Krishna
-
ఈ మంగళవారం బాబు సర్కార్ అప్పు.. రూ.4,600 కోట్లు
సాక్షి, విజయవాడ: దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో రికార్డులు నమోదు చేసిన ఆయన మళ్లీ భారీ అప్పు చేశారు. ఈ మంగళవారం(ఏప్రిల్ 21వ తేదీ) రూ.4,600 కోట్లు అప్పు తెచ్చారు.గడిచిన 23 నెలల్లో మొత్తం అప్పులు రూ.3,56,655 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రూ.9,000 కోట్లు, ఈ నెల 7వ తేదీన రూ.4,400 కోట్లు అప్పు చేశారు.ఘోర పాలనా వైఫల్యంతో అప్పుల రికార్డు నెలకొల్పిన చంద్రబాబు రూ.1,98,564 కోట్లు బడ్జెటరీ అప్పులు, కార్పొరేషన్ల గ్యారెంటీ కింద రూ.1,10,704 కోట్లు, రాజధాని అప్పులు రూ.47,387 కోట్లు చేశారు.ఇలా దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన సీఎంగా చంద్రబాబు రికార్డులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో 60 నెలల్లో రూ.3,32,000 కోట్ల అప్పులు చేస్తే, చంద్రబాబు కేవలం 23 నెలల్లోనే రూ.3,56,655 కోట్ల అప్పులు చేయడం గమనార్హం. -
పాలిసెట్కు ఏర్పాట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్)–2026 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. డీఆర్వో మాట్లాడుతూ ఏప్రిల్ 25వ తేదీ శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 21 పరీక్ష కేంద్రాల్లో 5,634 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా విజిలెన్స్, లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ పీటర్, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ రవీంద్రబాబు, జిల్లా ప్రజా రవాణాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కారు ఢీకొని జింక మృతి పెనుగంచిప్రోలు: కారు ఢీకొని జింక మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి జాతీయ రహదారిపై వేదాద్రి వైపు వెళ్తున్న కారు కొణకంచి క్రాస్రోడ్స్ వద్ద పొలాల్లో నుంచి అకస్మాత్తుగా రోడ్డు దాటుతున్న జింకను ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన జింక అక్కడికక్కడికే మృతి చెందింది. ఘటన జరిగిన వెంటనే ఫారెస్ట్ జగ్గయ్యపేట సెక్షన్ ఆఫీసర్ కె. రవివర్మ, వీఆర్ఓ పి. శ్రీను, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు హైవే మొబైల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలొదిలిన జింకను రోడ్డు పక్కకు తెచ్చారు. వారందరి సమక్షంలో నవాబుపేట పశువైద్యాధికారి శంకర్నాయక్ జింకకు పోస్టుమార్టమ్ నిర్వహించారు. అనంతరం జేసీబీతో గుంత తీయించి ఖననం చేశారు. ముగిసిన కొండపల్లి బొమ్మల పండుగ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత మూడు రోజులుగా జరుగుతున్న కొండపల్లి ఖిల్లా, కొండ పల్లి బొమ్మల పండుగ సోమవారం రాత్రి ముగిసింది. మూడురోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు బొమ్మల ప్రదర్శన, కళాకారుల ర్యాలీ ప్రదర్శనలతో పట్టణంలో ఉల్లాసాన్ని నింపాయి. ముంగిపు కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పూర్వం శ్రీ కృష్ణదేవరాయులు కాలంలో వీధుల్లో రత్నాలు రాసుల్లా పోసి అమ్మేవారని, నేడు కొండపల్లి బొమ్మలను రత్నాల్లా వీధుల్లో అమ్ముతున్నారని తెలిపారు. కొండపల్లి బొమ్మలు దేశానికి నిజ మైన వారసత్వ సంపద అన్నారు. కొండపల్లి బొమ్మల పోటీల్లో విజేతలుగా నిలిచిన శంకర్, గౌస్ బాషా, షేక్ ఖాజాకు వరుసగా రూ.30వేలు, రూ. 20వేలు, రూ. 10వేలను బహుమతులుగా అందజేశారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. అప్పు చేయడమే సంపద సృష్టా? గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా అంటూ జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ. 3.50లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర లేదు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు పూర్తిగా అటకెక్కాయని, తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారని కూటమి పాలకులను ప్రశ్నించారు. సోమవారం విజయవాడలోని జై భీమ్ భారత్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లు కూడా నిండని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో మూడున్నర కోట్లు అప్పులు చేసిందని, ఇందుకు గల కారణాలను స్పష్టం చేయాలన్నారు. ప్రతి మంగళవారం అప్పులు తెస్తూ మంగళవారం ప్రభుత్వంగా కూటమి మిగిలిపోయిందన్నారు. మావిగన్ ఓ మంచి ప్రతిపాదన ప్రతిపక్షనేత చేసిన మావిగన్ ప్రతిపాదనను ఈ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని శ్రావణ్ డిమాండ్ చేశారు. అమరావతిలో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రజలు రావడానికి వీల్లేదా అని ప్రశ్నించారు. వాళ్లేమైన అంటరాని వాళ్లా అని నిలదీశారు. -
త్యాగరాజ స్వామికి స్వరనీరాజనం
విజయవాడ కల్చరల్: శ్రీసద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలు శివరామకృష్ణ క్షేత్రంలో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు కళాకారులు త్యాగరాజస్వామికి స్వరనీరాజనాలు అర్పించారు. అన్త్వతమణి గాత్ర కచ్చేరీ శ్రావ్యంగా సాగింది. ఓరుగంటి సాయి వశిష్ట, కె.దుర్గాగాయత్రి, కె.లక్ష్మీవెంకట సత్యవల్లి, వావిలాల వేంకట రఘునామ ప్రణద, బొమ్మరాజు రఘనాథరావు, ఎం.చంద్రశేఖర్, కస్తూరి గోపాలరావు, కందుర్తి లక్ష్మీనరసమ్మ, తుషార పూర్ణవల్లి తదితరులు త్యాగరాజ స్వామి కృతులను వీనుల విందుగా ఆలపంచారు. సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఎన్.సీహెచ్. బుచ్చయ్యా చార్యులు త్యాగరాజ మార్గం అంశంగా ప్రసంగించారు. నందకుమార్, చావలి శ్రీనివాస్, కె.జగన్మోహిని, కందుల అనిల్కుమార్ వాద్య సహకారం అందించారు. వెడలెను కోదండపాణి, రామ నామము జన్మరక్షణ మంత్రము, ఇక కావలసినది ఏమి, రామ ననుబ్రోవరా తదితర కీర్తనలు అలరించాయి. వారం రోజులపాటు నిర్వహించే త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలను సంస్థ అధ్యక్షుడు బి.వి.ఎస్.ప్రకాష్ ప్రారంభించారు. ప్రధాన కార్యదర్శి పోపూరి గౌరీనాథ్, ఉపాధ్యక్షుడు బి.హరిప్రసాద్, సభ్యులు గాయత్రీ గౌరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి
ఉపాధి హామీ పథకంపై నీలినీడలు మధురానగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో పేద కార్మికులు రోడ్డున పడ్డారని.. ఉపాధి హామీ పథకంపై నీలినీడలు అలుముకున్నాయని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. స్థానిక విజయవాడ సత్యనారాయణపురం భగత్సింగ్ రోడ్డులోని యూనియన్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మార్చి, ‘జీరామ్ జీ’ పథకాన్ని తీసుకురావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. 2025–26 సంవత్సరానికి గానూ పనిదినాలు ఏకంగా 57.6 శాతానికి తగ్గించటం విచాకరమన్నారు. 2024–25లో 24.52 కోట్ల పనిదినాలు ఉంటే, ప్రస్తుత ఏడాదికి అవి 18.59 కోట్లకు పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో రాజకీయం.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి సుమారు 1,200 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని, నిజమైన కార్మికులకు పని కల్పించకుండా, కేవలం అధికార పార్టీ సానుభూతిపరులకే డబ్బులు చెల్లిస్తున్నారని గౌతంరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో 80వేల మంది వికలాంగ కార్మికులకు లబ్ధి చేకూరగా, ప్రస్తుత ప్రభుత్వంలో ఆ సంఖ్య 66వేలకు పడిపోయిందని అన్నారు. దర్శన టికెట్ల దందాపై సీఎంఓకి ఫిర్యాదు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో దర్శన టికెట్ల వ్యవహారం రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. గతంలో దర్శన టికెట్లను జిరాక్స్ కాపీలు తీసి అమ్మవారి దర్శనాలు చేయించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట దేవస్థాన ప్రోటోకాల్ దర్శనాలలో రూ. 500 టికెట్లను పదే పదే వినియోగిస్తున్న వ్యవహారం ఈవో దృష్టికి వచ్చింది. అయితే తాజాగా ఓ భక్తుడు తన స్నేహితులైన మరో ముగ్గురితో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. తనకు పరిచయం ఉన్న దేవస్థాన రిటైర్డ్ ఉద్యోగి సహకారంతో ప్రోటోకాల్ దర్శనం చేయించాలని కోరాడు. అయితే ఈ వ్యవహారంలో మధ్యవర్తులు సదరు భక్తుడి నుంచి రూ. వెయ్యి వసూలు చేశారు. ఆలయంలోని అవుట్సోర్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అటెండర్కు ఈ బాధ్యత అప్పగించారు. దర్శనం పూర్తయిన తర్వాత ఆ భక్తుడి నుంచి మరో వెయ్యి రూపాయలు ఫోన్పే చేయించుకున్నారు. దీంతో ఆగ్రహించిన సదరు భక్తుడు సీఎంఓలో పరిచయం ఉన్న వ్యక్తి సాయంతో ఈ వ్యవహారాలపై నేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలయ ఈవోను సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో కింది స్థాయిలో ఉన్న అటెండర్పై ఈవో వేటు వేసినట్లు సమాచారం. ఆలయంలో దర్శన టికెట్ల దందాలో కొంత మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ భాగస్వాములై ఉండటంతో ఇది కొనసాగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
లిఫ్ట్.. ప్రైవేటుకు గిఫ్ట్!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకోనుంది. రైతుల్లో అనైక్యతతో పాటు పలు ఇతర కారణాల వల్ల ఇప్పటికే సగానికి పైగా పథకాలు పనిచేయడం లేదు. కొన్ని పథకాలు ఏకంగా మూలన పడ్డాయి. ప్రైవేటుకు అప్పగిస్తే విచ్చలవిడిగా నీటి తీరువా వసూలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములు సాగు చేసే కౌలు రైతులపై అధిక భారం పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇదీ జిల్లాలో పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా మెట్ట ప్రాంతం. కృష్ణానదితో పాటు కట్టలేరు, మునేరు, వైరాయేరు, పాలేరు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. మెట్ట ప్రాంత రైతుల సాగు నీటి అవసరాలు తీర్చేందుకు, భూములను సాగులోకి తెచ్చేందుకు ఆయా యేర్లపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. జిల్లాలో చిన్నవి, పెద్దవి మొత్తం 118 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి కింద 1,13,511 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఎత్తిపోతల పథకాలను నిర్వహించేది. తర్వాత కాలంలో నిర్వహణ బాధ్యతలను రైతులకే అప్పగించి నీటిపారుదల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణ చేస్తోంది. రైతు నిర్వహణలోకి రావడంతో ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టింది. రైతుల మధ్య విభేదాలు, రాజకీయాల కారణంగా సక్రమంగా నిర్వహించడం లేదు. ఫలితంగా ఒక్కొక్కటి మూతపడుతూ వస్తున్నాయి. తరచూ మోటార్లు రిపేర్లు, పైపులు దెబ్బతినడం తదితర కారణాలతో సామర్థ్యాన్ని కోల్పోయాయి. పనిచేయని పథకాలు.. ఎన్టీఆర్ జిల్లాలోని 118 ఎత్తిపోతల పథకాల్లో 45 మాత్రమే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వీటి కింద మాత్రమే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. 46 పథకాలు పాక్షికంగా పనిచేస్తున్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల రైతుల మధ్య విభేదాలు, రాజకీయ పార్టీల ప్రమేయంతో ఉద్దేశపూర్వకంగా తాళం వేసి ఉంచారు. ఆయకట్టు పరిధిలోని ఒక్కోరైతు ఎకరాకు వెయ్యి రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బులు సక్రమంగా వసూలు కాకపోవడం, మరమ్మతులు వచ్చినపుడు సకాలంలో చేయించకపోవడంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పథకాలు నిర్వీర్యం అవుతున్నాయి. 20 పథకాలు పూర్తిగా పనిచేయడం లేదు. 7 పథకాలను పూర్తిగా మూసివేశారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఎత్తిపోతల పథకాలను ప్రైవేటుకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులు ఇష్టానుసారం నీటి తీరువా వసూలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులైతే దోపిడీకి ఆస్కారం ఉంటుంది. పంటలు సాగు చేసే వారిలో కౌలుదారులే ఉన్నారు. నీటి తీరువా పెంచితే కౌలు రైతులపై అధిక భారం పడే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే కౌలు రైతులకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. జిల్లాలోని పథకాలకు మరమ్మతులు చేపట్టి పనిచేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కట్టలేరుపై జయంతి గ్రామంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం గత రెండేళ్లుగా పనిచేయడం లేదు. అక్కడక్కడ పైపులైన్లు దెబ్బతిన్నాయి. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలి. పూర్తి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే నిర్వహిస్తే మేలు. – జి. కృష్ణారెడ్డి, రైతు, జయంతి ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటుకు అప్పగించడం సరికాదు. ఈ నిర్ణయం కౌలు రైతులకు ఎక్కువ నష్టం చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విచ్చలవిడిగా నీటి తీరువా వసూలు చేసే అవకాశం ఉంది. దోపిడీ పెరిగిపోతుంది. కౌలు రైతులకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రభుత్వం ఏం చేస్తుంది? పథకాల నిర్వహణలో ప్రభుత్వ బాధ్యత లేదా? ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. – పి. జమలయ్య, ప్రధాన కార్యదర్శి, కౌలు రైతు సంఘం -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026శ్రీసద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలు శివరామకృష్ణ క్షేత్రంలో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. లబ్బీపేట: అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం విజయవాడ బందరు రోడ్డులో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్డ్రిల్ నిర్వహించారు. ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞం కనులపండువగా సాగుతోంది. 7 -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక భద్రత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సందర్భంగా సోమవారం భద్రత ఏర్పాట్లు చేశారు. గత వారం నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు తనకు పరిహారం అందలేదంటూ కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్లో కారం చల్లి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పీజీఆర్ఎస్ నిర్వహించే పింగళి వెంకయ్య సమావేశ మందిరం ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. మహిళలను తనిఖీలు చేసేందుకు కేబిన్ ఏర్పాటు చేశారు. పీజీఆర్ఎస్లో అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. కలెక్టరేట్లోనూ అదనంగా పోలీసు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. గతంలో ఒకరిద్దరూ పోలీసు కానిస్టేబుళ్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఒక్కసారిగా పెంచేశారు. సామాన్యులను తనిఖీ చేయడమా! సీఎం, పీఎం వంటి నాయకుల సభలు, సమావేశాలు, ఇతర వీఐపీలు వచ్చిన సమయంలో తనిఖీలు చేసిన విధంగా కలెక్టరేట్లో పీజీఆర్ ఎస్కు వచ్చే వారిని తనిఖీ చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో వృద్ధురాలు కారం చల్లిందో.. ఆ పరిస్థితి తలెత్తకుండా చూస్తే సరిపోయేదని, అలా కాకుండా అర్జీలు సమర్పించేందుకు వచ్చే సామాన్యులను మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ప్రజా సమస్యలపై కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు పార్టీ నాయకులతో కలిసి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వేచ్ఛగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అర్జీ సమర్పించే అవకాశం ఉండాలని, ఏదో అనుకోని సంఘటన జరిగితే ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. 25 నుంచి వేసవి శిక్షణ శిబిరం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఈ నెల 25 నుంచి మే 25వ తేదీ వరకు తమ కళాశాల ఆవరణలో బ్యాడ్మింటన్, యోగా, జిమ్, ఏరోబిక్స్ అంశాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ చెప్పారు. స్థానిక కళాశాల ఆవరణలో కోచింగ్ క్యాంప్ వివరాలతో ముద్రించిన కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. మరిన్ని వివరాలకు 63041 90057, 99599 59530లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. -
గానగంధర్వుడి కచేరీకి 60 ఏళ్లు
ఘంటసాల: తెలుగు పాటల్లోని మాధుర్యాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసి, వాటికి ఖ్యాతి, వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి, మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు. అంతటి మహా గాయకుడు ఘంటసాల గ్రామంలో గాన కచేరీ చేసి మంగళవారం నాటికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ మంగళవారం నుంచి 2027 ఏప్రిల్ 21 వరకు ఏడాది పాటు జరిగే ఆరు దశాబ్దాల వేడుకలు నిర్వహించనున్నారు. ఘంటసాల గ్రామంలోని శ్రీ బాలపార్వతీ జలదీశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను కృష్ణాజిల్లా పర్యాటక శాఖ అధికారి గుండె రామలక్ష్మణ్ ప్రారంభించనున్నారు. 60 ఏళ్ల క్రితం.. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే హరికథలతో పాటు ఘంటసాల వారి మధుర గానామృతాన్ని ఘంటసాల ప్రాంత ప్రజలకు అందించాలని 60 ఏళ్ల కిందట నాటి గ్రామ పెద్దలు నిర్ణయించారు. వెంకటేశ్వరరావును సంప్రదించడం, ఆయన సమ్మతించడం వెనువెంటనే జరిగిపోయాయి. గ్రామానికి వచ్చిన గాన గంధర్వుడిని గ్రామస్తులు ఏనుగు అంబారీపై ఊరేగించారు. ఘంటసాలకు చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బంగారు గండపెండేరం తొడిగారు. అనంతరం ఘంటసాల మూడు గంటలకు పైగా ఏకబిగిన కచేరీని నిర్వహించి శ్రోతలను తన గానామృతంతో ఓలలాడించారు. ఆ కచేరీకి ఆరు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఘంటసాల వంశీయులైన స్థానిక విశ్వేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఘంటసాల విజయలక్ష్మి, ఆమె సోదరి ఘంటసాల మాధవీలతకు చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ మనవడు యార్లగడ్డ రామేశ్వర ప్రసాద్ చేతులు మీదగా ఈ నెల 25వ తేదీన స్వర్ణ పతాకాలు, రజిత కంకణాలు బహూకరించనున్నట్లు ఉత్సవాల నిర్వాహకులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, ఘంటసాల కృష్ణ మోహన్ తెలిపారు. -
వేదఘోషతో పులకించిన ఉల్లిపాలెం
కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన ఉల్లిపాలెం గ్రామం వేదఘోషతో పులకించింది. గ్రామంలోని శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞం కనులపండువగా సాగుతోంది. సోమవారం ఉదయం ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజల అనంతరం తిరుచ్చిపై ఊరేగింపుగా యాగశాల వద్దకు తీసుకువెళ్లారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికలో స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త, అష్టాక్షరీ పీఠాధిపతి త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిజీ పర్యవేక్షణలో రుత్వికులు పంచరామ ఆగమశాస్త్రబద్ధంగా హోమాలను ప్రారంభించారు. 13 యాగశాలల్లోని 108 హోమ గుండాల ద్వారా 250 మంది రుత్వికులు ఈ మహా యజ్ఞానాన్ని నిర్వహించారు. మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని కూడా యాగశాల వద్ద నెలకొల్పారు. భక్తులకు కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఇష్టి హోమగుండాల వద్ద భక్తులు హోమక్రతువులు నిర్వహించారు. రుత్వికుల మంత్రోచ్చరణ నడుమ మహాలక్ష్మి ఇష్టి హోమాలను కూడా వైభవోపేతంగా జరిపారు. విజయవాడ, నల్గొండ, హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తరించారు. అక్షయతృతీయ పూజలు ఆలయంలోని రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు రుత్వికులు అక్షయ తృతీయ పూజలను భక్తిప్రపత్తులతో నిర్వహించారు. అమ్మవార్లకు వివిధ రకాల బంగారు, గర్భాలయంలోని శ్రీమన్నారాయణుడి 11 అడుగుల ఏకశిలా మూలమూర్తికి వజ్రవైఢూర్యాలు పొదిగిన ఆభరణాలను అలంకరించారు. మహిళలతో సామూహిక కుంకుమార్చన, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. దివిసీమ చరిత్రలోనే జరుగుతున్న అతిపెద్ద మహాయజ్ఞంలో వివిధ పీఠాలకు చెందిన స్వామిజీలు పాల్గొని భక్తులకు అనుగ్రహభాషణ చేశారు. అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిజీతో పాటు కర్నూలకు చెందిన త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామిజీ, కర్నాటకలోని మేల్కోటకు చెందిన త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్ స్వామిజీ, భీమవరా నికి చెందిన రంగరామానుజ జీయర్ స్వామిజీ, హైదరాబాద్కు చెందిన త్రిదండి దేవనాథ రామా నుజ జీయర్ స్వామిజీ పాల్గొన్నారు. ఈ యజ్ఞంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోమవారం రెండు వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వమించారు. ఈ నెల 29వరకు ప్రతి రోజు హోమాలు జరుగుతాయని అష్టాక్షరీ స్వామిజీ చెప్పారు. వైభవంగా సాగుతున్న శ్రీమన్నారాయణ మహాయజ్ఞం మహాలక్ష్మి ఇష్టి యజ్ఞంలో అశేషంగా పాల్గొన్న భక్తజనం కనుల పండువగా శ్రీమన్నారాయణుడి అలంకారం -
విజయకీలాద్రిపై మండలాభిషేక మహోత్సవములు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీల్రాదిపై వేంచేసి ఉన్న 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమంతునికి మండలాభిషేక మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు 108 కలశాలతో అభిషేక మహోత్సవం, అనంతరం విశేష అర్చనలు, తీర్థ ప్రసాద గోష్ఠి అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కుమారి దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో నీటి నాణ్యతపై నిర్వహించిన ఆడిట్ నివేదికలను బహిర్గతం చేయాలని, తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న మూత్ర పిండ వ్యాధుల సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ మంచినీటి సరఫరా సంస్థ (ఏపీడీడబ్ల్యూఎస్సీ) ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ టి.గాయత్రీదేవికి వైఎస్సార్ సీపీ ప్రతినిధి బృందం సోమవారం వినతిపత్రం అంద జేసింది. నీటి కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాణాపాయ స్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. భూగర్భ జలాల్లో ఖనిజ లవణాలు, భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నందున, వెంటనే శుద్ధి చేసిన ఉపరితల జలాలను పైపుల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభావిత గ్రామాల్లోని అన్ని ఆర్వో ప్లాంట్లు రోజుకు 24 గంటలూ పని చేసేలా చూడాలని, సాంకేతిక కారణాలతో ప్లాంట్లు నిలిచిపోవడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సదుపాయాలతో పాటు, వ్యాధి మూలాలను అరికట్టేందుకు శాసీ్త్రయమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని కోరారు. స్వచ్ఛమైన తాగునీరందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని, కలుషిత నీరు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కాలరాయడమేనని అన్నారు. ఎ.కొండూరు, మార్కా పురం ప్రజల ప్రాణాలు కాపాడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తనుబుద్ధి శేఖర్రెడ్డి ఉన్నారు. కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో నీటి నాణ్యతపై ఆడిట్ నివేదికలు బహిర్గతం చేయాలి ఏపీడీడబ్ల్యూఎస్సీకి వినతి పత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ బృందం -
ప్రభుత్వ ఉత్తర్వులకు వక్రభాష్యం
మచిలీపట్నంఅర్బన్: వైద్య, ఆరోగ్య శాఖ అధికా రులు ప్రభుత్వ ఉత్తర్వులను ఇష్టానుసారం వక్రీకరిస్తూ ఉద్యోగుల భవితవ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.శ్రీనివాసరావు, పి.నాగరాజు ఆరోపించారు. కలెక్టరేట్లోని మీ–కోసం సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖర్కు వారు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. ఉమ్మడి కృష్ణాజిల్లా సంబంధించి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ నంంబరు 01/పీహెచ్సీ/2025 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీలో ఈ–అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు (ఈయూపీహెచ్సీ) సేవలు అందించిన ల్యాబ్ టెక్నీషియన్ల సర్వీస్ వెయిటేజ్ మార్కులను కావాలనే పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఈయూపీహెచ్సీల్లో పనిచేసిన ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ కేటగిరీకి చెందరని అధికారులు చెబుతున్న వాదన అసత్యమని స్పష్టం చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద ప్రభుత్వమే వారి సేవలను వినియోగించుకుందని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నియామకాలు జరిగాయని గుర్తుచేశారు. వారి పనితీరును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం అధికారులు పర్యవేక్షించారని పేర్కొన్నారు. అదే అధికారులు సర్వీస్ సర్టిఫికెట్లు జారీ చేసి ఇప్పుడు మాట మార్చడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒక్కోసారి ఒక్కో జీఓ గతంలో డీఎస్సీ నోటిఫికేషన్ నంబరు 1/2024లో జీఓ నంబరు 573ని అడ్డుపెట్టుకుని సర్వీస్ వెయిటేజ్ మార్కులను నిరాకరించారని, తాజాగా నోటిఫికేషన్ నంనంబరు 1/పీహెచ్సీ/2025లో జీఓ ఆర్టీ నంబరు 301ని చూపుతూ మళ్లీ అదే విధంగా కొనసాగిస్తున్నారని శ్రీనివాసరావు, నాగ రాజు ఆరోపించారు. ఒక్కోసారి ఒక్కో జీఓను చూపుతూ అభ్యర్థులను తిరస్కరించడం పరిపాలనా అవ్యవస్థకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే విధమైన సేవలు చేసిన ఇతర ల్యాబ్ టెక్నీషియన్లకు మాత్రం సర్వీస్ వెయిటేజ్ మార్కులు ఇచ్చి నియామక ఉత్తర్వులు జారీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల్లోనూ ఇదే నిబంధన అమలవుతోందని గుర్తు చేశారు. కేవలం ఈయూపీహెచ్సీ ఉద్యోగులపైనే వివక్ష చూపడం పక్షపాత ధోరణేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా మాయంపై అనుమానాలు అత్యంత ఆందోళన కలిగించే అంశంగా, కృష్ణాజిల్లా అధికారిక వెబ్సైట్లో 2021 నుంచి 2024 వరకు డీఎస్సీ నియామకాల డేటా మాయమవడంపై శ్రీనివాసరావు, నాగరాజు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో మాత్రం పూర్తి సమాచారం అందుబాటులో ఉండటం గమనార్హమని పేర్కొన్నారు. సమాచారం తొలగింపులో ఏదో దురుద్దేశం ఉన్నట్టుగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తంచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపి, ఈయూపీహెచ్సీ ల్యాబ్ టెక్నీషియన్లకు సర్వీస్ వెయిటేజ్ మార్కులు మంజూరు చేసి సమాన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బందరు శాఖ అధ్యక్షుడు బి.కోటేశ్వరరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఈయూపీహెచ్సీ ల్యాబ్ టెక్నీషియన్లకు అన్యాయం డేటా తొలగింపుతో అధికారులపై అనుమానాలు జిల్లా రెవెన్యూ అధికారికి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిర్యాదు -
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి దాత గోసాలకు చెందిన ఎం. శ్రీనివాసరావు, పార్వ తీ దంపతులు సోమవారం రూ. 1,00,008 విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు ఈ విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఉచిత ప్రసాద వితరణకు విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణకు విజయవాడ మాచవరానికి చెందిన గోవి పాండురంగారావు, కోటేశ్వరి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. దుర్గమ్మ నిత్యాన్నదానానికి.. హైదరాబాద్ ఈసీఐఎల్కు చెందిన కొండూరి సమన్విత కుటుంబం దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా అధికారులను కలిసి అమ్మవారి నిత్యాన్న దానానికి రూ. 1,01,116ల విరాళాన్ని అందజేసింది. వీరిని కూడా అధికారులు ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. -
ఇరిగేషన్ అధికారులపై తెలుగు తమ్ముళ్ల వీరంగం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తూరు తాడేపల్లి పరిధిలోని పోలవరం కాలువ వద్ద మట్టిని తరలిస్తున్న తెలుగు తమ్ముళ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందిన తమనే అడ్డుకుంటారా అంటూ వారు అధికారులపై వీరంగం చేశారు. కొత్తూరు తాడేపల్లి సమీపంలో పోలవరం కాల్వ ఆర్ఎంసీ కెనాల్ మట్టిని కొంతకాలంగా అధికార పార్టీ నాయకులు రేయింబవళ్లు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దీనిపై గ్రామస్తుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అక్రమ తవ్వకాలపై విషయంపై లోకాయుక్త నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదివారం రాత్రి ఈ మట్టి తరలిస్తున్న ప్రాంతానికి ఇరిగేషన్ ఈఈ సుభాని, ఇతర అధికారులు చేరుకుని రెండు పొక్లెయిన్లతో మట్టిని తవ్వి లారీలలో తరలించడాన్ని గమనించి అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ నాయకులు వీరంగం వేశారు. ఈ సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు అక్కడికి చేరుకున్నా అధికార పార్టీ నాయకులు శాంతించలేదు. అధికారులకు చేతనైంది చేసుకోండంటూ రెచ్చిపోయారు. పొక్లెయిన్లు, లారీలను సీజ్ చేయాలని పోలీసులకు ఇరిగేషన్ అధికారులు సూచించారు. దీంతో రెండు పొక్లెయిన్లు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కొండలరావు పేర్కొన్నారు. తమ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో అధికార పార్టీ నాయకులు కొత్తపేట పోలీస్స్టేషన్కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు తమకు ఎటువంటి ఫిర్యాదూ చేయలేదని సీఐ పేర్కొనడం గమనార్హం. -
మతం పేరిట హక్కులు కాలరాయడం దుర్మార్గం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కేవలం మతం పేరుతో కాలరాయడం దుర్మార్గమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ దేశంలో అగ్రవర్ణాల వర్గాల వారు మతం మారి నప్పుడు వారి కుల హోదా, సామాజిక గుర్తింపు మారడం లేదని, కేవలం దళితులు మతం మారినప్పుడే ఎస్సీ హోదా రద్దు చేయడం ముమ్మాటికీ వివక్ష, రాజ్యాంగ విరుద్ధమైన చర్యని స్పష్టంచేశారు. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే, 75 ఏళ్లుగా ప్రభుత్వం నియమించిన కాకా కలేల్కర్, కుమార పిళ్లై, జస్టిస్ రంగనాథ్ మిశ్రా, సచార్, దేశముఖ్ వంటి అన్ని కమిషన్లు మతం మారినా దళితుల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో మార్పు రాలేదు, వారిపై అంటరానితనం కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశాయని గుర్తుచేశారు. ఈ శాసీ్త్రయ నివేదికలను పక్కన పెట్టి, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వును సాకుగా చూపి దళిత క్రైస్తవులకు అన్యాయం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25 కల్పించిన సమానత్వానికి, మత స్వేచ్ఛకు విరుద్ధమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దళిత క్రైస్తవులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్లు శ్రీధర్ మాదిగ, ఏటుకూరి విజయ మాదిగ, గుండాల ఆనంద్ మాదిగ, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కనకపుటి వెంకటరత్నం మాదిగ, ప్రసాద్ మాదిగ, అర్బన్ నాయకులు మాతంగి సంజయ్ మాదిగ, గద్దల కొండ మాదిగ, బద్దేటి రాజు మాదిగ, ఆదామ్ మాదిగ, పేరుపొగు బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ -
డ్రోన్లు, రోబోల రూపకల్పన
గన్నవరం: ప్రభుత్వ ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఐదుగురు యువతీ యువకులు ఉన్నత ఉద్యోగ అవకాశాలను పక్కన పెట్టి స్వశక్తితో ఎదిగేందుకు గన్నవరం కేంద్రంగా లారా ఇన్నోవేషన్ సంస్థను ప్రారంభించారు. భారత రక్షణ రంగం, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా డ్రోన్లు, రోబోల డిజైన్ల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. స్థానిక రాయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని సోమవారం ఎండీ బి.చరణ్, సీఈఓ కె. మౌళీనాథ్ ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే పరిశోధనలు.. ఈ సందర్భంగా సంస్థ ఎండీ చరణ్ మాట్లాడుతూ తామంతా శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసినట్లు చెప్పారు. చదువుకునే రోజుల్లోనే ఇగ్నైటెడ్ మైండ్స్ ఆర్గనైజేషన్ను స్థాపించి సోషల్ సర్వీస్తో పాటు ప్రభుత్వ పాఠశాలలో స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా పరిచయమైన తామంతా కలిసి గత రెండేళ్లుగా డ్రోన్ల ప్రొపెలర్లు, రోబోల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరిపినట్లు చెప్పారు. ఈ అనుభవంతో డిజైన్ అండ్ డెవలప్మెంట్ హై ట్రస్ట్ డ్రోన్ ప్రొపెల్లర్స్, రోబోటిక్ రూపకల్పన ప్రాజెక్ట్ను ప్రారంభించినట్లు వివరించారు. భవిష్యత్లో భారత మిలటరీ, వ్యవసాయ రంగానికి అవసరమైన డ్రోన్ ప్రొపెల్లర్స్, రోబోటిక్ టెక్నాలజీని అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సంస్థ ప్రతినిధులు జి. ప్రసూన, జి. సంధ్య, పి. విష్ణువర్థన్, స్థానిక పారిశ్రామికవేత్త అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అన్న క్యాంటీన్లో సీఎం దంపతుల అల్పాహారం
పటమట (విజయవాడ తూర్పు): సీఎం చంద్రబాబు తన 76వ జన్మదినం సందర్భంగా విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్లో సోమవారం సతీసమేతంగా అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు బయట భోజనం చేయాలంటే రూ.100 చెల్లించాల్సిన స్థితిలో రూ.5కే ప్రభుత్వం మంచి ఆహారాన్ని అంది స్తోందన్నారు. ఈ క్యాంటీన్లకు ఇస్కాన్ ఫౌండేషన్ రుచికరమైన ఆహారాన్ని సరఫరా చేస్తోందని కొనియాడారు. తన పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల ఒకరోజు నిర్వహణకు రూ.76 లక్షల విరాళాన్ని తన భార్య భువనేశ్వరి అందించి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు విరాళాలివ్వాలని కోరారు. మరోవైపు మీడియాతో సీఎం మాట్లాడుతుండగా ఆయన వెంట ఉన్న ఎన్ఎస్జీ కమాండో నందలాల్ షా ఎండవేడికి తట్టుకోలేక అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. రోమి శ్రీసాయికి నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కోడూరు: కోడూరుకు చెందిన కోటగిరి రోమి శ్రీసాయి నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కైవసం చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రోమి శ్రీసాయికి ఇటవల నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు రికార్డు సర్టిఫికెట్ను అందించారు. 2007వ సంవత్సరంలో రోమి శ్రీసాయి నేషనల్ చైల్డ్ అవార్డు, దుర్గి చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డు, ఢిల్లీలో జరిగిన ఆలిండియా మల్టీ లింగ్వెల్ ప్రోగ్రామ్లో తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఆమె మూడు ముక్కలాట, నా బంగారు తల్లి నవలలు రచించి ప్రచురించారు. బహుముఖ రంగాల్లో ప్రతిభ చూప డంతో ఆమెకు నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు నిర్వాహకులు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. రోమి శ్రీసాయిని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సత్కరించి అభినందించారు. దుర్గమ్మ సన్నిధిలో మహాలక్ష్మి యాగం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అక్షయ తృతీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆలయ అర్చకులు సోమ వారం మహాలక్ష్మి యాగం నిర్వహించారు. తొలుత ప్రధాన ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య మహాలక్ష్మి యాగాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. లోక కల్యాణార్థం, భక్తుల సౌభాగ్యం కోసం దేవస్థానమే ఈ యాగాన్ని జరిపించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అక్షయ తృతీయ నాడు అమ్మవారిని ఆరాధించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, ధనధాన్యాలకు లోటు ఉండదని భక్తుల నమ్మకమని అర్చకులు పేర్కొన్నారు. యాగం అనంతరం నిర్వహించిన మహా పూర్ణాహుతిలో ఆలయ ఈఓ శీనానాయక్, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. నిందితుల రిమాండ్ పొడిగింపు విజయవాడ లీగల్: పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న 11 మంది నిందితుల రిమాండ్ సోమ వారం ముగిసింది. దీంతో పోలీసులు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వారిని వర్చువల్గా హాజరు పరిచారు. వచ్చే నెల నాలుగో తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి బి.రాధారాణి ఆదేశాలు జారీ చేశారు. -
నగ‘ధగ’లు
విజయవాడలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ఆదివారం అక్షయ తృతీయ నేపథ్యంలో అందరూ బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆ సంవత్సరమంతా మంచి ఆదాయముంటుందని ప్రజల నమ్మకం. ఆ విశ్వాసానికి అనుగుణంగా విభిన్న మోడల్స్, వివిధ ఆఫర్లతో జ్యూవెలరీ దుకాణదారులు వినియోగదారులను ఆకర్షించారు. దీంతో పెద్ద ఎత్తున బిజినెస్ జరిగినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివవచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. వేకువజామున నిర్వహించిన పలు ఆర్జిత సేవలతో పాటు ఉదయం 7గంటల తర్వాత ప్రారంభమయ్యే శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరగడంతో అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. వీఐపీలకు, ప్రముఖులతో పాటు రూ.300 టికెట్ కలిగిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఘాట్రోడ్డు, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ ప్రాంగణంలో చల్లటి తాగునీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లను దేవస్థానం అందజేసింది. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్యభగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా పలువురు ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. వాహనాల పార్కింగ్పై దృష్టి.. వేసవి సెలవుల నేపథ్యంలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో దేవస్థాన అధికారులు కొండపైకి అనుమతించే వాహనాల విషయంలో సెక్యూరిటీ, పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కుమ్మరిపాలెం నుంచి హెడ్ వాటర్ వర్క్స్ వరకు రోడ్డుకు ఇరువైపులా భక్తుల కార్లు, ఇతర వాహనాలను నిలుపుకొనేందుకు అనుమతినిచ్చారు. మరో వైపున కొండపైకి వచ్చే ద్విచక్ర వాహనాలను ఓం టర్నింగ్ వరకు మాత్రమే అనుమతించారు. వీఐపీల వాహనాలను ఓం టర్నింగ్ వద్ద నిలుపుదల చేసి బ్యాటరీ వాహనాలపై సమాచార కేంద్రానికి చేర్చారు. దీంతో కొంత మేర ట్రాఫిక్ ఇక్కట్లు తప్పాయి. రద్దీ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్ ఘాట్రోడ్డులోని చెప్పుల స్టాండ్, క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, చలివేంద్రాలను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి సదుపాయాల కల్పనపై సూచనలు తీసుకున్నారు. -
విజయవాడ జీజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలోని పలు వార్డులను ఆదివారం సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు ఆకస్మికంగా సందర్శించారు. సెలవు దినం రోజున తనిఖీలకు రావడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వార్డుల్లో ఉండాల్సిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రోగులు, అటెండెంట్స్తో మాట్లాడారు. వైద్యసేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. సెలవు రోజున కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని, విధుల్లో అలసత్వం పనికిరాదని సూచించారు. వైద్యులు సైతం రౌండ్స్ వేయాలన్నారు. అదే సమయంలో రోగులకు పెడుతున్న డైట్ను పరిశీలించారు. ఆయన వెంట సివిల్సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ వై. పద్మావతి కూడా ఉన్నారు. విజయవాడ కల్చరల్: శాంతి, సహనం, సౌభ్రాతృత్వం ప్రపంచానికి శ్రీ రామరక్ష అని సంగీత విద్వాంసుడు డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ అన్నారు. కంచికామకోటిపీఠం, లబ్బీపేట శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన 24గంటల నాదోపాసన మహాయజ్ఞం ఆదివారం ముగిసింది. లోకనాథ శర్మ మాట్లాడుతూ 40ఏళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో సంగీత విద్వాంసుల సహకారంతో నాదోపాసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాలయ ఇన్చార్జి ఆర్. రామ్మోహనరావు ఆధ్వర్యంలో లోకనాథ శర్మను సత్కరించారు. నాదయజ్ఞంలో బెంగళూరు నుంచి వచ్చిన మున్నంగి(పరమాత్ముని) వెంకట రమ్య తోపాటు చిన్నారులు వై. యమున, ఎం. శేషుబాబు, వెంకట రఘువర్మ, ప్రసాద్, మల్లాది ఆహ్లాద్, ఆముక్త, తమన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని జీవీఆర్ సంగీత కళాశాలలో 870 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ వారిని నిర్వాహకులు పట్టించుకోకపోవడం గమనార్హం. మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం బందలాయి చెరువు గ్రామానికి చెందిన తుంగల తారక రామ సుమారు కిలో వెండితో చేసిన నాగపడగను ఆదివారం సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు స్వామివారి వెండి పడగను అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ వెస్ట్ బైపాస్లో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా ఏలూరు వైపు వెళ్లే వెస్ట్ బైపాస్ రహదారిని తాత్కాలికంగా మూసివేసినట్లు ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు ఆదివారం తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లే వాహనాలు గొల్లపూడి వై జంక్షన్, అట్కిన్సన్ స్కూల్ సెంటర్, ఊర్మిళా నగర్, కబేళా, సీవీఆర్ ఫ్లైఓవర్, పాముల కాలువ మార్గం మీదుగా వెస్ట్ బైపాస్ ఎక్కాలని సూచించారు. నగరంలోకి ప్రవేశించే వాహనదారులు సైతం ట్రాఫిక్ డైవర్షన్లను గమనించి ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని కోరారు. వాహనదారులు పోలీసుల సూచనలు, డైవర్షన్ బోర్డులను గమనించాలన్నారు. -
కార్మిక వైద్యం.. నామమాత్రం!
షెడ్డుల్లో ఎన్నాళ్లీ ‘తాత్కాలిక’ సేవలు?లబ్బీపేట(విజయవాడతూర్పు): గుణదలలో అధునాతన ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. రెండేళ్ల కిందట శిథిలమైన భవనాలను తొలగించారు. దీంతో తాత్కాలికంగా నిర్మించిన షెడ్డుల్లోనే ఓపీ సేవలు అందిస్తున్నారు. శిథిలమైన భవనాలు తొలగించిన స్థానంలో కొత్తగా అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మించాల్సి ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 5.80 లక్షల మంది ఈఎస్ఐ చందా దారులకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏదైనా క్లిష్టతరమైన సమస్యతో వచ్చిన వారికి ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంది. 5.80 లక్షల మందికి పెద్దదిక్కు.. విజయవాడలో ఈఎస్ఐ ఆస్పత్రి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి నాలుగు ఉమ్మడి జిల్లాలోని సుమారు 5.8లక్షల మంది చందాదారుల వైద్య సేవలకు పెద్దదిక్కుగా ఉంది. ఆయా జిల్లాలోని చందాదారులు డిస్పెన్సరీల నుంచి మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు. అత్యవసర వైద్యం అవసరమైన వాళ్లు నేరుగా వస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం రెండేళ్లుగా తాత్కాలిక భవనాల్లో అరకొర సౌకర్యాలతో నాణ్యమైన సేవలు అందని పరిస్థితి నెలకొంది. నిపుణులైన వైద్యులు ఉన్నా, తాత్కాలిక భవనాల్లో ఆపరేషన్ థియేటర్లలో సర్జికల్ పరికరాలు లేక పోవడంతో శస్త్ర చికిత్సలు నిర్వహించలేని దయనీయ స్థితి నెలకొంది. దీంతో ఈఎస్ఐ చందాదారులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. కలగానే సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి.. విజయవాడలో ఐదు దశాబ్దాల కిందట ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. గతంలో ఏదైనా సూపర్స్పెషాలిటీ సేవలు అవసరమైతే హైదరాబాద్ వెళ్లేవారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇక్కడే అత్యాధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేస్తామని దశాబ్దం కిందట నాటి కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయింది. అధునాతన వ్యాధి నిర్ధారణ పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఏదైనా సీటీ, ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే ప్రైవేటుకు పంపుతున్నారు. దీంతో నడవలేని స్థితిలో ఉన్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు నాణ్యమైన వైద్యం కోసం ఈఎస్ఐ సౌకర్యం కావాలని పోరాటాలు చేసి సాధించుకున్న చందాదారులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 5.80 లక్షల మంది చందాదారులకు వైద్య సేవలు తాత్కాలిక భవనాల్లో అందించడం సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే అధునాతన భవనాలు నిర్మించి, వాటిలో సూపర్స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి తేవాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
దమ్జాయ్!
గల్లీ గల్లీలో అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం సాక్షి ప్రతినిధి, విజయవాడ: మాదకద్రవ్యాలను (గంజాయి, డ్రగ్స్) సమూలంగా నిర్మూలిస్తాం.. ఉక్కుపాదం మోపుతాం.. అంటూ పాలకులు ఎక్కడ చూసినా మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే అవన్నీ ప్రచారం కోసం మాట్లాడే ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి, ఇతర డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తుండటంతో యువత వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు విజయవాడకే పరిమితమైన ఈ విష‘మత్తు’ ఇప్పుడు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. అక్కడ సైతం గంజాయికి బానిసలైన యువత ఉంటున్నారు. ప్రభుత్వ వైఫల్యంతో గంజాయి కేజీల మొత్తంలో సరఫరా అవుతూనే ఉంది. అందుకు పోలీసులు పట్టుకున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గంజాయితో పాటు ఎండీఎంఏ డ్రగ్స్ సైతం విజయవాడలో పట్టుపడటం ప్రజలు నివ్వెర పడేలా చేసింది. జాతీయ రహదారులు ఉండే పోలీసు స్టేషన్ల పరిధిలోనే ఎక్కువగా గంజాయి పట్టుబడుతోంది. ఇందులో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. మత్తులో యువత చిత్తు.. గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడుతున్న వారిలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన యువత ఉంటున్నారు. అందుకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పదుల సంఖ్యలో యువతకు డ్రగ్స్ పాజిటివ్ రావడమే నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కొండపల్లి తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే అనుమానంతో యువతకు పరీక్షలు నిర్వహించారు. వారిలో 25 మందికి పాజిటివ్ వచ్చింది. జగ్గయ్యపేటలో నిర్వహించిన పరీక్షల్లో 31 మందికి పాజిటివ్ వచ్చింది. అంతేకాదు విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఒక్కో ప్రాంతంలో 5 నుంచి 15 మంది వరకూ పాజిటివ్ వచ్చింది. మైకంలో నేరాలు.. గంజాయి, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన యువత ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన నిందితుడిని పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా గంజాయికి అలవాటు పడిన వారు నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళ్లలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్లు చోరీ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో కూడా డ్రగ్స్కు బానిసలైన వారు ఉంటున్నారు. బెట్టింగ్స్కు పాల్పడే వారిలో సైతం డ్రగ్స్ బానిసలే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఏదైనా నేరంలో అరెస్టు చేసిన వారికి పోలీసులు తొలుత డ్రగ్ పరీక్షలు చేయిస్తున్నారు. ఘోర వైఫల్యం.. జిల్లా స్థాయిలో డ్రగ్స్పై దండయాత్ర పేరుతో అవగాహన కార్యక్రమాలు, పరీక్షలు చేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం.. వాటి అక్రమ రవాణా, విక్రయాలను అదుపు చేయడం, వాటి మూలాలను కూకటి వేళ్లతో పెకలించడంలో పూర్తిగా విఫలం చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే గంజాయి గ్రామాలను సైతం సరఫరా అవుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా:కృష్ణా జిల్లా: గతేడాది డిసెంబర్ 26వ తేదీన పెద్ద అవుటుప ల్లి వద్ద 180 కేజీలు దొరికింది. -
సెలవుపై వెళ్లిన కృష్ణా జిల్లా కలెక్టర్
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సెలవుపై వెళ్లారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు వ్యక్తిగత కారణాల నిమిత్తం సెలవు పెట్టారు. తిరిగి ఆయన ఈ నెల 27వ తేదీ సోమవారం విధులకు హాజరవుతారు. అప్పటి వరకు ఇన్చార్జ్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అన్నదాన పథకానికి హైదరాబాద్ మణికొండ అల్కాపురానికి చెందిన కేపీ ఆశ కుటుంబం రూ. 1,01,116, గుంటూరు కొత్తపేటకు చెందిన ఎం. సాంబశివరావు కుటుంబం రూ. 1,01,116, కాకినాడకు చెందిన వి. సూర్యనారాయణమూర్తి కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది. దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి విజయవాడ లబ్బీపేటకు చెందిన ఆర్. వెంకటేష్, అరుంధతి దంపతులు రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
కిడ్నీ వ్యాధితో మహిళ మృతి
ఎ.కొండూరు: మండల పరిధిలోని చైతన్యనగర్ తండాకు చెందిన భూక్యా తిరిపి (65)కిడ్నీ వ్యాధితో బాధపడూతూ ఆదివారం మృతి చెందారు. గత ఐదేళ్లుగా వ్యాధితో పోరాడుతున్న ఆమె విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటూ తుదిశ్వాస విడిచారు. తిరిపి మృతిపట్ల సీపీఎం నాయకులు జెట్టి వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి పానెం ఆనందరావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తిరిపి వైద్యం కోసం ఐదేళ్లలో రూ.5 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి ఏడుగురు సంతానం ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే ఆకుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మండలంలో కిడ్నీ వ్యాధుల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటికీ కృష్ణా జలాలు సరఫరా చేయడంతో పాటు బాధితులకు ఉచిత మందులు, పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
స్కేటింగ్ పోటీల్లో పతకాలు
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): తైవాన్లోని హ్సిన్చూ నగరంలో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు జరిగిన 2026 ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ అంతర్జాతీయ పోటీల్లో నగరానికి చెందిన చిన్నారి కె.దియశ్రీ (11) పలు విభాగాల్లో పతకాలు సాధించింది. కపుల్ డాన్స్ క్యాడెట్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్, పెయిర్ స్కేటింగ్ క్యాడెట్ విభాగంలో తృతీయ స్థానం సాధించి బ్రాంజ్ మెడల్ సాధించడంతో పాటుగా సోలో డాన్స్ ఎస్పోయిర్ గరల్స్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దియశ్రీ నగరంలోని సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. స్కేటింగ్ క్రీడతో పాటుగా సాంప్రదాయ నృత్యంలో కూడా దియశ్రీ శిక్షణ పొందుతోంది. స్కేటింగ్ కోచ్ పంచాడ సత్యనారాయణ, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులతో పాటు స్కేటింగ్ క్రీడాకారులు దియశ్రీకి అభినందనలు తెలిపారు. చల్లపల్లి: పేలుడు ఘటనలో గాయపడి మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం చల్లపల్లి ఎస్ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు ఆదివారం డిశ్చార్జి అయ్యారు. గత నెల 31న చల్లపల్లి పోలీస్టేషన్లో మందుగుండు సామగ్రి తరలిస్తుండగా పెట్టెలో నుంచి కిందికి జారి భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎస్ఐ దుర్గాంజనేయులుతో పాటు కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, జీపు డ్రైవర్ నాగరాజులు తీవ్రంగా గాయపడటంతో వారిని గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా చికిత్స అనంతరం 18 రోజుల తరువాత ఎస్ఐ దుర్గాంజనేయులు డిశ్చార్జి అయ్యి ఆదివారం చల్లపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. మిగిలిన ఇద్దరూ ఇంకా చికిత్స పొందుతున్నారు. సోమ, మంగళవారాల్లో దుర్గాంజనేయులు స్టేషన్ బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది. హనుమాన్జంక్షన్రూరల్: చైన్నె – కోల్కత్తా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొనటంతో ఓ వృద్ధుడు దుర్మరణం చెందిన సంఘటన బాపులపాడు మండలం వీరవల్లి సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో హైవేపై గుర్తు తెలియని వృద్ధుడిని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మరణించాడు. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపర్చారు. మృతుడి వివరాలను సేకరిస్తున్నారు. పటమట(విజయవాడతూర్పు): పటమట భారతీనగర్లోని పార్క్ ఐరిస్ హోటల్లో బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పటమట, టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. శుక్రవారం క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి హైదరాబాద్కు చెందిన బుకీ డూడ్ గణేష్, ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన ఆపరేటర్ పితాని ప్రసాద్ పాటు కానూరుకు చెందిన తోట శ్రీనివాసరావు, తాడిగడప డొంకరోడ్డుకు చెందిన పసుపులేటి రంగబాబును అదపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక ల్యాప్టాప్, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకుని పటమట పీఎస్కు తరలించారు. -
ఆకట్టుకున్న కళాకారుల ర్యాలీ
రెండో రోజు కొనసాగిన కొండపల్లి బొమ్మల పండుగ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల పండుగలో రెండోరోజు ఆదివారం వినూత్న రీతిలో కార్యక్రమాలు జరిగాయి. బొమ్మల ప్రదర్శన, బొమ్మల కొలువు, బొమ్మల దర్బార్ నిర్వహించా రు. బొమ్మల ఉత్పత్తి కళాకారులకు తెల్లపొనికి చెట్లు పెంపకం చేపట్టాల్సిన కార్యాచరణపై అటవీశాఖ ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. వివిధ కళాశాలలు, పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, కళాకారులు జానపద, కూచిపూడి నృత్యాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మల ఆటలతో ఆకట్టుకున్నారు. ఏటా నిర్వహించాలి.. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ మాట్లాడుతూ కొండపల్లి బొమ్మల పండుగ ఏటా నిర్వహించేలా చూస్తామన్నారు. హస్తకళల వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు మూడురోజుల పండుగ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం వివిధ కళా రంగాలకు చెందిన కళాకారులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కోయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, వివిధ వేషధారణలతో నృత్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలు స్థానికులను ఆకట్టుకున్నాయి. -
న్యూడ్ కాల్స్ కేసులో ముగ్గురు అరెస్ట్
తెనాలిరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన న్యూడ్ కాల్స్ దందా కేసులో ఎట్టకేలకు నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో తల్లి, కొడుకులు కూడా ఉండటం విశేషం. స్థానిక త్రీ టౌన్ పోలీసుస్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక పాండురంగపేట జనావాసాల మధ్య ఓ ఇంట్లో మహిళలు న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న సమాచారంతో ఈనెల 16న త్రీ టౌన్ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో బోడపాటి అనురాధ, మహమ్మద్ షహనాజ్లను అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు. ఆన్లైన్ వేదికగా ఓ యాప్లో ’స్ట్రిప్ టాక్’ పేరిట ఉన్న పోర్టల్లో ‘స్వీటీ క్యూటీ’ పేరుతో లాగిన్ అయ్యి ఇరువురు మహిళలు ముఖానికి మాస్క్తో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ, అవతలి వ్యక్తుల నుంచి నగదు అందిన సమాచారంతో వారి కోరిక మేరకు న్యూడ్గా ఫోన్లో మాట్లాడుతున్నారు. యాప్ నిర్వాహకులు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొంత నగదును మహిళల ఖాతాకు జమ చేస్తున్నారు. రెండు నెలల కిందట అద్దెకు తీసుకొని ఉంటున్న ఇంటిలో ఈ తతంగం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో ఈ కేసులో కీలకంగా వ్యవహరించి, యాప్ డౌన్లోడ్ చేయడంలో సహకరించిన అనురాధ కుమారుడు హేమంత్ సాయి పరారయ్యాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా అనేక వదంతులు విస్తరించాయని, వందలాది మంది మహిళలు ఇలా అక్రమంగా సంపాదిస్తున్నారని వచ్చిన వదంతుల్లో వాస్తవం లేదని డీఎస్పీ చెప్పారు. అనురాధ కుటుంబం గతంలో ఉపాధి కోసం విజయవాడ ఈడ్పుగల్లుకు వెళ్లగా అక్కడ తన స్నేహితురాలు విజయలక్ష్మి, ఆమె కుమారుడు తులసి ద్వారా ఈ యాప్ వివరాలు తెలుసుకుందని, అనురాధ, ఆమె కుమారుడు హేమంత్ సాయి యాప్ వినియోగం అక్కడే నేర్చుకున్నారని, ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసి హేమంత్సాయి ప్రేమవివాహం చేసుకున్నాడని తెలిపారు. తల్లి, భార్యతో కలసి విజయవాడలో ఉంటుండగా, ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం నచ్చక కోడలు విభేదించి తెనాలి వచ్చేయడంతో హేమంత్ సాయి వచ్చి భార్యతో కలిసి తెనాలిలో ఉంటున్నాడు. కొద్ది రోజులు వ్యవధిలోనే అనురాధ కూడా ఒంటరిగా ఉండలేక తిరిగి తెనాలి చేరిందని, వేరుగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న అనురాధకు షహనాజ్ పరిచయం కావడంతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అనురాధ తిరిగి తెనాలి చేరటం, ఈ తంతు ఇష్టంలేని కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో విజయవాడ వ్యక్తుల ప్రమేయం, యాప్ వివరాలు, దానిలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదించి, తదుపరి సాంకేతిక సహకారంతో విచారణ కొనసాగిస్తామని డీఎస్పీ చెప్పారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారాలలో వాస్తవం లేదని, కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉండటంతో జాప్యం జరిగినట్లు చెప్పారు. ఎస్ఐ నక్కా ప్రకాశరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): సమాజ సేవ చేయాలనే భావనను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని సిద్ధార్థ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కొల్లి ప్రశాంతి చెప్పారు. నార్త్ సౌత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ను స్థానిక హోటల్లో ఆదివారం అందజేశారు. ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. చదువు కోవడానికి డబ్బు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నార్త్ సౌత్ ఫౌండేషన్ వారు ప్రతి ఏడాది విద్యార్థులకు ఉపకార వేతనాలను అందచేయడం అభినందనీయమన్నారు. గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పుట్టగుంట సతీష్ మాట్లాడుతూ తోటి వారికి సహాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదని, సహాయం చేసే గుణం ఉంటే చాలని అన్నారు. నార్త్ సౌత్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ చలసాని మల్లిఖార్జునరావు, విజయవాడ చాప్టర్ కో–ఆర్డినేటర్ సూరపనేని వెంకటరత్నం మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లోని 700 మంది విద్యార్థులకు ఒక కోటి 76 లక్షల రూపాయలను విలువైన స్కాలర్షిప్లను అందించామన్నారు. ఈ రోజు 50 మంది విద్యార్థులకు రూ.15 లక్షల విలువైన స్కాలర్షిప్లను అందజేశామని చెప్పారు. ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సత్తారు బాబూరావు, లయన్స్ పాస్ట్ డిస్ట్రీక్ట్ గవర్నర్ కంకణాల శ్రీనివాసరావు, ఆంధ్రా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతబాబు కామినేని, ఆంధ్రా లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.బాలాజీ భానుతో పాటు స్కాలర్ షిప్ పొందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆత్మలకు భూ హక్కులు
జి.కొండూరు: రెవెన్యూ అధికారుల ఒంటెత్తు పోకడ రైతులకు తలనొప్పిగా మారింది. సమగ్ర భూ రీ సర్వే పేరుతో తప్పుల తడకగా రికార్డులను తయారు చేయడంతో దశాబ్దాల క్రితం మరణించిన వ్యక్తుల ఆత్మలకు సైతం భూ హక్కులు లభించాయి. ఎవరి భూమి ఎవరి పేరు మీదకు మారిందో కూడా అర్థంకాక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరో వైపు తాము తాయారు చేసిన రికార్డుల ప్రకారమే పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామంటూ అధికారులు సిద్ధమయ్యారు. జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో శనివారం నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభ రసాభాసగా మారింది. గ్రామంలో ఉన్న భూ రికార్డుల అన్నీ తారుమారు కావడం రెవెన్యూ అధికారుల వైఫల్యానికి అద్దంపడుతోంది. తప్పుల తడకగా రికార్డులు జి.కొండూరు మండల పరిధి ఆత్కూరు గ్రామంలో 1,524 ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. అందులో ప్రభుత్వ భూమి పోనూ 1,254 ఎకరాల వరకు రైతుల పేరిట పట్టా భూమి ఉంది. అయితే ఈ గ్రామంలో గత సార్వత్రిక ఎన్నికల కోడ్ సమయంలో రీ సర్వే జరిగింది. ఈ సర్వేలో కొందరు రైతులు పాల్గొనలేదు. రీసర్వే పూర్తయిన వెంటనే ఎల్పీఎం నంబర్లు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎల్పీఎం నంబర్లను మూడేళ్ల వరకు ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులు రూపొందించిన రికార్డుల ప్రకారం దశాబ్దాల క్రితం చనిపోయిన వ్యక్తులు, అసలు గ్రామానికే సంబంధం లేని వ్యక్తుల పేరిట భూములు ఉన్నాయి. భూమి ఉన్న రైతుకు లేనట్లు, భూమి లేని రైతుకు ఉన్నట్లు, ఒక రైతు భూమికి మరొక రైతును హక్కుదారుడిగా చూపుతూ పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. రీసర్వే జరిగిన అనంతరం ఈ రెండేళ్లలో మూడు వందలకుపైగా భూ ఖాతాల్లో భూమి క్రయవిక్రయాలు జరిగాయి. వందకుపైగా భూ ఖాతాల్లో భూ యజమానులు చనిపోగా వారి కుటుంబ సభ్యుల పేర్లతో రికార్డులను మార్చి ఇదే రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలను సైతం జారీ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ చనిపోయిన వ్యక్తుల పేర్లతో పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చేందుకు రికార్డులను తయారు చేశారు. క్రయవిక్రయాలు జరిగిన భూమికి కొనుగోలు చేసిన వారి పేర్లతో రిజిస్ట్రేషన్లు పూర్తయితే పట్టాదారు పాసుపుస్తకాలను సైతం జారీ చేసిన రెవెన్యూ అధికారులు, ఇప్పుడు భూమిని విక్రయించిన రైతుల పేర్లతోనే పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ అధికారులు తయారు చేసిన రికార్డుల ప్రకారం భూమి కొలతల్లో వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. మరో వైపు క్రయవిక్రయాలు జరిగిన భూ ఖాతాల్లోనూ సమస్య ఉత్పన్నమవుతోంది. గ్రామంలో ప్రస్తుత రికార్డుల ప్రకారం 600 వరకు భూ ఖాతాలు ఉన్నాయి. 580కిపైగా భూ ఖాతాలు తప్పుల తడకగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆత్కూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామ సభలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి బహిష్కరించారు. గ్రామంలో రీ సర్వే మళ్లీ జరిపించి రికార్డులను సరి చేయాలని కోరారు. మా గ్రామంలో నాకు ఖాతా నంబరు 95లో 8.5 ఎకరాలు భూమి ఉంది. అయితే ప్రస్తుతం 7.22 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రస్తుత రికార్డుల్లో చూపుతున్నారు. అంతే మొత్తం భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోసారి రీసర్వే జరిపి వాస్తవంగా ఉన్న భూమిని నా పేరున రికార్డుల్లో ఎక్కించాలి. – కాటంనేని లక్ష్మీపతిరావు, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం నా భర్త కనగాల వెంకటేశ్వరరావు ఐదేళ్ల క్రితం మరణించారు. ఆయన పేరుమీద ఉన్న 6.32 ఎకరాల భూమిని నా పేరు మీదకు బదలాయించారు. అయితే ఇప్పుడు నా పేరుతో భూ ఖాతా నంబరు 15లో 2.79 ఎకరాలను తగ్గించి 3.53 ఎకరాలు మాత్రమే ఉందని పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మిగిలిన భూమిని ఎవరికి రాశారో చెప్పాలి. – కనగాల పద్మావతి, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం -
ఫాం పాండ్పనుల పరిశీలన
పెడన: మండలంలోని మడక గ్రామంలో జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పనులతో చేపట్టిన కోనేటి గుంత (ఫాం పాండ్) తవ్వకం పనులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పది సూత్రాల కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర, నీటి భద్రత చాలా ముఖ్యమైనవన్నారు. కోనేటి గుంతల తవ్వడం, సంరక్షణ చర్యల ద్వారా భూగర్భ జలాలను పెంచుతున్నామని పేర్కొన్నారు. పంట కాలువలు, చెరువుల్లో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచుతామన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పెడనలో వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ శివప్రసాద్, జెడ్పీ సీఈఓ డాక్టర్ జె.అరుణ, జెడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేష్, ఇన్చార్జి తహసీల్దారు కె.అనిల్కుమార్, ఎంపీడీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. కేడీసీసీ బ్యాంక్కు ఐఎస్వో సర్టిఫికెట్ -
ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో ముమ్మరంగా ఎన్యూమరేషన్
గుల్లలమోద(నాగాయలంక): మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల చేపల వేట నిషేధ కాల భృతి కోసం చేపట్టిన బోట్ల ఎన్యూమరేషన్ కార్యక్రమం అవనిగడ్డ నియోజకవర్గంలోని 11 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో (నాగాయలంకలో 10, కోడూరులో ఒకటి) శనివారం ముమ్మరంగా నిర్వహించారు. వివిధ బృందాలుగా ఏర్పడిన అధికారులు, సిబ్బంది ఉదయం ఏడు గంటల నుంచే నాగాయలంక, ఏటిమొగ, గుల్లలమోద, ఎదురుమొండి, జింకపాలెం, ఏసుపురం, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ, సొర్ల గొంది, పాత ఉపకాలి, పాలకాయతిప్ప (కోడూరు మండలం) సెంటర్లలో మొత్తం 1,329 మోటారు బోట్లు, 22 సంప్రదాయ నావల ఎన్యూమరేషన్ పూర్తి చేశారు. గుడివాడ మత్స్యశాఖ ఉప సంచాలకురాలు ఎ.ఉషాకిరణ్ పర్యవేక్షణలో నావల గణన చేశారు. సంబంధిత పూర్తి వివరాల నివేదికలను జిల్లా మత్స్య శాఖ కార్యాలయానికి సమర్పిస్తామని స్థానిక ఎఫ్డీఓ వానపల్లి సత్యనారాయణ చెప్పారు. జిల్లా కార్యాలయం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎఫ్టీఐ ప్రిన్సిపాల్ వి.రమణరావు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ డి.సోమశేఖర్, ఎఫ్డీఓ నాగభద్రరావు తదితరులు సహకరించారు. వి.కొత్తపాలెం(కోడూరు): మండల పరిధిలోని వి.కొత్తపాలెం వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కె.చాణక్య శనివారం పట్టుకున్నారు. బియ్యం అక్రమ రవాణా విషయం తెలుసుకున్న వెంటనే సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా వేకనూరుకు చెందిన భోగాది కరుణకుమార్ అశోక్ లేలాండ్ ట్రక్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని వి.కొత్తపాలెంలోని ఆంజనేయస్వామి గుడివద్ద పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
కిడ్నాప్ కేసు సుఖాంతం
బాలుడిని తల్లికి అప్పగించిన ఎస్పీ కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బాలుడు ఆచూకీ కనుగొని తల్లి చెంతకు చేర్చారు. ఈ సందర్భంగా శనివారం ఎస్పీ విద్యాసాగర్నాయుడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాదాసు సుమమ్మ ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం తన పది నెలల కుమారుడిని వెంటబెట్టుకుని విజయవాడ ఆటోనగర్కు భిక్షాటనకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఆమె వద్దకు వెళ్లి తమ వద్ద పాత బట్టలు ఉన్నాయని, వాడుకోవటానికి ఇస్తామని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. కంకిపాడు ఫ్లై ఓవర్ సమీపంలో ఆమెను దించి బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆమె సమీపంలోని పెనమలూరు పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంపై ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర ఆధ్వర్యంలో సీఐ జేవీ రమణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు సీసీ పుటేజీలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాలుడి కోసం గాలించారు. 24 గంటల్లో నిందితుల్లో ఒకరైన కొమిరి కాళి (ఆటోడ్రైవర్)ను పెనమలూరులో పట్టుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారంతో బాలుడిని కొనుగోలు చేసిన మచిలీపట్నానికి చెందిన గంజాల వెంకటనాగ శ్రీనివాసరావు, షేక్ రెహనాను అదుపులోకి తీసుకున్నారు. ముందుగానే ఒప్పందం.. ఆటోడ్రైవర్ కాళీతో పాటు మరో నలుగురు ఇదే తరహాలో అనేక నేరాలకు పాల్పడుతూ రద్దీ ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించిన చిన్నారులను కిడ్నాప్ చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పది నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులు లక్షన్నరకు విక్రయించారు. గతంలో శ్రీనివాసరావు, రెహనాలు పిల్లాడి కోసం వీరిని మూడు నెలల క్రితం సంప్రదించగా నిందితులు ఈ పనికి పూనుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును 24 గంటల్లో చేధించిన సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర, సీఐ రమణ, సిబ్బంది పాల్గొన్నారు. -
కొండపల్లి బొమ్మల పండుగ ప్రారంభం
ఇబ్రహీంపట్నం: కొండపల్లి బొమ్మలు, కొండపల్లి ఖిల్లా మన వారసత్వ సంపదని, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ, ఆధ్వర్యంలో కొండపల్లి బొమ్మల పండగ (సాంస్కృతిక వారసత్వ ఉత్సవం)ను కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. అనంతరం కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్తో పాటు కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, కీలు బొమ్మల స్టాళ్లను సందర్శించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల వారసత్వ సంపదను భావితరాలకు వెలకట్టలేని బహుమతిగా అందించాలనే ఉద్దేశంతో బొమ్మల పండగను ఏటా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో హస్తకళల అభివృద్ధికి, హస్తకళాకారుల సంక్షేమానికి కృషిచేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మల తయారీలో నైపుణ్యత, సృజనాత్మక తతో నూతన ఆవిష్కరణలు చేసే వారిలో పది మందికి వచ్చే ఏడాది ఇదే రోజున రూ.50 వేలు చొప్పున రూ.5లక్షలు బహూకరిస్తామని ప్రకటించారు. ఉదయం ఖిల్లాపైకి ట్రెక్కింగ్ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన రోప్లతో ర్యాప్లింగ్ వాక్ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అధికారుల వైఫల్యం వేడుకల నిర్వహణలో మునిసిపల్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి. కలెక్టర్ వేదిక ఎక్కినా ప్రజలు లేకపోవడంతో అస హనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, రీజనల్ డైరెక్టర్ వై.వి.ప్రసన్న, డీఈఓ ఎల్.చంద్రకళ, జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్, మెప్మా పీడీ మురళీకృష్ణ, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు, మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు. -
కాలువలు.. కడగండ్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సర్కార్ తీరుతో కృష్ణా డెల్టా రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో రైతులకు కడగండ్లు తప్పడం లేదు. మే నెలలోనే సాగు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినా దానికనుగుణంగా కాలువల నిర్వహణపై ప్రభుత్వం శ్రద్ధ చూపటం లేదు. కాలువలు గుర్రపు డెక్క, తూటి కాడతో నిండిపోయాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ఇప్పటికీ పనులకు అనుమతులు మంజూరు చేయలేదు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా సరాసరిన నియోజకవర్గానికి రూ.3కోట్ల నుంచి రూ.4కోట్లతో అంటే దాదాపు రూ.38కోట్లతో ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. పనులు త్వరితగతిన చేయకుంటే తర్వాత కాలువకు నీరు విడుదల చేస్తే పనులు చేసే అవకాశం ఉండదు. ఆ తర్వాత పనులు మంజూరైనా పనులు చేయకుండా మమ అనిపించి నిధులు మింగేసే అవకాశం ఉంది. వర్షాలు వస్తే డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటకు పోక రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే కాలువలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసినా చివరి ఆయకట్టుకు నీరు అందని దుస్థితి నెలకొంటుంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.08లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సింది. అధ్వానంగా కాలువలు ప్రధానంగా చంద్రయ్య డ్రెయిన్లో పనులకు రూ.22కోట్లు, కొమరవోలు డ్రెయిన్ మరమ్మతులకు రూ.11కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు పనులు చేయకపోతే వర్షాకాలంలో చేయలంటే ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజక వర్గాల పరిధిలో పూడిక తీయక పోవడంతో అధ్వానంగా మారి పంట పొలాలు మునుగుతున్నాయి. దీనికి తోడు గుర్రపుడెక్క, తూటుతో మేట వేసుకుపోయాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్ఎస్ మేజర డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలో లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకొడు, వన్నేరు, ముస్తాఫాకొడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకొడు డ్రెయిన్లలో మురుగు నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్ఎన్ పురం వరకు ఉన్న బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఈ ఏడాదైనా పనులు సక్రమంగా చేపట్టకపోతే, రైతులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి.. కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా.. కాలువ కృష్ణా ఎన్టీఆర్ బందరు 1.51లక్షల – ఎకరాలు కేఈబీ 1.38 – ఏలూరు 0.56 1,332 వేల ఎకరాలు రైవస్ 2.17 425 మొత్తం 5.62 లక్షల 1,757 వేల ఎకరాలు ఎకరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సంఘాలకు రూ.10లక్షల వరకు నామినేషన్పై పనులు కట్టబెట్టే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ కాలువల్లో తూటికాడ, పిచ్చిమొక్కల తొలగింపు, షట్టర్ల మరమ్మతులు, కాంక్రీట్ పనులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాది కృష్ణా తూర్పు, కృష్ణా సెంట్రల్, డ్రెయినేజీ విభాగం, స్పెషల్ డివిజన్లో 650 పనులకు సంబంధించి రూ.26.03 కోట్లు మంజూరు చేశారు. కాలువలకు నీటి విడుదల తర్వాతే పనులు మంజూరు చేయడంతో, నీటి సంఘాల అధ్యక్షులు, నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మకై నామ మాత్రంగా పనులు చేపట్టి, మమ అనిపించారు. -
దర్గా భూములనూ వదలని టీడీపీ నేతలు
పామర్రు: టీడీపీ నేతలకు కాదేదీ ఆక్రమణలకు అన్నర్హం అన్న చందంగా పామర్రు టీడీపీ నేతల తీరు ఉన్న దని, చివరికి దర్గా భూములను కూడా వదలకుండా తమ అవసరాలకు వాడుకుంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ అన్నారు. స్థానికంగా చల్లపల్లి రోడ్డులో దర్గా భూములను ఆక్రమించుకుని వేసిన అక్రమ వెంచర్లను ఆయన స్థానిక పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ చల్లపల్లి రోడ్డులోని దర్గా భూమికి అవతల పక్కన స్థానిక టీడీపీ నేత కుదరపల్లి ప్రవీణ్ తన తండ్రి పేర సర్వే నంబరు 4378లో 4.25 ఎకరాలు, గణేష్కు సంబంధించిన నాలుగు ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు ఇచ్చారు. కూటమి నేతల భూమికి, స్థానిక పామర్రు– చల్లపల్లి రోడ్డుకు మధ్యలో దర్గా భూమి ఉందన్నారు. ఇది వారి రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధికి అటంకంగా మారిందని తెలిపారు. దీంతో దర్గా భూమిలో సుమారు 50 సెంట్లను 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. దర్గా నిర్వహణ కోసం ఎవరో దాతలు ఇచ్చిన భూమిని టీడీపీ నేతలు ఏవిధంగా ఆక్రమించుకుంటారని ప్రశ్నించారు. 99 ఏళ్లకు లీజుకు తీసుకుని దానిలో రియల్ ఎస్టేట్ కోసం 40 అడుగుల రోడ్డుని వేయటం అన్యాయం కాదాని ప్రశ్నించారు. మట్టి తోలకాలతో కోట్లు గడించారు.. మండల పరిధిలో నిబంధనలకు తిలోదాలు ఇచ్చిన అడ్డగోలుగా మట్టిని తెగనమ్ముకున్న మాట వాస్తవం కాదని ప్రశ్నించారు. నేను పామర్రులో ఓ ఇల్లు కట్టుకుంటే నాపై బురద చల్లడం నా కుటుంబ సభ్యులపై అన్యాయంగా మాట్లాడుతున్నారని అన్నారు. కూటమినేతల తప్పులను ఎత్తి చూపటం వాటిని స్థానిక ప్రజలకు తెలియజేయటమే ఒక ప్రతిపక్ష నాయకునిగా మా పని అన్నారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం.. ఈ వక్ఫ్ బోర్డు భూమిని తిరిగి కూటమి నేతల వద్ద నుంచి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై సోమవారం జిల్లా కలెక్టర్కు అర్జీని సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మూల్పూరి హరీష, నామా వెంకటేశ్వరరావు, గవాస్కరరాజు, ఎంపీపీలు డి. అశోక్కుమార్, గోగం సురేష్, వైస్ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, ఎంపీటీసీ సభ్యురాలు పి.రత్నకుమారి, మండల అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వరరావు, రాజులపాటి రాఘవరావు, గోళ్ల సోమేశ్వరరావు, నాయకులు లంకపల్లి సురేష్, డి.బాల వెంకటేశ్వరరెడ్డి, సజ్జా సుబ్రమణ్యం, డీడీ ప్రసాద్, టౌన్ అధ్యక్షులు సురేష్రెడ్డి, రాఘవరెడ్డి తదితర ఐదు మండలాలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రికుల సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు
గన్నవరం: హజ్ యాత్రికుల ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. స్థానిక ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో హాజ్ యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లను శుక్రవారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హజ్ యాత్రికులకు కల్పిస్తున్న సదుపాయలను ఆయన పర్యవేక్షించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది విజయవాడ అంబార్కేషన్ పాయింట్ నుంచి 335 మంది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. వీరిలో తొలి విడతలో శనివారం 160 మంది, ఆదివారం రెండో విడతలో 175 మంది వెళ్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో హజ్ యాత్రు వెళ్తున్న వారిలో 50 శాతం మహిళలు ఉన్నట్లు చెప్పారు. ముందుగా ఇక్కడికి చేరుకున్న సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులకు ప్రత్యేక వసతి, భోజనం, వైద్య సదుపాయాలను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్, హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ షేక్ హాసన్బాషా, కమిటీ సీఈఓ గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రికుల వసతి కల్పిస్తున్న ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్ను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. -
ట్రాక్టర్ బోల్తా పడి
కూలీ మృతి తాళ్లూరు(వత్సవాయి): ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో మహిళా కూలీ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ట్రాక్టర్పై వచ్చారు. మధ్యాహ్నం సమయంలో తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వేల్పుల అన్నపూర్ణమ్మ(65) అక్కడికక్కడే మరణించగా ట్రాక్టర్ డ్రైవర్ కాళ్ల మాధవరావు, బిట్రా రాధలకు గాయాలవడంతో వారిని మధిరలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర తరలించారు. -
‘కృష్ణా’ రాజకీయాల్లో నెహ్రూ ఒక బ్రాండ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూ అంటే ఒక బ్రాండ్ అని ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ అన్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ) 9వ వర్ధంతిని పురస్కరించుకొని గుణదలలోని ఆయన ఘాట్ వద్ద శుక్రవారం ఆయన తనయుడు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెహ్రూ పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేసేవారని, నెహ్రూ వారసుడిగా అవినాష్ రాజకీయాల్లో తన ఒరవడిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ నెహ్రూ ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారని, వైఎస్సార్ సీపీ జెండా పట్టుకొని ప్రజల పక్షాన నిలిచారన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను నమ్మిన వాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా నెహ్రూ చూసుకున్నారన్నారు. నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ తన తండ్రితో సాన్నిహిత్యంగా ఉన్న వారందరూ వచ్చి నివాళులర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ రూహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు కై లే అనిల్కుమార్, మొండితోక జగన్మోహనరావు, సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాయకుడు నెహ్రూ: పేర్ని నాని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని నెహ్రూ ఉమ్మడి కృష్ణాలో ప్రజానాయకుడిగా నిలిచారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్నినాని అన్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ)9వ వర్ధంతిని పురస్కరించుకుని ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అన్ని విధాల అండగా నిలిచారని, విజయవాడ రాజకీయ పుస్తకంలో తనకంటూ ఒకపేజీని నెహ్రూ సృష్టించుకున్నారని కొనియాడారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అలాగే మొగల్రాజపురం నిమ్మతోట సెంటర్లో లంకా అబ్బినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి -
ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్తో అగ్ని ప్రమాదాల నివారణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అమరావతి రాజధాని ప్రాంతంలో హైరేంజ్ బిల్డింగ్స్ రానున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు ఇంటిగ్రేటెడ్ అర్బన్ ప్లానింగ్ రూపొందించనున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీపీ వెంకటరమణ చెప్పారు. ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం రాత్రి విజయవాడ నగరంలోని హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకువచ్చేందుకు ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటుగా తమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో విశాఖపట్నంలో రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో త్వరలో 23 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అసోసియేషన్ అమరావతి అధ్యక్షుడిగా ఎన్నికై న వి.కాంతారావు, కార్యదర్శి వైవీ దుర్గారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం.మోహనరావు, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ బి.ఉమామహేశ్వరరావు, ప్రాంతీయ డైరెక్టర్ శివరామకృష్ణన్, అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రాఖీ దీపక్తో పాటుగా సభ్యులు పాల్గొని నూతన కమిటీని అభినందించారు. -
పేర్నినానిని కలిసిన రజక సంఘం నేతలు
పెనమలూరు: కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్నినానిని ఆ పార్టీ రజక సంఘం నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు మచిలీపట్నంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ రజక, బీసీ సంఘాల నేతలు పేర్ని నానిని కలిసి గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చలు జరిపారు. రజక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శెట్టిపల్లి పూర్ణరజక, కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ రజక విభాగం అధ్యక్షుడు లింగాల శోభన్బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఓలేటి అరవింద్, నాయకులు సత్తెనపల్లి శ్రీను, తాడేపల్లి సుబ్బారావు, పత్తికాయల శివ తదితరులు పాల్గొన్నారు. -
మేళాతో ప్రోత్సాహం
కళా వైభవం.. నేటి నుంచి కొండపల్లి బొమ్మల పండుగ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మల పరిశ్రమ సుమారు 500 ఏళ్లకు పైగా విరాజిల్లుతోంది. అలాంటి కళా వైభవాన్ని భావితరాలకు అందించాలని కొండపల్లి బొమ్మల పండుగ వేడుకలు నిర్వహించేందుకు జిల్లా పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అంతర్జాతీయ వారసత్వ దినోత్సవాన్ని పుస్కరించుకొని శనివారం నుంచి 20వరకు వేడుకలకు ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న బొమ్మల మేళా కళాకారులకు చేయూతనిస్తోందనే ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బొమ్మల వేడుకలు విజయవంతం చేయాలని ఆదేశించారు. కొండపల్లికి పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చే బొమ్మల వేడుకలను బొమ్మల తయారీ కళాకారులతో పాటు ప్రతి ఇంట్లో నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం.. కొండపల్లి ఖిల్లా కోటను రెడ్డిరాజుల వంశానికి చెందిన ప్రోలాయ వేమారెడ్డి 14వ శతాబ్దంలో నిర్మించే సమయంలో భవనాలపై చూడముచ్చటైన డిజైన్లు అద్దేందుకు రాజస్థాన్కు చెందిన రాజవంశీకులు ఇక్కడకు వలస వచ్చారు. రాజభవనాలపై డిజైన్(నగిషీలు)లు వేస్తూ రాజులు ఇచ్చే భరణాలతో జీవితాలు గడిపేవారు. కొందరు ఆ సమయంలోనే బొమ్మల తయారీ పరిశ్రమ కొండ కింద కొండపల్లిలో ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం బ్రిటీష్ వారి పాలనలో బొమ్మల తయారీ పరిశ్రమను విస్తరించుకుని వారి జీవనభృతిని ఏర్పాటు చేసుకున్నారు. కొండపల్లి పరిధిలోని చుట్టుపక్కల అడవుల్లో లభించే తేలికపాటి తెల్లపొనికి చెక్కతో ఆకర్షణీయమైన బొమ్మలు ఇక్కడ తయారు చేసేవారు. రాజస్థాన్ కళాకారుల నుంచి ఈ ప్రాంతానికి చెందిన వారు సైతం బొమ్మల తయారీలో నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం సుమారు 150 కుటుంబాల వారు బొమ్మల పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. అట్టహాసంగా ఏర్పాట్లు.. బహుమతుల ప్రదానం.. కొండపల్లి బొమ్మల తయారీలో కళాకారుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఫిబ్రవరి 3నుంచి మార్చి 8 వరకు నిర్వహించిన బొమ్మల పోటీల్లో కళాకారులు తమ నైపుణ్యంతో తయారు చేసిన బొమ్మలను ఎక్స్పీరియన్స్ సెంటర్కు చేర్చారు. వేడుకలు ముగింపు రోజున న్యాయ నిర్ణేతల ప్రకటించిన విజేతలకు రూ.లక్ష విలువైన బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించనున్నారు. సుమారు 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల కోసం వేడుక ఈ ఏడాది జరగడం కళాకారుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ వేడుకలతో రెట్టింపు ఉత్సాహంతో కళాకారులు పరిశ్రమను ముందుకు తీసుకెళ్తారు. సుమారు 20ఏళ్లుగా నా కుటుంబం అత్యంత నైపుణ్యంతో బొమ్మల తయారీ పరిశ్రమ నడుపుతున్నాం. అనేక అవార్డులు కూడా వరించాయి. – కూరెళ్ల వెంకటాచారి, బొమ్మల కళాకారుడు, కొండపల్లి -
నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి
కంకిపాడు: పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. కంకిపాడు పోలీసుస్టేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీసుస్టేషన్ భవన నిర్మాణ పనులను గురువారం రాత్రి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. నిర్మాణ పరమైన అంశాలపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అన్ని విభాగాలకు అధునాతన వసతులు సమకూరాలని సూచించారు. పోలీసుస్టేషన్ నిర్మాణ పనుల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్లను ప్రత్యేకంగా అభినందించారు. హనుమాన్జంక్షన్ రూరల్: పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా పారిశ్రామికవాడలో శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యం అని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ మోడల్ ఇండ్రస్టీయల్ ఎస్టేట్ను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామికవాడలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు, చోరీల నియంత్రణ, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, మహిళా ఉద్యోగులపై వేధింపులు వంటి పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ మహిళా ఉద్యోగులు, కార్మికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఐ ఎల్.రమణ, వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ పాల్గొన్నారు. నందిగామ రూరల్: జిల్లాలో 35,945 మంది రైతులతో 42,088 ఎకరాలలో సాగు చేపట్టేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని కంచల గ్రామంలోని తత్వవనంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ముందుగా మామిడి తోటలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వల్ల తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తర్వాత పీఎండీఎస్ (ప్రీ–మాన్ సూన్ డ్రై సోయింగ్) విత్తనాలు, విత్తన గుళికల తయారీని తెలుసుకుని ఐదు ఎకరాలలో విత్తనాలు నాటడాన్ని ప్రారంభించారు. ఆర్డీవో పోశిబాబు, తహసీల్దార్ సురేష్ బాబు, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అంజిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దేవదాయ శాఖ ఎక్స్అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్లాల్ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన హరిజవహర్లాల్ను అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. అనంతరం మహామండపం రెండో అంతస్తులో జరుగుతున్న అన్న ప్రసాద వితరణను పరిశీలించారు. అన్న భక్తులతో కలిసి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న ప్రసాద వితరణపై పలు సూచనలు చేశారు. తన కుమార్తె పుట్టిన రోజును పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణకు ఆయన విరాళాన్ని అందజేశారు. -
హార్బర్లను ప్రైవేటుకు అప్పగించే కుట్రలను అడ్డుకుంటాం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ విభాగం జాయింట్ సెక్రటరీ రంగారావు కంకిపాడు: జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న పెనమలూరు మండలం గంగూరు చేపల కుండీల సెంటరులోని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో జిల్లా స్థాయి ఫుట్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.ఝాన్సీలక్ష్మీ తెలిపారు. శుక్రవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ శాప్ లీగ్స్లో భాగంగా జిల్లా స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్, జిల్లా క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. అండర్ 15–అండర్19 బాల బాలికలు టోర్నమెంట్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టోర్నమెంట్ ప్రారంభిస్తారని వివరించారు. చిలకలపూడి(మచిలీపట్నం): దొంగతనాలను ప్రవృత్తిగా చేసుకున్న ఆరేపల్లి దుర్గారావుపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ను అమలు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ వివిధ జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 70కు పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న 38 సంవత్సరాల ఆరేపల్లి దుర్గారావుపై కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఈ యాక్ట్ను అమలు చేశారు. గత కొంతకాలంగా వివిధ దొంగతనాలు, ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడుతూ ప్రజలలో భయాందోళనలు కలిగిస్తున్న ఈ నిందితుడిపై సమగ్ర విచారణ నిర్వహించారు. పలు కేసుల్లో అరెస్టయి జైలు శిక్ష అనుభవించినప్పటికీ తన నేర ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దుర్గారావు నేర నివేదికను కలెక్టర్ డీకే బాలాజీకు పంపగా నిజనిర్ధారణ కావడంతో అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించేలా ఉత్తర్వులు జారీ చేయడంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చల్లపల్లి: క్రికెట్ బెట్టింగులు ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు చల్లపల్లి ఇన్చార్జి ఎస్ఐ పి.గౌతమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగులు ఆడేవారిపై, నిర్వహించే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. చల్లపల్లిలోని పలు ప్రాంతాలకు చెందిన ఎస్.హుస్సేన్, కె.రాజా, ఎం.శంకర్ప్రసాద్, ఎం.బ్రహ్మం, టి.సత్యనారాయణలతోపాటు మెరకనపల్లికి చెందిన సీహెచ్ వెంకట సురేష్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి రూ.2500 నగదును, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌతమ్ కుమార్ తెలిపారు. -
సీఎం ఇచ్చిన హామీకే అతీగతి లేదు
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు అంటూ హామీలు ఇచ్చారు. కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. నేరుగా పేదలను కలిసి చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. పింఛన్లకు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించి పేదలను ఆదుకోవాలి. – కామరాజ్ హరీష్, ప్రధాన కార్యదర్శి, బీసీఎస్ఎఫ్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ కూటమి నాయకులు ఊదరగొట్టారు. సామాజిక పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని, అర్హులు అందరికీ లబ్ధి చేకూరుస్తామని గొప్పల డప్పు కొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. కనీసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించలేదు. పెన్షన్ వస్తూ భర్త చనిపోయిన వారికి స్పౌజ్ కేసు కింద ప్రభుత్వం పింఛనుకు అవకాశం కల్పించి చేతులు దులుపుకొంది. కొత్త పింఛన్ కోసం పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేద్దామని వెళ్లిన వారికి రిసెప్షన్లో చేదు అనుభవం ఎదురవుతోంది. పింఛన్ మాటెత్తగానే అసలు అర్జీలు తీసుకోకుండా వెనక్కు పంపుతున్నారు. పక్షవాతంతోనో, ప్రమాదాల్లో, ఇతర కారణాలతో కాళ్లు పోయి మంచానికే పరిమితమైన వారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. మందులు, ఆహారం కూడా సమకూర్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారు పింఛన్లు మంజూరు కాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదుకునేవారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ మంజూరు చేసి తమను ఆదుకోవాలని ఎంతో ఆర్తిగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రావడం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2,36, 237 పెన్షన్లు ఇస్తే, కూటమి ప్రభుత్వంలో 2,26, 775 పింఛన్లు ఇస్తున్నారు. చంద్రబాబు సర్కార్ పింఛన్లలో కోత వేసింది. అమలుకు నోచని 50 ఏళ్లకే పింఛన్ హామీ అధికారంలోకి వస్తే 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు మంజూరు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ రెండేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ఈ రెండేళ్లలో యాభై ఏళ్లు దాటిన వారు సామాజిక భద్రత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రకటించిన జిల్లా బడ్జెట్లో పెన్షన్లకు ప్రత్యేక కేటాయింపులు జరగలేదు. దీన్ని బట్టి ఈ ఏడాది కూడా కొత్త పింఛన్ల మంజూరు లేనట్లేనని కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హాకర్లు, పేదల బాగోగులు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు దీపావళి పండుగ రోజు బీసెంట్ రోడ్డులో పర్యటించారు. దుర్గారావు అనే వ్యక్తికి పింఛన్, ఇళ్లు, జీవనోపాధి కల్పిస్తానని స్వయంగా హామీ ఇచ్చారు. ఇది జరిగి నెలలు గడస్తున్నా దుర్గారావుకు పింఛన్ మంజూరు కాలేదు. తనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, పింఛన్ మంజూరు చేయా లంటూ అధికారుల చుట్టూ ఆనాటి ఫొటోలను చూపినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాళ్లు లేక ఇబ్బందులు పడుతున్న తనకు చంద్రబాబు రూపంలో కొండంత అండ దొరికిందని సంబర పడ్డానని, అయితే ఆయన ఇచ్చిన హామీనే అమలు చేయడంలేదని, ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని దుర్గారావు వాపోయారు. దుర్గారావు పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 527.20 అడుగులకు చేరింది. ఇది 152.7328 టీఎంసీలకు సమానం.చిలకలపూడి : జన గణన– 2027కు సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఆయన చాంబర్లో స్వీయ గణన చేసుకున్నారు. ఈ ఫొటోలోని వ్యక్తిపేరు మల్లయ్య. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు గ్రామం. వయసు 32 సంవత్సరాలు. అతనికి ఇద్దరు కుమార్తెలు. పక్షవాతం వచ్చి రెండు కాళ్లూ పడిపోయాయి. పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ భారం అంతా అతని భార్యపై పడింది. పిల్లల చదువులు, భర్తకు మందులు, కుటుంబ పోషణ కష్టం మారింది. విధిలేని పరిస్థితుల్లో విజయవాడ వచ్చి భర్త ఆరోగ్యం చూసుకుంటూ వాచ్ఉమన్గా పనిచేస్తోంది. తన భర్తకు పెన్షన్ మంజూరు చేయాలని రెండేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ‘ఈ ఫొటోలో వ్యక్తిపేరు చింతలపూడి దుర్గారావు. ఇతనికి సొంతిల్లు లేదు. విజయవాడ సత్యనారాయణపురంలో అద్దె ఇంట్లో నివసివస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతని ఎడమ కాలిని మోకాలి వరకు తొలగించారు. రెండో కాలుకు పైలేరియా సోకడంతో నడిచేందుకు కూడా కష్టంగా ఉంది. పొట్టకూటి కోసం బీసెంట్ రోడ్డులో ఓ పక్కన పట్టా వేసుకుని కూర్చుని జూట్ సంచులు, పట్టీలు, చైన్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సదరం క్యాంప్లో వైద్యులు అతడిని పరీక్షించి 70 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించి సర్టిఫికెట్ జారీ చేశారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుందామంటే రెండేళ్లుగా ఆన్లైన్లో సైట్ ఓపెన్ కాలేదు. గతేడాది దీపావళి సమయంలో బీసెంట్ రోడ్డులో పర్యటించిన సీఎం చంద్రబాబును దుర్గారావు కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. తనకు పెన్షన్, ఇల్లు మంజూరు చేయాలని, జీవనోపాధి కల్పించాలని కోరాడు. చంద్రబాబు స్పందించి అతనికి పెన్షన్, సొంతిల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఆరునెలలుగా నెరవేరలేదు. నాలుగైదు సార్లు పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసుకున్నా స్పందన లేదు. 7 -
ఘనంగా రైల్వే వారోత్సవాలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో గురువారం రైల్వే వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో డీఆర్ఎం మోహిత్ సోనాకియా 2025–26లో డివిజన్ సాధించిన పురోగతిని వివరించారు. రికార్డు స్థాయిలో రూ. 5,939 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని, 40.64 మిలియన్ టన్నుల అత్యధిక సరుకు రవాణాను సాధించడం డివిజన్కు గర్వకారణమని కొనియాడారు. రైళ్ల సమయపాలన 87 శాతానికి మెరుగుపడిందని పేర్కొన్నారు. డివిజన్లో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించడం, మూడవ లైన్ సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న వేగపరిమితులను తొలగించడం, పెద్ద ఎత్తున ట్రాక్ పునరుద్ధణ వంటి కీలక విజయాలను సాధించామన్నారు. రద్దీ నివారణకు డివిజన్ మీదుగా ఐదు వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు. ఈ సందర్భంగా విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 58 ఉద్యోగులకు రైల్ సేవా పురస్కారాలు, 12 మంది ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీపీఓ ప్రేమ్కుమార్ లకావత్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టి కృషి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదాల నిరోధానికి ప్రభుత్వ శాఖలు, పౌరులు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రవాణా, పోలీసు శాఖలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చోట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో గురువారం ‘పీఎం–రాహత్’ పథకం అమలు–ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు జరిగే రోడ్డు ప్రమాదాలతో గాయపడే వారికి తక్షణం ఉన్నత వైద్యాన్ని అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని వెల్లడించారు. పీఎం రాహత్ పథకం క్షతగాత్రులకు ఉపశమనాన్ని ఇస్తుందన్నారు. ప్రమాదం జరిగిన గంటలోగా ఉచితంగా రూ.1.5 లక్షల వైద్యాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 656 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పీఎం రాహత్ కింద సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలో కనీసం 1,500 ఆస్పత్రుల్లో పీఎం–రాహత్ కింద వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నిరోధంపై అన్ని జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు (రోడ్డు సేఫ్టీ) నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎంఈ డాక్టర్ రఘునందన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, రవాణాశాఖ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బోస్, ఆషా అధ్యక్షులు డాక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో డిసీజ్ మానిటరింగ్ కేంద్రం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల సాధన కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ ర్యాంకింగ్ రావడం వల్ల వైద్య కళాశాలలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో రూ.6 కోట్లతో ఏర్పాటు కాబోతున్న డీఎండీసీ (డిసీజ్ మానిటరింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ సెంటర్) కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ లాన్సెట్ వంటి అంతర్జాతీయ స్థాయి జర్నల్స్లో రాష్ట్ర వైద్యుల పరిశోధన పత్రాలు ప్రచురితం జరిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సాయిసుధీర్, లక్ష్మీ సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. -
యనమలకుదురు ఆలయ అర్చకులకు బెయిల్
పెనమలూరు: యనమలకుదురు శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయంలో అర్చకులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను ఈవో ఎన్.భవాని, అర్చకులు సాగర్, పూర్ణ, ఉద్యోగి రోశయ్య స్వాహా చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అర్చకులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.50 వేలు రికవరీ కూడా చేశారు. ఈవో ఎన్.భవాని ముందస్తు బెయిల్ తీసుకోగా మిగతా ముగ్గురు అరెస్టు కావటంతో అవనిగడ్డ జైలుకు వెళ్లారు. ఇద్దరు అర్చకులు, ఒక ఉద్యోగికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవో, అర్చకులు సస్పెన్షన్లో ఉన్నారు. విచారణ పూర్తి ఆలయంలో జరిగిన అవినీతిపై గత కొద్ది రోజులుగా ఐదుగురితో కూడిన కమిటీ చేసిన విచారణ పూర్తైంది. ఆలయంలో రికార్డులు తనిఖీ చేశారు. విచారణ నివేదికను ఎండోమెంట్ కమిషనర్కు సమర్పిస్తారు. అయితే ఆలయంలో ఆభరణాలపై భక్తుల సమక్షంలో బహిరంగ విచారణ చేయాల్సి ఉంది. స్వామివారి ఆభరణాలు ఉన్నాయా... స్వాహా చేశారా అనే విషయం తేలాలి. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఫిర్యాదు గన్నవరం: సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గురువారం స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఒక ప్రైవేట్ సమావేశానికి సంబంధించిన దృశ్యాలను అనధికారికంగా రికార్డు చేయడంతో పాటు ఆడియో, వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను అసభ్యకరంగా చిత్రీకరించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం గన్నవరం: సూరంపల్లి శివారు రామచంద్రపురం వద్ద జాతీయ రహదారి బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం... పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఇల్లూరి జగదీష్(27) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన జగదీష్ బుధవారం బైక్పై హనుమాన్ జంక్షన్లోని స్నేహితుడి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం తిరిగి కానూరు వస్తుండగా బైపాస్ రోడ్డులో రామచంద్రపురం వద్ద టోల్గేట్ దాటిన తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా
మచిలీపట్నంటౌన్: కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగులు గురువారం ధర్నా నిర్వహించారు. మచిలీ పట్నంలోని బుట్టాయిపేట పాత టెలికం ఎక్స్ఛేంజ్ కార్యాలయ ద్వారం వద్ద ధర్నా నిర్వహించి, డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆర్థిక సౌలభ్యంతో ముడి పెట్టకుండా 2026 జనవరి ఒకటో తేదీ నుంచి ఇవ్వాల్సిన డీఏను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ అన్ని సదుపాయాలు కల్పించాలని, పే రివిజన్ వెంటనే అమలు చేయాలని, కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మోసపూరితమైన పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మచిలీపట్నం శాఖ కార్యదర్శి నాగేశ్వరరావు, పెన్షనర్స్ అసోసియేషన్ మచిలీపట్నం శాఖ అధ్యక్షుడు ఏడుకొండలు మాట్లాడుతూ ఎన్డీఏ నూతన విధానాలను అమలు చేస్తూ విశ్రాంత ఉద్యోగుల పొట్టలు కొడుతోందని ఆరోపించారు. సంఘ నాయకులు ఎండీ యూనస్, ఎస్.రంగనాథరావు, కుర్మా శ్రీనివాసరావు, పి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్గి రాజేసిన ప్రొటోకాల్ రగడ
అవనిగడ్డ: అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం రసా భాసగా మారింది. ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులు బైఠాయించి ఆందో ళన చేశారు. శిలాఫలకాన్ని లాగేసి కాలువలోకి పారేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ నాయకుల మధ్య మరింత అగాధాన్ని సృష్టించింది. అన్న క్యాంటీన్ భవనం గోడకు ఆనుకుని టీడీపీ నేత విక్కుర్తి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఈ ఫ్లెక్సీని తొలగించాలని పంచాయతీ, రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం. ఫ్లెక్సీలో చంద్రబాబు, ఎన్టీఆర్ బొమ్మలు ఉండటంతో ఫ్లెక్సీ తీస్తే సహించేది లేదని కొందరు టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవం కొంత ఆలస్యమైంది. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం శిలాఫలకంపై ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడం గమనించిన టీడీపీ నేతలు రావి నాగేశ్వరరావు, మెండు లక్ష్మణరావు (చంటి) శిలాఫలకం ముందు బైఠాయించి ఆందో ళన చేశారు. అనంతరం కొంతమంది ఈ శిలాఫ లకాన్ని లాగేసి పంటకాలువలో పారేసేందుకు యత్నించారు. వారిని గమనించిన టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు ఈ శిలాఫలకాన్ని లాక్కుని భవనం దగ్గరకు తీసుకెళ్లారు. ఏఎంసీ చైర్మన్ పేరు లేకుండా శిలాఫలకం వేయడానికి వీలులేదని కొల్లూరు వర్గీయులు నినాదాలు చేశారు. కలెక్టర్, తహసీల్దార్కు వచ్చిన ప్రొటోకాల్ జాబితాలో ఏఎంసీ పేరుందని, కావాలనే ఆయన పేరుని తొలగించారని కొల్లూరి వర్గీయులు ఆరోపించారు. దీంతో కనపర్తి కలుగ జేసుకుని శిలాఫలకాన్ని తీసేసి ఏఎంసీ చైర్మన్ పేరు వేయించి మరో శిలాఫలకం ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఆందో ళనకారులు వెనక్కి తగ్గారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ప్రొటోకాల్ విషయంలో పొరపాటు జరిగిందని, అందుకు క్షమించాలని సభావేదికపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రకటించడంతో కొల్లూరి వర్గీయులు శాంతించారు. ఈ ఘటన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, టీడీపీ నేతల మధ్య అగ్గి రాజేసినట్టయిందని కొంతమంది బాహాటంగానే చెప్పారు. -
ఫెయిల్యూర్ గాయం కాదు.. ఒక పాఠం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మార్కులే జీవితం కాదు. చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే. తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించలేని ఎందరో భవిష్యత్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఉత్తీర్ణత సాధించలేదని, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెందకుండా పట్టుదలతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయన్న మనస్తాపంతో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లులో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలిక చికిత్స పొందుతోంది. ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫలితాలు వెల్లడైన ప్రతిసారి కొందరు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు వచ్చా యన్న మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం. అందుకు వారు చదువులో ఎదుర్కొంటున్న ఒత్తిడి, తల్లిదండ్రులు ప్రభావం కూడా ఉంటోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నాం, అన్ని మార్కులు రావాలి, ఇన్ని మార్కులు రావాలి అంటూ తల్లిదండ్రులు తమ ఆశలను పిల్లలపై రుద్దుతున్నారు. దీంతో కొందరు పిల్లలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చలేకపోయామన్న బాధతో ఆత్మహత్మలకు పాల్పడుతున్నారు. ఈ విధానం మారాలని, మార్కులు ప్రామాణికం కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. చదువు ఒక్కటే జీవితం కాదు చదువు ఒక్కటే జీవితం కాదు. జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువులో రాణించలేక పోయినా, ఇతర వృత్తుల్లో రాణించి ఉన్నత స్థానానికి ఎదిగిన వారు అనేక మంది ఉన్నారు. ఒకసారి ఫెయిలైన వారు, తర్వాత పట్టుదలతో పరీక్షలు రాసి ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎందరో ఉన్నారనే వాస్తవాన్ని విద్యార్థులు గ్రహించాలి. ఆత్మహత్యలకు పాల్పడి తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగల్చడం సరికాదు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పిరికితనంతో చేసే చర్యగా నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రుల పాత్రే కీలకం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో తల్లిదండ్రుల పాత్రే కీలకమని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కొందరు తల్లిదండ్రులు రూ.లక్షల ఫీజులు చెల్లించి కార్పొరేట్ కాలేజీల్లో చేరుస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు కడుతున్నాం, మంచి మార్కులు రావాలంటూ పదే పదే పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కొందరు పిల్లలు మానసికంగా కుంగిపోయి, ఫెయిలైనా, మార్కులు తక్కువ వచ్చినా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల్లో మార్పు రావాలని, తమ పిల్లలు ఫెయిలైనా మరో అవకాశం ఉంన్న ఓదార్పుతో మాట్లాడాలని సూచిస్తున్నారు. ఇతర పిల్లలతో పోల్చడం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలను డాక్టరో, ఇంజి నీరో చేయాలని తల్లిదండ్రులు భావించడంతో తప్పులేదు. అయితే పిల్లల అభిప్రాయాలను తెలుసుకుని, వారు చదువులో రాణించగలరో లేదో అంచనా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలే దనో, తక్కువ మార్కులు వచ్చాయనో ఆత్మహత్యకు పాల్పడి సాధించేది ఏమీ లేదు. తల్లిదండ్రులకు విషాదాన్ని మిగల్చడమే. ఏదైనా జీవించి సాధించాలి. ఒకసారి ఫెయిలైనా మళ్లీ పట్టు దలతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. జీవితంలో ఎదిగేందుకు మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు. చదువులో రాణించలేని వారు రాజకీయాల్లో, వ్యాపారాల్లో, వివిధ వృత్తుల్లో రాణిస్తున్న వారు ఎందరినో చూస్తున్నాం. మనకు నచ్చిన రంగంలో రాణించే అవకాశం ఉంది. ఆత్మహత్యలతో జీవితాలను అర్ధంతరంగా ముగించొద్దు. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్, విజయవాడ -
ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రజలను, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేతిలో ఆయుధంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ను ఆయన కార్యాలయంలో అంబటి రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా తనను తప్పుడు కేసులో ఇరికించి 18 రోజులపాటు జైల్లో నిర్బంధించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో జడ శ్రావణ్కుమార్ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న తనను కలిసి పరామర్శించారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన జడ శ్రావణ్కుమార్కు ధన్యవాదాలు తెలిపేందుకు ఆయన కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. శ్రావణ్కుమార్ తమ పార్టీ కాకపోయినప్పటికీ ఈ ప్రభుత్వం తన అరెస్టు విష యంలో అక్రమంగా వ్యవహరించిందని ప్రపంచానికి చాటారన్నారు. జడ శ్రావణ్ కుమార్ సమా జంలో జరిగే అన్యాయాలపై కంఠం వినిపిస్తున్నా రని, ఆయన మాటలు సమాజంపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వైఎస్సార్ సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. నోటీసులు ఇస్తే సరిపోయే కేసుల్లో సమాజంలో పేరుగడించిన వ్యక్తులను రౌడీల్లా, సంఘ విద్రోహ శక్తుల్లా ఎత్తుకు పోవడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి వేధించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని స్పష్టంచేశారు. పోలీసులు, ప్రభుత్వాలు ఉంది కక్ష తీర్చుకోవడానికి కాదని, ప్రజల సంక్షేమాన్ని చూసేందుకు పని చేయాలని హితవుపలికారు. ప్రభుత్వాలు కక్ష తీర్చుకునేందుకు పోలీసులు వాడుకునే నీచస్థాయికి దిగజారిపోయాయన్నారు. గుంటూరులో నిరసన నిరాహార దీక్ష ఈ నెల 18వ తేదీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు. రెండు ప్రధాన డిమాండ్లతో 12 గంటల నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను అరెస్టయినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకు పోలీసులు ప్రవర్తించిన తీరు చట్టవ్యతిరేకమైందని స్పష్టంచేశారు. తనను హింసించాలని ప్రయత్నించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని, తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులకు కనువిప్పు కలగా లని తాను చేస్తున్న దీక్షకు ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పక్షాలు మద్దతు తెలపాలని అంబటి రాంబాబు కోరారు. జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ పూడి శ్రీహరి అరెస్ట్ను ఖండించారు. ఇది మీడియాపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. -
పేదల ఇళ్లపైకి మరోసారి బుల్డోజర్
పెనమలూరు/కంకిపాడు: కూటమి పాలకులు పేదల ఇళ్లపై కన్నెర్ర చేశారు. గోసాల–వణుకూరు రోడ్డులో ఉన్న పేదల ఇళ్లు బుధవారం నేలమట్టం చేశారు. పెద్ద ఎత్తున బుల్డోజర్లు తీసుకు వచ్చి విచక్షణారహితంగా ఇళ్లను కూల్చేశారు. ఎటువంటి గొడవలు జరగకుండా ఉండటానికి పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దించి బందోబస్తు పెట్టారు. చాలా ఏళ్లుగా ఉంటున్న ఇళ్లు కళ్ల ఎదుటే నేలమట్టం చేయటంతో బాధితులు బోరున విలపించారు. వివరాలు ఇవి.. మండల పరిధిలోని గోసాల–వణుకూరు ఆర్ అండ్బీ రోడ్డు పక్కనే గత 40ఏళ్లుగా చాలా మంది పేదలు ఇళ్లు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అయితే టీడీపీ నేతల కళ్లు పేదల ఇళ్లపై పడ్డాయి. దీంతో నాలుగు రోజుల క్రితం బుల్డోజర్లతో వచ్చి ఇళ్లను నేలమట్టం చేయాలని యత్నించారు. దీంతో వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవభక్తుని చక్రవర్తి అడ్డుకున్నారు. పేదలను రోడ్డు పాలు చేస్తే సహించేది లేదని నిరసన వ్యక్తం చేశారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. దీంతో ఇళ్ల కూల్చి వేత ఆగింది. తెల్లవారుజామునే కూల్చివేత.. అయితే రెవెన్యూ, పోలీసు ఒక్కసారిగా బుధవారం ఉదయాన్నే హఠాత్తుగా రంగంలోకి దిగారు. గోసాల రోడ్డులో ఉన్న దాదాపు 25 పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు. ఎటువంటి గొడవలు జరగకుండా దాదాపు 100 పోలీసులు పహారా కాశారు. ఒక్కసారిగా బుల్డోజర్లు వచ్చి ఇళ్ల పై పడి కూల్చివేయటంతో నిద్రమత్తులో ఉన్న పేదలు ఉలిక్కిపడ్డారు. తమకు న్యాయం చేయాలని పేదలు వేడుకున్నా అధికారులు మనసు కరగలేదు. కాకీలను అడ్డు పెట్టుకుని మొత్తం ఇళ్లన్నీ నేలమట్టం చేయటంతో పేదలు ఆర్తనాదాలు పెట్టారు. పేదలకు తమ ఇళ్ల వద్ద కూడా ఉండనీయలేదు. గోసాల రహదారి పోలీసులు మూసివేశారు. రియల్టర్ల కోసమేనా? కాగా రోడ్డు ఆక్రమణలు తాము తొలగించామని, ఇక్కడి పేదలకు వేల్పూరులో ఇళ్ల స్థలాలు ఇచ్చామని రెవెన్యూ అధికారులు తెలిపారు. అయితే గోసాలకు వేల్పూరు గ్రామం చాలా దూరమని తాము అక్కడికి వెళ్లి ఏమి చేయాలని బాధితులు కంటతడి పెట్టారు. ఇక్కడ పనులు చేసుకునే తాము వేల్పూరుకు వెళ్లలేమని చెప్పినా అధికారులు వినలేదన్నారు. కాగా కేవలం రియల్టర్ల వ్యాపారం కోసమే పేదల ఇళ్లు నేలమట్టం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోసాలలో 25 ఇళ్లు నేలమట్టం -
పారామెడికల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. బుధవారం విజయవాడ ప్రెస్క్లబ్లో జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ పారామెడికల్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలన్నారు. సిబ్బంది సేవలు నిరుపమానం అన్నారు. కరోనా సమయంలో రోగుల ప్రాణాలు కాపాడటం కోసం అనేకమంది ప్రాణాలను సైతం పణంగా పెట్టారన్నారు. గత 15 ఏళ్ల నుంచి ఉద్యోగ భద్రత లేక కాంట్రాక్ట్ విధానంలోనే విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికై నా స్పందించి పారామెడికల్ సిబ్బంది, కాంట్రాక్ట్ నర్సస్ను రెగ్యులరైజ్ చేయాలన్నారు. భవిష్యత్తు నోటిఫికేషన్లో గవర్నమెంట్ మెడికల్ విభాగంలో అన్ని పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో మరణించిన కాంట్రాక్ట్ ఎంప్లాయిస్కు రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. జేఏసీ ప్రతినిధులు కోటేశ్వరరావు, సతీష్, మనీషా, రమాదేవి, ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కంచికచర్ల: పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చెవిటికల్లు గ్రామానికి చెందిన విద్యార్థిని జగ్గయ్యపేటలోని గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం విద్యా శాఖ విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఆమె రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఇంట్లోకి వెళ్లి విద్యార్థినిని కిందకు దించారు. కంచికచర్ల ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయ వాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు ఇంటర్మీడియెట్ – 2026 ఫలితాలలో చక్కని ఫలితాలను సాధించినట్లు ఎన్టీఆర్ జిల్లా అధికారులు ప్రకటించారు. జూనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాలలో మొత్తం 804మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 700 మంది ఉత్తీర్ణతను సాధించి, 87శాతం నమోదు చేశారన్నారు. ముప్పాళ గురుకులం (100), కుంటముక్కల (98), రంగాపురం (97), నర్సాపురం (96), జగ్గయ్యపేట (95), బల్లిపర్ర (91) శాతం చొప్పున విజయాలను అందుకున్నాయన్నారు. సీనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాలకు సంబంధించి మొత్తం హాజరైన విద్యార్థులు 944 కాగా ఉత్తీర్ణులైన వారు 888 మొత్తం ఉత్తీర్ణత 94 శాతంగా నమోదైంది. -
అమరావతిని ఎవరో ఆపాల్సిన పనిలేదు!
చిలకలపూడి(మచిలీపట్నం): జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాపాడుకోలేని వారు తాము ఏదో తెచ్చామని చెప్పుకోవటం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మచిలీపట్నం నగరానికి పట్టాభి సీతారామయ్య భవన్, పోర్టు, మెడికల్ కళాశాల తానే తెచ్చానని ఎంపీ బాలశౌరి చెబుతున్నారని ఓ విలేకరిని అడగ్గా.. జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి అహర్నిశలు కష్టపడి కార్యకర్తగా పనిచేసిన వారిని కాపాడుకోలేని, ప్లాన్ మంజూరు చేయించలేని ఆయన.. ఇవి ఏ రకంగా తెచ్చానని చెప్పుకుంటున్నారో ప్రజలే గమనించాలన్నారు. ● సమాచారశాఖ మంత్రి పార్థసారథి జగన్కు రాష్ట్రంపై విజన్ లేదని ఎలా దోచుకుందామా అనే ధ్యాసే ఉందని వ్యాఖ్యానించారని చెప్పగా.. ఆయన సమాధానమిస్తూ మంత్రి పార్థసారథి అద్దె మైకు లాంటివారని ఎద్దేవా చేశారు. పార్థసారథి విజన్ ఏంటో ప్రజలకు తెలుసున్నారు. ● తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డీలిమిటేషన్లో హైబ్రీడ్ మోడల్ ప్రతిపాదనపై దక్షిణాది ముఖ్యమంత్రుల కు లేఖ రాశారని జగన్ కూడా లేఖ రాస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో చంద్రబాబునాయుడు, రేవంత్రెడ్డి ఏ విధంగా చేశారో అదే విధంగా డీలిమిటేషన్కు ఓటు వేయవద్దని రేవంత్రెడ్డి చంద్రబాబుకు చెప్పవచ్చు కదా పేర్ని సమాధానమిచ్చారు. ● వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్ని మొరిగినా అమరావతి నిర్మాణాన్ని ఆపలేరని ఎంపీ రేణుకాచౌదరి వ్యాఖ్యానించారని అడగ్గా.. పేర్ని నాని మాట్లాడుతూ దానిని ఎవరూ ఆపాల్సి అవసరం లేదని, అమరావతి ప్రాంతంలో రేపు వర్షాలు పడితే అదే ఆగిపోతుందని చెప్పారు. ● వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మావిగన్ అని అంటున్నారని, తాము సీఆర్డీఏలో ఎప్పుడో పెట్టామని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానిస్తున్నారన్న ప్రశ్నకు.. పేర్ని నాని సమాధానమిస్తూ అమరావతిలో రాజధాని కోసం 29 గ్రామాలు ఏర్పాటు చేశారన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 23 గ్రామాలకే తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదముద్రలో మాత్రం 29 గ్రామాలకు తెచ్చుకున్నారన్నారు. ఇది దొంగచట్టం అన్నారు. మావిగన్ అద్భుతమైన ప్రతిపాదన అని ప్రజలు చెప్పుకుంటున్న నేపథ్యంలో పిల్లిమొగ్గలు వేస్తున్నారన్నారు. ● మంత్రి నారా లోకేష్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారని ఓ విలేకరి చెప్పగా.. మరి చంద్రబాబు స్లీపింగ్ ప్రెసిడెంటా.. అని వ్యాఖ్యానిస్తూ అమరావతి రాజధాని నిర్మాణంలో మూటలు కట్టుకునే పనిలో ఉండి లోకేష్కు అప్పజెప్పినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, వైఎస్సార్ సీపీ నాయకుడు చిటికిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి స్వీయ గణన నగారా
చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం 2027 జనాభా గణనకు సంబంధించి ప్రజలకు స్వీయ గణన చేసుకునే అవకాశం ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు కల్పించినట్లు కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో బుధ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనగణన రెండు దశల్లో నిర్వహిస్తున్నామన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గణన, రెండో దశలో జనాభా గణన ఉంటుందన్నారు. ఈసారి మొట్టమొదటిగా డిజిటల్ సాధనాల ద్వారా డేటా సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎన్యుమరేటర్లు తమ సొంత స్మార్ట్ ఫోన్లో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి కుటుంబాల వివరాలను సేకరిస్తారన్నారు. ప్రజలు స్వీయ గణన ద్వారా సమర్పించిన సమాచారాన్ని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ధ్రువీకరిస్తారన్నారు. ఇళ్ల జాబితా, గణనకు సంబంధించి ప్రాథమిక ఏర్పాటు కొనసాగుతోందని ఇందులో భాగంగా మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్లు ఎంపిక చేసే వారికి తగిన శిక్షణ ఇచ్చామన్నారు. మండలాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాల్టీల్లో ఎన్యుమరేషన్ బ్లాక్లను గుర్తించామన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి నెలాఖరు వరకు నాలుగు బ్యాచ్లుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు మొదటి దశ ఇళ్ల జాబితా, గణన ఎంపిక చేయబడిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల ద్వారా నిర్వహించటం జరుగుతుందన్నారు. స్వీయ గణన కోసం వెబ్సైట్ https://se. census.gov.inను సందర్శించాలన్నారు. జనగణన ముఖ్యమైన కార్యక్రమం అయినందున ప్రజలందరూ సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని కోరారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన కలెక్టర్ బాలాజీ -
దుర్గమ్మకు రూ.2.69 కోట్ల హుండీ ఆదాయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు రూ.2.69 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఆలయ ఈఓ శీనానాయక్ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో 16 రోజులకు రూ.2,69,48,521 ఆదాయం సమకూరింది. నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 2.755 కిలోల వెండి లభ్యమైంది. 249 యూఎస్ఏ డాలర్లు డాలర్లు, 45 యూరప్ యూరోలు, 130 యూఏఈ దిర్హమ్స్, 180 థాయిలాండ్ బాత్స్, 200 ఓమన్ బైసాలు లభించాయి. రద్దయిన రూ.2 వేల నోట్లు 12 వచ్చాయి. కానుకల లెక్కింపును వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టాలని ఫిర్యాదు చిలకలపూడి(మచిలీపట్నం): సోషల్ మీడియా, టీవీ మాధ్యమాల్లో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కోరారు. వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కలిసి ఆయన అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడుకు బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వంశీమోహన్ మాట్లాడుతూ.. సామాజిక మాధ్య మాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్ దెబ్బతీయడానికి కొంత మంది కుయుక్తులు పన్నుతున్నారని, వారి పోస్టుల వెనుక ఉన్న వారి కోసం విచారణ జరిపి బాధ్యులపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు చెస్ ఆడటం వల్ల వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయని దీని వల్ల విద్యలో కూడా రాణిస్తారని ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ చెప్పారు. స్థానిక కానూరులోని స్కాట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు అమరావతిలోని విట్ యూనివర్సిటీలో త్వరలో జరగునున్న ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం జరిగాయి. బాల బాలికలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 24 మంది క్రీడాకారులను ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపిక చేశామని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణికుమార్ చెప్పారు. స్కూల్ సీఈఓ కె.జాహ్నవి, చెస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రీ సర్వే ప్రక్రియ పరిశీలన పెదప్రోలు(మోపిదేవి): భూముల రీ సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉంటూ తమ డాక్యుమెంట్లను అధికారులకు అందించి సహకరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. మండలంలోని పెదప్రోలులో జరుగుతున్న రీ సర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. రెవెన్యూ అధికారులు, రైతులకు కలెక్టర్ బాలాజీ పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి పలు రికార్డులు తనిఖీ చేశారు. అక్కడ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని వైద్యులు అందిస్తున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోపిదేవిలో బాలకల వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించారు. గ్రామ ప్రత్యేక అధికారి, తహసీల్దార్ ఎం.హరనాథ్, వసతిగృహ వార్డెన్ నాగలక్ష్మి, వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
పెనమలూరు: రాష్ట్రంలో యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో బుధవారం విబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ, ఈగల్ ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ ఇక్కడకు వచ్చిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐజీపీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. ఈగల్ మిషన్ ద్వారా విద్యార్థులందరినీ కలిసి ఎన్డీపీ చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మాదకద్రవ్యాల వల్ల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మాదకద్రవ్యాలను పట్టుకోవటానికి రైళ్లు, బస్సులు, కార్లపై నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్తో విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో పొగాకు, సిగరెట్లు విక్రయాలు నిషేధించామని తెలిపారు. 22 నాటికి ముగిస్తాం.. విబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఫౌండర్ విజయ్కలాం మాట్లాడుతూ ఏప్రిల్ 6వ తేదీ నుంచి తిరుపతి వేంకటేశ్వర యూనివర్సీటీ నుంచి విశాఖపట్నంలో ఈ నెల 22వ తేదీ నాటికి ముగిస్తామన్నారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కె.నాగేష్బాబు, అదనపు ఎస్పీ ప్రభాకర్, డీఎస్పీ ధర్మేంద్ర, సిద్ధార్థ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెంకటేశ్వరరావు, ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, ఎన్ఎస్ఎస్ కోర్డినేటర్లు జె.శివరామ్ప్రసాద్, పి.సుష్మాచౌదరి, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈగల్ ఐజీపీ రవికృష్ణ -
పతి వెనుకే సతి
మరణంలోనూ వీడని బంధం గూడూరు: అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన భర్త మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలో భార్య ప్రాణాలు విడిచిన విషాద ఘటన బుధవారం గూడూరు మండలం కప్పలదొడ్డిలో చోటు చేసుకుంది. గ్రామంలో రైసు మిల్లు నిర్వహిస్తున్న తిరుమలశెట్టి వీర రాఘవరావు(66) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. భర్త తన కళ్లెదుటే ప్రాణాలు విడవటాన్ని జీర్ణించుకోలేకపోయిన భార్య పద్మావతి(61) సొమ్మసిల్లి పడిపోయింది. పద్మావతి పరిస్థితిని గమనించిన బంధువులు ఆందోళన చెందారు. వెంటనే తేరుకుని పెడన పట్టణంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రైలు గేటు పడటంతో దాదాపు 20 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో ఆస్పత్రికి వెళ్లే లోపే ఆమె తుదిశ్వాస విడిచారు. జీవితాంతం భర్త అడుగుజాడల్లో నడుస్తూ తోడునీడగా మెలిగిన పద్మావతి.. మరణంలోనూ తోడును వదలకుండా వెన్నంటే అనంతలోకాలకు వెళ్లిపోవడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
తీరంలో పోలీసుల ‘సాగర్ కవచ్’
కోస్ట్గార్డ్, నేవీ సిబ్బందితో కలిసి మాక్డ్రిల్కోడూరు: ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అనుమానితుల ఆచూకీ కనిపెట్టేందుకు హంసలదీవి సాగరతీరం వెంట పోలీసులు సాగర్ కవచ్ పేరుతో ప్రత్యేక మాక్డ్రిల్ నిర్వహించారు. కోస్ట్గార్డు, నేవీ, మైరెన్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సాగర్ కవచ్ భాగంగా తనిఖీలు జరిపారు. పాలకాయతిప్ప మైరెన్ సీఐ సురేష్రెడ్డి పర్యవేక్షణలో 50మంది పోలీసులు కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. కోస్టల్ పోలీసులు, నేవీ అధికారులు ఉగ్రవాదులు, తీవ్రవాదుల రూపంలో వచ్చి తీరప్రాంత గ్రామాల్లోని ఏదో ఒక ప్రాంతంలో దాగుంటారని, పోలీసులు వీరిని ఏవిధంగా కనిపెడతారనే అంశంపై ఈ మాక్డ్రిల్ సాగుతుందని సీఐ సురేష్రెడ్డి చెప్పారు. వీరిని కనిపెట్టేందుకు పోలీసులు ప్రత్యేక పడవల ద్వారా సముద్రమార్గం వెంట సంచరించారు. సముద్రంలో వేటాడుతున్న పడవులను కూడా తనిఖీ చేశారు. పాలకాయతిప్ప, హంసలదీవి, ఉల్లిపాలెం, రామకృష్ణాపురం గ్రామాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అపరిచిత వ్యక్తుల వివరాలను సేకరించారు. ఎస్ఐలు ఉజ్వల్కుమార్, పూర్ణమాధురి, అవనిగడ్డ సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లా: ఆటో బోల్తా.. ఆరుగురి పరిస్థితి విషమం!
సాక్షి, కృష్ణా జిల్లా: నాగాయలంక సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో గణపేశ్వరం గ్రామానికి చెందిన 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొక్కజొన్న పనుల నిమిత్తం బాపట్ల జిల్లా గొరికపూడి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగింది. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఐదుగురికి అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.మరో ప్రమాదంలో నందిగామ రూరల్ మండలంలోని ఐతవరం గ్రామ శివారులోని 65వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. కంచికచర్లకు చెందిన లక్ష్మీనారాయణ (50) బుధవారం కంచికచర్ల నుంచి ద్విచక్ర వాహనంపై నందిగామ వస్తున్నాడు. ఈ క్రమంలో ఐతవరం గ్రామ సమీపంలోకి వచ్చే సరికి వెనుకగా వస్తున్న కారు ఢీకొట్టింది.ఈ ఘటనలో లక్ష్మీనారాయణ తలకు తీవ్ర గాయాలు కావటంతో టోల్ప్లాజా అంబులెన్స్లో నందిగామలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
పోలీసుల్ని ఆశ్రయించిన వల్లభనేని వంశీ
సాక్షి,కృష్ణాజిల్లా: వల్లభనేని వంశీపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ఏఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ కోరారు. -
అవనిగడ్డలో ఉద్రిక్తత.. ప్రొటోకాల్ రగడ
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ జరిగింది. అవనిగడ్డ అన్న క్యాంటీన్ ఓపెనింగ్ ఉద్రిక్తతకు దారితీసింది. శిలాఫలకంపై ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడంతో రచ్చ మొదలైంది. ఏఎంసీ ఛైర్మన్ పేరు లేని శిలాఫలకం మాకొద్దంటూ శిలాఫలకం బోర్డును వెంకటేశ్వరరావు వర్గీయులు పీకేశారు.శిలాఫలకాన్ని సమీపంలోని పంటకాలువలో పడేసేందుకు యత్నించారు. వెంకటేశ్వరరావు వర్గాన్ని అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాస్ అడ్డుకున్నారు. పార్టీ కోసం కష్టపడితే కుల వివక్ష చూపుతున్నారంటూ వెంకటేశ్వరరావు వర్గం మండిపడ్డారు. శిలాఫలకం వద్ద భైఠాయించి వెంకటేశ్వరరావు వర్గీయులు నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్ సిబ్బందితో గొడవకు దిగారు. కార్యక్రమం రచ్చ రచ్చగా మారడంతో అవనిగడ్డ అన్న క్యాంటీన్ ప్రారంభానికి నోచుకోలేదు. -
బాబు, లోకేష్.. పర్యవసానాలు అనుభవిస్తారు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: టీడీపీ వాళ్ల కళ్లల్లో ఆనందం కోసం పోలీసు వ్యవస్థ ఇంతలా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు.. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దగ్గరున్న వారిని భయపెట్టాలనుకుంటున్నారా?.. లోకేష్ ఒక్కడికే విద్య తెలుసు అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పూడి శ్రీహరిని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. ఏం నేరం చేశారని శ్రీహరిని అరెస్ట్ చేయించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఒక విలేకరిగా ఎదిగి పైకొచ్చిన వ్యక్తి పూడి శ్రీహరి. మీరు చేసేది చట్టబద్ధమైన చర్య అయితే ప్రెస్ మీట్ పెట్టి శ్రీహరిని అరెస్ట్ చేయించండి. శ్రీహరి ఏమైనా నేరాలు చేశాడా?. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు.సోషల్ మీడియా కేసుకు ఇలా తీసుకెళతారా. చంద్రబాబు మీరు ఏం నేర్పిస్తున్నారు?. మీ తప్పులను ప్రశ్నిస్తున్నందుకు 20 నెలల నుంచి అందరినీ లోపల వేస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్నవారిని భయపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మంగళహారతి పాడేందుకు జనం సిద్ధమైపోయారు. తప్పుడు కేసులు పెట్టి శ్రీహరిని ఓ 15 రోజులు జైల్లో పెట్టగలరు.. అంతకంటే ఏం చేయగలరు?. జైలు నుంచి బయటకి వచ్చాక జగన్ దగ్గర పనిచేయకుండా ఆపగలరా?. ఒకవేళ శ్రీహరి తప్పు చేస్తే అందరి ముందు అరెస్ట్ చేయండి. అలా కాకుండా దొంగతనంగా ఎత్తుకెళ్లడం దేనికి.. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు సీజ్ చేయడం దేనికి?. ఎవరిని భయపెడదామనుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు పోకడగలకు ఏ ప్రభుత్వాలు పోలేదు. రాజకీయ కక్షల కోసం పోలీసులను వాడుకున్న వాడు బతికిబట్టకట్టలేదు.40 ఏళ్ల ఇండస్ట్రీ అని నీతులు చెప్పడం సరికాదు. ఏపీలో పోలీసు వ్యవస్థను పతనావస్థకు తీసుకెళుతున్నారు. మీ కొడుకు మాటలు విని వ్యవస్థను నాశనం చేస్తే పర్యవసనాలు మీరు అనుభవించాల్సి వస్తుంది చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఏమైపోతారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు పెట్టినంత మాత్రాన మమ్మల్ని ఏం చేయలేరు. మీ కేసులు అరెస్టులు జగన్ వెంట జెండా మోయకుండా ఆపలేరు. ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం చంద్రబాబు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. తప్పుడు పనులు మానుకోవాలని లోకేష్ సూచిస్తున్నాం’ అని హితవు పలికారు. -
అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన అవసరం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరులోని రేవతి సెంటర్ వద్ద అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించి అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను మంగళవారం ఆయన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తారన్నారు. అగ్నిప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాన్నారు. ఆపద సమయాల్లో ప్రాణాలను రక్షించటంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకమైనదన్నారు. అనంతరం అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే పలు పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఫైర్ ఆఫీసర్ ఆనం రమణారెడ్డి, ఫైర్మెన్లు వెంకటేశ్వరరావు, జకరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
నేటి నుంచి ‘నేస్తం బడికిరా’
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షురాలు పి. భవానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదో తరగతి స్పాట్ జరుగుతున్న కేబీఎన్ కళాశాల వద్ద మంగళవారం సాయంత్రం మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయుల నుంచి సంతకాల సేకరణ చేశారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విద్యాశాఖ మంత్రి ఎన్. లోకేశ్ దృష్టికి తీసుకువెళడం కోసం ఆ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంతకాల సేకరణ చేస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలు పి. లీల జిల్లా స్థాయిలో ఉమెన్ గ్రీవెన్స్ సెల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లను వివరించారు. మహిళా నేతలు ఎం. లలితశ్రీ, డి. విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు. మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ఏసీబీ ఎస్పీ ఏ. సురేష్బాబు దంపతులు, కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం విడివిడిగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వీరు నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతనం ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్కుమార్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయన వెంట చల్లపల్లి సీఐ కె. ఈశ్వరావు, ఎస్ఐ పి. గౌతమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు కోడూరు: భూమిలో పండే దుంపలు మూడు నుంచి నాలుగు కిలోల బరువు ఉంటా యి. సేంద్రియ పద్ధతుల్లో పండించిన దుంపలు ఆరు కిలోల వరకు కూడా ఉంటా యి. కానీ కృష్ణాజిల్లా కోడూరు మండలం ఇస్మాయిల్బేగ్పేట గ్రామానికి చెందిన కాలారి శ్రీమన్నారాయణ ఇంటి పెరట్లోని పెండలం దుంప ఏకంగా 12 కిలోల బరువు ఉండి అందరినీ అబ్బురపరుస్తోంది. ఏవిధమైన రసాయన ఎరువులు వినియోగించకుండానే దుంప పెరిగిందని శ్రీ మన్నారాయణ తెలిపారు. -
కొండంత
కృష్ణాజిల్లాపులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 దుర్గమ్మ ఆలయ ప్రాంగణం(ఫైల్) వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తుల భద్రత గాలిలో దీపంలా మారింది. అధికారుల తీవ్ర నిర్లక్ష్యంతో ఇంద్రకీలాద్రి ప్రతిష్ట మసకబారుతోంది. పట్టించుకోవాల్సిన చంద్రబాబు సర్కారు పూర్తిగా కాడి వదిలేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. అవి వృథా అవుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. వీటికి సాక్షాలుగా ఇటీవల ఆలయ పరిసరాల్లో చోటు చేసుకున్న సంఘటనలను భక్తులు ఎత్తి చూపుతున్నారు. పోలీసు శాఖ, ఆలయ అధికారులు, పాలకవర్గం ఎవ్వరూ ఆలయ భద్రతపై దృష్టి పెట్టకుండా వారివారి ప్రయోజనాలే పరమావధిగా విధులు నిర్వర్తిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. వరుస చోరీలు.. దుర్గమ్మ ఆలయంలో ఇటీవల కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. గత నెల ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగిన కుంభాభిషేక మహోత్సవానికి పోలీసు శాఖ ఉన్న సిబ్బందికి అదనంగా 15 వందల మందిని నియమించింది. అన్ని వందల మంది సిబ్బంది ఉన్నప్పటికీ సరిగ్గా అమ్మవారి అంతరాలయ ఎదురుగా ఉన్న రావిచెట్టు వద్ద ఒక మహిళకు సంబంధించిన 125 గ్రాముల బంగారాన్ని ఒక మహిళ కాజేసి దర్జాగా మెట్లు దిగి వెళ్లిపోయింది. తాను బస చేసిన లాడ్జికి వెళ్లి అక్కడి నుంచి తన ఊరికి వెనుతిరిగింది. బంగారం విలువ సుమారుగా రూ.16 లక్షలుగా ఉంది. దీనిలో విశేషమేమిటంటే చోరీ జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరా పని చేయకపోవటం. వాహనాల్లోనూ చోరీలు.. ఘాట్రోడ్డులో తరచూ వాహనాల్లో చోరీలు జరుగుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కొద్ది మాసాల క్రితం ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ పాయింట్ సమీపంలో ఒక కుటుంబం తమ కారును పార్క్ చేసి అమ్మ వారి దర్శనానికి వెళ్లింది. దర్శనం ముగించుకొని వచ్చే సరికి వారి వాహనంలో ఉండాల్సిన బ్యాగ్ మాయమైంది. అందులో బంగారం చోరీకి గురైనట్లు పోలీసు లకు ఫిర్యాదు అందింది. అక్కడ సమీపంలో ఉన్న సీసీ కెమెరా సైతం పని చేయకపోవడం గమనార్హం. సీసీ కెమెరాలపై ఎందుకీ నిర్లక్ష్యం.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల భద్రత పూర్తిగా దిగజారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్గమ్మ ఆలయంలో కోట్లాది రూపాయాలు వ్యయం జరుగుతున్నప్పటికీ కనీసం ఆలయంలో సీసీ కెమెరాలు పనితీరును గాడిలో పెట్టే పరిస్థితులు లేకపోవటంపై సర్వత్రా విస్మయానికి గురవుతున్నారు. ప్రధానంగా పోలీసు శాఖ సైతం వివిధ ఉత్సవాల్లో వేలాది మందిని నియమించి వారికి అవసరమైన టీఏ, డీఏల పేరుతో ఏటా కోట్లాది రూపాయాలు తీసుకొని వెళ్తున్నారే తప్పా ఆలయంలో భక్తుల భద్రత విషయంలో శ్రద్ద చూపటం లేదంటూ ఆలయంలోని పాలకవర్గ సభ్యులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత! 7ఉగ్రవాద సానుభూతిపరులు, వారికి మద్దతు ఇస్తున్న వ్యక్తులను ఇటీవల పోలీసు శాఖ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితులు ఉన్న నగరంలో నిత్యం లక్షలాదిగా రాకపోకలు సాగించే అమ్మవారి ఆలయ భద్రత విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక మహిళ విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చి చక్కగా అమ్మవారి ఆలయానికి వెళ్లి దొంగతనం చేసి మళ్లీ ఆమె స్వస్థలానికి వెళ్లి పోయింది. చోరీ జరిగిన తరువాత ఆమెను పట్టుకున్నప్పటికీ అటువంటి సంఘటనలు జరగకుండా అరికట్టడంలో పోలీసు శాఖ చర్యలు లేకపోవటం, భద్రతపై చోటు చేసుకున్న నిర్లక్ష్యంపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు మృతదేహం ఉన్న తెలియకపోవటం వంటి సంఘటనలు ఇతర ప్రమాదకర ఘటనలకు పురిగొల్పే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం అమ్మవారి ఆలయ భద్రతపై దృష్టి పెట్టాలంటూ హితవు పలుకుతున్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పీస్ ఫోరం మంగళవారం విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించింది. కోడూరు: స్థానిక ఉల్లిపాలెంలోని గోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి క్షేత్రంలో ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నారు. దేవస్థానం దిగువన ఉన్న కనకదుర్గానగర్ సమీపంలో ఇటీవల ఒక మృతదేహం బయట పడింది. అక్కడ ఉన్న మరుగుదొడ్డిలో సిబ్బంది మృతదేహాన్ని చూసి ఉన్నతాధికారులకు వారి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ మృతదేహాన్ని చూసిన తరువాత విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఆ మృతదేహం మూడు, నాలుగు రోజుల క్రితం మృతి చెందిన వ్యక్తిది కావటం. ఇక్కడ పోలీసులు, పారిశుద్ధ్య అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు రాకపోకలు సాగించే దుర్గగుడి పరిసరాల్లో నాలుగు రోజుల పాటు ఒక మృతదేహం మరుగుదొడ్డిలో ఉన్నా తెలియకపోవటం అధికారుల పాలనతీరుకు నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు. -
సుబ్బారాయుడి ఆదాయం రూ. 9.32లక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 9,32,348 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. స్వామివారికి సేవా టికెట్ల ద్వారా రూ. 5,26,266, లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 1,22,130, స్వామివారికి డొనేషన్ ద్వారా రూ. 2,37,792, శ్రీవారి దర్శనం ద్వారా రూ. 37,600 మొత్తం కలిపి రూ. 9,32,348 ఆదాయం వచ్చినట్లు వివరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పలువురు భక్తులు నిత్యాన్నదాన పథకానికి విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ సనత్నగర్కు చెందిన జి. తనూజ కుటుంబం రూ.1.01,116, విజయవాడ భవానీపురం ఆశ్రమం రోడ్డుకు చెందిన జె.సీతారామాంజనేయులు, వాసవి సౌజన్య దంపతులు రూ.1,01,116, విజయవాడ ప్రసాదం పాడుకు చెందిన జి. వెంకట రామారావు, భవ్యశ్రీ రూ.1,01,116, గుంటూరు రెడ్డిపాలెం కాలనీకి చెందిన శ్రీవెంకట రాగ సుమంత్, జ్ఞాన చంద్రిక రూ.1.50లక్షల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
వేటకు లంగరు!
మచిలీపట్నంఅర్బన్: సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం విధించిన వార్షిక నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు ఈ నిషేధం కొనసాగనుంది. మత్స్య సంపద పునరుత్పత్తి, సంరక్షణ దృష్ట్యా ఏటా ఈ నిషేధాన్ని అమలు చేస్తారు. ఈ కాలంలో మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు సహా అన్ని రకాల వేట నౌకలు సముద్రంలోకి వెళ్లడం పూర్తిగా నిషేధించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వేటకు వెళితే బోట్లు, వలలు, చేపల సంపద స్వాధీనం చేసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాకు సుమారు 121 కిలోమీటర్ల సముద్ర తీరం ఉండగా, మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక, కృత్తివెన్ను మండలాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో 64 మత్స్యకార గ్రామాలు ఉండగా, మొత్తం 1,12,977 మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరిలో 38,914 మంది ప్రస్తుతం వేట వృత్తిలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,263 వేట బోట్లు ఉన్నాయి. తీరానికి బోట్లు.. నిషేధ కాలం ప్రారంభం కావడంతో వేట బోట్లు ఒక్కొక్కటిగా తీరానికి చేరుకుంటున్నాయి. రెండు నెలల విరామం కోసం మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. భృతి పంపిణీ ఏది? వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భృతి అందిస్తోంది. 2023–24 వైఎస్ఆర్ సీపీ హయాంలో 12,151 మంది మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.12.15 కోట్లు మత్స్యకారుల ఖాతాలోకి నేరుగా జమ చేశారు. 2024–25 సంవత్సరానికి 12,809 మంది అర్హులను గుర్తించినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా భృతి పంపిణీ చేయలేకపోయారు. అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రూ.20వేల భృతి ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఇప్పటికీ భృతి ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. కాగా 2025–26 నిషేధ భృతి కింద జిల్లాలో 13,077 మంది మత్స్యకారులకు రూ.26.15 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సముద్రంలో వేట నిషేధం ప్రారంభం 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మత్స్యకారులు భృతికి అర్హులు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44లక్షలకు లోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పెద్ద మొత్తంలో భూమి లేదా ఆస్తులు ఉన్నవారు అనర్హులు. -
త్వరలో ఒలింపిక్ జిల్లా సంఘాలకు ఎన్నికలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం (ఒలింపిక్ డే) సందర్భంగా జూన్ 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడ్తామని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసో సియేషన్ (ఏపీఓఏ) అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తమ్ తెలిపారు. త్వరలో ఒలింపిక్ జిల్లా సంఘాలకు ఎన్నికలు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏపీఓఏ జన రల్ బాడీ సమావేశం నగరంలోని ఓ హోటల్లో మంగళవారం జరిగింది. సమావేశం అనంతరం జరిగిన పురుషోత్తమ్ విలేకరులతో మాట్లాడారు. 2036వ సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలన్న భారతదేశ ప్రతిపాదితకు గుర్తుగా జూన్ 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2,036 మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మార్గదర్శకాలకు అనుగుణంగా చిత్తూరు జిల్లాకు చెందిన విశ్రాంత బ్యాంక్ మేనేజర్, మాజీ జాతీయ హాకీ క్రీడాకారుడు డి.ఎస్.వెంకటరామనాయుడును ఏపీఓఏ ముఖ్య కార్యనిర్వహణాధి కారిగా (సీఈఓ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఒలింపిక్ సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఐఓఏ నుంచి ఆర్థిక సహాయంతో జిల్లా, రాష్ట్ర, దక్షిణ మండల (సౌత్ జోన్) స్థాయిలలో ఒలింపిక్ తరహా పోటీలను నిర్వహించడానికి ఏపీఓఏ ప్రణాళిక రూపొందిస్తోందని వివరించారు. మేఘాలయలో జరిగే 39వ జాతీయ క్రీడల్లో ఏపీఓఏ తరఫున రాష్ట్ర జట్లను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఓఏ ఉపాధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, నడెళ్ల బ్రహ్మాజీరావు, కోశాధికారి శ్రీనివాస్, సీఈఓ వెంకటరామ నాయుడు, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మే 5, 6, 7 తేదీల్లో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో జరిగే ఐదో ఏపీ కప్ తైక్వాండో స్టేట్ చాంపియన్షిప్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తమ్ -
కొడుకు, తల్లి కళ్లెదుటే మృత్యు ఒడికి..
తిరువూరు: నిత్యం కృష్ణా నదిలో ఈతకు వెళ్లి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే క్రమంలో విజయవాడలో నివసిస్తున్న తిరువూరుకు చెందిన దంతవైద్యుడు సానికొమ్ము సురేష్ (46) మంగళవారం తన కుమారుడు, తల్లి కళ్లెదుటే నీట మునిగి దుర్మరణం చెందారు. ఇబ్రహీంపట్నం నిమ్రా కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న సురేష్ విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో నివసిస్తున్నారు. మంగళవారం తాడేపల్లి వద్ద కృష్ణానదిలో తన 12 కుమారుడితో కలసి ఈత కొట్టారు. అనంతరం బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేస్తూ రెండుసార్లు నీటి నుంచి బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లిన సురేష్ తదుపరి ఊపిరాడక చనిపోయారు. తిరువూరు నుంచి విజయవాడ ఆస్పత్రిలో వైద్యపరీక్షల నిమిత్తం వచ్చిన తల్లి సానికొమ్ము కుమారి కూడా ఆ సమయంలో సురేష్ సమీపంలోనే నది ఒడ్డున ఉన్నారు. ఈత కొట్టిన అనంతరం తల్లిని తిరువూరు బస్సు ఎక్కిస్తానని ఇంటి నుంచి తనతో కూడా తీసుకొచ్చిన సురేష్ ఎంతసేపటికీ నీటిలో నుంచి బయటకు రాకపోవడంతో కుమారి ఆందోళనతో తల్లడిల్లింది. చుట్టుపక్కల వారికి చెప్పడంతో గజ ఈతగాళ్లు గాలింపు జరిపారు. ఫలితం లేకపోవడంతో ఎన్ఆర్డీఎఫ్ సిబ్బంది గాలించి సురేష్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసునమోదు చేసుకుని ఆయన మృత దేహాన్ని మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సురేష్ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తిరువూరు శివారు పీటీకొత్తూరు తరలించారు. ఆయన సోదరుడు ఆస్ట్రేలియాలో నివసిస్తుండగా, తండ్రి సీపీఎంలో, రైతుసంఘంలో జిల్లాస్థాయి పదవులు నిర్వహించారు. తల్లి కుమారి ఏపీ మహిళా సంఘ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఆయన మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించిన నివాళులర్పించారు. కృష్ణానదిలో మునిగి దంత వైద్యుడు మృతి -
పురుగుమందు తాగిన ఘటనలో మరొకరు మృతి
రెడ్డిగూడెం: పురుగు మందు తాగిన ఘటనలో ఆరు రోజుల క్రితం తల్లి మృతి చెందగా, కుమారుడు మంగళవారం చనిపోయారు. రెడ్డిగూడెం మండలంలోని కుదప గ్రామంలో నివసించే బొర్రా సావిత్రి(74), తిరుపతయ్య (47) తల్లీకుమారులు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల ఎనిమిదో తేదీన ఇంటిలో ఎవరూ లేని సమయంలో సావిత్రి, తిరుపతయ్య పురుగు మందు తాగారు. కొద్ది సేపటికి వారిద్దరిని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోకి తరలించారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సావిత్రి ఈ నెల తొమ్మిదో తేదీన మృతి చెందింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతయ్య మంగళవారం ఉదయం పది గంటలకు మృతిచెందాడు. తాగుడుకు బానిసై... నూజివీడు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన బొర్రా తిరుపతయ్య కుటుంబం రెండు సంవత్సరాల క్రితం రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి నివసిస్తోంది. తిరుపతయ్య లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. తిరుపతయ్య భార్య, కుమారుడు, కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో తల్లి సావిత్రితో కలిసి పురుగు మందు తాగాడు. తిరుపతయ్య కొడుకు ప్రభాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరు రోజుల వ్యవధిలో తల్లీ కుమారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుడివాడరూరల్: వృద్ధురాలి ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు గుడివాడ తాలూకా పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బొమ్ములూరు గ్రామానికి చెందిన జాస్తి నిర్మలాదేవి (81) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపతోంది. విజయవాడలో పలుమార్లు చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఈ నెల తొమ్మిదో తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. అస్వస్థతకు గురైన నిర్వలాదేవిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవల అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నిర్మలాదేవి సోమవారం మృతి చెందింది. మృతురాలి పెద్ద కుమారుడు సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గూడూరు: బతుకుతెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఒడిశా కూలీ గూడూరు మండలం తరకటూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మంగళవారం పొద్దుపోయాక జరిగిన ఈ ప్రమాదంపై గూడూరు పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. ఒడిశాకు చెందిన వ్యక్తి తరకటూరుపాలెం సమీపంలోని ఓ రైసు మిల్లులో కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం పని ముగించు కుని విజయవాడ–మచిలీపట్నం రోడ్డు దాడుతుండగా విజయవాడ వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్ వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సీహెచ్.దివ్యప్రకాష్ ఘటనా స్థలంలో ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉన్న వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, పోస్టు మార్టం నిమిత్తం బందరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్థానికుడు కాకపోవడంతో అతని పూర్తి వివరాల కోసం పోసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుడివాడ టౌన్: దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో వ్యవసాయ ఉత్పత్తులు, కనీస మద్దతు ధర నిర్ణయం విధానంపై వాదనలు జరపడం శుభ పరిణామమని రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవ ఖర్చులు, కుటుంబ పనిపై ప్రస్తుత కనీస మద్దతు ధర నిర్ణయం రైతులను ఏమాత్రం ఆదుకోవడం లేదని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ కూడా కనీస మద్దతు ధర ఉండాలని సిఫారసు చేసిందని గుర్తుచేశారు. వాస్తవ ఖర్చులు, కుటుంబ ఖర్చులు, భూమి లీజు, పెట్టుబడి వడ్డీలకు అనుగుణంగా మద్దతు ధర నిర్ణయం సరిగ్గా లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎప్పటి నుంచో లేవనెత్తుతున్నామని, కనీస మద్దతు ధర నిర్ణయిస్తే సరిపోదని, ఆ ధర రైతుకు చేరేలా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు ప్రతినిధిగా ఈ విషయంపై సుప్రీంకోర్టులో వాదన జరగడం తాను స్వాగతిస్తున్నాని పేర్కొన్నారు. వీరులపాడు: తన పొలం పక్కనున్న మొక్కజొన్న పంటకు ఆకతాయిలు నిప్పంటించారని తెలుసు కుని ఆర్పేందుకు వెళ్లిన మహిళ ఆ మంటలు అంటుకుని మృత్యువాత పడిన ఘటన మంగళవారం జరిగింది. మండలంలోని తాటిగుమ్మి గ్రామానికి చెందిన పెనుమూరి అచ్చమ్మ (55) తన 50 సెంట్ల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె పొలం పక్కనే ఉన్న మొక్కజొన్న పంటకు మంగళవారం సాయంత్రం సమయంలో కొంత మంది ఆకతాయిలు నిప్పంటించారు. ఈ విషయం తెలిసి మంటలను ఆర్పేందుకు అచ్చమ్మ పొలం వెళ్లింది. మంటలను ఆర్పే క్రమంలో అగ్నికీలలు ఒక్కసారిగా ఆమెను అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న అచ్చమ్మ కుమారుడు శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు పొలం వెళ్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు పలకా మోహన్రెడ్డి, రాఘవరెడ్డి, డోర్నాల రవి తదితరులు అచ్చమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
తోట్లవల్లూరు: ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మండలంలోని యాకమూరు, తోట్లవల్లూరులో అంబేడ్కర్ విగ్రహాలకు అనిల్కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రొయ్యూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కై లే జ్ఞానమణితో కలిసి ఆయన ఆవిష్కరించారు. జెడ్పీటీసీ సభ్యుడు జొన్నల రామ్మోహన్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీలు కళ్లం శివారెడ్డి, మెల్లంపల్లి వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతలపూడి గవాస్కర్రాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడకుదురు రాజేంద్ర, మాజీ సర్పంచ్లు నిమ్మగడ్డ ప్రభుదాస్, దాసరి సుందరకుమార్, నాయకులు రామచంద్రరావు, శేషిరెడ్డి, వాసు, సురేంద్రరెడ్డి, కోటేశ్వరరావు, రాము తదితరులు పాల్గొన్నారు. -
నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి
కంచికచర్ల: స్థానిక వసంతకాలనీలో ఓ మహిళ తన ఇంటి వరండాలో నిద్రి స్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మంచంపై ఉన్న దిండుకింద చేయపెట్టగా గమనించిన ఆమె దొంగ.. దొంగా అని కేకలు వేసింది. దీంతో ఆ వ్యక్తి ఆమైపె కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కంచికచర్ల వసంతకాలనీలో బాలుర వసతి గృహం వెనుక ఓ ఇంట్లో నల్లకట్ల రమాదేవి(47) సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి వరండాలో నిద్రించింది. గుర్తు తెలియని ఆ ఇంటి వద్దకు వచ్చి తాళం చెవుల కోసం వెతికాడు. అవి కనిపించకపోవటంతో రమాదేవి నిద్రిస్తున్న మంచం వద్దకు వచ్చి దిండు కింద చేయి పెట్టాడు. ఈ అలికిడికి రమాదేవికి మెలుకువ వచ్చి, గుర్తుతెలియని వ్యక్తిని గమనించి దొంగ.. దొంగ అంటూ కేకలు వేసింది. వెంటనే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో ఆమె ముఖం, శరీ రంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. కేకలు విని రమాదేవి ఇంటికి వచ్చిన స్థానికులు గాయపడిన ఆమెను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమా దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.విశ్వనాథ్ తెలిపారు. -
మట్టి పెళ్లలు పడి మహిళ దుర్మరణం
గంపలగూడెం: మట్టి పెళ్లలు విరగి పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మండలంలోని అమ్మిరెడ్డిగూడెంలో మంగళవారం జరి గింది. గ్రామస్తుల కథనం మేరకు.. అమ్మి రెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుంజు రాంబాబు ట్రాక్టర్తో ఇసుక, మట్టి తోలుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య ధనలక్ష్మి (30), కుమార్తె రాజి, కుమారుడు ప్రవీణ్, తల్లి నాగలక్ష్మి ఉన్నారు. రాజి ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తగా, ప్రవీణ్ ఐదో తరగతి చదువుతున్నాడు. గంగదేవరపాడు పరిధిలోని కట్టలేరులో ఇసుక తోడేందుకు రాంబాబు తన భార్య ధనలక్ష్మి (30), తల్లి నాగలక్ష్మితో కలిసి వెళ్లాడు. కట్టలేరులో పూర్తి స్థాయిలో ఇసుక తోడేశారు. ఎక్కడ మంచి ఇసుక దొకనందున తెలంగాణ పరిధిలో ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లి ఇసుక తవ్వకాలు చేపట్టారు. పైన మట్టి, కింద ఇసుక ఉండ టంతో సొరంగం చేసి ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఐదు అడుగుల లోతున 20 అడుగుల మేర సొరంగం చేసి ఇసుక తోడుతున్న నేపథ్యంలో పైనున్న మట్టి పెళ్లలు విరిగి ధనలక్ష్మి, నాగలక్ష్మిపై పడ్డాయి. దీంతో వారిద్దరు మట్టికింద చిక్కుకుపోయారు. హుటాహుటిన మూడు ట్రక్కుల మట్టి తొలగించి వారిద్దరిని బయటకు తీసి 108 అంబులెన్స్లో తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ధనలక్ష్మి (30) మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన నాగ లక్ష్మిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి ఆస్పత్రి పాలై, భార్య తిరిగిరాని లోకాలకు చేరడంతో రాంబాబు తన ఇద్దరు బిడ్డలను అక్కున చేర్చుకుని రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో మహిళకు తీవ్ర ఆస్వస్థత -
బీఆర్ అంబేడ్కర్ అందరివాడు
చిలకలపూడి(మచిలీపట్నం): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఏ ఒక్క సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందరి వాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశపు హాలులో జరిగిన సభ కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలో అంబేడ్కర్ భవన్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ప్రతి మేధావిని ప్రభావితం చేసే వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకొల్పడానికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. అంబేడ్కర్ మన జీవితాల్లో అస్పృస్యత లేకుండా అందరూ సమానంగా గౌరవించబడేలా రాజ్యాంగాన్ని నిర్మించగలిగారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, శాసన సభ మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్బాబు, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనంద్కుమార్, ఎస్సీ సంఘ నాయకులు ఆదినారాయణ, కొడాలి శర్మ తదితరులు పాల్గొన్నారు. -
పూర్తిస్థాయిలో బూత్ ఏజెంట్లను నియమించండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 1,769 పోలింగ్ కేంద్రాలకు బూత్స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు. రానున్న సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో ఏజెంట్లను నియమించి సంబంధిత నియోజకవర్గాల ఓటర్ల నమోదు అధికారికి పంపాలన్నారు. భారత ఎన్నికల సంఘం బూత్ స్థాయి ఏజెంట్లకు త్వరలో శిక్షణ ఇవ్వనుందన్నారు. ఇంటింటికీ తిరిగి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి తోడ్పాటును అందించాలన్నారు. జిల్లాలో ఫారం 6, 7, 8 క్లయిమ్లకు సంబంధించి 86,313 దరఖాస్తులు వచ్చాయని వీటిలో 84,354 పరిష్కరించాలన్నారు. మిగిలిన దరఖాస్తుల పరిష్కారం వివిధ దశల్లో ఉందన్నారు. జిల్లాలో 2002 ఓటర్ల జాబితాను, 2025 ఓటర్ల జాబితాతో ప్రత్యేక తీవ్రతర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ 69 శాతం పూర్తి చేశామన్నారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, పార్టీల ప్రతినిధులు షేక్ సలార్దాదా, పీవీ గజేంద్ర, కొడాలి శర్మ, ఆసిఫ్బాషా, బాలాజీ ఉన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కృష్ణా కలెక్టర్ బాలాజీ -
జ్వాలాముఖి అమ్మవారికి స్వర్ణకవచ సమర్పణ
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాల యంలో వేంచేసిన్న జ్వాలాముఖిదేవి అమ్మవారికి సోమవారం స్వర్ణకవచాన్ని సమర్పించారు. దేవదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎన్.శ్రీనివాసరెడ్డి అమ్మవారికి రాగిపై బంగారుపూత వేసిన కవచాన్ని సమర్పించారు. సుమారు 40గ్రాముల బంగారంతో సుమారు రూ.6 లక్షల విలువైన వెండి కవచాన్ని అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు, జ్వాలాముఖి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
రెండేళ్లయినా రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఏవీ?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘సెంటు కాదు, రెండు సెంట్ల స్థలం ఇస్తామన్నారు. అది కూడా నగరాల్లోనే అని నమ్మబలికారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరికీ స్థలాలు ఎందుకు ఇవ్వలేదు’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని పట్టణ పేదలు ప్రశ్నించారు. ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు ఇళ్ల ఊసెత్తడం లేదంటూ మండిపడ్డారు. నగరంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు, టిడ్కో ఇళ్లు, సంక్షేమ పథకాలు అమలు కోరుతూ సీఐటీయూ, ఐద్వా, పౌర సంక్షేమ సంఘాల ఆధ్వ ర్యంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పేదలు తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు, దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు, అదానీ, అంబానీలకు వందల ఎకరాలను రాత్రికి రాత్రే ఎకరం రూపాయికే ఇస్తున్న ప్రభుత్వం పేద లను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ భూములను ప్రజా ప్రతినిధులు కబ్జా చేసి కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్కీం పెడుతున్నానని చెబుతున్న సీఎం చంద్రబాబు, పేదలు పనులు లేక, ఇళ్లు లేక రోడ్డున పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. కొండల పైన, కృష్ణా నది ఒడ్డున పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని, వాటికి రిజిస్ట్రేషన్ పట్టాలు లేవని పేర్కొన్నారు. ఆ ఇళ్లు అత్యవసర సమయంలో ఉపయోగపడటం లేదని, బ్యాంక్లు కనీసం రుణాలు కూడా ఇవ్వడం లేదని వివరించారు. పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయలేదన్నారు. కనీసం ఉన్న ఇళ్లకు పట్టాలు కూడా ఇచ్చేందుకు వెనుకాడుతోందని విమర్శించారు. కొండ ప్రాంతాల్లో ఉండే వారి ఇళ్ల పై కప్పు మార్పిడికి అవకాశం కల్పించా లని, అందుకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఎనిమిదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం డబ్బులు కట్టించుకుందని, ఇప్పటికీ వారికి ఇళ్లు కేటాయించలేదని పేర్కొన్నారు. డబ్బులు చెల్లించిన వారికి వడ్డీ భారం, మరో వైపు అద్దెల భారం పడుతోందన్నారు. డబ్బులు కట్టిన వారికి బ్యాంకు రుణాలు మాఫీ చేసి టిడ్కో ఇళ్లు ఇవ్వాలన్నారు. పేదలు నివాసం ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాల న్నారు. విజయవాడలో డిస్నీ ల్యాండ్లో 57 ఎకరాల ఖాళీ స్థలం, ఇతర శాఖల భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం ఆందోళన వద్దకు వచ్చి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి, నగర ప్రజా సంఘాల నాయకులు బోయి సత్యబాబు, బి. రమణారావు, పి.కృష్ణ, సీఐటీయూ నాయకులు దుర్గారావు, నారాయణ, నాగేశ్వరరావు, ఐద్వా నాయకులు కె.సరోజ, జి.ఆదిలక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో పేదలు -
క్రికెట్ బెట్టింగ్ల కట్టడికి స్పెషల్ టాస్క్ ఫోర్స్
పటమట(విజయవాడతూర్పు): ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కట్టడికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. సాంకేతికత, పటిష్ట నిఘాతో బెట్టింగ్లకు పాల్పడే వారిపై తీసుకుంటామన్నారు. పోలీస్కమిషరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సైబర్ క్రైం డీసీపీ కృష్ణప్రసన్నతో కలిసి నలుగురు ఏసీపీలతో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందంతో సీపీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జరుగుతున్న బెట్టింగ్ కార్యకలాపాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయిని పేర్కొన్నారు. బెట్టింగ్లపై హైటెక్ నిఘా ఏర్పాటు చేసి, బెట్టింగ్ నెట్వర్క్లపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డిజిటల్ వార్ చేయాలని ఆదేశించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లు, డార్క్ వెబ్ కార్యకలాపాలపై నిరంతరం పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో బెట్టింగ్ ప్రచారా లను గుర్తించాలని, ఈ సమాచారంతో ఎప్పటికప్పుడు సిబ్బందితో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి నిందితులను అరెస్టు చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డైల్ 100/112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కృష్ణలంక: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబును సోమవారం ట్రాఫిక్ ఏసీపీ డాక్టర్ శ్రీవేద బాధ్యతల స్వీకరణ అనంతరం మర్యాదపూర్వకంగా కలిశారు.చిలకలపూడి(మచిలీపట్నం): బందరు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ బాలాజీ సోమవారం తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.భవానీపురం(విజయవాడపశ్చిమ): భక్తుల సౌకర్యం, భద్రత, మెరుగైన సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని దుర్గగుడి ధర్మకర్తల మండలి సభ్యులు నిర్ణయించారు. బ్రాహ్మణ వీధిలోని కార్యాలయంలో సోమవారం దుర్గగుడి ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశం జరిగింది. దీనిలో దుర్గగుడి మాస్టర్ ప్లాన్ అమలు తీరు, కుంభాభిషేకం సమయంలో ఆలయ ఉద్యోగిపై జరిగిన దాడిపై చర్చించారు. ఎక్కెడెక్కడ ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, రికార్డుల పరంగా ఉండాల్సిన భూముల్లో ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి, ఎవరెవరు కౌలుకు తీసుకున్నారు, ప్రస్తుతం వారి చేతుల్లోనే భూములు ఉన్నాయా.. చేతులు మారాయా, కౌలుకు ఇచ్చిన భూముల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, కౌలుదారులు కౌలు సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా వంటి అంశాలపై చర్చ జరిగింది. అమ్మవారి పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించేందుకు క్యూ లైన్లలో టీవీలు ఏర్పాటు చేయాలని, ఆలయ ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఆస్పత్రితో ఎంఓయూ కుదుర్చుకోవాలని, జూన్ నుంచి అన్నదానం, లడ్డూ పోటు ప్రారంభించాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని 19 అంశాలను ఆమోదించగా 65వ అంశాన్ని తీర్మానించడం, 83, 84, 103 అంశాలను వాయిదా వేశారు. వాడీవేడిగా..!సమావేశంలో పలుఅంశాలపై వాడీవేడిగా చర్చ జరిగినట్లు తెలిసింది. కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న బంగారం చోరీ ఘటన, దుర్గ గుడి అభివృద్ధి, దైనందిన కార్యకలాపాలపై చేసిన ప్రతిపాదనలపై ఆలయ అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై మండలి సభ్యులు మండిపడ్డారని సమాచారం. ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ), ఈఓ శీనా నాయక్, ఈఈలు కోటేశ్వరరావు, ఎల్.రమ తదితరులు పాల్గొన్నారు.పెనమలూరుకు చెందిన రాజారావుకు మధుమేహం ఉంది. గతంలో ఫ్యామిలీ ఫిజీషియన్ పథకంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గ్రామానికి వచ్చే వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు తీసుకునేవాడు. ప్రస్తుతం రాకపోవడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. గ్రామీణులకు భరోసా ఏది? నిలిచిన ఫ్యామిలీ ఫిజీషియన్ పథకం కుయ్యో.. మొర్రో అంటున్న 108 దీర్ఘకాలిక రోగుల ఇబ్బందులు ధర భళా.. దిగుబడి బేల 7 -
టెన్త్ మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన కృష్ణా కలెక్టర్
మచిలీపట్నంఅర్బన్: లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మూల్యాంకన ప్రక్రియను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మూల్యాంకన కార్యక్రమంలో మొత్తం 775 మంది సిబ్బంది పాల్గొనగా, అందులో 80 మంది చీఫ్ ఎగ్జామి నర్లు, 461 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 234 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు తదితర అధికారులు పాల్గొన్నారు. హైవేపై ట్రాలీ లారీ బీభత్సం కృష్ణలంక(విజయవాడతూర్పు): స్థానిక జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద ట్రాలీ లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడుపుతుండగా లారీ అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు, కారును ఢీకొంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారధి వైపు నుంచి ఒక ట్రావెల్స్ బస్సు, కారు బెంజిసర్కిల్ వైపు వెళ్తున్నాయి. జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద ఉన్న సాయిబాబా గుడి సమీపానికి చేరుకోగానే గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు నుంచి ఆటోనగర్ వెళ్తున్న ట్రాలీ లారీ మితిమీరిన వేగంతో వచ్చి ట్రావెల్స్ బస్సు, కారును వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో బస్సు, కారు వెనుకవైపు భాగాలు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని పరీక్షించి మద్యం తాగినట్లు గుర్తించారు. లారీ డ్రైవర్పై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కృష్ణలంక పోలీసులు తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గం ఎన్నిక భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం రథసారథులుగా సాయికిరణ్, మోహన్ ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన సంఘ ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేసిన కిరణ్ – మోహన్ ప్యానల్ 915 ఓట్లతో ఘన విజయం సాధించింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా పి.సాయి కిరణ్, కందుకూరి మోహన్ను ప్యానల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశ్రాంత గ్రేడ్–2 ఆఫీసర్ వినుకొండ భవానీ దుర్గా ప్రసాద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో సంఘ ఆహ్వాన కమిటీ చైర్మన్ చల్లాల శివాజి, అధ్యక్షుడు మునగంటి కామేశ్వరరావు, రామకృష్ణ, శ్రీను, విజయవాడ నగర అధ్యక్షుడు గొర్తి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్, మోహన్లు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ సంఘీయులను కలిసి వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సంఘం బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. సంఘీయుల సమస్యలను పరిష్కరించి వారి అభ్యున్నతి కోసం పాటుపడతామని తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ.. ఉపాధి అవకాశాలు మచిలీపట్నంఅర్బన్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ డి.ఆర్.కె.ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘యూత్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అండర్ డీడీయూజీకేవై’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంతో నిరుద్యోగ యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగు ణంగా శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పి స్తామని పేర్కొన్నారు. అర్హులైన, ఉత్సాహవంతులైన అభ్యర్థులను ఎంపిక చేసి మూడు నెలల నివాస ఆధారిత శిక్షణను అందించడంతో పాటు ఉచిత నివాసం, భోజన సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్తో పాటు ప్లేస్మెంట్ సహకారం కూడా అందిస్తామని తెలిపారు. మెడికల్ కోడింగ్, సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీసెస్, మార్కెటింగ్, వేర్హౌస్ ఆపరేషన్స్, అన్ ఆర్మ్డ్ సెక్యూరిటీ సర్వీసెస్, జీఎస్టీ అకౌంట్స్ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న యువత తమ బయోడేటాను ఈ నెల 22వ తేదీలోగా వాట్సాప్ 91826 09909 నంబర్కు పంపాలని సూచించారు. -
ఫిర్యాదులపై చట్టబద్ధంగా చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యలపై వచ్చే ఫిర్యాదులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు పేర్కొన్నా రు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో మీ – కోసం కార్యక్రమంలో భాగంగా పలు వురు అర్జీదారులు ఇచ్చిన వినతిపత్రాలను, సమస్యలను ఆయన తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులకు సిఫార్సు చేశారు. వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ సమస్యలు చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాసమస్య లను ముఖాముఖిగా తెలుసుకుని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి పరిష్కారం అందించేందుకు జిల్లా పోలీస్శాఖ సిద్ధంగా ఉంటుందన్నారు. స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు బదిలీ చేసి వాటిపై పూర్తి విచారణ జరిపి పరిష్కారం చూపించాల్సిందిగా ఆదేశించారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా వారికి ఎదురైన సమస్యలను పోలీసులకు తెలపాలని ఎస్పీ సూచించారు. సత్వరమే న్యాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. మీకోసంలో ఆయన 35 ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
జాతీయ రహదారిపై పాల వ్యాను బోల్తా
చల్లపల్లి: పాల వ్యాను అదుపు తప్పి పల్టీకొట్టిన ఘటన 216వ నంబరు జాతీయ రహదారిపై మండలంలోని రామానగరం వద్ద సోమవారం ఉదయం జరిగింది. వ్యానులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయ డెయిరీకి చెందిన పాల వ్యాను నాగాయలంక వరకు వెళ్లి మిల్క్ పాయింట్ల వద్ద లోడు దించి తిరుగు ప్రయాణమైంది. రామానగరం క్లబ్ రోడ్డుకు ముందు వ్యాను అదుపుతప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. జాతీయ రహదారిపై నుంచి మోపిదేవి మండలం కాసానగరం వద్ద సర్వీసు రోడ్డులోకి దిగి చల్లపల్లి వైపు రావాల్సిన వ్యాను తిన్నగా మచిలీపట్నం వైపు వెళ్లిపోయింది. కొత్త డ్రైవర్ డ్యూటీలోకి రావటం వల్ల రూటు మర్చిపోయి ముందుకు వెళ్లిపోయి ఉంటాడని చెబుతున్నారు. 11 నుంచి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 30వ మహాసభలు మే 11 నుంచి 13వ తేదీ వరకు కోనసీమ అంబేడ్కర్ జిల్లా అమలాపురంలో జరుగుతాయని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ కరపత్రికను ఆవిష్కరించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 1934లో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య స్థాపించిన ఈ సంఘం ఐదు లక్షల సభ్యత్వాలు కలిగి ఉందన్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, పేదల హక్కుల కోసం ఉపాధి హామీ కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిందన్నారు. 232 గ్రామాల్లో భూస్వాములు ఆక్రమించుకున్న వేలాది ఎకరాలు పేదల భూములను, ప్రభుత్వ భూములను తిరిగి పేదలకు ఇప్పించడంలో ప్రముఖపాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర 30వ మహాసభ అమలాపురంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ మహాసభల్లో నూతన కమిటీ ఎన్నుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు శివ నాగరాణి, ఎ.రవి, కె.ఆంజనేయులు, కారం వెంకటేశ్వరావు, ఎం.పుల్లయ్య పాల్గొన్నారు. -
సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
మచిలీపట్నంఅర్బన్: సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్–జేఏసీ జిల్లా అధ్యక్షుడు కె.జాన్మోడీ డిమాండ్ చేశారు. బందరు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హెచ్ఆర్ పాలసీ అమలు చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు 22 రోజుల పాటు నిర్వహించిన సమ్మె సమయంలో కూటమి పార్టీలు మద్దతు ప్రకటించి, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. డిమాండ్ల సాధన కోసం మే 15వ తేదీ విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నివాసానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, హమామాలిని, సూరమ్మ, సాయి లక్ష్మి, ఎలిజబెత్ రాణి, అంజలి, దివ్య, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో సొత్తు రికవరీ
గుడివాడరూరల్: మాజీ మంత్రి కఠారి ఈశ్వర్కుమార్ ఇంట్లో జరిగిన చోరీ కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు తెలిపారు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. గత నెల 14వ తేదీన మాజీ మంత్రి ఈశ్వర్కుమార్ సతీమణి మధురిమ హైదరాబాద్ వెళ్లి 18వ తేదీ తెల్లవారుజామున స్థానిక భయ్యావారివీధిలోని ఇంటికి తిరిగిచేరుకున్నారు. ఇంట్లో చోరీ జరిగిందని ఆమె గుర్తించారు. దొంగలు ఇంటి తాళం పగులకొట్టి బీరువాలోని వెండి వస్తువులను దొంగిలించినట్లు గుర్తించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ జె.ఆర్.కె.హనీష్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ఇంట్లో ఎటువంటి ఆధారాలు లభించకపోయినా సాంకేతిక పరిజ్ఞా నంతో సమాచారం సేకరించి, పాత నేరస్తుల కదలికపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో సోమవారం పట్టణంలో ముగ్గురు వ్యక్తులను సీఐ అదుపులోకి తీసుకుని విచారించగా వారే చోరీ చేసులో నిందితులని తేలింది. వారి వద్ద రూ.15 లక్షలు విలువైన ఐదు కిలోల వెండి వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగ అయిన ఎన్టీఆర్ జిల్లా నందిగా టౌన్ రైతుపేట గ్రామానికి చెందిన దొడ్లోజి బాబు ఆలియాస్ రవిబాబు(56), అతనికి సహకరించిన రైతుపేట గ్రామానికి చెందిన తిరుమలశెట్టి అంజలి(38), గుడివాడ పట్టణం బేతవోలు సమీపంలోని నిమ్మతోటకు చెందిన తిరుమలశెట్టి వాణి(33)ని పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేశారు. రవిబాబు లారీ క్లీనర్గా పని చేస్తూ వ్యసనాలకు బానిసై జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. నిందితుడిపై హైదరాబాద్, ఎస్ఆర్నగర్, నెల్లూరు, చిలకలూరిపేట, తణుకు, ఎన్టీఆర్ జిల్లా తదితర ప్రాంతాల్లో 11 చోరీ కేసులు ఉన్నాయి. ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ పాలా శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్కుమార్ ఇంట్లో చోరీని ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు వివరాలు తెలిపిన ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
సమస్యలు పరిష్కరించకుంటే ప్రజాపోరాటం
చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ పేర్కొన్నారు. మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో పామర్రు నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలపై కలెక్టర్ డి.కె.బాలాజీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్తో ఆయన పలు సమస్యలపై చర్చించారు. అనంతరం అనిల్కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ప్రజలను వంచనకు గురిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా తిరిగి తమపై బురదజల్లే ప్రయత్నం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా ఆగడాలకు అడ్డూ అదుపు లేదన్నారు. ఎన్నికల హామీలను విస్మరించటమే కాకుండా ధనార్జనే ధ్యేయంగా ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలే లక్ష్యంగా పోలీసుల అండదండలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏడు ఎకరాల స్థలాన్ని సేకరించగా ఆ స్థలం పేదలకు ఇవ్వకుండా కోర్టుల్లో పిటీషన్లు వేసి తాత్సారం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్కు వివరించామని ఆయన త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలకు టిడ్కో ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే కుమార్రాజా బూటకపు హామీ ఇస్తున్నా రని విమర్శించారు. పామర్రు నియోజకవర్గంలో ఇరిగేషన్కు సంబంధించిన చెరువులోని మట్టిని, ఇసుకను అక్రమంగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. లారీకి రూ.13 వేల చొప్పున రోజుకు 500 లారీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వివరించారు. అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే అండదండలతో రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన ప్రణాళిక ద్వారా ఇసుక విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరామన్నారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే కుమార్రాజా రెవెన్యూ అధికారులు లంచాలు తింటున్నారని ఆరోపించి, వారి నుంచి సొమ్ము దండుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నా రని పేర్కొన్నారు. తన అధికారం కోసం అధికారులను పావుగా వాడుకుని వారిని బలిపశువులను చేస్తున్నారన్నారు. ఈ సమస్యలు అన్నింటినీ కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన పరిష్కరించని పక్షంలో ప్రజాపోరాటానికి సిద్ధమవుతామని కైలే అనిల్కుమార్ హెచ్చరించారు. వెంట పామర్రు ఎంపీపీ దాసరి అశోక్కుమార్, వైస్ ఎంపీపీ ఎ.రమాదేవి, రాజులపాటి రాఘవులు, ఎం.సుబ్రహ్మణ్యం, ఆరేపల్లి శ్రీనివాసరావు, నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేదలు అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి ఇసుక అనధికార తవ్వకాలపై చర్యలు చేపట్టండి పామర్రు ఎమ్మెల్యే కనుసన్నల్లోయథేచ్ఛగా అవినీతి, అక్రమాలు కలెక్టర్ వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ -
ఉచిత ప్రసాద వితరణకు రూ. 2 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ కోసం విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. నగరంలోనిపటమటకు చెందిన పి.హరినాథ్బాబు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి తన తండ్రి వెంకట సుబ్బయ్య పేరిట రూ.లక్ష, తల్లి నాగమణి పేరిట మరో రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆయనకు అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఇచ్చారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న కొండపల్లి బొమ్మల మేళాను విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న కొండపల్లి బొమ్మల మేళా వివరాలను ఆయన సోమవారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ 18న ఖిల్లాపైకి ట్రెక్కింగ్ చేసిన అనంతరం బొమ్మల మేళా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రెండోరోజు ఈ మార్కెట్ లీడర్స్, ఈ హ్యాండీక్రాఫ్ట్, కార్టూన్ మేకర్స్, ఆన్లైన్ కార్టూన్ సిరీస్ను క్రియేట్ చేస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, చుట్టుకుదురు శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్)ను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ జిష్ణు బారువా సోమవారం సందర్శించారు. నూతన 800 మెగావాట్లు ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేయడం వంటి చర్యలను పరిశీలించారు. ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్ల సమీకృత కార్యకలాపాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏపీజెన్కో డైరెక్టర్ (థర్మల్) అశోక్ కుమార్రెడ్డి, జనరేషన్/విద్యుత్ సౌధ చీఫ్ ఇంజినీర్ సుధీర్బాబు, ఎన్టీటీపీఎస్ సీఈ పి.శివ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో జలధార పథకం ద్వారా భూగర్భ జలాల మట్టం పెంపునకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చెరువుల పూడికలను ఉపాధి హామీ పథకం కింద తీసేందుకు మంజూరు ఉత్తర్వులు సిద్ధం చేయాలన్నారు. చిన్న నీటిపారుదల చెరువు కట్టల వెంబడి వీలైనంత ఎక్కువగా రీచార్జ్ సాఫ్టులను, పర్క్యులేషన్ ట్యాంకుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు నీరు వృథాగా పోకుండా చూడాలన్నారు. మురుగునీటి కాలువల్లో అడ్డంకులను తొలగించి కాంక్రిట్ నిర్మాణంతో పనులు చేపట్టాలన్నారు. నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. తాడిగడప మునిసిపాల్టీలో భూగర్భజలాల మట్టం పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ ఎంవీ శివప్రసాద్, జలవనరులశాఖ ఎస్ఈ గుణకర్, ఈఈలు గంగయ్య, రవికిరణ్, భూగర్భజలశాఖ ఏడీ బిందుశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
తిరువూరు టీడీపీలోవాట్సాప్ మెసేజ్,ఆడియో కలకలం
సాక్షి,విజయవాడ: తిరువూరు టీడీపీలో వాట్సాప్ మెసేజ్, ఆడియో కలకలం రేపుతున్నాయి. టీడీపీ వాట్సాప్ గ్రూపులో కేశినేని చిన్ని, శావల దేవదత్తు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అందులో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని దేవదత్తు వద్ద.. కేశినేని చిన్ని కోట్లు వసూలు చేశారని మెసేజ్లో ఉంది. ఆడియోల్లో తాను ఆర్థికంగా చితిపోయానని దేవదత్తు మాట్లాడారు. -
నిషేధం ఎత్తివేయాలి
22ఏ భూములపై తక్షణం కోడూరు(అవనిగడ్డ): 22ఏ జాబితాలోని భూములపై ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జోనల్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు డిమాండ్ చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 22ఏ జాబి తాలో భూములపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం డెప్యూటీ తహసీల్దార్ ఎన్.పద్మప్రియకు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి ప్రధాన సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దే శించి సింహాద్రి రమేష్బాబు మాట్లాడుతూ.. 2016లో చంద్రబాబు ప్రభుత్వం అవనిగడ్డ నియో జకవర్గంలోని వేలాది ఎకరాల భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని)తో కలసి ఎన్నోసార్లు ఆందోళనలు చేశామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నిషేధిత భూముల సమస్య పరిష్కారమైందని గుర్తుచేశారు. 2022 అక్టోబర్లో అవనిగడ్డలో జరిగిన బహిరంగసభలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి నిషేధిత జాబితా నుంచి తొలగించగా నియోజకవర్గంలో 17,857 ఎకరాల్లో భూములకు విముక్తి కలిగిందని వివరించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో భూముల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. 50 ఏళ్లయినా రాజధానిని పూర్తి చేయలేరు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల పాలనలో అమరావతి రాజధాని కోసం కేవలం రూ.8 వేలకోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఈ లెక్కన రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలంటే 50 ఏళ్ల అయినా సాధ్యం కాదని సింహాద్రి రమేష్బాబు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, కమీషన్లు దండుకునేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ వేల ఎకరాలు అడుగుతోందని దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ మావిగన్ను రాజధానిగా చేస్తే రూ.కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. దీనిని ప్రక్కదారి పట్టించేందుకు ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్ సీపీ నాయకుల కుటుంబ సభ్యుల మహిళలను కించపరిచేలా విధంగా తన చానల్లో ప్రసారం చేశారని విమర్శించారు. ఇది ఏ రకమైన జర్నలిజమో తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యువనేత సింహాద్రి వికాస్ మాట్లా డుతూ.. నిషేధిత జాబితా నుంచి చుక్కల భూము లను తొలగించక పోతే ఆందో ళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవనిగడ్డ వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కోడూరు తహసీల్దార్ కార్యాలయం వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, ఘంటసాల మండలాల పార్టీ కన్వీనర్లు పరిశే మాధవరావు, రేపల్లె శ్రీనివాసరావు, భోగాది శేషగిరిరావు, గరికపాటి వెంకటేశ్వరరావు, వేమూరి వెంకట్రావ్, అవనిగడ్డ, చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, రాజులపాటి కల్యాణి, నాయకులు సింహాద్రి వెంకటేశ్వరరావు, కొండవీటి వెంకటనారాయణ, సామర్ల రాంబాబు, గాజుల జయగోపాల్, నలుకుర్తి రమేష్, గుర్రం బసవయ్య, నలుకుర్తి పృథ్వీ రాజ్, యోగ ప్రకాష్, ఆరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.పాస్ బుక్లపై జగన్మోహన్రెడ్డి ఫొటోలు వేస్తే మీ భూములు లాక్కుంటారని గత ఎన్నికల్లో కూటమి నేతలు విషప్రచారం చేశారని, వారు అధికారంలోకి వచ్చిన తరువాత నిషేధిత భూములకు మళ్లీ చుక్క పెట్టడం వల్ల వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పేర్కొన్నారు. చేతిలో భూములు ఉన్నా ఎందుకూ ఉపయోగ పడటం లేదని, ఇటీవల వేకనూరుకు చెందిన రైతు రూ.8 లక్షలకు పైగా అప్పులు పెరిగి పోవడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి నిషేధిత జాబితా సమస్యను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు డిమాండ్ చేశారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు -
తెల్లబోయిన జొన్న రైతులు
● పంటమార్పిడి చేసినందుకు కష్టాలు ● పంట కొనుగోలుపై స్పందించని ప్రభుత్వం ● గిట్టుబాటు ధర లభించక రైతులు సతమతం పెనమలూరు: కృష్ణా ఆయకట్టు రైతులు రెండో పంటగా దాళ్వా వరి సాగు చేపట్టొద్దని, ఇతర పంటలు సాగుచేస్తే అండగా ఉండి ప్రోత్సహిస్తామని, రైతులను ఎల్లవేళలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేసింది. ప్రభుత్వ మాటలు నమ్మి రబీలో వరి బదులు తెల్లజొన్న సాగుచేసిన రైతులు నిలువునా మునిగారు. తెల్లజొన్న పంటను కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు మాటలు నమ్మి.. పెనమలూరు మండలంలో రబీలో మినుము, పెసర సాగుకు అనుకూలమైన పరిస్థితులు లేవు. ఈ పంటలకు పల్లాకు తెగులు ఎక్కువగా సోకడంతో రైతులు రెండో పంటగా దాళ్వా వరి సాగు చేస్తున్నారు. గత ఏడాది దాళ్వా సాగులో దిగుబడులు అధికంగా వచ్చాయి. అయితే ధాన్యానికి గిట్టుబాటు ధర లభించలేదు. ప్రభుత్వం సకాలంలో పంట కొనుగోలు చేయకపోవటంతో దళారులు ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేశారు. దీంతో రైతులు రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంట మార్పిడి చేయాలని రైతులకు సలహా ఇచ్చింది. వరి బదులు ఇతర పంటల సాగు చేస్తే అండగా ఉంటామని ప్రకటించింది. పైగా అధికారులు ప్రతి గ్రామంలో పర్యటించి పంట మార్పిడి చేయాలని రైతులు ప్రోత్సహించారు. మండల పరిధిలో రైతులు దాదాపు 1400 ఎకరాల్లో ఈ ఏడాది రెండో పంటగా తెల్లజొన్న సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.23 వేల వరకు ఖర్చు చేశారు. జనవరిలో పంట సాగు ప్రారంభమవగా ఇప్పుడు పంట దిగుబడికి సిద్ధంగా ఉంది. పంట కోసి విక్రయించాలంటే కనీస ధర కూడా పలకటం లేదు. మార్క్ఫెడ్తో కొనుగోలు చేయాలి తెల్లజొన్న పంటను ప్రభుత్వం ముందుకు వచ్చి మార్క్ఫెడ్ నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. దళారులకు బస్తా రూ.500 చొప్పున నష్టానికి విక్రయిస్తే తమకు మిగిలేది ఏమీ లేదని పేర్కొంటున్నారు. మార్క్ఫెడ్ ద్వారా తెల్లజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో పూర్తిగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లజొన్న సాగు వివరాలతో ప్రభుత్వానికి పూర్తి నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే మార్క్ఫెడ్ ద్వారా పంట కొనుగోలు చేస్తాం. ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నాం. – మురళీకిషోర్, డీఎం, మార్క్ఫెడ్ రైతులు నానా తిప్పలుపడి తెల్లజొన్న పంట సాగు చేయగా పంట కొనే వారు లేక పోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెల్లజొన్న క్వింటా బస్తా గరిష్ట ధర రూ.2500 వరకూ ఉండేది. ప్రస్తుతం రూ.1600 మాత్రమే ధర పలుకుతోంది. యుద్ధం కారణంగా పరిశ్రమలకు గడ్డుకాలం రావటం, ఎగుమతులు లేక పోవటం, ప్రభుత్వం వద్ద స్పష్టమైన పంటల సాగు విధానం లేక పోవటం తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇతర పంటలకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లే తెల్లజొన్న కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయటంలేదని ప్రశ్నిస్తున్నారు. పంట మార్పిడి పేరుతో రైతులను ఒత్తిడి చేసి తెల్లజొన్న సాగు చేయాలని సూచించిన అధికారులు సైతం పంట కొనుగోలు విషయంలో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడి ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): రియల్ ఎస్టేట్లో నష్టాలతో ఆర్థికంగా ఇబ్బందులకు గురైన ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అంబాపురం పంచాయతీ పరిధిలోని పైపుల రోడ్డుకు చెందిన సాగి శ్రీనివాస్రాజా(60) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. కొంత కాలంగా రియల్ ఎస్టేట్లో నష్టాలు వస్తున్నాయని కుమారుడు సుబ్బరాజుతో చెప్పుకొని బాధపడేవారు. ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదో తేదీన ఆఫీసుకు వెళ్లిన శ్రీనివాసరాజాకు కుమారుడు ఫోన్ చేయగా పని మీద బయటకు వెళ్లినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం శ్రీనివాస్ రాజా ఇంటికి రాకపోవడంతో కుమారుడు మళ్లీ ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సుబ్బరాజు పైపుల రోడ్డులో ఉన్న కార్యాలయానికి వెళ్లారు. ఆఫీసు ముందు బైక్ ఉండటంతో లోనికి వెళ్లి చూడగా, నేలపై శ్రీనివాస్రాజా పడి ఉన్నారు. అతనికి కొద్ది దూరంలో పురుగుల మందు కవర్ ఖాళీగా కనిపిం చింది. వెంటనే శ్రీనివాస్రాజాను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడిని వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలపూడి(మచిలీపట్నం): నగరంలోని చల్లరాస్తా సెంటరు సమీపంలో ఓ పండ్ల వ్యాపారిపై స్నేహితుడు కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. డ్రైవర్స్ కాలనీకి చెందిన వక్కలగడ్డ సాయి, హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పవన్బాబు స్నేహితులు. వారి మధ్య గతంలో జరిగిన వివాదం నేపథ్యంలో శుక్రవారం చల్లరాస్తా సెంటరు సమీపంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ పెద్దదై పవన్బాబుపై వక్కలగడ్డ సాయి పండ్లు కోసే కత్తితో దాడి చేశాడు. పవన్బాబుకు ఛాతీపై తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి సమాచారం అందుకున్న ఇనుకుదురుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు వక్కలగడ్డ సాయిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అపనిందలు మాని న్యాయం చేయాలి
సాక్షి టాస్కు ఫోర్సు: తోటి కులస్తులమైన తమకే న్యాయం చేయలేని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా మిగిలిన వారికి ఏం చేస్తారని బాధిత దళిత యువతి సుప్రియ తండ్రి జుఝవరపు చిన్ని ప్రశ్నించారు. మండలంలోని పసుమర్రు గ్రామంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మాదిగ కులానికి న్యాయం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తమకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. తన కుమార్తెను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెడితే కనీసం పరామర్శించలేక పోయారని పేర్కొన్నారు. ఆయన పార్టీ నాయకులు తమను దళితులమని చూడకుండా లేనిపోని అపవాదులతో ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. గ్రామంలో ప్రెస్ మీట్లు తమను దొంగలుగా ముద్రించి, అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకుడు కైలే అనిల్కుమార్కు, ఎమ్మెల్యేకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. మట్టి మాఫియాలో కోట్లకు కోట్లు కొల్లగొట్టిన వారు ఎక్కడ? నీతి, నిజాయితీతో దళితులను ఆదుకునే అనిల్కుమార్ ఎక్కడని ప్రశ్నించారు. తనను, తన కుటుంబ సభ్యులను దొంగలని నిరూపిస్తే వెంటనే తన కంఠం కోసేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రియ తల్లి ఆరోగ్యం మాట్లాడుతూ.. గ్రామ మాజీ సర్పంచ్ ప్రతి విషయంలో తమను చులకనగా చూస్తూ, తమపై లేనిపోని అభాండాలను వేసి అన్యాయానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన చేస్తున్న అవమానానికి తామందరం చనిపోదామని అనుకున్నామని వాపోయారు. బాధిత యువతి జుఝవరపు సుప్రియ మాట్లాడుతూ.. మీడియా ముందుకు తమ కుటుంబాన్ని తీసుకొచ్చి, తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఒక దళితుడైన మాజీ సర్పంచ్ గ్రామంలోని దళిత యువతికి జరిగిన అన్యాయంపై మాట్లాడకుండా, వారి నాయకుల గొప్పల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా తమపై అభాండాలు వేయటం దారుణమన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తూ ఉంటామని స్పష్టంచేశారు. దళిత యువతి సుప్రియ తండ్రి జుఝవరపు చిన్ని -
నేషనల్ ఇండోర్ రోయింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
లబ్బీపేట(విజయవాడతూర్పు): కటక్లో ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న నేషనల్ ఇండోర్ రోయింగ్ పోటీలకు రాష్ట్ర జట్టు తరలివెళ్లినట్టు ఆంధ్రప్రదేశ్ స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసో సియేషన్ అధ్యక్షుడు, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ తరుణ్ కాకాని శుక్రవారం తెలిపారు. మార్చి 17 నుంచి 26 వరకు వివిధ జిల్లా స్థాయిల్లో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశా మని పేర్కొన్నారు. అండర్–15 విభాగంలో గువ్వాడి పార్థు, బోర వైషాంత్, బండం రాకేష్, అండర్–17 విభాగంలో గొల్లపెల్లి శ్రీకర్, గువ్వాడి హిమజ, అండర్–19 విభాగంలో చీపుల్ల రుపాశ్రీ, ఓపెన్ విభాగంలో ఉదార్ల విజయ్, వాసిరెడ్డి గిరి రాజశేఖర్, శ్వామ్ గణేష్ ఎంపికయ్యారని వివరించారు. రెడ్డిగూడెం: మండలంలోని కుదప గ్రామానికి చెందిన బొర్రా సావిత్రి (74) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. రెడ్డిగూడెం ఎస్ఐ ఎస్.శ్రీను కథనం మేరకు.. సావిత్రి తన కుమారుడి తిరుపతయ్య వద్దే ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుటుంబ కలహాలు తలెత్తాయి. ఈ నెల ఎనిమిదో తేదీన ఇంటిలో ఎవరు లేని సమయంలో బొర్రా సావిత్రి, ఆమె కుమారుడు తిరుపతయ్య అప్పులబాధ, కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు తాగారు. కొంతసేపటి తరువాత వారిని గుర్తించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నెల తొమ్మిదో తేదీ ఉదయం పరిస్థితి విషమించి సావిత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం తిరుపతయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి మనవడు బొర్రా ప్రభాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గన్నవరం: రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేకుండా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కృష్ణా జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి సూచించారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల విక్రయ డీలర్లు, పీఏసీఎస్ సీఈఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ఒకే రైతుకు ఎక్కువ బస్తాల యూరియా ఇచ్చే ధోరణిలో కాకుండా, రైతుల వాస్తవ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలన్నారు. ఎరువుల విక్రయాలకు సంబంధించి బిల్లులు, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఎరువులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు బిల్లు ఇవ్వాలని స్పష్టంచేశారు. ఎరువుల విక్రయాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ–పాస్ మిషన్లో ఆన్లైన్ చేయాలని తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి రైతులకు యూరియా విక్రయాలకు సంబంధించిన వివరాలను మండల వ్యవసాయ అధికారులకు అందజేయాలని చెప్పారు. ఏపీ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఎం.మురళీకృష్ణ, వ్యవసాయ శాఖ ఏడీఏ ఎం. సునీల్, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. గన్నవరం: స్థానిక సొసైటీపేటలోని శ్రీగాయత్రి అమ్మవారి దేవస్థానానికి జెడ్పీ మాజీ చైర్మన్ కడియాల రాఘవరావు కుమారుడు కడియాల రవి, సత్యవాణి దంపతులు లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ కమిటీ అధ్యక్షులు కేవీఆర్. కిషోర్కు విరాళానికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను సత్యవాణి అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ శాశ్వత నిధి కోసం విరా ళంగా లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రవి దంపతులకు కృతజ్ఞతలు తెలి పారు. ఎఫ్డీపై ప్రతి ఏడాది వచ్చే వడ్డీ నగదును ఆలయ నిర్వహణ నిమిత్తం వినియోగించనున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ కార్యదర్శి ఎస్. రవికుమార్, కోశాధికారి ఎస్. గోపాలకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. బాల రాజేశ్వరరావు, రాజా, కె.కృష్ణదీక్షితులు, సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికలపై పెరిగిన లైంగికదాడులు
అమ్మో.. మృగాళ్లు సాక్షి, టాస్క్ఫోర్స్: అతను విద్యాబుద్ధులు నేర్పే గురువు. చదువుకునేందుకు వచ్చిన చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో అమ్మమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలిక ప్రైవేట్ పార్టులో పేపర్ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. బాలికను అమ్మమ్మ నిలదీయడంతో జరిగిన విషయం బయటపెట్టింది. ఈ అమాన వీయ ఘటన జరిగింది ఏ మారుమూల తండాలోనో కాదు. సాక్షాత్తూ విద్యలవాడగా పేరుపొందిన విజయవాడలో, అదీ పాఠశాలలో కావడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో నాలుగేళ్ల చిన్నారి ఇంటి ముందు సైకిల్ తొక్కుతుండగా అదే వీధిలో ఉంటున్న 45 ఏళ్ల వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి తిరిగొచ్చి పాపతో అదే తీరుగా ప్రవర్తించాడు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన బాలికల రక్షణకు సవాల్గా మారింది. ఇటీవల విజయవాడలో బాలిక ప్రైవేటు భాగాల్లో యాసిడ్ పోసిన ఘటన సంచలనంగా మారింది. చిన్నారుల మంచి చెడ్డలు చూడాల్సిన డే కేర్ సెంటర్లోనే జరిగిన ఈ ఘటన బాలికల తల్లిదండ్రులను కలవర పెడుతోంది. మచిలీపట్నంలో 17 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మైలవరంలో మరో బాలికపై లైంగికదాడి జరిగింది. ఇలా బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, దాడులు నిత్య కృత్యమయ్యాయి. ‘ఆడబిడ్డలపై చేయివేస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుంది’ అంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ‘శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. బాలికలు, మహిళలకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది’ అంటూ హోంమంత్రి అనిత సాక్షాత్తూ చట్టసభల్లోనే గొప్పలు చెప్పారు. వారి మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. నిత్యం ఏదో ఒక మూల మూడేళ్ల బాలిక నుంచి ముదుసలి వరకు లైంగికదాడులకు గురవుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రెండేళ్ల కాలంలో 196 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఏటేటా ఈ కేసులు రెట్టింపవుతున్నాయి. బాలికలు, మహిళలకు ఇంటాబయట రక్షణ కరువైంది. అభం శుభం తెలియని చిన్నారులపై మృగాళ్లు లైంగికదాడులకు తెగబడుతున్నారు. కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తుండగా, మరి కొన్ని ఘటనల్లో ఆడపిల్లల తల్లి దండ్రులు పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడానికి భయపడిపోతున్నారు. మరి కొన్ని ఘటన లను ప్రైవేటు పంచాయితీల్లో సర్దుబాటు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వరుసగా అమనవీయ ఘటనలు పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో వరుసగా మూడు రోజుల వ్యవధిలో మూడు అమానవీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూడు ఘటనల్లోనూ పోలీసుల తీరు అనుమానాస్పదంగా మారింది. రెండు కేసుల్లో ఘటన జరిగిన 15 రోజుల వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్సీ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. బాలిక తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో కేసులో సెక్షన్లు మార్చి ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసినట్లు సమాచారం. బాలికల రక్షణపై పాలకుల ప్రకటనలు ఒకలా ఉంటే, కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు తీరు మరోలా ఉంది. బాలికలపై దారుణాలన్నీ ఇంటి ముందు వీధిలోనో, ఇంటి ఆవరణలోనో, బడిలోనో జరిగినవే. ఈ ఘటనల్లో నిందితులు బంధువులో, ఇరుగు పొరుగు వారో కావడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు రక్షణ ఎలా అని ఆందోళన చెందుతున్నారు. శాంతి భద్రతలు అధ్వానంగా మారాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహిళలపై జరిగిన దాడులు అనేకం. వెలుగులోకి వచ్చినా చర్యలు ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రెండేళ్లుగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. బాలికలు, మహిళలకు రక్షణ కరువైంది. నడిరోడ్డుపై మహిళలపై కొందరు దారుణంగా దాడులు చేస్తున్నారు. చిన్నారులను చిదిమేస్తున్నారు. గత ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా రక్షణ కల్పించారు. మహిళల భద్రతకు అప్పటి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం మహిళల భద్రతను గాలికొదిలేశారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి. బాలికలు, మహిళలకు భరోసా కల్పించాలి – సౌమ్య, న్యాయవాది -
నాణ్యత, పోషకాల సమ్మేళం.. విజయ ఉత్పత్తులు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): వినియోగదారుడికి నాణ్యమైన, పోషకాలు కలిగిన ఉత్పత్తులను అందించడమే విజయ డెయిరీ లక్ష్యమని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ నూతనంగా ఉత్పత్తి చేస్తున్న ఫ్లేవర్డ్ మిల్క్, సబ్జా లస్సీ, మీగడ పెరుగును పాలప్రాజెక్టు ఫంక్షన్ హాల్లో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబుతో పాటు బోర్డు డైరెక్టర్లు హాజరయ్యారు. తొలుత ప్లాస్టిక్ బాటిల్లో వినియోగదారుడికి అందిస్తున్న ఆరు రకాల ఫ్లేవర్డ్ మిల్క్ను చైర్మన్, బోర్డు డైరెక్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. వినియోగదారుడి అభిరుచికి తగినట్లుగా విజయ డెయిరీ మార్కెట్లోకి బాదాం, చాక్లెట్, కాఫీ, స్ట్రాబెరీ, పిస్తా, రోజ్ ఫ్లేవర్లలో పాలతో పాటు వేసవిలో చల్లదనం కోసం సబ్జా ఉన్న లస్సీని మార్కెట్లోకి ప్రవేశపెట్టామన్నారు. వినియోగదారుల నుంచి అధికంగా డిమాండ్ ఉన్న గోల్డ్ పాలతో తయారు చేసిన గోల్డ్ పెరుగు కప్పులను (మీగడ పెరుగు)లను అందిస్తున్నామన్నారు. ఆరు దశాబ్దాల నమ్మకమే విజయ డెయిరీ అని, భవిష్యత్తులో వినియోగదారుడికి అవసరమైన అన్ని రకాల స్వీట్లు, ఐస్ క్రీమ్లను అందిస్తామన్నారు. తొలుత గణపతి శ్లోకంతో సాగిన నృత్య ప్రదర్శన అతిథులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ఫీడ్ కమిటీ సభ్యులు, కేటరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సమితి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భవనంపై నుంచి పడి కార్మికుడు దుర్మరణం
ఎ.కొండూరు: మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన పిట్టా ఇస్సాకు (52) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బుధవారం రాత్రి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూడేళ్లుగా కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్న ఇస్సాకు, డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఇప్పటివరకు సుమారు రూ.5లక్షల వరకు ఖర్చు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి పానెం ఆనందరావు, సీఐటీయూ మండల కార్యదర్శి జట్టి వెంకటేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా జిల్లా పరిషత్ ప్రాంగణంలో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించామని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు. జెడ్పీ ద్వారా 15 శాతం సీ్త్ర, శిశు సంక్షేమ నిధులు రూ.2 కోట్లతో నిర్మించిన వ్యాపార సముదాయాన్ని గురువారం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్తో కలిసి హారిక ప్రారంభించారు. అనంతరం హారిక మాట్లాడుతూ.. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల క్రితం ఈ వాణిజ్య సముదాయానికి శంకుస్థాపన చేశామన్నారు. మహిళలు చిన్నస్థాయి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఈ దుకాణాలను వారికి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. మచిలీపట్నంలో పది, అవనిగడ్డలో 12 దుకాణాలను మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం కోసం సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామన్నారు. త్వరలోనే బహిరంగ వేలం ద్వారా అర్హులైన వారికి దుకాణాలు కేటాయిస్తామన్నారు. ఈ వాణిజ్య సముదాయ నిర్మాణానికి సహకరించిన అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జె.అరుణ, డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనంద్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, జెడ్పీ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి మచిలీపట్నంఅర్బన్: స్థానిక నోబుల్ కళాశాలలో నిర్వహించిన ఇంట ర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం గురువారంతో పూర్తయినట్లు కృష్ణా జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధి కారి ఎస్.సరళకుమారి తెలిపారు. మార్చి 25న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మొత్తం 2,03,757 జవాబు పత్రాలను బోర్డు నిబంధనల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూల్యాంకనం చేసినట్లు పేర్కొన్నారు. 540 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 108 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 108 మంది స్క్రూటినైజర్లతో ఇరవై రోజుల పాటు మూల్యాంకనం నిర్వహించామని వివరించారు. సహకరించిన ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు సరళకుమారి కృతజ్ఞతలు తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలి భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక హౌసింగ్బోర్డ్కాలనీలోగల అన్న క్యాంటీన్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం పరిశీలించారు. క్యాంటీన్కు వచ్చే ప్రజలతో మాట్లాడి ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్ వెలుపల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీలో ప్లాస్టిక్ గ్లాసులను వినియోగించడాన్ని కలెక్టర్ గుర్తించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయ వస్తువులు ఉపయోగిస్తూ మజ్జిగ పంపిణీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. హజ్ యాత్రకుప్రభుత్వ సన్నాహాలు గన్నవరం: స్థానిక విమానాశ్రయం నుంచి ఈ నెల 18, 19 తేదీల్లో హజ్కు రాష్ట్రానికి చెందిన యాత్రికులు వెళ్లనున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. స్థానిక ఎస్ఎం కన్వెన్షన్లో గురువారం హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సీహెచ్.శ్రీధర్తో కలిసి హజ్ యాత్రికుల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి ఫరూక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ ఏడాది రాష్ట్రానికి చెందిన 337 మంది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు తెలి పారు. యాత్రికులు ముందుకు క్యాంప్ వద్దకు చేరుకుంటారని, సదుపాయలను కల్పించాలని అధికారులు సూచించారు. తొలిరోజు హజ్ యాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నకిలీ అధికారుల హల్చల్!
తిరువూరు: నియోజకవర్గంలో రవాణా, వాణిజ్య పన్నుల శాఖల అధికారులమంటూ కొందరు అనధికారిక వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో తిరువూరులో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో రవాణా, వాణిజ్య పన్నుల శాఖల చెక్పోస్టులు ఉండగా, రాష్ట్ర విభజన తదుపరి వీటిని తొలగించారు. స్థానికంగా ఆయా శాఖల కార్యాలయాలు లేకపోవడం, అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో కొందరు వ్యక్తులు వాహనదారులను బెదిరిస్తూ దండుకుంటున్నారు. గత నెలరోజుల్లో తిరువూరు సమీపంలోని అష్టలక్ష్మి దేవాలయం, పశువుల సంత, లక్ష్మీపురం సెంటర్లలో, అక్కపాలెం– పేరువంచ రహదారిలో రాత్రివేళల్లో వాహనాలు తనిఖీ చేసిన వ్యక్తులు తాము రవాణా శాఖాధికారులమని హంగామా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ, వాణిజ్య పన్నుల అధికారులమంటూ తనిఖీకి వచ్చేవారిలో ఎవరు అసలో, ఎవరు నకిలీనో తెలియట్లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేగనియంత్రణకు, ప్రమాదాల నివారణకు పోలీసులు రహదారులపై ఏర్పాటు చేసిన స్టాపర్ బోర్డులను అడ్డుపెట్టి పలువురు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. యూనిఫాం లేకుండానే తనిఖీలు.. ఇబ్రహీంపట్నం–జగదల్పూర్ జాతీయ రహదారిపై, లక్ష్మీ పురం–మచిలీపట్నం జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు యూనిఫాం లేకుండా తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని ఆసరా చేసుకుని ప్రైవేటు వ్యక్తులు సైతం వసూళ్లకు పాల్పడుతున్నారు. విజయవాడ, గన్నవరం నుంచి వస్తున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలలో ఎన్ని వాహనాలపై జరిమానా విధించిందీ, ఎక్కడ తనిఖీ చేసిందీ వివరాలను తెలియజేయట్లేదు. తిరువూరు అసలు ఏ అధికారి పరిధిలో ఉందో కూడా వాహనదారులకు తెలియని పరిస్థితి నెలకొంది. కార్యాలయాల ఏర్పాటులో తీవ్ర జాప్యం.. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఐదేళ్ల క్రితం ఏర్పడినప్పటికీ తిరువూరులో ఇంతవరకు పలు కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. వాహనచోదకులకు నిత్యం అవసరమైన రవాణాశాఖ కార్యాలయం తిరువూరులో లేకపోవడం, గతంలో నూజివీడు ఆర్టీఏలో డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగ్గా, ఇప్పుడు గన్నవరం వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరువూరులో రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు గతంలో పలుమార్లు స్థల పరిశీలన జరిపినా కార్యాచరణ జరగలేదు. అనధికారికంగా వాహనాల తనిఖీ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల పాత నేరస్తులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వారిపై నిఘా ఉంచుతాం. – గిరిబాబు, ఇన్స్పెక్టర్, తిరువూరు పోలీస్స్టేషన్ -
కారుకూతలపై ఆగ్రహ జ్వాల
పామర్రులో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్తున్న కై లే అనిల్కుమార్ మచిలీపట్నం పోలీస్స్టేషన్ బయట నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్న పేర్నికిట్టు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పెనమలూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం నిరసన తెలుపుతున్న దేవభక్తుని చక్రవర్తి, వైఎస్సార్ సీపీ నేతలు మహిళలను కించపరుస్తూ కారుకూతలు కూసిన ఏబీఎన్ రాధాకృష్ణ, ఆ టీవీ చానల్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పత్రికా రంగం పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ సమాజానికి ప్రమాదకరమని పలువురు విమర్శించారు. కారుకూతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు గురువారం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. – సాక్షి నెట్వర్క్ -
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నా యని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో సమగ్ర, నాణ్యమైన వైద్య సేవలు అందించి, వైద్య పరిశోధనలను బలో పేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, ఎన్టీఆర్ జిల్లా కలె క్టర్ డాక్టర్ జి.లక్ష్మీశతో కలిసి విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆమె గురువారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు, వ్యాధుల గుర్తింపు పరీక్షలు, సకాలంలో చికిత్స తీసుకునేలా ప్రోత్సహించడం వంటి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. టీబీ వ్యాధి నిర్ధారణకు అనుసరిస్తున్న విధానాలతోపాటు టీబీ ముక్త్ భారత్ అభియాన్–100 రోజుల ప్రచార కార్యక్రమం అమలును పరిశీలించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన పోర్టబుల్ ఎక్స్రే వ్యవస్థను పరిశీలించారు. క్షయ రోగులకు పోషక ఆహార కిట్లను అందజేశారు. సత్వర వైద్య సేవలు పుణ్య సలీలా శ్రీవాస్తవ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలను అను సంధానం చేస్తూ దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2024లో ప్రారంభమైన రెండో విడత ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అభియాన్ ద్వారా గణనీయమైన ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ జన రల్ (సెంట్రల్ టీబీ డివిజన్) రఘురామ్రావు, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, జేడీ (ఎన్టీఈపీ) డాక్టర్ రమేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు. -
ఏబీఎన్ను ప్రజలు చీదరించుకుంటున్నారు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణను, ఆ చానల్ను ప్రజలు చీదరించుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. వైఎస్సార్ సీపీ నేతల భార్యలపై అగౌరవంగా మాట్లాడిన ఏబీఎన్ రాధా కృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం మాచవరం పోలీస్స్టేషన్లో పార్టీ నేతలతో కలిసి దేవినేని అవినాష్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మావిగన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని వైఎస్ జగన్ సూచించారన్నారు. అప్పటి నుంచి కూటమి నేతలు, ఎల్లో మీడియా వైఎస్సార్ సీపీపై విరుచుకుపడుతోందన్నారు. రూ.లక్షల కోట్లతో అమరావతి అభివృద్ధి చేసే బదులు రూ.20వేల కోట్లతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయవచ్చని చెప్పారన్నారు. కూటమి నేతల స్టాండ్ ఏమిటో ఈ ప్రాంత కూటమి నేతలు మాట్లాడాలన్నారు. మావిగన్ చెప్పినప్పటి నుంచి రోత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీ పెట్టి పారిపోయినోళ్లు మాట్లాడుతున్నారు.. గతంలో ఐపీ పెట్టి నగరాన్ని వదిలి పారిపోయినోళ్లు ఇప్పుడు జగన్ గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. ఎంపీ అంటే మట్టి, పేకాటగా మార్చేశారన్నారు. అవినీతి, కబ్జాలకు కేరాఫ్గా కేశినేని చిన్ని ఉన్నారని ఆరోపించారు. ఇంకా మూడేళ్లే మీ అధికారం, ఆ తర్వాత మీ అడ్రస్ కూడా ఎవరికీ దొరకకుండా పారిపోతారన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ దారుణంగా మాట్లాడితే చంద్రబాబు, పవన్కల్యాణ్, నారా లోకేష్ ఏమయ్యారని ప్రశ్నించారు. రాబోయేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలని దేవినేని అవినాష్ అన్నారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, సీనియర్ నేతలు వెంకట సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు వియ్యపు అమర్నాథ్, తంగిరాల రామిరెడ్డి, పుప్పాల కుమారి, పార్టీ నేతలు నత్తా యోనారాజు, వడ్లమూడి సంపత్, ఇందు పల్లి సుభాషిణి, మాధవి, రమణ, ఆళ్ల చెల్లారావు, మాతంగి రాజేష్, సొంగా రాజ్కమల్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలను తక్షణం పరిష్కరించాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయ సమస్యలను తక్షణం పరిష్కరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎస్.చిరంజీవి డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న పదో తరగతి స్పాట్ కేంద్రం బయట గురువారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా కనీసం ఉద్యోగుల పీఆర్సీని పట్టించుకోలేదని విమర్శించారు. తక్షణం పీఆర్సీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు వచ్చే వరకూ ఐఆర్ 30 శాతం ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను చేపట్టాలని కోరారు. ఫ్యాప్టో డెప్యూటీ సెక్రటరీ జనరల్ నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ మాట్లాడుతూ.. మలిదశ పోరాటంలో భాగంగా ఈ నెల 25, 26, 28 తేదీల్లో జరిగే నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఫ్యాప్టో ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ ఎ.సుందరయ్య, కార్యదర్శి ఇంటి రాజు నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు కె.శ్రీనివాసరావు, జి.రామారావు, సయ్యద్ ఖాసీం, వి.రాధిక, జి.అనుగ్రహ ప్రసాద్, అరుణకుమారి, సురేష్ కుమార్, ఎం.కృష్ణయ్య పాల్గొన్నారు. -
దుర్గగుడి టాయిలెట్స్లో గుర్తు తెలియని మృతదేహం
మూడు నాలుగు రోజుల క్రితమే మృతి చెందినట్లు అనుమానాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి దిగువన కనకదుర్గనగర్లోని టాయిలెట్స్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం గుర్తించారు. కనకదుర్గనగర్లోని పురుషుల టాయిలెట్స్ మొదటి బాత్రూమ్ నుంచి భరించరాని దుర్వాసన వస్తుండటంతో, అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పక్క టాయిలెట్స్లో పైకి ఎక్కి వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. టాయిలెట్స్ లోపల వైపున గడియ పెట్టుకుని ఉండటం, ఓ వ్యక్తి కింద పడిపోయి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్టౌన్ పోలీసులు మృతుని ఒంటిపై ఉన్న ప్యాంట్, గోడపై ఉన్న షర్టులో అతనికి సంబంధించి గుర్తింపు కార్డులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. కనీసం మృతునికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతను యాచకుడు అయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు రోజుల కిందట మృతి చెంది ఉంటాడని దేవస్థాన అధికారులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం.. ఘటనలో శానిటేషన్ విభాగానికి చెందిన సూపర్వైజర్, సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. మూడు, నాలుగు రోజులుగా టాయిలెట్ డోర్ వేసి ఉంటే కనీసం లోపల ఎవరు ఉన్నారు.. అతని పరిస్థితి ఏంటని ఆరా తీయాల్సి ఉండగా, అదేమి పట్టనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. అసలు మూడు రోజులుగా శానిటేషన్ సిబ్బంది టాయిలెట్స్ను శుభ్రం చేయలేదని తెలుస్తోంది. టాయిలెట్స్లో ఉన్న వ్యక్తి బయటకు రాకపోయినా సిబ్బంది పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుర్తించలేని విధంగా మృతదేహం.. మృతిచెందిన వ్యక్తి మృతదేహం గుర్తించలేని విధంగా మారిపోయింది. ఘటన గురించి తెలుసుకున్న దుర్గగుడి ఈవో శీనానాయక్ కనక దుర్గనగర్కు చేరుకున్నారు. టాయిలెట్స్లో ఒకరు మృతి చెంది ఉన్నా కనీసం గుర్తించలేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకదుర్గనగర్లో శానిటేషన్ పనులను పర్యవేక్షించే సూపర్వైజర్, స్వీపర్ ఒకరికి మరొకరు పొంతనలేని సమాధానం ఇవ్వడంపై వారిపై చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు. మరో వైపున ఆలయంలో శానిటేషన్పై భక్తుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో గురువారం మధ్యాహ్నమే శానిటేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టాయిలెట్స్ను ప్రతి మూడు గంటలకు ఒక సారి శుభ్రం చేయాలని ఆదేశించారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
మచిలీపట్నంఅర్బన్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) 42 రోజుల వేసవి శిక్షణ కోర్సును మే 1 నుంచి జూన్ 11వరకు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ కేంద్రాలు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురంలలో ఉన్నాయన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందదలచిన అభ్యర్థులు మే 1వ తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి, గరిష్టంగా 45ఏళ్లు మించకూడదన్నారు. అర్హతలివి.. ఎస్ఎస్సీ లేదా సమానమైన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ వృత్తి విద్య కోర్సు ఉత్తీర్ణత, ఎస్బీటీఈటీ గుర్తించిన కోర్సులు, ఐటీఐల ద్వారా పొందిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, హ్యాండ్లూమ్ వీవింగ్ వంటి జాతీయ సంస్థల సర్టిఫికెట్లు లేదా పరిశ్రమల శాఖ జారీ చేసిన సర్టిఫికెట్లు ఉండాలని తెలిపారు. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం లేదా సమాన సంస్థల నుంచి కర్ణాటక సంగీతం(గానం/వాద్యం)లో డిప్లొమా, లేదా ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఫైన్ ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ (బీఎఫ్ఏ) కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల వారు.. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు తమ విద్యా, సాంకేతిక అర్హతలను ఆంధ్రప్రదేశ్ వెలుపల బోర్డులు లేదా సంస్థలలో పొందినట్లయితే, ప్రవేశానికి ముందు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల నుంచి అనుమతి పొందాలని సూచించారు. ఈ కోర్సుకు దరఖాస్తులు ఏప్రిల్ 26వరకు స్వీకరిస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్www. bse.ap.gov.inను సందర్శించాలన్నారు. నాగాయలంక: సముద్ర జలాల్లో ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మెకనైజ్డ్, మోటారు బోటులలో మత్స్యకారుల చేపల వేటపై నిషేధం అమలులో ఉంటుందని అవనిగడ్డ మత్స్యశాఖ అభివృద్ధి అధికారి వానపల్లి సత్యనారాయణ గురువారం తెలిపారు. ఏపీ మత్స్య క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం జూన్14వరకు (61రోజులు) ఈ నిషేధం అమలు ఉంటుందని వివరించారు. ఈ కాలంలో మత్య్సకారులు సముద్రంలో చేపలు, రొయ్యల వేటలను పూర్తిగా నిలిపి వేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఇంజిన్ లేని సంప్రదాయక నావలకు మాత్రం నిషేధం వర్తించదని పేర్కొన్నారు. చేపలు, రొయ్యల సంతానోత్పత్తి సమయం కాబట్టి తల్లి జాతిని సంరక్షించడం, చేపల జనాభా పెరుగుదలను ప్రోత్సహించడంతో సముద్రపు మత్స్య సంపద సుస్థిరత సాధించడం కోసమే ఏటా వేట నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కాలంలో చేపల వేట చేయకుండా మత్స్యకారులు మత్స్యసంపద అభివృద్ధికి సహకరించాలని, చట్టాన్ని అతిక్రమించి చేపలవేట సాగిస్తే శిక్షార్హులతారని చెప్పారు. విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో గురువారం రిమాండ్ ముగియడంతో బెయిల్పై ఉన్న 14 మంది నిందితులు ఎకై ్సజ్ న్యాయస్థానంలో హాజరయ్యారు. మిగిలిన నిందితులలో ఏడుగురు గైర్హాజరు పిటీషన్ దాఖలు చేయగా, నలుగురు నిందితులు గైర్హాజరు పిటీషన్ దాఖలు చేయలేదు. 6వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి లెనిన్బాబు నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ, విచారణను ఈనెల 23వ తేదీ వరకు వాయిదా వేశారు. -
స్థానిక సంస్థల నిర్వీర్యానికి కుట్రలు
చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వమే కుట్రలు చేస్తోందని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక విమర్శించారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో గురువారం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్పర్సన్ హారిక మాట్లాడుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జిల్లా పరిషత్కు స్టాంప్ డ్యూటీ నిధులు రూ.23 కోట్లు రావాల్సి ఉండగా రెండేళ్లుగా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీని వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు రాక, చేసిన పనులకు ప్రారంభోత్సవాలు జరగక తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలామని, ఇలాంటప్పుడు స్థానిక సంస్థలను ప్రభుత్వం రద్దు చేస్తే బాగుంటుందని సూచించారు. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వండి ప్రస్తుత వేసవి నేపథ్యంలో ప్రజలకు సక్రమంగా తాగునీరు సరఫరా జరిగేలా చూడాలని చైర్పర్సన్ హారిక అధికారులకు సూచించారు. కో–ఆప్షన్ సభ్యుడు పరి శుద్ధ రాజు మాట్లాడుతూ.. తాగునీటి అవసరాలపై ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే తెలిపేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, తద్వారా సమ స్యను తక్షణం పరిష్కరించొచ్చని సూచించారు. కృత్తివెన్ను మండలంలో దాదాపు 30 గ్రామాల ప్రజలకు కలుషిత తాగునీరు అందుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్న కుమారి కోరారు. తాగునీరు కలుషితం కావటంతో ఆర్వో ప్లాంట్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారని, వాటిపై పర్యవేక్షణ కొరవడిందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ స్పందిస్తూ.. తాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేలా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తా రని తెలిపారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై ఫుడ్ సేఫ్టీ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అధికారుల గైర్హాజరు జెడ్పీ సర్వసభ్య సమావేశానికి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఏలూరు జిల్లాకు సంబంధించి నూజివీడు సబ్కలెక్టర్ వినూత్న తప్ప ఎన్టీఆర్ జిల్లా నుంచి ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాకపోవ టంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాకుంటే తమ సమస్యలు ఎలా పరిష్కారమవు తాయని ప్రశ్నించారు. జెడ్పీ ద్వారా జరిగిన పనులకు ప్రారంభోత్సవాలు ఎప్పుడు జరుగుతాయని సభ్యులు ప్రశ్నించగా, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇచ్చిన తేదీల ప్రకారం నిర్వహిస్తామని అధికారులు బదులిచ్చారు. దీంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు ఒక తేదీని నిర్ణయించి, సంబంధిత ప్రజాప్రతినిధులను పిలవా లని సూచించారు. ఈ సమయంలో చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ.. ‘జెడ్పీ ఆవరణలో నిర్మించిన వాణిజ్య సముదాయానికి ప్రజాప్రతినిధులను మీరే పిలవాలి’ అని పీఆర్ డీఈ నగేష్ తనతో చెప్పటంతో ఆశ్చర్యపోయానని అన్నారు. ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులను అధికారులు పిలవాలా లేక ఎవరు పిలవాలని ప్రశ్నించారు. పీఆర్ ఎస్ఈ రమణరావు మాట్లాడుతూ.. డీఈ పొరపాటుగా చెప్పారన్నారు. దీనిపై జేసీ స్పందించి డీఈ నగేష్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గూడూరు మండల జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీపీ వేముల సురేష్, సంగా మధుసూదనరావు మాట్లా డుతూ.. పోసినవారిపాలెం, మల్లవోలు, రాయవరం గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మించి ప్రారంభోత్సవం చేయకుండా నిలుపుదల చేశారని, వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవా లని కోరారు. జెడ్పీ వైస్చైర్మన్ గరికిపాటి శ్రీదేవి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మండలంలోని దావు లూరు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తు న్నారని, ఈ ఇసుకను హైదరాబాద్ తరలించి అమ్ము కుంటున్నారని, అనుమతులు ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. జేసీబీల ద్వారా తవ్వకాలు జరుపుతున్నారని ఇలా అయితే ఆ ప్రాంత కూలీలకు ఉపాధి ఎలా దొరుకుతుందని నిలదీశారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్కలెక్టర్ వినూత్న, జెడ్పీ సీఈఓ జె.అరుణ, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న, మినుమును మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతూ సభ్యులు పోడియం వద్ద ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. పెనుగంచిప్రోలు మండలంలో 18 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవగా, ప్రభుత్వం క్వింటా మద్దతు ధరను రూ.2,400గా నిర్ణయించిందని, దళారులు రూ.1600 మించి కొనడంలేదని పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపురి గాంధీ సభ దృష్టికి తెచ్చారు. తక్షణం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జేసీ నవీన్ స్పందిస్తూ.. ప్రభుత్వానికి నివేదించామని ఉత్తర్వులు వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తామన్నారు. ఒక్కసారిగా సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ. రైతులంటే అంత చులకనా, మొక్కజొన్న, మినుము పంట లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం ఏమిటని ప్రశ్నించారు. కొద్దిసేపు పోడియం వద్ద పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో అక్కడి ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని వివరించారు. పెనుగంచిప్రోలు మండలంలోని కొల్లికోళ్ల, 11 గ్రామాలకు వెళ్లే తాగునీటి పైప్లైన్ తరచూ పగిలిపోతోందన్నారు. ఇసుక తవ్వకాల వల్ల ఈ పైప్లైన్ పగిలినప్పుడు సుమారు పది రోజులు తాగునీటిని సరఫరా నిలిపివేస్తున్నారని ఎంపీపీ గాంధీ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక తవ్వకాలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు కోడూరు: ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఎండీ రాధా కృష్ణపై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు డిమాండ్ చేశారు. కోడూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా రాధాకృష్ణ రాసిన రాతలు గర్హనీయమని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యాలను ప్రతి ఒకరూ తిప్పికొట్టాలన్నారు. తప్పుడు రాతలు రాసిన రాధా కృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటాన్ని తట్టుకోలేక ఎల్లో మీడియా డైవర్షన్ రాజకీయా లకు తెరలేపిందని రమేష్బాబు దుయ్య బట్టారు. అసత్యాలు, అసభ్యకర కథనాలు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళల గౌరవం, భద్రత కోసం వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోందన్నారు. ఆ పార్టీ జిల్లా రైతు విభాగం కార్యదర్శి కొండవీటి వీర వెంకటనారాయణరావు, ఎంపీటీసీ బడే గంగాధరరావు, నేతలు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
గన్నవరం: ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. మండల కేంద్రమైన గన్నవరం వద్ద చెన్నయ్ – కోల్కతా జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో ఏపీపీ మృతిచెందగా, మరొకరు తీవ్రగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన దోనేపూడి సాంబశివరావు గన్నవరం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోహిత్కుమార్ అనే వ్యక్తితో కలిసి ఆయన ద్విచక్ర వాహనంపై హనుమాన్జంక్షన్ వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. స్థానిక ఆల్ఫా హోటల్ వద్దకు రాగనే ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాంబశివరావు, లోహిత్కుమార్ను సమీపంలోని పిన్నమనేని సిద్ధార్ధ ఆస్పత్రికి తరలించారు. అయితే సాంబశివరావు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి గంపలగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. గంపలగూడెం పోలీసుల కథనం మేరకు.. తిరువూరు ఆర్టీసి డిపోకు చెందిన బస్సు మధిరకు బయలుదేరింది అదే సమయంలో మండలంలోని మాటూరుపేటకు చెందిన సేలం శివశంకర్రెడ్డి (30) వరిగడ్డి కట్టలు కట్టేయంత్రాన్ని ట్రాక్టర్కు కట్టుకుని మధిర వైపు ప్రయాణిస్తున్నాడు. రాజవరం శివారు మలుపు వద్ద బస్సు, ట్రాక్టర్ ఒకదానికొకటి తగిలాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ అదుపతప్పి పల్టీకొట్టింది. ట్రాక్టర్ నడుపుతున్న శివశంకర్రెడ్డి ప్రమాదం ధాటికి విసురుగా వెళ్లి బస్సుకు తగిలాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శివశంకరరెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. అతనికి భార్య శివాని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్ తెలిపారు. కారు ఢీకొని వృద్ధురాలి మృతి జూపూడి(ఇబ్రహీంపట్నం): కారు ఢీకొని రోడ్డు దాటుతున్న వృద్ధురాలు మృతిచెందిన ఘటన 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన పాలపు పుల్లమ్మ(60) వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక నిమ్రా వైద్యశాలకు వచ్చింది. చికిత్స అనంతరం తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పుల్లమ్మ మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ బి.రాజు ఘటనా స్థలానికి చేరుకుని వివ రాలు సేకరించారు. మృత దేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గూడ్స్ వాహనాన్ని బైక్ ఢీకొని యువకుడు.. కోనేరుసెంటర్(మచిలీపట్నం) గూడ్స్ వాహనాన్ని ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మచిలీపట్నం–అవనిగడ్డ హైవేపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గూడూరు మండలం పిండివారిపాలెంనకు చెందిన దేసు రోహిత్ (19), పెడన మండలం దక్షిణ తెలుగురావుపాలెంనకు చెందిన చరణ్, బందరు మండలం హుస్సేన్పాలెంనకు చెందిన మరో యువకుడు స్నేహితులు. వీరు ముగ్గురు కోతమిషన్లో పనిచేస్తుంటారు. బుధవారం స్నేహితులు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై అవనిగడ్డకు బయలుదేరారు. మచిలీపట్నం నుంచి అవనిగడ్డకు వెళ్లే హైవే ఫ్లై ఓవర్పై నుంచి నరసాపురం వైపు నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ వాహనం యూటర్న్ తీసుకుంటోంది. అదే సమయంలో రోహిత్ నడుపుతున్న బైక్ అదుపుతప్పి గూడ్స్ వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో రోహిత్పై నుంచి గూడ్స్ వాహనం వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్ఐ నాగరాజు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు నమోదు చేసుకున్నారు. రోహిత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం రోహిత్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. -
భూగర్భజలాల పెంపులో రైతుల పాత్ర కీలకం
కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ హనుమాన్జంక్షన్ రూరల్: భూగర్భ జలాల పెరుగుదలలో రైతుల భాగస్వామ్యం ఎంతో కీలకమని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. బాపులపాడు మండలం మడిచర్లలో బుధవారం పర్యటించిన ఆయన గ్రామంలోని చెరువును పరిశీలించారు. గ్రామంలో భూగర్భ జలాల లభ్యత, చెరువుల స్థితిగతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. చెరువు ఎఫ్ఎంబీ పరిశీలించిన కలెక్టర్కు స్థానికులు ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. గతంలో చెరువు విస్తీర్ణం 98 ఎకరాలు ఉండేదని, ఆక్రమణలతో 72 ఎకరాలకు తగ్గిపోయిందని వివరించారు. ఈ చెరువు నిండితే మడిచర్ల, బిళ్లనపల్లి గ్రామాలకు మంచినీటి కొరత ఉండదన్నారు. కలెక్టర్ బాలాజీ స్పందించి తక్షణమే చెరువు ఆక్రమణలు తొలగించాలని, కట్టలను బలోపేతం చేయాలని, ఉపాధి హామీ పనులతో పూడిక తీత చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జెడ్పీ హైస్కూల్ను తనిఖీ చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్థ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జలవనరుల శాఖ ఎస్ఈ గుణకర్, భూగర్భజల శాఖ డీడీ విజయవర్థన్, ఏడీ బిందు, డ్వామా డీపీ శివశంకర్, తహసీల్దార్ బి.మురళీకృష్ణ, ఎంపీడీఓ జోగేశ్వరరావు, ఎంఈఓలు శ్రీరామ్ బాలాసింగ్, కొమ్మా విజయ్, హెచ్ఎం మైథిలి, సాగునీటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దేవినేని సత్యనారాయణ, సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పుట్టా జగన్మోహనరావు పాల్గొన్నారు. -
రైతుల కోసం వైఎస్సార్ సీపీ పోరుబాట
కోడూరు: భూములపై రైతులు తమ హక్కులు కోల్పోయేలా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 22ఏ నిషేధిత జాబితా జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు తెలిపారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద రమేష్బాబు మండల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులు సాగు చేస్తున్న పంట భూములను 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చి భూములు రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు జరగకుండా ప్రత్యేక జీఓ తీసుకొచ్చా రని రమేష్బాబు గుర్తుచేశారు. ఈ జీఓ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి చేరిందన్నారు. దివిసీమలోనే 17,856 ఎకరాల భూమిని 22ఏ కింద చేర్చి 10,116 మంది రైతులకు తీవ్ర నష్టం కలిగించారని వివరించారు. ఈ భూములకు విముక్తి కల్పించాలంటూ నాడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు అండగా నిలిచిన జగన్మోహన్రెడ్డి టీడీపీ ప్రభుత్వం భూములను నిషేధిత జాబితా లోకి చేర్చుతూ ఇచ్చిన జీఓను వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి రద్దు చేసినట్లు రమేష్బాబు తెలిపారు. అవనిగడ్డ కేంద్రంగానే భారీ బహిరంగ సభ నిర్వహించి నిషేధిత జాబితాను నుంచి భూములను తొలగించి, భూములకు సర్వ హక్కులను రైతులకు కల్పిస్తూ జగన్మోహన్రెడ్డి పట్టాలు కూడా పంపిణీ చేశారన్నారు. చంద్రబాబు మాత్రం వైఎస్సార్ సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారని రమేష్బాబు మండిపడ్డారు. 2024లోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన జీఓను రద్దు చేసి 40 వేల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోకి చంద్రబాబు చేర్చి మళ్లీ రైతులు భూములపై హక్కు కోల్పోయేలా చేశారని విమర్శించారు. ప్రస్తుతం నిషేధిత భూముల జాబితాను ఒకేసారి రద్దు చేయకుండా ఒకొక్క రైతుకు సంబంధించిన భూముల వివరాలను పరిశీలించి, వాటి ఆధారంగా జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని రమేష్బాబు మండిపడ్డారు. ఒకొక్క రైతు వివరాలు సేకరించే సమ యంలో అన్నదాతలు తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు రూ.కోట్లతో లంచాలు ముట్టచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోఒదని మండిపడ్డారు. కోడూరులో నిరసన కార్యక్రమం.. నిషేధిత భూముల జాబితా సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదో తేదీన కోడూరులో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిహాద్రి రమేష్బాబు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ కార్యా లయం నుంచి ప్రధాన సెంటర్ మీదగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు అందిస్తామన్నారు. రైతులందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలపాలని కోరారు. పార్టీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి కొండవీటి వీరవెంకటనారాయణరావు, ఎంపీటీసీ సభ్యుడు బడే గంగాధరరావు, ఎస్సీసెల్ కన్వీనర్ వెన్నా ప్రసాద్, నేతలు తిమ్మన శివ, మాలే నరేష్, బండే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు బుధవారం విరాళాలను అందజేశారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రణీత్కుమార్, పవిత్ర కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి తమ కుమారుడు చిన్నారి జి.దేవాశిష్ పేరిట రూ. 1,01,116, అలాగే పవిత్ర తల్లి ఈశ్వరి, సోదరుడు నిఖిల్ చిన్నారి జి.ధీరన్ సాయి పేరిట రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ బాచు పల్లికి చెందిన జీఎన్ భాస్కరరావు దంపతులు, విజయవాడ వన్టౌన్ ప్రాంతానికి చెందిన ఎం. జైరామ్ కుటుంబం అన్నదానానికి రూ. లక్ష చొప్పున విరాళాన్ని అందజేసింది. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకుడు డీవీవీ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి బుధవారం పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలం, లింగారావుపాలెం గ్రామానికి చెందిన ఆలోకం వేణుకుమార్, త్రివేణి దంపతులు రూ.1,01,116, భక్తుల సౌకర్యార్థం రూ.32 వేలు విలువ కలిగిన రెండు వాటర్ కూలర్లను ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ లక్ష్మణ్, ఇన్స్పెక్టర్ బద్దుల కృష్ణమోహన్ పాల్గొన్నారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): జగ్గయ్యపేట మునిసిపాలిటీ, డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ఎస్ఆర్ఆర్ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ డి. యుగంధర్ మూడు స్వర్ణం, ఒక రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో యుగంధర్ అభినందన కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 56–60 సంవత్సరాల విభాగంలో తమ కళాశాల అధ్యాపకుడు మూడు స్వర్ణపతకాలు, ఒక రజతం సాధించటం కళాశాలకే గర్వకారణంగా పేర్కొన్నారు. ఆయన 200మీటర్ల ఫ్రీ స్టైల్, 25 మీటర్ల బటర్ఫ్లై, 100మీటర్ల ఇండివిడ్యువల్ మెడ్లీ విభాగాలలో స్వర్ణ పతకాలు, అలాగే మరొక విభాగంలో రజత పతకం సాధించినట్లు వివరించారు. అనంతరం యుగంధర్ను కళాశాల అధ్యాపకులు డాక్టర్ వీఎస్డీఎస్ బాలసుబ్రహ్మణ్యం, జె. నాగేశ్వరరావు, విజయదీప్ తదితరులతో కలిసి అభినందించారు. -
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ కంకిపాడు: గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త, వ్యర్థాలు పేరుకుపోకుండా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు చెత్తను తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మండలంలోని నెప్పల్లి గ్రామంలో బుధవారం కలెక్టర్ బాలాజీ విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త, వ్యర్థాలు నిర్దేశించిన సంపద తయారీ కేంద్రానికి మాత్రమే తరలించాలన్నారు. ప్రజలు తడి, పొడి చెత్త వేరువేరుగా పంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు. శ్మశానవాటికల నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తామన్నారు. గ్రామస్తులు పలువురు తామెదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.భావనారాయణ, డీఎల్పీఓ సంపత్కుమారి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు. -
బీఆర్టీఎస్ రోడ్డులో రూ.2 కోట్ల నగదు స్వాధీనం
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఆధారాలు లేని రూ.2 కోట్ల నగదు, కారును గుణదల పోలీసులు సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం రాత్రి పడవల రేవు ఫుడ్ కోర్టు సమీపంలో సీఐ సత్య రమేష్ ఆధ్వర్యంలో గుణదల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఆ వైపు ఓ కారులో వచ్చిన వ్యక్తులు పోలీసులను చూసి వెనుకకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అనుమానించిన సీఐ సత్యరమేష్ ఆ కారును ఆపి తనిఖీ చేశారు. ఎటువంటి పత్రాలు లేని రూ.2 కోట్ల నగదు కనిపించింది. కారులో ఉన్న వ్యక్తులను గుజరాత్కు చెందిన బల్వంత్ అమర్సింహసోలంకి, అల్పేష్ కుమార్గా గుర్తించారు. ఆ నగదు గురించి పోలీసులు ఆరా తీయగా, తాము ఒడిశాలోని బరంపురం నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల రైతుల నుంచి సరుకు కొనుగోలు చేసేందుకు నగదుతో వస్తున్నట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. ఆ నగదుకు సంబంధించిన పత్రాల గురించి పోలీసులు ప్రశ్నించగా వారు చూపించలేకపోయారు. ఆ నగదును తమ యజమాని ఇచ్చారని, తమకు ఏమీ తెలియదని.. విజయవాడ వెళ్లిన తరువాత ఎవరికి ఇవ్వాలో చెబుతామన్నారని పేర్కొన్నారు. బరంపురం నుంచి బైపాస్ మీదుగా నగరంలోకి వచ్చామని వెల్లడించారు. నగదుకు సంబంధించి ఆధారాలు చూపించకపోవటంతో గుణదల పోలీసులు రూ.2 కోట్ల నగదు, కారును సీజ్ చేసి బల్వంత్ అమర్సింహసోలంకీ, అల్పేష్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నగదుకు ఏమైనా రాజకీయ ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్లో అగ్రస్థానమే లక్ష్యం
వీఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్ లక్ష్మీశ భవానీపురం(విజయవాడపశ్చిమ): స్వచ్ఛ సర్వేక్షణ్లో సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డ్ నిలబెట్టుకోవడంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సమష్టిగా పని చేసి ర్యాంకుల సాధనకు కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్, జనగణనపై బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మునిసిపల్ కార్పొరేషన్లోని వివిధ శాఖాధిపతులు, స్వర్ణ వార్డుల సిబ్బందితో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ వేసవికి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, అదనపు కమిషనర్లు డాక్టర్ డి. చంద్రశేఖర్, ఎ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు పాల్గొన్నారు. సత్తా చాటుదాం.. పటమట(విజయవాడతూర్పు): స్వచ్ఛ సర్వేక్షణ్లో అగ్రస్థానమే లక్ష్యంగా అడుగేసి సత్తా చాటుదామని, వినూత్న కార్యాచరణ, విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ఇది సాధ్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనం సమావేశ మందిరంలో 30కు పైగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్డబ్ల్యూఏ), టెర్రస్ గార్డెన్ అసోసియేషన్ల ప్రతినిధులతో బుధవారం సమావేశం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి స్వచ్ఛతలో నగర కీర్తిప్రతిష్టలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికల అమల్లో ఆర్డబ్ల్యూఏల భాగస్వామ్యంపై లక్ష్మీశ చర్చించారు. అసోసియేషన్ల ప్రతినిధుల సలహాలు సూచనలు తీసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే మంచి ర్యాంకులు సాధించామని, 2025–26కు సంబంధించి కూడా ముందంజలో నిలిచేందుకు కృషిచేస్తున్నామని మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. డెప్యూటీ డైరెక్టర్ (ఉద్యాన) చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల నిరసన ధర్నా
మధురానగర్(విజయవాడసెంట్రల్): జనవరి 2017 నుంచి పెన్షన్ సవరణను తక్షణమే అమలు చేయాలని ఆల్ ఇండియా రిటైర్డ్ బీఎస్ ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కేశవరావు, ఎ.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం టెలికాం శాఖలో పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ ఆధ్వర్యాన సీసీఏ (కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్) కార్యాలయం వద్ద నిరసన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కేశవరావు, కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీరువల్ల బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందో ళన వ్యక్తంచేశారు. టెలికాం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాము దశలవారీ పోరాటం చేస్తున్నామని తెలిపారు. 2026 జనవరి నుంచి రావాల్సిన ఐడీఏ, డీఆర్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 1996 తర్వాత నియమితులైన జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ల వేతనాన్ని నిర్ధారించాలని కోరారు. మండే ఎండల్లో విశ్రాంత ఉద్యోగులు పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.శివరామ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యేశ్వర రావు, సర్కిల్ ఆర్థిక కార్యదర్శి ఎం.చంద్ర శేఖజురావు, సంఘం సభ్యులు పలువురు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధి మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని రూ.170 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని క్రీడలు, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. స్టేడియంలో చేపట్టనున్న వివిధ పనులకు బుధవారం భూమి పూజ జరిగింది. మంత్రి రాంప్రసాద్రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి ఈ కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని రూ.170 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి దశలో రూ.60 కోట్లతో పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియాలో భాగంగా రూ.20 కోట్లు, శాప్, విజయవాడ నగర పాలక సంస్థ సంయుక్తంగా మరో రూ.40 కోట్లతో ఈ పనులు చేస్తున్నామని వివరించారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది లోపుగా ఈ స్టేడియాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. శాప్తో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కలిసి పనిచేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. నగరంలోని క్రీడాకారులతో పాటుగా క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): తాళం వేసిన ఇంట్లోని బీరువాలో బంగారు నగలు, వెండి వస్తువులు చోరీకి గురైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణలంక, శంకరమఠం వీధిలోని ఓ భవనం మొదటి అంతస్తులో రెంటచింతల వెంకటాచలయాజులు కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత నెల 20వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి అయోధ్య వెళ్లారు. తిరిగి ఈ నెల ఏడో తేదీ రాత్రి 9.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం పగలగొట్టి తలుపు దగ్గరగా వేసి ఉండడాన్ని గమనించి కంగారుగా లోనికి వెళ్లి చూడగా బీరువా కూడా తెరిచి కనిపించింది. బీరువాలో వస్తువులు అన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. అందులో దాచిన పది కాసుల బంగారు నగలు, 30 కిలోల వెండి వస్తువులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏడీసీపీ రాజారావు, కృష్ణలంక సీఐ నాగరాజు పోలీసు సిబ్బందితో బుధవారం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరిసరాల్లోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. క్లూస్ టీం ఇంట్లోని వేలిముద్రలతో పాటు పలు ఆధారాలను సేకరించింది. ఈ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బందరు కార్పొరేషన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా మని, నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నగరంలోని మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నీటి సరఫరా, విద్యుత్, డ్రెయినేజీ, అమృత్ 2.0 తదితర అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. నగరంలో ప్రస్తుతం 14 రిజర్వాయర్లు ఉన్నాయని, మరో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణంపై ఏజెన్సీలతో చర్చించామని తెలిపారు. అమృత్ పథకం కింద నగరానికి రూ.65 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు నిధులు వస్తాయని పేర్కొ న్నారు. ఇందులో రూ.15 కోట్లు నీటి సరఫరా, పైప్లైన్ల మార్పిడి పనులకు కేటాయించగా, మిగిలిన నిధులు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం సంబంధిత పనులకు వినియోగిస్తామని పేర్కొన్నారు. డ్రెయినేజీ పనుల కోసం రూ.13 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటికే టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. నగరంలో వీధి దీపాల పనితీరును సమీక్షించిన మంత్రి, మరో రెండు వేల కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఆస్తి పన్నులు, అద్దెలు తదితర బకాయిలను సకాలంలో చెల్లించాలని కోరారు. ప్రస్తుతం రూ.24 కోట్ల వరకు పన్నుల బకాయిలు ఉన్నాయని, రూ.20 కోట్ల వరకు విద్యుత్ బిల్లుల భారం ఉందని వివరించారు. మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు పినిశెట్టి నాగ ఛాయాదేవి, దేవరపల్లి అనిత, మరకాని సమతాకీర్తి, దింటకుర్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మావిగన్ పంచ్తో రాధాకృష్ణకు భయం పట్టుకుంది
సాక్షి, కృష్ణా: ఏబీఎన్ రాధాకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ముస్తాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. ‘‘రాధాకృష్ణ బరితెగించాడు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నాడు. నీది(రాధాకృష్ణను ఉద్దేశించి..) దమ్మున్న చానెల్ అయితే వాస్తవాలు ఒప్పుకో. చంద్రబాబుకు వంత పాడడమే నీకు తెలుసు. అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారు?. వైఎస్ జగన్ నుంచి మావిగన్ ప్రతిపాదన రాగానే మీకు భయం పట్టుకుందా?’’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలు అవ్వకూడదు. అమరావతి పేరుతో దోపిడి ఆపాలి. వందేళ్లైనా అమరావతి పూర్తి కాదు. ఆ అవినీతిని అడ్డుకోవాలని జగన్ కోరారు. అందుకే మావిగన్ పెట్టమని జగన్ చెప్పారు. జగన్ చెప్పింది తప్పు అయితే అది తప్పని నిరూపించు. అంతేగానీ ఏబీఎన్ను అడ్డం పెట్టుకొని రోత రాతలు రాస్తున్నారు. అసలు ఏబీఎన్ రాధా కృష్ణది కానే కాదు. ఎవరో యావడో పెట్టిన ఛానల్ దోచుకొన్నాడు కదా. రాధాకృష్ణా.. కాశీ వెళ్లి సిగ్గుశరం వదిలేసి వచ్చావా?. దమ్మున్న చానల్ అయితే.. వలంటీర్ల విషయంలో కూటమి పార్టీల నేతలను ఎందుకు నిలదీయలేదు?. ఈ రెండేళ్లలో చంద్రబాబు 4లక్షల కోట్లు అప్పు చేస్తే ఏమైపోయావ్?. నీతులు చెప్పగానే సరిపోదు.. అమలు చేయాలి. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడినందుకు తక్షణమే క్షమాణలు చెప్పాలి అని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
ఉన్నత ప్రమాణాలతో చేరువవుతోన్న ‘ఇగ్నో’
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులకు మరింత చేరువవుతోందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి అన్నారు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 39వ స్నాతకోత్సవం విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య మధుమూర్తి స్నాతకోపన్యాసం చేశారు. ఇగ్నో 40ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా ఉన్నత విద్యనూ అన్నీ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచిందన్నారు. జాతీయ స్థూల నమోదు నిష్పత్తినీ పెంపొందించేందుకు కృషి చేస్తూ ‘మీ ఇంటి వద్దకే విద్య’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 70 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా డిగ్రీలను ప్రధానం చేశారు. రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత నివేదికను సమర్పిస్తూ దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా డిగ్రీలను ఈ స్నాతకోత్సవంలో అందుకోనున్నారని చెప్పారు. అలాగే విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 1,626 మంది విద్యార్థులు డిగ్రీలు తీసుకునేందుకు అర్హత సాధించారన్నారు. ప్రాంతీయ కేంద్రం పరిధిలో పలు నూతన కోర్సులతో పాటు నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో నూతన అధ్యయన కేంద్రాలను రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇగ్నో డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రసాద్బాబు, ఇగ్నో అధికారులు డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ మమత, చెన్ను బాల చందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి -
క్వాంటం వ్యాలీకి భూములివ్వం
కోమటిగుంట రైతులు ఎ.కొండూరు: క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు కోసం వ్యవసాయ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని ఎ.కొండూరు మండలం కోమటికుంట గ్రామ రైతులు స్పష్టం చేశారు. తహసీల్దార్ ఉదయ్ భాస్కరరావును మంగళవారం కలిసిన రైతులు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోమటిగుంట రైతులు మాట్లాడుతూ ముత్తాతలు, తాతలు, తండ్రుల కాలం నుంచి వందల ఏళ్లుగా ఈ భూములను సాగు చేస్తున్నామని తెలిపారు. ప్రాణంగా భావించే సాగు భూములను ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం సేకరించాలని చూడటం సరికాదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు వదులుకోబోమని వారు తేల్చిచెప్పారు. టీడీపీ సీనియర్ నేత గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ భూ సమీకరణ విషయంలో రెవెన్యూ అధికారులు రైతులకు స్పష్టమైన హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు భూపరిశీలనకు రావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆయన వివరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలని, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులను కోరారు. వారి క్షేమమే ముఖ్యమని ఆయన తెలిపారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ ఏపీఐఐసీ ద్వారా క్వాంటం వ్యాలీ ప్రతినిధులు భూములను కేవలం పరిశీలించడానికి మాత్రమే వచ్చారని తెలిపారు. పూర్తి వివరాలకు రైతులు కలెక్టర్ను కలిసి మాట్లాడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రైతులు వేములకొండ భాస్కరరావు, వేములకొండ సాంబశివరావు, కె. సురేష్, సీహెచ్ వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. -
కోడికి
కృష్ణాజిల్లాబుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పౌల్ట్రీపై వివక్ష మద్దతు ధర ఇవ్వండి మచిలీపట్నంఅర్బన్: స్వర్ణాంధ్ర విజన్ అమలును అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించింది. నగరంలోని కలెక్టరేట్ ‘మీకోసం’ సమావేశ మందిరంలో కేంద్ర బృంద సభ్యులు వికాస్ కిచి (విద్యుత్), సంతోష్ ప్రసాద్ (పరిశ్రమలు, అంతర్గత వ్యాపార ప్రోత్సాహం) కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో కీలక పనితీరు సూచికలు (కేపీఐ) మానిటరింగ్, స్వర్ణాంధ్ర విజన్ అమలు విధానంపై వివరాలు తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా జిల్లా విజన్ కార్యాచరణ ప్రణాళిక, నియోజకవర్గాల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుతో పాటు కేపీఐల నెలవారీ నమోదు విధానాలను వారు పరిశీలించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: స్థానిక లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని మంగళవారం రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) నాగమణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మూల్యాంకన ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. మూల్యాంకనం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఉపాధ్యాయులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జి.కొండూరు: ప్రభుత్వం తీరుతో పౌల్ట్రీ పరిశ్రమ ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కార్ వచ్చినప్పటి నుంచి ‘కోడి’కి భరోసా కానరావడం లేదు. గత ఏడాది ఫిబ్రవరిలో బర్డ్ప్లూ వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇది వ్యాపించకుండా చేపట్టిన భద్రతా చర్యల్లో భాగంగా కోళ్లు మృత్యువాత పడిన కోళ్లఫారాల్లో బతికి ఉన్న కోళ్లతో పాటు గ్రామాల్లో బతికి ఉన్న నాటుకోళ్లను సైతం కల్లింగ్ చేశారు. జిల్లాలో గంపలగూడెంలోని అనుముల్లంక గ్రామంలో అత్తునూరి పద్మారెడ్డికి చెందిన కోళ్ల ఫారంలో 15వేల కోళ్ల వరకు మృత్యువాత పడ్డాయి. ఎ.కొండూరు మండల పరిధి దీప్లానగర్ హనుమాన్ ఫౌల్ట్రీ కోళ్ల ఫారంలో 3వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. పద్మారెడ్డి కోళ్ల ఫారంలో మిగిలి ఉన్న కోళ్లతో పాటు, అదే గ్రామంలో 70మంది రైతులు ఇళ్ల వద్ద పెంచుకునే కోళ్లతో కలిపి 7500ను అధికారులు కల్లింగ్ చేశారు. వీటి వరకు నష్ట పరిహారంగా రూ.3,20,000 అందజేశారు. దీప్లానగర్ హనుమాన్ పౌల్ట్రీఫారంలో బతికి ఉన్న కోళ్లతో పాటు అదే గ్రామంలో 12మంది రైతులకు చెందిన మొత్తం 300కోళ్లను అధికారులు కల్లింగ్ చేశారు. నష్ట పరిహారంగా రూ.44వేలను అందజేశారు. కల్లింగ్ చేసిన ఒక్కొక్క కోడికి రూ.135చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా దీనిలో కోత విధించి నిర్వహకులకు వెన్నుపోటు పొడి చారు. పరిహారం విషయంలో ప్రభుత్వ తీరుతో రూ.50 లక్షల వరకు బాధిత కోళ్ల ఫారాల నిర్వాహకులు నష్టపోయారు. బర్డ్ఫ్లూతో ఎన్టీఆర్ జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం పడింది. వైరస్ వ్యాప్తితో అధికారికంగా రెండు కోళ్ల ఫారాల్లో మాత్రమే కోళ్లు మృత్యువాత పడినా మిగిలిన ఫారాల్లో వేల సంఖ్యలో మృత్యువాత పడినట్లు తెలిసింది. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం మొండిచేయి చూపడంతో కోళ్ల పెంపకం తగ్గుముఖం పట్టింది. వైరస్ వచ్చి పోయిన ఏడాది కాలంలోనే 29 బ్రాయిలర్ కోళ్ల ఫారాల నిర్వహణ నిలిచిపోయి 3,34,500 కోళ్ల పెంపకం తగ్గింది. మూడు నాటుకోళ్ల ఫారాలు తగ్గిపోయి 1100 వరకు కోళ్ల పెంపకం తగ్గిపోయింది. ఇటీవల మార్చిలో మళ్లీ బర్డ్ ప్లూ వ్యాప్తి చెందుతుందని పుకార్లు వచ్చాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేక పెట్టుబడి పెరిగిపోయి ఉత్పత్తి తగ్గడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి కోళ్లు పెంచేందుకు నిర్వాహకులు పూర్తిగా వెనకడుగు వేశారు. ఎ.కొండూరు: అధికారులకు మొక్కజొన్న రైతు సెగ తగిలింది. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కేలా చూడాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఎ.కొండూరు తహసీల్దార్ కార్యాలయాన్ని రైతులు మంగళవారం ముట్టడించారు. రైతు సంఘం నేత ఆళ్ల అమ్మిరెడ్డి ఆధ్వర్యాన పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. రైతు సంఘం నేత అమ్మిరెడ్డి మాట్లాడుతూ మండలంలో సుమారు 8వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం దారుణమన్నారు. అతి తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందిరైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు అతి తక్కువ ధరకే అమ్ము కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2,400 మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు జెట్టి వెంకటేశ్వరావు మాట్లాడుతూ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని పది రోజులుగా శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఇప్పటికే పంట అమ్ముకున్న రైతులకు బోనస్ ప్రకటించాలని కోరారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పానెం ఆనందరావు, రావుల రామకృష్ణ, సోమా యోహాను, పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 7 గతేడాది జిల్లాలో బర్డ్ఫ్ల్లూతో 18వేలకు పైగా బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత కల్లింగ్ చేసిన కోళ్లకే పరిహారం అందించి చేతులు దులుపుకొన్న ప్రభుత్వం ప్రభుత్వ భరోసా లేక జిల్లాలో ఏడాదికే తగ్గిన 3.35లక్షల కోళ్ల పెంపకం రూ.3.64 లక్షల పరిహారంతో సరి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన మొక్కజొన్న రైతులు మద్దతు ధర రూ.2,400 చెల్లించాలి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి రైతు సంఘం నేతలుమచిలీపట్నంఅర్బన్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం బందరులో ర్యాలీ చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రేమ్చంద్ పాల్గొన్నారు.కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మంగళవారం బందరులో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
ధర లేక.. దిక్కు తోచక!
–జాజి గోపి, రైతు, శింగవరం, వత్సవాయి మండలం –ఏలూరి శివాజీ, వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు గిట్టుబాటు ధర లేక... కొనుగోలు కేంద్రాలు ఏవీ! మార్క్ఫెడ్తో కొనుగోళ్లు చేయించండి కొనుగోలు కేంద్రాలు లేవు మద్దతు ధర రూ.2,400.. వ్యాపారులిచ్చేది రూ.1700 వర్షాలకు నేలకొరిగిన పంట కోతకు అదనపు ఖర్చు వర్షాలు పడతాయన్న సూచనలతో రైతన్న ఆందోళన -
చారిత్రక బావి.. చెత్తగా మారి!
గన్నవరం రూరల్: ముస్తాబాద శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం కోరట బావి. దీనిలోని నీరు అమృతతుల్యమని ఏళ్లుగా ప్రతీక. మండలంలోని ముస్తాబాద తూర్పు భాగంలో కొండ పక్కన కోరట బావి శతాబ్దాల క్రితం గ్రామస్తుల దాహార్తిని తీర్చేది. ఈ బావి నీరు అత్యంత ప్రశస్తమైనదిగా భావించిన పూర్వీకులు మంచినీటి అవసరాల కోసం ఇక్కడి నుంచి నీటిని తీసుకుని వెళ్లేవారు. అంతేగాక సూరంపల్లి, ముస్తాబాద, పురుషోత్తపట్నం, కొండపావులూరు, గోపవరపుగూడెం గ్రామాల నుంచి రైతులు, మొకాసా దారులు ఈ నీటిని తీసుకువెళ్లేవారు. ఈ ప్రాంత రైతులు పొగాకును పండించేవారు. దొర పొగాకును ఉత్పత్తి చేస్తూ ఎన్నో దశాబ్దాలుగా అప్పటి మద్రాసులో కంపెనీలు నిర్వహించేవారు. అక్కడికి ఈ కోరట బావి నీటిని వారు రైళ్లల్లో తీసుకు వెళ్లి మంచినీళ్లుగా వినియోగించటం జరిగేదని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఔషధగుణాలు.. కోరట బావి నీరు అమృతతుల్యమని భావిస్తారు. ఈ నీరు తాగితే మోకాళ్ల నొప్పులు రావని, తగ్గుతాయని చెప్పుకుంటారు. అంతేగాక దీర్ఘ రోగాలు తగ్గుతాయని భావిస్తారు. శతాబ్దాల ముస్తాబాద చరిత్రలో కోరట బావి పరిసరాల్లో సాధువులు, మహర్షులు బస చేసేవారని చెబుతారు. రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి దీర్ఘకాల రోగులను ఇక్కడికి తీసుకువచ్చి నెలల తరబడి ఉంచి, కోరట బావి నీరు అందిస్తే వారి రోగాలు తగ్గి వెళ్లే వారని గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. కాలగర్భంలో కలిసిపోతూ.. అటువంటి చరిత్రగల కోరట బావి నీరు అడుగంటింది. కాలగర్భంలో కలసిపోయే విధంగా మొక్కలు అల్లుకుపోయాయి. 1965లో గ్రామానికి చెందిన యువక బృందం కోరట బావిని ఆధునికీకరించి అప్పటి పంచాయతీ సమితి అధ్యక్షుడు డాక్టర్ సీఎల్ రాయుడుతో ప్రారంభోత్సవం చేయించిన శిలాఫలకం నేటికి కనిపిస్తోంది. కోరట బావి నీరు అనంతర కాలంలో బావికి సమీపంలో ప్రభుత్వం హ్యాండ్ బోరు నిర్మించగా అక్కడ ఆ జల కనిపించింది. దీంతో ఊపిరిపీల్చుకున్న పలు గ్రామాల ప్రజలు నిరంతరం కోరట బావి నీటిని ఈ హ్యాండ్ బోరు ద్వారా తీసుకువెళుతున్నారు. ముస్తాబాద శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న కోరట బావి ప్రాంతాన్ని ప్రభుత్వం రక్షించాలని, దాని విశిష్టతను భావితరాలకు తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోరట బావి జల పాయ నుంచి హ్యాండ్ బోరు ద్వారా నీటిని తీసుకువెళుతున్న గ్రామస్తులు చెట్ల వేళ్లతో పూడుకుపోయిన కోరట బావి కోరట బావి చరిత్రను భావితరాలకు తెలియజేయాలి. అందుకు దీనిని సంరక్షించాలి. బాగు చేసి, చారిత్రక సంపదగా పరిగణించాలి. దీనిలోని నీరు ఔషధ గుణాలు కలిగినదిగా చెబుతారు. అందుకే ఇప్పటికీ పరిసరాల్లోని 5గ్రామాల ప్రజలు మంచినీటిని ఇక్కడి నుంచి తీసుకువెళతారు. – షేక్ గోరా మస్తాన్, రైతు, ముస్తాబాద -
ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య
విస్సన్నపేట: ఒక ప్రైవేటు కళాశాలలో డీఫార్మసీ చదువుతున్న విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇవి.. మండలంలోని తాతకుంట్ల గ్రామానికి చెందిన మల్లాది కార్తీక్(22) స్థానిక పుట్రేలరోడ్డులోని ఫార్మసీ కళాశాలలో డీఫార్మసీ మొదటి సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వెళ్లిన కార్తీక్ను తన తండ్రి సోమవారం ఉదయం కళాశాలలో దిగబెట్టి వెళ్లాడు. కాగా మంగళవారం తెల్లవారుజామున తన పక్క రూంలో ఉండే విద్యార్థులు వాష్ రూం కని వెళ్లగా.. దాని పక్కనే ఖాళీగా ఉండే ఒక గదిలో ఫ్యాన్ హుక్కు కార్తీక్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. మృతికి గల కారణం తెలియరాలేదు. ఈ మేరకు మృతుడి తండ్రి బాలక్రిష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ అలివేలు మంగ తెలిపారు. హాస్టల్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. విస్సన్నపేట సీహెచ్ిసీలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కృత్తివెన్ను: మండల పరిధిలోని లక్ష్మీపురం వద్ద 216 నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఒడుగు నాగేశ్వరావు (45) మృతి చెందగా, కుమారుడు కార్తీక్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో నరసాపురం వైపు వెళ్తున్న కారు బంటుమిల్లి వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న నాగేశ్వరరావు, కార్తీక్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్లో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన తండ్రి ఆస్పత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడికి చికిత్స జరుగుతుందన్నారు. బాధితులు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు లాంచీల రేవు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏ పైడిబాబు తెలిపారు. జి.కొండూరు: తల్లిదండ్రులు లేని చిన్నారిని మేనత్త వేధిస్తున్న ఘటన కట్టుబడిపాలెం గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దళిత బహుజన రిసోర్స్సెంటర్ క్లస్టర్ కోఆర్డినేటర్ నందేటి అనిత జి.కొండూరు పోలీసులను ఆశ్రయించారు. వివరాలలోకి వెళ్తే.. బీహర్ రాష్ట్రానికి చెందిన నిబాకుమారి, శివనత్దాస్ దంపతులు తమ ముగ్గురు కుమారులతో కలిసి ఐదేళ్ల కిందట జి.కొండూరు మండల పరిధి కట్టుబడిపాలెం గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నారు. కాగా నిబాకుమారి తన అన్నా, వదినలు బీహార్లోనే మృతి చెందగా వారి కుమార్తె ఆర్తీకుమారి(6)ని గత కొంతకాలంగా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఆర్తీకుమారిపై మేనత్త నిబాకుమారి నిత్యం భౌతిక దాడి చేయడంతో పాటు సక్రమంగా అన్నం పెట్టక అనారోగ్యానికి గురైంది. చిన్నారిపై మేనత్త వేధింపుల విషయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న దళిత బహుజన రిసోర్స్ సెంటర్ క్లస్టర్ కోఆర్డినేటర్ నందేటి అనిత కట్టుబడిపాలెం వెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో గ్రామ మహిళా కానిస్టేబుల్ సాయంతో 108 అంబులెన్స్లో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అనిత జి.కొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జి.కొండూరు ఎస్ఐ సతీష్కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. -
ఉత్తమ నైపుణ్యం కలిగిన వైద్యులుగా తీర్చిదిద్దుతాం
గుంటూరు మెడికల్: ప్రముఖ జాయింట్ రీప్లేస్ మెంట్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ విభాగాలు కలిగిన సాయి భాస్కర్ హాస్పిటల్కు ఆర్థో విభాగంలో రెండు డీఎన్బీ సీట్లు కేటాయిస్తూ ఎన్.బి.ఇ.ఎం.ఎస్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్(ఎన్.బి.ఇ.ఎం.ఎస్ ) సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను జాతీయస్థాయిలో ఆర్థోపెడిక్ పీజీ ట్రైనింగ్ సెంటర్గా గుర్తిస్తూ డిప్లమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్బీ) సీట్లను కేటాయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్లో గుజరాత్కు చెందిన డాక్టర్ జీల్ కటిరా, రాజస్థాన్కు చెందిన డాక్టర్ యశా జైన్లు సాయి భాస్కర్ హాస్పిటల్ను ఎంపిక చేసుకున్నారు. మంగళవారం అరండల్ పేటలోని హాస్పిటల్లో డాక్టర్ నరేంద్రరెడ్డి ఎదుట తమ తొలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డీఎన్బీ సీట్లను తమ హాస్పిటల్కు కేటాయించడం గర్వంగాను, ఆనందంగానే ఉందని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు డీఎన్బీలో విద్యను అభ్యసించాల్సి ఉంటుందన్నారు. ఎముకలు కీళ్ల విభాగంలో అన్ని విధాలా మెరుగైన విద్యను, ప్రాక్టికల్స్ను అందించి ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది తద్వారా జాతీయస్థాయిలో గుంటూరుకు గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని డాక్టర్ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ కొనకల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
గుడివాడ రూరల్: రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి తర్వాత మొక్కజొన్నే అధికంగా సాగు చేశారని చెప్పారు. అకాల వర్షాల వల్ల మొక్కజొన్న పంట పాడై.. రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఉన్న కొద్దిపాటి పంటకు సైతం సరైన ధర లేకపోవడం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. వీరందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరా రు. లేదంటే వారికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి -
హస్త కళాకృతులకు డిమాండ్
పెడన: గుర్రపు డెక్కతో తయారుచేసిన వివిధ రకాల హస్త కళాకృతులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అందుకు తగ్గట్టుగా అందించడానికి కృషి చేస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఆయన మంగళవారం పెడన మండలం చేవేండ్ర, బంటుమిల్లి మండలం మణిమేశ్వరం పంచాయతీ లేళ్లగూడెం గ్రామాల్లో పర్యటించారు. సెర్ఫ్, డీఆర్డీఏ, వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపుడెక్కతో వివిధ హస్త కళాకృతుల తయారీలో శిక్షణ ఇస్తున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలకు శిక్షణ.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడాది క్రితం అసోం నుంచి కళాకారులను జిల్లాకు పిలిపించామని వారు మచిలీపట్నం మండలం చిన్నాపురంలో స్వయం సహాయక సంఘాల మహిళలు 30 మందికి గుర్రపు డెక్కతో వివిధ రకాల బుట్టలు, చాపలు వంటి హస్త కళాకృతులు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. శిక్షణ తీసుకున్న డ్వాక్రా మహిళలు ఉత్పత్తి బాగా చేస్తుండటం గుర్తించామని, తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేశామన్నారు. చిన్నాపురంలో శిక్షణ పొందిన వారితో పలు ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం 20 రోజుల్లోనే బుట్టలు చాపలు వంటి అల్లికలు బాగా చేశారని కలెక్టర్ మహిళలను అభినందించారు. అనంతరం కలెక్టర్ లేళ్లగూడెం 9వ తరగతి విద్యార్థులతోనూ, వలంటీర్లతో ముఖాముఖీ మాట్లాడారు. ఈ పర్యటనలో డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్, పెడన ఇన్చార్జి తహసీల్దార్ అనిల్ కుమార్, పెడన ఎంపీడీవో అరుణకుమారి, వెలుగు ఏపీఎం శ్రీదేవి, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీ -
పాఠశాలలో తనిఖీలు
రెడ్డిగూడెం: మండలంలోని రంగాపురం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆర్. రమేష్బాబు(ఏపీసీ) మంగళవారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని కిచెన్, క్లాస్ రూమ్స్, లైబ్రరీ, స్టాక్ రూమ్లను పరిశీలించారు. ఎస్వో, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థినులతో ముచ్చటించారు. జిల్లా కోఆర్డినేటర్ జీసీడీఓ, మండల విద్యాశాఖ అధికారి–2 పి. రమేష్బాబు, మండల ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (డీఈఈసెట్) నోటిఫికేషన్ విడుదలైనట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ మార్చి 31 నుంచి ఏప్రిల్ 15వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు రూ.1,000 ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు భారతీయ పౌరులు అయి ఉండాలని, ఇంటర్మీడియెట్ లేదా సమాన అర్హతలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. సాధారణ వర్గాలకు కనీసం 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు అవసరమని తెలిపారు. అభ్యర్థులు కనీసం 17ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని సూచించారు. పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పార్ట్–ఏకు 60 మార్కులు (సాధారణ అంశాలు), పార్ట్–బీకు 40 మార్కులు (ఎంపిక చేసిన సబ్జెక్ట్) ఉంటా యన్నారు. ప్రభుత్వ డీఈఈటీ కళాశాలలు, ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో ర్యాంక్ ప్రకారం సింగిల్ విండో విధానంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. హాల్ టికెట్లు, పరీక్ష తేదీలు తదితర వివరాలు త్వరలో అధికారిక వెబ్సైట్లలో వెల్లడిస్తామని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్ పూర్తిగా చదవాలని, సరైన ఫొటో, వివరాలను మాత్రమే అప్లోడ్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://cse.ap.gov.in,https://apdeecet. apcfss.in వెబ్సైట్లను పరిశీలించాలని చెప్పారు. రాష్ట్ర మంత్రి నారాయణ పెనమలూరు: మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, డ్రెయినేజీలు అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ కింద ఉన్న రోడ్లు నిర్మాణానికి రూ.103 కోట్లతో ఆయన మంగళవారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రోడ్లు, డ్రెయిన్లు, వేస్ట్ ఎనర్జీ ప్లా్ంట్స్ ఏర్పాటుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. మొదటి దశగా అన్ని మునిసిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పన చేస్తామన్నారు. ఆ తరువాత పార్కులు, భవనాల నిర్మాణాలు, స్కూల్ ఏర్పాటుకు నిధులు ఇస్తానన్నారు. కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి శుభాష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. గుడివాడరూరల్: అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమె మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.30వేలు అపరాధ రుసుమును విధిస్తూ 11వ జిల్లా అదనపు జడ్జి జి.సుబ్రహ్మణ్యం తీర్పు వెల్లడించినట్లు గుడి వాడ తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు మంగళవారం తెలిపారు. మండలంలోని వలివర్తిపాడు గ్రామానికి చెందిన బల్లవరపు సుధాకర్, సిమ్మతి అనూషను 2013లో వివాహం చేసుకున్నాడు. వివాహం తదనంతరం అదనపు కట్నం కోసం సుధాకర్, అతని కుటుంబ సభ్యులు సుభాషిణి, సుధాంజలి, మేరమ్మ, భాస్కరరావు, ప్రభాకరరావు వేధించడంతో అనూష ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు తన కుమార్తె మృతికి కారణమైన వారిపై తాలూకా పోలీస్ స్టేషన్లో మృతురాలి తల్లి మరియమ్మ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన అప్పటి డీఎస్పీ విచారించి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ పీపీ కంభంపాటి రవి సాక్ష్యాలను న్యాయమూర్తి ముందు సమర్పించడంతో నేరం రుజువు అయ్యింది. దీంతో మృతురాలి ఆత్మహత్యకు కారణమైన భర్త సుధాకర్కు ఐపీసీ–306 సెక్షన్ ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20వేల అపరాధ రుసుము, 498ఐపీసీ కింద రెండేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధించారు. -
సుబ్రహ్మణ్యునికి కిలో వెండి బిస్కెట్లు సమర్పణ
మోపిదేవి: Ý린MýS }Ð]l-ÎÏ-§ól-Ð]l-õܯ]l çÜÐól$™èl çÜ${ºçßæÃ-×ôæÅ-ÔèæÓ-Æý‡-ÝëÓ-Ñ$MìS EĶæÊÅÆý‡$ Ð]l$…yýlÌS… BMýS$¯]l*Æý‡$ {V>Ð]l*°MìS ^ðl…¨¯]l ÐðlÌSVýS-ç³Nyìl ÌS„îSà {ç³Ýë§Šæ MóSi ºÆý‡$OÐðl¯]l 5 Ððl…yìl ¼òÜPr$Ï Ð]l$…VýSâýæ-ÐéÆý‡… çÜÐ]l$-Ç-µ…-^èl$-MýS$-¯é²Æý‡$. E§ýlĶæ$… BÌS-Ķæ*-°MìS ^ólÆý‡$MýS$¯]l² ÐéÆý‡$ ™öË$™èl ÝëిÓÑ$Ðéǰ- §ýlÇØ…-^èl$MýS$° {ç³™ólÅMýS ç³NfË$, AÀõ-ÙMýS… ^ólÔ>Æý‡$. A¯]l…-™èlÆý‡… BÌSĶæ$ yðlç³NÅsîæ MýSÑ$-çÙ-¯]lÆŠ‡ §éçÜÇ }Æ>Ð]l$ Ð]lÆý‡{ç³-Ýë-§ýl-Æ>-Ð]l#MýS$ Ððl…yìl ¼òÜPr$Ï A…§ýl-gôæ-Ô>Æý‡$. §é™èl MýS$r$…º çÜ¿¶æ$Å-ÌS¯]l$ BÌSĶæ$ Ð]l$Æ>Å-§ýl-ÌS™ø çÜ™èlP-Ç…-^éÆý‡$. -
బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి జగనన్న కాలనీ(ఈలప్రోలు)లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ కాలనీ వాసులు కొండపల్లి మునిసిపాలిటీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలు, బకెట్లతో సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసి లక్ష్మీదేవి మాట్లాడుతూ కాలనీలో కనీసం తాగునీరు లేదని ఆరోపించారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. గుంతల రోడ్డులో నడుస్తూ కిందపడి ఆస్పత్రుల పాలవుతున్నట్లు వివరించారు. కనీసం గ్రావెల్ రోడ్లు వేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ దృష్టికి కాలనీ సమస్యలు పలుమార్లు తీసుకెళ్లినా ఆయనలో స్పందన లేదని విమర్శించారు. కాలనీలోని ఇళ్లకు ఇంటి పన్నులు వేస్తే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, పాఠశాల, వైద్యశాల సైతం నిర్మించాలని కోరారు. సీపీఎం సంఘీభావం.. కాలనీ వాసులకు సంఘీభావంగా నిలిచిన సీపీఎం పట్టణ కార్యదర్శి ఎం.మహేష్ మాట్లాడుతూ కొండపల్లి మునిసిపాలిటీలో అనేక రకాల సమస్యలు ఉన్నాయన్నారు. జగనన్న కాలనీలో ప్రధానంగా రోడ్లు, తాగునీరు డ్రెయినేజీ సమస్యలు ఉన్నాయన్నారు. తాగునీటి పైప్లైన్కు గతంలో రూ.10లక్షలు మంజూరు అయినట్లు మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు చెప్పారని, ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. మున్సిపల్ పాలకవర్గం సభ్యులు కాలనీని సందర్శించినప్పటికీ సమస్య పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. మునిసిపాలిటీలో మద్యం ఏరులైపారుతున్నప్పటికీ కృష్ణానది ఒడ్డున ఉన్న కొండపల్లి మునిసిపాలిటీకి తాగునీరు అందించలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కలెక్టర్ లక్ష్మీశ, గత ఆర్డీవో కావూరి చైతన్య, తహసీల్లార్ వెంకటేశ్వర్లుకు కాలనీలో సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు.కొండపల్లి మునిసిపల్ కార్యాలయం వద్ద ప్రజల ఆందోళన -
నీటి భద్రత.. సాగునీటి సంఘాల బాధ్యత
విజయవాడ ఎంపీ శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నీటి వనరుల పరిరక్షణ, సమర్థ వినియోగం, భవిష్యత్ తరాలకు తగిన నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభమైన జలధార–నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా ముందడుగు వేద్దామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి దార్శనికతతో నీటి భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించారని.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పటిష్ట కార్యాచరణతో జల వనరుల పరిరక్షణకు కృషి చేద్దామన్నారు. ఇప్పటికే జల భద్రతకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేద్దామని పేర్కొన్నారు. 100 రోజుల ప్రత్యేక కార్యచరణ.. కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల కార్యక్రమం జరగనుందన్నారు. నీటి సంరక్షణ, భూగర్భ జల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టిసారించి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమీకృత నీటి నిర్వహణ, చెరువులు – కాలువల పునరుద్ధరణ, చెరువుల అనుసంధానం, నీటి సంరక్షణ విధానాలు, పచ్చదనం పెంపొందించడం, గ్రామ నీటి బడ్జెట్ లక్ష్యాలతో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా నీటి వనరుల అధికారి (డీడబ్ల్యూఆర్వో) పి.రామచంద్రరావు, ఈఈ రామకోటయ్య, డీఈ బాబురావు, జల వనరుల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ కిచెన్ల పేరుతో మమ్మల్ని రోడ్డున పడేయొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్మార్ట్ కిచెన్ల పేరుతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుకు అప్పగించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్మార్ట్ కిచెన్ల పేరుతో కార్మికులను రోడ్లపై పడేయొద్దంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పథకాన్ని ప్రైవేటుకు అప్పగించొద్దంటూ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమం జరిగింది. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సుశీల, ఎన్సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక నిర్వహణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ప్రభుత్వ బాధ్యత లేకుండా ప్రైవేటుకు అప్పగిస్తే నాణ్యత లోపిస్తుందన్నారు. ఇప్పటికే ప్రైవేటు సంస్థలైన అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న చోట పిల్లలు చల్లారి పోయిన, చప్పటి భోజనం తినలేక పడేస్తున్నారన్నారు. ప్రధాన డిమాండ్లు ఇవి.. రాష్ట్ర వ్యాప్తంగా కిచెన్ షెడ్లు లేని పాఠశాలలో కిచెన్ షెడ్లు నిర్మించాలని, పథకం అమలుకు మౌలిక సౌకర్యాలు (మంచినీరు, గౌజులు, మాస్కులు, యాప్రాస్) కల్పించాలని, పథకం నిర్వహిస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ. 10వేల వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఒక్కో విద్యార్థికి రూ.20 మెస్ చార్జీలు ఇవ్వాలన్నారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎ. వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు డి.పద్మ, దుర్గాభవానీ, కె. రాజేశ్వరి, కుమారి, సావిత్రి, మహేశ్వరి, దుర్గ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ డిమాండ్ -
కలెక్టరేట్ వద్ద కార్మికుల ధర్నా
మచిలీపట్నంఅర్బన్: కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే పోరాటాలకు సిద్ధమని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్లపల్లి వేణుగోపాలరావు హెచ్చరించారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద భవన నిర్మాణ కార్మికులు సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయకపోతే భవన నిర్మాణ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని స్పష్టం చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని విమర్శించారు. గతంలో అమలులో ఉన్న పెళ్లి కానుక, డెలివరీ బెనిఫిట్, ఆసుపత్రి ఖర్చులు, అంగవైకల్య భత్యం, విద్యా స్కాలర్షిప్, సహజ మరణం, ప్రమాద మరణం, అంత్యక్రియలు, నమోదు కాని ప్రమాద మరణాలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 1 నుంచి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం, చివరికి కేవలం నాలుగు పథకాలకే పరిమితం కావడం భవన నిర్మాణ కార్మికులకు చేసిన ఘోర మోసమని మండిపడ్డారు. వెల్ఫేర్ బోర్డులో వేల కోట్ల రూపాయల నిధులు నిల్వ ఉన్నప్పటికీ, కార్మికులకు కనీస భద్రత కూడా కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో ప్రమాద మరణానికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం వివాహ కానుక, ప్రసవ కానుక, సహజ మరణం, మట్టి ఖర్చులకే పరిమితం చేయడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. అర్హులైన కార్మికుల నుంచి స్వీకరించిన అన్ని అప్లికేషన్లకు సంబంధించిన క్లెయిమ్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా క్లెయిములు అమలు కాకపోవడంతో అనేక మంది కార్మికులు వెల్ఫేర్ బోర్డులో రెన్యూవల్స్ చేయించుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త సభ్యత్వాలు చేపట్టి, గతంలో సభ్యులుగా ఉండి రెన్యూవల్ గడువు ముగిసిన వారికి మళ్లీ అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజనాల సురేష్, కోశాధికారి వేము పెదబాల, సీఐటీయూ నాయకులు జయరావు, చంద్రపాల్, మీరావలి, టి.నాగ, ఆర్.కొండ, కె.రాణి, పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. -
అతలాకుతలం
‘అకాల’ దెబ్బకు అకాల వర్షంతో రబీసాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న నేలవాలి తీవ్రంగా నష్టపోయిన రైతులకు సోమవారం మధ్యాహ్నం సమయంలో తీవ్ర పెనుగాలులతో కూడిన వర్షం కురవడంతో కోతలు పూర్తయి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాల్లో 4,496హెక్టార్లలో రబీ మొక్కజొన్న సాగవుతుండగా, 31,790టన్నుల మొక్కజొన్నలు దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అయితే ఇప్పటికే ఎనభైశాతం కోతలు పూర్తి కల్లాల్లో ఆరబోసి ఉండడంతో వర్షానికి తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు మండలాల్లో 250వరకు ఇటుక బట్టీలను నిర్వహిస్తుండగా వర్షం దెబ్బతో రూ.కోట్లల్లో నిర్వాహకులు నష్టపోయారు. అలాగే మామిడి కోతలు కోసే సమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణాజిల్లా హనుమాన్జంక్షన్లో మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. – జి.కొండూరు/హనుమాన్జంక్షన్ రూరల్ -
ప్రారంభమైన పదో తరగతి ‘స్పాట్’
నల్ల రిబ్బన్లతో స్పాట్కు హాజరైన ఉపాధ్యాయులు మచిలీపట్నం అర్బన్: ఉపాధ్యాయులు నిబద్ధతతో, పారదర్శకంగా తమ బాధ్యతలను నిర్వహించడంతో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. సోమవారం లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్పాట్ వాల్యుయేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పర్యవేక్షణలో మొత్తం 763 మంది ఉపాధ్యాయులు పాల్గొని జవాబుపత్రాలను మూల్యాంకనం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కచ్చితత్వంతో పాటు సమయపాలనకు ప్రాధాన్యతనిస్తూ మూల్యాంకనం కొనసాగుతోందని తెలిపారు. కేంద్రంలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. నల్ల బ్యాడ్జీలతో ఫ్యాప్టో నిరసన.. ఉపాధ్యాయులు, పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన వ్యక్తం చేశారు. -
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
‘మీ కోసం’లో కలెక్టర్ డీకే బాలాజీమచిలీపట్నంఅర్బన్: ‘మీ కోసం’ కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీదారునికి శాశ్వత పరిష్కారం అందేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ కోసం’ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్, డీఆర్ఓ కె. చంద్రశేఖరరావు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతు రాజు, బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ధర్మేంద్రతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. యంత్రాంగం ప్రధాన బాధ్యత ఇదే.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆశతో కలెక్టరేట్కు వస్తారని, అందువల్ల ప్రతి అర్జీని సున్నితంగా, బాధ్యతతో, మానవతా దక్పథంతో పరిశీలించాలని సూచించారు. కేవలం అర్జీ స్వీకరణతో సరిపెట్టకుండా సమస్య స్వభావాన్ని అర్థం చేసుకుని, ఫీల్డ్ స్థాయిలో పరిశీలన జరిపి, సమగ్రంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, జాప్యం లేదా నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ నిఖిల, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఎన్. పద్మావతి, జె. జ్యోతి, డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజు, జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి. శివరాం ప్రసాద్, డీఎస్ఓ జి. మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. -
రైలులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణంలో గర్భిణికి నొప్పులు రావటంతో తక్షణమే స్పందించిన మహిళా టీటీఐ అందుబాటులో ఉన్న ఇతరుల సహకారంతో రైలులోనే సుఖప్రసవం చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలివి.. ఆదివారం అలప్పుజ–ధన్బాద్ ఎక్స్ప్రెస్ (13352)లో బీ1 కోచ్లో తన కుటుంబంతో కలసి గర్భిణి ప్రయాణిస్తోంది. రైలు అన్నవరం స్టేషన్ దాటిన కొద్ది సేపటికే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు విధుల్లో ఉన్న మహిళా టీటీఐ జి.జ్యోతికి విషయం చెప్పారు. వెంటనే ఆమె స్పందించి కమర్షియల్ కంట్రోలర్తో సమన్వయం చేసుకుంటూ, వైద్యుల సూచనలను పాటిస్తూ అందుబాటులో ఉన్న మహిళల సహకారంతో గర్భిణికి ప్రసవం చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రైలును యలమంచిలి స్టేషన్లో అత్యవసరంగా నిలిపివేసి 108లో తల్లి, బిడ్డను యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారు ఆరోగ్యంగా ఉన్నారు. దీనికి సహకరించిన మహిళా టీటీఈ, సీనియర్ సీసీటీసీ బిపుల్కుమార్, జుబేర్ ఖాన్లను రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా అభినందించారు. -
కొనుగోలు–అమ్మకందారుల మేళాకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడలో ఈ నెల 9, 10 తేదీలలో నిర్వహించనున్న కొనుగోలుదారులు–అమ్మకందారుల సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే అంశంపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించే ఉద్దేశంతో విజయవాడ గాంధీనగర్లోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ పథకాల ద్వారా అనేక మంది మహిళలకు బ్యాంకు రుణాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఒక ప్రోమో వీడియోను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. జిల్లాలోని హోల్సేల్, రిటైల్ వ్యాపారులు ఈ సమ్మేళనంలో పాల్గొని మహిళలు తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తులను పరిశీలించి ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. మహిళా వ్యాపారవేత్తలకు ఇచ్చే ఒక్క ఆర్డర్ వారి జీవితాలను మార్చగలదని, అందువల్ల వారిని ప్రోత్సహించాలని అన్నారు. గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, డీఐసీ జీఎం వెంకటరావు, ఉద్యాన అధికారి జె.జ్యోతి, వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ సౌమ్య, ఆహార తనిఖీ అధికారి గోపాలకృష్ణ, ప్రొబేషనరీ డెప్యూటీ కలెక్టర్ నిఖిలశ్రీ , ఏడీఐఓ సెల్వినా తదితరులు పాల్గొన్నారు. -
ఈత పోటీల్లో జిల్లా చాంపియన్గా డీఎస్ఏ ఘన విజయం
జగ్గయ్యపేటఅర్బన్: జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ సహకారంతో ఈనెల 5 వ తేదీన పేటలోని మున్సిపల్ స్విమ్మింగ్ పూల్లో నిర్వహించిన డీఎస్ఏ స్విమ్మింగ్ చాంపియన్స్– 2026 పోటీలలో జగ్గయ్యపేటకు చెందిన డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్(డీఎస్ఏ) ఘన విజయం సాధించి ఎన్టీఆర్ జిల్లా చాంపియన్ షిప్ను కై వసం చేసుకుంది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం 19 జిల్లాలకు చెందిన 215 మంది స్విమ్మర్లు పాల్గొన్నారు. 25 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయస్సు గల క్రీడాకారులు పాల్గొనడం విశేషం. ఇందులో 52 శాతం మహిళలు పాల్గొనడం గమనార్హం. ముఖ్యంగా 87 ఏళ్ల వయస్సు గల ఒక మహిళ స్వర్ణ పతకం గెలుచుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా నుంచి 31 మంది మహిళలు, 40 మంది పురుషులు కలిసి మొత్తం 66 మంది పాల్గొని 101 స్వర్ణ పతకాలు, 56 రజత పతకాలు, 52 కాంస్య పతకాలు కలిపి మొత్తం 209 పతకాలు సాధించారు. దీనిలో జగ్గయ్యపేట డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ నుంచి 26 మంది మహిళలు, 13 మంది పురుషులు మొత్తం 39 మంది పోటీలలో పాల్గొని 78 స్వర్ణ, 34 రజత, 25 కాంస్యం కలిపి మొత్తం 137 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన బహుమతి ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం తేజస్వి పొడపాటి మాట్లాడుతూ 85 ఏళ్లు పైబడిన మహిళలు కూడా పాల్గొని పతకాలు సాధించడం తనకు ప్రేరణ ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లెల సీతమ్మ, మున్సిపల్ కమిషనర్ డీటీవీ కృష్ణారావు, సీఐ పి.వెంకటేశ్వర్లు, డీఎస్ఏ నిర్వహణ కమిటీ, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
డ్రగ్స్ కేసులో దొరికితే జీవితం నరకమే
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): డ్రగ్స్పై దండయాత్ర అంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటున్నారని.. డ్రగ్స్ కేసులో దొరికితే సహించేది లేదని.. చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. వాంబేకాలనీలోని వీఎంసీ కల్యాణమండపంలో ‘డ్రగ్స్పై దండయాత్ర 2.0’ కార్యక్రమం సోమవారం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్పై సైకిల్ యాత్ర మంచి ప్రభావం చూపిందన్నారు ఇప్పటి వరకు ప్రేమతో చెప్పాం.. బతిమాలి చెప్పి చూశాం.. ఇంకా మార్పు రాకపోతే ఈసారి తప్పకుండా దండించి తీరుతామన్నారు. డ్రగ్స్ మహమ్మారి ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా వారి కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లానే ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తుందని.. అందుకే ప్రత్యేక కిట్లతో ఈ డ్రగ్స్ పరీక్షలను పోలీసులు, వైద్యుల సమక్షంలో జరుపుతున్నామన్నారు. డ్రగ్స్ తీసుకొని ఆరు నెలల సమయం గడిచినా కూడా ఈ పరీక్షల్లో కనిపిస్తుందని చెప్పారు. 149 హాట్ స్పాట్లు.. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 149 హాట్ స్పాట్స్లను గుర్తించామని ఈ హాట్ స్పాట్స్లలో 30 రోజుల పాటు 3000 డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ద్వారా రోజుకు 100 మంది చొప్పున డ్రగ్స్ టెస్ట్ చేస్తామన్నారు. స్వచ్ఛందంగా వచ్చి తనిఖీ చేసుకున్న వారిలో పాజిటివ్ వస్తే వారిని అడిక్షన్ సెంటర్కు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. డ్రగ్స్పై దండయాత్ర కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రచార వాహనాలను జెండా ఊపి వారు ప్రారంభించారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, డ్రగ్ కంట్రోల్ ఏడీ శ్రీరామ్మూర్తి, డీఎంహెచ్ఓ సుహాసిని, డీసీపీలు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ‘మీకోసం’
కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మీకోసం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. వృద్ధులు, వికలాంగులతో మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎస్పీ మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరికొన్ని అర్జీలను ఫోన్లలో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అన్యాయానికి గురైన బాఽధితులకు న్యాయం చేయటమే పోలీసుల కర్తవ్యమని అన్నారు. మీకోసంలో అందిన ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపుతామన్నారు. న్యాయం కోసం వచ్చే బాధితుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా మసలుకోవాలన్నారు. మీకోసంలో 35 అర్జీలు అందినట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిలుకూరు(ఇబ్రహీంపట్నం): గేదెలు కాసేందుకు వెళ్లిన వ్యక్తి తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మేతకు వెళ్లిన గేదెలు సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి రాగా, వాటిని తోలుకెళ్లిన యజమాని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ముళ్ల పొదల మాటున ఓ ప్రాతంలో ముఖం, శరీరంతో పాటు ప్రైవేట్ పార్ట్ల వద్ద గాయాలతో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. అతని పక్కన పెద్దసైజు బండ రాళ్లు ఉండటంతో రాళ్లతో కొట్టి చంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సేకరించిన వివరాల మేరకు మండలంలోని చిలుకూరు గ్రామానికి చెందిన గుడిశ అమరలింగేశ్వరావు(48) కుటుంబ పోషణ కోసం లారీ డ్రైవర్గా పనిచేస్తూనే గేదెలను పెంచుతుంటాడు. ప్రతిరోజు అతని భార్య గేదెలను మేతకు తోలుకెళ్తుంటుంది. ఆమెకు వేరే పని ఉండటంతో సోమవారం ఆమె భర్త అమరలింగేశ్వరరావు గేదెలు తోలుకెళ్లాడు. సాయంత్రం గేదెలతో పాటు అతను ఇంటికి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని ముళ్లపొదల్లో గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న గంజాయి బ్యాచ్ హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, యుక్త వయస్సు వచ్చిన ఇద్దరు కుమారులు ఉన్నారు. జి.కొండూరు: మండలంలోని భీమవరప్పాడు గ్రామానికి చెందిన ట్రాక్టరు కోడూరు వైపు నుంచి వస్తూ టైరు పగలడంతో అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో ట్రక్కు మాత్రమే పక్కకి బోల్తాపడి ఇంజిన్ పడకపోవడంతో ట్రాక్టరు నడుపుతున్న రాము అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ట్రాక్టరు ట్రక్కులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
కార్పొరేషన్ ఉద్యోగి అనుమానాస్పద రీతిలో మృతి
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విజయవాడ కార్పొరేషన్ ఉద్యోగి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై కొత్తపేట పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ రూరల్ మండలం అంబాపురానికి చెందిన సవలం విఠల్ కిషోర్, సాయినాగ రేణుక భార్యభర్తలు. విఠల్ కిషోర్(34) విజయవాడ నగర పాలక సంస్థలో చెత్త లారీ డ్రైవర్గా ఉద్యోగం చేస్తుంటాడు. ఈ నెల 4వ తేదీన విఠల్ కిషోర్ ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లి తిరిగి రాలేదు. మధ్యాహ్నం విఠల్ కిషోర్కు భార్య ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిని విచారించినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం బంధువు కొర్రపాటి గాంధీ ఫోన్ చేసి పాముల కాల్వ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని చెప్పాడు. దీంతో పాముల కాల్వ వద్దకు చేరుకున్న రేణుక బంధువుల సాయంతో ఆ మృతదేహాన్ని పరిశీలించి అది తన భర్త విఠల్ కిషోర్దిగా గుర్తించారు. దీంతో ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి చర్యలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి శాప్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్దిడానికి ఖేలో ఇండియా నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), విజయవాడ నగర పాలక సంస్థ సంయుక్తంగా పనులు చేపట్టనున్నారు. ఈ స్టేడియంలో వివిధ క్రీడాంశాలకు సంబంధించిన కోర్టులను నిర్మాణం చేయడానికి గాను రూ.60 కోట్ల విలువైన పనులను చేయాలని శాప్ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించారు. ఈ అభివృద్ధి పనులకు ఖేలో ఇండియా నుంచి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. ఈనెల 8వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. మూడు దశలు... రూ.60 కోట్లతో పనులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని రూ.60 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.20 కోట్లను ఖేలో ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన రూ.40 కోట్లను శాప్, విజయవాడ నగరపాలక సంస్థ ఖర్చు చేయనున్నాయి. మొదటి దశలో స్టేడియం లోపలి భాగంలో ఫుట్బాల్ గ్రీన్ ఫీల్డ్ కోర్టు, 4–టెన్నిస్ కోర్టులు, 2–వాలీబాల్ కోర్టులు, 2–బాస్కెట్ బాల్ కోర్టులు, హ్యాండ్బాల్ కోర్టులు, 400, 200 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్స్ నిర్మాణం చేస్తారు. రెండో దశలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, మూడో దశలో పరిపాలన భవనాలు, జిమ్తో పాటుగా ఫిజియోథెరఫీ సెంటర్ నిర్మాణం చేయనున్నారు. మొదటి దశ పనులకు సంబంధించి బుధవారం భూమి పూజ జరుగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం స్థలం కార్పొరేషన్ ఆధీనంలో ఉండటంతో కార్పొరేషన్తో శాప్ ఒప్పందం చేసుకుని కార్పొరేషన్, శాప్ సంయుక్తంగా ఈ పనులను చేపట్టనున్నాయి. -
జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శేషగిరిరావు
మైలవరం: ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వై.శేషగిరిరావు ఎన్నికయ్యారు. మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇండోర్ స్టేడియంలో సోమవారం ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా ఐ.మురహరి వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వై.శేషగిరిరావు, ఉపాధ్యక్షులుగా ఆర్.రమేష్, ఎస్.సుబ్బారావు, కార్యదర్శి పి.బుజ్జి(ఏకగ్రీవం), సంయుక్త కార్యదర్శులుగా ఎల్.సతీష్ వర్మ, కె.రవిశంకర్, కోశాధికారిగా బి.చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా వై.హేమాంబిక, ఎం.మాధవీలత, బి.భారతి ఎన్నికయ్యారు. ఎన్నిక తదనంతరం జనరల్ బాడీ సమావేశంలో పది క్లబ్ ప్రతినిధులు, గౌరవ అధ్యక్షుడిగా పి.అజయ్కుమార్, చైర్మన్గా రానాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కోఆప్షన్ సభ్యులుగా బి.ప్రేమ్ తేజా, మౌనిక, హర్షలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 33 శాతం సీ్త్రలకు, 25 శాతం క్రీడా సంబంధిత వ్యక్తులను అసోసియేషన్ ద్వారా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి మురహరి తెలిపారు. కంకిపాడు: జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం...విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న సిమెంటు లోడు లారీ కంకిపాడు బైపాస్ మార్గంలోకి రాగానే లారీ టైరు పంక్చర్ అయ్యింది. దీంతో లారీ డ్రైవరు లారీని నిలిపివేశాడు. ఇదే మార్గంలో కంకరు లోడుతో వెళ్తున్న టిప్పరు సిమెంటు లోడు లారీని వెనుకగా వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో టిప్పరు ఇంజిను భాగం పూర్తిగా ధ్వంసమైంది. లారీ డ్రైవరు కేబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సుమారు అరగంట పాటు కష్టపడి కేబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవరును అతికష్టం మీద బయటకు లాగారు. గాయాలపాలైన డ్రైవరు ఘంటసాల మండలం అచ్చంపాలెంకు చెందిన తుమ్మపూడి నవీన్ (32)ను 108 అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. స్థానిక పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. -
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చిట్టూరు గ్రామానికి చెందిన జి. వెంకటరమణ, పార్వతీ దంపతులు సోమవారం రూ. 1,00,116 విరాళంగా సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. చల్లపల్లి: ఇటీవల చల్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న పోలీసులను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మార్చి 31వ తేదీన పోలీస్ స్టేషన్లో మందుగుండు సామగ్రి తరలిస్తుండగా అట్టపెట్టెలో నుంచి ఉల్లి బాంబులు జారిపడి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదంలో ఎస్ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా, ఎస్ఐ కార్ డ్రైవర్ డి.నాగరాజు తీవ్రంగా గాయపడగా వారిని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు హోమ్ మంత్రి అనితకు వివరించారు. అనంతరం ఆమె వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం అండగా ఉంటుందని గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం బంగారు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. విజయవాడ ఆచార్యరంగానగర్కు చెందిన జి.శరత్బాబు కుటుంబం సుమారు 22 గ్రాముల బంగారంతో తయారు చేయించిన రెండు మంగళ సూత్రాలను ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్పై కారు దగ్ధం వన్టౌన్(విజయవాడపశ్చిమ): పోలీసు శాఖకు చెందిన ఒక కారు నుంచి మంటలు చెలరేగిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కార్యాలయం ఉండేది. అయితే ఆ కార్యాలయాన్ని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం అమరావతికి తరలించింది. దాంతో పాత కార్యాలయం ప్రాంగణంలో ఉన్న వాహనాలను సైతం సిబ్బంది అమరావతికి తరలిస్తున్నారు. ఆ క్రమంలో అక్కడి నుంచి ఒక కారును అమరావతికి తరలిస్తుండగా కనకదుర్గ ఫ్లైఓవర్ పైన హెడ్ వాటర్ వర్క్స్ సమీపానికి వచ్చిన సమయంలో అందులో నుంచి మంటలు చెలరేగాయి. దాంతో అందులో ఉన్న డ్రైవర్ అప్రమత్తమై కారును నిలిపివేసి పక్కకు వచ్చేశాడు. అనంతరం అగ్నిమాపక శాఖకు, ఉన్నతాధికారులకు సమాచారమందించాడు. అగ్నిమాపక శాఖ వాహనం అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసింది. -
తాగు, సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలి
కోనేరుసెంటర్: రాబోయే రోజుల్లో తాగు, సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత నీటి సంఘాలు, ప్రజలపై ఉందని రాష్ట్ర గనులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి బందరు మండలంలోని పొట్లపాలెం గ్రామ పంచాయతీలోని కొత్తపూడి గ్రామ చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని చెరువులను గుర్తించి అందులో పూడిక తీత పనులను చేపట్టాలన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ చెరువుల్లో నీటిని నింపుకోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాల మట్టం పెరుగుతుందన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని నీటిని నిలువ చేసుకొని శుద్ధిచేసి పొదుపుగా ప్రతి ఇంటికి సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శివప్రసాద్, జలవనరుల శాఖ ఎస్ఈ గుణకర్, భూగర్భ జల శాఖ డీడీ బిందుశ్రీ, జలవనరుల శాఖ ఈఈ రవికిరణ్, డీఈఈ అపర్ణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ సుధాకర్, ఏఈ సుగుణ, తహసీల్దారు నాగభూషణం, డెప్యూటీ ఎంపీడీవో బాలకృష్ణరావు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, జిల్లా నీటి సంఘాల అధ్యక్షుడు దేవన బోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ గణేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, స్థానిక నాయకులు, పలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఏపీలో పంచాయతీ కార్యదర్శులకు కూటమి సర్కార్ బిగ్ షాక్
సాక్షి,విజయవాడ: ఏపీలో పంచాయతీ కార్యదర్శులకు కూటమి సర్కార్ బిగ్ షాకిచ్చింది. జీవో నెం 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించింది. గతంలో పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్ రూ.28280 ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25220కి తగ్గించింది. పేస్కేల్ తగ్గిస్తూ జీవో నెంబర్.91ను సవరణ చేసింది. అయితే కూటమి సర్కార్ తీరుపై పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పోరాటం తప్పదని పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. -
ఆరుగురు మిత్రులు.. చోరీల్లో దిట్టలు
గూడూరు: వారు ఆరుగురు స్నేహితులు. 19 నుంచి 22 ఏళ్లలోపు వారే.. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఫెయిలై చదువుకు దూరమయ్యారు. చెడు వ్యవసనాలకు అలవాటు పడి, అందుకు అవసరమైన డబ్బు కోసం చోరీల బాట పట్టారు. చివరికి పోలీసులకు చిక్కారు. గూడూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు వివరాలను బందరు ఇన్చార్జి డీఎస్పీ కె.ధర్మేంద్ర ఆదివారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు.. గూడూరు మండలం మల్లవోలుకు చెందిన షేక్ అస్కర్, జాన్ వెస్లీ, పోలవరం గ్రామానికి చెందిన మువ్వల లీలాధర్, పెండ్ర దుర్గారావు, బులసర కోట నాగవెంకట సాయి, గుమ్మడి రాహుల్ దాదాపు ఒకే వయస్సు యువకులు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఫెయిలై ఇంటిపట్టునే ఉంటూ జల్సాలు, ఆకతాయి తిరుగుళ్లకు అలవాటు పడ్డారు. తమ అవసరాలకు కష్టపడకుండా డబ్బులు సమకూర్చడం కోసం చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. మల్లవోలు, పోలవరం, పెడన, విజయవాడ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. పగలు ద్విచక్రవాహనాలపై గల్లీల్లో తిరగటం, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించడం, తర్వాత రెక్కీ నిర్వహించి ఆ ఇళ్లలోకి చొరబడి దొరికినంతా దోచుకెళ్లడం చేసేవారు. ఏడాదిన్నర కాలంలో ఎనిమిది చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. తీగలాగితే డొంక కదిలింది.. మల్లవోలు, పోలవరం గ్రామాల్లో ఇటీవలి కాలంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. వీటిని సీరియస్గా తీసుకున్న గూడూరు ఎస్ఐ చల్లపల్లి దివ్య ప్రకాష్ ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. దొంగతనాలు జరిగిన ఇళ్లలో వేలిముద్రలు సేక రించి, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి, గతంలో చోరీలకు పాల్పడిన వారిని విచారిస్తూ కేసు దర్యాప్తు సాగించారు. ఈ నేపథ్యంలో ఆరుగురు స్నేహితుల్లో ఇద్దరు ఓ ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఆ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా ఆరుగురు చేసిన చోరీలు వెలుగు చూశాయి. సాంకేతికంగా కూడా ఆధారాలు సేకరించి ముఠాలో ఆరుగురు స్నేహితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 99.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 437 గ్రాముల వెండి వస్తువులతో పాటుగా మూడు మోటారు సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను పట్టుకోవడంలో చాకచ క్యంగా వ్యవహరించిన పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్, గూడూరు ఎస్ఐ చల్లపల్లి దివ్య ప్రకాష్, పెడన ఎస్ఐ షేక్ బషీర్, సీసీఎస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు. -
కోర్టు ఆర్డర్ ఉంటే చూపించండి
మచిలీపట్నంటౌన్: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సంస్కారం మరచి తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇల్లు కూల్చివేయాలని కోర్టు ఆర్డర్ ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. స్థానిక రామానాయుడుపేటలో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి కృష్ణమూర్తి మరణంపై అబద్ధాలు వల్లెవేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తన తండ్రి అనారోగ్యం పాలైతే హైదరాబాద్, చైన్నె వంటి నగరాల్లోని ఆస్పత్రుల్లో నెలల పాటు వైద్యం చేయించానని గుర్తుచేశారు. తన తండ్రి తుదిశ్వాస విడిచేవరకు తాను, తన మరో తల్లి విక్టోరియమ్మ ఆయన్ను అంటిపెట్టుకుని ఉన్నామన్నారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా ఆయన అనారోగ్య కారణాల రీత్యా తాను డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. ఎన్నికల ప్రచారం కూడా తానే ఎక్కువగా నిర్వహించానన్నారు. కానీ తాను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని కొల్లు రవీంద్ర దిగజారి మాట్లాడితే తాను వివరణ ఇవ్వడం తన కర్మగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పరామర్శించడంలో తప్పేముంది కొబ్బరి తోటలో జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇల్లు కూల్చివేయాలని కోర్టు ఆర్డర్ ఉందని కొల్లు రవీంద్ర అంటున్నారని, ఆర్డర్ను కమిషనర్ ద్వారా చూపించాలని పేర్ని నాని సవాల్ విసిరారు. కోర్టు ఆర్డర్ ఉంటే వారు చెప్పే ఏ శిక్షకై నా తాను సిద్ధమని స్పష్టంచేశారు. ఆర్డర్ లేకుంటే ఏ శిక్షకై నా సిద్ధమేనా అని రవీంద్రను ప్రశ్నించారు. రూ.45 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన గృహాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తే బాధితులు ఫోన్ చేయగా తాను అక్కడికి వెళ్లానన్నారు. బాధితులను పరామర్శించడంలో తప్పేముందని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్న 2015–16 కాలంలోనే ఈ స్థలానికి ఖాళీ స్థలం పన్నులు వేశారని, 2024లో భవనాలు నిర్మించా రని, అయితే అవి తన హయాంలో జరిగినట్లుగా అవాస్తవాలు చెప్పడం సరికాదని హితవు పలికారు. బినామీ ఆస్తులు లాక్కోండి తనకు బినామీ ఆస్తులు ఉన్నాయని విమర్శిస్తున్నా రని, బినామీ ఆస్తుల చట్టం ప్రకారం వాటిని లాక్కోవచ్చుగా అని పేర్ని నాని ప్రశ్నించారు. నగరంలోని పోలీస్ కాంప్లెక్స్, పోలీస్ కల్యాణ మండపం, ఇలా పలు కట్టడాలకు అనుమతులు లేవని వాటిని కూల్చే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. నగరంలో ఏఏ భవనాలకు అనుమతులు లేవో జాబితా ఇస్తానని, దమ్మూ ధైర్యం ఉంటే వాటిని కూల్చాలని సూచించారు. చేపల మార్కెట్ సమీపాన, బందరు కోట ప్రాంతాల్లో మంత్రి రవీంద్ర నిర్మిస్తున్న భవనాలకు అనుమతులు లేవని, వాటిని కూడా కూల్చే స్తారా అని ప్రశ్నించారు. బందరుకోట స్థలానికి అసలు లింకు డాక్యుమెంట్లే లేవని, ఈ స్థలంలో అక్రమ భవనాన్ని ఎలా నిర్మిస్తున్నారని నిలదీశారు. ప్రధాన రహదారితో పాటు చిలకలపూడిలో రోడ్డు విస్తరణను స్థల యజమానులను ఒప్పించి చేయిస్తే దానిపై కూడా విమర్శలు చేయటం ఎంతవరకు సబబన్నారు. ప్రధాన రహదారిలో కల్పన టెక్స్టైల్ యజమాని గాంధీని రోడ్డు విస్తరణకు స్థలం ఇవ్వా లని తాను పలుమార్లు కలిసి బతిమిలాడానని, అయినా ఆయన ససేమిరా అనడంతో కోర్టు ఆదేశాల ప్రకారం రోడ్డుకు అవసరమైన మేర స్థలం తీసుకున్నామని గుర్తుచేశారు. తాను 2004 నుంచి 2014 వరకు, 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉండి బందరుకు కృష్ణ యూనివర్సిటీ, నర్సింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, పోర్టు మెడికల్ కళాశాల, ఫిషింగ్ హార్బర్ ఇలా ఎన్నో ప్రాజెక్టులు తీసుకువచ్చానని, పలు కాలనీల్లో రహదారులన్నీ అభివృద్ధి చేశానని వివరించారు. రవీంద్ర హయాంలో ఏ ప్రాజెక్టు తీసుకువచ్చారో ప్రజలకు చెప్పగలరా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులన్నీ తాను కృషి చేయకుంటే గాలికి వచ్చాయా అని ఎద్దేవాచేశారు. జల్లూరి గోపిని విజయవాడ పిలిపించి బెదిరించి ఆయన స్థలాన్ని లాక్కోలేదా అని ప్రశ్నించారు. విజయవాడలో ఆరు టీవీ చానళ్లు మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో ఆరు టీవీ చానళ్లు నడుపుతున్నారని, నెలకు రూ.85 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఆ మొత్తానికి సంబంధించి బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా అని పేర్ని నాని ప్రశ్నించారు. తన తల్లి విక్టోరియమ్మ ఆస్తుల విక్రయాల సమయంలో తానే సాక్షి సంతకాలు సైతం చేశానని పేర్ని నాని తెలిపారు. తల కిందులుగా తపస్సు చేసినా తనను వేలెత్తి చూపలేవని కొల్లు రవీంద్రకు హితవు పలికారు. తానేంటో తన నైజం ఏంటో కార్యకర్తలను ఎలా చూసుకుంటానో టీడీపీ కార్యకర్తలనే అడిగి తెలుసుకోవాలని సూచించారు. నిజాలు మాట్లాడితే తప్పు లేదని, కుసంస్కారంతో నీచంగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా కోశాధికారి బందెల డేవిడ్ థామస్నోబుల్, నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. -
డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ ప్రారంభోత్సవం
భవానీపురం(విజయవాడపశ్చిమ): సమాజం ద్వారా పొందిన జ్ఞానాన్ని, సహాయాన్ని తిరిగి అదే సమాజానికి అందించాలన్న మహనీయుల మాటలను స్ఫూర్తిగా తీసుకుని పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఎస్కేపీవీవీ గ్రూప్ యాజమాన్యం అభినందనీ యులని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఎస్కేపీవీవీ హిందూ హై స్కూల్స్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ జక్కంపూడి వైఎస్సార్ కాలనీ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎస్కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ.. ఆరున్నర ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ హై స్కూల్ విద్యలవాడగా పేరొందిన విజయవాడకే తలమానికంగా నిలుస్తుందన్నారు. ఈ హై స్కూల్ నిర్మాణానికి భూరీ విరాళం ఇచ్చిన డోకుపర్తి ఉపేంద్రను అభినందించారు. హిందూ హై స్కూల్స్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు టి. శేషయ్య, గోపిశెట్టి మల్లయ్య మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతివర్గాల విద్యార్థులకు తక్కువ ఫీజులతో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈ పాఠశాలను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మీరా, హిందూ హై స్కూల్స్ కమిటీ ట్రెజరర్ గోళ్ల బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారా యణరావు, స్కూల్ ఇన్చార్జ్ సెక్రటరీ డాక్టర్ టి.శ్రీనివాసు, స్కూల్ ప్రిన్సిపాల్ పి.శ్యామల, కమిటీ సభ్యుడు వేముల హజరతయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డోకుపర్తి ఉపేంద్ర దంపతులను సత్కరించారు. -
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి బాబూజగ్జీవన్రామ్ అని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు పేర్కొన్నారు. భారత ఉపప్రధాని బాబూజగ్జీవన్రామ్ జయంతిని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్న జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిమ్నజాతుల అభ్యున్నతికి జగ్గీజవన్రామ్ కృషి మరువలేనిదన్నారు. విద్యార్థి దశ నుంచే అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలను పటాపంచలు చేసిన మహోన్న తుడని పేర్కొన్నారు. క్విట్ ఇండియా, శాసనోల్లంఘన ఉద్యమాల్లో సైతం మహాత్మగాంధీతో కలిసి అడుగులు వేసి ముందుకు సాగారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలోని సర్కారుతోటలో చోరీ జరిగింది. పోలీ సులు రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిలకలపూడి పోలీసుల కథనం మేరకు.. సర్కారుతోటకు చెందిన మోతుకూరి లలిత మచిలీపట్నం మండల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆప రేటర్గా పనిచేస్తున్నారు. లలిత తన తల్లితో కలిసి శనివారం ఇంటికి తాళం వేసి విజయవాడ వెళ్లారు. ఆదివారం ఉదయం పక్కింటి వారు లలితకు ఫోన్ చేసి వారి ఇంటి తలు పులు తెరచి ఉన్నట్లు చెప్పారు. దీంతో ఆమె హుటాహుటిన మచిలీపట్నంలోని ఇంటికి చేరుకున్నారు. బీరువా తలుపులు తెరచి ఉండటంతో పాటు, రూ.20 వేల నగదు, గాజులు, ఉంగరం, రూపులు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించిన లలిత చిలకలపూడి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మైలవరం మండలం పుల్లూరులోని చిలుకూరువారిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాకు చెందిన దేవావతు రవి (30) ద్విచక్రవాహనంపై మైలవరం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు సెంటర్ సమీపంలో ఉన్న చిలుకూరువారిగూడెం జెడ్పీ హైస్కూల్ వద్దకు వచ్చే సమయానికి మైలవరం నుంచి తిరువూరు వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొని రవి రహదారిపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవిని స్థాని కులు 108 వాహనంలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. సంఘనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


