూటమి సర్కార్ బిగ్ షాక్
సాక్షి,విజయవాడ: ఏపీలో పంచాయతీ కార్యదర్శులకు కూటమి సర్కార్ బిగ్ షాకిచ్చింది. జీవో నెం 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించింది. గతంలో పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్ రూ.28280 ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25220కి తగ్గించింది. పేస్కేల్ తగ్గిస్తూ జీవో నెంబర్.91ను సవరణ చేసింది. అయితే కూటమి సర్కార్ తీరుపై పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పోరాటం తప్పదని పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. -
ఆరుగురు మిత్రులు.. చోరీల్లో దిట్టలు
గూడూరు: వారు ఆరుగురు స్నేహితులు. 19 నుంచి 22 ఏళ్లలోపు వారే.. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఫెయిలై చదువుకు దూరమయ్యారు. చెడు వ్యవసనాలకు అలవాటు పడి, అందుకు అవసరమైన డబ్బు కోసం చోరీల బాట పట్టారు. చివరికి పోలీసులకు చిక్కారు. గూడూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు వివరాలను బందరు ఇన్చార్జి డీఎస్పీ కె.ధర్మేంద్ర ఆదివారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు.. గూడూరు మండలం మల్లవోలుకు చెందిన షేక్ అస్కర్, జాన్ వెస్లీ, పోలవరం గ్రామానికి చెందిన మువ్వల లీలాధర్, పెండ్ర దుర్గారావు, బులసర కోట నాగవెంకట సాయి, గుమ్మడి రాహుల్ దాదాపు ఒకే వయస్సు యువకులు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఫెయిలై ఇంటిపట్టునే ఉంటూ జల్సాలు, ఆకతాయి తిరుగుళ్లకు అలవాటు పడ్డారు. తమ అవసరాలకు కష్టపడకుండా డబ్బులు సమకూర్చడం కోసం చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. మల్లవోలు, పోలవరం, పెడన, విజయవాడ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. పగలు ద్విచక్రవాహనాలపై గల్లీల్లో తిరగటం, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించడం, తర్వాత రెక్కీ నిర్వహించి ఆ ఇళ్లలోకి చొరబడి దొరికినంతా దోచుకెళ్లడం చేసేవారు. ఏడాదిన్నర కాలంలో ఎనిమిది చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. తీగలాగితే డొంక కదిలింది.. మల్లవోలు, పోలవరం గ్రామాల్లో ఇటీవలి కాలంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. వీటిని సీరియస్గా తీసుకున్న గూడూరు ఎస్ఐ చల్లపల్లి దివ్య ప్రకాష్ ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. దొంగతనాలు జరిగిన ఇళ్లలో వేలిముద్రలు సేక రించి, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి, గతంలో చోరీలకు పాల్పడిన వారిని విచారిస్తూ కేసు దర్యాప్తు సాగించారు. ఈ నేపథ్యంలో ఆరుగురు స్నేహితుల్లో ఇద్దరు ఓ ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఆ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా ఆరుగురు చేసిన చోరీలు వెలుగు చూశాయి. సాంకేతికంగా కూడా ఆధారాలు సేకరించి ముఠాలో ఆరుగురు స్నేహితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 99.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 437 గ్రాముల వెండి వస్తువులతో పాటుగా మూడు మోటారు సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను పట్టుకోవడంలో చాకచ క్యంగా వ్యవహరించిన పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్, గూడూరు ఎస్ఐ చల్లపల్లి దివ్య ప్రకాష్, పెడన ఎస్ఐ షేక్ బషీర్, సీసీఎస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు. -
కోర్టు ఆర్డర్ ఉంటే చూపించండి
మచిలీపట్నంటౌన్: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సంస్కారం మరచి తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇల్లు కూల్చివేయాలని కోర్టు ఆర్డర్ ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. స్థానిక రామానాయుడుపేటలో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి కృష్ణమూర్తి మరణంపై అబద్ధాలు వల్లెవేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తన తండ్రి అనారోగ్యం పాలైతే హైదరాబాద్, చైన్నె వంటి నగరాల్లోని ఆస్పత్రుల్లో నెలల పాటు వైద్యం చేయించానని గుర్తుచేశారు. తన తండ్రి తుదిశ్వాస విడిచేవరకు తాను, తన మరో తల్లి విక్టోరియమ్మ ఆయన్ను అంటిపెట్టుకుని ఉన్నామన్నారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా ఆయన అనారోగ్య కారణాల రీత్యా తాను డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. ఎన్నికల ప్రచారం కూడా తానే ఎక్కువగా నిర్వహించానన్నారు. కానీ తాను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని కొల్లు రవీంద్ర దిగజారి మాట్లాడితే తాను వివరణ ఇవ్వడం తన కర్మగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పరామర్శించడంలో తప్పేముంది కొబ్బరి తోటలో జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇల్లు కూల్చివేయాలని కోర్టు ఆర్డర్ ఉందని కొల్లు రవీంద్ర అంటున్నారని, ఆర్డర్ను కమిషనర్ ద్వారా చూపించాలని పేర్ని నాని సవాల్ విసిరారు. కోర్టు ఆర్డర్ ఉంటే వారు చెప్పే ఏ శిక్షకై నా తాను సిద్ధమని స్పష్టంచేశారు. ఆర్డర్ లేకుంటే ఏ శిక్షకై నా సిద్ధమేనా అని రవీంద్రను ప్రశ్నించారు. రూ.45 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన గృహాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తే బాధితులు ఫోన్ చేయగా తాను అక్కడికి వెళ్లానన్నారు. బాధితులను పరామర్శించడంలో తప్పేముందని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్న 2015–16 కాలంలోనే ఈ స్థలానికి ఖాళీ స్థలం పన్నులు వేశారని, 2024లో భవనాలు నిర్మించా రని, అయితే అవి తన హయాంలో జరిగినట్లుగా అవాస్తవాలు చెప్పడం సరికాదని హితవు పలికారు. బినామీ ఆస్తులు లాక్కోండి తనకు బినామీ ఆస్తులు ఉన్నాయని విమర్శిస్తున్నా రని, బినామీ ఆస్తుల చట్టం ప్రకారం వాటిని లాక్కోవచ్చుగా అని పేర్ని నాని ప్రశ్నించారు. నగరంలోని పోలీస్ కాంప్లెక్స్, పోలీస్ కల్యాణ మండపం, ఇలా పలు కట్టడాలకు అనుమతులు లేవని వాటిని కూల్చే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. నగరంలో ఏఏ భవనాలకు అనుమతులు లేవో జాబితా ఇస్తానని, దమ్మూ ధైర్యం ఉంటే వాటిని కూల్చాలని సూచించారు. చేపల మార్కెట్ సమీపాన, బందరు కోట ప్రాంతాల్లో మంత్రి రవీంద్ర నిర్మిస్తున్న భవనాలకు అనుమతులు లేవని, వాటిని కూడా కూల్చే స్తారా అని ప్రశ్నించారు. బందరుకోట స్థలానికి అసలు లింకు డాక్యుమెంట్లే లేవని, ఈ స్థలంలో అక్రమ భవనాన్ని ఎలా నిర్మిస్తున్నారని నిలదీశారు. ప్రధాన రహదారితో పాటు చిలకలపూడిలో రోడ్డు విస్తరణను స్థల యజమానులను ఒప్పించి చేయిస్తే దానిపై కూడా విమర్శలు చేయటం ఎంతవరకు సబబన్నారు. ప్రధాన రహదారిలో కల్పన టెక్స్టైల్ యజమాని గాంధీని రోడ్డు విస్తరణకు స్థలం ఇవ్వా లని తాను పలుమార్లు కలిసి బతిమిలాడానని, అయినా ఆయన ససేమిరా అనడంతో కోర్టు ఆదేశాల ప్రకారం రోడ్డుకు అవసరమైన మేర స్థలం తీసుకున్నామని గుర్తుచేశారు. తాను 2004 నుంచి 2014 వరకు, 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉండి బందరుకు కృష్ణ యూనివర్సిటీ, నర్సింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, పోర్టు మెడికల్ కళాశాల, ఫిషింగ్ హార్బర్ ఇలా ఎన్నో ప్రాజెక్టులు తీసుకువచ్చానని, పలు కాలనీల్లో రహదారులన్నీ అభివృద్ధి చేశానని వివరించారు. రవీంద్ర హయాంలో ఏ ప్రాజెక్టు తీసుకువచ్చారో ప్రజలకు చెప్పగలరా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులన్నీ తాను కృషి చేయకుంటే గాలికి వచ్చాయా అని ఎద్దేవాచేశారు. జల్లూరి గోపిని విజయవాడ పిలిపించి బెదిరించి ఆయన స్థలాన్ని లాక్కోలేదా అని ప్రశ్నించారు. విజయవాడలో ఆరు టీవీ చానళ్లు మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో ఆరు టీవీ చానళ్లు నడుపుతున్నారని, నెలకు రూ.85 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఆ మొత్తానికి సంబంధించి బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా అని పేర్ని నాని ప్రశ్నించారు. తన తల్లి విక్టోరియమ్మ ఆస్తుల విక్రయాల సమయంలో తానే సాక్షి సంతకాలు సైతం చేశానని పేర్ని నాని తెలిపారు. తల కిందులుగా తపస్సు చేసినా తనను వేలెత్తి చూపలేవని కొల్లు రవీంద్రకు హితవు పలికారు. తానేంటో తన నైజం ఏంటో కార్యకర్తలను ఎలా చూసుకుంటానో టీడీపీ కార్యకర్తలనే అడిగి తెలుసుకోవాలని సూచించారు. నిజాలు మాట్లాడితే తప్పు లేదని, కుసంస్కారంతో నీచంగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా కోశాధికారి బందెల డేవిడ్ థామస్నోబుల్, నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. -
డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ ప్రారంభోత్సవం
భవానీపురం(విజయవాడపశ్చిమ): సమాజం ద్వారా పొందిన జ్ఞానాన్ని, సహాయాన్ని తిరిగి అదే సమాజానికి అందించాలన్న మహనీయుల మాటలను స్ఫూర్తిగా తీసుకుని పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఎస్కేపీవీవీ గ్రూప్ యాజమాన్యం అభినందనీ యులని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఎస్కేపీవీవీ హిందూ హై స్కూల్స్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ జక్కంపూడి వైఎస్సార్ కాలనీ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎస్కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ.. ఆరున్నర ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ హై స్కూల్ విద్యలవాడగా పేరొందిన విజయవాడకే తలమానికంగా నిలుస్తుందన్నారు. ఈ హై స్కూల్ నిర్మాణానికి భూరీ విరాళం ఇచ్చిన డోకుపర్తి ఉపేంద్రను అభినందించారు. హిందూ హై స్కూల్స్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు టి. శేషయ్య, గోపిశెట్టి మల్లయ్య మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతివర్గాల విద్యార్థులకు తక్కువ ఫీజులతో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈ పాఠశాలను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మీరా, హిందూ హై స్కూల్స్ కమిటీ ట్రెజరర్ గోళ్ల బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారా యణరావు, స్కూల్ ఇన్చార్జ్ సెక్రటరీ డాక్టర్ టి.శ్రీనివాసు, స్కూల్ ప్రిన్సిపాల్ పి.శ్యామల, కమిటీ సభ్యుడు వేముల హజరతయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డోకుపర్తి ఉపేంద్ర దంపతులను సత్కరించారు. -
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి బాబూజగ్జీవన్రామ్ అని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు పేర్కొన్నారు. భారత ఉపప్రధాని బాబూజగ్జీవన్రామ్ జయంతిని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్న జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిమ్నజాతుల అభ్యున్నతికి జగ్గీజవన్రామ్ కృషి మరువలేనిదన్నారు. విద్యార్థి దశ నుంచే అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలను పటాపంచలు చేసిన మహోన్న తుడని పేర్కొన్నారు. క్విట్ ఇండియా, శాసనోల్లంఘన ఉద్యమాల్లో సైతం మహాత్మగాంధీతో కలిసి అడుగులు వేసి ముందుకు సాగారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలోని సర్కారుతోటలో చోరీ జరిగింది. పోలీ సులు రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిలకలపూడి పోలీసుల కథనం మేరకు.. సర్కారుతోటకు చెందిన మోతుకూరి లలిత మచిలీపట్నం మండల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆప రేటర్గా పనిచేస్తున్నారు. లలిత తన తల్లితో కలిసి శనివారం ఇంటికి తాళం వేసి విజయవాడ వెళ్లారు. ఆదివారం ఉదయం పక్కింటి వారు లలితకు ఫోన్ చేసి వారి ఇంటి తలు పులు తెరచి ఉన్నట్లు చెప్పారు. దీంతో ఆమె హుటాహుటిన మచిలీపట్నంలోని ఇంటికి చేరుకున్నారు. బీరువా తలుపులు తెరచి ఉండటంతో పాటు, రూ.20 వేల నగదు, గాజులు, ఉంగరం, రూపులు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించిన లలిత చిలకలపూడి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మైలవరం మండలం పుల్లూరులోని చిలుకూరువారిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాకు చెందిన దేవావతు రవి (30) ద్విచక్రవాహనంపై మైలవరం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు సెంటర్ సమీపంలో ఉన్న చిలుకూరువారిగూడెం జెడ్పీ హైస్కూల్ వద్దకు వచ్చే సమయానికి మైలవరం నుంచి తిరువూరు వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొని రవి రహదారిపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవిని స్థాని కులు 108 వాహనంలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. సంఘనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఘనంగా బాబూ జగ్జీవన్రామ్ జయంతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. జింఖానా మైదానం సమీపంలోని బాబూజగ్జీవన్రామ్ విగ్రహం వద్ద ఆయన జయంతిని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నేతలతో కలిసి జగ్జీవన్రామ్ విగ్రహానికి దేవినేని అవినష్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ దళితుల అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు. దళితులు ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకున్న వ్యక్తి అని కొనియాడారు. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల అభివృద్ధికి పెద్ద పీట వేసిందన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల సంక్షేమం, అభివృద్ధి గాలికి వదిలేశారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ వంటి మహనీయులు చూపిన బాటలో నడవాలన్నారు. ఈ కార్య క్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ శరత్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ శ్యామ్, కాలే పుల్లారావు, త్రివేణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడి ప్రాంగణంలో రూ. 14 లక్షలతో చలువ పందిళ్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో వేసవి చలువ పందిళ్ల పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో సుమారు రూ. 14 లక్షల అంచనాతో చలువ పందిళ్ల ఏర్పాటుకు ఆలయ అధికారులు కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. అమ్మవారి ఆలయం ఎదుట, రాజగోపురం ఎదుట కళావేదిక, ఘాట్రోడ్డు, కనకదుర్గనగర్, నటరాజ స్వామి వారి ఆలయం, లక్ష్మీగణపతి విగ్రహం వద్ద ఇలా పలు ప్రాంతాల్లో చలువ పందిళ్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో త్వరితగతిన చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మరో వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి గుంటూరు జిల్లా తాడేపల్లి వాస్తవ్యులు సుసర్ల వెంకట శశికృష్ణరాఘవ, జయ నందిని దంపతులు రూ. 1,00,111 ఆదివారం విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు విరాళాన్ని అందించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే పీజీఆర్ఎస్కోనేరుసెంటర్: కృష్ణా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈనెల 6 తేదీ సోమవారం యథావిధిగా జరగనున్నట్లు ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే కార్య క్రమంలో ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతుందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు వారికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ న్యాయం కోసం అర్జీలు అందజేయవచ్చని వివరించారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. -
వేతన వేదన!
ఉపాధి హామీ కూలీలు వేతన వేదన అనుభవిస్తున్నారు. పనులు చేసినా మూడు నెలలుగా వేతనాలు అందక పస్తులు ఉండాల్సి వస్తోంది. ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పనులకు మళ్లించడంతో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురవు తోంది. పనులు చేసిన పదిహేను రోజుల్లో చెల్లించాలని నిబంధనలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. దీంతో కూలీలు ఇతర పనులకు వెళ్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మూడు నెలలకు రూ.8.15 కోట్ల వేతనాలు పెండింగ్ మూడు నెలలుగా ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికీ ఈ నెలలో వేతనాలు అందుతాయి. గత మూడు నెలల పెండింగ్ వేతనాలతో పాటు ఈ ఏప్రిల్ నెల జీతాలు కూడా అందేలా 2026–27 బడ్జెట్లో ప్రొవిజన్ ఇచ్చాం. పని చేసిన ప్రతి ఒక్కరికీ వేతనాలు వస్తాయి. ఎటువంటి సందేహాలు లేకుండా పనులకు హాజరు కావాలి. –అరవపల్లి రాము, డ్వామా పీడీ, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు: ఉపాధి హామీ కార్మికులు మూడు నెలలుగా వేతనాల వెతలు పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ తీరుతో వారికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పని చేసినా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారు. దీంతో కూలీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కూలీలు పస్తులను ఉండలేక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఉపాధి పనులు టార్గెట్ పూర్తయ్యే అవకాశం లేక కూలీల సంఖ్యను పెంచాలంటూ ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందిపై ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. చేసిన పనికి వేతనాలు ఇవ్వకపోగా అదనంగా ఉపాధి పనులకు కూలీలను తీసుకురావాలనే ఒత్తిళ్లపై కింద స్థాయి సిబ్బంది రగిలిపోతున్నారని తెలుస్తోంది. రూ.8.15 కోట్ల వేతనాలు పెండింగ్ ఎన్టీఆర్ జిల్లాలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 2,80,956 పని దినాలకు రూ.8.15 కోట్ల వేతనాలను ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. పథకం నిబంధనల ప్రకారం పదిహేను రోజులకోకసారి కూలీలకు వేతనాలను అందించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను ఇతర పనులకు చంద్రబాబు సర్కార్ బదిలీ చేయడంతో కూలీలకు చెల్లింపు ఆలస్యమవుతోందని విమర్శలు వస్తున్నాయి. వేతనాలు లేట్కావడంతో పని చేసినా పస్తులు ఉండాల్సి వస్తోందని ఉపాధి కార్మికులు భావిస్తున్నారు. అధిక వేతనం కూడా ఆశ చూపడంతో వ్యవసాయ పనుల వైపు కూలీలు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూలీలు సక్రమంగా రాక ఉపాధి పనులు పెండింగ్ పడుతున్నాయి. మూడు నెలలుగా ఉపాధి పనులు చేస్తున్నా వేతనాలు ఇవ్వడం లేదు. వ్యవసాయ పనులకు వెళ్తే ఇంతకన్నా ఎక్కువే కూలీ వస్తుంది. వెంటనే డబ్బులు ఇస్తారు. ఈ పని ఎప్పుడూ ఉంటుందని వస్తే డబ్బులు అలస్యమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే వేతనాలను అందించాలి. –యర్రంశెట్టి అప్పారావు, చెవుటూరు ఉపాధి పనులకు వెళ్లినా ప్రయోజనం లేదు. పదిహేను రోజులకొకసారి ఇవ్వాల్సిన కూలి డబ్బులు.. మూడు నెలలు గడిచినా ఇవ్వకపోవడం దారుణం. కూలి చేసుకుంటేనే పూట గడిచే ఎన్నో కుటుంబాలు నరకయాతన పడుతున్నాయి. –యడ్లపల్లి తిరుపతమ్మ, చెవుటూరు -
ఎమ్మెల్యే వస్తున్నారు.. మీరు దండేసేందుకు వీల్లేదు
పామర్రు: ‘ఎమ్మెల్యే వస్తున్నారు. మీరు దండ వేసేందుకు వీల్లేదు. ఇక్కడే ఉండండి’ అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ను కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీసులు అడ్డుకున్నారు. గంట సేపటికి పైగా రోడ్డు పైనే నిలువు కాళ్లపై వేచి ఉండేలా నిర్బంధించారు. ప్రజాస్వామ్య దేశంలో దళిత నేత బీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించాలన్నా పోలీసుల అనుమతి కావాలా? చంద్రబాబు ప్రభుత్వ రాక్షస పాలనకు ఇది నిదర్శనమని స్థానికులు వాపోయారు. బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని పామర్రులో మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ఆదివారం పర్యటనలు చేస్తూ బీజేఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో అనిల్కుమార్ పమిడిముక్కల గ్రామం చేరుకున్నారు. అక్కడ జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలదండ వేయకుండా పమిడిముక్కల సీఐ చిట్టిబాబు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ‘ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పమిడిముక్కల వస్తున్నారు. ఆయన వెళ్లే వరకు మీరు గ్రామంలోకి రావడానికి వీల్లేదు’ అని హెచ్చరించారు. మాట వినకపోతే కేసులు బనాయిస్తాం తమ మాట వినకపోతే కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. అంతేకాదు కై లే కార్లను ముందుకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. సుమారు గంటకు పైగా రోడ్డుపైన మాజీ ఎమ్మెల్యే అనిల్కుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు వేచి ఉన్నారు. ఈ విషయమై కై లే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఎమ్మెల్యే వస్తుంటే సామాన్యులు పనులు చేసుకునే అవకాశం లేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు కావాలని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తాము దండ వేసి వెళ్లిపోతామని చెప్పినా పోలీసులు అంగీకరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఆయన వర్గీయులు బీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేళ్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా కార్లను వారి కార్లపై వేగంగా పోనించారు. టీడీపీ కార్యకర్తలు ఇలా ప్రవర్తించినా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూశారు. పోలీసుల తీరుపై గ్రామస్తులు విస్మయం వ్యక్తంచేశారు. -
క్రీస్తు సందేశం మానవాళికి శాంతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్రీస్తు ప్రభు అనుసరించిన క్షమాగుణం, త్యాగం, కరుణ, శాంతి మానవాళికి శాంతి సందేశం కావాలని విజయవాడ కతోలిక పీఠం పీఠాధిపతులు (బిషప్) మోస్ట్ రెవ. తెలగతోటి జోసఫ్ రాజారావు పిలుపునిచ్చారు. ఈస్టర్ (పాస్క) పర్వదినం పురస్కరించుకొని బెంజిసర్కిల్ సమీపంలోని సెయింట్ పాల్స్ చర్చిలో సజీవుడైన ఏసుక్రీస్తు పునరుత్థాన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు పాస్క సందేశమిస్తూ క్రీస్తు పునరుత్థానంతో మానవాళి చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆరంభమైందన్నారు. మరణించిన మహోన్నతుడైన ఏసు మూడవరోజు సజీవుడై లేచిన రోజే ఈస్టర్ పర్వదినమన్నారు. పాస్క (ఈస్టర్) అంటే మరణం జయించడమేనని ఆయన వివరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పవిత్ర పూజాపీఠంపై బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, ఫాదర్ నక్కా డేవిడ్ రాజు, ఫాదర్ యం. ఉపేంద్ర, ఫాదర్ పి. అంబేద్కర్ ‘ఈస్టర్ సమిష్టి దివ్యపూజాబలి’ సమర్పించారు. అంతకుముందు బిషప్ రాజారావు (పాస్క) కొవ్వొత్తిని వెలిగించి ఈస్టర్ వేడుకలను ప్రారంభించారు. పవిత్ర జలాన్ని ఆశీర్వదించారు. పూజానంతరం బిషప్ జోసఫ్ రాజారావు విజయవాడ కతోలిక పీఠం పరిధిలోని ప్రజలందరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
మచిలీపట్నంఅర్బన్/వన్టౌన్(విజయవాడ పశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ కేబీఎన్ కాలేజీ, కృష్ణా జిల్లా యాంప్తిల్ ప్రభుత్వ బాలకల పాఠశాలలో స్పాట్ వాల్యుయేషన్కు ఏర్పాట్లుచేశారు. ఎన్టీఆర్ జిల్లాకు 1.73 లక్షలు, కృష్ణాకు 1.84 లక్షల సమాధాన పత్రాలు వచ్చాయి. మూల్యాంకన సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు విధులను కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో.. మూల్యాంకన ప్రక్రియ కోసం ఎన్టీఆర్ జిల్లాకు మొత్తం 699 మంది సిబ్బందిని నియమించారు. అసిస్టెంట్ ఎగ్జామినర్స్ 409, చీఫ్ ఎగ్జామినార్స్ 75, స్పెషల్ అసిస్టెంట్స్ 215 మంది ఉన్నారు. కృష్ణా జిల్లాకు 741 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 433 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 78 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 230 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఉదయం 9 గంటలకు హాజరు తప్పనిసరి మూల్యాంకన కేంద్రంలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్ వద్ద అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు, ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు. కేంద్రంలో సౌకర్యాల కల్పన మూల్యాంకన కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యం, లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసు బందోబస్తు కల్పించారు. ప్రథమ చికిత్స కోసం ఏఎన్ఎంలు, సిబ్బంది, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచారు. ట్యాబ్ ద్వారా మార్కుల నమోదు ఈసారి సమాధాన పత్రాల మూల్యాంకనంతో పాటు మార్కులను ట్యాబ్లలో నమోదు చేసే విధానం అమలు చేస్తున్నారు. మాన్యువల్ ప్రక్రియ అనంతరం స్పెషల్ అసిస్టెంట్లు వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేసి అప్లోడ్ చేయనున్నారు. స్పెషల్ అసిస్టెంట్లకు సూచనలు స్పెషల్ అసిస్టెంట్లు లీప్ యాప్లో లాగిన్ అయి కంట్రోల్ బండిల్, ఆన్సర్ స్క్రిప్ట్లను స్కాన్ చేసి మార్కులు నమోదు చేయాలి. నమోదు చేసిన మార్కులను పూర్తిగా తనిఖీ చేసి, ప్రివ్యూ అనంతరం కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఒకసారి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదు. ఉపాధ్యాయులు, పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘పది’ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సోమవారం నుంచి నల్లబ్యాడ్జీలతో స్పాట్ వాల్యుయేషన్ విధులకు హాజరవుతూ నిరసన వ్యక్తం చేయనున్నారు. ఏప్రిల్ 9న మూల్యాంకన కేంద్రంవద్ద ఆందోళన, 25, 26, 27 తేదీల్లో విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఫ్యాప్టో కృష్ణా జిల్లా చైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం తెలిపారు. పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నగరంలోని కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఆరు నుంచి 15వ తేదీ వరకూ స్పాట్ వాల్యూయేషన్ను నిర్వహిస్తున్నాం. స్పాట్ జరిగే ప్రాంగణంలో అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాం. అప్పటికే ఉపాధ్యాయులందరికీ సమాచారం అందించాం. అలాగే ఉపాధ్యాయులందరూ ఈ వాల్యూయేషన్లో పాల్గొనున్నారు. –చంద్రకళ, డీఈవో, ఎన్టీఆర్ జిల్లా జిల్లాలో స్పాట్ వాల్యుయేషన్ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మూల్యాంకన ప్రక్రియ సాగుతుంది. సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు, ట్యాబ్ల ద్వారా మార్కుల నమోదు వంటి ఆధునిక విధానాలను అమలు చేస్తున్నాం. మార్కుల నమోదుకు స్పెషల్ అసిస్టెంట్లకు శిక్షణ కూడా ఇచ్చాం. ఉపాధ్యాయులు పరీక్షల నిష్పత్తి, నాణ్యతను కాపాడే విధంగా మూల్యాంకనం విధులు నిర్వర్తించి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి. –యూవీ సుబ్బారావు, కృష్ణా విద్యాశాఖాధికారి -
పారిశ్రామికవేత్తలకు డైనమిక్ వేదిక ‘ఫౌండర్స్ రూఫ్’
భవానీపురం(విజయవాడపశ్చిమ): పారిశ్రామికవేత్తలు, పెట్టుబడీదారులు, సృజనాత్మకత కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఇటీవల ఏర్పాటైన ‘ఫౌండర్స్ రూఫ్’ కార్యకలాపాలు విజయవంతంగా ముందుకు సాగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఆకాంక్షించారు. ఫౌండర్స్ రూఫ్ సంస్థను నెలకొల్పిన విష్ణు, జగ దీష్లు ఆదివారం భవానీపురంలోని హరిత బెరంపార్క్లో ఏర్పాటు చేసిన మీటప్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వారి ఆలోచనలు, భవిష్యత్ కార్యాచరణను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం నిర్వహించే ఫౌండర్స్ రూప్ మీటప్స్ ద్వారా ప్రత్యక్షంగా పరిచయాలు పెంచుకోవడం, పటిష్టమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం, స్టార్టప్ ఆలోచనలను ప్రదర్శించడం వంటి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. విజయవాడ రూరల్ గుంటుపల్లిలోని రైజ్ కేంద్రం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. -
దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి: పేర్ని నాని
కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్రకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ (ఏప్రిల్ 5న) పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. ‘జనసేన కార్యకర్త ఇంటిని మీరు కూల్చేస్తే మేం వెళ్లకూడదా? బాధితుడు తనకు జరిగిన కష్టం గురించి చెబితేనే నేను వెళ్లాను.కావాలంటే నా కాల్ డేటా ఇస్తా చెక్ చేసుకో. కోర్టు తీర్పు ఉంటేనే కూల్చేశామని చెబుతున్నారు కదా... దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి. కోర్టు తీర్పు చూపించండి... మీరు ఏం చేయమన్నా చేస్తా. కోర్టు తీర్పు ఉందని నిరూపించలేకపోతే నేను చెప్పింది మీరు చేస్తారా? మాట్లాడటానికి సిగ్గు ఉండాలి కొల్లు రవీంద్ర.గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కొబ్బరి తోటలో లే అవుట్ వేశారు. ఇప్పుడు మీరు మంత్రి అయ్యాకే అక్కడ బిల్డింగ్ లు కట్టారు. అక్కడ స్థలానికి, ఇళ్లకు నాకేం సంబంధం? నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా ఎవరి ఆస్తులను కూల్చలేదు. రోడ్డు విస్తరణలో కోర్టు ఆదేశాల మేరకే ఒకే ఒక్క అక్రమ బిల్డింగ్ ను అధికారులు కూల్చివేశారు.ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా... బయటికి తీయండి ఆధారాలు. నేనే ఆ బిల్డింగ్ కూల్చి వేయించినట్లు నీ దగ్గర ఆధారాలుంటే నా పై కేసు పెట్టించు. బందరుకు ఏం చేయలేదని నన్ను విమర్శిస్తున్నావు? నేను బందరు రోడ్డు విస్తరణ చేశానని నీ నోటితోనే చెబుతున్నావ్. నా బినామీల కోసమే నేను ఏదైనా చేస్తే బినామీ చట్టం ఉపయోగించండి’ అని అన్నారు.మీకు ఆ సత్తా లేదా? ‘మీకు అధికారం ఉంది కదా... మీకు ఆ సత్తా లేదా? అందరినీ ఒప్పించి నేను బందరులో రోడ్డు విస్తరణ చేపట్టాను. 2014-19 వరకూ ఇప్పుడు రెండేళ్లలో బందరుకు మీరేం చేశారో చెప్పగలరా కొల్లు రవీంద్ర? 2004-2014 వరకు బందరు అభివృద్ధికి పాటుపడింది నేను. మీరు వచ్చాక బందరుకు ఏం చేశారో సమాధానం చెప్పండి. బందరు కోటలో మీరు కట్టిన ఇంటికి ప్లాన్ లేదు. మార్కెట్లో కట్టిన మీ కాంప్లెక్స్కు ప్లాన్ లేదు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో కట్టిన పోలీస్ కాంప్లెక్స్ కు ప్లాన్ లేదు. పోలీస్ కల్యాణ మండపానికి ప్లాన్ లేదు. నేను మాట్లాడేవన్నీ ఆన్ రికార్డు. బందరులో ప్లాన్ లేనివన్నీ వెతికిమరీ ఓ లిస్ట్ ఇస్తా. ప్లాన్లు లేనివన్నీ కొట్టేసే దమ్ముందా మీకు? అంత సీనుందా మీకు? నీకు దమ్ముంటే నా బినామీలను బయటపెట్టండి. విజయవాడ కేంద్రంగా మీరు ఆరు న్యూస్ ఛానల్స్ నడిపిస్తున్నారు’ అని అన్నారు. -
సృజనాత్మకతతో ఆర్థిక స్వావలంబన
భవానీపురం(విజయవాడపశ్చిమ): మహిళలు సృజనాత్మకతతో రూపొందించిన హస్తకళ ఉత్పత్తులు వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాల నైపుణ్యాలతో తయారు చేసిన హస్తకళా ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని డీఆర్డీఏ కార్యాలయంలో రైజ్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు హస్తకళలపై శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్ర మాన్ని ఆయన పరిశీలించారు. ఫ్యాబ్రిక్, గ్లాస్ పెయింటింగ్, తాంజోర్ పెయింటింగ్స్పై నిర్వహించిన వర్క్షాప్లో దాదాపు వంద మందికిపైగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. హస్తకళా ఉత్పత్తులను తయారు చేయడంలో మహిళలు తమ సృజనాత్మకతను ప్రదర్శించడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చని సూచించారు. ఈ శిక్షణలో వివిధ ఉత్పత్తుల తయారీ పద్ధతులు, నూతన డిజైన్లు, మార్కెటింగ్ విధానాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. శిక్షణ అనంతరం మహిళలు రూపొందించిన తమ ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి. నాంచారరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
కేవీకేను మోడల్గా తీర్చిదిద్దుతాం
ఐసీఏఆర్ అటారి జోన్ డైరెక్టర్ డాక్టర్ షేక్ మీరా ఘంటసాల: ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని మోడల్ కేవీకేగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అటారి 10 డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా పేర్కొన్నారు. గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో 13వ శాసీ్త్రయ సలహా మండలి సమావేశం రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి.వి.ఎస్.దుర్గాప్రసాద్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ షేక్ మీరా మాట్లాడుతూ.. ఘంటసాల కేవీకే 13 ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తూ రైతుల సేవలు అందిస్తూ, వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ఏటా 620 క్వింటాళ్ల ఫౌండేషన్ వరి విత్తనాలు, 130 క్వింటాళ్ల నాణ్యమైన అపరాల విత్తనాలను రైతులకు అందించడంతో పాటు, 1.12 టన్నుల ట్రైకోడర్మా పంపిణీ చేస్తోందన్నారు. తద్వారా రైతు స్థాయిలో నాణ్యమైన విత్తనాలపై అవగాహన కల్పించడమే కాకుండా కొత్త పంటలు, కొత్త వంగడాలు, కొత్త వైరెటీ యాజమాన్య పద్ధతులను ఈ ప్రాంత రైతులకు పరిచయం చేస్తూ వ్యవసాయాభి వృద్ధికి కేవీకే దోహదం చేస్తోందన్నారు. దేశంలో మొత్తం 731 కేవీకేలు ఉండగా, వాటిలో ఘంటసాలకు ప్రత్యేకత ఉందన్నారు. రాబోయే నాలుగైదేళ్లలో ఈ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మోడల్గా తీర్చిద్దుతామన్నారు. కృష్ణా జిల్లాలో నేలల్లో సేంద్రీయ కార్బన్ శాతం తక్కువగా ఉందని, దీనిని పెంపొందించేందుకు సాయిల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వెయ్యి మంది రైతులను ఎంపిక చేసి సేంద్రీయతను పెంపొందించేందుకు దశ, దిశ మార్గదర్శకం చేస్తున్నామన్నారు. ఈ కేవీకేలో మొదటిసారిగా ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టి రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామన్నారు. లాభసాటి సాగు విధానాలను చేరువ చేయాలి ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. రైతులకు నూతన లాభసాటి సాగు విధానాలను చేరువ చేయాలని సూచించారు. ఘంటసాల కేవీకే రైతులకు ఉత్తమ సేవలు అందిస్తోందని కొనియాడారు. ముందుగా కేవీకే ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన పూలు, గుర్రపుడెక్క, మామిడి, జామ కాయలతో చేసిన వివిధ ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలించారు. భూమి సుపోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా చేసిన మట్టి పరీక్షలను తనఖీ చేశారు. ఘంటసాల కేవీకేలో నూతనంగా నిర్మించిన విత్తన గిడ్డంగి, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్, ఇతర ల్యాబ్స్, తాగునీటి పంపును డైరెక్టర్ డాక్టర్ మీరా, ఎమ్మెల్యే బుద్ధ ప్రారంభించి, నూతన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ విస్తరణ డైరెక్టర్ డాక్టర్ జి.శివన్నారాయణ, కేవీకే సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి, ఏఆర్ ప్రతినిధులు పద్మా వతి, కాకి నాగేంద్రరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్. పద్మావతి, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎ.నాగరాజు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్సీహెచ్ నరసింహులు, కేవీకే శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పలువురు పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లా అభివృద్ధికి కలెక్టర్ విశేష కృషి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా అభివృద్ధికి కలెక్టర్ డి.కె.బాలాజీ విశేష కృషి చేశారని పలువురు కొనియాడారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శనివారానికి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో కేక్ కట్చేసి సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్వో చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. కలెక్టర్ బాలాజీ జిల్లాలో సమర్థవంతమైన పరిపాలన అందించారన్నారు. కట్టుదిట్టమైన పర్యవేక్షణతో ప్రభుత్వ పథకాల అమలు చేశారని వివరించారు. కలెక్టర్ చూపుతున్న అంకితభావం ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్జాహిద్, బందరు ఆర్డీఓ కె.సాంబశివరావు, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ అఖిల, కలెక్టరేట్ ఏఓ ఎ.ఎస్.ఎన్.రాధిక, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. హైదరా బాద్ మోతీనగర్కు చెందిన పి.రజనీకాంత్ శర్మ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధి కారులను కలిసి వేలంమర్రి సాంబశివ శర్మ, పద్మావతి పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేశారు. బాపట్ల జిల్లా రేపల్లె రైలుపేటకు చెందిన ద్రోణవజ్జల బ్రహ్మ అవధాని దంపతులు, విజయవాడ సూర్యా పేటకు చెందిన బమిడిపాటి శ్రీమన్నారాయణ కుటుంబం, బమిడిపాటి శారద కుటుంబం రూ.లక్ష చొప్పున విరాళాలు అందజేశాయి. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. గన్నవరం: తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి గన్నవరానికి చెందిన శ్రీవారి భక్త సమాజం ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను శనివారం లారీల్లో తరలించారు. తొలుత కూరగాయల వాహనాన్ని తహసీల్దారు కె.వెంకటశివయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్త సమాజం ప్రతినిధి మండవ వెంకటప్రభాకరరావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు శ్రీవారి భక్త సమాజం ద్వారా 21 టన్నుల కూరగాయలను టీటీడీకి అందజేశామన్నారు. వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు పడమట రంగారావు, మాజీ ఉపసర్పంచ్లు జాస్తి శ్రీధర్, పాలడుగు నాని, పుర ప్రముఖులు నెక్కలపూడి ఈశ్వర రావు, టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, గూడపాటి సీతారాంబాబు, తుమ్మల మురళీకృష్ణ పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించనున్న ఏఐ సమ్మిట్ శనివారం విజయవాడలో ప్రారంభమైంది. బృందావన కాలనీలో ఏ కన్వెన్షన్లో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ను మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచాన్ని టెక్నాలజీ నడిపిస్తోందన్నారు. టెక్నాలజీపై పట్టు సాధిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందొచ్చన్నారు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ నెట్వర్క్ చైర్మన్ శ్రీధర్ కొసరాజు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయన్నారు. కార్పొరేట్ రంగంలో ఏఐ ద్వారా ఎలా పనిచేయాలనేది ఇండస్ట్రీ హెడ్స్ వివరిస్తారని, విద్యార్థులు, యువతకు ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు. సదస్సులో స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు, పరిశ్రమలు నడుపుతున్న వారు తమ వ్యాపారాలను ఎలా ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్గా మార్చుకోవాలో వివిధ రంగాల నిపుణులు తెలియజేశారు. పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ శనివారం ఉదయం విజయవాడ గాంధీజీ మహిళా కళాశాల సమీపంలోని అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీచేశారు. టోకెన్ కౌంటర్లో రూ.5 చెల్లించి క్యూలో నిలబడి, భోజనానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. క్యాంటీన్లో వసతులు ఎలా ఉన్నాయి? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. తాను కూడా ఆహార నాణ్యత పరీక్షించేందుకు భోజనం చేశారు. ఈ పర్యటనలో వీఎంసీ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026క్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకుని విజయవాడలో రన్ ఫర్ జీసస్ నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్, క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన టీటీడీ బోర్డు చైర్మన్ బి.ఆర్.నాయుడు తీరుపై ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన గళం వినిపించాయి. ఆయన్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జుల ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొని బి.ఆర్.నాయుడుకు వ్యతిరేకంగా బ్యానర్లు, ప్లకార్డులతో ర్యాలీలు నిర్వహించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ఆధ్వర్యంలో పామర్రు శివాలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని నినాదాలు చేస్తూ శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పూజల అనంతరం కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్గా బి.ఆర్.నాయుడు బాధ్యతలు చేపట్టాక తిరుమల ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన బి.ఆర్.నాయుడు వీడియోలు బయటకు వచ్చినప్పటికీ సీఎం చంద్రబాబు ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి తప్పకుండా శిక్షిస్తారని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకొని బీఆర్ నాయు డిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవభక్తుని చక్రవర్తి డిమాండ్ చేశారు. కానూరు తిరుపమ్మ ఆలయంలో శనివారం ఆయన పార్టీ నేతలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి విషయంలో టీడీపీ ప్రభుత్వం అలంబిస్తున్న తీరుతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ విజయవాడ పటమటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఎమ్మెల్సీ కల్పలత, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తిరువూరు నియోజకవర్గ పరిశీలకుడు తంగిరాల రామిరెడ్డి, వివిధ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో మాచవరం దాసాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. హిందూ ధర్మంపై చంద్రబాబుకు నిజమైన ప్రేమ ఉంటే వెంటనే బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఏ కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, కొండపల్లి పట్టణ అధ్యక్షుడు పోరంకి శ్రీనివాసరాజు, జిల్లా కార్యదర్శి మిక్కిలి శరభయ్య తదితరులు పాల్గొన్నారు. తిరువూరులోని వెంకటాచలస్వామి దేవస్థానంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బీఆర్ నాయుడు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, రేగళ్ల మోహన్రెడ్డి, పురిటిపాటి సుధారాణి, తిరువూరు, విస్సన్నపేట జెడ్పీటీసీ సభ్యులు యరమల రామచంద్రారెడ్డి, లోకేశ్వరరెడ్డి పాల్గొన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో సీతారాంపురం కొత్త వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ఆలయం ఎదురుగా టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుని పదవి తొలగించాలని కోరుతూ నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు పఠాన్ ఫిరోజ్ఖాన్, మండవ శ్రీనివాస్గౌడ్, చింతకుంట్ల వెంకటరెడ్డి, బత్తుల రామారావు, నంబూరి రవి, కాటేపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నందిగామ అమరలింగేశ్వరస్వామి ఆలయం, కంచికచర్ల పాతశివాలయంలో వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రత్యేక పూజలు జరిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు వేమా సురేష్బాబు, బండి మల్లికార్జున్ రావు, మార్త శ్రీనివాసరావు, మంగలపూడి కోటిబాబు, దేవకొండ గురవయ్య, మాడుగుల శంకర్, ఎంపీటీసీ సభ్యులు ఎం.మధుబాబు, వేమా రోజారమణి పాల్గొన్నారు. కానూరు తిరుపతమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న దేవభక్తుని చక్రవర్తి తిరువూరులో కొబ్బరికాయ కొడుతున్న స్వామిదాసు కంచికచర్లలో పూజలు చేస్తున్న జగన్మోహనరావు7విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 532.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 13,866 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
నందిగామ టౌన్: హోం శాఖ మంత్రిగా మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో మహిళలకు ఇంటా, బయటా రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వంగలపూడి అనిత సారథ్యంలోని హోంశాఖ లా అండ్ ఆర్డర్ కాస్త లేట్ అండ్ ఆర్డర్గా నడుస్తోందని ఎద్దేవాచేశారు. మహిళలపై ఇప్పటి వరకు జరిగిన అఘాయిత్యాలు, దాడులు, లైంగికదాడి ఘటనల్లో న్యాయం జరిగిందా? తప్పు చేసిన వారికి శిక్ష పడిందా అని ప్రశ్నించారు. రెండేళ్లుగా మహిళలకు అన్యాయాన్ని చూస్తుంటే హోం మంత్రికి ఎలా ఉందో తెలియదు కానీ తాము మాత్రం సిగ్గు పడుతున్నామని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో మహిళపై జరిగిన దాడి అత్యంత బాధాకరమన్నారు. ప్రతిపక్షంలో ఉండగా మహిళా రక్షణ కోసం గగ్గోలు పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు తమ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు వైఎస్సార్ సీపీ ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని శ్యామల స్పష్టంచేశారు. కేవలం ప్రాంతం పేరు చెప్పుకొని చేసే దోపిడీకి మాత్రమే వ్యతిరేకమన్నారు. రాజధానికి చట్టబద్దత అంటూ నానా హంగామా చేస్తున్నారని దీపాలు వెలిగిస్తున్నారని, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ఇళ్లలో కూడా ఇలానే ఆనందంగా సంబరాలు చేసుకుని దీపాలు వెలిగిస్తున్నారా అని ప్రశ్నించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు నానా అవస్థలు పడుతున్నారని, ప్లాట్లు అంటూ పట్టాలిచ్చారని, అవి ఎక్కడో భూమిపై చూపించలేని అసమర్థ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రాజధాని రైతుల భూ సమస్యను పరిష్కరించాలని హితవుపలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదన రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమన్నారు. దీని ద్వారా రాజధాని నిర్మాణానికి ఖర్చు తగ్గటంతో అతి కొద్ది సమయంలోనే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం శ్యామల దంపతులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీరులపాడు ఎంపీపీ కోటేరు లక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోటేరు నాగమల్లేశ్వరి, మార్త రజని, నాయకులు వేమా రోజ, షేక్ ఫాతిమ, వైఎస్ఎన్ ప్రసాద్, వేమా సురేష్బాబు, బుగ్గినేని సురేష్, కోటేరు సూర్య నారాయణ రెడ్డి, వేమూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి శ్యామల -
జబ్బున పడుతున్న సర్వరోగ నివారిణి
● వేసవిలో మాడిపోతున్న వేప చెట్లు ● గ్రామీణుల్లో అపోహలతో కూడిన ఆందోళన ● డై బ్యాక్ తెగులేనంటున్న నిపుణులు నాగాయలంక: భారతీయ ఆయుర్వేద వైద్యంలో సర్వరోగ నివారిణిగా, ఔషధ వృక్షంగా భావించే వేప చెట్లు రోగాల బారిన పడి చనిపోడంపై గ్రామీణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పలు ప్రాంతాల్లో వేప చెట్లు ఎండిపోతూ కనిపిస్తున్నాయి. తొలుత వేసవి కాలం కారణంగా ఆకులు ఎండి రాలిపోయి మళ్ళీ చిగురిస్తాయని తేలికగా తీసుకున్న ప్రజల్లో రాను రాను అధిక సంఖ్యలో వేప చెట్లు ఎండి చనిపోవడంతో ఆందోళన నెలకొంది. మూడేళ్ళ క్రితం 2023 ఏప్రియల్ మాసంలో కూడా ఇదే రీతిలో చెట్లు భారీ సంఖ్యలో మాడిపోయాయి. మళ్లీ ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో వేసవి తాపాన్ని తీర్చి చల్లని వాతావరణం ఇచ్చే వేప చెట్లు ఎండిపోవడంపై ఉద్యానవన, అటవీశాఖ అధికారులు అధ్యయనం చేసి అపోహలు తొలగించాలని గ్రామీణులు కోరుతున్నారు. డై బ్యాక్ తెగుల్ల వల్లే.. వేపచెట్టు కొమ్మలు పై నుంచి ఎండుతూ కింది వరకు వచ్చే పరిణామాలను డైబ్యాక్ తెగులుగా ఉద్యానవన నిపుణులు చెపుతున్నారు. ఈ తెగులు తీవ్రత అధికమైనప్పుడు చెట్లు చనిపోయే అవకాశం ఉందంటున్నారు. దీని నివారణకు మూడు గ్రాముల బ్లైటెక్స్ మందును లీటరు నీటితో కలిపి చెట్టు చుట్టూ వేర్లు తడిచేలా పోస్తే నివారణకు అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. పదో తరగతి పరీక్షలు పూర్తి కావడం, మరో వైపున సుముహూర్తపు వేళ ఒక్కటైన నవ వధువరులతో పాటు శుక్రవారం రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. మహామండపం లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్రోడ్డులోని క్యూలైన్లులో భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో రద్దీ మరింత పెరిగింది. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం, రూ. 100, రూ. 300 టికెట్లపై దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. రద్దీ నేపధ్యంలో ఉదయం 10 గంటల తర్వాత రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో క్యూలైన్లో వేచి ఉన్న వారికి మంచినీళ్లు, మజ్జిగను పంపిణీ చేశారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, దర్బారు సేవ, పల్లకీ సేవల్లో భక్తులు విశేషం గా పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ, కాలుష్య నివారణకు చర్యలు
పటమట(విజయవాడతూర్పు): మొక్కల సంరక్షణ, కాలుష్య నివారణ అంశాలపై విజయవాడ నగర పాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని స్పెషల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. ఆదివారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఆయన విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ వద్ద బందర్ కెనాల్ బండ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బందర్ కెనాల్ బండ్పై నాటిన మొక్కలకు స్ప్రింక్లర్ వ్యవస్థ ద్వారా అందిస్తున్న నీటి సరఫరాను వారు సమీక్షించారు. మొక్కల సంరక్షణ, పచ్చదన విస్తరణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అలాగే నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు. ముఖ్యంగా రహదారులపై కాలుష్య నియంత్రణ కోసం వినియోగిస్తున్న ప్రత్యేక (మిస్ట్) వాహనాల పనితీరును ప్రత్యక్షంగా వీక్షించి, మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. గుడివాడరూరల్: పరీక్ష సరిగ్గా రాయలేదని ఓ విద్యార్థిని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాధరపురంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్ములూరు గ్రామ శివారు ఉన్న గంగాధరపురానికి చెందిన బండ్ల హనుమంతరావు కుమార్తె హాసిని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 1వ తేదీన పరీక్ష రాయడానికి కళాశాలకు వెళ్లింది. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై పరీక్ష సరిగ్గా రాయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. 2న కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. తల్లి ఆశాలత పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం ఫోన్ చేసింది. ఆ సమయంలో కుమార్తె హాసిని తనకు ఒంట్లో బాలేదని, వాంతులు అవుతున్నాయని తల్లికి తెలిపింది. వెంటనే తల్లి ఇంటికి వచ్చి చూడగా గదిలో హాసిని ఆపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో వెంటనే స్థానికుల సహాయంతో హాసిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం హాసిని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గుడ్ ఫ్రైడే
త్యాగానికి ప్రతీక త్యాగానికి ప్రతీకై న గుడ్ ఫ్రైడేను ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పలుచోట్ల క్రైస్తవులు ప్రదర్శనలు చేశారు. శిలువపై క్రీస్తు చేసిన త్యాగం మానవాళికి రక్షణ సందేశం ఇచ్చిందని చర్చి ఫాదర్లు తెలిపారు. క్రీస్తు మానవాళికి ఇచ్చిన సందేశాన్నిచదివి వినిపించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో కొండపై శిలువ మార్గం చేశారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
తిరుపతమ్మకు బంగారు నక్లెస్ సమర్పణ
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారికి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన బూరుగుపల్లి శివరామకృష్ణ, వాణి దంపతుల మేనకోడలు భోగవల్లి దివ్యతేజ 25 గ్రాముల, 950 మిల్లీ గ్రాముల నక్లెస్ను ఆలయ సూపరింటెండెంట్ రాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ మాజీ సభ్యుడు చుంచు రమేష్బాబు, నాయకులు రేగండ్ల రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. యనమలకుదురుకు చెందిన గొట్టిపాటి పూర్ణచంద్రరావు, ప్రమీలరాణి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు దుర్గగుడికి విచ్చేశారు. వారి 60వ పెళ్లిరోజు పురస్కరించుకుని అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేయగా, కమిటీ చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారిని శుక్రవారం సూర్య కిరణాలు తాకాయి. గర్భాలయంలో ఉదయం అర్చకులు అభిషేకాలు చేస్తున్న సమయంలో మూలవిరాట్ను ఉదయం 6.30 నుంచి 6.45 గంటల మధ్యలో సూర్య కిరణాలు తాకాయి. అమ్మవారి పాదాల నుంచి ముఖం వరకు అమ్మవారిని సూర్య కిరణాలు వెలిగించిన దివ్య తేజస్సును చూసి భక్తులు పరవశులయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్డుపై నీటితో తడుపుతూ కాళ్లు కాలకుండా మ్యాట్లు కూడా ఏర్పాటు చేశారు. -
అడవి దాటని
నాగాయలంక మడ అడవుల మధ్య యానాదుల జీవనయానం.. కాలం మరిచిన గాథలా కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యానాదులకు అడవే వారి ఆశ్రయం.. ప్రకృతే ఆధారం. ఇతరుల కరుణపై ఆధార పడిన వీరికి పూట గడవాలంటే మాత్రం వెట్టి చాకిరీ తప్పడం లేదు. దీంతో అడవుల్లో చెట్ల నీడలో వీరు కన్నీరు పెట్టుకుంటున్నారు. పీతలు, రొయ్యలు, చేపల వ్యాపారుల చేతిలో వీరు ఉండటంతో.. జీవన పోరాటం చేయక తప్పడం లేదు.నాగాయలంక: నాగాయలంక మండలంలోని మడ అడవుల్లో వందకు పైగా యానాది కుటుంబాలు మాడిపోతున్నాయి. పీతలు, రొయ్యలు, చేపలు సాగు చేసే రైతులు.. పనిలో పెట్టుకుని వెట్టి చాకిరీ చేయిస్తున్నారని యానాదులు వాపోతున్నారు. మండలంలోని తీరప్రాంతం సొర్లగొంది నుంచి లైట్ హౌస్ వరకు వందకు పైగా యానాది(ఎస్టీలు) కుటుంబాలు నిత్య జీవన యానంలో వెట్టి చాకిరీతో కునారిల్లుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి.. సరైన సీజన్ కాక పోయినా పీతల వేట కొనసాగించేందుకు సంబంధిత వ్యాపారులు వెట్టి చాకిరీ చేయించుకోవడానికి బందరు, బంటు మిల్లి, బాపట్ల, నెల్లూరు జిల్లాల ప్రాంతాల నుంచి యానాదులను నాగాయలంక తీర ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇక్కడ కృష్ణా నది పరీవాహకం, బంగాళాఖాతం సముద్ర పాయల వెంట పీతల వేటకు అను కూలంగా ఉంటుంది. దీంతో గంపగుత్తగా పీతల వ్యాపారం సాగించే వ్యాపారులు వీరిని చెప్పు చేతల్లో పెట్టుకుని వెట్టి చాకిరీ చేయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తరచూ తీర గ్రామాల్లో ఘర్షణ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి యానాదులను తీసుకొస్తున్నారు. దీంతో మండలంలోని స్థానిక యానాదుల జీవనోపాధికి గండి కొడుతున్నారు. పరాయి ప్రాంత ఎస్టీలను తీసుకురావడం తరచూ తీర గ్రామాల్లో ఘర్షణలకు తావిస్తోంది. వసతుల్లేక అల్లాడుతున్నారు సొర్లగొంది తీరంలో మడ అడవుల మాటున మండు వేసవిలో సరైన నివాసాలు, సౌకర్యాలు లేక పిల్లలతో అల్లాడుతున్నా వారిపై కనికరం ఉండదు. వ్యాపారుల లక్ష్యం వారు వేట సాగించి సరుకు అందించడమే. నామ మాత్రపు కూలీతో పని చేస్తున్నారు. యానాదుల పిల్లలు సైతం ఈ కఠిన జీవన యాత్రలో సమిధలు కావాల్సి వస్తోంది. వేసవిలో తాగునీరు అందదు, రాత్రిళ్లు తాత్కాలిక నివాస డేరాల్లో దోమలతో ఇక్కట్లు పడాల్సిందే. గ్రామాలకు దూరంగా మడ అడవుల్లో తీరం వెంట వారి జీవనం సాగుతోంది. స్థానికులైతే ఏరోజుకారోజు వేటకెళ్లి ఇళ్లకు తిరిగి వస్తుంటారు. ఇది లాభదాయకమైన వెట్టి చాకిరి కావడంతో ఈమధ్య కాలంలో పలువురు వ్యాపారులు ఎస్టీల వైపు చూస్తున్నారు. ఇటీవల ఐదు కుటుంబాలకు విముక్తి ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ గ్రామానికి చెందిన పీతల వ్యాపారి నెలలు తరబడి దీవుల్లో యానాదుల (ఎస్టీలఉ)ను బంధించి వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్న తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఐదు కుటుంబాలకు చెందిన 15మందికి అధికారులు గత నెల 17న విముక్తి కలిగించారు. అంతకు ముందు ఈలచెట్టదిబ్బలో గ్రామ కమిటీకి వ్యాపారుల నడుమ ఘర్షణలు రచ్చకెక్కి కేసులు వరకు దారితీసిన విషయం తెలిసిందే. నాగాయలంక మడ అడవుల్లో మాడిపోతున్న యానాదుల జీవితాలు -
యానాదులకు రక్షణ, సౌకర్యాలు కల్పించాలి
ప్రస్తుతం పూర్తి సీజన్ కాకపోయినా నాగాయలంక మండలం మడ అడవుల తీరంలో యానాదులు పీతల వేటలో సౌకర్యాలు లేమితో ఇబ్బంది పడటం నిజమే. సొర్లగొంది నుంచి లైట్హౌస్ వరకు మడ అడవులు తీరంలో వంద కుటుంబాలు పీతల వేటలో ఉన్నారు. అయితే వీరిలో 80శాతం మందిని కొందరు వ్యాపారులు బందరు, బంటుమిల్లి, బాపట్ల, నెల్లూరు నుంచి తెస్తున్నారు. స్థానికులకు ఉపాధి కొరవడుతోంది. జిల్లా యంత్రాంగం యానాదులకు రక్షణ, ఉపాధి పెంపొందించాలి. – నక్కా విజయబాబు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యానాది మహానాడు -
అంగరంగ వైభవంగా ..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామివార్లు శుక్రవారం కృష్ణానదిలో విహరించారు. దుర్గాఘాట్ సమీపంలోని వీఐపీ స్నానఘాట్ వద్ద ప్రత్యేకంగా అలంకరించిన పడవపై ఆది దంపతుల నది విహారాన్ని ఆలయ అర్చకులు జరిపించారు. తొలుత ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా వీఐపీ ఘాట్కు తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాట నృత్యాలు, కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. నవ దుర్గల రూపంలో చిన్నారులు అలరించారు. ఈవో శీనానాయక్ కుటుంబ సమేతంగా, ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం స్నానఘాట్లో నదీ విహారానికి ఏర్పాటు చేసిన పడవపై ఆది దంపతులను అధిష్టించగా, అర్చకులు పూజలు చేశారు. అనంతరం ముల్లోకాలకు గుర్తుగా నదీలో మూడు పర్యాయాలు విహరించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తరలించారు. ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఇతర అర్చకులు, వేద పండితులు, ఈఈ ఎల్.రమ, ఇతర ఇంజినీరింగ్ అధికారులు నదీ విహారంలో పాల్గొన్నారు. ఆది దంపతుల నదీ విహారం -
‘మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’
సాక్షి, మచిలీపట్నం: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూల్చివేసిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, కిట్టుపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదు చేశారు. ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పీఎస్లో కేసు నమోదు చేయగా.. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇవాళ (ఏప్రిల్ 3, శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. ‘‘దోపిడీ దారులను నిలదీయడమే మా కర్తవ్యం.. మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’’అని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులు.. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా?’’ అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో ఎవరి ఇళ్లు కూల్చలేదన్న పేర్ని నాని.. శాంతి భద్రతల విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పబ్లిసిటి కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.‘‘మీరు ఏకవచనంతో మాట్లాడొచ్చా. తండ్రి వయసుంటే ఏం పీక్కుంటారో పీక్కోండి సీఐ అనొచ్చా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మచిలీపట్నంలో సీఐ పరమేశ్వర్ ఎప్పుడు పనిచేశారు? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిని మేం కొట్టించాం. మేం ఏ పేదవాడి ఇంటిని కూలగొడుతుంటే ఈ సీఐ వచ్చి బందోబస్తు ఇచ్చారు. వయసులో పెద్ద వారైనంతమాత్రాన ఏకవచనంతో సంభోదిస్తారా?. నువ్వు నువ్వు మీరు అనొచ్చు... మేం అనకూడదా?. నేను పోలీసుల గురించే మాట్లాడానని మీకు మీరు అన్వయించుకోవడమేనా?..గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరు భుజాలు తడుముకోవడం దేనికి?. నేను సీఐ పేరు ఎక్కడైనా ప్రస్తావించానా?. పంపుల దగ్గర తగాదాలతో మీకేం సంబంధం?. మీరు పెట్టే అక్రమ కేసులు నిలబడతాయా?. కంకిపాడులో పేకాట ఆడిస్తున్నందుకు పరమేశ్వర్ సస్పెండ్ అయ్యాడు. మీకు చేతనైతే ఆ విషయం పై స్పందించండి. నేను పబ్లిసిటీ, రాజకీయ ఎదుగుదల కోసం. తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ, అక్రమాలపై పోరాడేవారికి అండగా ఉండటమే నా ఉద్యోగం..పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టిన వారిని నిలదీయడమే నా పని. మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన నేను ప్రశ్నించడం ఆగదు. జైలు లోపల ఉన్నా ప్రశ్నిస్తూనే ఉంటా. రాజకీయాల్లో చెడిపోయిన వారి లాగే పోలీసుల్లోనూ కొందరు చెడిపోయారు. యూనిఫాం వేసుకుని కూడా కొందరు బార్లలో మందు తాగుతున్నారు. నేను పోలీసు వ్యవస్థ అంతటినీ కించపరిచినట్లు మాట్లాడటం సరికాదు. ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి లోపల వేస్తున్న నియంత పాలన సాగుతోంది. జైపాల్తో కృష్ణాజిల్లాలో ఉన్న పోలీసులందరికీ మోటివేషన్ క్లాసులు పెట్టించాలని ఎస్పీని కోరుతున్నాం. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్రులో ఓ సీఐని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు. 2014లో కొల్లు రవీంద్ర మంత్రి మచిలీపట్నం తాలూకా సీఐని విధుల్లో చేరకుండా అడ్డుకున్నాడా లేదా?...డీజీపీ చెప్పినా కుదరదని కొల్లు రవీంద్ర చెప్పిన విషయం మీకు గుర్తులేదా?. డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు పోస్టింగ్ లు రావడం లేదని జైపాల్ తెలుసుకోవాలి. పేర్ని నాని ఎప్పుడూ.. ఎన్నడూ పోలీస్ శాఖను బెదిరించలేదు. తప్పుడు పనులు చేసే వారిని, రాజకీయనాయకులకు తొత్తులుగా ఉన్నవారినే నేను హెచ్చరించా. ఒకడు లంచం తీసుకుంటే పోలీసులంతా లంచం తీసుకున్నట్లేనా?. తప్పుడు పనులు చేసేవారిని ప్రశ్నించడం నేరమా?.. నేను చేసింది నేరమే అయితే మీరు ఏం చేసినా శిరసా వహిస్తా..కొల్లు రవీంద్ర ఎంతోమంది పోలీసుల పట్ల అమర్యాదగా వ్యవహించారు. అప్పుడు పోలీసు విధి నిర్వహణలో జైపాల్ బాగా బిజీగా ఉన్నట్లున్నారు. ఒక అధికారి ఒక చోట రెండేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేయకూడదని పోలీస్ రూల్. పోలీస్ యూనిఫాం మాటున తప్పుడు పనులు చేసే వారిని మాత్రమే నేను అన్నా. వారి జాబితాలో మిమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు. నేను ప్రెస్ మీట్లలో ఏ ఒక్క పోలీసు అధికారిని ఏకవచనంతో మాట్లాడలేదు. తండ్రి వయసున్న వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చా. కొడుకు వయసున్న పేర్ని కిట్టు మాట్లాడితే మీకు తప్పైపోయిందా?. నిన్న మీరు విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ లెటర్ అసలైనదేనా ఓసారి చెక్ చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ సంతకం చేశారా?. మీరు హడావిడిగా చేయించారా?. మీరు విడుదల చేసిన లెటర్లో మున్సిపల్ కమిషనర్ సంతకం ఒరిజినల్ ది కాదు. పామర్రు స్టేషన్ లో సీసీ ఫుటేజ్ కూడా ఇప్పిస్తారా?. ఆ ఫుటేజ్ ఇప్పించండి నేను క్షమాపణ చెబుతా. కుమ్మరిగూడెంలో పేదల ఇళ్లను కూల్చడానికి బందోబస్తు ఇచ్చారు. బందోబస్తు రిక్విజేషన్ లెటర్ ఇవ్వండి నేను పోలీసుల పాత్ర గురించి మాట్లాడను. పామర్రు స్టేషన్ ఓ దళిత యువతిని దారుణంగా కొట్టారు. ఆ యువతిని పోలీసులను కొట్టినట్లు ఫుటేజ్ను విడుదల చేయండి...ఆ ఫుటేజ్ విడుదల చేస్తే నేను కచ్చితంగా నా మాటకు కట్టుబడి ఉంటా. అనేక మార్లు రౌడీ వెధవలు నా ఇంటి మీదకు వస్తే నా కార్యకర్తలు నాకు రక్షణగా నిలిచారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా గన్మెన్లు లేకుండానే బందరులో తిరిగాను. ఎందుకు మంత్రి వెంట లేరని నా గన్మెన్ లకు అనేక సార్లు మెమో ఇచ్చారు. కావాలంటే నాదగ్గర గన్మెన్లుగా చేసిన వారిని అడిగి చూడండి. నాకు ఎవరైనా మేలు చేస్తే విశ్వాసంలో కుక్కతో నేను పోటీపడతా. నేను పోలీసు శాఖతో ఎప్పుడూ అమర్యాదగా వ్యవహరించలేదు...నాపై హత్యాయత్నం జరిగితే నేటికీ ఆ కేసు ముందుకు సాగడం లేదు. మహిళా జడ్పీ చైర్ పర్సన్ పై హత్యాయత్నం జరిగితే ఇంతవరకూ దర్యాప్తు కూడా చేయలేదు. ఆరేళ్ల క్రితం సంబరాల రాంబాబు అని పోస్టు పెట్టిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎవరు ఫిర్యాదు చేశారని కేసు పెట్టి దళిత యువకుడిని జైల్లో పెట్టారు. బాషా కళ్లల్లో ఆనందం కోసం అక్రమ కేసులు పెట్టడమేనా మీ పని అన్యాయాన్ని ప్రశ్నించిందని ఓ దళిత యువతిని కొట్టి జైల్లో పెట్టారు. మీ ఇష్టానుసారంగా కేసులు పెడితే ఎవరినీ ప్రశ్నించకూడదా?, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి జైపాల్ సార్. మా అబ్బాయి పేర్ని కిట్టును మీ దగ్గరకు శిక్షణ కోసం పంపిస్తా’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొబ్బరితోటలో అక్రమంగా కూల్చేసిన ఇంటిని పరిశీలించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు వెళ్లారు.అయితే, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐను దూషించారంటూ పేర్ని కిట్టుపై కేసు నమోదు చేశారు. కిట్టుతో పాటు పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు. ఇనకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, నగరంలోని 6వ వార్డు కొబ్బరి తోటలో నిర్మాణంలో ఉన్న శ్రీపతి వెంకటాచలం ఇంటిని అకారణంగా కూల్చివేసిన నేపథ్యంలో గురువారం ఆయన ఆ ఇంటిని పేర్ని నాని, పేర్ని కిట్టు పరిశీలించి, బాధితుడిని పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా చనిపోయేలోపు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆశతో ఎంతో శ్రమకోర్చి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ఇల్లు నిర్మించుకుంటారన్నారు. అటువంటి ఇంటిని ఎటువంటి నోటీసులు లేకుండా అర్ధాంతరంగా కూల్చివేయటం దారుణమన్నారు. -
‘కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా’
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో ఆరో వార్డులో అక్రమంగా కూల్చేసిన ఇంటిని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. మంత్రి కొల్లు రవీంద్ర, పోలీసులు, అధికారుల తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రకు పేర్నినాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేదల గుండెల్లో ప్రొక్లెయిన్లు దించి వారికి నొప్పి కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మూడేళ్లు ఆగు కొల్లు రవీంద్ర. పేదల గుండెల్లో నువ్వు దింపిన గునపాల నొప్పి నీకు కూడా చూపిస్తా. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ఇదే బాపిరాజును బందరు తీసుకొస్తా. ఇదే బాపిరాజు చౌదరిని మళ్లీ బందరు మున్సిపల్ కమిషనర్గా తీసుకొస్తా. పేదల గుండెల్లో నొప్పి ఎలా ఉంటుందో నీకు కూడా రుచి చూపిస్తా. నీకు, నీ పెన్ డ్రైవ్లు దాచి నిన్ను అడిస్తున్నవాడికి చెబుతున్నా. జేసీబీ బక్కెట్లు దిగితే నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదే బాపిరాజు.. ఇదే పోలీసులను బందరు తీసుకొస్తా...అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను. బందరు కాదు.. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాసరే.. నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆలోచన చేయాలి. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని రాతపూర్వకంగా బందోబస్తు ఇవ్వాలని అడిగారా?. కొల్లు రవీంద్ర తానా అంటే మీరు తందానా అనడం భావ్యమేనా?. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని బందోబస్తు అడిగితే ఆ లెటర్ను మీడియాకు విడుదల చేయండి...బందరులో కొల్లు రవీంద్ర వెంట పోలీసులు తప్ప వచ్చే టీడీపీ కార్యకర్త లేడు. మమ్మల్ని కూడా వదిలేసి మా కాపులు నీ పల్లకి మోశారు. నీ దగ్గర పనిచేసేవాడు ఓ కాపు ఆడపిల్లకు కడుపు చేస్తే ఏం న్యాయం చేశావ్. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది.. నీకు ఆ మాత్రం కూడా విశ్వాసం లేకపోతే ఎలా?’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
మచిలీపట్నం: పేర్ని కిట్టును అడ్డుకున్న సీఐ
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో అధికార పార్టీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఆరో వార్డులో అధికారులు.. అక్రమంగా ఇల్లును కూల్చేసిన సంగతి తెలిసిందే. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మచిలీపట్నం వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టును సీఐ అడ్డుకున్నారు. పేర్ని కిట్టుపై పరుష పదజాలంతో సీఐ పరమేశ్వర్ రెచ్చిపోయారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సీఐ వ్యాఖ్యలపై పేర్ని కిట్టు అభ్యంతరం వ్యక్తం చేశారు.సీఐ తీరుపై వైస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఇంటి కూల్చివేతపై ఆదేశాలను చూపాలంటూ కార్పొరేషన్ అధికారులను పేర్ని కిట్టు నిలదీశారు. మున్సిపల్ అధికారులు.. పొంతనలేని సమాధానాలను చెబుతూ తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. కాగా, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో నగరపాలక సంస్థ అధికారులు నిన్న (బుధవారం) మరో కూల్చివేతల పర్వానికి తెరలేపారు.నగరంలోని 6వ డివిజన్ కొబ్బరితోట ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణంలో ఉన్న పక్కా గృహాన్ని భారీ పోలీస్ బందోబస్తు నడుమ పొక్లయినర్తో కూల్చివేశారు. తమ గృహాన్ని కూల్చివేయవద్దని బాధితులు అడ్డుపడినా పోలీసులు ఈడ్చిపారేశారు. జనసేన పార్టీ సానుభూతిపరులైన గృహనిర్మాణదారులను పోలీసులు నిర్భందించి ఈ కూల్చివేత పర్వం నిర్వహించటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటికి కట్టి ఉన్న జనసేన జెండాలు సైతం ఊడబెరికి కూలగొట్టడం గమనార్హం.నిర్మాణాలకు సంబంధించి ఇటీవలే కోర్టు స్టే వెకేట్ కావటంతో నిర్మాణదారులు భవన శ్లాబు పనులు చేపట్టారు. శ్లాబ్ పనులు పూర్తయిన అనంతరం టీడీపీ నాయకుల ఫిర్యాదుతో మునిసిపల్, పోలీస్ యంత్రాంగం బుధవారం ఒక్కసారిగా యుద్ధానికి వెళ్లినట్లుగా పొక్లయినర్తో చుట్టుముట్టి బాధితులను నిర్బంధించి ఈ చర్యకు పాల్పడటం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.తమకు ముందస్తు సమాచారం లేకుండా వేలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకున్న గృహాన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూల్చివేశారని బాధితులు వాపోయారు. పెట్రోల్ పోసుకుని చనిపోవటం తప్ప తమకు వేరే దారిలేదని బాధితుడు పెట్రోల్ పోసుకోబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితులు పేర్కొన్నారు. తమ గృహాన్ని నిర్ధాక్షిణ్యంగా ఎందుకు కూలుస్తారంటూ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని నిర్భందించారు. దీనిపై మునిసిపల్ అధికారులను మీడియా ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. -
అవినీతికి సైలో
కృష్ణాజిల్లాగురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్కు భరోసా ● అవినీతి మయంగా ఎన్టీటీపీఎస్ సైలో విభాగం ● ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అంతర్గత బదిలీలతో తీవ్ర ఒత్తిడి ● నూతన బదిలీల చర్చపై మండిపడుతున్న ఉద్యోగులు ఇబ్రహీంపట్నం: నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ సైలో (బూదిద ప్లాంట్)విభాగంలో అవినీతి తార స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ ఆదాయ మార్గంగా ఉన్న సైలో విభాగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను తొలగించి ఓ సామాజిక వర్గం వారిని మాత్రమే కొనసాగిస్తున్నారని సమాచారం. సైలో విభాగంలో వివిధ సిమెంట్ కంపెనీ లారీలకు లోడింగ్ ద్వారా వచ్చే నగదు, లారీ కాటా మాయాజాలంతో సంపాదించిన సొమ్ముల్లో వాటాలు రాజకీయ నేతల జేబుల్లోకి చేర్చేందుకే ఆ సామాజిక వర్గం ఉద్యో గులకు అక్కడ పెద్ద పీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక డీఈఈ స్థాయి అధికారి ఇటీవల కావాలని బదిలీ చేయించుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం వెలువడే సైలో(మెత్తటి బూడిద), ఎన్టీటీపీఎస్ చెరువులోకి వచ్చే బూడిదను లారీలకు లోడింగ్ చేసేందుకు ఏడాది క్రితం చైన్నెకు చెందిన రెప్లెక్స్ కంపెనీకి మూడేళ్లకు లీజుకు ఇచ్చారు. సైలో ప్లాంటు రెప్లెక్స్ కంపెనీకి అప్పగించాలనే నేపంతో ప్లాంటులో పని చేస్తున్న సుమారు 20 మంది ఉద్యోగుల్లో ఎనిమిది మంది ఎస్సీ ఉద్యోగులను వేరే ప్లాంటుకు బదిలీ చేశారు. సైలోలో కాసుల పంట పండటంతో వారిలో కొందరు రూ.50 వేల వరకు ఇచ్చి ఈ ప్లాంటు విధుల్లో చేరారు. అనతి కాలంలోనే వేరే ప్లాంటుకు బదిలీ చేయడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మిగిలిన 12 మందికి కూడా బదిలీ తప్పదని ఏడాదిగా చెబుతున్నారే తప్ప చేయడంలేదు. కొందరు బదిలీ ఉత్తర్వులు తీసుకుని కూడా రాజకీయ పలుకుబడితో అక్కడే తిష్టవేశారని సమాచారం. ఎస్సీ, బీసీ ఉద్యోగులను సైలో నుంచి తప్పించడంలో అధికార పార్టీ నేతలు, యూనియన్ నాయకులు విజయవంతమయ్యారు. ఇప్పుడు విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధి వద్ద స్థానిక టీడీపీ నాయులు సైలో లో నూతన నియామకాలు చేపట్టాలనే విషయాన్ని తరపైకి తెచ్చారని సమాచారం. ఈ తంతు విజయవంతమైతే ఉద్యోగులను నుంచి రూ.లక్షల్లో వసూలవు తుంది. ఉన్నవారిని తొలగించి నూతన బదిలీలు చేయడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సంస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని రాజకీయ నాయకులు, యూనియన్ నేతలు, అధికారులు ధన దాహంతో సైలో ప్లాంటులో మళ్లీ బదిలీలపై చర్చలు జరపడంపై మండిపడుతున్నారు. బదిలీలపై సైలో విభాగం అధి కారి వివరణ కోరగా.. సంస్థ చీఫ్ ఇంజినీర్ శివరామాంజనేయులు ఆదేశాల మేరకు ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు అంతర్గత బదిలీలు చేశామన్నారు. కులాల వారీగా బదిలీ చేయాల్సిన అవసరం సంస్థకు లేదని పేర్కొన్నారు. సైలోలో నూతన బదిలీలు, నగదు వసూలు విషయం ఇప్పటి వరకు తన వద్దకు చేరలేదని స్పష్టం చేశారు. 7ఎన్టీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం వెలువడే తడి బూడిద చెరువులోకి, మెత్తటి పొడి బూడిద సైలో ప్లాంటుకు చేరుతుంది. సైలో నుంచి వచ్చే బూడిదను సిమెంట్, సిమెంట్ ఇటుకల తయారీకి వాడతారు. దీంతో ఈ బూడిదకు భారీ డిమాండ్ ఏర్పడింది. లోడింగ్ సమయాల్లో డిమాండ్ను బట్టి భారీగా నగదు చేతులు మారుతుంది. పలు సిమెంట్ కంపెనీలు లారీ లోడింగ్కు నెలకు సుమారు రూ.3 లక్షల వరకు అక్కడి ఉద్యోగులకు ముట్టజెబుతారని సమాచారం. సిమెంట్ ఇటుకల కంపెనీలకు ఉచితగా బూడిద లోడింగ్ చేస్తామని పైకి చెబుతున్నప్పటికీ వారు కూడా ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. లోడింగ్ అయిన లారీలు కాటా పెట్టే సమయంలో అధిక లోడు పేరుతో ఒక్కొక లారీకి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తారు. రోజుకు 150 లారీల వరకు లోడింగ్ జరుగుతుంది. అధిక లోడు పేరుతో కాటా వద్ద రోజుకు మూడు షిప్టుల్లో సుమారు రూ.50 వేలు వరకు వసూలు చేస్తారు. అక్రమ మార్గాన సేకరించిన ఈ నగదు రాజకీయ నేతలు, ఉద్యోగులు, అధికారులు పంచు కుని సైలో ప్లాంటును అవినీతి మయంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో అధికారులు బుధవారం మరో కూల్చివేత పర్వానికి తెరలేపారు. ఇంటిని కూల్చొద్దని అడ్డుపడిన బాధితులను పోలీసులు ఈడ్చిపారేశారు. దుర్గగుడిలో చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఆదిదంపతులు బుధవారం సింహ వాహనంపై నగరోత్సవంలో విహరించారు. మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి హనుమకొండకు చెందిన ఎ.రాహుల్ రెడ్డి, సుస్మిత రూ.1.30 లక్షల విరాళం సమర్పించారు. -
ఎల్నినో పరిస్థితులపై అవగాహన అవసరం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎల్నినో వాతావరణ పరిస్థితులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఏపీఏవోఎస్ అసోసియేషన్ భవనంలో బుధవారం పీఎండీఎస్, ప్రకృతి సాగు విధానాలతో ఎల్నినో మిటిగేషన్పై జరుగుతున్న జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేలా సాగు విధానాలతో ప్రోత్స హించాలని సూచించారు. సాగు ఖర్చులు తగ్గించి వివిధ వాతావరణ పరిస్థితుల్లో రైతులకు సుస్థిర ఆదాయం సాధ్యం కావాలంటే పీఎండీఎస్, ట్రేసబిలిటీ, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ (పీజీఎస్), సర్టిఫికేషన్ వంటి వాటిపై దృష్టిసారించాలన్నారు. వీటిని రైతులకు చేరువచేసేలా చేయిపట్టి నడిపించాలని సూచించారు. పీఎండీఎస్ ద్వారా ఉత్పత్తి అయ్యే పశుగ్రాసంతో పాలలో వెన్నశాతం పెరుగుతుందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ అరుణ, ఏటీఎంఏ పీడీ మాధవీలత, డీడీ వెంకటేశ్వరరావు, ఇన్చార్జ్ డీపీఎం గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్బంధించి.. నిర్దాక్షిణ్యంగా..
మచిలీపట్నంటౌన్: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో నగరపాలక సంస్థ అధికారులు బుధవారం మరో కూల్చివేతల పర్వానికి తెరలేపారు. నగరంలోని 6వ డివిజన్ కొబ్బరితోట ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణంలో ఉన్న పక్కా గృహా న్ని భారీ పోలీస్ బందోబస్తు నడుమ పొక్లయినర్తో కూల్చివేశారు. తమ గృహాన్ని కూల్చివేయవద్దని బాధితులు అడ్డుపడినా పోలీసులు ఈడ్చిపారేశారు. జన సేన పార్టీ సానుభూతిపరులైన గృహనిర్మాణదారులను పోలీసులు నిర్భందించి ఈ కూల్చివేత పర్వం నిర్వహించటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటికి కట్టి ఉన్న జనసేన జెండాలు సైతం ఊడబెరికి కూలగొట్టడం గమనార్హం. స్టే వెకేట్ కావడంతో.. నిర్మాణాలకు సంబంధించి ఇటీవలే కోర్టు స్టే వెకేట్ కావటంతో నిర్మాణదారులు భవన శ్లాబు పనులు చేపట్టారు. శ్లాబ్ పనులు పూర్తయిన అనంతరం టీడీపీ నాయకుల ఫిర్యాదుతో మునిసిపల్, పోలీస్ యంత్రాంగం బుధవారం ఒక్కసారిగా యుద్ధానికి వెళ్లినట్లుగా పొక్లయినర్తో చుట్టుముట్టి బాధితులను నిర్బంధించి ఈ చర్యకు పాల్పడటం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. బాధితుడు ఆత్మహత్యాయత్నం.. తమకు ముందస్తు సమాచారం లేకుండా వేలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకున్న గృహాన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూల్చివేశారని బాధితులు వాపోయారు. పెట్రోల్ పోసుకుని చనిపోవటం తప్ప తమకు వేరే దారిలేదని బాధితుడు పెట్రోల్ పోసుకోబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితులు పేర్కొన్నారు. తమ గృహాన్ని నిర్ధాక్షిణ్యంగా ఎందుకు కూలుస్తారంటూ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని నిర్భందించారు. దీనిపై మునిసిపల్ అధికారులను మీడియా ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న జనసేన సానుభూతిపరుడి ఇల్లు కూల్చివేత అర్బన్ బ్యాంక్ చైర్మన్, టీడీపీ నాయకుడు దిలీప్కు తాము ఆయన అడిగిన డబ్బులు ఇవ్వలేదనే కక్షతో రెండురోజుల క్రితం నిర్మించిన శ్లాబుతో ఉన్న ఇంటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. తాము తక్కువ మొత్తానికి భూమిని కొనుగోలు చేశామని అందువల్ల గజానికి రూ. 5వేలు చొప్పున తనకు ఇస్తే గృహం నిర్మించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని లేకుంటే గృహంనిర్మించుకోనివ్వనని ఆయన హెచ్చరించాడు. పక్కా డాక్యుమెంట్లు ఉన్న తాము ఆయనకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాం. అప్పటి నుంచి తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ.. అధికార దర్పంతో మునిసిపల్, పోలీస్ శాఖల అధికారులతో ఈ దౌర్జన్య కాండకు దిగారు. మంత్రి కొల్లు రవీంద్రకు దిలీప్ ఇబ్బంది పెడుతున్న విషయాన్ని తాను వెళ్లి చెప్పినా తాను చేసేది చేస్తానని తేల్చి చెప్పారు. – శ్రీపతి వెంకటాచలం, బాధితుడు -
జెడ్పీ చైర్పర్సన్ను కలిసిన సీఈఓ
చిలకలపూడి(మచిలీపట్నం): జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన జె.అరుణ బుధవారం ఆమె చాంబర్లో మర్యా దపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఇటీవల నిర్వహించిన బదిలీల్లో ఆమె జెడ్పీ సీఈఓగా నియమితులయ్యారు. మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇబ్రహీంపట్నం: స్థానిక ఫెర్రీ ఇసుకరేవుపై తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, సీఐ ఎ.సుబ్రహ్మణ్యం బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో అనుమతులు లేకుండా కృష్ణానది గర్భం నుంచి ఇసుక తీసుకొచ్చిన పడవల నుంచి లోడింగ్ చేస్తున్న ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాల్టా చట్టం మేరకు ఒక్కొక ట్రాక్టర్కు రూ.10 వేల చొప్పున ఫెనాల్టీ విధించారు. ఫెనాల్టీ చెల్లించే వరకు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే పడవలు, డ్రెడ్జింగ్ యంత్రాలు, మ్యా నువల్ క్రేన్ల జోలికి అధికారులు వెళ్లకపోవడం గమనార్హం. -
పేలుడుకి ఉల్లి బాంబులే కారణం
చల్లపల్లి: చల్లపల్లి పోలీస్టేషన్లో భారీ విస్ఫోటనానికి కారణం ఉల్లిపాయ బాంబులని, వాటిని 2024లో స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి చల్లపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఎస్పీ విద్యాసాగర్నాయుడు, చల్లపల్లి ఎస్ఐ కె.ఈశ్వరరావు ఘటన వివరాలను ఐజీపీకి వివరించారు. ఐజీపీ అశోక్ కుమార్తో పాటు అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, అవనిగడ్డ ఇన్చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు ఉన్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగానే.. ఐజీపీ అశోక్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ 2024లో ఒక కేసులో సుమారు 1000 ఉల్లి బాంబులను, 2025 అక్టోబర్లో రెండు కేసులకు సంబంధించిన క్రాకర్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన వాటిని ఎవ్వరికీ ఇవ్వకుండా కోర్టు అనుమతితో నిర్వీర్యం చేస్తామని, ప్రమాద ప్రభావం తక్కువగా ఉండే క్రాకర్స్ను బల్క్గా ఆక్షన్ నిర్వహించి బయటకు ఇస్తామన్నారు. ప్రస్తుతం 2025 అక్టోబర్లో సీజ్ చేసిన క్రాకర్స్ స్థానికంగా ఉన్న ఓ క్రాకర్స్ స్టోర్లో భద్రపరిచామని, 2024లో పట్టుకున్న ఉల్లి బాంబులను నిల్వ ఉంచుకోవటానికి క్రాకర్స్ షాపు వారు నిరాకరించటంతో వాటిని స్థానిక స్టేషన్లోని ఓమూల నిరుపయోగంగా ఉన్న ఓ పాడుబడిన గదిలో ఉంచినట్లు పేర్కొన్నారు. తాజాగా దానికి సంబంధించిన కేసు కొట్టివేయటంతో వాటిని నిర్వీర్యం చేసే క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు వివరించారు. అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశాం.. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనతో మిగిలిన అన్ని స్టేషన్లను అలర్ట్ చేశామని ఐజీపీ చెప్పారు. ముఖ్యంగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే ఉల్లి బాంబులు లాంటివి స్టేషన్లలో పెట్టుకోకుండా వెంటనే తగు జాగ్రత్తలు పాటించి వాటిని నిర్వీర్యం చేయాలని సూచించినట్లు తెలిపారు. ఇలాంటి మందుగుండు సామగ్రిని సాధ్యమైనంత త్వరగా నిర్వీర్యం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టువారి దృష్టికి తీసుకు వెళతామన్నారు. అమ్మకాలు నిషేధిస్తాం.. ఇక నుంచి క్రాకర్స్ అమ్మే అన్ని షాపుల్లో ప్రమాదకరమైన ఉల్లి బాంబుల అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తామని ఐజీపీ చెప్పారు. ఎవరైనా వాటిని అమ్మితే వారిపై కేసులు నమోదు చేస్తామని వారి షాపుల లైసెన్సులు కూడా రద్దు చేయిస్తామని హెచ్చరించారు. కోలుకుంటున్నారు.. ప్రమాదంలో గాయపడి, గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు, డ్రైవర్ డి.నాగరాజులు కోలుకుంటున్నారని ఐజీపీ చెప్పారు. కోర్టు కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా ఇంకా క్రిటికల్ కేర్లోనే ఉన్నారన్నారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి అయ్యే వైద్య ఖర్చులను పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంటే భరిస్తుందని ఆయన చెప్పారు. -
ఐసీయూలోనే అబ్దుల్లా..
చల్లపల్లి పోలీస్టేషన్లో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన ఎస్ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు, డ్రైవర్ డి.నాగరాజులు క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం వీరితో పాటు తీవ్రంగా గాయపడిన కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా ముగ్గురూ గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగరాజుకు కంటి చూపు దెబ్బతినటంతో కుడి కంటికి వైద్యులు బుధవారం ఆపరేషన్ చేశారు. రెండో కంటికి కూడా మరోసారి పరీక్షలు జరిపి అవసరమైతే ఆపరేషన్ చేస్తామని వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన కోర్టు కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా మాత్రం ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఆయన్ని చూసేందుకు ఎవరనీ లోపలికి అనుమతించటం లేదు. -
ఈడుపుగల్లులో అధికారుల చర్యలపై వివాదం
సాక్షి, కృష్ణాజిల్లా: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో జాతీయ రహదారి విస్తరణ పనుల పేరుతో అధికారులు చేపట్టిన చర్యలు వివాదాస్పదంగా మారాయి. ఘటన వివరాలు.. NHAI అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి వైసీపీ సానుభూతిపరుల షాపుల ముందు JCB తో గండ్లు పెట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ధ్వంసం చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. రహదారి పక్కన ఉన్న ఇతర షాపులను మాత్రం తొలగించకపోవడం వివక్షత ఆరోపణలకు దారితీసింది. దాంతో పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా పడేస్తారు? అని ప్రశ్నించారు. మచిలీపట్నం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఇలాగే పడేస్తారా? అంటూ నిలదీశారు. రహదారి అటువైపు ఉన్న షాపులు ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు చెందిన షాపులపై అధికారులు జంకుతున్నారా అని కూడా ప్రశ్నించారు. వైసీపీ నేత చక్రవర్తి అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. -
‘టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి’
సాక్షి,విజయవాడ: టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు ప్రభుత్వం తాము చేస్తున్న ఒత్తిడి కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 4న (శనివారం) వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రంలోని దేవాలయాలు పూజలు చేయనున్నారు. ఈ క్రమంలో మల్లాది విష్ణుతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. బీఆర్ నాయుడు అసాంఘిక , అనైతిక చర్యల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. నెలరోజులైనా బీఆర్ నాయుడితో రాజీనామా చేయించడం లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. కోట్లాది మంది భక్తులు వచ్చే ఆలయ ఛైర్మన్ ఎంత నిష్టగా ఉండాలి. బీఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా?. లేదంటే చంద్రబాబు చెబితే బీఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకూ ఒత్తిడి తెస్తాం. టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడు కొనసాగడాన్ని వైఎస్సార్సీపీ తప్పుపడుతోందన్నారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
గన్నవరం: గ్రావెల్ను అక్రమ రవాణా చేస్తున్న తొమ్మిది టిప్పర్ లారీలను సోమవారం అర్ధరాత్రి గన్నవరం పోలీస్లు సీజ్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి గ్రావెల్ తరలింపు పేరుతో పక్కదారి పట్టిస్తున్న సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో మండలంలోని సవారిగూడెం పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్కు గ్రావెల్ మట్టిని తరలిస్తున్న తొమ్మిది టిప్పర్లను గన్నవరం పోలీసులు పట్టుకున్నారు.అనంతరం టిప్పర్లను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. -
రిటైర్డు ఉద్యోగులు ఆరోగ్యంగా జీవించాలి
కోనేరుసెంటర్: సుదీర్ఘకాలం పాటు ప్రజలకు తమ విశిష్టమైన సేవలను అందించిన పోలీసు సిబ్బంది పదవీవిరమణ అనంతరం తమ శేషజీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ప్రయత్నించాలని జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ పదవీవిరమణ పొందిన సిబ్బందిని మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వృత్తి కత్తి మీద సాములాటిదన్నారు. అలాంటి వృత్తిని దైవంగా భావించి శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ చేసిన సేవలు నిజంగా అభినందనీయమని కొనియాడారు. అనంతరం పదవీవిరమణ పొందిన ఏఎస్సైలు టీఆర్ఏ ప్రసాద్(నాగాయలంక), ఎంవీఎస్ఆర్ఎన్వీ ప్రసాద్(గుడివాడ వన్టౌన్), కె.నగేష్బాబు(ఉయ్యూరు), డీఎన్ మల్లేశ్వరీ (డీసీఆర్బీ), పి.నరసింహారావు (గన్నవరం)లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇతర అధికారులు, పోలీస్ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్(ఆప్నా) అధ్యక్షుడిగా 2026–27 సంవత్సరానికి గాను నగరానికి చెందిన డాక్టర్ టీవీ రమణమూర్తి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గవర్నర్పేటలోని ఐఎంఏ హాలులో పూర్వ అధ్యక్షుడు డాక్టర్ సీఎస్ఆర్ ప్రసాదరావు చేతుల మీదగా బాధ్యతలు చేపట్టారు. గన్నవరం: ఓ మైనర్ బాలికను వేధింపులకు గురి చేస్తున్న ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలుడిపై గన్నవరం పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం... గన్నవరం గ్రామానికి చెందిన ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి అతని ఇంటి పక్కనే నివసిస్తున్న 8వ తరగతి బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక కుటుంబం గన్నవరంలో ఇల్లు ఖాళీ చేసి పెద్దఅవుటపల్లి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆ బాలికను సదరు విద్యార్థి వేధింపులకు గురిచేస్తుండడంతో పాటు ఆ బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లో పెడతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని సదరు విద్యార్థి ఆ బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లిని అసభ్యంగా తిట్టడంతో పాటు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇనగుదురుపేట పరిధిలో.. కోనేరుసెంటర్: ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదైంది. ఇనగుదురుపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం రాజుపేటలోని మగ్గాలకాలనీకి చెందిన అబ్దుల్కలాం సోమవారం అదే ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలో ఉన్న ఆటోలోకి తీసుకువెళ్లాడు. ఆటోలో కూర్చోబెట్టి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గ్రహించిన స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కేసు పెట్టేందుకు పూనుకోగా స్థానికంగా ఉన్న కొంత మంది పెద్దలు అబ్దుల్కలాంకు మతిస్థిమితం సరిగా ఉండదని సహృదయంతో క్షమించాలని కోరారు. అయితే బాలిక తల్లిదండ్రులు జరిగిన ఘోరంపై మంగళవారం ఇనగుదురుపేట పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అబ్దుల్కలాంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో నిర్వహించిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్స్), ఓపెన్ స్కూల్ సెకండరీ సర్టిఫికెట్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. మంగళవారం పరీక్షల నిర్వహణను డీసీఓ, డీజీఈ కార్యాలయ అధికారులు పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ బందాలు 50 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయగా, అదనంగా ఏసీజీఈ అధికారులు ఎనిమిది కేంద్రాలను పరిశీలించారని తెలిపారు. అన్ని కేంద్రాల్లో నియమ నిబంధనలు కచ్చితంగా అమలైనట్లు అధికారులు వెల్లడించారు. 99.92 శాతం హాజరు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,109 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు కాగా, 6,104 మంది హాజరై పరీక్షలు రాశారు. ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 99.92గా నమోదైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల తనిఖీ.. జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు మచిలీపట్నంలోని కేకేఆర్ గౌతమ్ హైస్కూల్, నిర్మలా హైస్కూల్, షార్కీ హైస్కూల్, ప్రభుత్వ రాంజీ హైస్కూల్, మాస్టర్ ఈకే బాలభాను హైస్కూల్, ఎస్ఆర్ ప్రైమ్ హైస్కూల్ పరీక్ష కేంద్రాలను సందర్శించి నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించిన అనంతరం సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. -
అంగన్వాడీల జీతాలు పెంచే వరకు ఉద్యమిస్తాం
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీలు నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, సెంట్రల్ సిటీ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాలు పెంచాలని... మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని, మెనూ చార్జీలు పెంచి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని కోరుతూ ఏపీ అంగన్ వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సింగ్ నగర్ కృష్ణాహోటల్ సెంటర్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూటమి నాయకులు మొసలి కన్నీరు కార్చారని.. తాము అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, గ్రాడ్యుయేట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయటం ఎంతవరకు న్యాయమో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని లేని పక్షంలో దశల వారి ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు టి.గజలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విజయవాడ అర్బన్ ప్రాజెక్ట్ నాయకులు ఇ.మాణిక్యం, బి.కాశీరత్నం, కె.పూర్ణిమ, కె.నాగదుర్గ, సుభాషిని తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్యాన్ని తగ్గించేందుకు మిస్ట్ వెహికల్స్
పటమట(విజయవాడతూర్పు): కాలుష్యాన్ని తగ్గించేందుకు విజయవాడ నగరపాలకసంస్థ 6 మిస్ట్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చిందని వీఎంసీ స్పెషల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో వీఎంసీ ప్రధాన కార్యాలయంలో మిస్ట్ వాహనాలను మంగళవారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ.. విజయవాడ నగరపాలక సంస్థ కాలుష్యాన్ని తగ్గించేందుకు, వాయు నాణ్యతను పెంచేందుకు మిస్ట్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. నగర పరిధిలోని ప్రధాన కూడల్లో ఎక్కడైతే కాలుష్యానికి ఎక్కువగా అవకాశం ఉంటుందో అక్కడ ప్రతిరోజు ఈ వాహనాలను అందుబాటులోకి ఉంచి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ ఇంజినీర్ ఇన్చార్జి పి.సత్యకుమారి సూపరింటెండింగ్ ఇంజినీర్ వర్క్స్ వి.చంద్రశేఖర్, బయాలజీ కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి నుంచి స.హ. చట్టం ఆన్లైన్ సేవలు
చిలకలపూడి(మచిలీపట్నం): సమాచార హక్కు చట్టం ద్వారా ఆన్లైన్లో సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సమాచార హక్కు చట్టంపై వివిధ శాఖలకు చెందిన సంబంధిత అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం – 2005 ద్వారా ఇప్పటి దాకా భౌతికంగా దరఖాస్తులు చేసుకోవటంతో పాటు అర్జీదారులకు భౌతికంగానే సమాచారం అందించామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్టీఐ చట్టానికి సంబంధించి వివరాలను, దరఖాస్తులను ఆన్లైన్లోనే వెబ్సైట్ https://rtionline.ap.gov.in పోర్టల్ ద్వారా చేయాలని చెప్పారు. నోడల్ అధికారిగా డ్రాయింగ్ ఆఫీసర్లు జిల్లాలోని ప్రతి ప్రభుత్వశాఖాధిపతి కార్యాలయంలో ప్రధానంగా సిబ్బంది జీతభత్యాలు డ్రా చేస్తున్న డ్రాయింగ్ ఆఫీసర్లు నోడల్ అధికారిగా వ్యవహరించాలన్నారు. వారే మొదటి అప్పిలేట్ అధారిటీ లాగిన్ను తరువాత ప్రజాసమాచారాధికారి లాగిన్ను సిద్ధం చేయాలన్నారు. ప్రతి నోడల్ అధికారికి యూజర్ నేమ్ ఇస్తామని చెప్పారు. ఎవరైనా ఆన్లైన్లో ఆర్టీఐ చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే నోడల్ అధికారి లాగిన్లోకి వస్తుందని ఆ దరఖాస్తును సంబంధిత అధికారికి పంపాల్సి ఉంటుందన్నారు. ప్రజాసమాచార అధికారి సమాచారం సిద్ధం చేసి సంబంధిత దరఖాస్తుదారుని లాగిన్కు ఆన్లైన్లో పంపాలన్నారు. ఇదే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి శాఖలోనూ సిబ్బందికి శిక్షణ ఇచ్చి అమలు చేయాలని సూచించారు. సమాచారం అందించేందుకు కావాల్సిన రుసుమును ఆన్లైన్లోనే నోడల్ అధికారికి చెల్లించవచ్చునన్నారు. 30 రోజులుగా అర్జీదారునికి సమాచారం అందించాలన్నారు. శిక్షణా తరగతుల్లో గృహనిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకట్రావు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఏడీ కామరాజు, బీసీ సంక్షేమ సాధికారత అధికారి జి.రమేష్, మత్స్యశాఖ జేడీ ఎ.నాగరాజు పాల్గొన్నారు. డీఆర్వో చంద్రశేఖరరావు -
జీఎస్టీ వసూళ్లు సక్రమంగా జరగాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో వస్తు సేవల పన్నులు(జీఎస్టీ) సక్రమంగా వసూలయ్యే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జీఎస్టీ ఎగవేతకు అడ్డుకట్ట వేయాలని ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రిజిస్ట్రేషన్శాఖ పరిధిలో జరిగే ఆస్తులు, భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నులశాఖ అధికారులకు అందజేస్తున్నారా, లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. పన్నుల వసూళ్లు పూర్తిస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమిషనర్ జి.కల్పన, డెప్యూటీ కమిషనర్ సోనియాతార, సహాయ కమిషనర్లు సౌమ్య, జగదీష్, రాజ్కుమార్, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్కుమార్, జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణమూర్తి, గనులు, భూగర్భవనరుల ఏడీ కొండారెడ్డి, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
చల్లపల్లి పోలీస్స్టేషన్లో భారీ విస్ఫోటనం
సమయం: ఉదయం 10.05 గంటలు, రోజు: మంగళవారంకృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్టేషన్ సిబ్బంది విధుల్లో భాగంగా మందుగుండు సామగ్రి నిర్వీర్యం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. స్టేషన్ రిసెప్షన్లో సిబ్బంది వారి పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే విస్ఫోటనం సంభవించింది. ఏం జరిగిందని తేరుకొనేలోపే బాంబుల మోత మోగింది. ఈ ప్రమాదంలో ఎస్ఐతో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆ పేలుడు శబ్దంతోపాటు దట్టంగా కమ్మేసిన పొగ ఐదు కిలోమీటర్ల మేర వ్యాపించింది.దీంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.చల్లపల్లి: దీపావళి సందర్భంగా 2025 అక్టోబర్లో అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తున్న వ్యాపారుల నుంచి చల్లపల్లి పోలీసులు టపాసులు స్వా«దీనం చేసుకున్నారు. ఆ కేసు ఇటీవల కొట్టివేయడంతో కోర్టు ఆదేశాల ప్రకారం మందుగుండు సామగ్రిని నిరీ్వర్యం చేసేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10.05 గంటల సమయంలో ఎస్ఐ డి.దుర్గాంజనేయులు పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా, ఎస్ఐ వాహనం డ్రైవర్ డి.నాగరాజు మందుగుండును వాహనంలోకి ఎక్కించే సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.ఉలిక్కిపడ్డ వారు ఏమి జరిగిందో తెలుసుకునేలోపే ఎస్ఐ దుర్గాంజనేయులు, కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. రిసెప్షన్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కె.శివపార్వతికి, హెడ్ కానిస్టేబుల్ కేటీడీవీ ప్రసాద్(తేజ)కు కూడా గాయాలయ్యాయి. పేలుడు ధాటికి స్టేషన్ కిటికీలు, దర్వాజాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. పోలీస్జీపు దెబ్బతింది.చొచ్చుకుపోయిన రాళ్ల పిక్కలు.. ధ్వంసమైన స్టేషన్ ముందుగుండు సామగ్రిలో ఉపయోగించిన చిన్న రాళ్లపిక్కలు శరీరం లోపలికి చొచ్చుకుపోవడంతో కానిస్టేబుళ్లు షేక్ అబ్దుల్లా, నాగరాజుల శరీరాలు రక్తపు ముద్దలా మారిపోయాయి. ఎస్ఐ దుర్గాంజనేయులుకు వెనుక భాగం, జుట్టు బాగా కాలిపోయాయి. తొలుత ఎస్ఐతోపాటు మిగిలిన వారిని చికిత్స నిమిత్తం చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అబ్దుల్లా, నాగరాజు, ఎస్ఐ దుర్గాంజనేయులు, కేటీడీవీ ప్రసాద్ వినికిడి శక్తి, కంటి చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. శభాష్ శివపార్వతి తనకు గాయాలైనా రక్తమోడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సహోద్యోగిని ఆస్పత్రికి తరలించేందుకు ఆమె చేయి అందించింది. స్టేషన్లో సంభవించిన బాణసంచా ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ కె.శివపార్వతి గాయాలయ్యాయి. అయినా పట్టించుకోకుండా తీవ్రగాయాలతో నేలకొరుగుతున్న అబ్దుల్లాను వాహనం ఎక్కించింది. తర్వాత ఆమె కూడా చల్లపల్లి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. దీంతో శివపార్వతికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అట్టపెట్టెలో నుంచి జారి పడడంతో పేలుడు మందుగుండు సామగ్రి వాహనంలోకి ఎక్కించే సమయంలో అట్టపెట్టె అడుగు భాగం నుంచి మందుగుండు జారి కింద పడడంతో పేలుడు సంభవించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సీసీఫుటేజీలో ఈ విషయం వెల్లడైందన్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చల్లపల్లి ఎస్ఐ డి. దుర్గ ఆంజనేయులుతోపాటు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజును మంత్రులు వాసంశెట్టి సుభా‹Ù, కొల్లు రవీంద్ర, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రులు తెలిపారు. కోర్టుకానిస్టేబుల్ అబ్దుల్లా పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. -
చల్లపల్లి పోలీస్స్టేషన్లో పేలుడు
సాక్షి, కృష్ణా జిల్లా: చల్లపల్లి పోలీస్స్టేషన్లో పేలుడు సంభవించింది. మందుగుండు సామాగ్రి పేలడంతో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సీజ్ చేసిన టపాసులు కోర్టుకు తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసు జీపు స్వల్పంగా ధ్వంసమైంది. గాయపడిన పోలీసులను చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రావణ వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు సోమవారం రావణ వాహన సేవ జరిగింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో రెండో రోజైన సోమవారం ఉదయం మూలమంత్ర హవనం, సాయంత్రం ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రహవనం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రాంగణంలోని మహా మండపం నుంచి నగరోత్సవ సేవ ప్రారంభమైంది. రావణ వాహనంపై కొలువై ఉన్న శ్రీగంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ఊరేగింపును ప్రారంభించారు. మహామండపం నుంచి ప్రారంభమైన రావణ వాహన సేవ రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మెయిన్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆదిదంపతులకు భక్తులు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆది దంపతులకు పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించి పూజలు జరిపించుకున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ, చిన్నారుల కోలాట విన్యాసాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య నగరోత్సవం కనులపండువగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమన్వయంతో మాతృ, శిశు మరణాల తగ్గింపు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో మాతృ, శిశు మరణాలను తగ్గించడానికి వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా, సమన్వయంతో పని చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం సబ్–డిస్ట్రిక్ట్ స్థాయి మాతృ, శిశు మరణాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఎన్ఎంలు, ఆశలు సామర్థ్యాన్ని పెంపొందిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక దృష్టి పెట్టాలి శిశు ఆహార పద్ధతులు, ప్రసవానంతర శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గర్భిణులు, నవజాత శిశువుల్లో ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు సమాచారం అందించాలన్నారు. అనధికార వైద్యుల వద్దకు పంపడం పూర్తిగా నివారించాలని సూచించారు. తల్లులు, కుటుంబ సభ్యులకు భయపడకుండా స్పష్టమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని, ప్రమాద సూచనలు, సంక్లిష్ట పరిస్థితులపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. హైరిస్క్ గర్భధారణలు, దీర్ఘకాలిక వ్యాధులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమన్నారు. గర్భిణులు తప్పనిసరిగా నియమిత గర్భధారణ పరీక్షలు చేయించుకోవాలని, స్కాన్లు, 2డీ ఎకో పరీక్షల ప్రాముఖ్యతను వివరించి, సమస్యలను ముందుగానే గుర్తించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో మొత్తం 6 శిశు మరణాలు, 2 మాతృ మరణాల కేసులను విశ్లేషించి, సేవల్లో లోపాలను గుర్తించి నివారణ చర్యలపై చర్చించారు. సమావేశంలో కమిటీ సభ్యులు, వైద్యాధికారులు, ఫీల్డ్ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ యుగంధర్ -
ప్రతాపమా.. సహించం
పేద రైతులపైచిలకలపూడి(మచిలీపట్నం): బందరు మండల పరిధిలోని సముద్రతీర ప్రాంత గ్రామాల్లో వరి పండని పొలాల్లో అనాదిగా చెరువులు సాగు చేస్తున్నారని పేద రైతులపై మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు, రెవెన్యూ అధికారులు ప్రతాపం చూపిస్తే సహించేది లేదని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) హెచ్చరించారు. ‘మీ కోసం’లో పేద రైతులు పడుతున్న కష్టాలను జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్కు సోమవారం వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 1990 నుంచి బందరు సౌత్ మండల పరిధిలోని చిన్నాపురం, వాడగొయ్యి, కోన, పల్లెతుమ్మలపాలెం, కేపీటీపాలెం, పాతేరు, పోలాటితిప్ప తదితర గ్రామాల్లో 80 నుంచి 90 శాతం మంది రైతులు వరిపంట పండకపోవటంతో చెరువులుగా మార్చుకుని సాగు చేసుకుని జీవిస్తున్నారు. టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ మండలంలో చెరువులు తవ్వుకుంటే తమకు కప్పం కట్టలేదని నాయకులు సీజ్ చేయించారన్నారు. 50 వేలు మెజార్టీ వచ్చిందని చెప్పుకుంటున్న మంత్రి కొల్లు రవీంద్ర ఈ రకంగా ఎరానికి రూ. 50 వేలు వసూలు చేస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ఇటీవల కోనలో చిన్న రైతు 80 సెంట్ల భూమిని మరమ్మతులు చేసుకుంటుంటే ఆర్డీవో సాంబశివరావు హుటాహుటిన అక్కడకు వెళ్లి చెరువును పూడ్చి వేయాలని, పట్టాలు తీసుకువచ్చి చూపించాలని హుకుం జారీ చేయడం భావ్యమా అని పేర్ని నాని అన్నారు. పెదపట్నంలో 20 ఎకరాల మడ అడవులు తవ్వుతున్నా పెద్ద రైతులు అసైన్డ్ భూమిలో వంద ఎకరాల్లో చెరువులు తవ్వుతున్నా తహసీల్దార్, ఆర్డీవోకు వారు కనపడారా అని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్డీఓ సాంబశివరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత మడ అడవులు, వందల ఎకరాల అసైన్డ్ భూముల్లో చెరువులు తవ్వుతున్నా పట్టించుకోని ఆయన పేద రైతులపై ప్రతాపం చూపుతున్నారని దీనిపై జేసీకి వివరించామన్నారు. ఆయన తీరు ఇలాగే ఉంటే ఏసీబీని ఆశ్రయించడానికి కూడా వెనుకడామన్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత తీసుకుంటున్నారో, ఎవరి ద్వారా తీసుకుంటున్నారో ప్రజలే సాక్షులుగా చెబుతున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా చెరువుల సాగు చేస్తున్న పేద రైతుల మరమ్మతులను అడ్డుకుంటే పోరాడతామని ఆయన హెచ్చరించారు. పేర్ని నాని వెంట జేసీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు లంకే వెంకటేశ్వరరావు, గణేశన రమేష్, మట్టా మోహననాంచారయ్య, వన్నెంరెడ్డి రామకృష్ణ, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. రెండేళ్లకోసారి మరమ్మతులు చేయాల్సి వస్తుందని, ఇవి చేయాలంటే మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుమారుడు మంత్రాల శ్రీను చెయ్యి తడపనిదే పనులు ముందుకెళ్లే పరిస్థితి లేదన్నారు. ఎకరానికి రూ. 50 వేలు ఇస్తే కానీ మరమ్మతులు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని ఇటువంటి పేద రైతులు ఇంత మొత్తంలో ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో తహసీల్దార్, ఆర్డీఓలు కూడా వారికే ఏజెంట్లుగా పని చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
జాయింట్ కలెక్టర్ నవీన్
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎల్పీజీ గ్యాస్ వినియోగాన్ని తగ్గించి పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజవాయువు, ఇతర విద్యుత్ ఆధారిత వంట పరికరాల వినియోగం వైపు మారాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే నాగాయలంక రిఫైనరీ నుంచి సుమారు 450 కిలోమీటర్ల మేర పీఎన్జీ పైప్లైన్ అందుబాటులో ఉందని ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, వైఎస్సార్ తాడిగడప మునిసిపాల్టీల పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు తక్షణమే పీఎన్జీ వినియోగానికి మారాల్సిన అవసరం ఉందన్నారు. 90 రోజుల్లోపు మారకపోతే ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో పీఎన్జీకి మారనున్న 417 పరిశ్రమలు, 179 ఆస్పత్రులు, ఎనిమిది ప్రధాన దేవాలయాలను ఇప్పటికే గుర్తించామన్నారు. అన్నక్యాంటీన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ప్రాధాన్యత క్రమంలో పీఎన్జీ వినియోగం చేపట్టాలని సూచించారు. గృహ వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇండక్షన్ స్టౌలు, బయో గ్యాస్ స్టౌలతో ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మంటలు చెలరేగి కారు దగ్ధం
కోడూరు: పార్కింగ్లో పెట్టిన కారులోమంటలు చెలరేగి కారు దగ్ధం అయిన ఘటన కోడూరులో సోమవారం చోటు చేసుకుంది. కోడూరుకు చెందిన షేక్ కరిముల్లా తన కారును రామకృష్ణా థియెటర్కు చెందిన ఖాళీ ప్రదేశంలో పెట్టారు. ఉదయం 10 గంటల సమయంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి అహుతైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, అవనిగడ్డ ఫైర్ అధికారులు వచ్చి మంటలు అదుపు చేశారు. ఘటనాస్థలాన్ని కోడూరు ఎస్ఐ చాణిక్య పరిశీలించి, వివరాలు సేకరించారు. కారుకు ఎవరైనా నిప్పుపెట్టారా, లేక కారు లోపల నుంచి మంటలు వ్యాపించాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ పోతురాజు, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అర్జీల్లో కొన్ని -
2న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 5.55 గంటలకు ఘాట్రోడ్డు నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని దుర్గగుడి వైదిక కమిటీ పేర్కొంది. ప్రతి నెలా పౌర్ణమి రోజు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. గురువారం తెల్లవారుజామున ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని తెలిపారు. అక్కడి నుంచి కుమ్మరిపాలెం, విద్యాధరపురం, నాలుగు స్తంభాల సెంటర్, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, చిట్టినగర్, కేటీ రోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంటుంది. అమ్మవారి భక్తులు, సేవా సిబ్బంది పాల్గొనాలని కోరారు. నందిగామ రూరల్: అతిసార వ్యాధి పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రజలు భయాందోళనకు గురికావద్దని డీఎంహెచ్వో సుహాసిని పేర్కొన్నారు. చందాపురంలో సోమవారం ఆమె పర్యటించారు. ముందుగా గ్రామంలో జరుగుతున్న ఇంటింటి సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం అతిసార కేసుల పరిస్థితి, కారణాలు, ప్రాథమిక నివేదికలను అధికారులతో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయి అధికారులు పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేస్తూ ఎనిమిది ఆర్ఆర్టీ బృందాలు గ్రామంలో సర్వే చేస్తున్నాయన్నారు. ఆస్పత్రిలో బాధితులు కోలుకుంటున్నారని కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. రెండు, మూడు రోజుల పాటు వైద్యారోగ్య, పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ అధికారులు మల్లీశ్వరి, పద్మజ, శ్రీహరి వెంకటేశ్వర్లు, సరిత, భాను కిరణ్, జ్యోతి పాల్గొన్నారు. గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మవారి దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరిచి అందులో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. మొత్తం 31 రోజులకు నోట్ల ద్వారా రూ.13,77,046, చిల్లర ద్వారా రూ.1,44,060 వెరసి మొత్తం రూ.15,21,100 వచ్చింది. మచిలీపట్నం భోగిరెడ్డిపల్లి గ్రూప్ సూపర్వైజర్ అరుణ పర్యవేక్షణలో దేవస్థాన ఈఓ ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్ళేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు, తూము రాజ్యలక్ష్మి, ముంగం ఆంజనేయులు, మన్నెం వీర నాగేంద్రరావు, నూతలపాటి లక్ష్మీ పావని, వేమవరం ర సర్పంచ్ మన్నెం పద్మావతి, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో కానుకల్ని లెక్కించారు. లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, మచిలీపట్నం, ఉయ్యూరు, వేమవరం సేవా సమితి వారు, వేమవరం గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పరిశోధనలు, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని విశ్వవిద్యాలయం ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లోపతిలోనే కాకుండా ఆయుష్, డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇతర కోర్సుల విద్యార్థులు, ఫ్యాకల్టీ పరిశోధనలతో పాటు క్రీడా ప్రోత్సాహకాల కోసం ఏటా రూ.22.13 కోట్ల వ్యయం చేయనున్నట్టు ప్రకటించారు. అమరావతిలో విశ్వవిద్యాలయానికి 25 ఎకరాల స్థలం కేటాయించాలని చేసిన ప్రతిపాదన సీఆర్డీఏ పరిశీలనలో ఉందని తెలిపారు. వర్సిటీ రీసెర్చ్, డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ మాట్లాడుతూ డిసీజ్ మోడలింగ్, డెసిషన్ సెంటర్ను రూ.5.73 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. -
బహిరంగ వేలం ద్వారా రూ.92.90 లక్షల ఆదాయం
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.50,05,000(పచ్చల శివప్రసాద్), మట్టికుండలు నిర్వహణ లైసెన్స్ హక్కునకు రూ.10,50,000(పచ్చల శివప్రసాద్), మునేరు అవతల 7 షెడ్లు, 4 ఏసీ గదులు, ఒక కల్యాణ మండపం నిర్వహణకు రూ.9,50,000(కొత్తపల్లి సతీష్కుమార్), ఆలయం వద్ద సంచారంగా ఐస్క్రీమ్ విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.5,10,000(ముండ్లపాటి నాగరాజు), భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచు లైసెన్ప్ హక్కునకు రూ.3,15,000 (గడిపూడి గోపి), సులభ కాంప్లెక్స్ నిర్వహణకు రూ.11,80,000(నూతలపాటి సురేష్), పువ్వులు, పాలు, బియ్యం పోగుచేసుకునే హక్కునకు రూ.2,80,000(దండా పుష్పలత), హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్ హక్కును పొందారని తెలిపారు. చిలకలపూడి(మచిలీపట్నం): పేదరికం నుంచి బయటకు తీసుకురావాలన్నదే పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పీ4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 78వేల మంది బంగారు కుటుంబాలు, 2,903 మంది మార్గదర్శిలను గుర్తించి 4,470 మంది బంగారు కుటుంబాలను దత్తత ఇచ్చామని తెలిపారు. మార్గదర్శిలు బంగారు కుటుంబాలకు వారికి కావాల్సిన సహాయం అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ సమాజంలో పేదరికం నిర్మూలనకు పీ4 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, మార్గదర్శిలు చింతయ్య, తులసీదాస్ పాల్గొన్నారు. -
బాబు డ్రామాలు
అమరావతి పేరుతో వన్టౌన్(విజయవాడపశ్చిమ): అమరావతిపై తీర్మానం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ‘పశ్చిమ’ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెలంపల్లి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం.. కేవలం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఆడుతున్న డ్రామా అని తెలిపారు. 2028 లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే, మరోపక్క ‘రాజధాని మార్చేస్తారు’ అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అవినీతి బయటపడుతుందనే కౌన్సిల్ను పక్కన పెట్టారు కౌన్సిల్ను పక్కన పెట్టి అసెంబ్లీలో తీర్మానాలు చేయడం వెనుక.. అవినీతి బయటపడుతుందనే భయమేనని వెలంపల్లి స్పష్టం చేశారు. రైతులను మభ్యపెట్టి రెండో విడత పూలింగ్ కోసం ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని ఆరోపించారు. ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ. 2 కోట్లు అంటే, మొత్తం ప్రాజెక్టుకు రూ. 2 లక్షల కోట్లు పైగా అవసరమవుతాయని, ఇంత భారాన్ని భరించే శక్తి రాష్ట్రానికి ఉందా అని ప్రశ్నించారు. కేవలం డిజైన్ల పేరుతో రూ. 400 కోట్లు వృఽథా చేశారని ఆయన విమర్శించారు. అవినీతికి పరాకాష్ట టెండర్లను కొద్దిమంది అనుచర కంపెనీలకే కట్టబెడుతున్నారని, నాలుగు శాతం ఎక్సెస్తో పనులు ఇవ్వడం అవినీతికి పరాకాష్ట అని వెలంపల్లి అన్నారు. 2024 జూన్ తర్వాత తీసుకున్న రూ. 13 వేల కోట్ల రుణాల్లో రూ. 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపంలో కమీషన్ల కోసం ఇచ్చారని ఆరోపించారు. రూ. 47,000 కోట్ల అప్పులకు ప్రభుత్వ గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నారని, వీటిని ఎవరు తీరుస్తారని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదని, కేవలం అక్కడ జరుగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి సైతం అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారని గుర్తు చేస్తూ, తమకు ఆ ప్రాంతంపై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. అయితే హైపర్లూప్, ఒలింపిక్స్ వంటి సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మాట్లాడుతున్న వెలంపల్లి శ్రీనివాసరావు చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా జె.అరుణను నియమిస్తూ సోమవారం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారిగా పని చేస్తున్న ఆమెను ఉద్యోగోన్నతిపై సీఈవోగా నియమించారు. ఇప్పటి వరకు జెడ్పీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న కె.కన్నమనాయుడు ను పంచాయతీరాజ్శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. -
బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఆందోళన
నల్ల రిబ్బన్లు , ప్లకార్డులతో నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ ‘మౌన’ దీక్ష భవానీపురం(విజయవాడపశ్చిమ): జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కార్యక్రమాల్లో మొదటి నుంచి భాగస్వాములుగా ఉన్న 750కిపైగా ఉన్న చిన్న కాంట్రాక్టర్ల (ఎంఎస్ఎంఈ) బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యం, కార్పొరేట్ సంస్థలపై చూపుతున్న పక్షపాత ధోరణిపై నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన కొనసాగుతోంది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఏపీ ఇంజినీర్–ఇన్–చీఫ్ కార్యాలయం వద్ద పెండింగ్ బిల్లుల కోసం నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులతో చేపట్టిన ఆందోళన సోమవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి కోనేరు శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ టెండర్లు దక్కించుకుని పనులు చేసిన అనంతరం బిల్స్ సబ్మిట్ చేసి ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజుకూ చిన్న కాంట్రాక్టర్లకు సుమారు రూ.1,050 కోట్ల బిల్లులు చెల్లించాలని.. ప్రభుత్వం వద్ద ఈ బిల్లులు ఉన్నాయని, ఏడాదిగా పేమెంట్స్ జరుగుతున్న విధానం విస్మయానికి గురిచేసిందని తెలిపారు. ఫిబ్రవరి 2025 నుంచి ప్రభుత్వం సుమారు రూ.1,331 కోట్లు విడుదల చేసిందని, ఇందులో కార్పొరేట్ సంస్థలకు రూ.932 కోట్లు చెల్లింపులు చేయగా ఆ మొత్తంలో మొబలైజేషన్ అడ్వాన్స్ కూడా ఉండటం దుర్మార్గమని పేర్కొన్నారు. అదే సమయంలో 750కిపైగా ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపులు కేవలం రూ.263 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. కాంట్రాక్టర్లుగా ప్రభుత్వ పనులు చేసేందుకు ఆస్తులు కుదవపెట్టి, తెచ్చిన అప్పులు తీర్చలేక తమ బ్యాంక్ అకౌంట్లు ఎన్పీఎగా మారాయని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద పని చేస్తున్న రోజువారీ కార్మికులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిం దని, గత్యంతరం లేక రోడ్డెక్కి పోరాటానికి సిద్ధపడ్డామని చెప్పారు. తమ మీద ఆధారపడిన వేలాది కుటుంబాలను ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్మించుకుంటున్న గృహ నిర్మాణ పనులకు కూలీలుగా వెళ్లి శ్రమదానం చేసి నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాము వారం రోజుల నుంచి ధర్నా చేస్తున్నా ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించిన శాఖ మంత్రి, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించక పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
‘రైతుల జోలికొస్తే సహించేది లేదు’
మచిలీపట్నం: కూటమి ప్రభుత్వం దళారులను అడ్డుపెట్టుకుని సన్నకారు రైతులను దోచుకుంటుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇద్దరు ఎమ్మార్వోలు, ఆర్డీవో సాంబశివరావు ఆక్వరంగం రైతులను పట్టిపీడుస్తున్నారన్నారు. ఈ రోజు(సోమవారం, మార్చి 30వ తేదీ) ఆక్వారైతు సమస్యలపై జాయింట్ కలెక్టర్కు పేర్ని నాని ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా అనంతరం మీడియాతో మాట్లాడారు పేర్ని నాని. ‘బందరు మండల పరిధిలోని చిన్న చిన్న రైతులను చెరువులు రిపేర్లు చేయకుండా అడ్డుకుంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు సహకరిస్తున్నారు. వందల ఎకరాల రైతులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఎకరా రెండు ఎకరాల రైతులపై ఆంక్షలు విధిస్తూ వికృత సంస్కృతికి రెవిన్యూ సిబ్బంది పాల్పడుతున్నారు. ఎకరం రిపేరుకు 50,000 బోరు వేసేందుకు మరో 50 వేలు వసూలు చేస్తూ ఆక్వా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెదపట్నం కానూరు గ్రామాలలో యథేచ్ఛగా మడ అడవులను చెరువులుగా తవ్వుకుంటుంటే పట్టించుకోవడం లేదు. కోన గ్రామంలో 83 సెంట్ల రైతును రికార్డులు చూపించమంటూ ఆర్డీవో నా నా హైరానా చేశారు. రైతు చెరువును పూడ్చమని ఆదేశించడం ఏంటి?, ముడుపుల మాయలో బందరు ఆర్డిఓ ఎమ్మార్వోలు రైతులపై అగత్యాలకు పాల్పడితే సహించబోం’ అని హెచ్చరించారు. -
వెంకన్న దర్శనానికి భక్తుల రద్దీ
గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రులో వేంచే సిన భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యా ణార్థం, సకల ప్రాణ కోటికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని కోరుతూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించి సూర్యనారాయణుడికి కేసరిని నివేదనగా సమర్పించారు. అనంతరం అందరికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ భక్తులకు ప్రసాద పంపిణీ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మ వారి దర్శనానికి అనుమతించారు. కంచికచర్ల: మండలంలోని కీసర సమీపంలో జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ భూమిలో ఉన్న 10 ఎకరాల జామాయిల్ తోటకు ఆదివారం రాత్రి నిప్పంటుని దగ్ధమైంది. ఆకతాయిలు నిప్పంటించారని స్థానికులు పేర్కొంటున్నారు. అగ్నిమాపక కేంద్ర సిబ్బంది సంఘట నా స్థలానికి చేరుకుని జామాయిల్తోటలో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. అప్పటికే పది ఎకరాల్లో ఉన్న జామాయిల్ తోట పూర్తిగా దగ్ధమైందని, రూ.11 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని ఫైర్ అధికారి శివారెడ్డి తెలిపారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పోలీసులు పేకాట, కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై ఆదివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఒక్క రోజే 133 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో పేకాట, క్రికెట్ బెట్టింగ్లను అరికట్టాలంటూ ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం జిల్లావ్యాప్తంగా ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న వారిని స్థానిక తహసీల్దారుల ఎదుట బైండోవర్ చేశారు. జిల్లాలో పేకాట, క్రికెట్ బెట్టింగ్లకు సంబంధించి ప్రజల వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా సంబంధిత పోలీస్స్టేషన్లకు సమాచారం అందజేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
వృద్ధుడిని హత్య చేసిన ఆగంతకులు
నందిగామ టౌన్: ఇంటి వరండాలో నిద్రించిన వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చింతలపాడు గ్రామానికి చెందిన రెబ్బగొండ్ల వెంకటపతి (85) ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని భార్య గతంలోనే మరణించారు. ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి తన నివాసంలోని వరండాలో వెంకటపతి నిద్రించాడు. ఆదివారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడి ముఖంపై కొడవలితో దాడి చేసిన గాయాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధర్మరాజు తెలిపారు. -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026ఆయుర్వేదానికి అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5448 టీఎంసీలు. 7చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కాల్ సెంటర్(1100) కు కాల్ చేసి కూడా అర్జీ నమోదుతో పాటు దాని స్థితిని తెలుసుకోవచ్చన్నారు.పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారిని ఆదివారం నైమిషారణ్య పీఠాధిపతి, హిందూ ధార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బాల బ్రహ్మానంద సరస్వతి దర్శించుకున్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్లు ద్వారా రూ. 9,57,703 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ స్వామివారి సేవా టికెట్ల ద్వారా రూ.4,64,890, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,51,980, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ.1,10,395, శాశ్వత అన్నదానం ద్వారా రూ.1,24,368, స్వామివారి కల్యాణ కట్ట ద్వారా రూ.24,080, స్వామివారి దర్శన టికెట్ల ద్వారా రూ.45,800 తదితరాలు కలిపి మొత్తం రూ. 9,57,703 ఆదాయం వచ్చినట్లు వివరించారు. గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థులు క్రీడారంగంలో సైతం ప్రావీణ్యం పెంపొందించుకోవాలని లయోల ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ ఫాదర్ జోజిరెడ్డి అన్నారు. కళాశాల ఆవరణలో ఆదివారం చతురంగ–2026 పేరుతో చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. యూత్ ఎంపవరింగ్ సర్వీస్, చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన 148 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం ద్వారా విద్యార్థుల్లో మానసిక ఎదుగుదల, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. నగరానికి చెందిన 3 ఏళ్ల 11 నెలల చిన్నారి ఇవాన్ ఈ పోటీలలో పాల్గొని, గెలిచి అందరినీ ఆకట్టుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం టోర్నమెంట్లో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఏపీ చెస్ అసోసియేషన్ సెక్రటరీ రాజీవ్, ఫాదర్ బాల బొల్లినేని, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పార్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రుల్లోనే అతిసార బాధితులు
● వివిధ ఆస్పత్రుల్లో 17 మందికి చికిత్స ● రోగులను పరామర్శించిన డీఎంహెచ్ఓ లబ్బీపేట(విజయవాడతూర్పు): నందిగామ మండలం చందాపురంలో శనివారం సోకిన అతిసార అదుపులోకి వచ్చినట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ఆమె ఆదివారం అతిసార సోకిన చందాపురంతో పాటు, వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. చందాపురంలో ఏర్పాటు చేసిన శిబిరానికి ఆదివారం స్వల్ప విరేచనాలతో ముగ్గురు రాగా, వారికి అవసరమైన చికిత్స అందించినట్లు తెలిపారు. కాగా 17 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆమె వివరించారు. వారిలో నందిగామ ఏరియా ఆస్పత్రిలో 10మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరుగురు, విజయవాడ జీజీహెచ్లో ఒకరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వారికి అందుతున్న వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలు ఒకటి, రెండు సార్లకు మించి విరేచనాలు, వాంతులు అయితే వెంటనే వైద్య సిబ్బందికి తెలిపి సత్వర చికిత్స పొందాలని డీఎంహెచ్ఓ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు కాకుండా, వేడి ఆహార పదార్థాలను తినాలని, క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలన్నారు. డోర్టు డోర్ సర్వే.. వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. అక్కడ సాధారణ పరిస్థితి వచ్చే వరకూ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇంధుమతి, డాక్టర్ నవీన్, డాక్టర్ సునీల్, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
లోక రక్షకా.. హోసన్నా
గుణదల(విజయవాడ తూర్పు): సర్వ మానవ పాప పరిహారార్థమై జనియించిన లోక రక్షకుడైన క్రీస్తును ప్రతి ఒక్కరూ విశ్వసించి కీర్తించాలని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు అన్నారు. పుణ్యక్షేత్ర ఆవరణలో మట్టల ఆదివారం సందర్భంగా ప్రత్యేక సమష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ మానవాళినీ సన్మార్గంలో నడిపించేందుకు ఏసుక్రీస్తు ప్రయత్నించారని, ఆయనను విశ్వసించి దేవుని నియమాలను పాటించిన వారికి శాంతి, సమాధానాలు లభిస్తాయన్నారు. మానవాళి రక్షణ కోసం ఏసుక్రీస్తు చేసిన సిలువ త్యాగాన్ని గుర్తించాలన్నారు. అనంతరం పుణ్యక్షేత్ర ప్రధానాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. అటుపై పుణ్యక్షేత్ర గురువులు, విశ్వాసులు మట్టలను చేతపట్టి గుణదల పుర వీధులలో పవిత్ర యాత్ర నిర్వహించారు. ఈత మట్టలు చేతపట్టుకొని హోసన్నా.. ఏసన్నా.. రాజుల రాజ నీకే జయం.. శాంతి ప్రదాత నీకే స్తోత్రం.. అంటూ నినాదాలు చేస్తూ క్రైస్తవ విశ్వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం ప్రార్థనలు -
కొత్త వాటికి అనుమతి లేదు..
2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలో ఒక్క కొత్త ప్రైవేట్ పాఠశాలకు కూడా అనుమతి ఇవ్వలేదు. కొత్తగా ప్రారంభమవుతున్నట్లు ప్రచారం చేస్తున్న ఏ విద్యాసంస్థకూ అధికారిక అనుమతులు లేవు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపడుతున్నట్లు మా దృష్టికి వచ్చిన విద్యాసంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ప్రచార హోర్డింగులు, బోర్డులు వెంటనే తొలగించాలని స్పష్టంగా పేర్కొన్నాం. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అడ్మిషన్లు చేసేటప్పుడు సంబంధిత పాఠశాలల అనుమతుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. – యూవీ సుబ్బారావు, విద్యాశాఖాధికారి, కృష్ణా జిల్లా -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
పామర్రు: రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన పామర్రులో ఆదివారం జరిగింది. ఆరేపల్లి షణుఖ వెంకటేశ్వరరావు వేరే ఊరి నుంచి వస్తున్న తన బంధువుల కోసం పామర్రు – గుడివాడ రహదారిలోని ఫ్లై ఓవర్ వద్దకు బయలుదేరాడు. ఇంటి సమీపంలో నివసించే బావిశెట్టి జగదీష్(14)ను బైక్ ఎక్కించుకుని ఫ్లై ఓవర్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో గుడివాడ నుంచి వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి బైక్ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న జగదీష్ రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన జగదీష్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. జగదీష్ పామర్రులో జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పామర్రు ఎస్ఐ రాజేంద్రప్రసాద్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మెరుగైన ఫలితాలే శ్రీ గోసలైట్స్ లక్ష్యం
కంకిపాడు: ఏటా మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా తమ సంస్థలో విద్యాబోధన సాగుతోందని విజయవాడ శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ నరేంద్రబాబు పేర్కొన్నారు. శ్రీగోసలైట్స్ మెడికల్ అకాడమీ రీ–యూనియన్ ఫెస్టివిటీస్ కార్యక్రమం ఆదివారం కంకిపాడులోని అయానా ఫంక్షన్ హాలులో జరిగింది. నరేంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అకాడమీలో శిక్షణ పొంది అత్యుత్తమ ర్యాంకులతో జాతీయ స్థాయి, వివిధ రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో మెడికల్ సీట్లు సాధించిన మెడికోలను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ.. స్థాపించిన నాటి నుంచి ప్రతి ఒక్క తర గతి గదిని పూర్తి స్థాయిలో డిజటలైజ్ చేసి స్మార్ట్ బోర్డుల ద్వారా విద్యార్థులకు బోధన అందిస్తున్న ఏౖకైక విద్యాసంస్థ శ్రీగోసలైట్స్ అని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో అద్భుత విజయాలను తమ విద్యార్థులు సాధించేలా బోధనా పద్ధతులు అవలంబిస్తున్నామని తెలిపారు. నీట్ 2021లో 724, 2022లో 1,013, 2023లో 1,237, నీట్ 2024లో 1,392, నీట్ 2025లో 1,413 సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, మెడికల్ సీట్లు సాధిస్తున్నామన్నారు. శిక్షణ బృందం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యా ర్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
అలరించిన యువ సంకీర్తనా గానం
విజయవాడ కల్చరల్: శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో నెలవారీ సంగీత మహోత్సవంలో భాగంగా ఆదివారం నిర్వహించిన యువ సంకీర్తనా గానం శాసీ్త్రయ సంగీత వైభవాన్ని చాటింది. యువ సంగీత విద్వాంసులు ఎస్.హిరణ్మయి వీణపై సద్గురువులు ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి రచించిన సంకీర్తనలను హృద్యంగా పలికించారు. కార్తికేయ ఆదినారాయణ వాద్య సహకారం అందించారు. విశాఖపట్నానికి చెందిన తిరువీధుల సుజాతాదేవి నిర్వహించిన గాత్ర సంగీత కచేరి అలరించింది. హనుమంత్ రామ్చరణ్ వయోలిన్పై, కార్తికేయ ఆదినారాయణ మృదంగంపై వాద్యసహకారం అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగీత విద్వాంసుడు మోదుమూడి సుధాకర్ మాట్లాడుతూ.. యువ సంగీత విద్వాంసులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సంగీత సమితి కార్యదర్శి సి.వి.రావ్ మాట్లాడుతూ.. సంస్థ ప్రతి నెలా యువ సంగీత కళాకారులను ప్రోత్సహించడానికి సంగీత వేదికలను కల్పిస్తోందన్నారు. -
సుర్రుమన్న సూరీడు
పోలీస్ కంట్రోల్ రూం సమీపంలోని ఫై ్లఓవర్నిర్మానుష్యంగా కనిపిస్తున్న కంట్రోల్ రూం జంక్షన్ జనసంచారం లేక వెలవెలబోతున్న బందరురోడ్డు ఎండలు మండుతున్నాయి. మార్చి చివరి వారం నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం ఎనిమిది గంటలు దాటితే చాలు రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప పగటి వేళ రోడ్డు ముఖం చూడటంలేదు. దీంతో ఉదయం పది గంటలు దాటితే రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై సైతం వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. ఆదివారం ఎండ తీవ్రత పెరగడంతో విజయవాడ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
దుర్గమ్మను దర్శించుకున్న ఎన్హెచ్ఆర్సీ చైర్మన్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్ ఆదివారం రాత్రి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి సతీ సమేతంగా విచ్చేసిన జస్టిస్ రామ సుబ్రహ్మణియన్కు ఆలయ ఈవో శీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. జస్టిస్ రామసుబ్రహ్మణియన్ దంపతులకు ఆలయ ఈవో అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు?
● ఆశగా ఎదురుచూస్తున్న నిరుపేదలు ● డబ్బులు చెల్లించినా మంజూరు కాని ఇళ్లు ● పట్టించుకోని ప్రజాప్రతినిధులు తిరువూరు: సొంతిల్లు లేని పేద కుటుంబాలకు 2017లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. తిరువూరు పట్టణంలోని 1,536 మంది లబ్ధిదారులకు నేటికీ ఇళ్లు పంపిణీ జరగలేదు. మూడు కేటగిరీలలో నిర్మించే ఈ ఇళ్లకు పలువురు లబ్ధిదారులు తమ వాటా సొమ్ము కూడా చెల్లించినా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు. కేటగిరీ–1లో 300 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, కేటగిరీ–3లో 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను నిర్మించాలి. కేటగిరీ–1 ఇళ్లకు రూ.5.72 లక్షలు యూనిట్ ధర కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.1.50 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం భరిస్తుండగా, మిగిలిన రూ.2.71 లక్షలను బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. ఈ కేటగిరీ ఇళ్లకు లబ్ధిదారు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. కేటగిరీ–2లో యూనిట్ నిర్మాణ వ్యయం రూ.6.74 లక్షలు. రూ.50 వేలను లబ్ధిదారు వాటాగా నాలుగు విడతల్లో చెల్లించాలి. కేటగిరీ–3 ఇళ్లకు లబ్ధిదారులు నాలుగు విడతలుగా రూ.లక్ష చెల్లించే అవకాశం కల్పించారు. అయితే, కేటగిరీ 2, 3 ఇళ్లకు లబ్థిదారులు వాటా సొమ్ము చెల్లించినా డిమాండ్కు సరిపడా ప్లాట్ల నిర్మాణం చేపట్టకపోగా, వారికి మంజూరు చేసిన యూనిట్లను రద్దు చేసినట్లు అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే వారు చెల్లించిన సొమ్ము మాత్రం ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. నత్తనడకన నిర్మాణ పనులు తాము అధికారంలోకొస్తే వెంటనే టిడ్కో ఇళ్ల పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలునేటికీ నెరవేరలేదు. ఉగాది పండుగకే ఈ ఇళ్లను పంపిణీ చేస్తామని పదే పదే అధికారులు ప్రకటనలు గుప్పించారు. అయితే పనులు పూర్తికాకపోవడంతో ఇప్పట్లో టిడ్కో ఇళ్ల సముదాయంలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసే అవకాశం కనిపించడం లేదు. -
విద్యార్థులకు కార్పొరేట్ వల!
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో అనుమతులు లేని కార్పొరేట్ విద్యాసంస్థలు భారీగా అడ్మిషన్లు చేపడుతుండగా, వాటిని అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందని విద్యావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపు చిన్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన నిబంధనలు అమలు చేస్తూ, మరోవైపు కార్పొరేట్ విద్యాసంస్థలకు సడలింపులు ఇస్తోంది. జిల్లాలో 196 ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే అధికారిక అనుమతులు ఉన్నాయి. కాగా కొత్తగా అనుమతులు లేని కొన్ని కార్పొరేట్ సంస్థలు టీడీపీ నేతలు అండతో నిర్భీతిగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి. అనుమతులు లేకుండానే అడ్మిషన్లు.. జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్తగా ఎలాంటి ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నప్పటికీ, కొత్త కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడుతున్న పరిస్థితి తల్లిదండ్రుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. మచిలీపట్నం రూరల్ మండలంలోని ధర్మక్షేత్ర ఇంటర్నేషనల్ స్కూల్, గూడూరు మండలంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ వంటి సంస్థలు అనుమతులు లేకుండానే అడ్మిషన్లు ప్రారంభించాయి. ప్రభుత్వ ఒత్తిడి.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే విద్యాధికారులు మౌనం వహిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విద్యావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ‘సీబీఎస్ఈ’ పేరుతో ఆకర్షణ.. అనుమతులు లేకపోయినా ‘సీబీఎస్ఈ స్కూల్’ పేరు తో తల్లిదండ్రులను ఆకర్షిస్తూ యాజమాన్యాలు అడ్మి షన్లు చేపడుతున్నాయి. సీబీఎస్ఈ పాఠశాల అయినా జిల్లా విద్యాశాఖ నుంచి ఎన్ఓసీ తప్పనిసరి అనే నిబంధన ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి అనుమతులు పొందాలంటే 2025 డిసెంబర్ నాటికి ప్రభుత్వానికి చలాన్ చెల్లించి దరఖాస్తు చేయాలి. ఈ నిబంధనలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని కొన్ని కార్పొరేట్ యాజమాన్యాలు భవన నిర్మాణం పూర్తికాక ముందే అడ్మిషన్లు ప్రారంభించాయి. వాస్తవానికి పాఠశాలకు పూర్తి స్థాయి భవనం, తరగతి గదులు, బోధనా సిబ్బంది, క్రీడా మైదానం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. కానీ ఈ నిబంధనలను పక్కన పెట్టి భారీ ప్రచారం చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడుతున్నాయి. ‘సీబీఎస్ఈ’ పేరిట అడ్మిషన్ల దందా! అనుమతులు లేకుండానే దోపిడీకి శ్రీకారం జిల్లా విద్యాశాఖ ఎన్ఓసీ తప్పనిసరైనా పట్టించుకోని వైనం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు -
ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలి..
● మందులు, టెస్టులు అన్నీ బయటకే.. ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ● దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగుల అవస్థలు ● రాష్ట్రంలోని ఏకై క టీచింగ్ ఆయుర్వేద ఆస్పత్రిపై సర్కారు సవతి ప్రేమ లబ్బీపేట(విజయవాడతూర్పు): సంప్రదాయ దేశీయ వైద్యమైన ఆయుర్వేదంపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రాష్ట్రంలోనే ఏకై క ప్రభుత్వ టీచింగ్ ఆయుర్వేద ఆస్పత్రిగా ఉన్న విజయవాడలోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రి అరకొర సౌకర్యాలతో కునారిల్లుతోంది. దుష్ఫలితాలు లేని వైద్యమని ఆశతో వస్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. మందులు, రక్తపరీక్షలతో పాటు, ఫైల్స్, ఫిస్టులా వంటి వ్యాధులతో వచ్చే వారు దూది.. సూది కూడా బయట కొనుగోలు చేసి తీసుకు రావాల్సిన దయనీయ స్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో ఎలాంటి మందుల కొరత ఉండేది కాదు. కానీ నేడు వారి వద్ద ఉన్న వాటినే రోగులకు ఇచ్చి పంపుతున్నారు. లేనివి బయట కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నారు. డబ్బులు లేక ప్రభుత్వాస్పత్రికి వస్తే.. ఇక్కడ మందులు కూడా లేవంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వారికి ఎవరికై నా అల్ట్రాసౌండ్, సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్లు అవసరమైతే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికెళ్లి తీయించుకోమని చెప్పవచ్చు. కానీ కమీషన్ల కోసం కొందరు వైద్యులు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు రాస్తున్నారు. దీంతో ఆ స్లిప్పులు తీసుకుని అక్కడకు వెళితే రూ.వేలల్లో చెబుతున్నారని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని రకాల వ్యాధుల నిర్ధారణకు రక్తపరీక్షలు సైతం బయటకు రాస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యుల అత్యాశ వెరసి రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో పంచకర్మ విభాగంలో అనేక రకాల చికిత్సలు అందించే వారు. ఊబకాయం, మైగ్రేన్, నడుము నొప్పి, మెడనొప్పిలతో పాటు, వివిధ రకాల చర్మ వ్యాధులకు చికిత్సలు చేసేవారు. ఇప్పుడు పంచకర్మ విభాగం దాదాపు మూలనపడింది. అరకొరగా సేవలు అందిస్తున్నారు. పంచకర్మ చికిత్సలు చేసేందుకు అవసరమైన తైలాలు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాకుండా నాల్గో తరగతి సిబ్బంది కొరత ఉండటంతో చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరుత్సాహంగా తిరిగి వెళ్తున్నారు. ప్రజలకు విద్య, వైద్యం ఎంతో అవసరం. ప్రభుత్వాలు ఆ రెండు రంగాలను విస్మరించకూడదు. సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం పట్ల నిర్లక్ష్యం చేయడం తగదు. ఇక్కడ మంచి వైద్యం అందుతుందని దూర ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు. కానీ మందులు సరిగా ఇవ్వకుండా బయట కొనుక్కోమనడం, దూది కూడా లేక పోవడం దురదృష్టకరం. ప్రభుత్వం స్పందించి, సౌకర్యాలు కల్పించాలి. – ఎండీ నాహిద్, లబ్బీపేట విజయవాడ వన్టౌన్కు చెందిన లక్ష్మీ నడుము నొప్పితో చికిత్స కోసం ఆయుర్వేద ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించి వైద్యులు ఆరు రకాల మందు లు రాశారు. చీటీ తీసుకుని ఫార్మసీ వద్దకు వెళ్లగా మూడు రకాలు చేతిలో పెట్టి, మిగిలినవి బయట కొనుక్కోమని ఉచిత సలహా ఇచ్చి పంపారు. విజయవాడ గాంధీనగర్కు చెందిన వెంకటేశ్వరరావు ఫిస్టులా సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు రెండు రోజులకోసారి డ్రెస్సింగ్ చేయాల్సి వస్తోంది. ఆస్పత్రిలో స్టెరిలైజ్డ్ దూది లేక పోవడంతో బయట కొనుక్కొని తీసుకెళ్తున్నాడు. అంతేకాదు కుట్లు వేసేందుకు సూది కూడా లేని పరిస్థితి ఉంది. ఇలా వీరిద్దరే కాదు ఆస్పత్రికి వచ్చే రోగుల్లో మూడొంతుల మంది సగం మందులు బయట కొనుగోలు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంటుంది. కూటమి ప్రభుత్వం ఆయుర్వేదంపై సవతిప్రేమ చూపుతోందని పలువురు విమర్శిస్తున్నారు. -
1న ఉపాధ్యాయుల నిరాహార దీక్ష
మచిలీపట్నంఅర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ రణభేరి 3.0లో భాగంగా కృష్ణా కలెక్టరేట్ ఎదుట ఏప్రిల్ ఒకటో తేదీన ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు ఆదివారం తెలిపారు. నిరాహార దీక్ష నోటీసును శనివారం రాత్రి డీఆర్వో చంద్రశేఖర్కు అంద జేసినట్లు పేర్కొన్నారు. పీఆర్సీ, డీఏ, బకాయిలు, మెమో 57 అమలు వంటి ఆర్థిక సమస్యల పరి ష్కారం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. 11వ పీఆర్సీ అమలు సమయంలో ఆర్థిక ప్రయోజనాలు సక్రమంగా అందక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ సమస్యల పరిష్కారంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు 12వ పీఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ను నియమించలేదని విమర్శించారు. పెండింగ్ డీఏలు విడుదల చేయకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు 18 నెలలుగా గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లింపులు జరగకపోవడం ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మరోమారు ఉద్యమానికి దిగుతున్నామని వెల్లడించారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించి, 29 శాతం బేసిక్ రివిజన్ ప్రకటించాలన్నారు పెండింగ్ డీఏలు విడుదల చేయడం, ఉద్యోగులు – పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు స్పష్టమైన రోడ్మ్యాప్ ప్రకటించాలని చెప్పారు. కోవిడ్ సమయంలో మరణించిన పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి షౌకత్ హుస్సేన్, బి.కనకారావు, గౌరవాధ్యక్షుడు జె.లెనిన్ బాబు, జిల్లా కార్యదర్శి కె.రంగనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వి.సత్యనారాయణ, కె.అర్జున్, సుబ్రహ్మణ్యం, పి.పాపయ్య, ఒ.వి.నాగేంద్రం, అడపా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిల్వ చేసిన ఆహారం విక్రయిస్తే చర్యలు
నందిగామ టౌన్: రంగు కలిపిన, నిల్వ చేసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే సహించేది లేదని ఉమ్మడి కృష్ణాజిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. నందిగామ పట్టణంలోని పలు హోటళ్లు, స్వీట్ దుకాణాల్లో ఆయన ఆదివారం విస్తృత తని ఖీలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్వీట్ షాపులు, హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరు ఆహార భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రామలింగేశ్వర స్వీటు దుకాణం, విజయ దుర్గ హోటల్లోని ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. ఫుడ్ లైసెన్స్, తదితర అనుమతి పత్రాలు ఉండాలని చెప్పారు. వేసవి కాలంలో కావటంతో నిల్వ ఉంచిన మాంసాహారాలు, ఆహార పదార్థాలు అందించటం వల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు. నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను గుర్తించి బయట పడేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రరెడ్డి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలుడి దారుణ హత్య
నందివాడ: ఇంట్లో నిద్రిస్తున్న నానమ్మ, మనవడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి బాలుడు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో శనివారం అర్ధరాత్రి వెలుగు చూసింది. వివరాలు.. నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో గండికోట లక్ష్మి(70) ఒంటరిగా నివాసం ఉంటూ బెల్టుషాప్ నిర్వహిస్తోంది. ఆమె కొడుకు గండికోట రామసుబ్బారావు, కోడలు రమాదేవి స్థానికంగా రొయ్యల ఫ్యాక్టరీకి రోజూ రాత్రివేళ పనికి వెళ్తారు. ఈ నేపథ్యంలో రామసుబ్బారావు తన కొడుకు బాలాజీ(10)ని నానమ్మ లక్ష్మి దగ్గర రాత్రి వదిలేసి వెళ్తాడు. ఉదయం ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఇంటికి తీసుకెళ్తారు. బాలుడు చిన్నలింగాలలో ప్రభుత్వ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. రోజువారీ లాగే శనివారం రాత్రి వృద్ధురాలు లక్ష్మి, మనవడు బాలాజీతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బాలుడు బాలాజీ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని తొలుత గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. నందివాడ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలు స్థానికంగా బెల్టుషాప్ నిర్వహిస్తుండడంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. డాగ్స్క్వాడ్ రొయ్యల చెరువు వరకు వెళ్లి పోలీస్ జాగిలం ఆగిపోయింది. పోలీసులు పలువురి అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. వారి పనేనా ! ఇటీవల మండలవ్యాప్తంగా రొయ్యల చెరువుల వద్ద పని కోసం అస్సాం, బిహార్ రాష్ట్రాలకు చెందిన చాలామంది వ్యక్తులు వచ్చారు. వీరు వృద్ధురాలు లక్ష్మి దగ్గర తరచూ మద్యం కొనుగోలు చేస్తారు. దీనికితోడు వారు నిత్యం గంజాయి సేవిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో వారిపైనే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పెదలింగాల గ్రామంలో బాలుడి హత్య, వృద్ధురాలిపై దాడి ఘటన గ్రామస్తులను ఉలికిపాటుకు గురిచేసింది. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ ఎస్జీఎస్పీ చెక్కుల పంపిణీ
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా ఉంటుందని వీఎంసీ అదనపు కమిషనర్(జనరల్) ఎ.రవీంద్రరావు అన్నారు. వీఎంసీ ప్రాంగణంలోని ఎస్బీఐలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంక్ అమలు చేస్తున్న ఎస్బీఐ ఎస్జీఎస్పీ (స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్) గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం లబ్ధిదారులకు శనివారం ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విభాగాల్లో విధులు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రమాదవశాత్తు, అనారోగ్య కారణాల వల్ల మృతి చెందితే వారి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక ఆలంబన ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగి వారి వేతనాలు జమయ్యే ఎస్బీఐ బ్రాంచ్లో ఈ పథకం అమలులో ఉంటుందని, ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వీఎంసీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఐదుగురు పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక శానిటరీ మేసీ్త్ర, కుటుంబ సభ్యులకు వారి బీమా పరిహారపు చెక్కులు అందించారు. ఎస్బీఐ వీఎంసీ విజయవాడ వెస్ట్ ప్రాంతీయ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పథకం కింద రిటైర్మెంట్ వరకు బీమా రక్షణ ఉంటుందని, ఈ బీమా కవరేజ్ పూర్తి ఉచితంగా, ఎటువంటి ప్రీమియం లేకుండా అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీఎంసీ అకౌంట్స్ ఆఫీ సర్ బి.ఎస్.ఎన్.మూర్తి, చీఫ్ మేనేజర్ (డిపాజిట్స్ – వీఏఎస్) ఎం.భాస్కర్ రావు, వీఎంసీ బ్రాంచ్ మేనేజర్ ఎస్.శివరాం పాల్గొన్నారు. -
గ్రామ వ్యవసాయ సహాయకులకు రీ–కౌన్సెలింగ్
చిలకలపూడి(మచిలీపట్నం): కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులకు శనివారం రీ–కౌన్సెలింగ్ నిర్వహించారు. గత సంవత్సరం జూలై నెలలో జరిగిన కౌన్సెలింగ్లో తమకు అన్యాయం జరిగిందని గ్రామ వ్యవసాయ సహాయకులు హైకోర్టును ఆశ్రయించటంతో కోర్టు రీ–కౌన్సెలింగ్ నిర్వహించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.పద్మావతి ర్యాంకుల ఆధారంగా సీనియార్టీ జాబితా ప్రకటించి వారికి రీ–కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్లో 103 మంది పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఎన్టీఆర్ వ్యవసాయాధికారి విజయకుమారి, ఏలూరు జిల్లా ఏడీ వెంకటమణి, ఆచార్యులు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026అత్యధిక పాల సేకరణ ధర ఘనత విజయ డెయిరీదేఘంటసాలలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణమచిలీపట్నంఅర్బన్: ఆర్టీఈ చట్టం 12 (1)(సీ) ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత అర్హుల జాబితాను విడుదల చేసినట్లు కృష్ణా జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త కుమిదిని సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 686 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశా లల్లో మొదటి తరగతిలో 25 శాతం రిజర్వేషన్ కోటా కింద ఉచిత ప్రవేశాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ధ్రువపత్రాలను ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీతో కేటాయించిన పాఠశాలలో ఏప్రిల్ ఏడో తేదీ లోపు సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 18004258599 టోల్ ఫ్రీ నంబర్ సంప్రదించొచ్చని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ లబ్బీపేటకు చెందిన దేవి నేని రామకృష్ణ, కనకదుర్గాంబ అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులకు నిత్యాన్నదానానికి రూ.1,11,116 విరాళం అందచేశారు. ఇబ్రహీంపట్నానికి చెందిన సముద్రాల వీరభద్రరావు, శ్రీలత అమ్మ వారి నిత్యాన్నదానానికి రూ.1,11,116 విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మ వారి దర్శనం, వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాలయాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్థానిక ఆర్అండ్బీ ఈఈ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పరి సరాలను పరిశుభ్రం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. అమృత్ కృష్ణ పేరుతో గాజు సీసాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈఓ ఆనందకుమార్, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించు కుని దేవస్థానం తరఫున అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. గులాబీలు, చామంతులు, మల్లెలు, విరజాజులు, తామర పూలు, కాగడాలతో ఆలయ అర్చకులు అమ్మవారికి పుష్పార్చన జరిపించారు. ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మల్లేశ్వరస్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో మహా పూర్ణాహుతిని ఆలయ వైదిక కమిటీ నిర్వహించింది. స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చక బృందం పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపించారు. పెనమలూరు: మండలంలోని కానూరులో ఉన్న సిద్ధార్థ డీమ్డ్ టూ బీ యూనివర్సీటీలో శనివారం రాష్ట్ర స్థాయి వికసిత్ భారత్ పార్లమెంట్పై పోటీలు నిర్వహించారు. ఏపీ మై భారత్ (మేరా యువభారత్) డైరెక్టర్ అంసుమాన్ప్రసాద్దాస్, ప్రో వైస్ చాన్స్లర్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్ ఈ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి యువభారత్ పార్లమెంట్ పోటీల్లో ఎంపికై న 100 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. యూనియన్ బడ్జెట్ –2026, వికసిత భారత్ –2047 వైపు భారత యువత పదాన్ని బలోపేతం చేయడంపై పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎం.వెంకటసాహిత్య (గుంటూరు జిల్లా), వి.తనకమయ(అన్న మయ్య జిల్లా), టి.యోగవిష్ణురాజ్ (తిరుపతి జిల్లా) విజేతలుగా గెలిచారు. వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, జిల్లా యువజన అధికారి సుంకరరాము, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె.శివరామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జి.కొండూరు: సున్నా పెట్టుబడి.. నిత్యం ఆదాయం.. ఆపై ఉపాధి కల్పన.. అంటూ గొప్పగా ప్రచారం చేసిన ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సాహం అందించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జీరో పెట్టుబడితో ఉద్యాన సాగు అంటూ స్వల్ప కాల పంటలను సాగు చేసే రైతులను సైతం ఉద్యాన సాగు వైపు మళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అప్పులు చేసి ఉద్యాన సాగుపై పెట్టుబడి పెట్టిన రైతులకు ఈ ఏడాది మెటీరియల్ నిధులు ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిధుల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వచ్చే ఏడాది ఉద్యాన సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎన్టీఆర్ జిల్లాలో 1,307 మంది రైతులు 2,500 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేశారు. అయితే ఈ సాగుకు 2025–28 వరకు మూడేళ్ల కాలానికి కూలీల ఖర్చు కింద రూ.1,170.23 లక్షలు, మెటీరియల్ ఖర్చు కింద రూ.507.02 లక్షలు మంజూరు చేశారు. మొదటి ఏడాది 2025–26 సంవత్సరానికి కూలీల ఖర్చు కింద రూ.257.16 లక్షలు, మెటీరియల్ ఖర్చు కింద రూ.109.86 లక్షలు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే మెటీరియల్ ఖర్చుకు సంబంఽధించిన నిధులను ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కూలీల ఖర్చు నిధులను 20 శాతం ఇంకా విడుదల చేయలేదని సమాచారం. ఇదే కాకుండా 2024–25 సంవత్సరానికి సాగు చేపట్టిన రైతులకు ఈ ఏడాది విడుదల కావాల్సిన నిర్వహణ ఖర్చులు సైతం 20 శాతానికి పైగా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని నమ్మి అప్పులు చేసి సాగు చేపట్టిన రైతులు రాయితీ నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. పథకం ఇలా... ఉద్యాన పంటల సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వందశాతం రాయితీతో ప్రోత్సహిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండి ఉద్యాన పంటలను సాగు చేసే రైతులకు మూడేళ్ల కాల పరిమితితో విడతల వారీగా నిర్వహణ ఖర్చులను విడుదల చేస్తారు. పండ్ల తోటలకు ఒక రైతుకు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు సాగు చేపట్టేందుకు ఈ పథకంలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అయితే డ్రాగన్, గడ్డి, గట్లు వెంబడి మొక్కల పెంపకానికి గరిష్టంగా ఎకరం వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఈ విధంగా సాగు చేపట్టిన రైతులు ఉపాధి హామీ పనులకు వెళ్లకుండా తమ తోటలోనే ఏటా వంద రోజులు పనిదినాలు పొందే అవకాశం ఉంటుంది. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): దేశంలో అత్యధిక పాల సేకరణ ధర, పాడి రైతులకు బోనస్ అందిస్తున్న ఘనత కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ)ది అని సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ 36వ సర్వ సభ్య సమావేశం శని వారం పాలప్రాజెక్టు ఆవరణలోని ఫంక్షన్ హాల్లో జరిగింది. యూనియన్ మాజీ చైర్మన్ మండవ జానకీ రామయ్య చిత్రపటానికి చైర్మన్, ఎండీ, సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ ఏడాది యూనియన్ బోర్డు, సంస్థ ఉద్యోగులు సంయుక్త కృషితో సాధించిన వివరాల గురించి చైర్మన్ సభ్యులకు వివరించారు. సమావేశం అనంతరం చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. పాడి రైతులు ఆర్థికంగా నిలబడటమే కాకుండా వారికి తోడ్పాటును అందించాలనే కృత నిశ్చయంతో పాల సేకరణ ధరను రూ.30 పెంచి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆవుపాల ధరను లీటర్కు రూ.20 పెంచేందుకు సర్వ సభ్య సమావేశంలో తీర్మానించామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరను కృష్ణా మిల్క్ యూనియన్ చెల్లించబోతుందన్నారు. పాడి రైతులకు బోనస్గా రూ.15 కోట్లు డిసెంబర్ నుంచి మార్చి వరకు పాడి రైతులకు బోనస్గా రూ.15 కోట్లు చెల్లిస్తామని చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.45 కోట్లు బోనస్గా రైతులకు చెల్లించామన్నారు. గత ఏడేళ్లలో కృష్ణా మిల్క్ యూనియన్ రూ.716 వార్షిక టర్నోవర్ను రూ.1,265 కోట్లకు పెంచామని, రూ.96 కోట్ల సమితి మిగులు నిధులను రూ.250 కోట్లకు చేర్చామని వివరించారు. సమితి స్థిరాస్తులను రూ.64 కోట్ల నుంచి రూ.320 కోట్లకు పెంచామన్నారు. వీరవల్లిలోని యూనియన్ కొత్త యూనిట్కు కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లు సబ్సిడీ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, సమితి పాలక వర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ఫీడ్ కమిటీ సభ్యులు, సంఘ అధ్యక్షులు, సమితి అధికారులు పాల్గొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఘంటసాల: దేశంలోని ప్రతి పౌరుడికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం వంటి హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని అంబే డ్కర్ మనవడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భీమ్ రావ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. ఘంటసాలలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షుడు ఉప్పులేటి దేవీప్రసాద్తో కలసి ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యశ్వంత్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పల్లె, నగరంలో అంబేడ్కర్ విగ్రహాలు ఉండటం ఇక్కడి ప్రజలకు ఆయనపై ఉన్న అపారమైన గౌరవానికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య మాట్లా డుతూ.. ఎస్సీలు క్రైస్తవులైతే ఎస్సీ రిజర్వేషన్లు చెల్లవంటూ ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇవ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. ఢిల్లీస్థాయిలో గొంతు వినిపించి ఎస్సీలకు రక్షణ కల్పించాలన్నారు. ముందుగా ఘంటసాల వారసత్వ విగ్రహాల నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సభావేదిక వద్ద బౌద్ధ సంప్రదాయాలతో భంతే ధమ్మ ధజ థెరో ప్రత్యేక పూజలు చేసి అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు వేమూరి వెంకట్రావు, వేమూరి ప్రవీణ్, నలకుర్తి సురేష్, జుజ్జువరపు భాగ్యారావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పంత గాని రమేష్, కృష్ణాజిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్, తూమాటి బసవ సుధాకర్, కోటే రామ్నాథ్, గద్దె కోటినాగులు, ఏపీ న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ వెలగపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మార్చి చివరి వారంలోనే ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అనేక మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జ్వరం, తల నొప్పితో పాటు కొందరు చలితో కూడిన జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో కొందరు ఎండలోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్య సమస్యలు ఇవీ.. 5 డిగ్రీలు ప్రభావం ఎక్కువ ప్రస్తుతం నగరంలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతున్నాయి. అయితే దాని తీవ్రత ఐదు, ఆరు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆల్ట్రావైలెట్ కిరణాలు ఎక్కువగా పడటం ఇందుకు కారణమని వివరిస్తున్నారు. ఓజోన్ పొర బలహీన పడకపోయినప్పటికీ గాలిలో ఉండే దుమ్ము కాలుష్యం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు పేర్కొంటున్నారు. ఖీళీ ప్రదేశం లేని ఇరుకు భవనాలు, మార్జిన్ లేని సిమెంటు రోడ్లు, విచ్చలవిడిగా ఏసీల వినియోగంతో ఇలా మార్చిలోనే తీవ్రమైన ఎండలకు కారణం అంటున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి కాంక్రీట్ జంగిల్తోనే అధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం విజయవాడ కాంక్రీట్ జంగిల్గా మారడంతో మార్చిలోనే అధిక ఎండలు నమోదవుతున్నాయి. వాటి ప్రభావం కూడా ఐదు నుంచి ఆరు శాతం ఎక్కువగా చూపుతోంది. చెట్లు లేక పోవడం, ఖాళీ ప్రదేశం లేకుండా ఇంటిని అనుకుని ఇళ్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెట్లు లేక పోవడం వంటి కారణాలతో చల్లని వాతావరణ కొరవడింది. ఈ పరిస్థితి మారాలంటే సాయంత్రం వాటర్ స్ప్రిక్లింగ్ చేయడం, మొక్కలు పెంచడం వంటివి చేపట్టాలి. Iవిజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 535.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది. ఉపాధి హామీ పథకంలో ఉద్యాన సాగు చేపట్టిన రైతులకు పెట్టు బడి నిధులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకంతో రైతులు అప్పు చేసి పెట్టుబడులకు వెచ్చించారు. ఇప్పుడు మాట తప్పితే ఉద్యాన సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. కూలీల నిధులను వెంటనే విడుదల చేయాలి. – కోట కల్యాణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి 2025–26 ఏడాదికి ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులకు అందాల్సిన నిధులు ఇలా.. మండలం రైతులు కూలీల ఖర్చు మెటీరియల్ ఖర్చు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) ఎ.కొండూరు 133 33.20 7.86 చందర్లపాడు 73 12.52 11.21 జి.కొండూరు 53 7.76 3.92 గంపలగూడెం 65 11.73 2.91 ఇబ్రహీంపట్నం 28 5.43 2.83 జగ్గయ్యపేట 56 9.39 6.73 కంచకచర్ల 44 5.67 3.84 మైలవరం 168 35.93 19.45 నందిగామ 77 11.56 4.49 పెనుగంచిప్రోలు 61 7.43 5.61 రెడ్డిగూడెం 139 29.86 7.99 తిరువూరు 94 19.29 10.35 వత్సవాయి 75 13.38 7.33 వీరులపాడు 66 16.23 6.46 విజయవాడరూరల్ 32 6.00 2.85 విస్సన్నపేట 143 31.79 6.03 ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రతకు అనారోగ్యానికి గురైన వారు పలు సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, బాలింతలు ఎండ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐదేళ్లలోపు పిల్లలను బయటకు పంపకూడదు. మంచినీరు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా ఆహారం తగ్గించడం ఉత్తమం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై ఎండ ప్రభావం త్వరగా చూపుతుంది. వారు త్వరగా డీ హైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రతకు గురకాకుండా చూసుకోవాలి. మంచినీరు అధికంగా తాగడం, నీటి శాతం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం మంచింది. ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఎండలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు -
తెలుగుభాషా వైభవాన్ని చాటిచెప్పిన పుట్టపర్తి
చిలకలపూడి(మచిలీపట్నం): తెలుగు సాహిత్యానికి అపారమైన సేవలు అందించిన మహాకవి, పండితుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగుభాషా వైభవాన్ని చాటిచెప్పిన మహనీయుడని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శనివారం ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ నారాయణాచార్యులు తెలుగుభాషా సాహిత్య జగత్తులో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. యువత ఆయన సాహిత్య వారసత్వాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ నిఖిల, కలెక్టరేట్ ఏవో ఏఎస్ఎన్ రాధిక, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
సాగర్ కాలువలో పడి యువకుడి దుర్మరణం
తిరువూరు: ద్విచక్రవాహనం అదుపు తప్పి కాలువలో పడిన సంఘటనలో తిరువూరుకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ శాతకర్ణి తెలిపిన వివరాల ప్రకారం తిరువూరు 12వ వార్డుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు నల్లబోతుల సూర్యకుమార్(25) ద్విచక్ర వాహనంపై బైపాస్ రోడ్డు నుంచి సుందరయ్య కాలనీ మీదుగా మధిర రోడ్డు వెళుతూ పక్కనే ఉన్న తిరువూరు మేజరు నాగార్జున సాగర్ కాలువలో జారి పడిపోయాడు. రాత్రివేళ ఎవరూ గుర్తించకపోవడంతో నీట ముని గి ఊపిరాడక చనిపోయా డు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సూర్యకుమార్ మృతదేహానికి తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు అవివాహితుడు. -
కార్మిక పక్షపాతి వైఎస్ జగన్
● వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి ● ఘనంగా ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం మధురానగర్(విజయవాడసెంట్రల్): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. స్థానిక సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్లో శనివారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం సుమారు 80 సంఘాలతో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ బలోపేతమయిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దర్జీలు, ధోబీలు, ఆటో డ్రైవర్లు వంటి వివిధ చేతివృత్తుల కార్మికులకు ఏడాదికి రూ.10,000 నేరుగా లబ్ధి చేకూరిందని అన్నారు. యానిమేటర్ల వేతనాన్ని గత ప్రభుత్వం రూ.3,000 నుంచి రూ.10,000 కు పెంచారని, పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.8,000 నుంచి ఏకంగా రూ.21,000కు ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, ఫ్యాక్టరీల ద్వారా మరో 34 లక్షల మందికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధి కల్పించారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, కార్మిక వర్గాల సంక్షేమం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని గౌతం రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యాదల శ్రీనివాసరావు, జోనల్ ఇన్చార్జ్ ఎన్.రాజారెడ్డి, జిల్లా ఇన్చార్జ్ విశ్వనాథ రవి, రవీంద్ర రెడ్డి, బత్తుల గోవింద్, సామంతపూడి చిన్న, దుర్గాప్రసాద్, ప్రభు, వర్మ, కమ్మిలి రత్నకుమార్, బి.కిషోర్ పాల్గొన్నారు. -
రైతులకు రూ.182.31 లక్షల వడ్డీ మాఫీ
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణాజిల్లాలో రైతులకు ఉపశమనంగా రూ.182.31 లక్షల వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపినట్లు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీరఘురాం తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఫంక్షన్ హాలులో శనివారం సాయంత్రం నిర్వహించిన మహాజనసభ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్ల పాత్ర కీలకమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కేడీసీసీ బ్యాంకు కమర్షియల్ బ్యాంకులకు దీటుగా 5వ స్థానంలో ఉందన్నారు. అయితే కేడీసీసీ బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ స్థానం, దేశంలో నాల్గవ స్థానంలో నిలవటం గర్వకారణమన్నారు. రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన తమ బ్యాంక్ జనతా ఇన్సూరెన్స్ పథకం ద్వారా రైతులకు భద్రత కల్పిస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఆ రైతు తీసుకున్న పంట రుణంపై కూడా వడ్డీ మొత్తాన్ని మాఫీ చేస్తున్నామన్నారు. డిజిటల్ సేవలను విస్తరిస్తున్నాం కేడీసీసీ బ్యాంకు ద్వారా డిజిటల్ సేవలను విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ తెలిపారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఫోన్పే క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు. మహాజనసభ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.115.68 కోట్లు బడ్జెట్కు ఆమోదం తెలిపామన్నారు. బంటుమిల్లి, శేరీలక్ష్మీపురం పీఏసీఎస్ల నుంచి స్థలాలు కొనుగోలు చేసి బ్రాంచ్ భవనాలను నిర్మించేందుకు ఆమోదం తెలిపామన్నారు. రెడ్డిగూడెం మండలం వెల్లటూరు, శేరీలక్ష్మీపురం ప్రాంతాల్లో మూడు కొత్త బ్రాంచ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2026–27వ సంవత్సరానికి సంబంధించి మేనేజర్ స్థాయి నుంచి ఏజీఎం స్థాయి వరకు ఉద్యోగుల వేతన సవరణలకు అమూల్యమైన సహకారం అందించామని చైర్మన్ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో సభ్యులకు అంత్యక్రియల ఖర్చు కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. రైతు కుటుంబాల అభివృద్ధి కోసం విద్యా రుణాలు, గృహ రుణాలు, వ్యవసాయ భూమి కొనుగోలు రుణాలు వంటి పలు రుణ సదుపాయాలను అందిస్తున్నామన్నారు. అనంతరం నవాబ్పేట సొసైటీ చైర్మన్ చింతా వెంకటేశ్వరరావు ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయనకు రెండు నిమిషాలు సంతాపం తెలిపారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ సీఈవో ఎ.శ్యామ్మనోహర్, డీసీవో చంద్రశేఖరరెడ్డి, జనరల్ మేనేజర్లు రంగబాబు, బీఎల్ చంద్రశేఖర్, ఉమ్మడి కృష్ణా జిల్లా సొసైటీల అధ్యక్షులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పది పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఆరో రోజు శనివారం ఎస్ఎస్సీ, ఏపీఓఎస్ఎస్ పది పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని వెల్లడించారు. జిల్లాలో ఎస్ఎస్సీ బయోలాజికల్ సైన్స్ పరీక్షకు మొత్తం 21,716 మంది విద్యార్థులు నమోదు కాగా, 21,408 మంది హాజరయ్యారన్నారు. 308 మంది గైర్హాజరయ్యారని, హాజరు శాతం 98.58గా నమోదైందని పేర్కొన్నారు. అలాగే ఏపీఓఎస్ఎస్ హిందీ పరీక్షకు ఇద్దరు విద్యార్థులకు గాను ఇద్దరూ హాజరయ్యారన్నారు. 100 శాతం హాజరు నమోదైందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, అయిదు సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించాయన్నారు. అదనంగా ఏడు జోన్లలో 33 విభాగ కమిటీలు, ఏసీజీఈ కృష్ణా, మచిలీపట్నం పరిధిలో నాలుగు ప్రత్యేక కమిటీలు పర్యవేక్షణ నిర్వహించాయని తెలిపారు. నాలుగు పరీక్ష కేంద్రాలు తనిఖీ గూడూరు మండలంలోని జెడ్పీహెచ్ఎస్ మల్లవోలు, కంకటావ, జెడ్పీహెచ్ఎస్ గూడూరు, ఏపీఆర్ఎస్ నిమ్మకూరు పాఠశాలలను డీఈఓ తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు. -
సుప్రియా కేసు.. పోలీసులకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుంది ఏపీ పోలీసుల తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. జుజ్జువరపు సుప్రియపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారు. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి.. అలా చేస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటా అని పోలీసులకు పేర్ని నాని సవాల్ విసిరారు.మాజీ మంత్రి పేర్నినాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రియను మేం జైలులో పరామర్శించాం. బాధితురాలు చెప్పిన విషయాలపై నేను మీడియాతో మాట్లాడాను. పామర్రు సీఐ సుభాకర్, ఎస్ఐ భాస్కర్, హోంగార్డు కోటేశ్వరమ్మ ఎలా సుప్రియపై దాడి చేశారో చెప్పాను. బాధితురాలకి న్యాయం చేయాలని ఎస్పీని కోరాను. కానీ, తెల్లవారుజామున 3 గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి ఒక అశరీరవాణి విడుదల చేశారు. ప్రకటన పంపించడాన్ని మేం తప్పుపట్టడం లేదు. కానీ సంతకం లేకుండా ప్రకటన ఇచ్చారు. ఎవరో ఒకరు సంతకం పెట్టి ప్రకటన ఇవ్వాల్సింది. పోలీసులు సుప్రియపై దాడి చేయలేదని అశరీరవాణి ప్రకటనలో చెబుతున్నారు. సుప్రియ శరీరం పై ఎలాంటి రక్త గాయాలు లేవని వైద్యులు చెప్పారట. 108 సిబ్బంది కూడా ఎలాంటి గాయాలు లేవని సుప్రియను ఆసుపత్రికి తీసుకెళ్లలేదని చెబుతున్నారు. పోలీసులు అంతా చెడ్డవారని నేను చెప్పడం లేదు. దుర్మార్గంగా వ్యవహరించే వారి పేర్లనే మేం చెబుతున్నాం.రాజకీయ నాయకుడు లెటర్ ఇస్తే కానీ కేసులు కట్టే పరిస్థితి లేదు. 21వ తేదీన సుప్రియ, ఆమె తల్లిదండ్రులు పామర్రు స్టేషన్ కు వెళ్లారు. 21వ తేదీన స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ను మీడియాకు విడుదల చేయండి. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి. అలా చేస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటా. నేను మాట్లాడిన ప్రతీ మాట వెనక్కి తీసుకుంటా.. పోలీసు సిబ్బందికి క్షమాపణ చెబుతాను. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టా. రేపు 11:30 గంటల లోపు మీరు ఆధారాలను బయటపెట్టండి. సుప్రియ సోదరుడు తేజ దొంగతనం చేస్తున్నట్లు సీసీ కెమెరా ఆధారాలున్నాయంటున్నారు. తేజకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టండి. పామర్రు నియోజకవర్గం పేకాటకు నిలయంగా మారింది. ఆశ్రమం ఏరియాలో పేకాట శిబిరంపై దాడి చేసి పోలీసులు లక్షా 60 వేలు వసూలు చేశారని సమాచారంమూడు నక్షత్రాలు ఉన్న అధికారి ఏలూరు నుంచి వచ్చిన కొంతమంది నిర్వాహకులతో డీల్ చేసుకున్నాడా లేదా?. కైలే అనిల్తో మాట్లాడమని ఏలూరుకు చెందిన ఓ మిత్రుడు నన్ను అడిగారు. అనిల్ కుమార్ దమ్ముగా రాజకీయం చేసే వ్యక్తి. డబ్బుకు కక్కుర్తి పడే రకం కాదు. నాకు కులమతాలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని ఎస్పీ తెలుసుకోవాలి. పోలీసులకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే పరిస్థితి సామాన్యులకు ఉంటుందా?. ఆసుపత్రికి తీసుకెళ్లనని 108 సిబ్బంది ఎప్పుడైనా లిఖితపూర్వకంగా రాసివ్వడం చూశామా. కానీ సుప్రియ కేసులో 108 సిబ్బంది రాసిచ్చారు అని అన్నారు. -
సోడా.. సోడా.. గోలి సోడా..!
ఇప్పుడంటే ఏడాది పిల్లలు సైతం కూల్డ్రింక్లు కావాలంటూ మారాం చేస్తున్నారు కాని... ఓ 30, 40 ఏళ్ల కిందట వరకు గోలీసోడాకు ఉన్న క్రేజే వేరు... వీధిలోకి సోడా బండి వచ్చిందంటే జనం ఎగబడే వారు. గోలి సోడా కొట్టేటప్పుడు వచ్చే ఆ శబ్దానికి కూడా ఫ్యాన్స్ ఉండేవారు. సోడాలో గ్యాస్ పట్టే దానిని బట్టి ఆ సోడా బండికి కూడా డిమాండ్ ఉండేది. నైన్టీస్ వరకు ఓ వెలుగు వెలిగిన గోలి సోడా క్రమేణా కనుమరుగవుతూ వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా సోడా బండి కనపడితే ఈ తరం పిల్లలు విచిత్రంగా చూసే పరిస్థితి.50 ఏళ్లకు పైగా సోడా వ్యాపారం చేస్తున్న చక్రవర్తిమచిలీపట్నంటౌన్: గోలి సోడా కనుమరుగైన నేటి రోజుల్లో కూడా ఇప్పటికీ సోడా విక్రయం ద్వారా జీవనం సాగిస్తున్నాడు ఈ వృద్ధుడు. నైన్టీస్లో ప్రధాన డ్రింకుగా సోడానే ఉండేది.. కాలానుగుణంగా పలు రకాల కార్పొరేట్ సంస్థల కూల్డ్రింకులు అందుబాటులోకి రావడంతో సోడా కనుమరుగవుతూ వచ్చింది. కానీ నగరంలోని కాలేఖాన్పేట మంచినీటి కాలువ ప్రాంతానికి చెందిన చక్రవర్తి అనే వృద్ధుడు నేటికీ ఈ వ్యాపారంపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. దాదాపు 50 ఏళ్లకు పైబడి ఈ వ్యాపారం చేస్తున్నాడు. నాటి చెక్క బండిలోనే సోడాలను ఉంచి నగరంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ గోలి సోడాలను విక్రయిస్తున్నాడు. సోడా కావలసిన వారికి ఓపెనర్కి సోడా మూతికి మధ్య రబ్బర్ ముక్కను అడ్డుపెట్టి పెద్ద శబ్దం చేస్తూ ఓపెన్ చేస్తుండడం చూపర్లను పాతకాల జ్ఞాపకాల్లోకి తీసుకువెళుతోంది. రూ.5 పైసల నుంచి సోడాను విక్రయిస్తున్న చక్రవర్తి ప్రస్తుతం మామూలు సోడాను రూ.10కు, నిమ్మకాయ సోడాను రూ.15కు, సుగంధి సోడాను రూ.20 చొప్పున విక్రయిస్తున్నాడు. కాలగమనంలో కలుస్తున్న ఈ అరుదైన గోలి సోడాను విక్రయిస్తూ బతుకుతూ సోడాను కూడా ఇంకా బతికిస్తున్న చక్రవర్తి ఈ ప్రాంతంలో గోలి సోడా చక్రవర్తిగా పాపులర్. -
రైల్వేలో మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(డబ్ల్యూడబ్ల్యూఓ) మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వందన శ్రీవాస్తవ అన్నారు. గురువారం విజయవాడ డివిజన్లో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి పనులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ వర్షా సొనాకియాతో కలసి వందన శ్రీవాస్తవ ముందుగా పునరుద్ధరించిన జాక్ అండ్ జిల్ స్కూల్ను ప్రారంభించారు. అనంతరం వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినుల్లో ఆత్మగౌరవం పెంచేలా శానిటరీ డిస్పోజల్ యూనిట్ను ఆమె ప్రారంభించారు. అదే విధంగా డివిజన్లోని పలు కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు మరో 14 శానిటరీ డిస్పోజల్ యూనిట్లను డివిజన్ ఆర్గనైజేషన్కు అందజేశారు. డివిజన్కే గర్వకారణం.. ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ వర్షా సొనాకియా మాట్లాడుతూ పాఠశాలలో జరుగుతున్న పరివర్తన డివిజన్కే గర్వకారణం అన్నారు. పాఠశాల పునరుద్ధరణ, ఆధునిక పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన విద్యార్థులు, సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కొండా వీణా చందన, సెక్రటరీ నిహారిక, స్కూల్ సెక్రటరీ ఆర్.పవిత్ర, వి.సింధూర లక్ష్మి పాల్గొన్నారు. -
బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలిపై హత్యాయత్నం కేసా!
చిలకలపూడి(మచిలీపట్నం): అభం శుభం తెలియని బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలు సుప్రియపై పామర్రు పోలీసులు అకారణంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఇటీవల పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్ పరిధిలోని హోంగార్డు కోటేశ్వరమ్మపై హత్యాయత్నం చేశారనే కేసును సుప్రియపై నమోదు చేశారు. దీనిపై రిమాండ్కు వచ్చిన ఆమెను మచిలీ పట్నం సబ్జైలులో గురువారం పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్తో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ తెలుగు తమ్ముడు గణేష్ కళ్లలో ఆనందం కోసం పోలీసులు తీసుకున్న చర్యలు సరికాదని హితవు పలికారు. పొలంలో మినపకాయలు లాగుతున్న సమయంలో తన తండ్రిపై నేరం మోపేందుకు పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్కు పిలిపించారని ఆమె తెలిపారన్నారు. సోదరుడు తేజను దుర్భాషలాడితే దీనిపై సుప్రియ ప్రశ్నించినందుకు హోంగార్డు కోటేశ్వరమ్మతో బట్టలు చిరిగిపోయేలా ఆమెను లాక్కెళ్లటం అఘాయిత్యం కాదా అని పేర్ని ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతీపై చెయ్యి పెట్టి తోసేశారని ఆ అభాగ్యురాలు చెబుతుంటే నిర్ఘాంతపోయామన్నారు. సీఐ, ఎస్సైలు ఆమైపె దాడి చేయడంతో రక్తం వస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆటోలో బందరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందినట్లు తమకు తెలియజేసిందన్నారు. మూడు రోజులైనా వాంగ్మూలం రికార్డు చేయడానికి పోలీసులు రాకపోవడం దారుణమని తెలిపారన్నారు. విన్నవించుకుందామని వస్తే అరెస్టు చేస్తారా? తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ‘మీ కోసం’లో కలెక్టర్ బాలాజీ ఎదుట వ్యక్తం చేస్తే, ఆయన డీఎస్పీ శ్రీనివాసరావుకు అర్జీని బదిలీ చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. డీఎస్పీ ఆమెను నమ్మబలికి పామర్రు పోలీసులకు అప్పచెప్పారన్నారు. వారు గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం కోర్టులో హాజరుపరిచారని ఇలా చేయడం న్యాయమా అని పోలీసులను పేర్ని నాని ప్రశ్నించారు. కలెక్టర్కు ఏ రకంగా మర్యాద ఇస్తున్నారో గ్రహించాలన్నారు. ఎస్పీ నాయకత్వంలో పోలీసులు హోంగార్డు కోటేశ్వరమ్మను పావుగా ఎలా వాడుకున్నారో తెలుసుకోవాలన్నారు. కావాలంటే సీసీ పుటేజీని పరిశీలించాలని కోరారు. పోలీసులు ఆమెకు రిమాండ్ విధించేలా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంతో మంది టీడీపీ, జనసేన రౌడీలు రాజ్యమేలుతున్నా వారికి మాత్రం స్టేషన్ బెయిల్ తప్ప రిమాండ్ ఎందుకు ఉండదని ఆయన ప్రశ్నించారు. ఈ పాపం ఊరికే పోదు.. టీడీపీ నాయకుడు గణేష్ కళ్లలో ఆనందం కోసం.. పోలీసులు ఆమె విషయంలో చేసిన పాపాలు ఊరికేపోవన్నారు. గణేష్ ఎన్నికల కౌంటింగ్కు ముందు జుజ్జువరపు చిన్ని తమ్ముడి ఇంటిని తగలబెడితే కేసు నమోదు చేయలేదన్నారు. దళితురాలి విషయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తోందో అర్థమవుతోందన్నారు. డీసీఎం పవన్ కల్యాణ్కు.. 50 మంది పోలీసులతో బందోబస్తు, ఒక విమానం ఇస్తే ఇలాంటి ఘటనలు కనపడకుండా పోతాయా అని ప్రశ్నించారు. ఓదార్పు మాటలు చెప్పి దళిత మహిళను జైల్లో పెట్టిస్తావా అని డీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డు కోటేశ్వరమ్మ మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి విచారణ చేస్తూ విర్ర వీగుతుంటే మీ చదువుకు అర్థం లేకుండా పోతుందన్నారు. అభం శుభం తెలియని జైలులో ఉన్న సుప్రియకు న్యాయం జరిగే రోజు త్వరలోనే ఆ దేవుడు కల్పించాలని తాము కోరుకుంటున్నామన్నారు. -
యనమలకుదురులో కొనసాగుతున్న విచారణ
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో స్వామివారి సొమ్ము స్వాహా ఘటనపై విచారణ కమిటీ విచారణ గురువారం కొనసాగింది. ఆలయంలో హుండీలో సొమ్ము నకిళీ తాళంతో స్వాహా చేశారని ఆలయ ఈవో భవాని, పూజారులు సాగర్, పూర్ణ, ఉద్యోగి రోశయ్యలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాలని ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ రికార్డులను విచారణ కమిటీ తనిఖీ చేస్తున్నారు. మరో రెండు వారాల పాటు విచారణ కొనసాగనుందని తెలుస్తోంది. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు అర్చకులపై దుర్గగుడి ఈవో శీనానాయక్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో 3వ షిఫ్టులో ఉప ప్రధాన అర్చకుడు పి. శ్రీనివాసశర్మ, పరిచారకుడు కె. నాగరాజు విధులు నిర్వర్తించాల్సి ఉంది. బుధవారం రాత్రి ఈవో శీనానాయక్, ఇతర అధికారులు మల్లేశ్వరాలయానికి వెళ్లగా అక్కడ ఇద్దరు అర్చకులు విధులకు హాజరు కాలేదు. సదరు విషయాన్ని ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇద్దరు అర్చకులను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంటూ.. ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు ఎవరైనా సరే వారికి కేటాయించిన విధుల్లో ఉండాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 8 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చిట్టినగర్(విజయవాడపశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న రెండు హోటళ్లపై పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. చిట్టినగర్లోని బాబాయ్ హోటల్, సౌమ్య థియేటర్ సమీపంలోని ఓ టిఫిన్ హోటల్పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సౌమ్య థియేటర్ సమీపంలోని టిఫిన్ హోటల్లో ఉన్న ఐదు గ్యాస్ సిలిండర్లు, చిట్టినగర్ బాబాయ్ హోటల్లో మూడు గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారాల కోసం వినియోగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిట్టినగర్లో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారనే సమాచారంతో సెంటర్లోని మరి కొన్ని టిఫిన్ హోటళ్లు, బళ్ల నిర్వాహకులు తాళాలు వేసి పరుగులు తీశారు. -
పటిష్ట భద్రతలో ఈవీఎం, వీవీ ప్యాట్లు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు(ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెలవారీ తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం ఆయన విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదామును పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. డీఆర్ఓ లక్ష్మీనరసింహం, యరడ్ల ఆంజనేయరెడ్డి (వైఎస్సార్ సీపీ), కాకాని తరుణ్, బి. కృష్ణారెడ్డి (బీజేపీ), కాకొల్లు సురేష్ (టీడీపీ) తదితరులు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
యూపీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని చిట్టినగర్ యూపీహెచ్సీని గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రోజూ ఎంత ఓపీ నమోదు అవుతుంది, అభా ఐడీలు చేస్తున్నారా లేదా, ఆన్లైన్ పక్రియ సక్రమంగా జరుగుతుందా అనే అంశాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఫార్మసీలో అత్యవసర మందులు సరఫరా, రోగులకు ఇచ్చిన మందుల వివరాలు, మందుల లభ్యత, వాటిన భద్రపరుచే విధానం వంటి అంశాలను తనిఖీ చేశారు. రోగులకు రక్త పరీక్షల ఎలా నిర్వహిస్తున్నారు.. రిపోర్టులు సక్రమంగా ఇస్తున్నారా అని అక్కడ ఉన్న రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సిబ్బంది పనిచేయాలని పిలుపునిచ్చారు. -
విద్యార్థులు విలువలతో ఎదగాలి
కృష్ణా వర్సిటీ వీసీ ఆచార్య రాంజీ వన్టౌన్(విజయవాడపశ్చిమ): సాంకేతిక విప్లవం నేపథ్యంలో ఉన్నత విలువలతో విద్యార్థులు ఎదగాలని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రాంజీ కూన చెప్పారు. కేబీఎన్ కళాశాల 61వ వార్షికోత్సవం రెండో రోజైన గురువారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల కేరింతల నడుము సందడిగా జరిగింది. తొలుత శ్రీ పద్మావతి వేంకటేశ్వర ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ సుధా నాగేశ్వరరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ రాంజీ కూన మాట్లాడుతూ సాంకేతిక ఏదైనా విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా విద్యనభ్యసించి ఉన్నతి సాధించాలన్నారు. క్వాంటం టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీలు ప్రపంచంలో నూతన విప్లవానికి నాంది పలకనున్నాయన్నారు. శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ సుధా నాగేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ప్రయోజకులు కావాలన్నారు. కేబీఎన్ కళాశాల సెక్రటరీ డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేబియన్ కళాశాల విద్యార్థులు సమాజాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కృష్ణవేణి వార్షిక నివేదికను అందించారు. ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ కోశాధికారి గోళ్ల బాబా విజయకుమార్, కేబీఎన్ కళాశాల అధ్యక్షుడు ఉసిరిక ఉమా మహేశ్వర రావు, ఉపాధ్యక్షులు చిట్టూరి నాగేంద్ర కుమార్, కోశాధికారి హరగోపాల్, కమిటీ ఏవో డాక్టర్ వి. నారాయణరావు తదితరులు ప్రసంగించారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.3.50 లక్షలు నగదు, 304 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ ఏడీసీపీ ఎం.రాజారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జిల్లాలో రాత్రి సమయాల్లో జరుగుతున్న చోరీలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, దొంగతనం కేసుల్లోని సంఘటనా స్థలంలో సాంకేతిక ఆధారాలను సేకరించి అనుమానితులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం తమకు అందిన సమాచారంలో వన్టౌన్ తారాపేట రైల్వేస్టేషన్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా నిందితుడు ఆరేపల్లి దుర్గారావు కంగారు పడి, తన మోటార్ సైకిల్ను వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని చోరీ కేసులో రూ. 3.50 లక్షలు నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా పెడన, ఏలూరు పోలీస్స్టేషన్ల పరిధిలోని కేసుల్లో 304 గ్రాముల వెండిని రికవరీ చేసినట్లు తెలిపారు. వ్యసనాలకు బానిసై.. కాగా మచిలీపట్నం మేకవారిపాలెంకు చెందిన ఆరేపల్లి దుర్గారావు వ్యసనాలకు బానిసై పనులకు వెళ్లి సంపాదించే డబ్బులు సరిపోక, నేరాలకు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. ఇప్పటి వరకూ విజయవాడ సిటీతో పాటు, పరిసర జిల్లాలో 80 వరకూ దొంగతనాలకు పాల్పడినట్లు ఏడీసీపీ రాజారావు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంతో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ కిషోర్బాబు తమ సిబ్బంది కృషి చేసినట్లు పేర్కొన్నారు. -
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి వాడపల్లికి చెందిన భక్తులు గురువారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లికి చెందిన కొప్పుల దుర్గా దివ్య కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ఆధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళంగా ఇచ్చారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి ఆలయ ఏఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఇంద్రకీలాద్రిపై ఆహ్లాదం పెంపునకు చర్యలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ప్రాంగణంలో పచ్చదనం పెంపునకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులతోపాటు ఆధ్యాత్మికం, ఆహ్లాద వాతావరణం పెంపునకు నిపుణులైన హైదరాబాద్కు చెందిన డాక్టర్ రమాకాంత, శరవణన్, శరత్తోపాటు అమరావతి అభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్ గురువారం ఆలయానికి విచ్చేశారు. ఆలయ ప్రాంగణంలోని గోశాల పరిసరాలు, వాటర్ ట్యాంకులు, నూతన పూజా మండపం, యాగశాల, మల్లేశ్వరస్వామి ఆలయం, మహా మండపం దిగువ ప్రాంతాలను పరిశీలించారు. దేవస్థాన మాస్టర్ప్లాన్ను ఈవో శీనానాయక్ ఆ బృందానికి వివరించారు. జీరో బ్రేక్ డౌన్ లక్ష్యంగా పని చేయాలి గన్నవరం: జీరో బ్రేక్ డౌన్ లక్ష్యంగా ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రజా రవాణా అధికారి కె.వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక ఆర్టీసీ డిపోను గురువారం ఆయన సందర్శించారు. బస్ స్టేషన్లో ప్రయాణికులు కూర్చునే సీట్లు, తాగునీరు, ఫ్యాన్లు వంటి సదుపాయాలను, మరుగుదొడ్లు, బస్టాండ్ పరిసరాలను ఆయన పరిశీలించారు. అనంతరం గేట్ మీటింగ్ నిర్వహించి అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. బస్సులు సర్వీస్కు పంపిన తర్వాత ఎటువంటి ఫెయిల్యూర్స్ రాకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. బస్సులకు మరమ్మతులు నిర్వహించి కండిషనల్లో ఉంచాలని సూచించారు. అనంతరం గ్యారేజ్లో సర్వీస్ చేసిన బస్సులో రోడ్డు టెస్ట్ డ్రైవ్కు వెళ్లిన డీపీటీవో వాహన సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆయన వెంట డిపో మేనేజర్ పి.శివాజి, గ్యారేజ్ ఇన్చార్జ్ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఇన్చార్జ్ మధు, పలువురు సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. అవార్డులు బాధ్యతలను పెంచుతాయి విజయవాడ కల్చరల్: అవార్డులు బాధ్యతలను పెంచుతాయని కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ళ నారాయణరావు అన్నారు. 2026 సంవత్సరానికి ఉగాది పురస్కారాలు అందకున్న చిత్రకారులకు అభినందన సభను బాలోత్సవ భవన్లో పోలవరపు సాహితీ సమితి, డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యాన నిర్వహించారు. గోళ్ల నారాయణరావు చిత్రకారులను అభినందించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ చిత్రకళలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను తెలుసుకోవాలని సూచించారు. చిత్రకారులు ఎన్ఎస్ వెంకట్రావు, వజ్రగిరి, కళాసాగర్, పి.రమేష్, పట్నాల సుధాకర్ను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో మోతుకూరి ఆంజనేయులు, డాక్టర్ సీహెచ్ రామచందర్, కె. సుధాకర్, లయన్స్ క్లబ్ సభ్యులు ఉపేంద్ర, ఆంజనేయులు, ప్రసాద్ పాల్గొన్నారు. -
పూల పరిమళం.. భక్తి పరవశం
దుర్గమ్మకు సంపంగి, చామంతి, మల్లెలతో అర్చన ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు గురువారం అమ్మవారికి సంపంగి, చామంతి, మల్లెలతో విశేషంగా అర్చన జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలోని కళావేదిక నుంచి ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు, సిబ్బంది అమ్మవారి అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్కు పుష్పాలను సమర్పించారు. అనంతరం అర్చకులు పుష్పాలతో అర్చన నిర్వహించారు. పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఆ పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆంజనేయ స్వామికి విశేష పూజలు.. చైత్రమాస అష్టమి, శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడైన వీరాంజనేయ స్వామి వారికి గురువారం విశేష అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఆంజనేయ స్వామి వారికి, ఘాట్రోడ్డులోని స్వామి వారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరువూరు: ఇప్పటివరకు నగర పంచాయతీగా ఉన్న తిరువూరును గ్రేడ్–2 మునిసిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత కౌన్సిల్ సమావేశంలో తిరువూరును మునిసిపాలిటీగా వర్గోన్నతి చేయాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపగా, గ్రేడ్–2 మునిసిపాలిటీ హోదా కల్పిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. గత రెండు సంవత్సరాల్లో నగర పంచాయతీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెనమలూరు: కానూరులో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. కానూరు సెక్టార్ ఎస్ఐ జి.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు కల్పనానగర్లో కొందరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు గురువారం అక్కడకు వెళ్లారు. ఆసమయంలో నలుగురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు. పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. మరో ఇద్దరు పట్టుబడ్డారు. వారి వద్ద రెండు బ్యాగుల్లో ఆకుపచ్చని ఎండిన ఆకులు, కాండం, పువ్వులు, విత్తనాలు కనపడ్డాయి. పట్టుబడిన వారిలో కానూరుకు చెందిన సయన అనంత్కుమార్(32), తాడిగడప గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ మహేష్(26) వద్ద పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసులకు చిక్కకుండా పారిపోయిన షేక్ జాన్బాషా(జాన్బెర్రీ), రామవరప్పాడు చెందిన అక్బర్తో కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నామని వారు తెలిపారు. విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయి తీసుకు వస్తున్నామన్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ మాదకద్రవ్యం కూడా తీసుకువచ్చామని తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నామన్నారు. నిందితుల వద్ద 5 కిలోల గంజాయి, ఒక గ్రాము ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పారా కబడ్డీ రాష్ట్ర పురుషుల జట్టు ఎంపిక
గన్నవరం: పారా కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీఆర్ ఇండోర్ హాలులో గురువారం పారా పురుషుల రాష్ట్ర కబడ్డీ జట్టు ఎంపిక నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ సెలక్షన్స్కు హాజరయ్యారు. వీరిలో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచిన 14మంది క్రీడాకారులకు రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి ఉజ్వల్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు చండీగఢ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. జట్టు కోచ్గా డీఎన్ నాగరాజు, మేనేజర్గా చరణ్తేజ వ్యవహరించనున్నారన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఉజ్వల్, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కేపీ రావు అభినందించారు. -
బస్సుల్లోనే బతుకులు బుగ్గి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రైవేట్ బస్సులంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు.వరుసగా ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురికావడం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతుండటంతో ప్రయాణికులు హడలిపోతున్నారు. గతేడాది కర్నూలు జిల్లాలో, కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్ జిల్లా కీసర సమీపంలో.. తాజాగా మార్కాపురంలో ఇలా రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం ప్రైవేటు ట్రావెల్స్పై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది, మార్కాపురం బస్సు ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్కు విజయవాడ రాజధాని ప్రైవేటు ట్రావెల్స్కు విజయవాడ.. రాజధానిగా మారింది. ఇక్కడ నుంచి నిత్యం 500 పైగా బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో చాలా వరకు సరైన పర్మిట్లు, ఫిట్నెస్ లేకపోవడం, సేఫ్టీ పాటించకుండానే రోడ్లెక్కుతున్నాయి. అతి వేగం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్ వాహనాలు అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. ఒకే నంబరుతో ఒక బస్సు హైదరాబాద్, మరో బస్సు బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్తున్నా అధికారులకు తెలిసీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బస్సుల్లో సిబ్బంది వంట కోసం సామగ్రి, స్టౌ, గ్యాస్ వంటివి బస్సు కింది భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో పెడుతున్నారు. కొందరు అందులోనే మద్యం తాగుతున్నారు. మరికొన్ని బస్సులు సరుకు రవాణా చేస్తున్నాయి. ఎక్కవగా టైర్లు తరలిస్తున్నారు. అనుకోని ప్రమాదం జరిగి టైర్లకు నిప్పంటుకుంటే మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడే అవకాశం ఉంది. హనుమాన్పేట నుంచి బయలు దేరే బస్సుల్లో సరుకు రవాణా చేస్తున్నా.. ఏ ఒక్క అధికారి వాటి వంక కన్నెత్తి చూడడం లేదు. బస్సు బయలు దేరిన దగ్గర నుంచి సిటీ దాటే వరకు డబ్బులు ఇస్తూ ప్రైవేటు బస్సుల యాజమాన్యం తనిఖీలు చేయకుండా పనికానిచ్చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి ఉంది.ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న వరుణ్ ట్రావెల్స్ బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. నిత్యం రాష్ట్రంలో ఏదో మూల ప్రైవేటు బస్సులు కాలిబూడిదైపోతున్నాయి. ప్రయాణికులు చనిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించదా? ఇంకెన్ని అమాయక ప్రాణాలు పోవాలి? నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలి. ప్రయాణికులకు భద్రత కల్పించాలి. – వేమా సురేష్, కంచికచర్ల -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని డెలివరీ బాయ్ మృతి
పెనమలూరు: ఇసుక ట్రాక్టర్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయవాడ–అవనిగడ్డ కరకట్టపై ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో డెలివరీ బాయ్ దుర్మరణం చెందాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు పల్లిపేటకు చెందిన కొక్కిలిగడ్డ దుర్గేష్ (32) భార్య వీరలక్ష్మి, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. అతను డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. కాగా బుధవారం సాయంత్రం పెదపులిపాక శ్రీనగర్కాలనీలో డెలివరీ ఇవ్వటానికి బైక్పై వెళుతుండగా ఇసుక ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి అతనిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో దుర్గేష్ తీవ్రంగా గాయపడి స్పాట్లో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య వీరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
వేసవిలో పశు పోషకులు జాగ్రత్త వహించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): రానున్న వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పశుపోషకులు పశువులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన పోస్టర్ను గురువారం ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గటం, ఆహార స్వీకరణ సరిగ్గా లేకపోవటం వంటి సమస్యలు తలెత్తి మరణించే అవకాశాలు ఉంటాయన్నారు. ఇందుకోసం పశువులకు ఎప్పటి కప్పుడు చల్లటి తాగునీరు అందించాలన్నారు. నీడ ఉన్న ప్రదేశాల్లో ఉంచాలన్నారు. పశువుల్లో వేడి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పశువైద్యుని సంప్రదించాలన్నారు. వీటన్నింటిపై గ్రామ పశువైద్యసిబ్బంది యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, డీఈవో యూవీ సుబ్బారావు ఉన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
ధాన్యం కొనుగోలుకు చర్యలు
చిలకలపూడి: రైతుల నుంచి రబీ సీజన్లో సజావుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆయన చాంబర్లో గురువారం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తో కలసి 2025–26 రబీ సీజన్కు ధాన్యం సేకరణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం జిల్లాలో 54,678 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని రైతులు వారి ధాన్యాన్ని పూర్తిగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆరబెట్టుకొని రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం కల్పించిన వాట్సాప్ షెడ్యూలింగ్ సదుపాయాన్ని రైతులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. పౌర సరఫరాల సంస్థ డీఎం శివరాంప్రసాద్, డీఎస్వో మోహన్బాబు, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, భారత ఆహార సంస్థ డివిజనల్ మేనేజర్ సురేష్, డీసీవో చంద్రశేఖర్, ఆర్టీవో శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, తూనికలు, కొలతలశాఖ అధికారి ఈశ్వరయ్య, డిసీఎంఎస్ మేనేజర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం
● సీఎన్సీ మిషన్లు, కలప దగ్ధం ● రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం చల్లపల్లి: చెక్కలపై డిజైన్లు చెక్కే ఉడ్ కార్వింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి, రెండు సీఎన్సీ మిషన్లు, విలువైన టేకు, ఇతర కలప కాలిపోయింది. ఈ ఘటన మండల పరిధిలోని పెదకళ్లేపల్లి రోడ్డులోని మేకలడొంక వద్ద ఉన్న శ్రీసాయి టింబర్ డిపో అండ్ ఉడ్వర్క్ షాపులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సుమారు అన్నీ కులుపుకొని రూ.10లక్షలకుపైగా నష్టం సంభవించినట్లు బాధితులు చెబుతున్నారు. వివరాలు ఇవి.. మోపిదేవికి చెందిన అద్దంకి సత్యనారాయణ కంప్యూటర్ల సహాయంతో యంత్రాల ద్వారా కలపపై డిజైన్లు వేసే ఉడ్ కార్వింగ్ పనులు చేస్తుంటారు. సీజన్ కావటంతో పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. బుధవారం రాత్రి 8గంటల సమయంలో కంప్యూటర్లో డిజైన్ను సెట్చేసి మిషన్పై చెక్కలు బిగించాడు. కంప్యూటర్ చెక్కలపై డిజైన్ పని చేసుకుంటుండగా ఈలోపు భోజనం చేసి వద్దామని బయటకు వెళ్లాడు. కొంతసేపటి తరువాత తిరిగి వచ్చే చూసేసరికి అప్పటికే రెండు సీఎన్సీ మిషన్లు, చుట్టూ ఉన్న కలపకు మంటలు వ్యాపించాయి. వెంటనే అవనిగడ్డ అగ్నిమాపక కేంద్రానికి, తన సిబ్బందికి, స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే షెడ్డులో దట్టమైన పొగ అలముకుని మంటలు వ్యాపించటంతో అదుపుచేయటం కష్టంగా మారింది. ఈలోపు అందినకాడికి కలపను పక్కకు లాగారు. కొంతసేపటికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చని అంచనా వేశారు. పూర్తిగా దగ్ధం.. మిషన్లు, ఫర్నీచర్ కోసం ఉపయోగించే కలప చెక్కలు, కంప్యూటర్లు కాలిపోయాయి. అప్పటికే డిజైన్ పూర్తయి డెలివరీకి సిద్ధంగా ఉన్న కలప కూడా దగ్ధమైంది. సుమారు రూ.10లక్షల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఉన్నదంతా ప్రమాదంలో కాలిపోయిందని మరలా మిషన్లు ఎలా కొనుక్కోవాలో... ఆర్డర్లు ఇచ్చిన వారికి తిరిగి కలప ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వాలో పాలుపోవటంలేదని యజమాని అద్దంకి సత్యనారాయణ వాపోతున్నారు. -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5884 టీఎంసీలు.భక్తి పరవశం దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి సంపంగి, చామంతి, మల్లెలతో విశేషంగా అర్చన జరిగింది.గాయనీగాయకులకు సత్కారం విజయవాడ కల్చరల్: ‘మహానటి సావిత్రి’ కళాపీఠం సంక్షేమ సంఘం ఆధ్వర్యాన గురువారం విజయవాడలో గాయనీగాయకులను సత్కరించారు. 1 -
బహుముఖ ప్రతిభాశాలి యల్లా
విజయవాడకల్చరల్: బహుముఖ ప్రతిభాశాలి యల్లా వెంకటేశ్వరరావు అని గజల్ శ్రీనివాస్ అన్నారు. సంగీత సామ్రాట్ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, సుమధురగాన సధాకర కేవీ బ్రహ్మానందరావు కళాసంస్థ, తెలుగు కళావాహిని ఆధ్యర్యంలో జీవీఆర్ సంగీత కళాశాలలో అంతర్జాతీయ మృదంగ విద్వాంసులు డాక్టర్ యల్లా వెంకటేశ్వరరావుకు స్వర్ణకంకణ, సత్కార కార్యక్రమాన్ని బుధ వారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ మృదంగ విద్యకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన మహానీయుడు యల్లా అని అన్నారు. విశ్రాంత న్యాయమూర్తి టి.వేణుగోపాలరావు మాట్లాడుతూ.. ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఎంఎస్ సుబ్బులక్ష్మి, పండిట్ రవిశంకర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్లకు వాద్య సహకారం అందించారన్నారు. గాయకుడు మధుసూదనరావు, సి. వరదరాజులు యల్లా సంగీత సేవలను కొనియాడారు. నిర్వాహకులు కేవీ బ్రహ్మానందరావు, చిట్టిబాబు, గోళ్ల నారాయణరావుల చేతులమీదుగా యల్లా వెంకటేశ్వరరావుకు స్వర్ణ కంకణం ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. -
మే ఒకటో తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని శాప్ చైర్మన్ ఏ. రవినాయుడు చెప్పారు. స్థానిక బందరు రోడ్డులోని శాప్ ప్రధాన కార్యాలయంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. శాప్ ఎండీ ఎస్.భరణీతో పాటుగా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంఘాలు, ఇతర విద్యాసంస్థలను కలుపుకొని ఈ వేసవి క్రీడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణ శిబిరాల నిర్వహణకు శాప్ కోచ్లతో పాటుగా వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, రిటైర్డ్ ఉద్యోగులు సేవలను వినియోగించుకుంటామన్నారు. విద్యార్థులు, యువత ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుని క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిందిగా ఆయన కోరారు. -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు కేవలం గృహిణులుగా కాకుండా వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో బుధవారం నిర్వహించిన ఉమెన్ హుడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘రైజ్’ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి ముందస్తు అనుభవం లేకపోయినా, కేవలం ఆలోచనతో వస్తే చాలని, వారికి అవసరమైన శిక్షణ, మార్కెటింగ్ మెలకువలు, సాంకేతిక సహకారాన్ని ఈ సెంటర్ల ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇన్నర్వీల్ ఇంటర్నేషనల్ మాజీ కోశాధికారి సరిత లునాని, ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్ పర్సన్ అమ్రిత కుమార్, కలెక్టర్ సతీమణి సుప్రిత, ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ సీనియర్ చైర్ పర్సన్ సుప్రియ మలినేని తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026వేసవికి ముందే సిద్ధంగా లేకుంటే మున్ముందు ముప్పే! సాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 536.70 అడుగులకు చేరింది. ఇది 181.5216 టీఎంసీలకు సమానం. గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి హుండీల్లోని కానుకలను లెక్కించగా రూ. 15.17 లక్షల నగదు, 129గ్రాముల వెండి, 10 ఆస్ట్రేలియా డాలర్లు వచ్చినట్లు ఆలయ ఏసీ సంధ్య తెలిపారు.గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు సమర్థంగా పనులు చేపట్టి ఐదేళ్ల కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో 1,10,727 ఇంటింటి కుళాయి కనెక్షన్లను ఏర్పాటు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఈ పథకం మరుగున పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎనిమిది మంది అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో గంజాయి తరలిస్తున్న ఎనిమిది మంది అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను ఈగల్ బృందం అరెస్టు చేసి, వారి నుంచి 66 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఈగల్ బృందం, ఆర్పీఎఫ్, జీఆర్పీ, డాగ్ స్క్వాడ్ల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పూరి–తిరుపతి ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారంతో ఈగల్ బృందం, ఇతర భద్రతా దళాలతో కలసి జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ తనిఖీల్లో సుమారు 66 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వాటిని తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 8 మంది అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి.. గంజాయి ముఠా సభ్యులు ఒడిశా నుంచి సేకరించిన గంజాయిని కేరళ, తిరుపతి ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. విజయవాడ మీదుగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఈగల్ ఇన్స్పెక్టర్ ఎం.రవీంద్ర హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జీఆర్పీ ఇన్స్పెక్టర్లు జె.వి.రమణ, డి.నాగార్జున, ఎస్లు ఎం. వీరాంజనేయులు, రాంబాబు, డాగ్ స్వ్కాడ్ ఆర్ఎస్ఐ దుర్గాప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానానికి, ఉచిత ప్రసాద వితరణకు ముదునూరుకు చెందిన భక్తులు బుధవారం రూ. 2.75లక్షల విరాళాన్ని అందజేశారు. యలమంచిలి రంగారావు అమ్మవారి అన్నదానానికి రూ. 1.40లక్షలు, యలమంచిలి సీతా మహాలక్ష్మి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1.35లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు వేద పండితుల ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో ఆలయ అధికారులు, అర్చకులు సత్కరించారు. కోడూరు: సముద్ర కాలుష్యాన్ని నివారించే అరుదైన ఆలీవ్ రిడ్లే తాబేళ్ల పిల్లలను అటవీ అధికారులు బుధవారం సముద్ర బాట పట్టించారు. హంసలదీవి సాగరతీరం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆలీవ్ రిడ్లే తాబేళ్లు తీరంలోని ఇసుకతిన్నెల వెంట గుడ్లు పెట్టగా, వాటిని అటవీ సిబ్బంది సేకరించి నిర్ణీత ఉష్టోగ్రత దగ్గర సంతానోత్పత్తి కోసం ప్రత్యేక కేంద్రంలో వాటిని భద్రపర్చారు. ప్రస్తుతం తొలివిడతగా గుడ్ల నుంచి బయటకు వచ్చిన 123 తాబేళ్ల పిల్లలను సముద్ర బాట పట్టించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొని, తాబేళ్ల పిల్లలను సముద్రం వైపునకు విడిచిపెట్టారు. వైల్డ్ లైఫ్ ఏలూరు డివిజన్ డీఎఫ్ఓ త్రిమూర్తుల రెడ్డి, అటవీ రేంజర్ ఎస్వీకే కుమార్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి టి.నాగమణి, ఎఫ్బీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎ.కొండూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం అమలుపై ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ బుధవారం ఎ.కొండూరు మండలంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రమైన ఎ.కొండూరులోని పాత సినిమాహాలు వద్ద జరుగుతున్న సర్వే పనులను తహసీల్దార్ ఎన్.అరవింద్తో కలసి పరిశీలించారు. భూ సర్వే పక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వేలో ఉపయోగిస్తున్న పరికరాలను జేసీ పరిశీలించారు. సర్వే ద్వారా స్పష్టమైన రికార్డులు సిద్ధమవుతాయని, భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల్లో రూ. 89,17,515 నగదు రూపంలో వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరావు, బోగిరెడ్డిపల్లి శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్. అరుణ సమక్షంలో కానుకలు లెక్కించారు. డీసీ శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడుతూ మొత్తం 76 రోజులకు గాను రూ. 89,17,515నగదు, బంగారం 44.004 గ్రాములు, వెండి 1.686 కిలోలు, అమెరికా డాలర్లు 129, ఇంగ్లాండ్ కరెన్సీ 5, ఆస్ట్రేలియా కరెన్సీ 20 సమకూరినట్లు వివరించారు. లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.జి.కొండూరు: వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో క్రమక్రమంగా తాగునీటి సమస్య తలెత్తుతోంది. మోటార్లు, పైపులైన్ల మరమ్మతుల సమస్యతో తాగునీటి సరఫరాకి బ్రేక్పడి, గ్రామీణ ప్రాంతాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆపదలో ఆదుకోవాల్సిన చేతి పంపులు మరమ్మతులకు నోచుకోక మూలన పడుతున్నాయి. వేసవి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత లేకనే సమస్య ఉత్పన్నమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే కరువు సంభ విస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిది నెలలుగా తాగునీరు లేక.. జి.కొండూరు మండల పరిధిలో దుగ్గిరాలపాడు గ్రామానికి ఎనిమిది నెలలుగా కృష్ణా నీరు సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు నరకయాతన పడుతున్నా రు. గ్రామంలో 1200మంది వరకు జనాభా ఉండగా గ్రామంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటంతో వీరంతా కృష్ణావాటర్పైనే ఆధారపడ్డారు. దీంతో వీరు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న గంగినేని వెళ్లి ప్యూరిఫైడ్ వాటర్ని తెచ్చుకుంటున్నారు. వీలుకాని వాళ్లు ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. అదేవిధంగా గంగినేని, తెల్లదేవరపాడు, సున్నంపాడు, మునగపాడు, గడ్డమణుగు, చెర్వుమాధవరం గ్రామాలకు పైపులైన్ సమస్యతో నెలకు ఒకసారి చొప్పున కృష్ణా నీటిని విడుదల చేస్తున్నారు. భీమవరప్పాడు, చిన్ననందిగామ గ్రామాలకు కృష్ణావాటర్ పైపులైను లేక తాగునీరు అందుబాటులో లేక వాటర్ ప్లాంట్లకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు.. మా గ్రామానికి ఎనిమిది నెలలుగా కృష్ణావాటర్ రావడం లేదు. తాగేందుకు నీరులేక గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు. పైపులైన్లు లీకుల వల్ల నీళ్లు రావడంలేదని చెబుతున్నారు. ఎనిమిది నెలలుగా లీకులకు మరమ్మతులు చేయకపోవడం దుర్మార్గం. గ్రామస్తులంతా వాటర్ ప్లాంట్లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. – జడ రాంబాబు, సర్పంచ్, దుగ్గిరాలపాడు విజయవాడ నగరపాలక సంస్థలో ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లకు నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, డెప్యూటీ మేయర్ దంపతులతో పాటు కార్పొరేటర్లను సత్కరించారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. మేయర్ భాగ్యలక్ష్మి దంపతులను సత్కరిస్తున్న దృశ్యాన్ని చిత్రంలో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ 7ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశఎన్టీఆర్ జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ కింద తాగునీటి సరఫరా వివరాలు తాగునీటి సరఫరా హ్యాబిటేషన్లు 794 గ్రామాలు 321 జనాభా 9,87,854 కుటుంబాలు 2,67,574 ఇంటింటి కుళాయి కనెక్షన్లు 1,10,727 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు 19 ట్యాంకులు రక్షిత మంచినీటి పథకాలు 375 ట్యాంకులు మీడియం రక్షిత మంచినీటి పథకాలు 63 ట్యాంకులు డైరెక్ట్ పంపింగ్ స్కీములు 508 చేతి పంపులు 7,846 -
స్వామిత్వ సర్వేపై కలెక్టర్ పునఃపరిశీలన
పెడన: ఇంటి స్థలాలు, ఖాళీ స్థలాలకు సంబంధించి స్వామిత్వ సర్వే ప్రక్రియపై కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ బుధవారం పునఃపరిశీలన చేశారు. పెడన మండలంలోని పెనుమల్లి గ్రామ సచివాలయంలో స్వామిత్వ సర్వేకు సంబంధించి ఏర్పాటు చేసిన గ్రామ మ్యాపులు, రికార్డులను పరిశీలించడమే కాకుండా ల్యాప్టాప్లో వివరాలను పరిశీలించారు. కొన్ని విషయాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. అనంతరం సచివాలయానికి వెళ్లి పన్నుల వసూలు తీరును తనిఖీచేశారు. ఏ విధంగా వసూళ్లు చేస్తున్నది పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మీడియాతో మాట్లాడారు. స్వామిత్వ సర్వే ఎలా జరి గిందో పరిశీలించామన్నారు. కొన్ని అభ్యంతరాలు వచ్చాయని, వాటిని పరిష్కరించి సంబంధిత యాజమానులకు ప్రాపర్టీ కార్డులు అందజేస్తామన్నారు. రీసర్వేకు సంబంధించి ఆగ్రికల్చరల్ ల్యాండ్స్పై సర్వేను కూడా నందిగామలో పరిశీలించామని తెలిపారు. పెనుమల్లి గ్రామంలో తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని, చాలా మంది మోటర్లు ద్వారా మంచి నీటిని తోడేసుకుంటు న్నారని కలెక్టర్కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి తాగునీటిని తోడే మోటార్లను పంచాయతీ కార్యాలయానికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. సర్వే ఏడీ పి.లక్ష్మణరావు డీడీఓ జి.పద్మ, డీఎల్డీక్ష రాజావుల్లా, ఇన్చార్జి తహసీల్దారు కె.అనిల్కుమార్, ఎంపీడీఓ ఎ.అరుణ కుమారి, జెడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేష్, సర్పంచ్ గరికపాటి వెంకటరామానాయుడు, తదితరులు పాల్గొన్నారు. పెనుమల్లిలో పర్యటన సందర్భంగా తొమ్మిది నుంచి పదో తరగతిలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వేసవి సెలవుల్లో సబ్జెక్టులపై పట్టు సాధించాలని సూచించారు. ఎంఈఓ–1, 2 ఎన్.సలోమి, హరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
బీచ్ కబడ్డీ జాతీయ కమిషన్ చైర్మన్గా శ్రీకాంత్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తమ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బీచ్ కబడ్డీ జాతీయ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి.ప్రభావతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల వడోదరలో జరిగిన అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ) వార్షిక సర్వసభ్య సమావేశంలో కబడ్డీ అభివృద్ధికి శ్రీకాంత్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా బీచ్ కబడ్డీ జాతీయ కమిషన్ చైర్మన్గా నామినేట్ చేస్తూ ఏకేఎప్ఐ ప్రతినిధులు నియమకపత్రం అందజేశారని తెలిపారు. శ్రీకాంత్కు ఆంధప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కల అర్జునరావు, సంయుక్త కార్యదర్శి కె.వి.నాంచారయ్య, కోశాధికారి ఎం.సుబ్బరాజు తదితరులు అభినందనలు తెలిపారు. వేదాద్రి(జగ్గయ్యపేట): స్థానిక యోగానంద లక్ష్మీ నరసింహ స్వామికి భక్తులు హుండీల్లో సమ ర్పించిన కానుకల ద్వారా రూ.14.58 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ సురేష్బాబు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీ కానుకలు లెక్కించారు. మూడు నెలల 21 రోజులకు ఈ ఆదాయం వచ్చింది. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ పవన్కల్యాణ్, కేసీపీ ప్రతినిధి రాంప్రసాద్ పాల్గొన్నారు. ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు ఎన్ఆర్ఐ ఇంజినీరింగ్ కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించింది. ఈ మేరకు యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రావి వెంకట్రావు బుధవారం మాట్లాడారు. 2007లో ఎన్ఆర్ఐ ఫార్మసీ, 2008లో ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించగా, 2018లో అటానమస్ హోదా లభించిందన్నారు. ఇప్పటివరకు అనేకమంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా ప్రమాణాలందించి, అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు కల్పించామని వివరించారు. డీమ్డ్ యూనివర్సిటీ ఉత్తర్వులను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పెనమలూరు: గంగూరులో యూనియన్ పెట్రోల్ బంక్పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. బుధవారం రాత్రి ఉయ్యూరు మండలం పెదఓగిరాలకు చెందిన ముగ్గురు యువకులు యూనియన్ పెట్రోల్ బంక్కు బైక్పైవచ్చారు. పెట్రోల్ పోసిన తరువాత సొమ్ము చెల్లించే విషయంలో బంక్ సిబ్బందితో వివాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న ఆ ముగ్గురు సిబ్బందిపై దాడికి దిగి గాయపరిచారు. అంతటితో ఆగకుండా బంక్ ఫర్నిచర్, అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. అదే సమయంలో పెట్రోల్ పోయించుకోవటానికి వచ్చిన వాహనదారులు బెంబేలెత్తారు. కొద్ది సమయం యువకులు రెచ్చిపోయిన తరువాత తేరుకున్న బంక్ సిబ్బంది, స్థానికులు తిరగబడటంతో ఇద్దరు యువకులు పారిపోగా ఒక యువకుడు దొరికాడు. పోలీసులకు సమాచారం ఇవ్వ టంతో పోలీసులు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
వైభవంగా వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన బుధవారం అమ్మ వారికి తామర, గన్నేరు, సన్నజాజులు, ఎర్ర మందారాలు, మరువంతో విశేష పుష్పార్చన జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదిక నుంచి అమ్మవారికి సమర్పించే పుష్పాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో పాటు పూజలో పాల్గొనే ఉభయదాతలు, భక్తులు అమ్మవారికి సమర్పించే పుష్పాలతో ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను దర్శించుకున్నారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం నూతన పూజా మండపంలోఉత్సవ మూర్తి వద్ద ఆలయ అర్చకులు పుష్పా గంపలను అందించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ మధ్య పుష్పార్చన కనుల పండువగా జరి గింది. పూజ అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
భూ పంపిణీతో సకల సమస్యలకు పరిష్కారం
కృష్ణలంక(విజయవాడతూర్పు): సంపూర్ణ పేదరిక నిర్మూలన జరగాలంటే పేదలకు భూ పంపిణీ ఒక్కటే మార్గమని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు గుంటూరు బాపనయ్య వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బా రావు అధ్యక్షతన వలస కార్మికులకు రక్షణ చట్టం చేయాలని, 2005 ఉపాధి హామీ చట్టం అమలని కోరుతూ సెమినార్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు ఊదర కొడుతున్నా రని, ఎక్కడ, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేరళలో వామపక్షపాలనలో భూ సంస్కరణలు అమలు జరగడం వల్లే దేశంలోనే అక్షరాస్యత, పేదరిక నిర్మూలనలో ఆ రాష్ట్రం ముందుందని వివరించారు. వ్యవసాయ కార్మికులకు రక్షణ చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ అని గుర్తుచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేసిందని, ఫలితంగా వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2023–24లో కూలీలకు 25.54 కోట్ల పనిదినాలు కల్పించి రూ.2500 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చు చేసి కేవలం 18 కోట్ల పనిదినాలు కల్పించారని వివరించారు. గతంలో కుటుంబం సగటున 55 రోజులు పని చేస్తే ఇప్పుడు 42 రోజులకు పడిపోయిందన్నారు. రాష్ట్రంలో 200 మందికి పైగా వలస కార్మికులు ప్రమాదాల్లో చనిపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతికుటుంబానికి 200 రోజల ఉపాధి హామీ పని కల్పించాలని, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సెమినార్లో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి, వ్యవసాయ సంఘం రాష్ట్ర నాయకులు కోట కళ్యాణ్, అప్పారావు, పిల్లి రామకృష్ణ, రవి, ఆంజనేయులు, కోటేశ్వరి పాల్గొన్నారు. -
మద్యం అక్రమ కేసులో రిమాండ్ పొడిగింపు
విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో రిమాండ్ ముగిసిన ప్రతిసారీ సిట్ అధికారులు ఏ సెక్షన్ల ప్రకారం రిమాండ్ పొడిగింపు కోరుతున్నారో సంబంధిత రిపోర్టులో పేర్కొనకపోవడంపై న్యాయవాది యక్కంటి పుల్లారెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. మద్యం అక్రమ కేసులో నిందితుల రిమాండ్ బుధవారం ముగియడంతో రిమాండ్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి, రోణక్కుమార్ను ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇదే కేసులో బెయిల్పై ఉన్న ఎంపీ మిథున్రెడ్డి, చెరుకూరి వెంకటేష్నాయుడు, యద్దల నవీన్కృష్ణ గైర్హాజరు పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్పై ఉన్న మిగిలిన నిందితులు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ముప్పిడి అవినాష్రెడ్డి, పైలా దిలీప్, అనిల్ చోక్రా, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్రెడ్డి ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం న్యాయమూర్తి భాస్కరరావు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితులకు వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు. పోలీసు కస్టడీకి వాసుదేవరెడ్డి, ప్రణోయ్ప్రకాష్ మద్యం అక్రమ కేసులో గుంటూరు జైలులో రిమాండ్లో ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ప్రణోయ్ ప్రకాష్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం వారిద్దరికి తొలుత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించి విచారించారు. తిరువూరు: రబీ సీజన్లో ధాన్యం కొనుగోలులో రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలకియా సూచించారు. తిరువూరు వాహినీ కాలేజీలో రబీ ధాన్యం కొనుగోలుపై కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా రెవెన్యూ, వ్యవసాయ, సహకార, సచివాలయ, రైతుసేవా కేంద్రాల సిబ్బందికి బుధవారం శిక్షణ తరగతి నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రైతు సేవా కేంద్రాల్లో నిర్ణీత ప్రమాణాల ననుసరించి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారిణి వాణి, తిరువూరు ఆర్డీఓ కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలకు 305 మంది గైర్హాజరు
మచిలీపట్నం అర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని సమగ్ర శిక్ష అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా అబ్జర్వర్ డాక్టర్ ఎం.ఆర్. ప్రసన్న కుమార్ తెలిపారు. పరీక్షల పర్యవేక్షణలో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు జిల్లాలోని ఆరు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లా మానిటరింగ్ కోఆర్డినేటర్ తొమ్మిది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 42 కేంద్రాలను, ఏసీజీఈ కష్ణా, మచిలీపట్నం అధికారులు పది కేంద్రాలను సందర్శించారు. బుధవారం జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షకు 21,716 మంది విద్యార్థులకు 21,411 మంది పరీక్షకు హాజరవగా, 305 మంది గైర్హాజరయ్యారు. హాజరు 98.60 శాతంగా నమోదైంది. డీఈఓ యు.వి. సుబ్బారావు పామర్రు జెడ్పీ, అస్సీసి హై స్కూల్, ఉయ్యూరు జెడ్పీ, వీఆర్కేఎం, ఫ్లోరా హై స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఓపెన్ టెన్త్కు సంబంధించి సాంఘిక శాస్త్రం పరీక్షకు 590 మంది విద్యార్థులకు 414 మంది హాజరయ్యారు. 176 మంది గైర్హాజరయ్యారు. హాజరు 70.17 శాతంగా నమోదైంది. -
మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనాలి
● ఆకాల వర్షాలకు నష్టపోయినరైతులను ఆదుకోవాలి ● జేసీకి వినతి పత్రం అందజేసిన తన్నీరు నాగేశ్వరరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరి శివాజీ డిమాండ్ చేశారు. తక్షణం మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఇలక్కియాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 18వ తేదీన కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతిన్న రైతులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. దెబ్బతిన్న పంటల వివరాలను వెంటనే సేకరించాలన్నారు. నష్టపోయిన వరి, మామిడి, బొప్పాయి, అరటి రైతులను గుర్తించి నష్టపరిహారం అందజేయాలన్నారు. ఈ నెల 18వ తేదీ కురిసిన వర్షాలకు జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో మొక్కజొన్న, వరి, మామిడి, బొప్పాయి అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. వరిలో ధాన్యం రాలిపోయి వట్టి కంకులు మాత్రమే మిగిలాయన్నారు. పెనుగంచిప్రోలు మండలంలో గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు, అనిగండ్లపాడు గ్రామాలలో 800 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లిందన్నారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిందని, పొలంలో కోయని కాయలు రాలిపోయాయని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు శివరాత్రి పృథ్వీరాజ్, భైరబోయిన బాబు తదితరులు పాల్గొన్నారు. -
నున్నలో మామిడి కొనుగోళ్లు ప్రారంభం
విజయవాడరూరల్: ఆసియాలోనే పెద్ద మామిడి మార్కెట్గా గుర్తింపు పొందిన నున్నలో బుధవారం మామిడి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. బంగినపల్లి, తోతాపురి (కలెక్టర్), చెరుకు రసం కాయలు ఆరు టన్నులను నున్నకు చెందిన వెంకటరెడ్డి, ఆగిరిపల్లికి చెందిన సుమంత్, ఈదరకు చెందిన నారాయణ తీసుకొచ్చారు. రత్నావత్ కిషోర్ నాయక్ మామిడి కాయలను కొనుగోలు చేశారు. బంగినపల్లి మామిడికాయ రకం టన్ను ధర రూ.1.25 లక్షలు పలికిందని రైతులు తెలిపారు. ఈ సీజన్లో ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ఇప్పటి నుంచి దాదాపు మూడు నెలలు వ్యాపారం కొనసాగుతుంది. మామిడి కాయల వ్యాపారం ప్రారంభోత్సవానికి పలువురు వ్యాపారులతో పాటు మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని పూజలు నిర్వహించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని 2,800 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ స్కాలర్షిప్స్ అందజేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా ఈ స్కాలర్షిప్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మలబార్ రెస్ట్ ఆఫ్ ఇండియా రిటైర్ ఆపరేషన్స్ హెడ్ సిరాజ్ పీకే మాట్లాడుతూ.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లు విలువైన సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2,800 మందికి రూ.2.52 కోట్లను స్కాలర్షిప్ రూపంలో అందజేశామని వివరించారు. ఈ కార్యక్ర మంలో సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.పద్మజ, మలబార్ హైదరాబాద్ షరీజ్ కే, జోనల్ హెడ్ సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ నిశిల్ చంద్రన్, డెప్యూటీ హెడ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
4న విజయవాడలో ఏఐ సమ్మిట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో తొలిసారిగా ఏప్రిల్ నాలుగో తేదీన ఆర్టిఫిషియల్ ఇటెలిజెన్స్ (ఏఐ) సమ్మిట్ జరుగుతుందని ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్టీపీఐ సహకారంతో ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో ఆయన బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో వస్తున్న మార్పులు, పరిశ్రమల్లో ఎలా వినియోగిస్తున్నారు, ఉద్యోగ సాధన కోసం, ఐటీ ఇంజినీరింగ్ విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమ్మిట్ కోచైర్మన్ సురేష్ నర్రా, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఇంద్రజిత్ అన్నే మాట్లా డుతూ.. ఏఐ ట్రెండ్స్ను అందరికీ తెలపాలనే ఉద్దేశంతో సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. -
వ్యాధుల పర్యవేక్షణను సమర్థంగా నిర్వహించాలి
మచిలీపట్నంఅర్బన్: నైపుణ్యాలు పెంచుకుని వ్యాధుల పర్యవేక్షణను మరింత సమర్థంగా నిర్వహించాలని కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్ పి.యుగంధర్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్లో భాగంగా ఐహెచ్ఐపీ ఫీల్డ్ సర్వైలెన్స్పై గ్రామ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు సామర్థ్య వృద్ధి శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సంద ర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వ్యాధుల సమాచార సేకరణ, సమ యానికి నివేదికల సమర్పణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. సకాలంలో కచ్చితమైన సమాచారం అందితే వ్యాధుల నియంత్రణ చర్యలను వేగంగా చేపట్టొచ్చని సూచించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయకృష్ణ, జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ సాయి కిరణ్ శిక్షణ అందించారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కలిగే అనారోగ్య సమస్యలను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు, చికిత్స విధానాలపై వివరించారు. కృష్ణా డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ -
ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి మృతి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నరహరిశెట్టి శ్రీహరి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుదీర్ఘ కాలంగా న్యాయవాదిగా పని చేస్తున్న శ్రీహరి సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. నేషనల్ కాపు ఫెడరేషన్ పేరుతో కాపు ఉద్యమానికి అండగా నిలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ కార్యదర్శిగా పని చేశారు. వావిలాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో మద్య విమోచన ప్రచారానికి కృషి చేస్తూ ప్రత్యేకంగా మద్యానికి వ్యతిరేకంగా పత్రికను నిర్వహించారు. పాతబస్తీ అభివృద్ధి పోరాట సమితి పేరుతో ఈ ప్రాంత అభివృద్ధికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు న్యాయ వాదిగా సుదీర్ఘకాలం పని చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు నరహరిశెట్టి శ్రీహరి అంతిమయాత్ర జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురి నివాళి శ్రీహరి మరణ వార్త తెలియగానే ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి వన్టౌన్లోని ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా, కిలారు రోశయ్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (హైదరాబాద్) అధినేత ఉమారెడ్డి రమణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్, మహాదేవు అప్పాజీరావు, నరేంద్ర, కొనిజేటి రమేష్ నివాళులర్పించారు. -
గాజువాక ఆర్టీవో కార్యాలయానికి బాంబు బెదిరింపులు
అగనంపూడి/ చిలకలపూడి(మచిలీపట్నం): సీబీఐ కేసులో నిందితుడిని కేసు నుంచి బయటపడేయాలని లేదంటే, అగనంపూడిలోని గాజువాక ఆర్టీవో కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీవోకు మెయిల్ పంపారు. గాజువాక ఆర్టీవో జయప్రకాష్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. పోరా్టన్ మెయిల్ డాట్. కామ్ నుంచి సోమవారం మధ్యాహ్నం గాజువాక ఆర్టీవోకి మెయిల్ వచ్చింది. అందులో 15 గ్రానైట్ గ్యాస్ బాంబ్లతో కార్యాలయాన్ని పేల్చేస్తామని, వెంటనే సిబ్బంది ఖాళీ చేయాలని ఉండటంతో దువ్వాడ పోలీసులకు ఆర్టీవో ఫిర్యాదు చేశారు.సీఐ మల్లేశ్వరరావు నేతృత్వంలోని డాగ్స్కా్వడ్, సిబ్బంది కార్యాలయం ఆరుబయట, లోపల తనిఖీ చేశారు. ఎలాంటి బాంబులు బయటపడకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. సీబీఐ కేసులో నిందితుడుగా కేంద్ర మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై ఉన్న సీబీఐ కేసును ఉపసంహరించుకోవాలని లేదంటే కార్యాలయాన్ని పేల్చేస్తామని బెదిరించారని, ఈ–మెయిల్ ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు అలా చేశారో విచారణ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.కృష్ణాజిల్లా కోర్టుకు ‘గ్యాస్’ బాంబు బెదిరింపు ‘జిల్లా కోర్టులో గ్యాస్ బాంబు పెట్టాం. తమిళనాడు రాజకీయ నాయకుడు బాలాజీపై పెట్టిన సీబీఐ కేసును ఉపసంహరించుకోవాలి. లేకపోతే కోర్టును పేల్చి వేస్తాం..’ అంటూ కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి అధికారిక మెయిల్కు వచ్చిన ఒక మెసేజ్ కలకలం రేపింది. మెసేజ్ సమాచారాన్ని సోమవారం ఉదయం కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపీ.. ఎస్పీ విద్యాసాగర్నాయుడుకు తెలియజేయటంతో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను అప్రమత్తం చేశారు. దీంతో అందరూ భయాందోళనతో కోర్టు ప్రాంగణంలోకి వెళ్లకుండా వెలుపలే ఉండిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు బాంబు స్క్వాడ్ బృందం న్యాయమూర్తుల చాంబర్లుసహా మచిలీపట్నంలోని కోర్టు ప్రాంగణం, పరిసరాల్లో దాదాపు ఐదు గంటల పాటు అణువణువూ జల్లెడపట్టింది. ఫేక్ మెసేజ్ అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
‘దీన్ని తన్ని స్టేషన్లో వేయండి’
పామర్రు: తన తండ్రిని పోలీసులు ఎందుకు స్టేషన్కు పిలిపించారో తెలుసుకుందామని వెళ్లిన ఓ దళిత యువతి పట్ల అకారణంగా దుర్భాషలాడటమే కాక.. బూటుకాళ్లతో తన్నుతూ.. జుట్టు పట్టుకుని లాగుతూ చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్పృహ కోల్పోయిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణాజిల్లా పామర్రు మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జుఝవరపు చిన్ని అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి కుమారుడు తేజ, కుమార్తె సుప్రియ ఉన్నారు. తేజ తండ్రితో పాటు పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో చెట్లు నరికే పనులకు వెళ్తుంటాడు.కుమార్తె సుప్రియ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. మూణ్ణెళ్ల క్రితం గ్రామంలో ఓ చోట చెట్ల పొదల్లో కలి్టవేటర్ ఎంతోకాలంగా ఉందని గమనించిన తేజ, దాన్ని ఓ పాత ఇనుప సామాన్ల వ్యాపారికి రూ.3 వేలకు విక్రయించాడు. కొద్దిరోజుల తర్వాత ఓ వ్యక్తి వచ్చి కలి్టవేటర్ తనదని చెప్పడంతో తేజను తండ్రి మందలించి ఆ వ్యాపారికి రూ.3 వేలు చెల్లించి దానిని సంబంధిత వ్యక్తికి అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో.. శనివారం ఉదయం పామర్రు పోలీస్స్టేషన్ నుంచి జుఝవరపు చిన్నికి పోలీసులు ఫోన్ చేసి స్టేషన్కు రావాలని చెప్పారు. పనులు ముగించుకుని చిన్ని సాయంత్రం స్టేషన్లో సీఐ సుభాకర్ వద్దకు వెళ్లాడు. సీఐ దుర్భాషలాడుతూ.. పసుమర్రులో ఓ రైతు గడ్డర్ పోయిందని.. దానిని తీశారా అంటూ ప్రశి్నంచారు. తమకు తెలీదని చిన్ని బదులిచ్చాడు. ఎవర్రా ఇది.. ఎక్కువ మాట్లాడుతోంది.. అదే సమయంలో విజయవాడ నుంచి వచ్చిన సుప్రియ.. తన తండ్రిని పోలీసులు పిలిపించారని తెలుసుకుని భయంతో సీఐ వద్దకు వెళ్లింది. పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడే ఉన్న తేజను ‘ఏరా నువ్వు దొంగతనాలేనా.. మానభంగాలు కూడా చేస్తున్నావా?’ అంటూ పామర్రు ఎస్ఐ ప్రశి్నంచారు. ‘సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి. మేం చదువుకున్నాం.మాకూ రూల్స్ తెలుసు’ అని సుప్రియ అనడంతో ఎస్ఐ కోపంతో.. ‘ఎవ్వర్రా ఇది? ఎక్కువగా మాట్లాడుతోంది. దీన్ని తన్ని స్టేషన్లో వేయండి’ అంటూ పోలీసులను ఆదేశించారు. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా హోంగార్డు సుప్రియను డాబాపై నుంచి బూటుకాళ్లతో తన్నుకుంటూ, జుట్టు పట్టుకుని లాక్కుంటూ కిందకు తీసుకొచ్చారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇది చూసి బాలిక తండ్రి చిన్ని 108కు ఫోన్చేయగా వారు వచ్చి రక్తపు గాయాలు లేనందున తాము ఆస్పత్రికి తీసుకెళ్లబోమని చెప్పి వెళ్లిపోయారు. ఇక చేసేదిలేక చిన్ని తన కుమార్తెను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. దీనిపై సీఐ సుభాకర్ను వివరణ కోరగా.. పోలీస్స్టేషన్లోని హోంగార్డునే ఆ యువతి కొట్టి గాయపర్చిందని, అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయని బదులిచ్చారు. ఆమెపైన కేసు నమోదు చేశామన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో పండ్ల వ్యాపారి ఆత్మహత్య
గన్నవరం: ఆర్థిక ఇబ్బందులు, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీసుల వేధింపులను తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గన్నవరంలోని గాజులపేటలో నివసించే పడమట నాగరాజు దావాజిగూడెం రోడ్డులో పండ్ల దుకాణం నడుపుతున్నాడు. ఐదేళ్ల క్రితం సమీప బంధువు ఓ ఫైనాన్స్ సంస్థలో తీసుకున్న రుణానికి నాగరాజు ష్యూరిటీ సంతాకం చేశాడు. ఆ బంధువు రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు అప్పు చెల్లించాలని నాగరాజును వేధిస్తున్నారు. అంతే కాకుండా తాడేపల్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి నాగరాజు ద్వారా ఓ బుకి వద్ద క్రికెట్ బెట్టింగ్లు వేసి రూ.5 లక్షలు నష్టపోయారు. ఈ వ్యవహారం పోలీస్స్టేషన్కు చేరడంతో ఆ రూ.5 లక్షలకు నాగరాజును బాధ్యుడిని చేసి తిరిగి చెల్లించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ఈ విషయమై నాగరాజును స్టేషన్కు పిలిపించి గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన నాగరాజు గుంటూరు సమీపంలోని పొలాల్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అతనిని గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు. ఫైనాన్స్ సంస్థతో పాటు పోలీసులు వేధింపుల కారణంగానే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థికి కన్నీటి వీడ్కోలు
ఉయ్యూరు: తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ఏటిపాక మండలం పురుషోత్తపట్నం సమీపంలో కూనవరం వద్ద గోదావరి పాయలో స్నానానికి దిగి మృత్యువాత పడిన ఐదుగురిలో ఉయ్యూరుకు చెందిన తేజజ్ఞసాయి (20) మృతదేహం శనివారం లభించింది. భద్రాచలం రాముడి దర్శనానికి వెళ్లొస్తూ శుక్రవారం గోదావరి నదిలో విద్యార్థులు గల్లంతైన విషయం విదితమే.. నలుగురి మృతదేహాలు శుక్రవారమే లభించాయి. తేజజ్ఞసాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తాడిగడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తేజజ్ఞసాయి తండ్రి సౌతాఫ్రికా నుంచి వచ్చేందుకు సమయం పట్టే అవ కాశం ఉండటంతో భౌతికకాయాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తా నని చెప్పి విగతజీవిగా కళ్లముందున్న తమ బిడ్డను చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మరో ఇంజినీరింగ్ విద్యార్థి దగ్గుబాటి నవదీప్ (19) మృతదేహానికి స్వగ్రామమైన కనుమూరులో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి నవదీప్ మృతదేహం కుక్కనూరు వద్ద లభ్యంకాగా అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కనుమూరుకు తరలించారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నవదీప్ భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటి పర్యంతం అయ్యారు. కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సహచర విద్యార్థులు గ్రామానికి చేరుకుని నవదీప్ భౌతికకాయానికి నివాళులర్పించారు. తమ స్నేహితుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక బోరున విలపించారు. అశ్రునయనాల నడుమ నవదీప్ భౌతికకాయాన్ని ఊరేగించి అంత్యక్రియలు జరిపించారు. ఇరువురి బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ పరామర్శించారు.


