breaking news
Krishna
-
పూటీ లాగుడు పోటీలు ప్రారంభం
కోడూరు: రాష్ట్ర స్థాయి పూటీ లాగుడు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కోడూరు మండలంలోని స్వతంత్రపురం పీహెచ్సీ సమీపంలోని ఖాళీ స్థలంలో స్థానిక వ్యాపారి పసుపులేటి రాము ఆధ్వర్యాన పోటీలకు శ్రీకారం చుట్టారు. అవనిగడ్డ సీఐ యువకుమార్, ఎస్ఐ చాణిక్య పోటీలను ప్రారంభించారు. వారు నిర్వాహకుడు రామును శాలువాతో సత్కరించారు. అనంతరం పోటీకి వచ్చిన ఎడ్ల జట్ల యజమానులతో మాట్లాడారు. పోటీల్లో 22 ఎడ్ల జతలు.. తొలి రోజు ఆదివారం వ్యవసాయ విభాగానికి సంబంధించిన ఎడ్ల జతలకు పోటీలను నిర్వహించారు. బాపట్ల, చీరాల, ఒంగోలు, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 22 ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. సోమవారం న్యూ జూనియర్ విభాగానికి చెందిన ఎడ్ల జతలకు పోటీలు ఉంటాయని, వీటిలో గెలుపొందిన జతలకు నగదు బహుమతులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. పోటీల ప్రారంభంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. -
రజకులకు చట్టసభల్లో ప్రాతినిధ్యమే లేదు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): జనాభాలో మూడు శాతం ఉన్న రజక సామాజిక వర్గంలో ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె.పూర్ణచంద్రరావు అన్నారు. రజకులకు సామాజిక న్యాయం జరగాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ హనుమాన్పేటలో రజక సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎీస్టీ, మైనారిటీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగితే రాజకీయ సమీకరణాలు మారుతాయన్నారు. బీసీలు, ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో సమగ్ర కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు పానుగుపాటి శ్రీనివాస్, దాచేపల్లి మోహన్రావు, పేట శ్రీనివాస్, బైరవరపు శ్రీనివాస్, నమ్మి అప్పారావు పాల్గొన్నారు. -
మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధి
చిలకలపూడి(మచిలీపట్నం): మహిళల భాగస్వామ్యంతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధించిందని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక జెడ్పీ సమావేశపు హాలులో ఆదివారం సాయంత్రం వేడుకలు నిర్వహించారు. వీటిని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసి వారి ఉన్నతికి తోడ్పాటును అందించారన్నారు. తాను జెడ్పీ చైర్పర్సన్గా ఐదేళ్లు సమర్థంగా నిర్వహించామంటే అది వైఎస్ జగన్ నాకిచ్చిన గౌరవమేనన్నారు. జెడ్పీ సభ్యులుగా ఎక్కువ మంది మహిళలకు అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ హారికను సభ్యులందరూ గజమాల, పూలకిరీటంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిలో మహిళలది కీలకపాత్ర.. తొలి మెట్టు అదే.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక -
మహిళా సాధికారతే సమగ్ర ప్రగతికి పునాది
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మహిళలు సాధికారత సాధించినప్పుడే సమగ్ర ప్రగతికి పునాది అవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘రైజ్’ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో మహిళా దినోత్సవంలో 20సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నైపుణ్యాలు అందిస్తూ స్వావలంబన దిశగా ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్: 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడారు. అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మహిళలను సత్కరించారు. చెక్కులు అందజేత.. డీఆర్డీఏ ద్వారా 4,646 మంది స్వయం సహాయక సంఘ మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.83.78 కోట్లు, 6,146 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.829.55 కోట్లు, సీ్త్రనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కింద 18,550 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ.138.41 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఆంధ్రకేసరి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (వర్సున్నపేట)కు ట్రాక్టర్ అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దే అనురాధ, మున్సిపల్ చైర్మన్ సీహెచ్ చిట్టిబాబు, ఎంపీపీ పి.జోత్స్న అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026
పెనమలూరు: మండలంలోని యనమలకుదురు కొండపై ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలోని హుండీల్లో సొమ్ము చోరీ అయ్యింది. దీనిపై దాత సంగా నరసింహారావు ఫిర్యాదు మేరకు ఆలయ ఈవో ఎన్.భవాని, ప్రధాన అర్చకుడు సాగర్, అర్చకుడు పూర్ణ, వర్కర్ రోశయ్యపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఈ ప్రాంగణంలో శివాలయం, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, గణపతి, ఆంజనేయ, నాగేంద్రస్వామి ఆలయాల వద్ద హుండీలున్నాయి. భక్తులు ఈ హుండీల్లో సమర్పించిన కానుకలను ఏడాదికి మూడుసార్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.భవాని, ప్రధాన అర్చకుడు జి.ఆర్.వి.సాగర్, అర్చకులు, అటెండర్లు, గ్రామస్తుల సమక్షంలో లెక్కిస్తారు. ఆలయ పూజారులు పూర్ణ, సాగర్ శుక్రవారం గ్రామంలో మద్యం తాగి గొడవపడ్డారు. సొమ్ము విషయంలో తేడాలు.. హుండీల్లో కాజేసిన సొమ్ము విషయంలో వారి మధ్య గొడవ జరగడాన్ని ఆలయ దాత సంగా నరసింహారావు, డ్రైవర్ రాజులపాటి సాయిబాబు గమనించారు. ఈ విషయాన్ని నరసింహారావుకు చెప్పారు. దీంతో ఆయన ఆలయంలో రోజువారి పనిచేసే రోశయ్యను పిలిచి ప్రశ్నించారు. రెండేళ్లుగా హుండీలో సొమ్ము స్వాహా చేస్తున్నట్లు రోశయ్య ఆయనకు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో పలు ప్రదేశాల్లో ఉన్న హుండీల్లోని సొమ్మును లెక్కింపునకు తీసుకొచ్చే సమయంలో మధ్యలోనే ఈవో భవాని సహకారంతో పూజారులు సాగర్, పూర్ణ, తాను స్వాహాచేసినట్లు రోశయ్య తెలిపారు. అంతరాలయంలో ఉన్న ప్రధాన హుండీకి నకిలీ తాళం చెవులు తయారు చేసి కూడా సొమ్ము కాజేశారని, రూ.10 లక్షల వరకు సొమ్ము స్వాహా చేశారని నరసింహారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సూత్రధారులు ఈవో ఎన్.భవాని, ఆలయ ప్రధాన అర్చకుడు సాగర్, అర్చకుడు పూర్ణ, వర్కర్ రోశయ్యపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు. అభిషేకానికి పవిత్ర జలాలను బంగారు గోపురం వద్దకు తీసుకెళ్తున్న అర్చకులుపెనమలూరు: ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నామని ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్ తెలిపారు. ఈ మేరకు కానూరు అశోక్ జిమ్లో ఆదివారం సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ పోస్టర్ ఆవిష్కరించారు. మనోహర్, అశోక్ వివరాలు తెలుపుతూ ఈ పోటీలు విజయవాడలో మార్చి 29వ తేదీన జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో చాంపియన్ ఆఫ్ ది చాంపియన్ 2026 అవార్డుతో పాటు, వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. కె.ఈశ్వరరావు, సీహెచ్ రాజు, ఈదా రాజేష్, అల్లూరిరెడ్డి, ఎస్కే ఖాదర్ పలువురు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 8686771358, 9705663252లో సంప్రదించాలని సూచించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): అధికారులను సైతం బెదిరింపులకు గురిచేస్తూ, రేషన్ మాఫియాకు డాన్లా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణపై పీడీ యాక్ట్ను అమలు చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. కాజా సత్యనారాయణ(50) నందిగామ, మైలవరం సబ్ డివిజన్ పరిధిలోని లబ్ధిదారుల వద్ద నుంచి, కొంతమంది డీలర్స్ వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకుని వాటిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటాడని తెలిపారు. సత్యనారాయణ తొలిసారిగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ 2011లో పట్టుబడ్డాడని, అప్పటి నుంచి ఇప్పటి వరకు 41 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 2న డెప్యూటీ తహసీల్దార్కు వచ్చిన పక్కా సమాచారం మేరకు వీరులపాడు మండలం జయంతి గ్రామంలోని ఒక షెడ్ను తనిఖీ చేసి 147.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకుని వీరులపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసి రాజమండ్రి జైలుకు తరలించినట్లు తెలిపారు. కంకిపాడు: లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు పూర్తి చేయాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ అన్నా రు. మండలంలోని ఉప్పలూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో ఆదివారం ఆమె విస్తృతంగా పర్యటించారు. పలు కాలనీల్లో ఇంటి పన్నులకు సంబంధించిన డిమాండ్ నోటీసులను యజ మానులకు అందించారు. పన్ను వసూళ్లు, పెండింగ్ పన్నులపై సమీక్ష చేశారు. ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన అధిగమించాలన్నారు. బకాయిలపై దృష్టి సారించాలని ఆదేశించారు. పరిశీలనలో ఈఓ బి.వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవంగా సాగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా క్రతువు జరిగింది. కుంభాభిషేకం వేళ తులసీవనం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ప్రాంగణం, ప్రసాదాల విక్రయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసే మార్గంలోని బంగారు గోపురం వీక్షించే ప్రాంతం, క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి కుంభాభిషేకాన్ని వీక్షించారు. కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో, మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అందంగా అలంకరించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మంటప పూజలు, మూలమంత్ర హవనం నిర్వహించారు. అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 9గంట లకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, సీపీ రాజశేఖరబాబు, చైర్మన్ రాధాకృష్ణ, దుర్గగుడి ఆలయ ప్రధాన అర్చకులు ఎల్. దుర్గాప్రసాద్, అర్చకులు, వేద పండితులు అమ్మవారి బంగారు కలశం వద్దకు చేరుకున్నారు. బంగారు కలశానికి విజయేంద్ర సరస్వతి స్వామి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సుముహూర్తమైన 9.34 గంటలకు పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించిన అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన స్వామిజీ నేరుగా ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్దకు చేరుకుని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆలయాల్లో జరిగే విశేష పూజల వల్ల ఫలితాలు, భగవంతుడికి, భక్తుడికి మాధ్యమంగా ఉండేవి ఆలయాలేనని, యువ త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు. వారంలో రెండు రోజుల పాటు యువతకు, కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక దర్శన సమయం ఇవ్వాలని స్వామిజీ ఆకాంక్షించారు. అనంతరం ఈవో, చైర్మన్, ట్రస్ట్బోర్డు సభ్యులతో పాటు అధికారు లు, సిబ్బందికి స్వామిజీ ప్రసాదాలను అందించారు. పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా అభిషేకం దుర్గమ్మవారికి స్వామిజీ ప్రత్యేక పూజలు ఆలయ ప్రాంగణంలో అనుగ్రహ భాషణం భక్తజనంతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి -
జనసేన సభ్యత్వ నమోదులో రచ్చకెక్కిన ఇరు వర్గాలు
కంకిపాడు: కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇరు వర్గాల వార్ రచ్చకెక్కింది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే తమకు ఇవ్వడం లేదంటూ జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. చింతకింద సునీల్, మేక స్వాతి తేజ్ల మధ్య వివాదం రాజుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై రగడ చోటు చేసుకుంది. బ్యానర్లు కట్టుకోవడాని తనకు అనుమతి ఇవ్వకపోవడం జనసేనకు చెందిన స్వాతీ తేజ్ మండిపడ్డారు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయవాడలో కాల్పుల కలకలం
సాక్షి, విజయవాడ : విజయవాడలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులపైనే కాల్పులు జరిపేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. అయితే, ట్రిగ్గర్ బ్లాక్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం, అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో గన్ ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. దీంతో, అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. సదరు వ్యక్తిని పట్టుకున్నారు. దుండగుడి వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కాల్పులు జరిపిన వ్యక్తిని వరంగంల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడిని ఈగల్ టీమ్ విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. -
9న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో అప్రెంటిస్ మేళా
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాలోని ఎనిమిది ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు పోస్టు రోస్టర్ ప్రకారం భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో అర్హత కలిగిన అభ్యర్థులు సీడీపీవో ఆఫీసులో సంప్రదించి ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్త, ఆయా పోస్టులకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి వివాహిత అయ్యి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం ఐసీడీఎస్ కార్యాలయ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు. నాగాయలంక: ఇంటి వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల బాలిక పాము కాటుకు గురై ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మండలంలోని పెదపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్.ఐ రాజేష్ తెలిపిన వివరాల మేరకు.. లోయ శివరామకృష్ణ, ఝాన్సీ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఝాన్సీ ఇంటి ముందు పని చేసుకుంటోంది. ఆ సమయంలో రెండేళ్ల కుమార్తె పల్లవి పక్కనే బూత్రూమ్ దగ్గర ఆడుకుంటూ అకస్మాత్తుగా ఏడుస్తూ కేకలు వేసింది. అది విని తల్లి కుమార్తె దగ్గరకు వెళ్ళి పరిశీలించగా బాలిక కుడిచేతి మణికట్టు కింద పాము కాటు వంటి రెండు గాట్ల గుర్తులతో రక్తస్రావం కావడాన్ని గమనించింది. తక్షణం చికిత్స కోసం బాలికను అవనిగడ్డ సిహెచ్సికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యండకుదురు(ఘంటసాల): ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి విద్యుత్తు స్థంభాన్ని ఢీ కొట్టడంతో రెండు స్తంభాలు పడిపోవడంతో పాటు కారు ద్వంసంమైన ఘటన శుక్రవారం ఘంటసాల మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. చల్లపల్లి మండల మాజేరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం వాటపల్లిలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి మచిలీపట్నం నుంచి మాజేరు కారులో వస్తున్నారు. ఘంటసాల మండలం యండకుదురు శివారు జీలగలగండి – పచ్చవారిలంక గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన కారు 11 కేవీ విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారు ముందుబాగం దెబ్బ తినడంతో పాటు ట్రాన్స్ ఫార్మర్ సపోర్టుగా ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టడంతో రెండు స్తంభాలు విరిగి పడిపోవడంతో విద్యుత్తు వైర్లు కారు మీద పడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో కారులో ఉన్న వారికి ప్రాణాపాయం తప్పడమే కాక ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కారులో ఉన్న ప్రయాణికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
దాడికి పాల్పడిన విద్యార్థులకు కౌన్సెలింగ్
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వీరవల్లి జెడ్పీ హైస్కూల్లో బోధనేతర సిబ్బందిపై దాడికి పాల్పడిన టెన్త్ విద్యార్థులకు పోలీస్స్టేషన్లో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వివరాల్లోకి వెళ్లితే.. గత నెల 26వ తేదీన వీరవల్లి జెడ్పీ హైస్కూల్లో ముగ్గురు విద్యార్థులు మరుగుదొడ్ల వద్ద సిగరెట్లు తాగుతుండగా ల్యాబ్ అసిస్టెంట్ సీహెచ్ రవీంద్రరావు మందలించడంతో టెన్త్ విద్యార్థి పునీత్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆయనపై దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటం, మీడియాలో వార్తలు వెలువడటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరవల్లి పోలీస్స్టేషన్లో ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. గుడివాడ డీవైఈవో రవికుమార్, బాపులపాడు ఎంఈవో–2 కొమ్మా విజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల సమక్షంలో వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ ముగ్గురు టెన్త్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ముగ్గురు విద్యార్థులకు క్రమశిక్షణ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పట్ల గౌరవం, విద్యా సంస్థలో సత్ప్రవర్తన కలిగి ఉండటం గురించి ఎస్ఐ సత్యం సురేష్ వివరించారు. తల్లిదండ్రుల గైడెన్స్ లోపించడం వల్లే విద్యార్థులు పాఠశాలలో క్రమశిక్షణ పాటించడం లేదన్నారు. దీనికిగానూ భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లల ప్రవర్తన, భవిష్యత్కు పూర్తి బాధ్యత వహిస్తామని పేర్కొంటూ తల్లిదండ్రుల నుంచి పోలీసులు హామీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి విద్యార్థి మృతి
నందిగామ రూరల్: ప్రమాదవశాత్తు బావిలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు.. మండలంలోని పల్లగిరి గ్రామానికి చెందిన పాల్వాయి నీలాంబరం, శైలజ దంపతులకు ముగ్గురు సంతానం. తేజ (14), సోదరి తేజశ్రీ, తనూజ్ ముగ్గురు పిల్లల్లో తేజ, తేజశ్రీలు కవలలు. నీలాంబరం తాపీమేసీ్త్రగా పని చేస్తుండగా భార్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామ సమీపంలోని పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న తేజ శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత తాత జేమ్స్తో కలిసి రాఘవాపురం శివారులోని మామిడి మొక్కలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. తాత తోటలో నీళ్లు పెడుతుండగా తేజ బుంగతో బావిలో నీటిని తీసుకొచ్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడ్డాడు. గమనించిన తాత బావిలోకి దూకి గాలించినప్పటికీ బాలుడు లభ్యమవకపోవటంతో కేకలు వేశాడు. చుట్టపక్కల వారు అక్కడకు చేరుకుని అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బావిలోని నీటిని తోడి బాలుడిని బయటకు తీసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. -
నిర్దేశిత సూచికలను పూర్తి స్థాయిలో సాధించాలి
పెనుగంచిప్రోలు: ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద నిర్దేశించిన సూచికల్లో పూర్తి స్థాయిలో వృద్ధి సాధించాలని నీతి అయోగ్ ఢిల్లీ అధికారి రాధిక ములే అన్నారు. నీతి అయోగ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారం మండలంలో పర్యటించారు.అంగన్వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పశు వైద్యశాలలు, పెనుగంచిప్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. శనగపాడు గ్రామంలో గ్రామీణ కృషి పరిజ్ఞాన కేంద్రం సందర్శించి అక్కడ రైతులకు అందిస్తున్న స్మార్ట్ అగ్రి కల్చర్ శిక్షణ, జియో ఫెన్సింగ్, వ్యవసాయ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై వివరాలు తెలుసుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, బలవర్ధకమైన ఆహారం వంటి సూచికల్లో పూర్తి స్థాయిలో వృద్ధి సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మార్గదర్శకంలో సంపూర్ణత అభియాన్ 2.0 జిల్లాలో సమర్ధవంతంగా అమలవుతూ మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, ఎంపీడీఓ జి శ్రీను, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మీ, ఏఓ రామసుబ్బారెడ్డి, ఎంఈఓ రవీంద్ర, వైద్యాధికారి నాగరాణి, పశువైద్యాధికారి పి.అనిల్, ఏబీపీ కో–ఆర్డినేటర్ మోహన్ సందీప్, ఏపీఎం వెంకటరమణ, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ నాంచారయ్య, హౌసింగ్ ఏఈ సతీష్, ఐసీడీఎస్ సీడీపీఓ సత్యవతి, డెప్యూటీ ఎంపీడీఓ సుబ్బారావు, ఏఓ సిద్ధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
17 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
మైలవరం: అక్రమంగా రవాణా చేస్తున్న 17 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారి పి.వాణి తెలిపారు. ఈ నెల 5న అందిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పరిధిలో మూడు రేషన్ షాపుల్లో స్థానిక అధికారులతో కలిసి తనిఖీలు చేశామన్నారు. నాలుగు టన్నుల తేడాను గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల అనంతరం విజయవాడ వెళుతుండగా మార్గంమధ్యలో మైలవరం మండలం బాడవ టోల్ ప్లాజా వద్ద గురువారం రాత్రి అనుమానాస్పదంగా ఉన్న లారీని గుర్తించి తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీలలో 300 ప్లాస్టిక్ బ్యాగ్లతో నిండిన 17 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి మైలవరం పోలీస్ స్టేషన్కు లారీని తరలించి, స్థానిక తహశీల్దారును కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఓ వి. శ్రీనివాస్, డీటీ బి. రామకృష్ణ, ఆర్ఐ కిశోర్, స్థానిక వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. -
వెళ్తారా.. కేసులు పెట్టమంటారా?
విలేజ్ సర్వేయర్లకు ప్రయోజనాలు లేవు విలేజ్ సర్వేయర్లకు పోలీసుల హెచ్చరిక వినతిపత్రం ఇవ్వడానికి జిల్లాలోని మండలాల నుంచి విలేజ్ సర్వేయర్లు కలెక్టరేట్కు చేరిక ప్రతినిధులు తప్ప మిగతావారు బయటకు వెళ్లాలని పోలీసుల సూచన వెళ్లకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికతో ఉద్రిక్తం -
అంగరంగ వైభవంగా..
● దుర్గగుడిపై కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం ● తొలి రోజున పవిత్ర జలాలకు పూజలు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సోయగం ఆలయానికి అలంకరణ కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయం, పరిసరాలను పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని అడుగడుగునా మామిడి తోరణాలు, అరటి చెట్లతో అలంకరించారు. అంతరాలయంలో అమ్మవారి మూలవిరాట్కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అంతరాలయ దర్శనం రద్దు, టికెట్ల విక్రయాలను నిలిపివేయడంతో భక్తులు అన్ని క్యూల్లో అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఘాట్రోడ్డుతో పాటు ఆలయ పరిసరాల్లో 11కు పైగా ప్రత్యేక వైద్య శిబిరాలు, భక్తులకు మంచినీటి పంపిణీ, మజ్జిగను అందజేశారు. లోబ్రిడ్జి నుంచి అమ్మవారి ఆలయానికి చేరుకునే వరకు ప్రతి వంద మీటర్లకు తాగునీటి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మోడల్ గెస్ట్ హౌస్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 11వేల మందికి అన్న ప్రసాద వితరణ -
కేయూ మహిళల హ్యాండ్బాల్ చాంప్ కేబీఎన్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా యూనివర్సిటీ విశ్వవిద్యాలయ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్గా కేబీఎన్ కళాశాల విజయం సాధించింది. విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల మహిళ హ్యాండ్బాల్ పోటీలు కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి జరుగుతున్న పోటీలు శుక్రవారం ముగిశాయి. కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్, టోర్నమెంట్ చైర్మన్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ తమ కళాశాల హ్యాండ్బాల్ పోటీల్లో 12సార్లు వరుస చాంపియన్షిప్లను కై వసం చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. కేబీఎన్ కళాశాల మొదటగా లీగ్ పోటీలో విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (నున్న)పై 14 –2 గోల్స్ ఆధిక్యతంతో విజయం సాధించారు. రెండో లీగ్లో స్టెల్లా కాలేజ్ (విజయవాడ)పై 18–00 గోల్స్ ఆధిక్యతతో కేబీఎన్ విజయం సాధించింది. ఫైనల్లో సిద్ధార్థ మహిళ కళాశాల జట్టుపై 14–00 ఆధిక్యంతో యూనివర్సిటీ చాంపియన్షిప్ ట్రోఫీని కై వసం చేసుంది. ద్వితీయ స్థానం విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (నున్న) సాధించగా, తృతీయ స్థానాన్ని సిద్ధార్థ మహిళ కళాశాల జట్టు సాధించింది. బహుమతి ప్రదానం ముఖ్య అతిథి ఇగ్నో రీజనల్ డైరెక్టర్ డాక్టర్ సుమలత విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఏపీ ఉత్తమ క్రీడాకారిణిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న కేబీఎన్ కళాశాల విద్యార్థిని బోయి సత్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వీరిని తయారుచేసిన క్రీడా విభాగాధిపతి డి.హేమచంద్రరావును ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీనివాస్, యూనివర్సిటీ సెలక్షన్ కమిటీ మెంబర్స్, అధ్యాపక సిబ్బంది తదితరులు విజేతలను అభినందించారు. -
బాధ్యతల స్వీకరణ
మచిలీపట్నంఅర్బన్: స్థానిక సర్వజన ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా డాక్టర్ టి. లీలా ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ టీటీకే రెడ్డి.. డాక్టర్ లీలా ప్రసాద్కు అప్పగించారు. ఈ సందర్భంగా లీలా ప్రసాద్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బడ్జెట్ అంశాలను ఉన్నతాధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. సేవలు మరింత మెరుగుపరచడానికి సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం రాత్రి విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన విజయేంద్ర సరస్వతి స్వామీజీని ఆలయ ఈవో, చైర్మన్, స్థానాచార్య, ప్రధాన అర్చకులు, వేద పండితులు పాదాభివందనం చేసి సాదరంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న స్వామీజీ తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న అనంతరం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్లను, క్రతువులను స్వామీజీ పరిశీలించారు. యాగశాలకు చేరుకున్న స్వామిజీ ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కంచి పీఠాధిపతి ఇంద్రకీలాద్రికి విచ్చేశారని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అన్నారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించారు. దీనిలో ఫీడర్ లెవల్ సోలరైజేషన్, ఎస్సీ,ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్టాప్స్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఏజీఎల్ కనెక్షన్లు, వినియోగదారులకు ఇతర సర్వీసులు అందించాలన్నారు. రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం సాధించాలన్నారు. లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫీడర్స్ బ్రేక్ డౌన్ కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్(టెక్నికల్) మురళీ కృష్ణయాదవ్, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) టీవీఎస్ఎన్ మూర్తి, డైరెక్టర్ (ఫైనాన్స్) వెంకటేశ్వర్లు, సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు. మోపిదేవి: మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు అడిషనల్ సొలిటర్ జనరల్, మాజీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం నాగ పుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించు కున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. -
పన్నుల చెల్లింపులో అధికారులకు చుక్కలు చూపిస్తున్న బడాబాబులు
మండలం గృహాలు, డిమాండ్ వసూలైంది భవనాలు చందర్లపాడు 15,408 76.13 57.09 జగ్గయ్యపేట 17,265 473.4 247.74 కంచికచర్ల 17,963 391.4 208.97 నందిగామ 11,986 157.7 119.22 పెనుగంచిప్రోలు 14,046 173.9 104.34 వత్సవాయి 14,981 119.5 71.68 వీరులపాడు 12,998 79.83 64.08 ఎ.కొండూరు 11,296 54.33 33.53 గంపలగూడెం 17,104 146.7 76.62 రెడ్డిగూడెం 8,838 68.55 27.35 తిరువూరు 10,120 50.12 32.28 విసన్నపేట 13,152 152.3 82.59 జి.కొండూరు 15,142 244.2 145.45 ఇబ్రహీంపట్నం 11,036 423.5 202.6 మైలవరం 16,122 343.8 220 55,693 2444 1475 జి.కొండూరు: గ్రామాల్లో పన్నుల చెల్లింపులో పెద్దలు వెనుకంజలో ఉండగా.. తప్పించకోవడానికి ముందంజలో ఉన్నారు. ప్రసంగాల్లో నీతులు వల్లించే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఇంటి పన్నుల చెల్లింపులో మాత్రం అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. సామాన్యులను ముక్కుపిండి వసూలు చేసే అధికారులు.. ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లించని బడాబాబులను ఏమీ చేయలేక, రాజకీయ ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఇంటి పన్నులను బడాబాబులే ఎగవేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది చివరికి వచ్చినా పన్నుల వసూళ్లు పాత బకాయిలతో కలిపి 58 శాతం మాత్రమే పూర్తవడం ఆందోళనకరంగా మారింది. గ్రామ పంచాయతీలకు ఆదాయం లేక, స్టాంపు డ్యూటీ లేక, బడాబాబుల నుంచి ఇంటి పన్నుల వసూళ్లు కాకపోవడంతో కనీస మౌలిక వసతుల కల్పన లేక, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందించలేని దుస్థితి నెలకొంటోంది . ఎన్టీఆర్ జిల్లాలోని 16మండలాల పరిధిలో 288 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి చివరిరే రూ.53.99కోట్లు ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉంది. దీనిలో పాత బకాయిలే రూ.11.97కోట్లు ఉంది. గతేడాది ఆగస్టు నుంచి ఇంటి పన్ను వసూళ్లు ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకు పాత బకాయిలు రూ.4.60కోట్లు, నూతన ఇంటి పన్ను రూ.27.08కోట్లు కలిపి మొత్తం రూ.31.68కోట్లను వసూలు చేశారు. ఇప్పటి వరకు పేద, మద్య తరగతి వారి నుంచి మాత్రమే ఈ ఇంటి పన్నును అధికారులు వసూలు చేయగలిగారు. విజయవాడ రూరల్ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పన్నుల వివరాలు రూ.లక్షల్లో నగర, గ్రామ ఆర్థిక వ్యవస్థకు పన్నులు ప్రధాన ఆధారం. అయితే ఇటీవల పన్నులు కట్టకుండా దారులు చూస్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో అధిక ఆదాయం కలిగిన పెద్దలు, సంస్థలు ఇంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం బడాబాబులు పావులు కదుపుతున్నారు. పన్ను చెల్లింపులో సామాన్యులు నియమాలు పాటిస్తుంటే.. పెద్ద ఆదాయ వర్గాలు పన్నుల నుంచి తప్పించుకోవడం ఆర్థిక సమానతకు సవాల్గా మారుతోంది. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. సామాన్యులను ముక్కు పిండి వసూలు చేస్తున్న వైనం ఎన్టీఆర్ జిల్లాలో 2025–26లో ఇంటి పన్ను డిమాండ్ మొత్తం రూ.53.99కోట్లు ఇప్పటి వరకు 58.69 శాతం మాత్రమే వసూలు ఇంకా వసూలు చేయాల్సిన పాత బకాయిలు రూ.7.37కోట్లు, నూతన పన్ను రూ.14.93కోట్లు కలిపి మొత్తం రూ.22.30కోట్లలో 20 శాతం మొండి బకాయిలు ఉండగా మరో 20 శాతం కార్పొరేట్ విద్యా సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తల నుంచి వసూలు చేయాల్సి ఉంది. వీరు రాజకీయ నేతల నుంచి ఫోన్లు చేయించడం, మాట్లాడించడం వంటి దారులతో పంచాయతీ అధికారుల చేతులు కట్టేస్తున్నారు. సంబంధిత అధికారులు వచ్చినా బడాబాబులు లెక్కచేయడం లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన ఇంటి పన్నును వసూలు చేసేందుకు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. -
సమాజంలో మహిళల సేవలు అమూల్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో మహిళలు అందిస్తున్న సేవలు అమూల్యమని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా అధికారులు, ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమను వీసీ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో మహిళలు అద్భుతమైన విజయాలు సాధి స్తున్నారన్నారు. అకడమిక్, పరిశోధన, నాయకత్వం వంటి అంశాల్లోనూ సత్తాచాటుతున్నారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ మాట్లాడుతూ.. లింగ సమానత్వం అనేది ఒక లక్ష్యం కాదని, అది ఉమ్మడి బాధ్యతని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేసిన వర్సిటీ మహిళా ఉద్యోగులు ఎన్.బి.లక్ష్మి, వి.ఝాన్సీతో పాటు, ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఎంఆర్యూ పరిశోధనల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన తిరుపతి శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రవిప్రభు, పిడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.ఎస్.కిరిటీ, పీఆర్ఓ వీరకిరణ్ను సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.లక్ష్మీసూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధ, సీఓఈ డాక్టర్ చక్కా శ్రీకాంత్, ఫైనాన్స్ ఆఫీసర్ టి.కృష్ణ, కె.ఎల్.ఆర్.కె.ప్రసాద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026ఎండీయూ వాహనం.. ● ఎండీయూ వాహనాలను నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ● ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న వాహనాల ఆపరేటర్లు ● వాహనాల ఆపరేటర్లకు భారంగా మారిన రుణాల చెల్లింపు 7జి.కొండూరు: పేదల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులను చేరవేసే ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ వాహనాల వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపణలు చేసింది. ఈ వాహనాలను నిలిపివేసిన ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీని తిరిగి డీలర్లకు అప్పగించింది. వాహనాలను రద్దు చేసినప్పుడు వాటి రుణాల బకాయిలను వెంటనే క్లియర్ చేసి వాహనాల ఆపరే టర్లకు క్లియరెన్స్ లెటర్లు ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చింది. రుణాలు తీరిపోతే వాహనం ఆపరేటర్ల సొంతమై వారు ఇతర వ్యాపారాలకు వినియోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు గొప్పల డప్పుకొట్టింది. అయితే వాహనాలను తొలగించి తొమ్మిది నెలలు గడిచినా రుణాల క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో వాహనాలను వినియోగించని ఆపరేటర్లు, వాటిని విక్రయించే వీలు లేక లబోదిబోమంటున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ గడువు కూడా ముగియడంతో రెన్యూవల్ చేయించలేక సతమతం అవుతున్నారు. వాహనాలను తొలగించే ముందు రెండు విడతలు ఐసీడీఎస్, ఏఎండీలకు రేషన్ సరఫరా చేసిన కమీషన్కు సైతం రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. వాహనాలను తొలగించాకే రేషన్ మాఫియాకు రెక్కలొచ్చాయని ఎండీయూ ఆపరేటర్ల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ పంపిణీ వాహనాలను గత ఏడాది మే నెలలో తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వాహనంపై అప్పటి వరకు మిగిలి ఉన్న బ్యాంకు రుణం బకాయి రూ.1.5 లక్షలను ప్రభుత్వం ఒక్కసారిగా చెల్లించి ఉంటే బ్యాంకుల నుంచి క్లియరెన్స్ వచ్చి వాహనం ఆపరేటర్ల సొంతమయ్యేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా నెలవారీ వాయిదాలు చెల్లిస్తుండడంతో బ్యాంకుల నుంచి క్లియరెన్స్ రాలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ వాయిదాలు చెల్లించాల్సి ఉండటంతో వాహనా లకు క్లియరెన్స్ రావాలంటే ఆపరేటర్లు మరో ఏడాది పాటు వేచి ఉండక తప్పదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలకు వాహన మిత్ర పథకంలో వచ్చే సొమ్ముతో ఏటా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీతో ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఇన్సూరెన్స్ను రెన్యూవల్ చేసేందుకు రూ.11,500 చెల్లించాల్సి రావడం ఆపరేటర్లకు భారంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు చెల్లించాల్సిన ఐసీడీఎస్, ఏఎండీలకు రేషన్ సరఫరా చేసిన కమీషన్ రెండు విడతలుగా చెల్లించలేదు. ఈ రెండు విడ తలు కమీషన్ కలిపి ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.14 లక్షల వరకు ఆపరేటర్లకు రావాల్సి ఉంది. దసరా ఉత్సవాల తరహాలో కుంభాభిషేకంరేషన్ మాఫియా గుట్టు రట్టు మచిలీపట్నంఅర్బన్: స్థానిక ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ టి.లీలాప్రసాద్ నియమితులయ్యారు. ఆయన ఇప్పటి వరకు ఎస్పీవీ మెడికల్ కాలేజీలో ఈఎన్ టీఈ విభాగంలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. -
ఫిట్గా ఉంటేనే అన్నింటా ఫస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శారీరక, మానసికంగా ఫిట్గా ఉంటేనే అన్నింటా ఉత్తమ ఫలి తాలు సాధించగలమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో క్రీడా పోటీలను శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ నిర్మలకుమారి, కన్వీనర్ పి.మాధవి తదితరులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం సమర్థవంతమైన పాలనకు కీలకమన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ... క్రీడలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా నాయకత్వ లక్షణాలు, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి గుణాలను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎజ్జీఓ మహిళా విభాగం ప్రతినిధులు కె.శివలీల, వి.శాంతిశ్రీ, బి.జానకి, ఎం.సరస్వతి, బి.విజయశ్రీ, సీహెచ్.నాగమల్లేశ్వరి, ఎస్.దివ్య, వి.సురేఖ, పి.తులసీరత్నం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
నాలుగేళ్లపాటు ఉపాధి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు 2021, జనవరి 21వ తేదీన ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఉపాధి కల్పించడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఒక్కొక్కరికి సుమారుగా రూ.6 లక్షల విలువైన వాహనాన్ని అందజేశారు. ఈ వాహనం ఖరీదులో పది శాతం మాత్రమే లబ్ధిదారులు ముందుగా చెల్లించారు. బ్యాంకు రుణాలను తీర్చేందుకు ఆయా కార్పొరేషన్ల నుంచి ఒక్కొక్క వాహనానికి నెల వాయిదా పద్ధతిలో రూ.6 వేలు, ఆపరేటర్ల వేతనం నుంచి రూ.3 వేలు చెల్లించేవారు. ఈ విధంగా ఆపరేటర్లకు నెలవారీ వాయిదా, సహాయకుడి వేతనం, డీజిల్ ఖర్చు కలిపి ప్రభుత్వం నుంచి నెలకు రూ.21 వేలు చెల్లించారు. ఈ విధంగా ఆపరేటర్లు రేషన్ పంపిణీని 15రోజుల్లో పూర్తి చేసి నెలలో మిగిలిన 15 రోజులు ఇతర పనులు చేసుకొని ఉపాధి పొందేవారు. నాలుగేళ్ల పాటు ఉపాధి పొందిన ఆపరేటర్లుకు చంద్రబాబు ప్రభుత్వం షాకిచ్చింది. వాహనాలతో రేషన్ మాఫియా సాగుతోందని అసత్యాలు వల్లెవేస్తూ వాటిని తొలగించింది. ఇప్పుడు ఉపాధి పోయి ఆ వాహనాలకు తమ పేరుకు మారక, వాటిని విక్రయించే వీలు లేక, ఇన్సూరెన్స్ చెల్లించలేక ఆపరేటర్లు నరకయాతన పడుతున్నారు. -
డ్రగ్స్ ప్రమాదకరం
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ లబ్బీపేట(విజయవాడతూర్పు): డ్రగ్స్తో ఆరోగ్యానికే కాక భవిష్యత్తుకూ ప్రమాదకరమని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో బుధవారం డ్రగ్స్ వద్ద బ్రో అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథి రవికృష్ణ మాట్లాడుతూ..తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చడం విద్యార్థుల బాధ్యతన్నారు. పొగాకు, మద్యం, గంజాయి, హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాలకు ఒకసారి అలవాటు అయితే బయటపడటం కష్టమని హెచ్చరించారు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, ఈగల్ సీఐ రవీంద్ర, ఆర్ఐ నాగార్జున, ఎస్ఐ వీరాంజనేయులు, పలువురు అధ్యాపకులు, సుమారు 500 మంది మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి తెప్పోత్సవం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఏసీ సంధ్య తెలిపారు. ఉదయం సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటలకు రథోత్సవం జరిగింది. అనంతరం వసంతోత్సవం, పూర్ణహుతి, చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు స్వామి వారిని పల్లకిలో తిరువీధుల్లో ఘనంగా ఊరేగించారు. రాత్రి ఏడు గంటలకు వేణు గోపాలస్వామి తెప్పోత్సవం జరిగింది. -
తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ప్రారంభం
ఇబ్రహీంపట్నం: స్థానిక ఎన్టీటీపీఎస్లో బుధవారం జాతీయ భద్రత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్చార్జిచీఫ్ ఇంజినీర్ పి.అనురాధ ఈ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భద్రతంటే ఒక రోజు పాటించే నియమం కాదన్నారు. దైనందిన జీవితంలో భద్రత ఒక భాగం కావాలని సూచించారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వంటి కీలక విభాగాల్లో పనిచేసేటప్పుడు అప్రమత్తత కీలకమన్నారు. ప్రతి ఉద్యోగీ తనతో పాటు తోటి ఉద్యోగుల రక్షణను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రక్షణ పరికరాలు ధరించడంలో నిర్లక్ష్యం తగదని హితవుపలికారు. భద్రతా కమిటీ సభ్యులు, సిబ్బంది కలిసి భద్రతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ ఇంజినీర్లు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న గోసంరక్షణ కేంద్రానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. మొగల్రాజపురం శాంతినగర్కు చెందిన కె.లీలాకుమారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యుడు రామబ్రహ్మంనకు దాతలు ఈ విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండి తుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
మండలిలో ఉద్రికత్త.. టీడీపీ సభ్యుల జులం
అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..మీడియా పాయింట్:లడ్డూపై చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రులు యత్నించారు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులులడ్డూపై చర్చ జరపాలని మండలి మొదటి రోజు నుంచి డిమాండ్ చేస్తున్నాంశాసనమండలిలో లడ్డు పై చర్చ కోసం పదిరోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాంఈరోజు చర్చకు ఒప్పుపుకుని నిజాలు బయట పడుతుంటే తట్టుకోలేకపోతున్నారుసభలో లేని వైఎస్ జగన్ గురించి మాట్లాడారువైఎస్ జగన్ రాష్ట్రంలో అనేక దేవాలయాలను దర్శించారునిన్నకాక మొన్న నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారుతిరుమలకు ఏడుకొండలు ఉండాలని జీవో ఇచ్చింది వైఎస్సార్వైఎస్సార్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబువెంకటేశ్వరస్వామిపై ఎనలేని భక్తి ఉందని చంద్రబాబు చెప్పుకుంటాడుఒక్కసారైనా తిరుపతిలో తలనీలాలు ఇచ్చారా?లడ్డూపై నిందలు వేసి చర్చకు తెచ్చింది ఎవరు?వైఎస్ జగన్కి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలిలడ్డూపై చర్చ జరగకుండా పదేపదే అడ్డుపడ్డ మంత్రులుటీడీపీ ఎమ్మెల్సీల తీరుపై వైఎస్సార్సీపీ ఆందోళనఅచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ పట్టుఏపీ శాసనమండలి రేపటికి వాయిదానెయ్యికి పూతపూసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా: తూమాటి మాధవరావుజంతు కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్ షీట్ 209 పేజీలో చాలా క్లియర్గా చెప్పింది2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమల వెళ్లుంటారు కదాఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారుమీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయటపెట్టే ధైర్యం ఉందా?తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారుటెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సప్లై చేశారులడ్డూపై ఆరోపణలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారుహెరిటేజ్ పేరు తూమాటి ప్రస్తావించగానే ఉలిక్కిపడ్డ మంత్రులుతూమాటి ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ మంత్రి పయ్యావుల అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిందే..మండలి ఛైర్మన్పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు మీరు క్రిస్టియన్ అనుకున్నా. కానీ కాదని మీరు చెప్పారు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టిన ఎమ్మెల్సీలు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం మండలి ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలుతాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ తనను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరని అచ్చెన్నాయుడికి ప్రశ్నతాను హిందువునని క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుఅచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: తూమాటితూమాటి మాధవరావు ప్రసంగాన్ని అడ్డుకుంటున్న మంత్రులు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..1998లో హెరిటేజ్ టీటీడీకి మిల్క్ పౌడర్ సప్లై చేసింది. అడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఇవ్వొద్దని ఆదేశించింది.అయినప్పటికీ టీటీడీ ద్వారా బిల్లు పాస్ చేసుకున్నారునెయ్యికి పూత రాసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా.ఫిర్యాదుకు, సీబీఐ రిపోర్టుకు తేడా తెలియకుండా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ చార్జ్షీట్ 209 పేజీలో చాలా క్లియర్గా చెప్పారు.2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమలకు వెళ్లుంటారు కదా.ఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారు.మీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయట పెట్టే ధైర్యం ఉందా?.తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారు.టెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సరఫరా చేశారు.బిల్లులు ఆలస్యమైతే బోర్డు ముందుకు తెచ్చి మరీ బిల్లులు తెచ్చుకున్నారు.2024-26 వరకు తిరుమలలో ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా?.మండలిలో సంచలన విషయాలను బయటపెట్టిన తూమాటి. టీడీపీ ఎమ్మెల్సీపై చైర్మన్ ఆగ్రహం..టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధపై మండలి చైర్మన్ ఆగ్రహంసభలో వైఎస్సార్సీపీ నేతలను నిందితులుగా చదివిన అనురాధఈ క్రమంలో మీరు ఏమైనా.. పోలీసా, సీబీఐ అధికారా అంటూ చైర్మన్ ఆగ్రహంమండలిలో ఉద్రిక్తత.. ఏపీ శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుల రచ్చ..లడ్డూపై చర్చ జరగకుండా అధికార పార్టీ సభ్యుల జులుం.పోడియం దగ్గర అధికార పార్టీ సభ్యుల రచ్చ. మండలి చైర్మన్ ఆగ్రహం..తన మైక్ కట్ చేస్తున్నారంటూ చైర్మన్ ఆవేదన.మండలి ప్రతిష్ట నిలబడేలా చర్చ జరగాలన్న చైర్మన్.చర్చ ప్రారంభమైన 20 నిమిషాల్లో 17 సార్లు అడ్డుపడిన మంత్రులు.పర్వతనేని మాట్లాడుతుండగా నిమిషానికోసారి అడ్డుకున్న మంత్రులు.రూల్స్ మాట్లాడుతున్నామంటూనే వాస్తవాలు బయటకు రాకుండా మంత్రుల అరుపులు. మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్సీపీ లడ్డూపై చర్చను పదేపదే అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు.హెరిటేజ్, ఇందాపూర్ బంధంపై చర్చకు టీడీపీ సభ్యుల అభ్యంతరం.వైఎస్సార్సీపీ సభ్యులు ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుంటున్న పయ్యావుల.హెరిటేజ్ ప్రస్తావన రాకుండా పదేపదే అడ్డుకుంటున్న మంత్రులు.వాస్తవాలు బయటకు రాకుండా మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్సీపీ భోలే బాబా డెయిరీ ఎక్స్లెంట్ అంటూ పర్మిషన్ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే.అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు.ఫ్లెక్సీలు వేసి దేవుడిని రోడ్డుపైకి తెచ్చారు.2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హెరిటేజ్ దగ్గర మజ్జిగ కొనుగోలు చేసింది.ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ పాల్గొనలేదని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. మంత్రుల అత్యుత్సాహం..లడ్డూపై వాస్తవాలు బయటకు రాకుండా పదేపదే మంత్రులు అడ్డుకుంటున్నారు.హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారం బయటకు రాకుండా మంత్రుల అడ్డగింత.సంఘం డెయిరీ, వైష్ణవీ డెయిరీ వ్యవహారం ప్రస్తావనకు రాగానే మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు అడ్డగింత.లడ్డూపై మండలిలో చర్చ.. మంత్రుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కామెంట్స్..ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ యూనిట్.ఈ అంశంలో పెద్ద ఆర్ధిక కుట్ర దాగి ఉంది.ఆర్థిక కుంభకోణం బయటకు రాగానే హెరిటేజ్ వైబ్సైట్ నుంచి ఇందాపూర్ డెయిరీని కోమ్యానుఫ్యాక్చరింగ్గా మార్చేశారు.ప్రతీ మాట, ప్రతీ పదం ఆధారాలతోనే మాట్లాడుతున్నాను.కల్తీ నెయ్యి సరఫరా చేయడం వల్లే ఇందాపూర్ డెయిరీ తిరస్కరణకు గురైంది.టీడీపీ ప్రభుత్వంలోనే ఏఆర్ డెయిరీ నుంచి నాలుగు ట్యాంకర్లు వచ్చాయి.ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది.లడ్డూ ప్రసాదంపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది.స్వయంగా సీఎం చంద్రబాబే అబద్ధాలు చెప్పారు.టీడీపీ ప్రభుత్వంలో కల్తీ జరిగితే వైఎస్సార్సీపీకి అంటగట్టాలని చేస్తున్నారు.రాజకీయ లబ్ధిగా మొదలైన కుట్ర.. ఆర్థిక కుంభకోణంగా బయటకు వచ్చింది.నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యితో లడ్డూలు చేసింది కూటమి ప్రభుత్వంలోనే.మంత్రి గారు పదేపదే మా గొంతు నొక్కుతున్నారు.ఏఆర్ డెయిరీ ట్యాంకర్లను వైష్ణవి డెయిరీ పేరుతో టీటీడీకి పంపారు.సంగం డెయిరీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లది.కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి?.తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను ఎవరి ఒత్తిడితో అనుమతించారు?.సీబీఐ చార్జ్షీట్లో క్లియర్గా ఎటువంటి జంతు కొవ్వు లేదని చెప్పింది.ఫిర్యాదును పట్టుకుని సీబీఐ రిపోర్టు అంటూ ప్రచారం చేస్తున్నారు. చర్చ ప్రారంభించిన వెంటనే పర్వతరెడ్డిని అడ్డుకున్న మంత్రి అచ్చెన్నాయుడు.చంద్రబాబు అనలేదంటూ మండలి సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలు.పర్వతరెడ్డి ప్రసంగానికి పదేపదే అడ్డుతగులుతున్న మంత్రులు.పర్వతరెడ్డి చర్చ మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లోనే ఐదు సార్లు అడ్డుకున్న మంత్రులు.పర్వతరెడ్డి ప్రసంగాన్ని పదే పదే అడ్డుకుంటున్న మంత్రి పయ్యావుల. మంత్రి అచ్చెన్నాయుడు ఓవరాక్షన్..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలపై మంత్రి అచ్చెన్నాయుడు నోటి దురుసుఓపిక లేకపోతే పో.. అంటూ దురుసు వ్యాఖ్యలుఅచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీల ఆగ్రహం లడ్డూపై చర్చకు ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్సార్సీపీప్రభుత్వం భయంతోనే సభలో గందరగోళం సృష్టించాలని చూస్తోంది.చైర్మన్ సీరియస్.. మంత్రుల వాదనలతో నేను ఏకీభవించడం లేదు: చైర్మన్తిరుమల లడ్డూ విషయం చాలా సున్నితమైనది.లడ్డూ ప్రసాదంపై చర్చ చాలా మర్యాదగా, గౌరవప్రదంగా జరగాలి. మండలిలో మంత్రుల రగడ.. చర్చ కంటే ముందు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని మంత్రి పయ్యావుల మెలిక.చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేయవచ్చన్న చైర్మన్.చైర్మన్తో మంత్రుల వాగ్వాదం.మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: చైర్మన్నేను తప్పు చేస్తున్నా అనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.కొత్త సాంప్రదాయం తీసుకు రావద్దన్న మండలి చైర్మన్. చైర్మన్ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అధికార సభ్యుల గందరగోళం. తిరుమల లడ్డు ప్రసాదంపై మండలిలో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర.ముందుగా స్టేట్మెంట్ ఇస్తామని ప్రభుత్వం పట్టు.స్వల్పకాలిక చర్చలో స్టేట్మెంట్ అనేది ఉండదు: చైర్మన్మండలి నిబంధనలపై చైర్మన్ మాట్లాడుతుండగా అడ్డుకుంటున్న మంత్రులు. మండలిలో తిరుమల లడ్డుపై చర్చ.. మండలిలో లడ్డుపై చర్చకు చైర్మన్ అనుమతి. మండలి చైర్మన్తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల భేటీ..శాసనమండలి చైర్మన్తో భేటీ అయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుతిరుమల లడ్డుపై మండలిలో చర్చకు మండలి చైర్మన్ అనుమతిప్రశ్నోత్తరాలు ముగిసిన తరవాత తిరుమల లడ్డుపై చర్చముందుగా వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత.. ప్రభుత్వం స్టేట్మెంట్ పాస్ చేసేలా నిర్ణయంగతవారం లడ్డుపై చర్చ సందర్భంగా ప్రభుత్వం ముందు స్టేట్మెంట్ పాస్ చేయడంపై అభ్యంతరం తెలిపిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలునేడు తిరుమల లడ్డుపై చర్చకు ఆమోదం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై అరుణ్ కుమార్ ప్రశ్న..అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై రైతుల అభ్యంతరాలను సభలో ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..భూసేకరణపై అభ్యంతరాలకు తక్కువ సమయం ఇచ్చారుగ్రామసభలు, ప్రజాభిప్రాయసేకరణ పెట్టకుండానే భూ సేకరణపై ముందుకు వెళ్లారుభూ యజమానిని సంప్రదించకుండా భూములు తీసుకోవడం సరికాదుగెజిట్లో 140 మీటర్ల రోడ్డును 250 మీటర్లు చేశారుబఫర్ జోన్ను 500 మీటర్లు చేశారుదేశంలో ఎక్కడా ఔటర్ రింగ్ రోడ్డుకి ఇలా చేయలేదుమార్కెట్ రేట్ ప్రకారం గత మూడేళ్లలో ఎంత ఎక్కువ ఉంటే అంత ఇవ్వాలికానీ అలా ఫాలో అవ్వడం లేదుసేకరించిన భూమిని వినియోగించకపోతే తిరిగి వెనక్కి ఇచ్చేయాలి..ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదుఅమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను రద్దుచేయాలి2013 భూ సేకరణ చట్టం ప్రకారం కొత్త గెజిట్ ను విడుదల చేయాలి.. రైతులను ఆదుకోవాలిమండలి సమావేశాలు ప్రారంభం..ప్రారంభమైన శాసన మండలి సమావేశాలుప్రశ్నోత్తరాలు ప్రారంభం -
మద్యం మత్తులో కానిస్టేబుల్పై యువకుల దాడి
కోడూరు: మద్యం మత్తులో కానిస్టేబుల్పై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ చాణిక్య మంగళవారం తెలిపిన కథనం మేరకు.. మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ జాతరలో పోలీసు కానిస్టేబుల్ పి.వేణుస్వామి విధులు నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా సోమవారం రాత్రి పిట్టల్లంక గ్రామానికి యువత డీజే ఏర్పాటు చేశారు. అయితే విశ్వనాథపల్లి గ్రామంలోకి వచ్చిన తరువాత డీజేకు సంబంధించిన సౌండ్ను తగ్గించాలని కానిస్టేబుల్ వేణుస్వామి నిర్వాహకులకు సూచించారు. మద్యం మత్తులో ఉన్న పిట్టల్లంక గ్రామానికి చెందిన యువకులు కోట మహేష్, కోట నరేష్ ‘మా డీజే సౌండ్ తగ్గించమంటావా’ అంటూ కానిస్టేబుల్ మెడ పట్టుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ వేణుస్వామిని తోటి పోలీసులు హుటాహుటినా అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇద్దరి యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు. గుడివాడరూరల్: ప్రమాదవశాత్తూ గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన మండలంలోని మోటూరు గ్రామంలో మంగళవారం జరిగింది. సుమారు 40 సంవత్సరాల వయస్సు గల మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి మోటూరు గ్రామంలోని పంచా యతీ చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న గుడివాడ తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు తాలూకా పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెనమలూరు: మండలంలోని పోరంకిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. పోరంకికి చెందిన జాస్తి శ్రీదేవి (48), దుర్గాప్రసాద్ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. దుర్గాప్రసాద్ నాలుగేళ్ల క్రితం మృతి చెందటంతో శ్రీదేవి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బెంగళూరులో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లిన శ్రీదేవి ఈ నెల ఒకటో తేదీన బయలుదేరి పోరంకికి వచ్చింది. సోమవారం ఇంట్లో బెడ్రూమ్లో శ్రీదేవి సీలింగ్ ప్యాన్కు ఉరివేసుకుని మృతి చెందింది. అదే ఇంట్లో ఉంటున్న అత్త జాస్తి ఝాన్సీ ఉరికి వేలాడుతున్న శ్రీదేవిని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మృతురాలి కుమార్తె మేఘనసాయి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ ఆదేశించారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో ఇంటి, నీటి పన్నుల వసూలు ఆయన మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా స్వర్ణ పంచాయతీ పోర్టల్ను పరిశీలించారు. ఇప్పటి వరకు వసూలు చేసిన పన్నులు, పెండింగ్లో ఉన్న పన్నులు, మొత్తం లక్ష్యంపై ఆరాతీశారు. సకాలంలో ఇంటి పన్నులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు సైతం తమ ఇంటి పన్నులు సకాలంలో చెల్లించేలా చూసుకోవాలని స్థానికులకు సూచించారు. మీరు చెల్లించే పన్నలుతోనే గ్రామాభివృద్ధి సాథ్యమవుతుందన్నారు. అధికారులు పాల్గొన్నారు. -
దాడులు చేయించేందుకా దశాబ్దాల అనుభవం?
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిఇబ్రహీంపట్నం: సీఎం చంద్రబాబు దశాబ్దాల అనుభవం ప్రతిపక్ష నేతలు, ప్రజలపై దాడులను ప్రోత్సహించేందుకేనా అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోందన్నారు. ప్రభుత్వమే నేర వ్యవస్థను సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. జోగి రమేష్ ఇంటి పై ఘటన వీడియోలను చూస్తే ప్రభుత్వం, పోలీసులు కనుసన్నల్లో ఆ దుశ్చర్య జరిగి తీరు అర్థమవుతోందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైనా ఇటువంటి దాడే జరిగిందన్నారు. దాడుల్లో మహిళలు కూడా పాల్గొని కొత్త చరిత్రకు నాంది పలికారని పేర్కొ న్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టడం చూస్తుంటే పోలీస్ వ్యవస్థ ఎటుపోతుందనే అను మానం కలుగుతోందన్నారు. చంద్ర బాబు ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి, అవసరమైన సాక్ష్యాన్ని సృష్టంచే సంస్కృతి తీసుకొచ్చారని విమర్శించారు. ఈ సంస్కృతి భవిష్యత్లో కొనసాగితే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వింటే టీడీపీ ప్రభుత్వ తీరు తెలిసిపోతుందన్నారు. బడ్జెట్ మొత్తం అసత్యాలేనని ఎద్దేవాచేశారు. ఎన్నికల ముందు ‘నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అన్నారు కదా, రూ.15 వేలు, రూ.18 వేలు, రూ.20 వేలు ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నారని, ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని గుర్తుచేశారు. టీటీడీ లడ్డూపై మండలిలో చర్చ జరగకుండా అడ్డుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వమేనని విమర్శించారు. లడ్డూ విషయంలో వాళ్లే స్క్రిప్ట్ రాశారు, వాళ్లే దర్శకత్వం, వాళ్లే ప్రొడక్షన్, వాళ్లే హీరో, వాళ్లే విలన్, వాళ్లే జోకర్ అన్నీ వాళ్లే కదా అని ఎద్దేవాచేశారు. -
ఘనంగా నెమలి వేణుగోపాలుని కల్యాణం
గంపలగూడెం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం నయనానందకరంగా జరిగింది. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలుడి కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రాజగోపాలాచార్యులు, పరాశరం విఖనసాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. 250 మంది దంపతులు పీటలపై కూర్చున్నారు. కల్యాణ వేడుకలు తిలకించేందుకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తిరువూరు, మధిర ఆర్టీసీ డిపోలు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపాయి. ఆలయ సహాయ కమిషనర్ సంధ్య, దేవాలయ పాలకమండలి చైర్మన్ కావూరి శశిరేఖ, కమిటీ సభ్యులు కొండపల్లి కొండలరావు, గరిడేపల్లి వెంకటరమణ, మోదుగు సుహాసిని పర్యవేక్షించారు. ఏసీపీ ప్రసాదరావు, తిరువూరు సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయ అధికారులు పదివేల మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మధురానగర్(విజయవాడసెంట్రల్): దేవాలయాల్లో రాజకీయాలు తగవని, సనాతన ధర్మాన్ని చంద్రబాబు ప్రభుత్వం మంటకలు పుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య సోమవారం జరిగిన వివాదం హిందు వుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య జరుగుతున్న రాజకీయ గొడవలకు నెమలి వేణుగోపాల స్వామి కల్యాణం వేదికవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆలయాల్లో రాజకీయపరమైన ఘర్షణలు తలెత్తడం సర్వసాధార ణంగా మారిందని విమర్శించారు. భగవంతునికి భక్తితో సమర్పించే పట్టువస్త్రాల విషయంలో పదివేల మంది భక్తులు, అర్చక స్వాముల మధ్య ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఘర్షణ జరగటం దారుణమన్నారు. భక్తి భావంతో ఉండాల్సిన వేడుకలో తోపులాటలు, ఘర్షణలకు దేవస్థానం వేదికగా మారటం ఏమిటని ప్రశ్నించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మంగళవారం తెలిపారు. వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జరిపిన దాడుల్లో 15 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణకు చెందిన గోదాంలో సుమారు 15 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ బియ్యాన్ని తదుపరి చర్యలు నిమిత్తం కంచికచర్ల ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించినట్లు చెప్పారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న ఎనిమిది వాహనాలను వీరులపాడు పోలీస్ స్టేషన్కు అప్పగించామని వివరించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని, నివేదికల ప్రకారం సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిరంతర తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ నిల్వలపై జరిపిన దాడిలో డీఎస్వో పి.వాణి, ఏఎస్ఓ వి.శ్రీనివాస్, డెప్యూటీ తహసీల్దార్లు బి.రామకృష్ణ, సీహెచ్. సుమతి, ఆర్ఐ కె.కిషోర్, స్థానిక వీఆర్వోలు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరిపై అక్రమ కేసు నమోదు లబ్బీపేట(విజయవాడతూర్పు): మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్స్టేషన్లో అక్రమ కేసు నమోదైంది. ఏపీ మద్యం రవాణా కాంట్రాక్ట్పై సిట్ నమోదు చేసిన కేసు నుంచి తమను తప్పించాలని సిట్ విచారణాధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. -
దుర్గమ్మకు కానుకగా బంగారు బిస్కెట్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయ వాడకు చెందిన భక్తుడు మంగళవారం సుమారు వంద గ్రాముల బంగారు బిస్కెట్ను కానుకగా సమర్పించారు. నగరంలోని చెరువు సెంటర్కు చెందిన దొడ్ల నారాయణరావు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్ర కీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు రూ.16.87 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు బిస్కెట్ను అమ్మ వారికి కానుకగా సమర్పించారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి దాతకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. పెనుగంచిప్రోలు: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 7.30 గంటలకు పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ ఆలయ తలుపులను కవాట బంధనం చేసి మూసి వేశారు. తిరిగి బుధవారం ఉదయం 5.30 గంటలకు గోపూజ, ఆలయ పరిసరాలు ఽశుద్ధి చేసి సంప్రోక్షణ అనంతర భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు గోపీబాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నందిగామ టౌన్: చాలీచాలని వేతనాలతో అవస్థ పడుతున్నామని కనీస వేతనాలు అందించాలని అడిగినందుకు అక్రమ అరెస్ట్లు చేయటమేంటని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కల్యాణ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కటారపు గోపాల్ పేర్కొన్నారు. విజయవాడలో శాంతియుత నిరసన చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కార్యకర్తలు మంగళవారం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన తెలిపారు. తొలుత గాంధీ సెంటర్ నుంచి రైతుపేట వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. సమస్యలు పరిష్కరించి ఆదుకోవడంతో పాటు కనీస వేతనాలు అందించాలని అడిగిన అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని.. మొండిగా వ్యవహరిస్తే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోపీనాయక్, సయ్యద్ ఖాసిం, అంగనవాడీ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు సరళ, వెంకట్రావమ్మ, సుజాత, వేణు, పుల్లమ్మ, మహాలక్ష్మీ, పిచ్చమ్మ, అపర్ణ, లక్ష్మీ, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
అన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు మంగళవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. నగరంలో ఏలూరు రోడ్డులోని ఆదిత్య డెంటర్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ బి.రాజీవ్, ప్రశాంతి లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈవారంలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్ టికెట్లు కేవలం అధికారిక వెబ్సైట్ల్లోనే అందుబాటులో ఉంటాయని, ఇతర అనధికారిక వెబ్సైట్లను నమ్మవద్దని హెచ్చరించారు. హాల్ టికెట్లను www. bre.ap.gov.in వెబ్సైట్, వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర 95523 00009 లేదా లీప్ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేసి, హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
డ్రగ్స్, గంజాయి మాఫియాను అరికడదాం
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో రోజురోజుకు చెలరేగుతున్న డ్రగ్స్, గంజాయి మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, ప్రజానీకం కృషి చేయాలని, యువత భవిష్యత్తును కాపాడాలని రౌండ్టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ‘గంజాయి వద్దు – ఆరోగ్యం ముద్దు’ నినాదంతో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా, పీఎన్ఎం, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న అధ్యక్షతన ప్రజా సంఘాల రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.లక్ష్మణరావు, ఐద్వా జాతీయ నాయకులు డి.రమాదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందన్నారు. వాటి ప్రభావంతో యువతలో నేర ప్రవృత్తి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ ఇలా ఎక్కడ పడితే అక్కడే విచ్చలవిడిగా చాక్లెట్, బిస్కెట్, టాబ్లెట్ల రూపంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈగల్ నివేదిక ప్రకారం ఒక్క సంవత్సరంలోనే 836 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్, ఎంబీవిజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. డ్రగ్స్ మాఫియాను నిర్మూలించేందుకు నిష్పక్షపాతంగా కఠిన చట్టాలు అమలు చేయాలని, విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్కుమార్, సామాజిక న్యాయ సంక్షేమ సంఘం చైర్మన్ బాలకోటయ్య, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు గోళ్ల నారాయణరావు, డాక్టర్ ఎం.సూర్యనారాయణ, శ్రీనివాస్, లంక గోవిందరాజు, ఆండ్ర మల్యాద్రి, విజయ్ ప్రకాష్, ఎ.సూర్యారావు పాల్గొన్నారు. ప్రజాసంఘాల రౌండ్టేబుల్ సమావేశం పిలుపు -
విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా
నందిగామ రూరల్: ఈత సరదా ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మండలంలోని కొండూరు గ్రామ సమీపంలోని కూచి వాగు వద్ద మంగళవారం జరిగింది. కొండూరు గ్రామానికి చెందిన బెల్లంకొండ లక్ష్మణరావు, అనూష దంపతులు వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దినకరన్ (15) మాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి, రెండో కుమారుడు దినేష్ ఏడో తరగతి చదువుతున్నారు. హోలీ పండుగ సందర్భంగా మంగళవారం పాఠశాలకు సెలవు కావటంతో ప్రభు కిషోర్, బంశీ, చరణ్, కుమార్తో పాటు మరో నలుగురు స్నేహితులతో కలిసి దినకరన్ కొండూరు–మాగల్లు గ్రామాల మధ్య ఉన్న కూచి వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో దినకరన్ వాగులోని గుంతలో మునుగుతుండటాన్ని స్నేహితులు గమనించి కేకలు వేశారు. చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకుని దినకరన్ను బయటకు తీసి నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దినకరన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దినకరన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదించారు. పట్టణంలోని మార్చురీ వద్దకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
త్రిశూలధారిణిగా నాంచారమ్మ
కోడూరు: కృష్ణాతీరంలోని విశ్వనాథపల్లి గ్రామం జనజాతరతో పోటెత్తింది. అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ప్రధాన జాతరను పురస్కరించుకొని మంగళవారం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తజనం పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు పోటెత్తారు. అమ్మ వారి పుట్టింటివారైన గుంటూరు, ప్రకాశం జిల్లాల భక్తులు నాంచారమ్మ తల్లి దర్శనానికి బారులు తీరారు. హైదరాబాద్, ఉభయగోదావరి, నల్లగొండ, బెంగళూరు, విజయవాడకు చెందిన భక్తులు కూడా ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వృత్తిరీత్యి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు కూడా విశ్వనాథపల్లికి చేరడంతో ప్రతి ఇంటా పండుగ శోభతో ఉట్టిపడింది. కృష్ణానది వద్ద ఏర్పాటు చేసిన రెండ్లు ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నాంచారమ్మ తల్లికి ఒడుగంటి బియ్యం సమర్పించి ఆలయం వెనుక భాగంలో కదలకుండా అమ్మ నామస్మరణతో ప్రాణాచారం చేస్తే సంతానభాగ్యం కలుగుతుందని మహిళల ప్రగాఢ విశ్వాసం. దీంతో మహిళలు ఈ ప్రాణాచారం చేసి అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ప్రాణాచారం చేస్తున్న మహిళలపై భక్తులు పసుపు, కుంకుమ చల్లుతూ దీవెనలు అందించారు. కొంతమంది భక్తులు తమ పిల్లలను ఆలయం ఎదుట ధ్వజ స్తంభానికి కట్టిగా, మేనమామ వరుసవారు వేలం ద్వారా విడిపించుకున్నారు. పాలపొంగళ్లు, పట్టువస్త్రాలు, చీరలు, నైవేద్యాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. యువకులు డప్పువాయిద్యాల నడుమ కోళ్లు, మేకపోతలను ఊరేగించి సమీప పోలాల్లో కుటుంబసమేతంగా సహపంక్తీ భోజనాలు చేశారు. చంద్రగ్రహణం నేపథ్యంలో నాంచారమ్మ అమ్మవారి ఆలయాన్ని దేవాదాయ అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. గ్రామోత్సవంలో ఉన్న చిన్న అమ్మవారిని కూడా ఆలయ ప్రవేశం చేయించారు. పండితులు శాస్త్రోక్తంగా పూజలు గర్భాలయానికి తాళాలు వేశారు. రాత్రి ఎనిమిది గంటలకు సంప్రోక్షణ చేసి ఆలయ తలుపులు తెరిచి భక్తులకు యథావిధిగా దర్శనం కల్పించారు. ఆలయ ఈఓ తిక్కిశెట్టి వీరవెంకటమోహనరావు, ఆలయ కమిటీ చైర్మన్ తోట సూర్య నరసింహారావులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంతానం కోసం ప్రాణాచారం ఆలయం మూసివేత జాతర నేపథ్యంలో నాంచారమ్మ మూలమూర్తిని త్రిశూలధారిగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, భక్తుల సమర్పించిన చీరాలు, గాజులు, పూలదండలతో ముస్తాబు చేశారు. తల్లి దివ్యస్వరూపాన్ని తిలకించి భక్తులు పరవశించారు. క్యూలైన్లు మొత్తం భక్తజనంతో కిటకిటలాడాయి. మూలమూర్తిని భక్తులు స్వయంగా తాకే అవకాశభాగ్యం ఉండడంతో పలువురు భక్తులు బంగారు మంగళసూత్రాలు, అభరణాలను సమర్పించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వమే కల్తీ మయం
మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఇబ్రహీంపట్నం: చంద్రబాబు ప్రభుత్వమే కల్తీలకు నిలయంగా మారిందని రాయచోటి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన్ను మంగళవారం శ్రీకాంత్రెడ్డి పరామర్శించారు. దాడి జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ను గద్దె దింపినప్పటి నుంచి ప్రజాబలం లేని చంద్ర బాబు మేనేజ్డ్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. జోగి రమేష్, అంబటి రాంబాబు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇళ్లపై పోలీసులే దగ్గరుండి దాడులు, హింసను ప్రోత్సహించడం ఏమి సంస్కృతి అని ప్రశ్నించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక దాడులు చేసిన వారిని విడిచిపెట్టబోమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీచర్లకు 27 శాతం ఐఆర్ ఇచ్చారని, ఇంతవరకు ఐఆర్, పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సచివాలయ వ్యవస్థ జగన్మోహన్రెడ్డి మానస పుత్రిక కాబట్టే నిర్వీర్యం చేయాలని చర్యలు చేపట్టారని దుయ్యబట్టారు. గతంలో తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం కూల్చేసిన చంద్రబాబే లడ్డూ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సనాతన ధర్మం అంటూ ఊగిపోయారని ఎద్దేవాచేశారు. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ లడ్డూలో జంతు కొవ్వు లేదని తేల్చిందన్నారు. -
నేటి నుంచి తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల
పెనుగంచిప్రోలు: భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల ఉత్సవాలు బుధవారం నుంచి ఎనిమిదో తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. తిరునాళ్ల ఉత్సవాలకు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, నల్గొండ జిల్లాల నుంచే కాక ఉభయగోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్బాబు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బుధవారం ఉదయం 6.19 గంటలకు అఖండ జ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవుతాయి. ఐదో తేదీ రాత్రి 7.02 గంటలకు ఉత్సవమూర్తుల రథోత్సవం, ఆరో తేదీ రాత్రి 10.02 గంటలకు 90 అడుగుల దివ్య ప్రభోత్సవం, ఏడో తేదీ రాత్రి 7.32 గంటలకు తిరునాళ్లల్లో ప్రధాన ఘట్టమైన శ్రీతిరుపతమ్మ అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు– కుంకుమల బండ్లు పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటాయి. మార్చి ఎనిమిదో తేదీ ఉదయం 5.30 గంటలకు భక్తుల బోనాల సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయి. వేసవి తీవ్రత దృష్ట్యా చిన్నతిరునాళ్లలో తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఇన్చార్జీ ఈఈ భాస్కర్ తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయం చుట్టూ నాలుగు ఆర్ఓ ప్లాంట్లు నిత్యం భక్తులకు శుద్ధజలాన్ని అందిస్తాయన్నారు. వాటర్ ప్యాకెట్ల పంపిణీతోపాటు, ఆలయం చుట్టూ చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పుణ్య స్నానాల కోసం మునేరులో 300 షవర్లు ఏర్పాటు చేశామని, తాత్కాలికంగా మరుగుదొడ్లను సిద్ధం చేశామని వివరించారు. -
అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించండి
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): సమాజంలో పెరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కవి, రచయిత, సామాజిక విశ్లేషకులు జి. లక్ష్మీ నరసయ్య పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రథమ జాతీయ మహాసభలు మంగళవారం విజయవాడ సింగ్నగర్ గుజ్జల సరళ దేవి ఫంక్షన్ హాల్లో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పీడీఎస్యూ జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ రామకృష్ణ పీడీఎస్యూ బిగి పిడికిలి జెండాను ఆవిష్కరించారు. ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు పి.టాన్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ ఘాయల్, పరిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ కోశాధికారి ఎల్ .భాను సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ జాతి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఇ .విజయ్ కన్నా, యు. గనిరాజు తదితరులు పాల్గొన్నారు. -
పట్టు కోల్పోయారు!
చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వెలివోలు గ్రామానికి చెందిన చీడేపూడి లంకలో సొసైటీ కింద దళితులు పొలాలు సాగుచేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం 80 మంది రైతులు 92 ఎకరాల్లో పట్టు పురుగుల పెంపకాన్ని చేసేవారు. రూ.15వేల నుంచి రూ.20వేల పెట్టుబడితో కేవలం రెండు నెలల వ్యవధిలో ఎకరాకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకూ లాభాలు పొందేవారు. రెండేళ్లుగా సంబంధిత శాఖ అధికారులు ప్రయివేటు వ్యక్తుల నుంచి పట్టు గుడ్లను కొని సరఫరా చేయడంతో నాణ్యత లోపించి పట్టు గూళ్లు తయారు కాకముందే పురుగులు చనిపోతున్నాయని ఈ ప్రాంత రైతులు వాపోతున్నారు. మార్కెట్లో వీటిని ఎవరూ కొనకపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు చెబుతున్నారు. తగ్గుతున్న సాగు ఈసారైనా లాభాలు రాకపోతాయా అని రైతులు ఆశపడటం, ఎన్నిసార్లు చెప్పినా అధికారులు అవే నకిలీ గుడ్లను పంపించడంతో రెండేళ్లలో ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయామని రైతులు వాపోతున్నారు. క్రమంగా పట్టుసాగుచేసేవారి సంఖ్య రెండేళ్లలో 80 నుంచి 12 మంది రైతులకు చేరింది. పట్టు సాగుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమ పూర్తిగా అంతరించిపోయినట్లేనని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ స్పందన లేక, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పట్టుపరిశ్రమ ఈ దుస్థితికి చేరిందని ఆరోపిస్తున్నారు. లాభాలతో కళకళలాడుతుండే పట్టు పరిశ్రమ రెండేళ్లుగా వెలవెలబోతోంది. అధికారులు నాణ్యతలేని పట్టు గుడ్లును సరఫరా చేయడం, గూళ్లు తయారయ్యే దశలో పురుగులు చనిపోవడంతో ‘చల్లపల్లి’ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు తరచూ.. అవే గుడ్లను సరఫరా చేయడంతో రైతులు క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చివరికి పట్టు పురుగుల పెంపకంపై రైతులకు ఆసక్తి తగ్గుతోంది. నాణ్యతలేని పట్టు గుడ్లు ఇస్తున్నామనేది రైతుల అపోహ మాత్రమే. ఆరోగ్యకరమైన ఆహారం అందించకపోవడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో పట్టు పురుగులు చనిపోతున్నాయి. –ఐ.శ్రీనివాసరావు, ఉమ్మడి కృష్ణాజిల్లా సెరికల్చర్ అధికారి -
అద్భుతంగా నిర్వహిద్దాం
కుంభాభిషేకాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు జరగనున్న కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా, అద్భుతంగా నిర్వహిద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కుంభాభిషేకం మహోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఆలయ ఈవో వీకే శీనానాయక్ తదితరులు సమావేశంలో కుంభాభిషేక కార్యక్రమాలపై చర్చించారు. సామాన్యు భక్తులకు పెద్ద పీట కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కుంభాభిషేకానికి మొదటి రెండు రోజులు లక్ష మంది చొప్పున, మూడో రోజున 1.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్నారు. క్యూతో పాటు అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన పాయింట్లలో తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, శానిటేషన్ ఏర్పాట్లు ఉండాలన్నారు. క్యూలైన్లలో తాగునీరు, మజ్జిగతో పాటు పులిహోర వంటివి అందించాలని ఆదేశించారు. జల్లు స్నానాల ఏర్పాట్లతో పాటు సెక్టార్ల వారీగా అధికారులు, సిబ్బంది బృందాలను నియమించాలని సూచించారు. వైద్య సేవల శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సమన్వయ శాఖల అధికారులు, సిబ్బందితో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థను క్రియాశీలకం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ భక్తుల భద్రతకు భరోసా కల్పిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈవో వీకే శీనానాయక్.. కుంభాభిషేక విశిష్టత, మూడు రోజుల ప్రత్యేక కార్య క్రమాలు, భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. మార్చి 6న యాగశాలలో ఉదయం 8 గంటలకు జరిగే యాగశాల ప్రవేశం దగ్గర నుంచి 8వ తేదీన ఉదయం 9:34 గంటలకు ప్రధాన ఆలయ ప్రాంగణంలో జరిగే కుంభాభిషేకం క్రతువు వరకు కార్యక్రమాలను వివరించారు. పవిత్ర కార్యక్రమం కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి కరకమలములతో జరుగుతుందన్నారు. మూడు రోజులు ఉచిత దర్శనాలు ఉంటాయని, అంతరాలయం దర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేస్తామని ఈవో వీకే శీనానాయక్ వివరించారు. సమావేశంలో విజయవాడ ఆర్డీఓ టి.వి.సతీష్, ఆలయ ఈఈలు ఎల్.రమ, కోటేశ్వరరావు, అడిషనల్ డీసీపీ జి.రామకృష్ణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఓపెన్ డీల్!
ఇంటర్ ఓపెన్ పరీక్షల్లో కొన్ని స్టడీ సెంటర్ల నిర్వాహకులు దందాకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సెంటర్ల నిర్వాహకులు పరీక్షలు పాస్ చేయిస్తామంటూ ‘డీల్’ కుదుర్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి బదులు మరొకరిని పరీక్షలు రాయించడానికి పంపుతున్నారు. దీనికి నిదర్శనం పరీక్షల మొదటి రోజే అధికారులు ముగ్గురిని పట్టుకోవడం. అక్రమార్కుల దందా బట్టబయలైనా సంబంధిత శాఖ అధికారుల్లో స్పందన కానరావడం లేదు. దీనిలో ఉన్నతాధికారులకూ భాగముందనే ఆరోపణలు వస్తున్నాయి. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్ ఓపెన్ పరీక్షల్లో పలు స్టడీ సెంటర్ల నిర్వాహకులు ‘డీల్’ కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు పలు స్టడీ సెంటర్లు ‘ఓపెన్’గా దందాకు పాల్పడుతున్నాయి. లక్షలాది రూపాయలను దండుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మాస్ కాపీయింగ్, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసేందుకు నిర్వాహకులు ఒప్పందాలు కుదర్చుకొని లక్షలాది రూపాయాలు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి దందాలకు సంబంధించి పలు స్టడీసెంటర్ల నిర్వాహకులు బహిరంగంగానే వీటిపై డీల్స్ మాట్లాడుకొని వసూళ్లకు తెగిస్తున్నారని పలువురు విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకూ జరుగుతాయి. జిల్లాలో పరీక్ష రాస్తున్న 1,288 మంది.. ఇంటర్ ఓపెన్ కోర్సులకు ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది సుమారుగా 1,288 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీటికి సంబంధించి జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా జిల్లాలో సుమారుగా 30కు పైగా వివిధ స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలకు హాజరుకావాలని భావించే విద్యార్థులు అధిక శాతం మంది ఆయా స్టడీ సెంటర్లను ఆశ్రయించి డబ్బులు చెల్లిస్తుంటారు. వాటి నిర్వాహకులు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి అడ్మిషన్లు కడుతుంటారు. స్టడీసెంటర్లు తప్పనిసరిగా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడా పూర్తి స్థాయిలో తరగతులు జరిగిన దాఖలాలు లేవు. పాస్ గ్యారెంటీ పేరుతో దందా.. ఇంటర్మీడియెట్ పాస్ గ్యారెంటీ పేరుతో ఆయా స్టడీ సెంటర్ల నిర్వాహకులు కొందరు.. అధికారులతో కుమ్మకై దందాలకు పాల్పడుతున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల్లో అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని సబ్జెక్ట్లు రాయకుండా పాస్ చేయిస్తామని, మీకు బదులు వేరే వ్యక్తులతో పరీక్ష రాయిస్తామంటూ డీల్ కుదుర్చుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. వీరు కొన్ని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొని అక్రమాలకు పాల్పడుతుంటారని ప్రచారం జరుగుతోంది. నగరానికి చెందిన ఒకరిద్దరు ప్రముఖ స్టడీ సెంటర్ల నిర్వాహకులు, చక్రం తిప్పుతుంటారని, లక్షలాది రూపాయాలు వసూళ్లకు పాల్పడటంతో పాటు అధికారులను సైతం ప్రభావితం చేస్తుంటారని వినవస్తోంది. ఇలాంటి దందాలకు కొన్ని ప్రత్యేక కేంద్రాలు ఈ పరీక్షల దందాకు ప్రత్యేకంగా కొన్ని కేంద్రాలను అక్రమార్కులు ఎంచుకుంటున్నారు. విజయవాడ నుంచి 50, 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆ కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయిస్తుంటారు. విజయవాడకు చెందిన పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నందిగామ, జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసే కేంద్రాలకు హాజరవుతుంటారు. వీటిలో అక్రమాలు జరుగుతాయనే ప్రచారం ఉంది. దీన్ని తొలి రోజు జరిగిన పరీక్ష నిజం చేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడాది ఓపెన్ స్కూల్ పరీక్షలను నాటి డీఈవో చాలా వరకూ నిలువరించారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో ఉన్న కేంద్రాల్లో ఏదో ఒక బృందం తనిఖీ చేసే విధంగా చూడటంతో పరీక్షలు సజావుగా జరిగాయి. దాదాపు పరీక్ష ఫలితాలు పది శాతం కన్నా తక్కువ వచ్చాయంటే ఎగ్జామ్స్ చక్కగా జరిగినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఈ ఏడాది అధికారులు మారడంతో అక్రమార్కులు తమ దందాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా తొలి రోజు ముగ్గురు బయట వ్యక్తులు లోపలకు వచ్చి పరీక్ష రాస్తున్నారంటే ఆ శాఖలోని అధికారుల హస్తాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తొలి రోజు నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు సంబంధించి అక్రమార్కులు చేపట్టిన దందా బట్టబయలైంది. పరీక్ష రాయాల్సిన ముగ్గురు అభ్యర్థుల కోసం వేరే వ్యక్తులు హాజరు కావడం జిల్లాలో సంచలనం సృష్టించింది. నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం రూమ్ నంబర్ నాలుగులో పరీక్ష రాస్తున్న విద్యార్థిని గమనించిన ఇన్విజిలేటర్ అనుమానంతో ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడే వెళ్లిన ఫ్లయింగ్ స్క్వాడ్ అతనిని పరిశీలిచి అసలైన అభ్యర్థి కాదని నిర్ధారించింది. అతనిపై నందిగామ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. అలాగే నందిగామలో శ్రీ విద్య ఉన్నత పాఠశాలలో ఇద్దరు అభ్యర్థుల బదులు వేరే వ్యక్తులు పరీక్ష రాయడానికి రావడంతో పరీక్ష గదిలో ముందుగానే పసిగట్టి వారిని నిలువరించారు. -
రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి
నాగాయలంక: మండలంలోని గుల్లలమోద ప్రధాన మార్గంలో పెదపాలెం అంబేడ్కర్ విగ్రహం సమీపంలో సోమవారం రెండు బైక్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన జన్ను రామాంజనేయులు (40) మృతి చెందాడు. నాగాయలంక ఎస్ఐ కలిదిండి రాజేష్ కథనం మేరకు.. రామాంజనేయులు ఏటిమొగ గ్రామం వెళ్తున్న సమయంలో ఎదురుగా ఈలచెట్లదిబ్బ గ్రామం నుంచి నాగాయలంక వైపు వస్తున్న చెన్ను నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ నాగ రాజు బైక్పై వస్తూ ఢీకొట్టారు. ఈ ఘటనలో రామాంజనేయులు తలకు తీవ్ర గాయాలయ్యాయి. నాగరాజు, నాగేశ్వరరావు కూడా గాయపడ్డారు. అందరినీ హుటాహుటిన 108 అంబులెన్స్ వాహ నంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామాంజనేయులును మెరుగైన చికిత్స నిమిత్తం మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లా లని అవనిగడ్డ వైద్యులు సూచించారు. అయితే బందరు ఆసుపత్రికి వెళ్ళేసరికి రామాంజనేయులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగతా ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వీడియో వైరల్: కేశినేని చిన్ని Vs కొలికపూడి.. మరో వివాదం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం నెమలి శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో వివాదం చోటుచేసుకుంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య పట్టు వస్త్రాల పంచాయితీ జరిగింది. కేశినేని చిన్ని చేతుల్లోని పట్టు వస్త్రాలను కొలికపూడి లాక్కున్నారు. కొలికపూడి చర్యతో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ నేతలు కంగుతిన్నారు. కొలికపూడిని ఎంపీ చిన్ని వర్గీయులు అడ్డుకోబోయారు. దీంతో ఒక్కసారిగా ఆలయ కమిటీ, భక్తులు అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడి చర్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు.కాగా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు ఇటీవల తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు పలు ఆరోపణలు చేసుకున్నారు. తన వద్ద ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నట్టు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. మరోవైపు, పార్టీలో తనకు జరుగుతున్న అవమానాల గురించి కొలికపూడి.. టీడీపీ అధిష్ఠానం వద్ద వాపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కేశినేని చిన్నిపై కొలికపూడి పోస్ట్లు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. గంపలగూడెం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ ఫోటోను పెడుతూ ‘బంగారు కొండ.. మానుకొండ’ అంటూ పోస్ట్ పెట్టారు కొలికపూడి.. వరుస పోస్టులు తిరువూరులో దుమారం రేపాయి. -
విద్యార్థుల ప్రయోగాత్మక అభ్యాసనకు సన్నాహాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజ్ఞాన శాస్త్రం(సైన్స్) పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు మాత్రమే కాకుండా వివిధ రంగాలలో కొత్త విషయాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(అప్కాస్ట్) వినూత్న కార్యక్రమం చేపట్టింది. విజయవాడ భవానీపురంలోని అప్కాస్ట్ రీజనల్ సైన్స్ సెంటర్ (ఆర్ఎస్సీ)ను సందర్శించిన విద్యార్థులు, సైన్స్ ఉపాధ్యాయులు ఇప్పటి వరకు ఉన్న అనేక ఎగ్జిబిట్స్ ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇకపై ప్రయోగాత్మకంగా అభ్యసించేందుకు(ప్రాక్టికల్ లెర్నింగ్) సుమారు రూ.20 లక్షలతో 12 కంటైనర్లను ఏర్పాటు చేస్తుంది. అందుకు భవానీపురంలోని రీజనల్ సైన్స్ సెంటర్ వేదిక కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వివిధ పరికరాలను ఆయా కంటైనర్లలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో కంటైనర్లో ఒక్కో థీమ్ (పరికరాలతో సహా)ను ఏర్పాటు చేయనున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే దిశలో సరికొత్తగా ఏర్పాటు చేస్తున్న కంటైనర్లు ఉపయోగపడనున్నాయి. -
విద్యాశాఖ కఠిన వైఖరి సరికాదు
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర విద్యాశాఖ అవలంభిస్తున్న కఠిన వైఖరి సరికాదని ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా టీచర్స్ ఫెడరేషన్ ఆర్థిక కార్యదర్శి జోసెఫ్ సుధీర్ బాబు విమర్శించారు. ఆదివారం మచిలీపట్నం ఎన్జీఓ హోంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ‘లీప్’ యాప్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయన్నారు. అనేక సందర్భాల్లో హాజరు సరిగా నమోదుకాకపోవడం, యాప్ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, ఆ లోపాలన్నింటినీ ఉపాధ్యాయులపై మోపడం తగదన్నారు. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దకపోతే ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే పదో తరగతి పరీక్ష విధుల కేటాయింపులో చోటుచేసుకున్న అసంబద్ధాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా శాఖ అధ్యక్షుడు పి. ఇమ్మానియేల్, ప్రధాన కార్యదర్శి యువీ కృష్ణమూర్తి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొమ్ము ప్రసాద్, సతీష్ బాబు, సీనియర్ నాయకులు ఎంవీఎస్ఎన్ ప్రసాద్, కిరణ్ బాబు, వీరబాబు పాల్గొన్నారు. ఏపీజేఏసీ కృష్ణా జిల్లా కో చైర్మన్గా లంకేశ్వరరావు -
మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మైలవరం/రెడ్డిగూడెం: మామిడి పంట తెగుళ్లు బారిన పడి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రెడ్డిగూడెం, మైలవరం మండలాల్లోని మామిడి తోటలను ఆదివారం రైతు సంఘం నాయకులు, రైతులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అమర్ భవన్లో ఎం.మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో మైలవరం, తిరువూరు ఎమ్మెల్యేలు నష్టపోతున్న మామిడి రైతుల గురించి చర్చించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు లక్షా ఇరవై వేలకు పైగా ఎకరాల్లో మామిడి పంట సాగు చేస్తున్న రైతులు పండించిన పంటకు నల్లదోమ, పేలు బారిన పడి పూర్తిగా మామిడి దెబ్బతినడం జరిగిందన్నారు. పంట నాణ్యత లేక దిగుబడి రాకపోవడంతో రైతులు మామిడి చెట్లను నరికేస్తున్నారని తెలిపారు. లక్షల రూపాయాలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, గత సంవత్సరంలో ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, రైతు సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకటరెడ్డి, పీవీ ఆంజనేయులు, జిల్లా నాయకులు వీరారెడ్డి, ధనలక్ష్మి, వి.వెంకటరెడ్డి, రావుల సుబ్బారావు, అప్పిరెడ్డి, కొండపల్లి పరమేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రికల్ ఎస్ఈగా రవీంద్రబాబు
మచిలీపట్నంటౌన్: విద్యుత్ శాఖ కృష్ణాజిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా పి.రవీంద్రబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్ఈగా పనిచేసిన వీవీ చిరంజీవి ఫిబ్రవరి 28వ తేదీ శనివారం ఉద్యోగ విరమణ చేయడంతో రవీంద్రబాబు ఉద్యోగోన్నతిపై బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎస్ఈ కార్యాలయంలోని ఆయన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రవీంద్రబాబు ప్రస్తుతం విజయవాడ నగర విద్యుత్ శాఖ డీఈగా పనిచేస్తూ ఉద్యోగోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలో కృష్ణా జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అంతరాయం లేకుండా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులు సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఈ రవీంద్రబాబుకు విద్యుత్ శాఖ మచిలీపట్నం ఈఈ జి.గోవిందరావు, అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఎన్టీఆర్ జిల్లా జేఏసీ ఏకగ్రీవ ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఏకగీవ్రంగా ఎన్నికై ంది. ఏపీ ఎన్జీఓ హోంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డీఎస్ఎన్ రెడ్డి, కో–చైర్మన్లుగా పి.రమేష్ (జిల్లా కార్యదర్శి, ఏపీఎన్జీఓ సంఘం), జి. అనుగ్రహ ప్రసాద్(రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం), రామకృష్ణ (రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ), ఉపాధ్యక్షులుగా జి. నారాయణరావు(పెన్షనర్ల సంఘం), ఎస్.కె. నవాబ్ జానీ(పీఆర్టీయూ), కె.ప్రభాకర్ (సివిల్ పెన్షనర్స్ సంఘం), జి.అజయ్ కుమార్ (మున్సిపల్ కార్పొరేషన్), ప్రధాన కార్యదర్శిగా ఎస్.డి.ఖాసిం (ఏపీటీ ఎఫ్–257), కార్యనిర్వహణ కార్యదర్శిగా జి.రామకృష్ణ (ఏపీఎన్జీఓల సంఘం) ఎన్నికయ్యారు. వీరితో పాటు సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
తలశిల చంద్రశేఖరరావుకు ఘన నివాళులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): శాసనమండలి సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు దశదిన కర్మ కార్యక్రమం గొల్లపూడిలోని రఘురాం నివాసం వద్ద ఆదివారం జరిగింది. ఎంపీ మిథున్రెడ్డి, సాక్షి దినపత్రిక సంపాదకులు ఆర్.ధనంజయరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, విడదల రజని, మేరుగ నాగార్జున, కొడాలి నాని, కురసాల కన్నబాబు. ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, ఎండీ రుహుల్లా, మొండితోక అరుణకుమార్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని తలశిల చంద్రశేఖరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, మేకా ప్రతాప్ అప్పారావు, వల్లభనేని వంశీమోహన్, ముదునూరి ప్రసాదరాజు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్సీ తలారి వెంకట్రావు, దేవభక్తుని చక్రవర్తి, కార్పొరేటర్లు, నగర నాయకులు పాల్గొని నివాళులర్పించారు. -
పొగ మంచు ఎఫెక్ట్.. గన్నవరంలో విమానాల చక్కర్లు
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా సోమవారం ఉదయం రెండు విమానాల ల్యాండింగ్కు అంతరాయం నెలకొంది. ఇస్తాంబుల్ నుండి వచ్చిన ప్రత్యేక విమానం, ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో, ప్రయాణికులు ఆందోళనకు గురైనట్టు సమాచారం. -
లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
వేదాద్రి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్ర పటం అందజేశారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు, ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్, విశ్వభారతి కళాశాల చైర్మన్ కొమరగిరి పద్మావతి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారం కోరుతూ ‘చలో కలెక్టరేట్’
మచిలీపట్నం అర్బన్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని కలెక్టరేట్లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.పోలినాయుడు మాట్లాడుతూ, జీతాల పెంపు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీఓలు 132, 142, 680లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ల విధానాన్ని రద్దు చేసి, హైకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలని కోరారు. బీవోఎంఎస్ నంబర్36 ద్వారా ప్రకటించిన వేతనాలను జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగానే పంచాయతీ కార్మికులు, ఎన్ఎంఆర్లు, గ్రీన్ అంబాసిడర్లకు నెలకు రూ.21వేల వేతనం ప్రభుత్వం నేరుగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అన్ని కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేసి, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ, పెన్షన్, సెలవులు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించడంతో పాటు బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎం.గణేష్, ఎం.ప్రభుశేఖర్, ఎం.జగన్, వి. శ్రీనివాసరావు, సీహెచ్.మౌనిక, ఎన్.నాగేంద్రమ్మ, పి. కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
సీజేఐ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
గన్నవరం: రాష్ట్ర పర్యటనలో భాగంగా మార్చి 1న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గన్నవరం విమానాశ్రయానికి విచ్చేస్తున్న సందర్భంగా అధికారులు శుక్రవారం ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి శ్యామలరావు విమానాశ్రయంలో విశ్రాంత భవనంలోని రిజర్వ్ లాంజ్, సెక్యూరిటీ చెక్, నిర్గమన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడుతో కలిసి శ్యామలరావు భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజేఐ తిరుపతి నుంచి విమానంలో ఆదివారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఇక్కడికి చేరుకుంటారని తెలిపారు. అమరావతి, విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీజేఐ తిరిగి ఎయిర్పోర్ట్కు చేరుకుని సాయంత్రం 6.30కు న్యూఢిల్లీ వెళ్తారని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి పర్యటనలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆయన ఆదేశించారు. వైద్య సహాయం కోసం అంబులెన్స్, సమీపంలోని ఆస్పత్రులను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎంఎల్కే రెడ్డి, టర్మినల్ ఇన్చార్జ్ అంకిత్ జైస్వాల్, ప్రొటోకాల్ డైరెక్టర్ మోహన్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రహ్మణ్యం పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వృద్ధ దంపతులపై సైబర్ వల
కోనేరుసెంటర్: ‘హలో.. నేను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారిని... మీపై పెద్ద అభియోగమే పడింది.. మేము చేసిన స్పెషల్ ఆపరేషన్లో నలుగురు ఉగ్రవాదులను పట్టుకున్నాం.. వారి మొబైల్లో మీ ఫోన్ నంబరుతో పాటు ఏటీఎం కార్డుకు సంబంధించిన లావాదేవీలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. సో మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు. ఈ విషయం మీకు మాకు తప్ప మరెవరికీ తెలియకూడదు.. తెలిస్తే మీకే సమస్య తరువాత మీ ఇష్టం’ అంటూ ఓ సైబర్ నేరగాడు కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ వృద్ధ జంటను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ నేరగాడి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన పెద్దిరెడ్డి హరినాథ్ (రిటైర్డ్ బెల్ కంపెనీ ఉద్యోగి) తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆయనకు ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. ఫోన్లో పోలీసు యూనిఫామ్ ధరించిన ఓ వ్యక్తి లైన్లోకి వచ్చి తాను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారి అని పూణే నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. మీపై సీబీఐ కోర్టులో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, ఇటీవల నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా వారి వద్ద మీ ఏటీఎం కార్డును గుర్తించినట్లు చెప్పాడు. మీ కార్డు ఉగ్రవాదుల వద్ద ఎందుకు ఉందంటూ గదమాయించాడు. దంపతులు ఇరువురు కంగారు పడటంతో మీరిద్దరు ఉగ్రవాదులకు సహకరించినట్లు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని ఆరోపిస్తూ ‘మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నాం’ అంటూ భయభ్రాంతులకు గురి చేశాడు. అలా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీడియో కాల్లోనే ఉంచి మానసిక ఒత్తిడికి గురి చేశాడు. అయితే బాధితుల ఇంట్లో అద్దెకు ఉంటున్న మణి అనే వ్యక్తి రిటైర్డ్ ఉద్యోగి పడుతున్న ఇబ్బందిని గమనించిన ఆరా తీయగా, ‘నేను డిజిటల్ అరెస్ట్లో ఉన్నాను’ అని హరినాథ్ చెప్పడంతో ఇది కచ్చితంగా సైబర్ నేరగాళ్ల మోసమేనని గ్రహించాడు. వెంటనే విషయాన్ని చిలకలపూడి పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ షేక్ అబ్దుల్ నభీ మరుక్షణమే బాధితుడి ఇంటికి చేరుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. సైబర్ నేరగాడితో మాట్లాడమని చెప్పి వీడియో కాల్ సంభాషణను గమనిస్తూ వచ్చాడు. బెదిరింపులు మితిమీరుతుండటంతో ఫోన్ వద్ద వెళ్లి అరే ఇడియట్ అంటూ మాట్లాడే ప్రయత్నం చేయగా కంగుతిన్న నేరగాడు ఫోన్ కట్ చేసి మాయమయ్యాడు. నేరగాళ్ల ఉచ్చు నుంచి కాపాడిన సీఐకి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. -
కళాకారులను ప్రోత్సహించాలి
విజయవాడ కల్చరల్: కళాకారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి అన్నారు. సమతా సేవా సమితి, ఏపీ సృజనాత్మక సమితి ఆధ్వర్యాన జీవీఆర్ సంగీత కళాశాలలో చింతా కృష్ణమూర్తి 42వ వర్ధంతి, సమతాసేవా సమితి 15వ వార్షిక వేడుకలు, వివిధ రంగాలకు చెందిన వారికి పురస్కారాల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ సాంస్కృతిక కళాసంస్థలు, కళాకారుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా సమతా సేవా సమితి సేవలను వివరించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి మహ్మద్ ఇంతియాజ్, జీఆర్కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు, కోగంటి సత్యం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నా వల్లభరావు పాల్గొన్నారు. సమతాసేవా సమితి నిర్వాహకుడు చింతా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రంగస్థల కళాకారుడు దంగేటి సూర్యప్రకాశరావుకు రంగస్థల యశస్వి, గొలిమి రామకృష్ణకు ఉద్యోగ రత్న, పురస్కాలను అందజేశారు. చింతా కృష్ణమూర్తి స్మారక పురస్కారాన్ని మాదాల గోపాల కృష్ణకు ప్రదానం చేశారు. -
అందెల రవళులతో పులకించిన ‘సిద్ధేంద్రయోగి’
పామర్రు: మొవ్వ మండలంలోని కూచిపూడి శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయ కల్యాణోత్సవాల సందర్భంగా రెండో రోజు శుక్రవారం ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలతో ‘సిద్ధేంద్ర యోగి’ పులకించారు. కళాకారులు దేవాలయం సమీపంలోని శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళావేదికపై ప్రదర్శించిన అంశాలు అలరించాయి. కళా నృత్యనికేతన్ (స్కూల్ ఆఫ్ కూచిపూడి) ప్రదర్శనలు, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం నృత్య దర్శకత్వంలో రూపొందించిన కృష్ణశబ్దం, ఆనంద తాండవం అంశాలను ప్రదర్శించారు. మధుసూదన్, శ్రీనిధి కదిరి నృసింహుడు, శివరంజని థిల్లానాలను ప్రదర్శించారు. శ్రీ సిద్ధ డ్యాన్స్ అకాడమీ ( వరంగల్) కళాకారులు పలు అంశాలను ప్రదర్శించారు. ఉమా నృత్యనికేతన్ నిర్వాహకురాలు రెడ్డి ఉమారాణి(రాజమండ్రి) బ్రహ్మాంజలి కామాక్షి అంశాలను ప్రదర్శించారు. కళాకారులను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పాలకమండలి సభ్యులు కళారత్న రాధేశ్యామ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. -
నకిలీ గుప్పు.. గుప్పు
పొగ తాగడమంటేనే ఆరోగ్యానికి హాని కరం. ఇక నకిలీ సిగరెట్లు తాగితే శరీరంలో అవయవాలకు దెబ్బే. ఉమ్మడి జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా జోరుగా సాగు తోంది. సిగరెట్ తాగేవాళ్లు బ్రాండా.. నకిలీదా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీన్ని అరికట్టాల్సిన ఫుడ్సేఫ్టీ కంట్రోల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వన్టౌన్(విజయవాడపశ్చిమ): మార్కెట్లో నకిలీ సిగరెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతోంది. ఒకవైపు ప్రజల ఆరోగ్యానికి మరింతగా తూట్లు పొడుస్తుంటే మరోవైపు విదేశీ సిగరెట్లతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సైతం భారీగా గండి పడుతోంది. ఈ వ్యాపార లావాదేవీలు కొంతమంది అధికారులకు మంచి ఆదాయ వనరులుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విచ్చలవిడిగా.. నకిలీ సిగరెట్ల వ్యాపారానికి బెజవాడ అడ్డాగా మారుతోంది. విజయవాడ కేంద్రంగా చుట్టుపక్కల జిల్లాలకు సైతం సరఫరా అవుతున్నట్లు ఒకరిద్దరు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది విజయవాడ వన్టౌన్, భవానీపురం పోలీస్స్టేషన్ల పరిధుల్లో ఉన్న గొల్లపూడి, భవానీపురం, పాతబస్తీలోని పలు ట్రాన్స్పోర్టు గోడౌన్లలో రూ.2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటనలు తెలిసిందే. విదేశీ సిగరెట్లకు సంబంధించి రాయనపాడులోని ఒక గోడౌన్లో భారీగా సరుకును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. వీటితో పాటుగా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ నకిలీ, విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అధికారికంగా దాడులు చేసి స్వాధీనం చేసుకున్న ఘటనలు మాత్రమే. వారం తర్వాత మళ్లీ మామూలే నగరంలో ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగినప్పుడు నకిలీ సిగరెట్ల వ్యాపారులు వారం పాటు లావాదేవీలను నిలిపివేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ మాములుగానే ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లుగా స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఈ దందా కొందరు అధికారులకు తెలిసే జరుగుతున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. భవానీపురం, పాతబస్తీలో ఈ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతున్నట్లు, పది మంది నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. బ్రాండ్ల కంటే తక్కువ ధర నకిలీ సిగరెట్లు, విదేశీ బ్రాండ్లు నగరంలో విచ్చలవిడిగా విక్రయాలు జరగడానికి కారణం అవి మాములు బ్రాండ్ల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండటమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఏమీ చెల్లించకపోవడం, అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా దందా చేస్తుండటంతో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. నకిలీ సిగరెట్ల దందాకు సంబంధించి అదుపు చేయాల్సిన బాధ్యత పుడ్ సేఫ్టీ కంట్రోల్ శాఖకు ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల న్యాయస్థానంలో ఓ కేసు విచారణలో ఇలాంటి ఆదేశాలు వచ్చాయని అధికారులు తెలుపుతున్నారు. నకిలీ సిగరెట్లను అదుపు చేయాల్సిన పుడ్ సేఫ్టీ అధికారులు సైతం ముడుపుల మత్తులో ఉన్నరానే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ దిశగా ఇప్పటి వరకూ దాడి చేసిన సంఘటన ఒకటి లేదు. దీంతో నకిలీ సిగరెట్ల వ్యాపారం జోరుగా జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో నకిలీ సిగరెట్ల వ్యాపారులపై కొంతమంది అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నా.. చట్టంలో లొసుగులతో తప్పించుకుంటున్నారని కొంతమంది అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా పోలీసు శాఖ ఆయా అక్రమార్కులపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు సరైన వాదన లేకపోవడం, సెక్షన్లలో లొసుగులతో వారు తప్పించుకుంటున్నారు. దీనికి తోడు సరుకును సైతం యథావిధిగా బయటకు తెచ్చుకుంటున్నారని తెలుస్తోంది. నకిలీ సిగరెట్లతో పాటుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సిగరెట్ల దందాతో ప్రభుత్వ శాఖలకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. సరైన నిఘా లేక అక్రమార్కులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా సిగరెట్ల దందాపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు స్పష్టమైన సమాచారం ఉన్నా ఆ దిశగా కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. ముఖ్యంగా అధికారులకు వివిధ స్థాయిల్లో ముడుపులు వెళ్లడంతో ఈ దందా విచ్చలవిడిగా జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
దుర్గమ్మ సేవలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏసీ రంగారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని, సంక్షేమం, అభివృద్ధిలో ముందుండాలని కోరుకున్నానని పేర్కొన్నారు. డయాలసిస్ రోగులకు ఆరోగ్యశ్రీ సేవలను అందించండి పామర్రు: డయాలసిస్ రోగులకు ఎన్టీఆర్ వెద్య సేవ అందేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీని సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం సీఈవో డాక్టర్ కూచిభట్ల ఆనంద్ కోరారు. కలెక్టర్ కూచిపూడిలోని సంజీవని వైద్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యాలయంలోని అత్యవసర విభాగం, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే, ప్రసూతి విభాగం, క్యాంటీన్ తదితర విభాగాలను పరిశీలించి ప్రజాభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాలయం సీఈవో డాక్టర్ కూచిభట్ల ఆనంద్ మాట్లాడుతూ 2018లో దాతల సహకారంతో ఈ వైద్యాలయాన్ని నిర్మించామని రోజుకు 450 మంది వరకు వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. కలెక్టర్ స్పందిస్తూ డయాలసిస్ రోగులకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందేలా ప్రతిపాదనలు పంపించాలని సీఈవోకు సూచించారు. అనంతరం కలెక్టర్ బాలాజీని సత్కరించారు. కార్యక్రమంలో మొవ్వ తహసీల్దార్ మస్తాన్, ఎంపీడీవో సుహాసిని, సర్పంచ్ కొండవీటి వెంకట విజయలక్ష్మి వైద్యాలయం ఏవో హనుమకుమారు, మేనేజర్ సత్యప్రకాష్ పాల్గొన్నారు. శ్రీకొండలమ్మకు రూ.12.58 లక్షల ఆదాయం గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మ దేవస్థానంలోని హుండీల్లో భక్తులు వేసిన కానుకలను శుక్రవారం లెక్కించారు. 31రోజులకు నోట్ల ద్వారా రూ.11,20,055, చిల్లర ద్వారా రూ.1,38,754 మొత్తం రూ.12,58,809 లెక్కింపులో వచ్చింది. మచిలీపట్నం భోగిరెడ్డిపల్లి గ్రూప్ సూపర్వైజర్ అరుణ పర్యవేక్షణలో దేవస్థాన చైర్మన్ ఈడే మోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్లేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్ర బాబు, తూము రాజ్యలక్ష్మి, ముంగం ఆంజనేయులు, మన్నెం వీర నాగేంద్రరావు, ఈఓ ఆకుల కొండలరావు, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, గుడ్లవల్లేరు పోలీస్ సిబ్బంది హుండీలను తెరిచి కానుకలు లెక్కించారు. ముగిసిన ఖోఖో శిక్షణ గుడివాడటౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఆలిండియా పోలీస్ ఖోఖో టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారుల శిక్షణ శుక్రవారం ముగిసింది. స్టేడియం కమిటీ సభ్యులు క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్చి 7 నుంచి 12వ తేదీ వరకు జమ్మూ కశ్మీర్లో టోర్నమెంట్స్ జరుగుతాయన్నారు. ఏపీ తరఫున పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎన్టీఆర్ స్టేడియం గత నెల రోజులుగా అతిథ్యం ఇచ్చి శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. పూర్తి స్థాయిలో తర్ఫీదు పొందిన ఈ జట్టు జాతీయ స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ కె. రంగప్రసాద్, సైబర్ సీఐ గణేష్, ఏపీ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు మడకా ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. -
చలో విజయవాడకు సిద్ధం
మచిలీపట్నంఅర్బన్: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించని పక్షంలో మార్చి 2న చలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి రాజీ పడబోమని, ప్రభుత్వానికి సత్తా చూపిస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి హెచ్చరించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనే డిమాండ్తో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి. రైతు సంఘం నాయకులు శీలం నారాయణరావు, సీఐటీయూ నాయకులు చంద్రపాల్, బూర సుబ్రహ్మణ్యం, కరీముల్లా, గంగాధర్, జయరావు, సీహెచ్ శ్రీహరి తదితరులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీల సేవలు చేస్తూ కనీస వేతనం మాత్రమే కోరుతున్నామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ అనవసర ఖర్చులు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాల పెంపునకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వానికి సాష్టాంగ దండాలు పెట్టారు. దీక్షలో పార్వతి, గోపిలక్ష్మి, కృష్ణవేణి, రాణి, కస్తూరి, గీత, దేవకన్య తదితరులు పాల్గొన్నారు. -
పటిష్ట భద్రతలో ఈవీఎం గోడౌన్
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదాంకు పకడ్బందీ భద్రత ఏర్పాట్లు కల్పించినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గురువారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోగల ఈవీఎం, వీవీప్యాట్ల గోదాంను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. డెప్యూటీ సీఈఓ, ఈవీఎంల నోడల్ ఆఫీసర్ ఆంజనేయులు, డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక కార్పొరేషన్ కోరుతూ అర్ధ నగ్న ప్రదర్శన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎస్టీ వర్గీకరణ చేయాలని కోరుతూ ధర్నా చౌక్లో గురువారం అర్ధనగ్న ప్రదర్శన జరిగింది. యానాద రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాల్గో రోజుకు చేరాయి. కార్యక్రమానికి కేవీపీఎస్, గిరిజన సంఘాలు, మద్దతు తెలిపాయి. మద్దతు తెలిపిన వారిలో ఆండ్ర మాల్యాద్రి, లోకనాథం, ఈగ శ్రీనివాసరావు, పి. లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి యానాదుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఈ ప్రదర్శనలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపట్ల బ్రహ్మయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుత్తూరు శ్రీనివాసరావు, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
5న చలో విజయవాడ
మచిలీపట్నంఅర్బన్: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే మార్చి ఐదో తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రమాదేవి హెచ్చరించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరాయి. ఐసీఈయూ ఎల్ఐసీ డివిజన్ ప్రధాన కార్యదర్శి జి. కిశోర్ కుమార్ దీక్షలకు సంఘీభావం తెలిపారు. రమాదేవి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాల పెంపునకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, లేకుంటే నిరవధిక సమ్మెకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ నెల 23, 24 తేదీలలో ప్రాజెక్టు స్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని, 25 నుంచి 27 వరకు జిల్లా కేంద్రంలో దీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్ట్ లీడర్లు నాంచారమ్మ, లక్ష్మి, శివకుమారి, నాగమణి, గంగాభవానీ, రాజారత్నం, సత్యవతి, విజయలక్ష్మి, దుర్గ, రాజకుమారి దీక్షలో కూర్చున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
భవిష్యత్ అవసరాల మేరకు హైవే అభివృద్ధి
ఎంపీ కేశినేని శివనాథ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారుల నెట్వర్క్ను అభివృద్ధి చేయడం ముఖ్యమని.. ఈ నేపథ్యంలో ఎన్హెచ్–65 విస్తరణ ఉండాలని కోరుకుంటున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ రహదారి ప్రాజెక్టులపై భాగస్వాముల (స్టేక్హోల్డర్స్) సమావేశం జరిగింది. జాతీయ రహదారులు, రెవెన్యూ, ఆర్అండ్బీ, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులతో పాటు ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, వసంత వెంకట కృష్ణప్రసాద్, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), గద్దె రామ్మోహన్రావు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి–65 ఆరు వరుసల విస్తరణకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం ఎన్హెచ్ 65 విస్తరణకు సంబంధించి కొంతవరకు డీపీఆర్ తయారైందన్నారు. ఈ డీపీఆర్ను పరిశీలించిన మీదట ఎక్కువమంది రైతులు ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. విస్తరణలో ప్రతిపాదించిన రెండు బైపాస్లు (అంబారిపేట–ఐత వరం; కాచవరం–మూలపాడు–ఇబ్రహీంపట్నం వెస్ట్) బదులు పాత రహదారినే పటిష్ట ప్రణాళికతో విస్తరణ, అభివృద్ధి చేయాలని తీర్మానం చేశామన్నారు. సమావేశంలో ఎన్హెచ్ పీడీ (విజయవాడ) ఎం.విద్యాసాగర్, ఎన్హెచ్ పీడీ (హైదరాబాద్) సీహెచ్ శ్రీనివాసరావు, పీడీ (అమరావతి) టి.పార్వతీశం, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆస్తి కోసం అన్నదమ్ముల బాహాబాహీ
●కర్రలు, కత్తులతో కుటుంబ సభ్యుల పరస్పర దాడులు ● రెండు వర్గాల దాడిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు రెడ్డిగూడెం(జి.కొండూరు): ఆస్తి కోసం అన్నదమ్ముల కుటుంబాలు బాహాబాహీకి దిగడమే కాదు, కర్రలు, కత్తులతో పరస్పరం దాడులకు తెగబడిన ఘటన రెడ్డిగూడెం మండలలోని కొత్త నాగులూరు గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కట్టా రాజారావుకి మొదటి భార్య అమృతం, రెండో భార్య సువర్ణ ఉన్నారు. మొదటి భార్య అమృతంనకు కొడుకు అబ్రహాం, సువర్ణకు ఇద్దరు కొడుకులు జమలయ్య, శ్రీను ఉన్నారు. రాజారావు అనారోగ్య సమస్యలతో కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ముగ్గురు కొడుకుల మధ్య భూ వివాదం కొనసాగుతోంది. రాజారావు జీవించి ఉన్న సమయంలో తన పేరుతో ఉన్న 2.50 ఎకరాల బీఫాం భూమిని తన వద్దనే ఉంచుకొని తన పేరుతో ఉన్న మరో 80 సెంట్ల పట్టా భూమిని మొదటి భార్య కుమారుడు అబ్రహాం పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అతని వద్ద కొంత కాలం ఉన్నాడు. ఆ తర్వాత అతను తనను సరిగా చూడటంలేదంటూ రెండో భార్య కుమారుల వద్దకు వెళ్లిన రాజారావు, తన పేరుతో ఉన్న 2.50 ఎకరాల బీఫాం పట్టా భూమిని వారిద్దరి పేరిట రాశాడు. ఆ తర్వాత రాజారావు మృతి చెందగా అప్పటి నుంచి భీపాం పట్టా భూమిలో తనకూ వాటా ఉందని అబ్రహాం, 80 సెంట్ల పట్టా భూమిలో తమకూ వాటా ఉందని జమలయ్య, శ్రీను ఇద్దరు గొడవ పడడం ప్రారంభించారు. ఈ వివాదం ఐదేళ్లుగా కొనసాగుతోంది. గతంలో ఒక సారి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పెద్దలు పంచాయితీలు చేసి సర్ది చెప్పారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని రెండు వర్గాల వారు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కత్తులు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో అబ్రహాం, జమలయ్య, శ్రీను, వారి బంధువులైన మేడూరు సురేఖ, కట్టా ఎస్తేరు, మట్టకొయ్య రుషరావు, మట్టకొయ్య పద్మ, మట్టకొయ్య దావీదురాజు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న రెడ్డిగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్లో క్షతగాత్రులను మైలవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. రెండు వర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. -
పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్ రద్దు చేయాల్సిందే
ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వారడిసన్ క్లాస్ పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజును వెంటనే రద్దు చేయాలని ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రామమోహన గ్రంథాలయంలో సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతేడాది మార్చిలో పార్లమెంటులో ఆర్థికబిల్లులో భాగంగా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ వ్యాలిడిషన్ క్లాజ్ చేర్చి ఆమోదించిందన్నారు. ఈ క్లాజ్ పెన్షనర్లను పాత, కొత్త పెన్షనర్లుగా విడగొట్టిందన్నారు. భవిష్యత్తులో వేతన సవరణ జరిగితే పాత పెన్షనర్స్కు పెన్షన్ సవరణ లేకుండా.. కొత్త పెన్షనర్స్కు మాత్రమే సవరణ పొందే హక్కులు కల్పిస్తూ రాష్ట్రపతి ఆమోదం పొందించిందన్నారు. ఇది పెన్షనర్లకు హక్కులను కాలరాసే చర్య అని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎరియర్స్ సహా అమలు చేయండి.. ఫోరం అధ్యక్షుడు వి.వరప్రసాద్ మాట్లాడుతూ 8వ సెంట్రల్ పే కమిషన్ టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ప్రస్తుతం సివిల్ పెన్షనర్లు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్తో సహా అందరికీ పెన్షన్ సరవణ ఉండే విధంగా చూడాలన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి వేతన సవరణ, ఎరియర్స్ సహా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫోరం కన్వీనర్ ఎన్. రామారావు, ఏఐబీడీపీఏ వైస్ ప్రెసిడెంట్ పి. అశోక్ బాబు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కేఎస్సీ బోస్, ఏఐబీఎస్ఎన్ఎల్ పీడబ్ల్యూఏ నాయకులు పాల్గొన్నారు. -
కదులుతున్న రైలు నుంచి పడిపోయిన బాలిక
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రాత్రి సమయంలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ ఓ బాలిక పడిపోయింది. సకాలంలో స్పందించిన ఆర్పీఎఫ్, జీఆర్పీ, స్టేషన్ సిబ్బంది ఆ బాలికను రక్షించిన ఘటన బుధవారం రాత్రి ఒంగోలు రైల్వేస్టేషన్ పరిసరాల్లో జరిగింది. బుధవారం రాత్రి 11.53 గంటల సమయంలో ధర్మవరం – నర్సాపూర్ (17248) ఎక్స్ప్రెస్ రైలు ఒంగోలు స్టేషన్కు రెండు మీలోమీటర్ల దూరంలో సూరారెడ్డిపాలెం – ఒంగోలు సెక్షన్ మధ్య ప్రయాణిస్తుండగా తొమ్మిదేళ్ల బాలిక ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిపోయింది. రైలు రాత్రి 12.03 గంటలకు రైలు ఒంగోలు స్టేషన్కు చేరుకోగా ఆమె కుటుంబ సభ్యులు స్టేషన్ మాస్టర్, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ మార్గంలో వస్తున్న తిరుపతి – కరీంనగర్ ఎక్స్ప్రెస్ (12761) రైలులోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. లోకో పైలెట్ ట్రాక్ పక్కన బాలికను గుర్తించి రైలును నిలిపడంతో జనరల్ కోచ్లోని సిబ్బంది ఆమెను రక్షించారు. అప్పటికే ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది కూడా బాలిక కోసం గాలిస్తూ అక్కడకు చేరుకున్నారు. గాయాలతో ఉన్న బాలికను ఒంగోలు స్టేషన్కు తరలించిచారు. ఆమె ఎడమ చేతికి, కాళ్లకు స్పల్పగాయాలవటంతో ప్రథమ చికిత్స చేసి, అనంతరం దగ్గరలోని ఆస్ప త్రిలో చికిత్స చేయించి కుటుంబ సభ్యు లకు అప్పగించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాలికను రక్షించిన రైల్వే సిబ్బంది, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
సుబ్బారాయుడి సన్నిధిలో చీఫ్ పోస్ట్మాస్టర్
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హెడ్ బీపీ శ్రీదేవి గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆమె నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు సీహెచ్ వెంకటేశ్వరావు, విరూప్ శర్మ, మణిదీప్శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. మచిలీపట్నంఅర్బన్: ‘నీట్’ను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం మధ్యాహ్నం న్యూఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాజేష్ లఖన్, రాష్ట్ర ప్రభుత్వ కళాశాల విద్యా కమిషనర్ భరత్ గుప్తాతో కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. క్యాంపు కార్యాలయం నుంచి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాలైన కేంద్రీయ విద్యాలయం, కృష్ణ విశ్వవిద్యాలయలలో నీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్, నీట్ పరీక్షల సమన్వయకర్త మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్, పరీక్షా కేంద్ర పర్యవేక్షకులు సత్యనారాయణ పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: గర్భిణులు, బాలింతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిల్కారి కాల్ సేవలు ఎంతో ప్రయోజనకరమని కృష్ణా జిల్లా కిల్కారి ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు తెలిపారు. గురువారం బందరుకోట, శారదానగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కిల్కారి సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి, బిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ కాల్స్ ద్వారా అందజేస్తారని వివరించారు. గర్భధారణ నాల్గో నెల నుంచి శిశువు ఒక సంవత్సరం పూర్తయ్యే వరకు నెలకు ఒకసారి గర్భిణులు, బాలింతల మొబైల్ ఫోన్లకు ఈ కాల్స్ వస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ నంబర్ (911600403660)ను గర్భిణులు, బాలింతలు తమ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకుంటే కాల్ వచ్చినప్పుడు పూర్తి సమాచారాన్ని వినగలరన్నారు. అవసరమైతే 14423 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి తిరిగి సమాచారాన్ని వినవచ్చని సూచించారు. డాక్టర్ పరమేశ్వరి, డాక్టర్ తాజుద్దీన్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. అవనిగడ్డ: ఘంటసాల పరిశోధన కేంద్రం రూపొందించిన జీబీజీ 164 మినుము పంట అవనిగడ్డలో సాగు చేయగా.. దానిని శాస్త్రవేత్తల బృందం గురువారం పరిశీలించింది. సమన్వయకర్త డాక్టర్ డి. సుధారాణి మాట్లాడుతూ జీబీజీ 164 రకం కాలపరిమితి 80 నుంచి 85 రోజుల పంటని, ఎల్బీజీ 752 రకంతో పోలిస్తే గింజ మెరుగ్గా ఉంటుందని చెప్పారు. కృష్ణాజిల్లా ప్రాంతానికి ఈ రకం అనుకూలంగా ఉంటుందన్నారు. రైతులు జీబీజీ 164 రకాన్ని సాగుచేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. వెంకట లక్ష్మి, డాక్టర్ కె. రేవతి ఏడీఏ జయప్రద, ఏవో శుభ హారిక, వీఏ వి. తేజశ్రీ పాల్గొన్నారు. -
డాక్టర్ దీపిక మృతిపై వీడని మిస్టరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో అనుమనాస్పద స్థితిలో మరణించిన ఎనస్థీషియా పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థిని డాక్టర్ బత్తుల దీపిక మరణంపై మిస్టరీ వీడలేదు. ఈ నెల ఐదో తేదీన ఆమె ఆపరేషన్ థియేటర్లో బెంచీపై కూర్చుని కుప్పకూలి ప్రాణాలు విడిచిన విషయం విదితమే. ఆమె మృతికి సంబంధించిన కారణాలు తెలియలేదు. మరోవైపు సీసీ కెమెరాల్లో సైతం ఆ రోజు రాత్రి 1.10 నుంచి 1.40 గంటల వరకూ ఆపరేషన్ థియేటర్లోకి బయటి వ్యక్తులు ఎవరూ వెళ్లినట్లు రికార్డు కాలేదు. దీంతో ఆమె మృతి మిస్టరీగా మారింది. పోస్టుమార్టం రిపోర్టు కోసం పోలీసులతో పాటు, ఆస్పత్రి అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ వారాంతంలో ఆ రిపోర్టు వచ్చే అవకాశం ఉందని సమాచారం. వైద్య మంత్రికి వినతి డాక్టర్ దీపిక మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తండ్రి బత్తుల కోదండరామిరెడ్డి నిత్యం పలువురిని కలుస్తూ వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్తో పాటు, ఏసీపీ దామోదర్ను ఇప్పటికే కలిసి తనకున్న అనుమానాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. తాజాగా గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలిసి డాక్టర్ దీపిక కళాశాలలో చేరిన వద్ద నుంచి మరణించిన వరకూ జరిగిన ఘటనలు, అనుమానాలను పేర్కొంటూ వినతి పత్రం అందజేశారు. పీఎం రిపోర్టు వస్తేనే.. దీపిక మృతిపై ఇప్పటికే ముగ్గురు ప్రొఫెసర్లతో ఎనస్థీషియా విభాగంలోని పీజీలు, వైద్యులను విచారణ జరపగా ఎలాంటి ఆధారాలూ తెలియలేదు. ఆమె మృతిపై రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు ఆరా తీశారు. పోలీసులు కూడా కొంత సమాచారాన్ని సేకరించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది. ఆ రిపోర్టు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
ముగిసిన లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తున్న లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ గురువారం సాయంత్రం ముగిసింది. శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీల్లో పాల్గొన్నారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడతూ.. వచ్చే ఏడాది సౌత్ ఇండియా ప్రీమియర్ లీగ్ పేరుతో ఆరు రాష్ట్రాల శాసన సభ్యులకు విశాఖపట్నంలో క్రీడాపోటీలు నిర్వహిస్తామన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. సౌత్ ఇండియా ప్రీమియర్ లీగ్కు తమ పూర్తి సహాయ సహాకారాలను అందిస్తామన్నారు. శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి పాల్గొన్నారు. స్పోర్ట్స్ మీట్ చివరి రోజు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, టెన్నిస్, క్యారమ్స్ పోటీలు జరిగాయి. -
ఎలుకలు దాడి చేస్తున్నా పట్టని పాలకులు..
ఏకొండూరులోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఈ నెల ద్వితీయార్థంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో నిద్రిస్తున్న బాలికలను ఎలుకలు దాడి చేసి గాయపరిచిన సంఘటన సంచలనం సృష్టించింది. సుమారు పదకొండు మంది బాలికలు ఎలుకల దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రభుత్వం హాస్టల్స్ నిర్వహణలో చూపుతున్న నిర్లక్ష్యానికి ఇదొక మచ్చుతునక. ఈ సంఘటనతో సాక్షాత్ జిల్లా కలెక్టర్ ఆ ప్రాంగణాన్ని సందర్శించి పరిశీలించారు. ఒకటిరెండు చర్యలు చేపట్టినా సమూల మార్పు తీసుకురావటానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవే పరిస్థితులు చాలా హాస్టళ్లలో కనిపిస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. -
తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను జయప్రదం చేయాలి
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసిన శ్రీతిరుపతమ్మ వారి చిన్న తిరునాళ్ల ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ సూచించారు. మార్చి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు జరిగే తిరునాళ్లకు సంబంధించి గురువారం ఆలయ సత్రాల్లో అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ.. తిరునాళ్లు జరిగే ఐదు రోజులు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫ రాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మార్చి ఏడో తేదీన పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లకు విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేసే సందర్భంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయం వద్ద పలు శాఖల సమాచార కేంద్రాలతో పాటు, తాగునీటి సౌకర్యం, తాత్కాలి కంగా బస్టాండ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటుతో పాటు అందులో అన్నిశాఖల అధికారులు ఉండాలన్నారు. తిరునాళ్లకు ముందు రోజు కల్లా అన్ని శాఖల అధికారులు తమ యాక్షన్ ప్లాన్తో పాటు, ఫోన్ నంబర్లను ఆలయ అధికారులకు, రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలన్నారు. బెల్ట్ షాపులు లేకుండా చేయాలని ఎకై ్సజ్ సీఐ రమా దేవికి సూచించారు. ఆలయం వద్ద దుకాణాలను నిర్ణయించిన చోట మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. పసుపు–కుంకుమల బండ్లు ఎన్ని వచ్చేది ముందుగా రెవెన్యూ కార్యాలయంలో తెలపాలని కోరారు. ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామ న్నారు. మునేటిలో భక్తులకు జల్లు స్నానాలతో పాటు మునేరులో తాత్కాలిక కేశఖండనశాల ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులను ఈఓ కోరారు. డీసీపీ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ఎటువంటి అవరోధం లేకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి.శ్రీను, ఆలయ ఈఈ రమాదేవి, నందిగామ ఏసీపీ తిలక్, జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు, వైద్యాధికారి నాగరాణి, విద్యుత్ ఏఈ వెంకటకృష్ణ, పీఆర్ ఏఈ సుందరరామయ్య, ఆర్అండ్బీ ఏఈ సురేష్, గ్రామ కార్యదర్శి శ్యామ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ -
హాస్టల్ .. హడల్!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. సమాజంలో వెనుకబాటును ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లటానికి హాస్టళ్లు బాసటగా ఉండాల్సి ఉంది. కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు జిల్లాలోని హాస్టళ్లలో దర్శనమిస్తున్నాయి. అన్ని వసతులు కల్పించి విద్యార్థులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తుండటంతో వాటి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో హాస్టళ్లు ఎలుకలకు ఆవాసాలుగా మారాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ప్రతి హాస్టల్లోనూ ఏదో ఒక సమస్య వెంటాడుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారుజిల్లాలో పరిస్థితి..జిల్లా వ్యాప్తంగా 65 హాస్టళ్లు వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతుండగా అందులో సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 34 హాస్టళ్లు, వెనుకబడిన తరగుతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 36, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు చొప్పున హాస్టళ్లు పని చేస్తున్నాయి. అయితే వీటిల్లో సగానికి పైగా హాస్టళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఆయా హాస్టల్స్లో వసతి పొందుతున్న వేలాది మంది విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కేజీబీవీల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి.80 శాతానికి పైగా అసంతృప్తి..జిల్లాలోని పలు హాస్టళ్లపై భారీగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల పలు దఫాలుగా ఐవీఆర్ఎస్ సర్వేలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 శాతానికి పైగా విద్యార్థులు తమ హాస్టల్స్లో వసతులు దారుణంగా ఉన్నాయని విమర్శలు చేశారు. అలాగే హాస్టల్ వార్డెన్లు సైతం నియమనిబంధనల ప్రకారం ఉండాల్సిన సమయాల్లో ఉండటం లేదనే విషయాన్ని సైతం వివరించారు. వీటిపై మంత్రి ఆదేశాలతో నియమించిన అధికారులు వెళ్లి చూడగా ఆ సమయంలోనూ వార్డెన్లు లేక పోవటం, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవటం అంశాలపై వాటి తీరుతెన్నులను స్పష్టం చేస్తున్నాయి.భోజన మెనూ మరీ దారుణం..జిల్లాలోని ఆయా సంక్షేమ హాస్టళ్లలో మెనూ అమలు పరిస్థితి మరింత దారుణంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఫుడ్ కమిషన్ చైర్మన్ సైతం పలు హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించినప్పుడు వాటి పరిస్థితి బయటపడింది. చాలా హాస్టళ్లలో ఒక కూరతోనే సరిపెడుతున్న పరిస్థితి ఉంది. చాలా హాస్టళ్లలో పాలు, పెరుగు వారంలో ఒకటి రెండు రోజులకు పరిమితమవుతున్నాయి. కూరల పంపిణీలోనూ దోపిడీ జరుగుతోంది. ఫిర్యాదు చేస్తే ఎవరు తమను ఏమి అంటారో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు కాలం గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి.హాస్టళ్లపై పర్యవేక్షణ శూన్యం..జిల్లాలో ఉన్న హాస్టళ్లకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ అవసరం. కానీ ఉన్నతాధికారులెవరూ వాటిపై దృష్టి సారించకపోవటంతో వేలాది మంది విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హాస్టళ్లపై అసలు నిఘా కరువైందనే విమర్శలు ఉన్నాయి. అందువల్లే విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఆయా వస్తువులను పంపిణీ చేసే కాంట్రాక్టర్ల నుంచి మామూళ్లను తీసుకోవటంలో ఉన్న శ్రద్ధ హాస్టల్స్లో ఏమి జరుగుతుందనే విషయాలను తెలుసుకోవటంలో చూపటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులెవరూ హాస్టల్స్పై నిఘా పెట్టకపోవటంతో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.ఎలుకలు దాడి చేస్తున్నా పట్టని పాలకులు.. ఏకొండూరులోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఈ నెల ద్వితీయార్థంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో నిద్రిస్తున్న బాలికలను ఎలుకలు దాడి చేసి గాయపరిచిన సంఘటన సంచలనం సృష్టించింది. సుమారు పదకొండు మంది బాలికలు ఎలుకల దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రభుత్వం హాస్టల్స్ నిర్వహణలో చూపుతున్న నిర్లక్ష్యానికి ఇదొక మచ్చుతునక. ఈ సంఘటనతో సాక్షాత్ జిల్లా కలెక్టర్ ఆ ప్రాంగణాన్ని సందర్శించి పరిశీలించారు. ఒకటిరెండు చర్యలు చేపట్టినా సమూల మార్పు తీసుకురావటానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవే పరిస్థితులు చాలా హాస్టళ్లలో కనిపిస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..హాస్టల్స్ నిర్వహణలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వార్డెన్లు అందుబాటులో ఉండటం లేదు. అలాగే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన ఆహారంలోనూ కోతలు విధిస్తూ వారి పొట్టలు కొడుతున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్ప మిగిలిన సమయంలో ఆయా హాస్టళ్లను సందర్శించేవారు గానీ, పట్టించుకునే వారు కానీ ఉండటం లేదు. హాస్టళ్లలో అరకొర వసతులతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికై నా వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి.– సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
ఎండీఎంఏ డ్రగ్స్ కేసు నిందితుడి అరెస్టు
లబ్బీపేట(విజయవాడతూర్పు): బెంగళూరు నుంచి విశాఖపట్నానికి ఎండీఎంఏ డ్రగ్స్ తరలిస్తున్న కేసులో పరారీలో ఉన్న నిందితుడు రాజేష్ను మాచవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గత ఏడాది నమోదైన ఈ కేసులో రాజేష్ నిందితుడు. రెండు నెలల కిందట విజయవాడ మాచవరం పోలీస్స్టేషన్ నుంచి అతను పోలీసుల కళ్లుకప్పి పరారయ్యాడు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్, సెంట్రల్ ఏసీపీ దామోదర్ నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. మాచవరం పోలీసులు, క్రైం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ తరుణంలో నిందితుడికి సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు చిక్కింది. క్రైమ్ కానిస్టేబుల్ తరుణ్ సహకారంతో నిందితుడు రాజేష్ను మాచవరం ఇన్స్పెక్టర్ రమణ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా నగరంలో డ్రగ్స్ విక్రయ కార్యకలాపాల్లో పాల్గొనట్లు అంగీకరించాడు. అతడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారు. హనుమాన్జంక్షన్ రూరల్: గన్నవరం డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, కేసుల విచారణలో పురోగతిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గురువారం సమీక్ష నిర్వహించారు. స్థానిక విజయవాడ రోడ్డు స్వరాజ్య నగర్లోని హనుమాన్జంక్షన్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆయన క్రైమ్ రివ్యూ నిర్వహించారు. డీఎస్పీ చలసాని శ్రీనివాస్తో పాటుగా హనుమాన్జంక్షన్, గన్నవరం, పెనమలూరు సర్కిల్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న కేసులు, డివిజన్లో క్రైమ్ రేట్, రికవరీలపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆరా తీశారు. -
లడ్డూపై చర్చ.. మండలిలో టీడీపీ యూటర్న్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..శాసన మండలిమండలిలో లడ్డు ప్రసాదం చర్చపై టీడీపీ యూ టర్న్మండలి ఎజెండాలో లడ్డుపై స్వల్ప కాల చర్చగా పేర్కొన్న సెక్రెటరీ జనరల్తీరా చర్చ వచ్చే సరికి మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తారంటూ యూ టర్న్మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ మంత్రి పయ్యావుల పట్టుస్వల్ప కాలిక చర్చలో మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసిన మండలి చైర్మన్ఏపీ శాసనమండలి ప్రాంగణంలో బొత్స కామెంట్స్..తిరుమల లడ్డూ అంశంపై చర్చకు ఎందుకు భయపడుతున్నారు?.అబద్ధాలు, దుష్ప్రచారం, దోపిడీ చేసిన వారిని దేవదేవుడు క్షమించరు.తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చి చెప్పింది.సభ ప్రారంభమైన మొదటి నుంచి చర్చకు డిమాండ్ చేస్తున్నాం.లడ్డూపై చర్చించాలని వాయిదా తీర్మానాలను కూడా ఇచ్చాం.చర్చ జరిగితే నిజాలు బయటపడతాయనే పారిపోయారా?.తిరుమల లడ్డూపై ఎప్పుడైనా చర్చకు సిద్దమని చెప్పారు.తీరా చర్చ పెట్టాక ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడమేంటి?.హెరిటేజ్-ఇందాపూర్ మధ్య సంబంధం ఉందా? లేదా?.మీ దోపిడీని ఆ దేవదేవుడు చూస్తూ ఊరుకోరు.టీటీడీ చరిత్రలో ఎప్పుడైనా తొక్కిసలాట జరిగిందా?.ఎప్పుడైనా టీటీడీలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయారా?.సీఎం కుర్చీపై ఉన్న శ్రద్ద.. దేవుడు, దేవాలయాలపై లేదు. మండలిలో లడ్డూపై మాట మార్చిన కూటమి సర్కార్.. మండలిలో లడ్డూ అంశంపై మాట మార్చిన ప్రభుత్వం.చర్చ లేకుండా ప్రకటన మాత్రమే చేసేందుకు ప్రయత్నం.లడ్డూ అంశంపై ప్రకటన చేస్తామన్న మంత్రి పయ్యావులచర్చ జరగాలంటూ వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు.మంత్రి ప్రకటనకు సంబంధించి తనకు సమాచారం లేదన్న చైర్మన్.లఘు చర్చలో ప్రతిపక్షానికే తొలి ప్రాధాన్యత అన్న చైర్మన్.స్టేట్మెంట్ తర్వాతే చర్చ చేపట్టాలన్న మంత్రి పయ్యావుల.స్టేట్మెంట్ ఇవ్వడంపై చైర్మన్ అభ్యంతరం.గందరగోళం మధ్య మండలిని రేపటికి వాయిదా వేసిన చైర్మన్.మండలిలో మంత్రులపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం.బొత్స కామెంట్స్..లడ్డూపై చర్చ చేయకుండా ప్రభుత్వం పారిపోతోంది.మీ దోపిడీ కోసం దేవదేవుడిని అపవిత్రం చేస్తున్నారు.ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా..మండలిలో గందరగోళం సృష్టించిన అధికార పక్షం.లడ్డూపై చర్చ జరగకుండా అధికార పార్టీ పలాయనం.టీడీపీ నేతల గొడవతో మండలి రేపటికి వాయిదా లడ్డూపై చర్చను టీడీపీ అడ్డుకునే ప్రయత్నం..మండలిలో లడ్డుపై చర్చ అడ్డుకోవడానికి టీడీపీ సభ్యులు ప్రయత్నంప్రశ్నోత్తరాల ముగిశాయి అని ఇప్పటికే ప్రకటించిన చైర్మన్లడ్డూపై చర్చ ను ప్రారంభించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డిఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి ప్రసంగం అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్సీల గొడవస్వల్పకాలిక చర్చలో మంత్రి స్టేట్మెంట్ ఉండదు అని స్పష్టం చేసిన మండలి చైర్మన్స్టేట్మెంట్ ఇవ్వాలంటే మరోసారి ఇవ్వాలని తెలిపిన మండలి చైర్మన్స్టేట్మెంట్కి అనుమతి ఇచ్చారంటూ మంత్రి పయ్యావుల కేశవ్ వాదనఅసలు ఆ డాక్యుమెంట్ కోసం నాకు తెలియదని స్పష్టం చేసిన మండలి చైర్మన్ మండలి మరోసారి వాయిదా.. మంత్రుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ సభ్యుల అభ్యంతరం.. గాలేరు, నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుపై వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి..గాలేరు, నగరి ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పనిచేయాలి..గత ప్రభుత్వ హయాంలో జగన్ ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించారు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది..గాలేరు, నగరి ప్రాజెక్టుకు బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారు..ప్రాజెక్టు ఏపాటి లోపు పూర్తి చేస్తారో చెప్పాలి..మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం..సభ్యులు అడిగిన ప్రశ్నల గురించే మాట్లాడాలి..అడిగిన ప్రశ్నలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అడగలేదు..వైఎస్సార్సీపీ సభ్యులు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. విపక్షనేత బొత్స సత్యనారాయణ కౌంటర్..రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి సూటిగా సమాధానం చెప్పాలి..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వాస్తవమా.. కదా..కాదు అంటే కాదని చెప్పండి..ఈ ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు మొదలు పెడతారు..ఎప్పటి లోపు పూర్తవుతాయి అనేది సమాధానం చెప్పాలి..లేకపోతే తర్వాత చెప్తామని చెప్పాలి.. మంత్రి నిమ్మల రామానాయుడు..వైఎస్సార్సీపీ వాళ్లకు సమాధానాలు వినే ధైర్యం ఉంటే రేపు చర్చిద్దాం..మేం అన్నీ ప్రశ్నలపై సమాధానాలు చెప్పేందుకు సిద్ధం..పొరుగు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు అని చెప్పారు..పొరుగు రాష్ట్రంలో వల్ల రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుతారు..అధికారంలో ఉంటే ఒక రకంగా.. ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా మాట్లాడుతున్నారు..గాలేరు, నగరి సహా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నాం..మంత్రి నిమ్మల సమాధానంపై వైఎస్సార్సీపీ సభ్యుల అభ్యంతరం..సభలో పెద్దఎత్తున నినాదాలు..బొత్స సత్యనారాయణ కామెంట్స్..రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి..ఆయన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్లకు లేదా?.కాకపోతే ఇది వాస్తవం కాదు అని ఎందుకు చెప్పటం లేదు..సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా..ఎస్ ఆర్ నో సూటిగా సమాధానం చెప్పాలి..మంత్రి నిమ్మల రామానాయుడు కామెంట్స్..పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మేం తేలేదు..వైఎస్సార్సీపీ వాళ్ళే తెచ్చారు..అధికారంలో ఉన్నప్పుడు ఏం గుర్తు లేదు..అధికారం పోయి 11 సీట్లకు పరిమితం అయినప్పుడు ఇప్పుడు సీమ ప్రజలు అని మాట్లాడుతున్నారు..మంత్రి పయ్యావుల కేశవ్ కామెంట్స్..ప్రశ్నోత్తరాల సమయం ఇక గంట మాత్రమే..వైఎస్సార్సీపీ వాళ్ళు అది గుర్తుంచుకోవాలి..గత పదిరోజులుగా వైలేషన్ జరిగింది..అది ఎవరి వైపు నుంచి జరుగుతుందో అందరూ చూశారు..బొత్స సత్యనారాయణ కామెంట్స్..ఇద్దరు మాట్లాడుకుని లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలా..ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాలు మా బాధ్యత..డైవర్షన్ చేయాలనుకోవటం ధర్మమా?.బొత్స మాట్లాడే సమయంలో వాకౌట్ అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు..మేం బయటకు ఎందుకు వెళ్తాం అంటూ బొత్స ఫైర్.. ఏపీ శాసన మండలి మరోసారి వాయిదా.వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు పొంతనలేని సమాధానాలు.మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన..సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ సభ్యుల డిమాండ్.రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్న.రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు.లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేసి సీమకు అన్యాయం చేశారు.సీమ లిఫ్ట్ కడతారా? లేదా? ప్రభుత్వం చెప్పాలి. అసెంబ్లీ మీడియా పాయింట్.. టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అంతా రోడ్డు ఎక్కారుప్రభుత్వం కనీసం వారిని పిలిచి చర్చలు కూడా జరపటం లేదుఉద్యోగుల ధర్నాపై నిర్లక్ష్యం వహిస్తుందిసచివాలయ ఉద్యోగులు అంగన్వాడీలు, టీచర్స్ ఆందోళన బాట పట్టారుఉద్యోగుల గురించి పట్టించుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదుఉద్యోగులకు అధికారంలోకి రావడానికి మాయమాటలు చెప్పారుపీఆర్సీలు , ఐఆర్ ఇస్తాం అని మాయమాటలు చెప్పారుఉద్యోగుల సమస్యలు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు అధికారం రాగానే మేనిఫెస్టో పక్కన పడేశారుఉద్యోగులకు ఇచ్చిన హామీల నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాముఅధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారుఉద్యోగులకు సంబంధించి 35వేల కోట్లు బకాయిలు ఉన్నాయి అవి చెల్లించరా?పెండింగ్లో పెట్టి వాటిని కొండలాగా పెంచుకుంటూ పోతారా?ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే ఉద్యోగులంతా రోడ్లు ఎక్కారుశాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ.. ఉద్యోగులు లేకుండా నడుస్తాయా?అధికారంలోకి రావటానికి రథ చక్రాలలా ఉద్యోగులు పని చేశారునేడు ఆ చక్రాల కింద పడి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది..ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక టార్చర్ గవర్నమెంట్ లాగా ఉందిఎంతోమంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారువిద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గాని ఉద్యోగ సంఘాలతో చర్చలు కూడా జరపడం లేదు35 వేల కోట్లు ఉద్యోగులకు బకాయిలు పెట్టారు...ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరించి వారి డిమాండ్స్ నెరవేర్చాలి. 👉ఐదు నిమిషాల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన మండలిమంత్రి సమాధానంపై బొత్స సీరియస్.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై మంత్రి సమాధానం చెప్పకపోవడంపై బొత్స సీరియస్మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..సభా సంప్రదాయాలు ఉంటాయి..ఇరిగేషన్ మంత్రి ఉపన్యాసంతో మాకు అభ్యంతరం లేదు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నారా లేదా?.దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.మేం మాట్లాడుతుంటే మైక్ సౌండ్స్ తగ్గిపోతున్నాయి.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై శాసనమండలిలో ప్రశ్న..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ భాషా కామెంట్స్..శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల లోపు తెలంగాణ వాళ్ళు నీళ్లు తీసుకెళ్తున్నారు..పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 841 అడుగులకు వెళ్తే కానీ నీళ్లు అందవు..800 అడుగుల లోపు మన వంతుగా నీళ్ళు రావటానికి గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చారు..దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు పనులు ఆపించామని చెప్పారు..ఒక రాయలసీమ వాసిగా ఉన్న చంద్రబాబు సీమ నీటి హక్కుల విషయంలో తెలంగాణతో లాలూచీ పడ్డారు..రాయలసీమకు హక్కుగా రావలసిన వాటా నీళ్లు రాకుండా చేయటం న్యాయమా, ధర్మమా?.లేకుంటే ప్రాజెక్ట్ పనులు ఆపాల్సిన అవసరం లేదు..మీరు ఈ పనులు పూర్తి చేస్తారా.. లేక రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారా? వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కామెంట్స్..రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమ ప్రాంత రైతులకు, ప్రజలకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్..రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి..చంద్రబాబు తో ఏకాంత సమావేశంలో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపించాలని చెప్పారు..అయినా ఇంతవరకు టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పలేదు..పంటలు పూర్తిగా ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు..కానీ ప్రభుత్వం మాత్రం సీమ హక్కుల గురించి పట్టించుకోవటం లేదు..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కామెంట్స్..రాయలసీమ నీటి అవసరాలకు ఎత్తిపోతల పథకాలు చాలా అవసరం..రాజకీయ అవసరాల దాన్ని మూసేస్తున్నారా..దీనిపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయి..ప్రజల ఆందోళనలు ప్రభుత్వం నివృత్తి చేయాలి..అనంతరం మంత్రి సమాధానంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం..👉సభలో ఆందోళన..👉పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో సభలో గందరగోళం..👉కొద్దిసేపు విరామం ప్రకటించిన ఛైర్మన్.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రసాభాసమంత్రి సమాధానంపై అభ్యంతరం తెలియజేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుతన విజ్ఞప్తి వల్లే రాయలసీమ ఎత్తిపోతలు నిలిపివేశారు అంటూ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డిఆయన మాటలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు -
ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణను బుధవారం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన పరీక్ష కేంద్రంలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, సరైన విధంగా హాజరు నమోదు, ఇన్విజిలేటర్ల విధుల నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాయడానికి తగిన డెస్కులు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఫస్ట్ ఎయిడ్ వంటి ఏర్పాట్లు ఉన్నాయా అని పరిశీలించారు.ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందో బస్తు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, ప్రశ్నపత్రాల రవాణా, భద్రపరచడం వంటి అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, ప్రథమ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఇదే క్రమశిక్షణతో, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 98 పరీక్ష కేంద్రాల్లో 36,928 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 39,980 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 76,908 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా ఇంట ర్మీడియెట్ విద్యాధికారి బి.ప్రభాకరరావు తెలియజేశారు. -
మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన అవసరం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మందుల వినియోగంపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం వినియోగదారులు మందులు కొనుగోలు చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, యాంటీబయోటిక్స్ సరైన వినియోగం, నాణ్యమైన జనరిక్ ఔషధాల ప్రోత్సాహం వంటి అంశాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుల సూచన లేకుండా యాంటీబయోటిక్స్ను వినియోగించడం వలన యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పోస్టర్లలో లైసెన్సు కలిగిన మెడికల్ షాపుల నుంచే మందులు కొనుగోలు చేయడం, తప్పనిసరిగా బిల్ తీసుకోవడం, మందుల గడువు తేదీ పరిశీలించడం, స్వయంగా మందులు వాడకూడదని, వైద్యులు సూచించిన విధంగా పూర్తిగా కోర్సు పూర్తి చేయాలని సూచనలు ఇచ్చామన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ అమ్మకాన్ని నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నాణ్యత, భద్రత, ప్రమాణాలు పాటించే జనరిక్ ఔషధాల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. తక్కువ ఖర్చుతో సమర్థమైన చికిత్స అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని పోస్టర్ల ద్వారా తెలియజేశారన్నారు. కార్యక్రమంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.శ్రీరామమూర్తి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కె.వి.భూపేష్, బి.గోపాలకృష్ణ, జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి డి.వి.ఆర్.సాయి కుమార్, ఉపాధ్యక్షుడు కె.సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 7న విజయవాడలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వచ్చే నెల 7వ తేదీన విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఏపీ జేఏసీ, అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ గవర్నర్పేటలోని ఏపీ ఆర్ఎస్ఏ భవన్లో బుధవారం వేడుకలకు సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా దినోత్సవానికి మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉన్న హెడ్ ఆఫీసుల్లో (ప్రధాన శాఖాధిపతి కార్యాలయాలు), విజయవాడలోని అన్ని జిల్లా స్థాయి కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులంతా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మహిళా విభాగం చైర్పర్సన్ పారె లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళా దినోత్సవం అనేది కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా మహిళల హక్కులు, సమానత్వం, భద్రత, గౌరవం వంటి అంశాలపై సమాజంలో చైతన్యం కలిగించే ఉద్యమ దినమని అన్నారు. మహిళలు విద్య, ఉపాధి, నాయకత్వం వంటి రంగాల్లో ముందుకు రావాలంటే ప్రభుత్వ విధానాలు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మహిళల ఐక్యత అవసరమని తెలిపారు. వేడుకల సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ నాయకులు పలిశెట్టి దామోదరరావు, తిమ్మసర్తి నాగేశ్వరరావు, రామిశెట్టి వెంకట రాజేష్, ఎ.అర్లయ్య, మందపాటి శంకరరావు, బత్తిన రామకృష్ట పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా సీతా నగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూనీళా సమేత వైకుంఠనాథ్ పెరుమాళ్, శ్రీలక్ష్మీ హయగ్రీవ స్వామి, శ్రీ యోగాంజేయ స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. బుధవారం ఉదయం శ్రీ నారసింహ హవనం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి మంగళ శాసనాలు అందుకున్నారన్నారు. -
క్షేత్రస్థాయిలో ఉద్యోగుల పరిస్థితి దయనీయం
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(కుటుంబ వివరాలు), అక్షరాంధ్ర, మన మిత్ర, ఈ–గవర్నర్స్, పురమిత్ర యాప్, పీ–4, వాట్సప్ గవర్నర్స్, ఈ–కేవైసీ అప్డేట్, మొబైల్ అప్డేట్ సర్వేలతో పాటు ఎవరైనా ఇంటి వద్ద వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు ఎంతమంది చేస్తున్నారనే సర్వేలు కూడా చేయిస్తూ సచివాలయ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించే క్రమంలో ఉన్నతాధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ మెమోలు జారీ చేయడానికి సైతం వెనుకాడటం లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. -
యంత్రం.. ఛూమంత్రం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన అనేక పథకాలను ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయంపై ఆది నుంచి చిన్నచూపు ఉన్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా తన పాత వైఖరినే కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు బహుళ ప్రయోజనకారిగా దోహదపడిన రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చినా పేరులోనే తప్ప సేవలు పూజ్యం అన్నట్టుగా చేశారు. ఇక యంత్ర సేవా కేంద్రాలకై తే ఏకంగా మంగళం పాడేశారు. జి.కొండూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చి కుదించడం, క్రాప్ ఇన్సూరెన్స్ ను ఎత్తివేయడం, పంట నష్ట పరిహారాన్ని అందించకుండా వేధించడంతో పాటు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన యంత్ర సేవా కేంద్రాలను సైతం ఎత్తివేసి రైతులకు రాయితీపై అందించవలసిన యంత్రాలు, పరికరాల పంపిణీకి మంగళం పాడింది. రైతులు తమకు అవసరమైన యంత్రా లు, పరికరాలను అద్దెకు తీసుకోవాలంటూ రెండు యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది యాంత్రీకరణ లేనట్టే వ్యవసాయ యాంత్రీకరణ కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన యంత్ర సేవా కేంద్రా లకు మంగళం పాడిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది అంటే 2024–25 వ్యవసాయ సంవత్సరంలో తూతూమంత్రంగా వ్యవసాయ పరికరాలను అందించి చేతులు దులుపుకొంది. ఎన్టీఆర్ జిల్లాలో 1,08,859 మంది రైతులు ఉంటే 867 మంది రైతులకు మాత్రమే రూ.167.27 లక్షలతో వ్యవసాయ పరికరాలను అందించారు. రూ.274.40 లక్షలతో 35 కిసాన్ డ్రోన్లను పంపిణీ చేశారు. ట్రాక్టర్లు, ఇతర యంత్రాలేవీ పంపిణీ చేయలేదు. పంపిణీ చేసిన పరికరాలు కూడా అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో టీడీపీ సానుభూతిపరులకే అందించారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం రాయితీపై అందించిన పరికరాల ధర, బయట మార్కెట్లో లభించే పరికరాల ధరకు వ్యత్యాసం లేదని విమర్శలు వచ్చాయి. ఇక ఈ ఏడాది అంటే 2025–26 వ్యవసాయ సంవత్సరం మార్చితో ముగిస్తున్నప్పటికీ యాంత్రీకరణ ఊసే ప్రభుత్వం ఎత్తకపోవడంతో రైతుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అద్దెకు తీసుకునేలా యాప్లు రైతులకు వ్యవసాయ పరికరాలు, యంత్రాలను రాయితీపై అందించలేని చంద్రబాబు ప్రభుత్వం వాటిని అద్దెకు తీసుకునేలా ఏపీ ఎయిమ్స్, ఊబైరెజేషన్ యాప్లను అంటుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ అందుబాటులోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ జిల్లాలో ఇప్పటివరకు 12వేల మంది మాత్రమే లాగిన్ అయినట్లు తెలుస్తోంది. అది కూడా యాభై శాతంకు పైగా స్మార్ట్ఫోన్లు లేని రైతులకు కీప్యాడ్ ఫోన్లకు ఓటీపీ పంపి లాగిన్ చేయించినట్లు సమాచారం. యాప్ నిర్వాహకులకు దోచిపెట్టే సొమ్ముతో రైతులకు రాయితీపై యంత్రాలనే అందించొచ్చని రైతులంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేతల్లో కనిపించడంలేదు. వ్యవసాయ యంత్రాలు, పరికరాలు రాయితీపై అందించలేక ఇప్పుడు అద్దెకు తీసుకోవాలంటూ యాప్లను తీసుకొచ్చారు. –గుడిపూడి రమేష్, రైతు, కోడూరు, జి.కొండూరు మండలం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ఒక్కొక్క రైతు భరోసా కేంద్రానికి ఒక యూనిట్గా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరి కోత యంత్రాలకు పది శాతం రైతు వాటాతో ప్రభుత్వం అందించే 40 శాతం రాయితీతో కలుపుకొని ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా 50 శాతం రుణాలను మంజూరు చేయించింది. ఈ విధంగా ఒక్కొక్క యంత్ర సేవా కేంద్రానికి రూ.15లక్షల విలువ చేసే ట్రాక్టరు, యంత్ర పరికరాలను అందజేశారు. క్లస్టర్ యంత్ర సేవా కేంద్రంలో ఏర్పడిన రైతు గ్రూపునకు రూ.25లక్షల విలువ చేసే వరికోత యంత్రాన్ని అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 267 రైతు భరోసా కేంద్రాలకు గానూ 257 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, 34 క్లస్టర్ లెవెల్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.32.84కోట్ల విలువగల 1667 వ్యవసాయ పరికరాలు, 35 వరికోత యంత్రాలు, 183 ట్రాక్టర్లను రైతులకు అందజేశారు. ఈ విధంగా ప్రభుత్వం నుంచి రూ.11.83కోట్ల రాయితీని రైతులు పొందారు. పోయిన సంవత్సరం తూతూ మంత్రంగా వ్యవసాయ పరికరాలను అందించిన ప్రభుత్వం ఈ ఏడాది అది కూడా చేతకాక అద్దెకు తీసుకునేలా యాప్ తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం. –మండల శేషయ్య, రైతు, మునగపాడు, జి.కొండూరు మండలం -
సర్వం సర్వేల మయం
క్షేత్రస్థాయిలో సిబ్బందికి ప్రాణాంతకంపెడన: చంద్రబాబు ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై సర్వేల భారం మోపుతోంది. ఉద్యోగులు తమ దైనందిన విధులకు తోడు ఈ సర్వేల కారణంగా అదనపు భారం మోయలేక శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం లక్ష్యాల సాధనలో భాగంగా ముంచెత్తుతున్న సర్వేల భారంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతూ సతమతమవుతున్నారు. ప్రధానంగా వైద్య శాఖలో ఏఎన్ఎంలు, రెవెన్యూ శాఖలో వీఆర్వో లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం ఇష్టానుసారంగా భారం మోపుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన ఆరోగ్య సిబ్బంది సర్వేల పేరిట ఇంటింటికీ పరుగులు తీయాల్సివస్తోంది. దీంతో ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ఏఎన్ఎంల ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక రెవెన్యూ సిబ్బంది సంగతి సరేసరి. విద్యుత్శాఖలోని సిబ్బంది సైతం విద్యుత్ సర్వీసులకు ఆధార్ అనుసంధానంపై సర్వే పేరిట పరుగులు తీయాల్సివస్తోంది. వీరంతా క్షణం తీరిక లేకుండా తమకు అప్పగించిన సర్వేలను పూర్తి చేయడానికి నానా అగచాట్లు పడుతున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడి నెల రోజుల్లో జరగాల్సిన పనిని వారంలో పూర్తి చేయాలని, లేదంటే మెమోలు జారీ చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో వీఆర్వోలు, ఏఎన్ఎంలు, సచివాలయ ఉద్యోగులు, విద్యుత్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పని హడావుడి లో తమకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంటర్నెట్ అందక సకాలంలో వాటిని పూర్తి చేయలేక చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతూ మానసిక రుగ్మతలకు గురై బీపీ, షుగర్ వంటి రోగాల బారిన పడుతున్నారు. వారంలో ఆరు రోజులు సర్వేలతో తీవ్ర మనో వేదనకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఒకదాని వెంట మరొకటి... వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంల పరిస్థితి మరీ దారుణం. ఒక సర్వే పూర్తి కాక ముందే మరో సర్వే నెత్తిన పెడుతున్నారని, రోజుకు 24 గంటలు పనిచేసినా లక్ష్యాలు పూర్తి కావని, అధికారుల వేధింపులతో పాటు వైద్యులు చెప్పిన పని చేయకపోతే జీతం రాదని బెదిరింపులు కూడా ఎక్కువయ్యాయని వాపోతున్నారు. వీఆర్వోలకు కూడా సర్వేలతో పాటు రెవెన్యూపరమైన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, వాటిని అందించిన తరువాత వారి నుంచి వివరాల సేకరణ, రీ సర్వే, మధ్య మధ్యలో బీఎల్వో(ఎన్నికల) విధులు, ఇవి కాకుండా నీటి తీరువా వసూళ్లు టార్గెట్ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడాలు లేకుండా ఒకటో తేదీన ఆదివారం సెలవు రోజు వస్తే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేయించడం చేయిస్తూ సర్వేలతో సెలవులు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారంటూ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. చివరకు పండగ రోజుల్లో కూడా విధులు నిర్వర్తించాలంటూ అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని వాపోతున్నారు. డిపార్ట్మెంట్ జాబ్ చార్టు ప్రకారం ఏ విధులు నిర్వహించాలో కూడా స్పష్టత లేకుండా ఒకేసారి అన్ని విధులూ చేయలేక మానసిక ఆందోళనకు గురవుతున్నామని వాపోతున్నారు. పనిభారం అధికమై ఇటీవల సచివాలయ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలను సైతం సమర్పించారు. అయినా ఫలితం లేకపోయింది. సర్వత్రా విమర్శలు ఉన్నతాధికారులు సర్వేల పేరుతో సిబ్బందిని ఒత్తిడికి గురి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది పని భారాన్ని గమనించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సర్వేల్లో భాగంగా ఓటీపీలు చెప్పడానికి ప్రజలు నిరాకరిస్తున్నారన్నారు. ఒక్కో కుటుంబాన్ని సర్వే చేయడానికి అరగంట సమయం పడుతోంది. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సర్వేల ఒత్తిడిని తగ్గించాలని ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు కోరుతున్నారు. చంద్రబాబు సర్కారులో క్షేత్రస్థాయిలో ఉద్యోగులు నిరంతర సర్వేలతో సతమతమవుతున్నారు. పని ఒత్తిడితో మానసిక వేదనకు గురవుతున్నారు. తమ బాధలు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉద్యోగుల హఠాన్మరణాలు, బలవన్మరణాలు జరుగుతున్నాయి. అయినా పాలకుల వైఖరి మారడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్సాహంగా లెజిస్లేటివ్ స్పోర్ట్స్మీట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, శాసనసభ్యులు(లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్–2026) నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలాచారి ఇండోర్ స్టేడియంలలో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది. స్పోర్ట్స్ మీట్లో రెండో రోజైన బుధవారం క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్(పురుషులు, మహిళలు), పికల్బాల్ (మెన్), మ్యూజికల్ చైర్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రికెట్ పోటీల్లో మొదటి మ్యాచ్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సత్యకుమార్ యాదవ్ జట్ల మధ్య పోటీ జరిగింది. పల్లా శ్రీనివాసరావు జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 69 పరుగులు సాధించింది. 70 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన మంత్రి సత్యకుమార్ యాదవ్ జట్టు 7 వికెట్ల తేడాతో సునాయాసంగా 70 పరుగులు సాధించి విజయం సాధించింది. -
చైన్ స్నాచర్గా మారిన లైన్మన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): వేర్వేరు ప్రాంతాల్లో చోరీ అయిన, పోగొ ట్టుకున్న 122 ఫోన్లను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. వాటిని బుధవారం తిరిగి బాధితు లకు అందజేశారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న మాట్లాడుతూ.. పలువురు పోగొట్టుకున్న, కొందరి నుంచి చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు. రికవరీ చేసిన 122 ఫోన్లను బాధితులకు అందించారు. ఇప్పటి వరకూ ఏడు విడతల్లో రూ.18 లక్షల విలువగల 2,468 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్లు తెలిపారు. ప్రజలు మొబైల్ పోయిన వెంటనే సీఈఐఆర్ సేవలను వినియోగించాలన్నారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు ఆలస్యం చేయ కుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ బి.రాజశేఖర్, ఇన్స్పెక్టర్లు దుర్గాప్రసాద్, శ్రీను, శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
10న కయ, విక్రయదారుల సమ్మేళనం
వాహనాల రిజిస్ట్రేషన్లను పరిశీలించిన కలెక్టర్ విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో బెయిల్ పొందిన జోగి రమేష్, జోగి రాము బెయిల్ షరతులకు విరుద్ధంగా మీడియాతో మాటాడారని, ర్యాలీ నిర్వహించారనే అభియోగంపై పోలీసులు వారిరువురి బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ 8వ అదనపు జిల్లా జ్యుడీషియల్ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్పై విచారణను న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు. ఇదే కేసులో రిమాండ్లో ఉన్న తాండ్ర రమేష్బాబు బెయిల్ పిటీషన్పై వాదనల నిమిత్తం ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి తీర్పును వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేశారు. -
కొనసాగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలు
నందిగామ రూరల్: మాదక ద్రవ్యాల వినియోగం ప్రమాదకరమైన వ్యసనమని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్బాబు పేర్కొన్నారు. డ్రగ్స్పై ప్రజలకు అవగాహన కల్పించి, వాటి వాడకాన్ని నియంత్రించేందుకు పోలీసు శాఖ చేపట్టిన డ్రగ్స్పై దండయాత్ర సైకిల్ ర్యాలీ బుధవారం నందిగామకు చేరింది. మండలంలోని మునగచర్ల వద్ద సైకిల్ ర్యాలీకి ఏసీపీ లతాకుమారి, సీఐ వై.వి.ఎల్.నాయుడు పాఠ శాల విద్యార్థులతో కలిసి స్వాగతం పలికారు. సీపీ రాజశేఖర్ బాబు, సినీ నటుడు సుమన్ మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీకరం కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. డ్రగ్స్పై అవగాహన కలిగించేందుకు చేపట్టిన సైకిల్ ర్యాలీకి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 470 కిలో మీటర్ల మేర ర్యాలీ జరిగిందని తెలిపారు. బాధ్యతాయుతంగా నడుచుకోవాలి.. యువత డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిసవకుండా యువత బాధ్యతాయుతంగా నడుచు కోవాలని సినీ నటుడు సుమన్ సూచించారు. డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఆరోగ్యం దెబ్బతినటంతో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. అనంతరం సైకిల్ యాత్ర చేపట్టిన మహిళా పోలీసులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డీసీపీ అడ్మిన్ సరిత, ఏసీపీలు లతాకుమారి, తిలక్, ఎస్ఐలు సూర్య వంశీ, మోహనరావ తదితరులు పాల్గొన్నారు. డే కేర్ సెంటర్లో అమానుషం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవానీపురం స్టేషన్ పరిధిలోని ఓ డే కేర్ సెంటర్లో అమానుష ఘటన వెలుగుచూసింది. డే కేర్ సెంటర్కు వెళ్లిన చిన్నారికి ఒంటిపై, ప్రైవేటు భాగాల్లో కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటన పై భవానీపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. విద్యాధరపురానికి చెందిన ఓ చిన్నారి ఎనిమిది నెలలుగా డే కేర్ సెంటర్కు వెళ్తోంది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డే కేర్ సెంటర్ నిర్వాహకుల సంరక్షణ లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీ 11.30 గంటల ప్రాంతంలో సెంటర్ నిర్వాహకులు బాలిక పిన్నికి ఫోన్ చేసి పాపకు డ్రెస్ తీసుకుని రావాలని సూచించారు. ఆమె వెంటనే సెంటర్కు వెళ్లింది. అప్పుడు బాలిక ఒంటిపై దుస్తులు లేవు. తనతో తీసుకెళ్లిన డ్రెస్ వేసి చిన్నారిని ఇంటికి తీసుకెళ్లింది. ఇంటికి వెళ్లిన తర్వాత బాలిక చెంపల కింద గాయం కనిపించింది. ప్రైవేటు భాగాల్లో ముందు, వెనుక కాలిన గాయాల తరహాలో గుర్తులు కని పించాయి. దీనిపై సెంటర్ సిబ్బందిని ఏం జరిగిందని బాలిక కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. బాలిక ఆడుకుంటూ సోప్ ఆయిల్, ఫెనాయిల్ పడిపోయిన చోట కూర్చుందని చెప్పారు. బాలిక మాత్రం తనను టీచర్ కొట్టిందని తల్లికి చెప్పింది. బాలికకు వైద్యం అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక తల్లిదండ్రులు డే కేర్ సెంటర్లోని ఓ టీచర్పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెకు ప్రైవేటు భాగాల్లో కాలిన గాయాలు కావడానికి టీచర్ కారణమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పటమట(విజయవాడతూర్పు): ముదిరాజ్ సోదరులు ఎంతగానో ఎదురు చూస్తున్న ముదిరాజ్ కార్పొరేషన్ను వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.మారేష్ పేర్కొన్నారు. పటమటలోని సంస్థ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ముదిరాజులను ఎమ్మెల్యేగా చేసిందని, మంత్రి పదవి కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ముదిరాజ్ కార్పొరేషన్ ప్రకటించకపోవడం వారిని నిరాశకు గురి చేయడమేనని పేర్కొన్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజు సోదరులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి జీవన స్థితిగతులను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. -
రాజాధిరాజ వాహనంపై నృసింహుడు
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన బుధవారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాన్ని తిలకించిన వారు సుఖ సంతోషాలతో వెలుగొందుతారని నమ్మకం. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించు కుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కైంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. నేడు యాలి వాహనంపై.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం రాత్రి యాలివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలను భక్తులు తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. -
బాలుడిపై వీధి కుక్కల దాడి
తీవ్రగాయాలతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చిట్టినగర్(విజయవాడపశ్చిమ): స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న 9 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు విచ్చక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన కొత్తపేట ఆంజనేయవాగు సెంటర్లో చోటు చేసుకుంది. కొత్తపేట ఆంజనేయవాగు కొండ ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల రాచకొండ రిషి కస్తూరి సీతారామయ్య స్కూల్ రెండో తరగతి చదువుతున్నాడు. తండ్రి శివ, తల్లి చిన్ని చేపల మార్కెట్లో బట్టల వ్యాపారం చేస్తుంటారు. మంగళవారం ఉదయం స్కూల్కు వెళ్లిన రిషి సాయంత్రం నాలుగు గంటలకు తోటి విద్యార్థులు, స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. వాగు సెంటర్లోని బాలభక్త సమాజం మీదుగా కొండపై వాటర్ ట్యాంక్ వైపునకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో బాలభక్త సమాజం వద్దకు వచ్చేసరికి రోడ్డుపై కుక్కలు గుంపులుగా ఉండటంతో భయంతో ఓ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లసాగాడు. వెంటనే మూడు కుక్కలు గుంపుగా రిషిపై పడి తీవ్రంగా గాయపరిచాయి. విరిగిన ముక్కు ఎముక.. కుక్కలు రిషి ముఖంపై కరవడంతో ముక్కు ఎముక విరిగిపోవడంతో పాటు ముఖంపై పలు చోట్ల గాయాలయ్యాయి. ఇంతలో స్థానికులు రిషిని కుక్కల బారి నుంచి కాపాడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, స్థానికులు హుటాహుటిన రిషిని కొత్తపేటలో ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించగా, అక్కడి వైద్యులు బాలుడిని పరీక్షించి, కొత్త ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో రిషి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆటోలో కొత్త ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు రిషిని పరీక్షించి ఆపరేషన్ చేయాలని సూచించారు. -
‘బాబూ’.. తప్పుదోవ పట్టించొద్దు!
● రైతులను ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదు ●న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే సమ్మె ●సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు చల్లపల్లి: కో–ఆపరేటివ్ ఇన్చార్జి కమిషనర్ బాబు సహకార సొసైటీలపై లేనిపోనివి చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చండ్ర రవికుమార్, కృష్ణాజిల్లా జిల్లా అధ్యక్షుడు తోట కృష్ణారావు ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు ఈనెల 16వ తేదీ నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. కాగా అవనిగడ్డ నియోజవర్గంలోని 37 సొసైటీలకు చెందిన 130 మంది ఉద్యోగులు, సిబ్బంది స్థానిక కేడీసీసీ బ్యాంక్ వద్ద మంగళవారం సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సహకార సంఘాలు 40 శాతం నష్టాల్లో ఉన్నాయన్నది వాస్తవమైతే ఆ నష్టాలకు కారకులెవరో కమిషనర్ బాబు ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. అందరం చిన్న ఉద్యోగులమని కింది స్థాయిలో రైతాంగానికి విత్తనం దగ్గర నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకూ ఏన్నో సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవం బాధాకరమన్నారు. న్యాయ పోరాటానికి సిద్ధం.. ఇతర రాష్ట్రాల్లో ఏజెన్సీల ద్వారా సొసైటీల కంప్యూటరీకరణ చేయిస్తే.. మన రాష్ట్రంలో మాత్రం కమిషనర్ తమతోనే అన్ని కంప్యూటీకరణ పనులు చేయించారని కృష్ణారావు చెప్పారు. కంప్యూటర్ సిబ్బందిని రెగ్యులర్ చేయకపోతే న్యాయపోరాటానికై నా తాము సిద్ధమని పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము సమ్మెకు దిగాల్సి వచ్చిందని రైతులను ఇబ్బంది పెట్టాలని గానీ, సొసైటీలను నష్టపెట్టాలని గానీ తమ ఉద్దేశం కాదని విన్నవించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే యూనియన్ నాయకుల ఆదేశాల మేరకు ఆమరణ నిరాహార దీక్షకు కూడా తాము సిద్ధమని స్పష్టం చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు కోసూరు రామాంజనేయులు, సహకార సంఘాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పాలిసెట్ పోస్టర్ ఆవిష్కరణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన కల్పటపు శేషశాయి, అడవి రాధాకృష్ణమూర్తి, రమాదేవి, ప్రసాద్ రూ.లక్ష విరాళంగా సమర్పించారు. మంగళవారం ఉదయం ఆలయానికి విచ్చేసిన వారు తొలుత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మదుసూధనరావును కలిసి విరాళం అందజేశారు. వారి కుటుంబీకులు కల్పటపు కామేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, బాల సూర్యనారాయణమూర్తి పేరిట రూ.లక్ష, కల్పటపు వీరభద్రయ్య, శేషమ్మ పేరిట రూ.లక్ష చొప్పున విరాళాలను అందజేశారు. దాతలను ఆలయ అధికారులు సత్కరించారు. మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలో ఇంటర్మీ డియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయని డీఐఈఓ ఎస్.సరళ కుమారి తెలిపారు. మొత్తం 63 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరు గుతున్నాయని పేర్కొన్నారు. 21,763 మంది విద్యార్థులకు 21,584 మంది పరీక్షలకు హాజరయ్యారయ్యారని వివరించారు. మరో 179 మంది గైర్హాజరయ్యారని, 98 శాతం హాజరు నమోదైందని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం సెట్–2 ప్రశ్న పత్రాన్ని వినియోగించామని తెలిపారు. మచిలీపట్నంఅర్బన్: క్రీడలు శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయని కృష్ణా జిల్లా క్రీడా ప్రాధి కార అధికారి కె.ఝాన్సీలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ.. బాలురకు పది, బాలికలకు ఆరు కిలోమీటర్ల దూరంలో మాస్ పార్టిసిపేషన్, టైమింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించామన్నారు. గన్నవరం, కంకి పాడు, గుడివాడ, గూడూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. అండర్–18 విభాగంలో విజేతలుగా నిలిచిన బాలురు, బాలికలు 28 మంది ఆదివారం విజయవాడ రూరల్ మండ లంలోని నున్న వద్ద జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలి పారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎం.అరుణ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కేబుల్ వైర్లకు మంటలు.. తప్పిన ముప్పు
మధురానగర్(విజయవాడసెంట్రల్): నిత్యం రద్దీగా ఉండే చుటుగుంట సిగ్నల్స్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 3.10 గంటలకు విద్యుత్ స్తంభానికి కట్టి ఉన్న నెట్ కేబుళ్ల వద్ద మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు వ్యాపించటంతో విద్యుత్ ఫీడర్ ట్రిప్ అయ్యింది. సమాచారం అందుకున్న చుట్టుగుంట విద్యుత్ సబ్స్టేషన్ ఈఈ వెంకట్రావు సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం నీరు, ఇసుక, నిచ్చెనలు, గడకర్రలు తాళ్లు ఉపయోగించి మంటలను అదుపు చేసి, పాడైన ఇన్సులేటర్ను మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి విద్యుత్ సిబ్బంది మంటలు అదుపు చేసి, విద్యుత్ సరఫరా పునరుద్దరించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేబుల్, నెట్వైర్లు విద్యుత్ స్తంభాల వద్ద చుట్టగా చుట్టి వదలివేయటం వల్ల అధిక వేడి వల్ల మంటలు వచ్చే ప్రమాదం ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. -
పన్నులు సజావుగా వసూలు చేయాలి
చిలకలపూడి(మచిలీపట్భం): జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు సజావుగా వసూలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఆయన చాంబర్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఆస్తులు, భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలన్నారు. తప్పనిసరిగా వస్తు సేవల పన్నులు వసూలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పౌర సరఫరాలు, తూనికలు కొలతలు, గనులు భూగర్భ శాఖల అధికారులు టాస్క్ఫోర్స్ ఏర్పాటై ఉమ్మడిగా వాహనాలను తనిఖీ చేసి వస్తుసేవల పన్ను వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ జి. కల్పన, అదనపు ఎస్పీ వి. నాయుడు, వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్లు సౌమ్య, జగదీష్, రాజకుమార్, డీపీఓ డాక్టర్ జె. అరుణ, డీఎస్ఓ మోహన్ బాబు జెడ్పీ డెప్యూటీ సీఎం సీఈఓ ఆనంద్ కుమార్. జిల్లా ఆడిట్ అధికారి సూర్య ప్రకాష్ రావు జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
నాంచారమ్మ తిరునాళ్లకు పటిష్ట ఏర్పాట్లు
విశ్వనాథపల్లి(కోడూరు): గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఏర్పాట్లపై స్థానిక ఆలయ ప్రాంగణంలో అధికారులు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎంపీడీఓ సుధాప్రవీణ్ మాట్లాడుతూ.. మార్చి రెండు, మూడు తేదీల్లో జరిగే అమ్మవారి ప్రధాన జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కృష్ణాజిల్లాతో పాటు గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే జాతరకు సుమారుగా లక్ష మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. జాతర అనంతరం మూడో తేదీన చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆలయాన్ని మూసివేసి తిరిగి రాత్రికి తెరచి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈఓ తిక్కశెట్టి వీరవెంకట మోహనరావు తెలిపారు. ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని సీఐ యువకుమార్ తెలిపారు. జాతరకు వచ్చే వాహనాలను వి.కొత్తపాలెం మీదుగా, తిరుగు ప్రయాణంలో నరసింహపురం మీదుగా పంపించనున్నట్టు చెప్పారు. ఇద్దరు సీఐల పర్యవేక్షణలో పది మంది ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుళ్లు బందోబస్తును పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కిరణ్మయి, ఎస్ఐ చాణక్య, ఆలయ కమిటీ చైర్మన్ తోట సూర్యనరసింహారావు, సర్పంచ్ కొప్పనాతి శేషుబాబు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం కార్యదర్శి కొప్పనాతి వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
● ఇంటి వద్దకే పసుపు గానుగ
ఆలోచన ఉంటే ఉపాధి మార్గం వెతుకోవచ్చు అంటారు.. అదే ఆలోచనతో స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు హైదరాబాద్కు చెందిన ఇస్సాక్ కుటుంబ సభ్యులు. రూ. లక్ష పెట్టుబడితో పసుపు గానుగ పట్టే యంత్రాన్ని కొనుగోలు చేసి వ్యాన్లో అమర్చారు. తమతో పాటుగా నాణ్యమైన నిజామాబాద్ పసుపు కొమ్ములను తీసుకొచ్చి పసుపు గానుగ ఆడిస్తున్నారు. వీరు మంగళవారం కంకిపాడు పరిసరాల్లో సంచరిస్తూ విక్రయాలు చేపడుతున్నారు. పావుకిలో పసుపు రూ. 100, కిలో రూ. 400 చొప్పున విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. నాణ్యమైన పసుపు, కళ్లెదుటే గానుగ ఆడించి ఇవ్వటంతో పసుపు కొనుగోళ్లు చేసేందుకు కంకిపాడు పట్టణ వాసులు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా ఇస్సాక్ను ‘సాక్షి’ పలుకరించగా, ప్రజలు మన వద్దకు రావాలని చూడటం కంటే వారి వద్దకే వెళ్లి విక్రయాలు చేపట్టడం మేలని, ఈ తరహాలో విక్రయాలు చేస్తున్నట్లు చెప్పారు. – కంకిపాడు -
దుర్గమ్మ సేవలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సీఎస్ విజయానంద్ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీనానాయక్ సీఎస్ విజయానంద్కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్ర దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. హరి జవహర్లాల్ మంగళవారం తెల్లవారుజామున అమ్మవారి ఖడ్గమాలార్చనలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అమ్మవారి ఖడ్గమాలార్చనలో పాల్గొనేందుకు తెల్లవారుజాము 4 గంటలకు ఆలయానికి చేరుకున్న హరిజవహర్లాల్కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి ఖడ్గమాలార్చన, మల్లేశ్వర స్వామి వారి విశేష అభిషేకాలలో పాల్గొన్న అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం, పట్టువస్త్రాలను అందించారు. వీరులపాడు: ఒంటరిగా తిరుగుతున్న మానసిక స్థితి సరిగా లేని ఆరేళ్ల బాలుడిని ఆటో డ్రైవర్ గమనించి పంచాయతీ కార్యాలయంలో అప్పగించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన దార్ల నాగరాజు కుమారుడు అనీష్ మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి మధిర రోడ్డు మీదుగా నడుచుకుంటూ జుజ్జూరు గ్రామానికి చేరుకున్నారు. గ్రామ శివారులో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గమనించిన ఆటో డ్రైవర్ హనుమంతరావు ఆటోలో ఎక్కించుకుని వచ్చి జుజ్జూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ఉద్యోగులకు అప్పగించాడు. పంచాయతీ సిబ్బంది విషయాన్ని సర్పంచ్ రమావత్ కోటికి తెలుపగా సర్పంచ్ భర్త రాము బాలుడి ఫొటోతో సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు. విషయం తెలుసుకుని జుజ్జూరు గ్రామానికి వచ్చిన తల్లిదండ్రులకు సర్పంచ్ బాలుడిని అప్పగించారు. తమ కుమారుడిని క్షేమంగా అప్పగించిన సర్పంచ్ కోటి, భర్త రాము, ఆటో డ్రైవర్కు కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యుత్ అదాలత్కు 12 అర్జీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ వినియోగదారుల అదాలత్కు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని టౌన్ ఈఈ రవీంద్రబాబు తెలిపారు. మంగళవారం విజయవాడ ఏపీసీపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ కాన్ఫరెన్స్ హలు నందు సీజీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టౌన్ డివిజన్కు సంబంధించిన 16 సెక్షన్లకు సంబంధించి అదాలత్లో మొత్తం 12 మంది వినియోగదారులు తమ సమస్యలపై అర్జీలు అందజేశారన్నారు. వీటిలో స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, వేలాడే విద్యుత్ తీగలు సరిచేయాలని, లైన్ షిఫ్టింగ్ వంటి పలు అంశాలపై వినియోగదారులు అదాలత్లో ఫిర్యాదు చేశారన్నారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎన్. విక్టర్ ఇమ్మానుయేలు అధ్యక్షతన జరిగిన అదాలత్లో సాంకేతిక సభ్యుడు డి. కృష్ణానాయక్, ఆర్థిక సభ్యుడు కె. కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ. సునీత, ఎస్ఈ యు. హనుమయ్య పాల్గొని అర్జీలను స్వీకరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక మధుచౌక్లోని మొగల్ ఎగ్జిబిషన్ హాలులో ఈ నెల 28 శనివారం నుంచి మార్చి 8వ తేదీ వరకు మహిళా ఉత్సవ్–2026ను నిర్వహిస్తున్నామని జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు వారే స్వయంగా విక్రయించేందుకు ఏటా ఈ మహిళా ఉత్సవ్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 28వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, డీఆర్డీఏ ఎన్టీఆర్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎన్వీ నాంచారయ్య, జన శిక్షణ సంస్థాన్ వైస్ చైర్పర్సన్ గోళ్ల వాణీ హాజరై మహిళా ఉత్సవ్ను ప్రారంభిస్తారని చెప్పారు. -
గుర్తు తెలియని మహిళ మృతి
పెనమలూరు: పోరంకిలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఆస్పత్రిలో చేర్చగా ఆమె మంగళవారం మృతి చెందింది. ఎస్ఐ ఉషారాణి తెలిపిన వివరాల ప్రకారం పది రోజుల క్రితం పోరంకి సెంటర్లో గుర్తు తెలియని మహిళ(50) పడిపోయి ఉండటంతో స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది ఆమెను విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్సకై చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు. మృతురాలు యాచకురాలని, ఆమె వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
ఎలుకల మందు తాగి మహిళ ఆత్మహత్య
గుడివాడరూరల్: ఎలుకల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై గుడివాడ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తటివర్రు గ్రామానికి చెందిన కొల్లూరి జాన్ భార్య మరియమ్మ(40) గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోందన్నారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం పొలం వెళ్లేందుకు మరియమ్మ భర్త అడుగగా కడుపునొప్పిగా ఉందని తాను రాలేనని చెప్పడంతో, సరేనని భర్త పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో పొలం నుంచి ఇంటికి వచ్చిన భర్తకు కడుపు నొప్పిగా ఉందని తాగేందుకు కూల్డ్రింక్ తీసుకురావాలని కోరిందని, ఈ క్రమంలో తీసుకువచ్చి ఇచ్చాడు. రాత్రి 11గంటల సమయంలో మరియమ్మకు వాంతులు అవుతుండగా కుమారుడు వచ్చి ప్రశ్నించగా తాను ఎలుకల మందు తాగినట్లు మరియమ్మ తెలిపిందన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వైద్య సేవల నిమిత్తం తరలించగా మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. కంకిపాడు: జాతీయ రహదారిపై ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాద స్థాయి ఊహించని విధంగా ఉన్నా, ప్రాణాపాయం లేకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం కంకిపాడు–గోసాల సెంటర్ గ్రామాల నడుమ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ప్రమాదాల వివరాల్లోకి వెళితే.. కంకిపాడు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆటోకి డీజిల్ అయిపోవటంతో మరో ఆటో డ్రైవరు తన కాలితో ఆటోను వెనుక నుంచి నెడుతూ ఆటో నడుపుతున్నాడు. కంకిపాడు బైపాస్ దాటగానే వాహనాలు అదుపుతప్పి జాతీయరహదారిపై పల్టీ కొట్టాయి. ఒక ఆటో ఏకంగా పంట బోదెలోకి దూసుకెళ్లింది. అయితే ఆటోలో డ్రైవర్లు మినహా ఎవరూ లేరు. వారికి కూడా స్వల్ప గాయాలే అయ్యాయి. గోసాల గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు జాతీయరహదారిపై పడ్డ ఆటోను రోడ్డు మార్జిన్కు తరలించి, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకున్నారు. కారును ఢీకొట్టిన టిప్పరు.. ఇదే సమయంలో కంకిపాడు నుంచి గోసాల వైపు వెళ్తున్న కారును వెనుకగా వస్తున్న భారీ టిప్పరు ఢీకొంది. కారులో ఉన్న భార్యాభర్తలు, వారి కుమారుడు ప్రాణభయంతో కేకలు పెట్టారు. టిప్పరు ఢీకొనటంతో కారు డోర్లు ధ్వంసమై ఇరుక్కుపోవటంతో భయాందోళనలు చెందారు. అక్కడే ఉన్న పారిశుద్ధ్య కార్మికులు అతికష్టం మీద కారు డోర్లు తెరవటంతో ఆ కుటుంబం ఊపిరిపీల్చుకుంది. ఈ రెండు ప్రమాదాల్లోనూ ఎవరికీ ప్రాణాపాయం లేకపోవటంతో అంతా ఊపిరితీసుకున్నారు. -
శక్తి పునరుద్ధరణ కోసం మహా కుంభాభిషేకం
● మార్చి 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శక్తి పునరుద్ధరణ కోసం మహా కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి ఆరో తేదీన ప్రారంభమయ్యే ఈ మహోత్సవ ఏర్పాట్లను కలెక్టర్, దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈఓ శీనానాయక్, జిల్లా అధికార యంత్రాంగం, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదిక వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులతో కలిసి మీడియా సమావేశం నిర్వ హించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. 12 ఏళ్లకు ఒక సారి మహా కుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు. చివరి సారిగా 2014 ఫిబ్రవరిలో ఈ వేడుక జరిగిందన్నారు. మార్చి ఆరో తేదీ ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిజీ చేతుల మీదగా ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఎనిమిదో తేదీ ఉదయం 9.45 గంటలకు కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదగా కుంభాభిషేకం జరుగుతుందన్నారు. ఉత్స వంలో సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారని తెలిపారు. మహా కుంభాభిషేకంలో ఆలయ బంగారు గోపుర సంప్రోక్షణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభోట్ల దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో వేద పండితులు క్రతువులు నిర్వహిస్తారన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవా లకు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. చైర్మన్ చాంబర్లో సమీక్ష కుంభాభిషేకం ఏర్పాట్లపై జిల్లా అధికారులు, దుర్గగుడి అధికారులు చైర్మన్ చాంబర్లో సమీక్ష జరిపారు. గతంలో నిర్వహించిన కుంభాభిషేకం విశేషాలను ఆలయ వైదిక కమిటీ సభ్యులు కలెక్టర్కు వివరించారు. ఆలయ వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, ఎల్.దుర్గాప్రసాద్, ఎం.షణ్ముఖేశశాస్త్రి, వి.శ్రీధర్, ఈఈ కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
అకాల వర్షం.. పంటలకు నష్టం
తిరువూరు/గంపలగూడెం: తిరువూరు నియోజకవర్గంలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాలవర్షానికి వాణిజ్య పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. తిరువూరు మండలంలో 8.2 మిల్లీ మీటర్లు, గంపలగూడెంలో 3.4, విస్సన్న పేటలో 2.6, ఎ.కొండూరులో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంపలగూడెం మండలంలో ఐదు వేల ఎకరాల్లో మిర్చిపంట సాగు చేయగా, మొదటి కోతను కల్లాల్లో ఆరబోసిన మిర్చి నీటిపాలైందని తునికిపాడు, దుందిరాలపాడు, ఊటుకూరు, నెమలి, రాజవరం, కొణిజర్ల గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ ఇస్తున్న ప్రోత్సాహంతో గంపలగూడెం మండలంలో 8వేల ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్న రైతులు కూడా అకాలవర్షం కారణంగా నష్టపోయామని వాపోతున్నారు. 70 శాతం పంట వర్షం కారణంగా పాడవడంతో ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలవాలిన మొక్కజొన్న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఎ.కొండూరు మండలంలో మొక్కజొన్న నేల వాలింది. మండలంలోని వల్లంపట్ల, పోలిశెట్టిపాడు, గొల్ల మందల, మాధవరం, రేపూడి తదితర గ్రామాల్లో 250 ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. తిరువూరు మండలంలోని ఎర్రమాడు, కొమ్మిరెడ్డిపల్లి, రాజుగూడెం గ్రామాల్లో మిర్చి పంటకు పాక్షికంగా నష్టం జరిగిందని రైతులు తెలిపారు. అకాల వర్షం కారణంగా కలిగిన పంటనష్టం అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. గంపలగూడెం మండలం ఊటుకూరులో నేలకొరిగిన మొక్కజొన్న పంట వర్షంతో తడిసిన మిర్చి మిర్చి, మొక్కజొన్న రైతుల దిగాలు పంట నష్టం అంచనా వేస్తున్న అధికారులు చేతికందే దశలో వాణిజ్య పంటలు నేలపాలు -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేయాలి ● సమస్యల సుడిలో జనరల్ నర్సింగ్ విద్యార్థులు ● భోజనంలో సుద్ద అన్నం, నీళ్ల చారు ● థియరీ బోధనకు తరగతి గదులు కరువు ● వైద్య మంత్రికి సమస్యలను వివరించిన విద్యార్థులు ● రెండు నెలలు అవుతున్నా మంత్రి తీసుకున్న చర్యలు శూన్యంలబ్బీపేట(విజయవాడతూర్పు): జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థులు అరకొర సౌకర్యాలతో సతమతవుతున్నారు. థియరీ పాఠాలు బోధించేందుకు తరగతి గదులు సరిపడా లేవు. నివసించేందుకు సైతం అవసరమైనన్ని గదులు కరువయ్యాయి. సుద్ద అన్నం, నీళ్ల చారుతో కూడిన భోజనం మింగుడు పడక ఇబ్బందిపడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించండి సారూ అంటూ వైద్య శాఖ మంత్రికి విన్నవించారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి రెండు నెలలు గడిచినా ఏ ఒక్క సమస్యా ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదు. తమ పరిస్థితి ఇంతేనా, సమస్యలతో సహవాసం చేయాల్సిందేనా అని జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మదనపడుతున్నారు. ప్రభుత్వాస్పత్రికి అనుబంధంగా నర్సింగ్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థులు 300 మంది వరకూ ఉన్నారు. వారికి అక్కడే వసతి సౌకర్యంతో పాటు, తరగతులు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వాస్పత్రిలో క్లినికల్ శిక్షణ పొందుతుంటారు. గతంలో నర్సింగ్ స్కూల్ నిర్వహించిన భవనంలో సగ భాగాన్ని బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు కేటాయించారు. దీంతో జీఎన్ఎం విద్యార్థులకు తరగతి గదులు, వసతి గదులు చాలడం లేదు. థియరీ పాఠాలు వినేందుకు తరగతి గదులు, వసతి పొందేందుకు గదులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గదుల కొరతతో ఒక్కోసారి ఆరుబయట నిర్వహిస్తున్న తరగతులకు హాజరై పాఠాలు వినాల్సిన దయనీయ స్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు. తమకు అందిస్తున్న భోజనం తిన లేని విధంగా ఉంటోందని జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థులు వాపోతున్నారు. సుద్ద అన్నం, నీళ్ల చారుతో ముద్ద మింగుడు పడటం లేదని, ఒక్కొక్క సారి ఉడికీ ఉడని అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ భోజనం అరగక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో ఇచ్చే బియ్యంతో అన్నం వండుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగుల ధర్నా కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న సహకార సంఘాల ఉద్యోగులు 7గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులపై ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన డీడబ్ల్యూఎస్ఎం సమావేశం మంగ ళవారం జరిగింది. జేజేఎం–కుళాయి కనెక్షన్లలో పురోగతి, పథకం పనితీరుపై సమీక్షించారు. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్)– ఓడీఎఫ్ ప్లస్, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, నీటి నాణ్యత పర్యవేక్షణ, నిఘా తదితరాలపై చర్చించారు. ఎ.కొండూరు మండలంలోని సీకేడీ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటి కుళాయి కనెక్షన్ల భౌతిక స్థితిని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. 100 శాతం కనెక్షన్లు కల్పించేందుకు డీపీఓకు ఆదేశాలిచ్చారు. గొల్లమండల తండా, జమలగడ్డ, దీప్లానగర్కు మార్చి నాటికి తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటికి కొరత లేకుండా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎ. రామకృష్ణారావు, డీపీఓ పి.లావణ్యకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి పాల్గొన్నారు. నందివాడ: కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్కుమార్ మంగళవారం నందివాడ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. రికార్డులను, ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి నగరంలోని కొత్తపేటకు చెందిన భక్తుడు సుంకర వెంకటేశ్వరరావు మంగళవారం రూ.1,00,116 విరాళం సమర్పించారు. -
మండలిలో టీడీపీ అడ్డగోలు వాదన.. చైర్మన్ అసహనం
ఏపీ శాసన మండలి అప్డేట్స్..ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కామెంట్స్..అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. జగన్ హిందూ వ్యతిరేకి అని అవాస్తవాలు మాట్లాడుతున్నారువైవీ సుబ్బారెడ్డి సతీమణి గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాంసుబ్బారెడ్డి సతీమణి స్వర్ణమ్మ గురించి మీకు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నాబైబిల్ పట్టుకున్నంత మాత్రాన స్వర్ణమ్మ క్రిస్టియన్ అయిపోతుందా?.మీరు కూడా అనేక సార్లు మీ మీటింగ్లలో బైబిల్ పట్టుకున్నారుమీరు కూడా క్రిస్టియన్లే అని ఒప్పుకుంటారా?మీ రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న మహిళలను బయటికి తేవడం మంచి పద్ధతి కాదుచంద్రబాబు కూల్చిన గుళ్లను పునఃనిర్మించిన చరిత్ర వైఎస్ జగన్ది.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలను నిర్మించారు801 ఆలయాలను పునఃరుద్ధరణ చేశారునవనీత సేవ కోసం గోశాలను ఏర్పాటు చేశారు వైఎస్సార్, వైఎస్ జగన్ హిందూ సాంప్రదాయాలను కాపాడిన వ్యక్తులు21 మందితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసింది వైఎస్సార్. దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కూటమి నేతలు వైఎస్ జగన్పై బురద జల్లుతున్నారుఇప్పటికైనా చంద్రబాబు దేవుడిపై రాజకీయం చేయడం మానుకోవాలిఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కామెంట్స్..ఆరోగ్య శ్రీ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక.వైద్యానికి వైఎస్సార్, వైఎస్ జగన్ పెద్దపీట వేశారుఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది.నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం మానేసిందిబిల్లులు నిలిపివేయడం వల్ల నెట్ వర్క్ ఆసుపత్రులు ఇబ్బందుల్లో పడ్డాయి శాసనమండలి మీడియా పాయింట్..ఎమ్మెల్సీ తూమాటి మధవరావు కామెంట్స్.. పోర్టులకు ఎంత ఖర్చు చేశారని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారుతప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారుగత ప్రభుత్వంలో చేసిన ఖర్చులనే ఈ ప్రభుత్వం చేసినట్లు చెబుతున్నారుప్రభుత్వం మారగానే అంచనాలు, టెండర్లు ఎందుకు మార్చారని అడిగితే వివరాలు లేవంటున్నారుఆరు ఫిషింగ్ హార్బర్లు అసలు మొదలు పెడతారా లేదా?పోర్టుల అనుసంధానం వల్లనే రహదారులు అభివృద్ధి చెందుతున్నాయిగత ప్రభుత్వంలో 50-60 శాతం పనులు చేస్తే, ఈ ప్రభుత్వంలో 5% కూడా చేయలేదురేపటిలోగా మా ప్రశ్నలకు సమాధానాలు రాకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం సమాధానం చెప్పలేక టీడీపీ అడ్డగోలు వాదన..ఆడబిడ్డ నిధిపై మండలిలో టీడీపీ అడ్డగోలు వాదనఆడబిడ్డ నిధిపై సమాధానం చెప్పకుండా వైఎస్సార్సీపీ సభ్యులపై మంత్రుల ఎదురుదాడికిమంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్ధసారథి, కూటమి ఎమ్మెల్సీలు అత్యుత్సాహంకూటమి ఎమ్మెల్సీల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మండలి చైర్మన్ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పొంతనలేని సమాధానంమంత్రి సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ సభ్యులుఆడబిడ్డ నిధి గురించి కాకుండా మిగిలిన అంశాలపై మాట్లాడిన మంత్రిసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు సూచించిన చైర్మన్ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 ఇస్తామని చెప్పారునీకు 18 వేలు నీకు 18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి చెప్పారుఎన్నికల్లో తిరిగి మరీ ప్రచారం చేశారుమూడు బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డ నిధి ఊసేలేదు వాటర్ పైప్ లైన్లుపై దృష్టి పెట్టాలి: బొత్సశాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..వాటర్ ట్యాంకుల నిర్వహణ లోపం వల్లే డయేరియా వ్యాప్తి. ప్రభుత్వం వాటర్ పైప్ లైన్లు, ట్యాంకుల నిర్వహణపై దృష్టిపెట్టాలి. బాబుకి భోగాపురానికి సంబంధమే లేదు.. ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కామెంట్స్..భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు టెంకాయ కొట్టి వదిలేశారు377 ఎకరాలు మాత్రమే భూ సేకరణ చేసి వదిలేశారు కోర్టు కేసులు క్లియర్ చేయలేదుఎన్ఓసీ తీసుకురాలేదువైఎస్ జగన్ సీఎం అయ్యాకే భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పరుగులు పెట్టించారుఅన్ని అనుమతులు తెచ్చింది జగన్కేంద్రంతో మాట్లాడి బీచ్ కారిడార్ అభివృద్ధికి ఆరు వేల కోట్లు తెచ్చారుఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తైనా ఎయిర్ పోర్టు రోడ్ల అనుసంధాన ప్రక్రియ ప్రారంభించలేదు. నేడు మండలిలో ప్రారంభమైన సమావేశాలుప్రశ్నోత్తరాలు ప్రారంభంనేడు వ్యవసాయంపై లఘు చర్చశాసనమండలి..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..డయేరియాపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదుగతంలో జగ్గయ్యపేట, తురకపాలెం, విజయవాడ, ఇప్పుడు శ్రీకాకుళంలో డయేరియా విజృంభించిందితురకపాలెంలో ప్రజలు ఈ నీళ్లు మేం తాగలేమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదుడయేరియా కట్టడికి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాలి -
ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి
స్థాయీ సంఘ సమావేశంలో వీఎంసీ మేయర్ భాగ్యలక్ష్మి పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఆమె స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశపు అజెండాలో మొత్తం 32 అంశాలు ప్రతిపాదనకు రాగా వాటిలో 23 అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఒక అంశాన్ని వాయిదా వేయగా, నాలుగు అంశాలు ర్యాటీఫై చేస్తూ తీర్మానించారు. ఒక అంశాన్ని రికార్డు చేయగా మరో అంశాన్ని ధ్రువీకరించారు. ప్రధానాంశాలివే.. ● విజయవాడలోని సర్కిల్–2 పరిధిలో ఉన్న లెనిన్ సెంటర్ వద్ద శిల్కోషోరూం ఎదురుగా వీఎంసీ పార్కింగ్ స్థలాన్ని లీజు పొడగింపునకు వచ్చిన ప్రతిపాదనను సభ్యులు తిరస్కరిస్తూ తీర్మానించారు. ● నగరపాలక సంస్థ పరిధిలోని సర్కిల్–1లో కబేళాను ఏడాదిపాటు లీజుకు ఇచ్చేందుకు వచ్చిన ప్రతిపాదనను వాయిదా వేస్తూ తీర్మానం చేశారు. ● నగరపాలక సంస్థలో హార్టీకల్చర్ ఆఫీసర్(హెచ్వో)లుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు రూ. 60వేలు వేతనాన్ని పెంచుతూ వచ్చిన తీర్మానంపై సభ్యులు ఆమోదం తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ప్రణాళిక ప్రకారం రైతులకు కావాల్సిన ఎరువులను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సోమవారం సాయంత్రం ఆయన చాంబర్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న యూరియా నిల్వలను ఐఎఫ్ఎంఎస్ డేటాతో సరిపోల్చుకొని స్పష్టత ఇవ్వాలని సూచించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ప్రవేశపెడుతున్న కొత్త యాప్పై అవగాహన కోసం వ్యవసాయశాఖ అధికారులు, మార్క్ఫెడ్ అధికారులు గుంటూరు, ఏలూరు జిల్లాలకు వెళ్లి అక్కడ నిర్వహిస్తున్న పైలెట్ ప్రాజెక్టుపై అధ్యయనం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు కనీసం 1500 టన్నుల బఫర్ యూరియా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అదనపు నిల్వలను డిమాండ్ చేసి తెప్పించుకోవాలన్నారు. మే నెల నుంచే జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్. పద్మావతి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ బి. మురళీ కిషోర్, బందరు ఇన్చార్జ్ ఆర్డీవో పోతురాజు పాల్గొన్నారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థి రైలు కింద పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం జిల్లా బురుజుపల్లె తండాకు చెందిన మూడావత్ గణేష్ నాయక్(18) పెనమలూరులోని ప్రైవేటు కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. గణేష్ నాయక్ తల్లిదండ్రులు ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్కు రూ. 2.6లక్షలు, ద్వితీయ సంవత్సరానికి రూ. 2.85 లక్షలు చెల్లించి చదివిస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదు. ఇదే విషయాన్ని గణేష్నాయక్ తలిదండ్రులకు ఫోన్ చేసి తాను ఎంత కష్టపడి చదివినప్పటికీ మార్కులు రావటం లేదని.. గుర్తుండటం లేదని చెప్పాడు. దీనికి తలిదండ్రులు గుర్తున్నదే రాయి అని ధైర్యం చెప్పారు. అంతర్మథనంతో అఘాయిత్యం.. అయినప్పటికీ రూ. లక్షలాది రూపాయల వ్యయంతో తనను చదివిస్తున్నారని.. తాను ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోతున్నానని మథన పడుతున్నాడు. మంగళవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి స్టడీ అవర్ నుంచి బయటకు వచ్చిన గణేష్ నాయక్ విజయవాడ రైల్వేస్టేషన్కు చేరుకున్నాడు. 7వ నంబర్ ప్లాట్ఫాంలో ఆదివారం రాత్రి రైలు కదులుతున్న సమయంలో ఒక్కసారిగా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. తల్లిదండ్రుల అనుమానం.. గణేష్నాయక్ తల్లిదండ్రులు ఈ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో ఏదో గొడవ కారణంగానే ఇది జరిగిందని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారించి, న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘మీ కోసం’ నిర్వహిస్తున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ‘మీ కోసం’లో పాల్గొన్న ఆయన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ బాధితుల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించే దిశగా అధికారులు పనిచేస్తున్నారన్నారు. మీ కోసంలో ఎలాంటి ఫిర్యాదునైనా అధికారుల దృష్టిలో పెట్టవచ్చని చెప్పారు. వాటిని చట్టపరిధిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ‘సమస్య మీది పరిష్కారం మాది’ అనే నినాదంతో సిబ్బంది పని చేయాలని ఆయన సూచించారు. సోమవారం జరిగిన ‘మీ కోసం’లో 48 అర్జీలు అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఆటోనగర్(విజయవాడతూర్పు): భారతీనగర్ సర్వీస్ (తూర్పువైపు) రోడ్డులో ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్ర పక్కన జిరాక్స్షాపు తెరచి ఉంచారు. నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రం సమీపంలో ఇలాంటివి తెరిచి ఉండకూడదు. పరీక్ష జరిగే సమయంలో తప్పనిసరిగా మూయించాల్సి ఉంది. అయితే అధికారులు, పోలీసులు అలాంటి చర్యలేమి తీసుకోలేదు. దీనిని పలువురు తప్పుబడుతున్నారు. రామవరప్పాడు: అతి ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ అధిరోహణకు విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జెడ్పీ పాఠశాల దివ్యాంగ విద్యార్థి గట్టెం విశ్వాస్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సోమవారం విశ్వాస్ను పాఠశాల హెచ్ఎం తాయారు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా తాయారు మాట్లాడుతూ ఎవరెస్ట్ అధిరోహణే లక్ష్యంగా జాతీయ స్థాయి హై ఆల్టిట్యూడ్ శిక్షణకు విశ్వాస్ ఎంపికై నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జోనల్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఎంపికై , కడప జిల్లా గండికోటలో నెల రోజుల పాటు శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్లోని లడక్లో ట్రైనింగ్కు ఎంపికై నట్లు వివరించారు. శారీరక లోపం ఉన్నా ఏమాత్రం అధైర్యపడకుండా పట్టుదలతో ఇంతటి ఘనత ను సాధించడం అభినందనీయమన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఆ సినిమాకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్ర చేపట్టినట్లు హీరో శివ కందుకూరి తెలిపారు. బెంజిసర్కిల్లోని ట్రెండ్సెట్మాల్లో ప్రేక్షకులతో కలిసి హీరో శివ కందుకూరి, హీరోయిన్ తేజు అశ్విని, దర్శకుడు ప్రమోద్ హర్ష చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ప్రేక్షకులను నేరుగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో శివ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న చిత్రాన్ని తప్పనిసరిగా ఆదరిస్తారనడానికి తమ చిత్రమే నిదర్శనం అన్నారు. అనంతరం హీరోయిన్ తేజు అశ్విని మాట్లాడుతూ తాను విజయవాడ వాసినే అని, ఇక్కడి ప్రేక్షకులను నేరుగా కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పటమట(విజయవాడతూర్పు): రాష్ట్ర బడ్జెట్లో బీసీ కార్పొరేషన్లకు జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.మారేష్ డిమాండ్ చేశారు. విజయవాడలోని పటమటలో సోమవారం కుల సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మారేష్ మాట్లాడుతూ బీసీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందజేయాలని కోరారు. సీఎం చంద్రబాబు బీసీ కార్పొరేషన్లపై రివ్యూ నిర్వహించి ఇంకా వెల్లడించని కులాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆదరణ పథకాన్ని ప్రారంభించాలని, రాష్ట్రవ్యాప్తంగా బీసీ స్టడీ సర్కిళ్లకు బడ్జెట్ పెంచాలన్నారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్ నూటికి నూరు శాతం బీసీలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. -
ఆలయాలతో గ్రామాలకు ఆధ్యాత్మిక బలం
పామర్రు(పమిడిముక్కల): గ్రామ జీవనానికి ఆలయాలు ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ అన్నారు. పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని (గౌడ రామాలయం) సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రతిష్టా మహోత్సవాల పోస్టర్లను, కరపత్రాలను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ట మహోత్సవాలను విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తున్నామని, ఆలయ కార్యకలాపాలకు తన మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి పీఏసీఎస్ మాజీ చైర్మన్ బొర్రా వీర వెంకట రామ్మోహనరావు(చిన్నబాబు) ఆధ్వర్యంలో మొత్తం విరాళాలు రూ.3,61,579ను మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. బొర్రా వీర వెంకట రామ్మోహనరావు రూ.2,25,999, ఈడే వెంకట సత్యనారాయణ రూ.1,00,116, కోకా మాధవరావు రూ.10,116, కాగిత సుబ్బారావు రూ.10,116, ఈడే జంగమయ్య రూ.10,116, పరిమికాయల విజయలక్ష్మి రూ.5,116 స్వామికి విరాళాలుగా అందజేశారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్, వైస్ ఎంపీపీ గంజాల సీతారామయ్య, మండల ప్రధాన కార్యదర్శి గరికపూడి బుజ్జి, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ -
స్వచ్ఛమైన ఓటర్ల జాబితాకు సహకరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితాకు సహకరించాలని కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించి భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీలో బూత్స్థాయి అధికారులకు రాజకీయ పార్టీల బూత్స్థాయి ఏజెంట్ల సహకారం చాలా అవసరమన్నారు. ఏప్రిల్ నెలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇందుకోసం ప్రతి రాజకీయ పార్టీకి చెందిన బూత్స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు. క్లయిమ్ల స్టేటస్ ఇది.. జిల్లాలో ఫారం–6, 7, 8 క్లయిమ్లకు సంబంధించి మొత్తం 76,176 అర్జీలు వచ్చాయని, అందులో 73,474 అర్జీలు పరిష్కరించామని కలెక్టర్ చెప్పారు. మిగిలిన 2,696 అర్జీలు పరిష్కరించాల్సి ఉందన్నారు. జిల్లాలో 1,769 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 32 పోలింగ్ కేంద్రాల స్థలాలను మార్చేందుకు ప్రతిపాదనలు చేశామన్నారు. 170 పోలింగ్ కేంద్రాలు పేరు మార్చాలని ప్రతిపాదించామన్నారు. అలాగే 73 కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు. వీటితో మొత్తం 1,842 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్దాదా, పంతం గజేంద్ర, కొడాలి శర్మ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ -
బరితెగించిన మట్టి దొంగలు!
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ దందాజి.కొండూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సహజ వనరుల దోపిడీనే ఆదాయ మార్గంగా ఎంచుకున్న టీడీపీ నాయకులు, చెరువుల్లో నిండు కుండలా నీళ్లు ఉండగానే మట్టి తవ్వకాల కోసం ముమ్మర ప్రయత్నాలు చేయడం విస్మయానికి గురి చేస్తోంది. వేసవిలో మూగ జీవాల తాగునీటి అవసరాల కోసం నిల్వ ఉన్న నీటిని బయటకు పంపి మట్టి తవ్వకాలు చేయాలనే కుట్రను రైతులే భగ్నం చేశారు. మైలవరం మండల పరిధి గణపవరంలోని తూర్పు చెరువులో మట్టి తవ్వకాలు చేయకూడదని హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు బరితెగించి నీళ్లను బయటకు పంపే ప్రయత్నం చేయగా.. రైతుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. కోర్టు నుంచి స్టే తెచ్చిన రైతులుగణపవరం గ్రామాన్ని ఆనుకొని ఎగువన 160.17ఎకరాల విస్తీర్ణంలో తూర్పు చెరువు ఉంది. ఈ చెరువు కింద ఆయకట్టు భూమి 500ఎకరాలు ఉంది. వర్షాధారంతో అడవి నుంచి ఈ చెరువుకు నీరు సరఫరా అవుతోంది. ఈ చెరువులో మట్టి తవ్వకాలు చేపడితే చెరువు లోతు ఎక్కువై నీరు పరిమితికి మించి నిల్వ ఉంటే కట్ట తెగి ఊరుమీద పడే అవకాశం ఉంది. అంతే కాకుండా మట్టి తవ్వకాల కోసం చెరువులో ఉన్న నీటిని వేసవికి ముందే బయటకు విడుదల చేస్తుండటంతో మూగజీవాలు ఇబ్బంది పడతాయని భావించిన రైతులు, చెరువులో చేపట్టిన మట్టి తవ్వకాలను నిలుపదల చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన రైతు ఉమ్మా నర్మదా ఆధ్వర్యంలో గత ఏడాది ఏప్రిల్ నెలలో హై కోర్టుకు వెళ్లారు. రైతుల అభ్యర్థన మేరకు ఈ అంశంపై గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ చెరువులో ఎటువంటి తవ్వకాలు చేయొద్దని ఈ ఏడాది జనవరి 28వ తేదీన హైకోర్టు శాశ్వత ఉత్తర్వులను సైతం జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత చెరువుకు ఉన్న రెండు తూములలో ఒక తూము తాళపు చెవిని స్థానిక రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో తూము తాళపు చెవి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి దగ్గరే ఉంది. దీనితో కోర్టు ఆర్డర్ని సైతం పక్కనబెట్టిన టీడీపీ నాయకుడు తన దగ్గర ఉన్న తాళపు చెవిని వినియోగించి ఈ నెల 16వ తేదీన తూము తెరిచి చెరువు నుంచి నీటిని అనవసరంగా బయటకు వదిలారు. దీనితో గ్రామానికి చెందిన రైతుల ఫిర్యాదు మేరకు కోర్టు ఆర్డర్ని పాటిస్తూ రెవెన్యూ అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. ఆ తర్వాత చెరువులో నీటి విడుదలను అడ్డుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన 480మంది రైతులు, గ్రామస్తులు సంత కాలను చేసి ఈ నెల 20వ తేదీన ఇరిగేషన్శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని టీడీపీ నాయకులు ఈ నెల 21వ తేదీన రాత్రి మరలా తూము తెరిచి చెరువులో నీటిని బయటకు విడుదల చేశారు. దీనితో మరలా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. గ్రామస్తుల ఆందోళన.. టీడీపీ నాయకులు తూర్పు చెరువులో విచ్చలవిడిగా తవ్వకాలు చేయడం వల్ల చెరువులోతు పెరిగి పరిమితికి మించి నీరు నిల్వ ఉండి గత ఏడాది చెరువు కళంగి వద్ద కట్ట తెగడంతో నీరు గ్రామం మీదకు వచ్చింది. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. మరలా అటువంటి ఘటనలే జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేసవి సమీపిస్తున్న వేళ ఎగువన ఉన్న చెరువులో నీటిని బయటకు పంపితే గ్రామంలో భూగర్భజలాలు పడిపోయి తాగునీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉందని, వేసవిలో మూగజీవాలు తాగునీటి అవసరాలకు నీరు లేకపోతే నరకయాతన పడతామని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గణపవరం తూర్పు చెరువును చెరపట్టిన టీడీపీ నాయకులు మట్టి తవ్వకాల కోసం నీటిని బయటకు పంపే ప్రయత్నాలు రైతుల ఫిర్యాదుతో నీటి విడుదలను అడ్డుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చెరువులో తవ్వకాలు చేయవద్దని హైకోర్టు నుంచి ఉత్తర్వులు అనుమతి లేకుండా నీటిని విడుదల చేస్తే ఊరుకునేది లేదు గణపవరం తూర్పు చెరువులో అనవసరంగా చేస్తున్న నీటి విడుదలను అడ్డుకున్నాం. అదే కొనసాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చెరువులో అక్రమ మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నాం. చెరువులో ఎటువంటి కార్యకలాపాలు చేయాలన్నా అనుమతి పొందిన తర్వాతే చేయాలి. – రాజశేఖర్, ఇరిగేషన్ ఏఈ, మైలవరం -
సిబ్బంది అనుచిత ప్రవర్తనతో ఆలయ ప్రతిష్టకు దెబ్బ
దుర్గగుడి ఈవో శీనానాయక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది తీరు, కాంట్రాక్టర్ల వ్యవహార శైలి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని దుర్గగుడి ఈవో శీనానాయక్ అన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులో సమావేశంలో నిర్వహించగా, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఆలయ స్థానం దిగజారుతోంది.. ఈవో మాట్లాడుతూ వివిధ సేవల కాంట్రాక్టర్ల ప్రవర్తనతో దేవస్థానానికి అపకీర్తిని కలుగుతోందన్నారు. కొబ్బరి కాయలు కొట్టే చోట, క్లోక్రూమ్, చెప్పుల స్టాండ్ల వద్ద అదనపు వసూళ్లు, పార్కింగ్ కాంట్రాక్టర్ దురుసు ప్రవర్తనతో ఆలయంలో ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రయోజనం లేకుండా పోతోందన్నారు. భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అసంతృప్తి ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా ప్రభుత్వం దృష్టికి వెళ్తోందన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఇంద్రకీలాద్రి ర్యాంకింగ్ వెనుకబడిపోతోందన్నారు. భక్తుల రద్దీ సమయాల్లో వారు ఒత్తిడిలో ఉంటారని, వారిని గద్దించడం, విసుక్కోవడం వంటివి చేయకూడదని సూచించారు. భక్తుల పట్ల ప్రవర్తనలో మార్పు రాకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో ఏసీ రంగారావు, ఏఈవో వెంకటరెడ్డి, చంద్రశేఖర్, తిరుమలేశ్వరరావు ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యకు దరఖాస్తులు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.44 లక్షలుగా ఉండాలని, స్టేట్ సిలబస్లో చేరే విద్యార్థి జూన్ 2, 2020 నుంచి, 31 మే 2021 మధ్య జన్మించి ఉండాలని, అలాగే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ పాఠశాలలో చేరే విద్యార్థి రెండు ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చి 2021 మధ్య జన్మించి, ఐదు సంవత్సరాలు నిండి ఉండాలని పేర్కొన్నారు. వెబ్సైట్, స్వర్ణగ్రామ, వార్డు సచివాలయాలు, ఎంఈవో కార్యాలయం, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే చిరునామా ధ్రువీకరణకు ఏదైనా గుర్తింపు కార్డు, పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. విద్యార్థి జనన, కుల, వార్షికాదాయ ధ్రువీకరణ పత్రాలు జతచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 512 కార్పొరేట్, ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయని అందులో గత ఏడాది వెయ్యి మందికి ప్రవేశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. మార్చి 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, అదే నెల 25వ తేదీన లాటరీ తీసి విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 13 నుంచి 23వ తేదీ వరకూ ప్రవేశాల నిర్ణయం ఉంటుందని వివరించారు. ● హామీలు అమలు కాని పక్షంలో మార్చి 2న మహాధర్నా ● ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ మచిలీపట్నంఅర్బన్: అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆద్వర్యంలో సోమవారం కలక్టరేట్ ధర్నా చౌక్ వద్ద రిలే నిరహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మీ, సీహెచ్ నాంచారమ్మ మాట్లాడుతూ 2024 జూలైలో వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చిందని.. కానీ హామీల అమలులో ఆలస్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందని గద్దెనెక్కి రెండేళ్లు అవుతున్నా ఒక్కహామీ కూడా అమలు చేయలేదన్నారు. హామీల అమలు సాధనకు ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ప్రాజెక్టు, జిల్లా స్థాయిలలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ చేయని పక్షంలో మార్చి 2న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు సీహెచ్ జయరావు, లింగం ఫిలిప్, ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శలు జి. చిట్టి కుమారి, పి. ధనశ్రీ తదితరులు మద్దతు తెలిపారు. -
మామిడిపై పగమంచు
మధురఫలం మామిడికి మంచు దెబ్బ తగిలింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం లేదు. ప్రస్తుతం మామిడి తోటలకు ఓ వైపు మంచు, మరో వైపు తెగుళ్ల ప్రభావంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏడాది కష్టం నేలపాలయ్యే పరిస్థితి ఉండి.. దిగుబడి ఆశలు రాలిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెనుగంచిప్రోలు: మామిడి రైతుల ఆశలపై మంచుతెరలు కమ్ముకోవడంతో అవస్థలు తప్పడం లేదు. కొంతకాలం క్రితం వరకు మామిడి తోటలు పూతతో కళకళలాడాయి. దిగుబడి బాగుంటుందని, కష్టాలు తీరతాయని మామిడి రైతులు భావించారు. ఇంతలోనే నల్లతామర పురుగుకు తోడు తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించడం.. ప్రతికూల వాతావరణం ఎదురుకావడంతో పూతంతా మాడి పోయింది. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 57 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో తోటలు అధికంగా ఉన్నాయి. కృష్ణా నది, మునేరు, పాలేరు ఏరుల పరీవాహక ప్రాంతాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. పూతకు నష్టం వాతావరణ పరిస్థితులు, మంచు ప్రభావానికి మామిడి పంటను చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసంతో తేనె మంచు తెగులు, బూడిద తెగులు, తామర పురుగు విజృంభించి పూతకు నష్టం కలిగిస్తున్నాయి. తేనె మంచు పురుగు లేత ఆకులు, పూతపై చేరి రసం పీల్చుతుండటంతో ఎండిపోయి పూత రాలిపోతోందని రైతులు దిగులుపడుతున్నారు. ఇవి విడిచే జిగట పదార్థంతో నల్లబూజు ఏర్పడి పూత మాడిపోయినట్లు కనిపిస్తోంది. బూడిద తెగులు పూతపై తెల్లటి పౌడర్ లాంటి పొర ఏర్పడి క్రమంగా అది గోధుమ రంగులోకి మారి పూత ఎండిపోతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో చలి, పగటి పూట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది తీవ్రమవుతుంది. అకాల వర్షాలు, మంచు కురవడం, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పూత మాడిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రైతు పూత వచ్చిన నాటి నుంచి దాన్ని కాపాడుకోవటానికి 5 నుంచి 10 సార్లు రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. చివరిలో తామర పురుగు ఆశించటంతో చేసిన ప్రయత్నమంతా వృథా అవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మందులు కొట్టిన ప్రతిసారి ఎకరానికి రూ.3 వేల నుంచి రూ.5 వేలు ఖర్చు అవుతోందని రైతులు వాపోతున్నారు. ఏటా మామిడి పంటతో నష్టపోతున్నామని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు అంటున్నారు. -
కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం సోమవారం కనులపండువగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో కల్యాణ వేదికపై కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉపాలయంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం రాజగోపురం ఎదుట కల్యాణోత్సవం జరిగింది. దేవస్థానం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించగా, కమిటీ చైర్మన్ రాధాకృష్ణ కల్యాణంలో పాల్గొన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న వారికి మేలు జరుగుతుందని, వివాహం కానివారికి వివాహం, సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని అర్చకులు పేర్కొన్నారు. బస్టాండ్(విజయవాడ పశ్చిమ): రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ (ఏపీ పీటీడీ) మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీస్ ఆఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డి.అంకినీడు, జోనల్, రీజనల్ నాయకులు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. వారి వెంట సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు, అడిషనల్ జనరల్ సెక్రటరీ కొండారెడ్డి, రవి తదితరులు ఉన్నారు. -
ముగిసిన మహిళా ఆర్చరీ ర్యాంకింగ్ టోర్నమెంట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్న 3వ ఎన్టీపీసీ కేలో ఇండియా ఆర్చరీ నేషనల్ ర్యాంకింగ్ (మహిళల) టోర్నమెంట్ సోమవారం ముగిసింది. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో రికర్వ్, కాంపౌండ్ అంశాల్లో పోటీలు జరిగాయి. ఆది, సోమ వారాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు సోమవారం బహుమతులను అందజేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, విజయవాడ నగర పాలక సంస్థ స్పోర్ట్స్ కమిటీ మాజీ చైర్మన్ దోనేపూడి శంకర్, హైకోర్టు న్యాయవాదులు ఎన్.సాయి శంకర్, పి.రాజశేఖర్ విజేతలకు బహుమతులను అందజేశారు. చెరుకూరి ఓల్గా అర్చరీ అకాడమీ క్రీడాకారులు వి.స్ఫూర్తి సబ్జూనియర్ కాంపౌండ్ విభాగంలో బంగారు పతకం, కె.రుషికీర్తన జూనియర్ కాంపౌండ్ విభాగంలో రజత పతకం సాధించింది. ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ 11 మంది టెక్నికల్ సిబ్బంది పర్యవేక్షణలో టోర్నమెంట్ జరిగిందన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.వెంకట రమణ, సంఘ సభ్యులు అభినందించారు. -
అర్జీలను సకాలంలో పరిష్కరించాలి
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి అందే ‘మీ కోసం’ అర్జీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి సానుకూలంగా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, డీఎస్పీ శ్రీనివాసరావులతో కలసి మీకోసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్లో ప్రారంభం కానున్న జనాభా లెక్కల సేకరణను జిల్లా అధికార యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యతతో చేయాలన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లుగా నియమించిన సిబ్బందికి ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం కింద ఇకపై అర్జీదారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని వారికి ఆన్లైన్లోనే సమాధానం పంపుతారని తెలిపారు. ఆర్టీ జిల్లాస్థాయి నోడల్ అధి కారిగా డీఆర్వో వ్యవహరిస్తారన్నారు. ప్రజా సమాచార అధికారులు నిర్ణీత గడువు 30 రోజుల్లోగా సమాధానం అర్జీదారులకు పంపాలన్నారు. సత్యసాయి సేవా సమితి స్వచ్ఛందంగా ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఉచితంగా అల్పాహారం అందజేయడం అభినందనీయమన్నారు. మీకోసంలో 112 అర్జీలు స్వీకరించారు. తొలుత ఉద్యోగుల గ్రీవెన్స్ నిర్వహించి వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల నుంచి 25 అర్జీలు స్వీకరించారు. -
తిరుపతమ్మ తిరునాళ్లకు విస్తృత ఏర్పాట్లు
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ చిన్న తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 4 నుంచి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు నుంచి పసుపు, కుంకుమల బండ్లు రాక ప్రధాన ఘట్టంగా నిలవనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. మునేరులో జల్లు స్నానాలు, పలు చోట్ల భక్తుల సౌకర్యార్థం చేతి పంపులు, శుద్ధి చేసిన తాగు నీటికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. పలుచోట్ల షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి రోజు అఖండ జ్యోతి స్థాపనతో ప్రారంభం చిన్న తిరునాళ్లలో మొదటి రోజు మార్చి 4న ఉదయం 6.19 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవుతాయి. నిత్య కల్యాణ మూర్తులకు అభిషేకం చేస్తారు. రెండో రోజు గ్రామోత్సవం తిరునాళ్లలో రెండో రోజు మార్చి 5వ తేదీ రాత్రి 7.02 గంటలకు ఉత్సవమూర్తుల రథోత్సవం (గ్రామోత్సవం) కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించనున్నారు. మూడో రోజు దివ్య ప్రభోత్సవం మూడో రోజు మార్చి 6వ తేదీ రాత్రి 10.02 గంటలకు దివ్య ప్రభోత్సవం వైభవంగా జరగనుంది. సుమారు 90 అడుగుల దివ్యప్రభపై ఉత్సవమూర్తులను ఉంచి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయిస్తారు. నాలుగోరోజు అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమలు చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు నాలుగో రోజు మార్చి 6న అనిగండ్లపాడు గ్రామం నుంచి రాత్రి 7.32 గంటలకు ప్రారంభం కానున్నాయి. అమ్మవారి పుట్టింటి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి నుంచి ఏటా పసుపు కుంకుమలు బండ్లపై తీసుకు రావడం ఆనవాయితీగా వస్తోంది. మార్చి 8న భక్తుల బోనాల సమర్పణతో చిన్న తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి. 4 నుంచి ఉత్సవాలు ప్రారంభం 7న అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు రాక చిన్న తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు, ప్రసాదాల కౌంటర్లు, తదితర ఏర్పాట్లను ఆలయ ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్నారు. మునేరులో షవర్బాత్లు, తలనీలాలు తీసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరగనున్నాయి. భక్తులతో పాటు గ్రామస్తులు, అధికారులు సహకరించి విజయవంతం చేయాలి. తిరునాళ్లలో ఆలయం వద్ద రాత్రి సమయంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. – బి.మహేశ్వరరెడ్డి, ఆలయ ఈఓ -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు కృష్ణాలో ప్రశాంత వాతావరణంలో సోమవారం ప్రారంభమైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్.సరళకుమారి తెలిపారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 23,396 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు నమోదు కాగా, వారిలో 22,936 మంది పరీక్షలకు హాజరయ్యారని 460 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం హాజరు 98 శాతం నమోదైందన్నారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసు శాఖ ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు చేపట్టింది. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా, పరీక్ష నియమాలు కచ్చితంగా పాటించేలా అధికారులు ఆదేశించారు. పరీక్షల పర్యవేక్షణకు మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు నిర్వహించిన పరీక్షకు సెట్–1 ప్రశ్నపత్రాన్ని వినియోగించినట్లు పరీక్షల అధికారి తెలిపారు. జిల్లాలో 98 శాతం హాజరు -
మద్యం మత్తులో తండ్రిని నరికి చంపిన తనయుడు
కొండిపర్రు(పామర్రు): పొయ్యిలో మంట ఎందుకు ఎక్కువగా పెట్టావని తిట్టిన తండ్రిని మద్యం మత్తులో ఉన్న కుమారుడు హత్య చేశాడు. ఈ ఉన్మాదం కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పామర్రు పోలీసుల కథనం మేరకు.. కొండిపర్రు గ్రామశివారు డీపీగూడెంలో చదువుల సురేష్(45)కుమారుడు చంద్ర మహేష్ నివసిస్తున్నారు. సురేష్ భార్య గతంలో మృతి చెందింది. 22 ఏళ్ల చంద్రమహేష్ పనీపాట చేయకుండా తాగి తిరుగుతుంటాడు. ఆదివారం రాత్రి చంద్ర మహేష్ పొయ్యి వెలిగించి నీరు కాస్తున్నాడు.ఆ సమయంలో తండ్రి సురేష్ వేడి నీరు తోడుతూ ఎందుకు ఇంత పెద్ద మంట పెట్టావు అని తిట్టాడు. మద్యం మత్తులో ఉన్న చంద్రమహేష్ ఆగ్రహంతో అక్కడే ఉన్న కత్తి తీసి తండ్రి మెడతో పాటు ఇంకా రెండు చోట్ల నరికాడు. సురేష్ రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా స్థానికులు మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యంలోనే సురేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు సీఐ సుభాకర్ తెలిపారు. -
టీటీడీకి 658.. ప్రజలకు 560.. కల్తీ అమ్ముతున్నారా?: ఇందాపూర్పై బొత్స ప్రశ్న
శాసన మండలి అప్డేట్స్..శాసనమండలి మీడియా పాయింట్ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్..మండలిలో జరుగుతున్న విధానాలు సభ్యుల హక్కులు హరించేలా ఉన్నాయిప్రభుత్వ అనుకూల వీడియోలు మాత్రమే బయటికి వస్తున్నాయిమొత్తం వీడియో ఫుటేజ్ను బయటికి విడుదల చేయాలిమేం పోడియం వద్ద ఉన్న ఫుటేజ్ మాత్రం ఇవ్వడం లేదుప్రభుత్వానికి కావాల్సిన ఫుటేజ్ను వాళ్ల పేపర్లలో వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నవి మాత్రమే ఇచ్చారుఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫుటేజ్ కావాలని అడిగినా స్పందించలేదుప్రజల హక్కులు కాపాడాలనేది మా ప్రయత్నంప్రజల హక్కులను కాలరాసే ప్రయత్నం ప్రభుత్వానిది.దేవాలయంగా భావించే సెక్రటేరియట్కు బూట్లు వేసుకుని సీఎం శంకుస్థాపన చేశారుచంద్రబాబు బూట్లు వేసుకుంటే తప్పులేదు..మేం చెప్పులేసుకోవడం తప్పు అనేలా ప్రచారం చేస్తున్నారుదేవుడికి పూజ చేసినప్పుడు కూడా చంద్రబాబు బూట్లు వేసుకున్నారుమండలి ఛైర్మన్ను సెక్రటరీ ఏమాత్రం లెక్కచేయడం లేదు.బొత్స చిట్చాట్..ఇందాపూర్ ఫ్యూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకు దొరుకుతుంది.టీటీడీకి 658 రూపాయల చొప్పున ఇందాపూర్ నెయ్యి సరఫరా చేస్తున్నారు.టీటీడీకి 658 రూపాయలకు అమ్మే నెయ్యి ప్యూర్ నెయ్యి అయితే బయట 560 రూపాయలకు దొరికే నెయ్యి కల్తీనా?.ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా?.లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా? ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి టెండర్ల వెనుక నిజాలు వెలికి తీసుకురావాలనేది మా ప్రయత్నంఅందుకే మండలిలో మేం వాయిదా తీర్మానాలు కోరుతున్నాంమేం చెప్పులతో స్వామివారి ఫొటోలు పట్టుకుని పోడియం వద్ద గొడవ చేశారని ప్రచారం చేస్తున్నారుఎవరు వేంకటేశ్వరస్వామికి అపచారం చేస్తున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలిమేం చెప్పులు విడిచిన తర్వాతే పోడియం వద్ద నిరసన చేపట్టాంచంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని మేం దేవుడి ఫొటోలతో నిరసన చేపట్టాంమేం మండలి నుంచి బయటికి రాకుండానే మా ఫొటోలు బయటికి వచ్చాయిసాక్షాత్తూ చంద్రబాబు వినుకొండ సభలో మా గురించి ప్రస్తావించారుతిరుపతి లడ్డూ కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశంమేం ఎక్కడా తిరుపతి లడ్డూని రాజకీయాల కోసం వాడుకోలేదుమాపై బురద జల్లడం కోసం శాసనమండలిని వాడుకున్నారుమొత్తం వీడియో ఫుటేజ్ను బయటికి ఇవ్వాలని శాసనమండలి చైర్మన్ను కోరాంమేం ఏనాడూ వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడలేదుమండలి చైర్మన్ నిస్సహాయత వ్యక్తం చేశారుశాసనమండలి అధికారాలకు కోత పెట్టడం బాధాకరంబీఏసీ సమావేశంలో అన్ని అంశాలను చైర్మన్ చర్చిస్తామన్నారుతప్పనిసరి పరిస్థితుల్లో మండలి చైర్మన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాల్సి వచ్చిందిసభ్యుల హక్కులనే కాపాడలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందిసెక్రటరీ జనరల్ ను ఎక్కడి నుంచో ఐదు లక్షల వేతనానికి తెచ్చారుఎవరు ఏం అడిగినా ఆయన ఇవ్వడట..రైటైర్డ్ అయిన తర్వాత కూడా ఐదు లక్షల జీతానికి పని చేసేవారిని దేశంలో ఎక్కడా చూడలేదుప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే మండలిలో ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలిఇందాపూర్ , తిరుపతి లడ్డూపై చర్చ జరపాలిఅధికారంలో ఉన్నాం మేం చెప్పేదే వినాలనే ధోరణి మానుకోకపోతే ప్రజల పక్షాన వారి గొంతుకై పోరాడుతాం ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..వేంకటేశ్వరస్వామిని నమ్మేవాళ్లే అయితే మొత్తం ఫుటేజ్ను బయటపెట్టండిమాట్లాడే వారి వీడియోలు మాత్రమే రికార్డ్ చేశారని చెబుతున్నారుమరి ఆ ఫొటోలు, వీడియోలు ఎలా వచ్చాయినేను చెప్పులు వేసుకుని పోడియం వద్దకు వెళ్లినట్లు నిరూపించండిఈ క్షణమే రాజీనామా చేస్తాహౌస్ మొత్తం ప్రొసీడింగ్స్ను రికార్డ్ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుందిసభలో ప్రొసీడింగ్స్ కవరేజ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడమేంటి?.మీకు దమ్ముంటే మొత్తం ఫుటేజ్ను విడుదల చేయండిలేకపోతే తప్పు చేశామని క్షమాపణ చెప్పండి. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కామెంట్స్..శాసనమండలి చైర్మన్ ను ఈ ప్రభుత్వం గౌరవించడం లేదుకేవలం దళితుడై నందునే మండలి చైర్మన్ ను గౌరవించడం లేదుదళితుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపుతోందిచంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇందాపూర్ తెరపైకి వస్తుంది ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..ఇందాపూర్ పై చర్చ పెట్టాలని ఐదు రోజులుగా కోరుతున్నాంమేం చెప్పులు విడిచిన తర్వాతే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో పోడియం వద్దకు వెళ్లాందేవదేవుడంటే మాకు అమితమైన భక్తితిరుమల పవిత్రతను, వేంకటేశ్వరస్వామిని ప్రతిష్టను దెబ్బతీసింది చంద్రబాబులడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేసింది చంద్రబాబుమండలిలో మొత్తం ఫుటేజ్ను బయటపెట్టాలిచంద్రబాబు తన సొంత మనుషులతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారుఏకసభ్య కమిషన్ ద్వారా ఇందాపూర్ ,హెరిటేజ్ కు ఉన్న సంబంధాల పై విచారణ చేయించాలిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..ఇందాపూర్, హెరిటేజ్ పై చర్చ జరగాలని మేం అడుగుతున్నాంకానీ చర్చ జరగనివ్వడం లేదుఅందుకే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో మండలి చైర్మన్ వద్దకు వెళ్లాంపోడియం వద్దకు మేం చెప్పులతో వెళ్లలేదుమేం చెప్పులతో దేవుడి ఫొటోలతో చైర్మన్ వద్దకు వెళ్లామని తప్పుడు ప్రచారం చేశారుమండలిలో ఫుటేజ్ ను మొత్తం బయటపెట్టాలని చైర్మన్ ను కోరాంకానీ మేం మండలి నుంచి బయటికి రాకుండానే మార్ఫింగ్ ఫొటోలను ప్రచారం చేశారుమాకు పూర్తి వీడియో ఫుటేజ్ ఇచ్చే వరకూ మేం పోరాటం చేస్తూనే ఉంటాందమ్ముంటే మండలిలోని పూర్తి వీడియో ఫుటేజ్ ను ప్రభుత్వం బయటపెట్టాలి ఎమ్మెల్సీ, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్..ఏపీలో శాంతిభద్రతలు లేవుప్రశ్నించే వారి ఇంటి పై దాడులు చేస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారుఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూ పై ప్రచారం చేసినందుకు చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదాలడ్డూ కల్తీ జరిగిందంటూ ఫ్లెక్సీలు పెట్టినందుకు చంద్రబాబుకి ఏమీ అనిపించడం లేదా?లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం చర్చకు భయపడుతుందిమండలిలో చెప్పులు వేసుకుని మేం దేవుడి ఫొటోలతో పోడియం వద్ద నిరసన చేశామని ప్రచారం చేస్తున్నారుశాసనమండలి సెక్రటరీ జనరల్ నియంతలా వ్యవహరిస్తున్నారుమండలి చైర్మన్ కు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదుమా పై పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల కామెంట్స్..దేవుడి చిత్రపటం చూసైనా చంద్రబాబు బుద్ధి మారుతుందేమో అనుకున్నాం.అందరం చెప్పులు విడిచే స్వామివారి పటాలు పట్టుకున్నాం.మా చేతిలోని దేవుడి చిత్ర పటాలు లాక్కొని బయటకు పంపించారు.గతంలో టీడీపీ నేతలు చెప్పులతో పూజలు చేశారు.చంద్రబాబు గతంలో చెప్పులతో రాజధానికి శంకుస్థాపన చేశారు.తిరుమల లడ్డూ అంశాన్ని మేము రాజకీయ కోణంలో చూడటం లేదు.ఏపీలో తిరుమల ఉందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం.టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.టీటీడీకి ఇందాపూర్ నెయ్యి సరఫరాపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం.శుక్రవారం నాటి మండలి పూర్తి వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 👉 శాసనమండలి కాసేపు వాయిదా.. టీడీపీ ఎడిటింగ్ వీడియో విడుదలపై ఫిర్యాదు..మండలి చైర్మన్ చాంబర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భేటీ.శుక్రవారం నాటి మండలి ఫుటేజీని విడుదల చేయాలని ఆందోళన.మొత్తం ఫుటేజీ విడుదల చేయాలని రమేష్ యాదవ్ ఫిర్యాదు.టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో విడుదల చేయడంపై ఫిర్యాదు.ఎడిట్ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని డిమాండ్.ఫుటేజీ కోసం అసెంబ్లీ అధికారులను ఆదేశించిన చైర్మన్.మొత్తం ఫుటేజీ లేదన్న అధికారుల సమాధానంపై ఆగ్రహం. మండలిలో చర్చ జరగాల్సిందే: బొత్సతిరుపతి లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన బొత్సఅసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనేది మాకు అనవసరం.మాకు మాత్రం మండలిలో చర్చ జరగాలి.రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందిదేవదేవుడిపై నిండాపనిందలు రాకుండా ప్రభుత్వం చర్చకి రావాలి.శాసనమండలిలో గందరగోళంచైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, కూటమి ఎమ్మెల్సీలునినాదాలు చేసిన ఇరుపక్షాలుసభలో గందరగోళ పరిస్థితి..సభకు కొద్ది సేపు విరామం ప్రకటించిన మండలి చైర్మన్శాసన మండలి చైర్మన్తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల సమావేశం11:30 గంటలకి బీఏసీ సమావేశం నిర్వహించనున్న చైర్మన్..లడ్డూ అంశంపై మండలిలో చర్చించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం👉 హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా వున్న ఇందాపూర్ డైయిరీ అంశంపై శాసన మండలిలో చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, మరోసారి వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు.👉 దీంతో, చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు చేశారు. .వైఎస్సార్సీపీ సభ్యులకు పోటీగా చైర్మన్ పోడియం వద్దకు కూటమి ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మండలి వాయిదా పడింది. -
‘నా కుమార్తె మృతిపై అనుమానాలున్నాయి’
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో పీజీ డాక్టర్ దీపిక మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, ఆమె తండ్రి బత్తుల కోదండిరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెంది 18 రోజులు గడిచినా నేటికీ మృతికి గల కారణాన్ని గుర్తించలేక పోవడం అనుమానాలకు తావిస్తోందని ఆయన తెలిపారు. ఆ రోజు డ్యూటీలో ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మ లేకపోవడంపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలోని ఓ ప్రైవేట్ హాలులో దీపిక తండ్రి కోదండి రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5న తన కుమార్తె మృతిపై మాచవరం పోలీస్స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైందన్నారు. నేటి వరకూ మృతికి గల కారణం తెలియలేదన్నారు. సత్వరమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో స్పందించి రెవెన్యూ డివిజనల్ అధికారి స్థాయిలో జ్యూడిషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఉన్నతాధికారులందరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. జీజీహెచ్లో 36 గంటల పాటు విధి నిర్వహణలో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సుష్మ డ్యూటీని కూడా తన కూతురే చేయాలని ఆదేశాన్ని ఇవ్వడంతో పై అధికారుల మాటను శిరసావహించిందన్నారు. డ్యూటీనే పరమావధిగా భావించే తన కూతురు డ్యూటీలో ఇబ్బందులు ఎదుర్కొని వైద్యం అందక కేవలం 20 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడం అంతుచిక్కని మిస్టరీగా ఉందన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సుష్మవిధుల్లో లేరు.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని, నష్ట పరిహారాన్ని ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పీజీ వైద్య విద్యార్థిని ఆపరేషన్ థియేటర్ లోనే డ్యూటీలో భాగంగా కుప్పకూలి మృత్యువాత పడితే కూడా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. అసలు ఆ రోజు ఏమి జరిగిందో ముఖ్యమంత్రి సమగ్ర విచారణ జరిపించి దీపిక మృతిపై వీడని చిక్కుముడిని ప్రజలకు బహిర్గతం చేయాలని కోదండరాంరెడ్డి డిమాండ్ చేశారు. ఆ రోజు నైట్ డ్యూటీలో ఎనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మ లేకపోవడం పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. -
వీఏఏలపై పనిభారం..
రైతు సేవలకు మంగళం పాడుతున్న చంద్రబాబు సర్కారుగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వ్యవ‘సాయానికి’ చిరునామాగా ఉండి.. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాల అడ్రస్ గల్లంతవుతోంది. రైతుల అవస్థలను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు కేంద్రాల పేరు మార్చి.. నిర్వీర్యం చేస్తోంది. రేషనలైజేషన్ పేరిట కత్తికట్టి, కేంద్రాలను కుదిస్తోంది. అన్నదాతలకు విత్తనం నుంచి విక్రయం వరకూ ఇబ్బందుల పాల్జేస్తోంది.గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతులు తమ అవసరాలకు గ్రామం దాటి వెళ్లకూడదని, అన్ని సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకేలు) ప్రారంభించింది. విత్తనం నుంచి పంట విక్రయం వరకు సేవలు ఆర్బీకేలలో లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఒక్కో ఆర్బీకేలో వ్యవసాయ సహాయకుడు, ఉద్యాన సహాయకుడు, వెటర్నరీ సహాయకుడు ఇలా సిబ్బందిని నియమించింది. సిబ్బంది ద్వారా వ్యవసాయదారులకు సూచనలు, సలహాలు, భూ సార పరీక్షలు, ఈ–క్రాప్ నమోదు చేయడం ద్వారా పంటలకు బీమా సౌకర్యం కల్పించడం వంటి సేవలను అందించింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచింది. పంటలు వాటి మద్ధతు ధరల వివరాలు డిస్ ప్లే చేసింది. రైతులు పండించిన పంటలు కొనుగోలు మద్ధతు ధరలకు కొనుగోలు చేసేలా నాటి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి తెచ్చింది. ఆ ఐదేళ్లు ఆర్బీకేలు రైతులతో కళకళలాడాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఇదంతా గతం. ఇప్పుడు అధ్వానం.. తాము అధికారంలోకి వస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని నమ్మబలికి చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు పూర్తయింది. గత ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకొచ్చిన ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలు(ఆర్ ఎస్కే)గా పేర్లు మార్చింది. రేషనలైజేషన్ పేరుతో రైతు సేవా కేంద్రాలను కుదించింది. జిల్లాలో మొత్తం 60 కేంద్రాలకు తాళాలు వేసింది. రెండు, మూడు కేంద్రాలను కలిపి ఒకటిగా చేసింది. సిబ్బందిని సర్దుబాటు చేసింది. మిగిలిన పోయిన ఆర్బీకేల నిర్మాణం పూర్తి చేయకపోగా ఉన్నవాటికే తాళం వేసింది. ఆయా చోట్ల రైతులకు సూచనలు, సలహాలు ఇలా సేవలన్నింటికి స్వస్తి పలికింది. ఫలితంగా వ్యవసాయం తిరోగమనంలోకి వెళుతోంది. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా ఎగనామం పెట్టింది. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. ఆర్ఎస్కేలలో గిట్టుబాటు ధరల సమాచారమే అందుబాటులో లేదు. లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటిని ప్రారంభించి సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు. మొత్తంగా రైతు సేవా కేంద్రాలు వెలవెలబోతున్నాయి. 267 మొత్తం రైతు భరోసా కేంద్రాలు207మొత్తం సిబ్బంది207రేషనలైజేషన్ తర్వాత మిగిలినవి 75అసలు ప్రారంభం కానివిఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి 98భవన నిర్మాణాలు పూర్తయినవి 20నిర్మాణం పూర్తయి ప్రారంభం కాని భవనాలురైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం పూర్తి గా నిర్వీర్యం చేస్తోంది. గ్రామాల్లో రైతులకు సాగు విషయంలో వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడేది. ప్రస్తుతం ఆర్బీకేలలో పని చేసే అగ్రికల్చర్, హార్టీకల్చర్ అసిస్టెంట్లకు ఇతర పనులు అప్పగించడంతో గ్రామాల్లో పూర్తిగా వ్యవసాయ సమాచారం ఇచ్చేవారే కరువయ్యారు. – ఉన్నం శ్రీనివాసరావు, రైతు, అనిగండ్లపాడు, పెనుగంచిప్రోలు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా ఎరువులు, పురుగు మందులు అందించేవారు. అంతే కాకుండా పంటల రైతు భరోసా, పంట నష్ట పరిహారాలు కూడా సకాలంలో అందేవి. ఈ–క్రాప్ నమోదు చేసి పంటల బీమా కల్పించారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. – కొండబోలు శ్రీను, రైతు, మక్కపేట, వత్సవాయి మండలం ఒక్కో ఆర్ఎస్కేలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(వీఏఏ) అందుబాటులో ఉండేవారు. ప్రారంభంలో జనాభా ప్రాతిపదికన వీఏఏల నియామకం జరిగింది. ఇపుడు రేషనలైజేషన్ పేరుతో పంట సాగు విస్తీర్ణం ఆధారంగా వీఏఏలను సర్దుబాటు చేశారు. రెండుమూడు ఆర్ఎస్కేలను విలీనం చేయడంతో ఆ భారమంతా ఒక వీఏఏపై పడుతోంది. ఈ–క్రాప్ నమోదు, వ్యవసాయ సంబంధిత విధులే కాకుండా ఇతర సర్వేలు కూడా చేయిస్తుండటంతో వారిపై భారం పడుతోంది. ఉద్యాన సహాయకులైతే ఒక్కో మండలంలో మూడు గ్రామాలకు ఒకరు చొప్పున ఉండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. రాబోయే రోజుల్లో ఆర్ఎస్కేలను ఉంచుతుందా లేదా అన్న ఆందోళనలో వారు ఉన్నారు. -
సుబ్బారాయుడి సేవలో ఆర్టీసీ ఎండీ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ బాల సుబ్రహ్మణ్యం ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక తహసీల్దార్ ఎం. హరనాథ్, అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వెంకటేశ్వరావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదతో సత్కరించారు. ఆయన వెంట చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, ఎస్ఐ పి. గౌతమ్కుమార్ పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ విభాగమైన యూరాలజీలో రెండు పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి ఆ విభాగంలో ఇద్దరు పీజీ విద్యార్థులు అడ్మిషన్లు పొందనున్నారు. ఇప్పటికే న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు ఉండగా, తాజాగా మరో విభాగంలో మంజూరయ్యాయి. కాగా 2020లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభం అనంతరం యూరాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి అందిస్తున్న నాణ్యమైన సేవలకు గాను, ఎన్ఎంసీ పీజీ సీట్లు మంజూరు చేశారు. యూరాలజీ పీజీ సీట్లు వచ్చేందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావును విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ను వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ గోవింద్, డాక్టర్ ప్రభాకర్, ఇతర టీచింగ్ అధ్యాపకులు అభినందనలు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గుజరాత్లోని వడోదరలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 72వ సీనియర్ జాతీయ పురుషుల కబడ్డీ చాంపియన్షిప్లో మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే జట్టును ఎంపిక చేశామని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.శ్రీకాంత్ ప్రకటనలో ఆది వారం తెలిపారు. ఇండియా అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీకి జట్టు కెప్టెన్గా పి.దుర్గారావు(తూర్పు గోదావరి), పి.గోపి(పల్నాడు), జి.లక్ష్మారెడ్డి(బాపట్ల), ఎన్.తేజ (విశాఖపట్నం), సీహెచ్ నాగబాబు (కాకినాడ), కె.రాంబాబు(తిరుపతి), కె.ఫణేంద్ర(ఎన్టీఆర్), పి.బ్రహ్మారెడ్డి(బాపట్ల), కె.దినేష్ (తిరుపతి), జి.పవన్ కుమార్ (కృష్ణ), కె.హరి ప్రసాద్ రెడ్డి(బాపట్ల), కె.మనోహర్ (కాకినాడ), జి.హరీష్ (పల్నాడు), ఎస్కే బాషా(గుంటూరు), జట్టుకు కోచ్గా టి.సుధాకర్, జట్టు మేనేజర్గా కె.మహేష్లు ఎన్నికయ్యారన్నారు. క్రీడాకరులను రైల్వే శాఖ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అదనపు డైరెక్టర్ కె.రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కల అర్జునరావు, జాయింట్ సెక్రటరీ నాంచారయ్య అభినందించారు. చిలకలపూడి(మచిలీపట్నం): సిపాయిల తిరుగుబాటుకు ముందే ఆంగ్లేయుల పాలనను ఎదురించి పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లోని మీ కోసం హాలులో కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి తెలుగువారి పౌరుషాన్ని చాటి చెప్పిన అమర వీరుడన్నారు. డీటీడబ్ల్యూవో ధూర్జటి ఫణి, డెప్యూటీ కలెక్టర్ నారాయణ పాల్గొన్నారు. -
నాన్వెజ్ ఎక్కువగా తినకూడదు..
మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. బిర్యానీలు, నాన్వెజ్ వంటకాలు ఎక్కువగా తినడం మంచిది కాదు. వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వలన ఫ్యాటీ లివర్, జీర్ణకోశ వ్యాధులు వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువ మంది చిరుధాన్యాలపై ఆసక్తి చూపుతున్నారు. వాటిలో కూడా పిండి పదార్ధాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పరిమితంగానే వాటిని తీసుకోవాలి. తాజా పళ్లు, కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, కోడిగుడ్డు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకుంటే మంచిది. మధుమేహం ఉన్న వారు. ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న వారు. ఆహార నియమాల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. – డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు -
తిరుమల నిత్యాన్నదానానికి పది టన్నుల కూరగాయలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): తిరుమల శ్రీవారి సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదానానికి ఐసీఏఐ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను పంపించారు. కాగా కూరగాయల వాహనాన్ని ఆదివారం గవర్నర్ పేటలోని ఆ సంస్థ కార్యాలయం వద్ద ఐసీఏఐ విజయవాడ చాప్టర్ అధ్యక్షుడు డి. ప్రసన్నకుమార్, ఇతర సభ్యులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవను సుస్థిరతతో అనుసంధానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. చైర్మన్ జయంత్ ఉప్పులూరి, ఆక్స్ ఆఫిషియో సభ్యుడు ముప్పాల సుబ్బారావు వేమూరు వీర పావన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం సీనియర్ పురుషుల కృష్ణాజిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఈ సెలక్షన్స్కు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 14 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లుగా ఆ సంఘ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎం. నరేంద్రబాబు చెప్పారు. మరో నలుగురు క్రీడాకారులను స్టాండ్బైగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు మార్చి 7వ తేదీన ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు. వ్యాయామ ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రా ఆత్మహత్యపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో బ్లాక్ నంబర్ 135లో అబ్దుల్ రషీద్ కుటుంబం నివాసం ఉంటుంది. రషీద్కు కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు అబ్దుల్ రెహమాన్ 12 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లి పోయి కాలనీలో 45వ బ్లాక్లో ఉంటున హిజ్రాలతో కలిసి ఉంటున్నాడు. కొన్నేళ్లుగా రెహమాన్ అంజలిగా పేరు మార్చుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రషీద్ భార్యకు రెహమాన్ స్నేహితులు ఫోన్ చేసి రెహమాన్ వాళ్ల ఇంట్లో ఉరి వేసుకున్నాడని తెలిపింది. దీంతో హుటాహుటినా వారు రెహమాన్ ఇంటికి వెళ్ల చూడగా ఉరికి వేలాడుతుండగా కిందకు దింపి ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. జి.కొండూరులో బాలిక..ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్కు చెందిన జె.కిషోర్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.5 లక్షల విరాళాన్ని అందచేశారు. కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన మోచర్ల భవానీ కుటుంబం రూ.1,01,116, విజయవాడ లయోలా కాలేజీ ప్రాంతానికి చెందిన తన్నీరు మారుతీ ఫణికాంత్ రూ.లక్ష విరాళాన్ని అందించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుడ్లవల్లేరు: రైలు ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు చెప్పిన వివరాల మేరకు గుడ్లవల్లేరు నుంచి కౌతవరం వైపు రైలు వస్తుండగా పుల్లేరు కాలువ వంతెనపై గల రైలు పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొట్టింది. 55 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొనగా కీ మ్యాన్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతుడు మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఫిర్యాదుపై మచిలీపట్నం ఆర్పీఓ పీహెడ్ కానిస్టేబుల్ ఏఎస్ కుమార్చే మచిలీపట్నం ఆర్పీ ఎస్ఐ కే శివన్నారాయణ ఉత్తర్వులపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచి మృతుని ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుని వద్ద నేవీ బ్లూ రంగు షర్టు, కాషాయం రంగు టవల్ ఉన్నాయి. మృతుని ఆచూకీ తెలిసినవారు 98495 96079 నంబర్కు సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్డుపై ఉంచిన బారికేడ్ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం చెందిన ఘటన కొండపల్లిలో 30వ నంబర్ జాతీయ రహదారిపై డీఏవీ పాఠశాల సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు కొండపల్లి వడ్డేనగర్కు చెందిన ఏసుబాబు(60) వ్యక్తిగత పనులపై ఇబ్రహీంపట్నం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తున్నాడు. లారీ వెనుక వెళ్తున్న ఏసుబాబుకు దగ్గరకు వచ్చే వరకు బారీకేడ్ కనిపించలేదు. కూతవేటు దూరంలో బారికేడ్ కనిపించడంతో అప్పటికే అదుపు తప్పిన బైక్ బారికేడ్ను ఢీకొట్టింది. బారికేడ్ కింద పడిన ఏసుబాబును చూసిన స్థానికులు చేరుకుని 108 సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది వైద్య పరీక్షలు జరిపి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నెల రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
క్రేజీ.. బిర్యానీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు పిజ్జాలు, బర్గర్లు తినే నగర యువత, చిన్నారులు నేడు బిర్యానీలపై మనసు పారేస్తుంటున్నారు. తరచూ నాన్వెజ్ వంటకాలను లాగించేస్తున్నారు. దీంతో బిర్యానీ పాయింట్లకు క్రేజ్ నెలకొంది. ఆయిల్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటంతో ఊబకాయులుగా మారి, ఆనారోగ్యం పాలవుతున్నారు. మరోవైపు మధ్య వయస్సుతో పాటు, వృద్ధులు సాంప్రదాయ, ఆర్గానిక్ ఆహారంపై దృష్టి పెడుతున్నారు. దీంతో నగరంలో ఆర్గానిక్ స్టాల్స్ వెలుస్తున్నాయి. జోరుగా వ్యాపారం.. నగరంలో బిర్యానీల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్స్ వెలుస్తున్నాయి. రోడ్డుపైనే మొబైల్ బిర్యానీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈట్ స్ట్రీట్ నుంచి కార్పొరేట్ హోటల్స్ వరకూ బిర్యానీలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రస్తుతం బిర్యానీల ట్రెండ్ నడుస్తోంది. అంతేకాదు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా జుమాటో, స్విగ్గీ వంటి సర్వీసుల ద్వారా ఇంటి వద్దకే బిర్యానీలు వచ్చేస్తున్నాయి. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్న వారిలో 90 శాతం నాన్ వెజ్ వంటకాలే ఉంటున్నాయి. మరో వైపు ఇళ్లలో సైతం నూడిల్స్, బర్గర్స్ వంటివే తయారు చేసుకుని లాగించేస్తున్నారు. యువత, చిన్నారులు ఎక్కువగా వాటిపై మక్కువ చూపుతున్నారు. రకరకాల బిర్యానీలు.. యువతను ఆకట్టుకునేందుకు రకరకాల బిర్యానీలు అందుబాటులోకి తెస్తున్నారు. పాలకొల్లు కుండ బిర్యానీ, రాయలసీమ రొయ్యల బిర్యానీ, అరేబియన్ మండీ బిర్యానీ, గ్రిల్స్ చికెన్, తండూరీ, నెల్లూరు రొయ్యలు బిర్యానీ అంటూ ఇలా రకరకాల బిర్యానీలు ఘుమఘుమలాడే సువాసనలతో నోరూరించే రుచులను అందిస్తుండటంతో నగర ప్రజలు మనసుపారేసుకుంటున్నారు. వారంలో మూడు నాలుగు రోజులు బిర్యానీలను లాగించేస్తున్నారు. బిర్యానీలు అధికంగా లాగించే వారిలో 90 శాతం మందికి ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వస్తున్నాయి. ఫ్యాషన్గా మారిన ఈట్స్ట్రీట్.. ఒకప్పుడు రోడ్డుపై తినుబండారాలు తినేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద తినడం ఫ్యాషన్గా మారింది. అంతేకాదు ఈట్స్ట్రీట్కు వస్తున్న వారిలో ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాల వారే ఎక్కువగా ఉంటున్నారు. రాత్రి వేళల్లో కుటుంబ సమేతంగా వచ్చి ఈట్స్ట్రీట్లోని బండి వద్ద బిర్యానీలు తీసుకుని రోడ్డుపై తినేస్తున్నారు. వీకెండ్స్లో అయితే రద్దీ మరింతగా ఉండటంతో బిర్యానీలు హాట్కేక్ల్లా అయిపోతున్నాయి. ఆర్గానిక్ ఫుడ్స్ వైపు చూపు.. నగరంలో క్రమేణా ఆహార పద్ధతుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నారు. వయస్సు 45 ఏళ్ల దాటిన వారు పాతతరం ఆహార పద్ధతులను మళ్లీ అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం నగరంలో స్టాల్స్ వెలుస్తున్నాయి. ఆర్గానిక్స్ ఉత్పత్తుల వాడకం కూడా పెరిగింది. ఆర్గానిక్ కూరగాయలు, చిరుధాన్యాలను ఇటీవల కాలంలో ఎక్కువగా ఆ వయస్సు వారు వాడుతున్నారు. అంతేకాదు నగరంలో చద్దన్నం స్టాల్స్ కూడా వెలుస్తున్నాయి. అనారోగ్యం అంటున్న వైద్యులు.. బిర్యానీలు ఎక్కువగా తినడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. వారంలో ఒక రోజు తింటే పర్వాలేదని, మూడు, నాలుగు రోజులు తింటున్న వారి సంఖ్య ఎక్కువ అవుతున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారు ఒబెసిటీతో పాటు ఫ్యాటీ లివర్, మధుమేహం, రక్తపోటు, స్ట్రెస్, యాంగ్ల్జైటీ, డిప్రెషన్ వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. పిల్లలు చిన్నతనంలో ఊబకాయులుగా మారితే పెనుప్రమాదమని సూచిస్తున్నారు. -
‘వికసిత్ భారత్’లో యువత భాగస్వాములు కావాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆత్కూరు(గన్నవరం): వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆదివారం జరిగిన ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా యువత తమ కాళ్ల మీద తాము నిలబడి నైపుణ్య శిక్షణ ద్వారా స్వావ లంబన సాధించాలని సూచించారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరపడి తద్వారా సుస్ధిర దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ట్రస్టీ అట్లూరి అశోక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరదేశి, సీఈఓ శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. హోమియో వైద్య శిబిరం పరిశీలన.. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్లోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జీవీ చలపతిరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు పరిశీలించారు. డాక్టర్ పి.వి.సత్యనారాయణ బృందం ఎటువంటి లాభపేక్ష లేకుండా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ముదాహమని ఆయన పేర్కొన్నారు. -
ఆర్చరీ టోర్నమెంట్ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆర్చరీ క్రీడాభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ చెప్పారు. స్థానిక పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ కళాశాల ఆవరణలో 3వ ఎన్టీపీసీ ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఫర్ ఉమెన్ ఆర్చరీ టోర్నమెంట్–2026 ఆదివారం ప్రారంభమైంది. కలెక్టర్ లక్ష్మీశ ముఖ్యఅతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ ర్యాంకింగ్ పోటీలకు విజయవాడ వేదిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 24వరకూ పోటీలు.. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ 3వ ఎన్టీపీసీ ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఫర్ ఉమెన్ ఆర్చరీ టోర్నమెంట్ ఈ నెల 24వ తేదీ మంగళవారం వరకు జరుగుతుందన్నారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్), డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. సబ్–జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో రికర్వ్ అండ్ కాంపౌండ్ అంశాల్లో టోర్నమెంట్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ టోర్నమెంట్ కాంపిటేషన్ డైరెక్టర్ అరుంధతి సిలో, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీవీ రమణ, కోశాధికారి చెరుకూరి కృష్ణకుమారి, కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియేషన్ కోశాధికారి గొట్టిపాటి ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కోడెలతో రథోత్సవం
మోపిదేవి: మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆదివారం ఒక్క రోజు వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.11,16,611 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ స్వామివారికి సేవా టికెట్లు ద్వారా రూ.5,81,106, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,78,055, నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.1,82,491, శాశ్వత అన్నదానానికి రూ.25,245, స్వామివారి కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ.32,600, స్వామివారి దర్శనం ద్వారా రూ.71,450, మొత్తం రూ.11,16,611 ఆదాయం వచ్చిందన్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): తోలుబొమ్మలాట కులస్తులను బీసీ(ఏ) జాబితాలో చేర్చాలని, దేవదాయ ధర్మాదాయ శాఖలో, వైద్య ఆరోగ్యశాఖలో అవకాశాలు కల్పించాలని ఏపీ తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనపర్తి ఏడుకొండలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ తోలుబొమ్మలాట కళాకారులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని, రూ.10 వేలు పెన్షన్ ఇవ్వాలని, కళాకారుల పిల్లలకు వృత్తిపరమైన శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి వాద్య పరికరాల కొనుగోలుకు సబ్సిడీపై లోన్స్ ఇవ్వాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి డిజిటలైజ్ చేయాలని కోరారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్కుమార్, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీర్నాల కృష్ణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంతరాలయ దర్శనం రద్దు.. -
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది
మాజీ మంత్రి మేరుగ నాగార్జున చల్లపల్లి: రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని, అడ్డూ అదుపూలేకుండా దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున అన్నారు. చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి నాయకులు అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ఇళ్లపైకే వచ్చి గంటలు తరబడి దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. కనీసం ఆ దాడులను ఆపే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయకపోవటం పరోక్షంగా అరాచక శక్తులను ప్రోత్సహించటమేనని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏడు గంటలపాటు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేయటం, జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేయటం అరాచక పాలనకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు సున్నిత మనస్కుడని ఆయన మాట్లాడే విధానం డ్రమటికల్గా ఉంటుందే తప్ప ఎవరినీ తూలి మాట్లాడరని పేర్కొన్నారు. అలాంటి అంబటి రాంబాబును కొట్టాలని, చంపాలని చూస్తున్నారని విమర్శించారు. బాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత.. రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును గాలికొదిలేసి ప్రజామోదంలేని, వారికి ఉపయోగపడని ఒక డొల్ల బడ్జెట్ను తీసుకువచ్చారని మేరుగ దుయ్యబట్టారు. రాష్ట్ర, ప్రజల అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ను అందించిన ఘనత వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. కులం, మంతం, ప్రాంతం, పార్టీ అనే భేదాలు చూడకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందించడం ఆయనకే చెల్లిందన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, ఎప్పుడెప్పుడు ప్రజానేత జగన్మోహన్రెడ్డికి పట్టం కడదామా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. మేరుగ నాగార్జున వెంట వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బి.ఏడుకొండలు, చల్లపల్లి మండల నాయకులు యడ్ల జగదీష్, కొల్లూరి ముద్దుకృష్ణ, మద్దాల వీరాస్వామి, మెండు వీరబాబు, ఇతన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
భావితరాలభవిష్యత్తుకు ప్రకృతి సాగేకీలకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయానికి చేరువ కావాలని, భావితరాల బంగారు భవిష్యత్కు ప్రకృతి సాగే కీలకమని వక్తలు పేర్కొన్నారు. సేంద్రియ సాగును ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, రైతు సాధికార సంస్థ, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయాస్ ఫార్మర్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం ఆదివారం జరిగింది. ప్రకృతి సాగును ముందుకు తీసుకెళ్తామని ప్రజాప్రతినిధులు రైతులు ప్రతిజ్ఞ చేశారు. విస్తృతంగా అవగాహన.. ● దేశీయ గో ఉత్పత్తుల కేంద్రం, రైతు సాధికార సంస్థ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, బయో ఇన్పుట్స్, పీఆర్ఐటీహెచ్యూ (రీజెన్ అగ్రి కార్బన్ ప్రాజెక్టు), వన్ ఎర్త్ – వన్ లైఫ్ టెర్రాస్ గార్డెన్, సాయిశ్రీనివాస్ గోశాల, స్వయం సహాయక సంఘాల ఆర్గానిక్ ఉత్పత్తులు, దేశవాళీ వంగడాలు, ఆరోగ్య వనం తదితర స్టాళ్లు ఏర్పాటు చేసి ఆర్గానిక్ సాగుతో పాటు ఉత్పత్తుల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ● ప్రబాల్ తోమర్ (కిసాన్ లెడ్జర్), ఆశా కిరణ్ (అమరావతి ఆర్గానిక్), రఘురాం (భూమి ఆర్గానిక్) తదితర ప్రకృతి సేద్యం, ఉత్పత్తుల రంగ నిపుణులు మార్కెట్ లింకేజీలపై అవగాహన కల్పించారు. ● రైతులు తాము పండించిన ప్రకృతి సేద్య ఉత్పత్తులకు మంచి ధర లభించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ● వినియోగదారుడు కూడా తనకు నాణ్యమైన ప్రకృతి సేద్య ఉత్పత్తులే కొనుగోలు చేశాననే విశ్వాసం పెంపొందించేలా తీసుకొచ్చిన ట్రేసబులిటీపై కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయకుమార్ మాట్లాడుతూ 2030 నాటికి రాష్ట్రంలోని ప్రతిరైతుకూ ప్రకృతి వ్యవసాయాన్ని చేరువ చేస్తామన్నారు. ప్రకృతి ‘వ్యవసాయం వెనుక శాసీ్త్రయత అనే అంశం’పై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, జేసీ ఎస్.ఇలక్కియ, డీపీఎం వై.శంకర్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవంలో వక్తలు -
ప్రతిపక్ష నేతలపై దాడులు అమానుషం
ఇబ్రహీంపట్నం: వైఎస్సార్ సీపీకి చెందిన ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో దాడులు చేస్తోందని, ఇక సామాన్యుడికి న్యాయం ఏమి జరుగుతుందని శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో దెబ్బతిన జోగి రమేష్ ఇంటిని ఆదివారం ఆయన పరిశీలించారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో దాడులు, కక్షలు, కార్పణ్యాలతో రాష్ట్రం అట్టుడికి పోతోందన్నారు. అసలు ఈదాడులు ఏమిటని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాను గానీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న నాయకులపై దాడి చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు. బలహీన వర్గాలపై చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దాడులు ప్రోత్సహిస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇతర నాయకులను టార్గెట్ చేసి కేసులు, దాడులతో హింసించడం దుర్మార్గమన్నారు. బలహీనవర్గాల్లో పుట్టాం కానీ తాము బలహీనులం కాదనే విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వ నాయకులు గుర్తించాలని అన్నారు. దాడి తర్వాత జోగి రమేష్ ధీరుడిగా ప్రజలు గుర్తించారని వెల్లడించారు. పోలీస్ వ్యవస్థ ఏమి చేస్తోంది.. డైవర్షన్ పాలిటిక్స్కు అలవాటు పడిన కూటమి నాయకులు ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఛీ కొట్టే పరిస్థితులు ఉన్నాయని తమ్మినేని స్పష్టం చేశారు. దాడులన్నీ పోలీసుల సమక్షంలో చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. సామాన్య ప్రజలకు ఏమి భరోసా ఇస్తారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ, డైవర్ట్ రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. కేసులకు భయపడే పరిస్థితులు వైఎస్సార్ సీపీ నాయకులకు లేదన్నారు. బంతి గోడకు కొడితే ఎంత స్పీడుగా వస్తుందో రానున్న రోజుల్లో రాష్ట్ర పాలన కూడా అలాగే జరుగుతుందని వెల్లడించారు. అన్నింటికి తెగించే ఉన్నామని స్పష్టం చేశారు. అంతకు ముందు కలింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డి.లక్ష్మణరావు, ఇంటిలెక్చువల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లల రామకృష్ణ, రణస్థలం ఎంపీపీ పిన్నేటి సాయికుమార్, వైఎస్సార్ సీపీ సహాయ కార్యదర్శి గుమ్మడి రాంబాబు, మాజీ పీఏసీ చైర్మన్ చింతల సూర్యనారాయణ, కొండపల్లి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా వీఎంసీ కౌన్సిల్
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రశాంతంగా జరిగింది. నగరంతోపాటు గన్న వరం, కంకిపాడు, నున్న ప్రాంతాల్లో కూడా వీఎంసీ సాధారణ నిధులతో 15 ట్రాఫిక్ జంక్ష న్లలో సిగ్నళ్లు ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రతిపాదనపై సవరణ తీర్మానాన్ని ఈ సమావేశంలో ఆమోదించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు నిధుల మంజూరు, విడుదల, నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని ఈ తీర్మానం చేశారు. నగర పాలక సంస్థ సర్వసభ్య సాధారణ సమావేశం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సంబంధించి అజెండాలో 169 అంశాలను పొందుపరిచారు. వాటిలో 149 అంశాలను ఆమోదించగా ఏడింటికి ఆఫీస్ రిమార్కులు కోరారు. మరో ఏడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్త్తూ తీర్మానం చేయగా, నాలుగు అంశాలను తిరస్కరించారు. ఒక అంశాన్ని రికార్డు చేయగా, మరో అంశాన్ని ధ్రువీకరించారు. నిధుల వివరాలు ఇవీ.. కౌన్సిల్కు సరైన సమాధానం ఇవ్వటంలేదని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులకు, చేసే ఖర్చుకు, ఇచ్చే బిల్లులకు సరిపోలటంలేదని మేయర్ రాయన భాగ్యలక్ష్మి సభలో ఇన్చార్జి సీఈ సత్యకుమారిని మందలించారు. సర్కిల్ –3 పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా అక్కడ శిలాఫలకం వేయటంలేదని, కార్పొరేటర్ పేరు రాయాల్సి వస్తుందని ఇలా చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. దీనిపై సర్కిల్–3 ఈఈ సామ్రాజ్యం సభ్యులు సంతృప్తి పడేలా సమాధానం ఇవ్వలేదు. దీంతో సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలి
మచిలీపట్నంటౌన్: స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలను కోరారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న బాల భవన్ బ్యాడ్మింటన్ కోర్టు ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, పలువురు జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. మంత్రి రవీంద్ర ప్రాంగణంలోని వ్యర్థాలను, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేశారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి మంత్రి, జిల్లా కలెక్టర్, ఆర్టీసీ చైర్మన్ ఫొటో దిగారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొల్లు మాట్లాడుతూ.. మచిలీపట్నం నగరం స్వచ్ఛత కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు జిల్లా కలెక్టర్ను, మునిసిపల్ కమిషనర్ను అభినందించారు. చెత్త ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటుకు కోన మార్గంలో 13 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడు, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, జిల్లా ఖజానా అధికారి రవికుమార్, డీఎస్డీఓ ఝాన్సీలక్ష్మి, మత్స్య శాఖ అధికారి అయ్యా నాగరాజ, ఆర్డీఓ పోతురాజు, డీటీడబ్ల్యూఓ ఫణి ధూర్జటి, పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్రప్రసాద్, అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ థియరీ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయని కృష్ణా జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి (డీఐఈఓ), పరీక్షల కన్వీనర్ ఎస్.సరళ కుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పరీక్షలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. జిల్లాలో 49,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 24,173 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 25,406 మంది ఉన్నారని వివరించారు. జిల్లాను 14 జోన్లుగా విభజించి 63 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 63 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 63 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 1,100 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారని పేర్కొ న్నారు. అదనంగా నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని, ప్రశ్న పత్రాను భద్రపరిచేందుకు 18 స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. తొమ్మిది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టంచేశారు. విద్యార్థులు తప్పని సరిగా తమ వెంట హాల్ టికెట్లను తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144, 163 సెక్షన్లు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షలను పారదర్శ కంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
కుంభాభిషేకానికి ఏర్పాట్లు ప్రారంభం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే కుంభాభిషేక మహోత్సవా నికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ శిఖరం చుట్టూ పరంజా, సెంట్రింగ్ బల్లల ఏర్పాటు పనులను శనివారం ప్రారంభించగా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ వాటిని పరిశీలించారు. దుర్గ గుడిలో మూడు రోజుల పాటు కుంభాభిషేకం జరగనుంది. ఇందు కోసం అమ్మవారి ఆలయ బంగారు శిఖరానికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో చివరి రోజైన మార్చి ఎనిమిదో తేదీన అభిషేకాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుతో పాటు శృంగేరీ శారదాపీఠం పీఠాధిపతులను ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయం చుట్టూ ఐరన్ పైపులు, చెక్కలతో పరంజాను నిర్మిస్తున్నారు. అమ్మ వారి బంగారు శిఖరంపైకి కేవలం ప్రొటోకాల్ ఉన్న వారికే అనుమతించే అవకాశం ఉంది. తిరుపతికి చెందిన కాంట్రాక్టర్కు ఈ పనులను అప్పగించారు. 20 మంది కార్మికులు ఈ పనులను చేపట్టారు. పరంజా నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తిరుమల తిరుపతి దేవస్థానంలో వినియోగించినవి తీసుకువస్తున్నట్లు ఆలయ ఇంజినీరింగ్ అధికా రులు తెలిపారు. శనివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ లక్ష్మీశ తొలుత అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పరంజా పనులను పరిశీలించారు. ఆలయ ఈఓ శీనానాయక్, స్థానాచార్య శివప్రసాద్ శర్మతో పాటు ఆర్అండ్బీ అధికారులు, దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండటంతో ఏర్పాట్లను కట్టు దిట్టంగా నిర్వహించాలని, పనులను ఎప్పటికప్పుడు ఆర్అండ్ బీ అధికారులు పరిశీలించి నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. పరంజా నిర్మాణ పనులు నెలాఖరు నాటికి పూర్తి చేసి క్వాలిటీ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. కుంభాభిషేకం ప్రారంభానికి రెండు, మూడు రోజుల ముందుగా సీఎంఓ కార్యాలయం తనిఖీలు, భద్రతా తనిఖీలు జరుగుతాయని తెలుస్తోంది. -
కార్తికేయుని సన్నిధిలో మంత్రి కొల్లు రవీంద్ర
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయన వెంట తహసీల్దార్ ఎం.హరనాథ్, మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు, కూటమి నాయకులు రావి రత్నగిరి, నడకుదుటి జనార్దనరావు, చందన రంగారావు, మోటుపల్లి పండు, చల్లపల్లి సీఐ ఈశ్వరావు, ఎస్ఐ పి.గౌతమ్కుమార్, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు: బాలికను లైంగికంగా వేధించిన నిందితుడికి జైలు శిక్ష పడిందని సీఐ వెంకటరమణ తెలిపారు. శనివారం ఈ కేసు వివరాలను సీఐ తెలిపారు. ఆయన కథనం మేరకు.. 2021 సంవత్సరంలో వణుకూరు గ్రామంలో 11 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల కలపాల స్వామియేలు ఆమెను తాగడానికి నీళ్లు అడిగి, ఆమెను తాకి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జూన్ 17వ తేదీ 2021 సంవత్సరంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అప్పటి ఎస్ఐ వెంకటేష్ కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. ఈ కేసులో ఎనిమిది మంది సాక్షలను విచారించిన న్యాయమూర్తి వేల్పుల భవాని ఈ నెల 20వ తేదీన తుది తీర్పు ఇచ్చారు. నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరి మానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది గడ్డం రాజేశ్వరరావు వాదించారు. గుడివాడరూరల్: గుడివాడ మునిసిపాల్టీలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలను రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిని స్ట్రేషన్ అధికారి సీహెచ్ నాగనరసింహారావు శనివారం పరిశీలించారు. తొలుత డంపింగ్ యార్డులో జరుగుతున్న లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ పనులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ప్రాసెసింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించి, పట్టణంలోని డ్రెయిన్ల వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. పట్టణానికి సరఫరా అవుతున్న మంచినీరు, ఉత్పత్తి అవుతున్న మురుగునీటి పరిమాణాలను పరిశీలించి అందులో ఎంత మేరకు మళ్లించబడుతుందనే అంశాలను సమీక్షించారు. ప్రతి ఇంటి నుంచి మల వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తరలించి శుద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుద్ధి చేసిన నీటిని పట్టణంలోని పార్కులు, డివైడర్లు నిర్వహణ అవసరాలకు వినియోగించాలని సూచించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన పనులను పూర్తి చేసి ట్రయల్ రన్కు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, డెప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్, శానీ టరీ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కోనేరుసెంటర్(మచిలీ పట్నం): లోన్ యాప్కు ఓ యువకుడు బలయ్యాడు. ఈ ఘటన మచిలీపట్నంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మచిలీ పట్నం కాసానిగూడెం ప్రాంతానికి చెందిన ఈడే గిరీష్ కుమార్ (28) నిమ్మకూరు బెల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతని తండ్రి మృతి చెందడంతో కుటుంబ పోషణ బాధ్యత గిరీష్పై పడింది. దీంతో ఆర్థిక అవసరాల నిమిత్తం ఓ లోన్ యాప్లో రూ.70 వేల రుణం తీసుకుని నెలనెలా బాకీ వాయిదాలను చెల్లిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తటంతో నగదు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. లోన్ డబ్బులు చెల్లించటంలో ఆలస్యం అవుతుండటంతో లోన్ యాప్ సిబ్బంది గిరీష్ను వేధించటం మొదలుపెట్టారు. సిబ్బంది పెడుతున్న ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేని యువకుడు శుక్రవారం రాత్రి పొటాష్ గడ్డ తిని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపుల వల్ల యువ కుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీ పట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన డెప్యూటీ తహసీల్దార్
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): కూటమి పాలనలో అవినీతి ఏ విధంగా రాజ్యమేలుతోందో చెప్పడానికి ఇటీవల జరుగుతున్న ఏసీబీ దాడులే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఏకంగా రూ.45 వేల లంచం తీసుకుంటూ అయోధ్యనగర్ 229, 231 సచివాలయాలకు చెందిన ఇద్దరు రెవెన్యూ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కారు. తాజాగా ఓ డెప్యూటీ తహసీల్దార్ అవినీతికి పాల్పడుతూ ఏసీబీ చేతికి చిక్కిన ఘటన శనివారం జరిగింది. ఎఫ్ఎంసీ కోసం రూ.12 వేలు తీసుకుంటూ.. విజయవాడ వాంబేకాలనీ ప్రాంతానికి చెందిన ఉప్పాడ సాయి(26) నానమ్మకు వాంబేకాలనీలో ఓ ఇల్లు ఉంది. ఆ గృహానికి సంబంధించిన లావాదేవీల విషయంలో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సాయి తండ్రి రాము గత నెల 29వ తేదీన స్థానిక మీ–సేవ కేంద్రం ద్వారా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రోజులు గడుస్తున్నా తమకు సర్టిఫికెట్ రాకపోవడంతో రాము స్థానిక వార్డు రెవెన్యూ కార్యదర్శిని కలువగా ఆయన సింగ్నగర్లోని నార్త్జోన్ తహసీల్దార్ కార్యాలయంలో డెప్యూటీ తహసీల్దార్, ఇన్చార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చింతకాయల అప్పారావును కలవాలని సూచించారు. దీంతో అప్పారావును రాము కలవగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం రూ.13 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి రూ.12 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. శనివారం ఉదయం దరఖాస్తుదారులను సింగ్నగర్లోని నార్త్ జోన్ తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకుని రూ.12 వేల లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్హ్యాండెండ్గా అప్పారావును పట్టుకున్నారు. డీటీ కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో నిందితుడిని హాజరు పరుస్తా మని ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బరావు తెలిపారు. చింతకాయల అప్పారావు 2003లో కారుణ్య నియామకం కింద ఆఫీస్ సబార్డినేట్గా చేరి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పలు ప్రదేశాల్లో పనిచేసి 2022లో రీ సర్వే డెప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగోన్నతి పొందాడు. 2024లో నార్త్జోన్ డెప్యూటీ తహసీల్దార్, ఇన్చార్జ్ ఆర్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అప్పారావుపై పలు అవినీతి ఆరోపణలు రాగా ఉన్నతాధికారులు గతంలో శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలి సింది. ఏసీబీ సీఐలు ఎం.వి.ఎస్.నాగరాజు, జి.వి.వి.సత్యనారాయణ, ఎస్ఐ పూర్ణి, ఇతర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే జిల్లా ఏసీబీ అధికారులకు నేరుగా కానీ, ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064, మోబైల్ నంబర్ 94404–40057కు కానీ తెలపాలని ఏసీబీ అధికారులు కోరారు. -
లక్ష ఎకరాల్లో సేంద్రియ సాగు లక్ష్యం
ఎ.కొండూరు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో లక్ష ఎకరాల్లో సేంద్రియ సాగు లక్ష్యంగా కార్యాచరణ సిద్ధమైందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం నాగ సింధు స్పిన్నింగ్ మిల్ ఆవరణలోని మామిడి ఉద్యానవనంలో శనివారం ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతు సేంద్రియ సాగుపై అవగాహన పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించామన్నారు. డిజిటలైజేషన్తో కొనుగోలుదారులకు నమ్మకం ఏ సర్వే నంబరులో ఎవరు సాగు చేశారు, ఏ విధమైన ఎరువులు వినియోగించారు తదితర వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలిసే విధంగా డిజిటలైజేషన్ చేయడం వలన మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులు కొనేవారికి నమ్మకం కలుగుతుందన్నారు. పామాయిల్ సాగులో అంతర పంటలు, ఉద్యాన పంటలు, కూరగాయలు, మిరప వంటివి సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న రైతులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలపై కూడా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల వారీగా రైతులను గుర్తించి క్లస్టర్ల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు, సాంకేతిక సహకారం అందించడం, మార్కెట్ లింకేజీలను సమగ్రంగా అమలు చేయడం లక్ష్యంగా అధికారులు కృషిచేయాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహిస్తూ వారి ద్వారా ఇతర రైతులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, బయో ఇన్పుట్స్, రీజెన్ అగ్రి కార్బన్ ప్రాజెక్టు, బయో ఎరువుల, పురుగుమందులు, రిసోర్స్ సెంటర్, మార్కెటింగ్, కార్బన్ క్రెడిట్స్ ట్రేసబులిటీ తదితర స్టాళ్లను ఏర్పాటు చేశారు. దేశవాళీ వంగడాలు, జీవామృతం, గో ఆధారిత ఉత్పత్తులు, ఆధునిక యంత్రపరికరాలు, వ్యవసాయ డ్రోన్లను కూడా ప్రదర్శనలో ఉంచారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, ప్రకృతి వ్యవసాయ అధికారి వై.శంకర నాయక్, తిరువూరు ఆర్డీవో కె.మాధురి, జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ కుమార్, రాష్ట్ర ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ దేవదత్, ఆర్గానిక్ ఉత్పత్తుల అథారిటీ డైరెక్టర్ వై.సతీష్, నాగసింథు స్పిన్నింగ్ మిల్ యజమాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హుండీల ద్వారా భక్తులు రూ.2.89 కోట్ల మేర నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులు, ముడుపులను శనివారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఇక కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.2000 నోట్లు 16 హుండీలో వేయడం గమనార్హం. 17 రోజులకు గాను 115 మూటల్లో కానుకలను లెక్కించగా, రూ.2,89,12,052, 171 గ్రాముల బంగారం, 880 గ్రాముల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఇక యుఎస్ఏకు చెందిన 820 డాలర్లు, ఇంగ్లాండ్కు చెందిన 40 డాలర్లు, మలేషియా రింగిట్లు 31, సింగపూర్ డాలర్లు 22, యుఏఈ దిర్హమ్స్ 105, ఆస్ట్రేలియా డాలర్లు 20, ఓమన్ రియాల్ 400, యూరప్ యూరోస్ 55, కెనడా డాలర్లు 505 లభించినట్లు పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో ఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లతో పాటు దేవదాయ శాఖ అధికారులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సౌర విద్యుత్ వినియోగదారులకు నగదు చెల్లింపు మచిలీపట్నంటౌన్: కృష్ణా జిల్లా పరిధిలో సౌర విద్యుత్ వినియోగదారులు పవర్ గ్రిడ్డుకు అందించిన అదనపు యూనిట్లకు సంసంబంధించి నగదును వారి ఖాతాల్లో జమ చేసినట్లు విద్యుత్ శాఖ కృష్ణా జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ వి.వి.చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 4,636 మంది రూఫ్ టాప్ సోలార్ వినియోగదారులకు సోలార్నెట్ మీటరింగ్ విధానం ద్వారా గ్రిడ్డుకు అదనంగా సరఫరా చేసిన విద్యుత్ యూనిట్లకు రూ.33.45 లక్షలను వారి ఖాతాలకు శనివారం జమ చేశామన్నారు. 2025 నవంబర్ నెల వరకు ఈ మొత్తాన్ని జమ చేసినట్టు చెప్పారు. అలాగే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సోలార్నెట్ మీటరింగ్ విధానం ద్వారా గ్రిడ్డుకు అదనంగా సరఫరా చేసిన విద్యుత్ యూనిట్లకు ఆయా వినియోగదారులకు బిల్లులో సర్దుబాటు చేశామని తెలిపారు. 2026 మార్చి నుంచి అదనంగా సరఫరా చేసిన విద్యుత్ యూనిట్లకు గాను వినియోగదారులకు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రతి నెలా చెల్లింపులు చేస్తామని వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు సౌర విద్యుత్ వినియోగాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో పాటు అదనంగా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్కు నగదు పొందవచ్చునని ఆయన వివరించారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు సౌర విద్యుత్ వినియోగానికి ముందుకు రావాలని ఆయన కోరారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం ఎగువ సన్నిధిలోని పానకాల స్వామివారి ముఖ మండపంలో శనివారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు గురుస్వామి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు భక్తులకు మాల వేసి దీక్షలు ఇచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్ల సేవా ట్రస్ట్ చైర్మన్ తోట శ్రీనివాసరావు సుమారు 250 మంది భక్తులకు ఉచితంగా దీక్షా వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు వీరేంద్ర, రాఘవేంద్ర, భక్తబృందం ప్రతినిధులు కృష్ణ, రుద్రువినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను వెబ్సైట్ లేదా యాప్ ద్వారా పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 95523 00009 నంబర్తో వాట్సాప్ ద్వారా హాల్టికెట్ పొందవచ్చని పేర్కొన్నారు. ఏపీ ఓపెన్ స్కూల్ అధికారిక వెబ్సైట్ ద్వారా సైతం హాల్టికెట్ పొందొచ్చని వివరించారు. -
మోంథా...మానని గాయం
సర్కారు నిర్లక్ష్యమే కారణం కంకిపాడు: మోంథా తుపాను చేసిన గాయానికి సర్కారు నిర్లక్ష్యం తోడవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే చంద్రబాబు సర్కారు రైతులను అడుగడుగునా నిరాశ పరుస్తోంది. మోంథా కలిగించిన నష్టానికి పంట నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రోజులు దాటవేస్తోంది. ఇప్పటికే తుపాను నష్టం జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా పంట నష్టపరిహారం అందక సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రబీ సాగుకు ఈ సాయం ఉపకరిస్తుందనే ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్న రైతులకు ఎండమావే అయింది. జిల్లా వ్యాప్తంగా 2025 అక్టోబరు చివరి వారంలో సంభవించిన మోంథా తుపాను కారణంగా రైతులు భారీగా పంట నష్టపోయారు. పంట చేతికొచ్చే తరుణంలో తీవ్రమైన గాలులు, భారీ వర్షానికి ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ, ఉద్యాన పంటలు నీటి ముంపునకు గురయ్యాయి. పంట పొలాల్లో ఉన్న మురుగు పంట బోదెల్లోకి మళ్లించటం, నీటిని తొలగించటంలో అసౌకర్యం కారణంగా రోజుల తరబడి నీరు, మురుగు పొలాల్లో నిలిచి పోవటంతో నేలవాలిన వరి పొలాల్లో కంకులు మొలకెత్తి పనికి రాకుండా పోయిన పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో వరి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ ఇతర పంటలు 76,135.25 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, 60,055 మంది రైతులకు గానూ రూ.75.71 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా చెల్లించాలంటూ వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. ఉద్యానశాఖకు సంబంధించి 2056 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రూ.75.75 లక్షలు పరిహారంగా చెల్లించాలంటూ నివేదించింది. పంట నష్టం అంచనాల్లోనూ కోతలే... తమది రైతు సంక్షేమం అంటూ సర్కారు ప్రచారం ఊదరగొడుతున్నా ఆచరణలో మాత్రం ఆ దిశగా అడుగులు పడటం లేదు. మోంథా తుపాను కారణంగా జిల్లాలో 1.12 లక్షల ఎకరాల్లో వరి, 3,742 ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే నిబంధనల పేరుతో నష్టపరిహారం అంచనాల్లో భారీగా కోత విధించారు. తుది నివేదికల్లో వరి, ఇతర పంటలు 76135.25 ఎకరాల్లోనూ, ఉద్యాన పంటలు 2056 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు తుది నివేదిక సమర్పించారు. నిబంధనల పేరుతో సాయం ఎగవేసేందుకు ప్రభుత్వం శతవిధాలా యత్నించటం స్పష్టమైంది. అధికారులు అందించిన నివేదికల ఆధారంగా పంట నష్టాన్ని పరిశీలించేందుకు నవంబరు నెలలో కేంద్ర బృందం పరిశీలించి వెళ్లటం గమనార్హం. విపత్తులు సంభవించినప్పుడు ఏ సీజన్కు అదే సీజన్లో రైతులను ఆదుకున్న ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. 2019–2024 వరకూ సంభవించిన అనేక ప్రకృతి విపత్తుల వేళ రైతులకు సర్కారు అండగా నిలిచింది. అదే సీజన్లో పెట్టుబడి సాయం అందించి భరోసా ఇచ్చింది. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం దాట వేత ధోరణితో వ్యవహరిస్తోంది. ఖరీఫ్లో ప్రకృతి ప్రకోపానికి అన్నదాత అతలాకుతలమయ్యాడు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోంది. పైగా నష్టం అంచనాల్లోనూ భారీగా కోతలు పెట్టింది. ధాన్యం కొనుగోళ్లలోనూ అడుగడుగునా అన్యాయమే... సర్కారు దళారులకు గేట్లు ఎత్తివేసింది. రబీ సీజన్ వచ్చినా ఇంతవరకు సాయం ఊసే లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నాలుగు నెలలు కావస్తున్నా కర్షకులకు మోంథా మానని గాయంగా ఇంకా బాధపెడుతూనే ఉంది. మోంథా తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడులు చేతికొచ్చిన పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోళ్లలోనూ రైతులకు అన్యా యమే జరిగింది. దళారులు, మిల్లర్లు బరితెగించారు. మోంథా నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందానికి రైతుల సమస్యలను వివరించాం. కానీ నేటికీ సాయం అందలేదు. యోగాంధ్ర, ఆవకాయ్ అమరావతి అంటూ వందల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం కౌలురైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. వాస్తవ సాగుదారులను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ప్రభుత్వం తక్షణమే స్పందించి మోంథా సాయం విడుదల చేయాలి. –ఎం.హరిబాబు, కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మోంథా తుపాను సంభవించి నాలుగు నెలలు గడుస్తోంది. ఆ విపత్తులో జరిగిన నష్టాన్ని అధిగమించి రైతులు చేతికొచ్చిన వరి పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి అందిన కాడికి సొమ్ము చేసుకున్నారు. ఈ సమయంలో రైతుల పట్ల ప్రభుత్వం నిర్దయగానే వ్యవహరించింది. సకాలంలో రవాణా సదుపాయం, గోనె సంచులు కల్పించకుండా అవస్థల పాలు చేసింది. మిల్లర్లు, దళారులు రంగ ప్రవేశం చేసి తేమ శాతం సాకుగా చూపి అడ్డగోలుగా దోచుకున్న పరిస్థితి తెలిసిందే. ప్రస్తుతం రైతులు రబీ సాగుకు ఉపక్రమించారు. వరి, మినుము, పెసర, మొక్కజొన్న, ఇతర కూరగాయ పంటలను సాగు చేసుకుంటున్నారు. పెట్టుబడులకు అవసరమైన సొమ్ము సమకూర్చుకుంటున్నారు. అయితే మోంథా తుపాను నష్టపరిహారం అందిస్తే రబీ పెట్టుబడులకు ఊతంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. కొంత వరకై నా అప్పుల సమస్య నుంచి తేరుకుంటామని అంటున్నారు. సాయం అందజేతకు ప్రభుత్వం స్పందిస్తుందో? లేదో? చూడాలి. -
అంతులేని అరాచకం
గమ్మునుండు...గొడవ చేశావో నీ ఉద్యోగం ఊడపీకుతా...ప్రభుత్వం మాది. కిందా.. పైనా..అంతా మా వాళ్లే జాగ్రత్త.. అంటూ అధికారికి ఓ క్వారీ నిర్వాహకుడి బెదిరింపు. చంద్రబాబు ప్రభుత్వంలో క్వారీ నిర్వాహకుల అరాచకానికి హద్దుల్లేకుండా పోతోంది. నిత్యం వందల లారీల్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. అధికారులు అక్రమాన్ని అడ్డుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము మథనపడుతున్నారు. జి.కొండూరు: జి.కొండూరు మండల పరిధి గడ్డమణుగు లోయ ప్రాంతంలో అటవీశాఖ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్లు 143, 26/2లోని అన్సర్వ్డ్ ఏరియా 720 ఎకరాలలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ క్వారీలను నిర్వహిస్తున్నారు. వివాదాస్పద ఏరియాలో క్వారీల నిర్వహణ ఆపాలని ప్రశ్నించిన అధికారులను ఓ క్వారీ నిర్వాహకుడు బెదిరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం మాదే, గుంటూరు పార్లమెంట్ ప్రజా ప్రతినిధి మా వాడే...ఎక్కువ మాట్లాడితే ఇక్కడ నుంచి బదిలీ చేయిస్తా అంటూ సదరు క్వారీ నిర్వాహకుడు రెచ్చిపోవడంతో అధికారులు సైతం చేసేది లేక వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తమకిక ఎదురేలేదని భావించిన సదరు క్వారీ నిర్వాహకుడు ఇదే అదునుగా యథేచ్ఛగా గ్రావెల్, మెటల్ను భారీగా తరలిస్తున్నారు. ఉత్తుత్తి దాడులు... అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్వారీలపై మైనింగ్ శాఖ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి సీజ్లు చేయడం...ఫైన్లు వేయడం...వదిలేయడం తప్ప క్వారీల నిర్వాహకులు అనుమతులు పొందేదీ లేదు, అక్రమ తవ్వకాలు ఆగేది లేదు అన్నట్లుగా మండలంలో క్వారీల పరిస్థితి ఉంది. గత ఏడాది సెప్టెంబరు 4వ తేదీన కొండపల్లి పరిధిలో సాయి కృష్ణా ఎంటర్ ప్రైజెస్ పేరుతో నిర్వహిస్తున్న క్రషర్కు జీఎస్టీ, మైనింగ్ అనుమతులను పొందలేదని తెలిసి క్రషర్తో పాటు క్రషర్లో ఉన్న ఐదు టిప్పర్ లారీలు, ఒక లోడర్, మెటీరియల్ను మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనకు ముందు రోజు సెప్టెంబరు 3వ తేదీన జి.కొండూరు మండల పరిధిలోని లోయ ప్రాంతంలో శ్రీ కనకదుర్గ స్టోన్ క్వారీలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకుని గ్రావెల్ తవ్వుతున్న ఒక పొక్లయిన్, రవాణా చేస్తున్న మూడు టిప్పర్ లారీలను, క్వారీని మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఎక్కడా దాడులు గాని, సీజ్ చేయడాలు కాని చేసిన దాఖలాలు లేవు. కేవలం లెక్క చూపించుకోవడానికి ఉత్తుత్తి దాడులు చేయడం తప్ప, చిత్తశుద్ధితో దాడులు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎవ రన్నా అధికారి నిజాయితీగా పనిచేయాలనుకున్నా చేసే పరిస్థితులు ఇక్కడ లేవని ఆయా గ్రామాల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. పట్టా భూమిలో తవ్వకం గడ్డమణుగు లోయ ప్రాంతంలో సర్వే నంబరు 14లో ఉన్న పట్టా భూమిని రైతు నుంచి లీజుకు తీసుకున్న ఓ క్వారీ నిర్వాహకుడు అనుమతులు లేకుండా ఇటీవల గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలు జరిపిన ప్రదేశం అటవీ భూమికి సమీపంలో ఉంది. అటవీ భూమికి 500 మీటర్ల పరిధిలో తవ్వకాలు చేపట్టాలంటే అటవీశాఖ నుంచి ఎన్ఓసీ పొందాల్సి ఉంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోనే రాతి, గ్రావెల్ క్వారీలు అధికంగా ఉన్నాయి. జి.కొండూరు మండల పరిధిలో తొమ్మిది క్వారీలు, కొండ పల్లి పరిధిలో ఆరు క్వారీలు, ఇబ్రహీంపట్నం, కంచికచర్లలో కలిపి 39 క్వారీల వరకు నిర్వహణ సాగుతోంది. అయితే అమరావతి నిర్మాణంలో భాగంగా రహదారులు, వివిధ నిర్మాణాలలో అవసరమైన గ్రావెల్, మెటల్, కంకర, వెట్ మిక్స్, డస్టు వంటి వాటిని ఇక్కడ నుంచే రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతాన్ని ఆనుకొని క్వారీల నిర్వహణ సాగుతుండడంతో అసలు ఈ క్వారీల నిర్వహణకు ఎంత పరిధికి నిర్వాహకులు అనుమతి పొందారో, హద్దులు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపెట్టడం సాధ్యం కాదు. కొన్ని క్వారీలైతే అనుమతులు లేకుండా నిర్వహణ జరుగు తుండడంతో ఇష్టారాజ్యంగా హద్దులు మీరి గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. అటు వైపు కన్నెత్తి చూసే అధికారులు లేకపోవడంతో రాత్రి, పగలు తేడా లేకుండా వందలాది లారీల్లో భారీగా గ్రావెల్ తరలిపోతోంది. -
నూరు శాతం ఉత్తీర్ణత సాధనకు కృషి చేయండి
జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు మార్కులు తెచ్చుకునేలా నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సూచించారు. విజయవాడ నార్త్ మండలానికి చెందిన పాఠశాలల ఉపాధ్యాయుల కోసం సబ్జెక్టు వారీగా క్లస్టర్ సమావేశం సింగ్నగర్లోని ఎంకే బేగ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల కోసం ‘‘100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక’’ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో సమగ్ర పాఠ్య ప్రణాళిక, నిరంతర పరీక్షలు, వ్యక్తిగత శ్రద్ధ అవసరమన్నారు. ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకూడదనే సంకల్పంతో ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ విద్యాసంవత్సరంలో 9వ తరగతి విద్యార్థుల సమ్మెటివ్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు నిర్వహించి వారిని బోర్డు పరీక్షలకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టెమ్ ల్యాబ్లను పరిశీలించారు. ల్యాబ్ సదుపాయాలు, విద్యార్థుల ప్రయోగాత్మక పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంకే బేగ్ హైస్కూల్ హెచ్ఎం మైనం హుస్సేన్, మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సమాజంలో పెరుగుతున్న మానసిక సమస్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు పెరుగుతున్నారని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ అన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ(ఐపీఎస్) ఏపీ చాప్టర్, ఇండ్లాస్ హాస్పిటల్స్ సంయుక్తంగా ఏపీ మిడ్టర్మ్ సీఎంఈ–2026 శనివారం ప్రారంభమైంది. మానసిక వ్యాధులు.. అధునాతన చికిత్సా పద్ధతులు అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న సీఎంఈని హెల్త్ యూనివర్సిటీ వీసీ సాయిసుధీర్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మానసిక సమస్యలకు వైద్యం పొందడంలో ప్రజలు ఇంకా వెనుకాడుతున్నారని, ప్రజల్లో అపోహలను తొలగించడంలో మానసిక వైద్యుల కృషి అవసరం అన్నారు. మరో అతిథి చీఫ్ ఇన్కంటాక్స్ కమిషనర్ సునీత బిల్లా మాట్లాడుతూ మానసిక వ్యాధి సోకిన వారికి సరైన వైద్యం అందించలేనప్పుడు ఆ ప్రభావం కుటుంబం, సమాజంపై ఉంటుందన్నారు.కార్యక్రమానికి ఐపీఎస్ రాష్ట్ర చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ పి.లోకేశ్వరరెడ్డి అధ్యక్షత వహించగా, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఇండ్ల విశాల్రెడ్డి పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో బెంగళూరు విమ్హాన్స్తో పాటు, ముంబై, చైన్నె, పూనే తదితర ప్రాంతాలకు చెందిన మానసిక వైద్య నిపుణులు మానసిక వ్యాధులకు అధునాతన చికిత్సలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు ఇవ్వనున్నారు. సదస్సులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 300 మంది మానసిక వైద్యులు, మానసిక వైద్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు పాల్గొన్నారు. హెల్త్ యూనివర్సిటీ వీసీ సాయిసుధీర్ -
హృదయ కల్లోలం
ప్రధానంగా.. చిట్టినగర్లోని వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సెక్రటరీ వయస్సు 32. ఇటీవల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో పదిహేను రోజుల క్రితం ఆకస్మికంగా విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ వైద్యుడి వయస్సు 29. వైభవంగా పెళ్లి జరిగిన పదిరోజులకే ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. ఇలా వీరిద్దరే కాదు. ఇటీవల కాలంలో తరగతి గదిలో కుప్పకూలి మరణించిన విద్యార్థిని, బస్సు కోసం వేచి చూస్తూ ఆకస్మికంగా గుండెపోటుతో బస్టాండులోనే మరణించిన ప్రయాణికుడు వంటి ఘటనలు ఇటీవల అనేకం చూస్తున్నాం. -
గ్రాట్యూటీపై సీలింగ్ రద్దు చేయాలి
మచిలీపట్నంఅర్బన్: వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీపై సీలింగ్ విధించి కేవలం రూ.2లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని, గ్రాట్యూటీ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి చెల్లింపులు జరపాలని రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జన్యావుల రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగం ఫిలిప్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ జీవో సంఖ్య 36ను వెంటనే అమలు చేయాలని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేపట్టాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,400 మంది ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొంటుండగా, ఇప్పటికే 2,026 సహకార సంఘాలు మూత పడ్డాయని తెలిపారు. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు వైవీవీ మోహన్రావు, అడప శ్రీనివాసరావు, వీరవల్లి వెంకటేశ్వరరావు, రాజులపాటి శ్రీనివాసరావు, హనుమకొండ శ్రీనివాసరావు, మెట్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. సహకార ఉద్యోగుల నిరవధిక సమ్మెలో నాయకుల డిమాండ్ -
విస్సన్నపేటలో కారు బీభత్సం
మద్యం మత్తులో ఉన్న ఇద్దరి అరెస్ట్ విస్సన్నపేట: మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంగా కారు నడుపుతూ.. దారి పక్కన ఉంచిన వాహనాలను ఢీకొంటూ.. ఎదురుగా వస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. అదృష్టవశాత్తూ కారు రోడ్డు పక్కన విద్యుత్ స్తంభానికి ఢీకొని ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి.. విస్సన్నపేట ప్రధాన రహదారిలో శుక్రవారం ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ భయానక వాతావరణం సృష్టించారు. కొందరి వాహనాలను ఢీకొనడంతో అవి దెబ్బతినడంతో పాటు పలువురికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో స్థానికులు కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో నూజివీడు రోడ్డులో వెళ్లిన కారు రహదారి పక్కనే ఉన్న విద్యుతు స్తంభాలకు ఢీకొని ఆగిపోవటంతో స్థానికులు కారులో ఉన్న ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. ఎ. కొండూరు మండలం పాత రేపూడికి చెందిన కొప్పుల గొవర్థన్, కొప్పుల ప్రసాద్లను అదుపులోకి తీసుకున్నామని, కారు నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ అర్జున్రాజు తెలిపారు. -
నిర్మాణంలో గోడ కూలి కార్మికుడు మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఐదో అంతస్తులో నిర్మాణంలో ఉన్న ఒక భవనం గోడ కూలి అక్కడ పనులు చేస్తున్న కార్మికులపై పడటంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయ పడ్డారు. ఈ ఘటన గురువారం సాయంత్రం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామానికి చెందిన జోరిగే సురేంద్ర (36) గురువారం సత్యనారాయణపురం, కొమ్మువారి వీధిలోని నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవన నిర్మాణంలో తాపీ పనులు చేసేందుకు వెళ్లాడు. సాయంత్రం మారుతీనగర్కు చెందిన పల్లా రామారావు, సూరిబాబులతో కలసి సురేంద్ర పరంజాల మీద నిల్చొని ప్లాస్టింగ్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో అంతకు ముందు కట్టిన గోడ కూలి వారి మీద పడటంతో వారు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ సమయంలో రామారావు, సూరిబాబులు వేలాడుతున్న పైపుల మీద పడి అక్కడ నుంచి జారుతూ కిందపడ్డారు. సురేంద్ర మాత్రం ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందపడటంతో తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే తోటి కార్మికులు ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సురేంద్ర అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మరో ఇద్దరు కార్మికులు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై సమాచారం అందటంతో ఎస్ఎన్పురం పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. న్యాయం చేయాలి.. పని ప్రదేశంలో ప్రమాదానికి గురై మృతి చెందిన సురేంద్రకు భార్య మహాలక్ష్మి, పదో తరగతి, ఆరో తరగతి, రెండో తరగతి చదువుతున్న ముగ్గురు ఆడపిల్లల సంతానం ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయిన సురేంద్ర మృతిచెండటంతో ఆడపిల్లలతో కలసి ఎలా జీవించాలని భార్య బోరున విలపిస్తున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఎన్పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రతా ప్రమాణాలు లేకుండానే.. పని ప్రదేశంలో ప్రమాదం జరిగి కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన భవన నిర్మాణ బిల్డర్ తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని కేసును నీరుగార్చే చర్యలు చేపడుతున్నాడని బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకుండా ప్రమాదకరంగా పనులు చేయించిన బిల్డర్పై పోలీసులు కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
రోగులకు నాణ్యమైన సేవలు అందాల్సిందే
విజయవాడ కొత్త జీజీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీశ లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాజీ ఉండకూడదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. విజయవాడలోని కొత్త జీజీహెచ్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, శుభ్రత, ఔషధాల లభ్యత, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి.. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోగికి సమయానుకూలంగా నాణ్యమైన చికిత్స అందాలని స్పష్టం చేశారు. ఆస్పత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం (ఓపీ), ఇన్ పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, ఔషధ పంపిణీ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బందికి సేవల మెరుగుదలపై సూచనలు ఇచ్చారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలు 24 గంటల పాటు సమర్థంగా అందేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు కూడా ఉన్నారు. -
ఆర్టీసీ డిపోల మూసివేత నిర్ణయాన్ని విరమించాలి
ఎంప్లాయీస్ యూనియన్ నాయకులుభవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీ డిపోల మూసివేత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యాధరపురం డిపో వద్ద ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ బస్సు ముద్దు.. ప్రైవేట్ విద్యుత్ బస్సులు వద్దు, ప్రయాణికుల భద్రత – భరోసా ఆర్టీసీతోనే సాధ్యం, పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆసరాగా ఉన్న ఆర్టీసీని కాపాడుకుందాం’ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర డెప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. మొదటి విడతగా 750 విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం 12 డిపోలను మూసివేస్తే రెండో దశలో మరిన్ని బస్సులు వస్తే మిగిలిన డిపోలు, ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 2029 నాటికి విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబర్ 88ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు డీజిల్, సీఎన్జీ బస్సులను నడిపిన తాము విద్యుత్ బస్సులను నడపలేమా అని ప్రశ్నించారు. సీ్త్ర–శక్తి పథకం విజయవంతం కావాలంటే మరో మూడు వేల బస్సులు, పది వేల మంది ఉద్యోగులు కావాలన్నారు. ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా విద్యుత్ బస్సులను నడపాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు. రాష్ట్ర డిపోల మెయింటినెన్స్ కన్వీనర్ ఎన్.హెచ్. చక్రవర్తి మాట్లాడుతూ.. కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించటాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. హైఎండ్ బస్సులను నైపుణ్యంతో సమర్థంగా నడిపిన ఉద్యోగుల స్థానంలో ప్రైవేట్ ఆపరేటర్లను తీసుకురావడం ద్వారా ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టీసీని ప్రైవేట్కు అప్పగిస్తే ఇకపై చరిత్రలోనే సంస్థ ఉంటుందన్నారు. ఈయూ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ జి.ఎం.రావు మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న విద్యాధరపురం డిపోను ఖాళీ చేయించి ప్రైవేట్ విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం అప్పగించటం దారుణమన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన ప్రమాదాలు 0.2 శాతంగా ఉంటే ప్రైవేట్ బస్సుల ద్వారా జరిగినవి ఆరు శాతానికిపైగా ఉన్నాయని వివరించారు. ఈయూ విద్యాధరపురం డిపో సెక్రటరీ, ప్రెసిడెంట్లు ఎల్ఎల్ రాజు, కె.అనిల్ కుమార్ మాట్లాడుతూ 1990లో ఏర్పడిన ఈ డిపో ఉద్యోగులంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటున్నా మని తెలిపారు. ఈ పరిస్థితిలో డిపోను మూసివేసి ఇక్కడి ఉద్యోగులను వేర్వేరు డిపోలకు కేటాయించడం బాధాకరంగా ఉందన్నారు. -
బాబు హయాంలో లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ చేపట్టాలి
చిలకలపూడి(మచిలీపట్నం): 2014 నుంచి 2019 వరకు, 2024 నుంచి ఇప్పటి వరకు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించే ధైర్యం సీఎం చంద్రబాబుకు ఉందా అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశ్నించారు. బందరులోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయిస్తే నిజాలు నిగ్గు తేలతాయన్నారు. చంద్రబాబు, నారా లోకేశ్ ఈ వ్యవహారంలో నిజాయితీపరులైతే శాసనమండలిలో ఎందుకు చర్చ జరపడం లేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పాత్రికేయుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై నారా లోకేశ్ పుష్ప సినిమా డైలాగుల మాదిరి ‘ఫ్లైట్ టిక్కెట్టు నాదే, మ్యాచ్ టిక్కెట్టు నాదే’ అని ట్వీట్ చేయటంపై పేర్ని నాని స్పందిస్తూ పుష్ప సినిమాలో హీరో కూలీ అని, నారా లోకేశ్ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు కూలీ అని ఫ్లైట్ టికెట్టు, మ్యాచ్ టికెట్టు కొన్న వివరాలు, బోర్డింగ్ పాస్ల వివరాలు, దుడ్లు ఏ అకౌంట్ నుంచి చెల్లించారో ఆధారాలు ట్విట్టర్లో పెట్టగలరా? అని నిలదీశారు. రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రి అయిన లోకేశ్ ఇప్పటి వరకు ఎన్ని స్పెషల్ౖ ఫ్లెట్లలో తిరిగారు? ఎంత మొత్తం ఏ అకౌంట్ ద్వారా చెల్లించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాబుపై ఎన్ని కేసులు పెట్టాలో అప్పుల మంత్రి కేశవ్ చెప్పాలి శాసనమండలిలో వైఎస్సార్ సీపీ సభ్యులు చెప్పులు వేసుకుని వేంకటేశ్వరస్వామి చిత్రపటాలతో సభలోకి వచ్చారని, దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ శాసనమండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారని ఓ విలేకరి ప్రశ్నించగా, పేర్ని నాని సమాధానం చెబుతూ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్కు అప్పులు తేవటం కోసం సంతకాలు పెట్టి, పెట్టి మైండ్ బ్లాక్ అయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ‘అప్పుల మంత్రి కేశవ్ గారూ నిత్యం వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని కేసులు నమోదు చేయాలో చెప్పగలరా?’ అని వేంకటేశ్వస్వామి చిత్రపటం పట్టుకుని చంద్రబాబు బూట్లతో వెళ్తున్న ఫొటో చూపించి ప్రశ్నించారు. నెయ్యి రవాణా కంపెనీలతో హెరిటేజ్కు ఎన్నో అక్రమ సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. ప్రసాదం అంశాన్ని బజారుకీడ్చిందెవరో! అసలు భోలేబాబా డెయిరీకి, హెరిటేజ్కు సంబంధం లేదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని, శాసనమండలిలో ప్రైవేటు కంపెనీపై ఎందుకు చర్చ జరపాలని అంటున్న టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ సలహాదారుగా ఉన్న కుటుంబరావు హెరిటేజ్ సంస్థపై ఎందుకు వివరణ ఇచ్చారో చెప్పాలని పేర్నినాని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఎవరినైనా మేనేజ్ చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, అయితే వేంకటేశ్వరస్వామిని మేనేజ్ చేయలేక ఆయన పాపం బద్ధలైందని, ఆ స్వామే కక్ష తీర్చుకున్నారని పేర్కొన్నారు. భోలే బాబా సంస్థతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్న టీడీపీ నాయకులు ఆ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న వైష్ణవి కంపెనీ యాజమాన్యం ద్వారా వెనక్కి పంపిన నాలుగు లారీల నెయ్యిని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎలా అనుమతించారని సూటిగా ప్రశ్నించారు. ఆ నెయ్యితోనే లడ్డూ ప్రసాదాన్ని చేసి భక్తులకు పంచలేదా అని నిలదీశారు. ప్రస్తుతం మార్కెట్లో రూ.650కు నెయ్యి దొరుకుతుంటే, రూ.658కు ఎలా కొనుగోలు చేస్తున్నారో చంద్రబాబు, లోకేశ్, పవన్కల్యాణ్ జవాబివ్వాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు లంకే వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
దీవించమ్మా.. దుర్గమ్మ!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆశీస్సుల కోసం విద్యార్థులు శుక్రవారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తులు, యాత్రికులు, నూతన వధూవరులతో అమ్మ వారి ఆలయంలో పండుగ వాతావరణం కనిపించింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. పోటీ పరీక్షలు, వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లతో అమ్మవారిని దర్శించుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యేలా దీవించు తల్లీ అంటూ వేడుకున్నారు. కనక దుర్గమ్మ అమ్మ వారి దర్శనం కోసం తరలివచ్చిన విద్యార్థులు, భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం కల్పించారు. -
వెంటిలేట్ర్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేదల ప్రాణాలకు పెద్దదిక్కుగా నిలవాల్సిన విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో మృత్యుఘోష కొనసాగు తోంది. ఆస్పత్రిలో సేవలు రోజు రోజుకూ దిగజారు తున్నాయి. నిపుణులైన వైద్యులు, సమర్థంగా పనిచేసే అధికారులు ఉన్నా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించక పోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది. అత్యవసర సమయంలో రోగుల ప్రాణాలు నిలిపేందుకు అత్యంత కీలకమైన వెంటిలేటర్లు కావాలని ఆరు నెలల కిందటే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయితే అవి ఇంత వరకూ ఆస్పత్రికి చేరలేదు. ఉన్న వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో వాటిని మూలన పడేశారు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రోగులకు ఊపిరి అందించేందుకు ఉన్న అరకొర యంత్రాలతోనే వైద్యులు కుస్తీ పడుతున్నారు. ఈ తరుణంలో మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వెంటిలేటర్లు కొనుగోలులో జాప్యం ప్రభుత్వాస్పత్రిలో ఉన్న వెంటిలేటర్లు దాదాపు పనిచేయని స్థితికి చేరాయి. కోవిడ్ సమయంలో కొనుగోలు చేసిన వెంటిలేటర్లులో చాలా వాటిని ఇప్పటికే పక్కన పెట్టేశారు. అనంతరం గత ప్రభుత్వంలో వచ్చిన వెంటిలేటర్లు కొన్ని ఉండగా వాటితోనే కుస్తీ పడుతున్నారు. వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు సిద్ధార్థ వైద్య కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2023వ సంవత్సరంలో మంజూరు చేసి, డీఎంఈ వద్ద ఉన్న పీజీ గ్రాంట్స్తో వెంటిలేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆరు నెలల కిందటే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పినా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆస్పత్రిలో ఎవరికై నా వెంటిలేటర్ సపోర్టు అవసరమైతే, అందుబాటులో ఉన్న వాటిపై ఉంచేందుకు వైద్యులు సంకోచించాల్సిన పరిస్థితినెలకొంది. అవి సరిగా పనిచేయక పోతే, రోగికి ప్రాణాపాయం అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తోంది. డీఎంఈలో నిర్లక్ష్యం చేయడంతో రోగులకు శాపంలా మారింది. ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ తర్వాత నిత్యం 12 నుంచి 14 మంది వరకూ మరణించే వారు. వారిలో క్రిటికల్ స్టేజ్లో ఆస్పత్రికి వచ్చిన వారు ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రోజుకు 18 నుంచి 20కి చేరింది. ఒక్కో రోజు 20 మంది కంటే ఎక్కువగానే ప్రాణాలు కోల్పోతున్నారు. జీజీహెచ్లో 2025 జనవరిలో 504 మంది మృత్యువాత పడ్డారు. 2026 జనవరి 523 మంది మృతి చెందారు. ఇలా మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఒక వైపు పాలకులు నాణ్యమైన సౌకర్యాలు అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారే కానీ క్షేత్రస్థాయిలో ఆస్పత్రులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ప్రాణాలు నిలుస్తాయన్న కొండంత ధైర్యంతో ప్రభుత్వాస్పత్రికి వస్తున్న నిరుపేద రోగులు నాణ్యమైన సేవలు అందక విలవిల్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్లు కొనుగోలుకూ గతిలేకుండా పోయింది. గత ప్రభుత్వంలో కోవిడ్ సమయంలో వచ్చిన వాటితోనే వైద్యులు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటిలేటర్ సరిగా పనిచేయక, రోగి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికై నా జాప్యం చేయకుండా వెంటిలేటర్లను కొనుగోలు చేసి, జీజీహెచ్కి అందించాలి. – డాక్టర్ ప్రభుదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
నేడు ఆర్గానిక్ రైతోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో శనివారం ఎన్టీఆర్ జిల్లా సేంద్రియ మేళా – ఆర్గానిక్ రైతోత్సవం జరగనుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. అన్నదాతలు, ప్రకృతి వ్యవసాయ ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్గానిక్ రైతోత్సవం నిర్వహణపై జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి రెవెన్యూ, ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన, పశు సంవర్ధక తదితర సమన్వయ శాఖల అధికారులతో శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు రైతులకు సామర్థ్య అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ మేళాలో సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ స్టాళ్లు కూడా ఉంటాయన్నారు. సేంద్రియ సాగుకు అవసరమైన ఉత్పాదితాల ప్రదర్శన ఉంటుందన్నారు. రైతు–నిపుణుల పరస్పర చర్చా వేదికల ద్వారా సందేహాల నివృత్తితో పాటు మేధోమధనానికి అవకాశం కల్పించినట్లు వివరించారు. ప్రకృతి వ్యవసాయ రైతులు, వినియోగదారులు, సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ నెల 22వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలోనూ ప్రకృతి వ్యవసాయ మేళా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ధర లభించేలా మార్కెటింగ్ లింకేజీ, ఎంఓయూలపై అవగాహనతో పాటు అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, మంచి ఫలితాలు వచ్చేలా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. -
తిరుపతమ్మ ఆలయానికి రూ.2.71 కోట్ల ఆదాయం
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ వ్యాపా రాలు నిర్వహించే హక్కు పొందేందుకు శుక్ర వారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ –ప్రొక్యూర్మెంట్ టెండర్ కం బహిరంగ వేలం ద్వారా రూ.2,71,06,062 ఆదాయం సమకూ రిందని ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. భక్తులు సమర్పించే తల నీలాలు పోగు చేసుకునే హక్కును రూ.2,07,72,729లకు శ్రీనివాస హెయిర్ ఇండస్ట్రీస్ (ఏలూరు), కొబ్బరి చెక్కలు పోగుచేసుకునే హక్కు రూ.52,33,333 లకు రెడ్డి మణికంఠ (తూర్పు గోదావరి జిల్లా), తిరునాళ్లలో జెయింట్ వీల్, కొలంబస్, పాస్ట్ఫుడ్ నిర్వహణకు రూ.11 లక్షలకు ఆర్.ఫణికుమార్ (ఉయ్యూరు) హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్ హక్కులు పొందారని పేర్కొన్నారు. ఈఈ రమ, ఏఈఓ జంగం శ్రీనివాస రావు, చుంచు రమేష్బాబు పాల్గొన్నారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల పోటీలు ఈ నెల 22 నుంచి మార్చి ఎనిమిదో తేదీ వరకు జరుగుతాయని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు. స్థానిక ఎక్స్పీరియన్స్ కేంద్రంలో ఈ పోటీల బ్రోచర్ను జేసీ ఇలక్కియ, కొండపల్లి మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ జి.కృష్ణన్ శుక్రవారం ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. సంప్రదాయ కళను ప్రోత్సహించి, కళాకారుల జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీలకు శుక్రవారం ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు శనివారం రాత్రి పది గంటల వరకు కొనసాగుతాయన్నారు. కళాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తయిన బొమ్మలను మార్చి తొమ్మిదో తేదీన సమర్పించాలని, రూ.లక్ష విలువైన బహుమతులు, సర్టిఫికెట్లు అందజేస్తారని పేర్కొన్నారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): క్వారీ, క్రషర్ లారీలను అరుణనగర్ రోడ్డు మీదుగా నడపొ ద్దని ఆ ప్రాంతం వాసులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఆరో రోజు కొనసాగాయి. లారీ లతో దుమ్ము ధూళితో కాలుష్యం పెరిగిందని శుక్రవారం స్థానికులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు. సీపీఎం పట్టణ కార్యదర్శి ఎం.మహేష్ మాట్లాడుతూ లారీల అతివేగంతో వెదజల్లుతున్న కాలుష్యంతో ఇళ్లల్లో ఉండలేక పోతున్నామన్నారు. గుంతలు పడిన రోడ్డులో లారీల మధ్య బైకులు నడపాలన్నా, కాలినడకతో వెళ్లాలన్నా నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో ఉన్న సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడో ఎన్టీపీసీ ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఫర్ ఉమెన్ ఆర్చరీ టోర్నమెంట్ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్చరీ అసో సియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియే షన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్), డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ సంయుక్తంగా ఈ పోటీ లను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. 22వ తేదీ ఉదయం పది గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, శాప్ వైస్ చైర్మన్ ఎస్.భరణి టోర్నమెంట్ను ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలోని సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో రికర్వ్ అండ్ కాంపౌండ్ అంశాల్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానాల్లో ఉన్న మహిళా ఆర్చర్లు పాల్గొంటారని సత్యనారాయణ వివరించారు. -
ప్రత్యేక ఉప కారాగారం సందర్శన
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ విజిటర్స్ సభ్యులు శుక్రవారం మచిలీపట్నం ప్రత్యేక ఉపకారాగారాన్ని సంద ర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తదితరుల కేసు నేపథ్యంగా దేశవ్యాప్తంగా జైళ్ల స్థితిగతులు, ముద్దాయిలకు అందుతున్న సదుపాయాలు, వసతులు, కుల, మత సంబంధిత వివక్ష అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి, సీనియర్ సివిల్ జడ్జి కె.వి.రామకృష్ణయ్య, బోర్డు సభ్యులైన రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.పోతురాజు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి.యుగంధర్, పంచాయతీరాజ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎ.రమణరావు, డీవైఈఓ బి.ఎస్.సి. శేఖర్ సింగ్, జిల్లా సామాజిక సంక్షేమ అధికారి ఎస్కే షాహిద్ బాబు, జిల్లా ఉపాధి అధికారి బ్రహ్మం, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఖైదీలతో అధికారులు నేరుగా మాట్లాడి జైలులో అందుతున్న వసతులు, ఆహారం, శుభ్రత, వైద్య సేవలు, న్యాయ సహాయం వంటి అంశాలపై ఆరా తీశారు. సబ్ జైలులో ఖైదీలందరూ మంచి పరివర్తనతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ చీలి ముసలయ్య, జైలు సూపరింటెండెంట్ పిల్లా రమేష్, డెప్యూటీ జైలర్ టి.మాలిబాబు, జైలు సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ సాంఘిక నాటకోత్సవాలు ప్రారంభం
విజయవాడ కల్చరల్: ఏపీ సృజనాత్మక సాంస్కృతిక సమితి సౌజన్యంతో శ్రీ కృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యాన ఈ నెల 19 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే 26వ సాంఘిక నాటకోత్సవాలు గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో గురువారం ప్రారంభమయ్యాయి. సమాజంలో విలువలతో కూడిన రాజకీయాలు నడపాలని, సమాజమే దేవాలయమని పీడిత తాడిత ప్రజలకు మేలు చేస్తే ప్రజల గుండెల్లో నిలచిపోతారనే సందేశంతో హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారి అనగనగా ఓ రాత్రి సాగుతుంది. రచన పీవీ సత్యనారాయణ, దర్శకత్వం మహ్మద్ఖాజావలి, రెండో నాటికగా హైదరాబాద్కు చెందిన స్వర్ణసూర్యా డ్రామాలవర్స్ వారి సీ్త్రమాత్రేనమః మూడో నాటికగా ఉషోదయ, కట్రపాడు వారి మంచి మనసులు నాటకాన్ని ప్రదర్శించారు. నాటక పోటీలను ప్రారంభించిన సమాచార పౌరసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్కుమార్ పోతలు మాట్లాడుతూ తెలుగు నాటకాలకు పూర్వవైభవం తీసుకురావాలన్నారు. శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కేవీ రంగనాథన్, కోశాధికారి చంద్రశేఖర్, శ్రీ కృష్ణ తెలుగు ఽథియేటర్ ఆర్ట్స్ క్రియాశీలక నిర్వాహకులు హరి రవిశంకర్, మక్కపాటి అవంతి, బొర్రా నరేన్, హెచ్వీఆర్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.


