breaking news
Krishna
-
వరుస దొంగతనాల కేసులో నిందితుడు అరెస్ట్
కృత్తివెన్ను: వరుస దొంగతనాలతో మండలంలో సంచలనం రేకెత్తించిన దొంగను 24 గంటల్లో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అరెస్టు చేశారు. కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు బుధవారం నిందితుడిని విలేకరుల ముందు హాజరుపరచి వివరాలు వెల్లడించారు. మండలంలోని అడ్డపర్ర గ్రామంలో సోమవారం రాత్రి 7 ఇళ్లతో పాటు రామాలయంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో బందరు డీఎస్పీ చొప్పిడి రాజా పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేశారు. ఈ చర్యల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం బొప్పనపల్లికి చెందిన కట్టా సుబ్బారావును పాలకొల్లు సమీపంలోని పూలపల్లిలో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే 30కి పైగా కేసులు ఉండగా పలుసార్లు జైలుకు వెళ్లొచ్చిన నేరచరిత్ర ఉన్నట్లు ఎస్ఐ వివరించారు. నిందితుడు రామాలయంలో చోరీ చేసిన రూ.2 వేల నగదు రికవరీ చేసినట్లు చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. -
అంతర్ జిల్లాల క్రికెట్ చాంపియన్ గుంటూరు
విజయవాడ రూరల్: నున్నలోని గ్రీన్ హిల్స్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. స్కూల్ అండర్–17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలవగా, చిత్తూరు జిల్లా ద్వితీయ, కర్నూలు జిల్లా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఫైనల్ మ్యాచ్లో గుంటూరు జట్టు నిర్ణీత ఒవర్లలో 78 పరుగులు చేయగా, చిత్తూరు జట్టు 62 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుంటూరు జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో కర్నూలు జట్టు కడప జట్టుపై విజయం సాధించింది. కర్నూలు జట్టు 101 పరుగులు చేయగా, కడప జట్టు 68 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. ముగింపు కార్యక్రమంలో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి ట్రోఫీ, పతకాలు అందజేశారు. ప్రిన్సిపాల్ నక్కనబోయిన గోపాలకృష్ణ, ఎస్జీఎఫ్ఏపీ అండర్–17 బాలికల అంతర్–జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ అబ్జర్వర్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణానదిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాల మాక్ డ్రిల్
ఇబ్రహీంపట్నం: ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించే విధానాలపై స్థానిక పవ్రిత్ర సమగం వద్ద కృష్ణానదిలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాయి. నీటి ప్రమాదాలు, వరదల సమయంలో బాధితుల ప్రాణాలు రక్షించడం వంటి చర్యలను నదిలో ప్రదర్శించారు. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక వాహనంలో నది వద్దకు చేరుకుని ప్రత్యేక బోట్ల ద్వారా నదిలోకి చేరుకున్నారు. బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం, అక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా వైద్యాధికారుల వద్దకు తీసుకువెళ్లి తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలు రక్షించడం వంటి సంఘటనలు కళ్లకు కట్టినట్లు మాక్ డ్రిల్ ప్రదర్శించారు. నదిలో చిక్కుకుని ఒడ్డుకు చేరుకోలేక మునిగిపోతున్న వారిని ఎయిర్ బెలూన్లు అందించి ఒడ్డుకు చేర్చిన విధానం ఆకట్టుకుంది. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మండల తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటరత్నం, సీఐ చంద్రశేఖర్, పర్యవేక్షించారు. -
ఒడిశా గవర్నర్కు వినతి
జన్మభూమికి అనపర్తిలో స్టాపేజీ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విశాఖపట్నం– లింగంపల్లి – విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ ప్రెస్కు ప్రయోగాత్మకంగా అనపర్తి రైల్వేస్టేషన్లో స్టాపేజీ కల్పిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం – లింగంపల్లి (12805) ఎక్స్ప్రెస్ జనవరి ఆరో తేదీ నుంచి ఉదయం 8.49 గంటలకు అనపర్తి చేరుకుని 8.50 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా లింగంపల్లి – విశాఖపట్నం (12806) సాయంత్రం 4.16 గంటలకు అనపర్తి చేరుకుని, 4.17 గంటలకు బయలుదేరుతుంది. షోలాపూర్–అనకాపల్లి రైలు పొడిగింపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటి వరకు నడుస్తున్న షోలాపూర్–అనకాపల్లి ప్రత్యేక వారాంతపు రైలును ఫిబ్రవరి వరకు పొడిగించనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రు ప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. షోలాపూర్ – అనకాపల్లి (01477) ప్రత్యేక వారాంతపు రైలు జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం, అదే విధంగా అనకాపల్లి – షోలాపూర్ (01478) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శనివారం నడపనున్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): హిందుస్థాన్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాల్లో కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగిన ఈ యువజనోత్సవాల్లో నృత్య పోటీల్లో కృష్ణా వర్సిటీ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించటమే కాకుండా, 13 అంశాల్లో పలు బహుమతులు సాధించారు. క్లాసికల్ ఓకల్ సోలోలో ద్వితీయ బహుమతి, క్లాసిక్ ఫర్క్యూషన్లో నాలుగో స్థానం, క్లాసిక్ నాన్ ఫర్క్యూషన్లో ద్వితీయ స్థానం ఇలా పలు అంశాల్లో విజేతలుగా నిలిచారు. దక్షిణ భారత స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల్లో ప్రతిన కనమరిచి మూడో రన్నరప్గా నిలిచిన విశ్వవిద్యాలయ బృందాన్ని వైస్చాన్స్లర్ కె.రాంజీ, రెక్టార్ ఎం.వి.బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఎన్.ఉష అభినందించారు. -
హక్కులపై అవగాహన అవసరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కల్పించుకోవాలని, డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, ఎండీ ఎస్.ఢిల్లీరావు సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం’ అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై ప్రసంగించారు. పౌరసరఫరాల సంస్థ సంచాలకుడు ఆర్.గోవిందరావు మాట్లాడుతూ.. పాఠశాలల్లో కన్జ్యూమర్ క్లబ్ల ద్వారా విద్యార్థులకు వినియోగదారుల హక్కు లపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ ప్రేమ్ సజాని పట్నాలా, లీగల్ మెట్రాలజీ శాఖ జాయింట్ కంట్రోలర్ కృష్ణచైతన్య, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, సివిల్ సప్లయీస్ అదనపు సంచాలకులు కె.రంగకుమారి, డీఈఓ చంద్రకళ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పాపారావు, ఏఎస్ఓ వేంపాటి శ్రీనివాసులు, విద్యార్థులు, ఎన్జీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించే పోస్టర్ను ఆవిష్కరించారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
పెనమలూరు: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగే విధంగా శ్రమించాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్ఈఆర్డీ) డైరెక్టర్ మార్తల వెంకట కృష్ణారెడ్డి అన్నారు. పోరంకి మురళీ రిసార్ట్స్లో బుధవారం రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025–2026 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు మంచి నైపుణ్యం ప్రదర్శించారన్నారు. విజేతలైన విద్యార్థులు త్వరలో హైదరాబాద్లో జరగనున్న సదరన్ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని సత్తా చాటి బహుమతులు గెలవాలని కోరారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థుల్లో కనీసం 10 మందైనా శాస్త్రవేత్తలుగా ఎదగాలని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ క్యూరేటర్ పురుషోత్తం, వైజ్ఞానిక ప్రదర్శన నోడల్ ఆఫీసర్ నాగమణి, అన్ని జిల్లాల డీఈవోలు, ఎంఈవోలు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు మైలవరం విద్యార్థినులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): జాతీయ స్థాయి సైన్స్ఫెయిర్కు ఎన్టీఆర్ జిల్లా విద్యార్థుల నమూనాలు ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ తెలిపారు. బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ఫెయిర్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ఎస్ఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణకు మైలవరంలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇస్లావత్ రుక్మిణి, బత్తుల విజయదుర్గ ఎంపికై నట్టు చెప్పారు. దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఇద్దరు ఎంపిక మచిలీపట్నంఅర్బన్: జిల్లా నుంచి రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో పాల్గొన్న వారిలో ఇద్దరు దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 23, 24 తేదీలలో పోరంకి మురళి రిసార్ట్స్లో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో మొత్తం 11 మంది జిల్లా ప్రతినిధులు పాల్గొనగా, బాలల కేటగిరీలో గుడివాడ మాంటిస్సోరి ఇంగికలష్ మీడియం హైస్కూల్కు చెందిన ఎస్.అశ్విన్ కుమార్ విజేతగా నిలిచారని, ఉపాధ్యాయుల కేటగిరీలో మచిలీపట్నం మండలం గుండుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బి.సోమేశ్వర రావు విజేతగా నిలిచారని వివరించారు. -
27న కేఎల్యూ స్నాతకోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం ఈనెల 27 వ తేదీన వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి.పార్థసారథివర్మ తెలిపారు. విజయవాడ గవర్నర్పేట మ్యూజియం రోడ్డులోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 184 మంది పీహెచ్డీ, 700 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, 4500 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరిలో 340 ఎంబీఏ, 105 ఎం.టెక్, 40 మంది లా కోర్సులు, 3200 మంది బీ.టెక్, 12 మంది ఆర్కిటెక్చర్, 48 మంది బీ.ఫార్మ్, 330 మంది బీసీఏ, 325 మంది బీబీఏ, 37 మంది బీకామ్, 18 మంది బీఎస్సీ (వీసీ), 25 మంది బీఏ, 180 మంది బీఎస్సీ అగ్రికల్చర్, 14 మంది ఎం.ఫార్మసీ, 32 మంది ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ), 220 మంది ఎంసీఏ డిగ్రీ వారు ఉన్నారని వివరించారు. ఈ డిగ్రీలను విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరచిన 44 మంది విద్యార్థులకు బంగారు, 40 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించనున్నట్లు చెప్పారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ వినోద్ కె. సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారన్నారు. టాటా మెమోరియల్ సెంటర్, ముంబై ఎండీ, ఐఏపీ పీడియాట్రిక్ హీమాటో–ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి గౌరవ అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధాన కర్త వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. డిగ్రీలు తీసుకునే విద్యార్థులందరికీ ఇప్పటికే సమాచారం అందించామని, 27 వ తేదీ ఉదయం 9 గంటలకు యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమానికి డాక్టర్ కె.సుబ్రమణ్యం, డాక్టర్ కె.రామకృష్ణ ప్రధాన కన్వీనర్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ కేఎస్ జగన్నాధరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిశోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్కు పటిష్ట భద్రత
జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోడౌన్కు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను చేశామని, అయినా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సమన్వయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలతో పాటు మూడు నెలలకు ఒకసారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి త్రైమాసిక తనిఖీలు నిర్వహించడంలో భాగంగా బుధవారం విజయవాడ రూరల్ గొల్లపూడిలోని ఏఎంసీ ఆవరణలో గల ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరుస్తున్న గోడౌన్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో త్రైమాసిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గోడౌన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, యరడ్ల ఆంజనేయరెడ్డి(వైఎస్సార్ సీపీ), యేదుపాటి రామయ్య(టీడీపీ), బొంతు కృష్ణారెడ్డి(బీజేపీ), బొర్రా కిరణ్(కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలలో ఆరోగ్యవనాలు పెంచే యోచన
టి.కొత్తపాలెం(నాగాయలంక): జిల్లాలో గ్రామీణ స్థాయిలో ఔషధ మొక్కల పెంపకంతో ఆరోగ్య వనాలు పెంపొందించే దిశగా గ్రామ పంచాయతీలను సమాయత్తం చేసేందుకు అధికారులు, సర్పంచ్లతో చర్చించి కార్యాచరణ చేపడతామని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ వెల్లడించారు. నాగాయలంక మండలం టి.కొత్తపాలెం గ్రామంలో బుధవారం ఆయన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఔషధ మొక్కలతో మోడల్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామ ఆరోగ్య వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వనంలో పెంచిన 21 రకాల ఔషధ మొక్కలను ఆసక్తిగా పరిశీలించారు. ఈ కాన్సెప్ట్ రూపొందించిన గ్రామ కార్యదర్శి ఆది అశోక్ కలెక్టర్తో మాట్లాడుతూ పూర్వీకుల ఔషధ విజ్ఞాన పునరుద్ధరణ, అరుదైన ఆయుర్వేద మొక్కల సేకరణ, అంతరించిపోతున్న ఆయుర్వేద సంపద సంరక్షణ లక్ష్యంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో ఆరోగ్యవనం కాన్సెప్ట్కు రూపకల్పన చేసినట్లు వివరించారు. ఆలోచనీయమైన, ఆచరణాత్మక మోడల్ ప్రాజెక్ట్ను రూపొందించిన అశోక్ను కలెక్టర్ అభినందించి సన్మానించారు. అదేవిధంగా గ్రామంలోని కాల్వగట్లు, ప్రభుత్వ ఖాళీభూములు అన్యాక్రాంతం కాకుండా, చెత్తకుప్పల ప్రదేశాలుగా మారకుండా పూలు, క్రోటన్ మొక్కలతో సిమెంట్ బల్లల ఏర్పాటుతో రూపొందించిన మినీ పార్కులను కలెక్టర్ పరిశీలించి సహకరించిన దాతలను సత్కరించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ కష్టసాధ్యమైనప్పటికీ కార్యదర్శి అశోక్, సర్పంచ్ శివపార్వతి నేతృత్వంలో చేపట్టిన గ్రామ ఆరోగ్య వనం ఏర్పాటు స్ఫూర్తి దాయకమన్నారు. జిల్లాలోని కొన్ని పంచాయతీల్లోనైనా ఈ ఆరోగ్య వనాల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పడేలా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా నిరోధించే రీతిలో మినీ పార్కులు పిల్లలకు ఆటవిడుపు కాగలవని చెప్పారు. ప్రజలకు మేలు కలిగించే వినూత్న ఆలోచనలను తప్పకుండా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. సర్పంచ్ శివపార్వతి, ఆమె భర్త శ్రీనివాసరావు, తహసీల్దార్ సీహెచ్వీ ఆంజనేయ ప్రసాద్, ఎంపీడీఓ కె.ఎం.చంద్రశేఖర్, డీసీ చైర్మన్ బండ్రెడ్డి నాగమల్లికార్జునరావు (చినబాబు), ఎస్ఐ కె.రాజేష్, డీసీ మాజీ చైర్మన్ బీసాబత్తుని ప్రసాద్, బండ్రెడ్డి హరి, వీఆర్వో టీజీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇండియన్ బ్యాంక్ మహిళల స్వయంసమృద్ధి, మహిళా సాధికారతకు కృషి చేస్తుందని బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని బ్యాంక్ జనరల్ మేనేజర్, ఆర్బీడీ వి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్లో బుధవారం ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోన్ ఆధ్వర్యాన ఎస్హెచ్జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్ జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్హెచ్జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రూ.1150 కోట్ల స్వయం సహాయక బృందాలకు రుణాలను మంజూరు చేశామన్నారు. ఎంతో మంది తమ చిన్న వ్యాపార అవసరాల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి తమ జీవితాలను కష్టతరం చేసుకుంటున్నారని అన్నారు. ఇండియన్ బ్యాంక్ ద్వారా స్వయం సహాయక బృందాల కోసం ఉత్పత్తులను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందవచ్చన్నారు మహిళలకు సాధికారత కల్పించి వారిని లక్షాధికారులగా మార్చటానికి ఉద్దేశించిన ‘సీడ్స్ టు సక్సెస్’ ప్రచారం, లక్షపతి దీదీ గురించి మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. విజయవాడ జోనల్ మేనేజర్ ఎం.రాజేష్ మాట్లాడుతూ విజయవాడ జోన్లో స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేకత కలిగిన 4 మైక్రోశాట్ బ్రాంచిలు ఉన్నాయన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 5 వేల స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం అందిస్తోందని, 43 బ్రాంచిలు స్వయం సహాయక బృందాల ఆర్థిక అవసరాలను తీర్చటానికి నిరంతరం పనిచేస్తున్నాయని, బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేష్కుమార్, జోనల్ మేనేజర్ ఎన్.గౌరీశంకర్రావు, రాష్ట్ర అధికారులు ఏఎన్వీ నాంచారరావు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
ఆతిథ్యానికి దాడుల సెగ
25 హోటళ్లపై 150 మంది జీఎస్టీ అధికారుల దాడులు హోటల్స్ ఆదాయాలను పరిశీలిస్తున్న వైనం సంపద సృష్టిలో భాగంగా హోటల్స్పై దాడులు? – షేక్ జహీర్, డెప్యూటీ కమిషనర్, విజయవాడ–2 డివిజన్ విజయవాడలో హోటళ్లపై జీఎస్టీ అధికారుల దాడులు 25 హోటళ్లపై దాడులు నిర్వహించిన 150 మంది అధికారులు సంపద సృష్టిలో భాగంగానే ఈ దాడులని విమర్శలు దాడులపై ముఖ్యమంత్రిని ఆశ్రయించిన హోటళ్ల సంఘ నేతలు -
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025u8లో అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 41.6347 టీఎంసీలు.7పవిత్ర సగమం వద్ద కృష్ణానదిలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాయి. ప్రమాదాలకు గురైన వారిని రక్షించే చర్యలు ప్రదర్శించాయి. నాగాయలంక: మండలంలోని టి.కొత్తపాలెంలో ఔషధ మొక్కలతో మోడల్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామ ఆరోగ్య వనాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ప్రారంభించారు. -
కరాటే కుటుంబం
శుభకరం.. ప్రభు జననం ● దుర్గారావు కుటుంబంలో మూడు తరాలు కరాటేలోనే.. ● జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధన బాల ఏసు ప్రతిమ వద్ద ప్రార్థనలు చేస్తున్న బిషప్ తెలగతోటి రాజారావువిద్యుత్ దీపాల వెలుగుల్లో విజయవాడ వన్టౌన్లోని సెయింట్ పౌల్స్ సెంటినరీ చర్చిఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో ప్రార్థనా మందిరాలు సరికొత్తగా కాంతులీనాయి. క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపేలా ఏర్పాటు చేసిన పశువుల పాక సెట్లు ఆకట్టుకున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు విశ్వాసులు వేలాదిగా ప్రార్థనల్లో పాల్గొన్నారు.పెనమలూరు: పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన సుంకు దుర్గారావుది నిరుపేద కుటుంబం. ఆటో నగర్లో సీట్లు కుట్టడమే వృత్తి. అయితే కరాటేపై మక్కువ ఆయన జీవితాన్నే మార్చే సింది. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా తీర్చిదిద్దింది. ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి సత్తాచాటారు. తన భార్య, పిల్లలను సైతం కరాటేలో నిపుణులుగా తీర్చిదిద్దారు. దుర్గారావు మనవళ్లు, మనవరాళ్లు సైతం కరాటేలా పతకాల పంట పండిస్తున్నారు. దుర్గారావు ప్రస్తుత వయసు 64 ఏళ్లు. ఆయన విజయవాడ సింగ్నగర్లో జన్మించారు. తండ్రి సత్యం, తల్లి లక్ష్మి సింగ్నగర్లో హోటల్ నడిపేవారు. కుటుంబం గడవక పోవటంతో దుర్గారావు యనమలకుదురులో స్థిరపడి ఆటోనగర్లో సీట్లు కుట్టి కుటుంబాన్ని పోషించేవారు. దుర్గారావుకు భార్య నాగమణి, కుమారులు నరేంద్రబాబు, క్రాంతికుమార్, ప్రశాంత్కుమార్ ఉన్నారు. 1980లో బ్రూస్లీ ప్రభంజనం కాలంలో దుర్గారావుకు కరాటే, కుంగ్ఫూ నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. మాస్టర్ ఆర్.వి.టి.మణి వద్ద శిక్షణ పొంది 1986లో కరాటే మాస్టర్గా ఎదిగారు. 1994లో విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించి మలేషియన్ గ్రాండ్ మాస్టర్ చూచూ షూట్ నుంచి బ్లాక్బెల్ట్ పొందారు. దుర్గారావు ప్రేరణతో ఆయన భార్య, ముగ్గురు కుమారులు కూడా కరాటే నేర్చుకున్నారు. వారు సైతం జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. స్థానికంగా ఉంటున్న క్రీడాకారులు, చిన్నారులు, పెద్దలను ప్రోత్సహించి దుర్గారావు కరాటే శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఇలా నాలుగు దశాబ్దాలుగా ఎంతో మందికి కరాటేలో శిక్షణ ఇస్తున్నారు దుర్గారావు కుటుంబ సభ్యులు. కరాటే మాస్టర్ దుర్గారావు ఇంటి నిండా పతకాలే కనబడుతాయి. సీనియర్ సిటిజన్ విభాగంలో 14 బంగారు పతకాలు గెలిచారు. సీనియర్ సిటిజన్ విభాగంలో గ్రాండ్ చాంపియన్షిప్ను నాలుగు సార్లు కైవసం చేసుకున్నారు. అంతకు ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 18 పతకాలు సాధించారు. ఆయన సాధించిన మొత్తం పతకాల సంఖ్య 32. అతని కుటుంబంలో అందరు కలిపి ఇప్పటికి 175కు పైగా పతకాలు గెలిచారు. కరాటేలో దుర్గారావు, ఆయన భార్య, కుమారులే కాకుండా మనవళ్లు మనవరాళ్లు కూడా కరాటేలో ప్రావీణ్యం సంపాదించారు. తొమ్మిదేళ్ల సాత్విక్, ఏడేళ్ల రుత్విక్, అనన్య, అన్షిక్ కరాటే పోటీల్లో సత్తాచాటుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 27 పతకాలు గెలిచారు. తాను నేర్చుకున్న విద్య తనతో ఆగిపోకుండా ఉండటానికి కరాటేపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని దుర్గారావు చేపట్టారు. వాన్కాన్ కరాటే డు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ కోచ్గా తన వద్ద 30 మంది క్రీడాకారులకు కరాటే, కుంగ్ఫూలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. విజయవాడ నగరంలో వివిధ పాఠశాలల్లో చదువుతున్ను వెయ్యి మందికిపై విద్యార్థులకు దుర్గారావు కరాటేలో రోజూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కరాటే నా ఊపిరి. నా కుటుంబంలో మూడు తరాల వారు కరాటే పోటీల్లో పాల్గొంటున్నారు. నేను 40 సంవ త్సరాలుగా కరాటే రంగంలో ఉన్నాను. అనేక మంది విద్యార్థులను కరాటేలో శిక్షణ ఇచ్చి మాస్టర్లుగా తీర్చిదిద్దాను. వ్యక్తిగత సంరక్షణకు కరాటే చాలా అవసరం. ప్రభుత్వం ముందుకొచ్చి సాయం అందిస్తే కరాటేను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తా. ఊపిరి ఉన్నంత వరకు కరాటే పోటీల్లో పాల్గొంటాను. – సుంకు దుర్గారావు, కరాటే మాస్టర్, యనమలకుదురు -
పుష్కాట్లను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నంటౌన్: నగరపాలక సంస్థ నూతనంగా తయారు చేయించిన 76 చెత్త తరలించే తోపుడుబళ్లను బుధవారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. స్థానిక క్యాటిల్డిపో వద్ద జరిగిన కార్యక్రమంలో రూ.19.80 లక్షల వ్యయంతో తయారు చేసిన చెత్త తరలించే తోపుడుబండ్లతో పాటు రూ.9.50 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 850 ప్లాస్టిక్ బుట్టలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్రలో భాగంగా వచ్చిన నిధులు 29.30 లక్షలతో వీటిని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ , కమిషనర్ సీహెచ్వీవీఎస్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, కాంట్రాక్టర్ కన్నా ప్రసాద్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికకు నోటిఫికేషన్
చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికకు నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు ఎన్నికల అధికారి బత్తిన రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 11వ తేదీ ఆదివారం మచిలీపట్నంలోని రెవెన్యూ భవన్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నామినేషన్ పత్రాల జారీ, 11 నుంచి 1.00 గంట వరకు నామినేషన్ల స్వీకరణ, 1.00 నుంచి 1.30 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ల జాబితా ప్రచురణ చేయటంతో పాటు, 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుందన్నారు. 3.30 గంటలకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటే 4 నుంచి 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని రామకృష్ణ తెలిపారు. ఎ.కొండూరులో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులు తిరువూరు: కిడ్నీ వ్యాధుల తీవ్రతతో అల్లాడుతున్న ఎ.కొండూరు మండలంలో ఇటీవల సికిల్సెల్ ఎనీమియా, తలసేమియా వ్యాధులు కూడా విస్తరిస్తున్నట్లు ప్రజారోగ్య వేదిక ప్రకటించింది. వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జేవీఎస్ సాయిప్రసాద్, ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ప్రకాష్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం మండలంలోని చీమలపాడు, కృష్ణారావుపాలెం, ఎ.కొండూరు, చైతన్యనగర్, పోలిశెట్టిపాడు గ్రామాల్లో పర్యటించి ఈ వ్యాధి లక్షణాలను గుర్తించింది. ఇప్పటివరకు తొమ్మిది మంది తలసేమియా వ్యాధిగ్రస్తులు, 11 మంది సికిల్సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులను గుర్తించినట్లు వేదిక ఒక ప్రకటనలో తెలిపింది. ఎ.కొండూరు, చీమలపాడు, గొల్లమందల, కోమటికుంట, పోలిశెట్టిపాడు, వల్లంపట్ల, మాధవరం, రేపూడి గ్రామాల్లో రెండు వ్యాధుల బారిన పడిన వారున్నారని తెలిపారు. సకాలంలో గుర్తిస్తే జీవితకాలం పెంపు తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా వ్యాధులు జన్యుపరమైనవని, వీటిని సకాలంలో గుర్తించి వైద్యం ప్రారంభిస్తే రోగుల జీవిత కాలం పెంచవచ్చని ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి విజయప్రకాష్ తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు తెలియజేసి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ నెల 28న ఎ.కొండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజలకు సికిల్సెల్ ఎనీమియా, తలసేమియా వ్యాధి లక్షణాలు గుర్తించడానికి రక్త పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలకు సుమారు రూ.15వందలు ఖర్చవుతుండగా, ప్రజారోగ్య వేదిక ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సహకారంతో ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రజలు ఈ పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్థారణ జరిగితే వైద్యసేవలు పొందాలని సూచించారు. 28న గ్రీటింగ్ కార్డ్ డిజైన్ కాంటెస్ట్ వాల్పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈతరం చిన్నారులకు గ్రీటింగ్ కార్డులకు ఉన్న ప్రాముఖ్యతను తెలియపరచి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే లక్ష్యంతో ఈనెల 28న గ్రీటింగ్ కార్డు డిజైన్ కాంటెస్ట్ నిర్వహించనున్నట్లు స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ప్రిన్సిపల్ స్ఫూర్తి శ్రీనివాస్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో గ్రీటింగ్ కార్డు కాంటెస్ట్ వాల్ పోస్టర్ను బుధవారం కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియో, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రీటింగ్ కార్డ్ డిజైన్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈతరం చిన్నారులకు ప్రేమ, ఆప్యాయతలతో ఇచ్చి పుచ్చుకునే గ్రీటింగ్ కార్డుల ప్రాముఖ్యత తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. -
సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య మునిసిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ – 2025 పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడా పాలసీని అమలు చేస్తోందన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. శాప్ ఎండీ ఎస్.భరణి, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసి డెంట్ ఎం.ద్వారకానాథ్, కార్యదర్శి అంకమ్మచౌదరి మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. శాప్ డైరెక్టర్ సంతోష్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఐ.రఘురాజ్, జాయింట్ సెక్రటరీ వంశీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని కాకానినగర్లో వరలక్ష్మి అనే యువతి బుధవారం ప్రియుడి ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా కై కలూరుకు చెందిన వరలక్ష్మి(29), జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ అనే యువకుడు దాదాపు 13 ఏళ్లుగా కలిసి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ప్రేమగా మారడంతో గత ఆరేళ్లుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని వరలక్ష్మి చెబుతోంది. ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నామని, సత్యదేవ్ తల్లిదండ్రులు కూడా మా కోడలు నీవే అని పలుమార్లు తనతో చెప్పినట్లు వరలక్ష్మి అంటోంది. అయితే కొంతకాలంగా బాలు సత్యదేవ్ ముఖం చాటేశాడని, అతని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మాటమార్చి తన ప్రియుడిని కనిపించకుండా చేసి, తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని యువతి కోరుతుంది. -
వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటాలి
పెనమలూరు: పాఠశాల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి అన్నారు. పోరంకి మురళీ రిసార్ట్స్లో మంగళవారం రెండు రోజుల రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025–26ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. పాఠశాల కర్రీక్యూలమ్ క్యాలెండర్ ప్రకారం స్టేట్ సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులు ప్రతిభ చాటాలని అన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఏడు అంశాలలో 188 గ్రూపు ప్రాజెక్ట్లను విద్యార్థులు అంశాలవారీగా ప్రదర్శించారు. ఉపాధ్యాయుల కేటగిరీలో 52 ప్రాజెక్ట్లు, విద్యార్థుల వ్యక్తిగత ప్రాజెక్ట్లు 52 చొప్పున ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రొఫెసర్ టీపీ శర్మ, స్టేట్ ఎకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కే.నాగేశ్వరరావు, డీఈవోలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సమాజసేవలో పోలీసుల భాగస్వామ్యం అభినందనీయం
జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడుకోనేరుసెంటర్: సమాజసేవలో పోలీసుల భాగస్వామ్యం నిజంగా అభినందనీయమని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు చెప్పారు. విధి నిర్వహణతో పాటు సమాజంలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న పలువురు పోలీసులను మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో సన్మానించి అభినందించారు. ఇటీవల రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వై.వెంకటరత్నం స్కూలు వదిలిన సమయంలో కొంత మంది పేద విద్యార్థులు మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా రోడ్డుపై వెళుతుండటాన్ని చూసి అందరికీ తన సొంత ఖర్చులతో పాదరక్షలు కొనిపెట్టి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఈ విషయంలో సోషల్మీడియా ద్వారా హల్చల్ అయింది. అలాగే ఆర్పేట పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ (డ్రోన్ ఆపరేటర్)గా విధులు నిర్వహిస్తున్న కె.కృష్ణమూర్తి (పిసి–1832) తన పుట్టినరోజును అందరి మద్య ఆడంబరంగా చేసుకోకుండా శీతాకాలంలో చలిపులికి గజగజలాడుతున్న యాచకులకు రగ్గులు, దుప్పట్లును అందజేసి తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు. అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్పీ విద్యాసాగర్నాయుడు వెంకటరత్నం, కృష్ణమూర్తిలను తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల్లో సేవాభావం అనేది ఎప్పుడూ ఉంటుందన్నారు. అయితే పైకి గాంభీర్యం కనిపించే పోలీసులను మాత్రమే చూస్తారన్నారు. ప్రజాభద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కూడా ప్రజల కోసం పోలీసులు చేసే సేవా కార్యక్రమాలేనని చెప్పారు. మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు మరింత దగ్గరవుతుండటం సంతోషంగా ఉందన్నారు. వెంకటరత్నం, కృష్ణమూర్తి వంటి సిబ్బందిని పోలీసుశాఖలోని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే ఇదే స్ఫూర్తితో సిబ్బంది రాబోయే రోజుల్లో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా మన్ననలు అందుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.వి నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల అనుమతులు మంజూరు చేసి ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల, పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సింగిల్ డెస్క్ పాలసీ కింద పరిశ్రమలు నెలకొల్పేందుకు 1,496 దరఖాస్తులు రాగా అందులో 1,217 ఆమోదించి, ఒకటి తిరస్కరించారని, ఇంకా 278 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. అందులో ప్రధానంగా తూనికలు కొలతల శాఖలో అత్యధికంగా 245, కాలుష్య నియంత్రణ మండలిలో 16, ఏపీఐఐసీలో తొమ్మిది ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పరిష్కరించి అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ● పీఎం విశ్వకర్మ పథకం కింద 2036 దరఖాస్తులు అందగా ఇప్పటివరకు 790 దరఖాస్తులకు ఆర్థిక సహాయం మంజూరు చేశారని, మిగిలిన దరఖాస్తులను కూడా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ● పీఎంఈజీపీ పథకం కోసం 162 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు కేవలం 43 యూనిట్లకు మాత్రమే బ్యాంకులు ఆర్థిక సహాయం మంజూరు చేశాయని, పరిష్కారం వేగవంతం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ● 23 ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ. 88.16లక్షలు పెట్టుబడి రాయితీ, వడ్డీ రాయితీ, విద్యుత్తు రాయితీ ప్రోత్సాహకాలను మంజూరు చేశారన్నారు. డీఐసీ జీఎంఆర్ వెంకటరావు, డీఆర్డీఏ పీడీ హరినాథ్, ఏపీఐఐసీ జెడ్ఎం బాబ్జి, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్రబాబు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారి జె. జ్యోతి, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి విక్టర్ బాబు, తూనికలు కొలతల తనిఖీ అధికారి ఈశ్వరరావు పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీపీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ వంటి ప్రభుత్వ పథకాలకు అత్యధిక ప్రాధాన్యతతో విరివిగా రుణాలు అందించి వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల సమితి సమావేశం, జిల్లా స్థాయి సమీక్ష సమావేశం బ్యాంకర్లు, జిల్లా అధికారులతో నిర్వహించి పలు పథకాల పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి హామీ కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద 121 దరఖాస్తులు బ్యాంకులకు రాగా అందులో 30 దరఖాస్తులకు రూ. 1.65కోట్లు మంజూరు చేశారని, 11 తిరస్కరించారని, ఇంకా పెండింగ్లో ఉన్న 89 దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద 35 దరఖాస్తులు బ్యాంకుల వద్ద అపరిష్కృతంగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం అమలులో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉందని, అందుకు కృషి చేసిన అధి కారులు బ్యాంకర్లను అభినందిస్తున్నామన్నారు. -
బస్సులు ఢీకొని పలువురికి గాయాలు
నందిగామ రూరల్:ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ పాఠశాల బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామానికి చెందిన సెయింట్ లూసి పాఠశాల బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వస్తుండగా కేతవీరునిపాడు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పాఠశాల బస్సు డ్రైవర్ ముప్పాళ్లకు చెందిన శ్రీనివాసరావు, ఆర్టీసీ బస్సు డ్రైవర్ హరికృష్ణలకు గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థులకు కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనలో పాఠశాల బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. దీనిపై పోలీస్ కేసు నమోదు కాలేదు. -
ఎస్ఎంసీలో బాలికల వసతి గృహం ప్రారంభం
కార్యక్రమంలో పాల్గొన్న వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్ఎంసీ)లో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 330మంది విద్యార్థినులు ఉండేలా 210 గదులతో భవనం నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా, అందుకోసం రూ.21.51కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన వసతి గృహంలో 105 గదులు ఉన్నాయని, వాటిలో 80 గదులు యూజీ(ఎంబీబీఎస్) బాలికలకు, మిగిలిన వాటిని సీనియర్ రెసిడెంట్లకు ఇవ్వనున్నట్లు తెలిపారు. మిగిలిన నిర్మాణాలను త్వరలో పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్య కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, పీపీపీ విధానంలోనే మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. నర్సింగ్ విద్యార్థుల వసతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దే రామ్మోహన్, కలెక్టర్ జి.లక్ష్మీశ, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డి.వెంకటేష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దుర్మరణం
చల్లపల్లి: కారు టైరు పగిలి బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని మాజేరు చెక్పోస్టు వద్ద 216 జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో ఒకరికి రెండు నెలల క్రితమే వివాహమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుడివాడకు చెందిన దొడ్డ లోకేశ్వర్ తన భార్య రమాగీత, రెండేళ్ళ వయస్సుగల బాబు గీతాన్ష్తో కలిసి కారులో మోపిదేవి గుడికి వెళ్లారు. తిరిగి జాతీయ రహదారిపై మచిలీపట్నం మీదుగా గుడివాడ బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మాజేరు చెక్పోస్టు వద్దకు రాగానే కారు ముందుభాగంలోని డ్రైవర్ వైపు చక్రం పగిలిపోయింది. దీంతో అదుపుతప్పి రోడ్డుకు కుడివైపు కారు దూసుకుపోయింది. ఇంతలో ఎదురుగా మచిలీపట్నం నుంచి చల్లపల్లి వైపునకు వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న కోడూరు మండలం పిట్టలంక గ్రామానికి చెందిన సిరివెళ్ళ భాగ్యరాజు(24), పులిగడ్డకు చెందిన చెన్ను రాఘవ(25) మృతి చెందారు. భాగ్యరాజుకు బలమైన గాయాలు కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. చెన్ను రాఘవకు కుడిచేయి చంక భాగంలో తెగిపోవటంతో తీవ్రరక్తస్రావం అయింది. వెంటనే 108లో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడు. భాగ్యరాజు, రాఘవ ఇద్దరూ పులిగడ్డ పంచాయతీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ కింద కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఆఫీసు పనిమీద మచిలీపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. సిరివెళ్ళ భాగ్యరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వెంటనే కారులోని ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోవటంతో అందులో ఉన్న లోకేశ్వర్కు ఆయన భార్య రమాగీత, చిన్నారి గీతాన్ష్కు ఎటువంటి గాయాలుకాలేదు. లోకేశ్వర్ పస్తుతం పోలీసుల అదుపులో ఉండగా ఎస్ఐ కె.వై.దాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భాగ్యరాజుకు రెండు నెలల క్రితం అక్టోబర్ 7వ తేదీన వివాహం జరిగింది. కాళ్ళ పారాణి ఆరకముందే భాగ్యరాజు దుర్మరణం చెందాడు. పులిగడ్డకు చెందిన చెన్ను రాఘవకు తొమ్మిది నెలల క్రితం గాయత్రితో వివాహం అయ్యింది. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి. ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోవటంతో పాటు ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
ప్రజలకు సుపరిపాలన అందించాలి
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు సమస్యలను ఓపికతో వింటారో వారు మంచి పరిపాలన అధికారిగా పేరు తెచ్చుకుంటారని చెప్పారు. సప్త సూత్రాలను విధిగా పాటించాలని చెప్పారు. డీఆర్వో కె.చంద్రశేఖరరావు, డీఎస్వో మోహన్బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు శివరాంప్రసాద్, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్ననరసింహులు, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, డీటీడబ్ల్యూవో ఫణి దూర్జటి, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, వయోజన విద్య డీడీ బేగ్, గృహనిర్మాణ పోతురాజు పాల్గొన్నారు. కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో ఇటీవల నిర్వహించిన బీటెక్ ఐదో సెమిస్టర్ (రెగ్యులర్, సప్లమెంటరీ), ఎల్ఎల్బీ, ఎంబీఎల్బీ నాలుగు, ఐదు సెమిస్టర్, రీవాల్యుయేషన్, ఎల్ఎల్ఎం రెండో సెమిస్టర్ రీవాల్యూయేషన్, బి.పి.డి, డి.పి.డి రెండో సెమిస్టర్ రీవాల్యూయేషన్ ఫలితాలను ఈ నెల 20వ తేదీన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ విడుదల చేసినట్లు విశ్వపరీక్షల నియంత్రణ అధికారి పి.వీరబ్రహ్మచారి తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. పునఃమూల్యాంకనానికి జనవరి ఆరో తేదీలోగా వెబ్సైట్లో సూచించిన విధంగా రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు
ముగిసిన 78వ అంతర్ రాష్ట్ర టీం పోటీలు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని చెన్నుపాటి రామ కోటయ్య మునిసిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో సోమవారం మొదలైన 78వ అంతర్ రాష్ట్ర టీమ్ బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం ముగిశాయి. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. తమిళనాడు, హరియాణా జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోటీలో తమిళనాడు జట్టు విజయం సాధించింది. రన్నర్గా హరియాణా జట్టు నిలిచింది. మహిళల టీమ్ బ్యాడ్మింటన్ పోటిల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య జరిగిన పోటీలో హరియాణా టీమ్ విజయం సాధించింది. విజేతలకు కలెక్టర్ లక్ష్మీశతో పాటుగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ద్వారకనాథ్, టోర్నమెంట్ కన్వీనర్ ఉమర్ రషీద్, గుజరాత్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి మయూర్ పారిఖ్ బహుమతులను అందజేశారు. నేటి నుంచి నేషనల్ పోటీలు.. బుధవారం నుంచి 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఇండివిడ్యువల్ చాంపియన్ షిప్–2025 పోటీలు జరుగుతాయని బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలిపింది. పురుషుల సింగిల్స్లో తలపడుతున్న హరియాణా (డార్క్ బ్లూ టీషర్ట్), తమిళనాడు(స్కై బ్లూ టీషర్ట్) క్రీడాకారులు -
300 స్టాళ్లతో విజయవాడ పుస్తక మహోత్సవం
పోస్టర్ ఆవిష్కరించిన నిర్వాహకులువన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి రెండో తేదీ నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే 36వ విజయవాడ పుస్తక మహోత్సవంలో తెలుగు సాహిత్యంలో వస్తున్న వివిధ మార్పులపై పలు సదస్సులను నిర్వహించనున్నట్లు సొసైటీ గౌరవ సలహాదారు ఎమెస్కో పబ్లిషర్స్ అధినేత డి.విజయకుమార్ చెప్పారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు టి.మనోహర్నాయుడు, కె.లక్ష్మయ్యతో కలిసి మాట్లాడారు. తొలుత బుక్ ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా సొసైటీ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పలు అంశాలపై సదస్సులతో పాటు స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు, ప్రముఖ విద్యావేత్త ఆచార్య తూమాటి దొణప్ప, సుప్రసిద్ధ కథ రచయిత మునిపల్లె రాజు తదితర ప్రముఖుల శతజయంతి సభలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది సుమారు 300 దుకాణాలతో పుస్తక మహోత్సవం ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యక్షులు జె. ప్రసాద్, సహాయ కార్యదర్శి ఏబీఎస్ సాయిరామ్, కోశాధికారి కె. రవి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు బిగ్ షాక్!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కూటమి సర్కార్కు ఊహించని షాక్ తగిలింది. మెడికల్ కాలేజీలను తీసుకునేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు. వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంతో ప్రైవేటు సంస్థలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.వివరాల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానంలో టెండర్లను పిలిచింది. ఈ టెండర్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. అయితే, మార్కాపురం, పులివెందుల, మదనపల్లె మెడికల్ కాలేజీలకు ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. కేవలం ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే సింగిల్ బిడ్ దాఖలైంది. కాగా, కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు టెండర్లు గడువు పెంచింది. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ నుండి ఉద్యమ బాట పట్టిన వైఎస్సార్సీపీ.. కోటి సంతకాల సేకరణతో పతాక స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సంస్థలు మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఉద్యమంగా కోటి సంతకాల సేకరణ..అంతకుముందు.. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంగా మారిన వేళ.. సోషల్ మీడియాలో ఆ ప్రజా ఉద్యమానికి అపూర్వ స్పందన లభించింది. ఎక్స్లో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం టాప్ ట్రెండింగ్లో కొనసాగింది. కోటి సంతకాల సేకరణకు ఎక్స్లో మద్దతు వెల్లువెత్తింది. కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వేల సంఖ్యలో ట్వీట్లు చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. దీంతో, చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఇది బట్టబయలు చేసింది.వైఎస్ జగన్ సంకల్పం..పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి జిల్లా కేంద్రాలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని గవర్నర్కు అందజేశారు. -
చట్ట పరిధిలో సమస్యలకు పరిష్కారం
కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో అందిన అర్జీలను చట్టపరిధిలో విచారణ జరిపించి సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని ఫిర్యాదులను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 40 అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● పెడనకు చెందిన వనజ అనే వివాహిత ఎస్పీని కలిసి తన సమస్యను విన్నవించుకుంది. 9ఏళ్ల క్రితం తనకు వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని వాపోయింది. అతనికి అడ్డు వస్తే తనతో పాటు పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వివరించింది. రక్షణ కల్పించి న్యాయం చేయాలని అర్జీ సమర్పించింది. ● పమిడిముక్కలకు చెందిన లక్ష్మి అనే వివాహిత తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. అందుకు అత్తమామలు అతనికి సహకరిస్తూ తనను మానసికంగా చిత్ర హింసలకు గురి చేస్తున్నారంటూ వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ● మచిలీపట్నం కుమార్ అనే వ్యక్తి ఎస్పీని కలిసి స్నేహితునికి ఆర్థిక అవసరాల నిమిత్తం ఎలాంటి ఆధారాలు లేకుండా ఐదు లక్షల రూపాయలు చేబదులుగా ఇచ్చానని చెప్పాడు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే తనను దుర్భాషలాడటమే కాకుండా కిరాయి వ్యక్తులను పంపించి తనపై దాడి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ కోరాడు. -
విద్యార్థులకు సైబర్ భద్రతపై నైపుణ్యం అవసరం
పెనమలూరు: విద్యార్థులు సైబర్ భద్రతపై నైపుణ్యం సాధించాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో సోమవారం డాక్టర్ వీఎల్ దత్ బ్లాక్లో కేవీరావు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సైబర్ నేరాలు పెరుగుతున్నందున విద్యార్థుల సైబర్ భద్రతపై నైపుణ్యం సాధించాలని సూచించారు. ఇటువంటి కేంద్రాలు దేశ డిజిటల్ భద్రతకు ఉపయోగపడతాయన్నారు. డెప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ కీలకమయ్యాయని తెలిపారు. కాకినాడ సీపోర్టు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రావు మాట్లాడుతూ పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయటానికి ఇటువంటి కేంద్రాలు చాలా ఉయోగపడతాయని వివరించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాజయ్య, పాలడుగు లక్ష్మణరావు, ఉపకులపతి ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.రవిచంద్, కంప్యూటర్ విభాగాధినతి డాక్టర్ డి.రాజేశ్వరరావు పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు -
ఆడుకుందాం.. ఆపేదెవరు?
ముందే ‘బరి’తెగిస్తున్న అధికార పార్టీ నేతలుతిరువూరు: సంక్రాంతి జూదాల నిర్వహణకు తిరువూరు సర్కిల్లో ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో మూడు రోజుల పాటు పండుగ జూదాలకు పోలీసుల నుంచి అనధికారిక అనుమతులు పొందే నిర్వాహకులు తిరువూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోడి పందేలు, కోతముక్కలు, లోన బయట, పులిమేక వంటివి నిర్వహిస్తారు. గతేడాది తిరువూరు, గంపల గూడెం, ఏకొండూ రు, విస్సన్న పేట మండలాల్లో రూ.20కోట్లకు పైగా సొమ్ము పండుగ జూదాల్లో చేతులు మారింది. ఈ ఏడాది కూడా పండుగ జూదాల కోసం మామిడితోటల్లో బరులకు సిద్ధం చేస్తున్నారు. రాత్రీపగలు జూదాల నిర్వహణకు అనువుగా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి బరుల చుట్టూ ఫెన్సింగ్ నిర్మించడం, ఇండోర్ స్టేడియం తరహాలో సీటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. దూరప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు.. తిరువూరు నియోజకవర్గంలో జరిగే కోడిపందేలు, ఇతర జూదాలకు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పందెంరాయుళ్లు వస్తారు. వీరికి తిరువూరు పరిసరాల్లోని లాడ్జీలలో ముందస్తుగా గదులు బుక్ చేయడంతో పాటు మామిడి తోటల్లోనే తాత్కాలిక టెంట్లు వేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటారు. తిరువూరు మండలంలోని మల్లేల, కాకర్ల, తిరువూరు, గంపలగూడెం మండలంలోని పెనుగొలను, ఊటుకూరు, విస్సన్నపేట మండలంలోని కొండపర్వ, నరసాపురం, విస్సన్నపేట, ఏకొండూరు మండలంలోని గోపాలపురం, చీమలపాడులలో ఈ ఏడాది పందేల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. జూదాల్లో పేద, మధ్యతరగతి వర్గాలే ఎక్కువగా డబ్బు పోగొట్టుకునే పరిస్థితి ఉన్నప్పటికీ వీటిని నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. స్టాల్స్ ఏర్పాటుకు డిపాజిట్లు.. జూదరులు, పందెంరాయుళ్ల వాహనాల పార్కింగ్, మద్యం అమ్మకాలు, భోజనం సరఫరా స్టాళ్ల ఏర్పాటుకు కూడా స్థలాలు శుభ్రం చేస్తున్నారు. వీటిని మూడురోజులు నిర్వహించినందుకు పందేల నిర్వాహకులు అద్దెలు నిర్ణయించి ముందుగానే వసూలు చేస్తున్నారు. గతేడాది సంక్రాంతి పండుగకు తిరువూరు నియోజకవర్గంలో మద్యం రెట్టింపు అమ్మకాలు జరగడంతో జూదాల్లో ఈసారి మద్యం స్టాల్స్కు అధిక మొత్తంలో వసూలు చేయనున్నారు. సంక్రాంతి జూదాలకు భారీ ఏర్పాట్లు ముందస్తుగా మామిడితోటల్లో బరుల నిర్మాణం పందెం రాయుళ్లకు ఆహ్వానాలు స్టాల్స్ నిర్వహణకు వేలం పాటలు జూదాల కోసం మామిడితోటలలో భూమి చదును చేయిస్తున్న నిర్వాహకులు.. తిరువూరు పట్టణంలోని రాజుపేటలో నాగార్జునసాగర్ కాలువ తూరలు, లాకులను ధ్వంసం చేశారు. పట్టణంలోని సాగునీటి చెరువులకు సాగర్ జలాలు సరఫరా చేసే కాలువ ధ్వంసం చేసిన నిర్వాహకులు హడావుడిగా మరో తూర వేసి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమై సాగర్ అధికారులు సైతం స్పందించక పోవడం గమనార్హం. -
బీసీ కుల గణన జరపాలని డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జనగణనతో పాటు బీసీ కులగణన చేయాలని బీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కులగణన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో బీసీ నవ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘హలో బీసీ – చలో విజయవాడ’ పేరిట సోమవారం ధర్నా చేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్, బీసీ మహాసభ, బీసీ నవ చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో సీట్లు కేటాయించాలన్నారు. రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు యాదవ్, బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రుషింగప్ప, జెట్టిపాలెం వెంకటేష్ (జాంబవ రాజు) ఎస్సీ, ఎస్టీ, బీసీ పోరాట సంఘం అధ్యక్షుడు చందు, బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు బీసీ రమణ, జై ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు జైబాబు, నవ క్రాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌస్, బీసీ నవ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ వెటరన్స్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్–2025 నగరంలోని ఫన్టైమ్స్ క్లబ్లో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. పురుషుల సింగిల్స్ 40+ కేటగిరీలో ప్రదీప్, 50+ కేటగిరీలో వైటీవీ సుబ్బారావు, 60+ కేటగిరీలో కె.జయరామ్, 65+ కేటగిరీలో సీహెచ్ హనుమంతరావు, 70+ కేటగిరీలో గంగాధర్, 75+ కేటగిరీలో ఎస్.ప్రభాకరరావు, పురుషుల డబుల్స్ 40+ కేటగిరీలో వైవీ ప్రదీప్, బి.రాజు, 50+ కేటగిరీలో నరసింహారావు, సుభాకృష్ణ, 60+ కేటగిరీలో కె.జయరామ్, అబ్బాస్, మహిళల సింగిల్స్ 40+ కేటగిరీలో పి.భారతి, 50+కేటగిరీలో సత్యవతి, 60+ కేటగిరీలో బేబీ సరోజిని, మిక్స్డ్ డబుల్స్లో సురేష్, సరోజిని విన్నర్స్గా నిలిచారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి పి.విశ్వనాథ్ బహుమతులను అందజేశారు. -
అనుమతులున్నా.. అడ్డుగోడ కట్టేశారు
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక జోజినగర్ ప్రాంతంలోని 42 ప్లాట్ల ప్రధాన రహదారి 2021లోనే రెగ్యులరైజ్ అయిన నేపథ్యంలో ఆ రోడ్ పక్కనే ఉన్న ఎస్కేటీ వెస్ట్ మెడోస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న 72 కుటుంబాలకు, 42 ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ కోరారు. ఈ మేరకు ఆయన అపార్ట్మెంట్వాసులతో కలిసి సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రను కలిసి వినతి పత్రం అందజేశారు. అన్యాయంగా గోడ కట్టారు.. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ 42 ప్లాట్ల యజమానులకు, అపార్ట్మెంట్ నివాసితులకు మున్సిపల్ కార్పొరేషన్ గతంలోనే అనుమతులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు సొసైటీ పేరుతో వచ్చి 42 ప్లాట్లను కూల్చివేయడంతోపాటు అపార్ట్మెంట్కు వెళ్లే దారిని కూడా మూసేస్తూ గోడ కట్టారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వారంతా తమ ఫ్లాట్లలోకి వెళ్లకుండా దౌర్జన్యంగా అడ్డుగోడ నిర్మించి నిలువరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారిలో వృద్ధులు, అనారోగ్యంతో చికిత్స పొందున్నవారు, మహిళలు, పిల్లలు ఉన్నారని, కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ధ్యానచంద్రను కలిసిన వారిలో వెస్ట్ మెడోస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్లు బెవర సాయి సుధాకర్, ఇల్లా భాస్కర్, గంజి జోషి ఉన్నారు. వెస్ట్ మెడోస్ అపార్ట్మెంట్వాసులకు న్యాయం చేయాలని వినతి -
సుబ్బారాయుడి సేవలో..
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ గురుకులాల సెక్రటరీ పి. మాధవీలత, రాష్ట్ర గౌడ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నూతనంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వీరంకి వెంకట గురుమూర్తి విడివిడిగా సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వీరు నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్కుమార్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. మచిలీపట్నంఅర్బన్: ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ‘ముస్తాబు’ కార్యక్రమానికి సంబంధించి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్తాబు కార్యక్రమం నిర్వహణతో విద్యార్థులు ఆరోగ్యం, ఆహ్లాదం, క్రమశిక్షణ వంటి విలువలను అలవర్చుకునే అవకాశం కలుగుతుందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటుగా చేసుకునే లక్ష్యంతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని అన్ని విద్యాసంస్థల్లో సమగ్రంగా అమలు చేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.ఫణి ధూర్జటి, డీఆర్ఓ చంద్రశేఖర్ రావు, డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. గూడూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు నిర్వహించిన త్రో బాల్ జిల్లా స్థాయి పోటీలలో ఉయ్యూరు డివిజన్ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం గూడూరు హైస్కూల్లో నిర్వహించిన పోటీలలో ఫైనల్లో మచిలీపట్నం డివిజన్ జట్టును చిత్తు చేసి ఉయ్యూరు డివిజన్ జట్టు విజేతగా నిలిచింది. క్రికెట్ చాంపియన్గా మచిలీపట్నం.. పురుషుల క్రికెట్ విభాగంలో జిల్లా విజేతగా మచిలీపట్నం డివిజన్, రన్నర్గా ఉయ్యూరు డివిజన్ జట్లు నిలిచాయి. వీరిలో నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపనున్నట్లు జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ మత్తి అరుణ తెలిపారు. ఉదయం త్రోబాల్, క్రికెట్ పోటీలను గూడూరు ఎంపీపీ సంగా మధుసూదనరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని గొరిపర్తి విజయకుమారి, లింగం విజయ్కుమార్ ప్రారంభించారు. తాడేపల్లి రూరల్: సీతానగరం పుష్కర ఘాట్ల సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద మృతదేహం ఉన్నట్లు స్థానికులు సోమవారం తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వారు వెళ్లి విజయవాడ నుంచి కృష్ణా కెనాల్కు వచ్చే రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. దాన్ని బయటకు తీసి గుట్టుచప్పుడు కాకుండా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మృతుడి శరీరంపై గాయాలు ఉన్నాయని, ఒక కన్ను పూర్తిగా పోయి లొట్టగా ఉందని తెలియవచ్చింది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 ఉండొచ్చు. ట్రైన్లో నుంచి జారి పడ్డాడా? గతంలో మాదిరి రైల్వేబ్రిడ్జిపై హత్యచేసి కిందకు నీళ్లలోకి పడవేశారా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో ప్రతిభ మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నాగల సౌరవ్ రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో సత్తాచాటి రెండు రజత పతకాలు కై వసం చేసుకున్నాడు. జూడో పోటీల్లో క్యాడెట్, జూనియర్ విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. సోమ వారం కళాశాలలో సౌరవ్ను ఇన్చార్జి ప్రిన్సిపాల్ టి.ఆర్యాపతి, అధ్యాపకులు అభినందించారు. -
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్టు
పెనమలూరు: గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసారావు తెలిపారు. పెనమలూరు పోలీస్స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పోరంకి సాలిపేట వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు అందుకున్న సమాచారం మేరకు ఎస్ఐలు ఫిరోజ్, ఉషారాణి, సిబ్బంది దాడి చేసి దెందులూరు గ్రామానికి చెందిన సేపేని వరప్రసాద్(24), పోరంకి సాలిపేటకు చెందిన పసుమర్తి శ్రీసూర్య(21), గడ్డం రాకేష్(19), గంగూరుకు చెందిన ఎండీ.సులేమాన్(19)లను పట్టుకున్నారని తెలిపారు. వారి వద్ద రెండున్నర కేజీల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ కేసులో కీలక నిందితుడైన వరప్రసాద్పై పలు గంజాయి కేసులు నమోదు అయ్యాయని వివరించారు. సీలేరు, అరకు ప్రాంతాల్లో గంజాయి తరలిస్తుండగా గతంలో పట్టబడి జైలుకు వెళ్లాడని డీఎస్పీ తెలిపారు. ఇలా చిక్కారు.. ఈ నెల 12వ తేదీన ఒడిశా రాష్ట్రంలోని పుకాలికి వెళ్లి నర్సింగ్ అనే వ్యక్తి వద్ద 6 కేజీల గంజాయి కేజీ రూ. 4 వేల చొప్పున కొన్నాడని డీఎస్పీ తెలిపారు. పెనమలూరు సెంటర్లో ఉండే కౌషిక్, శివకుమార్లకు మూడున్నర కేజీలు గంజాయి అమ్మాడని తెలిపారు. వీరిద్దరు పరారీలో ఉన్నారన్నారు. వరప్రసాద్ గంజా యిని శ్రీసూర్య, సులేమాన్, గడ్డం రాకేష్కు పోరంకి సాలిపేటలో విక్రయిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. కంకిపాడు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐలు ఫిరోజ్, ఉషారాణి సిబ్బంది పాల్గొన్నారు. రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం -
కొనసాగుతున్న పల్స్ పోలియో
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం రెండో రోజు కొనసాగినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె. ప్రేమ్చంద్ తెలిపారు. సోమవారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. చిన్నారుల భవిష్యత్తు కోసం రెండే చుక్కలు నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రోజున జిల్లాలో మొత్తం 1,45,588మంది ఐదేళ్లలోపు చిన్నారులు లక్ష్యంగా ఉండగా, 1,34,643 మంది చిన్నారులకు (95.49 శాతం) పోలియో డోసులు వేసినట్లు వెల్లడించారు. మొదటి రోజు పోలియో చుక్కల పంపిణీలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారుల కోసం ఇంటింటి సర్వే నిర్వహించి, 124 మొబైల్ బృందాలు, 46 ట్రాన్సిట్ బృందాల సహకారంతో సోమవారం 2,592 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా మంగళవారం సాయంత్రం ఐదు గంటలలోపు వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలనే ఉద్దేశంతో వైద్య, ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు ప్రేమ్చంద్ పేర్కొన్నారు. -
ప్రైవేటీకరణతో కృశించిపోతున్న ప్రభుత్వ రంగం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ, పీపీపీ విధానం మూలంగా ప్రభుత్వ రంగం క్రమేపీ కృశించిపోతోందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో కార్మికులు, పేదలు మరింత అభద్రతకు గురవుతున్నారని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. విద్యుత్, రవాణా, విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వం తన బాధ్యతలను వదిలించుకునేందుకు ఎంచుకున్న పీపీపీ విధానం మూలంగా అత్యవసర సేవల్లో నాణ్యత, జవాబుదారీతనం లోపించడంతో పాటు సామాన్య ప్రజానీకం మీద మరింత ఆర్థిక భారం మోపడానికి దారితీస్తుందన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నాయకుడు మాకినేని బసవపున్నయ్య 111 వ జయంతి సందర్భంగా ఎం.బి.విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ పి.మధు అధ్యక్షతన శనివారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణ తీరుతెన్నులు–రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనే అంశంపై స్మారకోపన్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు మార్క్సిజం లెనినిజాన్ని అన్వయించి భారత విప్లవోద్యమానికి సరైన పంథా రూపొందించిన అత్యుత్తమ నాయకుడు బసవ పున్నయ్య అని కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి ఒనగూడాల్సిన ప్రయోజనాలు రాజధాని నిర్మాణానికి కేంద్రం విడుదల చేయాల్సి నిధులపై కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా రాజీ పడుతోందన్నారు. శ్రమ ప్రాధాన్యత పరిశ్రమలకు బదులు పెట్టుబడి ప్రాధాన్యత పరిశ్రమలకు పెద్దపీట వేయడంతో రాష్ట్రాలలోని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఎంవోయూలు, ఆర్భాటపు ప్రకటనలు కట్టిపెట్టి సరైన పారిశ్రామికాభివృద్ధికి నడుం కట్టాలన్నారు. సంస్థాగతంగా ఉన్న ఆటంకాలను అధిగమించేందుకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎం.బి. విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, తులసీరావు, స్వరూపరాణి పాల్గొన్నారు. -
అక్రమ కేసులపై న్యాయపోరాటం చేయాలి
గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా చంద్రబాబు పని చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని తన కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార మదంతో కూటమి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని, అదేమని అడిగిన తమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల విషయంలో లీగల్ సెల్ నాయకులు న్యాయ పోరాటం చేయాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అవస్థలకు గురవుతున్నారన్నారు. ప్రజల్లో ఇప్పటికే కూటమి పాలనపై వ్యతిరేకత మొదలైందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం లీగల్ సెల్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సాయిరామ్, ఉపాధ్యక్షుడు బసవారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
తిరువూరులో మెగా రక్తదాన శిబిరం
తిరువూరు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం తిరువూరులో పార్టీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తిరువూరు ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, వైఎస్సార్ సీపీ కార్యక ర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు 200 మందికి పైగా రక్తదానం చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. కౌన్సిలర్ మోదుగు ప్రసాద్, పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, కాలసాని గోపాల నాగేశ్వరరావు, వాళ్ల సురేష్ తదితరులు రక్తదాన మిచ్చారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ నల్లగట్ల సుధారాణి, మహిళా విభాగ అధ్యక్షురాలు పురిటిపాటి సుధారాణి, తిరువూరు, విస్సన్నపేట జెడ్పీటీసీ సభ్యులు యరమల రామచంద్రారెడ్డి, బీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, తిరువూరు, విస్సన్నపేట వైఎస్సార్ సీపీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్కుమార్, దుర్గారావు, కుటుంబరావు, పార్టీ నాయకులు కలకొండ రవికుమార్, గోగులమూడి చెన్నకేశవరెడ్డి, చావా వెంకటేశ్వరరావు, ఏరువ ప్రకాష్రెడ్డి, తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, ఇనపనూరి రవి, పరసా నెహ్రూ, రాజ్మహ్మద్, ఆలపాటి ఉమామహేశ్వరరావు, చెరుకు నరసారెడ్డి, మామిడి కుటుంబరావు, బొర్రా మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు పల్స్ పోలియో
మచిలీపట్నంఅర్బన్: పోలియో నిర్మూలన లక్ష్యంగా ఈ నెల 21న జిల్లాలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పి.యుగంధర్ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులు అందరికీ చుక్కల మందు వేయడమే లక్ష్యమన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 1,45,588 మంది ఉన్నారని, వారి కోసం 1,94,160 పోలియో డోసులను సిద్ధం చేశామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 986, పట్టణ ప్రాంతాల్లో 187, మొబైల్ బూత్లు 62, ట్రాన్సిట్ బూత్లు 23 చొప్పున 1,258 కేంద్రాల ద్వారా చిన్నారులకు చుక్కల మందు పంపిణీచేస్తామని తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వాణిజ్య సముదాయాలు, పర్యాటక ప్రాంతాల్లో సంచరించే పిల్లల కోసం ట్రాన్సిట్ బూత్లు కీలకంగా పనిచేస్తాయన్నారు. ఆదివారం పల్స్ పోలియో శిబిరాలకు రాని చిన్నారుల కోసం 22, 23 తేదీల్లో ఇంటింటి సర్వే చేసి చుక్కల మందు వేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో 4,898 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా బందరులో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ, అన్నదానం, గోసంరక్షణకు భక్తులు విరివిగా విరాళాలు అందించారు. విజయవాడ మధురానగర్కు చెందిన డి.శ్రీనివాస ప్రసాద్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి ఉచిత ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయ్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అన్నదానానికి రూ.లక్ష విరాళం అమ్మవారి అన్నప్రసాద వితరణకు చైన్నెకు చెందిన ఎం.బాబ్జి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. విజయవాడ ఇస్లాంపేటకు చెందిన కె.వి.మోహనరావు దంపతులు దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి రూ.1,00,005 విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి, వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. -
ఎన్టీటీపీఎస్కు రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ సంస్థకు రాష్ట్ర స్థాయి ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు వరించింది. విజయ వాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మి, సీపీడీసీఎల్ చైర్మన్ పుల్లారెడ్డి చేతుల మీదుగా ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ పి.శివరామాంజనేయులు శనివారం అవార్డు అందుకున్నారు. థర్మల్ ప్లాంటులో శక్తి వినియోగాన్ని తగ్గిస్తూ వినూత్నమైన శక్తి పరిరక్షణ విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట్రస్థాయిలో శక్తి పరిరక్షణ విభాగంలో రెండో స్థానం దక్కించుకుని సిల్వర్ మెడల్ సొంతం చేసుకోవడం సంస్థకు గర్వకారణమని సీఈ శివరామాంజ నేయులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సీఈకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈలు గోపాల్, వెంకటరావు, ఈఈలు సురేష్బాబు, శ్రీనివాస్రెడ్డి, డీఈఈ హరి పాల్గొన్నారు. -
బలమైన కుటుంబ వ్యవస్థతో ఆరోగ్యకర సమాజం
పెడన: బలమైన కుటుంబ వ్యవస్థతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్మన్ గుట్టాల గోపి అన్నారు. పెడనలో శనివారం ఉదయం జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార(డీసీఎల్ఏ) సంస్థ, జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నూతన తరహా న్యాయ సేవల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాలు సామాజిక స్థిరత్వానికి మూలమని, నేరాలు, సామాజిక వ్యతిరేక ప్రవర్తనలను తగ్గిస్తాయని అన్నారు. ప్రభుత్వానికి న్యాయవ్యవస్థలకు మధ్య వారధిగా డీసీఎల్ఏ పని చేస్తుందన్నారు. రాజీ మార్గం ద్వారా కక్షిదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. సామాన్యులకు న్యాయం అందుబాటులో ఉంచడం, సాంఘిక దురాచారాల పోరాటంపై ప్రజలకు అవగాహన కల్పించడం, పిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా దూరమైన వారిని గుర్తించి వారికి చేరువ చేసేలా చర్యలు తీసుకోవడంలో డీఎల్ఎస్ఏ విశేష కృషి చేస్తుందని వివరించారు. పిల్లలను సరైన మార్గంలో నడిపించేలా తల్లిదండ్రులు చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. సమాజంలో ఇప్పటికీ బాల్యవివాహాలు జరగటం విచారకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతురాజు, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ యుగంధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి.సాయిసుధ, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, జిల్లా అధికారులు కామరాజు, రాజేంద్ర ప్రసాద్, మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీ తదితరులు ఇతర న్యాయమూర్తులతో కలిసి సందర్శించి తిలకించారు. సమాజంలో బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ చిన్నారులు ప్రదర్శించిన లఘు నాటిక ప్రదర్శన, జానపద గీతాలు ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి -
హెల్త్ వర్సిటీ ఫుట్బాల్ జట్టు ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఈ నెల 24 నుంచి కాలికట్లోని కాలికట్ విశ్వవిద్యాలయం ఆవరణలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ (పురుషులు) టోర్నీలో పాల్గొనడానికి తమ యూనివర్సిటీ జట్టును శనివారం ఎంపిక చేశామని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ ఇ.త్రిమూర్తి ప్రకటనలో తెలిపారు. పి.ప్రసన్న శేషు కుమార్, మితుల్ అమరా, కె.సాయి శ్రీష్, ఎం.జస్వంత్, కె.సాయి లోకేష్ , కె.భావిష్ , కె.వెంకట ప్రణీత్ తేజ, పి.వెంకట సత్య ఆదిత్య, ఎస్డి.హర్షవర్థన్, డి.ప్రసన్న సాయి, కె.దినేష్ మణిరాజ్, అఖిల్ ఎం థామస్, టి.కృష్ణప్రకాష్, ఎవిన్ విల్ఫీ, ఎస్.సుధీర్, జిబిన్ బిజు, ఆనందు ఆర్ గోపాల్, సినో సాజి అబ్రహం ఎంపికయ్యారు. చిలకలపూడి(మచిలీపట్నం): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే శ్రమదానం కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ డి.కె.బాలాజీ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం చెత్తను తీసుకువెళ్లే ట్రాక్టర్ను స్వయంగా నడిపారు. శబ్ద, వాయు కాలుష్యం నివారణలో భాగంగా శనివారం కలెక్టరేట్కు వచ్చే ఉద్యోగులు, ప్రజలు నడక, సైకిల్పై రావాలని గతంలో కలెక్టర్ కోరారు. దీంతో అధికారులు సైకిళ్లపై విధులకు హాజరయ్యారు. కలెక్టరేట్ పరిసరాలను ప్రతి శనివారం అధికారులు, ఉద్యోగులు శుభ్రం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేకరరావు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, వయోజన విద్య ఏడీ బేగ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రామలక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
అన్ ఎయిడెడ్ పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని అన్ఎయిడెడ్ పాఠశాలల హెడ్మాస్టర్లు, కరస్పాండెంట్లతో జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు శనివారం డీఈఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. పరీక్షపై చర్చా కార్యక్రమం ప్రాధాన్యతను వివరించి, విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరచేలా పాఠశాలల్లో అమలు చేయాలని తెలిపారు. రాబోయే ఎస్ఎస్సీ పరీక్షలు–2026కు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ విజయ్, అన్ఎయిడెడ్ పాఠశాలల హెడ్మాస్టర్లు, కరస్పాండెంట్లు పాల్గొన్నారు. పెనమలూరు: గోసాలకు చెందిన వ్యాపారి బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ దొంగలు సొమ్ము కాజేసిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు ఎస్ఐ ఫిరోజ్ కథనం మేరకు గోసాల గ్రామానికి చెందిన వ్యాపారి వి. రమేష్కి కొద్ది రోజుల క్రితం ఫోన్కు వచ్చిన మెసేజ్లో లింక్ ఓపెన్ చేశాడు. వెంటనే అతని బ్యాంక్ ఖాతా నుంచి రెండు దఫాలుగా రూ.2,99,999 సొమ్ము సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్
●డీఎస్పీ ధీరజ్ వినీల్ ●ఐదు బైక్లు, రెండు బంగారు చెవిదిద్దులు స్వాధీనం గుడివాడరూరల్: బైక్లు, ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ తెలిపారు. గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం మల్లాయపాలెం టిడ్కో కాలనీ చివరి హెలిప్యాడ్ వద్ద నుంచి వచ్చిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ ఎన్.చంటిబాబు, తన సిబ్బందితో తనిఖీలు చేపట్టారని, ఈ క్రమంలో పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. వెంటనే ఎస్ఐ వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. టిడ్కో కాలనీలో ఉంటున్న పెమ్మిశెట్టి రామప్రకాష్(25), నైజాంపేటకు చెందిన అబుబకర్ బేగ్ అలియాస్ అబు(23)లను విచారించగా గుడివాడ లక్ష్మీనగర్ కాలనీ, టిడ్కో కాలనీ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరిగిన చోరీలను తామే చేసినట్లు విచారణలో అంగీకరించారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లు, రెండు బంగారు చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.4.50 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితులపై తెనాలి, చల్లపల్లి, గుడివాడ వన్టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జనవరి 2వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో తాలూకా సీఐ ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు, ఎస్ఐ నంబూరి చంటిబాబు, ట్రైనీ ఎస్ఐ టి.లోకేశ్వరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంకిత భావంతో విధులు నిర్వర్తించాలి
కోనేరుసెంటర్: పోలీసు శిక్షణకు వెళుతున్న అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం విధి నిర్వహణను అంకితభావంతో నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండా లని జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు తెలిపారు. జిల్లాలో ఇటీవల పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికై న అభ్యర్థులు విజయనగరం, శ్రీకాకుళం పోలీసుశిక్షణ కేంద్రాల్లో తొమ్మిది నెలల పాటు నిర్వహించనున్న శిక్షణకు శనివారం తరలివెళ్లారు. ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ నాయుడు అభ్యర్థులను అభినందించి శిక్షణకు పంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా అభ్యర్థులు శిక్షణలో అన్ని మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. చట్టాలపై శిక్షణలో పూర్తిగా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, బందరు డీఎస్పీ సీహెచ్ రాజా, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రి నాదెండ్లకు షాకిచ్చిన రైతులు, టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ: మంత్రి నాదెండ్ల మనోహర్కు రైతులు, టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగిందన్న టీడీపీ నేతలు.. గత ప్రభుత్వంలో రైతు భరోసా సక్రమంగా అందిందన్నారు. కూటమి పాలనలో రైతు భరోసా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం(డిసెంబర్ 20) తోట్లవల్లూరు మండలంలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ను మిల్లర్లు తమ కష్టాన్ని దోచేస్తున్నారంటూ రైతులు నిలదీశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతులు.. చంద్రబాబు సర్కార్ గాలితీసేశారు. ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని ఆధారాలతో సహా రైతులు బయటపెట్టారు.రైతులకు మేమే మేలు చేశామని డబ్బాలు కొట్టిన చంద్రబాబు సర్కార్.. ధాన్యం కొనుగోళ్లపై గొప్పలు చెప్పుకుంటుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ సాక్షిగా ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. వైఎస్సార్సీపీ హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్న టీడీపీ నేత తోట సాయిబాబు.. గత ప్రభుత్వంలో రైతు భరోసా సక్రమంగా ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అరకొరగానే ఇచ్చారన్నారు. దీంతో టీడీపీ నేతలు సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడంతో మంత్రి నాదెండ్ల మనోహర్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కంగుతిన్నారు. -
ఎస్జీ అండర్–17 క్రికెట్ చాంపియన్ విశాఖపట్నం
విజయవాడరూరల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్న జెడ్పీ హైస్కూల్ ఆధ్వర్యాన మూడు రోజులపాటు గ్రీన్ఫీల్డ్ మైదానంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ అండర్–17 బాలుర క్రికెట్ చాంపియన్షిప్ను విశాఖపట్నం జిల్లా జట్టు కై వసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో విశాఖ జట్టు శ్రీకాకుళంపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు రోజులపాటు 13 జిల్లాల నుంచి జట్లు పాల్గొనగా శుక్రవారం టోర్నమెంట్ ముగిసింది. టైటిల్ పోరులో విశాఖపట్నం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచు కుంది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. కెప్టెన్ అవినాష్ కేవలం 19 బంతుల్లోనే ఆరు ఫోర్లు, భారీ సికర్స్తో 39 పరుగులు చేశాడు. శ్రీకాకుళం బౌలర్ సాహిల్ క్రమశిక్షణతో బౌలింగ్ చేసి పరుగుల ప్రవాహాన్ని నియంత్రించాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జట్టు విశాఖ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆరు వికెట్ల నష్టానికి 71 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ జోగేంద్ర 22 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. విశాఖపట్నం బౌలర్లు శ్రీరామాంజనేయులు, సాకేత్ అద్భుతంగా రాణించి చెరో రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కార్యదర్శి, కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చాంపియన్స్ విశాఖపట్నం, రన్నరప్ శ్రీకాకుళం, మూడవ స్థానంలో నిలిచిన తూర్పు గోదావరి జిల్లాకు ట్రోఫీలను అందజేశారు. ప్రిన్సిపాల్ ఎన్.గోపాలకృష్ణ, టోర్నమెంట్ పరిశీలకుడు వి.భూపాల్రెడ్డి, స్కూల్ గేమ్స్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, కృష్ణా జిల్లా కార్యదర్శి గంపా రాంబాబు, ఎంపిక కమిటీ సభ్యులు వ్యక్తిగత పతకాలు అందజేశారు. -
వేర్వేరు చోట్ల గుర్తు తెలియని రెండు మృతదేహాలు లభ్యం
కృష్ణలంకలో కలకలం కృష్ణలంక(విజయవాడతూర్పు): వేర్వేరు చోట్ల గుర్తు తెలియని రెండు మృతదేహాలు లభ్యమైన ఘటన కృష్ణలంక ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణలంక 22వ డివిజన్లోని సత్యంగారి హోటల్ సెంటర్లో పాత పోస్టాఫీస్ రోడ్డు మొదట్లో నిచ్చెనల తయారీ వెనుక వైపు ఒక పురుష మృతదేహం ఉన్నట్లు శుక్రవారం ఉదయం 10 గంటలకు సమాచారం అందింది. పాత పోస్టాఫీస్ రోడ్డు ఎదురుగా హైవే వెంట కర్మల భవన్ పక్కన ఉన్న బస్టాప్లో మరో మగ మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలను పరిశీలించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. పాత పోస్టాఫీస్ రోడ్డు మొదట్లో ఉన్న మృతదేహం పక్కన ఒక కవర్లో మద్యం క్వార్టర్ బాటిల్, డబ్బులు, సిగరెట్ పెట్టె ఉన్నాయి. గురువారం రాత్రి పక్కనే ఉన్న వైన్ షాపులో మద్యం క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి సేవించడానికి అక్కడ కూర్చొని ఉండవచ్చని, గుండెపోటు రావడంతో మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బస్టాప్ వద్ద మృతదేహం కుళ్లి దుర్వాసన వస్తుండటంతో రెండు రోజుల క్రితం మృతి చెంది ఉండొచ్చని తెలిపారు. స్థానికులను విచారణ చేసి మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు యాచకులుగా పోలీసులు నిర్ధారించారు. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని నగరపాలక సంస్థ సిబ్బందికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తజన కోలాహలం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం, మార్గశిర అమావాస్య నేపథ్యంలో ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, చండీహోమం, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన సేవ జరిగాయి. నూతన యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో 201 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ.300, రూ.500 క్యూలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమావాస్య నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. సాయంత్రం అమ్మవారికి దర్బారు సేవ, పల్లకీ సేవ, పంచహారతుల సేవలను నిర్వహించారు. రేపు హిందూ ఆత్మీయ సమ్మేళనం లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలో ఎన్టీఆర్ కాలనీ 4వ లైన్లోని మలినేని నాగేశ్వరరావు గ్రంథాలయ హాలులో ఈ నెల 21వ తేదీ హిందూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆ కాలనీ బస్తీ ప్రతినిధి తరుణ్ కాకాని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యఅతిథిగా తాడేపల్లిలోని శివకేశవ పీఠం సంస్థాపక అధ్యక్షుడు మాతా శివానంద సరస్వతి, ముఖ్యవక్తగా ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రాంత కార్యకారిణి సదస్యులు పాకాల త్రినాథ్ హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. హిందువులు కుటుంబ సమేతంగా ఉదయం 8.30 గంటలకు జరిగే సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో ప్రయోగాత్మక స్టాపేజ్ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు రైల్వే మంత్రిత్వశాఖ మచిలీపట్నం–విశాఖపట్నం, విశాఖపట్నం– కడప రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్లో ప్రయోగాత్మకంగా స్టాపేజ్ ఇచ్చింది. మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైలు అర్ధరాత్రి 1.13 గంటలకు కొవ్వూరు చేరుకుని 1.15 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైలు మధ్యరాత్రి 1.23 గంటలకు చేరుకుని, 1.25 గంటలకు బయలుదేరుతుంది. విశాఖపట్నం–కడప (18521) సాయంత్రం 5.23 గంటలకు కొవ్వూరు చేరుకుని, 5.25 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో కడప–విశాఖపట్నం (18522) ఉదయం 5.04 గంటలకు కొవ్వూరు చేరుకుని, 5.05 గంటలకు బయలుదేరుతుంది. 22న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మచిలీపట్నంఅర్బన్: జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ – 2025 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా సైన్స్ అధికారి మొహమ్మద్ జాకీర్ అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 25 మండలాల్లో ముందుగా మండల స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలు నిర్వహించామని తెలిపారు. మండల స్థాయిలో నిర్దేశించిన ఏడు థీమ్లలో ప్రథమ స్థానంలో నిలిచిన ఏడుగురు విద్యార్థులు, ఉపాధ్యాయ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఒక ఉపాధ్యాయుడిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రతి మండలం నుంచి ఎనిమిది చొప్పున మొత్తం 200 ప్రదర్శనలు ఉంటాయన్నారు. వాటినుంచి అత్యుత్తమంగా ఎంపికయ్యే 11 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపిక చేస్తామని తెలిపారు. డివైడర్ ఎక్కి బోల్తా కొట్టిన కారు కృష్ణలంక(విజయవాడ తూర్పు): డివైడర్ ఎక్కి కారు బోల్తా కొట్టిన ఘటన కనకదుర్గ వారధి ఫ్లై ఓవర్ వద్ద జరిగింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు జి.కొండూరుకు చెందిన నాగభూషణం కారు డ్రైవర్. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అతను మైలవరంలో సమీప బంధువులైన ఇద్దరు మహిళలను కారులో ఎక్కించుకుని కంకిపాడులో శుభకార్యానికి వెళ్లారు. అతను అక్కడే మద్యం సేవించాడు. తిరిగి సాయంత్రం బంధువులను కారులో ఎక్కించుకుని బెంజిసర్కిల్ నుంచి కృష్ణలంక హైవే మీదుగా మైలవరం బయలుదేరాడు. సుమారు సాయంత్రం 6.30 గంటలకు రాణిగారితోటలోని కోదండ రామాలయం సమీపానికి చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న అతను గుంటూరు వైపునకు వెళ్లే ప్లైఓవర్పైకి వెళ్లి డివైడర్ను ఎక్కించాడు. కారు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు సీట్బెల్టు ధరించడంతో చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును పక్కకు తీసి వివరాలు సేకరించారు. అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
డీఆర్ఎం కప్ టోర్నమెంట్ ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో తొమ్మిదవ డీఆర్ఎం కప్ ఇంటర్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ మీట్–2025 విజయవాడ రైల్వే స్టేడియం, రాయనపాడు వ్యాగన్ వర్కుషాపులో ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి డీఆర్ఎం, దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహిత్ సోనాకియా రాయనపాడు చీఫ్ వర్క్షాపు మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఏడీఆర్ఎంలు కొండా శ్రీనివాసరావు, పీఈ ఎడ్విన్, డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్, సీనియర్ డీఓఎం ఎం.దినేష్కుమార్తో కలసి పోటీలను ప్రారంభించారు. పురుషులకు క్రికెట్, వాలీబాల్, మహిళలకు త్రోబాల్, టెన్నికాయిట్, 50 ఏళ్ల లోపు, పైబడిన కేటగిరిలో పురుషులు, మహిళలకు అథ్లెటిక్స్లో 100 మీటరు 200 మీటర్లు లాంగ్ జంప్, షాట్ఫుట్లలో ఉద్యోగులు పోటీపడనున్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 200 మంది మహిళా ఉద్యోగులు మొదటి సారిగా పోటీల్లో పాల్గొనడం లింగ వివక్షలేని సమాజానికి నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు. ఇటువంటి క్రీడలు ఉద్యోగుల్లో ఐక్యత, సమాన అవకాశాలను ప్రోత్సహించడంలో డివిజన్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. గత ఏడాదిలో డివిజన్లోని 15 విభాగాల నుంచి 240 మంది ఉద్యోగులు పాల్గొనగా, ఈ ఏడాది 17 విభాగాల నుంచి 650 మంది ఉద్యోగులు పాల్గొనేందుకు ముందుకు రావడం శుభపరిణామన్నారు. ఈ పెరుగుదల రైల్వే ఉద్యోగుల్లో క్రీడలు, ఫిట్నెస్, జట్టు సమష్టి కృషి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
గాంధీ పేరును తొలగించడం దుర్మార్గం
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహాత్మాగాంధీ పేరుతో ఉన్న వాటిని బీజేపీ కూటమి ప్రభుత్వం తొలగించడం సరికాదని వైఎస్సార్ సీపీ ట్రేడ్యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యనారాయణపురం భగత్సింగ్రోడ్డులోని వైఎస్సార్ సీపీ ట్రేడ్యూనియన్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్(వీబీ–జీ రామ్ జీ )గా మార్చడం దుర్మార్గం అన్నారు. బీజేపీ కూటమి జాతిపిత మహాత్మా గాంధీజీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బీజేపీ, కూటమి నాయకుల్లో గాడ్సే రక్తం ప్రవహిస్తోందన్నారు. కార్మిక చట్టాలను విస్మరిస్తున్నారు కార్మిక వర్గాలపై కూటమి ప్రభుత్వం సిగ్గుమాలిన పనులు చేస్తోందని.. కార్మిక చట్టాల్ని విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంట్లో ఈ విధానం తప్పని తెలిపారని.. టీడీపీ ఎంపీలు నోరు మెదపలేదని దుయ్యబట్టారు. ఉపాధిపై చంద్రబాబు ఎందుకు చర్చించడం లేదు ప్రతివారం జోలె పట్టుకొని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వందల కోట్లు తెచ్చుకుంటున్నారన్నారు. చంద్రబాబు గ్రామీణ ఉపాధి పథకం గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. కార్మిక వర్గాల జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నారని.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. గ్రామీణ ఉపాధి పథకం తీసి వేస్తే వారికి నిరుద్యోగ భృతి ఇస్తారా అని ప్రశ్నించారు. కార్మికుల హక్కులు కాలరాస్తే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగలై 12 గంటల పని విధానం తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికులందరికీ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అండగా ఉంటుందని గౌతంరెడ్డి హామీ ఇచ్చారు. -
నకిలీ సిగరెట్ల దందా!
● ఉమ్మడి జిల్లాలో జోరుగా అమ్మకాలు ● లక్షలాది రూపాయల పన్నులు ఎగవేత ● తెలిసినా పట్టించుకోని వాణిజ్యపన్నులశాఖ! ● ఇటీవల వివిధ ప్రాంతాల్లోని ట్రాన్స్ పోర్ట్లో దొరికిన సిగరెట్ల లోడ్లు ● కోటిన్నరకు పైగా సరుకును సీజ్ చేసినట్లు ప్రచారం ● నామమాత్ర జరిమానాతో సరి వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా జోరుగా సాగుతోంది. బెజవాడ కేంద్రంగా అక్రమ పద్ధతుల్లో సిగరెట్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారం మేరకు ట్రాన్స్పోర్టుల్లో దాడి చేసి భారీగా సరుకును స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. దాడుల్లో భారీగా దొరికిన సిగరెట్ల లోడు కొందరు అక్రమార్కులు వివిధ పద్ధతుల్లో విదేశీ సిగరెట్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో తయారయ్యే నకిలీ సిగరెట్లను బెజవాడకు తీసుకువస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని విజయవాడ డివిజన్–1, విజయవాడ డివిజన్–2, విజయవాడ డివిజన్–3 పరిఽధిల్లోని వివిధ ట్రాన్స్పోర్టుల్లో ఇటీవల అధికారులు తనిఖీలు చేశారు. విజయవాడ డివిజన్–1 పరిధిలో భవానీపురం, గొల్లపూడి ప్రాంతాల్లోని ట్రాన్స్పోర్టుల్లో, విజయవాడ డివిజన్–2 పరిధిలోని రాజారంగయ్యప్పారావు వీధిలోని మరో ట్రాన్స్పోర్టులో, విజయవాడ డివిజన్–3 పరిధిలోని తోట్లవల్లూరు రోడ్డులో ఉన్న మరో ట్రాన్స్పోర్టులో భారీగా నకిలీ, విదేశీ సిగరెట్లను భారీ లోడులను స్వాధీనం చేసుకున్నారు. విచ్చలవిడిగా.. ఉత్తరాది రాష్ట్రాల నుంచి, నేపాల్ వంటి దేశాల నుంచి నకిలీ కంపెనీల సిగరెట్లను నగరానికి తీసుకొచ్చి ఇక్కడ దుకాణాలకు అక్రమార్కులు విక్రయిస్తున్నారని విజిలెన్స్ విభాగంలో గతంలో పని చేసిన అధికారులు చెబుతున్నారు. సాధారణ కంపెనీల సిగరెట్లతో పాటుగా వీటిని ఆయా కంపెనీల రకాలతో కలిపి విక్రయిస్తుండటంతో చిరువ్యాపారులకు సైతం తెలియకుండా ఇవి వినియోగదారులకు చేరిపోతున్నాయి. దాడుల్లో తప్ప.. మామూలుగా పట్టుకోవడం లేదు ఏడాది క్రితం రామవరప్పాడులోని ఒక గోడౌన్లో ఉంచిన సుమారు రెండు కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను కేంద్ర ప్రభుత్వ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని సెంట్రల్ జీఎస్టీ అధికారులు, కస్టమ్స్ కమిషనరేట్ సిబ్బంది ఆ సరుకును స్వాధీనం చేసుకొని గుంటూరు తరలించారు. తాజాగా వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయా ట్రాన్స్పోర్టులపై దాడులు చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆయా డివిజన్లు, సర్కిల్ పరిధుల్లో ఉన్న అధికారులకు ఎవరు ఎటువంటి వ్యాపారాలను నిర్వహిస్తున్నారన్నది స్పష్టంగా తెలిసినా ఆ వైపుగా దృష్టి పెట్టడం లేదు. వారి నుంచి వచ్చే ముడుపుల కారణంగానే అధికారులు, సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జరిమానాలపై సర్వత్రా అనుమానాలు ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరిగిన తనిఖీల్లో సుమారుగా కోటిన్నరకు పైగా సిగరెట్ల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. సాధారణంగా బయట దేశాల నుంచి వచ్చే సిగరెట్లపై 28 శాతం పన్ను శాతంగా నివేదికలు చెబుతున్నాయి. దాని ప్రకారం దొరికిన సరుకుకు సుమారుగా పన్ను, జరిమానా కలిపి మొత్తం సుమారుగా కోటి వరకూ ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ కేవలం నామమాత్రంగా పన్ను, జరిమానాలను చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ సంబంధిత వ్యక్తికి నోటీస్లు జారీ చేసింది. అయితే దానికి సైతం అతను కట్టనంటూ ఎదురుతిరిగినట్లు సమాచారం. తొలుత భారీగా సరుకు పట్టుకున్నామని ప్రచారం జరగటం, తరువాత నామమాత్రంగా జరిమానా విధించటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అధికారుల కన్నుసన్నల్లోనే ఈ అక్రమ దందాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నాయని ఒకరిద్దరు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. సిగరెట్ల దందాపై దృష్టి పెడుతున్నాం సిగరెట్ల విక్రయాలు చేసే వ్యక్తులపై దృష్టి పెడుతున్నాం. కొంతమంది ఎన్నిసార్లు దొరికినా తిరిగి ఇదే వ్యాపారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై మా అధికారులను అప్రమత్తం చేస్తాం. అడ్డదారుల్లో నగరానికి వచ్చే సిగరెట్లను పట్టుకోవటానికి చర్యలు చేపడుతున్నాం. రానున్న కాలంలో ఈ దాడులను ఉధృతం చేస్తాం. –ప్రశాంత్కుమార్, జాయింట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, విజయవాడ డివిజన్–1 -
దళారులకే సం‘పత్తి’!
కంచికచర్ల: చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అధికారుల నిర్వాకంతో పత్తి రైతులు దళారీల చేతుల్లో నలిగిపోతున్నారు. సీసీఐ పంట కొనుగోలు చేస్తుందని ఊదరగొట్టినా.. చివరికి దళారీలదే పెత్తనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు సీసీఐ కూడా దళారీలకే మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్భాటంగా ప్రారంభం.. ఎన్టీఆర్ జిల్లాలో రైతులు 87,908 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. అయితే మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కొంత మేర పత్తి పంట దెబ్బతింది. గతంలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే ఈ ఏడాది 5 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చిందని రైతులు అంటున్నారు. పత్తిని కొనుగోలు చేసేందుకు చంద్రబాబు సర్కారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను సంప్రదించింది. ఎన్టీఆర్ జిల్లాలో ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఆర్భాటంగా ప్రారంభించింది. అధికార పార్టీ నాయకులు కూడా దళారుల వద్ద అమ్ముకోవద్దని సీసీఐ ద్వారా పత్తిని విక్రయించాలని రైతులకు చెబుతూ వచ్చారు. కనీస మద్దతు ధరను క్వింటాకు నాణ్యతను బట్టి రూ. 7,710 నుంచి రూ.8,110గా ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ఒక్క దానిలో కూడా పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం లేదు. దళారుల సహకారంతో పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేయించి సీసీఐ అధికారులు లబ్ధి పొందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సీసీఐ, దళారుల మిలాకత్! కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయకపోవటంపై సీసీఐ అధికారులు హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన పత్తిని గుంటూరులోని మిల్లుల వద్దకు రవాణా చేసేందుకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ టెండర్లు పిలిచామని, ఆ టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవటంతో పత్తిని కొనుగోలు చేయలేక పోతున్నామని కుంటి సాకులు చెబుతున్నారు. కాలయాపన చేస్తూ రైతులను అసహానికి గురిచేస్తూ దళారులను రైతులు ఆశ్రయించేలా చేస్తున్నారు. దళారుల నుంచి పత్తి కొనుగోలు చేయటం ద్వారా సీసీఐ అధికారులు మాత్రం ట్రాన్స్పోర్టు కిరాయిని దోచుకుంటున్నారు. ఇప్పటికే రైతుల వద్ద ఉన్న పత్తికి దళారులు క్వింటాకు రూ. 4వేల నుంచి రూ.4,500 లోపు కొంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినా.. తమ పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కంచికచర్లకు చెందిన ప్రజా ప్రతినిధులు, రైతులు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడిని ఇటీవల కలిశారు. కానీ నేటికీ రైతుల నుంచి ప్రభుత్వం కాని, సీసీఐ అధికారులు కాని కొనుగోలు చేయలేదని రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెరిగే దిశగా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గుణదలలోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఆవరణలో ఏర్పాటైన రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలిపారు. సిద్ధాంత పరమైన సమస్యల పరిష్కారానికి ఆలోచనా సామర్థ్యం పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉండే ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించేందుకు వీలవుతుందన్నారు. ఆధునిక ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అందరూ విజేతలే.. కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. ఈశ్వర్ మాట్లాడుతూ ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వాములైన విద్యార్థులంతా విజేతలేనని తెలిపారు. ఈ ప్రదర్శనలో సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, హరిత ఇంధనం, గణిత వినోదం, జల వనరుల నిర్వహణ, వంటి అంశాలను ప్రదర్శించారన్నారు. డీఈఓ ఎల్. చంద్రకళ, పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ వరప్రసాద్, ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ రాంబాబు, పాఠశాల హెచ్ఎం సిస్టర్ షైనీ థామస్ తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్వోల సమస్యల పరిష్కారానికి డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు కోరారు. శుక్రవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న అర్హులైన గ్రేడ్–1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. వన్ టైం సెటిల్మెంట్ కింద రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అర్హులతో భర్తీ చేయాలన్నారు. అర్హులైన గ్రేడ్–2 వీఆర్వోలకు గ్రేడ్ –1, వీఆర్వోలుగా వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్వోలు అందరికీ కామన్ డీడీఓగా తహసీల్దార్లు ఉండేలాగా ఆదేశానివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకే డిపార్ట్మెంట్ కింద.. వీఆర్వోలు అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తారని, ఇతర శాఖల అధికారులు జారీ చేసిన ఆదేశాలు పాటించడం సాధ్యం కాదని రవీంద్రరాజు అన్నారు. బయోమెట్రిక్ విషయంలోనూ జీఎస్డబ్ల్యూ అధికారులు జారీ చేసిన ఆదేశాలు అమలు సాధ్యం కాదన్నారు. వీఆర్వోలు ఈ–ఆఫీసు ద్వారా ఫైల్స్ పంపేందుకు వీలుగా కంప్యూటర్ సౌకర్యం కల్పించాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో వీఆర్వోల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆర్టీజీఎస్ అధికారులు చేస్తున్న చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఏపీ గవర్నమెంట్ రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటు చేసి పనిచేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి మౌళి భాష, గ్రామ సహాయకుల రాష్ట్ర జేఏసీ చైర్మన్ పెద్దన్న, డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర నాయకులు, గ్రేటు–2 వీఆర్వో అసోసియేషన్ నాయకులు శ్యామ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
పరిశ్రమల కల్పనపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఆయన చాంబర్లో జేసీ కలెక్టర్ ఎం. నవీన్తో కలిసి పరిశ్రమల పురోగతిపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీఐఐసీ ద్వారా రెండేళ్లలోపు మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొంది ఇంకా యూనిట్లను ప్రారంభించని దాదాపు 400 మంది పారిశ్రామికవేత్తల జాబితా తయారుచేసి వారి యూనిట్లు వెంటనే నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 30న సమావేశం నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కరించాలన్నారు. ఇంకనూ పరిశ్రమలు నెలకొల్పని వారికి ఎందుకు వాటిని రద్దు పరచకూడదో తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర పథకాల అమలుపై అసంతృప్తి.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ పథకాల అమలులో పురోగతి సరిగా లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద బ్యాంకులలో 39 దరఖాస్తులు ఎటువంటి పురోగతి లేకుండా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని వెంట నే పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖర్, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు స్వాతి, జి. బాలసుబ్రహ్మణ్యం, బీఎస్ హేలా షారోన్, డీఆర్డీఏ పీపీడీ శివప్రసాద్, డ్వామా పీడీ హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
దుర్గమ్మ సన్నిధిలో దేవదాయ శాఖ మంత్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు, చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రా లను బహూకరించారు. అనంతరం ఈవో చాంబర్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో చర్చించారు. భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లు, దేవస్థానంలో ఇటీవల చేపట్టిన మార్పులు, అదనపు కౌంటర్లు, ఆన్లైన్ సేవల గురించి అధికారులు వివరించారు. కార్యక్ర మంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీక్ష విరమణల సమయంలో తయారు చేసిన లడ్డూలను శుక్రవారం కూడా దేవస్థానం ఉచితంగా పంపిణీ చేసింది. గురు, శుక్రవారాలలో మొత్తం 1.30 లక్షల లడ్డూలను ఉచితంగా పంపిణీ చేసినట్లు దేవస్థాన అధికారులు, చైర్మన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవానీ దీక్ష విరమణల నిమిత్తం మొత్తం 28.08 లక్షల లడ్డూలను తయారు చేయగా, 24.49 లక్షల లడ్డూలను విక్రయించినట్లు అధికారులు పేర్కొన్నారు. దేవస్థానం వద్ద 4.61 లక్షల లడ్డూల స్టాక్ ఉండగా, వాటిలో 3.32లక్షల లడ్డూలను విక్రయం నిమిత్తం కౌంటర్లలో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మిగిలిన 1.30లక్షల లడ్డూలను ఉచిత ప్రసాద వితరణ బదులుగా గురు, శుక్రవారాల్లో ఆలయ ప్రాంగణంలోని వేరు వేరు ప్రదేశాల్లో భక్తులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిఽధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విశాఖపట్నం గాజువాకకు చెందిన పీతల సునీల్కుమార్ కుటుంబం రూ. లక్ష, ప్రకాశం జిల్లా పుల్లెల చెరువుకు చెందిన టి. బ్రహ్మానందరెడ్డి కుటుంబం టి. కోటిరెడ్డి పేరిట రూ. 1,01,116, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కొండిశెట్టి వెంకట విఠల్ భాస్కర్ తన కుటుంబ సభ్యులైన కె. సత్యనారాయణమ్మ, అంజయ్య ల పేరిట రూ. 1,00,116 విరాళాన్ని అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పక డ్బందీ ఏర్పాట్లతో విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 966 పోలియో బూత్ల పరిధిలో దాదాపు 2,48,900 మంది సున్నా నుంచి అయిదేళ్లలోపు పిల్లలు లక్ష్యంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, ప్రజా రవాణా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులు కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. 611 గ్రామీణ బూత్లు, 355 అర్బన్ బూత్లు, 71 మొబైల్ బృందాలు, 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా బృందాలు సేవలందిస్తాయన్నారు. 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే.. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని కలెక్టర్ చెప్పారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా అధికారులు చూడాలన్నారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, ఆర్డీవోలు పాల్గొన్నారు. -
ఆత్మస్తుతి.. పరనింద!
మొక్కుబడిగా డీఆర్సీ సమావేశం చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా సమీక్ష సమావేశం మొక్కుబడిగా సాగింది. గంటా నలభై నిమిషాలు ఆలస్యంగా వచ్చిన మంత్రులు.. ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహనానికి పరీక్ష పెట్టారు. సమావేశం ప్రారంభమైన తర్వాత కూడా జరగాల్సిన విధంగా జరగలేదు.. తూతూ మంత్రంగానే సాగింది. అంతా ఆత్మస్తుతి, పరనింద అన్న చందంగా సాగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాల కారణంగా తలెత్తుతున్న సమస్యలను సైతం గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ.. తాము చేసేదే గొప్ప అన్నట్లుగా సమావేశం నడిచిందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో శుక్రవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి 2 గంటలకు హాజరు కావాల్సిన మంత్రి వాసంశెట్టి, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి 3.40 గంటలకు వచ్చారు. దీనిపై అవనిగడ్డ ఎమ్మెల్యే(జనసేన) మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహిస్తే పరిపూర్ణంగా నిర్వహించాలని.. లేకుంటే మరో రోజుకు వాయిదా వేయాలని, ఇలా చేస్తే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ నుంచి విజయవాడ కరకట్ట రోడ్డు పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. మిల్లర్ల జోక్యాన్ని నివారించండి.. అనంతరం వ్యవసాయ అనుబంధ శాఖలపై చర్చ ప్రారంభంకావటంతో మంత్రి సుభాష్ మాట్లాడుతూ మోంథా తుపానును సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. రాబోయే వేసవి కాలం నాటికి ఇసుకను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని దీని ద్వారా ఇళ్ల నిర్మాణం, భవన నిర్మాణ కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు రూ. 8కోట్ల నిధులు జిల్లా పరిషత్కు కేటాయించారని జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఆర్డర్లు తమకు వచ్చాయని కృష్ణాజిల్లాకు సంబంధించి ఆర్డర్లు రాలేదని వివరించారు. అయినప్పటికీ కృష్ణాజిల్లాకు సంబంధించిన నిధులను బట్టి కేటాయించిన పనులకు సంబంధించిన ఫైలు తాము తిరస్కరించామని పత్రికల్లో సీఈవో కన్నమనాయుడు తనపై వార్తలు రాయిస్తున్నారని మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా గత సర్వసభ్య సమావేశంలో జరిగిన సంఘటనను బట్టి కలెక్టర్ ఇచ్చిన హామీని కూడా లెక్క చేయకుండా మరలా 205 పనులు రద్దు చేస్తూ తనకు లేఖ రాశారని చెప్పారు. పనులు ప్రారంభమైనవి కూడా ప్రారంభం కాన్నట్లుగా చూపుతున్నారని.. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఆమె కోరారు. -
నాడు పత్తిని రూ.7వేలకు కొన్నారు..
గ్రామంలో 20 ఎకరాలు పత్తి పంట సాగుచేశా. తుపాను దెబ్బకు ఎకరానికి నాలుగు క్వింటాళ్లు పత్తి మాత్రమే దిగుబడి వచ్చింది. జగన్ ప్రభుత్వంలో క్వింటా పత్తిని రూ.7.500కు కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని కిలో కూడా కొనలేదు. ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవటం లేదు. కనీసం పత్తి పంట దెబ్బతిన్నా ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీరుతాయో అర్థం కావటంలేదు. – షేక్ మొహిద్దీన్ పాషా, రైతు, మోగులూరు, కంచికచర్ల మండలం -
కన్నతల్లిని, జన్మభూమిని మరువకూడదు
గుడివాడ టౌన్: వునిషి ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కన్న తల్లినీ, జన్మభూమినీ మరువ కూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నాట్స్ ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాలులో గురువారం నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటించాలన్నారు. యువత ప్రకృతి సమతుల్యతను పాటించేందుకు ప్రయత్నించాలన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలన్నారు. నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ తన జన్మభూమిని గుర్తు ఉంచుకుని గుడివాడలో 30 విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, డాక్టర్ భవాని శంకర్, డాక్టర్ పాలడుగు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు -
భక్తులకు ఉచితంగా లడ్డూల పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీక్ష విరమణలలో తయారు చేసిన లడ్డూలను దేవస్థానం గురువారం ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేసింది. భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని దేవస్థానం భారీగా లడ్డూలను తయారు చేసింది. అయితే చివరి రోజైన సోమవారం భక్తులు, భవానీల రద్దీ అంతంత మాత్రంగానే ఉండటంతో లడ్డూ విక్రయాలు తగ్గాయి. దీంతో దేవస్థానం వద్ద భారీగా లడ్డూ స్టాక్ ఉండటంతో గురువారం ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో భక్తులకు వాటిని ఉచితంగా పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే మార్గంలో రెండు ప్రదేశాల్లో, మహా మండపం లిప్టు ఎదుట, ఘాట్రోడ్డు మార్గంలో డోనర్ సెల్ వద్ద సేవా సిబ్బంది, ఆలయ అర్చకులకే లడ్డూలను పంపిణీ జరిగింది. మరో వైపున భక్తులు ఇదే అవకాశంగా ఒక్కోక్కరు ఒకటికి, రెండు సార్లు క్యూలైన్లో నిల్చోని లడ్డూలను పొందారు. దీంతో ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్, మహా మండపం దిగువన లడ్డూ కౌంటర్లు విక్ర యాలు లేక వెలవెలపోయాయి. దీక్ష విరమణలకు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన తిరుగు ప్రయాణమైన శానిటేషన్, సెక్యూరిటీ, దేవదాయ శాఖ, పోలీసు, ఇతర విభాగాలకు చెందిన వారికి సైతం దేవస్థానం లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేయడం విశేషం. అయితే ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి మాత్రం ఉచిత లడ్డూ ప్రసాదాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మహిళలకు ఇళ్లలోనూ రక్షణ కరువు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. కనీసం ఇళ్లల్లో కూడా మహిళలు స్వేచ్ఛగా ఉండలేని భయానక వాతావరణం నెలకొనడం సిగ్గుచేటని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ్నగర్లోని నార్త్జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో బుధవారం గంజాయి బ్యాచ్ వీరంగంతో గాయపడిన గుమ్మళ్ల కుసుమ కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన గురువారం పరామర్శించారు. గంజాయి బ్యాచ్ సభ్యులు చేసిన ఆగడాల గురించి బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీసిన వీడియోలను చూసి నివ్వెరపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని విమర్శించారు. టీడీపీ నాయకుల వత్తాసు సిగ్గుచేటు.. అమాయక ప్రజల ధన, మాన, ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడని గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు టీడీపీ నాయకులు వత్తాసు పలకడం సిగ్గుచేటని గౌతమ్రెడ్డి విమర్శించారు. ఇళ్లల్లో చొరబడి రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం ప్యాకెట్లతో అలజడి చేసి ఇళ్లను ధ్వంసం చేసి చిన్నపిల్లలను సైతం బూతుపురాణాలతో చంపేస్తామని బెదిరించిన మానవ మృగాలను కాపాడేందుకు టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిళ్లు తీసుకురావడం దారుణమన్నారు. ఇటువంటి విధానాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని.. కూటమి ప్రభుత్వ పాలకులు ఇటువంటి విధానాలను వీడకుండా నేరాలను, నేరస్తులను ప్రోత్సహిస్తే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తోందని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల చేతుల్లో పావులుగా మారకుండా చట్టపరంగా.. న్యాయపరంగా నడుచుకోవాలని కోరారు. వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి సింగ్నగర్లో గంజాయి బ్యాచ్ చేతిలో గాయపడిన మహిళ కుటుంబానికి పరామర్శ -
కేంద్రాలపై ప్రభుత్వం చిన్న చూపు
● పౌషకాహార లోపంతో చిన్నారులు ● అంగన్వాడీల్లో స్పెషల్ డైట్ ఊసే ఎత్తని సర్కారు ● దొడ్డుబియ్యం ఇస్తుండటంతో తినలేకపోతున్న చిన్నారులు ● గత వైభవం కోల్పోయిన అంగన్వాడీలు లబ్బీపేట(విజయవాడతూర్పు): చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. ఫలితంగా ఎదుగుదల లోపిస్తోంది. వయస్సుకు తగిన ఎత్తు, బరువు సక్రమంగా ఉండటం లేదు. ప్రభుత్వం సైతం అలాంటి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతా ల్లోని అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో 20 నుంచి 30 శాతం మంది ఇలాంటి పిల్లలు ఉన్నట్లు సమా చారం. అందుకు ఇటీవల జక్కంపూడి ప్రాంతంలోని ఒక అంగన్వాడీ సెంటర్ను ఓ జిల్లా అధికారి తనిఖీ చేయగా, అక్కడ ఉన్న 20 మందిలో 8 మంది పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించడమే నిదర్శనంగా కనిపిస్తోంది. వారికి ప్రత్యేక డైట్ ఏమైనా ఇస్తున్నారా అంటే అదేమీ లేదని తేలింది. అంతేకాదు పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ఇచ్చే ప్రత్యేక డైట్పై అంగన్వాడీలకు సైతం సరైన అవగాహన లేక పోవడం కొసమెరుపు. లావు బియ్యం, పుచ్చిన కందిపప్పు.. అంగన్వాడీల్లో చిన్నారులకు ప్రతిరోజూ మధ్యాహ్నం పప్పు, ఆకుకూరల భోజనంతో పాటు, ఉడికించిన గుడ్డు, వంద మిల్లీలీటర్ల పాలు ఇవ్వాలని మెనూలో ఉంది. కానీ అక్కడ పెట్టే భోజనం చిన్నారులు తినలేక పోతున్నట్లు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో ఇచ్చే దొడ్డు(లావు) బియ్యమే అంగన్వాడీలకు ఇస్తుండటం, ఒక్కోసారి కందిపప్పు సైతం నాణ్యతాలోపం ఉండటంతో చిన్నారులు తినలేక పోతున్నట్లు చెబుతున్నారు. నూనె, ఇతర సరుకులు కూడా అంత నాణ్యత ఉండటం లేదు. దీంతో అంగన్వాడీల్లోని చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. మరోవైపు పోషకాహారలోపం ఉన్న వారికి అదనంగా డైట్ ఇవ్వాల్సి ఉన్నా, అది సరిగా అమలు కావడం లేదు. దీంతో పోషకాహార లోపం చిన్నారులకు శాపంలా మారుతుంది. గర్భిణులకూ నాసిరకమే.. ఏడాదిగా గర్భిణులకు సరఫరా చేసే రాగి పిండిలో ఇసుక తగులుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం రాగి పిండి సరఫరా చేయడంతో ఇలా జరుగుతోందని వారు అంటున్నారు. అంతేకాకుండా చిక్కీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినది నాణ్యతగా ఉండేదని, కానీ ఇప్పుడు తినలేక పోతున్నామంటున్నారు. మరోవైపు పాలు లీటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారని, అవి ఫ్రిడ్జ్ లేని వాళ్లు ఎలా స్టోరేజ్ చేసుకుని తాగాలని ప్రశ్నిస్తున్నారు. అరలీటరు ప్యాకెట్స్ ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకూ వైఎస్సార్ సీపీ పాలనలో అంగన్వాడీలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే నిత్యావసరాలు నాణ్యతతో ఉండేలా చూశారు. ముఖ్యంగా సన్నబియ్యం సరఫరా చేయడంతో చిన్నారులు ఇష్టంగా తినేవారు. ఎవరైనా పోషకాహార లోపంలో చిన్నారులకు ఉంటే వారికి ప్రత్యేక డైట్ అందించేవాళ్లు. అలా మూడు నెలలు ఇచ్చినా బరువు పెరగకపోతే, వారికి న్యూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్(ఎన్ఆర్సీ)కు రిఫర్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్పెషల్డైట్ సక్రమంగా అందక పోగా, ఎన్ఆర్సీ సెంటర్కు కూడా రిఫర్ చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదు. దీంతో చిన్నారులకు బరువు తక్కువగా ఉంటూ, చలాకీగా ఉండలేక పోతున్నారు. అంగన్వాడీల్లో పిల్లలందరికీ రొటీన్ డైట్ ఇస్తాం. పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఉంటే, వారికి జీర్ణ లోపం ఉందేమో గుర్తించి, వారికి ఆహారం ఎలా పెట్టాలో తల్లికి కౌన్సెలింగ్ ఇస్తాం. స్పెషల్ డైట్ అంటూ ఏమీలేదు. – రుక్సానా, పీడీ, ఐసీడీఎస్, ఎన్టీఆర్ జిల్లా -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
విస్సన్నపేట: రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న గురుదేవ్ మహాపాత్రో(23)సంఘటన స్థలంలోనే మృతి చెందిన సంఘటన గురువారం విస్సన్నపేట– నూజివీడు రోడ్డులో జరిగింది. మృతుడు విస్సన్నపేటలో ఒక కార్ల షోరూమ్లో స్పేర్పార్ట్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులతో కలసి కొండపర్వలో నివాసం ఉంటున్న గురుదేవ్ మహాపాత్రో ఉదయం విధులకు హాజరయ్యేందుకు స్కూటర్పై ఇంటి నుంచి విస్సన్నపేట వస్తుండగా మలుపు వద్ద లారీ వెనుక భాగం తగిలి తలకు బలమైన గాయం అయి తీవ్ర రక్తస్రావం జరగటంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్కూటీ నడుపుతున్న మృతుడి హెల్మెట్ లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. వెనుకనే వస్తున్న డీసీఎం వ్యాను, దాని వెనుక వస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. స్కూల్ బస్లో ఉన్న విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు. న్యాయం చేయండి.. మృతుడు తల్లి మధుస్మిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. కాగా వీరి స్వగ్రామం ఒడిశా రాష్ట్రం పూరి జిల్లా మల్లూ గ్రామం, అయితే కొండపర్వ గ్రామం వద్ద ఉన్న ఫ్యానుల కంపెనీలో వైడింగ్ పని మేసీ్త్రగా తన భర్త సురేష్ మహాపాత్రో పనిచేస్తుండటంతో కుటుంబం కొండపర్వ గ్రామంలో నివాసం ఉంటున్నామని మృతుడి తల్లి మధుస్మిత పేర్కొన్నారు. డ్యూటీకి వస్తున్న క్రమంలో తన కుమారుడు ఈ విధంగా రోడ్డుప్రమాదంలో మృతి చెందాడని, మృతికి కారణమైనవారిని పట్టుకొని తమకు తగున్యాయం చేయాలన్నారు. చేతికంది వచ్చిన కుమారుడు ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో రక్తపు మడుగులో మృతి చెంది ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకొని విలపించారు. -
పొగముంచు.. గమనించు!
నాగాయలంక మండలంలో మంచు కమ్మేసింది. గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచే దట్టంగా కమ్ముకున్న మంచుతో ఉదయాన్నే పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, ట్యూషన్లకు వెళ్లే విద్యార్థులు, స్వచ్ఛత పనులకు కదిలే పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు పడ్డారు. ఉదయం 8గంటల దాటినా మంచు దుప్పటి వీడక పోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరికివారు జాగ్రత్తగా ముందుకు కదిలారు. – నాగాయలంక ఉదయాన్నే మంచు, చలి నుంచి ఊరట పొందేందుకు టీ స్టాల్స్కు క్యూ కట్టిన శ్రామికులు ఉదయం 8.30గంటల వేళ బయటకు వస్తున్న భానుడు వర్షంలా కురుస్తున్న మంచు మధ్యనే.. -
21న పల్స్ పోలియో
మచిలీపట్నంఅర్బన్: చిన్నారుల భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలు తప్పక వేయించాలని కృష్ణా జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ తెలిపారు. పోలియో నిర్మూలన లక్ష్యంగా జిల్లాలో ఈ నెల 21న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని గురువారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు ఒక్క చిన్నారూ మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయించడమే లక్ష్యంగా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తమైందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు మొత్తం 1,39,180 మంది ఉన్నట్లు అంచనా వేశామని వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు 1,94,160 డోసులను సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమం విజయవంతానికి జిల్లాలో మొత్తం 4,898 మంది సిబ్బందిని నియమించామన్నారు. పెనమలూరు: మద్యానికి బానిసగా మారిన వ్యక్తి బందరు కాలువలో దూకి గల్లంతైన ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు ఇందిరానగర్కు చెందిన దేవల దుర్గారావు(33) మట్టి పని చేస్తాడు. అతనికి భార్య మరియ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దుర్గారావు మద్యానికి బానిసగా మారటంతో భార్య, పిల్లలు పుట్టింటికి ఐదు నెలల క్రితం వెళ్లి పోయారు. భార్య, పిల్లలు వెళ్లి పోవటంతో మనస్తాపం చెందిన దుర్గారావు విపరీతంగా మద్యం తాగడం ప్రారంభించాడు. కాగా బుధవారం దుర్గారావు యనమలకుదురు లాకుల వద్ద బందరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. కాలువలో అతని ఆచూకీ తెలియకపోవటంతో ఈ ఘటనపై తల్లి తిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ెపదపారుపూడి: ఎదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొన్న ఘటనలో యవకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన పెదపారుపూడిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ రూరల్ మండలం కాశిపూడి గ్రామానికి చెందిన చప్పిడి అజయ్(24) గ్రామం నుంచి బైక్పై గుడివాడ పట్టణానికి వెళ్తుండగా పెదపారుపూడి గ్రామంలోని రామాలయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు, బైక్ను ఢీకొనటంతో అజయ్ బైక్పై నుంచి కిందకు పడిపోయాడు. చిక్సిత నిమిత్తం గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే సొంత గ్రామానికి వచ్చాడు. మృతుడికి అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఉన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): బీఫార్మసీ రెండు, మూడు సెమిస్టర్ల రెగ్యులర్ ఫలితాలను గురువారం సీఈ ఆలపాటి శివప్రసాద్ విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో 31వ తేదీలోగా సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు ఫీజు రూ.2,070 చెల్లించాలన్నారు. అలానే వ్యక్తిగత పరిశీలనకు రూ.2,190 చెల్లించాలని సూచించారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్షల విరమణ ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.4.49 కోట్ల ఆదాయం సమకూరింది. గురువారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.3,21,22,542 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మహా మండపం ఆరో అంతస్తులో కానుకలు లెక్కించారు. బుధవారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.1,27,90,645 కోట్ల ఆదాయం వచింది. రెండు రోజుల్లో రూ.4,49,13,187 నగదు, 218 గ్రాముల బంగారం, 17.324 కిలోల వెండి సమకూరింది. 190 యూఎస్ఏ డాలర్లు, 25 కెనడా డాలర్లు, 15 యూఏఈ దిర్హమ్స్, 23 మలేరియా రింగట్స్, 101 ఖత్తర్ రియాన్స్, 100.5 ఓమన్ బైంసాలు లభించాయి. కానుకల లెక్కింపును ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించగా, దేవస్థాన సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు. మచిలీపట్నం – ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక రైలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు మచిలీపట్నం – ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక వన్ వే రైలు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రు ప్కర్ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం 4.20 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, 24న తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రయాగ్రాజ్ చేరుతుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్లు, పెద్దపల్లి, మాచర్ల, సిర్పూర్ కాగజ్నగర్, బల్హార్షా, చంద్రాపూర్, నాగ్పూర్, బినా, వీరంగన లక్ష్మీభాయ్ జంక్షన్, ఒరై, గోవింద్పురి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. విజయవాడ–కాచిగూడ ప్రత్యేక రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు. ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్ మీదుగా కాచిగూడ చేరుకుంటుంది. పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈ నెల 21వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిద్దామని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. పల్స్ పోలియోపై యూపీ హెచ్సీ వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ ఎంలు, బూత్ వలంటీర్లకు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురువారం శిక్షణ ఇచ్చారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయాలని స్పష్టంచేశారు. తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మాత్రమే వైద్యుడి సంప్రదించా లని సూచించారు. జిల్లాలో 966 పోలియో బూత్లలో 2,48,900 మంది పిల్లలకు చుక్కల మందు వేయాలన్నది లక్ష్యమని వివరించారు. ఈ సమావేశంలో వీఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ అర్జునరావు, ఏఎంఓహెచ్ డాక్టర్ బాబుశ్రీనివాసరావు, డాక్టర్ గోపాలకృష్ణ, డీఐఓ డాక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన నగరంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల(గుణదల)లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్)ను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులలో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రొత్సహించే లక్ష్యంతో వివిధ స్థాయిల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా పాఠశాల, మండల స్థాయిలో నిర్వహించిన విజేతలతో జిల్లా స్థాయి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన నమూనాలను రాష్ట్ర స్థాయిలో, అక్కడ విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయికి పంపిస్తామని వివరించారు. మండల స్థాయిలో గ్రూప్ ఎగ్జిబిట్స్ ఏడు చొప్పున, విద్యార్థుల వ్యక్తిగత ఎగ్జిబిట్స్ రెండు, ఉపాధ్యాయులు వ్యక్తిగత ఎగ్జిబిట్స్ రెండు చొప్పున ప్రదర్శనలో ఉంటా యని వివరించారు. -
సమస్యలపై చర్చ జరిగేనా?
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) తొమ్మిది నెలల తరువాత శుక్రవారం జరగనుంది. గత డీఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు సమాచారాన్ని సంబంధిత అధికారులు మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాల్సి ఉంది. తొమ్మిది నెలల తరువాత డీఆర్సీ సమావేశం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇది మూడో సమావేశం. గత డీఆర్సీ తూతూమంత్రంగా సాగింది. ఈ సమావేశంలో అయినా ప్రస్తుతం జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలపై చర్చ జరుగుతుందో లేదోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశం అజెండాలో వ్యవసాయ అనుబంధ శాఖలతో పాటు విద్య, వైద్యం, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, గృహనిర్మాణం, పరిశ్రమలు తదితర శాఖలకు సంబంధించి అంశాలను పొందుపరిచారు. రైతుల సమస్యలపై చర్చ సాగేనా..? జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు డీఆర్సీ జరగనుంది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై చర్చ జరిగేనా అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. పంట కోతకొచ్చే సమయంలో మోంథా తుపాను ప్రభావం వల్ల జిల్లాలోని చాలా మండలాల్లో ఈదురుగాలులకు పైరు నేలవాలింది. ధాన్యం రాశులు వర్షానికి తడిచిపోయాయి. దీంతో ధాన్యంలో తేమ శాతం రైతులను వేధించింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని రైతులు పోరాటం చేసినప్పటికీ తేమశాతం తగ్గిస్తేనే కొనంటామని అధికారులు తెగేసి చెప్పారు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తూ మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల జిల్లాలో పర్యటించినప్పుడు ధాన్యం కొనుగోళ్లపై రైతులు నిలదీశారు. ఇప్పటికీ జిల్లాలో సగానికిపైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ధాన్యం సేకరణ, రైతుల ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందో, లేదో వేచి చూడల్సి ఉంది. జిల్లాలోని ప్రతి మిల్లులో తేమశాతం తగ్గించేందుకు డ్రయ్యర్లు ఏర్పాటు చేయాలని గత సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. వలసలపై చర్యలేవి? కృష్ణాజిల్లా నుంచి పేదలు ఎక్కువగా వలస వెళ్తున్నారని, దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారిం చటం లేదని గత సమావేశం దృష్టికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీసుకువచ్చారు. జిల్లాలో అన్యాక్రాంతమైన భూములపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కలెక్టర్ వివరించాల్సిన అవసరం ఉందని యార్లగడ్డ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడలేని మనం ఇలా సమావేశాలు నిర్వహించటం వృథా అని ఆయన తేల్చి చెప్పారు. పశుసంవర్ధకశాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాల్సిన అవసరం ఉంది. అన్నిశాఖల అధికారులందరూ జిల్లా కేంద్రమైన బందరులో కచ్చితంగా ఉండాల్సిందేనని మంత్రి కొల్లు రవీంద్ర గత సమావేశంలో స్పష్టంచేశారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అయినప్పటికీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోతో పాటు కొంతమంది అధికా రులు తప్ప ఎక్కువశాతం అధికారులు ఇప్పటికీ విజయవాడ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మంత్రి సూచనలు, కలెక్టర్ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదు. అధికారులు జిల్లా కేంద్రంలో నివాసం ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే సమస్యల పరిష్కారంలో చొరవ చూపొచ్చని గత సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన నేపథ్యంలో అటువంటివి ఏమీ ప్రస్తుతం జరగటం లేదు. ఈ సమావేశంలో ఈ విషయంపై ఎంత మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారో చూడాల్సి ఉంది. -
విద్యాహక్కు చట్టంలో సవరణ తీసుకురావాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసు కురావాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరిచాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో గురువారం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం 2009 క్లాజ్ 23(2) సవరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పని సరిగా టెట్ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఇప్పటికీ నాలుగు నెలలైనా, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రివ్యూ పిటీషన్ వేయకపోవటాన్ని తప్పుపట్టారు. వెంటనే కోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి.మనోహర్ కుమార్, జిల్లా ప్రధాన కార్య దర్శి సుందరయ్య మాట్లాడుతూ.. ఆప్షన్ హాలిడే విని యోగించుకోవడంలో, రెండో శనివారం సెలవులు, ఏకోపాధ్యా యులు ఓహెచ్, ఇతర సెలవులు వినియోగించుకోవడంలో అధికారుల మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విజయవాడ కార్పొరేషన్ పరి ధిలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు -
కృష్ణా జిల్లా
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం నాగాయలంక: మాస శివరాత్రి సందర్భంగా స్థానిక శ్రీరామ పాద క్షేత్రంలోని పుష్కర ఘాట్ వద్ద ఉన్న గంగ, పార్వతి సమేత రామలింగేశ్వరస్వామికి గురువారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 41.9308 టీఎంసీలు. గుడివాడటౌన్: ఏఎన్నార్ కాలేజీ వజ్రోత్సవాలు గురు వారం ఘనంగా ముగిశాయి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్టౌన్(విజయవాడ పశ్చిమ):వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజయవాడలో గురువారం ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి మద్దతుగా తరలివచ్చిన ప్రజలు జననేతకు సంఘీభావం తెలిపారు. ప్రైవేటీకరణపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని కోటి సంతకాల రూపంలో గవర్నరకు తెలియజేయడానికి అభిమాన నేత నగరానికి చేరుకోవటంతో పార్టీ శ్రేణులతో పాటుగా భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పట్టి సంపూర్ణ మద్దతు తెలిపారు. నేతాజీ వంతెన నుంచి అంబేడ్కర్ స్మృతి వనం వరకు.. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నేతాజీ వంతెన వద్ద వేలాది మంది వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు నీరాజనాలు పలికారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. వందలాది కార్లు, వేలాది ద్విచక్ర వాహనాలతో భారీ సంఖ్యలో ప్రజలు వెంటరాగా పశువుల ఆస్పత్రి సెంటర్ వద్ద బందరు రోడ్డులోకి జననేత కాన్వాయ్ ప్రవేశించింది. అక్కడి నుంచి బందరు రోడ్డు మీదుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్మృతి వనం వద్దకు చేరుకుంది. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్మృతి వనం వద్ద పార్టీ నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ పార్టీ శ్రేణులు నినదించాయి. అక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో చేపట్టిన ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందించేందుకు తరలివెళ్లారు. దారి పొడవునా జై జగన్.. జైజై జగన్ అన్న నినాదాలు మిన్నంటాయి. అడుగడుగనా ఆంక్షలు.. నగరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సంద ర్భంగా అడుగడుగునా ఆంక్షలు విధించారు. బందరురోడ్డు పరిసరాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అంబేడ్కర్ స్మృతి వనం నుంచి గవర్నర్ బంగ్లాకు జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు, పోలీసులు బారికేడ్లు పెట్టి ఇబ్బందులు పెట్టారు. జననేత వెంట జనం ముందుకు సాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, ఆంక్షలు విధిస్తూ ఎటూ వెళ్లడానికి లేకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ సుమారు మూడు గంటల పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వేలాది మంది ప్రజలు అనుసరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణకుమార్, రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెలంపల్లి, మల్లాది విష్ణు, పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. 7ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న చర్యలు దారుణం. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు రానున్న రోజుల్లో వైద్య విద్య అందకుండాపోతుంది. ప్రభుత్వం తక్షణం ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలి. పేద, మధ్య తరగతి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలి. వారికి వైద్య విద్యను చేరువ చేయాలి. – కై లా భరత్ భూషణ్, బీఎస్సీ విద్యార్థి, యనమలకుదురు, పెనమలూరు మండలం -
గన్నవరం: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
గన్నవరం: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. గురువారం(డిసెంబర్ 18వ తేదీ) రాత్రి గం. 8.10ని.లకు టేకాఫ్ కావాల్సిన విమానం.. సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. టేకాఫ్ అవుతున్న సమయంలోనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, ఈరోజు ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుండి కోజికోడ్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (IX 398)లో గురువారం ఉదయం సమస్య ఏర్పడటంతో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.ఎయిరిండియా విమానం కోజికోడ్కు వెళ్తుండగా, కుడి వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్, టైర్లో సమస్య ఏర్పడింది. దాంతో వెంటనే విమానాన్ని కొచ్చి వైపు మళ్లించి ఉదయం 9 గంటల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ నిర్వహించారు.ఇదీ చదవండి:ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం -
క్వార్టర్ ఫైనల్స్కు చేరిన క్రికెట్ పోటీలు
విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ బుధవారం ప్రారంభమైంది. ఈ పోటీలను వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ, కరస్పాండెంట్ ఎన్.సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీని నున్నలో రెండు మైదానాలు, సూరంపల్లిలో ఒక మైదానంలో లీగ్–కమ్– నాకౌట్ పద్ధతి నిర్వహిస్తారు. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. ప్రారంభ మ్యాచ్లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా ప్రకాశంపై 102 పరుగుల భారీ తేడాతో, కృష్ణా జిల్లాపై 35 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. విజయనగరంపై విశాఖపట్నం పది వికెట్ల తేడాతో, కర్నూ లుపై గుంటూరు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచాయి. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆతిథ్య కృష్ణా జిల్లా ప్రకాశంపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించింది. కృష్ణా బౌలర్ యశ్వంత్ అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం.అరుణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, టోర్నీ పరిశీలకుడు డి.భూపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ టి.విజయవర్మ పాల్గొన్నారు. -
ఐదంచెల సాగు.. లాభాలు బాగు
●ఎకరాకు రూ.3 లక్షల నికర ఆదాయం ●సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ప్రచారకుడు విజయరామ్ గూడూరు: వ్యవసాయంలో మూస పద్ధతికి స్వస్తి పలికి ఐదంచెల సాగు ద్వారా రైతులు లాభాలు గడించొచ్చని నిరూపిస్తున్నారు సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ప్రచారకుడు ఎం.విజయరామ్. గూడూరు మండలం తరకటూరులోని సౌభాగ్య గో సదన్లో చేపట్టిన ఐదంచెల సాగు విధానం ద్వారా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎకరాకు రూ.3 లక్షల నికర ఆదాయం పొందొచ్చని చేసి చూపించారు. ఈ నెల 15వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఐదంచెల సాగు విధానంపై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 60 x 60 నమూనా ఐదంచెల సాగు విధానంలో 60 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో వ్యవసాయ క్షేత్రాన్ని సిద్ధం చేశారు. ఎకరం పొలాన్ని 7 1/2 అడుగుల మడులుగా విభజించారు. ప్రతి మడి తరువాత చిన్నపాటి కలువను తవ్వించారు. కాలువ మధ్యలో ఉన్న దిబ్బలపై పసుపు నాటి, అంతర పంటలుగా 20 అరటి, 36 మునగ, 16 బొప్పాయి, వట్టివేరు తదితర పంటలను సాగు చేస్తున్నారు. సాధారణ సాగు పద్ధతిలో ఉపయోగించే నీటిలో ఐదంచెల సాగు పద్ధతిలో మూడు శాతం నీటిని మాత్రమే అవసరం అవుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పద్ధతిలో పంటల నుంచి లాభాలు గడించొచ్చని విజయరామ్ పేర్కొంటున్నారు. 6 టన్నుల పసుపు దిగుబడి వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన పసుపు పంట ద్వారా దాదాపు ఆరు టన్నుల పసుపు దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు విజయరామ్. దీంతో పాటు సాగు చేస్తున్న మునగ, వట్టివేరుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక మునగ చెట్టుకు సరాసరి రెండు కిలోల మునగాకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కిలో రూ.300 పలుకుతుండగా వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన 36 చెట్ల ద్వారా 72 కిలోల మునగాకు దిగుబడి వస్తుంది. దీనిని డ్రయ్యర్లో పొడి చేయడం ద్వారా ఆకు పాడవకుండా పొడి చేసి ఇతర ప్రాంతాలకు దీనిని ఎగుమతి చేస్తున్నారు. 81 రకాల మొక్కల సాగు ఐదంచెల విధానంలో మొత్తం 81 రకాల పండ్ల, ఆకుకూరలు, కూరగాయలు, తదితర మొక్కలు పెంచేలా విజయరామ్ ఏర్పాట్లు చేశారు. ప్రతి 60 అడుగులకు ఒక మామిడి, నేరేడు, సపోటా, పనస, మధ్యలో జామ, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, అంజీర, ఉసిరి, బిల్వ, మారేడు వంటి చెట్లను పెంచుతున్నారు. వీటి మధ్య ఆవాలు, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి, జీలకర్ర, సోంపుతోపాటు తోటకూర, గోంగూర, బచ్చలి కూర, మొంతి కూర, కొత్తిమీర, ఎర్రతోటకూర, పచ్చతోటకూర, పాలకూర తదితర ఆకుకూరలు, బెండ, టమాట, వంకాయ, చిక్కుడు, సొరకాయ, పొట్లకాయ, బీరకాయ, కాకరకాయ, దోస కాయ, నేతి బీర కాయ వంటి కూరగాయలు, అల్లం, కంద, ముల్లంగి, బీట్రూట్, చామదుంప, వంటి దుంపలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలోనే సాగు విజయరామ్ సాగు చేస్తున్న పంటలకు ఎక్కడా రసాయనాలు వినియోగించడం లేదు. ప్రకృతి వ్యవసాయ విధానంలో వినియోగించే ఆవు పేడ, మూత్రంతో పాటు ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసి వాటి ద్వారానే పంటలను సాగు చేస్తున్నారు. ఫలితంగా పంట దిగుబడులకు మార్కెట్లో మంచి రేటు లభిస్తోంది. ఈ విధా నంలో పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యవంతమైన జీవనం సాగించడానికి అవకాశం లభిస్తుందని, భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం అరికట్టవచ్చని విజయరామ్ పేర్కొంటున్నారు. కార్పొరేట్ కొలువుల వైపు పరిగెత్తుతూ నగరాల్లో కాలుష్య కోరల్లో క్షణం తీరిక లేని జీవనం గడుపుతున్న యువతను వ్యవసాయ రంగంలోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని విజయ రామ్ అంటున్నారు. కూలీలపై ఆధారపడకుండా కష్టపడి పనిచేస్తే ఒక్క ఎకరం పొలంలో ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం సాధించొచ్చని పేర్కొన్నారు. 15 ఏళ్ల పాటు శ్రమించి ఈ ఐదంచెల విధానం రూపొందించడం జరిగిందని ఆయన అన్నారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని తన ద్వారా మరింత మందికి తీసుకువెళ్లాలన్న బృహత్తర లక్ష్యంతో డిసెంబర్ 15 నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని రైతులకు ఐదంచెల విధానంపై క్షేత్ర స్థాయ అవగాహన కార్యక్రమం రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. -
ఆరుగురు గంజాయి విక్రేతలు అరెస్టు
పెనమలూరు: మండలంలోని పెదపులిపాక గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిపై కేసు నమోదుచేసిన పెనమలూరు పోలీసులు వారిని అరెస్టు చేశారు. సీఐ జె.వెంకటరమణ కథనం మేరకు..పెదపులిపాక గణపతినగర్లోని ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఆరుగురు వ్యక్తులు గంజాయితో ఉన్నారన్న సమాచారం పోలీసులకు అందింది. స్పందించిన పోలీసులు ఆ ప్రాంతంపై దాడిచేసి గంజాయితో ఉన్న కానూరు మురళీనగర్కు చెందిన చెందిన జువ్వనపూడి శశికాంత్, ఉయ్యూరు వెంకటవంశీకృష్ణ, ప్రసాదంపాడుకు చెందిన వి.దుర్గారావు, ఆకుల వెంకటమాధవ్, పెదపులిపాక గణపతినగర్కు చెందిన ఆకులపల్లి మౌనిక, పెనమలూరు పల్లిపేటకు చెందిన గోగం ఫణికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు భద్రాచలం నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న పొట్లాలుగా కట్టి విక్రయిస్తున్నారని విచారణలో తేలింది. నిందితుల వద్ద 2,250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గన్నవరంలో గంజాయి స్మగ్లర్ అరెస్టు కోనేరుసెంటర్(మచిలీపట్నం): గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని గన్నవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పూణేకు చెందిన దీపక్ తుపే ఒడిశాలో రాజ్కుమార్, సురాన్కర్ణ వద్ద 112 కిలోల గంజాయి కొన్నాడు. పూణేలో వైష్ణవిలవన్కు అందిం చేందుకు కారులో ఒడిశా నుంచి బయలుదేరాడు. దీపక్ తుపే గన్నవరం సమీపంలోని బీబీగూడెం అండర్ పాస్ వద్ద చేరుకున్న సమయంలో పోలీ సులు వాహనాలను తనిఖీచేస్తుండటంతో కంగారుపడ్డాడు. అతడిని గమనించిన గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్ కారును తనిఖీ చేయగా రూ.5.60 లక్షల విలువైన 112 కిలోల గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు దీపక్ తుపేపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఒడి శాకు చెందిన రాజ్కుమార్, సురాన్కర్ణ, పూణేకు చెందిన వైష్ణవిలవన్ను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. స్మగ్లర్ను పట్టుకున్న గన్నవరం పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ బి.వి.శివప్రసాద్, ఈగల్ టీం సీఐ ఎం.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లుగా ఎంపికై న అక్కాచెల్లెళ్లకు సత్కారం
ఇబ్రహీంపట్నం: తొలి ప్రయత్నంలో కానిస్టేబుళ్లుగా ఎంపికై న అక్కాచెల్లెళ్లు రత్నశ్రీ, జయశ్రీని పలువురు బుధవారం అభినందించారు. జి.కొండూరు మండలం భీమవరప్పాడు గ్రామానికి చెందిన వంగూరి చిట్టిబాబు పోలీస్ శాఖలో హోం గార్డుగా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు తేజ బసవశ్రీ, రత్నశ్రీ, జయశ్రీ ఉన్నారు. పెద్ద కుమార్తె తేజ బసవశ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిశారు. రెండో కుమార్తె రత్నశ్రీ, మూడో కుమార్తె జయశ్రీ సివిల్ పోలీళ్లుగా ఎంపికయ్యారు. ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యా లయం వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో రత్నశ్రీ, జయశ్రీని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా చాప్టర్ ఏర్పాటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికారిక ఎంఎస్ఎంఈ వ్యవస్థ లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా చాప్టర్ ఏర్పాటైంది. మహాత్మాగాంధీ రోడ్డులోని అమరావతి హౌసింగ్స్లో ఏర్పాటు చేసిన ఈ శాఖను జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ మోహన్ సుందరం ఏపీ అధ్యక్షుడు తులసీ యోగీష్ చంద్రతో కలిసి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ సుందరం మాట్లాడుతూ.. లఘు ఉద్యోగ భారతి దేశం వ్యాప్తంగా 68 వేల ఎంఎస్ఎంఈ యూనిట్ల సభ్యత్వం కలిగి ఉందన్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద ఎంఎస్ఎంఈ సంస్థని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా కార్యవర్గం ఇదే.. లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడిగా వెలగపూడి సాంబశివరావు, కార్యదర్శిగా చెరుకూరి చాముండేశ్వరి, జాయింట్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ తరుణ్ కాకాని, ఉపాధ్యక్షులుగా టి.వెంకట నాగేశ్వరరావు, అన్నే శ్రీనివాసరావు, శ్రీరామ్, కార్యదర్శులుగా జె.అభినయ్కృష్ణ, యార్లగడ్డ హరీష్, కార్యనిర్వాహక సభ్యులుగా దొడ్డపనేని కల్యాణ్ కృష్ణ, ప్రణీత్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. -
ఎలా రద్దు చేస్తారు..
పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేసి పనులు కేటాయింపులు జరిపి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తరువాత ఎలా రద్దు చేస్తారు? నిధుల రాబడి అంచనాలు రూపొందించిన తరువాతే పనుల కేటాయింపు జరిగింది. గత సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ ఇచ్చిన హామీని సీఈవో లెక్క చేయటం లేదు. చైర్పర్సన్, పాలకవర్గ సభ్యులకు సమావేశం నిర్వహించి పనులపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఈవో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు. – వేముల సురేష్బాబు, గూడూరు జెడ్పీటీసీ -
పీపీపీపై జనకోటి కన్నెర్ర
కృష్ణాజిల్లాగురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సంతకాలతో నిరసనాగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రజలు● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ● ఆ ప్రతులను నేడు గవర్నర్కు అందించనున్న వైఎస్ జగన్ ● ఉమ్మడి జిల్లా నుంచి 8.25 లక్షల సంతకాలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): మెడికల్ విద్యను పేదలకు దూరం చేసే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న పీపీపీ విధానంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించి ఆ ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కు నివేదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ క్రమంలో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన సంతకాల పత్రాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాష్ట్ర గవర్నర్ను కలిసి అందించనున్నారు. జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ఉద్యమానికి కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా మిగిలిన రాజకీయపక్షాలు, విద్యార్థి సంఘాలు సైతం స్పందిస్తున్నాయి. దీంతో చంద్రబాబు సర్కార్ బెంబేలెత్తుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి 8.25 లక్షల సంతకాలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి భారీ స్పందన లభించింది. రెండు జిల్లాల్లోని 14 నియోజకవర్గాల నుంచి ప్రజలు తమ సంతకాల ద్వారా చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ (పశ్చిమ), విజయవాడ (తూర్పు), విజయవాడ (సెంట్రల్), నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల నుంచి 4.25 లక్షల సంతకాలు రాగా, కృష్ణాజిల్లా నుంచి మచిలీపట్నం, గుడివాడ, పామర్రు, పెనమలూరు, పెడన, అవనిగడ్డ, గన్నవరం నియోజకవర్గాల నుంచి సుమారుగా నాలుగు లక్షల ప్రజల నుంచి సంతకాలను పార్టీ శ్రేణులు సేకరించాయి. ఆయా సంతకాల పత్రాలను 15వ తేదీన రెండు జిల్లాల నుంచి నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. ఉద్యమిస్తున్న రాజకీయ, విద్యార్థి సంఘాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలకు వైద్య విద్యను చేరువ చేసే లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వాటిల్లో కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కళాశాలలను పూర్తి చేసి తరగతులను సైతం ప్రారంభించారు. మరో రెండు కళాశాలలు అందుబాటులో వచ్చే సమయానికి ఎన్నికలు రావటంతో చంద్రబాబు సర్కార్ గద్దనెక్కింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానం అంటూ తన అనుకూల వర్గీయులకు మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకు కుట్రకు తెరలేపారు. దీనిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రజా ఉద్యమం కొనసాగుతూ ఉండగా అదేబాటలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు రోడ్డుపైకి వస్తున్నాయి. 7గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టారు. అవి పూర్తయితే నాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యలో మంచి అవకాశాలు వచ్చేవి. కాని ప్రభుత్వం మారినంత మాత్రానా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గ చర్యగా భావిస్తున్నా. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ప్రైవేటీకరణను ఆపాలి. – కుక్కమళ్ల బ్యూలా, బీటెక్ విద్యార్థి, కంచికచర్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఫీజులు భారీగా పెరిగి వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుంది. వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు అధికంగా పాల్గొని ప్రభుత్వంపై వ్యతిరేకత చాటారు. గవర్నర్ సైతం ప్రైవేటీకరణపై తుదినిర్ణయం తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలని కోరుతున్నాం. – జి.హేమంత్, బీటెక్ విద్యార్థి, మైలవరంప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్య విద్యను దూరం చేసినట్లే. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. – వెనుగుర్తి హరి, జగ్గయ్యపేటప్రభుత్వ దంత వైద్య కళాశాల 2020 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు బుధవారం వెటర్నరీ కాలనీలోని ఓ ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగాయి. గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.యుగంధర్ బుధవారం గుడ్లవల్లేరు పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేశారు. మందుల పంపిణీ, వార్డులను పరిశీలించారు. గుడివాడటౌన్: గుడివాడలో బుధవారం సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు కుటుంబసభ్యులతో హాజరయ్యారు. సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర అట్టడుగు వర్గాలకు వైద్య విద్యను దూరం చేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యంగా ఉంది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. – సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ ప్రభుత్వమే ప్రజల ప్రాథమిక హక్కులైన విద్యా, వైద్య రంగాలను కళ్ల ముందు కాజేస్తూ, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పీడీఎస్వో ఖండిస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల ిపీపీపీ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. యువగళం పాదయాత్రలో జీవో నంబర్ 107, 108ను రద్దు చేసి 100 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామన్న హామీని ఎందుకు నిలబెట్టుకోరని ప్రశ్నిస్తున్నాం. – ఏ సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్వో -
ఏకపక్షంగా 205 పనులు రద్దు చేసిన సీఈఓ
● కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతర్ ● గత పాలకవర్గ సమావేశంలో నిలదీసినా వెనక్కి తగ్గని వైనం ● అధికారిని వెనకుండి నడిపిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ● సీఈఓ నిర్ణయంపై భగ్గుమంటున్న పాలక వర్గ సభ్యులు సాక్షి ప్రతినిధి, విజయవాడ/మచిలీపట్నం: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన పనులను రద్దు చేస్తూ సీఈవో కన్నమనాయుడు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆయన పాలక వర్గం నిర్ణయాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై పాలక వర్గ సభ్యులు భగ్గుమంటున్నారు. గత పాలక వర్గ సమావేశంలో పనుల రద్దు అంశంపైన సమావేశంలో గందరగోళం నెలకొంది. సీఈవో తీరును నిరసిస్తూ సభ్యులు నిరసన చేపట్టారు. కలెక్టర్ హామీతో సభ్యులు శాంతించారు. అయితే మరలా ఈ నెల 19వ తేదీన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ సీఈవో కె. కన్నమనాయుడు తన మొండి వైఖరి విడనాడకుండా, సమావేశంలో ఆమోదించిన పనులను రద్దు చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతి నిధులకు మంచి పేరు ఎక్కడ వస్తుందోనని ఆందోళన చెందుతున్న అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జిల్లా పరిషత్ సీఈఓను పావుగా వాడుకొంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లా పరిషత్ పాలకవర్గం ఆమోదించిన పనులకు నిధులు లేవంటూ సాకులు చూపుతూ రద్దు చేసి, ‘నేనింతే’ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు సూచించిన పనులకు నిధులు వెచ్చిస్తున్నారు. పాలకవర్గంపై అక్కసుతోనే.. జిల్లా పరిషత్ పాలకవర్గం ఆయా సభ్యులకు కేటాయించిన రూ.12.74కోట్లకు సంబంధించి 205 పనులు నిలిపివేస్తూ జెడ్పీ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి చైర్పర్సన్కు లేఖ పంపినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులకు చెందిన పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ పాలకవర్గం వైఎస్సార్ సీపీది కావటంతో వారిపై అక్కసుతో కావాలనే ఈ రకంగా సీఈవో వ్యవహరిస్తున్నారని సభ్యులు వాపోతున్నారు. గత సర్వసభ్య సమావేశం ముందు రూ. 24.75 కోట్లకు చెందిన 424 పనులను రద్దు చేశారు. దీంతో సభ్యులు సమావేశంలో ఒక్కసారిగా సమావేశాన్ని స్తంభింపజేసి పనులను ఎందు కు నిలిపివేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. రద్దు చేసిన పనులు ఇవి.. నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాలకు ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేశారు. గుడ్లవల్లేరు, బంటుమిల్లి మండలాలకు శ్మశానవాటికలు లేవని, దహన సంస్కారాలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆయా పంచాయతీలోని ప్రజలు విన్నవించగా 25 పంచాయతీలకు టెండర్ ద్వారా పనులను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ఇబ్రహీంపట్నంలోని రూ.90 లక్షల విలువగల పనులకు శంకుస్థాపన సైతం చేసినట్లు గత జెడ్పీ సర్వసభ్య సమావేశం దృష్టికి జెడ్పీ వైస్ చైర్సర్సన్ శ్రీదేవి తెచ్చారు. గత సర్వసభ్య సమావేశంలో పనుల రద్దు విషయంలో సభ్యులు చేసిన పోరాటానికి కలెక్టర్ డీకే బాలాజీ స్పందిస్తూ చైర్పర్సన్, సీఈవో, ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి పనులు ఎంత వరకు వచ్చాయి? ఏ పనులు పూర్తయ్యాయి? అనే విషయాలను చర్చిస్తామని.. అనంతరం నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీని సైతం తుంగలో తొక్కి ఏకపక్షంగా 205 పనులను సీఈఓ రద్దు చేయడంపై సభ్యులు మండిపడుతున్నారు. పనుల రద్దు సమయంలో కలెక్టర్ ఇచ్చిన హామీనీ ఓ అధికారి, సీఈఓ దృష్టికి తీసుకొని వస్తే, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. చైర్మన్, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం పెట్టకుండానే నిర్ణయం తీసుకోవడం ఆయన మొండి వైఖరికి అద్దం పడుతుందనే భావన పలువురిలో వ్యక్తం అవుతోంది. -
తక్షణమే విరమించుకోవాలి..
చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కార్పొరేట్లకు కారు చౌకగా అప్పజెప్పే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా ఒక్క పాఠశాల కానీ, కళాశాల కానీ, విశ్వవిద్యాలయం కానీ నిర్మించడం చేతకాలేదు. కానీ గత ప్రభుత్వంలో నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాసులకు కక్కుర్తి పడి కార్పొరేట్లకు లీజుకు ఇవ్వడం సరైన పద్ధతి కాదు. – ఎం. సాయికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ -
దుర్గమ్మ హుండీ ఆదాయం లెక్కింపు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణలలో అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. తొలి విడత లెక్కింపులో రూ.1.27కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన కానుకల, ముడుపులు, మొక్కుబడుల లెక్కింపులో మొత్తం రూ. 1,27,90, 645 నగదు, 18 గ్రాముల బంగారం, 2.474 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. గురువారం కూడా కానుకల లెక్కింపు జరుగుతుందని అధికారులు ప్రకటించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఇతర అధికారులు పర్యవేక్షించారు. పైడమ్మతల్లి హుండీ ఆదాయం రూ.5.47లక్షలు పెడన: పట్టణ పరిధిలోని పైడమ్మ తల్లి ఉత్సవాలు ముగియడంతో బుధవారం అధికారుల పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించినట్లు ఈఓ గోవాడ వెంకటకృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల ముగిసిన 70 రోజుల పైడమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి రూ. 5,47,633 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆయన చెప్పారు. అలాగే 700 మిల్లీగ్రాముల బంగారం, 128 గ్రాముల వెండి వస్తువులు వచ్చాయన్నారు. ఉత్సవాలు అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డి. వాయునందన్రావు పాల్గొన్నారు. పీవీన్వీ ప్రసాదరావు పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. -
మాకేం సంబంధం లేదు!
● బీఎస్సీ(ఎంఎల్టీ) విద్యార్థుల సమస్యలపై హెల్త్ వర్సిటీ వీసీ చంద్రశేఖర్ ● వర్సిటీ ఎదుట నిరసన తెలిపిన విద్యార్థులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని 2021– 22 సంవత్సర బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాలల నుంచి వచ్చిన బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థులు డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ను బుధవారం కలిశారు. ప్రధానంగా 2021–22 సంవత్సర బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థులకు ఇంటర్న్షిప్ను ఆప్షనల్గా పెట్టాలని లేదా గరిష్టంగా ఆరు నెలలకు పరిమితం చేసి, ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థుల నుంచి ఇంటర్న్షిప్ పేరుతో ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదనీ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్న్షిప్ కారణంగా పొడిగించిన సంవత్సరానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్న్షిప్ సమయంలో కనీసం నెలకు రూ.6,000 స్టైఫండ్తో పాటు వారాంతాల్లో సెలవు ఇవ్వాలని కోరారు. మేం ఏం చేయలేం.. విద్యార్థుల డిమాండ్లపై వీసీ సానుకూలంగా స్పందించకపోవటంతో పాటు తాము ఏం చేయ లేమని స్పష్టం చేసినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజులు వసూలు చేయమని తాము చెప్పలేదని, కనుక తమకు సంబంధం లేదని, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టి స్టైఫండ్ రిలీజ్ చేయడం కుదరదని పేర్కొన్నారని చెప్పారు. దాంతో విద్యార్థులు బయటకు వచ్చి యూనివర్సిటీ ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. -
హాస్టల్ విద్యార్థులకు కలుషిత నీరు.. తప్పు ఒప్పుకున్న చంద్రబాబు
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులకు కలుషిత నీరు అందించినట్లు సీఎం చంద్రబాబు అంగీకరించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ..‘హాస్టళ్లలో నీళ్లు సరిగా లేవు, బాత్రూమ్లు సరిగా లేవు. కలుషిత నీరు ఇవ్వడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇది మనందరం సిగ్గుపడే విషయం’ అని అన్నారు. ఇన్నాళ్లూ మంత్రులు హాస్టళ్లలో నీటి సమస్య లేదని, కలుషితం కాలేదని బుకాయించారు. కానీ ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాస్టళ్లలోని దుస్థితిని బయటపెట్టారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించగా.. ఇప్పుడు తన పాలనా వైఫల్యాల్ని చంద్రబాబు సైతం అంగీకరించడం గమనార్హం. -
సీఎం చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేర్లను మార్చి తన ఖతాలో వేసుకున్న చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు. ఇవాళ విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పేరును మార్చి ఇకపై వాటిని ‘స్వర్ణ గ్రామం’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ గ్రామంలోనే అన్ని ప్రభుత్వ సేవలను పొందే అవకాశం కలిగింది. పలు శాఖల పనులను ఒకే కేంద్రంలో సమీకరించడం వల్ల ప్రజలకు సేవలు మరింత సులభతరం అయ్యాయి. కొత్త పేరుతో కొనసాగింపుఅయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం, ఈ వ్యవస్థను కొనసాగిస్తూ..దానికి కొత్త పేరు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘స్వర్ణ గ్రామాలు’ అనే పేరుతో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు.చంద్రబాబుపై విమర్శలుచంద్రబాబు నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ సృష్టించిన వ్యవస్థకు పేరు మార్చి క్రెడిట్ తీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. -
మా కోసం పోరాడతానన్నారు
మా ఇళ్లు కూల్చివేత తరువాత న్యాయం చేయాలని కోరుతూ కలవని ప్రజాప్రతినిధి లేరు. కనీసం ఘటనా స్థలానికి వచ్చిన వారు లేరు. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు వెళ్లి కలిశాం. మా బాధలను ఆలకించిన ఆయన మా ప్లాట్ల వద్దకు వస్తానని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జగన్మోహన్రెడ్డి వచ్చారు. నలభై రెండు మందికి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. విశ్వసనీయతకు మారు పేరైన ఆయన మాలో నమ్మకం కల్పించారు. మా గుండెల్లో బాధను తగ్గించారు. – గోదావరి గంగ, బాధితురాలు -
కుంగ్ఫూలో తేజ్వీర్కు స్వర్ణపతకం
మచిలీపట్నంఅర్బన్: తండ్రి క్రీడా విజయాల బాటలో కుమారుడు కూడా అగ్ర స్థానానికి చేరుకున్నాడు. మచిలీపట్నానికి చెందిన అంతర్జా తీయ కిక్బాక్సింగ్ విజేత చలాది సతీష్ కుమారుడు చలాది తేజ్వీర్ (09) కుంగ్ఫూలో జాతీయ స్థాయిలో స్వర్ణపతకం సాధించాడు. ఈ నెల 14న చిలకలూరిపేటలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ నేషనల్ లెవల్ కుంగ్ఫూ, కరాటే చాంపియన్షిప్ 2025లో 25 కిలోల లోపు కాటా ఈవెంట్లో తేజ్వీర్ జాతీయ విజేతగా నిలిచి స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు. తేజ్వీర్ తండ్రి సతీష్ గత ఏడాది న్యూఢిల్లీలో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్బాక్సింగ్ ఇండియా (వాకో) ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రెండు రజత పత కాలు సాధించారు. ఇప్పుడు అతని కుమారుడు జాతీయ స్థాయిలో విజయం సాధించడం విశేషం. -
చెట్టుకింద ఉంటున్నాం
జోజినగర్ 42 ప్లాట్లలో మాది 29వ ప్లాటు. 2001లో కొనుగోలు చేశాం. ఇంటి పన్నులు కూడా చెల్లించాం. మూడేళ్ల క్రితం రూ.30 లక్షల బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. స్టే ఉండగానే నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూల్చి నిలువ నీడ లేకుండా చేశారు. చెట్టుకింద ఉంటున్నాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. మా బాధ చెప్పుకొనేందుకు ఎయిర్ పోర్టు, ఇంటి వద్ద రెండు సార్లు జగనన్నను కలిశాం. పరామర్శకు వస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వచ్చారు. మా తరఫున ప్రభుత్వంపై పోరాడుతానన్నారు. మాకు ధైర్యం ఇచ్చారు. జగనన్నకు రుణపడి ఉంటాం. – యమున, బాధితురాలు -
సబ్జైలులో జిల్లా జడ్జి తనిఖీలు
అవనిగడ్డ: జిల్లా న్యాయమూర్తి జి.గోపీ మంగళవారం అవనిగడ్డ సబ్జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమాండ్ ఖైదీలతో మాట్లాడారు. జైలులో అందుతున్న భోజన వసతి గురించి తెలుసుకున్నారు. స్టోర్ రూం, వంట గదిని న్యాయమూర్తి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. జైలు ప్రాంగణం అంతా కలియ తిరిగి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గోపీ మాట్లాడుతూ.. బెయిల్ కోసం న్యాయవాదులను పెట్టుకోలోని రిమాండ్ ఖైదీల కోసం న్యాయవాదులను ఏర్పాటు చేస్తామనానరు. ఖైదీల ప్రవర్తన గురించి జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, అవనిగడ్డ సీనియర్ సివిల్ జడ్జి కె.అరుణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వర్ణలత ఓల్గా, జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సనకా రఘురామప్రసాద్, న్యాయవాది దామెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
జీవితాలతో బెట్టింగ్ ఆట
జి.కొండూరు: సంక్రాంతి సంబరాలు అంటూ నిర్వహిస్తున్న కోడిపందేల శిబిరాల వద్ద బెట్టింగ్ క్రీడలు జోరుగా సాగుతున్నాయి. శిబిరాల వద్దకు సరదాగా గడిపేందుకు వస్తున్న చిన్నారులు, యువకులను బెట్టింగ్ క్రీడలు ఆకర్షిస్తున్నాయి. పండుగ మూడు రోజుల సెలవుల్లో యువకులు, చిన్నారులు సరదాగా బెట్టింగ్ గేమ్లను ఆడడం పరిపాటిగా మారింది. ఈ సరదా వారిని బెట్టింగ్లకు బానిసగా మారుస్తోంది. చిన్న వయస్సులోనే ఆన్లైన్ గేమ్లు, బెట్టింగ్లకు అటవాటు పడిన యువకులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు, చోరీలకు తెగబడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది జిల్లాలో 70కిపైగా శిబిరాలు ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది సంక్రాంతి సంబరాల పేరుతో అనధికారికంగా 70కిపైగా కోడిపేందేల శిబిరాలు నడిచాయి. ఈ శిబిరాల ఏర్పాటుకు ముడుపులు, అద్దెల కోసం భారీగా ఖర్చు పెడుతున్న నిర్వాహకులు ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు పేకాటతో పాటు బెట్టింగ్ గేమ్లకు విచ్చలవిడిగా అనుమతినిచ్చారు. కోడిపందేలు నేరమని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంప్రదాయం పేరుతో ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో పోలీసులు అటు వైపు వెళ్లే అవకాశం లేకుండా పో యింది. కోడిపందేల శిబిరాల నిర్వాహకులు ఆదాయం కోసం బెట్టింగ్ గేమ్లకు అనుమతి ఇవ్వడంతో మూడు రోజులు పాటు చిన్నారులు, యువకులు పేకాట, కోసు ఆట, లోన – బయట, రాజు – రాణి, నలుపు – తెలుపు, బొమ్మలాట, నంబర్లాట, చిన్న బజారు – పెద్ద బజారు, మూడు ముక్కలాట, బొమ్మాబొరుసు వంటి ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ సరదా సంక్రాంతి సంబరాలు ముగిశాక ఆన్లైన్ గేమ్లు, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడేలా చేస్తోంది. బెట్టింగ్లకు డబ్బుల కోసం లోన్ యాప్ల నుంచి అప్పులు చేయడం, డబ్బు దొరకనప్పుడు చోరీలు, ఇతర నేరాలకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. వెలుగు చూసిన ఘటనల్లో కొన్ని.. -
లంచం తీసుకుంటూ దొరికిన ఉద్యోగికి రిమాండ్
విజయవాడలీగల్: గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలవరం కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్రింటింగ్ టెక్నీషియన్ నగేష్బాబుకు న్యాయమూర్తి ఈ నెల 30 వరకూ రిమాండ్ విధించారు. వివరాలివి.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు సంబంధించి విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జునకు ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు నగేష్బాబు రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో నాగార్జున అవినీతి నిరోధక శాఖ అధికారుల(ఏసీబీ)కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు వలపన్ని నగేష్బాబు తన కార్యాలయంలో లంచం మొత్తం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడిని మంగళవారం అవినీతి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి పి.భాస్కరరావు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఈనెల 30వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయ వాడ జిల్లా జైలుకు తరలించారు. కారుణ్య నియామకంలో ఆపరేటర్గా ఉద్యోగంలో చేరిన నగేష్బాబు 2022 నుంచి అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తిరువూరు: గంపలగూడెం మండలం వినగడప తండాలో మంగళవారం కిడ్నీ రోగి మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన భూక్యా సత్యం(47) పదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఏకొండూరు మండలం కుమ్మరికుంట్లకు చెందిన సత్యం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వివాహమైన తదుపరి వినగడప తండాలో నివసిస్తూ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న నీటి కారణంగా కిడ్నీవ్యాధికి గురైన సత్యం నాలుగేళ్లుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో, తదుపరి తిరువూరులో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. గత శనివారం తిరువూరు ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్ యూనిట్లో డయాలసిస్ చేస్తున్న సమయంలో అతనికి రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడంతో పరిస్థితి విషమించి అపస్మారక స్థితికి చేరాడు. హుటాహుటిన సత్యంను విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అసలే పేదరికం కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సత్యం కుటుంబం అతని చికిత్స నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ
మచిలీపట్నంటౌన్: స్థానిక బైపాస్రోడ్డు హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ మంగళవారం రాత్రి జరిగింది. మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్తో కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ చేపట్టిన ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన యాత్ర’ బందరుకు చేరిన సందర్భంగా వాజ్పేయి విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహ ఏర్పాటును తొలుత టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పోటీగా ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు యత్నించడంతో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో వాజ్పేయి, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని జనవరి 18న ఆవిష్కరిస్తారని సమాచారం. -
పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి
పిల్లలు సున్నిత మనసుతో ఉంటారు. దేనికైనా వెంటనే ఆకర్షితులవుతారు. తిరునాళ్లు, జాతర్లు, సంక్రాంతి సంబరాల వద్ద నిర్వహించే బెట్టింగ్ గేమ్లను సరదాగా ఆడుతూ వాటికి ఆకర్షితులు అవుతారు. తల్లిదండ్రులు ఆ ఆటల వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. బెట్టింగ్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. నిరంతరం పిల్లలపై పర్య వేక్షణ లేకపోతే వారు బెట్టింగ్లకు బానిసయ్యే ప్రమాదం ఉంది. – డాక్టర్ జి.అజయ్కుమార్, పిల్లల వైద్య నిపుణుడు, మైలవరం -
నీడ లేకుండా చేశారు
కుటుంబంతో ఒకటో నంబరు ప్లాట్లో నిర్మించిన ఇంటిలో నివసిస్తున్నా. ప్లాటుకొనుగోలు చేసే సమయంలో లీగల్ ఓపీనియన్ తీసుకున్నాం. ఎవ రికై నా అభ్యంతరాలు ఉంటే తెలపాలని పేపరు ప్రకటన కూడా ఇచ్చాం. ఎవరి నుంచీ అభ్యంతరాలు రాలేదు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి రూ.70 లక్షలతో ప్లాటు కొనుగోలు చేశాం. అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే ఇంటి నిర్మాణం చేపట్టాను. ఇప్పుడు కొందరు గద్దల్లా వాలిపోయారు. 42 ప్లాట్లలో ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేసి, మాకు నిలువ నీడ లేకుండా చేశారు. – విద్యాసాగర్, బాధితుడు, జోజినగర్ -
మ్యాజిక్ బస్తో కేయూ అవగాహనా ఒప్పందం
కోనేరుసెంటర్: కృష్ణా యూనివర్సిటీ పలు సంస్థలతో చేసుకుంటున్న అవగాహన ఒప్పందాల్లో భాగంగా మంగళవారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఐబీఎం సంస్థతో సమన్వయంగా రానున్న 11 నెలల కాలంలో కృష్ణా యూనివర్సిటీలోని కళాశాలలు, దాని అనుబంధ కళాశాలలకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక టూల్స్తో లైఫ్ అండ్ ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ మీద విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించనుంది. అనంతరం ఆ సంస్థ ఆధ్వర్యంలోనే కొన్ని బహుళ జాతి సంస్థలలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. వర్సిటీ వీసీ ఆచార్య కె. రాంజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, వర్సిటీ శిక్షణ, ఉపాధి అవకాశాల డైరెక్టర్ ఆచార్య వైకే సుందరకృష్ణ, మ్యాజిక్ బస్ సంస్థ నుంచి డీజీఎం డి. శేఖర్బాబు, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సీహెచ్ మోహన్ సంస్థ ప్రతినిధులు శౌర్య, రత్న ప్రసాద్, పుష్పలత పాల్గొన్నారు. -
జియోడెటిక్ అసెట్ మ్యాప్ల ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కచ్చితమైన పటాల(మ్యాపుల) తయారీకి, సర్వేకు జియోడెటిక్ అసెట్ రిజిస్టర్ ఎంతగానో దోహదపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో జియోడెటిక్ అసెట్ రిజిస్టర్, రాష్ట్ర జియోడెటిక్ అసెట్ మ్యాప్లను సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడాతో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జియోడెటిక్ అసెట్ రిజిస్టర్లో గ్రేట్ ట్రిగ్నో మెట్రికల్ సర్వే స్టేషన్స్ (జీటీఎస్), గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ (జీసీపీ), స్టాండర్డ్ బెంచ్ మార్క్స్ (ఎస్బీఎం), గ్రావిటీ రిఫరెన్స్ స్టేషన్స్, మ్యాగ్నెటిక్ రిపీట్ స్టేషన్స్, టైడల్ అబ్జర్వేటరీస్ వంటి ఆరు అసెట్స్ ఉన్నాయని చెప్పారు. వీటి ద్వారా సర్వే, మ్యాపుల రూపకల్పన మెరుగ్గా చేయవచ్చని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడా మాట్లాడుతూ రాష్ట్రంలో స్వామిత్వ, నక్ష, అమృత్, ఏపీ రీ సర్వే వంటి కీలకమైన ప్రాజెక్టులలో సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మొదటిసారిగా తెలుగులో రూపొందించిన రాష్ట్ర పటాన్ని (మ్యాప్ను) కలెక్టర్కు అందజేశారు. -
నిలిచిన సహకార సేవలు
పెనుగంచిప్రోలు: సహకార సంఘాల ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, ఆ దిశగా ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని ఆరోపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక(జేఏసీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా ఈనెల 6న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కాగా, 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీ బ్రాంచ్ల ముందు సంఘాలకు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. మంగళవారం మరోసారి అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. అలాగే ఈనెల 22న రాష్ట్రంలోని అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల ముందు ధర్నా, వినతి పత్రం అందించటం, 29న రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా, ఉన్నతాధికారులకు వినతిపత్రం, జనవరి5, 2026నుంచి విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలను జేఏసీ ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో 2,000 మంది ఉద్యోగులు.. ఉమ్మడి జిల్లాలో 425 సహకార సంఘాల్లో రెగ్యులర్, రోజువారీ వేతనంతో పనిచేసే మొత్తం 2000 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ధర్నాలో పాల్గొనటంతో సంఘ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. దీంతో సహకార సంఘాలకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పలేదు. జిల్లాలో సహకార కేంద్రాల ద్వారా రోజు రూ.కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు, ధాన్యం అమ్మినవారు డబ్బులు చెల్లించేందుకు సహకార సంఘాలకు వస్తున్నారు. ఇప్పటికే ఈ నెలలో 8న, 12న రెండు రోజులు తాళాలు వేశారని రైతులు అంటున్నారు. మంగళవారం కూడా సంఘాల్లో ఉద్యోగులు లేక పోవటంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బంగారు రుణాల కోసం పదుల సంఖ్యలో రైతులు బ్యాంకు ల వద్దకు వెచ్చి వెనుదిరగడం కనిపించింది. సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు -
బాధితులకు జననేత భరోసా
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ‘నేనున్నా.. మీకు తోడుగా ఉంటా’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా బాధితుల్లో కొండంత ధైర్యం నింపింది. రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి, ప్రభుత్వ ఆదరణకు నోచుకోని బాధితులు జననేత ఆత్మీయ పరామర్శతో సాంత్వన పొందారు. బెజవాడ జోజినగర్లో చంద్ర బాబు ప్రభుత్వం అండతో 42 ప్లాట్లలో ఇటీవల అక్రమంగా కూల్చివేతకు గురైన ఇళ్ల బాధిత కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం జోజినగర్ చేరుకున్న జననేతకు బాధితులు ఒక్కొక్కరుగా తమ ఆవేదన వినిపించారు. రెక్కల కష్టంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుని పాతికేళ్లుగా నివ సిస్తున్నామని వివరించారు. ఇన్నేళ్ల తరువాత ఆ ప్లాట్లు తమవి కావంటూ తమ ఇళ్లను ఒక్కసారిగా బుల్డోజర్లతో కూల్చివేసి రోడ్డుపాలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. గంటకు పైగా బాధిత కుటుంబాలతో మాట్లాడిన జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన జగన్మోహన్రెడ్డి సుమారు గంటకు పైగా ఆయా కుటుంబాలను ఓదార్చారు. ప్రతి ఒక్కరినీ పరామర్శించి, వారి ఆవేదనను తెలుసుకున్నారు. స్థలాలను ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎంతకు కొన్నారు, ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ తీసుకున్న తీరును, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తదితర అంశాలపై బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జోజినగర్ 42 ప్లాట్ల ప్రాంతానికి చేరుకున్న జగన్మోహన్రెడ్డి ఆయా బాధిత కుటుంబాలు ఉన్న టెంట్లోకి వెళ్లి వారితో పాటు కూర్చుని వారి బాధలను ఓపికగా ఆలకించారు. ప్రభుత్వంపై బాధితుల ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి పోలీసు సిబ్బందితో తమను రోడ్డుపాలు చేసిందంటూ బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాము దశా బ్దాల క్రితం కష్టపడి కొనుగోలు చేసిన ఈ ప్లాట్లను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, అన్ని అనుమతులతో నిర్మించుకుని పాతికేళ్లుగా నివసిస్తున్న ఇళ్లను ప్రభుత్వం దగ్గరుండి కూల్చివేసి మోసగాళ్లకు కొమ్ముకాసిందని జగన్ వద్ద వాపోయాయి. తమ స్థలాలకు పన్నులు కట్టించుకుంటూ, ఇంటి నిర్మాణానికి ప్లాన్లతో ఆమోదం తెలిపి, విద్యుత్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ స్థలాలను ఎవరో వస్తే వారికి అండగా నిలిచి దోచి పెట్టిందని బాధితులు విలపించారు. జననేత కోసం తరలివచ్చిన జనసందోహం జోజినగర్కు వచ్చిన తమ అభిమాన నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడటానికి, కలిసి మాట్లాడటానికి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలతో జోజినగర్ పరిసరాలు మారుమోగాయి. భారీ జన సందోహం కారణంగా కారు దిగిన జగన్మోహన్రెడ్డి పక్కనే బాధిత కుటుంబాలు ఉన్న టెంట్ వద్దకు చేరుకోవడానికి 15 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, రుహుల్లా, మేయర్ రాయన భాగ్య లక్ష్మి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, రాష్ట్ర కార్యదర్శి గౌస్ మొహిద్దీన్, జోగి రాజీవ్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, వీఎంసీ ఫ్లోర్లీడర్ అరవ సత్యనారాయణ, కార్పొరేటర్లు ఆంజనేయరెడ్డి, చైతన్యరెడ్డి, ఇర్ఫాన్, కోటిరెడ్డి, షేక్ రెహమతున్నీసా, బండి నాగేంద్ర పుణ్యశీల, గోదావరి గంగ, శిరంశెట్టి పూర్ణ, సహాయ కార్యదర్శి షేక్ హాయత్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు సరగడ శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాలు ప్రారంభం
గుడివాడ టౌన్: స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వజ్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీవీ సత్యనారాయణ, డీన్ డాక్టర్ మణి, కళాశాల కరస్పాండెంట్ కేఎస్ అప్పారావు తదితరులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. 75ఏళ్ల క్రితం కళాశాల ఏర్పాటుకు సహకరించిన వారందరూ రైతులు కావడంతో రైతులను స్మరించుకుంటూ తొలి రోజు రైతు సదస్సు నిర్వహించారు. ఏరువాక సాగారో.. అనే చిన్నారుల నృత్యంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మనదేశంలో 15వేల మిలియన్ ఎకరాలలో పంటను పండిస్తే 145 కోట్ల మందికి భోజనం దొరుకుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల లోటు ఉన్న నేపథ్యంలో యాంత్రీకరణవైపు రైతు దృష్టిపెట్టాలన్నారు. ప్రిన్సిపాల్ పీజేఎస్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ బీఎస్ఎస్ పద్మజ, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫేక్ సొసైటీతో భూకబ్జా కుట్ర
విజయవాడ నడిబొడ్డున ఖరీదైన భవానీపురంలోని జోజినగర్లో భూముల కబ్జాకు 2016లోనే కన్నేశారు. 1981 నాటి డేట్తో ఒక ఫేక్ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పుడు జోజినగర్లో ఏకంగా 42 మంది పేదల ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేయటాన్ని బట్టి ఇందులో కూటమి పెద్దల కుట్ర స్పష్టంగా తేలుతోంది. ఇళ్ల కూల్చివేతపై సీబీఐతో విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది ఏమిటి? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోంది? పేదల తరపున ఉందా? ఇక్కడి వారు సీఎం చంద్రబాబును మూడుసార్లు, లోకేశ్ రెండు సార్లు కలిశారు. అర్జీలు ఇచ్చారు. ఎవరికైతే వీరు అర్జీలు ఇచ్చారో.. వారే కుట్ర పన్ని వీళ్లకు అన్యాయం చేశారు.సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు సర్కారు విజయవాడ భవానీపురంలోని జోజినగర్లో 42 మంది పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్ల కూల్చివేత దారుణమన్నారు. ఈ కూల్చివేతలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్నితో పాటు స్థానిక జనసేన కార్పొరేటర్ సోదరుడి ప్రమేయం ఉందన్నారు.‘సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు ఎలా కూల్చేస్తారు? పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేయడం దుర్మార్గం. జోజినగర్ బాధితుల బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లించాలి. కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన ఆ 42 కుటుంబాలకు తిరిగి ఇళ్లు కట్టించి ఇవ్వాలి’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. లేని పక్షంలో తమ ప్రభుత్వం రాగానే విచారణ జరిపించి ఈ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతామని హెచ్చరించారు.జోజినగర్ బాధితులకు పూర్తి అండగా నిలబడతామని, వారి న్యాయ పోరాటానికి పార్టీ తోడుగా ఉంటుందని ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం జోజినగర్లో పర్యటించి ఇళ్లు కోల్పోవడంతో రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ ఏకపక్షంగా తమ ఇళ్లను కూల్చివేశారని, ఎంత ప్రాథేయపడినా ఆలకించకుండా ఈ ప్రభుత్వం తమ బతుకులను రోడ్డు పాలు చేసిందని బాధిత కుటుంబాలు ఆక్రోశించాయి. వారికి న్యాయం జరిగేవరకు తోడుగా నిలిచి పోరాడతామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..ప్రభుత్వ పెద్దల అండతోనే కూల్చివేతలు..విజయవాడ జోజినగర్లో 42 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారు 25 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే ఒక్కసారిగా వచ్చి ధ్వంసం చేశారు. ఈ స్థలం గురించి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరుగుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఆ 42 కుటుంబాలకు డిసెంబరు 31 వరకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఒకవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా, ఈనెల 31 వరకు ఊరట ఉండగానే.. ఒకేసారి 200 మందికి పైగా పోలీసులు వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ, ఈ 42 ఇళ్లకు సంబంధించిన వారిని నిర్దాక్షిణ్యంగా, వాళ్లు ఇళ్లలో ఉండగానే, ఇళ్లన్నీ పడగొట్టి రోడ్డున పడేశారు.ప్రభుత్వ పెద్దల ప్రమేయం, వారి సహకారం, ఆశీస్సులతోనే ఇదంతా జరిగింది. అందుకే ఇంత అకస్మాత్తుగా కూల్చివేశారు. ఈ నెలాఖరు వరకు గడువు ఉందని తెలిసి కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వారిని రోడ్డు పాల్జేశారు.ఫేక్ సొసైటీ ఏర్పాటు..ఇక్కడ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.150 కోట్లకు పైగానే ఉంది. దీంతో దీంట్లోకి ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఓ ఫేక్ సొసైటీని పెట్టారు. 1981 డేట్తో ఒక తప్పుడు సొసైటీని ఏర్పాటు చేసి, రూ.150 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు అడుగులు పడ్డాయి.వీరంతా చంద్రబాబు సన్నిహితులు. నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడికి కూడా ఇందులో ప్రమేయం ఉంది. ఇంతమంది కలిశారు. అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందనేందుకు ఇది నిదర్శనం. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే, డిసెంబర్ 31 వరకు వెసులుబాటు ఉన్నా కూడా.. 200 మందికిపైగా పోలీసులు వచ్చి ఇంత మందిని రోడ్డు పాల్జేశారు.ఈ స్థలాలు వేరేవారివైతే.. అనుమతులన్నీ ఎలా ఇచ్చారు?ఈ 2.17 ఎకరాల స్థలంలో 2001కి ముందు నుంచి 25 ఏళ్లుగా వీరు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇందులో చాలా మంది ఇళ్లు కూడా కట్టుకున్నారు. వాటికి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కూడా ఇచ్చారు. ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజీ కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఇళ్లకు ప్లాన్ అప్రూవల్ నుంచి అన్ని అనుమతులూ ఉన్నాయి. మరోవైపు బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి.ఇక్కడున్న వారిలో చాలామంది రూ.20 లక్షలు, రూ.25 లక్షలకుపైగా లోన్లు కూడా తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. మరి ఇక్కడ స్థలాలు వేరేవారివైతే.. ఎలా అనుమతి ఇచ్చారు? ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? బిల్డింగ్ ప్లాన్ ఎలా అనుమతించారు? బ్యాంకులు లోన్లు ఎలా ఇచ్చాయి? వాటర్, పవర్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? మరి ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు, అన్ని అనుమతులున్నా.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, న్యాయం చేయాలని కనీసం ఆలోచన చేయకుండా, ప్రైవేటు వ్యక్తులకు మద్దతు ఇస్తూ, పోలీసులు వచ్చి పొక్లెయిన్లు, బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పగలగొట్టారు.గతంలో ఇక్కడ ఇళ్ల క్రయ విక్రయాలు జరిగినప్పుడు అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పలు సందర్భాల్లో పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడా, ఎవరి నుంచి అభ్యంతరాలు రాలేదు. ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేందుకు, రూ.150 కోట్లకుపైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు.. చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ ఎంపీ, జనసేన కార్పొరేటర్ సోదరుడు.. ఇంతమంది కలిసి ఒక్కటై పేదలను నిస్సహాయులుగా రోడ్ల మీద నిలబెట్టించారు.సీబీఐతో విచారణ జరిపించాలి..ఇక్కడే కాదు.. రాష్ట్రమంతా ఇదే కొనసాగుతోంది. ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్లు ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఎంటర్ అవుతున్నారు. ల్యాండ్ కబ్జా చేస్తున్నారు. కొన్ని చోట్ల వారే స్వయంగా లిటిగేషన్లు పెట్టి కబ్జా చేస్తున్నారు. వీరే నిషేధిత జాబితాలో ఆస్తులను బలవంతంగా చేరుస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడు.. వీరంతా కలసి ఏ రకంగా కబ్జాలు చేయిస్తున్నారో ప్రజలకు తెలియాలి.ఇక్కడ 1981 డేట్ వేసి ఓ ఫేక్ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అది కూడా బయటకు రావాలి. ప్రభుత్వం పేదలకు అండగా ఉండాల్సింది పోయి వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేసింది. అందుకే మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలి. వాస్తవాలు బయటకు రావాలి.ప్రభుత్వమే లోన్లు చెల్లించాలి.. ఇళ్లు కూడా కట్టించాలిఇక్కడ 25 ఏళ్ల నుంచి ఉంటున్నారు. వారికి బ్యాంక్ లోన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇళ్లు లేవు. అందుకే ప్రభుత్వం ముందుకు రావాలి. వీరి బ్యాంక్ రుణాలు ప్రభుత్వమే కట్టాలి. వీరందరికి ఇక్కడ గానీ మరెక్కడైనా గానీ పక్కాగా ఇళ్లు కట్టించాలి.ఇది మీ జగనన్న మాట..!అయ్యా చంద్రబాబూ..! మీరు ఈ పని చేయకపోతే, రేపు మా ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం. దోషులను కోర్టు ముందు నిలబెడతాం. ఇక్కడి బాధితులందరికీ తోడుగా నిలబడతాం. బాధితులకు ఇది మీ జగనన్న మాట అని హామీ ఇస్తున్నా. సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ బాధితుల తరపున వాదించేందుకు వైఎస్సార్ సీపీ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాం.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహూల్లా, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్తలు మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పోతిన మహేష్, పూనూరు గౌతంరెడ్డి, ఆసిఫ్, జోగి రాజీవ్, రామిరెడ్డి, కొండారెడ్డి, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆడపిల్లలకు పసుపు–కుంకుమ కింద ఇచ్చా మేం 2007లో ఇక్కడ 180 గజాల ప్లాట్ కొన్నాం. నా ఇద్దరు కుమార్తెలకు 2015లో పెళ్లిళ్లు చేశాం. ఆ ప్లాట్ను రెండు భాగాలు చేసి 2016లో నా కుమార్తెలకు పసుపు–కుంకుమ కింద ఇచ్చాను. ఇప్పుడేమో ఆ ప్లాట్ మాది కాదని రోడ్డుపాలు చేశారు. ఇద్దరు కుమార్తెలు మా పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. అల్లుళ్లు గొడవ చేస్తున్నారు. చాలా దారుణంగా మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. అన్ని విధాలా అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు భరోసా ఇచ్చారు.– కోడెబోయిన కోటేశ్వరమ్మప్రభుత్వమే మమ్మల్ని రోడ్డుపాలు చేసింది మేం అందరం డబ్బులు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశాం. అక్రమంగా ఆక్రమించుకుని ఉంటున్న స్థలాలు కాదు ఇవి. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మేం కొన్న స్థలాలు 25 తర్వాత మావి కాదంటే... మేం ఏమి చేయాలి? ఏమీ అర్థంకావడం లేదు. మాకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే మమ్మల్ని రోడ్డుపాలు చేసింది. అధికారులు బలవంతంగా మా ఇళ్లు కూల్చేశారు. ఉన్నపళంగా రోడ్డుపాలు చేశారు. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు.– విజయలక్ష్మిప్రైవేట్ వ్యక్తులకు కొమ్ముకాసిన ప్రభుత్వం మేం ఎన్నో ఏళ్లపాటు డబ్బులు కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఈ ప్రభుత్వం కొమ్ముకాసి మమ్మల్ని బజారున పడేసింది. ఇంత అడ్డగోలుగా మమ్మల్ని రోడ్డుపాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి పేదలంటే చిన్నచూపని అర్థమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చి మాకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయ పోరాటానికి సహకారం అందిస్తామని, మాకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మాకు చాలా ధైర్యం వచ్చింది.– కె.అరుణరూ.25 లక్షలు బ్యాంక్ రుణం ఎలా కట్టాలి? కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని ఇక్కడ స్థలం కొన్నాం. కార్పొరేషన్ నుంచి ప్లాన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. ఇంటి నిర్మాణానికి బ్యాంకు నుంచి రూ.25 లక్షలు రుణం తీసుకున్నాం. ఇప్పుడేమో ఇంటిని దౌర్జన్యంగా కూల్చేశారు. మేం కొనుక్కున్న స్థలం మాదికాదంటున్నారు. బ్యాంక్ రుణం ఎలా కట్టాలి? మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులే మా ఇంటి నిర్మాణానికి ప్లాన్ ఇచ్చారు. ఆ ఇంటికి పన్ను కట్టించుకుంటున్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులు వచ్చి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే మేం ఎలా బతకాలి?.– డి.స్రవంతిఊరిలో పొలం అమ్మి ఇక్కడ స్థలం కొన్నాం సిటీలో స్థలం ఉంటే మా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించాం. 25 ఏళ్ల కిందట సొంతూరులో ఉన్న ఎకరం పొలం అమ్మి ఇక్కడ స్థలం కొన్నాం. మొత్తం 42 ప్లాట్లు కొనుగోలుచేసివారు పేదలు. రోజువారీ పనులు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుని బతికేవాళ్లు. మేం అందరం కలిసి ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని కాస్త అభివృద్ధి చేసుకున్నాం. చీమలు పుట్టలు పెడితే పాములు వచ్చి ఆక్రమించినట్లుగా సొసైటీ పేరుతో అక్రమంగా మా స్థలాలను ఆక్రమించారు. ప్రశ్నిస్తే కోర్టు తీర్పు అంటూ బెదిరిస్తున్నారు.– సుబ్బులులీగల్ సపోర్ట్ ఇస్తామని వైఎస్ జగన్ భరోసా కోర్టు తీర్పులో ఇళ్లు కూల్చి 42 ప్లాట్లను స్వా«దీనం చేసుకోవాలని ఎక్కడా పేర్కొనలేదు. ఈ నెలాఖరు వరకు కోర్టు గడువిచ్చింది. స్థానిక న్యాయస్థానాలు, హైకోర్టు ఇలా చాలాచోట్ల వాదోపవాదనలు జరిగాయి. అయితే బాధితులకు సరైన న్యాయం జరగలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల బాధితుల తరఫున న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించటానికి లీగర్ సపోర్ట్ ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. – వి.స్వప్న, న్యాయవాది -
బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ నొక్కడంతో..
కృష్ణా జిల్లా: కారు అదుపు తప్పి జనంపైకి దూసుకుపోవటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి పోలీస్టేషన్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సాయంత్రం 5 గంటల సమయంలో సంతబజారు వద్ద చల్లపల్లి–మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్టేషన్ రోడ్డులోకి కారు మలుపు తిరిగింది. ఇంతలోనే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుని అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాయనమ్మ, మనవరాలు కూతాటి నాగమల్లేశ్వరి, కూతాటి జెనీలియాలను ఢీ కొట్టి, అదే వేగంతో వెళ్తూ చల్లపల్లికి చెందిన గెల్లి రాధాకృష్ణను ఢీకొంది. మరికొంత దూరం ముందుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందున్న మండపం వద్ద మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి జెనీలియా, నాగమల్లేశ్వరి, రాధాకృష్ణలను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయాకు, నాగమల్లేశ్వరికి బలమైన గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద మృతి చెందిన వ్యక్తిని నందిగామ కమలాకరరావుగా గుర్తించారు. నాగాయలంకకు చెందిన కమలాకరరావు(60) చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి.. కారు నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్ చేతకాకకపోవటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుగా ఉన్న మండపాన్ని ఢీ కొని కారు ఆగిందని.. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది. -
వివాహేతర సంబంధం.. అత్తపై కోడలు దాడి
కోనేరుసెంటర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను ప్రియుడితో కలిసి కోడలు హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. అత్త చనిపోయిందని భావించి ప్రియుడితో కలిసి మూడేళ్ల బాలుడితో మహిళ పరారైంది. అయితే కొన ఊపిరితో ప్రాణాలు నిలబెట్టుకున్న వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన నలపాల సురేష్ లిఖిత భార్యాభర్తలు, వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సురేష్ తల్లి పార్వతి కొడుకు వద్దే ఉంటుంది. సురేష్ నగరంలోని ఓ పెట్రోల్బంకులో పనిచేస్తుంటాడు. సురేష్ ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. మూడేళ్ల బాబుతో పరారీ.. అందరూ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి సురేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న పార్వతిపై దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక పార్వతి బిగ్గరగా కేకలు పెడుతూ ఇంట్లో ఉన్న లిఖితను పిలిచింది. లిఖిత ఎంతకీ బయటకు రాలేదు. ఆమెను చంపేందుకు రకరకాలు ప్రయత్నిస్తుండగా పార్వతి అతని దాడిని ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నట్లు నటించిన లిఖిత కారం తెచ్చి ఆ వ్యక్తి చేతికి ఇవ్వటంతో అత్త కళ్లల్లోకి విసిరాడు. అనంతరం ఇద్దరు ఆమెను అంతమొందించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.చివరికి పార్వతి అపస్మారకస్థితికి చేరుకోగా చనిపోయిందనుకుని భావించిన లిఖిత ఆ వ్యక్తితో కలిసి తన మూడేళ్ల బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. గాయాలపాలైన పార్వతి సమీపంలో బంధువుల ఇంటికి విషయం చెప్పగా వారు సురేష్కు జరిగిన విషయం చెప్పారు. దీంతో సోమవారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గుర్తుతెలియని వ్యక్తితో పాటు లిఖిత కోసం గాలిస్తున్నట్లు సీఐ ఎస్కే నబీ తెలిపారు. -
అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అధిక ప్రాధాన్యతతో శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ ఎం. నవీన్, ఇన్చార్జ్ డీఆర్వో శ్రీదేవి, ఏఎస్పీ సత్యనారాయణ, ఆర్డీవో స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మీ కోసంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాకపోతే వెంటనే సంబంధిత అర్జీదారునికి ఏ విధంగా పరిష్కరించాలో వివరించే వివరణతో సమాధానం ఇవ్వాలన్నారు. మీ కోసంలో 151 అర్జీలను అధికారులు స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) కళాశాల వజ్రోత్సవాలను మంగళవారం నుంచి 18వ తేదీ వరకు నిర్వహించేందుకు కళాశాల పాలకవర్గం ఏర్పాట్లు పూర్తి చేసింది. మచిలీపట్నంఅర్బన్: ఈ నెల 21న నిర్వహించ నున్న పల్స్ పోలియో కార్యక్రమ పోస్టర్లను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ఆవిష్కరించారు.9కృష్ణాజిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టామని.. అన్ని వర్గాల ప్రజలు తమతో చేయి కలిపారన్నారు. ప్రజామోదంతో కోటి సంతకాలు చేపట్టామని, కోటి సంతకాలను గవర్నర్కు అందిస్తామని చెప్పారు. ప్రజా కలం.. నిరసన గళమై నినదించింది.. సంతకాల రూపంలో తమ అభీష్టాన్ని ప్రస్ఫుటం చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు సహించబోమని చాటి చెప్పింది. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఏకంగా 4లక్షల మంది సంతకాలు చేశారు. ఈ ప్రతులను సోమవారం బందరు నుంచి భారీ ర్యాలీ నడుమ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసమన్నారు. చంద్రబాబే అధికారంలో ఉండాలని కోరుకునే వాళ్లు కూడా ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రి, మాజీ పోలీస్ అధికారి వెంకటేశ్వరరావు ప్రస్తుత పాలనలోని పలు విధానాలను తప్పుపడుతున్నారన్నారని గుర్తు చేశారు. -
అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం
మీకోసంలో జిల్లా ఎస్పీకోనేరుసెంటర్: న్యాయం కోసం మీ కోసంను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఎస్పీ వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీకోసంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. సమస్య తీవ్రను బట్టి విచారణ జరిపించి చట్టపరిధిలో న్యాయం చేస్తామన్నారు. పోరంకి నుంచి వచ్చిన ఓ వివాహిత కొన్ని కారణాల వలన మొదటి భర్తతో విడాకులు తీసుకుని పెనమలూరుకు చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకోవటం జరిగిందని చెప్పింది. అయితే తాను అధిక కట్నం కావాలని మానసికంగా తీవ్ర వేధింపులకు పాల్పడటంతో పాటు శారీరకంగా దాడి చేస్తూ హింసిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరింది. వీటితో పాటు వచ్చిన అర్జీలపై స్పందించిన ఎస్పీ సమగ్ర విచారణ జరిపించి కచ్చితంగా న్యాయం చేస్తామని బాఽధితులకు హామీ ఇచ్చారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ వీవీ నాయుడు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. -
అమరజీవి త్యాగం అజరామరం
కోనేరుసెంటర్: ఆఽంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరువలేనిదని కృష్ణా జిల్లా ఎస్పీ వీవీఎస్ నాయుడు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర సాధనకు కఠోర నిర్ణయంతో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి పొట్టి శ్రీరాములు అమరుయ్యాడన్నారు. పొట్టి శ్రీరాములు జీవితం మన అందరికీ ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చల్లపల్లిలో కారు బీభత్సం
చల్లపల్లి: కారు అదుపు తప్పి జనంపైకి దూసుకుపోవటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి పోలీస్టేషన్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సాయంత్రం 5 గంటల సమయంలో సంతబజారు వద్ద చల్లపల్లి–మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్టేషన్ రోడ్డులోకి కారు మలుపు తిరిగింది. ఇంతలోనే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుని అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాయనమ్మ, మనవరాలు కూతాటి నాగమల్లేశ్వరి, కూతాటి జెనీలియాలను ఢీ కొట్టి, అదే వేగంతో వెళ్తూ చల్లపల్లికి చెందిన గెల్లి రాధాకృష్ణను ఢీకొంది. మరికొంత దూరం ముందుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందున్న మండపం వద్ద మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి జెనీలియా, నాగమల్లేశ్వరి, రాధాకృష్ణలను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయాకు, నాగమల్లేశ్వరికి బలమైన గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద మృతి చెందిన వ్యక్తిని నందిగామ కమలాకరరావుగా గుర్తించారు. నాగాయలంకకు చెందిన కమలాకరరావు(60) చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి.. కారు నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్ చేతకాకకపోవటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుగా ఉన్న మండపాన్ని ఢీ కొని కారు ఆగిందని.. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది. -
అక్కినేని వజ్రోత్సవ వైభవం
గుడివాడరూరల్: గుడివాడలో విద్యా రంగానికి పెన్నిధి అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) కళాశాల నిలిచింది. మొదటి 1950లో గుడివాడ కళాశాలగా ప్రారంభమై నేడు అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా రూపాంతరం చెంది 75 ఏళ్లు (వజ్రోత్సవాన్ని) పూర్తి చేసుకోనుంది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కళాశాల వజ్రోత్సవాలు నిర్వహించేందుకు కళాశాల పాలకవర్గం వజ్రోత్సవ కమిటీని ఏర్పాటు చేసి గత నెలరోజులుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకల్లో స్వర్గీయ అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు, కళాశాలలో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు భారీగా హాజరు కానున్నారు. కళాశాల ఏర్పాట్లు బీజం పడింది ఇలా.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కృష్ణా డెల్టాలోని రైతుబిడ్డలు స్థానికంగా ప్రాథమిక విద్యనభ్యసించినా, ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వారికి డిగ్రీ కోర్సులను అందుబాటుకి తీసుకురావాలన్న సంకల్పంతో 1950లో గుడివాడలో కళాశాలకు పునాది పడింది. విశాఖపట్నంలోని యూనివర్సిటీ వారిని అప్పటి ప్రముఖులు కలసి సమస్యను వివరించగా సానుకూలంగా స్పందించారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత గుడివాడ, కై కలూరు, గన్నవరం ప్రాంతాల్లోని ప్రముఖులతో 1950 ఏప్రిల్ 22వ తేదీన శ్రీనివాస సినిమా హాల్లో సమావేశం నిర్వహించారు. పర్వతనేని వెంకటరత్నం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కాజ వెంకట్రామయ్య, సంయుక్త కార్యదర్శిగా వేములపల్లి రామబ్రహ్మం, కోశాధికారిగా ఉప్పలపాటి వీరభద్రరావు, సభ్యులుగా వడ్డే శోభనాద్రి, లింగం వెంకటకృష్ణయ్య, ఉపద్రష్ట పాపన్నశాస్త్రిలతో గుడివాడ కళాశాల ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పాటైంది. 1959లో సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, వారి మిత్రులు రూ.లక్ష కళాశాలకు విరాళంగా ఇవ్వడంతో అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా రూపాంతరం చెందింది. ల్రైబరీతో పాటు మెయిన్ బిల్డింగ్ను ఏర్పాటు చేయించి నిర్వహణ ప్రారంభించారు. 1961లో ముదినేపల్లికి చెందిన యెర్నేని వెంకటేశ్వరరావు రూ.54 వేలు విరాళం ఇవ్వగా ఆయన తండ్రి పేరు యెర్నేని చలమయ్య ఆడిటోరియం నిర్మించారు. కాలానుగుణంగా చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాశాలలో చదివి ఉన్నత స్థానాలకు ఎదిగిన పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి కళాశాలకు కావాల్సిన అన్ని రంగాలు, అభివృద్ధి పనులు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం వల్ల నేడు ఏఎన్నార్ కళాశాల 75సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంది. వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ విద్య.. వచ్చే ఏడాది నుంచి ఏఎన్నార్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెడుతున్నట్లు కళాశాల పాలకవర్గ సభ్యులు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతోనే ఇంజినీరింగ్ విద్యను ప్రవేశ పెడుతున్నామన్నారు. కేవలం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు మాత్రమే చెల్లించి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించవచ్చని పాలకవర్గ సభ్యులు తెలిపారు. -
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు
కలెక్టర్ బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణకు అవసరమైన వాహనాలు, గోనె సంచులను సమకూర్చి సహకరించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ రైస్మిల్లర్లకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం రాత్రి జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్తో కలిసి రైస్మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అత్యధికంగా 149 కంబైన్డ్ హార్వెస్టర్లు వరికోతలు కోయటంతో ఎక్కువగా ఒకేసారి ధాన్యాన్ని సేకరించాల్సి వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గోనె సంచులు, వాహనాలను సమకూర్చినప్పటికీ సరిపోవటం లేదని చెప్పారు. మిల్లర్లు వారి వద్ద ఉన్న గోనె సంచులు, వాహనాలను రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమకూర్చాలన్నారు. 75 శాతం కోతలు పూర్తి.. జిల్లాలో ఇప్పటికే 75 శాతం వరికోతలు పూర్తయ్యాయని, ప్రస్తుతం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉందన్నారు. ఆ ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. రోజుకు 20 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే బ్యాంక్ గ్యారెంటీలు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతు కోత కోసిన వెంటనే ధాన్యాన్ని తీసుకువస్తున్నారని దానిని ఆరబెట్టేందుకు వీలుగా మిల్లర్ల వద్ద ఉన్న డ్రయర్లను వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రైతులు 1318 రకం వరిని పండిస్తున్నారని ఆ ధాన్యాన్ని కూడా తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. జిల్లాకు మరో 10 లక్షల గోనె సంచులను త్వరలో తీసుకువస్తున్నామని తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.శివరామప్రసాద్, రైస్మిల్లర్లు పాల్గొన్నారు. -
జయహో దుర్గాభవాని
సంబరంగా ముగిసిన దీక్ష విరమణ ఉత్సవాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఐదు రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు సోమవారం మహా పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. మొత్తం 5.27లక్షల మంది భవానీలు దీక్షలను విరమించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రికి నగరానికి చేరుకున్న భవానీలు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గిరిప్రదక్షిణను పూర్తి చేసుకున్నారు. అర్ధరాత్రి క్యూలైన్లోకి చేరుకున్న భవానీలు, భక్తులకు గంటన్నర లోపే అమ్మవారి దర్శనం పూర్తయింది. కొండ దిగువకు చేరుకున్న భవానీలు ఇరుముడులు, హోమగుండానికి నేతి కొబ్బరి కాయలను సమర్పించిన దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి భవానీలకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ మార్గంలో భవానీల తాకిడి కనిపించింది. రద్దీ నేపథ్యంలో గిరిప్రదక్షిణకు నాలుగున్నర నుంచి 5 గంటల సమయం పట్టింది. ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గిరిప్రదక్షిణ మార్గంలో రద్దీ కొనసాగుతూనే ఉంది. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి పరిసరాలు, కెనాల్రోడ్డు, సీతమ్మ వారి పాదాలు, వీఎంసీ కార్యాలయ పరిసరాలు అరుణవర్ణాన్ని సంతరించుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. రేపటి నుంచి ఆర్జిత సేవలు.. మంగళవారం భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతాయని, మంగళవారం కూడా వచ్చే భవానీలకు అన్ని క్యూలైన్లలో ఉచితంగా అనుమతిస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు. దీక్షలు ముగియడంతో బుధవారం నుంచి ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించే అన్ని ఆర్జిత సేవల్లో ఉభయదాతలు పాల్గొనవచ్చని, టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామని ఆలయ అధికారులు ప్రకటించారు. మహా పూర్ణాహుతితో పరిసమాప్తం.. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఆలయ అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్.దుర్గాప్రసాద్, ఇతర వైదిక కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్, భవానీ దీక్ష విరమణల ఫెస్టివల్ ఆఫీసర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారం, సమష్టి కృషితోనే దీక్ష విరమణలను విజయవంతంగా నిర్వహించగలిగామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఆయన మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఈ ఏడాది దీక్ష విరమణలు చేసిన భవానీల సంఖ్య పెరిగిందని, మొత్తంగా 5.27 లక్షల మంది రాగా, 21.25లక్షల లడ్డూలను విక్రయించారన్నారు. అన్న ప్రసాదం, అల్పాహారాన్ని 2.13 లక్షల మందికి అందించామని, సుమారు 60వేల మంది భవానీలు అమ్మవారికి తలనీలాలు సమర్పించారని చెప్పారు.పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు, అధికారులు -
వంశీని పలకరించారని టీడీపీ వారిపైనే దాడి
రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వర్గీయులు గన్నవరం: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ను పలకరించినందుకు టీడీపీ వారిపైనే దాడి చేశారు. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెం గ్రామంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని పరామర్శించేందుకు వల్లభనేని వంశీ ఆదివారం మర్లపాలెం వెళ్లారు. ఆయనను టీడీపీకి చెందిన కంభంపాటి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఇది జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు కంభంపాటి సాయి, శేషు, జాస్తి మురళి ఆదివారం రాత్రి గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న శ్రీధర్పై అకారణంగా దాడి చేశారు. తనపై ఎందుకు దాడి చేశారని అడిగేందుకు బంధువైన కంభంపాటి రామ్మోహన్రావుతో కలిసి శ్రీధర్ గ్రామంలోని సాయి ఇంటికి వెళ్లగా... మరోసారి సాయి, శేషు, జాస్తి మురళీతో పాటు విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హాకీ స్టిక్స్, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో శ్రీధర్ తలకు, రామ్మోహన్రావు చేతికి బలమైన గాయాలయ్యాయి. వారిని బంధువులు వెంటనే చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, తాను 20 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నానని, గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు విజయం కోసం పని చేశానని శ్రీధర్ తెలిపారు. ఎన్నికల అనంతరం యార్లగడ్డ ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ తమను దూరం పెట్టారని చెప్పారు. తమ సమీప బంధువుల ఇంటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీని పలకరించాననే కక్షతో యార్లగడ్డ వర్గీయులు అమానుషంగా దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంభంపాటి శ్రీధర్, రామ్మోహన్రావును సోమవారం వల్లభనేని వంశీ పరామర్శించారు. -
ఏసీబీ వలలో సాగునీటి ప్రాజెక్టు ఉద్యోగి
విజయవాడలీగల్: పోలవరం కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్రింటింగ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న నగేష్బాబు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు సంబంధించి గుత్తేదారుకు ధ్రువీ కరణ పత్రం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జున నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేయడంతో నాగార్జున ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నాగార్జున ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని నగేష్బాబు తన కార్యాలయంలో లంచం మొత్తం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నగేష్బాబు నివాసం, కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కారుణ్య నియామకంలో ఆపరేటర్గా ఉద్యోగంలో చేరిన నగేష్బాబు 2022 నుంచి అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. చిలకలపూడి(మచిలీపట్నం): ఖాతాదారునికి వడ్డీతో ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షుఢు చింతలపూడి కిషోర్కుమార్, సభ్యురాలు శ్రీలక్ష్మీరాయల సోమవారం తీర్పునిచ్చారు. మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన డి.వెంకటనరసింహారావు ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో 2014లో తనకు, తన కుటుంబ సభ్యులకు కలిపి పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 2024లో నరసింహారావు గుండె సమస్యతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యి రూ.1,98,915 ఖర్చు చేశారు. క్లయిమ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించగా మెడికల్ రికార్డులు పరిశీలించి రూ.1,12,026 లు మాత్రమే చెల్లించారు. బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాలని ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీని అడిగినా ప్రయోజనం లేకపోవటంతో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. కమిషన్ సభ్యులు పూర్వాపరాలను విచారించి ఖాతాదారుడు నరసింహారావుకు బ్యాలెన్స్ మొత్తం రూ.76,862 లు ఫిర్యాదు చేసిన రోజు నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని మానసిక వేదనకు రూ.5 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పు చెప్పారు. -
‘అయ్యా చంద్రబాబూ.. మీరు చేస్తోంది పెద్ద తప్పయ్యా’
సాక్షి, కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా.. అంటూ కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మచిలీపట్నంలో సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమాన్ని సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజాభిప్రాయాన్ని వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అంతకు మించే అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. సంతక పత్రాలతో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీ నిర్వహించింది. జగన్కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కోటి సంతకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వైఎస్సార్సీపీ చెబుతోంది. మచిలీపట్నంలో ప్రతులను తరలించే కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు.. వైఎస్సార్సీపీ ఆఫీస్ నుంచి వాహనంలో బాక్సులను స్వయంగా పేర్ని నాని, ఇతర నేతలతో కలిసి ఎక్కించారు. అక్కడి నుంచి కోనేరు సెంటర్ దాకా భారీ ర్యాలీ జరిగింది. -
ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్ బీ’ సెమీ ఫైనల్
●నాలుగు కేటగిరీల్లో పరీక్షలు నిర్వహణ ●278 మంది విద్యార్థుల హాజరు ●ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి హాజరైన విద్యార్థులు కృష్ణలంక(విజయవాడతూర్పు): విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై నైపుణ్యాలను పెంచేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ సెమీ ఫైనల్ రౌండ్ పరీక్షలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. గతంలో జరిగిన క్యార్టర్ ఫైనల్ రౌండ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సెమీ ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. విజయవాడ, బందరురోడ్డులోని నలంద డిగ్రీ కాలేజీలో జరిగిన పరీక్షలకు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ స్కూల్స్ నుంచి 278 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నాలుగు కేటగిరీలుగా విభజించి పరీక్షలు నిర్వహించారు. కేటగిరి–1లో 39 మంది, కేటగిరీ–2లో 78 మంది, కేటగిరీ–3లో 94 మంది, కేటగిరీ–4లో 67 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పోటీతత్వాన్ని పెంపొందించేలా నిర్వహిస్తున్న పరీక్షలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి కనబరిచి వారే స్వయంగా తమ పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కాలేజీ ఆవరణలో సందడి నెలకొంది. ప్రధాన స్పాన్సర్గా డ్యూక్స్ వాఫీ, అసోసియేట్ స్పాన్సర్గా ట్రిప్స్ ఇంటర్నేషన్ స్కూల్(రాజమండ్రి) వ్యవహరిస్తున్నారు. ఈ పరీక్షలను నలంద డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అనురాధ, ఏఓ కాళీప్రసాద్ పర్యవేక్షించారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు త్వరలో హైదరాబాద్లో జరగనున్న ఫైనల్ రౌండ్ పరీక్షలకు అర్హత సాధిస్తారని ఈవెంట్స్ అసిస్టెంట్ మేనేజర్ ఇ.శ్రీహరి తెలిపారు. -
ఏపీఆర్ఎస్ఏ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
చల్లపల్లి: చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన వృత్తిరీత్యా విశాఖపట్నంలో హెడ్కానిస్టేబుల్గా చేస్తున్న మురాల నాగమల్లేశ్వరరావు 7వ ఏపీ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటారు. రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. నాగమల్లేశ్వరరావు 40–45 ఏళ్ల క్రీడాకారుల విభాగంలో మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శనివారం నిర్వహించిన పోటీల్లో విశాఖ జిల్లా తరఫున పాల్గొని గెలుపొందారు. ఐదు కిలోమీటర్లు, 1500 మీటర్లు పరుగు పందేల్లో బంగారు పతకాలు, 110 హర్డిల్స్ పందెంలో వెండి పతకాన్ని కై వసం చేసుకున్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం జనసంద్రంగా మారింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగర్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యాన సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అనారోగ్య పరిస్థితులు లేవు
● ఆర్టీసీలో మెకానిక్ రామకృష్ణ ● 59 ఏళ్లలోనూ పాల్గొంటే పతకాలే ● ఇప్పటి వరకు 225 పైగా బహుమతులు కై వసం ● హైస్కూలు స్థాయి నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ వరకు పతకాల పంట ఆటోనగర్(విజయవాడతూర్పు): ఆయన ఆర్టీసీలో మెకానిక్. 59 ఏళ్ల ప్రాయంలోనూ ఆటల పోటీలంటే అత్యంత ఆసక్తి చూపుతున్నారు. ఆటల్లో సత్తా చాటి క్రీడా కోటాలో ఆర్టీసీ ఉద్యోగం సాధించారు బంటుమిల్లి మండలం ఆముదాలపల్లికి చెందిన పి.రామకృష్ణ. ఆయన ఇప్పటి వరకు 225 పైగా బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. మొదటి బహుమతితో క్రీడా కోటాలో.. రామకృష్ణకు రన్నింగ్, సైక్లింగ్, యోగా అంటే మక్కువ. పాఠశాల స్థాయిలోనే ప్రావీణ్యం చూపారు. 1988లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి మారథాన్ 42.195 కిలోమీటర్ల విభాగంలో (రన్నింగ్ 3.28 గంటలు) ప్రథమ స్థానం సాధించారు. ఐటీఐ చదివిన ఆయన ఈ సర్టిఫికెట్తో 1991లో ఆర్టీసీ అవనిగడ్డ డిపోలో మెకానిక్గా ఉద్యోగంలో చేరారు. ఇలా ఇబ్రహీంపట్నం, గవర్నర్పేట, గుడివాడ డిపోల్లో చేసి ప్రస్తుతం ఆటోనగర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతను నెరవేరుస్తూ.. మరోవైపు రన్నింగ్లో పతకాలు సాధించి ఆర్టీసీకి, జిల్లాకు ఖ్యాతి తెస్తున్నారు. నాటి నుంచి ఇప్పటి వరకు.. హైస్కూల్ స్థాయిలోనే కాకుండా ప్రస్తుతం మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరుస్తున్నారు. ఎన్నోపతకాలను సొంతం చేసు కుంటున్నారు. ఆయన పాల్గొంటే కచ్చితంగా పతకం సాధించడమే. యువతకు శిక్షణ ఉద్యోగం చేస్తూనే జిల్లాలో యువకులకు నడక, యోగా, రన్నింగ్లో శిక్షణ ఇస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన వారిలో పలువురికి పోలీసు, ఇతర శాఖల్లో ఉద్యోగాలు వచ్చినట్టు రామకృష్ణ చెబుతున్నారు. 1988, 1993, 98, 2000, 2006, 2009, 2010, 2011 వరకు జరిగిన మారథాన్ రన్నింగ్లో బంగారు పతకాలు సాధించారు. 2025లో ఇటీవల నవంబరులో జరిగిన పరుగు పందాల్లో మూడో స్థానం పొందారు. ఈ నెలలో జరిగిన 44వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అధ్లెటిక్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించారు. అనేక పోటీల్లో వెండి, కాంస్య పతకాలు సాధించారు. నాకు 59 సంవత్సరాలు . ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవు. ఇప్పటి వరకు 50 బంగారు పతకాలు, 100 వెండి, 75 కాంస్య పతకాలు సాధించాను. కొన్నేళ్ల నుంచి కానూరులోని సిద్ధార్థ కాలేజీలో యువకులకు, మధ్య వయసు వారికి నిత్యం రన్నింగ్, యోగా, సైక్లింగ్లో శిక్షణ ఇస్తున్నాను. గతంలో శిక్షణ పొందినవారు పోలీసు, ఇతర శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. –పి.రామకృష్ణ, ఆర్టీసీ మెకానిక్, ఆటోనగర్ డిపో -
బందరులో పందెంకోళ్ల కూతలు
●రంగు, వాటాన్ని బట్టి పందెంపుంజుల కొనుగోళ్లు ●రూ.10 వేల నుంచి రూ.30 వేల ధర పలుకుతున్న పుంజులు కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లా కేంద్రమైన బందరులో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగకు నెల ముందునుంచే హడావుడి కనిపిస్తోంది. ప్రధానంగా పందెంకోళ్ల కూతలు విన్పిస్తున్నాయి. పందెంరాయుళ్లు పుంజుల కొనుగోలుకు గాలిస్తున్నారు. కిందటేడాది కాకిడేగ మైలాను మట్టి కరిపించిందని ఒకరంటే.. నీ కాకిడేగ మైలానే కొట్టింది నా నెమలి అయితే పర్లాను పరుగులు పెట్టించింది గుర్తుందా.. అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏ రంగుకు ఏ రంగు కోడి కలపాలి, ఏ సమయంలో పందెం వేయాలి, ఎప్పుడు కత్తి కట్టి వదలాలి, ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోతుందనే చర్చలు సాగుతున్నాయి. పందెంకోడి కూత వినబడితే చటుక్కున ఆగి పెంపకందారులతో బేరసారాలు ఆడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి అడ్వాన్స్లు ఇచ్చేస్తున్నారు. పుంజు రంగు, వాటం, కాలు విసిరే విధానం నచ్చితే.. రేటు గురించి కూడా ఆలోచించడంలేదు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, అబ్రాస్, నెమలి, సీతువా, రసంగి, పర్లా, పింగళా, కక్కిరి, మైలా, ఎర్రబొట్ల సీతువా.. ఇలా రంగులను బట్టి పుంజు జాతి గలది అయితే ఒక్కో కోడిని రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ధరకు కొనేస్తున్నారు. పలువురు పందెంకోళ్లను జీడిపప్పు, పిస్తా, కోడిగుడ్లు, కీమా వంటి ఖరీదైన మేతలతో యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. సండే మార్కెట్లో సందడి.. సంక్రాంతి దగ్గర పడుతుండటంతో బందరు సండే మార్కెట్లో పందెంరాయుళ్ల సందడి పెరిగింది. మిగిలిన రోజుల్లో కూర కోళ్లకు మాత్రమే గిరాకీ ఉండగా ప్రస్తుతం పందెంపుంజుల కూతలు విన్పిస్తున్నాయి. దీంతో పందెంరాయుళ్లు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే పుంజుల కోసం సండే మార్కెట్కు చేరుకుంటున్నారు. సండే మార్కెట్లో ఓ మాదిరి పందేలు వేసుకునే వారికి అనుకూలంగా రూ.3 వేల నుంచి రూ.7 వేల వరకు ధర పలికే పుంజులు అమ్మకానికి వస్తున్నాయి. ఈసారి సంక్రాంతికి ఈ ప్రాంతంలో కోడిపందేలు పెద్ద ఎత్తున జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమనలు దిగ్విజయంగా జరుగుతున్నాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. దీక్ష విరమణలపై ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్ వేద పండితులు షణ్ముఖేశ శాస్త్రి, అర్చకులు యూ మురళీధర శాస్త్రిలు మాట్లాడారు. దేవదాయ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ భవానీలకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. 9 మందితో ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు లక్షలాది మంది దీక్షలు స్వీకరించే స్థాయికి చేరిందన్నారు. భవానీలకు వీలైనంత అధిక సమయం దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. దీక్ష విరమణలన్నీ శాసీ్త్రయంగానే సమర్పిస్తున్నామని చెప్పారు. -
షటిల్ డబుల్స్ టోర్నమెంట్ విజేత విజయవాడ జట్టు
నాదెండ్ల: క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు యువత మధ్య స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయని సీఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చుండి రంగనాయకులు అన్నారు. గణపవరం సీఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయి షటిల్ డబుల్స్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సీఆర్ కళాశాల షటిల్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో నియోజకవర్గ స్థాయిలో 30 జట్లు, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయిలో 40 జట్లు పాల్గొన్నాయి. మూడు జిల్లాల స్థాయి విజేతలు మూడు జిల్లాల స్థాయిలో విజయవాడకు చెందిన ధనుష్, చంద్రగోపీ మొదటి బహుమతి కై వసం చేసుకున్నారు. రెండు, మూడు, నాల్గవ బహుమతులు వరుసగా విజయవాడకు చెందిన విజయ్సాయిరెడ్డి, పోతురాజు, గణపవరం గ్రామానికి చెందిన జాక్సన్, పృథ్వీ, కోండ్రుపాడు, గణపవరానికి చెందిన ఆదినారాయణ, సుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా కొండెపాటి నాగయ్య, రమేష్, నరేంద్ర, గేరా యాకోబు వ్యవహరించారు. కమిటీ సభ్యులు యశ్వంత్చౌదరి, సాయిచౌదరి, పట్నంశెట్టి మణికంఠ, నాని, బాషా, ఆదినారాయణ పర్యవేక్షించారు. -
చిత్రం.. భళారే విచిత్రం
విజయవాడ కల్చరల్: ఏపీ సృజనాత్మక సమితి, తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య ఆధ్వర్యాన పున్నమ్మ తోటలోని దూరదర్శన్, టీటీడీ కల్యాణమండపం రోడ్డులో నిర్వహించిన చిత్ర కళాప్రదర్శన ఆకట్టుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులు వారి చిత్రాలను ప్రదర్శించారు. 200 స్టాల్స్లో ప్రదర్శించిన చిత్రాలు కనువిందు చేశాయి. ఆధునిక చిత్రకళ ఉట్టిపడేలా గ్రామీణ జీవనం, రైతులు, ప్రకృతి సౌందర్యం, పల్లెజీవితం, జాతీయ నాయకులు, దేవతా మూర్తులు తదితర అంశాలతో కూడిన చిత్రాలను ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చిత్ర కళాప్రదర్శన రాత్రి 9 గంటలవరకు సాగింది. ప్రపంచ తెలుగు చిత్రకళా సమాఖ్య అధ్యక్షుడు పీరన్, కార్యదర్శి బాలయోగి, టి.వెంకటర్రావ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడానికే.. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఆశయంతో చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు పీరన్ తెలిపారు. బాల చిత్రకారులకు ఇటువంటి వేదికలు అవసరమన్నారు. అమరావతి కేంద్రంగా కళాకారుల ప్రదర్శనకు ఆడిటోరియం నిర్మించాలని సూచించారు. నిర్వాహకులు శిబిరంలో పాల్గొన్న చిత్రకారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై..నియోజకవర్గం సంతకాల సంఖ్య మచిలీపట్నం 65,000 పామర్రు 50,815 గుడివాడ 60,000 అవనిగడ్డ 54,000 పెడన 43,000 గన్నవరం 40,000 పెనమలూరు 50,000 మొత్తం 3,62,815 పతకాల వీరుడు @597చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. డివిజన్, మండలస్థాయిలో కూడా మీ కోసం జరుగుతుందని పేర్కొన్నారు.సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ సెమీ ఫైనల్ రౌండ్ పరీక్షలు ఆదివారం విజయవాడ నలంద డిగ్రీ కాలేజీలో ఉత్సాహంగా జరిగాయి. గుడివాడరూరల్: గుడివాడ మెయిన్రోడ్డు లోని అద్దేపల్లి కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.కోటి ఆస్తి నష్టం సంభవించింది. -
శాతవాహన కళాశాల పరిరక్షణకు ఐక్య కార్యాచరణ
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): శాతవాహన కళాశాల పరిరక్షణకు విద్యార్థి సంఘాలు అన్ని కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించాలని అప్పుడే కళాశాలకు పూర్వ వైభవం వస్తోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర చెప్పారు. స్థానిక విశాలాంధ్ర రోడ్డులో శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం ఆ కళాశాల ఆవరణలోని మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు, విద్యార్థి సంఘాల కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించి చేసే కార్యక్రమాల్లో తమ సంఘం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. భవనాలను కూల్చడం అనాగరిక చర్య.. శాతవాహన కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సాంబిరెడ్డి మాట్లాడుతూ.. శాతవాహన కళాశాల ఐదు దశాబ్దాల పాటు వేల మందికి విద్యను అందించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దిందన్నారు. కళాశాల స్థలం విలువ కోట్ల రూపాయలకు పెరగడంతో కొంతమంది వ్యక్తులు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. శాతవాహన కళాశాల స్థలాన్ని దురాక్రమణదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవలసిన బాధ్యత శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘంపైనే ఉందన్నారు. ఇందుకోసం కోసం అన్ని విద్యార్థి సంఘాలతో పాటు పూర్వ విద్యార్థులు సంఘం సభ్యులు కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించాలన్నారు. దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధి పి.కృష్ణమోహన్ మాట్లాడుతూ శాతవాహన కళాశాల స్థలాలను పరిరక్షించుకుని కళాశాలను పూర్వస్థితికి తీసుకురావడానికి తమ సొసైటీ అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు నవనీతం సాంబశివరావు, సభ్యులు ఎం.రామకృష్ణ మాట్లాడుతూ కళాశాల భవనాలను కూల్చడం, క్రీడా మైదానాన్ని జేసీబీలతో తవ్వించడం వంటి దుశ్చర్యలు అనాగరికమన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులు రవి, కిరణ్, వెంకన్న, వాలేశ్వరరావు వల్లూరు బాబు, భాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర -
కార్టూనిస్టుల సేవలు ఎనలేనివి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్టూనిస్టుల సేవలు ఎనలేనివని, ప్రజల హితాన్ని కాంక్షిస్తూ కార్టూనిస్టులు సేవలు అందిస్తున్నారని ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం, అమరావతి’ ఆవిర్భావ సభ సంఘం అధ్యక్షుడు బాచీ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. కార్టూనిస్టుల సంఘానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందేలా చూస్తానన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎ.వి.శేషసాయి మాట్లాడుతూ.. కార్టూన్ అంటే అందరికీ మక్కువేనన్నారు. అందరికీ హాస్యం ఇష్టమని, కార్టూన్కు ఎప్పుడు ఆదరణ ఉంటుందని చెప్పారు. -
కారు, బైక్ ఢీ : ఇద్దరికి గాయాలు
కంచికచర్ల: ముందు వెళ్తున్న బైక్ను వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనగా బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలైన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు గుంటుపల్లికి చెందిన దుర్గా సురేష్కుమార్, రమణ అనే మహిళతో కలిసి విజయవాడ వైపు నుంచి తెలంగాణా రాష్ట్రం కోదాడ బైక్పై బయలుదేరారు. కంచికచర్ల మండలం కీసర బీజేటీ డిగ్రీ కళాశాల వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో రమణకు తీవ్రగాయాలు, సురేష్కుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రమణను వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దుర్గా సురేష్ కుమార్ బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
ఏపీ టీచర్స్ ఫెడరేషన్ కార్యవర్గం ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నికై ంది. సూర్యారావుపేటలోని ఏపీటీఎఫ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ద్వితీయ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏపీటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా వి.రాధిక, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఖాసీం, ఉపాధ్యక్షులుగా టి.పూర్ణచంద్రరావు, ఎన్.అవని, ఎండీ నయీం అహ్మద్, డి.రాజకుమార్, కార్యదర్శులుగా డి.వసరాం, ఏ సుందరరామారావు, శెట్టిపోగు రాము, షేక్ ఖాజా, షేక్ లాల్మద్, రాష్ట్ర కౌన్సిలర్లుగా పీవీ దుర్గా ప్రసాద్, ఎస్కే నిఖత్ సుల్తానా ఎన్నికయ్యారు. పీఆర్సీ కమిషన్ నియమించాలి.. ఎన్నికల అధికారిగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పువ్వాడ వెంకటేశ్వర్లు, పరిశీలకులుగా మక్కెన శ్రీనివాసరావు వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్, ఉపాధ్యక్షులు అనిత మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పని గంటల పెంపు విధానాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు మండాది వెంకటేశ్వర్లు, శోభనాద్రాచార్యులు, వై.భాస్కరరావు, కె.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
●షార్ట్సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు ●రెండు షాపులు పూర్తిగా, ఓ షాపు పాక్షికంగా దగ్ధం ● రూ.కోటి వరకు ఆస్తి నష్టం గుడివాడరూరల్: పట్టణంలోని అద్దేపల్లి కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే పట్టణ నడిబొడ్డులోని నెహ్రూచౌక్ సమీపంలో ఉన్న అద్దేపల్లి కాంప్లెక్స్లో ఉన్న ఓ సెల్ఫోన్ షాప్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. సుమారు గంట తర్వాత సమీప ప్రజలు, ఉదయం వాకింగ్ చేసే వాకర్స్ మంటలు బయటకు కన్పించడంతో 5.15 గంటలకు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక అధికారి జక్కంపూడి ఆంజనేయులు నేతృత్వంలో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. గుడివాడకు ఒక ఫైర్ ఇంజన్ మాత్రమే ఉండటంతో వెంటనే కై కలూరు, ఉయ్యూరు ప్రాంతాల్లోని ఫైర్ ఇంజన్లు రప్పించి 20 మంది ఫైర్ సిబ్బందితో గుడివాడ, కై కలూరు ఫైర్ అధికారులు ఆంజనేయులు, క్రాంతికుమార్ నేతృత్వంలో మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, రెండు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయని, ఒక షాపు పాక్షికంగా దగ్ధమైనట్లు ఫైర్ అధికారులు తెలిపారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు గుర్తించారు. పెరిగిన ప్రమాద తీవ్రత.. గుడివాడలో ఒక్క ఫైర్ ఇంజన్ ఉండడం.. ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చే సరికి ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి డి.ఏసురత్నం, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున నష్టపోయిన బాధితులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదే కాంప్లెక్స్లో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల, ఎస్బీఐ బ్రాంచ్తో పాటు మరికొన్ని షాపులు ఉన్నాయి. ఆదివారం కావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
28 బ్రాంచీలు.. రూ.30 కోట్లు వసూలు !
● రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ బాధితులు ●ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారికే బ్రాంచ్ల నిర్వహణ బాధ్యతలు ● గుట్టుగా పెట్టుబడులు తరలించి బోర్డు తిప్పేసిన నిర్వాహకులు తిరువూరు: ౖలెఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అడ్వయిజరీ సర్వీసెస్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా శాఖలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఆకర్షణీయమైన బ్రోచర్లు, అధిక వడ్డీల పేరుతో ప్రజలకు నమ్మకం కలిగించి 2023 నుంచి పెట్టుబడులు స్వీకరించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సంస్థకు చైర్మన్గా ఎన్ఎస్ఎన్ దుర్గాప్రసాద్, సీఈఓగా ఆయన భార్య శివానీ వ్యవహరించారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నమ్మకస్తులైన ఐదుగురిని నియమించుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, వరంగల్ పట్టణాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 28 బ్రాంచ్లు ఏర్పాటుచేసి రూ.30 కోట్లకు పైగా వసూలు చేశారు. తాము 200కు పైగా ప్రాజెక్టుల ద్వారా లాభాలను అందిస్తామని కస్టమర్లను నమ్మించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష మొదలుకుని రూ.10 లక్షల వరకు డిపాజిట్లు స్వీకరించారు. మొక్కలు పెంచే ఆలోచన ఉన్నవారే తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలంటూ బ్రోచర్లలో నిబంధనలు వల్లెవేశారు. పోస్టాఫీసులు, బ్యాంకుల కంటే అధిక మొత్తంలో వడ్డీ వస్తుందనే ఆశతో చిన్న, మధ్య తరహా కుటుంబాలు ఎక్కువగా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో కొంత డబ్బు కస్టమర్లకు చెల్లించినా, నిర్వాహకులు క్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులు దారి మళ్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏజెంట్లపై కస్టమర్ల ఒత్తిడి తాము లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సంస్థలో పెట్టిన పెట్టుబడులు తిరిగి ఇవ్వాలంటూ ఏజెంట్లపై ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. సంస్థ గురించి తమకు తెలియకపోయినా పరిచయస్తులైన ఏజెంట్లకు డబ్బు చెల్లించామని, వారి హామీపైనే పెట్టుబడి పెట్టామని పలువురు చెబుతున్నారు. ఇన్వెస్టర్ల ఒత్తిడి తట్టుకోలేక శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కొత్తగూడెం తదితర పట్టణాల నుంచి ఏజెంట్లు విస్సన్నపేటకు వచ్చి దుర్గాప్రసాద్, శివానీ ఆస్తులపై ఆరా తీశారు. శివానీ అదృశ్యంపై ఫిర్యాదు దుర్గాప్రసాద్, శివానీది ప్రేమ వివాహం. వారిద్దరి కులాలు వేర్వేరు. దుర్గాప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. శివానీ స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం మొద్దులపర్వ. డిపాజిట్దారులు, ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేక దుర్గాప్రసాద్ అక్టోబరు 27న ఆత్మహత్య చేసుకున్నాడు. 10 రోజుల కిందట శివానీ తన ఇద్దరు కుమార్తెలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ, ఏజెంట్లు, కస్టమర్లు ఆందోళన చేస్తుండటంతో అనూహ్యంగా శివానీ కనిపించట్లేదని ఆమె తండ్రి గోవింద్ ఆదివారం రెడ్డిగూడెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
వల్లభనేని వంశీని కలిశారనే కోపంతో..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. మర్లపాలెం గ్రామంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారని.. స్థానికంగా అధికార పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారనే కోపంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నాం మర్లపాలెంలో వల్లభనేని వంశీ పర్యటించి.. ఓ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీధర్,కంభంపాటి రామ్మోహనరావు వంశీని కలిసి ఫొటోలు దిగారు. స్థానికంగా కొనసాగుతున్న ప్రతీకార రాజకీయాల గురించి ఆయనకు వివరించారు. ఈ విషయం తెలిసిన టీడీపీ మూక రెచ్చిపోయింది.ఆ ఫొటోల ఆధారంగా ఇద్దరిని గుర్తించింది. వంశీనే కలుస్తారా? అంటూ.. ఇరువురిపై మూక దాడికి పాల్పడ్డారు. తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీధర్, రామ్మోహనరావులను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వల్లభనేని వంశీ.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
బంగారు కొండ.. మానుకొండ అంటూ పోస్ట్!
విజయవాడ: ఏపీలో అధికార టీడీపీ నేతలైన ఎంపీ కేశినాని చిన్ని-ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య నడుస్తున్న కోల్డ్వార్ తారాస్థాయికి చేరింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్గా కొలికపూడి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ హిట్ పుట్టిస్తున్నారు. కొలికపూడి పోస్ట్లతో ఎంపీ కేశినేని చిన్ని వర్గంలో కలవరం మొదలైంది. తాజాగా కేశినేని చిన్నిపై కొలికపూడి పెట్టిన పోస్ట్ వైరల్గా మారింంది. గంపలగూడెం టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ ఫోటోను పెడుతూ ‘ బంగారు కొండ.. మానుకొండ’ అంటూ పోస్ట్ పెట్టారు కొలికపూడి. ఈనెల 18 నుంచి గంపలగూడెం మండలంలో పల్లెనిద్ర అంటూ మరో పోస్టు పెట్టారు. కొలికపూడి వరుస పోస్టులు తిరువూరులో దుమారం రేపుతున్నాయి. -
అధిక మొత్తం ఆశ చూపి కుచ్చుటోపీ!
విస్సన్నపేట: మీ జీవితాల్లో వెలుగులు నింపుతా... మీరు పెట్టే పెట్టుబడికి ఎవ్వరూ ఇవ్వనంత ప్రతిఫలం ఇస్తా... రూ.లక్షకు నెలకు రూ.పదివేలు, రూ.10 లక్షలకు నెలకు రూ.లక్ష లాభం చూపిస్తానంటూ అమాయక ప్రజలకు ఆశ చూపి పెద్దమొత్తంలో కుచ్చుటోపీ పెట్టిన ఒక సంస్థ విస్సన్నపేటలో బోర్డు తిప్పేసింది. విస్సన్నపేట శ్రీనివాస నగర్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ను 2023లో ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా విస్సన్నపేట, పరిసర ప్రాంతాల ప్రజలకు క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని, మీకు అత్యధిక లాభాలు చూపిస్తానని నమ్మబలికి సుమారు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లవరకు ప్రజల నుంచి దండుకున్నారు. సంస్థ డైరెక్టర్ నండూరి శివ నాగదుర్గాప్రసాద్, అతని భార్య శివాని కొద్దినెలల పాటు పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు చూపించారు. గత కొద్దికాలంగా సంస్థ తాళాలు తీయకపోవడం, రెండు నెలల క్రితం భవనం ఖాళీ చేయడంతో ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు లబోదిబోమంటున్నారు. డిపాజిట్దారుల వత్తిడితో డైరెక్టర్ ఆత్మహత్య తాము పెట్టే పెట్టుబడికి అధిక మొత్తం చెల్లిస్తామని నమ్మించిన దుర్గాప్రసాద్ దంపతులు తీరా బోర్డు తిప్పేయడంతో వారిని నమ్మి డబ్బులు డిపాజిట్ చేసిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురై తమ సొమ్ము ఇవ్వవలసిందిగా వత్తిడి చేయడంతో నెల క్రితం ఆ సంస్థ డైరెక్టర్ శివనాగ దుర్గాప్రసాద్ అత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన భార్య శివానీ కూడా కొద్దిరోజులుగా అదృశ్యమవడంతో పెట్టుబడిదారులు కంగుతిన్నారు. పిల్లల పెళ్లిళ్లకు, భవిష్యత్ అవసరాలకు అక్కరకు వస్తాయని ఆశించి దాచుకున్న డబ్బులను ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విస్సన్నపేట పరిసర ప్రాంతాల వారే కాకుండా గన్నవరం, మచిలీపట్నం, ఉయ్యూరు, విజయవాడ తదితర ప్రాంతాలలో కూడా అధికసంఖ్యలో బాధితులున్నారు. శనివారం వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. అయితే విస్సన్నపేట పోలీస్స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
అవనిగడ్డలో బుక్ కీపర్ ఘరానా మోసం
అవనిగడ్డ: అవనిగడ్డ శివారు లంకమ్మ మాన్యంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి పొదుపు, లోన్లకు కట్టాల్సిన రూ.25 లక్షల సొమ్మును బుక్ కీపర్ స్వాహా చేసి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగక పోవడంతో శనివారం బాధిత మహిళలు నిరసన తెలిపారు.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పంచాయతీ పరిధిలోని లంకమ్మ మాన్యంకు చెందిన భాగ్యశ్రీ స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలుగా ఉన్న విశ్వనాథపల్లి నాగమల్లేశ్వరి 23 డ్వాక్రా గ్రూపులకు బుక్ కీపర్గా పనిచేస్తోంది. భాగ్యశ్రీ గ్రూపు సభ్యులు నాలుగేళ్ల క్రితం రూ.20 లక్షలు యూనియన్ బ్యాంకు నుంచి లోను తీసుకున్నారు. వీటికి సంబంధించి ప్రతినెలా పొదుపు, లోను చెల్లిస్తుండగా మరో ఏడు నెలలు చెల్లిస్తే పూర్తిగా చెల్లింపులు జరిగినట్టవుతుంది. ఒక్కో సభ్యురాలు రూ.30వేలు కడితే లోను పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో గత నెల 11వ తేదీ నుంచి నాగమల్లేశ్వరితో పాటు ఆమె భర్త, పిల్లలు కనబడకుండా వెళ్లిపోయారు. దీంతో బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీయగా ఇంకా రూ.8.50 లక్షలు కట్టాలని చెప్పడంతో కంగుతిన్నారు. లంకమ్మ మాన్యంకు చెందిన మరియా ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులు గతంలో రూ.15లక్షలు ఇండియన్ బ్యాంకు నుంచి లోను తీసుకున్నారు. ప్రతినెలా నాగమల్లేశ్వరికే ఈ గ్రూపు సభ్యులు లోను, పొదుపు డబ్బులు ఇచ్చేవారు. ఎనిమిది నెలల క్రితమే ఈ సభ్యులు తీసుకున్న లోను తీర్చేశారు. అప్పటి నుంచి మరో లోను ఇప్పిస్తానని చెప్పి వీరి వద్ద నుంచి మరికొంత సొమ్ము తీసుకుంది. ఈమె కనిపించకుండా పోయిన తరువాత ఈ గ్రూపు సభ్యులు బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీయిస్తే రూ.6.35 లక్షలు కట్టాలని చెప్పడంతో అవాక్కయ్యారు. నాగమల్లేశ్వరి కోడలు సెక్రటరీగా ఉన్న యాసిన్ గ్రూపు సభ్యులు గతంలో ఒక్కొక్కరు రూ.2 లక్షలు లోను తీసుకున్నారు. ఈ గ్రూపునకు సంబంధించి నాలుగు నెలల పొదుపు, లోను డబ్బులు నాగమల్లేశ్వరికి ఇవ్వగా వాటిని బ్యాంకుకు చెల్లించలేదు. ఫోర్జరీ సంతకాలతో శ్రీనిధి లోను భాగ్యశ్రీ గ్రూపు ప్రెసిడెంట్గా ఉన్న విశ్వనాథపల్లి నాగమల్లేశ్వరి సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి రూ.2లక్షలు శ్రీనిధి లోను తీసుకుంది. బ్యాంకుకు వెళ్లినపుడు ఈ విషయం తెలియడంతో బాధిత మహిళలు లబోదిబో మంటున్నారు. అదికాక యాసిన్ గ్రూపు నుంచి సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి మరో రూ.3లక్షలు లోను తీసుకుంది. ఇలా ఇప్పటివరకూ ఈ మూడు గ్రూపుల నుంచి రూ.25 లక్షలకు పైగా సొమ్మును స్వాహా చేసినట్టు లెక్కలు తేలాయి. మూడు గ్రూపుల నుంచే ఇంత సొమ్ము స్వాహా చేస్తే, ఆమె బుక్ కీపర్గా ఉన్న మరో 20 గ్రూపుల పరిస్థితి ఏమిటోనని ఆయా గ్రూపుల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నాగమల్లేశ్వరి మొత్తం 23 గ్రూపులకు బుక్కీపర్గా ఉండగా ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి. కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా... ఈ విషయమై గత నెల 14వ తేదీన అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. 15వ తేదీన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు, 17వ తేదీన కలెక్టర్ డీకే బాలాజీకి కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకూ న్యాయం జరగకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొదుపు, లోను డబ్బులు కట్టక పోవడంతో ఇప్పటికే బ్యాంకులు రూ.2లక్షలు పొదుపు సొమ్ము జమ వేసుకుందని, మరిన్ని డబ్బులు జమ వేసుకోక ముందే కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు కోరుతున్నారు. -
లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపిచిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వరం కేసులు పరిష్కరించుకోవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్లో శనివారం జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 49 బెంచ్లను ఏర్పాటు చేశామన్నారు. 43,824 కేసులు పరిష్కారం జాతీయ లోక్అదాలత్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆయా కోర్టుల్లో 43,824 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. ఈ లోక్అదాలత్లో 38,525 క్రిమినల్ కేసులు, 331 సివిల్ కేసులు, 1313 చెక్బౌన్స్ కేసులు పరిష్కరించారన్నారు. 142 మోటారు వాహన ప్రమాద క్లయిమ్లకు గానూ రూ.9.85 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయన్నారు. 3,513 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించి అవార్డులు జారీ చేశామన్నారు. మచిలీపట్నంలోని కోర్టుల్లో 7,449 కేసులు, విజయవాడ కోర్టుల్లో 11,964, గుడివాడ 6594, నందిగామ 3334, నూజివీడు 2340, మైలవరం 1892, జగ్గయ్యపేట 927, బంటుమిల్లి 734, కై కలూరు 684, తిరువూరు 3340, గన్నవరం 1668, అవనిగడ్డ 1541, మొవ్వ 673, ఉయ్యూరు కోర్టులో 684 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
బీటీఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
మచిలీపట్నంటౌన్: బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) –అమరావతి సంఘ కృష్ణా జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక బైపాస్ రోడ్లోని బహుజన టీచర్స్ అసోసియేషన్ –అమరావతి సంఘ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి లంకపల్లి రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చేబ్రోలు శరత్చంద్ర మాట్లడుతూ ఉపాధ్యాయులకు రావలసిన డీఏలు, సంపాదిత సెలవు బకాయిలను తక్షణం విడుదల చేయాలని, పీఆర్సీ కమిషన్ను నియమించి 30 శాతం ఐఆర్ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం నూతనంగా ఎన్నికై న ఆ సంఘ జిల్లా శాఖ కార్యవర్గసభ్యులు జిల్లా విద్యా శాఖాధికారిగా ఇటీవల బాధ్యతలను చేపట్టిన యూవీ సుబ్బారావును మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బీటీఏ జిల్లా నూతన కార్యవర్గం ఇదే: బీటీఏ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడిగా ప్రత్రిపాటి జలంధర్, గౌరవ సలహాదారుగా ఎల్.రామచంద్రరావు, అధ్యక్షుడిగా మన్నెం పవన్ కుమార్ (కేపీటీ పాలెం, బందరు మండలం), ప్రధాన కార్యదర్శిగా తేరా దైవకాంత్ (ఫిషర్మెన్ కాలనీ, బందరు మండలం), అసోసియేట్ అధ్యక్షుడిగా కందిమళ్ల శ్రీనివాసరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా బట్టా రవికుమార్, కోశాధికారిగా ఆబూతురబ్ అలీ, ఉపాధ్యక్షులుగా సైకం వెంకట్రావు, కె.గోపాలం, కార్యదర్శులుగా దోమతోటి ప్రభాకర్, కొనకళ్ల వెంకటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు జిల్లాలో సంఘ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
‘వేగ’లో పండుగల ఆఫర్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు):రానున్న ధనుర్మాసం, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని వేగ జ్యూయలర్స్లో ప్రత్యేక ఆఫర్లు ప్రవేశ పెట్టారు. ఈ నెల 15 నుంచి అందుబాటు లోకి రానున్న ఈ ఆఫర్ల బ్రోచర్ను శనివారం విజయవాడ బృందావన కాలనీలోని నందమూరి రోడ్డులో ఉన్న వేగ షోరూమ్లో మిరాయ్ సినిమా ఫేమ్ రితిక నాయక్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఆఫర్లలో భాగంగా బంగారు ఆభరణాల తరుగులో 50 శాతం తగ్గింపు, పోల్కి ఆభరణాల తయారీ, తరుగు చార్జీలు ఉండవని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. వజ్రాభరణాల క్యారట్ ధర కేవలం రూ.49,999 ఉంటుందని, అందరూ ఈ అద్భుతమైన ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మైలవరం: ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ను ట్రాక్టర్ ఢీకొని, అదుపు తప్పి పార్కింగ్ ప్రదేశంలో ఉంచిన ద్విచక్ర వాహనాల పైకి దూసుకు వెళ్లడంతో 9 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మండలంలోని పొందుగల గ్రామం నుంచి మైలవరం ఏఎంసీకి ధాన్యం లోడుతో ట్రాక్టర్ వెళుతోంది. ఈ క్రమంలో విజయవాడ వైపు నుంచి మైలవరం వస్తున్న ఆర్టీసీ బస్ను స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్ద ట్రాక్టర్ ఢీకొని అదుపు తప్పి ఎల్బీఆర్సీఈ విద్యార్థులు పార్కింగ్ చేసిన వాహనాల పైకి దూసుకువెళ్లింది. దీంతో పార్కింగ్లోని 9 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆర్టీసీ బస్ పాక్షికంగా దెబ్బతింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్లో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. లకిరెడ్డి బాలిరెడ్డి కళాశాల విద్యార్థి బాణావత్ మోనిక్ నాయక్కి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని మైలవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి కారణం ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమేనని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): రద్దీ ప్రదేశాల్లో ఏమరుపాటుగా ఉన్న ప్రయాణికుల నుంచి సెల్ఫోన్స్ దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన 11 ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్ఐ జె.భానుప్రసాద్ తెలిపారు. విజయవాడ బస్టాండ్లోని పోలీస్ ఔట్పోస్టులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన క్రైమ్ ఎస్ఐ గిరిధర్బాబుతో కలిసి నిందితులను ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గుంటుపల్లి ప్రాంతంలో నివసిస్తున్న షేక్ రియాజ్, చిట్టినగర్ వాగు సెంటర్కు చెందిన ములకా అర్జునసాయి, ఇబ్రహీపట్నంకు చెందిన ఒక బాల నేరస్తుడు స్నేహితులు. వీరు ముగ్గురూ కలిసి సెల్ఫోన్లు దొంగతనం చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ ప్రదేశాల్లో తిరుగుతూ ఆదమరిచి ఉన్న ప్రయాణికుల నుంచి మొబైల్స్ దొంగతనానికి పాల్పడుతున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో సీపీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ సూచనలతో ఏసీపీ పావన్కుమార్ పర్యవేక్షణలో సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్టేషన్ పరిధిలోని బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై పటిష్ట నిఘా పెట్టారు. ఈ క్రమంలో దొంగిలించిన మొబైల్స్ను అమ్ముదామని ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద వెళ్లి అనుమానంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన 11 మొబైల్స్, ఒక మోటార్సైకిల్ను స్వాధీనం చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో కానిస్టేబుళ్లు విజయసారథి నాయక్, రాజేష్, నాగుల్మీరా, సాయి తదితరులు పాల్గొన్నారు. -
బైపాస్రోడ్డులో బైక్ దగ్ధం
కంకిపాడు: కంకిపాడు బైపాస్ రోడ్డు మార్గంలో బైక్ దగ్ధమైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...పటమటకు చెందిన అయ్యప్ప మాలధారి బైక్పై ఉయ్యూరు నుంచి విజయవాడ వైపు వస్తుండగా మార్గ మధ్యంలో కంకిపాడు బైపాస్ మార్గంలో బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన బైక్ యజమాని ఒక్కసారిగా బైక్ స్టాండు వేసి బైక్ దిగటంతో వాహనదారుడికి ఎలాంటి గాయాలు కాలేదు. పెట్రోలు లీక్ అయి బ్యాటరీపై పడటంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సందీప్ తెలిపారు. -
గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం
గుడివాడ: నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడివాడలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం(ఢిసెంబర్ 14వ తేదీ) ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమీపంలోని ఇతర షాపులకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరిజజన్ల సాయంతో అక్కడకు వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. -
మంత్రి సాక్షిగా బట్టబయలైన ఏపీ ప్రభుత్వం బండారం
విజయవాడ: ఏపీలోని రైతుల్ని దీనావస్థలోకి నెట్టేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బండారం బట్టబయలైంది. మంత్రి పార్థసారథి ఎపిసోడ్తో ప్రభుత్వం గుట్టురట్టయ్యింది. రైతులు దీనావస్థలో ఉన్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్ని రోజుల క్రితం చెప్పింది.. ఇప్పుడు మంత్రి పార్థసారధి సాక్షిగా నిజమని తేలిపోయింది. అసల రైతుల పట్ల ప్రభుత్వ నిబంధనలు ఎంత దారుణంగా ఉన్నాయో సుస్పష్టమైంది.ఈరోజు(శనివారం) మంత్రికి రైతుల నుంచి సెగ తగలడంతో రెచ్చిపోయారు. బూతులతో మరీ రెచ్చిపోయారు రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని మంత్రికి రైతులు ఫిర్యాదు చేయగా, దాన్ని అధికారుల మీదకు, మిల్లర్ల మీదకు నెట్టేసే యత్నం చేశారు. మీరు మీర కలిసి దోచుకోండి అంటూ మండిపడ్డారు. ఫలితంగా మిల్లర్లకు లబ్ధి చేకూర్చడం కోసం ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్న వైనం బయటపడింది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటామో చెప్పకుండా ‘ మీరు మీరు’ దోచుకోండి’ అంటూ అధికారుల్ని, మిల్లర్లపై ధ్వజమెత్తారు మంత్రి. నాణ్యత ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు ప్రభుత్వం. మంత్రి పార్థసారథి సొంతగ్రామంలో కూడా ధాన్యం కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు చేయక కల్లాల్లోనూ , మిల్లుల వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారు. నాణ్యత ఉన్నప్పటికీ తేమ శాతం చూపించి మిట్లర్లు ధాన్యం కొనుగోలు చేయని క్రమంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఇవ్వకుండా ఇలా రెచ్చిపోతే రైతుకు న్యాయం ఎలా జరుగుతుందనేది రైతుల ప్రశ్న. -
నృత్య శిక్షణ తరగతుల ప్రారంభం
కూచిపూడి(మొవ్వ): మూడు రోజుల పాటు నిర్వహించే కూచిపూడి నాట్య శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కూచిపూడి సర్పంచ్ కొండవీటి వెంకటరమణ విజయలక్ష్మి సూచించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్ర సంగీత నాటక అకాడమీ డైరెక్టర్ కళారత్న డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి ఆధ్వర్యంలో కూచిపూడిలోని శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్ నిర్వహించే నృత్య శిక్షణ తరగతులను సర్పంచ్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యాం, ఏఎంసీ చైర్మన్ దోనేపూడి శివరామయ్య, కూచిపూడి రోటరీ క్లబ్ ఉపాధ్యక్షుడు కొండ వీటి అమర బాలేశ్వరరావు, నాట్యాచా ర్యులు పసుమర్తి నారాయణమూర్తి, మువ్వ మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బెల్లంకొండ వెంకటేశ్వరరావు, నాట్యాచార్యులు జగన్నాథరావు, డాక్టర్ వసంత్ కిరణ్ పాల్గొన్నారు. చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల ఎనిమిదో తేదీన కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో గుర్తు తెలియని పురుషుడు అనారోగ్యంతో ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు చేరుకొని అతడిని 108 అంబులెన్స్లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతను చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి గురు వారం రాత్రి ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆస్పత్రి అవుట్పోస్ట్ నుంచి వచ్చిన సమాచారం మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వయసు 49 సంవత్సరాలు ఉంటుం దని, అనారోగ్యంతో బక్కచిక్కి ఉన్నా డని, ఆకుపచ్చ రంగు చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వన్టౌన్ పోలీసుస్టేషన్లో లేదా 94406 27176, 0866 – 2568220 ఫోన్ నంబర్లలో సమాచారం అందించాలని కోరారు. -
భక్తి ప్రకాశం.. అరుణోదయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలా ద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకోగా.. శుక్రవారం సుమారు 80 వేల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 1.15 గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీ దర్శనానికి అనుమతించారు. గురువారం రాత్రి నగరానికి చేరుకున్న భవానీలు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని, క్యూలైన్లోనే వేచి ఉండటం కనిపించింది. వేకువజామునే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భవానీలు, కొండ దిగువకు చేరుకుని ఇరుముడులను సమర్పించారు. అనంతరం ఇరుముడిలోని నేతి కొబ్బరి కాయను హోమగుండానికి అర్పించి దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. దీక్ష విరమించిన భవానీలు లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 11 గంట వరకు భవానీలకు అమ్మవారి దర్శనం కల్పించారు. భవానీలతో పాటు సాధారణ భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. నేడు, రేపు కీలకం.. భవానీ దీక్ష విరమణలలో శనివారం, ఆదివారం అత్యంత కీలకమని ఆలయ అధికారులు భావిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారాల నేపథ్యంలో భవానీలు భారీగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భవానీలు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. కుమ్మరి పాలెం మొదలు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్ వరకు పలు ప్రధాన కూడళ్లు, అపార్టుమెంట్లు, భవన సముదాయాల వద్ద పలు భక్త బృందాలు, సేవా బృందాలు అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు అల్పాహారం, పాలు, పండ్లు, ఫలాలను అందిస్తూ సేవలు చేస్తున్నారు. దుర్గగుడి ఈవో శీనానాయక్ గిరిప్రదక్షిణ మార్గంలో బైక్పై తిరుగుతూ భవానీలతో మాట్లాడారు. ఇబ్బందులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈవో వెంట ఈఈ రాంబాబు పాల్గొన్నారు. -
జగన్ పాలనలో నాణ్యతతో కూడిన కిట్లు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో ఏటా విద్యార్థులకు పుస్తకాలతో పాటుగా అత్యంత నాణ్యతతో కూడిన బ్యాగులు, షూస్ అందించారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులకు వాటిని అందజేశారు. గత ప్రభుత్వ పాలనలో చక్కగా యూనిఫామ్ ధరించి బ్యాగులు తీసుకొని షూస్ వేసుకొని హుందాగా పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యే వారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు లక్ష మంది విద్యార్థులకు అందించిన బ్యాగులు, షూస్లో సగం వరకూ చిరిగిపోయి ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. -
21న యూటీఎఫ్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశాలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశంలో ఈ నెల 21వ తేదీన తిరువూరులో జరుగుతుందని సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య తెలిపారు. ఈ సమావేశాల కరపత్రాలను యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసరావు, సుందరయ్య మాట్లాడుతూ.. తిరువూరులో జరిగే సమావేశాలకు మాజీ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎనస్.ప్రసాద్ తదితరులు హాజరవుతారని తెలిపారు. సంఘం కార్యకలాపాల నివేదికలను ప్రవేశపెట్టి ఆమోదించి, నూతన కమిటీ ఎన్నిక జరుపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎ.ఎన్.కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్, నాయకులు ఎం.హనుమంతరావు, మచ్చా శ్రీనివాస్, పి.లీల, పి.నాగేశ్వరరావు, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అధికారిక అడ్డా
పేకాటరాయుళ్లకు సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేకాట శిబిరాలు జోరుగా నడుస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ శిబిరాలు నడుస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మొక్కుబడి దాడులతో సరిపెడుతు న్నారు. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తన వాట్సాప్ స్టేటస్లో పెట్టిన పోస్టు పేకాట జోరుకు నిదర్శనంగా నిలిచింది. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్. పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్’ అంటూ ఆయన వాట్సాప్ స్టేటస్లో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఇది నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్న తీరును, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. విస్సన్నపేట మండలంలోని కొండపర్వ గట్టుపై నిత్యం పేకాట క్లబ్బు నడుపుతున్నారని ఆ మండల ముఖ్య నాయకు డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్లో చేసిన కామెంట్లు టీడీపీ నాయకులు, పోలీసులను ఇరకాటంలో పడేశాయి. ఇక్కడ ప్రజాప్రతినిధుల మధ్య వివాదం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పార్లమెంట్ ప్రజాప్రతినిధి క్యాంపు కార్యాలయాల పేరుతో మండల కేంద్రాల్లో పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేశారు. తిరువూరు, విస్సన్నపేటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాల్లోకి ఎమ్మెల్యేకు, ఆయన అనుచరులకు ప్రవేశం లేకుండా అడ్డుకట్ట వేశారు. గతంలో పలుమార్లు పార్టీ నాయకులపైనే ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే ఈ సారి విస్సన్న పేటలో ఓ నాయకుడిని పరోక్షంగా ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో తిరువూరులో గంజాయి అమ్మకాలపై కూడా పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గీయులను టార్గెట్ చేస్తూ పోలీసుస్టేషనులో ఎమ్మెల్యే హల్చల్ చేశారు. పెనమలూరులో.. పెనమలూరులో పేకాట శిబిరాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రధానంగా పోరంకి–నిడమానురు రోడ్డు, వణుకూరు శివారు ప్రాంతాలు, కానూరు, పోరంకిలోని నివాస సముదాయాలు, ఈడుపుగల్లు, ఉప్పులూరు, యనమలకుదురు లంకలు, కోలవెన్ను, కంకిపాడులోని వాణినగర్, ఉయ్యూరు శివారు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. పోరంకిలో గత ఏడాది నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుచరుడి పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల పోరంకింలో టీడీపీ నాయకురాలి భర్త దొరి కాడు. కానూరులో ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారని తెలిసి పోలీసులు దాడిచేస్తే రూ.2 లక్షలు దొరికాయి. పెనమలూరు పోలీసుస్టేషన్లోని కానిస్టేబుల్ పేకాట శిబిరాల అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కంకి పాడు మండలం కోలవెన్ను గ్రామానికి చెందిన ఓ మంత్రి అనుచరుడు కొలుసు లక్ష్మణ్ ఉప్పులూరులో అద్దెకు తీసుకున్న ఇంట్లో కోతముక్క నిర్వహిస్తుండగా కంకిపాడు పోలీసులు పట్టుకున్నారు. 13 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద రూ.1,72,400, ఒక కారు, పది సెల్ఫోన్న్లను స్వాధీనం చేసుకున్నారు. ● గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు, సూరంపల్లిలో పేకాట శిబిరాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ● గుడివాడలో వన్టౌన్ పరిధిలో హోటళ్లు, లాడ్జిలు, నివాస గృహాలు, నందిగామ మండలంలో గాజులపాడు, పోలుకొండ, ఇలపర్రు, పుట్టుగుంట ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలతోపాటు, జనసేన నాయకులు చేతులు కలిపి పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు. ● పెడన నియోజకవర్గంలో మొబైల్ జూదం నడిపిస్తున్నారు. ● అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతిరోజు పెద్ద ఎత్తున పేకాట జరుగుతోంది. ఘంటసాల మండలం కొడాలి, కోడూరు మండలం మందపాకల శివారు ప్రాంతం, నాగాయలంక బస్టాండు ప్రాంతాల్లో జోరుగా పేకాట సాగుతోంది. ఇక్కడ ముఖ్యంగా ఓ సామాజిక వర్గం చెందిన ముఖ్యనేతలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అవనిగడ్డ మండలంలో జనసేన నేత పలుచోట్ల పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. చల్లపల్లి మండలంలో ప్రాంతాలు మారుస్తూ పేకాట ఆడుతున్నారు. ● మచిలీపట్నం నియోజకవర్గంలో పేకాట యథేచ్ఛగా జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా పేకాట శిబిరాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే శిబిరాల నిర్వహణ తిరువూరు ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్లో సంచలన వ్యాఖ్యలు ఎన్టీఆర్ సొంత గ్రామంలో యథేచ్ఛగా సాగుతున్న జూదం పామర్రులో పేకాట జోరు పామర్రు నియోజకవర్గంలో పేకాట జోరుగా సాగుతోంది. ప్రధానంగా మొవ్వ మండలంలోని క్రోసూరు పేకాట డెన్గా మారింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇక్కడ విచ్చలవిడిగా పేకాడిస్తున్నారు. పామర్రుతోపాటు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఏలూరు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పేకా డుతున్నారు. ఈ డెన్పై పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. ఇటీవల క్రోసూరులో పేకాట శిబిరాలపై దాడికి వెళ్లిన ఓ పోలీసు అధికారిపై జూదరులు దాడికి యత్నించారంటే, ఎంత బరితెగించారో ఇట్టే తెలిసిపోతోంది. దీంతో ఆ పోలీసు అధికారి ఇక్కడ పనిచేయలేక ఇటీవల బదిలీపై వెళ్లినట్లు నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. సాక్షాత్తూ ఎన్టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరులో సైతం పేకాట జోరుగా సాగు తోంది. ఇక్కడ డిమ్ అండ్ డిప్ వంటి వ్యక్తి ఆటను సాగిస్తున్నారు. ఈ తతంగం అంతా పమిడిముక్కల పోలీసు అధికారికి తెలిసే జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పామర్రులోని కొత్త పెద్దమద్దాలి శివారు ప్రాంతంలో యథేచ్ఛగా పేకాట శిబిరం కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా కింది స్థాయిలో కొంత మంది పోలీసు అధికారుల తీరు వల్లే పేకాటకు అద్దూఅదుపూ లేకుండా పోతోంది. పామర్రు ప్రాంతంలో మచిలీపట్నం నగరంలోని బలరామునిపేటకు చెందిన పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. -
రేషన్ పక్కదారి పడితే కఠిన చర్యలు
ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అమలుకు సంబంధించి విస్తృత తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్ పక్కదారి పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం జేసీ ఇలక్కియ ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వను అరికట్టే విషయాలపై జిల్లా పౌర సరఫరా శాఖ సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమన్వయ శాఖల అధికా రుల బృందాలు బోర్డర్ చెక్ పోస్ట్కు వచ్చే వాహనాలు, కోళ్ల ఫారాలు, చేపల చెరువులను విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. వీటిలో రేషన్ బియ్యాన్ని వినియోగిస్తే 6–ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అందరు ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి గ్యాస్ పంపిణీ తీరుపై సమీక్షించారు. గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన డెలివరీ బాయ్స్ వినియోగదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడటం ముఖ్య మన్నారు. గ్యాస్ ధర కంటే ఎక్కువ మొత్తం వసూలు చేసినట్లు తేలితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తప్పవని జేసీ ఇలక్కియ స్పష్టం చేశారు. 6–ఏ కేసుల్లో పలువురికి జరిమానా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ శుక్రవారం పౌర సరఫరాల శాఖకు సంబంధించిన 6–ఏ కేసుల కోర్టు నిర్వహించారు. ఈ కోర్టులో కేసులు నమోదు అయిన వ్యక్తులను, నమోదు చేసిన అధికారులను విచారించారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరానికి ఉపయోగించిన వారికి రూ.11 వేల జరిమానా విధించారు. 133 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ప్రభుత్వ పరం చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు వినియోగించిన వాహన యజమానికి రూ.5 వేలు, పీడీఎస్ బియ్యంతో అక్రమంగా వ్యాపారం చేసిన వారికి రూ.58 వేల జరిమానా విధించారు. -
నవ్విపోయిన నాణ్యత!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సర్కార్ పాఠశాలల విద్యార్థులకు అందించిన బ్యాగులు ఇతర సామగ్రి మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. వాటి నాణ్యత దారుణంగా ఉండటంతో విద్యార్థులు నానాతంటాలు పడుతున్నారు. అంత చేస్తాం.. ఇంత ఇస్తామంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ విద్యార్థి సంఘ నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన సామగ్రి మూడునాలుగు మాసాలకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 942 ప్రభుత్వ విద్యాసంస్థలు ఎన్టీఆర్ జిల్లాలోని 20మండలాల్లో సుమారుగా 942 ప్రభుత్వ యాజమాన్య పరిధిల్లో కొనసాగే విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్, మునిసిపల్ తదితర యాజమాన్యాల పేర్లతో అవి కొనసాగుతున్నాయి. ఆయా విద్యా సంస్థల్లో సుమారుగా లక్ష మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారికి 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటుగా బ్యాగ్, షూస్, యూనిఫామ్ తదితర వస్తువులతో కూడిన కిట్లను అందించారు. సాధారణంగా పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన వస్తువులను దాదాపుగా నెల రోజుల తేడాతో వాటిని విద్యార్థులకు అందించారు. ఇచ్చిన నెలకే చిరిగిపోయాయి.. ప్రభుత్వం అందించిన బ్యాగులు, షూస్ విద్యార్థులకు అందిన నెల రోజులకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానంగా నాణ్యత లేని బ్యాగులు అందించటంతో చిరిగిపోయిన వాటిని కొంతమంది వాటిని కుట్టే వారికి అందించి డబ్బులిచ్చి కుట్టించుకున్నామని చెబుతున్నారు. మరికొంతమంది వారే సూదితో కుట్టుకొని అవస్థలు పడుతూ వినియోగిస్తున్నారు. కొంతమంది తమ బ్యాగులు ఎక్కడికక్కడ పీసులుగా ఊడిపోయి కుట్టడానికి సైతం కుదరకపోవటంతో వాటిని బయట పడేసి ఇతర బ్యాగులతో పాఠశాలలకు వస్తున్నారు. షూస్ పరిస్థితి సైతం అదే విధంగా ఉందని విద్యార్థులతో పాటుగా కొంతమంది ఉపాధ్యాయులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. తల్లిదండ్రుల ఆగ్రహం.. చంద్రబాబు ప్రభుత్వం పాలనలో తమ పిల్లలకు బ్యాగులు, షూస్ ఇచ్చామనే పేరే తప్ప వాటిలో నాణ్యత లేదని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అందించే వస్తువులు నాణ్యత లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు అందులోనూ చిన్నపిల్లలు వాడే వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరిగిపోయిన బ్యాగుల్లో పుస్తకాలు తీసుకువెళ్లటానికి చిన్నారులు నానా తంటాలు పడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం చంద్రబాబు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందించిన వస్తువులు చాలా నాసిరకంగా ఉన్నాయి. బ్యాగ్తో పాటు బూట్లు కూడా రెండు నెలలకే చిరిగిపోయాయి. వాటిని పక్కన పెట్టేసి చెప్పులతోనే స్కూల్కి పంపుతున్నాం. పేద పిల్లల కోసం ఇస్తున్న వస్తువుల్లో నాణ్యత ఉండాలే తప్ప, ఇలా మూడునెల్లకే పాడైపోతే ఎలా? మళ్లీ మా ఖర్చులతో కొనక తప్పడం లేదు. ప్రభుత్వం నాణ్యమైన వస్తువులను ఇస్తే పేదలపై భారం తగ్గుతుంది. – పేటేటి లావణ్య, విద్యార్థి తల్లి, మచిలీపట్నం ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కోసం ఇస్తున్నామంటూ ప్రచారం పెద్దగా చేస్తోంది. కానీ ఇచ్చిన బ్యాగులు నాణ్యత చాలా దారుణంగా ఉంది. కొన్ని పుస్తకాలను కూడా వాటిల్లో తీసుకెళ్లలేని పరిస్థితి. పిల్లలు చిరిగిన బ్యాగులను తలపై పెట్టుకుని మోసుకు వెళ్తున్నారు. తెగిపోయిన బూట్లను ఈడ్చుకుంటూ స్కూళ్లకు వెళ్తున్నారు. రెండు నెలలకే ఇలా పాడయితే పేదలు ఎలా కొనగలరు? ప్రభుత్వం పేదల పరిస్థితి తెలిసి కూడా కనీస నాణ్యతతో ఇవ్వాల్సింది పోయి దారుణమైన వస్తువులు విద్యార్థులకు అందించారు. – కోటప్రోలు నాగు, సర్పంచ్, చినగొన్నూరు, గుడ్లవల్లేరు మండలం -
ఓబీసీల సమస్యలపై 15న ఢిల్లీలో ధర్నా
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశ వ్యాప్తంగా ఓబీసీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. అందుకు సంబంధించిన హలో బీసీ.. చలో ఢిల్లీ పోస్టర్ను శుక్రవారం విజయవాడలోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగబద్ధంగా, సామాజిక న్యాయమందించేలా రిజర్వేషన్లు ఇవ్వడానికి, నేటి ఆదిపత్య–పెత్తందారీ రాజకీయ వ్యవస్థకున్న అభ్యంతరాలను స్పష్టం చేయాలని వారు నిలదీశారు. అనేక దశాబ్దాలుగా రాజకీయంగా చట్టసభలు, స్థానిక సంస్థల్లోనూ బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కేటాయించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమ రూపాలలో పోరాడుతూనే ఉన్నామన్నారు. తరాలు మారుతున్నాయే గాని, బీసీల సామాజిక–ఆర్థిక–రాజకీయ అంతరాల నిర్మూలనకు మాత్రం ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. ఓబీసీల సమస్యల పరిష్కారానికి పోరాట మార్గమే శరణ్యమని భావిస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆ సంఘ ఉపాధ్యక్షుడు కనకారావు, ఉద్యోగ సంఘాల కార్యనిర్వాహక అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరవు, బీసీ నాయకులు మేకా వెంకటేశ్వరరావు, వాక వెంకటేశ్వరరావు, రాంప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ సీపీలో తిరుపతిరావుకు అదనపు బాధ్యతలు జి.కొండూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గం జి.కొండూరుకు చెందిన వేములకొండ తిరుపతిరావును పంచాయతీ రాజ్ విభాగం జోన్–3 కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు అదనంగా ఈ బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తిరుపతిరావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. -
తిరువూరులో మళ్లీ మాటల యుద్ధం
తిరువూరు: ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్బుకా, పార్టీకా?’.. అంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నియోజకవర్గంలో తన పార్టీ నేతలపై మరోమారు మాటల దాడికి దిగారు. పార్టీ మండల స్థాయి నేతను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి.గత కొద్దికాలంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేదాలతో నియోజకవర్గంలో పార్టీ ఇరువర్గాలుగా చీలిపోయింది. దీంతో పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తంటాలు పడుతున్న సమయంలో కొలికపూడి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. విస్సన్నపేట మండలానికి చెందిన ముఖ్యనేతను ఉద్దేశించి కొలికపూడి.. ‘పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్’ అంటూ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పోస్టు చేయడంతో ప్రత్యర్థి వర్గం దీనికి కౌంటర్గా శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఎమ్మెల్యే తననుద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని, తాను సాయిబాబా సాక్షిగా ప్రమాణం చేసి తాను పేకాట శిబిరాలు నిర్వహించట్లేదని చెబుతానని, ఎమ్మెల్యే కూడా తనపై చేసిన ఆరోపణల నిరూపణకు ప్రమాణం చేస్తారా అని విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు ప్రశ్నించారు. తిరువూరులో బెల్టుషాపులను అడ్డుకుంటానని చెప్పి మద్యం సిండికేట్ల వద్ద డబ్బు దండుకోవడం, ఎ.కొండూరు మండలం గోపాలపురంలో మట్టి తవ్వకాలకు యత్నించి గ్రామస్తులు ప్రతిఘటించడంతో తోక ముడవడం ఎమ్మెల్యేకే చెల్లిందని ప్రత్యారోపణ చేశారు. ఇక కొలికపూడి తమ ఎమ్మెల్యే అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నామన్నారు. -
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
మైలవరం: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ, ఏసీపీ వై. ప్రసాదరావు తెలిపారు. మైలవరం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాల్లో ఉన్న ఆలయాలను టార్గెట్ చేసుకుని మైలవరం సర్కిల్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు వారి నుంచి రూ.27,50, 050 విలువ గల వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు నెలల నుంచి మైలవరం సబ్ డివిజన్, సర్కిల్ పరిధిలోని దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతుండటంతో జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఏసీపీ వై. ప్రసాదరావు మైలవరం సర్కిల్ సీఐ దాడి చంద్రశేఖర్ పర్యవేక్షణలో మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మైలవరం ప్రభుత్వాసుపత్రి వద్ద గురువారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఆరుమళ్ళ పురుషోత్తం, (ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల జిల్లా, తెలంగాణరాష్ట్రం)తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో పురుషోత్తంతో పాటు మరో నలుగురు చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరవల్లి మండలం తేలుప్రోలుకు చెందిన పొట్లూరి పద్మతో పురుషోత్తం సహజీవనం చేస్తూ ఏలూరు జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నిర్మానుష్యంగా ఉన్న పరిసర ప్రాంతాల్లో దేవాలయాలను దొంగతనాలకు వీరు ఎన్నుకుంటున్నారు. అందుకోసం వీరితో పాటు మైలవరం మండలం తోలుకోడు, వెల్వడం రోడ్లో ఉంటున్న ఏకుల రవికుమార్, ఏకశిరి అభిలాష్ , ఏకశిరి చిట్టెమ్మ కలిసి ఒక బృందంగా ఏర్పడి ఏడాది నుంచి ఆలయాల్లో దొంగతనాలుకు పాల్పడుతున్నారు. మైలవరం పోలీస్ స్టేషన్లో 3, జి.కొండూరు 2, రెడ్డిగూడెం 1, ఆగిరిపల్లి 1, ద్వారకా తిరుమల 1, తాడేపల్లిగూడెం 1, విజయవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కేసులు నమోదయ్యాయి. దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్న విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దీనితో ఆరుమల్ల పురుషోత్తంలో పాటు అతని టీమ్ను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న సొమ్మును రికవరీ చేశారు. వీరిపై మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. దేవాలయాల్లో చోరీ కేసులు ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన మైలవరం ఎస్ఐ సుధాకర్, రెడ్డిగూడెం ఎస్ఐ, జికొండూరు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్ను పోలీస్ అధికారులు అభినందించారు. -
15లోగా నివేదికలు అందజేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 15వ తేదీలోగా జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్కు సంబంధించిన నివేదికలు అందజేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురించి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని, ఇందుకు సంబంధించి వివిధ ప్రభుత్వశాఖల నివేదికలు వెంటనే సిద్ధం చేసి అందించాలన్నారు. వివిధ అంశాలపై ఏమైనా మార్పులు ఉంటే జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూప్లో పంపుతామని, అందరూ అప్రమత్తంగా ఉండి గమనించాలన్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో జిల్లాకు సంబంధించిన అంశాలు ఉంటే వాటిని ఈసారి పొందుపరచాలని, గత మూడు నెలలుగా జిల్లాలో ఏమైనా కొత్తగా మొదలుపెట్టిన పనులకు సంబంధించిన వివరాల నోట్ లను కూడా అందజేయాలన్నారు. ఆర్టీజీఎస్ లెన్స్ మాస్టర్ డాష్ బోర్డులో చూపుతున్న వివరాలు సరిగా ఉన్నాయో, లేదో ఒకసారి పరిశీలించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ డీఆర్వో శ్రీదేవి, డ్వామా, డీఆర్డీఏ పీడీలు ఎన్వీ శివప్రసాద్, డి.హరిహరనాఽథ్, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, డీఈవో సుబ్బారావు, డీఎస్వో మోహన్బాబు, డీఎంఅండ్హెచ్వో యుగంధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
తాగునీరు, పారిశుద్ధ్య పనులు చేపట్టండి
కలెక్టర్ డీకే బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో గురువారం తాగునీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ మిషన్ నిధుల ద్వారా గ్రామ పంచాయతీల్లో మంజూరైన 956 మరుగుదొడ్ల పనులను త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సామాజిక పారిశుద్ధ్య సముదాయాల నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 18 అంగన్వాడీ కేంద్రాలు, ఇతర పనులను వెంటనే మొదలుపెట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మంజూరైన 148 మరుగుదొడ్లు, తాగునీటి పనులు 131 పూర్తి చేశారని మిగిలిన పనులు కూడా సత్వరమే చేపట్టాలని కోరారు. గ్రామాల్లోని అన్ని మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని అందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఏలూరు కాలువ పరిధిలో విజయవాడ నుంచి బుడమేరు వరద ముంపు జరగకుండా కాలువల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. గన్నవరం, నందివాడ, బాపులపాడు, ఉంగుటూరు మండలాల పరిధిలో అన్ని చెరువులను నూరుశాతం నింపుకోవాలని తెలిపారు. అవసరమైతే అదనపు బోర్లను కూడా వేయాలన్నారు. మురుగుకాలువల నిర్మాణంలో ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం
విస్సన్నపేట: విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక వెలుగు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఎంపీపీగా 6వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు గద్దల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కె.మాధురి, అబ్జర్వర్గా జేసీ ఎస్.ఇలక్కియా వ్యవహరించారు. ఏకగ్రీవంగా ఎన్నికై న ఎంపీపీతో ఆర్డీవో ప్రమాణస్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. తహసీల్దార్ కె.లక్ష్మీకళ్యాణి, ఎంపీడీఓ చేకు చిన్నరాట్నాలు, ఎస్ఐ రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యుడు పాల్గొన్నారు. మల్లయ్యకు అభినందనలు గద్దల మల్లయ్యను వైఎస్సార్ సీపీ నాయకులు మండలంలోని పుట్రేల గ్రామంలో పార్టీ రాష్ట్ర నాయకుడు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి నివాసం వద్ద గురువారం అభినందనలు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు, నియోజకవర్గ అబ్జర్వర్ తంగిరాల రామిరెడ్డి,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఓలేటి దుర్గారావు, పట్టణ అధ్యక్షుడు నెక్కళపు కుటుంబరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


