breaking news
Krishna
-
సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు వేసిన పిటిషన్లోనే హెబియస్ కార్పస్ అంశం పెట్టారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు విజయలక్ష్మితో సంతకం పెట్టించారు అడ్వకేట్.హెబియస్ కార్పస్ పిటిషన్పై సాయికృష్ణ పిన్ని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. పిటిషనర్కు తెలియకుండా హెబియస్ పిటిషన్ ఏ విధంగా వెనక్కి తీసుకుంటారంటూ అడ్వకేట్ కనకదుర్గ ప్రశ్నించారు. పిటిషనర్కు తెలియకుండా సంతకం తీసుకున్నారని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్కు తెలియకుండా హెబియస్ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ ఎలా ఫైల్ చేస్తారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.పిటిషన్ ఫైల్ చేసిన అడ్వకేట్కి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. న్యాయవాది లైసెన్స్ రద్దుకు బార్ కౌన్సిల్కు రిఫర్ చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు. విచారణను రేపటి(గురువారం)కి కోర్టు వాయిదా వేసింది. -
కూటమి సర్కార్కు బిగ్ షాక్.. టాటా పవర్ గుడ్బై!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రం నుంచి టాటా పవర్ భారీ పెట్టుబడి ప్రాజెక్టు ఒడిశాకు తరలిపోతున్నట్టు ఎకనామిక్ టైమ్స్లో కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రానికి రావాల్సిన రూ.6,675 కోట్ల పెట్టుబడి చేజారిపోవడం పారిశ్రామిక విధానాల్లో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించింది.నెల్లూరులో ఏర్పాటు చేయాల్సిన టాటా పవర్ ఇంగాట్-వేఫర్ యూనిట్ (10 గిగావాట్ల సామర్థ్యం) కోసం గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఒడిశాకు తరలిపోతున్నట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. అలాగే, పెట్టుబడులు తీసుకురావడంలో గొప్పలు చెప్పుకున్న కూటమి ప్రభుత్వం.. ఇలా వచ్చిన పెట్టుబడులను నిలబెట్టుకోవడంలో విఫలమైందని మండిపడింది.గతంలో టాటా పవర్ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత టీడీపీదే అంటూ పచ్చ పార్టీ నేతలు ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడు అదే ప్రాజెక్టు ఇతర రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరుస్తామని చెప్పిన ప్రభుత్వం, వాస్తవంగా ఉన్న పరిశ్రమలను నిలబెట్టడంలో విఫలమవుతోందని విమర్శించింది.ఏపీ కంటే ఒడిశా పారిశ్రామిక విధానాలు మెరుగ్గా ఉండటంతో కంపెనీలు అక్కడికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యలు చేసింది. పారిశ్రామిక విధానాల్లో ఏపీ కంటే ఇతర రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో రాష్ట్ర స్థానం దిగజారడం పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించింది. అయితే, ప్రాజెక్టు మార్పునకు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
దగా డీఎస్సీపై
బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026చిలకలపూడి(మచిలీపట్నం): విద్యారంగ, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై విద్యార్థులు, యువజనులు కదం తొక్కారు. నీట్ అవకతవకలపై ఢిల్లీలో జెన్ జీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఆందోళనల తరహాలో మచి లీపట్నం నగరాన్ని నిరసనలతో హోరెత్తించారు. వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వ ర్యంలో మంగళవారం భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత లక్ష్మీటాకీస్ సెంటర్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్కు చేరుకున్నారు. యువత, విద్యార్థులు ప్లకార్డులు చేబూని దగా డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలతో హోరెత్తించారు. నిిస్సిగ్గుగా టీచర్ పోస్టులను అమ్ముకున్నారు రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో నిస్సిగ్గుగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీచర్ పోస్టులను అమ్ముకున్నారని మాజీ మంత్రి, వైఎ స్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ధర్నా చౌక్ వద్ద ఆయన మాట్లాడారు. దగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాలు, ఆధారాలు చూపిస్తే సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు. డీఎస్సీపై చర్చకు రావాలని లోకేష్ విసిరిన సవాల్కు ఆయన అమ్మమ్మ లక్ష్మీ పార్వతి స్పందించి వస్తే పారిపోయారని విమర్శించారు. తాను చర్చకు వస్తానన్నా ఇంత వరకు సమాధానం చెప్పలేదని పేర్కొ న్నారు. నీట్ పేపరు లీకేజీపై ఢిల్లీ లోని జంతర్మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై నీతి, నిజాయితీ ఉంటే నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగాన్ని పార దోలుతామని యువతకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు సందుసందులో పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్ పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) విమర్శించారు. సంక్రాంతి కోడిపందేలు, జూదాలు నిర్వహించటమే జాబ్క్యాలెండర్గా భావించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో సచివాలయాలు ఏర్పాటు చేసి 1.50 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఒక్క ఆరోపణ కూడా రాలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే డీఎస్సీలో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామన్నారు. చదువుతోనే పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఎటువంటి బకా యిలు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారని వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము తెలిపారు. నాడు – నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్ని సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఇంత వరకు విద్యార్థులు, యువత కోసం ఒక్క పథకమైనా ప్రవేశపెట్టారా అని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవభక్తుని చక్రవర్తి ప్రశ్నించారు. ప్రతి విద్యార్థీ ఉన్నత చదువులను అభ్యసించాలని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి మహానుభావుడని పేర్కొన్నారు. లక్షల మంది విద్యార్థులకు మేలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారని వివరించారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక జోమాటా, ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్లుగా మారుతున్నా రని వైఎస్సార్ సీపీ స్టూడెంట్ విభాగం జిల్లా అధ్యక్షుడు చైతన్య పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు మేలు చేయా ల్సింది పోయి తమ మందీ మార్బలం, కాంట్రాక్టర్లను కూటమి పాలకులు బాగు చేస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నా మని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని పేర్కొన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని, ఇప్పటి దగా డీఎస్సీలో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మేరుగుమాల కాళేశ్వరరావు అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని అన్నారు. -
తాగునీటి సరఫరాపై అప్రమత్తత అవసరం
చిలకలపూడి (మచిలీపట్నం): రగామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, పంచా యతీరాజ్శాఖ అధికారులతో ఆయన మంగళ వారం సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. కాలువల ద్వారా వచ్చే నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రాంతాల్లో మోటార్లు, పంపులు, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తాగునీటి సరఫరా విషయంలో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. నిధుల కొరత కారణంగా ఎక్కడా పనులు నిలిచిపోకుండా అవసరమైతే పంచా యతీ నిధులను వెచ్చించి పూర్తి చేయాలన్నారు. సీఎస్ఆర్, ఇతర అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్సీ సోమశేఖర్, ఈఈ నటరాజ్, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీపీఓ ఎం.ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఉపకారంలో కోతలు .. విద్యార్థుల వెతలు
బీసీ విద్యార్థులకు మొండిచేయి చదువులపై ఆర్థిక భారం బీసీ విద్యార్థులకు : రూ.27.68 కోట్లు ముస్లిం మైనార్టీలకు : రూ.5.32 కోట్లు క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు : రూ.0.76 కోట్లు ఈబీసీ విద్యార్థులకు : రూ.4.47 కోట్లు కాపు విద్యార్థులకు : రూ.1.34 కోట్లు ఎస్టీ విద్యార్థులకు : రూ.0.77 కోట్లు -
బదిలీల్లో ఆన్ డ్యూటీ
మచిలీపట్నంఅర్బన్: చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు జూనియర్, డిగ్రీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాక ముందే జూనియర్ కళాశాలల్లో బోధిస్తున్న లెక్చరర్లకు ఉద్యోగోన్నతులు కల్పించి డిగ్రీ లెక్చరర్లుగా పోస్టింగ్లు ఇచ్చింది. వారంతా 15 రోజుల్లోగా బదిలీ అయిన స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభమై తరగతులు కొనసాగుతున్న సమయంలో అధ్యాపకులను డిగ్రీ కళాశాలలకు తరలించడంతో జూనియర్ కళాశాలల్లో బోధన దెబ్బతింటోందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయా లెక్చరర్లు అందరినీ తిరిగి పాత స్థానాలకు వచ్చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 75 మందికి బదిలీలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లుగా జోన్–2కు చెందిన 75 మంది జూనియర్ లెక్చరర్లు ఉద్యోగోన్నతి పొందారు. రాష్ట్రంలోని నాలుగు జోన్లలో జోన్–4 తర్వాత అత్యధికంగా జోన్–2లోనే ఉద్యోగోన్నతులు కల్పించారు. జోన్–2 పరిధిలోని ఉమ్మడి కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 75 మంది అధ్యాపకులు డిగ్రీ కళాశాలలకు బదిలీ అయ్యారు. ఫలితంగా ఇంటర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఏర్పడింది. సబ్జెక్టుల వారీగా చూస్తే కామర్స్లో 11 మంది, తెలుగు 9, ఎకనామిక్స్ 8, ఇంగ్లిష్ 8, ఫిజిక్స్ 7, పొలిటికల్ సైన్స్ 6, జువాలజీ 5, కెమిస్ట్రీ 5, హిస్టరీ 5, హిందీ 4, బోటనీ 3, లైబ్రేరియన్లు 3, మ్యాథమెటిక్స్లో ఒకరు ఉద్యోగోన్నతి పొందారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, తమిళం, ఫిజికల్ డైరెక్టర్ విభాగాల్లో ఒక్కరికి కూడా ప్రమోషన్ దక్కలేదు. ఈ బదిలీలతో ప్రధాన సబ్జెక్టుల్లో అధ్యాపకుల కొరత మరింత పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. భిన్న ఉత్తర్వులతో గందరగోళం తొలుత జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు కల్పించి అక్కడ విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం మరో ఉత్తర్వు జారీచేసి, ఉద్యోగోన్నతి పొందిన వారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాము పని చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ‘ఆన్ డ్యూటీ’ ప్రాతిపదికన విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు వారిని రిలీవ్ చేసి జూనియర్ కళాశాలలకు పంపాలని, అక్కడి ప్రిన్సిపాళ్లు హాజరు ధ్రువీకరణ పత్రాలు పంపగా, వేతనాలు మాత్రం డిగ్రీ కళాశాలల నుంచే చెల్లించాలని ఆదేశించింది. కొద్ది రోజుల వ్యవధిలోనే పరస్పర భిన్నమైన ఉత్తర్వులు రావడంతో అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. బోధనపై ప్రతికూల ప్రభావం ముందుగా జూనియర్ కళాశాలల్లో ఏర్పడే అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అనంతరమే ఉద్యోగోన్నతులు కల్పిస్తే సమస్య ఉండేది కాదు. అలాకాకుండా డిగ్రీ కాలేజీలకు అధ్యాపకులను బదిలీచేసింది. జూనియర్ కళాశాలల్లో ఖాళీలు ఏర్పడి బోధన దెబ్బతింటుందని గుర్తించి పాత స్థానాల్లో విధులు నిర్వహించాలని వారికి సూచించింది. భవిష్యత్తులో వారిని తిరిగి డిగ్రీ కళాశాలలకు పంపితే, ఇంటర్ విద్యార్థుల పరి స్థితి ఏమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లోనూ ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. అక్కడ అధ్యాపకుల కొరతను ఎలా భర్తీ చేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పష్టత ఇవ్వాల్సిందే.. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తికాకముందే ఇంటర్ కళాశాలల నుంచి అధ్యాపకులను తరలించడం, అనంతరం మళ్లీ జూనియర్ కళాశాలల్లోనే బోధించా లని ఆదేశించడం ప్రభుత్వ నిర్ణయాల్లో స్థిరత్వం లోపించిందనే విమర్శలకు కారణమైంది. ఒకవైపు జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఏర్పడిన అధ్యాపకుల కొరతను భర్తీ చేసే చర్యలు చేపట్టకుండా, ఉన్న అధ్యాపకులనే అటూ ఇటూ తిప్పడం వల్ల సమస్య మరింత జటిలమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగోన్నతులు, పోస్టింగ్లు, బోధనా బాధ్యతలపై స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని విద్యార్థులు, తల్లి దండ్రులు, అధ్యాపక సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
12 నుంచి హెల్త్ వర్సిటీ కల్చరల్ మీట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యతో పాటు సృజనాత్మకత, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తొలిసారిగా ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్ నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. కల్చరల్ మీట్ పోస్టర్ను యూనివర్సిటీలో మంగళవారం ఆవిష్కరించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కల్చరల్ మీట్ను ఆగస్టు 12 నుంచి 14 వరకూ మంగళగిరిలోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీ అనుబంధ వైద్య, దంత వైద్య కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధ, ఎన్ఆర్ఐ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన మాతాశిశు మరణాలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాత ప్రభుత్వాస్పత్రిలోని సెమినార్ హాలులో జరిగిన ఈ సమీక్షలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణ్బాబు, జీజీహెచ్ పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పి.అనీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి.కొండూరు, ఎ.కొండూరు, చంద్రాల, ఉట్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు, సింగ్నగర్ యూపీహెచ్సీలో జరిగిన నవజాత శిశు మరణాలపై చర్చించారు. జీజీహెచ్ పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.సౌజన్య, డాక్టర్ మొబిన్ అహ్మద్, సీహెచ్ గంగాదేవి, ఎం.సబిత తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): తమకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం మరోసారి ఆందోళనకు దిగారు. రెండు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి క్యాజువాలిటీ బ్లాక్ ఎదుట బైఠాయించారు. జీతాలు ఇచ్చేంత వరకూ పని బంద్ చేసి ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పలువురు కార్మకులు మాట్లాడుతూ.. ఇంటి అద్దెలు, పిల్లలకు ఫీజులకు అప్పులు చేసి, వడ్డీలు సైతం కట్టలేని స్థితిలో ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కాంట్రాక్టర్ వచ్చిన తొమ్మిది నెలల్లో ఏ ఒక్క నెలలోనూ కచ్చితంగా జీతాలు వేసిన దాఖలా లేదన్నారు. ఆరు నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ పలు దఫాలుగా చర్చలు జరిపినా కాంట్రాక్టు సంస్థ స్పందించలేదన్నారు. సీఐటీయూ తూర్పు కృష్ణ కార్యదర్శి పి.కృష్ణ, నగర కమిటీ సభ్యుడు కోటబాబు, యూనియన్ నాయకులు తిరపతమ్మ, భాస్కరమ్మ, అఖిత, పద్మ పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రికి హరిత శోభ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘వరి కంకుల మధ్య మా దుర్గమ్మా.. నిను చూచిన కనులదే భాగ్యం కదమ్మా..’ అంటూ భక్తులు పులకించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు అంగరంగ వైభ వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంలో మూలవిరాట్కు వరి కంకులనే ఆభరణాలుగా తీర్చిదిద్దారు. ముగ్ధ మనోహరమైన అమ్మవారి రూపాన్ని చూసిన భక్తులు మైమరిచారు. తెల్లవారు జాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి శాకంబరీగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కరివేపాకు తోటగా మలిచిన తీరు అందరికీ ముగ్ధులను చేసింది. మరో వైపు ఆషాఢ మాసోత్సవం నేపథ్యంలో అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మహా నివేదన అనంతరం రద్దీ అంతకంతకు పెరుగుతూ ఉండటంతో అన్ని క్యూలైన్లలోనూ భక్తులను ఉచి తంగా అనుమతించారు. రూ.500 టికెట్ల విక్రయా లను నిలిపివేసిన దేవస్థాన అధికారులు బంగారు వాకిలి ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, సాయంత్రం ఆరు నుంచి రాత్రి 9.30 గంటల వరకు భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఆకట్టుకున్న ప్రధాన ఆలయ అలంకరణ శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మ వారి ప్రధాన ఆలయానికి చేసిన కూరగాయల అలంకరణ భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. కరివేపాకు, వంకాయలు, దొండ, బెండ, కాకర, టమాట, క్యారెట్, క్యాప్సికమ్లతో ఆలయ ప్రాంగణాన్ని హరిత వనంగా తీర్చిదిద్దారు. ఇక ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఆకుకూరలు, కాయ గూరలతో విశేషంగా అలంకరించారు. వేద విద్యార్థులకు దివ్య దర్శనం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న వేద పాఠశాల విద్యార్థులకు ఇకపై అమ్మవారి దివ్య దర్శనం కలగనుంది. ఈ మేరకు మంగళవారం పోరంకి వేద పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా దర్శనం కల్పించారు. ఈ నూతన పాలసీకి ఆలయ ఈఓ శీనానాయక్ సోమ వారం ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి పండుగ దినాలు, పౌర్ణమి, అమావాస్య వంటి విశేష రోజుల్లో అమ్మవారి దర్శనం కల్పించడం చాలా ఆనందంగా ఉందని వేద విద్యార్థులు పేర్కొన్నారు. నేడు పూర్ణాహుతి సోమవారం ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు బుధవారం ముగియనున్నాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సప్తశతీ పారాయణం, మహా విద్యా పారాయణం, హోమాలు, శాంతి పౌష్టిక హోమాలు, మంటప పూజలను నిర్వహిస్తారు. అనంతరం 9.30 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఉదయం 5.55 గంటలకు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. అమ్మవారి ఆలయ ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే గిరిప్రదక్షిణ కుమ్మరి పాలెం, విద్యాధరపురం, సితార, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. -
జూనియర్ అధ్యాపకులు తిరిగొచ్చారు
జిల్లాలో మొత్తం ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్లో 1,271 మంది, సెకండ్ ఇయర్లో 1,731 మంది చొప్పున 3,002 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి కృష్ణా నుంచి 22 మంది జూనియర్ లెక్చరర్లు డిగ్రీ కళాశాలల లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు ఈ నెల 12వ తేదీన కొత్త విధుల్లో చేరారు. అయితే ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వారు ఒక సంవత్సరం పాటు తిరిగి జూనియర్ కళాశాలల్లోనే ‘ఆన్ డ్యూటీ’ ప్రాతిపదికన బోధనా బాధ్యతలు నిర్వహిస్తారు. బదిలపై వెళ్లిన వారు ఇప్పటికే పాత స్థానాలకు వచ్చి యథావిధిగా పాఠాలు బోధిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల బోధనకు ఎలాంటి అంతరాయం లేదు. – కె.సరళ కుమారి, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి -
పోలవరం కాలువ ద్వారా సాగునీటిని పునరుద్ధ్దరించాలి
గన్నవరం: నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఖరీఫ్ పంటలు ఎండిపోయి, రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో పోలవరం కాలువ నుంచి విద్యుత్ మోటర్ల ద్వారా సాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబునాయుడును మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ కోరారు. ఈ మేరకు సీఎంకు నియోజకవర్గానికి చెందిన 500 మంది రైతుల సంతకాలతో కూడిన లేఖను ఆయన రాశారు. నియోజకవర్గంలోని సుమారు 30కు పైగా గ్రామాల ప్రజలు సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం పోలవరం కాలువపై ఆధారపడ్డారని చెప్పారు. పోలవరం కాలువ అందుబాటులోకి రాకముందు వర్షపాతం, భూగర్భజలాలపై ఆధారపడిన రైతాంగం తీవ్ర నీటి ఎద్దడిని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పోలవరం కుడి కాలువ నిర్మాణం కోసం ఇక్కడి రైతులు నీటి సౌకర్యం కల్పిస్తారనే నమ్మకంతో తమ సారవంతమైన భూములను ప్రభుత్వానికి అప్పగించారని గుర్తుచేశారు. 2015లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడి భౌగోళిక సమస్యను వివరించగా, మెట్ట భూములకు నీటిని లిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీంతో గత 12 ఏళ్లుగా పోలవరం కాలువ నుంచి మోటర్ల ద్వారా గోదావరి జలాలను తోడుకుని తమ పొలాలకు, చెరువులకు మళ్లించుకుంటున్నారని తెలిపారు. ఈ విధానం జలవనరులు, రెవెన్యూ, విద్యుత్ శాఖల పర్యవేక్షణ, సమ్మతితోనే కొనసాగుతోందన్నారు. ఈ వ్యవస్థపై నమ్మకంతోనే చాలా మంది రైతులు బ్యాంక్ రుణాలు, ప్రైవేట్ అప్పుచేసి మరీ ఈ ఏడాది ఖరీఫ్ సాగును ప్రారంభించారని, అయితే హఠాత్తుగా ఇప్పుడు విద్యుత్ కనెక్షన్లు తొలగించి మోటర్ల ద్వారా నీటి సరఫరా నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. కరెంట్ సరఫరాను నిలిపివేసే ముందు రైతులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, కనీసం వారి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితిని, జీవనోపాధిని దెబ్బతీసే ఇలాంటి కఠిన నిర్ణయాన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండా అమలు చేయడం సరికాదన్నారు. రైతులు పొలం దుక్కులు, నారుమడులు, నాట్లు వేసేందుకు భారీగా ఖర్చుపెట్టారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి డెల్టా ఆయకట్టు నీటి అవసరాలకు భంగం కలగకుండా మెట్ట ప్రాంత రైతులకు సాగునీటి సరఫరాకు విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని కోరారు. పోలవరం కాలువ ద్వారా ఎగువ భూములకు నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా శాశ్వత విధానాన్ని రూపొందించాలని ఆ లేఖలో సీఎంను కోరారు. -
బస్సు ఢీకొని కార్మికుడు మృతి
కంకిపాడు: బస్సు ఢీకొని కార్మికుడు మృతి చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్ఐ కేవై దాసు తెలిపిన కథనం మేరకు...కంకిపాడు పట్టణంలోని పద్మావతి నగర్లో నివాసం ఉంటున్న గుడివాడ విష్ణువర్థన్రావు (62) పట్టణంలోని పొగాకు కొట్టులో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు స్థానికంగా ఉన్న అపార్టుమెంట్ వద్ద నిలబడ్డాడు. రవీంద్ర భారతి పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా బస్సును వెనక్కి రివర్స్ చేయటంతో విష్ణువర్థన్రావును బస్సు ఢీకొని కిందపడ్డాడు. అతని తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వైద్యం నిమిత్తం పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే విష్ణువర్థన్రావు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ దాసు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని రమేష్ ఆసుపత్రి రోడ్డులో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల 10వ స్నాతకోత్సవం కళాశాల ఆవరణలోని కృష్ణవేణి సభాగర్ ఆడిటోరియంలో బుధవారం జరుగనుంది. పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ సంస్థ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ సి.మాండే ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ డాక్టర్ ఆమోఘ్కుమార్ గుప్తాతో పాటుగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల విజయవాడ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తారు. 2026వ విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన 262 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. -
మెగా డీఎస్సీ అక్రమాలపై హైకోర్టులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి పిల్
విజయవాడ: మెగా డీఎస్సీ అక్రమాలపై ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి పిల్ దాఖలు చేశారు. డీఎస్సీ-2025 నియామకాలపై సీబీఐ దర్యాప్తు కోరారు. మెగా డీఎస్సీ మొత్తం నియామక ప్రక్రియపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని పిటిషన్ వేశారు. పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటా అక్రమాలు, మెరిట్ జాబితాలపై సంచలన ఆరోపణలు చేశారు. డీఎస్సీకి సంబంధించిన అన్ని డిజిటల్ రికార్డులు, సర్వర్లు, ఫైళ్లను భద్రపరచాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాలపై సమగ్ర విచారణ జరిపి అక్రమ నియామకాలు రద్దు చేయాలని కోరారు. లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్టికల్స్ 14, 16 ఉల్లంఘన జరిగిందని ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
నారా లోకేష్కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణాజిల్లా: డిఫాక్టో సీఎం లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు కట్టిపెట్టాలంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే చర్చకురండని సవాల్ చేయడం కాదు.. చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్ వస్తారు. లోకేష్ చర్చకు వస్తే నేనే వస్తా’’ అంటూ ఆయన సవాల్ విసిరారు.‘‘విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెడతాడు. కంపెనీలు తెచ్చా, ఉద్యోగాలు కల్పించా అంటాడు. రెడ్ బుక్ రుచి చూశారా అంటాడు. చీమ చిటుక్కుమన్నా తనవల్లే అంటాడు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించడానికి వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడాడు. లోకేష్ మాటలు కోటలు దాటుతాయి. దేనికైనా సమవుజ్జీ కావాలి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచావ్. నీకు సత్తా ఉంటే డీఎస్సీ అక్రమాల పై నాతో చర్చకు రా. నీ వెంట తిరిగిన కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘పవిత్రమైన టీచర్ ఉద్యోగాల్లో పాపాలు చేశారు. ఈ డీఎస్సీ దిక్కుమాలిన డీఎస్సీ. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అన్ని పాత్రలు మీరే పోషిస్తారు. జిల్లా కలెక్టరేట్లలో ఎందుకు మెరిట్ లిస్ట్లు పెట్టలేకపోయారు. గోల్డ్ మెడల్ కొట్టినోడికి కాకుండా పాల్గొన్నవారికి పోస్టులు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్పై కోర్టు విచారణ చేయమని చెప్పింది. దమ్ముంటే విచారణ జరిపించండి. మీలో నిజాయితీ ఉంటే రాజీనామా చేయండి. మంత్రి పదవి కోసం బోండా ఉమా ముచ్చట పడుతున్నారు కదా. మీరు రాజీనామా చేసి ఇవ్వండి ఆయనకు మంత్రి పదవి’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
ఏం జరిగిందో..? విషం తాగి దంపతుల బలవన్మరణం
విజయవాడ: చూడ ముచ్చటైన జంట.. అనురాగం.. ప్రేమ, ఆప్యాయతలతో సంతోషంగా సాగుతున్న సంసారం.. ఏడేళ్ల ఆ బంధానికి ఇద్దరు మగపిల్లల సంతానం.. అంతా బాగుందని అనుకున్న ఆ చిన్న కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో.. ఏమో కానీ భార్యాభర్తలిద్దరూ విషం తాగి మృత్యువు ఒడికి చేరిపోయారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దేవీనగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం కలకలం సృష్టించింది. ఏం జరిగిందంటే.. దేవీనగర్ ప్రాంతానికి చెందిన తాడిశెట్టి బాజీ సైదులు(30), జలసూత్రం మానస(27)కు పెద్దల సమక్షంలో 2019లో వివాహమైంది. వీరికి సంజయ్(5), సంతోష్ (ఏడాదిన్నర) కుమారులు ఉన్నారు. సైదులు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ విభాగంలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మానస ఇంటి వద్దే ఉంటూ టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఆదివారం ఉదయం సైదులు తన పిల్లలిద్దరినీ ఇందిరా నాయక్నగర్లోని తన సోదరుడు నాగుల్మీరా వద్ద దింపి పనులకు వెళ్లగా మానస వారి ఇంటి సమీపంలోని చర్చికి ఉదయం పది గంటలకు వెళ్లి మధ్యాహ్నం రెండు గంటల తిరిగి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో సైదులు తన మావయ్య వీరభద్రరావుకు ఫోను చేసి దంపతులిద్దరం విషం తాగేశామని.. ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పాడు. దీంతో అతను తన వియ్యంకుడు ఏడుకొండలు, సైదులు సోదరుడు నాగుల్మీరాకు ఫోను చేసి హూటాహూటిన వారి ఇంటికి వెళ్లి తలుపులు పగలకొట్టి అపస్మారక స్థితిలో పడి ఉన్న భార్యాభర్తలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న భార్యాభర్తలిద్దరూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందారు. దీంతో వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆన్లైన్లో ఆర్డరు పెట్టుకొని.. సైదులు, మానస ఎంతో అన్యోన్యంగా ఉంటారని, వారికి ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేవని వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలతో మాటామాటా పెరిగి క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆన్లైన్లో గడ్డిమందు, కూల్డ్రింక్ను ఆర్డర్ పెట్టుకొని డ్రింక్లో దానిని కలుపుకొని ఇద్దరూ తాగినట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అజిత్సింగ్నగర్ సీఐ దాడి చంద్ర శేఖర్ తెలిపారు. -
జంట హత్యలు ‘వీఆర్ బాయ్స్’ పనే!
కృష్ణాజిల్లా: కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం జంటహత్యల కేసులో నమ్మశక్యం కాని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక సామాజిక వర్గానికి తలనొప్పిగా మారడమే కాకుండా భవిష్యత్తులో వారి జీవనాధారమైన చేపలవేటలోనూ తీవ్ర పోటీదారులవుతారని భావించి శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను అదే సామాజిక వర్గానికి చెందిన వారు సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు నిర్ధారౖణెంది. సుపారీ గ్యాంగ్గా ‘వీఆర్ బాయ్స్’.. జూన్ 27 రాత్రి చినగొల్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను దారుణంగా హత్య చేశారు. ఎవరు చేశారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా ఉండే శంకరపు శ్రీను, హత్యకు గురైన సుబ్బన్న, అయ్యపలతో చేపల వేట వద్ద హత్యకు ముందు ఘర్షణ జరిగింది. శ్రీను అదే గ్రామానికి చెందిన జల్లా నాగరాజుతో కలిసి గుడివాడకు చెందిన వీఆర్ బాయ్స్ అని పిలిచే నలుగురు స్నేహితుల ద్వారా సుబ్బన్న, అయ్యప్పలను హత్య చేశారు. వీరి మృతదేహాలను వారి బైక్కే కట్టి నీటిలో వదిలేశారు. లావాదేవీలపై నిఘా.. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు వీఆర్ బాయ్స్ సుపారీ లావాదేవీలతో ఫోన్ల ద్వారా జరిగిన సంభాషణలు ద్వారా హత్య చేసిన వారిని పోలీసులు గుర్తించినట్లుగా విశ్వసనీయ సమాచారం. చినగొల్లపాలెంకు చెందిన ఏ1 శంకరపు శ్రీను, ఏ2 జల్లా నాగరాజులున్నారు. వీరు కాకుండా సుపారి గ్యాంగ్ అయినటు వంటి వీఆర్బాయ్స్గా పిలువబడే ముగ్గురు యలవర్తిపాడుకు చెందిన డొక్కుమాల శ్రీకాంత్, పెదఎరుకపాడుకు చెందిన కటికల కల్యాణ్, గుడివాడ కారి్మకనగర్కు చెందిన అబ్దుల్ఖాదర్ జిలానీలతో పాటు మరొక వ్యక్తి అబ్బూరి విజయరత్నం (దాస్)లను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరులే.. గుడివాడ నుంచి వచ్చిన నిందితులు వీఆర్ బాయ్స్.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అనుచరులు కాగా వారిలో డొక్కుమాల శ్రీకాంత్పై ఇప్పటికే రౌడీ షీట్ ఉంది. మృతదేహాలను వెలికి తీసే సమయంలో వీఆర్ బాయ్స్ కూడా అక్కడే ఉన్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో సుపారీ జరిగిందంటే.. దీనిలో అధికార పారీ్టలోని కీలక నాయకుల ప్రమేయం తప్పకుండా ఉంటుందనే అనుమానాలకు తావిస్తోంది. కేసు ఛేదన సమయంలో ఒకానొక సందర్భంలో కృత్తివెన్ను పోలీసులను గుడివాడ ఎమ్మెల్యే బెదరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు గుడివాడ నియోజకవర్గంలో వీఆర్ బాయ్స్ చేసిన ఆగడాలు, ఆకృత్యాలు అనేకం ఉన్నాయనే విషయాలపై అక్కడి అధికార పారీ్టకి చెందినవారు, ముఖ్యనాయకులు చర్చించుకోవడం గమనార్హం. -
స్థిరమైన మార్కెట్తో ఆదాయం పెంపు
కలెక్టర్ డీకే బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): మహిళా సంఘాల ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ కల్పించడం ద్వారా ఆదాయాన్ని పెంచే దిశగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో డీఆర్డీఏ, జిల్లా పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, జిల్లా సమాచార శాఖ తదితర అధికారులతో సమావేశమై జీవనోపాధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ప్రస్తుతం మహిళా సంఘాలకు లభిస్తున్న ఆర్డర్లు, అవసరమైన ముడి పదార్థాల కొనుగోలుకు అవసరమైన నిధులు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. మరిన్ని ఆర్డర్లు తీసుకురండి.. అవసరానికి అనుగుణంగా రూ.5లక్షల లోపు రివాల్వింగ్ ఫండ్ ప్రతిపాదనలు సమర్పించాలని, అనంతరం రీయింబర్స్మెంట్ ప్రాతిపదికన నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీని కలెక్టర్ ఆదేశించారు. లేపాక్షి, ఇతర ఈ–కామర్స్ ఆన్లైన్ వంటి సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ మహిళా సంఘా ల ఉత్పత్తులకు మరిన్ని ఆర్డర్లు తీసుకురావాలన్నారు. విజయవాడలో మహిళల ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక షోరూమ్ ఏర్పాటు అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. గొర్రెల యూనిట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ఇప్పటికే గుర్తించిన లబ్ధిదారులకు త్వరితగతిన యూనిట్లు మంజూరు చేసి గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ–మార్కెటింగ్పై దృష్టి.. గ్రీన్ కై ్లమేట్ ఫండ్ (జీసీఎఫ్) కార్యక్రమాల పురోగతి, ఇంపాక్ట్ స్టడీ, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ఈ–మార్కెటింగ్, మహిళలకు సోషల్ మీడియా మార్కెటింగ్పై విజయవాడలో ప్రత్యేక శిక్షణ కల్పించే అంశాలపై కూడా సమీక్షించి, కార్యాచరణను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, పశుసంవర్ధకశాఖ అధికారి ఎం. శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి అయ్యా నాగరాజా, ఉద్యానశాఖ అధికారి జె. జ్యోతి, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి. జయరావు, ఏడీఐఓ సెల్వినా తదితరులు పాల్గొన్నారు. -
శాకంబరీ..
కృష్ణాజిల్లామంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026ప్రణామమమ్మా అంటూ భక్తితో కొలిచిన భక్తజనం 7మంత్రి నారా లోకేష్ కంకిపాడు మండల పర్యటన ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తెచ్చిపెట్టింది. గంటల తరబడి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది.గంపలగూడెం: నెమలిలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకుడు టి. గోపాలచార్యులు ఆధ్వర్యంలో వరుణజపం, వరుణయాగం నిర్వహించారు. చిలకలపూడి(మచలీపట్నం): భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకునేటప్పుడే తమ వ్యక్తిగత లగేజీని కూడా బుక్ చేసుకునేందుకు వీలుగా భారతీయ రైల్వే కొత్త ఆన్లైన్ సదుపాయం కల్పించింది. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే నిర్ధేశించిన పరిమితి వరకు తమ అదనపు లగేజీలను కూడా బుక్ చేసుకునే వీలుంటుంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా భారతీయ రైల్వే ఈ సదుపాయాన్ని ఈ నెల 31 నుంచి ప్రయాణికులకు అందు బాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు ఉచిత పరిమితి మించి లగేజీలను తీసుకువెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు స్టేషన్లోని బుకింగ్ కార్యాలయానికి వెళ్లి అదనపు లగేజీలను బుక్ చేసుకుని అవసరమైన రుసుం చెల్లించాల్సి వచ్చేది. ఒక వేళ ప్రయాణికుడు పరిమితికి మించి లగేజీ బుక్ చేయకుండా ప్రయాణం చేస్తే టీటీఈ ద్వారా జరిమానా విధించేవారు. కొత్త విధానంతో ప్రయాణికులు ఐఆర్సీటీసీ ద్వారా ధ్రువీకరించిన రిజర్వ్డ్ టికెట్తో పాటు అర్హత కలిగిన వ్యక్తిగత లగేజీని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ పక్రియలో ప్రయాణికులకు కావాల్సిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచారు. వారు తీసుకువెళ్లాల్సిన ఉచిత లగేజీ బరువు, నిషేధిత లగేజీల వివరాలతో పాటు బుక్ చేయని లగేజీలను తీసుకువెళితే వర్తించే జరిమానా వంటి వివరాలు అందులో ఉంటాయి. దీని వలన ప్రయాణికులు నిర్ధేశించిన పరిమితులకు అనుగుణంగా తమ లగేజీలను ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లగేజీల వివరాలు.. ● ఏసీ ఫస్ట్ క్లాస్లో ఉచిత లగేజీ 70 కేజీలు ఉండగా అదనంగా 150 చేజీల వరకు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ● ఏసీ 2టైర్లో ఉచిత లగేజీ 50 కేజీలు ఉండగా 100 కేజీలకు వరకు బుక్ చేసుకోవచ్చు. ● 3 టైర్/ఏసీ 3 ఎకానమీ/ ఏసీ చైర్ కార్లో ఉచిత లగేజీ పరిమితి 40 కేజీలు మాత్రమే. ● స్లీపర్ క్లాస్లో ఉచిత లగేజీ 40 కేజీలు ఉండగా దాన్ని 80 కేజీల వరకు పెంచారు. ● సెకండ్ క్లాస్లో ఉచిత లగేజీ 35 కేజీలు ఉండగా అదనంగా 70 కేజీల వరకు అనుమతించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారిని ఆకుకూరలు, కాయగూరలు, డ్రైఫ్రూట్స్తో అలంకరిస్తారు. తొలి రోజున అమ్మవారి ప్రధాన మూలవిరాట్తో పాటు మహా మండపం ఆరో అంతస్తు, ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాల్లోని పరివార దేవతలకు ఆకుకూరలు, కాయగూరలతో అలంకరించారు. ఆలయ పరిసరాలను అలంకరించేందుకు సుమారు 20 టన్నుల కూరగాయలను వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. పూజా సామగ్రిగా కూరగాయల దండలు.. శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు పూజా సామగ్రికి బదులుగా ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసిన దండలను అమ్మవారికి సమర్పించడం కనిపించింది. సారె, పూజా సామగ్రితో పాటు ఆకుకూరలు, కాయగూరలను మూల విరాట్తో పాటు ఉత్సవ మూర్తికి సమర్పించారు. ఆకట్టుకున్న కూరగాయల ప్రతిమలు.. రాజగోపురం ఎదుట కూరగాయలతో చేసిన ఆకృతులు, ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజగోపురం ఎదుట చిన్న అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద కరివేపాకుతో భారీ చెట్లను తీర్చిదిద్దారు. ఇక ట్రస్ట్బోర్డు సభ్యుల చాంబర్ ఎదుట, చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రతిమలు అలరించాయి. ఆయా ప్రతిమల వద్ద భక్తులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ కనిపించారు. పలు జిల్లాల నుంచి వితరణగా.. పలు జిల్లాల నుంచి ఆకుకూరలు, కాయగూరలను రైతులు, హోల్సేల్ వ్యాపారులు అమ్మవారికి సమర్పించారు. విజయవాడ నున్నలోని శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్, కేదారేశ్వరపేట హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్, గుంటూరు ఆకుకూరల మార్కెట్, నారా కోడూరులోని కూర గాయల వ్యాపారులు, యడ్లవల్లి రైతులు, సంగం జాగర్లమూడి రైతులు, వట్టిగుడిపాడు, కొత్తపేట, ఏలూరు, తణుకు, సిద్ధాంతం, మడికి, నూజివీడు, చిన్న ఓగిరాల, పెద్ద ఓగిరాలకు చెందిన రైతులు కూరగాయలను అందజేశారు. కొంత వరకే అలంకరణలు.. శాకంబరీ ఉత్సవాలతో రాజగోపురం, ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున కూరగాయల దండలను అలంకరించారు. అయితే భక్తులు ఎక్కువగా కొండపైకి నడుచుకుంటూ వచ్చే ఘాట్రోడ్డు మార్గంలోని లక్ష్మీగణపతి ప్రాంగణం, చిన్న గాలిగోపురం, నటరాజస్వామి వారి ఆలయం, నాగేంద్ర పుట్ట పరిసరాల్లో కూరగాయల దండలు కనిపించలేదు. మరో వైపున ఆయా పరిసరాల్లో ప్లాస్టిక్ డబ్బాలు, అరుగుపై సిద్ధం చేసిన కూరగాయల దండలను వదిలేయడంతో భక్తులు వాటిని తీసుకునేందుకు పోటీ పడ్డారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ నవీన్, ఇతర అధికారులు సీఎం చంద్రబాబునాయుడుతో డొక్కుమాల శ్రీకాంత్(ఫైల్) గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కటికల కల్యాణ్(ఫైల్) ఆషాఢ మాసం నేపథ్యంలో సారె సంబరం కొనసాగుతోంది. సోమవారం 27కు పైగా భక్త బృందాలు, సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నూతన పూజా మండపం వద్ద భక్తులకు కదంబ ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ఈవో శీనానాయక్, ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్ కదంబ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం నూతన పూజా మండపం వద్దకు చేరుకున్న భక్తులు కదంబ ప్రసాదాన్ని స్వీకరించారు. కుటుంబ సభ్యులతో పిల్లాపాపలతో కలిసి కదంబ ప్రసాదాన్ని స్వీకరించడం కనిపించింది. -
పోలీస్ పీజీఆర్ఎస్లో 84 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 84 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. వారి వినతుల్లోని సమస్యలు తెలుసుకుని, ఆయా స్టేషన్ల ఎస్హెచ్ఓలతో పాటు, సత్వరమే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భూ, ఆస్తి తగాదాలకు సంబంధించి 39, భార్యభర్తలు, కుటుంబ కలహాలపై 5, వివిధ మోసాలపై 3, మహిళా సంబంధిత నేరాలపై 7, కొట్లాటలపై 2, దొంగతనాలపై 4, ఇతర వివిధ సమస్యలపై 24 ఫిర్యాదులు అందాయి. చోరీకి వచ్చిప్రమాదవశాత్తు మృతి రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్ కోచింగ్ డిపోలోని ఐఓహెచ్ షెడ్డులో రైల్వే సొత్తు చోరీ చేసేందుకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి షెడ్డుపై నుంచి జారిపడి మృతి చెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది షెడ్డులో గుర్తు తెలియని వ్యక్తి రక్తపు గాయాలతో బోర్లాపడి మృతిచెంది ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుని వయస్సు సుమారు 40–45 సంవత్సరాల మధ్య ఉంటుందని, వంటిపై నీలం, తెలుపు బనియన్, పచ్చరంగు షార్ట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతుడు కోచింగ్ డిపోలో చోరీ చేసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు షెడ్డు పైనుంచి జారిపడి మృతిచెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. -
సాగునీరు రాదని ముందే చెప్పాలి కదా..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గన్నవరం రూరల్: సాగునీరు రాదంటే రైతులు ఎలా బతుకుతారని, ఖరీఫ్ సాగు చేపట్టిన తర్వాత నీరివ్వనంటే ఎలాగని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రశ్నించారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని తెంపల్లె, వీరపనేనిగూడెం, కొత్తగూడెం గ్రామాల్లో ఆయన సోమవారం పోలవరం కెనాల్ సందర్శించి సాగు భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం కాలువ నీటిని నమ్ముకుని పదేళ్లుగా రైతులు వ్యవసాయం చేస్తున్నారని, ఈ సంవత్సరం మోటార్లు తొలగించటంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. కాలువ తవ్వకం సమయంలో కొందరు రైతులు కోర్టు కేసులు వేస్తే వారితో మాట్లాడి భూములు ఇప్పించామని గుర్తుచేశారు. రైతులు మొదట్లో ఒప్పుకోలేదని, ఒక ఎకరం పోయినా మిగిలినది బాగా పండుతుందని వారిని తాము ఒప్పించామని వివరించారు. ఈ ప్రాంతంలో డ్రాపులు పూర్తికాకపోవటంతో సాగునీటి కోసం రైతులు మోటార్లు ఏర్పాటు చేయగా అప్పట్లోనే ఇరిగేషన్, విద్యుత్ అధికారులు వ్యతిరేకించారన్నారు. అప్పటి సీఎం చంద్రబాబును కలసి సమస్య విన్నవించగా రైతులకు నీరు ఇచ్చారన్నారు. ఎవరైతే పోలవరం కాలువకు భూములిచ్చారో వారికి తప్పకుండా నీరు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. డెల్టా స్థిరీకరణ కోసం ఆలోచన చేసి పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వంశీ చెప్పారు. ప్రస్తుతం సాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడుగుతానన్నారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని, గతంలో మాదిరిగా రైతుల ప్రయోజనాల కోసం మోటార్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు కందిమళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంత సాగు, తాగు అవసరాల కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీపీ అనగాని రవి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెత్ రాణి, నాయకులు పడమట సురేష్, కొలుసు శిరీష, గిరీష్రాజ్, బండి నాగసాంబిరెడ్డి, తూంపాటి రాంబాబు, షేక్ సలాం పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కనుమరుగైన శాంతి భద్రతలు
కృత్తివెన్ను: రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగైపోయాయని, ఇద్దరు గిరిజనులు దారుణంగా హత్యకు గురైతే కనీసం గిరిజన శాఖ మంత్రి గానీ, హోంశాఖ మంత్రి గాని స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ట్రైకర్ మాజీ చైర్మన్ సురేంద్ర అన్నారు. సోమవారం ఆయన కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో హత్యకు గురైన శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ యానాదులు ఎంతో ధైర్యంగా సముద్రంలో వేటాడి ఒడ్డుకు రాగలుగుతున్నారు కానీ ఒడ్డు నుంచి ఇంటికి క్షేమంగా చేరలేకపోతున్నారని, దీనికి నిదర్శనమే ఈ జంట హత్యలు అని అన్నారు. నిరుపేద కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ హత్యల్లో స్థానికంగా ఉన్న వారితో పాటు, అధికారపార్టీ నాయకుల ప్రమేయం ఉందన్న అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు. కారకులైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యతను పోలీసులు నిష్పక్షపాతంగా తీసుకోవాలన్నారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరగకపోతే వారి తరఫున, వైఎస్సార్ సీపీ ఎంతటి ఉద్యమానికై నా సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు యానాది గిరిజన ఫెడరేషన్ యూత్ స్టేట్ అధ్యక్షుడు ఎందేటి వెంకటసుబ్బయ్య, పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లూరి శివయ్య, బాపట్ల జిల్లా యానాది యూత్ అధ్యక్షులు చౌటు రమేష్, గుంటూరు జిల్లా కార్యదర్శి కొమరగిరి సూరిబాబు, కందుకూరి శేషయ్య, కిరణ్, యాకసిరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర -
పట్టుబడిన స్కూటీల దొంగ
జి.కొండూరు: స్థానికంగా స్కూటీలను చోరీ చేస్తున్న దొంగను జి.కొండూరు పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జి.కొండూరుకు చెందిన అజయ్బాబు అనే యువకుడు వాహన చోదకులు రోడ్డుపై పార్క్ చేసి వాహనాలకు తాళపు చెవి వదిలేసి వెళ్లగానే ముందుగా ఆ తాళపు చెవులను చోరీ చేసేవాడు. అవే తాళపు చెవులతో రాత్రి సమయాలలో స్కూటీలను చోరీ చేసేవాడు. ఈ విధంగా ఇటీవల జి.కొండూరులో మూడు స్కూటీలను ఎత్తుకెళ్లాడు. ఈ స్కూటీలను విక్రయించేందుకు వేరే ప్రాంతానికి తరలించే యత్నంలో భాగంగా గెయిల్ కంపెనీ ప్రాంతంలో అనుమానాస్పదస్థితిలో సంచరిస్తుండగా అజయ్బాబుని జి.కొండూరు పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మూడు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. అజయ్బాబుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
జాతీయ స్థాయిలో ప్రకాశించిన జ్యోతిశ్రావణి
బంటుమిల్లి జెడ్పీ విద్యార్థినికి ద్వితీయ బహుమతి బంటుమిల్లి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పక్షి గూళ్లు తయారీ విధానంలో ప్రతిభ కనబరచి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించినట్లు హెచ్ఎం జేవీ పద్మజ సోమవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, కాకినాడ డివిజన్ వారు పక్షి గూడు తయారీ విధానంపై జాతీయ స్థాయిలో ఆన్లైన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న స్థానిక జెడ్పీ పాఠశాల 7వ తరగతి విద్యార్థిని ముత్యాల జ్యోతిశ్రావణి ద్వితీయ బహుమతి సాధించింది. శ్రావణికి బోటనీ టీచరు కోళ్ల మాధవీప్రియదర్శిని గైడ్గా వ్యవహరించారు. ఈ నెల 26న కాకినాడలో జరిగిన ప్రపంచ మడ అడవుల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, రాజమండ్రి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ టి.జ్యోతి చేతుల మీదుగా శ్రావణికి బహుమతి ప్రదానం చేశారు. టీచర్ మాధవి ప్రియదర్శినికి ఉత్తమ గైడ్టీచర్గా ప్రశంసాపత్రం అందజేశారు. వీరిని ఎంఈఓ 1,2 బి.ఆదినారాయణ, ఎ.వెంకటేశ్వరరావు, హెచ్ఎం జేవీ పద్మజ, ఉపాధ్యాయులు పండు, గోపయ్య అభినందించారు. -
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పేట విద్యార్థుల ప్రతిభ
జగ్గయ్యపేట అర్బన్: పట్టణానికి చెందిన వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఈనెల 25,26 తేదీల్లో మైసూరు లోని చాముండి విహార్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 29 వ ఆలిండియా షిటోర్యో కరాటే–డో చాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనపరిచారు. అకాడమీకి చెందిన ఎ.దైనిక, పి.జితేంద్ర జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి త్వరలో జపాన్లో సెప్టెంబర్ 20 నుంచి 27 వరకు జరగనున్న 11 వ ఇంటర్నేషనల్ షిటోర్యో కరాటే–డో చాంపియన్షిప్ పోటీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యారు. టి.లోహిత తృతీయ స్థానం సాధించగా, పి.అభిషిక్త్ మంచి ప్రతిభ కనపరిచాడు. ఈ సందర్భంగా సోమవారం అకాడమీలో జరిగిన అభినందన కార్యక్రమంలో అకాడమీ కోచ్ ఎరుగురాల పూజ విద్యార్థుల కృషిని అభినందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా వారు అత్యుత్తమ ప్రతిభ కనపరచి దేశానికి, జగ్గయ్యపేటకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
చేపల వేట కోసమే హత్య ?
కృత్తివెన్ను:జిల్లాలోనే సంచలనం కలిగించిన కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం జంట హత్యల కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు స్థానికుల ప్రమేయంతోనే హత్య జరిగినట్లు సమాచారం. హత్యలో స్థానికులైన ఇద్దరు వ్యక్తులు కీలకపాత్ర పోషించగా మరింత ఎక్కువ మందికి హత్యలో ప్రమేయం ఉండవచ్చే అనుమానాలున్నాయి. ఇప్పటికే పోలీసు యంత్రాంగం దీనిపై ముమ్మర కసరత్తు చేయగా వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. హత్యకు గురైన సుబ్బన్న, అయ్యప్పలు చేపల వేటలో దిట్టగా ఉండటంతో పాటు అధికంగా చేపలను వేటాడుతున్నారు. వారితో పోటీ పడలేక వారినే లేకుండా చేసేస్తే తమకు వేటలో పోటీ ఉండదనే అభిప్రాయంతో ఈ హత్యకు రూపకల్పన చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సుఫారీ గ్యాంగ్ పనేనా ? హత్యలో స్థానికులతో పాటు గుడివాడకు చెందిన కొందరు కిరాయి హంతకులను ఉపయోగించి హత్య చేయించినట్లు తెలుస్తోంది. దీనికి గాను ముందుగానే పకడ్భందీగా ప్లాన్ వేసుకుని మాట్లాడుకున్నారని ఈ వ్యవహారం అంతా స్థానికంగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో జరిగినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీలు
చింతలపూడి(జంగారెడ్డిగూడెం): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లో రాష్ట్రస్థాయి రోయింగ్ చాంపియన్షిష్–2026 పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఎస్ఆర్ఏఏపీ, శాప్, డీఎస్ఏ ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. శాప్ డైరెక్టర్ జగదీశ్వరి, శాప్ డీఎస్డీఓ అజీజ్ సిరాజ్, ఎస్ఆర్ఏఏపీ అధ్యక్షుడు తరుణ్ కాకాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలురు, బాలికలకు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో సింగిల్, డబుల్ స్కల్స్ అంశాలపై ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రధాన కోచ్ కృష్ణమూర్తి, టెక్నికల్ అఫీషియల్ విజయ్ రోవర్ పర్యవేక్షించారు. ఎన్టీఆర్ జిల్లా ప్రతినితి ఎన్.పవన్ తదితరులు పాల్గొన్నారు. విజేతల్లో ఎన్టీఆర్ జిల్లా వాసులు జూనియర్ మహిళల విభాగంలో ఎస్.యమున కాంస్యం, జూనియర్ బాలుర విభాగంలో జి.మాధవ్ స్వర్ణం, ఐ.జగదీష్ కాంస్యం, సీనియర్ పురుషుల విభాగంలో జి.సాయిరామ్ స్వర్ణ పతకాలు సాధించారు. -
ప్రతిపక్ష నేతలపై విచక్షణా రహితంగా దాడులు
చందర్లపాడు(నందిగామ రూరల్): చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారని శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. టీడీపీ మూకల దాడిలో గాయపడిన చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన రావూరి చిన్నా, మద్దిపట్ల సాంబశివరావులను ఆదివారం ఆయన పరామర్శించి దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరుణకుమార్ మాట్లాడుతూ యావత్ దేశం మొత్తం భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తేంటే రాష్ట్రంలో మాత్రం రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. దాడులకు పాల్పడుతున్నా పోలీసులు సైతం అధికార పార్టీ నేతల వత్తిళ్లతో కనీస చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అరుణకుమార్ డిమాండ్ చేశారు. అధికార వత్తిళ్లకు తలొగ్గి చర్యలు తీసుకోకుంటే పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అప్పుడు కూడా స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్య పడొద్దని పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కందుల నాగేశ్వరరావు, నాయకులు వెలగపూడి వెంకటేశ్వరరావు, వైఎస్ఎన్ ప్రసాద్, చింతోటి ప్రసాద్, నల్లాని సాయి, మద్దుకూరి సాయిబాబు, ఓర్సు కొండ, షేక్ కరిముల్లా పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థలో మార్పులు తేవాలి
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026● ధూమ్ ధామ్ జాతర● వేడుకగా సాగిన ఊరేగింపు ● కొనసాగిన ఆషాఢ సారె సంబరాలు ● ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల తాకిడి ● అన్ని దర్శన టికెట్ల విక్రయాలు రద్దు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ తరఫున హైదరాబాద్లోని భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం బంగారు, వెండి బోనాలను సమర్పించింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాబావ పరిస్థితులు తొలగిపోయి, వర్షాలు పుష్కలంగా కురవాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పించినట్లు జోగిని అవికా పేర్కొన్నారు. 17 ఏళ్లగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఉమ్మడి దేవాలయాల కమిటీ పేర్కొంది. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద తెలంగాణ బంగారు బోనంకు కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 5 వందల మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ఇంద్రకీలాద్రికి వైపు సాగారు. జోగిని అవికా బంగారు బోనంను తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా వెండి తదితర బోనాలతో మిగిలిన వారు ముందుకు సాగారు. బంగారు బోనంను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, ఇంద్రకీలాద్రి పరిసరాలను తరలివచ్చారు. దుర్గాఘాట్కు చేరుకున్న ఊరేగింపు కృష్ణమ్మకు గంగ తెప్ప, పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. దుర్గాఘాట్, ఘాట్రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణానికి సుమారు 700 మంది కళాకారులు, కమిటీ ప్రతినిధులు చేరుకోవడంతో ఘాట్రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనంకు ఆలయ ఈవో,చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు స్వాగతం పలికారు. కమిటీ ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం బంగారు, వెండి బోనంతో పాటు పూజా సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను ఆలయ ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బుల్లెట్ శ్రీధర్, మాజీ అధ్యక్షులు పేర్కొన్నారు. ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించాయి. అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆలయ ప్రాంగణం రద్దీగా కనిపించింది. ఉదయం 8 గంటల కల్లా ఆలయ పరిసరాలతో పాటు మహామండపం, ఘాట్రోడ్డులో భక్తుల రద్దీ కనిపించడంతో దర్శనానికై విక్రయించే అన్ని టికెట్ల విక్రయాలను అధికారులు రద్దు చేశారు. బంగారు వాకిలి, రూ. 300, రూ. 100టికెట్ క్యూలైన్లలో భక్తులను ఉచితంగా దర్శనానికి అనుమతించగా, సర్వ దర్శనం రెండు లైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు 70వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. బేతాళ నృత్యం చేస్తున్న కళాకారుడువిస్తరిస్తోంది.. విస్మరించొద్దు! బెజవాడ జెన్ జీ యూత్ ఆధ్వర్యాన ధర్నాచౌక్లో వినూత్న నిరసన దుర్గమ్మను ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, తెలంగాణ స్పీకర్ జి. ప్రసాద్కుమార్, ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మాజీ ఎంపీ, సినీనటుడు మురళీమోహన్, తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో, చైర్మన్లు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. -
టిప్పర్ ఢీకొని వృద్ధుడు దుర్మరణం
కోనేరుసెంటర్: టిప్పర్ ఢీకొని వృద్ధుడు దుర్మరణం చెందిన ఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మండలం మంగినపూడి బీచ్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజాము చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ జి.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం బందరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీ శివారు శ్రీనివాసనగర్కు చెందిన కాగిత పాండురంగారావు (80) అనే వృద్ధుడు కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతి రోజులానే ఆదివారం తెల్లవారుజామున ఊరి బయట ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా మంగినపూడి రోడ్డులోని శ్రీనివాస్నగర్ ప్రధాన కూడలి వద్ద బందరు పోర్టు వైపునకు లోడుతో వెళ్తున్న టిప్పర్ వృద్ధుడి ఢీకొంది. ఈ ప్రమాదంలో పాండురంగారావు టిప్పర్ కింద పడిపోయాడు. టిప్పర్ మధ్యలో ఇరుక్కున అతనిపై నుంచి టిప్పర్ వెళ్లింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు హుటాహుటినా మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాండురంగారావు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన టిప్పర్ను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. అలాగే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్ఐ చెప్పారు. లక్ష్మీపురం(తిరువూరురూరల్): ఇబ్రహీంపట్నం – జగదల్పూర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళగిరి నుంచి తిరువూరు వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో డ్రైవింగ్ చేస్తున్న కారుమంచి హరికృష్ణ ప్రసాద్(60)కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆయన భార్య భవానికి కూడా తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. తిరువూరు మండలం చింతలపాడుకు చెందిన హరికృష్ణ ప్రసాద్ మంగళగిరిలో నివసిస్తూ స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాజకీయాలు, కులం వేర్వేరని, రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కుల ప్రయోజనాల కోసం యాదవులంతా ఏకతాటిపైకి రావాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడలోని విజయ నర్సింగ్ కాలేజీలో యాదవ సంఘం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆత్మీయ సత్కార కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవులు లేనిదే చరిత్ర లేదన్నారు. యాదవులు శ్రీ కృష్ణుడి వారసులని... నీతి నిజాయితీకి మారుపేరు అని కొనియాడారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మొదట తెరిచేది కూడా మన గొల్ల మిరాశిలేనన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక జనాభా కలిగిన బలమైన సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం అన్నారు. యాదవులంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎవరి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విజయవాడ వంటి నగరంలో కార్పొరేషన్లో యాదవ కుల ప్రాతినిధ్యం చెప్పుకోతగిన స్థాయిలో ఉందన్నారు. ఇది గర్వించదగిన విషయమని ఆయన పేర్కొన్నారు. యాదవుల కుల దైవం శ్రీ కృష్ణుడి జన్మదినం కృష్ణాష్టమిని ఘనంగా నిర్వహించాలని సూచించారు. ‘ఎవరికి ఏ అవసరమొచ్చినా నేను ఉన్నానని గుర్తు పెట్టుకోండి.. నా పూర్తి అండదండలు ఉంటాయి’ అంటూ యాదవ సామాజిక వర్గానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయనను యాదవ సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరవ వెంకట సత్యనారాయణ(అరవ సత్యం), విజయ నర్సింగ్ కాలేజీ అధినేతి తట్టి అర్జునరావు, డాక్టర్ వెంకట్ చరణ్ తేజ, ఐతా కిషోర్, నాగరాజు, ఎల్లయ్య, జోగారాజు, ఆగిరిపల్లి రాజు, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
సాగునీరివ్వకుంటే.. పరిహారం చెల్లించండి !
కోడూరు: కృష్ణా డెల్టాలో వరిసాగు చేసిన వేలాది మంది రైతులు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం ఇకనైనా రాజకీయాలను పక్కనబెట్టి అన్నదాతలను ఆదుకునేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్బాబు కోరారు. ఆదివారం కోడూరు మండలంలోని ఉల్లిపాలెం ప్రాంతంలో పర్యటించిన రమేష్బాబు సాగునీరు అందక బీడువారిన వరి పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 20 పంపులు పని చేస్తున్నాయని, వాటి ద్వారా 700 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారని రమేష్బాబు తెలిపారు. ఆ నీరు విజయవాడకు చేరుకునే సమయానికి సుమారు 5,500 క్యూసెక్కులుగా మారుతుందని, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న మరో 700 క్యూసెక్కులు కలిపి ప్రస్తుతం డెల్డాకు సుమారు 6,200 క్యూసెక్కుల నీరు మాత్రమే అందుతోందని చెప్పారు. అయితే పులిచింతల ప్రాజెక్టులో 29 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని, అందులో నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినా డెల్టాకు మరో 50 రోజుల పాటు సాగునీరు అందుతుందని రమేష్బాబు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం ఘనంగా పూజలు నిర్వహించి, కాలువల్లో నీళ్లు వస్తున్నాయని ప్రచారం చేసి రైతులను నారుమడులు పోసుకునేలా ప్రోత్సహించిందని, నేడు అదే రైతులు నీటి కోసం ఎదురుచూస్తుంటే నారుమళ్లు ఎందుకు పోశారని తిరిగి వారే ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంటే రైతులు చేసిన ఖర్చుకు పూర్తి నష్ట పరిహారం చెల్లించాలని రమేష్బాబు డిమాండ్ చేశారు. రైతులతో కలిసి పాదయాత్ర చేస్తా.. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రైతు సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రమేష్బాబు హెచ్చరించారు. సాగునీటిపై స్పష్టత ఇవ్వకపోతే విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు రైతులతో కలిిసి పాదయాత్ర చేస్తానన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తీరుపై రమేష్బాబు విమర్శలు గుప్పించారు. కోడూరు అవుట్ఫాల్ స్లూయిజ్ల వద్ద ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనుల నాణ్యతతో జరిగాయని బుద్ధప్రసాద్ ప్రచారం చేస్తున్నారని, అయితే వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. స్లూయిజ్కు ఏర్పాటు చేసిన గేట్లు ఉపయోగంలో లేకపోతే రైతులు స్వచ్ఛందంగా రూ.2 లక్షలు సమకూర్చి కాంక్రీట్ పనులు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కవులు, కళాకారులు, జయంతి ఉత్సవాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, రైతులకు సాగునీరు ఇప్పించడం, వారి సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పులిగడ్డ అక్విడేట్కు రంగులు వేయడం తప్ప నియోజవర్గ రైతాంగానికి చేసిందేమి లేదని ఆరోపించారు. అనంతరం రైతులు బాగు చేసుకున్న స్లూయిజ్ను పరిశీలించారు. పార్టీ మండల కన్వీనర్ పరిశె మాధవరావు, నాయకులు కోట పద్మావతి వరప్రసాద్, వెర్రీ శ్రీనివాసరావు, కొక్కిలిగడ్డ శ్రీమన్నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు -
అశ్రద్ధ చేయొద్దు..
మా సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టే సమయంలో జలుబు, జ్వరం, బాడీపెయిన్స్ ఉన్న వారిని గుర్తించి సమీపంలోని యూపీహెచ్సీ, పీహెచ్సీలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే జీజీహెచ్కి రిఫర్ చేస్తున్నారు. అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరాన్ని బట్టి ఆస్పత్రిలో చేర్చడం, లేదంటే హోం ఐసోలేషన్కు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఎ. శ్రావణ్బాబు, వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా -
సాగునీటి కోసం రైతుల ఆందోళన
పామర్రు: బల్లిపర్రు లాకులకు ఎగువనున్న ప్రాంతాల్లో సాగునీరు అందక పోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని లాకుల వద్ద రైతులు ఆదివారం ఆందోళన చేపట్టారు. లాకులకు ఎగువ ప్రాంతంలో సుమారు 2 వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఉన్నాయని వీటిలో నాట్లు వేశామని కానీ సాగుకు నీరు అందని కారణంగా నాట్లు ఎండిపోతున్నాయని వారు వాపోయారు. బల్లిపర్రు లాకుల నుంచి దిగువ ప్రాంతాలకు సాగునీరు విడుదల చేయటంతో తమ పంట పొలాలకు నీరు అందక ఎండిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై జల వనరుల శాఖ డీఈ సూర్య భరత్ స్పందిస్తూ రీడింగ్ ప్రకారమే సాగునీటిని విడుదల చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): జీవితంలోనైనా, వ్యాపారంలోనైనా విజయాన్ని అందుకోవాలంటే పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ప్రముఖ బాడ్మింటన్ కోచ్, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనా విధానాన్ని మార్చుకుంటూ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఆదివారం జరిగిన బీఎన్ఐ ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ నెట్వర్కింగ్ కాంక్లేవ్ 4.0లో పుల్లెల గోపిచంద్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఏఐ), డేటా ఆధారిత నిర్ణయాలు, వినూత్న మార్కెటింగ్ పద్ధతులు వంటి ఆధునిక సాధనాలను ఉపయోగించుకోవడం ద్వారా వ్యాపారాన్ని మరింత వేగంగా విస్తరించవచ్చని సూచించారు. ఒకరి అనుభవం మరొకరికి మార్గదర్శకంగా మారుతుందని, బలమైన నెట్వర్క్ ఉన్న వ్యాపారవేత్త ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కోగలడని చెప్పారు. కార్యక్రమంలో బీఎన్ఐ విజయవాడ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్, ఎంఎస్ఎంఈ ఎక్స్పో కమిటీ చైర్మన్ త్రినాథ్ నండూరి, కన్వీనర్ బి.దేవకుమార్, కార్యదర్శి లక్ష్మీశాంతి కోగంటి, కాంక్లేవ్ కమిటీ చైర్మన్ పి.యువకిషోర్, కన్వీనర్ ఎన్.నాగార్జున తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): పంచాయతీ రాజ్ ఈఎన్సీ నియామకంపై రగడ జరుగుతోంది. ప్రస్తుత ఈఎన్సీ బి.బాలునాయక్ ఈ నెలాఖారుకు ఉద్యోగ విరమణ చేయనున్నారు. అనంతరం ఎవరిని నియమిస్తారనేది ప్రస్తుతం ఆ శాఖలో వాడీవేడి చర్చ సాగుతోంది. ఉద్యోగ విరమణ చేసినా బాలునాయక్కు మరో రెండేళ్లు సర్వీసు పొడిగించి, ఆయన్నే ఈఎన్సీగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై ఆ పోస్టు చేపట్టేందుకు అర్హత ఉన్న ఇంజినీర్లతో పాటు ఇతర అధికారులు మండిపడుతున్నారు. తన సర్వీసులో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని ఉద్యోగ విరమణ చేసినా అదే పోస్టులో ఎలా కొనసాగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ శాఖలో ఎస్ఈలు, ఈఈలు, డీఈలకు ఉద్యోగోన్నతులు కల్పించడంలో తీవ్ర జాప్యం నెలకొంది. తమకు ఉద్యోగోన్నతులు కల్పించకుండా, ఉద్యోగ విరమణ చేసే వారిని కొనసాగించేందుకు సంబంధించిన ఫైలును ఆగమేఘాలపై ఆమోదం కోసం పంపడం విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగ విరమణ అనంతరం బాలునాయక్ పునర్నియామకం జరిగితే ఆ ఖాళీ ఏర్పడకుండా ఉండటమే కాకుండా, సేవలో ఉన్న అర్హులైన అధికారుల, ముఖ్యంగా మహిళా అధికారుల ఉద్యోగోన్నతి అవకాశాలు మరింత కాలం వాయిదా పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళా అధికారికి అవకాశం కల్పించాలి.. ఇప్పటికే పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు ఆ శాఖ కమిషనర్ కృష్ణతేజను కలిసి అర్హత ఉన్న మహిళా అధికారిని ఇంజినీర్ ఇన్ చీఫ్గా నియమించాలని వినతిపత్రం అందజేశారు. ఆమెకు ఇంకా పదేళ్లు సర్వీసు ఉందని ఉన్నతాధికారులు చెప్పడంపై వారు మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు, నియామక విధానాల ప్రకారం ఉద్యోగంలో చేరిన అధికారి, అదే కారణంతో తరువాత ఉన్నత పదవికి అవకాశాన్ని కోల్పోవడం న్యాయసమ్మతమేనా అని ఆ శాఖ ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తున్న నేపథ్యంలో, అర్హత కలిగిన సేవలో ఉన్న మహిళా అధికారికి ఇంజినీర్–ఇన్–చీఫ్ పదవికి సముచిత అవకాశం కల్పించాలని ఆ శాఖ ఇంజినీర్లు డిమాండ్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్ జిల్లాలో రెండు కోవిడ్ యాక్టివ్ కేసులు
● తొలుత నమోదైన బాలికకు నెగిటివ్ ● కోవిడ్ నిబంధనలు పాటించాలంటున్న వైద్యులు ● రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరి ● ప్రస్తుతం అరకొరగానే నిర్ధారణ పరీక్షలు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో కోవిడ్ మళ్లీ విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో ఒకరికి నెగిటివ్ వచ్చింది. ఇంకా రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా మరింత మంది కోవిడ్ సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కావడంతో జలుబు, తీవ్రమైన బాడీపెయిన్స్, జ్వరం వంటి లక్షణాలు.. రెండు, మూడు రోజులు ఉండి తగ్గిపోతున్నాయి. దీంతో ఫ్లూ జ్వరంగా భావించి చికిత్స పొందడంతో నాలుగైదు రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. మరికొందరిలో వారం పది రోజుల పాటు నీరసం వేధిస్తోంది. అలాంటి వారికి కోవిడ్ సోకి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా మళ్లీ కోవిడ్ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కేసుల వివరాలు.. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకూ ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వారిలో తిరువూరుకు చెందిన బాలికకు ఇప్పటికే నెగిటివ్ రాగా, మరో రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో ఒకరు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరొకరు హోం ఐసోలేషన్లోనే ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కోవిడ్ విజృంభిస్తుండగా, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సైతం కోవిడ్ కేసులు నమోదు కావడం ప్రజల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. జాగ్రత్తలు తప్పనిసరి.. కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. జనం రద్దీగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం, చేతులను తరచూ నీటితో కడుక్కోవడం, శానిటైజర్ రాసుకోవడం, భౌతిక దూరం పాటించడం, బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరిస్తే మంచిదని సూచిస్తున్నారు. అంతేకాకుండా క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రభుత్వ పరంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు అరకొరగానే చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రికి అనారోగ్యంతో వచ్చే వారికి కోవిడ్ లక్షణాలు ఉంటే అక్కడ శ్యాంపిల్ తీసి పరీక్ష చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ర్యాపిడ్ పరీక్షలు చేస్తుండగా, జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కోవిడ్ పరీక్షలు చేయడం లేదు. గతంలో పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో కూడా కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్లు చేసే వాళ్లు. ఇప్పుడు అక్కడ చేయడం లేదు. కేవలం లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించాలని మాత్రమే నిర్ణయిస్తున్నారు. దీంతో జిల్లాలో అరకొరగానే కరోనా పరీక్షలు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. -
685 మంది సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీ సెట్లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన విజయవాడలోని రమేష్ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్–145, స్కౌట్స్ అండ్ గైడ్స్–70 మంది, సీఏపీ–470 మంది మొత్తం 685 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను ఆదివారం పరిశీలించారు. అలాగే సోమవారం ఉదయం సీఏపీ–60,001 నుంచి లక్ష లోపు ర్యాంకు, ఎన్సీసీ–1 నుంచి 50వేల లోపు ర్యాంకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్–50,001 నుంచి 80 వేల లోపు ర్యాంకు, స్కౌట్స్ అండ్ గైడ్స్ 80,001 నుంచి చివరి ర్యాంకు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించే జానకీ సదనం(సత్రం)లో గది నిర్మాణానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. విజయవాడకు చెందిన నరసింహారావు రూ.12లక్షల చెక్కును ఆదివారం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం కుటుంబీకులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి దేవస్థాన అధికారులు, అర్చకులు తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరువ కావాలంటే పట్టుదల, క్రమశిక్షణతో చదవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశ చెప్పారు. స్థానిక సున్నపుబట్టీల సెంటర్లోని ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) హాలులో ‘అమ్మ’ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్(అమ్మ) అధ్యక్షుడు గారపాటి సతీష్ మాట్లాడుతూ తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు ఏటా ఈ విధంగా ఉపకార వేతనాలను అందజేస్తున్నామని, ఈ ఏడాది 423 మంది విద్యార్థులకు రూ.23లక్షల విలువైన ఉపకార వేతనాలతో పాటుగా నోటు పుస్తకాలను అందజేస్తున్నామన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకర చంద్రశేఖర్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సంతానలేమితో బాధపడుతున్న దంపతుల జీవితాల్లో వెలుగులు నింపడంలో క్లినికల్ ఎంబ్రియాలజిస్టుల పాత్ర అత్యంత కీలకమైందనీ వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల రీప్రొడక్టివ్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ మోహన్ ఎస్. కామత్ అన్నారు. నైపుణ్యం, అంకితభావం కలిగిన ఎంబ్రియాలజిస్టులే ఐవీఎఫ్ కేంద్రాలకు వెన్నెముక వంటివారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంబ్రియాలజిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఎంబ్రియాలజిస్టుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎంజీ రోడ్డులోని ఫార్చ్యూన్ మురళీపార్క్లో సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ మోహన్ ఎస్. కామత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సావనీర్ ఆవిష్కరించారు. యువ ఎంబ్రియాలజిస్టులకు క్విజ్, శాసీ్త్రయ పోస్టర్ ప్రదర్శన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఎంబ్రియాలజిస్టుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్బాబు, కార్యదర్శి డాక్టర్ వి. లెనిన్ బాబు, ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ పాల్గొన్నారు. -
22ఏ జాబితాను రద్దు చేసి ఆ భూములు పునరుద్ధరించాలి
సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు ఏబీ వెంకటేశ్వరరావు, చక్రవర్తి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం 22ఏ బాధితులకు ఉపశమనం కల్పించేందుకు తెచ్చామని చెబుతున్న జీవో 444 ఓ చెత్త జీవో అని సెంటర్ ఫర్ లిబర్టీ కొట్టి పారేసింది. తక్షణమే 22–ఏ జాబితాను రద్దు చేసి భూములను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. శనివారం విజయవాడ ప్రెస్క్లబ్లో 22 ఏ బాధితులతో కలిసి సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, చక్రవర్తి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులు మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా నల్లమోతు చక్రవర్తి మాట్లా డుతూ 22ఏ బాధితుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలా డుకుంటుందోని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇనాం భూములకు విముక్తి కల్పిస్తామని అనేక సభల్లో ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన చెప్పిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఆవులపల్లె జీవో మోడల్ను రాష్ట్రం అంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీవో 444 ప్రతులను చించివేశారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, అజయ్ మల్లారెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకొంటున్న తల్లికి వందనం పథకం అమలులో ఎన్నో లోపాలు వెలుగు చూస్తున్నాయి. మచిలీ పట్నం రూరల్ మండలం, పోట్లపాలెం గ్రామానికి చెందిన గాజుల శివన్నారాయణ, హేమలత దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి కుమారుడు శ్రావణ్ కుమార్ ఎనిమిదో తరగతి, కుమార్తె మానసాదేవి ఆరో తరగతి చదువుతున్నారు. అర్హులైనప్పటికీ వారికి తల్లికి వందనం పథకం అంద లేదు. పోతిరెడ్డిపాలెం సచివాలయంలో ఆరా తీయగా, ఆ దంపతుల పేర్లపై సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఆన్లైన్లో నమోదైందని అధికారులు చెప్పడంతో వారు విస్తుపోయారు. నెలకుర్రు, మచిలీపట్నం, పోలాటితిప్ప, గోపువానిపాలెం, కానూరు, పల్లెతుమ్మలపాలెం గ్రామాల్లో తమ పేరిట భూములు ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయని, వాస్తవానికి తమకు ఒక్క సెంటు భూమి కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా పథకం అందలేదని, ఆప్పుడే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించనందున ఈ ఏడాదీ తమకు లబ్ధి చేకూరలేదని శివన్నారాయణ, హేమలత దంపతులు వాపోయారు. -
స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక భరోసా
గుంటుపల్లి(జి.కొండూరు): మహిళలు నైపుణ్యం పెంచుకొని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడం వల్లన ఆర్థికంగా ఎదగొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. జి.కొండూరు మండలంలోని గుంటుపల్లి రైజ్ కేంద్రంలో హస్తకళా ఉత్పత్తులపై శనివారం నిర్వహించిన వర్క్ షాపును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రావ్స్ ఎండ్ లెస్ క్రాఫ్టస్ వ్యవస్థాపకురాలు శ్రావణి 60 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు బొకేలు, అలంకరణ వస్తువులు, ఆకర్షణీయ బహుమతుల తయారీలో శిక్షణ ఇచ్చారు. డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తెలంగాణ నుంచి దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనం, ఆషాఢ సారె నేపథ్యంలో అన్ని వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు దుర్గగుడి ఈఓ శీనానాయక్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ బోనం సమర్పణకు సుమారు మూడు వేల మంది కళాకారులు, ఉత్సవ కమిటీ సభ్యులు వస్తారని తెలిపారు. గత ఆదివారం ఒక్క రోజే సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నామని వివరించారు. మరో వైపున కొండపైకి ఎటువంటి ప్రయివేటు వాహనాలను అనుమతించేది లేదని, దేవస్థానం బస్సులను పూర్తి స్థాయిలో నడుపుతామని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు, చంటి బిడ్డల తల్లులు ఉదయం ఎని మిది గంటల్లోపు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు రావాలని సూచించారు. రద్దీ దృష్ట్యా దేవస్థ్ధానం తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు. ఘంటసాల: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ డి.సుధారాణి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికయ్యారు. బాపట్లలో జరుగుతున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయం పరి ధిలో ఉత్తమ శాస్త్రవేత్తగా గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా శనివారం ఆమె పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పాలడగు సత్యనారాయణ, న్యూడిల్లీకి చెందిన ఐఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ మణి తదితరులు పాల్గొన్నారు. సుధారాణిని కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సిబ్బంది, కృష్ణాజిల్లాలోని శాస్త్రవేత్తలు, పలువురు రైతులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
డీఎస్సీ అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయాలి
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అవే ప్రమా ణాలను ఆంధ్రప్రదేశ్లో కూడా పాటించాలని కోరారు. రాష్ట్రంలోని వేల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడిందని, డీఎస్సీ నియామక ప్రక్రియలో అనేక అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన, అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర యువత అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, డీఎస్సీ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని అవినాష్ డిమాండ్ చేశారు. -
31న ముసాయిదా ఓటర్ల జాబితా
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (సర్) మొదటిదశ పూర్తయిందని కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 15,43,242 మంది ఓటర్లు ఉన్నారని వారిలో 14,05,580 మంది నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్నామని తెలిపారు. మిగిలిన 1,37,662 ఓటర్ల ఫారాలు తిరిగి సేకరించలేకపోవటంతో వారిని అన్కలెక్టబుల్గా నమోదు చేశామని పేర్కొన్నారు. వీరిలో 56,346 మంది మరణించగా, 24,603 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని వివరించారు. మరో 34,650 మంది ఇప్పటికే ఇతర చోట్ల నమోదు కావటంతో డూప్లికేట్గా గుర్తించామని తెలి పారు. 21,970 మంది ఇంటి వద్ద అందుబాటులో లేని వారుగా, మరో 93 మందికి ఇతర కారణాలు నమోదయ్యాయని వివరించారు. మొత్తం ఓటర్లలో 8.92 శాతం అన్కలెక్టబుల్గా గుర్తించామన్నారు. ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఫారం–6 ద్వారా మరో అవకాశం తుది జాబితాలో పేర్లు లేకపోయినా వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫారం–6 ద్వారా తిరిగి ఓటర్లుగా చేరే అవకాశం ఉందని కలెక్టర్ బాలాజీ సూచించారు. ముసాయిదా ప్రచురణ అనంతరం ఆగస్టు 30వ తేదీ వరకు క్లయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి వారి వాదనలు, సమర్పించిన పత్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం అక్టోబరు మూడో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని కలెక్టర్ తెలిపారు. 14,05,580 మంది ఎన్యూమరేషన్ ఫారాల్లో 13,82,660 మంది ఓటర్ల వివరాలు 2002 ఓటర్ల జాబితాలో ఉన్న వారి పేర్లు, తల్లిదండ్రులు లేక వారి కుటుంబ సభ్యుల పేరుతో మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. నో మ్యాపింగ్ కింద గుర్తించిన వారికి మాత్రమే నోటీసులు జారీ చేస్తామని, వారికి అవసరమైన పత్రాల జాబితాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించిన ధ్రువపత్రాలు జతపరిస్తే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ప్రతి ఓటరుకు పూర్తి సహకారం అందించేలా బీఎల్వోలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలకు అవసరమైన వివరాలు తెలిపి ఇబ్బందులు కలగకుండా అవసరమైన పత్రాలు సేకరించే చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ డీఆర్వో ఎస్.పోతురాజు, కలెక్టరేట్ ఏఓ ఎ.ఎస్.ఎన్.రాధిక, ఎన్నికల విభాగం డెప్యూటీ తహసీల్దార్లు ఎం.వి.శ్యామ్నాథ్, వై.నారాయణ పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026నీరు ఇవ్వలేం.. 7ఈపాటికి పచ్చగా కళకళలాడాల్సిన పంట పొలాలు సాగునీరు లేక ఇలా బీడుగా.. మచిలీపట్నంటౌన్: స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాన్ని ప్రజా ఉద్యమంగా విజయవంతం చేయడంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని కలెక్టర్ డి.కె.బాలాజి కోరారు. శనివారం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కలెక్టర్ బంగ్లా నుంచి పరాసుపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన పారిశుద్ధ్య పనుల్లో ఆయన పాల్గొన్నారు. రోడ్ల వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవస రంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి బలమైన పునాదలని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.ఈ ఖరీఫ్ సీజన్లో ఏడు ఎకరాలు కౌలుకు తీసు కున్నా. వరి సాగుకు నీరు లేక ఇబ్బందులు తప్పడంలేదు. ఎండుతున్న పొలా లను బతికించేందుకు ఎంత నీరు పెట్టినా నిలవటం లేదు. ఇంజిన్, ఆయిల్, ట్యూబుల అద్దె ఖర్చులే ఎక్కువ అయిపోతున్నాయి. ఇలా అయితే సాగు చేయలేం. – గొరికపూడి శివకుమార్, కప్తానుపాలెం, మోపిదేవి మండలం మబ్బులు కమ్ముతున్న ఆకాశం కనికరించి నేలపై ఒక్క వర్షపు చుక్కను కూడా రాల్చడం లేదు. నీటి గలగలలతో కళకళలాడాల్సిన పంటకాలువలు చుక్కనీరు లేక ఒట్టిపోయాయి. పచ్చందాలతో కనువిందు చేయాల్సిన సాగు భూములు బీడుగా దర్శనమిస్తున్నాయి. అదునుకొచ్చిన వరి నారు మడులు నీటి తడిలేక ఎండుముఖం పట్టాయి. సాగునీటిపై ప్రభుత్వం స్పష్టతివ్వడం లేదు. ఆరు తడిపంటలు మేలు అంటూ అధికారులు సూచనలతో సరిపెడుతున్నారు. చినుకమ్మా నీవన్నా కరుణించి ఆదుకోమ్మా అంటూ అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. చల్లపల్లి / పెనుగంచిప్రోలు: కృష్ణా జిల్లాలో సాధారణంగా జూలై మొదటి వారానికి దాదాపుగా పూర్తి కావాల్సిన వరినాట్లు ఇప్పటికీ ప్రారంభం కూడా కాలేదు. నీటి కోసం పొలాలు రైతుల వైపు చూస్తుంటే.. రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. ప్రకృతి కరుణి స్తుందా? ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూపుతుందా? లేక రైతులు మరోసారి అప్పుల ఊబిలో కూరుకుపోతాడా? అన్న ప్రశ్న ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని వెంటాడుతోంది. ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి సకాలంలో సాగునీరు వస్తుందని భావించిన రైతులు ఇప్పటికే వేల రూపాయలు ఖర్చు చేసి నారుమడులు సిద్ధం చేసుకున్నారు. తీరా వర్షాలు పడక, కాలువల్లో నీరు అడుగంటడంతో నారుమడిని కాపాడటం, పొలాన్ని తడిపి నాట్లు వేయటం సవాలుగా మారింది. ఆయిల్ ఇంజిన్లతో అదనపు భారం.. కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1,65,771 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి. ముఖ్యంగా వరి 1.60,655 హెక్టార్లలో సాగవుతుంది. ఈ ఖరీఫ్లో వెద పద్ధతి, బోర్లు, ఇతర నీటి వసతులు ఉన్న ప్రాంతాల్లో 65 వేల హెక్టార్లలో మాత్రమే వరి సాగవుతోంది. వెద పద్ధతిలో సాగుచేసిన పొలాలు నీటి తడులు అందక ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల కాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటిని రైతులు ఆయిల్ ఇంజిన్లతో తోడి పొలాలకు నీటి తడులు అందిస్తున్నారు. దీనివల్ల రైతులపై మరింత ఆర్థిక భారం పడుతోంది. ఎకరం పొలం తడపటానికి 15 నుంచి 20 గంటల వరకు ఇంజిన్ ఆడాల్సి వస్తోంది. ఇందుకు 20 లీటర్ల వరకూ అంటే రూ.2 వేల వరకు ఇంధనం ఖర్చు అవుతోంది. ఆయిల్ ఇంజిన్కు అద్దె రూ.1000, వాటర్ తరలించేందుకు ట్యూబులకు అద్దె, మరోపక్క కూలి ఖర్చులు. ఇలా పొలం తడపటానికే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. గత ఏడాది నష్టాల నుంచి తేరుకోకముందే.. గత ఏడాది తుపానులు, భారీ వర్షాలు మిగిల్చిన అప్పులు, కష్టాల నుంచి తాము ఇంకా బయటపడలేదని రైతులు చెబుతున్నారు. తీరా ఈ ఏడాది కూడా ఆదిలోనే హంసపాదు అన్న చందంగా సాగు ప్రారంభంలోనే నీటి కోసం నానా కష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నాట్లు కూడా వేయకుండానే ఎకరా పొలం తడపటానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చులు అయ్యాయని వాపోతున్నారు. ఎండుముఖం పట్టిన పత్తిచేలు ఎన్టీఆర్ జిల్లాలో ఏటా ఖరీఫ్లో 48,831 హెక్టార్లలో వరి, 3,727 హెక్టార్లలో మొక్కజొన్న, 75 వేల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. వర్షాల జాడలేక బోర్లు, బావులు ఉన్న చోట మాత్రమే రైతులు వరి సాగు చేపట్టారు. మొక్కజొన్న వెయ్యి హెక్టార్ల లోపు మాత్రమే నేటి వరకు సాగయింది. ఈ పంటలను రక్షించుకునేందుకు నీరులేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 30 వేల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు చేశారు. మొక్కలు నాటి నెల గడిచినా నీటి తడిలేక పైరు ఎదగలేదు. కొన్ని మొక్కలు ఎండ, గాలులకు వడబడుతున్నాయి. మరో వారం ఇదే పరిస్థితి ఉంటే మొక్కలు మొత్తం ఎండి పోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇప్పటికే ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. కౌలు రైతులు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 29.160 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 400 క్యూసెక్కులు వదులుతున్నారు. కాలువ పక్కనున్న వారు ఇంజిన్లతో నీటిని పెట్టుకుంటున్నారు. కాలువలకు దూరంగా ఉన్న పొలాల్లో సాగు చేసేదెలా? ఇప్పటికీ 90 శాతం నాట్లు పూర్తికావాలి. ఐదు శాతం కూడా పూర్తి కాలేదు. సకాలంలో సాగునీరు ఇస్తే ఈ ఇబ్బంది రైతులకు వచ్చేది కాదు. – పాగోలు నాగసీతారామరావు, చల్లపల్లి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మూడు రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఆల్మట్టి డ్యామ్లో నీటి నిల్వ తక్కువగా ఉంది, అక్కడి నుంచి నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లు నిండిన తర్వాత శ్రీశైలంకు నీరు చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పులిచింతలలో 30 టీఎంసీలు తప్ప మరే ఇతర రిజర్వాయర్లో తగినంత నీటి నిల్వలు లేవని స్పష్టంచేశారు. పుష్కలంగా వర్షాలు పడితే తప్ప సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడినట్లు వివరించారు. ఉన్న నీటిని తాగు అవసరాలకు వాడుకోవాలని ఆపై వర్షాలు వస్తే సాగుకు కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. రైతులను ఎక్కువగా ఆరుతడి పండల వైపు మొగ్గుచూపేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. దీంతో రైతులు మరింత దిగాలు పడ్డారు. -
ఉమ్మడి కృష్ణా జిల్లా వివరాలు..
● పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి తప్పుకునేందుకు బాబు సర్కార్ ఎత్తుగడ ● మున్సిపల్ ఆస్తులను తాకట్టు పెట్టుకుని అభివృద్ధి పనులు చేయాలని సూచన ● జీఓ నంబర్ 151 జారీ ● లోటు బడ్జెట్లతో మున్సిపాలిటీలు కార్పొరేషన్/ వార్డులు జనాభా మున్సిపాలిటీ (అంచనా) విజయవాడ 64 11,43,232 మచిలీపట్నం 60 2,52,000 గుడివాడ 36 1,25,000 జగ్గయ్యపేట 31 51000 పెడన 23 35,000 ఉయ్యూరు 20 42,000 నందిగామ 20 48000 తిరువూరు 28 50,000 కొండపల్లి 40 70,200 వైఎస్సార్ తాడిగడప 38 2,50,000 సాక్షి, విజయవాడ: మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ఆస్తులు తాకట్టు పెట్టుకోవాలని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. దీనికి ‘పూల్డ్ మున్సిపల్ బాండ్ల’ను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే నగర, పట్టణాల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత. చంద్రబాబు ప్రభుత్వం వసతుల కల్పనతో పాటు ఎంపిక చేసిన ప్రాజెక్టుల పూర్తికి మున్సిపాలిటీలు తమ పరిధిలోని విలువైన ఆస్తులను తాకట్టు పెట్టుకోవాలని చెబుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలకు కల్పించాల్సిన రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, డ్రైన్ల, పారిశుద్ధ్యం, మురుగునీటి శుద్ధి నిర్వహణ, పార్కులు వంటి మౌలిక వసతుల కల్పన, నిర్వహణ బాధ్యతల నుంచి కూడా తప్పుకునేందుకు సిద్ధమైంది. పట్టణాల్లో ప్రజలకు కనీసం అందించాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ‘పూల్డ్ మున్సిపల్ బాండ్ల’ను తెరపైకి తెచ్చింది. మున్సిపల్ ఆస్తులను పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని చూస్తున్నారు. దీనికి ఇటీవల ప్రభుత్వం జీవో నంబర్ 151 జారీ చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 9 మున్సిపాలిటీలు ఉండగా ఇందులో విజయవాడ కార్పొరేషన్కు వేలసంఖ్యలో స్థిరాస్తులు(భూములు, భవనాలు, కమ్యూనిటీ హాల్స్, మార్కెట్లు, షాపులు) ఉన్నాయి. ఎలాంటి కీలక పనులు చేపట్టాలన్నా పూల్డ్ బాండ్ల ద్వారా ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ● పూల్డ్ బాండ్ల జారీకి నగర, పట్టణ, స్థానిక సంస్థలకు క్రెడిట్ రేటింగ్ తప్పనిసరి ● ఆదాయాన్ని ఆర్జించే మున్సిపల్ ఆస్తులను ఈ బాండ్ల జారీలో అనుసంధానం చేయడం ద్వారా క్రెడిట్ ప్రొఫైల్ను బలోపేతం చేయాలి -
గ్రామానికి గర్వకారణం.. చిరస్మరణీయం
కాలినడకన చదువుకున్న బాలుడు.. కోట్లాది అభిమానుల నటుడయ్యాడు ప్రతినాయకుడికి కొత్త నిర్వచనం ఎన్టీఆర్కు డూప్గా.. తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సినిమా దాటి.. సొంత ఊరిపై మమకారం కై కాల మరణానంతరం గ్రామస్తులు స్వచ్ఛందంగా ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి జయంతి, వర్ధంతి రోజున ఆ విగ్రహం వద్ద నివాళులర్పించడం కౌతవరం ప్రజలకు ఒక ఆనవాయితీగా మారింది. ‘మా ఊరిలో పుట్టి తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన మహానటుడు’ అని గ్రామస్తులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు. -
నర్సింగ్ కాలేజీలో అవినీతిపై విచారణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరుగుతున్న అవినీతిపై ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ‘పైసలిస్తేనే..ప్రాక్టికల్ మార్కులు’ అనే శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో డీఎంఈ కార్యాలయంలోని నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులను పిలిచి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు ఇవ్వాలని వత్తిడి చేస్తున్నారా అని అడిగారు. అలా నాలుగో ఏడాది విద్యార్థులు అందరినీ పిలిచి వారి వద్ద నుంచి లెటర్లు రాయించుకున్నారు. వారితో పాటు ఫ్యాకల్టీ సభ్యులను సైతం ఆమె విచారణ చేశారు. ఉదయం 11 గంటల సమయంలో నర్సింగ్ కళాశాలకు వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ సాయంత్రం 5 గంటల వరకూ ఉన్నారు. ఇక్కడ విచారణలో తేలిన అంశాలను రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. బలవంతంగా లెటర్.. మా ఇష్ట పూర్వకంగానే కళాశాలకు ఫండ్ ఇచ్చాం అంటూ విద్యార్థులపై వత్తిడి చేసి లెటర్లు ఇప్పించినట్లు తెలిసింది. అలా రాయకుంటే ప్రిన్సిపాల్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతో విద్యార్థినిలు తప్పనిసరి పరిస్థితులో లేఖలు రాసినట్లు పలువురు చెబుతున్నారు. ‘ఇష్టపూర్వకంగా ఇస్తే ఆర్థికంగా ఉన్న వాళ్లు ఇస్తారు.. పేద విద్యార్థులు కూడా డోనేషన్ ఇస్తారా అని’ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై గతంలోనే అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యార్థులను విచారణ చేసిన నర్సింగ్ డీడీ -
కౌన్సెలింగ్ ప్రారంభం
గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్)లో 2026–28 విద్యా సంవత్సరంలో డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్ కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభ మైంది. ఈ నెల 29వ తేదీ వరకు జరుగుతుందని డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వినయకుమార్ తెలిపారు. డైట్ అంగలూరుకు 99 మందిని, ఏజే కాలేజ్ మచిలీపట్నానికి 40 సీట్లను కన్వీనర్ కేటాయించారని చెప్పారు. డైట్ అంగలూరులో తొమ్మిది మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలనలో లెక్చరర్లు ప్రకాశం, రాజ్యలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్స్ శ్రీనివాస్, దివ్యశ్రీ, ఆఫీస్ సిబ్బంది శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి శ్రావణ్బాబు లబ్బీపేట(విజయవాడతూర్పు): పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు సోకకుండా చూడవచ్చని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రావణ్బాబు అన్నారు. ఆయన శుక్రవారం పలు ప్రాంతాల్లో జరిగిన ఫ్రైడే డ్రైడే తో పాటు మెగా పేరెంట్స్ టీచర్చ్ డేల్లో పాల్గొన్నారు. ముత్యాలంపాడులోని ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో శ్రావణ్బాబు ఆర్బీఎస్కే సేవలు, పిల్లల విద్య, ఆరోగ్యంపై చర్చించారు. సమతుల్య ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, నులిపురుగుల నివారణ, రక్తహీనత నివారన, టీకాలు వేయించుకోవడం, కౌమారదశ ఆరోగ్యం, అంటువ్యాధుల నివారణ ప్రాముఖ్యతపై ఆయన తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా మలేరియా అధికారి రాజునాయక్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ మహేశ్వరరావు, వైద్యులు ప్రవీణ్కుమార్, ప్రీతి తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యతో పాటు నైతిక విలువలు, వృత్తి నైపుణ్యాలను విద్యార్థులు పెంచుకోవాలని కృష్ణా విశ్వ విద్యాలయం వీసీ ప్రొఫెసర్ కూనా రామ్జీ అన్నారు. విజయవాడలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ విద్య పూర్తి చేసుకున్న వారికి శుక్రవారం గ్రాడ్యుయేషన్ పట్టాలు అందజేశారు. ముఖ్యఅతిథి ప్రొఫెసర్ రాంజీ మాట్లాడుతూ ఫార్మసీ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మరో అతిథి సిద్ధార్థ అకాడమీ హయ్యర్ ఎడ్యుకేషన్ రిజిస్ట్రార్ రవిచంద్ మాట్లాడుతూ అధ్యయనం, పరిశోధన, వృత్తి నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల కన్వీనర్ అరుణ్కుమార్, ప్రిన్సిపాల్ ఎ.సునీత, జి.రమణ, కళాశాల పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు లేరు.. ఇద్దరినీ పెంచుకుంటారా..!
విజయవాడ: తరుచూ తల్లి తమను మందలిస్తోందని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ అన్నాచెల్లులు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండం సీతానగరం చేరుకున్నారు.. బ్యారేజీ వద్ద చేపలు విక్రయిస్తున్న వారి వద్దకు వెళ్లి తమకు తల్లిదండ్రులు ఇద్దరు లేరని... మమల్ని పెంచుకుంటారా అని అడిగారు. దీంతో వారు ఆ చిన్నారులను అక్కున చేర్చుకున్నారు.. కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన అఖిల్, స్వేచ్ఛ అన్నాచెల్లెలు.. వీరిని తల్లి ప్రతి చిన్న విషయానికి మందలించడం, తిట్టడం, కోప్పడడం చేయడంతో మనస్తాపానికి గురై 21వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులైన రాజేశ్వరి, మహే‹Ùలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన కొత్తపేట సీఐ కొండలరావు పర్యవేక్షణలో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు చిన్నారులు ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం సీతానగరంలో చేపల విక్రయించే వారిని ఆరా తీయగా, తమ వద్దే ఉన్నట్లు పేర్కొని వారిని పోలీసులకు అప్పగించారు. సెక్టార్ ఎస్ఐ భారతి చిన్నారుల తల్లిదండ్రులను స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి వారిని అప్పగించారు. -
30 ఏళ్ల బస్సు సర్వీస్ ఒక్కసారిగా బంద్..!
కృష్ణాజిల్లా: గత 30 సంవత్సరాలుగా తిరుగుతున్న హనుమంతపురం ఆర్టీసీ సర్వీసును అర్ధాంతరంగా నిలిపివేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉయ్యూరు డిపో నుంచి వీరంకిలాకు, హనుమంతపురం, ముళ్లపూడి, ఐనంపూడి, భట్లపెనుమర్రు, పెడసనగల్లు గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్సు నడిపేవారు. ఉదయం 10 గంటలకు ఒక ట్రిప్పు, సాయంత్రం 4 గంటలకు మరో ట్రిప్పు ఉండేది. విజయవాడ వరకు వెళ్లే ఈ సర్వీస్ పమిడిముక్కల, మొవ్వ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడేది. ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన వీరంకిలాకు వెళ్లాలన్నా, వైద్యం కోసం వీరంకిలాకు, కపిలేశ్వరపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలన్నా ఈ బస్సు తప్ప ఆయా గ్రామాలకు ఏ విధమైన రవాణా సౌకర్యం లేదు. ఈ గ్రామాలకు కనీసం ఆటోలు కూడా తిరిగే పరిస్థితి లేదు. ఉన్న ఒక్క బస్ సరీ్వస్ నిలిపివేయడంతో ఉదయం కాలేజీలకు, ఉద్యోగాలకు, విజయవాడ పనుల మీద వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరేందుకు రవాణా సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ఇక ఆసుపత్రులకు వెళ్లే రోగుల బాధలు వర్ణనాతీతం. కనుమూరుకు ఎందుకు మార్చారో..?కనుమూరు గ్రామం విజయవాడ– మచిలీపట్నం జాతీయ రహదారి పక్కన ఉంది. ఈ గ్రామస్తుల రాకపోకలకు ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇటీవల కనుమూరులో రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే, మంత్రి, ఆర్టీసీ చైర్మన్, జిల్లా అధికారులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కనుమూరు గ్రామంలో నుంచి వేల్పూరు, ముళ్లపూడి మీదుగా వెళ్లేందుకు కొత్తగా ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సర్వీసు ప్రారంభం కాగానే హనుమంతపురం గ్రామానికి వెళ్లే బస్సును నిలిపివేశారు. రహదారి పక్కనున్న కనుమూరుకు కొత్త సర్వీస్ వేయడం, తమ గ్రామానికి 30 ఏళ్లుగా వస్తున్న బస్సు నిలిపివేయడమేమిటని హనుమంతపురం తదితర గ్రామాల ప్రజలు లబోదిబోమంటున్నారు. ఆర్టీసీ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశామని, అధికారులు అదిగో..ఇదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకరిద్దరు అధికార పార్టీ నాయకుల స్వార్థం కోసం తమను ఇబ్బందులు పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. హనుమంతపురం సరీ్వస్ను యథావిధిగా కొనసాగించకపోతే ఉయ్యూరు డిపో ఎదుట గ్రామస్తులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. హనుమంతపురం గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్ గ్రామస్తులతో కలిసి మంగళవారం ఉయ్యూరు డిపోకు వెళ్లి మేనేజర్ ప్రశాంత్ను కలిసి సమస్య వివరించి బస్సు సర్వీస్ను కొనసాగించాలని కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సర్వీస్ను కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని మేనేజర్ హామీ ఇచ్చారు. -
మెగా పీటీఎంకు తల్లిదండ్రులు తప్పనిసరి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ విద్యా సంస్కరణల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం) కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులతో పాటు తండ్రులు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గత మూడు విడతల మెగా పీటీఎంలలో ఎక్కువగా తల్లులు మాత్రమే పాల్గొన్నారని, రేపు జూలై 24న జరగబోయే కార్యక్రమానికి ఈసారి తండ్రులు కూడా హాజరైతే పిల్లల విద్యా ప్రగతి, అభ్యాస స్థాయిపై ప్రత్యక్ష అవగాహనతో పాటు వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఆధారంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా సమావేశమై విద్యార్థి అభ్యాస స్థాయి, బలాలు, లోపాలను మెరుగుపరిచే చర్యలపై సమగ్రంగా చర్చిస్తారని తెలిపారు. డోనర్ యాప్.. ‘డోనర్ యాప్’ను కూడా ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తమ గ్రామంలోని లేదా తాము చదివిన పాఠశాల అభివృద్ధికి సహకరించాలనుకునే పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, దాతలు తమ శక్తి మేరకు ఈ యాప్ ద్వారా విరాళాలు అందించవచ్చని వివరించారు. తల్లికి వందనం రాని వారు.. తల్లికి వందనం పథకం కింద జిల్లాలో దాదాపు 99 శాతం మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమైందని కలెక్టర్ తెలిపారు. ఇంకా ఎవరికై నా నగదు జమ కాకపోయినా లేదా ఇతర సమస్యలు ఉన్నా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తమ స్థితిని తెలుసుకుని ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు పాల్గొన్నారు. సమన్వయంతో విజయవంతం చేయండి అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పేరెంట్స్ మీటింగ్ను విజయవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక అధికారులకు, విద్యాశాఖాధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం)పై అధికారులతో గురువారం తన చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించాలన్నారు. డీఈవోతో పాటు డీఐఈఓ సరళ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో ప్రయివేటు విద్యాసంస్థలు శుక్రవారం సెలవు ప్రకటించినట్టు వస్తున్న వార్తలపై కృష్ణా డీఈవో యూవీ సుబ్బారావును వివరణ కోరగా.. తాము ఏ పాఠశాలకూ సెలవు కోసం అనుమతి ఇవ్వలేదని, పీటీఎం యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు. -
దుర్గమ్మ సన్నిధిలో కొబ్బరి చిప్పల టెండర్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు సమర్పించే కొబ్బరి చిప్పలను పోగు చేసుకునే హక్కు కోసం దేవస్థానం గురువారం టెండర్ పక్రియను నిర్వహించింది. విజయవాడకు చెందిన సంకబత్తుల నాగ వైష్ణవి బహిరంగ వేలం పక్రియ ద్వారా టెండర్కు రూ. 1.35 కోట్లకు దక్కించుకున్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన మహా మండపం ఆరో ఆంతస్తులో టెండర్ పక్రియ జరిగింది. టెండర్ పక్రియను ఆలయ ఈవో శీనానాయక్, ఛైర్మన్ రాధాకృష్ణ, డీఈవో కిషోర్కుమార్లు పర్యవేక్షించారు. రూ.10 లక్షల ప్రథమ దరావత్తుగా టెండర్ పక్రియ ప్రారంభం కాగా, 5 గురు కాంట్రాక్టర్లు డిపాజిట్ను చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొన్నారు. దేవస్థానం పాటను రూ. 1.10 కోట్ల నుంచి ప్రారంభించింది. తొలుత కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో పాటను రూ. నాలుగు లక్షలు తగ్గించి రూ.1.06 కోట్ల నుంచి ప్రారంభించారు. విజయవాడకు చెందిన సంకబత్తుల నాగ వైష్ణవి, కాకినాడకు చెందిన పవన్ సూర్య ట్రేడర్స్, విజయవాడకే చెందిన వీఎల్డీ ట్రేడర్స్, కరిష్మా ఇంటిరీయల్, సీఎస్ఆర్ ఎంటర్ప్రైజర్స్, నాగ వైష్ణవి ట్రేడర్ బహిరంగ వేలంలో పాల్గొన్నారు. పాటను కాంట్రాక్టర్టు పోటీ పడి పెంచుతూ చివరకు నాగ వైష్ణవి ట్రేడర్స్, నాగ వైష్ణవిల మధ్య పోటాపోటీగా సాగింది. చివరకు నాగ వైష్ణవి రూ. 1,36,50,000కు పాటను దక్కించుకున్నారు. ఇక సీల్డ్ టెండర్లో కాకినాడకు చెందిన పవన్సూర్య ట్రేడర్ రూ. 1,19,99, 989, సీఎస్ఆర్ ఎంటర్ప్రైజర్స్ రూ. 90 లక్షలకు దాఖలు చేశారు. ఇక ఈ టెండర్లో పవన్ సూర్య ట్రేడర్స్ రూ. 1.22 కోట్లకు దాఖలు చేయగా, మూడు పక్రియలలో బహిరంగ వేలం ద్వారా అత్యధిక మొత్తంలో టెండర్ను సంకబత్తుల నాగ వైష్ణవి దక్కించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. టెండర్ ఏడాది కాలపరిమితికి జరిగిందని, రానున్న ఏడాది పది శాతం అదనంగా పాటతో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది రూ. 1.01 కోట్లకు పలకగా, ఈ ఏడాది 34.56 శాతం అధికంగా టెండర్ పలకడం విశేషమని అధికారులు పేర్కొన్నారు. టెండర్ పక్రియను ఆలయ ఎఈవో ఎన్. రమేష్బాబు పర్యవేక్షించగా, ట్రస్ట్ బోర్డు సభ్యుల సమక్షంలో నిర్వహించారు. -
26న దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు 26వ తేదీన తెలంగాణ బంగారు బోనం సమర్పించనున్నారు. భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5 వందల మంది కళాకారులు, బేతాళ నృత్యకారులతో ఊరేగింపుగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. బోనాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రాత్రికి హైదరాబాద్ నుంచి బోనాల కళాకారులు నగరానికి చేరుకుంటారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. బోనాల కమిటీ సభ్యులకు సీవీ రెడ్డి చారిటీస్లో వసతి కల్పించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు సీవీ రెడ్డి చారిటీస్ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఆదివారం కావడం, మరో వైపున ఆషాఢ మాసోత్సవాల నేపథ్యంలో సారె సమర్పించే భక్త బృందాల కోలాహలం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 27 నుంచి శాకంబరీ ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. శాకంబరీ ఉత్సవాల నిమిత్తం ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలలో కూరగాయలు, ఆకుకూరలను కట్టేందుకు ఐరన్గ్రిల్స్ను ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేస్తుంది. మరో వైపున శాకంబరీ ఉత్సవాల అలంకరణకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలా ల సేకరణకు ఆలయానికి చెందిన కొంత మంది అధికారులు, సిబ్బంది రైతులను, హోల్సేల్ వ్యాపారులను కలిసి విరాళాలను అందించాలని కోరారు. శని, ఆదివారం నాటికి కూరగాయలు, ఆకుకూరలు దేవస్థానానికి చేరే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. కాగా రానున్న పది రోజులు చాలా కీలకమని ఆలయ అధికారులు భావిస్తున్నారు. దీంతో సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా విధులు కేటాయింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
కుందేరు ఆర్ఎస్కేలో కేరళ మంత్రి
కంకిపాడు: మండలంలోని కుందేరు రైతు సేవ కేంద్రాన్ని కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ గురువారం సందర్శించారు. రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు ఆర్ఎస్కేను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ–క్రాప్ నమోదుతో పంట నిర్ధారణ, దిగుబడులు అంచనా, ధాన్యం సేకరణలో తేమశాతం పరిశీలనకు తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. రైతులకు గోనె సంచులు అందజేత, రవాణా సౌకర్యాల కల్పన, రైతులకు సొమ్ముచెల్లింపులపై ఆరా తీశారు. ధాన్యం సేకరణ తీరుపై స్థానిక అధికారులతో సమీక్షించారు. ఉయ్యూరు ఆర్డీఓ కరుణకుమారి, తహసీల్దార్ వీ.భావనారాయణ, ఏఓ ఉషారాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. పైలెట్ ప్రాజెక్టుకు గన్నవరం మండలం ఎంపిక చిలకలపూడి(మచిలీపట్నం):‘మీ భూమి–బ్లాక్ చెయిన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థ’ పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి దశలో ఈ పైలెట్ ప్రాజెక్టు అమలుకు జిల్లాలోని గన్నవరం మండలాన్ని ఎంపిక చేశారు. మండలంలోని 18 గ్రామాలకు చెందిన 25,680 భూ ఖాతాలను ఈ వ్యవస్థలో నమోదు చేయనున్నారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపై సమీకరించడం ద్వారా భూ రికార్డుల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టనున్నారు. ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా భూ రికార్డులకు ఒకే ప్రామాణిక సమాచారం (సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్) అందుబాటులోకి వస్తుందని, రికార్డుల్లో అక్రమ మార్పులు, భూ మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు భూ సంబంధిత సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. పోతురాజు, గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం, గన్నవరం తహసీల్దార్ శివయ్య, సర్వే శాఖ సహాయ సంచాలకుడు లక్ష్మణరావు, వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి రామణి, మత్స్యశాఖ అధికారి అయ్యా నాగరాజా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ కాంక్లేవ్ను శుక్రవారం నుంచి 26 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించనున్నట్లు బీఎన్ఐ విజయవాడ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్దేశాయ్ తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 128 స్టాళ్లతో ఎక్స్పో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడంతో పాటు కొత్త కస్టమర్లు, వ్యాపార భాగస్వాములను కలుసుకునే అవకాశాన్ని ఈ ఎక్స్పో కల్పిస్తుందని చెప్పారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, బ్యాడ్మింటన్ దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో నిర్వాహకులు త్రినాథ్ నండూరి, బి.దేవకుమార్, లక్ష్మీ శాంతి కోగంటి, పి.యువకిషోర్, ఎన్.నాగార్జున తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కల్చరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని ఉండవల్లి గుహల సముదాయంలో 25, 26 తేదీలలో నిర్వహించే తెలుగు మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్ పర్సన్ తెలిపారు. గురువారం విజయవాడలోని కార్యాలయంలో మాట్లాడుతూ ఉదయం 6 గంటలకు తొలిరోజు సభలు ప్రారంభమవుతాయన్నారు. రచయిత్రుల కోసం ఆమె మాట అక్షరబాట, కవుల కోసం చెట్టునీడన చిరుగాలి, చిన్నారుల కోసం అమ్మమ్మ ముచ్చట్లు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. -
4వ శతాబ్దానికి చెందిన విగ్రహాలను పరిరక్షించాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం కాజ గ్రామంలోని పొలాల్లో బయల్పపడిన 4వ శతాబ్దానికి చెందిన రెండు చిన్న వినాయక విగ్రహాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ మొగల్రాజపురంలోని కల్చరల్ సెంటర్లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కాజ గ్రామానికి చెందిన సింహాద్రి వెంకటరామారెడ్డి తన పొలాన్ని దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు లభించాయని తనకు సమాచారం ఇవ్వడంతో గురువారం వాటిని పరిశీలించానని చెప్పారు. మూడు నుంచి 5 సెంటీమీటర్ల పరిమాణం గల ఎర్ర ఇసుక రాతి (చింతామణి రాయి)తో చేసి రెండు విగ్రహాలతో పాటు ఎరుపు, నలుపు, గచ్చకాయ, గోధుమ రంగు మట్టి పాత్రల పెంకులు కూడా లభించాయని తెలిపారు. అవి 4వ శతాబ్దం (శాతవాహన, ఆనందగోత్రినుల కాలం) నాటివని శివనాగిరెడ్డి చెప్పారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల ఈ విగ్రహాలను పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివనాగిరెడ్డి కోరారు. పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి -
తల్లికి వెన్నుపోటు!
ఆంక్షల ‘వందనం’.. అర్హుల రోదనం కూటమి పాలనలో అందరికీ వెన్నుపోటే. యువత, విద్యార్థులు, రైతులు ఇలా అందరికీ ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కదానిని నెరవేర్చలేదు. తాజాగా జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడిని నేడు తల్లికి వందనం పేరు పెట్టి దిగజారుస్తున్నారు. ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు అని చెప్పి తల్లులనే తగ్గించి వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి తల్లికివందనం పథకాన్ని ఎగ్గొడుతున్నారు. – ఎ. రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘ నేత వన్టౌన్(విజయవాడపశ్చిమ): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని తల్లులకు మరోసారి వెన్నుపోటు పొడిచింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కేవలం పేరు మార్చడం మాత్రమే కాకుండా ఉమ్మడి జిల్లాలో వేలాది మంది తల్లులకు పలు కారణాల పేరుతో అనర్హులుగా ప్రకటించి ఎగ్గొడుతోంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి పిల్లవాడికి అమలు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ హడావుడి చేసింది. తీరా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు కేవలం ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే వేలాది మంది తల్లులకు ఎగనామం పెట్టిందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆంక్షల పేరుతో ఎగవేత.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పలు కారణాలు చూపుతూ వేలాది మందికి ఈ పథకాన్ని ఎగవేసేందుకు పాలకులు కుట్ర చేశారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. గ్రామాల్లో పది వేలు, పట్టణాల్లో 12వేలకు మించి ఆదాయం ఉంటే వారికి ఈ పథకం వర్తించదని నిబంధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు పైగా ఉంటే వారికి సైతం ఈ పథకం వర్తించదు. అలాగే గత ఏడాది పది, ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారికి ఈ పథకంలో చూపటం లేదని ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ పథకంలో పేర్లు కనిపించటం లేదని పలువురు వివరిస్తున్నారు. అదే విధంగా ఐటీ రిటర్న్స్ పేరుతో చాలా మందిని దీనిలో అనర్హులుగా ప్రకటిస్తూ జాబితాలను ప్రదర్శిస్తున్నారు. అయితే తాము ఐటీ చెల్లించటం లేదని వారంతా ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2023లో 3,00,120 మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదును వేసింది. ఆ క్రమంలో కృష్ణాజిల్లాలో 1,29,533 మంది తల్లులకు, ఎన్టీఆర్ జిల్లాలో 1,70,587 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన నివేదికల ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2,82,922 మంది తల్లుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ అయ్యేటట్లుగా నిధులను విడుదల చేశారు. ఆ క్రమంలో కృష్ణాజిల్లాలో 1,23,110 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 1,59,812 మంది తల్లుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,198 మంది తల్లులకు ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ క్రమంలో కృష్ణాజిల్లాలో 6,423 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 10,775 మందికి మొండి చెయ్యి చూపుతోంది. అప్పుడు విమర్శించి.. అదే పని.. గత ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13 వేల నగదును జమ చేసినప్పుడు కూటమి నేతలు చాలా దారుణంగా మాట్లాడారు. ఎన్నికల వేళ నీకు15 వేలు, నీకు 15 వేలు.. అంటూ హడావుడి చేశారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగిసిన తరువాత అదే రూ.13వేలనే వేసి మిగిలిన రెండు వేలను పాఠశాలల అభివృద్ధి పేరుతో పక్కదోవ పట్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గత ఏడాది ఆ రెండు వేలు చొప్పున ఏ విద్యాసంస్థకు కేటాయించలేదని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివరిస్తున్నారు. వార్డు సచివాలయాల వద్ద అర్హుల జాబితాలను అధికారులు ప్రకటించారు. అయితే గతంలో అమ్మ ఒడి పథకం తీసుకున్న వారి పేర్లు ప్రస్తుత జాబితాల్లో అనర్హులుగా కనపడుతుండటంతో వారంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ తాము తీసుకున్న ఈ పథకం ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదంటూ మండిపడుతున్నారు. సచివాలయాల సిబ్బంది మీ పేరు మీద కారు ఉందని, ఐటీ రిటర్న్స్ ఉన్నాయని, స్థలం నమోదైందని పలు అంశాలను వివరిస్తున్నారు. అయితే తమకు మీరు చెబుతున్నవి ఏమి లేవంటూ వారు వాపోతున్నారు. -
పైసలిస్తేనే.. ప్రాక్టికల్ మార్కులు!
లబ్బీపేట(విజయవాడతూరు): విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో వసూళ్ల దందా సాగుతోంది. అక్కడ ఏ పనిచేయాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే. అంతేకాదు ప్రాక్టికల్ మార్కులు వేయాలంటే అడిగినంత చెల్లించాల్సిందే. చివరికీ పేద విద్యార్థినులకు వచ్చే స్టైపెండ్లో సైతం కమీషన్లు అడుగుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాక రికార్డులపై సంతకాలు పెట్టేందుకు సైతం టీచింగ్ స్టాఫ్ డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకుంటే, మీరు కోర్సు పూర్తి చేసి ఎలా వెళతారనే బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా, ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. 600 పైగా విద్యార్థినులు.. గత ప్రభుత్వం విజయవాడలో బీఎస్సీ నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏటా వంద మందికి అడ్మిషన్లు కల్పిస్తుంటారు. ప్రస్తుతం నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న వారు.. ఇంటర్న్షిప్ చేస్తున్న వారు అంతా కలిపి దాదాపు 604మంది ఉన్నారు. ఇక్కడ ప్రిన్సిపాల్, టీచింగ్ సిబ్బందితో పాటు, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కూడా పనిచేస్తుండగా, దీని పర్యవేక్షణ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, ఆ కార్యాలయంలోని నర్సింగ్ విభాగం చూస్తుంటుంది. దీంతో ఇక్కడ ఏమి జరిగినా పట్టించుకునే వారే ఉండటం లేదు. వసూళ్ల దందా.. నర్సింగ్ కళాశాలలో విద్యార్థినుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఫైనలియర్ విద్యార్థినుల ప్రాక్టికల్స్ జరగ్గా, ఒక్కో విద్యార్థి రూ.4వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. విద్యార్థులు అంత ఇచ్చుకోలేమంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.1500, రూ.2 వేలు చొప్పున దాదాపు రూ.2 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇదంతా ప్రిన్సిపాల్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రిన్సిపాలే చేస్తుంటే తామేమైనా తక్కువా అంటూ టీచింగ్ సిబ్బంది సైతం రికార్డులపై సంతకాలు పెట్టేందుకు డబ్బులు వసూళ్లు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఇస్తే ఒక రేటు, మార్కుల జాబితా ఇస్తే మరో రేటు నిర్ణయించి మరీ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్టైపెండ్ వచ్చినా వదలరు.. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాల మూతపడగా అక్కడి విద్యార్థులను ఈ కళాశాలకు ఎటాచ్ చేశారు. వారికి ఏడాదిన్నకు సంబంధించి ఒకేసారి రూ.25వేల నుంచి రూ.30వేల వరకూ స్టైపెండ్ వచ్చింది. వాటి నుంచి సైతం తలా రూ.3వేలు ఇవ్వాలంటూ విద్యార్థినులకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో చేసేది లేక అడిగినంత ఇచ్చినట్లు చెబుతున్నారు. వాళ్లు అక్కడ చదువుతుండటంతో బయటకు చెప్పేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. ఇలా ప్రతి పనికీ రేటు నిర్ణయించి వసూళ్ల దందా సాగిస్తున్న నర్సింగ్ కళాశాల ఆగడాలపై రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. -
తిరుపతమ్మకు సారె సమర్పణ
పెనుగంచిప్రోలు: ఆషాఢమాసం సందర్భంగా పెనుగంచిప్రోలు గ్రామంలో కొలువైన శ్రీ తిరుపతమ్మ తల్లికి గురువారం గ్రామంలోని భక్త సేవా సేవాసంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు సారె సమర్పించి బోనాలు చెల్లించారు. అమ్మవారి రంగుల మండపం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకోగా వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి సారె సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు రాజు, లక్ష్మణ్, కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్బాబు లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలులో ప్రగతి సాధించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణ్బాబు అన్నారు. ఆయన జిల్లా పరిధిలోని పీహెచ్సీ వైద్యాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆరోగ్య కార్యక్రమాలను అంశాల వారీగా చర్చించి, అభివృద్ధి సూచికలో ముందుండాలన్నారు. అందుకు అనుగుణంగా అన్ని కార్యక్ర మాలను సమర్థంగా నిర్వహించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. ఈ సమీక్షలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతీదేవి, డీఐఈ డాక్టర్ శరత్బాబు, డీపీఎంఓ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని కృష్ణలంక, భ్రమరాంబపురంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కృష్ణలంక–7ను గురువారం ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.శ్రావణ్బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం పరిసరాలు, పరిశుభ్రత, త్రాగునీటి సౌకర్యం, మూత్రశాలలు, వాటిలో నీటి సదుపాయం పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. పరిశుభ్రతపైన, కనీస వసతులపైన ప్రత్యేక దృష్టి పెట్టి అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. అనంతరం లాబొరేటరీలో పరీక్ష వివరాలను పరిశీలించి రిపోర్ట్లను తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి మందులను పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడుల విషయంలో నమోదవుతున్న కేసుల విచారణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్, చార్జ్షీట్ దాఖలులో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత గత సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమగ్రంగా సమీక్షించారు. సమావేశంలో కమిటీ సభ్యులు కె.కొండలరావు, టి.సాయిబాబా, ఎ.శ్రీదేవిలు ఎస్సీ, ఎస్టీలకు చేపడుతున్న కార్యక్రమాలు, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలను ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 78 ప్రభుత్వ వసతి గృహాల్లో ఏవైనా లోపాలు గుర్తిస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అధికారులు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసుల పురోగతిని వివరించారు. 2026 మార్చి 31 నాటికి 122 ట్రయల్ కేసులు పెండింగ్లో ఉండగా, అనంతరం జూన్ 20 వరకు మరో 18 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో ఒక కేసులో నిందితుడు దోషిగా తేలగా, రెండు కేసుల్లో నిర్దోషులుగా తీర్పు వెలువడిందన్నారు. మరో 35 కేసుల్లో సాక్షుల విచారణ పూర్తికాగా, ఐదు కేసులు ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్నాయని వివరించారు. అనంతరం మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనపై సమీక్షిస్తూ, జిల్లాలో ప్రస్తుతం మాన్యువల్ స్కావెంజర్లు లేరని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సీసీఆర్బీ ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాన్యువల్ స్కావెంజర్స్ కమిటీ సభ్యులు ఆనంద కీర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పి.జ్యోతిలక్ష్మిదేవి, విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, ఏసీపీలు సి.హెచ్. శ్రీనివాసరావు, పి.రామమోహన్రావు, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మిరెడ్డి రజనికి 14 రోజుల రిమాండ్
కోనేరుసెంటర్: మానవహక్కుల సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలిగా చెప్పుకునే మచిలీపట్నంకు చెందిన అమ్మిరెడ్డి రజనిపై చిలకలపూడి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ ఎస్కే నభీ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా చల్లపల్లి మండలానికి చెందిన షేక్రిమ్షి భర్తతో మనస్పర్ధల కారణంగా గత యేడాది విడాకులు తీసుకుంది. అనంతరం మచిలీపట్నంకు చెందిన అమీన్ అనే వ్యక్తిని ఈ యేడాది జనవరి 15న రెండో వివాహం చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత వీరిరువురి మధ్య కూడా దూరం పెరిగింది. అమీన్ వేఽధింపులు భరించలేని రిమ్షి ఇటీవల ఇనగుదురుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో రిమ్షి సమీప బంధువు పోలీసుల వద్ద కంటే అమ్మిరెడ్డి రజని వద్దకు వెళితే న్యాయం జరుగుతుందని చెప్పడంతో ఆమె ఇటీవల మానవహక్కుల సంఘం (ప్రైవేటు సంస్థ) జాతీయ అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజని వద్దకు వెళ్ళి సమస్య వివరించింది. దీంతో కౌన్సెలింగ్ పేరుతో అమీన్ను తన కార్యాలయానికి పిలిచిన రజని అమీన్ ఉత్తముడు అంటూ సర్టిఫికెట్ ఇవ్వటంతో పాటు తప్పు మొత్తం నీదేనంటూ రిమ్షిపై నిందలు మోపింది. రిమ్షి మొబైల్ను బలవంతంగా లాక్కుని తన సొరుగులో పెట్టుకుంది. ఆమెను భయబ్రాంతులకు గురి చేసి రూ. 40,000 తన ఖాతాలోకి ఫోన్పే ద్వారా వేయించుకుంది. ఐదు గ్రాముల బంగారాన్ని బలవంతంగా తీసుకుంది. చివరికి తప్పంతా నీదేనంటూ బెదిరించి పంపేసింది. దిక్కుతోచని రిమ్షి మరలా పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ చిలకలపూడి పోలీస్స్టేషన్లో రజినిపై ఫిర్యాదు చేసింది. బాఽధితురాలికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని రజని కార్యకలాపాలపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ జిల్లా ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. విచారణలో బాధితురాలి ఫిర్యాదు వాస్తవమేనని తెలుసుకున్న సీఐ నభీ విషయాన్ని ఉన్నతాధికారుల నోటీసులో పెట్టి రజనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గురువారం ఆమెను కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు సీఐ తెలిపారు. -
విజయవాడలో ఉద్రిక్తత..
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలు లోక్భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. దీంతో, పోలీసులు.. విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
నాణ్యమైన వైద్యం లేదు
కార్మికులు ఈఎస్ఐ ద్వారా నాణ్యమైన వైద్యసేవలు ఉచి తంగా పొందొచ్చని భావిస్తారు. కానీ విజయవాడలో ఈఎస్ఐ ఆస్పత్రి తాత్కాలిక భవనాల్లో నిర్వహించడంతో, శస్త్ర చికిత్స అంటే ప్రైవే టుకు రిఫర్ చేస్తున్నారు. అక్కడ ఎంతో కొంత డబ్బులు చెల్లించుకోవాల్సిన వస్తోందని పలువురు చందా దారులు చెబుతున్నారు. విజయవాడలో ఈఎస్ఐ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి కలగానే మిగిలింది. ఇప్పటికై నా పాలకులు ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణంపై దృష్టి పెట్టాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ వైద్య విభాగం ● -
మచిలీపట్నం, ఉయ్యూరుకు ‘స్వచ్ఛాంధ్ర’ అవార్డులు
చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ’ఆపరేషన్ క్లీన్ స్వీప్’ విజయవంతమైందని కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. మచిలీపట్నం, ఉయ్యూరు పురపాలక సంఘాలకు స్వచ్ఛాంధ్ర అవార్డులు లభించాయని పేర్కొన్నారు. బ్లాక్ స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా అభివృద్ధి చేసిన కృషికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 23 నుంచి జూన్ 26 వరకు జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తరచూ చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి, అందుకు కారణాలను విశ్లే షించి, డోర్–టు–డోర్ చెత్త సేకరణలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించే చర్యలు చేపట్టామన్నారు. ఆ ప్రాంతాల్లో తిరిగి చెత్త వేయకుండా ఉండేలా మొక్కలు నాటడం, గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు వేయించడం, బెంచీలు ఏర్పాటు, పరిశుభ్రత సందేశాలతో అలంకరించడం వంటి చర్యల ద్వారా ఆ ప్రాంతాలను ఆహ్లాదకరమైన గ్రీన్ స్పాట్లుగా అభివృద్ధి చేశామని వివరించారు. జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల పరిధిలో మొత్తం 141 బ్లాక్ స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా అభివృద్ధి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అమలు చేసిన ఈ వినూత్న కార్యక్రమాన్ని గుర్తించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన తొమ్మిది పురపాలక సంఘాల్లో మచిలీ పట్నం నగరపాలక సంస్థ, ఉయ్యూరు మునిసిపాలిటీకి స్వచ్ఛంధ్ర అవార్డులు ప్రదానం చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు, శానిటేషన్ సెక్రటరీ, మున్సిపల్ సిబ్బంది, మునిసిపల్ కమిషనర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు కలెక్టర్ బాలాజీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ఇదే స్ఫూర్తితో మరింత విస్తతంగా కొనసాగిస్తామని వెల్లడించారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.46 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. మహామండపం ఆరో అంతస్తులో కానుకలను బుధవారం లెక్కించారు. 16 రోజులకు రూ.3,46,08,014 నగదు లభించినట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. 280 గ్రాముల బంగారం, 4.300 కిలోల వెండి, 905 యూఎస్ఏ డాలర్లు, 35 ఆస్ట్రేలియా డాలర్లు, 140 యూఏఈ దిర్హమ్స్, 870 కెనడా డాలర్లు, 100 సౌత్ ఆఫ్రికా ఫౌండ్లు, 800 కెన్యా షిల్లాంగ్స్, రెండు వేల ఇండోనే షియా రుపియాలు, లక్ష వియాత్నం డాంగ్లతో పాటు ఇతర దేశాలకు చెందిన కరెన్సీ లభించిందని తెలిపారు. కానుకల లెక్కింపును ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఏసీ రంగారావు, డీఈఓ కిషోర్కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. మచిలీపట్నంఅర్బన్: ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీ జీఈఏ) కృష్ణా జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు జి.శ్రీనివాస్ బుధవారం కలెక్టర్ డి.కె.బాలాజీని మర్యాదపూర్వకంగా కలి శారు. ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షుడు పి.రాము ఉద్యోగోన్నతిపై భీమవరం బదిలీ కావడంతో, జిల్లా అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షుడిగా ఉన్న జి.శ్రీనివాస్ను తాత్కాలిక ఇన్చార్జి అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు డీఈఓ యు.వి. సుబ్బారావును కలిసి ఉద్యోగుల సమస్యలు, పలు పరిపాలనా అంశాలకు సంబంధించిన వినతిపత్రాన్ని సమర్పించారు. జిల్లా కార్యదర్శి తోట ప్రసాద్, ఉపాధ్యక్షులు సీహెచ్.ఎస్.ఆర్.పవన్ కుమార్, రవి, టౌన్ అధ్యక్షుడు పి.వి. పరమేశ్వరరావు, కె.శ్రీనివాసులు, పి.విజయ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. గంపలగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే అదనపు భవనాల నిర్మాణ, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గంపలగూడెం మండలం వినగడప జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం ఆయన తనిఖీచేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాల సాధనకు కృషిచేసిన ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. పాఠశాలకు ఆటస్థలం లేకపోవడం, రోడ్డుకు ఇరువైపులా తరగతి గదులు ఉడటంతో ఇబ్బందికరంగా ఉందని హెచ్ఎం రవికిరణ్ కలెక్టరు దృష్టికి తెచ్చారు. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మధుసూదనరావు, తహసీల్దారు రాజకుమారి పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ రైతులకు నష్టం చేకూర్చే ఏ విధమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపైనా మోదీ నేతృత్వంలోని కేంద్రం సంతకం చేయకూడదని రైతు సంఘాల సమన్వయ సమితి డిమాండ్ చేసింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది. రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో మామిడి, పొగాకు, ఆక్వా, పౌల్ట్రీ రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఉపాధ్య క్షుడు మల్నీడి యలమందారావు, రైతు, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
అన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు బుధవారం విరాళాలు అందజేశారు. విజయవాడ గాంధీనగర్కు చెందిన దిట్టకవి వెంకట సుబ్బరాయ్ శర్మ తన తల్లి అలివేలు పేరిట అమ్మవారి అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అలాగే విజయవాడకు చెందిన పర్వతం గోపీచంద్ తన భార్య భరణి పేరిట అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశానికి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్, విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది, 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు. అర్హులైన అభ్యర్థులు ఐటీఐ అడ్మిషన్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో గానీ, ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు స్వయంగా వచ్చి ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయాలనన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 6 గంటల లోగా ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్ దరఖాస్తు చేయడంలో సహాయం కోసం విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, వివరాలకు సెల్: 94906 39639 నంబర్ను సంప్రదించాలని కోరారు. పారా స్పోర్ట్స్ ఓవరాల్ చాంప్ కృష్ణా మచిలీపట్నం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష, పీఎం శ్రీ, రాష్ట్ర సహిత విద్యా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో అగిరిపల్లి మండలం తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్ పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్ ఫర్ సీడబ్ల్యూఎస్ఎన్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భరణి కృష్ణా జిల్లా దివ్యాంగ విద్యార్థులకు ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని అందజేశారు. పోటీలో్ల్ జిల్లా దివ్యాంగ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో పతకాలు సాధించారు. గూడూరు మండలానికి చెందిన అమీనా తబస్సుమ్ షాట్పుట్, 400 మీటర్ల పరుగు, లాంగ్ జంప్లో పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయి ఎంపిక రిలే పోటీలో ప్రథమస్థానం దక్కించుకుంది. అలాగే వినుకొండ భరత్బాబు, మహమ్మద్ ఆనస్, మురాల రోహిత్, ఎం. తేజశ్రీ దుర్గ కూడా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు కీర్తి తెచ్చారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, సహిత విద్య ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆర్.కుముదిని సింగ్, జిల్లా సహిత విద్య సమన్వయకర్త కళ్లేపల్లి ఏడుకొండలు అభినందించారు. -
న్యాయం కోరి వస్తే.. వారిపైనే కేసులా?
లబ్బీపేట(విజయవాడతూర్పు): పోలీసుల వ్యవహారశైలిని ఎండగడుతూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ కృష్ణాజిల్లా ఎస్పీకి ఘాటు లేఖ రాశారు. జిల్లాలో అమలవుతున్న పోలీసు రాజ్యాంగం కూటమి ప్రభుత్వ పాలనను స్పష్టం చేస్తోందని అందులో పేర్కొన్నారు. మహానీయుడు నందమూరి తారక రామారావు పుట్టిన గడ్డపై ఎందరో ఎస్పీలు గొప్పగా విధులు నిర్వహించారని, కానీ ప్రస్తుత ఎస్పీ పనితీరుతో నిజాయితీ గల పోలీ సులు, అధికారులు సైతం మనస్సాక్షిగా పనిచేయలేక పోతున్నామని అంతర్మఽథనం చెందుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా వంటిపై ఖాకీ యూనిఫాం వేసుకుని న్యాయం చేస్తున్నామా అనే దిగులుతో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఫిర్యాదులు చేసేందుకు వెళ్తే.. నాపై ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెట్టి రాజకీయ గందరగోళం, ప్రజల్లో అశాంతి, వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని అనిల్కుమార్ లేఖలో పేర్కొన్నారు. పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే న్యాయం చేయక పోగా, పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని అంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన వారిపైనే కేసులు పెట్టడం పోలీసు రాజ్యాంగమా అని ఆ లేఖలో ప్రశ్నించారు. కేసులు నాకేమీ కొత్తకాదని, ప్రజల కోసం ఎన్ని కేసులనైనా భరిస్తానని, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం కానీ, ఇక్కడ ఎస్పీగా మీరు తెరవెనుక ఉండి నడిపించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, సర్వోన్నత న్యాయస్థానాల ఆదేశాలు పోలీసు వ్యవస్థలో ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. కృష్ణా జిలాల్లో ఎస్పీ జమానాలో రాజ్యాంగం అమలు శూన్యమని పేర్కొన్నారు. తాము రాజకీయాల్లోనే ఉన్నామని, చట్టాన్ని చదువుకున్నామని, చట్టాన్ని ఉల్లంఘించడం, దౌర్జన్యాలకు దిగడం, తప్పుడు కేసులు పెట్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, వర్గాలను రెచ్చగొట్టడం తాము ఏ రోజూ చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా ఒక్కటే కోరుతున్నామని, పామర్రు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది, అసలు వాస్తవం ఏంటీ, పోలీస్స్టేషన్లలో ఏమి చేస్తున్నారు, చట్టానికి, రాజ్యాంగానికి లోబడి పోలీసు విధులు నిర్వర్తిస్తున్నారా, ఎమ్మెల్యే చెప్పినట్లు ఆడుతున్నారా అనే విషయాలను మనస్సాక్షిగా పరిశీలించాలని కై లే అనిల్కుమార్ ఆ లేఖలో కోరారు. -
రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి
డీఆర్ఎం మోహిత్ సోనాకియా రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి అని డీఆర్ఎం మోహిత్ సోనాకియా పేర్కొన్నారు. రైల్వే ఆడిటోరియంలో పట్టణ అధికార భాష అమలు కమిటీ (టీఓఎల్ఐసీ) సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా టీఓఎల్ఐసీ చైర్మన్, డీఆర్ఎం మోహిత్ సోనా కియా హిందీ ప్రాముఖ్యత, అమలు కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుత కాలంలో హిందీ నేర్చుకోవడం గతం కంటే చాల సులభమని సూచించారు. ఇటు వంటి కార్యక్రమాలు, పోటీలు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీ వినియోగాన్ని పెంచేందుకు దోహదపడతాయని వివరించారు. రాజభాష అమలులో ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు డివిజన్ నిరంతరం కృషిచేస్తూనే ఉంటుందని తెలిపారు. ఏడీఆర్ఎం పి.ఇ.ఎడ్విన్ మాట్లాడుతూ.. టీఓఎల్ఐసీ సమావేశంలో అన్ని విభాగాలు చురుగ్గా పాల్గొనడం అభినందనీయ మన్నారు. అధికార భాష అమలు, ప్రచారం కోసం రైల్వే చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. అనంతరం సీనియర్ రాజభాష అధికారి హేమంత్ వాడేకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డివిజన్లో రాజభాష అమలు పురోగతిని వివరించారు. అనంతరం గత మార్చి పది నుంచి 12వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించిన హిందీ ఉపన్యాసం, వ్యాస రచన, కవితా పఠనం, డ్రాఫ్టింగ్, వార్త పఠనం, క్విజ్, అంత్యా క్షరి పోటీల్లో 45 కేంద్ర ప్రభుత్వ క్యాలయాలకు చెందిన 276 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొనగా 63 మంది విజేతలకు డీఆర్ఎం చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీఏ అండర్–19 మహిళల చాంపియన్ కృష్ణా జిల్లా జట్టు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో అండర్–19 మహిళల వన్–డే ఇంటర్–జోనల్ టోర్నమెంట్ విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగింది. ఈ నెల 15 నుంచి ఈ టోర్నమెంట్లో భాగంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ బుధవారం నిర్వహించారు. అనంతపురం జిల్లా జట్టు, కృష్ణాజిల్లా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. అనంతపురం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ను ఎంచుకుని 50 ఓవర్లల్లో 166/5 స్కోర్ చేసింది. తర్వాత కృష్ణా జిల్లా జట్టు బ్యాటింగ్ చేసి 42.1 ఓవర్లలో 169/4 స్కోర్ చేసింది. 6 వికెట్ల తేడాతో 0.808 రన్ రేట్తో ఏసీఏ ఇంటర్ జోనల్ మ్యాచ్ చాంపియన్గా కృష్ణా జిల్లా జట్టు నిలిచింది. -
నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం
పెనమలూరు: నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. హడ్కో నిధులు రూ. 4.20 కోట్లతో యనమలకుదురులో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే పెదపులిపాకలో రూ. 4.20 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోజుకు 200 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని డిస్కంలను పటిష్టం చేస్తున్నామని, రూ. 200 కోట్లతో నూతన సబ్స్టేసన్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. గ్రామాలలో 24 గంటల నిరంతరం విద్యుత్ సరఫరా, రైతులకు ఏకకాలంగా 9 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. యనమలకుదురు, పెదపులిపాక గ్రామాలలో భవిష్యత్లో పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్ అందుతుందని చెప్పారు. సోలార్ విద్యుత్కు ప్రోత్సాహం.. సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశం మొత్తం మీద కోటి సోలార్ కనెక్షన్లు లక్ష్యం కాగా రాష్ట్రంలో 6 లక్షల కనెక్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఎస్సీలకు ఈ పథకం అమలు చేస్తున్నామని, త్వరలో బీసీలకు కూడా పథకం అమలు చేస్తామన్నారు. తొలుత మంత్రి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టీవీఎన్ఎస్ మూర్తి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ -
గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారికి బుధవారం అమ్మవారి సేవకురాలు పాపమాంబ వంశీకులైన ఆలయ అర్చకులు సారె సమర్పించి బోనాలు చెల్లించారు.సాక్షి, విజయవాడ: తాగునీటి సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్య తీవ్రరూపం దాలుస్తున్నా పాలకులు, అధికారుల్లో చలనం రావడంలేదు. పంచాయతీలు, మునిసిపాలిటీ, నగరపాలక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థలు అధికారుల ఏలుబడిలోకి వెళ్లాయి. ప్రత్యేక అధికారుల పాలనలో తాగునీటి సమస్య జటిలంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ముఖ్య నగరమైన విజయవాడలో తాగునీటి సరఫరా కోసం ఏటా రూ.58 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారు. అయినా స్వచ్ఛమైన నీరు అందడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తాగునీరు కలుషితమైన కుళాయి నీటిని తాగి గిరిపు రంలో పలువురు స్థానికులు డయేరియా బారినపడ్డారు. గతేడాది సెప్టెంబర్లో న్యూరాజరాజేశ్వరి పేటలో నీరు 100 మందికి పైగా అతిసారం బారిన పడగా ఇద్దరు మృతి చెందారు. అయినా కార్పొరేషన్ నిర్లక్ష్యం వీడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా అంతటా అదే సమస్య ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరపాలక సంస్థ, నాలుగు మునిసిపాలిటీలు, 321 పంచాయతీలు ఉన్నాయి. సుమారు 22.18 లక్షల మంది నివసిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్ర మైంది. జగయ్యపేట 29వ వార్డు ట్రెజరీ కార్యా లయం రోడ్డు పక్కన 15 రోజులుగా నీరు రావడం లేదు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆర్టీసీ కాలనీకి వెళ్లే మెయిన్ పైపులైన్ ఎనిమిది చోట్ల లీకవుతోంది. రెండేళ్లుగా మరమ్మతులు చేయాలని కోరుతున్నా అధికారులకు పట్టడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నందిగామలో రెండు, మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. తిరువూరులో వారానికి ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. మైలవరం నియోజవర్గంలోని మైలవరం, జి.కొండూరు మండలాలు, తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, ఎ.కొండూరు మండలాలు, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలంలో తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. కృష్ణా జిల్లాలో మరింత దుర్భరం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కార్పొరేషన్తో పాటు గుడివాడ, పెడన, ఉయ్యూరు, తాడిగడప మునిసిపాలిటీలు, 502 గ్రామాల్లో 17.35 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతోపాటు గుడివాడ, పెడనలో రోజు మార్చి రోజు తాగునీటి సరఫరా జరుగుతోంది. కృత్తివెన్ను మండలంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. గ్రామాల్లో గృహ అవసరాలకు వినియోగించే నీరు నెలలో రెండు లేదా మూడుసార్లకు మించి సరఫరా కావడం లేదు. ఇటీవల కృత్తివెన్ను పంచాయతీ పల్లెపాలెంలో కుళాయిల ద్వారా రంగు మారి కలుషిత నీరు సరఫరా కావడంతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, డీఈ గ్రామంలో పర్యటించారు. ఇంతేరు నుంచి చిన్న గొల్లపాళెం వరకు సముద్ర తీరం ప్రాంతం కావడంతో తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బంటుమిల్లి మండలంలో కూడా ఇదే పరి స్థితి. ముఖ్యంగా చోరంపూడి, మల్లంపూడి గ్రామాల్లో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు చుట్టపు చూపులా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు తప్పా క్షేత్రస్థాయిలో తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎవరైనా నోరెత్తి సమస్య చెబితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండడంతో తాగునీటి సమస్య చెప్పడానికి కూడా జనం భయపడుతున్నారు. కృత్తివెన్ను మండలం పల్లెపాలెం గ్రామంలో రంగుమారిన నీటిని పారబోస్తున్న మహిళలు (ఫైల్) ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారుల రికార్డుల ప్రకారం 7,846 చేతి పంపులున్నాయి. తాగు నీటి సమస్య పరిష్కారమంటూ ఏకంగా 7,746 పంపులకు మరమ్మతులు చేయించామని అధికా రులు రికార్డుల్లో చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో నాలుగు వేల పంపులు కూడా పని చేయడం లేదు. చేతిపంపుల మరమ్మతుల పేరిట నందిగామ, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో పంచాయతీ కార్యదర్శులు నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పోషకాహార లోపం.. గర్భిణులకు శాపం
● గర్భం దాల్చిన తర్వాత మహిళలకు అందని సరైన పోషకాహారం ● రక్తహీనత బారిన పడి హైరిస్క్ ప్రెగ్నెన్సీగా మారుతున్న వైనం ● జీజీహెచ్కి వచ్చే గర్భిణుల్లో అత్యధికులు రక్తహీనత ఉన్న వారే ● గర్భిణులకు సంపూర్ణ పోషణ కిట్ అందించిన గత ప్రభుత్వం లబ్బీపేట(విజయవాడతూర్పు): గర్భిణులకు పోషకాహార లోపం శాపంగా మారుతోంది. పోషకాహారం తీసుకోని వారికి ప్రసవం సమయంలో హైరిస్క్గా మారి తల్లీబిడ్డల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది. గర్భం దాల్చిన పేద మహిళలకు పోషకాహారం అందించాల్సిన ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతోంది. దీంతో ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే మహిళల్లో సగం మందిలో రక్తహీనత సమస్య ఉంటోంది. హిమోగ్లోబిన్ 9 గ్రాములకంటే తక్కువగా ఉన్న వారే ఎక్కువగా ఉంటున్నారు. హెచ్బీ 3,4 గ్రాముల శాతం ఉన్న వారు కూడా రిఫరల్ కేసులుగా వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. వారికి ప్రసవం చేయడం అత్యంత క్లిష్టతరంగా మారిందని వివరిస్తున్నారు. గత ప్రభుత్వంలో అందించిన సంపూర్ణ పోషకాహారం కిట్లు ఇప్పుడు అందడం లేదని గర్భిణులు ఆరోపిస్తున్నారు. రక్తహీనత ఇలా.. విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)కి ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి గర్భిణులు కాన్పుల కోసం వస్తుంటారు. ఇక్కడ ప్రతి నెలా వెయ్యికి పైగా ప్రసవాలు చేస్తుంటారు. ఇక్కడకు వచ్చే వారిలో రక్తహీనత లోపం ఉన్న వారే ఎక్కువగా ఉంటున్నారు. హిమోగ్లోబిన్ పది గ్రాముల శాతం కంటే తక్కువ ఉంటే రక్తహీనతగా, ఏడు గ్రాములు అంతకంటే తక్కువ ఉంటే తీవ్రమైన రక్తహీనతగా పరిగణిస్తారు. జీజీహెచ్కు వచ్చే వారిలో ప్రతి వంద మందిలో పది గ్రాముల శాతం కంటే ఎక్కువ ఉన్న వారు 15 మంది, 8,9 గ్రాముల శాతం ఉన్న వారు 25 మంది, 7, 8 గ్రాముల శాతం ఉన్న వారు 45 మంది, ఆరు గ్రాముల కంటే తక్కువగా ఉన్న వారు 15 మంది ఉంటున్నారు. వీరిలో హిమోగ్లోబిన్ 9 గ్రాముల కంటే తక్కువ ఉన్న వారికి ప్రసవం రిస్క్ ఉంటుంది. ఆరు గ్రాముల శాతం కంటే తక్కువ ఉన్న వారికి హైరిస్క్ ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రిఫరల్ వచ్చిన వారిలో నాలుగు గ్రాములు ఉన్న వారిని కూడా చూస్తున్నామని వైద్యులు అంటున్నారు. అలాంటి వారికి రెండు, మూడు యూనిట్ల రక్తం ఎక్కిస్తున్నారు. తల్లీబిడ్డలకు సమస్యలు రక్తహీనత కారణంగా గర్భిణుల్లో అలసట, బలహీనత, దడ, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు తలెత్తుతాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా నెలలు నిండకుండా ప్రసవం జరగడంతో ప్రీటామ్ బేబీలు పుట్టడం, నెలలు నిండినా శిశువు తక్కువ బరువు ఉండటం, ప్రసవ సమయంలో రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో మాతా శిశు మరణాలకు దారితీసే ప్రమాదం ఉంటోంది. సమన్వయ లోపం వైద్య ఆరోగ్యశాఖ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా గర్భిణులకు పోషకాహారం సక్రమంగా అందడం లేదు. ఇటీవల జిల్లాలో గర్భిణులకు పోషకాహాం అందించే విషయంలో వైద్యశాఖ మ్యాపింగ్ చేయక పోవడంతో అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఒక్కోసారి గర్భిణులకు శాపంగా మారుతోంది. గర్భిణికి పోషకాహారంతో పాటు, వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. ఇలా ఉమ్మడి కృష్ణాజిల్లాలో అనేక ప్రాంతాల్లో నెలకొంది. శాఖల మధ్య సమన్వయ లోపం మహిళలకు శాపంలా మారుతోంది. పోషకాహారం అందించే విషయమై ఐసీడీఎస్ జిల్లా అధికారిణి వివరణ కోరేందుకు సంప్రదించగా స్పందించలేదు. పోషకాహార లోపం నివారణ నినాదం ప్రభుత్వ ప్రకటనలకే పరిమితం అవుతోంది. పేద గర్భిణులకు పోషకాహారం అందించడం అందని ద్రాక్షాగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వంలో గర్భం దాల్చిన మహిళలకు సంపూర్ణ పోషకాహార కిట్లను అందించే వారు. అందులో భాగంగా పాలు, కందిపప్పు, చిక్కీ, నూనె, బియ్యం, కోడిగుడ్లు వంటివి అందేవి. ఇప్పుడు రేషన్ బియ్యం, పుచ్చిపోయిన కందిపప్పు, రాళ్లు ఉన్న రాగిపిండి వంటివి ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గర్భిణుల్లో రక్తహీనత సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. -
కూచిపూడిలో యునెస్కో ప్రపంచ వారసత్వ వర్క్షాపు
పామర్రు: స్థానిక శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో అక్టోబర్ ఆరు, ఏడు తేదీల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాతీయ వర్క్ షాపు నిర్వహించనున్నట్లు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య డి.మునిరత్నం నాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. విశ్వ వ్యాప్తమైన కూచిపూడి నృత్యానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ మరింత గుర్తింపు ఇచ్చేలా కేంద్రీయ విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్షాప్లో రెండు రోజుల పాటు 100 మంది ఔత్సాహిక నాట్య విద్యార్థులకు శిక్షణ తరగతులు (వర్క్షాపు) నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు విజయ వంతం కోసం కృష్ణాజిల్లా సహాయ కలెక్టర్ సమత్రా అగర్వాల్ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. పగలు ఔత్సాహికు లకు వర్క్షాప్, రాత్రి వేళ నిష్ణాతులైన కళాకారులతో నాట్య ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ టూరిజం కన్స ల్టెంట్ అజ్వంత్ నాయుడు, ప్రముఖ నాట్యాచారిణి సుమిత్రా పార్థసారథి, కల్చరల్ కన్సల్టెంట్ సీహెచ్.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, టీచింగ్ అసిస్టెంట్ ఎస్.వెంకటేశ్వరరావు, పసుమర్తి హరినాథశాస్త్రి, గ్రంథాలయ పాలకులు వై.వి.ఫణికుమార్, తహసీల్దార్ కె.మస్తాన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
దసరా ఉత్సవాలపై తొలి సమీక్ష సమావేశం
● అలంకారాలు, క్యూలైన్లు, ● ఇంజినీరింగ్ పనులకు అంచనాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహించే దసరా ఉత్సవాల తొలి సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. మహామండపం నాలుగో అంతస్తులోని ఈఓ ఛాంబర్లో ఈఓ శీనానాయక్ అధ్యక్షతన ఆలయ ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ఇంజినీరింగ్ అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. దసరా ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి విశేష అలంకారాలను త్వరగా సిద్ధం చేయాలని వైదిక కమిటీని, అదే విధంగా క్యూలైన్లు, ఇతర ఇంజినీరింగ్ పనులకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని ఆలయ ఈఓ శీనానాయక్ ఆలయ అధికారులను ఆదేశించారు. రానున్న దసరా ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, అందుకు తగిన రీతిలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు తమకు కేటాయించిన పనులపై సమగ్రంగా అంచనాలను రూపొందించడంతో పాటు అంచనా వ్యయం వెంటనే సిద్ధం చేయాలన్నారు. దసరా ఉత్సవాల ప్రతిపాదనలను రానున్న ట్రస్ట్ బోర్డు సమావేశం నాటికి సిద్ధం చేయడంతో పాటు పాలకవర్గ ఆమోదం కోసం పంపాలన్నారు. ప్రభుత్వం నుంచి, దేవదాయ శాఖ నుంచి అనుమతి పొందాల్సిన అంశాల జాబితాను సిద్ధం చేయడంతో పాటు ప్రత్యేక నివేదికను తయారు చేయాలన్నారు. అన్ని విభాగాల సహకారంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏఈఓ ఎన్. రమేష్బాబు, చంద్రశేఖర్, తిరుమలేశ్వరరావు, ఈఈ ఎల్.రమాదేవి, ఏఈఈలు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఫైనాన్స్ వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం
కోసూరువారిపాలెం(మోపిదేవి): ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక మహిళ దాసి ధనలక్ష్మీ అధికంగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండల పరిధిలోని కోసూరువారిపాలెం శివారు దాసివాని పల్లె గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసి శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కోసూరువారిపాలెం శివారు దాసి వానిపల్లె గ్రామంలో తన ఇంటిపై ప్రైవేటు పైనాన్స్ కంపెనీ నుంచి వీరు లోన్ తీసుకున్నారు. విడతల వారీగా చెల్లించగా ఇంకా రూ. 40 వేలు బాకీ కట్టవలసి ఉంది. బాకీ నిమిత్తం ఫైనాన్స్ కంపెనీ వారు ఇంటికి వచ్చి దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు దుర్భాషలాడటంతో మనస్థాపానికి గురైన ఆమె మంగళవారం రాత్రి ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. రాత్రివేళ వచ్చి వేధించడంతో.. బాకీ చెల్లించాలని నోటీసులు ఇచ్చి కూడా రాత్రి సమయంలో ఇంటికి వచ్చి వేధించడంతో ధనలక్ష్మి అవమానభారంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితులు శ్రీనివాసరావు కుటుంబం కూలీ పనుల కోసం అవనిగడ్డ మండలం సీతాయలంక గ్రామంలో గత ఆరు మాసాలుగా ఉంటున్నారు. ఫైనాన్స్ కంపెనీ వారి వేధింపుల నుంచి మాకు రక్షణ కల్పించాలని వారు పోలీస్ అధికారులను వేడుకుంటున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బల్క్ వేస్ట్ జనరేటర్ల గుర్తింపు వేగవంతం
కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం చిలకలపూడి(మచిలీపట్నం): పట్టణాల్లో బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి వ్యర్థాలను మూలంలోనే శాసీ్త్రయంగా నిర్వహించేలా చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, బల్క్ వేస్ట్ జనరేటర్ల గుర్తింపు, కంపోస్టింగ్ విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై విస్తతంగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోజుకు 100 కిలోలకుపైగా తడి వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు, 20 వేల చదరపు అడుగులకు పైబడిన భవనాలు, రోజుకు 40 వేల లీటర్లకు పైగా నీటిని వినియోగించే సంస్థలు బల్క్ వేస్ట్ జనరేటర్లుగా పరిగణించబడతాయన్నారు. ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, పరిశ్రమలు తదితర సంస్థలను తప్పనిసరిగా గుర్తించి నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఈ నెలాఖరులోగా అన్ని మున్సిపాలిటీల్లో బల్క్ వేస్ట్ జనరేటర్ల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని కమిషనర్లను ఆదేశించారు. వేర్వేరుగా సేకరించాలి.. బల్క్ వేస్ట్ జనరేటర్లు తడి, పొడి, ప్రమాదకర, శానిటరీ వ్యర్థాలను మూలంలోనే వేర్వేరుగా సేకరించాలని, తడి చెత్తను కంపోస్టింగ్ లేదా బయోగ్యాస్ ద్వారా శుద్ధి చేయాలని, ప్లాస్టిక్, కాగితం, లోహం వంటి పొడి వ్యర్థాలను రీసైక్లింగ్కు పంపించాలని కలెక్టర్ సూచించారు. తడి చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చేందుకు ఆధునిక కంపోస్టింగ్ పద్ధతులు, డబుల్ కంపోస్టింగ్ బిన్స్, బయోగ్యాస్ యూనిట్లు, కంపోస్ట్ పిట్స్ వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. గ్రీన్ రిచ్ సంస్థ రూపొందించిన డబుల్ కంపోస్టింగ్ బిన్స్ ద్వారా ఒక బిన్ నిండిన తర్వాత మరో బిన్ను వినియోగిస్తే సుమారు 30 రోజుల్లో సేంద్రియ ఎరువు సిద్ధమవుతుందని, రోజుకు 5 కిలోల నుంచి ఒక టన్ను వరకు తడి వ్యర్థాలను శాసీ్త్రయంగా ప్రాసెస్ చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మచిలీపట్నం, గుడివాడ, పెడన, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, మనోహర్రావు, కొండయ్య, సుభాష్ చంద్రబోస్, జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాస్, గ్రీన్ రిచ్ సంస్థ డైరెక్టర్ ఎస్. శరవణ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతమ్మకు సారె సమర్పణ
పెనుగంచిప్రోలు: ఆషాఢ మాసం సందర్భంగా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ వారికి బుధవారం అమ్మవారి సేవకురాలు పాపమాంబ వంశీకులైన ఆలయ అర్చకులు సారె సమర్పించి బోనాలు చెల్లించారు. గ్రామంలోని అమ్మవారి రంగుల మండపం నుంచి ఆలయం వరకు మేళతాళాలతో వారు చేరుకున్నారు. అమ్మవారికి సారె సమర్పణ అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. పారా స్పోర్ట్స్ మీట్లో దివ్యాంగ విద్యార్థి ప్రతిభ కంకిపాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రశిక్ష, పీఎం శ్రీ, రాష్ట్ర సహిత విద్యా విభాగం సంయుక్తంగా ఆగిరిపల్లి మండలం తోటపల్లి హీల్ ప్యారడైజ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్లో కంకిపాడుకు చెందిన ప్రత్యేక విద్యార్థి ప్రతిభ చాటారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన కంకిపాడుకు చెందిన దివ్యాంగ విద్యార్థి వినుకొండ భరత్బాబు షాట్పుట్ జూనియర్స్ విభాగంలో ద్వితీయ స్థానం, 400 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం, లాంగ్జంప్లో ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. ప్రతిభ చూపిన విద్యార్థిని శాప్ ఎండీ ఎస్.భరణి, సమగ్ర శిక్ష ఏఎస్పీడీ కె.రవీంద్రనాఽథ్రెడ్డి, ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ వి.రామస్వామి, ఐఈ రీసోర్సు టీచర్లు అభినందించారు. కారు ఢీకొని వృద్ధురాలు దుర్మరణం కంకిపాడు: కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. కంకిపాడు ఎస్ఐ కేవై దాసు తెలిపిన వివరాల ప్రకారం.. పమిడిముక్కల మండలం అమీనాపురం గ్రామానికి చెందిన కోలాహలం సూర్యకుమారి (68) ప్రొద్దుటూరు శివారు కొణతనపాడు గ్రామంలోని తమ్ముడిని చూసేందుకు అమీనాపురం నుంచి కొణతనపాడు గ్రామానికి వచ్చింది. కొణతనపాడు అడ్డరోడ్డు వద్ద రోడ్డు దాటే ప్రయత్నంలో మచిలీపట్నం నుంచి విజయవాడకు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సూర్యకుమారిని వైద్యం నిమిత్తం విజయవాడకు తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి కుమార్తె పోరంకి దేవి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుమారుడి హత్య కేసులో తల్లికి రిమాండ్ చల్లపల్లి: కుమారుడి హత్య కేసులో నిందితురాలైన తల్లికి కోర్టు రిమాండ్ విధించింది. ఎస్ఐ డి.దుర్గాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి పడమర వీధికి చెందిన దుర్గాప్రసాద్ ఈనెల 20న రాత్రి మద్యం సేవించి తన తల్లి నాగమణితో వాగ్వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ఆమె ఇనుప రాడ్డుతో కొట్టడంతో దుర్గాప్రసాద్ మృతిచెందాడు. ఈ కేసులో నిందితురాలైన తల్లి నాగమణిని మొవ్వ కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆమెకు 14 రోజులు రిమాండు విధించింది. బందరు కాలువలో గుర్తు తెలియని మృతదేహం పెనమలూరు: బందరు కాలువలో పెనమలూరు వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఎస్ఐ తాతాచారి తెలిపిన వివరాల ప్రకారం.. బందరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం రాత్రి కొట్టుకు వచ్చింది. మృతుని వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. వంటిపై నల్లరంగు ప్యాంట్, పసుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉబ్బిపోయింది. పోలీసులు బుధవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు సెల్: 96183 36684 నంబర్ను సంప్రదించాలని కోరారు. కృష్ణారావు మృతదేహం లభ్యం ఇబ్రహీంపట్నం(జి.కొండూరు): కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు డైవర్షన కెనాల్లో ఈనెల 19న ఈతకు దిగి గల్లంతైన బైనిబిల్లి కృష్ణారావు(50) మృతదేహం బుధవారం సాయంత్రం వీటీపీఎస్ సమీపంలో కెనాల్లో లభ్యమైంది. మృతుడు కృష్ణారావుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కృష్ణారావు మృతదేహం మూడు రోజులుగా నీటిలో నానడంతో ఉబ్బిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
ఇంద్రగిరిపై భక్తుల సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి కొనసాగుతోంది. దుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పించేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు బృందాలు బుధవారం తరలివచ్చి సారె సమర్పించారు. ఎక్కువగా ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలకు చెందిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. కనకదుర్గనగర్, మహామండపం మీదుగా కొండపైకి చేరుకుంటున్న భక్తులు రూ. 100 క్యూలైన్లో ఆలయంలోకి చేరుకుని అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో హుండీ లెక్కింపు జరుగుతుండటంతో నూతన పూజా మండపంలో లక్ష కుంకుమార్చన వేదిక వద్ద ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం భక్త బృందాలు తమతో పాటు విచ్చేసిన భక్తులు, కుటుంబ సభ్యులకు పసుపు, కుంకుమతో పాటు సారె సామగ్రికి ఇచ్చిపుచ్చుకున్నారు. బుధ వారం సాయంత్రానికి 23 బృందాలుగా సుమారు పది వేల మంది భక్తులు సారె సమర్పించారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలతో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ టోకరా
సాక్షి,విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ సబ్ కమిటీ (మంత్రివర్గ ఉపసంఘం)టోకరా వేసింది. ఉద్యోగ సంఘాలు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న తమ ప్రధాన సమస్యలను ప్రభుత్వం ముందుంచినప్పటికీ, మంత్రివర్గ ఉపసంఘం వాటిలో ఒక్క హామీకి కూడా స్పష్టమైన పరిష్కారం చూపకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.బుధవారం విజయవాడలో 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ కీలక భేటీ నిర్వహించింది. ఈ చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమకు సంబంధించిన 21 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. నూతన పీఆర్సీ తక్షణ ఏర్పాటు. ఐఆర్ ప్రకటన. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఐదు డీఏల చెల్లింపు. వేల కోట్ల రూపాయల మేర బకాయి ఉన్న పెండింగ్ బిల్లులను త్వరగా విడుదల చేయడం. అయితే, ఉద్యోగుల ఆర్థిక, సేవా పరమైన ఈ ప్రధాన డిమాండ్లపై మంత్రుల కమిటీ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేసింది.పీఆర్సీ, ఐఆర్, డీఏల చెల్లింపు, బకాయిల విడుదలకు సంబంధించి మంత్రులు పూర్తిగా మౌనం వహించారు. ఈ ఆర్థికపరమైన అంశాలన్నింటినీ సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అంటూ మంత్రుల కమిటీ చర్చలను ముగించేసింది.ప్రభుత్వ అగ్ర నాయకత్వంతో చర్చిస్తామనే పాత సాకుతోనే మంత్రులు ఈ సమావేశాన్ని ముగించడంతో ఉద్యోగ సంఘాల నేతలు, సచివాలయ సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చర్చల పేరుతో ప్రభుత్వం తమను మరోసారి టోకరా వేసిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
విజయవాడలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల కొట్లాట
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ కౌంటర్ ఆందోళన చేపట్టింది. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాల కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విజయవాడలో మ్యూజియం రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు "డౌన్ డౌన్ రాహుల్ గాంధీ", "డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ" అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒకేచోట చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.అనంతరం, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ..‘మోదీ ఇంటి ముట్టడి వెనుక అసలు శక్తులు బయటపడ్డాయి. దాడి వెనుక కాంగ్రెస్ అగ్రనేతల హస్తం ఉంది. జంతర్ మంతర్ నిరసనలకు కాంగ్రెసే సూత్రధారి. సోనమ్ వాంగ్చుక్ను వెనుక ఉండి నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీనే. నిరసనల్లో ఒక్క నీట్ విద్యార్థి కూడా లేరు, కేవలం లెఫ్ట్ యూనియన్ నాయకులే ఉన్నారు. నిరసనల్లో అర్బన్ నక్సల్స్, 370 రద్దును వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. నీట్ లీకేజీకి సంబంధించి 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు. నేపాల్, బంగ్లాదేశ్ తరహా అలజడులు సృష్టిస్తే ఉపేక్షించం. విద్యార్థులకు భరోసా, నిజమైన నీట్ బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
డీఎంహెచ్ఓకు వినతి
మచిలీపట్నం అర్బన్: కృష్ణా జిల్లా నూతన వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. లోకనాథ్ దయాకర్ను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొకినాల సౌమ్యరేఖ పలువురు స్టాఫ్ నర్సులతో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, 100 శాతం గ్రాస్ వేతనం అమలు, ఈఎస్ఐ వంటి సంక్షేమ సౌకర్యాల కల్పన, కనీస వేతనాల పెంపు, బదిలీల్లో పారదర్శకత, రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని కోరారు. అలాగే పీహెచ్సీలు, సీహెచ్సీల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సిబ్బంది కొరత, పని ఒత్తిడి తదితర సమస్యలను డీఎంహెచ్వో దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలపై చర్యలు తీసుకుంటానని, మిగిలిన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని డీఎంహెచ్వో హామీ ఇచ్చారు. ‘తల్లికి వందనం’ లబ్ధిదారుల జాబితా ప్రదర్శన గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘తల్లికి వందనం‘ పథకానికి సంబంధించి అర్హుల, అనర్హుల జాబితా, పరిశీలనలో ఉన్న లబ్ధిదారుల జాబితాలు జూలై 22 నుంచి జిల్లాలోని ప్రతి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం ప్రదర్శించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ పేరు జాబితాలో లేకపోవడం, వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు ఉండటం, అనర్హుల జాబితాలో పేరు ఉండటం లేదా ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉన్నట్లయితే, సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. ఫిర్యా దులను జూలై 22 మధ్యాహ్నం నుంచి స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు తమ అభ్యంతరాలు, సమస్యలను నిర్ణీత గడువులోగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదును ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాల ప్రకారం పూర్తిస్థాయిలో పరిశీలించి, అవసరమైన సవరణలు చేసి అర్హులైన వారికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం అర్హులైన తల్లులు 1,59,812 మంది, పిల్లలు 2,44,614 మంది ఉన్నట్లు వివరించారు. డయేరియా, కోవిడ్పై అప్రమత్తంగా ఉండాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): వర్షాకాలం ప్రారంభం కావడంతో డయేరియాపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏ శ్రావణ్బాబు అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసి, జాగ్రత్తలు పాటించేలా చూడాలని ఆయన సూచించారు. ఆయన మంగళవారం నగరంలో గతంలో డయేరియా సోకిన ప్రాంతాల్లోని న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, గిరిపురం యూపీహెచ్సీలను సందర్శించారు. అక్కడ సిబ్బంది హాజరును పరిశీలించి, పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అనుమానిత కేసులు, ముఖ్యమైన పరిణామాలు ఉంటే వెంటనే తమ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు. రోజువారీ రోగులకు అందించే సేవలను యూపీహెచ్సీల్లో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమష్టి గా కృషి చేస్తామని, మంత్రుల బృందం సమక్షంలో జరిగే స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల గళాన్ని బలంగా వినిపిస్తామని ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ఆయన్ని మంగళవారం విజయవాడ లోని ఎన్జీవో హోమ్లో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు డి. సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి పి. రమేష్ పాల్గొన్నారు. -
సౌకర్యాలు సద్వినియోగం చేసుకోండి
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి కొండపర్వ(విస్సన్నపేట): విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకొని, బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని కొండపర్వ గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఎమ్మెల్యే కె. శ్రీనివాసరావుతో కలసి మంత్రి మంగళవారం సందర్శించారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. గురుకుల పాఠశాలకు వచ్చే రహదారి సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని ఓ విద్యార్థి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రహదారి ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి అన్నారు. విద్యార్థులకు వడ్డించే ఆహారం, పాఠశాల వసతులను, డార్మెటరీలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి మంత్రి, ఎమ్మెల్యే భోజనం చేశారు. మౌలిక వసతుల కల్పన.. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు వసతి గృహాలలో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో గిరిజన సంక్షేమ శాఖ నుంచి 2,500 కోట్లను రోడ్లు, హస్టళ్లు నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించామన్నారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్, తహసీల్దార్ కె. లక్ష్మీకల్యాణి, ఏఓ చందా ప్రసాద్, డెప్యూటీ ఎంపీడీఓ రామ్మోహనరావు, ఎంఈఓ సుధాకర్, గురుకుల కళాశాల కన్వీనర్ ప్రిన్సిపాల్ జి. ప్రసూన, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వాణి పాల్గొన్నారు. -
అంధ సర్కారు కళ్లు తెరిపించండి
మచిలీపట్నంటౌన్: రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకునేలా.. ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని కోరుతూ భారత రత్న, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో ఆ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక రామానాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బయటకు రావాలంటేనే భయం.. పార్టీ మహిళా విభాగం నాయకులు మాట్లాడుతూ మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నేడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ నెలకొన్నాయన్నారు. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, వాటిని నిరోధించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇక పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా మారిపోవడం దురదృష్టకరమన్నా రు. ఇటీవల గుంటూరు, బద్వేలు తదితర ప్రాంతా ల్లో మహిళలను వివస్త్రలను చేసి అవమానించిన అమానవీయ ఘటనలు రాష్ట్రంలో దారుణంగా మారిన పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. అధికార పార్టీ అండదండలతో.. కొన్ని ఘటనల్లో నిందితులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసుల నమోదులో జాప్యం, విచారణలో నిర్లక్ష్యం, నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత ప్రదర్శిస్తే బాధితులకు న్యాయం జరగడంలేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థలు, మహిళా పోలీస్ స్టేషన్లు, హెల్ప్లైన్లు, పెట్రోలింగ్ బృందాలు సమర్థంగా పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకు సంఘీభావం.. ఆ పార్టీ మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల సమన్వయకర్తలు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రాము పాల్గొని ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, బందరు మాజీ మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ ఎం. హరీష, జిల్లా ఉపాధ్యక్షురాలు అన్నవరపు ఎలిజబెత్రాణి, జిల్లా కార్యదర్శి కె. పద్మ, కృతివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి, మచిలీపట్నం నియోజకవర్గ అధ్యక్షురాలు వాణిశ్రీ, నగర అధ్యక్షురాలు షేక్ షాహినా, జిల్లా నాయకులు రమాదేవి, కంచర్లపల్లి మాధవి, కై లా సబాకీర్తి, సీహెచ్ రత్నాబాయి, పల్లికొండ రత్నకుమారి, కె. రాణి, పైడిపాముల వరలక్ష్మితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
జీతాలివ్వండి మహా ప్రభో!
విజయవాడ జీజీహెచ్ శానిటేషన్ కార్మికుల నిరసన లబ్బీపేట(విజయవాడతూర్పు): రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ప్రభుత్వాస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం నిరసనకు దిగారు. అందులో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి ఆస్పత్రి గేటు వద్ద ఆందోళన చేశారు. వారికి సీఐటీయూ, సీపీఎం నేతలు అండగా నిలిచారు. అనంతరం వారు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ను కలిశారు. ఈ నెల 25 లోపు తమకు రావాల్సిన పెండింగ్ జీతాలు చెల్లించాలని, లేకుంటే 27 పని బంద్ చేసి, జీతాలు చెల్లించే వరకూ విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికులకు జీతాలు నెలల పాటు పెండింగ్లో ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ప్రతినెలా చేసిన పనికి జీతం వేయాలని అడిగించుకోవడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించారు. ఇక్కడ పనిచేసే కార్మికులంతా అద్దె ఇళ్లలో ఉంటూ, జీతం వస్తే కానీ పూటగడవని దుస్థితిలో ఉన్నట్లు తెలిపారు. ప్రతినెలా 10వ తేదీ జీతం ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి తిరిగి మూడు నెలలు కావస్తున్నా పెండింగ్ జీతాలు ఇవ్వక పోవడం సమంజసమేనా అని ప్రశ్నించారు. గత సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి సమస్య చెప్పామని, కానీ ఇప్పటి వరకూ కార్మికుల సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ నెల 25 లోపు జీతాలు చెల్లించాలని, లేకుండా 27 నుంచి పని బంద్ చేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
న్యాయం కోసం వెళ్తే అక్రమ కేసు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని పామర్రు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్పైనే పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా పెట్టిన పోస్టింగ్లకు సంబంధించి ఆధారాలతో స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, టీడీపీ నేతలు వల్లూరిపల్లి గణేష్, కుదరవల్లి ప్రవీణ్ చంద్ర తదితరులపై కేసు నమోదు చేయాలని కై లే అనిల్ కుమార్ పోలీసు స్టేషన్కు వెళితే, ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే కేసు నమోదు చేయడం రెడ్బుక్ మార్క్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేస్తున్నారనడానికి నిదర్శనం. అవినీతి దందాను ప్రశ్నిస్తున్నందుకే.. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, పేకాట, అక్రమ లేఅవుట్లు.. ఇలా టీడీపీ ప్రజా ప్రతినిధికనుసన్నల్లో టీడీపీ నేతలు చేయని దందానే లేదు. ఈ దందాను కై లే అనిల్కుమార్ ప్రశ్నించడంతో పాటు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిని జీర్ణించుకోలేకే అక్రమ కేసుల నమోదుకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అక్రమ కేసుల పరంపర.. కృష్ణాజిల్లా పామర్రు పోలీసు స్టేషన్ టీడీపీ ఆఫీసుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రజా ప్రతినిధికి జీ హుజూర్ అంటూ పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపుల పరంపర కొనసాగిస్తున్నారు. ● గత ఏడాది వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తుపానుకు దెబ్బ తిన్న పంట పొలాల పరామర్శ సందర్భంగా ఆయనకు తమ సమస్యలను చెప్పేందుకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇది ఏమిటని ప్రశ్నించిన కై లే పైన తప్పుడు కేసు పెట్టారు. ● మొవ్వ మండలంలో రైతుల తరఫున యూరియా కోసం ధర్నా చేస్తే కేసు పెట్టారు. ● మచిలీపట్నంలో మెడికల్ కళాశాల సందర్శనకు వెళ్తుంటే అడ్డుకుని అక్రమ కేసు బనాయించారు. ● పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ దళిత నేత పృథ్వీపై అన్యాయంగా కేసులు నమోదు చేయటమే కాకుండా అతనిపై రౌడీషీటు ఓపెన్ చేశారు. సోషల్ మీడియాలో పెట్టిన అక్రమ పోస్టులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కై లే ఫిర్యాదు విధులకు ఆటంకం కలిగించారంటూ కై లే పైనే తిరిగి కేసు నమోదు టీడీపీ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో పామర్రు పోలీసు స్టేషన్ ఒక మాజీ శాసనసభ్యుడిగా తనపై జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదు చేస్తే, తనపైనే కేసు నమోదు చేయడం ఏమిటని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో టీడీపీ వారి ఫిర్యాదులే స్వీకరిస్తారా.. ప్రతిపక్ష నేతలు, సామాన్య ప్రజల ఫిర్యాదులు తీసుకోరా అని నిలదీశారు. పోలీస్ స్టేషన్ అని బోర్డు తీసి టీడీపీ కార్యాలయం అని బోర్డు పెట్టుకోండని హితపు పలికారు. -
దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సంప్రదాయంతో మూడు వందల మంది భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. విజయనగరానికి చెందిన మూడు వందల మందికి పైగా భక్తులు తమ సొంత ఖర్చులతో 5 బస్సులను ఏర్పాటు చేసుకుని మంగళవారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఉత్తరాంధ్రలో పుట్టింటి నుంచి అత్త ఇంటికి వెళ్లే ఆడపిల్లకు ఇచ్చే విధంగా వెదురు బుట్టలలో అరిసెలు, చక్రాలు, నాడూలు, పంచదార చిలకలు, చెక్క భరిణెలలో పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, గాజులు, పూలతో పాటు పట్టుచీరలను భక్తులు అమ్మవారికి సమర్పించారు. వీరికి ఆలయ ఈవో శీనానాయక్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయడంతో పాటు మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద ప్రత్యేక పూజలతో పాటు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మహా మండపం రెండో అంతస్తులో వారికి ప్రత్యేక భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఏటా తమ కుటుంబాల తరఫున అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు పేర్కొన్నారు. -
గ్రామాలపై సైబర్ వల!
ప్రభుత్వ పథకాల పేరుతో మాయాజాలంజి.కొండూరు: ఎలక్ట్రానిక్ డివైజ్లు ఉచితం, ఫోన్ డేటా రీచార్జ్ ఉచితం, ఇన్సూరెన్స్లు ఉచితం అనగానే ఎగబడి వెబ్ లింక్లను నొక్కేస్తున్నారు. అంతే సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి చొరబడి డేటా చోరీ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలలో ఉన్న నగదును మాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ తరహా దందా గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడింది. గ్రామీణ యువతను టార్గెట్ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడడం కలవరానికి గురి చేస్తోంది. అందుబాటులోని ఆధునిక టెక్నాలజీని సరైన పద్ధతిలో వినియోగించకపోతే మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందనడానికి సైబర్ మోసాలే నిదర్శనమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకేరోజు రెండు కేసులు.. మైలవరం పోలీసు డివిజన్ పరిధిలోని జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని స్వల్ప మొత్తంలో నగదును కోల్పోయి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. గతంలో జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన ముగ్గురు సంక్షేమ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో చిక్కుకొని నష్టపోయారు. సైబర్ నేరాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. ఉచితం అని ప్రకటనలు రాగానే ఆశపడి మోసపోతున్నారు. వాట్సాప్, పేస్బుక్, ఇన్స్టా, సాధారణ మెసేజ్ల ద్వారా వచ్చే వెబ్ లింక్లను అస్సలు టచ్ చేయవద్దు. ప్రభుత్వ పథకాల పేరుతో రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాలి అంటే స్పందించవద్దు. ప్రభుత్వ పథకాల వివరాలను అధికారిక వెబ్సైట్లు, సంబంధిత కార్యాలయాల ద్వారానే తెలుసుకోవాలి. తెలియని వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు, యూపీఐలకు డబ్బులు పంపవద్దు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయడం లేదా సమీపంలోని పోలీసు స్టేషన్ను సంప్రదించాలి. – సతీష్కుమార్, ఎస్ఐ, జి.కొండూరు సైబర్ నేరగాళ్లు తల్లికి వందనం పథకం అమలును ఆసరాగా చేసుకొని గతేడాది భారీగా మోసాలకు పాల్పడ్డారు. గతేడాది ప్రభుత్వం తల్లికి వందనం నగదు జమ చేసిన జూన్ 12వ తేదీని సైబర్ నేరగాళ్లు నేరం చేసేందుకు అనువుగా ఎంచుకున్నారు. అనుకున్న ప్రకారం ముందుగా జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన గతంలో గ్రామ వలంటీర్లుగా పని చేసిన వారికి ఫోన్ చేసి మిమ్మల్ని మరలా గ్రామ వలంటీర్లుగా తీసుకుంటున్నామని, ఎక్కువ జీతం కూడా వస్తుంది అని నమ్మ బలికారు. వారి దగ్గర గతంలో అమ్మ ఒడి పొందిన లబ్ధిదారుల పేర్లు, ఫోన్ నంబర్లు ఇవ్వాలంటూ అడిగారు. దీనితో సదరు మాజీ గ్రామ వలంటీర్లు వారి దగ్గర ఉన్న పేర్లు, ఫోన్ నంబర్లను ఇచ్చారు. వారిలో తల్లికి వందనం పెండింగ్లో ఉన్న వారిని మోసానికి అనువుగా ఎంచుకున్నారు. వారితో ఫోన్లో మాట్లాడి.. పెండింగ్లో నగదు మీ ఖాతాలలో జమ కావాలంటే కొంత అమౌంట్ మీరు ఫలానా ఖాతాలో జమ చేయాలని చెప్పి ముగ్గురు నుంచి రూ.44వేలు కాజేసి ఉడాయించారు. ముగ్గురు బాధితులు మోసపోయామని తెలుసుకొని పోలీసులను సంప్రదించారు. ఇప్పుడు తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో తల్లులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
దళిత మహిళ కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ
జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి హాజరైన కోట సామ్రాజ్యం మచిలీపట్నంఅర్బన్: గన్నవరానికి చెందిన దళిత మహిళ కోట సామ్రాజ్యం కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి అందిన ఫిర్యాదుపై సోమవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లవరపు నవీన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణకు కోట సామ్రాజ్యం, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. విచారణ అనంతరం కోట సామ్రాజ్యం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన కుల ధ్రువీకరణ పత్రాన్ని వివాదాస్పదం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. తన నివాసంపై టీడీపీ నాయకులు దాడి చేసి ఆస్తి ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. తనకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, తాను దళిత మహిళను కాదంటూ జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయించడం విచారకరమన్నారు. ఆ ఫిర్యాదు కారణంగానే జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు హాజరైనట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాన్ విక్టర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులపై వేధింపులు పెరిగాయని ఆరోపించారు. కోట సామ్రాజ్యం ఇంటిపై దాడి చేసి ఆస్తి ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు, దళిత జేఏసీ నాయకులు భూపతి అంబేద్కర్, జక్కుల ఆనంద్, గడిదేశీ రాజు, కొక్కిలిగడ్డ శరత్, బేతపూడి రవి, బాల యేసు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్హెచ్ఏఐ నిర్వాకం... జనం అయోమయం
గూడూరు: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి విస్తరణ సమయంలో రోడ్డు వెంబడి గ్రామాలు వాహనదారులకు తెలిసేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతి ఊరు మొదలయ్యే చోట ఆ ఊరిపేరుతో కూడిన సూచికలు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా గూడూరు గ్రామ శివార్లలో మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి వెంబడి గులాబ్పురా పేరిట పెద్ద పెద్ద సూచికలు ఏర్పాటు చేశారు. అయితే స్థానికంగా గులాబ్ పురా అనే ఊరు ఇక్కడ లేకపోవడం జాతీయ రహదారిపై ప్రయాణం చేసే ప్రయాణికులు, వాహనదారులను గందరగోళానికి గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల ప్రకారం కూడా గూడూరు పరిసరాల్లో ఈ ఊరిపేరు కనిపించడం లేదు. గూగుల్లో సెర్చ్ చేస్తే... రాజస్థాన్లోని బిల్వారా జిల్లాలో ఒక టౌన్ ఉన్నట్లు చూపిస్తుండటం విశేషం. మరి అలాంటి ఊరి పేరును గూడూరు సమీపంలో ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అధికారులకే ఎరుక. స్థానికులకు కూడా ఈ పేరు ఇక్కడ ఎందుకు పెట్టారబ్బా అంటూ ఎంతగా ఆలోచన చేస్తున్నా... సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. నరికేడ్లపాలెం సూచిక కూడా అంతే.. ఇదొక్కటే కాదండోయ్ తరకటూరు శివారు పర్ణశాల సమీపంలో కూడా నరికేడ్లపాలెం అంటూ మరో సూచిక ఏర్పాటు చేశారు. వాస్తవానికి నరికేడ్లపాలెం అనే గ్రామం గూడూరు మండలంలోనిదే. కానీ గూడూరు నుంచి పెడన వెళ్లే మార్గంలో ఉంటుంది. కానీ తరకటూరు శివారు పర్ణశాల నుంచి తుమ్మలపాలెం వెళ్లే రోడ్డును నరికేడ్లపాలెం గ్రామానికి సూచికగా అధికారులు ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో ఆటో ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు చనిపోయారు. ఆటోలో ఉన్న మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న వారు 108కు ఫోన్ చేసి ప్రమాద స్థలాన్ని నరికేడ్లపాలెం రోడ్డు దగ్గర అని చెప్పడంతో 108 ఊరంతా తిరిగి ఘటనా స్థలానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర గులాబ్పురా పేరిట ఏర్పాటు చేసిన సూచిక ; తరకటూరు శివారు పర్ణశాల సమీపంలో నరికేడ్లపాలెం పేరిట ఏర్పాటు చేసిన సూచిక పట్టించుకోని పాలకులు బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్... ఇలా ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు విజయవాడ వెళ్లాలంటే రెగ్యులర్గా ఈ రహదారి మీదే ప్రయాణాలు సాగిస్తుంటారు. గూడూరు, తరకటూరు ప్రాంతాల దగ్గర తప్పుగా ఏర్పాటు చేసిన సూచికలు తొలగించి, సరైన సమాచారంతో ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు స్థానిక ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. గతంలో జేసీగా పనిచేసిన మాధవీలత గూడూరులో పర్యటించినప్పుడు స్థానికులు ఈ సమస్యను లిఖిత పూర్వకంగా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ వల్లభనేని బాలశౌరికి కూడా స్థానిక నాయకులు వినతిపత్రం సమర్పించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి సూచికలు సరిచేయాలని వారు కోరుతున్నారు. మచిలీపట్నం నుంచి విజయవాడ మధ్యలో చిన్న చిన్న గ్రామాల పేర్లు కూడా పెద్దపెద్ద అక్షరాలతో వాహనదారులకు తెలిసేలా ఏర్పాటు చేసిన జాతీయ ప్రాధికార సంస్థ అధికారులు దాదాపు ఏడు వేల జనాభా కలిగి మండల కేంద్రంగా ఉన్న ‘గూడూరు’ పేరుతో ఎక్కడా సూచిక ఏర్పాటు చేయకపోవడం కొసమెరుపు. గూగుల్లో వెదికినా కనిపించని ఊరు -
ఫిర్యాదుల పరిష్కారం బాధ్యతగా భావించండి
మీకోసంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు కోనేరుసెంటర్: మీకోసంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించటంలో అధికారులు, సిబ్బంది ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీకోసంలో అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో సిబ్బందిపై ఎలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని, అటువంటి ఆరోపణలు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీకోసంలో మొత్తం 56 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధానమైన అర్జీలు ● పామర్రుకు చెందిన శ్రీను అనే బాధితుడు ఎస్పీని కలిసి తన తాతల నాటి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని బంధువులు నకిలీ పత్రాలు చూపించి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనపై భౌతిక దాడికి పాల్పడుతున్నారని వాపోయాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ● చల్లపల్లి నుంచి లక్ష్మి అనే బాధితురాలు తనకు వివాహం జరిగి ఆరేళ్లయిందని, అప్పటి నుంచి అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా ప్రయోజనం లేకపోయిందని, అత్తింటి వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది. ● కంకిపాడుకు చెందిన బసవయ్య అనే రైతు తన పొలానికి వెళ్లే మార్గాన్ని సరిహద్దుదారుడు అడ్డుకుంటూ పొలంలోకి వెళ్లనీయటం లేదని, అదేమని ప్రశ్నించినందుకు తనను దుర్భాషలాడుతూ భౌతికదాడికి పాల్పడుతున్నాడని వాపోయాడు. విచారణ జరిపించి తనకు రక్షణ కల్పించాలని కోరాడు. ● ఘంటసాల నుంచి వచ్చిన నరేష్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న తనకు తన స్నేహితుడు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడని, డబ్బు తీసుకుని ఏడాదవుతున్నా ఉద్యోగం ఇప్పించకపోగా, ఉద్యోగం గురించి అడిగితే బెదిరిస్తున్నాడంటూ వాపోయాడు. విచారణ జరిపించి తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. -
లీకేజ్ మంత్రి కొనసాగడం దేశ భవిష్యత్తుకే ప్రమాదం
మధురానగర్(విజయవాడసెంట్రల్): లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి, 22 మంది విద్యార్థుల బలిదానాలకు కారకుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. సోనమ్ వాంగ్ చుక్ దీక్షను నిరంకుశంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డి.వై.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో 89 సార్లు పేపర్ లీక్ లతో విద్యా వ్యవస్థను అత్యంత ఘోరంగా దిగజార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు స్పందించకుండా భగ్నం చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ప్రభుత్వ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్, సహాయ కార్యదర్శి ఐషిగోష్ ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారన్నారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కు దేశ యువత, విద్యార్థులు సీజేపీ పిలుపులో భాగంగా దేశ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి వేలాది మంది విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేపడితే భారీగా పోలీసులను మోహరించి లాఠీచార్జ్ చేయడం, ఇంటర్ నెట్ ఆపేయడం, మెట్రోలను ఆపేయడం చూస్తుంటే యువత పోరాటానికి బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. ఇప్పటికై నా తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ను బర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో యువత, నిరుద్యోగుల్లో అసంతృప్తి పెద్దఎత్తున పెరిగిందన్నారు. నిరసన ర్యాలీ మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ భవన్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రవి, నాయకులు కృష్ణ, శివ, షణ్ముఖ్, ఒజేస్విన్, సోమేశ్వరరావు పాల్గొన్నారు. చలో పార్లమెంట్ యూత్ మార్చ్కు మద్దతుగా నిరసన ప్రదర్శన -
కోలాహలంగా సారె సంబరం
సారెతో అమ్మవారి ప్రతిమ సారెను సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం పలు భక్త బృందాలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రికి చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన భక్త బృందాల రాక సాయంత్రం వరకు కొనసాగింది. సారె సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన భక్తులకు రూ.100, రూ.300 క్యూలైన్ల ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ను దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తున్నారు. సారె సమర్పించిన భక్త బృందాలు, భక్తులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, భక్త బృందంలోని సభ్యులకు పసుపు, కుంకుమ, ప్రసాదాలను ఇచ్చి పుచ్చుకున్నారు. సారె సమర్పించిన భక్తులతో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారులు మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చారు. -
పల్లె నుంచి పరిశోధనల శిఖరానికి..
కోడూరు: అతనిది సముద్రతీరంలో ఓ చిన్న గ్రామం. సాధారణ కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలోనే చదువు. కల మాత్రం ప్రపంచాన్ని తాకేంతటిది. ఆ కలను కేవలం ఊహగా మిగల్చకుండా కఠోర శ్రమతో నిజం చేసి చూపించారు కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ తక్కెళ్ల దినేష్బాబు. ప్రభుత్వ విద్యసంస్థల్లోనే చదువుకుని జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు. ఐఐటీ హైదరాబాద్లో పీహెచ్డీ పూర్తి చేసి, నేడు అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్లో పోస్టు డాక్టోరల్ రీసెర్చర్గా ఎంపిక కావడం ఆయన పట్టుదలకు నిదర్శనం. పరిశోధనతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ.. కెమిస్ట్రీపై అపారమైన ఆసక్తితో ముందుకు సాగిన దినేష్బాబు, ఐఐటీ హైదరాబాద్లో డీఎన్ఏ నిర్మాణం, దాని చలన స్వభావం, ఎపిజెనెటిక్ మార్పులపై అత్యాధునిక స్పెక్ట్రోస్కోపిక్, మైక్రోస్కోపిక్, కంప్యూటేషనల్ పద్ధతులతో విస్తృత పరిశోధనలు చేశారు. ఆయన సమర్పించిన పీహెచ్డీ పరిశోధన శాసీ్త్రయ వర్గాల ప్రశంసలు అందుకుంది. పరిశోధనలో కనబర్చిన ప్రతిభకు గుర్తింపుగా ఐఐటీ హైదరాబాద్ ప్రతిష్టాత్మక రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డుతో దినేష్బాబును సత్కరించింది. ఇదే కాకుండా అంతర్జాతీయ శాసీ్త్రయ జర్నల్స్లో ఏకంగా 24 పరిశోధనా వ్యాసాలు ప్రచురించడం విశేషం. వాటిలో 14 పరిశోధనలకు తొలి రచయితగా, మరో పరిశోధనకు సంబంధిత రచయితగా వ్యవహరించడం దినేష్బాబు ప్రతిభకు అద్దం పడుతోంది. అమెరికాలో ప్రతిష్టాత్మక బాధ్యత ప్రపంచ స్థాయి పరిశోధనల దిశగా మరో అడుగు వేస్తూ, డాక్టర్ దినేష్బాబు ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్లో పోస్టు డాక్టోరల్ రీసెర్చర్గా బాధ్యతలు చేపట్టారు. రీసెర్చర్గా చేస్తున్నందుకు సంవత్సరానికి సుమారు రూ.60 లక్షల వేతన ప్యాకేజీ లభిస్తోంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఒక యువకుడు ప్రపంచ స్థాయి పరిశోధనల్లో భాగస్వామి కావడం గర్వకారణంగా ఉందని కుటుంబ సభ్యులు, వి.కొత్తపాలెం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం ముఖ్యం ప్రస్తుతం అమెరికాలో ఉన్న దినేష్బాబు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. పాఠశాల ఏదన్నది ముఖ్యం కాదు. మన పట్టుదలే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేసి జ్ఞానాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టాలి. కష్టపడే తత్వం, క్రమశిక్షణ, దృఢ సంకల్పం ఉంటే ప్రపంచంలో ఏ లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చు’ అని దినేష్బాబు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో జన్మించిన తాను అమెరికాలోని యూని వర్సిటీ ఆఫ్ కాన్సాస్లో పోస్ట్ డాక్టోరల్ రీసర్చర్గా రూ.60 లక్షల వార్షిక వేతనం తీసుకోవడం గర్వంగా ఉందని, పరిశోధన రంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నానని వివరించారు. తన విజయానికి తల్లిదండ్రులు, గురువులు, పరిశోధనా మార్గదర్శకుల ప్రోత్సాహమే ప్రధాన బలమని చెప్పారు.దినేష్బాబు వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన తక్కెళ్ల శ్రీనివాసరావు, సుజాత దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వం విద్యాసంస్థల్లోనే సాగింది. వి.కొత్తపాలెం జెడ్పీ పాఠశాలలో పదో తరగతి వరకు, అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఎన్సీసీలో చురుకుగా పాల్గొని ‘బీ’, ‘సీ’ సర్టిఫి కెట్లను సాధించి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రవేశం పొంది, విశ్వవిద్యాలయంలోనే ప్రథమ స్థానం సాధించారు. బంగారు పతకంతో పాటు యూనివర్సటీ ర్యాంక్ హోల్టర్ అవార్డు, యూజీసీ అవార్డులను అందుకున్నారు. అనంతరం సీఎస్ఐఆర్– యూజీసీ జేఆర్ఎఫ్ అండ్ నెట్, గేట్, ఏపీసెట్ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో అర్హత సాధించి పరిశోధన రంగంలో తన సత్తాచాటారు. -
చెస్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ పి.రేణుక ఉమెన్ క్యాటగిరీలో 4.5 పాయింట్లు సాధించి బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డుతో పాటు ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిందని ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ పాషా చెప్పారు. స్థానిక చుట్టుగుంటలోని ఎస్ఆర్ఆర్ చెస్ అకాడమీ ఆవరణలో పతకాలు పొందిన క్రీడాకారులను సోమవారం ఆయన అభినందించారు. ఈ నెల 18, 19 తేదీల్లో నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో బాలికల అండర్ –7 కేటగిరిలో గోలి అతిథి శ్రేయ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుందన్నారు. చెస్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులతో పాటుగా చెస్ క్రీడాకారులు పాల్గొని పతకాలు పొందిన రేణుక, గోలి అతిథి శ్రేయలను అభినందించారు. -
నలుగురు దొంగల అరెస్టు
● రూ.15.38 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం ● నిందితుల్లో ఇద్దరు హిజ్రాలుగుడివాడరూరల్: గుడ్లవల్లేరు ఎన్టీఆర్ కాలనీలో జరిగిన బంగారం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. గుడివాడ తాలూకా సీఐ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ పాలా శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 16వ తేదీన గుడ్లవల్లేరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన పోలగాని నాగేశ్వరమ్మ ఇంటి తాళం పగలకొట్టి బంగారు ఆభరణాలు, నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారని, పోలీసులు కేసు నమోదు చేసి ఎస్ఐ సత్యనారాయణ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారన్నారు. సోమవారం ఉదయం గుడ్లవల్లేరు రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసింది తామేనని అంగీకరించారన్నారు. ఈ దర్యాప్తు ప్రారంభించి నాలుగు రోజుల్లోనే నిందితులను గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితులు విజయవాడ కృష్ణలంకకు చెందిన గాడు నాగరాజు, గుడ్లవల్లేరుకు చెందిన తుమ్మరాడ అంజు అలియాస్ రేవంత్(హిజ్రా), కడవకొల్లు శ్రీనివాస్(హిజ్రా), విజయవాడ జక్కంపూడి కాలనీకి చెందిన చుక్క ప్రవీణ్ అని డీఎస్పీ వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.15.38 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనం చేసిన అనంతరం ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో దొంగలు కారం చల్లారన్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో తాలూకా సీఐ ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు, గుడ్లవల్లేరు ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీమచిలీపట్నంఅర్బన్: నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు సోమవారం మచిలీపట్నంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఈ ఘటనపై యువత చేపట్టిన ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అణచివేత ధోరణి అవలంబించిందని విమర్శించారు. ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను బలవంతంగా విరమింపజేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొ న్నారు. టెట్కు సంబంధించిన సమస్యల వల్ల లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చలు జరపకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఎండీ షౌకత్ హుస్సేన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకారావు, గౌరవాధ్యక్షుడు జె.లెనిన్బాబు, జిల్లా కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వరరావు, కె.రంగనాథ్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు జె.ప్రసాదరావు, వివిధ మండల శాఖల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026ఖరీఫ్ సీజన్ మొదలైనా రైతులకు రాయితీపై అందని వ్యవసాయ యంత్రాలు 7పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 29.440 టీఎంసీలు.దిగువకు సాగునీటి అవసరాల నిమిత్తం 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించారు. పెనుగంచిప్రోలు: ఆషాఢం సందర్భంగా పెనుగంచిప్రోలులో వేంచేసిన శ్రీతిరుపతమ్మవారికి సోమ వారం అమ్మవారి పుట్టిన ఊరు అనిగండ్లపాడు మహిళలు సారె సమర్పించారు. -
పీజీఆర్ఎస్ అర్జీలను సత్వరం పరిష్కరించాలి
మచిలీపట్నంఅర్బన్: ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, గడువులో పరిష్కరించేలా చర్యలు తీసు కోవాలని కృష్ణా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ నవీన్, ఇతర అధికారులకు అర్జీలు అందించారు. ఇన్చార్జి డీఆర్వో ఎస్.పోతురాజు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ పి.నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ జి.శ్రీనివాసరావుతో కలిసి జేసీ నవీన్ ప్రజల సమస్యలను ఆలకించారు. జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పీఎంఎఫ్బీవైను సద్వినియోగం చేసుకోవాలి
మచిలీపట్నంఅర్బన్: ఈ ఖరీఫ్ సీజన్కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద అర్హులైన రైతులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకుని పంటల బీమా రక్షణ పొందా లని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం సోమ వారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు జ్యోతి రమణి పథకం లక్ష్యాలు, అమలు మార్గదర్శకాలు, ఖరీఫ్–2026 అమలు విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలను తగ్గించి వారికి ఆర్థిక భద్రత కల్పించడమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రుణగ్రహీత రైతులతో పాటు రుణేతర రైతులు, కౌలు రైతులు కూడా స్వచ్ఛందంగా పథకంలో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి అర్హులైన ప్రతి రైతు పథకంలో నమోదు అయ్యేలా వ్యవసాయ, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది రుణేతర రైతులకు రైతు స్వీయ ధ్రువీకరణ విధానాన్ని ప్రవేశపెట్టడంతో నమోదు ప్రక్రియ మరింత సులభతరమైందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో రైతుల నమోదు పురోగతిని సమీక్షించిన కలెక్టర్, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని నమోదు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రచార పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ గుణకర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రారెడ్డి, జిల్లా గణాంక శాఖ ఏడీ కె.పద్మజ, డ్రెయినేజీ ఈఈ కిరణ్బాబు, కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త సుధారాణి, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, మండల వ్యవసాయ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
మత్స్యానికీ మద్యం కిక్కు..!
కృత్తివెన్ను: మద్యం కిక్కుకు మనిషే కాదు జలపుష్పాలు (చేపలు) సైతం ఖుషీ అవుతాయంటున్నారు కొందరు ఆక్వా రైతులు. ఆక్వాసాగులో భాగంగా చేపలు పెంచుతున్న రైతులు పట్టుబడి సమయంలో చేపల ఫిజికల్ కండీషన్కు మద్యం ఎంతగానో ఉపకరిస్తోందంటున్నారు. పట్టుబడి చేసే ముందు చేపలను కొంతసేపు వలల్లో ఉంచుతారు. ఆ సమయంలో ఒక్కోసారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి చేపలు చనిపోవడం లేదా నీరసించి పోవడం జరుగుతుంది. గతంలో ఈ సమస్యను అధిగమించడానికి ఆక్సిజన్ టాబ్లెట్లు లేదా పౌడర్ను వినియోగించేవారు. కానీ ఇప్పుడు వాటి అవసరం లేకుండానే మద్యాన్ని చేపలు ఉన్న వలల్లో పిచికారీ చేయడంతో ఆక్సిజన్ లెవల్స్ పెరగడమే కాదు చేపల్లో మంచి హుషారు కనిపిస్తోందని రైతులు అంటున్నారు. ఏది ఏమైనా మద్యం కిక్కుకు మనిషే కాదండోయ్ చేపలు కూడా చిందులు వేస్తాయంటున్నారు కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలోని ఆక్వా రైతులు. -
ఏపీలో వీసా స్కామ్.. రోడ్డున పడ్డ 700మంది బాధితులు
సాక్షి,కృష్ణ: ఇటీవల నందూస్ వరల్డ్ వీసా స్కామ్ మరువక ముందే తాజాగా మరో వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది. యూకేలో ఉద్యోగాలు, స్పాన్సర్షిప్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ‘ఫ్లైయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ’మోసం తాజాగా విజయవాడలో బయటపడింది. సుమారు 700 మంది బాధితుల నుండి ఈ సంస్థ భారీగా డబ్బులు వసూలు చేసి ముంచేసిందని బాధితులు లబోదిబోమంటున్నారు.ఓ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రకటనలు, ప్రమోషనల్ వీడియోలను నమ్మి తాము హైదరాబాద్ బేగంపేట, విజయవాడ పరిసరాల్లో ఉన్న ఫ్లైయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీని సంప్రదించామని బాధితులు తెలిపారు. ఈ సంస్థ నిర్వాహకులు సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ తమను నమ్మించారని పేర్కొన్నారు.యూకేలో స్కిల్డ్ వర్క్ వీసాపై ఉద్యోగం ఇప్పిస్తామని, కుటుంబ సభ్యులను కూడా డిపెండెంట్లుగా తీసుకెళ్లొచ్చని నమ్మబలికారు. అక్కడ ఉద్యోగం, వసతితో పాటు పోస్ట్ ల్యాండింగ్ సపోర్ట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం ప్రక్రియకు రూ.12 లక్షలు ఖర్చవుతుందని, ముందుగా రూ.6 లక్షలు, యూకే వెళ్లిన తర్వాత మిగిలిన రూ.6 లక్షలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. వీరి మాటలు నమ్మి చాలామంది అప్పులు చేసి రూ.3 లక్షల నుండి రూ.12 లక్షల వరకూ చెల్లించారు. రిక్రూట్మెంట్ లైసెన్స్ లేకుండానే వీరు ఈ కన్సల్టెన్సీని నడుపుతున్నట్లు బాధితులు గుర్తించారు.డబ్బులు కట్టించుకున్న తర్వాతే వీరు అగ్రిమెంట్లు చూపించారని, అందులో ఉద్యోగ హామీ గురించి స్పష్టంగా లేదని బాధితులు వాపోయారు. మౌఖికంగా మాత్రం 100శాతం జాబ్ వస్తుందని నమ్మించారు. తీరా డబ్బులు కట్టాక వీసాలు రాకపోవడంతో నిలదీస్తే బాధితుల ఫోన్ నెంబర్లను బ్లాక్ చేశారు. లక్ష రూపాయలు మాత్రమే తిరిగి ఇస్తామని తేల్చి చెప్పారు.న్యాయం కోసం హైదరాబాద్ బేగంపేటలోని కార్యాలయానికి వెళ్లి వివరణ కోరగా.. నిర్వాహకులు బాధితులపైనే ఉల్టా న్యూసెన్స్ కేసులు పెట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా బాధితులపై సివిల్ సూట్లు దాఖలు చేసి, డబ్బులు అడిగితే రాజకీయ నాయకుల పేర్లు చెప్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు.తమను నిలువునా ముంచిన ఫ్లైయింగ్ బోర్డర్స్ సంస్థ యజమాని సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని, వారి బ్యాంక్ ఖాతాలను తక్షణమే సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమడబ్బును తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. -
టీచర్ను హోటల్కు తీసుకెళ్లిన జిమ్ ట్రైనర్.. ఆపై నిజస్వరూపం..
విజయవాడ: ఓ యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి, నగ్న ఫొటోలు తీసినట్లు బాధిత యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్పై కేసు నమోదు చేసిన సత్య నారాయణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బాధిత యువతి ప్రైవేట్ స్కూల్ టీచర్గా పని చేస్తోంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పరిచయమయ్యాడు. లావుగా ఉన్న టీచర్ స్లిమ్గా అయ్యేందుకు జిమ్ సలహాలు ఇస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ప్రైవేట్ హోటల్కు తీసుకువెళ్లి బరువు తగ్గడానికి షేక్ తాగాలంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడని ఆ టీచర్ తెలిపింది. మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడని పోలీసులను ఆశ్రయించిన యువతి. కేసు నమోదు చేసి యువతిని పోలీసులు వైద్య పరీక్షల కోసం తరలించారు. జిమ్ ట్రైనర్ ఖాదర్ పరారీలో ఉన్నాడు. -
హైదరాబాద్–విజయవాడ ఇక నాన్స్టాప్!
సాక్షి, హైదరాబాద్: విజయవాడకు వెళ్లే ప్రైవేటు బస్సు ఎక్కి తే, ఎల్బీనగర్ దాటిన తర్వాత మధ్యలో రాత్రి భోజనానికో, టీ తాగేందుకో తప్ప మరెక్కడా ఆగకుండా నేరుగా విజయ వాడకు చేరుకుంటుంది. అదే, ఆర్టీసీ బస్సులో ఎక్కితే భోజన, టీ విరామాలతోపాటు అదనంగా కోదాడ, సూర్యా పేట బస్టాండ్లలో ఆగుతుంది. ఇది ఆక్యుపెన్సీ రేషియోపై ప్రభావం చూపుతున్నట్లు తాజాగా ఆర్టీసీ గుర్తించింది. వేగంగా విజయవాడకు చేరుకోవాలనుకునే చాలామంది, ఈ ఒక్క కారణంతో ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నట్లు తే లింది. ఇప్పుడు గరుడ, రాజధాని సహా ప్రీమియం కేటగిరీ సర్వీసులకు, ఆ హాల్టులను తప్పించి నేరుగా విజయవాడకు నాన్స్టాప్ సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. అవసరమైతే ఆ రెండు ప్రాంతాలకు మరిన్ని సర్వీసులు తిప్పాలని యోచిస్తోంది.‘బెంగళూరు ప్రయోగం’ సక్సెస్తో...ప్రతినెలా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఆర్టీసీ బస్సుల్లో సగటున 1.30 లక్షల మంది ప్రయాణిస్తుండగా, 90 వేల మంది మాత్రమే తిరిగి ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు. మిగతావారు ఎందుకు రావటం లేదో తెలుసుకునేందుకు ఇటీవల ఆర్టీసీ ఓ బృందాన్ని బెంగళూరుకు పంపింది. బెంగళూరు నుంచి వచ్చే క్రమంలో ప్రైవేటు బస్సులు 20 చోట్ల ఆగుతున్నాయని, ఆర్టీసీ బస్సులు కేవలం నాలుగు చోట్లే నిలుపుతున్నాయని, దీంతో చాలామంది తమకు అనుకూలమైన ప్రాంతంలోని హాల్టుల వద్దకు వెళ్లి ప్రైవేటు బస్సులు ఎక్కుతు న్నారని ఆ బృందం గుర్తించింది. వెంటనే, ఆర్టీసీ కూడా 20 ప్రాంతాల్లో హాల్టింగ్ సదుపాయం కల్పించింది. దీంతో 20 రోజుల్లో, రోజుకు 8 శాతం వరకు ఆక్యు పెన్సీ రేషియో పెరిగి రోజుకు రూ.80 వేల ఆదాయం అదనంగా సమకూరటం మొదలైంది. ఈ సక్సెస్తో తాజాగా, మరో బృందాన్ని విజయవాడ, గుంటూరు సెక్టార్లో అధ్యయనానికి ఆర్టీసీ పంపింది. ఇందులో భాగంగా, హైదరాబాద్–విజయవాడ మధ్య నాన్స్టాప్ సర్వీసులు కావాలన్న డిమాండ్ ఆ బృందం దృష్టికి వచ్చింది. గతంలో గరుడ బస్సులకు ఈ స్టాపులు ఉండేవి కాదు. కానీ, ఆక్యుపెన్సీ రేషియో పేరుతో వాటిని కూడా నాన్స్టాప్ కోటా నుంచి తొలగించి కోదాడ, సూర్యాపేట బస్టాండ్లలోకి వెళ్లేలా మార్చారు. దీనివల్ల దాదాపు అరగంట నుంచి 40 నిమిషాల సమయం వృథా అవుతోంది. ఫలితంగా ఆర్టీసీ ప్రయాణికుల్లో 10 శాతం మంది ప్రైవేటుకు మళ్లారని భావిస్తున్నారు. విజయవాడలో కూడా వేర్వేరు స్టాపులు...హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులు నేరుగా పండిట్ నెహ్రూ బస్టాండ్లోకి వెళ్లి నిలిచిపోతాయి. కానీ, అదే హైదరాబాద్లో ఏపీ బస్సులు ఎంజీబీఎస్కే పరిమితం కాకుండా, అమీర్పేట, కూకట్పల్లి, కేపీహెచ్బీ, లింగంపల్లి, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ సహా చాలా ప్రాంతాలకు వెళ్లి ఆగుతాయి. ఇప్పుడు ఇదే తరహాలో విజయవాడలో కూడా బెంజ్ సర్కిల్, ఆటోనగర్, పోరంకి, గాంధీనగర్, సత్యనారాయణపురం... ఇలాంటి ప్రధాన ప్రాంతాలకు వెళ్లేలా బస్సు రూట్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. గుంటూరులో కూడా ఇదే తరహా ఏర్పాటు చేయనున్నారు. -
గిరిపురంలో కొనసాగుతున్న ప్రత్యేక వైద్య శిబిరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): గిరిపురంలో డయేరియా సోకిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరం సోమవారం కూడా కొనసాగనుంది. ప్రస్తుతం ఆదివారం కొత్తగా కేసులు ఏమీ నమోదు కానప్పటికీ సోమవారం కూడా వైద్య బృందాలు ఇంటింటి సర్వే చేయనున్నాయి. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలు ఇచ్చే వరకూ వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏ శ్రావణ్బాబు తెలిపారు. కాగా ఈ వైద్య శిబిరంలో ఆదివారం 18మంది చికిత్స చేశారు. వారంతా జనరల్ ఓపీకి వచ్చిన వారేనని వైద్యులు తెలిపారు. వారిలో డయేరియా బాధితులు లేరని చెప్పారు. గిరిపురంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ఏ సమయంలోనైనా అనారోగ్యానికి గురైన వారు రావచ్చని తెలిపారు. ప్రజలకు ఆరోగ్య అవగాహన.. గిరిపురంలో ఇంటింటి సర్వే చేపడుతున్న సిబ్బంది, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన నీరు తాగడం, వేడి వేడి ఆహారం తీసుకోవడం వంటి అంశాలను స్థానికులకు వివరిస్తున్నారు. ఆర్వో వాటర్ను కూడా కాచి చల్లార్చిన తర్వాత తాగితే మంచిదని సూచిస్తున్నారు. అంతేకాకుండా పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆస్పత్రికి తరలించేందుకు 108 వెహికల్ను అక్కడ అందుబాటులో ఉంచారు. పైప్లైన్లకు మరమ్మతులు.. మంచినీరు సరఫరా అయ్యే పైపుల్లో డ్రెయినేజీ వాటర్ కలుస్తోందనే అనుమానాలు రావడంతో ఆదివారం మంచినీటి పైప్లైన్లను డమ్మీ చేసి, పలు ప్రాంతాల్లో వీఎంసీ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. అదే విధంగా ఇళ్లలో నుంచి మురుగు నీరు సైడు డ్రెయిన్లలోకి రాకుండా చూడాలని ప్రజలకు సూచించారు. పూడిన డ్రైయిన్లను శుభ్రం చేశారు. -
టిఫిన్ సెంటర్ ధ్వంసం చేసిన వారిపై కేసు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టిఫిన్ సెంటర్ ధ్వంసం చేసిన ఘటనపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం భవానీపురానికి చెందిన పలగాని శివరామ్ ప్రసాద్ విద్యాధరపురం చెరువు సెంటర్లో నాగండ్ల సీతామహాలక్ష్మికి చెందిన ఖాళీ స్థలం అద్దెకు తీసుకుని టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గతేడాది డిసెంబర్లో స్థల యజమాని కొడుకులు పవన్, తేజ వచ్చి ఖాళీ చేయాలని అడిగారు. దానికి శివరామ్ ప్రసాద్ అంగీకరించలేదు. తాను రూ. 5లక్షలు ఖర్చు చేసి స్థలం మెరక చేశానని చెప్పాడు. యజమాని కుమారులు పదే పదే ఖాళీ చేయాలని గొడవ చేస్తుండడంతో అతను కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో శివరామ్ ప్రసాద్ హోటల్ మూసివేసి ఇంటికి వెళ్లాడు, మర్నాడు ఉదయం 6 గంటలకు హోటల్ వద్దకు వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి, అందులోని టేబుల్స్, కుర్చీలు, సీసీ కెమెరాలు, క్యాష్ కౌంటర్లోని రూ. 42 వేల నగదు తీసుకెళ్లిపోయారు. షాపులో సామాన్లు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భవానీపురం పోలీసు స్టేషన్లో బాధితుడు శివరామ్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. స్థల యజమాని కొడుకులు హోటల్ ధ్వంసం చేసి ఉంటారని పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు గుంటూరు ఎడ్యుకేషన్: దసరా సెలవుల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) లో పలు కీలక మార్పులు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ తెలుగు అవగాహన తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీఎస్సీకి అనుసంధానంగా నిర్వహించే టెట్కు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్లో మార్పులు లేనట్లయితే అది స్పెషల్ టెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్పెషల్ టెట్లో కామన్గా అందరికీ పాస్ మార్కు తగ్గింపుగా ఉండాలని, ఆఫ్లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2ఏ పరీక్షలో ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు వరకే సిలబస్ ఉండాలని, తనవి కాని సబ్జెక్టును తొలగించాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అవగాహన తరగతులు విజయవంతమయ్యాయని, మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. టెట్ అవగాహన తరగతులను నిర్వహించేందుకు సహకారం అందించిన ఏసీ కళాశాల యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తరగతుల ముగింపు కార్యక్రమంలో తెలుగు రీసోర్స్ పర్సన్ ఆర్.వెంకటరావును సత్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టీఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, యూత్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కలుస్తున్న మలినం..
విజయవాడలో తాండవిస్తున్న అపారిశుద్ధ్యంలబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే తాండవిస్తోంది. ముఖ్యంగా మురుగు కంపు కొట్టే డ్రెయిన్లు పక్కనే ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలు అంటు వ్యాధులకు కార్కానాలుగా మారుతున్నా.. వీఎంసీ అధికారులకు పట్టడం లేదు. ప్రజల ఆరోగ్యంపై విషయంలో సర్కారు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా డయేరియా వంటి అంటు వ్యాధుల బారిన పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు 2024లో మొగల్రాజపురం.. 2025 న్యూ రాజరాజేశ్వరిపేట.. నేడు గిరిపురం ఇలా ఏటా ఏదో ప్రాంతంలో డయేరియా సోకడాన్నే నిదర్శనంగా చెబుతున్నారు. ఏదైనా ప్రాంతంలో డయేరియా సోకినప్పుడు రెండు.. మూడు రోజులు వచ్చి హడావుడి చేసి వెళ్లిపోవడమే కానీ, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీటిలో కలిసిన మలినమే కాటేసిందా? గిరిపురంలో పది రోజులుగా 20 మందికి పైగా ప్రజలు డయేరియా బారిన పడ్డారు. రంగు మారిన నీరు తాగడం వల్లే డయేరియా సోకినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకూ అధికారులు నోరు మెదపడం లేదు. నీటి శ్యాంపిల్స్ సేకరించాం.. రిపోర్టులు రాలేదని మాత్రమే చెబుతున్నారు. మంచినీటి సరఫరా లైన్లో డ్రెయినేజీ వాటర్ కలిసినట్లు పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆదివారం గిరిపురంలో వాటర్ పైప్లైన్ డమ్మీ చేసి పలు ప్రాంతాల్లో మరమ్మతులు చేశారు. అంతేకాక కుళాయిల నుంచి వచ్చే వాటర్ తాగవద్దని, ఆర్వో వాటర్ను ఇంటింటికీ సరఫరా చేయడం కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అధికారులు మాత్రం కారణం బయటకు చెప్పడం లేదు. గత ఏడాది న్యూ రాజరాజేశ్వరిపేటలో నిర్వహించిన నీటి పరీక్షల ఫలితాలు కానీ, ఈ ఏడాది గిరిపురంలో నిర్వహించిన నీటి పరీక్ష ఫలితాలు ఇప్పటి వరకూ వెల్లడించలేదు. వీఎంసీ ఏమి చేస్తున్నట్లు? నగర పాలక సంస్థలో ప్రజారోగ్య విభాగం ఉంది. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడటం ఈ విభాగం పని. డ్రెయిన్ల నిర్వహణ, ఆహార పదార్థాల అమ్మకాల వద్ద పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడటం, పారిశుద్ధ్య సమస్య లేకుండా వారే చూడాలి. కానీ నగరంలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం ఉంటే, ఆ విభాగం అధికారులు ఏమి చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆహార పదార్థాల విక్రయాలు జరిపే చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా అనే విషయాలను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు అంటు వ్యాధుల బారిన పడుతున్నారు. నగరంలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. చెత్తా చెదారం, మురుగు కూపాల వద్దే ఆహార పదార్థాల విక్రయాలు జరుపుతున్నా అధికారులకు పట్టడం లేదు. కేవలం ఫుడ్కోర్టులతో పాలకులు జేబులు నింపుకుంటున్నారే కానీ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ఆ ప్రాంతంలోని డ్రెయిన్లు, పరిసరాలు చూస్తే అంతా అర్థమవుతుంది. నగరం అంతా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికై నా పాలకులు కళ్లు తెరవాలి. నగరంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే -
ఏపీజీఈఏ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వైద్యశాఖ ఉద్యోగి కూనపరెడ్డి శ్రీనివాసరావు నియమితులయ్యారు. విజయవాడలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో శ్రీనివాసరావును కార్యదర్శిగా నియమిస్తూ సంఘ అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ నియామక ఉత్తర్వులు అందజేశారు. శ్రీనివాసరావుకు సంఘ సభ్యులు అభినందనలు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు నేడు (20వ తేదీ) సోమవారం రాత్రి 11.59 గంటలకు గడువు ముగుస్తుందని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్)సీఎండీ పి.పుల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగి ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించి, అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత గడువులోపు దరఖాస్తు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలను అభ్యర్థులు నమ్మవద్దని సూచించారు. చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదికపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు క్యూఆర్ కోడ్ను ప్రదర్శించాలని నిర్ణయించామని ఆదివారం ఓ ప్రకటన తెలిపారు. జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలలో, వివిధ మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్ను స్పష్టంగా, కంటికి కనిపించే పరిమాణంలో ముద్రించి, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలన్నారు. పౌరులు పి.జి.ఆర్.ఎస్ సేవలను పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్ల ద్వారా క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని సమర్పించవచ్చన్నారు మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు సోమవారం (జూలై 20) ఫ్లయింగ్ స్టార్ట్ అవార్డ్స్–2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10.00 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఎంపికై న విద్యార్థులకు ప్రశంసాపత్రంతో పాటు ఒక్కొక్కరికీ రూ.20వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని 26 మండలాల నుంచి 168 మంది పదో తరగతి, 49 మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులు పురస్కారాలకు ఎంపికయ్యారన్నారు. అవార్డులకు ఎంపికైన విద్యార్థులు సోమవారం ఉదయం 8.00 గంటలకే జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్కు చేరుకోవాలని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హాజరై అవార్డులు ప్రదానం చేయనున్నట్లు డీఈఓ వెల్లడించారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకరించారు. భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి, మొక్కులు తీర్చుకున్నారు. -
ఆషాఢ వైభవం.. ‘ఇంద్ర’ వైభోగం
జగన్మాతకు ప్రణమిల్లిన భక్తజనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు సారెను సమర్పించాయి. జగన్మాత దుర్గమ్మను భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, మిఠాయిలను సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, తిరిగి సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 9.30 గంటల వరకు సారె సమర్పణలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉదయాస్తమాన సేవగా సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుందా అనే భావన భక్తుల్లో కలిగింది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అన్ని టికెట్ల విక్రయాలు రద్దు.. గతంలో శుక్రవారం, ఆదివారాల్లో కేవలం అంతరాలయ దర్శనాలను మాత్రమే రద్దు చేసేవారు. అయితే ఆదివారం భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని టికెట్ల విక్రయాలను రద్దు చేసి ఉచితంగా ఆయా క్యూలైన్ మార్గాల్లో భక్తులను దర్శనానికి అనుమతించారు. ముందుగా ఆన్లైన్లో రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక సమాయాన్ని కేటాయించి వారికి అంతరాలయ దర్శనం కల్పించారు. రిజిస్ట్రేషన్ కాకుండానే.. అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే భక్తులు, భక్త బృందాలు ఆలయ ప్రాంగణంతో పాటు కనకదుర్గనగర్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. అయితే ఆదివారం రద్దీ అధికంగా ఉండటంతో భక్తులు ఎక్కడా వేచి ఉండే పరిస్థితులు కనిపించలేదు. దీంతో సారె సమర్పించే వారు రిజిస్ట్రేషన్ కాకుండానే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకోవడం, సారె సమర్పించడం జరిగింది. ఆదివారం అనధికార లెక్కల ప్రకారం వందకు పైగా భక్త బృందాలు సారెను సమర్పించినట్లు తెలుస్తోంది. చైర్మన్, ఈవోల పర్యవేక్షణ రద్దీ అధికంగా ఉండటంతో ఎవరికీ వీఐపీ దర్శనాలు కల్పించవద్దని ఆలయ ఈవో శీనానాయక్ ప్రోటోకాల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఘాట్రోడ్డులోని సమాచార కేంద్రానికి చేరుకున్న ఈవో సిబ్బందికి పలు సూచనలిచ్చారు. మరో వైపున చైర్మన్ బొర్రా రాధా కృష్ణ మహా మండపం ఆరో అంతస్తులో సారె సమర్పించిన భక్తులను కలిసి మాట్లాడారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఏఈవోలు, సూపరిండెంటెంట్లు స్కానింగ్ పాయింట్లో రద్దీని పర్యవేక్షించారు. నగరానికి చెందిన భక్త బృందాలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. అంతే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఏర్పడి అమ్మవారికి సారెను సమర్పించేందుకు ఇంద్ర కీలాద్రికి తరలివచ్చారు. భక్తుల వాహనాలతో కొండ దిగువన పలు మార్లు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే మార్గంలో బస్సులు, కార్లను పున్నమీ ఘాట్, భవానీపురం పరిసరాల్లోనే నిలిపివేశారు. దేవస్థాన బస్సులతో పాటు ద్విచక్ర వాహనాలను మాత్రమే కొండపైకి తరలించారు. వీవీఐపీ ప్రోటోకాల్ ఉన్న వాహనాలను సైతం ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ వరకు మాత్రమే అనుమతించారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక విధులను నిర్వర్తించారు. -
నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించాలి
● కాల్మనీ బాధితుడు మోతె గోపరాజు ఆవేదన ● పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): కాల్మనీ వడ్డీ వ్యాపారులతో తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని బాధితుడు మోతె గోపరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారులు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తాను ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో సీనియర్ సేల్స్ మేనేజర్గా పని చేశానని తెలిపారు. వ్యాపార అవసరాల కోసం 2024 జూలై నుంచి 2025 సెప్టెంబర్ మధ్య కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన సుంకర ఫాల్గుణ సాయి నరేన్ (సుంకర సాయి) వద్ద రూ.96 లక్షలు అప్పుగా తీసుకున్నానని తెలిపారు. ఆ అప్పునకు సంబంధించి అసలు, వడ్డీ కలిపి విడతల వారీగా రూ.1.90 కోట్లు చెల్లించినా, ఇంకా వడ్డీ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న సుంకర సాయి తన అనుచరులతో కలిసి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి తన భార్యకు చెందిన ఖాళీ చెక్బుక్తో పాటు నాలుగు ఖాళీ ప్రాంశరీ నోట్లపై సంతకాలు చేయించుకుని తీసుకెళ్లారని ఆరోపించారు. ఆ తర్వాత తనపై పెనమలూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని, స్టేషన్కు వెళ్లినప్పుడు పోలీసులు తన వివరణను పట్టించుకోకుండా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారని తెలిపారు. పలుమార్లు ఇంటికి వచ్చి బెదిరించడంతో పాటు, ఇంటిని ఖాళీ చేయించాలని యజమానిని కూడా బెదిరించారని వాపోయారు. జూన్ 5న పోలీస్స్టేషన్కు పిలిచి, డబ్బులు చెల్లిస్తానని తనతో వీడియో రికార్డు చేయించారని, లేకుంటే తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ పటమట, విస్సన్నపేట పోలీసులు కూడా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. తాను డబ్బులు తిరిగి చెల్లించినట్లు ఆధారాలు చూపినా పోలీసులు పట్టించుకోకుండా వారికే వత్తాసు పలుకుతున్నారని, తనకు సుంకర సాయి, నిమ్మగడ్డ తిరుపతిరావు, వెల్ది వెంకట సుభాష్ గణేష్ చౌదరితో ప్రాణహాని ఉందని గోపరాజు తెలిపారు. ఈ విషయమై సీఎం, డీజీపీ కార్యాలయాలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని గోపరాజు వేడుకున్నారు. -
జలక్రీడల్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారుల ప్రతిభ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విశాఖ పట్నంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన 11వ ఏపీ సబ్–జూనియర్, జూనియర్ అంతర్–జిల్లా జల క్రీడల చాంపియన్షిప్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ చూపి 231 పాయింట్లతో ఓవరాల్ రన్నరప్గా నిలిచారు. అండర్–16 బాలికల విభాగంలో వడ్లమూడి లిపి ఐదు బంగారు పతకాలు, అండర్–14 బాలుర విభాగంలో ఎం.రామ్మణి కంఠ–5 బంగారు పతకాలు పొంది వ్యక్తిగత చాంపియన్ షిష్ను సొంతం చేసుకున్నారని ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ తెలిపారు. గ్రూప్–1(ఏ)బాలుర విభాగంలో కె.శక్తిదార్–1 బ్రాంజ్, గ్రూప్–1(బి)–బాయ్స్ విభాగంలో బి.పృఽథ్వీరాజ్–3 బంగారు, 1 సిల్వర్,1 బ్రాంజ్ పతకాలు, గ్రూప్–1(బి) బాలికల విభాగంలో వడ్లమూడి లిపి–5 బంగారు, పి.రమ్యశ్రీ–2 బంగారు, 3 సిల్వర్పతకాలు, గ్రూప్–2 బాయ్స్ విభాగంలో ఎం.రామ్మణికంఠ–5 గోల్డ్, ఎం.హర్షిత్–1 గోల్డ్, 2 సిల్వర్, 2 బ్రాంజ్, గ్రూప్–2 బాలికల విభాగంలో యానా జైన్–2బంగారు, 3 సిల్వర్, కె.సింధుజ–1సిల్వర్, 2 బ్రాంజ్, గ్రూప్–3 బాలుర విభాగంలో జి.జతిన్–1సిల్వర్,2–బ్రాంజ్, గ్రూప్–3 బాలికల విభాగంలో ఎం.జీసాశ్రీ–2 సిల్వర్, 2 బ్రాంజ్ పతకాలు పొందారని రమేష్ తెలియజేశారు. 18 బంగారు పతకాలు, 13 సిల్వర్, 9–బ్రాంజ్ పతకాలు పొంది మొత్తం 231 పాయింట్లతో ఓవరాల్ రన్నరప్గా నిలిచారన్నారు. పతకాలు పొందిన క్రీడాకారులను ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొంగర రవికాంత్, ఏపీ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఓబుల్రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు కొడాలి రమేష్, డీఎన్డీ కుమార్ అభినందించారు. -
అనైతికం.. అందుకే అడ్డుకుంటున్నాం
గన్నవరం రూరల్: పోలవరం కాలువపై రైతులకు నీరందించే మోటార్లు తొలగించమనటం అనైతికమని రైతులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఆదివారం గన్నవరం మండలం సూరంపల్లి, కొండపావులూరు గ్రామాల్లో పోలవరం కాలువకు ఏర్పాటు చేసి ఉన్న మోటార్లు తొలగించాలని పోలవరం, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా పర్యటించి ఫ్యూజులు తొలగించారు. దీంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ రాజకీయ నాయకులు, విజ్ఞత ఉన్న వాళ్లు చేసే నిర్ణయం ఇది కాదని మండిపడ్డారు. కృష్ణాడెల్టా స్థిరీకరణ పేరుతో ఇక్కడి రైతులను ఎండగడతారా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఆనాడు పోలవరం కాలువకు తాము భూములు ఇవ్వకపోతే పోలవరం ఉండేదా అని ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మోటార్లు ఆపేది లేదని రైతు నాయకుడు జూపల్లి సురేష్ తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఆకుమడులకు నీరు ఇస్తున్నామని, ఇప్పటి వరకూ ఊడ్పులు లేవన్నారు. ‘మేం రైతులం కాదా? తాము పండించి పది మందికి పెడుతున్నాం? ఇక్కడి రైతులు అన్నం తినవద్దా?’ అంటూ ప్రశ్నించి, ప్రతిఘటించడంతో అధికారులు వెను తిరిగారు. ఫ్యూజులు తొలగించటం దారుణమని మండిపడ్డారు. తీవ్ర వాగ్వాదం.. హనుమాన్జంక్షన్ రూరల్: సాగునీటి తరలింపు విషయంలో ఇరిగేషన్ అధికారులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పొలవరం కుడి ప్రధాన కాలువపై బాపులపాడు మండలం బండారుగూడెం వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి సాగునీటిని తరలిస్తున్న రైతులను ఇరిగేషన్ అధికారులు అడ్డుకోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. నారుమళ్లు సాగుచేసేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, అదునుకు నీళ్లు అందకపోతే నారు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు వివరించారు. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పటంతో తాత్కాలికంగా వివాదం సర్దుమణిగింది.పోలవరం కాలువపై మోటార్లు తొలగింపును ప్రతిఘటించిన రైతులు -
షరతుల్లేకుండా మహిళా బిల్లు ఆమోదించాలి
మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎటువంటి షరతులు లేని మహిళా బిల్లును ఆమోదించాలని మహిళా సంఘాల ఐక్యవేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లెనిన్ సెంటర్లో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర నాయకురాలు రమాదేవి, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు పద్మ మాట్లాడుతూ.. 2023లో భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మహిళా రిజర్వేషన్కు కేంద్రం చట్టబద్ధత కల్పించిందన్నారు. జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు వాయిదా వేయడం ద్వారా మహిళలకు తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన, డీలిమిటేషన్ షరతులు లేకపోయి ఉంటే ప్రస్తుతం లోక్ సభలో మహిళల ప్రాతినిధ్యం 33శాతం ఉండేదన్నారు. దశాబ్దాలుగా మహిళా ఉద్యమాలు సాగించిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తాత్సారం చేయడం మహిళల రాజకీయ సాధికారతను అడ్డుకోవడమేనన్నారు.. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్ వంటి వివాదాస్పద అంశాలతో ముడిపెట్టకుండా వర్షాకాల సమావేశాలలో షరతులు లేని మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుర్గ కోటేశ్వరావు, బంకా ఝాన్సీ, నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, ఐద్వా జిల్లా నాయకురాలు శ్రీదేవి, మహిళా సంఘాల నాయకురాళ్లు దుర్గాసి రమణమ్మ , దుగ్గిరాల సీతారావమ్మ, అనిత, అండమని నాగమణి, ఆర్. అనసూయ, రాజ్యలక్ష్మి, గుణసుందరి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
జత్వానీ కేసులో బాబు సర్కార్ కుట్రలు బట్టబయలు
సాక్షి, విజయవాడ: జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. జత్వానీని వేధించారంటూ గతంలో కూటమి మంత్రులు రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే, జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని సీఐడీ తేల్చింది. జత్వానీపై నమోదైన కేసులో సిఐడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జత్వానీ బ్లాక్ మెయిల్ చేసిందని.. బెదిరించి పెద్ద ఎత్తుల డబ్బులు వసూలు చేసినట్టు సీఐడీ నిర్థారించింది. కుక్కల విద్యాసాగర్ నుండి డబ్బులు గుంజినట్టు వెల్లడించింది.1.31 కోట్లు బ్లాక్ మెయిల్ చేసి లాగేసిందని.. బ్యాంకు లావాదేవీలను సాంకేతికంగా సీఐడీ నిర్ధారించింది. గతంలో పారిశ్రామిక వేత్త జిందాల్ని బ్లాక్ మెయిల్ చేసిన జత్వానీని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెనకేసుకొచ్చారు. జత్వానీని ఏపీకి రప్పించి తప్పుడు కేసులు పెట్టించిన ప్రభుత్వం.. స్టార్ హోటళ్లు, ఫ్లైట్లు, ప్రోటోకాల్తో జత్వానీని ట్రీట్ చేసింది. దుర్గ గుడిలో ప్రోటోకాల్ దర్శనాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయించింది.జత్వానీ కేసు పేరుతో ఐపీఎస్ అధికారులపై కక్ష సాధించిన ప్రభుత్వం.. డీజీ పీఎస్ ఆర్ ఆంజనేయులు, సీపీ క్రాంతిరాణా టాటాలపై కేసులు పెట్టి.. సస్పెన్షన్ చేసింది. డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావులపైన కూడా కేసులు పెట్టి సస్పెన్షన్ చేసింది. జత్వానీ పేరుతో పోలీస్ అధికారులను చంద్రబాబు ప్రభుత్వం వేధించింది. ఇప్పుడు జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేలింది. సాక్షాత్తూ హోంమంత్రి అనిత దగ్గరుండి కేసు పెట్టించిన సంగతి తెలిసిందే. జత్వానీని వీఐపీలా ట్రీట్ చేసి కూటమి నేతలు అభాసుపాలయ్యారు. -
విజయవాడలో మళ్లీ ‘కాల్ మనీ’ కలకలం
సాక్షి, విజయవాడ: నగరంలో మరోసారి కాల్ మనీ వ్యాపారులు రెచ్చిపోయారు. కాల్ మనీ వ్యాపారీ ద్వారా మోసపోయానంటూ న్యాయం కోసం బాధితుడు రోడ్డెక్కాడు. 96 లక్షల అప్పుకు కోటి 96 లక్షలు కట్టానని బాధితుడు మోతే గోపరాజు చెబుతున్నాడు. కోటి 96 లక్షలు వడ్డీకే సరిపోయాయని.. 96 లక్షలు కట్టాలంటూ బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘లక్షకు రోజుకు 500 వడ్డీతో 96 లక్షలు అప్పు తీసుకున్నాను.. 96 లక్షలకు గాను కోటి 96లక్షలు ఇప్పటివరకు కట్టాను.. ఏప్రిల్ 11వ తేదీన కొంతమంది కుర్రవాళ్లతో బెదిరించారు. నా భార్యతో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్స్పై సంతకాలు తీసుకున్నారు. ఇంకా డబ్బులు కట్టకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అధికార పార్టీకి చెందిన నేతలు తన వెనుక ఉన్నారని బెదిరించడం ప్రారంభించారు...మే నెలలో పెనమలూరు స్టేషన్లో నాపై సుంకరసాయి అనే వ్యక్తి కేసు పెట్టారు. 6 సార్లు పెనమలూరు స్టేషన్కి వెళ్లి వివరాలు అన్ని ఇచ్చాను. పోలీస్ స్టేషన్లో పోలీసులు నన్నే బెదిరించారు. కోటి 96 లక్షలు వడ్డీకే సరిపోయాయి. 96 లక్షలు కట్టాలని పోలీసులు బెదిరించారు. చంద్రబాబుకు, డీజీపీకి లేఖ రాశాను. కాల్ మనీ వ్యాపారుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలి’’ అని బాధితుడు కోరుతున్నారు. -
క్రాంతికుమార్ కుటుంబానికి అండగా వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక కాంత్రికుమార్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జూలై 2న క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.క్రాంతి కుమార్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ మేరకు 10 లక్షల రూపాయల చెక్ను కాంత్రికుమార్ కుటుంబసభ్యులకు వైఎస్సార్సీపీ నేతలు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోన్రావు, మాజీ ఎంపీ నందిగామ సురేష్.. క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి చెక్ అందించారు.చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?: టీజేఆర్ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన మానవతా హృదయం చూపించారు. పేరుపొగు కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇది సామాజిక బాధ్యత. క్రాంతి కుమార్ని గంజాయి, డ్రగ్స్ అమ్మాలని, మర్డర్ చేయాలంటూ సీఐ వేధించాడు. క్రాంతి కుమార్ ఆవేశ పూరిత నిర్ణయంతో ముగ్గురు రోడ్డు మీద పడ్డారు. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి ఎందుకు చంద్రబాబు న్యాయం చేయలేదు?..వైఎస్ జగన్.. క్రాంతి కుమార్ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చారు. పేరూపొగు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించిన తర్వాత ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారు. రాజ్యాగం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. దళితులను ఉచకోత కొస్తున్నారు. చంద్రబాబు దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకొంటారంటూ అన్నాడు.’’ అని టీజేఆర్ గుర్తు చేశారు.రెడ్బుక్ రాజ్యాంగంలో ఇలాగే..: మొండితోక జగన్మోహన్రావుమొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రాజకీయ కోణంలో కాకుండా మానవత కోణంలో సాయం చేశారు.. ప్రభుత్వం తుతూ మంత్రంగా వ్యవహరించింది. సాయికృష్ణ బూడిద కూడా ఇవ్వని పరిస్థితి. గుంటూరులో మహిళను వివస్త్రని చేస్తే ముడు రోజుల వరకు బయటకు రాలేదు. హోమంత్రి ఏం చేస్తున్నారు? ఐటీడీపిలో పని చేసిన వ్యక్తి మంచోడు మణిరత్నంపై కూడా దాడి చేసి కొట్టారు. నందిగామలో టీడీపీ నేత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయడు. పాము తన పిల్లలను తినేటట్లు టీడీపీ నేతలు తమ కార్యకర్తలనుని వదలడం లేదు. శాంతిభద్రతాలను కాపాడాల్సిన ప్రభుత్వం దాడులకు దిగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలాగే జరుగుతుంది.ఆర్థిక సాయమే కాదు.. ఆరోగ్య భరోసా కూడా: నందిగామ సురేష్ మాజీ ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ.. ఆర్థిక సహాయమే కాదు.. ఆరోగ్య భరోసా కూడా అందించాం. హోం మంత్రి కనీసం కుటుంబాన్ని పరామర్శించలేదు. చంద్రబాబు మొదటి నుండి దళితులను చిన్న చూపు చూస్తాడు. లోకేష్ పెత్తనం తీసుకొన్న తర్వాత మరింత విచ్చలవిడిగా దారుణాలు పెరిగాయి. రాష్టాన్ని దోచుకొని విదేశాల్లో దాచుకొంటున్నారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ అంశాల్లో వైఎస్ జగన్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం స్వందించింది..దళితులంటే చంద్రబాబుకి చిన్న చూపు: దేవినేని అవినాష్10 లక్షలు ఇచ్చి.. క్రాంతి కుమార్ కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న క్రాంతి కుమార్ చిన్న కుమారుడికి విజయవాడలో టెస్ట్లు చేసి హైదరాబాద్ పంపుతున్నారు. ఏ కష్టం వొచ్చిన నేనున్నాను అని చెప్పే వ్యక్తి జగన్. దళితులు అంటే చంద్రబాబుకి చిన్న చూపు. కూటమి ప్రభుత్వం నిజ స్వరూపం ప్రజలు తెలుసుకొంటున్నారు. పరిపాలన ఎలా చేయాలో జగన్ని చూసి నేర్చుకోవాలి.వైఎస్ జగన్కి కృతజ్ఞతలు: క్రాంతి కుమార్ తండ్రి క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. క్రాంతి కుమార్ విషయంలో వైస్సార్సీసీ సత్వరమే స్పందించింది. వైఎస్ జగన్ ఇంటికి వచ్చి భరోసా ఇచ్చారు. 10 లక్షలు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చారు. వైఎస్ జగన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. -
యోగాంధ్రలో పాల్గొన్న యువతకు ప్రశంసా పత్రాలు
మచిలీపట్నంఅర్బన్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీ (సోమవారం) మచిలీపట్నంలోని నోబుల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న జాబ్మేళాను వినియోగించుకోవాలని కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ ఒక ప్రకటనలో కోరారు. శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్ఎస్వీ సొల్యూషన్స్, ఇన్నోవ్సోర్స్, జస్ట్ డయల్ లిమిటెడ్, రాండ్స్టాడ్, వరుణ్ మోటార్స్, ఆర్ఆర్ ట్రేడర్స్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్, టికోనా ఇన్ఫినెట్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్, టీవీఎస్, వసంత, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్, మ్యాన్పవర్, డైకిన్, డిక్సన్ తదితర ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఉద్యోగాలకు 10వ తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు అర్హులని వివరించారు. జాబ్ మేళాకు బయోడేటా, ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్, పాన్ కార్డు, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో హాజరు కావా లని కోరారు. మరిన్ని వివరాలకు 81424 16211, 99664 89796 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
కొండెక్కిన హామీలు!
గుడివాడలో కనిపించని అభివృద్ధి జాడ గుడివాడరూరల్: గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలాయి. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమనే చెప్పాలి. సామాన్య నిరుపేదలకు ప్రభుత్వం వల్ల ఒరిగిందేమి లేదు. కనీస మౌలిక వసతులైన రోడ్లు, తాగునీరు ప్రజలకు అందని ద్రాక్షగా మారాయి. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గం దేశవ్యాప్తంగా ఆక్వా రంగానికి పెట్టింది పేరుగా ఉంది. ఎన్నికల హామీల్లో ఆక్వా పరిశ్రమకు ఇచ్చిన ఒక్క హామీ సక్రమంగా నెరవేరింది లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ మంజూరు చేస్తామని, యూనిట్ రూ.1.50కే విద్యుత్ అందజేస్తామని చెప్పారు. రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు హామీని అమలు చేసిన దాఖలాలు లేవు. దీంతో ఆక్వా రైతులపై అధిక భారం పడుతుంది. హబ్ లేదు.. ల్యాబ్ ఊసే లేదు.. గుడివాడ పరిసర ప్రాంతాల్లో ల్యాబ్లు ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలు వాటిలో కల్పించి, ఉచితంగా ఆక్వా రైతులకు పరీక్షలు లభించే విధంగా 100 ఎకరాల విస్తీర్ణంలో ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలాయి. ఆక్వా హబ్గా గుడివాడ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని సైతం అమలు చేసిన దాఖలాలు లేవు. రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో ఆక్వా రైతుల నుంచి అన్ని రకాల పన్నుల రూపంలో ఆదాయం దండుకోవడమే కానీ వారికి ప్రభుత్వం కల్పించిన వసతులు శూన్యం. దీని ప్రభావంతో ఆక్వా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. నీటి సమస్యకు పరిష్కారమేది? గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నందివాడ, గుడివాడరూరల్ మండలాల్లోని పంట పొలాలు చేపల చెరువులుగా మారడంతో గ్రామాల్లో కలుషిత మంచినీటి సమస్య కొరలు చాచింది. ముఖ్యంగా నందివాడ మండలంలోని 23గ్రామాల్లో ఏ గ్రామంలోనూ మంచినీటి చెరువుల నుంచి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించే పరిస్థితి లేదు. తాగునీటి మాట దేవుడెరుగు.. వాడుక నీరు సైతం లేకపోవడంతో గ్రామస్తులు పాలు మాదిరిగా నీటిని కొనుగోలు చేసే పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కలుషిత మంచినీటి సమస్య పరిష్కారానికి జనార్దనపురం గ్రామంలో 100ఎకరాల విస్తీర్ణంలో భూమిని సేకరించి అదే ప్రాంతం నుంచి మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు మెగా రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించే విధంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం అడుగులు వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకానికి మంగళం పాడేసింది. టిడ్కో కాలనీలో అభివృద్ధి శూన్యం.. సింగపూర్ మాదిరిగా టిడ్కో కాలనీలను అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇళ్ల అభివృద్ధిని గాలికి వదిలేసింది. 2014నుంచి 2019 వరకు ఇళ్లను అసంపూర్తిగా నిర్మించి ఏ ఒక్క గృహం ప్రజలకు ఇవ్వకుండా లబ్ధిదారులను ఇబ్బందుల పాలు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో టిడ్కో కాలనీలకు అధిక నిధులు కేటాయించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే కాకుండా గృహాలకు లేని నిరుపేదలైన ప్రతి ఒక్కరికీ ప్లాట్లతో పాటు ఇళ్ల స్థలాలను కేటాయించారు. వారికి అవసరమైన కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, విద్య, వైద్యం తదితర సౌకర్యాలను దాదాపుగా పూర్తి చేశారు. టిడ్కో కాలనీల్లో మిగిలిన వసతులు పూర్తి చేసే సమయంలో వైఎస్సార్ సీపీ అధికారం కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిట్కో కాలనీల అభివృద్ధి మరుగున పడింది. రెండేళ్ల కాలంలో అంతర్గత రోడ్లు, ఇతర సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టిసారించకపోవడంతో కాలనీల్లో సమస్యలు తిష్టవేసి, కాలనీల్లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ కాలనీ వాసులు వేడుకుంటున్నా కూటమి ప్రభుత్వం స్పందించడం లేదంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు సార్లు వచ్చినా.. ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి హోదాలో గుడివాడ నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి శనివారం వస్తున్నారు. ఈసారైనా ఇచ్చిన హామీలు నెరవేర్పు దిశగా అడుగులు వేయాలని, పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
‘పవర్’ చూపిన మైలవరం క్రీడాకారులు
కేసరపల్లి(గన్నవరం): మండలంలోని కేసరపల్లిలో హెచ్సీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఈఎస్ఎస్సీఐ) సహకారంతో ఏర్పాటు చేసిన యువకేంద్రం, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, స్వర్ణ ఆంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సీహెచ్ కుటుంబరావుతో కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ కేంద్రంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు శిక్షణ నిమిత్తం 619 మంది యువతి, యువకులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి షేక్ షాహిద్బాబు, హెచ్సీఎల్ టెక్ విజయవాడ హెడ్ శివప్రసాద్, ఈఎస్ఎస్సీఐ వైస్ ప్రెసిడెంట్ నరోజ్ పాల్గొన్నారు. గన్నవరం: రకికెట్ మ్యాచ్ వివాదంలో ఓ యువకుడి మృతికి కారణమైన వ్యక్తిని శుక్రవారం గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ నెల 14న స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో క్రికెట్ మ్యాచ్ విషయమై తలెత్తిన వివాదంలో ఈడే వెంకటరామచంద్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడైన పడమట దృశంత్ అలియాస్ రాకేష్ను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక 12వ అదనపు ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించడంతో స్థానిక సబ్జైలుకు తరలించారు. ఏలూరు టౌన్: ఏలూరు శివారు జాతీయ రహదారి సమీపంలోని ఇంద్రప్రస్థ వద్ద మోటారుసైకిల్ అదుపుతప్పి ఓ యువతి దుర్మరణం పాలయ్యింది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి చెందిన వేముల జయంతి అనే యువతి, మేనమామ కొండబాబుతో కలిసి మోటార్సైకిల్పై ఏలూరు వచ్చారు. తిరిగి వెళ్తుండగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఘటనా స్థలం వద్ద మోటారు సైకిల్ అదుపుతప్పింది. దీంతో జయంతి, కొండబాబుకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో పడి ఉన్న క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ నందకిషోర్ అటు గా వెళ్తూ వెంటనే స్పందించారు. వారిద్దరినీ ఏలూరులోని జీజీహెచ్కు తరలించారు. వైద్యు లు పరీక్షించి జయంతి మార్గమధ్యలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరూ ముందుక రాకపోవడం, సకాలంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవటంతో యువతి మృత్యువాత పడినట్టు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్కి తరలించారు. -
ఊడలు వేసిన నిర్లక్ష్యం
విజయవాడ నగరపాలక సంస్థలో నిర్లక్ష్యం వేళ్లూనుకుపోయి వటవృక్షంలా తయారైంది. ప్రధానంగా ప్రజారోగ్యం గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. గత ఏడాది న్యూ ఆర్ఆర్ పేట ఘటనలు మరువక ముందే మళ్లీ ఈ ఏడాది గిరిపురంలో వీఎంసీ నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. పది రోజులుగా రంగుమారిన తాగునీరు వస్తుందని ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోకపోవడంతో దాదాపు 20 మంది వరకు మంచాన పడ్డారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. మంచినీటి కుళాయిల నుంచి రంగు మారిన నీరు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులు పెడచెవిన పెట్టారు. పేదలు నివసించే కాలనీయే కదా అని చిన్నచూపేమో... పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా ఒక్కొక్కరుగా ఆ ప్రాంత ప్రజలు డయేరియా బారిన పడుతూ ఆస్పత్రుల దారి పట్టారు. వారిలో ఒకరిద్దరు ప్రాణాపాయ స్థితి వరకూ వెళ్లి కోలుకున్నారు. గత ఏడాది న్యూ ఆర్ఆర్పేటలో... గత ఏడాది నగరంలోని న్యూ ఆర్ఆర్పేటలో ఏకంగా 300 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. ఆ ఘటన తర్వాత కూడా అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు. రంగునీరు వస్తున్నాయని ప్రజలు మొత్తుకుంటున్నా పాలకులు పెడచెవిన పెట్టారు. దీంతో గత ఏడాది రీతిలోనే ఇప్పుడు గిరిపురం ప్రాంత వాసులు డయేరియా బారిన పడ్డారు. ఆ ప్రాంతంలో దాదాపు 20 మంది వరకూ బాధితులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆర్వో వాటర్ సరఫరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. రంగు నీళ్లు వస్తున్నాయి సరిదిద్దండీ అంటే పట్టించుకోని అధికారులు, ఇప్పుడు డయేరియా సోకిన తర్వాత ఇంటింటికీ ఆర్వో వాటర్ను సరఫరా చేస్తున్నారు. గిరిపురంలో డయేరియా సోకిన మూడు వీధులతో పాటు, పరిసర ప్రాంతాల్లో సైతం ఆర్వో వాటర్ క్యాన్లు ఆటోల్లో తీసుకు వచ్చి సరఫరా చేస్తున్నారు. దీంతో స్థానికులు బిందెలతో తీసుకు వెళ్తున్నారు. ఎక్కడ చూసినా అపరిశుభ్రతే... గిరిపురంలోని డ్రైనేజీలు ఎక్కడ చూసినా అపరి శుభ్రంగా, కంపుకొడుతూ దర్శనం ఇస్తున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గిరిపురం ఒకటి. ఆ ప్రాంతంలో వీఎంసీ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో ఎక్కడ చూసినా డ్రైన్లు వ్యర్థాలతో నిండిపోయాయి. పరిసరాల అపరిశుభ్రత కూడా డయేరియాకు దారితీసి ఉండవచ్చునని భావిస్తు న్నారు. శానిటేషన్ సిబ్బంది కేవలం రోడ్లు శుభ్రం చేస్తున్నారే కానీ, డ్రైన్లను పట్టించుకోవడం లేదని, దీంతో అవి మురుగు కూపాలుగా మారుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ మోటార్లు పనిచేయక పోవడంతో తరచూ మ్యాన్హోల్స్ నుంచి మురుగు పొంగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి కై నా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో రంగు మారిన నీళ్లు వస్తున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడం వలనే ప్రజలు డయేరియా బారిన పడ్డారు. వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు వచ్చి అధికారులు హడావుడి చేస్తున్నారు. ముందుగానే స్పందించి ఉంటే డయేరియా సోకేది కాదు. డ్రైన్లు మురుగు కూపాలుగా మారాయి. వాటిని వీఎంసీ పట్టించుకోవడం లేదు. పేదల కాలనీల పట్ల పాలకులకు నిర్లక్ష్యం తగదు. – కుక్కల అనిత, మాజీ కార్పొరేటర్ -
సీనియారిటీ జాబితాలో తప్పులు సరిదిద్దాలి
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల స్థానిక క్యాడర్ నిర్ణయ ప్రక్రియలో సీనియారిటీకి ఎలాంటి భంగం కలగకుండా జాబితాలో తప్పులు సరిదిద్దాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావుకు యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక క్యాడర్ నిర్ణయానికి రూపొందించిన సీనియారిటీ జాబితాలో ఉన్న తప్పులను ఆధారాలతో పరిశీలించి సరిదిద్దాలని కోరారు. ఉపాధ్యాయుల సీనియారిటీకి ఎలాంటి నష్టం కలగకుండా పారదర్శకంగా స్థానిక క్యాడర్ నిర్ణయ ప్రక్రియను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి.షౌకత్ హుస్సేన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకారావు, జిల్లా గౌరవాధ్యక్షుడు జె.లెనిన్ బాబు, జిల్లా కార్యదర్శి కె.రంగనాథ్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు జె.ప్రసాదరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రవి వరప్రసాద్, అబ్దుల్ వహీద్, పి.పాపయ్య, శివకుమార్, కె.అర్జున్, వి.వి.ఎస్. సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉప్పాల నాంచారయ్య, వై.సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య
తెల్లవారుజామున.. గన్నవరం: ఉంగుటూరు మండలం తేలప్రోలులో మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ వృద్ధుడు శుక్రవారం అజ్జంపూడి వద్ద ఏలూరు కాలువలో శవమై తేలాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. తేలప్రోలు గ్రామానికి చెందిన ఉద్దగిరి వీరవెంకట్రావు(70) కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన వెంకట్రావు తిరిగి రాలేదు. ఆయన కోసం కుటుంబ సభ్యులు పరిసరా గ్రామాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆత్కూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండలంలోని అజ్జంపూడి వద్ద ఏలూరు కాలువలో కొట్టుకువచ్చిన శవం వెంకట్రావుదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతుడు కుమారుడు వెంకట సాంబశివరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన అనారోగ్య, మానసిక సమస్యలు కారణంగా వెంకట్రావు ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. -
బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎల్నినో నేపథ్యంలో బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతులతో పాటు, తీసుకోని రైతులు కూడా తప్పనిసరిగా బీమా పథకాల్లో చేరాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి హాల్లో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన వ్యవసాయ, ఉద్యాన, సహకార, బ్యాంకింగ్, బీమా సంస్థల అధికారులతో సమావేశం జరిగింది. ఎల్నినో ప్రభావం వంటి పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టాల ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నందున రైతులకు ఫసల్ బీమాపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల్లో చేరేలా ప్రోత్సహించాలన్నారు. ఇందుకు సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు. నోటిఫై చేసిన పంటలివే.. ఖరీఫ్–2026 సీజన్కు జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద వరి, ఎర్రమిరప, మొక్కజొన్న, పెసర పంటలను నోటిఫై చేశారన్నారు. పున ర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పత్తిని నోటిఫై చేసినట్లు వివరించారు. వీటితో అతి తక్కువ ప్రీమియంతోనే కష్టకాలంలో అధిక ఆర్థిక భరోసా లభించనుందని చెప్పారు. వరికి ఎకరాకు బీమా మొత్తం రూ.42,500 కాగా, రైతు వాటా ప్రీమియం రూ.850 చెల్లిస్తే సరిపోతుందన్నారు. వరికి సంబంధించి పథకంలో నమోదుకు ఆగస్టు 15వ తేదీ ఆఖరు తేదీ కాగా ఎర్ర మిరప, మొక్కజొన్న, పెసరకు జూలై 31 చివరితేదీ అని తెలిపారు. పత్తికి ఈ నెల 24వ తేదీలోగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. పంట రుణం తీసుకున్న రైతులకు రుణంతో పాటు అదనంగా బీమా ప్రీమియం కూడా మంజూరవుతుందని, పంట రుణాలు తీసుకోని రైతులు నమోదుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కామన్ సర్వీస్ సెంటర్లు, జాతీయ పంటల బీమా పోర్టల్, స్వర్ణ గ్రామం, తపాలా కార్యాలయాలను ఉపయోగించుకోవచ్చన్నారు. పంట రుణాలు తీసుకోని రైతులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. పథకాలకు సంబంధించిన సమాచారం, సందేహాల నివృత్తి కోసం స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, జిల్లా ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అధికారి డీవీ శివరామ ప్రసాద్, గరికపాడు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఐ.వెంకటరెడ్డి, ప్రగతిశీల రైతు యు.మాధవరావు, యూబీఐ సీనియర్ మేనేజర్ అబ్దుల్ సలామ్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
దుర్గమ్మ అన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విశాఖపట్నం ఇందిరాగాంధీ నగర్కు చెందిన సజ్జా రాధాకృష్ణ తన భార్య శోభారాణి, కుమార్తె మాలిని పేరిట అన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని డెప్యూటీ ఈవో కిషోర్కుమార్కు అందజేశారు. ఆగిరిపల్లికి చెందిన శివపార్వతి తన భర్త పత్తిపాటి సాంబశివప్రసాద్ పేరిట అన్నదానానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విజయవాడ జీజీహెచ్లో కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా క్యాజువాలిటీకి అనుబంధంగా ఉన్న హెచ్డీయూలో 15 పడకలతో వార్డును సిద్ధం చేశారు. క్రిటికల్ కేసులకు చికిత్స అందించేందుకు మరో ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ 47 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, అందరికీ నెగటివ్ వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. కోవిడ్ నోడల్ అధికారిగా పల్మొనాలజీ విభాగాధిపతి డాక్టర్ సుదీనా వ్యవహరించనున్నారు. హెచ్డీయూ వార్డును ఎమర్జెన్సీ మెడిసిన్కు చెందిన డాక్టర్ నూరుల్లా, ఇతర వైద్యులు పర్యవేక్షిస్తారు. డయేరియాకు వార్డు సిద్ధం నగరంలోని గిరిపురంలో డయేరియా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జీజీహెచ్లో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. డయేరియా కేసులు వస్తే ఆ వార్డులో ఉంచి చికిత్స అందించేందుకు సన్నద్ధం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందు జాగ్రత్తలు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ముందు జాగ్రత్తగా విజయవాడ జీజీహెచ్లో 15 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రానికి చెందిన లఘు ఉద్యోగ భారతి ప్రతినిధి బృందం గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఈ సందర్భంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రభావితం చేసే ముఖ్యమైన పలు సమస్యలపై ఆమెకు వినతిపత్రం అందించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు తులసి యోగేష్ తెలిపారు. ఎంఎస్ఎంఈ తయారీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ వినతిపత్రంలో ప్రస్తావించారు. ఎంఎస్ఎంఈ వినియోగదారుల కోసం తగిన ఫాస్ట్ట్రాక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సంస్థ ప్రతినిధులు వెలగపూడి సాంబశివరావు, చాముండేశ్వరి, తరుణ్ కాకాని తదితరులు ఉన్నారు. -
నేడు సీఎం గుడివాడ పర్యటన
గుడివాడరూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం స్వచ్చభారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుడివాడకు రానున్నారు. బైపాస్రోడ్డులోని కేకేఆర్ గౌతమ్ స్కూలు వద్ద జరగనున్న స్వచ్ఛభారత్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, సీఎంవో అధికారులతో కలసి గుడివాడ బైపాస్రోడ్డు, ఇంజినీరింగ్ కళాశాల, ఏఎన్ఆర్ కళాశాలలను పరిశీలించారు. సీఎం పర్యటనలో భాగంగా ఏఎన్ఆర్ కళాశాలలో హెలీప్యాడ్, ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ, బైపాస్రోడ్డులోని యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ ముఖ్య నేతల సమావేశ వేదికలను అధికారులు ఖరారు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్కుమార్, ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మనోహర్, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పలు శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆషాఢంలో భక్త ఝరి...పులకించిన ఇంద్రగిరి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు, ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసోత్సవాలలో మూడో రోజు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం 8 గంటల నుంచి అమ్మవారికి సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్త బృందాలు ఆలయానికి తరలివచ్చాయి. దీంతో అమ్మవారి దర్శనానికి అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనం నిలిపివేసిన అధికారులు, సాధారణ భక్తులతో పాటు సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు బంగారువాకిలి, రూ.100 టికెట్ క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. శుక్రవారం మొత్తం 30కి పైగా భక్త బృందాలు అమ్మవారికి సారె సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. పాల పొంగలి, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, రవిక, పండ్లతో మహిళలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. సారె సమర్పించే భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు త్వరితగతిన సారె సమర్పించేలా చర్యలు తీసుకుంది. సారె సమర్పించిన అనంతరం మహామండపం రెండో అంతస్తులో భక్తులకు అమ్మవారి అన్నప్రసాదాన్ని అందజేశారు. కృష్ణలంక బాలాజీనగర్కు చెందిన భవానీ భక్త బృందం వారు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. మహా నివేదన తర్వాత పెరిగిన రద్దీ శుక్రవారం, ఆషాఢం సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మరో వైపున ఉదయం 11–40 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. మహా నివేదన అనంతరం తిరిగి 12–20 గంటలకు అన్ని దర్శనాలు ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవ, దర్బారుసేవల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. -
జగనన్న 2.0 సూపర్ యాప్తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జగనన్న 2.0 సూపర్ యాప్తో ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పలువురు నేతలతో కలిసి జగనన్న 2.0 సూపర్ యాప్ను అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామం, మండలం, వార్డులో పార్టీ నాయకుడికీ, కార్యకర్తకు మధ్య ఒక బలమైన అనుసంధాన వారధిగా ఈ యాప్ ఉంటుందని అన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ యాప్ లాంచ్ చేస్తామని, ప్రతి పార్టీ కార్యకర్త ఈ యాప్తో అను సంధానమై, ప్రభుత్వ తప్పుడు పనులను అందులో అప్లోడ్ చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ యాప్ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్ ట్రేడ్యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి నాగేంద్ర పుణ్యశీల, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర పాల్గొన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి “jagan 2.0 Super App’ ను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
దూరపు బంధువులే హంతకులు!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పాతబస్తీలో ఒంటరిగా ఉంటున్న ఒక వృద్ధురాలిని హత్య చేసి బంగారం చోరీ చేసిన కేసును వన్టౌన్ పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వన్టౌన్ పోలీసుస్టేషన్ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం ఏడీసీపీ జి.రామకృష్ణ, స్థానిక ఏసీపీ దుర్గారావు, సీఐ గుణరాముతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను తెలిపారు. పాతబస్తీలోని వట్టూరి వారి వీధిలో కొత్తమాసు విజయలక్ష్మి(69) ఒంటరిగా నివసిస్తోంది. భర్త గతంలో మృతి చెందగా.. కుమార్తె అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. వృద్ధురాలికి కుమార్తె రెండు రోజులుగా ఫోన్ చేస్తుండగా ఎత్తకపోవటంతో ఈ నెల 15వ తేదీన విజయవాడలోని తమ బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పి చూడమని సూచించింది. వారు ఆమె ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి.. అది కిటికీలో పడి ఉండటాన్ని గమనించారు. కిటికీ నుంచి లోపలకు చూడగా విజయలక్ష్మి మృతి చెంది విగతజీవిగా పడి ఉంది. ఆమె ఒంటిపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు కనపించలేదు. దీనిపై బంధువులు కుమార్తెతో పాటుగా పోలీసులకు సమాచారమందించారు. బంగారం కోసమే.. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సాయంతో కేసును విచారించారు. ఆ క్రమంలో దూరపు బంధువైన నులకపేటకు చెందిన మానేపల్లి సోమశేఖర్బాబు, అతని కుమారుడైన మైనర్ ఇద్దరూ కలిసి ఈ నెల 14వ తేదీన ఆమెకు ఊపరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఆమె నుంచి బంగారు గొలుసు, గాజులు, దిద్దులు తీసుకొని పరారైనట్లు గుర్తించారు. శుక్రవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 66 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన తెలియగానే కొద్ది గంటల్లోనే కేసును ఛేదించినట్లు రామకృష్ణ పేర్కొన్నారు. కేసు ఛేదించటంలో చొరవ చూపించిన వన్టౌన్ సీఐ గుణరాము ఇతర సిబ్బంది, వివిధ స్టేషన్ల సీఐలు కొండలరావు (కొత్తపేట) ఉమామహేశ్వరరావు (భవానీపురం)లను రామకృష్ణ అభినందించారు. -
తృటిలో తప్పిన ప్రమాదం
ఎదురుమొండి దీవి(నాగాయలంక): దీవిలోని ఎదురుమొండి నుంచి గొల్లమంద మీదుగా సముద్రతీర గ్రామం జింకపాలెం వెళ్లే ప్రధాన రోడ్డులో ప్రయాణం రోజు రోజుకూ ప్రమాదభరితంగా మారుతోంది. శుక్రవారం ఆ ప్రాంతంలో జరిగిన ఘటన ఆ ప్రమాదాల తీవ్రతను చాటుతోంది. తమ గ్రామం జింకపాలెం నుంచి సాయంత్రం 3.30గంటల సమయంలో కొక్కిలిగడ్డ శశివర్థన్ అనే యువకుడు బైక్పై ఎదురుమొండి గ్రామానికి వస్తున్న తరుణంలో రోడ్డు నది కోతకు గురైన ప్రాంతంలో బ్యాలెన్స్ నిలవక బైక్తో పాటు కృష్ణానదిలోకి జారిపోయాడు. అయితే ఆ సమయంలో నది పోటు లేకపోవడంతో నది అంచున బైక్ ఆగిపోయింది. అప్రమత్తమైన యువకుడు నీళ్లలోకి పూర్తిగా జారకుండా ఆపగలిగాడు. వెంటనే తేరుకొని తమ గ్రామస్తులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఈలోగా ఆ రహదారి వెంట వెళ్తున్న సమీప గ్రామస్తులు గమనించి యువకుడిని, బైకును రోడ్డుపైకి తీసుకొచ్చారు. నది పోటుపై ఉండి నీరు ఇంకా పైకి ఉన్నట్లయితే యువకుడు బైక్తో సహా నదిలోకి వెళ్లిపోయేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే హెచ్చరించిన ‘సాక్షి’ గత మోంథా తుపాను తాకిడికి ఈరోడ్డు గొల్లమంద సమీపంలో పూర్తిగా కృష్ణానదిలో కరిగిపోవడంతో గొల్లమంద, జింకపాలెం ప్రజలకు మరో ప్రయాణ మార్గం లేక భయపడుతూ సాగిపోతున్న వైనంపై పలుమార్లు ‘సాక్షి’ కథనాలతో హెచ్చరించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దీని కోసం రూ.13కోట్లు మంజూ రు అయినట్లు ఏడాది క్రితం ప్రకటించినా ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నా భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా?!
కృష్ణాజిల్లా: కట్టుకున్న భర్త మరో మహిళతో ఉంటూ తనని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో భార్య తన కుటుంబ సభ్యులతో ఆ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మచిలీపట్నంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బలరామునిపేటకు చెందిన శ్రీను అనే వ్యక్తికి అంజలితో వివాహం అయ్యింది. శ్రీను శ్లాబు పనులు చేస్తుంటాడు. అయితే ఐదేళ్ల క్రితం శ్రీను మీనాక్షి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా ఆమెతోనే ఉంటూ మొదటి భార్యను పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అంజలి శుక్రవారం రాత్రి తన బంధువులతో కలిసి మీనాక్షిని నడిరోడ్డుపై అడ్డుకుని విచక్షణారహితంగా దాడి చేసింది. ఆమెతో పాటు బంధువులు మీనాక్షిని మహిళ అని కూడా చూడకుండా మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నడిరోడ్డుపై ఆమె దుస్తులను చింపేసి తీవ్రంగా అవమానించారు. కొంత మంది మగాళ్లు కూడా మహిళ అని చూడకుండా మీనాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు పలువురు చికిత్స నిమిత్తం ఆమెను మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో వైద్యుల సలహా మేరకు పోలీసులు తమ ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. బాధితురాలు కోలుకున్న అనంతరం వివరాలు సేకరించి ఆమె ఇచ్చిన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చిలకలపూడి పోలీసులు తెలిపారు. -
యువ రచయితల ఉత్సవానికి సోనీకి ఆహ్వానం
కంచికచర్ల: కేంద్ర సాహిత్య అకాడమీ దక్షిణ భారత యువ రచయితల ఉత్సవంలో పాల్గొనాలని తనకు ఆహ్వానం వచ్చిందని కంచికచర్ల గ్రామానికి చెందిన కవి, రచయిత తంగిరాల సోనీ గురువారం తెలిపారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆరు రాష్ట్రాల నుంచి కన్నడ, కొడవ, మళయాళం, తుళు, మలైయాళి, తెలుగు భాషల నుంచి యువ కవులను ఎంపిక చేశారని సోనీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తరఫున కేంద్ర సాహిత్య అకాడమీ బెంగళూరు నుంచి తనకు ఆహ్వానం అందిందని పేర్కొన్నారు. సోనికి పలువురు కవులు, కళాకారులు, రచయితలు అభినందనలు తెలిపారు. మైలవరం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మైలవరం పోలీసులు గురువారం తెల్లవారు జామున స్వాధీనం చేసుకున్నారు. లకి రెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వై జంక్షన్, ఆల్ఫా సెంటర్ మధ్య పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ లారీలో నాలుగు టన్నుల రేషన్ బియ్యం నిల్వలను గుర్తించారు. ఈ బియ్యాన్ని కర్నాటి సాయి బావులపాడు మండలం, లింగన్నగూడెం నుంచి కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలానికి తరలిస్తున్నారని లారీ డ్రైవర్ సమాచారం మేరకు పోలీసులు గుర్తించారు. సివిల్ సప్లయీస్ డెప్యూటీ తహసీల్దారు సమక్షంలో పంచనామా నిర్వహించి ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద భద్రపరిచారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ తాతినేని అనిల్ను అరెస్టు చేసి, బియ్యం సేకరించిన కర్నాటి సాయి, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. కర్నాటి సాయి పరారీలో ఉన్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. గన్నవరం: క్రికెట్ మ్యాచ్లో తలెత్తిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కేసరపల్లి శివారు వి.ఎన్.పురం కాలనీకి చెందిన ఈడే వెంకటరామ చంద్(17) ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ఈ నెల 14వ తేదీన స్థానిక జెడ్పీ బాలుర హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు. మ్యాచ్ విషయమై వెంకటరామచంద్, గన్నవరానికి చెందిన గోపీచంద్ మధ్య వివాదం తలెత్తింది. వీరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి గురైన గోపీ చంద్తో పాటు ఆతని స్నేహితులు రాకేష్, ఆనంద్, మణికంఠ బ్యాట్తో వెంకటరామ చంద్ను తీవ్రంగా కొట్టారు. తలకు బలమైన గాయాలైన వెంకటరామచంద్ విజయవాడ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. అతడి మృతదేహానికి గురువారం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీఎన్.పురం కాలనీలో వెంకటరామచంద్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడు తండ్రి ఈడే దుర్గాపవన్కుమార్, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో వెంకట రామచంద్ పాడెను వంశీమోహన్ మోశారు. -
గుట్టుచప్పుడు కాకుండా..
చడీచప్పుడూ లేకుండా గృహాలకు స్మార్ట్ మీటర్ల బిగింపుపెనమలూరు: టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లపై గగ్గోలు పెట్టి.. నేడు అధికారంలోకి వచ్చిన తరువాత స్మార్ట్ మీటర్లను గృహ వినియోగదారులకు అంటగడుతోంది. ఇంటింటికీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో విద్యుత్ రీడింగ్, బిల్లింగ్ పూర్తిగా ప్రైవేటు పరం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో విద్యుత్ వినియోగదారులకు భవిష్యత్తులో షాక్ల మీద షాక్లు తగులు తాయని ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ ఎలక్ట్రానిక్ మీటర్లు(ఐఆర్) స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత కాలం విద్యుత్ వినియోగదారులు వారు వినియోగించిన విద్యుత్ను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మీటర్ రీడింగ్ తీసి వినియోగదారులకు బిల్లులు ఇచ్చేవారు. వినియోగదారులు ఆన్లైన్ లేదా విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన కౌంటర్లలో బిల్లులు అందిన 15 రోజుల్లో సొమ్ము చెల్లించేవారు. ప్రజల్లో ఆందోళన.. గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల విద్యుత్ వినియోగం కన్నా రీడింగ్ ఎక్కువగా వస్తుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ మీటర్లు అమర్చడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎసరు పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు వినియోగించిన విద్యుత్ బిల్లు వినియోగదారుడికి వాట్సాప్ ద్వారా లేదా మెసేజ్ రూపంలో వస్తుంది. భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లను ప్రీపెయిడ్ మీటర్లుగా అమలు చేసే అవకాశం ఉండటంతో ఒక నెల ముందుగానే వినియోగదారులు సొమ్ము అకౌంట్లో బ్యాలెన్స్ ఉంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఎక్కువ లోడ్ విద్యుత్ వాడితే వెంటనే అదనపు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్ మీటర్లు వద్దు.. గృహాలకు స్మార్ట్ మీటర్లు వద్దని ప్రజలు కోరుతున్నారు. ఈ మీటర్ల వల్ల తమకు ఒరిగేది ఏమీ లేదని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థలను బాగు చేయటానికి, ప్రజలను దోచుకోవటం సరైన చర్య కాదని ఖండిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల కారణంగా తమపై భారం పడుతుందని, ఇప్పటికే విద్యుత్ బిల్లులలో రకరకాల చార్జ్లు చూపుతూ ముక్కుపిండి ప్రభుత్వం సొమ్ము వసూలు చేస్తోందని తెలుపుతున్నారు. ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానూరు సెక్షన్ పరిధిలో వినియోగదారులకు గుట్టుచప్పుడవ్వకుండా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కానూరు సెక్షన్లో దాదాపు 80వేల గృహాలు ఉన్నాయి. గతంలో వాణిజ్య సంస్థలకు స్మార్ట్ మీటర్లు పెట్టారు. గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి యత్నించగా జనాల నుంచి వ్యతిరేకత రావటంతో ఇంతకాలం ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల జోలికి వెళ్లలేదు. అయితే ఇప్పుడు చడీచప్పుడు లేకుండా సైలెంట్గా గృహాలకు విద్యుత్ ఎలక్ట్రానిక్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇళ్లల్లో ఎవ్వరు లేని సమయం చూసి స్మార్ట్ మీటర్లు ప్రైవేటు వ్యక్తులు వచ్చి అమర్చి చల్లగా జారుకుంటున్నారు. గృహ యజమానులు వచ్చి చూసేసరికి స్మార్ట్ మీటర్లు కనబడుతున్నాయి. అదే ఇంట్లో ఎవరైన ఉంటే అభ్యంతరం తెలిపితే స్మార్ట్ మీటర్లు పెట్టడం లేదు. కానీ స్మార్ట్ మీటర్లు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తామని విద్యుత్శాఖ అధికారులు చెబుతున్నారు. -
నేడు రాయనపాడు రైల్వేస్టేషన్ జాతికి అంకితం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు రైల్వేస్టేషన్ను శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్ఎస్) కింద రూ.12.13 కోట్లతో చేపట్టిన పునరుద్ధరణ పనులు పూర్తవడంతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. నిత్యం 250 రైళ్లు, 1.40 లక్షల మంది ప్రయాణికులతో విజయవాడ రైల్వేస్టేషన్లో అధిక రద్దీ నెలకొనడంతో రాయపాడు స్టేషన్ను శాటిలైట్ స్టేషన్గా ఆధునికీకరించారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆధునిక బహుళ అంతస్తులతో స్టేషన్ భవన నిర్మాణాలు జరిగాయి. గ్రీనరి, ఏసీ, నాన్ ఏసీ వెయిటింగ్ హాళ్లు, ప్లాట్ఫారాల పొడిగింపు, ఎస్కెలేటర్లు, లిఫ్ట్లు, ఫుట్ బ్రిడ్జి, రిజర్వేషన్ కౌంటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, మాడ్యూలర్ టాయిలెట్లు వంటి వసతులు కల్పించారు. -
దుర్గమ్మ సేవలో హీరో అల్లరి నరేష్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను హీరో అల్లరి నరేష్ గురువారం దర్శించుకున్నారు. దుర్గాఘాట్, వీఐపీ ఘాట్తో పాటు కేఆర్ మార్కెట్, ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ మార్గంలో గత నాలుగు రోజులుగా ఆయన సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంద్రకీలాద్రికి చేరుకున్న అల్లరి నరేష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను నరేష్కు అందించారు. 1980లో విజయవాడలో దుర్గమ్మ రిక్షాలో ప్రయాణించి సినిమాకు వెళ్లిన కథ ఇతివృత్తంగా సినిమా నిర్మాణం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పెద ఓగిరాలకు చెందిన గుంటక దుర్గాప్రసాద్రెడ్డి, ఇంద్రజ దంపతులు అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1,11,111, గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెందిన పి.మధుబాబు, కుసుమకుమారి దంపతులు అన్న ప్రసాద వితరణకు రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ పర్యవేక్షకులు డీవీవీ సత్యనారాయణ, ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. విజయవాడ కల్చరల్: విజయవాడకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, శతాధిక గ్రంథకర్త, ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ జీవీ పూర్ణచందును 2026 ఏడాదికిగానూ లోకగురు పురస్కారానికి ఎంపిక చేసినట్లు వికాస విద్యార్థి వాహిని వ్యవస్థాపక అధ్యక్షుడు వేములపల్లి కేశవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరురోడ్డులోని సర్వోత్తమ గ్రంథాలయంలో 29వ తేదీ సాయంత్రం పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి వికాస వాహిని, గురుపూర్ణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయితోపాటు పలువురు సాహితీవేత్తలు, రచయితలు భాషా సేవకులు పాల్గొంటున్నారన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా వినూత్న కృషితో అధ్యయన పుస్తకాలను రూపొందిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ.. విద్యాశాఖ అధికారులతో కలిసి గురువారం కలెక్టరేట్లో హిందీ స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ముఖ్యమైన అంశాలను సమగ్రంగా పొందుపరిచిన ఈ స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త రమేష్ బాబు, జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి కార్యదర్శి ఉమర్ అలీ, హిందీ రిసోర్స్ పర్సన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
మనసారా.. కొలి‘సారె’
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో రెండో రోజైన గురువారం పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖులు అమ్మవారికి సారెను సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దంపతులు అమ్మవారికి సారె సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. సారె ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ దంపతులకు ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధా కృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. మరో వైపు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సైతం గురువారం అమ్మవారికి సారెను సమర్పించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పట్టుచీర, పూలు, పసుపు, కుంకుమ, పూజా సామగ్రికి సమర్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో, చైర్మన్లు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. తరలివచ్చిన భక్త బృందాలు.. సారెను సమర్పించేందుకు ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు, భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. 26కు పైగా భక్త బృందాలలో మొత్తం 9 వేల మందికి పైగా భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారికి సారెను సమర్పించిన భక్త బృందాలకు భవానీ అనుగ్రహ దర్శన్ క్యూలైన్(100 టికెట్)ద్వారా అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పించారు. అనంతరం మహా మండపం రెండో, మొదటి అంతస్తులలో దేవస్థానం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసింది. వీకెండ్లో అంతరాలయ, వీఐపీ దర్శనాలు రద్దు.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు అంతరాలయ, వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. వీకెండ్ రద్దీకి తోడు ఆషాఢ మాసోత్సవాల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. మరో వైపున ఆలయ ప్రాంగణంలో టికెట్ల కౌంటర్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు కొండ దిగువన కనకదుర్గనగర్, ఓం టర్నింగ్ పాయింట్, ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం, మహామండపం దిగువన కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
3 విభాగాల్లో ప్రపంచ ఫొటోగ్రఫీ డే పోటీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశేష ప్రతిభకనబరిచిన ఫొటోగ్రాఫర్లకు ఆగస్ట్ 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఫొటోగ్రఫీ పోటీల పోస్టర్లను సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, ఫొటో జర్నలిస్టులతో కలిసి గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని ఫొటో జర్నలిస్టులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, స్టూడియో ఫొటోగ్రాఫర్లు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. మూడు విభాగాల్లో జరిగే ఈ పోటీలకు ఆగస్టు ఐదో తేదీలోగా ఎంట్రీలు పంపాలని సూచించారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.10 వేలు, రూ.7 వేలు, రూ.4 వేలు, ఆరుగురికి ప్రోత్సాహక నగదు బహుమతులుగా రూ.2 వేల చొప్పున అందిస్తామని వివరించారు. ఒకరు ఒక విభాగం నుంచి మూడు ఫొటోలు చొప్పున తొమ్మిది ఫొటోలు పంపొచ్చని సూచించారు. 2025, జూన్ 12 నుంచి 2026, జులై 31 మధ్య తీసిన ఫొటోలను డీపీఆర్వో కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, విజయవాడ– 520002 చిరునామాకు నేరుగా లేదా పోస్టల్ ద్వారా పంపాలని, ఇతర వివరాలకు డివిజనల్ పీఆర్వో కె.రవి (90101 56550)ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమాచార, పౌర సంబంధాల శాఖ డీఐపీఆర్వో కె.వి. రమణరావు, డీపీఆర్వో టి.నాగేశ్వరరావు, డివిజనల్ పీఆర్వో కె.రవి, వి.వి. ప్రసాద్, పలువురు ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు. -
తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం
స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి సక్రమంగా సరఫరా చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ కన్వెన్షన్ హాలులో గురువారం 1వ స్థాయీ సంఘం (ప్లానింగ్, ఆర్థికం), 7వ స్థాయీ సంఘం (పనులు) సమావేశాలు చైర్పర్సన్ అధ్యక్షతన జరిగాయి. ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సంబంధించిన పరిపాలనా అనుమతుల మంజూరు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అనుమతులు పొందిన పనులను వెంటనే ప్రారంభించి, ప్రస్తుత పదవీకాలం ముగిసేలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జెడ్పీటీసీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ నెల 24 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే సాధారణ సర్వసభ్య సమావేశాన్ని అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి.. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కొత్త సమావేశ మందిరం, చాంబర్ ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయని హారిక చెప్పారు. జిల్లా పరిషత్కు చెందిన భూముల్లో కొబ్బరి, కోకో, జీడిమామిడి, క్యాజూరినా వంటి వాణిజ్య పంటల సాగు ద్వారా ఆదాయం పెరగడంతో పాటు భూముల ఆక్రమణలను కూడా నివారించవచ్చన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా సంతృప్తి స్థాయిలో (సాచ్యురేషన్ మోడ్) తాగునీటి సరఫరా కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన తాగునీరు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జెడ్పీ సీఈవో జె. అరుణ మాట్లాడుతూ స్థాయి సంఘ సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను రూపొందించుకునే విధంగా ఉండాలన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించి ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థాయీ సంఘాల ఆమోదంతో తీసుకున్న అంశాలను రాబోయే సర్వసభ్య సమావేశంలో ఆమోదానికి ఉంచనున్నట్లు తెలిపారు. సమావేశంలో డెప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఎడారిన కాలువలు.. నోళ్లు తెరిచిన పొలాలు
గుడివాడరూరల్/కృత్తివెన్ను: రైతుల పక్షపాతి అని చెప్పుకొంటున్న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సాగునీరు అందక వరిచేలు ఎండు ముఖం పట్టాయి. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, అధికారుల అలసత్వం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూలై నెల సగం గడిచినా పంట కాలువల్లో సాగునీటి ప్రవాహం జాడ కనిపించడం లేదు. వర్షాలు సైతం ముఖం చాటేయడంతో వెదజల్లిన వరి చేలు ఎండిపోతున్నాయి. గుడివాడ మండ లంలోని పర్నాస గ్రామంలో 300 ఎకరాల్లో రైతులు వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశారు. ఇప్పటికే ఎకరాకు రూ.7 వేలకు పైగా ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ చేలు నీటి తడి అందక ఎండుముఖం పట్టాయి. ఇప్పటికే 60 శాతం పొలాలు ఎండిపోయాయి. మరో రెండు మూడు రోజుల్లో సాగునీరు అందకపోతే వెదజల్లిన పంట పొలాలు పూర్తిగా ఎండి పోయి నష్టపోతామని రైతులు వాపోతున్నారు. రైతుల పాలిట శాపం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో సకాలంలో సాగునీరు అందించిన దాఖలాలు లేవని రైతులు ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముందు చూపుతో రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సకాలంలో సాగుకు నీరు అందించారని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు వాపోతున్నారు. సాగునీటి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గుర్తించిన పలువురు రైతులు వర్షాలపైనే భారం వేసి వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేపట్టారు. మరి కొందరు కాలువలపై ఆధారపడి సాగు చేసేందుకు నారు మడులను సిద్ధం చేసుకున్నారు. ఆగస్టు నెల సమీపిస్తున్నా కాలువలకు సాగునీటి విడుదల కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువల్లో సాగునీరు ప్రవహించ, వర్షాలు పడక నారు మడులను, వెదజల్లిన చేలను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారు. ప్రభుత్వ తీరుతో ఈ ఏడాది ఖరీఫ్లో వరి సాగుకు క్రాప్ హాలిడే ప్రకటిండం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడారిన సాగుభూములు కృత్తివెన్ను మండలం వరిచేలు ఎండుముఖం పట్టాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా తీరప్రాంతంలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం, నాగాయలంక, అవనిగడ్డ, కోడూరులో సాగుభూములు ఎడారుల్లా మారాయని ఆర్టీసీ కృష్ణాజోనల్ మాజీ చైర్మన్ పిన్నెంటి మహేష్, పలువురు రైతులు వాపోయారు. ఈ ప్రాంతాల్లో వరి సాగు మినహా మరో ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేదన్నారు. గతేడాది జూన్ 25 నాటికి వరి నాట్లు పూర్తయ్యా యని, ఈ ఖరీఫ్లో జూలై నెల సగం గడిచినా అధిక శాతం నారుమడులు కూడా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి సాగు నీరివ్వలేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం వెంటనే ఇప్పించాలని కోరుతున్నారు. గతంలో ఏటా జూన్ మొదటి వారంలో కాలువలకు సాగునీరు విడుదలయ్యేది. కాలువలపై ఆధారపడే వరి సాగు చేసేవాళ్లం. ఈ సారి కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టలేదు. మరోవైపు కాలువలకు సాగునీరు విడుదల చేయలేదు. ఎన్నిసార్లు ప్రాథేయ పడినా అధికారులు పట్టించుకోవడంలేదు. విత్తనాలు వెదజల్లి నెల కావస్తున్నా నీటి తడులు అందక పైరు ఎండిపోతోంది. – సురేష్, రైతు పర్నాస గ్రామం, గుడివాడ మండలం మా గ్రామంలో 300 ఎకరాలకు పైగా వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేశాం. దిగు వనున్న చేపల చెరువులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు అందిస్తు న్నారు. జూలై సగం గడిచినా పంట పొలాలకు నీరు అందించడం లేదు. కాలువల్లో పూడిక తీయకపోవడం మా పాలిట శాపంగా మారింది. ఇప్పటికై నా అధికారులు శ్రద్ధ చూపి పంటల సాగుకు నీరు అందించాలి. –వెంకటేశ్వరరావు, రైతు పర్నాస గ్రామం, గుడివాడ మండలం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో ఏనాడూ రైతులకు సాగునీరు సకాలంలో అందని పరిస్థితి లేదు. రైతులకు జూన్ మొదటి వారంలోనే సాగునీరు అందించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రైతులను నట్టేటముంచుతోంది. ప్రభుత్వం కళ్లు తెరచి రైతులకు నీరు అందించకుంటే వైఎస్సార్ సీపీ తరఫున ఆందోళన చేస్తాం. – గోళ్ల రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు, గుడివాడ -
సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా చేసుకుని పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ఏపీకే ఫైల్స్ ద్వారా జరిగే నేరాలను ఛేదించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై పోలీసు అధికారులు సైతం అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పోలీస్ కమిషనరేట్లో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులను పాటు, అన్ని పోలీస్స్టేషన్ల అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు బాధితుడితో మాట్లాడేటప్పుడు సేకరించాల్సిన సమాచారం, సాక్ష్యాలను సేకరించే విధానం తదితరాలను వివరించారు. మాట్లాడుతున్న సీపీ రాజశేఖరబాబు -
గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి
చిలకలపూడి(మచిలీ పట్నం): గ్రామాల్లో స్వచ్ఛరథం కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ జె.అరుణ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం ఉమ్మడి కృష్ణాజిల్లా ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మూడు సంవత్సరాలుగా మండల పరిషత్ ఆదాయ వనరుల భాగస్వామ్యంతో చేపట్టిన పనుల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని ఆరుణ కోరారు. ఆదాయ వనరులకు మించి పనులు మంజూరు చేసే వాటి వివరాలను కూడా తెలపాలని, లేకుంటే వాటిని వెంటనే రద్దు చేయాలని సూచించారు. గ్రామాల్లో సిమెంటు రోడ్లు, డ్రెయిన్లతో పాటు తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి నిధులు వెచ్చించి సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ రథం కార్యక్రమంలో నిత్యం మండల పరిధిలోని గ్రామాలను తనిఖీ చేసి పారిశుద్ధ్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ సంబంధించి ఆస్తుల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలన్నారు. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటి ద్వారా ఆదాయ వనరులు పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనందకుమార్ పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ అరుణ -
ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు నెల రోజుల వ్యవధిలో మొత్తం 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తొలి కోవిడ్ కేసు జూన్ 26న వైఎస్సార్ కడప జిల్లాలో నమోదైంది. కడప-8, గుంటూరు-2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కో కోవిడ్ కేసు నమోదయినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ బారిన పడిన 12 మందిలో నలుగురు మృతి చెందారు.ప్రస్తుతం ముగ్గురు హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ముగ్గురు పూర్తిగా కోలుకున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీర పాండియన్ తెలిపారు. వైద్యులు, ఆసుపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని నీట్ అభ్యర్థులు, మెడికల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ‘నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్’ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు వినతి పత్రం అందజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన్ని కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రయోజనాలే ధ్యేయంగా రూపొందించిన ఎనిమిది ప్రధాన డిమాండ్లతో కూడిన మెమొరాండం ఇచ్చారు. నేషనల్ మెడికల్ కమిషన్ సవరించిన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీ సీట్ల సంఖ్యను 250 వరకు పెంచాలని కోరారు. ప్రైవేట్ మెడికల్ కాలే జీల్లో అక్రమ ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అరుణ్ చౌదరి, వర్కింగ్ ప్రెసి డెంట్ డి.తారకేష్, వైస్ ప్రెసిడెంట్లు కె.వి.పి.ఆర్. పట్నాయక్, ఎస్.అల్తాఫ్, సెక్రటరీ కె.రంగారావు, జాయింట్ సెక్రటరీ ఎ.అనూష, ట్రెజరర్ విజయ రాధిక, వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ రవి సుబ్రహ్మణ్యం, ఎన్.గణపతిరావు తదితరులు ఉన్నారు. -
మహిళా రిజర్వేషన్ల అమలుకు చొరవ చూపాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని, అందుకు పార్టీ లకు అతీతంగా అన్ని పార్టీలు చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల ఐక్యవేదిక కోరింది. ఈ మేరకు వారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవి నేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మల్లాది విష్ణును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ.. 2023లో భారత రాజ్యాంగ (106వ రాజ్యాంగ సవరణ) చట్టం ద్వారా మహిళా రిజర్వే షన్లకు చట్టబద్ధత కల్పించినా జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు వాయిదా వేయడంతో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ షరతులు లేకపోయి ఉంటే ప్రస్తుత లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం 33 శాతం ఉండేదని, అయితే అది 14 శాతానికి కూడా చేరలేదని వివరించారు. సుమారు 185 దేశాల జాతీయ పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో భారత దేశం 151వ స్థానంలో ఉండటం దేశానికి అవమానకరమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా మహిళా ఉద్యమాలు సాగించిన పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తాత్సారం, మహిళల రాజకీయ సాధికారతను అడ్డుకోవడం కారణమని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్ వంటి వివాదాస్పద అంశాలతో ముడిపెట్టకుండా రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి వెంటనే అమలయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్య దర్శి వి.సావిత్రి, అధ్యక్షురాలు శ్రీదేవి, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి.పద్మ, సీఎంఎస్ నాయకులు ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల ఐక్య వేదిక వినతి -
స్వాతంత్య్ర దీప్తి .. పోరాట స్ఫూర్తి
విజయవాడ కల్చరల్: వందేమాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతీయ నాటక పోటీలో భాగంగా హనుమంతరాయ గ్రంథాలయంలో మంగళవారం ప్రదర్శించిన ‘స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తి గీతం – వందేమాతరం’ నాటకం ఆద్యంతం దేశ భక్తిని చాటింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమీ, సాయిబాబా నాట్యమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతం – దాని ప్రభావం, ఉద్యమం – దాని ప్రభావం, స్వాతంత్య్ర సమరయోధుల పోరాట సంఘటనలతో నాటకం సాగింది. బాలగంగాధర తిలక్ పాత్రలో సీహెచ్ లోకేష్, లాలా లజపతిరాయ్ పాత్రలో ఎంఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్రపాల్ పాత్రలో సీహెచ్ చాణిక్య, నెహ్రూ పాత్రలో ఎస్. అర్జున్, అల్లూరి సీతారామరాజుగా సాయిశంకర్తోపాటు 40 మంది నటీనటులు నాటకానికి ప్రాణప్రతిష్ట చేశారు. ఈ నాటకానికి రచన డాక్టర్ పీవీఎన్ కృష్ణ, దర్శకత్వం సాయి శంకర్ వహించారు. కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ సభ్యురాలు డాక్టర్ ఎస్పీ భారతి, విద్యావేత్తలు సీబీఆర్ ప్రసాద్, వి.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
చంద్రబాబుకు ఆ అర్హతే లేదు!
మధురానగర్(విజయవాడసెంట్రల్): కృష్ణా డెల్టా, పులిచింతల, పోలవరం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేఎల్రావు ఆలోచనా విధానంతో దివంగత ముఖ్యమంత్రి అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు. 2004కు ముందు సాగు నీటి విషయంలో పరి స్థితి ఎలా ఉంది.. 2004 తర్వాత వైఎస్సార్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. తాగునీరు ప్రాజెక్టుల విషయంలో టీడీపీ బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఒక పక్క అనుమతుల కోసం పనిచేస్తూనే మరో పక్క కుడి ఎడమ కాలువ పనులను వైఎస్సార్ ప్రారంభించటం ఆయన ముందు చూపు, దూరదృష్టికి నిదర్శనంగా పేర్కొన్నారు. పోలవరం తదితర ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకునేందుకు టీడీపీ పనిచేసిందని.. రైతులతో కేసులు వేయించారని గుర్తు చేశారు. కృష్ణా డెల్టా మోడరైజేషన్ పనులను అవనిగడ్డలో ప్రారంభిస్తే వాటిని చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. పట్టిసీమలో కేవలం మోటార్లను ఏర్పాటు చేసి నీటిని పంపింగ్ చేసి తామే అంతా చేసినట్లు బిల్డప్ ఇస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఆ కాలువల నుంచే నీళ్లు తరలిస్తూ అంతా తామే చేసామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తాను దూర దృష్టి కలిగిన వాడినని ముందు చూపుతో అన్నీ చేస్తానని చెప్పే చంద్రబాబు ఎల్నినో ప్రభావంతో ప్రజలు రైతులు అవస్తలు పడుతుంటే ఏం చేశారని మల్లాది విష్ణు సూటిగా ప్రశ్నించారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని ఎస్టీవీఆర్ స్కూల్ ఆవరణలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన పురుషులు, మహిళల రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు పలు విభాగాల్లో పతకాలు సాధించారని సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ తెలిపారు. పతకాలు పొందిన విద్యార్థులను కళాశాల ఆవరణలో బుధవారం అభినందించారు. రమేష్ మాట్లాడుతూ 53 కేజీల విభాగంలో టి.భాను ప్రసాద్, 66 కేజీల విభాగంలో ఈ.వేణు, 59 కేజీల విభాగంలో ఐ.శివరామస్వామి, 74 కేజీల విభాగంలో వై.హర్షిత్, 63 కేజీల విభాగంలో బి.లిఖిత బంగారు పతకాలు సాధించారన్నారు. వీరితో పాటుగా 66 కేజీల విభాగంలో పవన్ సతీష్, 59 కేజీల విభాగంలో సీహెచ్ కృష్ణ సిల్వర్ మెడల్స్, 59 కేజీల విభాగంలో ఎస్.రోహిత్ రెడ్డి బ్రాంజ్ మెడల్ సాధించారని చెప్పారు. గోల్డ్ మెడల్ సాధించిన ఐదుగురు విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. విద్యార్థులను కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, కోచ్ శ్యామ్, కళాశాల స్పోర్ట్స్ హెచ్వోడీ డాక్టర్ బాలకృష్ణారెడ్డి అభినందించారు. -
ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ సర్జరీలకు ప్రాధాన్యం
ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక వైద్య రంగంలో ప్లాస్టిక్, రీ కన్స్ట్రక్టివ్ సర్జరీలు అత్యంత కీల కంగా మారినట్లు ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు పేర్కొ న్నారు. ప్రమాదాలు, కాలిన గాయాలు, జన్యుపరమైన లోపాలు, క్యాన్సర్ వంటి కారణాలతో అవయవాలు దెబ్బతిన్న రోగులకు తిరిగి రూపాన్ని, పని తీరును అందించడంలో ప్లాస్టిక్ , రీకనస్ట్రక్టివ్ సర్జన్స్ విశేష సేవలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవాన్ని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో బుధ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స పితామహుడిగా పేరుగాంచిన సుశ్రుతుడి చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఏఆర్సీహెచ్ మోహన్ మాట్లాడుతూ.. తమ విభాగం సాధించిన విద్య, వైద్య విజయాలను వివరించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్న పోలదాస్ తమ విభాగంలో అందిస్తున్న సేవలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఫైనలియర్ ఎంబీబీఎస్ విద్యార్థులతో పాటు, ఆ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జాడ మాబు తదితరులు పాల్గొన్నారు. -
ముద్రగడకు ఘన నివాళులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి దేవినేని అవినాష్, ఇతర పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాపు ఉద్యమ నేతగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం, కాపు వర్గాల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించిన నాయకుడిగా ఎల్లప్పుడూ గుర్తుండిపోతారన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పార్లమెంట్ కార్యదర్శిలు తంగిరాల రామిరెడ్డి, ఆళ్ల చెల్లారావు, మాజీ కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవళ్లిక, పుప్పాల కుమారి, కలపాల అంబేడ్కర్, అనుబంధ విభాగాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 99.83 శాతం పూర్తయిందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 17,13,445 మంది ఓటర్లకు ఏడు నియోజకవర్గాల్లో నూరు శాతం ఫారాల పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. 99.83 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాలు ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, జగ్గయ్యపేటలో నూరు శాతం డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. తిరువూరులో 99.75 శాతం, మైలవరం 99.89 శాతం, నందిగామ 99.03 శాతం పూర్తయినట్లు కలెక్టర్ వివరించారు. భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఆయుర్వేద, యునాని, నేచురోపతి కళాశాలలు, ఇంటి గ్రేటెడ్ ఆస్పత్రులతో ప్రాచీన వైద్యానికి పునర్వైభవం తీసుకొస్తామని, అందులో భాగంగా 1,500 ఆయుష్ డిస్పెన్సరీలను రూ.414 కోట్ల వ్యయంతో ఆధునికీకరించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఔషధ మొక్కల స్థిరమైన సాగు, మార్కెటింగ్, మౌలిక సదుపాయాలపై బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రూ.280 కోట్లతో నాలుగు కొత్త ఆయుష్ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఔషధ, సుగంధ మొక్కలను ప్రోత్సహించేందుకు రూపొందించిన వెబ్సైట్ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం రైతులకు ఔషధ, సుగంధ మొక్కల విత్తనాలను పంపిణీ చేశారు. -
గాదె సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘విజయలక్ష్మి తప్పుకున్నా.. మేం పోరాటం చేస్తాం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిపై ఒత్తిళ్లు ఉన్నాయి. అందుకే ఆమె మానవ హక్కుల కమిటీ సాయం వద్దంది. కేసు నుంచి ఆమె తప్పుకున్నా.. నేను పోరాడుతా’’ అంటూ కనకదుర్గ స్పష్టం చేశారు.మేము సామాన్యులం.. ఏం చెప్పమంటే అది చెప్పిస్తున్నారు. నాక్కూడా చెప్పకుండా ఆమె కోర్టుకు వచ్చారు. ఒత్తిళ్ల వల్ల అడ్వకేట్స్ను మార్చుకుంది. సాయి కృష్ణ తల్లిని కోర్టుకు తీసుకుని రావడానికి కూడా హైడ్రామా నడిపించారు. హైడ్రామా ఎవ్వరు నడిపించారూ ఆమె వెనుక ఎవ్వరు ఉన్నారో మాకు తెలియడం లేదు. సాయికృష్ణ తల్లి వెనకడుగు వేసిన మా లీగల్ బ్యాటిల్ కొనసాగుతుంది. మా అక్క విజయలక్ష్మీ పోరాటం చేయకపోయినా..నేను పిన్నిగా సాయికృష్ణ కోసం మానవ హక్కుల కమిటీ తరపున పోరాటం చేస్తాం’’ అని కనకదుర్గ తెలిపారు. -
వెయ్యి రూపాయల వివాదం.. మహిళ ఆత్మహత్య
నందివాడ: జనార్ధనపురం (జొన్నపాడు) గ్రామంలో ఓ మహిళ సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సాగర్ గౌరీపట్నం గ్రామానికి చెందిన నక్క భూలక్ష్మి (30) జనార్ధనపురంలోని ఆర్టీఏ ట్రాక్ సమీపంలో లక్ష్మీ గణపతి బ్రిక్స్ కంపెనీలో పనిచేసేందుకు తన సోదరుడు కన్నయ్య, సోదరితో కలిసి నెల క్రితం వచ్చింది. వారం రోజుల క్రితం కన్నయ్య తన సోదరి భూలక్ష్మి నుంచి వెయ్యి రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. కొన్ని రోజులకు అప్పుగా తీసుకున్న సొమ్మును ఇవ్వాలంటూ భూలక్ష్మి కన్నయ్యను కోరగా ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఆ డబ్బులను తిరిగి ఇచ్చేందుకు కన్నయ్య తన చెల్లితో కలిసి గుడివాడ వచ్చాడు. ఈ విషయమై మనస్థాపానికి గురైన భూలక్ష్మి తను ఉరి వేసుకుని చనిపోతున్నానంటూ తన ఫోన్లో స్టేటస్ పెట్టింది. ఆ స్టేటస్ చూసిన పిన్ని ములికి లక్ష్మి కన్నయ్యకు ఈ సమాచారం అందించింది. అతను గుడివాడ నుంచి వచ్చేసరికి భూలక్ష్మి ఇనుపరాడ్డుకు ఉరివేసుకొని ఉంది. వెంటనే ఆమెను కిందకి దింపి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పారు. కన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కృష్ణా డీఆర్వోగా శ్రీధర్రెడ్డి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారిగా కె. శ్రీధర్రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం డీఆర్వోగా పనిచేస్తున్న కె. చంద్రశేఖరరావు నెలన్నర రోజులుగా సెలవుపై ఉన్నారు. ఈ స్థానంలో ఇన్చార్జ్ డీఆర్వోగా జిల్లా విజిలెన్స్ అధికారి పోతురాజు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన డీఆర్వోగా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్గా పనిచేస్తున్న కె. శ్రీధర్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
వైఎస్ జగన్ కృషి ఫలితం.. వైద్య విద్యకు వరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగానికి 2019–24 మధ్య ఒక స్వర్ణయుగం అని వైద్యరంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్టం చేసేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా ఉదారంగా నిధులు మంజూరు చేసి, రానున్న రోజుల్లో అదనంగా సీట్లు మంజూరుకు అవసరమైన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో 250 సీట్లకు అనుగుణంగా రూ.90 కోట్లతో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా ఇప్పటికే ఉన్న 175 సీట్లకు అదనంగా మరో 75 సీట్లు ఎన్ఎంసీ(నేషనల్ మెడికల్ కమిషన్) మంజూరు చేసింది. రూ.90 కోట్లతో నిర్మాణాలు.. రాష్ట్రంలోని బోధనాస్పత్రులను నాడు–నేడు పనుల ద్వారా అభివృద్ధికి నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో రూ.170 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టాలని అంచనా వేశారు. అందులో భాగంగా తొలివిడగా రూ.90 కోట్లతో 250 సీట్లకు అనుగుణంగా సిద్ధార్థ వైద్య కళాశాలలో తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రెరీ వంటి సౌకర్యాల కోసం నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో వేగంగా జరిగిన పనులు, ప్రస్తుతం నత్త నడకన సాగుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తికాగా, ఇంకా ఎలక్ట్రికిల్, డ్రెయినేజీ, వాటర్ పైప్లైన్ వంటి పనులు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రిలో సైతం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. సౌకర్యాల కల్పనతోనే సాధ్యం.. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఇప్పటికే 175 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిని అదనంగా మరో 75 సీట్లు మంజూరు చేయాలని ఈ ఏడాది కళాశాల తరఫున నేషనల్ మెడికల్ కమిషన్కు దరఖాస్తు చేశారు. దీంతో ఎన్ఎంసీ బృందం వచ్చి తనిఖీలు చేసింది. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటు, ప్రభుత్వాస్పత్రిలోని సౌకర్యాలను చూసి, సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎంఆర్ఐ, సీటీ స్కాన్లతో పాటు, ఎంబీబీఎస్ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయంటూ మరో 75 సీట్లు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో 2014–19 కాలంలో ఒక్క అదనపు సీటు కూడా మంజూరు కాలేదు. కానీ 2019–24 సమయంలో సౌకర్యాల కల్పనతో పలు విభాగాల్లో దాదాపు 80 పీజీ సీట్లు మంజూరు అయ్యాయి. అంతేకాదు సూపర్ స్పెషాలిటీ విభాగాలైన న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో సైతం ఒక్కో విభాగంలో ఐదు సీట్లు మంజూరు అయ్యాయి. వాటితో పాటు ఈఎన్టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి విభాగాల్లో కూడా సీట్లు మంజూరయ్యాయి. దీంతో ప్రభుత్వాస్పత్రిలో పీజీలు ఏడాదికి వంద మంది చొప్పున పెరగనున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది. వైద్య రంగానికి వైఎస్ జగన్ జీవం పోశారు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు వెంటిలేటర్పై ఉన్నాయి. అలాంటి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా, వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు పెద్ద ఎత్తున చేపట్టారు. 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఉన్న కళాశాలలను అభివృద్ధి చేసి మరిన్ని సీట్లు వచ్చేలా కృషి చేశారు. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ, వైద్య విభాగం -
హిట్లర్లా నియంతృత్వ పోకడలు తగదు
సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి గన్నవరం: రాష్ట్ర ప్రభుత్వ వైఫలాల్యలను ప్రశ్నించిన ప్రశ్న రావణ్పై రాజద్రోహం వంటి కేసులు నమోదు చేయడం దుర్మార్గమని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. గన్నవరం కోర్టులో రావణ్ కస్టడీ పిటీషన్పై వాదనలు వినిపించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రావణ్ను కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ను పోలీసులు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. విచారణ దశలో ఉన్న కస్టడీ పిటీషన్లో బలం లేదని ఉపసంహరించుకోవడం తన న్యాయవాద వృత్తిలో తొలిసారి చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలోని ఓ వ్యక్తిని సంతృప్తి పరిచేందుకు రావణ్పై రాజద్రోహం వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగించడం సరికాదన్నారు. ఇది న్యాయ సమ్మతం కాదనే ఉద్దేశంతో రావణ్కు మద్దతుగా వాదించేందుకు ముందుకువచ్చినట్లు చెప్పారు. నిజంగా దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా రావణ్ వ్యాఖ్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వమే ఎన్ఐఏ వంటి కేసు నమోదు చేయాలని సూచించారు. కానీ రాష్ట్రంలో కూటమి పార్టీల భద్రత కోసమే ఈ అక్రమ కేసులు పెట్టినట్లుగా ఉందన్నారు. హిట్లర్ మాదిరిగానే కూటమి ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందన్నారు. ఇదే పంథా కొనసాగితే రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రక్షణ ఉండదన్నారు. ప్రభుత్వాన్ని గొంతెత్తి ప్రశ్నించిన, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరిన రావణ్కు పట్టిన గతే పడుతుందని కూటమి పాలకులు సాంకేతాలు ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటికై న ప్రజాస్వామ్యవాదులందరూ గొంతెత్తాలని కోరారు. హిడ్మా మృతిపై చేసిన వ్యాఖ్యలకు రావణ్ను ఉరితీసేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులపై పెట్టే ఉపా కేసులను యూట్యూబర్ రావణ్పై నమోదు చేయడమంటే ఇంత కంటే దుర్మార్గం రాష్ట్రంలో మరోకటి ఉండదని మరో సీనియర్ న్యాయవాది సుదర్శన్రెడ్డి తెలిపారు. గతంలో కూడా భావప్రకటన స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టిందన్నారు. న్యాయవాదులు తిరివీధి వెంకయ్య, టి. కట్రావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తాపీ మేస్త్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణలంక గౌతమీనగర్ రెండో లైన్లో గొర్రెల బంగార్రాజు (48) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను తాపీ పనికి వెళ్తుండగా భార్య ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమార్తెలిద్దరు చదువుకుంటున్నారు. అతను ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లేవాడు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తరచూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. 11 గంటల వరకు కుటుంబ సభ్యులందరూ సరదాగా మాట్లాడుకుని నిద్రకు ఉపక్రమించారు. అతను మాత్రం ప్రక్క బెడ్రూంలో పడుకుంటానని చెప్పి లోపలకు వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు కుటుంబ సభ్యులు నిద్ర లేచినా అతను మాత్రం లేవలేదు. తలుపు తట్టినా ఉలుకూపలుకూ లేదు. గోడకు ఉన్న రంధ్రంలో గుండా లోపలికి చూడగా ఫ్యాన్ హుక్కు చున్నీతో ఉరేసుకుని వ్రేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహాయంతో లోపలికి వెళ్లి అతనిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 17న వర్చువల్గా స్టేషన్ ప్రారంభోత్సవం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): అమృత్ భారత్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చేసిన రాయపాడు రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ‘సెల్ఫీ విత్ స్టేషన్’ పేరుతో సోషల్ మీడియా ప్రచారాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం పి.ఇ. ఎడ్విన్ మాట్లాడుతూ రాయనపాడు రైల్వేస్టేషన్లో జరిగిన అద్భుతమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మార్పులపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటుగా భారతదేశంలో వేగంగా జరుగుతున్న రైల్వే మౌలిక సదుపాయాలలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సాహించడమే ఈ ప్రచార కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ పోటీలలో పాల్గొని సెల్ఫీ తీసుకుని ఈ నెల 16లోగా విజయవాడ డివిజన్ సోషల్ మీడియాను ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగామ్, ఎక్స్లలో షేర్ చేసుకోవాలి లేదా ఠ్ఛీ జ్చట్ఛ ఛ్డ్చఃజఝ్చజీ .ఛిౌఝ కి మెయిల్ చేసి తమ ఎంట్రీలను పంపిచాలన్నారు. ఈ నెల 17న స్టేషన్ ప్రారంభోత్సవం రోజున విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. -
సమగ్ర సవరణకు సహకరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో రాజకీయ పార్టీలు, బీఎల్ఏలు సహకరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అన్ కలెక్టబుల్, అన్ ట్రేస్డ్, షిఫ్టెడ్గా గుర్తించిన ప్రతి ఓటరును మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. బీఎల్వోలు వ్యక్తిగతంగా సంప్రదించి వివరాలను నిర్ధారించాలన్నారు. బీఎల్వోల సూపర్వైజర్లు కూడా ప్రతి బీఎల్వోతో సమీక్ష నిర్వహించి ఓటర్ల జాబితాలో నమోదైన చిరునామా వాస్తవమైనదో లేదో ధ్రువీకరించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1.39 లక్షల మంది అన్కలెక్టబుల్గా నమోదయ్యారని వీరిలో ఇప్పటికే మరణించిన ఓటర్ల వివరాలు తొలగింపు ప్రక్రియలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వలసలు ఎక్కువగా ఉండటం వల్ల ఓటర్లను గుర్తించటం కష్టమవుతోందని ఈ దశలో రాజకీయ పార్టీల బీఎల్ఏల సహకారం కీలకమన్నారు. పామర్రు భేష్.. కొన్ని నియోజకవర్గాల్లో అధికారులు అద్భుతంగా పనిచేశారని ముఖ్యంగా పామర్రు నియోజకవర్గంలో నో మ్యాపింగ్ కేసులు తగ్గించటం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2002 నాటి పోలింగ్ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంటే అనుసంధానం సులభమవుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ల భౌగోళిక పరిధికి అనుగుణంగా ఓటర్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం బీఎల్ఏ పరిధిలో ఉన్న ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఓటర్ల జాబితాను సిద్ధం చేసి బీఎల్వోలకు అందించాలన్నారు. రానున్న పది రోజులు మిగిలిన ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, బీఎల్ఏలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపగలమన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్దాదా, కొడాలి శర్మ, కొడమంచిలి చంద్రశేఖర్, కూనపరెడ్డి శ్రీనివాసరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించండి.. పెడన: పట్టణంలోని భట్టజ్ఞానకోటయ్య(బీజీకే)జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యాశాఖకు మాత్రమే సమాచారం ఇచ్చి విచ్చేసిన ఆయన తొలుత పాఠశాలలో ఎస్ఎస్ఏ ద్వారా ఏర్పాటు చేస్తున్న ఆటిజం సెంటర్ను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించిందీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. తర్వాత ఉపాధ్యాయులతో సమావేశమైన కలెక్టర్.. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అందరిలో కాకుండా ప్రత్యేకంగా పిలిపించుకుని, సున్నితంగా కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. వారిలో ఉండే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. కలెక్టర్తో పాటు డీవైఈవో శేఖర్సింగ్, ఎంఈవో–1, 2 ఎన్. సలోమి, వైవీ హరనాథ్, పాఠశాల హెచ్ఎం ఎల్. ఇందిరా తదితరులు ఉన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
దుర్గమ్మకు బంగారు హారం సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తుడు మంగళవారం రూ. 3 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిచంద్రపురానికి చెందిన సీహెచ్ వంశీకృష్ణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరంవేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ అధికారి డీవివి సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. డాక్టర్ జవ్వాజి లోకేష్కు గోల్డ్మెడల్ ప్రదానం లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో జనరల్ సర్జరీ విభాగంలో ఉత్తమ అవుట్గోయింగ్ పోస్టు గాడ్యుయేల్ విద్యార్థిగా ఎంపికై న డాక్టర్ జవ్వాజీ లోకేష్కు సోమవారం డాక్టర్ కనకమేడల శ్రీనివాస్ స్మారక గోల్డ్మెడల్ను అందజేశారు. వైద్య కళాశాల సెమినార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎ విష్ణువర్థన్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ పులాల చంద్రశేఖర్ చేతుల మీదగా ఈ మెడల్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు మాట్లాడుతూ జనరల్ సర్జరీలో ఉత్తమ అవుట్గోయింగ్ విద్యార్థికి డాక్టర్ కనకమేడల శ్రీనివాస్ స్మారకార్థం ఆయన పుట్టిన రోజు అయిన జూలై 14న ఏటా ఈ గోల్డ్మెడల్ అందిస్తున్నట్లు తెలిపారు. జీజీహెడ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, జనరల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ పద్మశ్రీ, కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ప్రతినిధులు, మెడల్ గ్రహీత తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైద్య శాఖలో సమస్యలు పరిష్కరించాలని వినతి మధురానగర్(విజయవాడ సెంట్రల్): రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఏర్పడే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని, నిలిచిన సీహెచ్వో, ఇతర కేడర్ ఉద్యోగోన్నతులు పూర్తిచేయాలని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గొంతి ఆస్కార్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆ శాఖ కార్యదర్శి వీరపాండియన్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అందులో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల ఇబ్బందులు, సమస్యలను వివరించారు. కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సాగర్, నాయకులు సత్యనారాయణ, సత్యనారాయణ బాబు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో అర్ధాకలి!
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న పేద విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న హాస్టళ్లలో మెస్ చార్జీలు మాత్రం యథాతథంగా కొనసాగిస్తోంది. గత రెండేళ్లలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పుధాన్యాలు, వంటనూనె, గ్యాస్ సిలెండర్ ధరలు అమాంతం పెరిగినా, మెస్ చార్జీలను మాత్రం ఇప్పటికీ సవరించలేదు. మరోవైపు వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రచారం చేస్తోంది. ఇదెలా సాధ్యమో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. పౌష్టికాహారం ఎలా సాధ్యం.. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఒక విద్యార్థికి సమతుల్య పౌష్టికాహారం అందించాలంటే రోజుకు కనీసం రూ.100 నుంచి రూ.140 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న మెస్ చార్జీలు ఆ మొత్తానికి సగం కూడా చేరని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యక్ష ప్రభావం పడుతున్నా మెస్ చార్జీల సవరణపై ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. 2023 తర్వాత పెంపు లేదు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో చివరి సారిగా మెస్ చార్జీలను పెంచింది. అప్పట్లో ప్రీ–మెట్రిక్ వసతి గృహాల్లో 3, 4వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,000 నుంచి రూ.1,150కు, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.1,250 నుంచి రూ.1,400కు, పోస్ట్–మెట్రిక్ విద్యార్థులకు రూ.1,450 నుంచి రూ.1,600కు పెంచింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మెస్ చార్జీలను సవరించలేదు. 2023లో రూ.835 ఉన్న వంట గ్యాస్ సిలెండర్ ధర ప్రస్తుతం రూ.970కు చేరగా, కంది పప్పు ధర రూ.110 నుంచి రూ.160కు, వంట నూనె ధర రూ.130 నుంచి రూ.173కు పెరిగింది. కూరగాయలు, మసాలా దినుసులు, ఇతర ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగాయి. మరి ఇంత వ్యత్యాసంతో విద్యార్థులకు పౌష్టికాహారం ఎలా సాధ్యం? రోజువారీ ఖర్చు.. ప్రస్తుతం ప్రభుత్వం 3, 4వ తరగతి విద్యార్థికి నెలకు రూ.1,150 మాత్రమే అందిస్తోంది. అంటే రోజుకు కేవలం రూ.38.33 మాత్రమే ఆహారానికి ఖర్చు చేసే పరిస్థితి ఉంది. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.1,400 చొప్పున, అంటే రోజుకు రూ.46.66 మాత్రమే లభిస్తోంది. పోస్ట్–మెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ.1,600 చొప్పున, అంటే రోజుకు రూ.53.33 మాత్రమే మెస్ ఖర్చు కేటాయిస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరలకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. పెంపు కోసం ఎదురుచూపులు.. వేలాది మంది విద్యార్థుల ఆహార బాధ్యతను నిర్వర్తిస్తున్న వసతి గృహాలకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో పాత మెస్ చార్జీలే కొనసాగడం నిర్వహణపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెస్ చార్జీలతో పాటు కాస్మెటిక్ చార్జీలను కూడా ప్రభుత్వం పునఃసమీక్షించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నా, ప్రభుత్వ వసతి గృహాల మెస్ చార్జీలను రెండేళ్లుగా పెంచకపోవడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న మెస్ చార్జీలు ప్రస్తుత ధరలకు ఏమాత్రం సరిపోవు. ఈ మొత్తంతో విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడం అసాధ్యం. కనీసం అన్ని వసతి గహాల విద్యార్థులకు నెలకు రూ.3,000 మెస్ చార్జీలు మంజూరు చేసి, కాస్మెటిక్ చార్జీలను కూడా పెంచాలి. విద్యార్థుల ఆరోగ్యం, విద్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మెస్ చార్జీల సవరణపై నిర్ణయం తీసుకోవాలి. – ఎస్. సమరం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
సారె సంబరాలకు సర్వం సిద్ధం
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆదిదంపతులు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై బుధవారం నుంచి ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 7గంటలకు ప్రధాన ఆలయంలోని అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తిని ఊరేగింపుగా మహామండపం ఆరో అంతస్తుకు తీసుకువస్తారు. ఆరో అంతస్తులో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఉదయం 7.30 గంటలకు ఆలయ అర్చకులు ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి తొలి సారెను సమర్పిస్తారు. రూట్ ప్లాన్ ఇదే.. సారె సమర్పణలకు వచ్చే భక్తులు ఘాట్రోడ్డు, మహామండపం ద్వారా కొండపైకి చేరుకుంటే తొలుత ప్రధాన ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి ఆరో అంతస్తుకు చేరుకుని ఉత్సవ మూర్తి వద్ద సారెను సమర్పించి పూజలు జరిపించుకునేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అమ్మవారికి సారె సమర్పించిన పిమ్మట భక్తులు తమతో తెచ్చిన పండ్లు, మిఠాయిలు, ఇతర పూజా సామగ్రిని తొటి భక్తులకు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక ఈ కార్యక్రమం అంతా అయిన అనంతరం భక్తులకు మహామండపం రెండు, మొదటి అంతస్తుల్లో జరిగే ఉచిత అన్న ప్రసాద వితరణకు పంపుతారు. అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు నేరుగా కనకదుర్గనగర్కు చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఆరో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు ఇక ఆరో అంతస్తులో భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులందరూ ఒక వరస క్రమంలో కూర్చునేలా రోప్లను ఏర్పాటు చేసింది. అమ్మవారికి సమర్పించే పూజా సామగ్రి కోసం వేదిక ఎదుట ప్రత్యేకంగా బల్లలు ఏర్పాటు చేసింది. సారెలో భాగంగా అమ్మవారికి సమర్పించే ప్రతి చీరకు తప్పని సరిగా రశీదు ఇచ్చేలా దేవస్థానం కౌంటర్ను, సిబ్బందిని నియమించనుంది. మొబైల్ఫోన్లు, కెమెరాలతో నో ఎంట్రీ ఈ దఫా మొబైల్ఫోన్లు, కెమెరాలతో ఆలయంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులను అనుమతించమని దేవస్థాన అధికారులు పేర్కొంటున్నారు. కనకదుర్గనగర్లోనే భక్తుల లగేజీ, చెప్పులు, సెల్ఫోన్లను భద్రపరిచేందుకు వేరు వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. ఆలయ ప్రాంగణం, ఆరో అంతస్తులో సెల్ఫోన్ కలిగిన భక్తుల నుంచి వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తామని ఆలయ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


