breaking news
Krishna
-
వైఎస్ జగన్ పర్యటన సక్సెస్.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు.మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసు పెట్టారు. అంతేకాకుండా డ్రోన్ వీడియోల ఆధారంగా మరికొందరిపైన కూడా కేసులు పెడతామని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.ఇక, అంతకుముందు.. వైఎస్ జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్కు దిగారు.జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, వైఎస్సార్సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.అడ్డుకున్న పోలీసులు.. తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి వరికోటి అశోక్బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు. -
9న హరివిల్లు చిత్రకళా పోటీలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో హరివిల్లు చిన్నారుల రంగుల పండుగ పేరుతో చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నామని ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ అధ్యక్షుడు అనుమకొండ సునీల్కుమార్ అన్నారు. గవర్నర్పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో పండుగకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ చిత్రకళా పోటీలు మూడు విభాగాల్లో జరుగుతాయని, ప్రవేశం ఉచితమన్నారు. సాయంత్రం 3.30 నుంచి 5.30 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. సబ్ జూనియర్స్ విభాగంలో 3,4,5 తరగతుల విద్యార్థులకు మీకు నచ్చిన చిత్రం అనే అంశంపై, జూనియర్స్ విభాగంలో 6,7 తరగతులకు నచ్చిన సంప్రదాయ క్రీడ అనే అంశంపై, సీనియర్స్ విభాగంలో 8,9,10 తరగతులకు నచ్చిన సైన్స్ ఆవిష్కరణ అనే అంశంపై పోటీలు జరుగుతాయని వివరించారు. పోటీల అనంతరం మ్యాజిక్ షో, తరువాత బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. పోటీలలో పాల్గొనాలనుకునే వారు ఈ నెల 7వ తేదీ లోపు 9347950085 నంబర్కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఉపాధ్యక్షుడు ఎ.గిరిధర్, కోశాధికారి రమేష్, సంధ్య, సౌజన్య, సుధారాణి, శ్రావణ్, సుష్మ తదితరులు పాల్గొన్నారు. -
బూడిద లోడింగ్ను అడ్డుకున్న లారీ ఓనర్లు
ఇబ్రహీంపట్నం: ఖిల్లా రోడ్డులోని బూడిద చెరువు వద్ద బూడిద లోడింగ్ పనులను లారీ ఓనర్లు అడ్డుకున్నారు. స్థానిక లారీ ఓనర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు లారీలకు లోడింగ్ ఆపివేయాలని కోరుతూ మంగళవారం ఆందోళనకు దిగారు. లారీ ఓనర్లకు తోడుగా టీడీపీ నాయకులు జత కలవడంతో లోడింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న రెఫెక్స్ సంస్థ ప్రతినిధులు ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు. ఈ ప్రాంతంలో బూడిద లోడింగ్ వలన భారీగా కాలు ష్యం పెరిగిందని తెలుసుకున్న కేంద్రం సూచనల తో ఏపీ జెన్కో సంస్థ ఇటీవల స్థానిక బూడిద లో డింగ్ కాంట్రాక్ట్ను రెఫెక్స్ అనే సంస్థ టెండర్ ద్వా రా దక్కించుకుంది. ఈ విధానంతో ఇప్పటివరకు ఉచితంగా లోడింగ్ చేయించుకున్న లారీ ఓనర్లు ఇప్పుడు లారీ లోడింగ్కు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. లారీ ఓనర్లు నష్టపోతున్నందున కాంట్రాక్ట్ టెండర్ రద్దు చేయాలని కోరుతూ ఎన్టీటీపీఎస్ ప్రధాన గేటు సమీపంలో 38రోజుల పా టు లారీ ఓనర్లు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఎ మ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఒక్కొక్క లారీకి నెలకు 12 ట్రిప్పులు ఉచితంగా లోడింగ్ చేసేలా మాట్లాడామని హామీ ఇస్తూ దీక్షను విరమింపచేశా రు. అయితే ఎమ్మెల్యే హామీని తుంగలో తొక్కుతూ ఒక్కొక్క ట్రిప్పుకు రూ.850 నగదు డిమాండ్ చేయడంతో లారీ ఓనర్లు లోడింగ్ పనులు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన లారీ ఓనర్లు డబ్బులు చెల్లించి లోడింగ్ చేసుకుంటున్నారు. టీడీపీకి చెందిన లారీ ఓనర్లు ఉచితంగా ఇవ్వాలని రెఫెక్స్ సంస్థ ప్రతినిధులపై బెదిరింపు ధోరణికి దిగారు. ప్రభుత్వ మాది, మాకు ఉచితంగా లోడింగ్ ఇవ్వాలని కాంట్రాక్టర్ ప్రతినిధులపై బెదిరింపులకు దిగారు. సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ భువనగిరి రాజు సిబ్బందితో అక్కడకు చేరుకుని చైన్నెలో ఉన్న టెండర్దారుడికి సమాచారం చేరవేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు లోడింగ్ పనులు నిలిపివేశారు. -
బెదిరింపులకు, అరెస్టులకు భయపడేది లేదు
పమిడిముక్కల(పామర్రు): పోలీసుల బెదిరింపులకు, కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు సరికాదన్నారు. కార్యకర్తలను రానివ్వకుండా రోప్లు అడ్డుపెట్టడం, పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని, ప్రస్తుతం కూటమి పాలనలో తుపాన్ వల్ల దెబ్బతిన్న పంట నష్టం నమోదు చేయాలంటే టీడీపీ వారికే చేస్తున్నారని ఆరోపించారు. పంట నష్ట పరిహారం, దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని, మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ అక్రమ అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ -
బంగారు కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలి
గుడ్లవల్లేరు: మండలంలోని బంగారు కుటుంబాలకు జీవనోపాధులు కల్పించి పేదరికం నుంచి బయట పడేందుకు చేయూతను అందించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మండలంలోని డోకిపర్రు భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని కల్యాణ మండపంలో మంగళవారం ఉదయం డీఆర్డీఏ ఆధ్వర్యంలో పి–4 కార్యక్రమంపై ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. గ్రామానికి చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి మండలాన్ని దత్తత తీసుకున్నారు. కలెక్టర్ తొలుత మండలంలోని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, వారికి అప్పగించిన బంగారు కుటుంబాలలో ఎవరెలా ఉన్నారనే దానిపై సమీక్షించారు. ఆయా కుటుంబాలకు ఏం కావాలనే అంశాలపై అభిప్రాయాలను సచివాలయాల వారీగా అడిగి తెలుసుకున్నారు. బంగారు కుటుంబాలు కోరిన విధంగా వివిధ రకాల వ్యాపారాలు చేసుకోవటానికి వారికి చేయూతను అందించి జీవనోపాధులు కల్పించేందుకు మెయిల్ సంస్థ ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి హరిహరనాథ్, గుడివాడ నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, గుడ్లవల్లేరు తహసీల్దారు లోకరాజు, ఎంపీడీవో ఇమ్రాన్, వెలుగు ఏపీఎం పాండురంగ ప్రసాద్, మెయిల్ ప్రాజెక్టు మేనేజర్ శివరామకృష్ణ, శిక్షణ అధిపతి జిలాని, ఏపీ మాస్ ట్రైనర్ బలరాం, యువ నిపుణులు మణికంఠరావు, వీఆర్వో వేణుగోపాలస్వామి, పలువురు సీఆర్పీలు పాల్గొన్నారు. డోకిపర్రులో అధికారుల్ని ఆదేశించిన కలెక్టర్ బాలాజీ గుడ్లవల్లేరు మండలాన్ని దత్తత తీసుకున్న మెయిల్ సంస్థ -
● పౌర్ణమి చంద్రుడు.. కార్తిక దీపమైన వేళ!
కృష్ణా జిల్లాలోని నాగాయ లంక కృష్ణానది తీరంలో మంగళవారం రాత్రి ఏడు గంటల సమయాన ఓ దృశ్యం కనువిందు చేసింది. రామలింగేశ్వరుని మండపం ఎదుట కార్తిక దీప ప్రమిదలను అమర్చి ఉంచారు. ఆ సమయంలోనే ఆకాశంలో చంద్రుడు ఉదయించి పైకి వస్తున్న తరుణంలో జ్యోతులు వెలిగించేందుకు అక్కడ సిద్ధంగా ఉంచిన ప్రమిదలలో వత్తులకు అనుసంధానంగా చంద్రుడు కనిపించిన ఆసక్తికర దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరాలో ఇలా బంధించింది. కార్తిక పౌర్ణమి ఘడియలు మరి కొన్ని గంటలలో ప్రవేశించే ముందు ఆ చంద్రుడే కార్తిక దీపంగా ఆవిష్కృతమైన సోయగం ఇది. –నాగాయలంక(అవనిగడ్డ) -
టూరిస్ట్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో తిరిగే ప్రైవేట్ టూరిస్ట్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బ అనేష్బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్మిట్లు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో బస్సులు నడిపే వారి వలన టూరిస్ట్ బస్సు ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వాహన సాఫ్ట్వేర్లో లోపాలను సవరించాలని కోరారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనేష్బాబు మాట్లాడుతూ టూరిస్ట్ బస్సు ఆపరేటర్లు ప్రతి ఏడాది రూ.8 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్మిట్లు తీసుకొని సంవత్సరానికి రూ.50 వేల టాక్స్ చెల్లించి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా టాక్స్ కట్టకుండా స్టేట్ క్యారేజ్ నిర్వహిస్తూ ప్రైవేట్ టూరిస్ట్ బస్ ఆపరేటర్ల వ్యాపారాన్ని గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ అధికారులు ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళీమోహన్, కార్యదర్శి కె.శివరాం మాట్లాడుతూ టూరిస్ట్ బస్సు ఆపరేటర్లు ఏ విధమైన నియమ నిబంధనలు అతిక్రమించడం లేదన్నారు. గ్రీన్ టాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆరు నెలల క్రితం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ను కలిసి విన్నవించినా, ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు అశ్విన్రెడ్డి, సత్యప్రసాద్, వేములపల్లి వెంకటేశ్వర్లు, కేతన సాయి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బ అనేష్బాబు -
యువజనోత్సవాల్లో విజేతలకు బహుమతి ప్రదానం
గుడ్లవల్లేరు: విద్యతో పాటు విద్యార్థులకు సాంస్కృతిక ప్రదర్శనలు అవసరమని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఓ.మధు భూషణం అన్నారు. ఏపీ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ స్టెప్ క్రిషి వారు 2025 జిల్లా స్థాయి యువజనోత్సవాలను మంగళవారం గుడ్లవల్లేరు ఏఏఎన్ఎంఅండ్ వీవీఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఓ.మధు భూషణం మాట్లాడుతూ యువజనోత్సవాల ద్వారా యువతలో దాగి ఉన్న కళా నైపుణ్యం వెల్లడవుతుందని అన్నారు. జిల్లా యువజన సంక్షేమాధికారి యు.శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని, రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన విజేతలు జనవరిలో న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయి యువజనోత్సవాలలో జిల్లాకు చెందిన పలు కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. యువజనోత్సవాల ముగింపు సందర్భంగా పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లతో పాటు జ్ఞాపికలను అందజేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్, యూత్ ఆఫీసర్ సుంకర రాము, జిల్లా ఎన్.ఎస్.ఎస్ అధికారి కె.రమేష్, డిస్ట్రిక్ట్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. -
'దయలేని బాబు' దగా పాలన
తుపాన్తో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి.. ఎలా పరిహారం ఎగ్గొడదామా అని ఆలోచనలు చేస్తుండటం దుర్మార్గం. ఎన్యుమరేషన్ అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి కావాలని చెబుతూ ఒక్క రోజు ముందు 30న ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని ఏమంటారు? ఒక్క రోజులో ఎన్యుమరేషన్ అనేది ఎలా సాధ్యం? పంట నష్ట పరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయం అని చెప్పడం దారుణం. ఇలా రైతులను బ్లాక్ మెయిల్ చేస్తూ.. బెదిరిస్తూ.. పైకి మాత్రం రైతులను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్లా?తుపాను కారణంగా వరి కంకుల సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించడం ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యుమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితే లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానం? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ఆకుమర్రు లాకు నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తుపాను దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగ.. రైతు అనే వాడు వేస్ట్.. అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయం, రైతుల విషయంలో చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి.. రైతులు రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లో దిగి.. బాధిత రైతులతో మమేమకవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రు లాకు వద్ద బాధిత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టం అని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ‘మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు.. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముంబై పోతాడు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’ అని ఎత్తిచూపారు. పంటలు దెబ్బ తిన్న ప్రతీ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, పంటల బీమా పరిహారం కూడా ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. గత 18 నెలల్లో సంభవించిన విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కృష్ణాజిల్లా నిడుమోలు వద్ద భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 18 నెలల్లో ఒక్క రైతుకైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ⇒ రైతు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో తిరిగితేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు ఉన్నాయి. మోంథా తుపాను దాదాపు 25 జిల్లాలపై ప్రభావం చూపింది. ⇒ అటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు కృష్ణా నుంచి కర్నూలు వరకు దాని ప్రభావం కన్పించింది. దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడూ ఊహించని విధంగా పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరి పంటకే ఎక్కువగా 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు మరో నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ⇒ వరి పంట గింజలు పాలు పోసుకున్న దశలో తుపాను విరుచుకుపడింది. తీవ్రమైన గాలులు, వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతింది. చంద్రబాబు 18 నెలల పాలనలో దాదాపు 16 సార్లు తుపానులు, వరదలు, అకాల వర్షాలు, కరువు వంటి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ 18 నెలల్లో ఏ రైతుకైనా ఒక్క సారైనా ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏ రైతుకైనా ఒక్కసారైనా పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) ఇచ్చారా? అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తా అని హామీ ఇచ్చి.. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.ఐదు వేలతో సరిపెట్టారు. ⇒ ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాలేదు. ఇన్సూరెన్స్ రాలేదు. చివరికి ఎరువులు బ్లాకులో కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లోకి రైతులు వెళ్లిపోయారు. రూ.266కు దొరకాల్సిన యూరియా కట్టను ఏకంగా రూ.500, రూ.600 చొప్పున బ్లాకులో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అవసరాన్ని బట్టి బ్లాకులో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇలా కష్టాల సాగు చేసిన రైతులు తాము పండించిన పంటను అమ్ముదామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది ధాన్యం 75 కేజీల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,750 రావాల్సి ఉండగా, రైతుల చేతికొచ్చింది మాత్రం కేవలం రూ.1,350 మాత్రమే. చంద్రబాబు హయాంలో ప్రతి అడుగులోనూ రైతు నష్టపోతూనే ఉన్నాడు. నాడు ప్రతి రైతుకు భరోసా ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో వారిపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని ఐదేళ్ల పాటు అమలు చేసి అండగా నిలిచింది. మూడున్నర ఎకరాలున్న రైతులు సైతం దాదాపు రూ.70 వేలు, రూ.66 వేలు చొప్పున గతంలో బీమా పరిహారం డబ్బులు అందుకున్న పరిస్థితులను ఇక్కడి రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు ఏ రైతు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. విపత్తుల వేళ పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని ఏ రోజు ఏ రైతు ఆ ఐదేళ్లలో అధైర్య పడలేదు. కారణం.. పంట నష్టం జరిగితే జగనన్న ఉన్నాడు.. పైసా భారం పడకుండా తమ పంటకు బీమా చేయించాడని, తమకు డబ్బులొస్తాయని ధైర్యంగా ఉండేవారు. ప్రతి రైతుకు భరోసా ఉండేది. ⇒ ఏదైనా విపత్తు వేళ పంటలకు నష్టం వాటిల్లితే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇస్తాడనే ధైర్యం ఉండేది. ఆ డబ్బులతో మరుసటి సీజన్లో పెట్టుబడి పెట్టుకోవచ్చనే ధైర్యం ఉండేది. సీజన్ మొదలయ్యే సరికే ప్రతి రైతుకు ఓ భరోసా ఉండేది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఇస్తారన్న నమ్మకం ఉండేది. ⇒ ఆర్బీకే వ్యవస్థ అనేది రైతులను చేయి పట్టి నడిపించే వ్యవస్థగా ఉండేది. ప్రతీ రైతు వేసిన పంటకు ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలోనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్.. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు అందుబాటులో ఉండే వారు. సచివాలయాలతో అనుసంధానం చేసి వలంటీర్లతో కలిసి రైతులను చేయిపట్టి నడిపించేవారు. ప్రతి రైతును.. అతను సాగు చేసిన పొలంలో నిలబెట్టి జియో ట్యాగ్ చేసి ఈ–క్రాప్ బుకింగ్ చేసే వారు. తద్వారా పంటకు ఎప్పుడు, ఏ ఇబ్బంది వచ్చినా రైతుకు ప్రభుత్వం తోడుగా నిలబడేది. ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వ జోక్యం ⇒ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉండేది కాదు. ఆర్బీకే పరిధిలో ఏ పంటను ఏ రేటుకు కొనుగోలు చేసేది రైతులకు తెలియజేసేవాళ్లం. ఆ రేట్ల కంటే తక్కువగా పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. మద్దతు ధరల వివరాలు ఆర్బీకేలో ప్రదర్శించేవాళ్లం.⇒ ఎక్కడ ఏ పంట రేటు తగ్గినా వెంటనే ఆర్బీకే అసిస్టెంట్ నుంచి ఎలెర్ట్ వచ్చేది. మార్క్ఫెడ్కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న జేసీలు వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకునే వారు. ధరలు పడిపోయిన పంటలను కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీని తీసుకొచ్చి «రైతుకు తోడుగా నిలబడేవారు. ఇందుకోసం కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ (సీఎం యాప్) అనే యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలో ఉండేది. ⇒ ఈ యాప్ ద్వారా గ్రామ స్థాయిలో ధరలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి రైతుకు బాసటగా నిలిచే వారు. ఇలా ఐదేళ్లలో ధర లేని సమయంలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కనీస మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ⇒ అప్పట్లో రైతులు సాగు చేసిన ప్రతి పంటను ఈ–క్రాప్లో నమోదు చేసేవాళ్లం. తద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. దాదాపు 85 లక్షల మంది రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచితంగా పంటల బీమా అమలు చేశాం. 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ కింద రూ.7,800 కోట్లు జమ చేశాం. ⇒ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో కేవలం 19 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అది కూడా బ్యాంక్ రుణాలు తీసుకున్న వారు. మరి ప్రీమియం చెల్లించని మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి పంటల బీమా పరిహారం అందకుండా చేయడం దుర్మార్గం కాదా?ఇదేం విడ్డూరం.. ఒక్క రోజు ముందు ప్రొసీడింగ్సా!?⇒ తుపాన్తో నష్టపోయిన రైతులు ఆశ్చర్యం కలిగించే విషయాలు చెబుతున్నారు. మీ పొలంలో ఎన్యుమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా? అని అడిగితే.. ఈ పొలంలోకే కాదు రాష్ట్రంలో దెబ్బతిన్న ఏ పొలంలోకి, ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ చేసేందుకు ఎవరూ రాలేదన్న మాట విని్పస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30వ తేదీన ప్రొసీడింగ్స్ (ఉత్తర్వులు చూపిస్తూ) ఇచ్చారు.⇒ ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డామేజ్, సోషల్ ఆడిట్ 31వ తేదీ కల్లా పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. ఒక్క రోజులో ఎన్యుమరేషన్ (పంట నష్టం మదింపు), సోషల్ ఆడిట్ అయిపోవాలట! ఎలా సాధ్యమో మీరే చెప్పండి. పైగా ఈ గడువులోగా చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని ఇదే ప్రొసీడింగ్స్లో స్పష్టం చేశారు. క్రాప్ డామేజ్, ఎన్యుమరేషన్, సోషల్ ఆడిట్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అంతా పూర్తి చేసి తుది జాబితాలను 1వ తేదీకల్లా వ్యవసాయ శాఖ డైరెక్టరేట్కు పంపాలని పేర్కొన్నారు.⇒ ఈ ఆదేశాలు చూస్తుంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. ఎన్యుమరేషన్ అనేది ఎవరూ పంట పొలాల వద్దకు వచ్చి చేసే పరిస్థితి లేదు. గాలులు, తుపాను వల్ల ధాన్యం సుంకు విరిగిపోయింది. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారి అయినా సరే పొలంలో అడుగుపెట్టాలి. వరి కంకులను చూడాలి. సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఈ విషయాన్ని స్పష్టంగా రాయాలి. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే విధానం?ధాన్యం కొనబోమని బ్లాక్ మెయిల్ చేస్తారా?⇒ ఎన్యుమరేషన్ కోసం ఎందుకు పొలం వద్దకు రాలేదని ఏ రైతు అయినా అడిగితేæ వారిని వెటకారం చేసి మాట్లాడుతున్నారు. పైగా ప్రతి రైతుకు వ్యవసాయ శాఖాధికారి నుంచి తాము చెప్పిన పత్రాలు (ఆధార్, 1బి జిరాక్స్, కౌలు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం) సమరి్పంచిన వారి పొలాల్లో మాత్రమే పంట నష్టం పరిశీలించి జాబితాలో పెడతామని మెసేజ్లు పంపిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కూడా చెప్పిస్తున్నారు. అదీ అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తీసుకొస్తేనే స్వీకరిస్తామని, లేదంటే ఆ పత్రాలు స్వీకరించం అని తెగేసి చెబుతున్నారు. ⇒ మరొక వైపు ‘దయచేసి రైతులు గమనించగలరు. ఇప్పుడు పంట నష్టం చేయించుకున్న రైతుల నుంచి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయబడదు’ అని నిర్దయగా మెసేజ్లు పంపిస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎవరైనా అడిగితే వాళ్ల ధాన్యం కొనుగోలు చేయరట! అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?⇒ ఎక్కడైనా తుపాను వచ్చినపుడు ప్రభుత్వం మానవత్వం ప్రదర్శించాలి. నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకునేందుకు ముందుకు రావాలి. పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) వచ్చేలా చేయాలి. అంతే కాకుండా వారి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాలి. అది ఇస్తే ఇది ఇవ్వం.. ఇది ఇస్తే ఆది ఇవ్వం.. అని చెబుతూ రైతులను బెదిరించడం దారుణం. దీన్నిబట్టి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది.మా హయాంలో కచ్చితమైన చర్యలు⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి తుపానులు వచ్చే ముందు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించే వాళ్లం. వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో జిల్లా యంత్రాంగం కలిసి పనిచేసేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్ల పరిధి తగ్గించాం. తక్కువ నియోజకవర్గాలకు ఎక్కువ మంది కలెక్టర్లు, జేసీలు వచ్చారు. ఇలాంటి విపత్తుల వేళ ప్రాణ నష్టం జరగకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వాళ్లం. కలెక్టర్ల చేతుల్లో కావాల్సినంత డబ్బులు పెట్టేవాళ్లం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్లం.⇒ వారం.. పది రోజుల టైం ఇస్తున్నాం.. ఎన్యుమరేషన్ పక్కాగా, పారదర్శకంగా చేయాలని చెప్పేవాళ్లం. తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు కలెక్టర్ పనితీరు ఏలా ఉంది.. పంట నష్టం కోసం ఎన్యుమరేషన్ ఎలా జరిగింది.. అన్ని సదుపాయాలు మీకు కల్పించారా.. లేదా.. వంటి వివరాలు ప్రజలను అడిగి తెలుసుకునేవాణ్ని. ఏ ఒక్కరైనా అధికారులు బాగా చేయలేదని చెబితే ఉద్యోగం పీకేస్తామని గట్టిగా చెప్పే వాళ్లం. అందువల్ల అధికారుల్లో ఒక భయం ఉండేది. ఆకుమర్రు లాకు వద్ద పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్ ఈ–క్రాప్ను గాలికొదిలేశారు..⇒ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ క్రాప్ అనేది రైతులకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతులను నిలబెట్టి, జియో ట్యాగ్ చేసి, వారి ఫొటోతీసిసి అప్లోడ్ చేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ–క్రాప్ నిర్వచనం మార్చేశారు. ఈ–క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా ఉంది. టీడీపీ వాళ్లయితే ఉన్న భూమి కంటే ఎక్కువగా సాగు చేసినట్టు చూపిస్తున్నారు.⇒ ఇందుకు బాపట్ల జిల్లాయే ఉదాహరణ. ఈ జిల్లాలోని పర్చురులో 112 శాతం, జే.పంగలూరులో 114 శాతం.. బల్లికురవలో 115 శాతం.. వేటపాలంలో 117 శాతం.. చీరాలలో 122 శాతం.. చినగంజాంలో 128 శాతం చొప్పున ఈ–క్రాప్ నమోదైనట్టుగా చూపించారు. అంటే ఉన్న భూమి కన్నా సాగైన భూమి ఎక్కువగా ఉందా? ఉన్నభూమి 100 శాతమైతే 128 శాతం విస్తీర్ణంలో సాగైనట్టు చూపిస్తున్నారు. అదెలా సాధ్యం! ఈ–క్రాప్ను ఏ విధంగా నీరుగారుస్తున్నారో ఇంతకంటే ఉదాహరణలు కావాలా?⇒ ఇలాంటి విపత్తుల వేళ కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగే వారు. వారం, పది రోజుల తర్వాత నేను వెళ్లే వాడిని. పరిస్థితిని అంచనా వేసే వాళ్లం. ముఖ్యమంత్రి వస్తాడేమో అనే భయంతో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా కలెక్టర్లు పనిచేసే వారు. ఈ రోజు ప్రభుత్వ పనితీరు చూస్తుంటే.. ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ⇒ రైతుకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే.. ఒకరోజు చాపర్లో అలా అలా తిరుగుతాడు. మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వస్తాడు.. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి పోతాడు. ఇక్కడ రైతుల పరిస్థితి ఏడవ లేక.. కడుపులో బాధ తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ ఒక్క కౌలు రైతుకు కౌలు కార్డులు ఇవ్వడం లేదు. ఇస్తే వాళ్లకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే దురాలోచనతో ఉన్నారు.ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నారు?⇒ ఎన్యుమరేషన్ లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? తుపాను వల్ల దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇంత పంట నష్టం ఎప్పుడు జరగలేదని మీ ఎల్లో మీడియాలో, మీ గెజిట్ పేపర్ ఈనాడులోనే తొలుత రాశారు. ఇప్పుడు ఎందుకు తగ్గించి రాస్తున్నారు? ఎన్యుమరేషన్ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడలేకపోతున్నారు? పైగా ఎన్యుమరేషన్ చేస్తే మీ పంటను కొనుగోలు చేయం అని ఎందుకు భయపెట్టిస్తున్నారు? రైతుకు మంచి చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తోంది?⇒ మీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం (ఇన్సూరెన్స్) డబ్బులు రావడం లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ఉండి ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం రూ.25 వేలకు పైగా పరిహారం వచ్చేది. మీ తప్పిదం వల్ల వారికి ఈ పరిహారం అందకుండా పోయింది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం వల్ల నష్టం జరిగింది. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వచ్చేలా చేయాల్సిన బాధ్యత మీదే. అలా చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. 18 నెలల్లో 16 సార్లు రైతులు నష్టపోయారు. మీరు తగ్గించి, కోతలేసి వేసిన లెక్కల ప్రకారమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూ.600 కోట్లు ఇవ్వాలి. ఆ బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నా. -
వైఎస్ జగన్ పర్యటన సూపర్ సక్సెస్
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు(మంగళవారం, నవంబర్ 4వ తేదీ) చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన సూపర్ సక్పెస్ అయ్యింది. జగన్ పర్యటించే గ్రామాల్లో బ్యారికేడ్లు అడ్డంపెట్టినా, గ్రామస్తులను కూడా కదలనీయకుండా చేసి వేధింపులకు గురి చేసినా, ఇలా ఎన్నో రకాలుగా ఆటంకాలు సృష్టించాలని చూసినా వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అత్యంత విజయవంతమైంది. కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావితమైన ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, బీవీ తోట ఎస్.ఎన్. గొల్లపాలెంలో జగన్ పర్యటన సాగింది. దాంతో గ్రామస్తులను, రైతులను అడ్డుకోవాలని పోలీసులు చూశారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తన్న ఏపీ పోలీస్ యంత్రాంగం.. జగన్ పర్యటనను విజయవంతం కాకుండా చూడాలని ఎప్పటిలానే ప్రయత్నాలు చేసింది. కానీ వారు చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. వీటిని గ్రామస్తులు, రైతన్నలు, యువత, మహిళలు ఎవరూ లెక్కచేయలేదు. తమ జననేత జగనన్న వస్తున్నాడని తెలిసి ఊరూ-వాడా ఏకమై కదిలారు. జగనన్నకు సంఘీభావం తెలుపుతూ జై జగన్ నినాదాలతో హెరెత్తించారు. రైతన్నలకు భరోసా.. వైఎస్ జగన్ పడిపోయిన పంట పొలాల్లో దిగి పరిశీలించారు. అదే సమయంలో రైతన్నతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ధీమా కల్పించారు. మోంథా తుపానుతో నష్టపోయిన రైతన్నలను ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ మరో పోరాటం చేయడానికి కూడా వెనుకాడదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.జనసంద్రం.. ఐదు గంటల ఆలస్యంవైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆ రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. విజయవాడ నుండి గొల్లపాలెం వరకు అడుగడుగునా భారీ జనసందోహమే కనిపించింది. దాంతో ఆ భారీ జనసందోహనికి అభివాదం చేస్తూ జగన్ పర్యటన ముందుకు సాగింది. దీనిలో భాగంగా వైఎస్ జగన్ పర్యటన ఆలస్యమైంది. సుమారు ఐదు గంటలు ఆలస్యంగా వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. మిట్ట మధ్యాహ్నం ఎండలోనూ జగన్ కోసం రైతులు, మహిళలు, కార్యకర్తలు వేచి చూడగా, పొలాల్లో నుండి సైతం వచ్చి జగన్ను కలిశారు రైతన్నలు. తుపానుతో తాము నష్టపోయిన విషయాలను జగన్కు వివరించారు. ఇదీ చదవండి:‘మా హయాంలో జగనన్న ఉన్నాడనే భరోసా ఉండేది’ -
జగనన్న ఉన్నాడనే ధీమా ఉండేది
అమరావతి: వ్యవసాయం దండగ అన్న సీఎం చంద్రబాబు అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో దాదాపు 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, దాంతో రైతులకు నష్టం కలుగుతోందని, అయినా ఏ ఒక్క రైతును ఆదుకున్న దాఖలా లేదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. మొక్కుబడిగా చాలా తక్కువగా పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా రద్దు, ఇన్పుట్ సబ్సిడీ రద్దు, పంటలకు లేని కనీస మద్దతు ధర, రైతులకు తగిన యూరియా కూడా సరఫరా చేయకపోవడం, చివరకు పంటలు కూడా కొనేవారు లేకపోవడంతో.. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు నానా అగచాట్లు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు తుపాన్లో నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని, రైతులకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని వైఎస్ జగన్ ప్రకటించారు.మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన పంటలు పరిశీలించడంతో పాటు, రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాలలో పర్యటించారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయనకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. మరోవైపు ప్రతిచోటా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా రోప్పార్టీలు, బారికేడ్లు ఛేదించుకుని జనం, అభిమానులు తరలిరాగా, రైతులు తమ గోడు చెప్పుకున్నారు.కాళ్లకు చెప్పులు కూడా లేకుండా.. పొలాల్లోకి:కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, పంట పొలాల్లోకి దిగిన వైఎస్ జగన్ , రైతులతో మమేకం అయ్యారు. తుపాన్లో నష్టపోయిన పంటలను స్వయంగా చూశారు. రైతులతో మాట్లాడి వారి బాధలు ఆరా తీశారు. వారి ప్రతి కష్టాన్ని, ఇబ్బందిని సావధానంగా విన్నారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. చివరగా పెడన నియోజకవర్గం, గూడూరు మండలం, ఆకుమర్రులాకు వద్ద రైతులను కలుసుకున్న ఆయన, వారి బాధలు, కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..:వరసగా నష్టాలు. అయినా అందని సాయం:మోంథా తుపాన్ దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఇటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం, అటు రాయలసీమలో కర్నూలు జిల్లా వరకు తుపాన్ ప్రభావం చూపింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా పంట నష్టం జరిగింది. కారణం ఏమిటంటే, ఇప్పుడు నష్టపోయిన పంటల్లో దాదాపు 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. అది పొట్టకొచ్చే దశలో ఉంది. అంటే గింజలు తయారయ్యే పరిస్థితి. ఈదురుగాలులు, భారీ వర్షాలతో చాలా నష్టం సంభవించింది. ఇంకా పత్తి, మొక్కజొన్న, బొప్పాయి మరో దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, రైతులు నష్టపోయారు. ఈ 18 నెలల్లో 16 సార్లు అలా రైతులు ఇబ్బంది పడ్డారు. మరి ఏ ఒక్క రైతుకు అయినా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఇన్సూరెన్స్ డబ్బు అందిందా? పెట్టుబడి సాయం మొత్తం చేశారా? అంటే అదీ లేదు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. ఇన్ని ఇబ్బందులు పడి, నష్టం జరిగినా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అదే మా ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలు చేశాం. దీంతో ఏ రైతు ఇబ్బంది పడలేదు. అప్పుడు మూడు ఎకరాలున్న రైతులకు దాదాపు రూ.70 వేల పరిహారం అందింది.అదే ఇప్పుడు చివరకు ఇప్పుడు యూరియా కూడా బ్లాక్లో కొనాల్సి వచ్చింది. బస్తా యూరియా దాదాపు రూ.600కు కొనాల్సి వచ్చింది. ఇంకా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.1750 ఉంటే రైతుకు రూ.1300 కూడా రావడం రాలేదు. ఏ ఒక్క పంటకూ కనీస గిట్టుబాటు ధర రాలేదు.నాడు జగనన్న ఉన్నాడన్న భరోసా:అందుకే అందరూ మా ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నాడు ఏం జరిగినా రైతులు ఆందోళన చెందలేదు. జగనన్న ఉన్నాడు. ఆదుకుంటాడు అన్న భరోసా ఉండేది. ఉచిత పంటల బీమా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కూడా వస్తుంది. ఏటా సీజన్ ఆరంభంలో పెట్టుబడి సాయం చేస్తాడు. అలా ఏటా రూ.13,500 తప్పనిసరిగా ఇస్తాడు అన్న నమ్మకం రైతుల్లో ఉండేది. అలా వారిలో ఒక భరోసా ఉండేది. రైతులను చేయి పట్టి ఆర్బీకేలు నడిపించేవి. ప్రతి ఎకరా ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకేల్లో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉండేవారు. వారు పక్కాగా ఈ–క్రాప్ నమోదు చేసే వారు. దాంతో ఏ పంటకు, ఏ ఇబ్బంది వచ్చినా, ఈ–క్రాప్ ఉంది కాబట్టి ప్రభుత్వం తోడుగా నిలబడేది.ఆర్బీకేలు జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసేవి. తద్వారా రైతులకు కనీస మద్దతు ధర వచ్చేది. ఎక్కడైనా ధరలు తగ్గితే, ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ జిల్లా జేసీకి సమాచారం ఇస్తే, వారు వెంటనే జోక్యం చేసుకుని, మార్కెట్లో పంటలు కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడేవారు. సీఎం–యాప్ ద్వారా ప్రతి రైతుకు ఆర్బీకేల్లో ఆసరగా నిల్చేవాళ్లం. దాదాపు రూ.7800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాం. అందుకోసం ఏటా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం.ప్రతి ఎకరా ఈ–క్రాప్ చేసి, ఉచిత పంటల బీమా ఇచ్చాం. 70 లక్షల ఎకరాలకు ఉచిత పంటల బీమా అమలు చేయడంతో, ఆ బీమా పరిధిలో ఏకంగా 85 లక్షల మంది రైతులు ఉండేవారు. ఉచిత పంటల బీమా వల్ల దాదాపు రూ.7800 కోట్ల పరిహారం రైతులకు అందింది. అదే ఇప్పుడు చంద్రబాబు పాలనలో కేవలం 19 లక్షల మంది రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే పంటల బీమా ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? వారికి పంటల బీమా లేదు. మరి వారి పరిస్థితి ఏమిటి?. వారందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు?.ఒక్క రోజులో ఎన్యుమరేషన్. ఎలా సాధ్యం?:ఈరోజు ఈ రైతు ఒకే విషయం చెప్పాడు. ఎక్కడా, ఏ రైతు వద్దకు, ఏ పొలం వద్దకు ఎవరూ ఎన్యుమరేషన్ కోసం రాలేదు. ఇంకా ఇక్కడ ఒక దారుణ అంశం ఏమిటంటే..(అంటూ ఆ ఆర్డర్ కాపీ చూపారు). ఇది అక్టోబరు 30న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్. ఎన్యుమరేషన్, సోషల్ ఆడిటింగ్ ఆ మర్నాటికల్లా (అంటే అక్టోబరు 31. కేవలం ఒకే ఒక్క రోజు) పూర్తి కావాలని అందులో ఆదేశించారు. అక్కడ ఇంకో పేరాలో ఏం రాశారంటే.. అక్టోబరు 31 నాటికి అవి కచ్చితంగా పూర్తి చేయాలి. ఆ పని చేయకపోతే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారట. ఆ తర్వాత రైతులు కనీసం దరఖాస్తు కూడా చేయడానికి వీలు లేదు. ఆ వివరాలు నవంబరు 1నాటికి కలెక్టరేట్కు చేరాలట. ఇది ఎంత దారుణం. కేవలం ఒకే ఒక రోజులో పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు? అది సాధ్యమేనా? ఈదురుగాలులు, వర్షాలతో పంట నష్టం ఎలా జరిగింది? సుంకు విరిగిపోయిందా? పంట ఎలా ఉంది? సుంకు విరిగిపోతే, గింజ పాలు పోసుకోదు. ఎన్యుమరేషన్ చేసే వాళ్లు పొలంలోకి దిగి చూస్తేనే తెలుస్తుంది. కానీ, ఇక్కడ ఎక్కడా ఎవరూ రాలేదు. పొలంలోకి రాలేదు. అయినా ఎన్యుమరేషన్ జరిగిందని చెబుతున్నారు.ఇంకో దారుణం.. ఒకటి తీసుకుంటే మరొకటి కట్:ఈ పత్రాలు సమర్పించిన వారు, అక్టోబరు 31 నాడు పత్రాలు, డాక్యుమెంట్లు తెచ్చిన వారికే పరిహారం ఇస్తారట. అంటే ఇప్పుడు ఆ పని చేసిన రైతుల ధాన్యాన్ని, ఆ తర్వాత కొనుగోలు చేయబోమని చెప్పారు. అంటే ఇన్పుట్ సబ్సిడీ, పరిహారం కోరిన రైతుల ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. కనీస మానవత్వం చూపాలి. పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. పరిహారం ఇవ్వాలి. పంటలు కూడా కొనుగోలు చేయాలి. కానీ, ఇక్కడ ఒకటి ఇస్తే, మరొకటి ఇవ్వబోమంటున్నారు. అంటే ఎంత నిర్దయగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ–క్రాప్కు పూర్తిగా ఎగనామం పెట్టింది. ఈ–క్రాప్ చేస్తే, ఇలాంటి విపత్కర పరిస్థితిలో శ్రీరామరక్షగా నిలుస్తుంది.తూతూ మంత్రంగా ఈ–క్రాప్.. అందులోనూ అవినీతికి బీజం:అసలు ఈ–క్రాప్ అంటే. రైతులను పొలాల్లో నిలిపి ఫోటో తీయాలి. కానీ, ఇప్పుడు ఈ–క్రాప్ పేరుకే చేస్తున్నారు. ఇంకా వాస్తవ పంటలకు మించి ఈ–క్రాప్ చూపుతున్నారు. టీడీపీ వారికి ఏకంగా ఉన్న భూమి కన్నా, ఎక్కువ పంట వేశారని చూపుతున్నారు. అలా పర్చూరులో 112 శాతం, జె.పంగలూరులో 114 శాతం, బల్లికరువులో 115 శాతం, వేటపాలెంలో 117 శాతం, చీరాలలో 122 శాతం. చిన్న గంజాంలో 128 శాతం ఎక్కువ చూపుతున్నారు. అంటే ఉన్న భూమి కంటే ఎక్కువగా పంటను చూపుతున్నారు. ఆ స్థాయిలో ఈ–క్రాప్ నీరుగార్చారు.కష్టాల్లో రైతులు. జల్సా టూర్లలో తండ్రీ కొడుకులు:ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికొదిలేసింది. ఇక్కడ ఇంత విపత్కర పరిస్థితులు ఉంటే, సీఎం ఏం చేశారు?. ఒకరోజు ఛాపర్లో అలా తిరిగి, మర్నాడు లండన్ వెళ్లిపోయారు. ఆయన కొడుకు ఆస్ట్రేలియాలో పర్యటించి వచ్చి, మర్నాడు క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం ముంబై వెళ్లాడు. ఇది వాళ్ల వ్యవహారశైలి.అదే మా ప్రభుత్వంలో నేనేం చేసేవాణ్ని?:తుపాన్ రాగానే, అధికారులకు బాధ్యతలు అప్పగించేవాళ్లం. జిల్లాలు పెంచడం వల్ల, కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు ఎక్కువగా వచ్చారు. ఇంకా సచివాలయాలు ఉండేవి. తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కలెక్టర్లకు నిధులు ఇచ్చే వాళ్లం. వారికి వారం, పది రోజుల టైమ్ ఇచ్చి, అన్నీ పక్కాగా చేయమనేవాళ్లం. ఆ తర్వాత నేను స్వయంగా వస్తానని చెప్పి, అలాగే పర్యటించేవాణ్ని. దాంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే, కలెక్టర్లు విస్తృతంగా పర్యటించి, ఎలాంటి తప్పిదం లేకుండా చూసేవాళ్లు. నేను ఆ వారం, పది రోజుల తర్వాత ఎప్పుడు, ఎక్కడికి వస్తానో తెలియదు కాబట్టి, అందరు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, అన్ని సహాయ కార్యక్రమాలు చేసేవారు. బాధితులను ఆదుకునే వారు.నష్టాన్ని ఎందుకు తక్కువ చూపుతున్నారు?:కానీ, ఈరోజు ప్రభుత్వం అనేది ఉందా? ఇదే చంద్రబాబును అడుగుతున్నాను. పంట నష్టాన్ని ఎందుకు తక్కువ చేసి చూపుతున్నారు. పంటల నష్టం చాలా జరిగిందని ఎల్లో మీడియాలోనే రాశారు. మరి పంట నష్టం లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపుతున్నారు? రైతులకు మంచి చేయకుండా ఎందుకు నష్టం చేస్తున్నారు? చంద్రబాబు, నీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం రావడం లేదు. మీరు ప్రీమియమ్ కట్టి ఉంటే, వారికి పరిహారం ఉండేది. ఉచిత పంటల బీమా మీరు ఎత్తేయడం వల్ల, వారికి నష్టం జరుగుతోంది. కాబట్టి, అది ఇచ్చి మీరే ఆదుకోవాలి. రబీ నుంచైనా కచ్చితంగా ఉచిత పంటల బీమా అమలు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా తగ్గించి, తగ్గించి చివరకు రూ.600 కోట్లు బకాయి పెట్టారు. అది వెంటనే ఇవ్వాలి.రైతుల పక్షాన పోరాడతాం:రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టం. వ్యవసాయం దండగ అనేది చంద్రబాబు వైఖరి. అందుకే వారికి ఈరోజు ఇన్ని ఇబ్బందులు. రైతులు రాష్ట్రానికి వెన్నెముక. వారిని ఆదుకోవాలి. లేకపోతే మేము రైతుల పక్షాన పోరాడతాం. ఇంకా కౌలు రైతులకు కార్డులు కూడా ఇవ్వలేదు. అవి వెంటనే ఇవ్వాలి. రాష్ట్రంలో రైతులకు న్యాయం, మేలు జరిగే వరకు వారికి తోడుగా నిలుస్తామని, పోరాడతామని వైఎస్ జగన్ ప్రకటించారు. -
వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా జనాన్ని ఆపలేరన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారు?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను పోలీసులు, ఆంక్షలు, నిర్బంధాలతో అడ్డుకోలేరు. చంద్రబాబు లాగా జనాల్ని పోగేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్ని నాని అన్నారు.‘‘వైఎస్ జగన్పై జనంలో విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యుల్లాగా వైఎస్ జగన్ను ఓన్ చేసుకున్నారు. ఆంక్షలు నిర్బంధాల నడుమ పోలీసుల నోటీసులు ఇచ్చి కట్టడి చేసి జగన్ దగ్గరికి జనాలను రాకుండా ఆపలేరు. కృష్ణాజిల్లాలో ఒక్క మంత్రిగాని, వ్యవసాయ శాఖ మంత్రి గాని.. జిల్లా మంత్రిగాని ఒక్క ఎమ్మెల్యే గాని... రైతులకు జరిగిన నష్టాన్ని పొలంలోకి వచ్చి చూడలేదు. ఎల్లో మీడియాలో రావడానికి పొలంలో ఫోటోలకు పోజులు మాత్రమే ఇస్తారు. రైతు కష్టాన్ని పొలంలోకి వచ్చి విన్నవాడు ఎవరూ లేరు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ నిద్రపోతున్నాడో తెలియదు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వర్సిటీ భూములు కృష్ణార్పణం
గూడూరు: ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో కృష్ణా యూనివర్సిటీకి అంకురార్పణ చేశారు. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో మహానేత శిలాఫలకం ఆవిష్కరించగా, తర్వాతి కాలంలో నేషనల్ కాలేజీలో తాత్కాలికంగా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. యూని వర్సిటీకి సొంత భవనాలు సమకూర్చడానికి ప్రభుత్వం 2010లో యూనివర్సిటీకి భూములు కేటాయించింది. మచిలీపట్నం మండలం రుద్రవరంలో 102 ఎకరాలు కేటాయించగా, గూడూరులో 44.92 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బందరు మండలం రుద్రవరంలో కేటాయించిన భూముల్లో యూనివర్సిటీ నిర్మాణం చేపట్టడంతో ప్రస్తుతం అక్కడి నుంచే పరిపాలన, తరగతుల నిర్వహణ సాగుతున్నాయి. గూడూరులో 44.92 ఎకరాల కేటాయింపు గూడూరు పటాన్పేటలోని సర్వే నంబరు 443/3లో 25.58 ఎకరాలు, కోకనారాయణపాలెం వెళ్లే రోడ్డు వెంబడి సర్వే నంబరు 393/1లో 19.00 ఎకరాలు వెరసి మొత్తం 44.92 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయిస్తూ 2010లో అప్పటి కలెక్టర్ ఎలినేషన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వాస్తవానికి యూనివర్సిటీకి కేటాయించిన భూములన్నీ రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూములుగా నమోదయి ఉన్నప్పటికీ అనాది నుంచి స్థానిక రైతులు వాటిని సాగు చేసుకుని జీవనం సాగిస్తూ వచ్చారు. దీంతో తమ భూములను యూనివర్సిటీకి కేటాయించడంపై సర్వే నంబరు: 393/1లో అనుభవంలో ఉన్న రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి. అన్యాక్రాంతం అవుతున్న భూములు ఇదిలావుండగా యూనివర్సిటీకి గూడూరు పటాన్పేటలోని 443/3లో కేటాయించిన భూములను అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. కనీసం భూముల చుట్టూ ఫెన్సింగ్ గానీ, సూచికలు గానీ, హద్దులు గానీ ఏర్పాటు చేయలేదు. దీంతో అనాది నుంచి భూములను సాగు చేసుకుంటున్న వారు ఇతరులకు అమ్మేసుకుంటున్నారు. 443/3 సర్వే నంబరులో మొత్తం 93.22 ఎకరాలు ఉండగా, దానిలో నుంచి యూనివర్సిటీకి 25.58 ఎకరాలు కేటాయించారు. మిగిలినవి ప్రైవేటు భూములు. దీంతో యూనివర్సిటీ భూములు సులువుగా రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. కొందరు పక్కా భవనాలు కూడా నిర్మించేసుకుంటుండటం గమనార్హం. వెంచర్లు వేసి మరీ విక్రయాలు వర్సిటీ అధికారులు ఈ భూముల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కొందరు వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయించేస్తున్నారు. ఈ వ్యవహారంలో కింది స్థాయిలో ఉండే రెవెన్యూ సిబ్బంది ప్రత్యక్ష పాత్ర పోషిస్తుండగా ఆ శాఖలోనే ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు మరికొందరికి పరోక్షంగా సహాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారికి సమీపంలో... మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారికి ఈ భూములు 100 మీటర్ల పరిఽధిలోనే ఉండటంతో ప్రస్తుతం వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు సాగుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. -
అధికారులు సూచికలు ఏర్పాటు చేసినా...
వర్సిటీ భూములు అక్రమంగా అమ్మేసుకుంటున్నారన్న సమాచారం రావడంతో గూడూరు తహసీల్దారు డి.రాజ్యలక్ష్మి సిబ్బందితో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. అయితే బోర్డులు పెట్టిన ఒకటి, రెండు రోజుల్లోనే వాటిని తొలగించి యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీనిపై యూనివర్సిటీ అఽధికారులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించడం లేదని, తాము ఏం చేయగలమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఇప్పటికై నా కృష్ణా యూనివర్సిటీ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకుని వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి
కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జేసీ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ పర్హీన్ జాహిద్, కేఆర్ ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, ఆర్డీవో స్వాతి, సీఐ శ్రీనులతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో 121 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, డీపీవో జె.అరుణ, రహదారులు, భవనాలు శాఖ ఈఈ లోకేష్, డీఎస్వో మోహన్బాబు, డీఎంఅండ్హెచ్వో యుగంధర్, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి, మత్స్యశాఖ జేడీ నాగరాజా, విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యానందం, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, డీటీడబ్ల్యూవో ఫణిధూర్జటి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రధానమైన అర్జీలు ఇవే... చల్లపల్లి మండలం లంకపల్లి నీటి వినియోగ దారుల సంఘం అధ్యక్షుడు పరిసే చలపతిరావు, రైతులు కమ్మిల పెదబాబు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు కలెక్టర్కు వరి పైరు చూపుతూ మాజేరు, లంకపల్లి గ్రామాల్లో మోంథా తుపాను వలన వరి పైరుకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వరిపైరుకు పాలు పట్టే సమయంలో బలమైన ఈదురు గాలులు రావడంతో పంట నేల వాలిపోయిందన్నారు. కొంత పంట నేల వాలకపోయినా నీరు నిలిచి కంకుల్లో 25శాతం నుంచి 50శాతం గింజలు ఉన్నాయన్నారు. మొత్తం మీద కేజీన్నర గింజలకు గాను కేవలం 150 గ్రాములు అది కూడా తాలూతప్పలు ఉన్నాయన్నారు. తమ ప్రాంతంలో ఈ పంట నమోదు కాలేదని, నష్టాన్ని బట్టి సజావుగా లెక్క కట్టి రైతులను ఆదుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులు అందరికీ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించాలని, తుపానులో నష్టపోయిన రైతులు, కౌలు రైతులందరికీ సర్వే చేసి నష్టపరిహారం అందించాలని, నిబంధనలు సడలించి తుపాను వలన నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం పోను మిగిలిన మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తుపాను వలన పంట నష్ట పోయిన రైతులకు పంటల బీమా వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కోసూరి శివనాగేంద్ర, కార్యదర్శి గౌరీశెట్టి నాగేశ్వరరావు విజ్ఞప్తిచేశారు. ఉయ్యూరు మండలం గండిగుంటకు చెందిన వృద్ధురాలు, దివ్యాంగురాలు గరిమెళ్ళ ఝాన్సీరాణి తన కుమార్తె శ్రీలక్ష్మి సహాయంతో చక్రాల కుర్చీలో కలెక్టరేట్కు వచ్చింది. కలెక్టర్ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడు శ్రీనివాసరావు రెండేళ్ల క్రితం కానూరులోని అనాథాశ్రమంలో నెలనెలా డబ్బులు కట్టే విధంగా చేర్చాడని, ఇటీవల గన్నవరం మండలంలోని ముస్తాబాద్లో తనకు ఉన్న 3 సెంట్ల స్థలాన్ని అమ్మాలని ఒత్తిడి తెస్తున్నాడన్నారు. తాను అందుకు నిరాకరించడంతో ఆశ్రమానికి డబ్బులు చెల్లించడం లేదని, దాంతో తాను ఈడుపుగల్లులో ఉన్న కుమార్తె ఇంటికి చేరుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. కలెక్టర్ స్పందించి ఉయ్యూరు ఆర్డీవో హేలాషారోన్కు ఫోన్ చేసి సీనియర్ సిటిజన్ చట్టం కింద కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. -
కళ్ల ముందు నష్టం కనిపిస్తున్నా..
ఆకుమర్రు గ్రామంలో నాలుగున్నరఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. తుపానుకు పంటంతా నీటిలో నానుతున్నా పంట నష్టం నమోదు చేయడం లేదు. పొలంలోనుంచి నీరు బయటకు వెళ్లకపోవడంతో పొట్టదశలో ఉన్న పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వాటిల్లిన రైతులందరికీ పరిహారం అందేలా చూడాలి. –ఓడుబోయిన బ్రహ్మకృష్ణ, రామరాజుపాలెం మద్దిపట్ల గ్రామంలో ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. మోంథా తుపానుకు పంటంతా నేలకొరిగింది. కళ్లముందు పంట నష్టం కనిపిస్తున్నా నమోదు చేయలేదు. ఎందుకు నమోదు చేయడం లేదని అడిగితే ఏఓ గారిని అడగమంటున్నారు. –డొక్కు నాగమల్లేశ్వరరావు, తరకటూరు -
నేడు వైఎస్ జగన్ పర్యటన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తుపాను కృష్ణాడెల్టాకు తీరని నష్టం మిగిల్చింది. ఈదురుగాలులు, భారీ వర్షాలకు వరి పొలాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఉద్యాన పంటలైన బొప్పాయి, అరటి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. వరి దుబ్బులు మీదుగా వర్షపునీరు ప్రవహించింది. చిరుపొట్ట, గింజ గట్టిపడే దశలో వర్షం కురవటంతో తాలు,తప్ప గింజ ఏర్పడుతుందని, మానుగాయ వచ్చి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు ఒక్కో ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. పంట చేలు కోతకు సిద్ధమయ్యే దశలో వచ్చి పడ్డ తుపానుతో పెట్టుబడులు పూర్తిగా నీటిపాలైనట్టేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంటలు డెబ్బతింటే ఎకరాకు రూ.25 వేలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందని, ఇప్పుడు ఎకరాకు పంట నష్ట పరిహారం రూ.10వేలు ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. పంట నష్టం సర్వే లోనూ మెలిక ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలతో అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. సబ్సిడీ ఎగ్గొట్టడమే లక్ష్యంగా కుట్రలు సాగుతున్నాయి. పంట నష్టం పరిహారానికి సంబంధించి రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద నమోదు కోసం వెళితే నష్ట పరిహారం కావాలంటే మీ ధాన్యం మేము కొనేది లేదని అధికారులు చెబుతున్నారని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల్లో పంట నష్టం అంచనాలు రూపొందించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు కాలేదని రైతులు వాపోతున్నారు. తమకు రైతు భరోసా అందలేదని కౌలు రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లడిల్లుతున్న రైతులు తమ కళ్ల ముందే నేల వాలిన పంటను చూసి తల్లడిల్లిపోతున్నారు. ఎకరానికి కౌలు రూ.30 వేలు, పంట పెట్టుబడి రూ.35 వేలు మొత్తం గంగ పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పది రోజుల్లో చేతికొచ్చే పంట పూర్తిగా నీళ్లలో నాని కుళ్లిపోతోందని, గింజలు మొలకెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. అరకొర మిగిలిన పంట కోయాలన్నా, మామూలు సమయంలో పంట కోతకు ఎకరాకు 2 గంటల సమయం పడితే, ఇప్పుడు 4 గంటల సమయం పడుతుందని, పైగా గింజలు రాలిపోతాయని, మిగిలిన అరకొర దిగుబడులు పంటకోత ఖర్చులకు కూడా రావని మథనపడుతున్నారు. ఒక వేళ కొంత మంది రైతులు ధైర్యం చేసి నేలకు వాలిన పంటను పైకి లేపి కట్టాలన్నా ఎకరాకు 100 మంది కూలీలు అవుతున్నారని, కూలీ రూ.330 చొప్పున రూ.33వేలు అవుతుందని వాపోతున్నారు. నిలబడిన వరి పంటకూ నష్టమే... మోంథా తుపాను వివిధ దశల్లో ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం చేకూర్చింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈనిక, చిరుపొట్ట దశలో ఉన్న పంటకు కనపడని నష్టాన్ని కలిగించింది. ఈదురు గాలులకు కంకులు ఒక దానికొకటి రాసుకుని తాలు..తప్ప కంకులు వస్తున్నాయి. చిరుపొట్ట మీద ఉన్న వరి కర్రలు పొట్టలు పగిలి దిగుబడులపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా సరాసరి ఎకరాకు పది నుంచి 15 బస్తాలు దిగుబడి తగ్గి పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావానికి వరి పంట నేల వాలి పడిపోకుండా నిలబడి ఉన్న పంటకు కూడా నష్టం తప్పదని, పడిపోకుండా నిలబడిన వరి పంటకు ప్రభుత్వం నుంచి నష్టం కూడా రాదని రైతులు వాపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గంలోని గూడూరు చేరుకుంటారు. మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి హైవే మీదుగా తాడేపల్లి చేరుకుంటారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సుబ్బన్న, చిటికెన నాగేశ్వరరావు పరిశీలించారు. జగన్ పర్యటన సాగే రామరాజుపాలెం నుంచి గొల్లపాలెం వరకు వరకు ప్రయాణించారు. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025మోంథా తుపానుతో అన్నదాతకు గుండె కోత పంట నమోదు చేయలేదుఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి సోమవారం విజయవాడకు చెందిన ముగ్గురు భక్తులు విరాళాలను అందజేశారు.కోడూరు: ప్రముఖ ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సోమవారం 250 మంది శిష్య బృందంతో కలిసి కృష్ణా సాగరసంగమ ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లాలోపంట నష్టం ఇలా... (ప్రాథమిక అంచనా ఎకరాల్లో) తుపాను ప్రభావితమైన గ్రామాలు : 427 మొత్తం పంట నష్టం : 1,16,342.5 బాధిత రైతులు : 56040 వరి పంట : 1,12,600 బాధిత రైతులు : 54180 వేరుశనగ పంట : 720.5 బాధిత రైతులు : 586 మినుము పంట : 2462.5 బాధిత రైతులు : 1249 పత్తి పంట : 107.5 బాధిత రైతులు : 43 మొక్క జొన్న : 01 బాధిత రైతులు : 02 ఉద్యాన పంటలు : 3540.55 బాధిత రైతులు : 2229 ఉద్యాన పంట నష్టం అంచనా : రూ.73.45 కోట్లు గూడూరు మండలంలో నేలవాలిన వరి పైరు ప్రకృతి ప్రకోపానికి వరికంకులు తలలు వాల్చాయి. అన్నదాతకు గుండెకోతే మిగిలింది. ఆరుగాలం పడిన శ్రమ చేతికందే సమయంలో మోంథా తుపాను గద్దల్లే తన్నుకుపోయింది. సర్కారు నుంచి భరోసా లేకపోగా పంట నష్టం సర్వేలోనూ అడ్డగోలు నిబంధనలు పెడుతోంది. దీంతో అన్నదాత కష్టాల సుడి గుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు.7 -
రైతులకు అన్యాయం జరిగితే మరో పోరాటానికి సిద్ధం: వైఎస్ జగన్
కృష్ణా జిల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. దారిపొడవునా ఆయనకు రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు.04-11-20254: 30 PMఅనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..విపత్తులు వస్తే రైతులను పట్టించుకోరా?ఏపీలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందివిపత్తులు వచ్చినా రైతులను పట్టించుకోని పరిస్థితి మోంథా తపానుతో అత్యధికంగా వరిపంట నష్టం జరిగిందిగింజలు పాలు పోసుకునే సమయంలో దెబ్బతింది4 లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న , అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయికూటమి పాలనలో రైతుల పంటలకు ఇన్సూరెన్స్ లేదు18 నెలల కూటమి పాలనలో 16 విపత్తుల వచ్చాయిఅన్నదాత సుఖీభవ పేరతో రైతులను మోసం చేశారురూ. 40 వేలు ఇవ్వాల్సింది కేవలం రూ. 5 వేలు మాత్రమే ఇచ్చారుమా హయాంలో రైతులకు భరోసా ఉండేదిజగనన్న ఉన్నాడనే భరోసా రైతులకు ఉండేదిప్రతీ రైతును ఆర్బీకేలు చేయిపట్టుకొని నడిపించాయిప్రతీ ఆర్బీకేలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉండేవాడుమా హయాంలో ఈ-క్రాప్ నమోదు చేసేవాళ్లంఈ క్రాప్తో ప్రతిరైతుకు న్యాయం జరిగేదిపంట కొనుగోలుకు కాంపిటేషన్ క్రియేట్ చేశాంరూ. 7,800 కోట్లతో పంటలకు గిట్టబాటు ధర ఉండేలా చేశాంరూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం85 లక్షల మంది రైతులకు మేం ప్రీమియం చెల్లించాంఇప్పుడు 19 లక్షల మంది రైతులకు మాత్రమే బీమా ఉంది ఉచిత పంటల బీమా తీసేయడం దారుణం కాదాఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ కోసం అధికారులు రాలేదుఒక్క రోజులోనే ఎన్యమురేషన్, ఆడిట్ అయిపోయిందిచంద్రబాబు తప్పిదం వల్లే..చంద్రబాబూ.. నీ తప్పిదం వల్లే రైతులకు ఉచిత పంట బీమా లేకుండా పోయిందిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారుఆ బకాయిలను వెంటనే రైతులకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడ్ని డిమాండ్ చేస్తున్నాంఏ రాష్ట్రంలో అయినా రైతు కన్నీర పెడితే మంచిది కాదురైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోంరైతులకు అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ తరుఫున పోరాటానికి సిద్ధమని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాకృష్ణా జిల్లా :మోంథా తుఫానుకు కారణంగా నేలకొరిగిన వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడిన వైఎస్ జగన్పంట పొలాలను వైఎస్ జగన్ పరిశీలన బాధిత రైతులకు వైఎస్ జగన్ ఓదార్పుతుపాను దెబ్బకు తడిసిన కంకులను వైఎస్ జగన్కు చూపించిన రైతులు పంట నష్టం అంచనా వేయలేదంటూ రైతుల ఆవేదన 18నెలల కాలంలో ఇన్పుట్ సబ్సీడీ రాలేదన్న రైతులు రామరాజుపాలెం చేరుకున్న వైఎస్ జగన్ పంటపొలాలను పరిశీలించనున్న వైఎస్ జగన్పంటపొలాలను సందర్శించే చోట పోలీసుల పేరుతో వెలిసిన ఫ్లెక్సీలుజనం వెనక్కి వెళ్లిపోవాలంటూ హుకుంజగన్తో పాటు వస్తున్న వాహనాలను నిలిపేసిన పోలీసులుచెక్ పోస్టు పెట్టి బైకులు, కార్లు నిలిపివేతరైతులను కూడా తరిమేస్తున్న పోలీసులు మూడున్నర గంటలు ఆలస్యంగా జగన్ పర్యటనకృష్ణా జిల్లా గూడూరు చేరుకున్న వైఎస్ జగన్గూడూరుకు ఉదయం 11:30 గంటలకు రావాల్సి ఉన్నా మూడున్నర గంటలు ఆలస్యంవిజయవాడ నుండే రోడ్డు పొడవునా జగన్ స్వాగతం పలుకుతున్న రైతులు, మహిళలు, కార్యకర్తలుదారి మధ్యలో ప్రతిచోటా జగన్కు ఘన స్వాగతందారి పొడవునా జగన్కు తమ కష్టాలు చెప్తున్న రైతులుతుపాను దెబ్బకు తడిచిన వరి కంకులు, కుళ్లిపోయిన పసుపు, అరటి పిలకలను జగన్కు చూపిస్తూ భోరుమన్న రైతులుబాధిత రైతులను ఓదార్చిన జగన్గూడూరు చేరుకున్న వైఎస్ జగన్కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోకి ఎంటరైన వైఎస్ జగన్గూడురు చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికిన మహిళలు,రైతులుదారి పొడవునా వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతంరోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన మహిళలు, రైతులుతరకటూరు చేరుకున్న వైఎస్ జగన్పెడన నియోజకవర్గంలోకి ఎంటరైన వైఎస్ జగన్తరకటూరు చేరుకున్న జగన్నిడమోలులో వైఎస్ జగన్నిడుమోలు చేరుకున్న వైఎస్ జగన్రోడ్డుకు ఇరువైపులా భారీగా నిల్చున్న రైతులుఎండ తీవ్రతలోనూ జగన్ కోసం వేచి ఉన్న రైతులుకృష్ణా జిల్లాలో వైఎస్ జగన్కు అడుగడుగునా అపూర్వ స్వాగతంవైఎస్ జగన్ కోసం దారి పొడవునా ఎదురు చూస్తున్న అభిమానులుఈడుపుగల్లులో వైఎస్ జగన్ను కలిసిన మహిళా రైతులునష్టపోయినవ అరటి, వరి పంటను వైఎస్ జగన్ చూపించిన రైతులువరి కంకులను పరిశీలించిన వైఎస్ జగన్మచిలీపట్నంలో పోలీసుల ఆంక్షలుమచిలీపట్నం, సుల్తాన్నగర్, ఎస్ఎన్ గొల్లపాలెంలో బారికేడ్లు పెట్టిన పోలీసులుబారికేడ్లు పెట్టడంతో పొలాల మధ్య నుంచి వస్తున్న రైతులుపామర్రు: 14వ మైలురాయి వద్దకు చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్కు స్వాగతం పలికిన రైతులు, మహిళలుదారిపొడవునా వైఎస్ జగన్కు ఘన స్వాగతంపామర్రు నియోజకవర్గంలో ప్రవేశించిన వైఎస్ జగన్గోపువానిపాలెం చేరుకున్న వైఎస్ జగన్గజమాలలతో జగన్కు స్వాగతం పలికిన కార్యకర్తలుభారీగా తరలివచ్చిన మహిళలు, వృద్ధులుదారి పొడవునా వైఎస్ జగన్కు ఘన స్వాగతంమచిలీపట్నంలో పోలీసుల ఓవరాక్షన్రైతులు, వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులుపోలీసుల తీరుపై పేర్ని కిట్టు ఆగ్రహంగండిగుంట చేరుకున్న వైఎస్ జగన్పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికిన మహిళలుఆకునూరు సెంటర్ కి చేరుకున్న వైఎస్ జగన్జగన్ని కలిసి తమ కష్టాలు చెప్పుకున్న కల్లుగీత కార్మికులునెప్పల్లి సెంటర్లో పోలీసుల ఆటంకాలుజగన్తో వస్తున్న వాహనాలను నిలిపేస్తున్న పోలీసులుచెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాల దారి మళ్లింపుజగన్ కాన్వాయ్ తప్ప మిగతా వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులునెప్పల్లి సెంటర్కు చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికిన రైతులు, మహిళలుదారిపొడవునా వైఎస్ జగన్కు ఘన స్వాగతంగోసాల సెంటర్లో జగన్ని కలిసిన మహిళా రైతులుతుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటను జగన్ జగన్ కు చూపించిన రైతులుతమకు జరిగిన నష్టంపై జగన్కు వినతి పత్రాలు సమర్పించిన అన్నదాతలుఈడుపుగల్లులో జగన్ని కలిసిన మహిళా రైతులుతుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటను జగన్ జగన్ కు చూపించిన రైతులుకంకిపాడు మండలం, నెప్పల్లి సెంటర్లో పోలీసుల ఆంక్షలువాహనాలు మచిలీపట్నం వైపు వెళ్లకుండా బారికేడ్లుడ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ పోలీసులు బెదిరింపులుతాడిగడపలోనూ రైతులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారుబైక్ల తాళాలు లాక్కొని జగన్ను చూసేందుకు వెళ్లకుండా ఆంక్షలు వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు: పేర్ని నానిఎన్ని ఆంక్షలు పెట్టినా జనాన్ని ఆపలేరురైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదువ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారు?పెనమలూరు సెంటర్కి చేరుకున్న వైఎస్ జగన్భారీ బైకు ర్యాలీతో స్వాగతం పలికిన యూత్తాడిగడపలో పోలీసుల అత్యుత్సాహంబైక్లపై వస్తున్న యువతను అడ్డుకుంటున్న పోలీసులువైఎస్ జగన్తో పాటు వెళ్లకుండా అడ్డంకులుజగన్ను రైతులు కలవకుండా భారీగా పోలీసుల మోహరింపురోప్ పార్టీలతో అడ్డుకుంటున్న పోలీసులుపామర్రు: బల్లిపర్రుకు భారీగా చేరుకుంటున్న రైతులురైతులను, వైఎస్సార్సీపీ కార్యకర్తలను అడ్డుకుంటునన్న పోలీసులుకైలే అనిల్కుమార్తో పమిడిముక్కల సీఐ వాగ్వాదంరోడ్డు మీద ఉండొద్దంటూ పోలీసుల ఆంక్షలువిజయవాడ పడమట చేరుకున్న వైఎస్ జగన్గుమ్మడి కాయలతో దిష్టి తీస్తున్న మహిళలుభారీగా తరలి వచ్చిన కార్యకర్తలుపూలు చల్లుతూ ఘన స్వాగతంకృష్ణా జిల్లా పర్యటనకు బయల్దేరిన వైఎస్ జగన్తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలనబాధిత రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్వైఎస్ జగన్ను కలవకుండా రైతులపై ఆంక్షలుజనాన్ని రాకుండా అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు మోహరింపువైఎస్ జగన్ పర్యటించే గ్రామాలను బ్లాక్ చేసిన పోలీసులునేడు కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్న వైఎస్ జగన్రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ షరతులుకేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలుద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలువైఎస్ జగన్ పర్యటనకు రావొద్దంటూ వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులుమాజీ ఎమ్మెల్యే లు, మండల, గ్రామ నాయకులకు నోటీసులతో బెదిరింపులు -
కార్తిక శోభ
మండల దీక్షల స్వీకరణకు తరలివస్తున్న భక్తులు విజయవాడ దుర్గా ఘాట్లో కార్తిక శోభ నెలకొంది. కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారు జామునే పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి, పూజలు చేసి నదిలో దీపాలను వదిలారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వారి మండల దీక్షల స్వీకరణ కొనసాగుతోంది. ఏకాదశి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ బుధవారం వరకు కొనసాగుతుంది. మూడో రోజైన సోమవారం మహా మండపం ఆరో అంతస్తులోని ఉత్సవ మూర్తి వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి భవానీ దీక్షలను స్వీకరించారు. దీక్షల స్వీకరణకు విచ్చేసిన భక్తులతో దీక్షా మండపం అరుణ వర్ణాన్ని సంతరించుకుంది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకుని ఉత్సవ మూర్తి వద్ద దీక్షలను స్వీకరించారు. బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు భవానీ దీక్షలను స్వీకరించే అవకాశం ఉందని ఆలయ అర్చకులు పేర్కొంటున్నారు. దుర్గమ్మ సేవలో మంత్రి సంధ్యారాణి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా సోమవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగ తం పలికారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగ తం పలకగా, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు జరిపించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. అన్నదానం, లడ్డూ పోటులను పరిశీలించిన ట్రస్ట్ బోర్డు దుర్గగుడి అభివృద్ధి పనుల్లో భాగంగా మహా మండపం వద్ద నిర్మాణంలో ఉన్న లడ్డూపోటు, అన్నదాన భవనాలను దుర్గగుడి ట్రస్ట్బోర్డు చైర్మన్ రాధాకృష్ణ, సభ్యులు, ఆలయ అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ నెల 7వ తేదీన ట్రస్ట్ బోర్డు సమావేశం నేపథ్యంలో ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్న బుద్దా వారి గుడి సమీపంలోని ప్రసాదాల వంటశాలను పరిశీలించారు. అనంతరం మహామండపం ఎదుట నిర్మాణంలో ఉన్న లడ్డూపోటును, అన్నదా నం భవనాలను పరిశీలించారు. కనకదుర్గనగర్, గోశా ల వద్ద ఉన్న దుకాణాలను పరిశీలించారు. ఆయా దుకాణాలలో భక్తులకు విక్రయిస్తున్న పేపరు ముక్క చీరలను ట్రస్ట్బోర్డు సభ్యులు, చైర్మన్ పరిశీలించారు. భక్తులను ఈ విధంగా మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చీరలను విక్రయించే వారి పై కఠిన చర్యలు తీసుకునేలా బోర్డు సమావేశంలో చర్చించాలని సూచించారు. గోశాల వద్ద దుకాణాలు ఫుట్పాత్లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడంపై ట్రస్ట్బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసు కోవడం లేదని ప్రశ్నించారు. పర్యటనలో దేవస్థాన అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
రెండు లారీలు ఢీ : ముగ్గురికి గాయాలు
కొణకంచి క్రాస్రోడ్స్(పెనుగంచిప్రోలు): రెండు లారీలు ఢీ కొనడంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలైన ఘటన మండల పరిధిలోని కొణకంచి క్రాస్ రోడ్స్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ కొణకంచి గ్రామంలో నుంచి జాతీయ రహదారి పైకి వస్తున్న లారీని ప్రమాదవశాత్తూ వెనుక వైపు నుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీడ్రైవర్ నల్గొండ జిల్లా మునగాలకు చెందిన పాలకూర శ్రీశైలం తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి విజయవాడ తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెపక్తక్రా ఓవరాల్ చాంపియన్ కృష్ణా
ఉరవకొండరూరల్: రెండు రోజులుగా ఉరవకొండ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అండర్ –14, 19 రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా బాలబాలికల క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 280 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ –19 బాలబాలికల విభాగంలో కృష్ణా జిల్లా మొదటి స్థానం, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్లు నిలిచాయి. అండర్– 14 బాలుర విభాగంలో మొదటి స్థానంలో తూర్పు గోదావరి, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి, మూడో స్థానంలో కర్నూలు, బాలికల విభాగంలో మొదటి స్థానంలో నెల్లూరు, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి, మూడో స్థానంలో అనంతపురం జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు ఆల్ ఇండియా సెపక్ తక్రా పెడరేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కృష్ణా జిల్లా ఏపీ స్కూల్ గేమ్స్ పరిశీలకుడు రమేష్, ఉరవకొండ ఎంఈఓలు ఈశ్వరప్ప, రమాదేవి, పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి, ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ ట్రోఫీ, మెడల్స్ ప్రదానం చేశారు. పోటీలను పీడీలు మారుతీ ప్రసాద్, పుల్లా రాఘవేంద్ర, ప్రభాకర్, చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు, ముద్దలాపురం శివ తదితరులు పర్యవేక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే ఏపీ జట్టుకు ఎంపిక చేశారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): బీరువా పగలగొట్టి బంగారు, వెండి, నగదు చోరీకి గురైన ఘటన సోమవారం జక్కంపూడి కాలనీలో చోటుచేసుకుంది. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి కాలనీలో బ్లాక్ నంబర్ 208లో షేక్.నాగూర్బీ, మస్తాన్ దంపతులు నివాసం ఉంటున్నారు. మస్తాన్ ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్ షాపులో పని చేస్తుంటాడు. సోమవారం ఉదయం భార్యాభర్తలు పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన మస్తాన్కు తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఇంటి లోపలకు వెళ్లి చూడగా, బీరువా తాళాలు విరగొట్టి అందులోని వస్తువులను చిందర వందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో దాచిన 12 గ్రాముల బంగారపు వస్తువులు, 15 తులాల వెండి పట్టీలు, రూ.10 వేల నగదు కనిపించలేదు. దీంతో వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పెనమలూరు: పోరంకిలో గంజాయి కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ ఉషారాణి తెలిపిన వివరాల ప్రకారం పోరంకి బీజేఆర్ నగర్ వద్ద పోలీస్ సిబ్బంది పర్యటిస్తుండగా సంచితో ఉన్న ఏడుగురు వ్యక్తులు పారిపోయే యత్నం చేశారు. వారిలో నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకోగా ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. దొరికిన వ్యక్తుల వద్ద సంచి స్వాధీనం చేసుకోని తనిఖీ చేయగా అందులో కేజీన్నర గంజాయి గుర్తించారు. నిందితులపై కేసు నమో దు చేసి అరెస్ట్ చేశారు. పరారైన ముగ్గురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
జి.కొండూరు: కారు ఢీ కొనడంతో సైకిల్పై వెళ్తున్న వృద్ధుడు దుర్మరణం చెందిన ఘటన జి.కొండూరు మండల పరిధి విద్యానగరం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జి.కొండూరు మండల పరిధి పినపాక గ్రామానికి చెందిన కోసూరి బాబూరావు(57) సైకిల్పై జి.కొండూరు వైపు నుంచి 30వ నంబర్ జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో పినపాక వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో విద్యానగరం వద్ద పినపాక గ్రామం వైపు యూటర్న్ తీసుకుంటుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు సైకిల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన బాబూరావు తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయాడు. క్షతగాత్రుడిని ఢీ కొట్టిన కారులోనే చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. గూడూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై రామరాజుపాలెం అడ్డరోడ్డు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గూడూరుకు చెందిన పెద్దిపోయిన వెంకటరాజు(38) కొన్నేళ్ల క్రితం మచిలీపట్నం సుకర్లాబాదలో ఇల్లు కట్టుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడూ గూడూరు వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గూడూరు వచ్చిన వెంకట్రాజు గూడూరు మసీదు సెంటరులో తారసపడిన గొరిపర్తి నాగేంద్రంను కూడా తన ద్విచక్రవాహనం ఎక్కించుకుని బందరు బయలుదేరాడు. రామరాజుపాలెం అడ్డరోడ్డు దాటిన తర్వాత వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో వెంకటరాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వెంటనే ప్రైవేటు అంబులెన్స్లో బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరాజుకు భార్య, ఇద్దరు సంతానం. నాగేంద్రం స్వల్పగాయాలతో బయట పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెనమలూరు: తాడిగడప గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతా మల్లిఖార్జునరావు(49) అరటి ఆకులు కోసి మార్కెట్లో విక్రయిస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అరటి తోటకు వెళ్లాడు. అయితే మల్లిఖార్జునరావు అరటి తోటలో పడి పోయి ఉండటాన్ని కొమ్మునాగరాజు చూసి వెంటనే అతని కుటుంబ సభ్యులను సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు అక్కడకు వద్ద వచ్చి చూడగా అప్పటికే మల్లిఖార్జునరావు మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు లిఖిల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
నేటి నుంచి స్కూల్ గేమ్స్ సెలక్షన్స్
గూడూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ క్రీడా విభాగాలలో ఉమ్మడి కృష్ణాజిల్లా అండర్–14, 17 బాలుర, బాలికల జట్ల ఎంపికలు ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ కృష్ణాజిల్లా సెక్రటరీ మత్తి అరుణ తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 4న గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో చెస్, అథ్లెటిక్స్ సెలక్షన్స్, 5న గన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో యోగా సెలక్షన్స్, గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్, ఖోఖో సెలక్షన్స్ జరుగుతాయన్నారు. 6న గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సాఫ్ట్బాల్, బేస్ బాల్ సెలక్షన్స్, 7న గూడూరు జెడ్పీ హైస్కూల్లో కబడ్డీ సెలక్షన్స్ నిర్వహిస్తామని అరుణ చెప్పారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. హెచ్ఐవీ బాధితులు యాంటీరెట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) మందులు క్రమం తప్పకుండా వాడడంతో ఆరోగ్యంగా జీవించవచ్చని, వ్యాప్తి కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు పెంచాలన్నారు. మచిలీపట్నం ఏఆర్టీ సెంటర్ ఆధునికీకరించామన్నారు. గుడివాడ ఏఆర్టీ సెంటర్కు సౌకర్యాల లోపం ఉందని అధికారులు వివరించగా, సీఎస్ఆర్ నిధులతో భవనం ఏర్పాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 7,085 మంది హెచ్ఐవీ బాధితులు ఏఆర్టీ సెంటర్ ద్వారా చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ పి.యుగంధర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శేషుకుమార్ పాల్గొన్నారు. -
కూచిపూడిలో చాగంటికి నాట్య నీరాజనాలు
కూచిపూడి(మొవ్వ): ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు సోమవారం నాట్య క్షేత్రం కూచిపూడిలో ఘన స్వాగతం లభించింది. కోలాట భజనలు, మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో వేదపండితుల ఆశీర్వచనాల నడుమ శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు సోమవారం సాయంత్రం ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నూతన వస్త్రాలతో సత్కరించారు. ఆలయ సమీపంలోని శ్రీ సిద్ధేంద్రయోగి కళా వేదికపై జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి చాగంటి కోటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.మునిరత్నం నాయుడు, గ్రామ సర్పంచ్ కొండవీటి వెంకటరమణ విజయలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, ఎంపీడీవో డి.సుహాసిని, దేవాలయ పాలక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న నాట్య ప్రదర్శనలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠం విద్యార్థులతో పాటు హైదరాబాద్, కాకినాడకు చెందిన కూచిపూడి కళాకారులు ప్రదర్శించిన నాట్యాంశాలు ఆకట్టుకున్నాయి. అలాగే చాగంటి కోటేశ్వరరావు మనుమరాలు శ్రీకరి (కాకినాడ) ప్రదర్శించిన రామాయణ శబ్దం చక్కని హావభావాలతో ప్రదర్శించి ప్రేక్షకులను అబ్బురపరిచింది. శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠం ఉప ప్రధానాచార్యులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ నృత్య దర్శకత్వంలో నిర్వహించిన మోహిని భస్మాసుర నృత్య రూపకం ఆశీనులను భక్తి భావంలోకి తీసుకువెళ్లింది. -
ఎస్జీఎఫ్ తైక్వాండో పోటీల్లో అక్కా చెల్లెళ్ల ప్రతిభ
ఇబ్రహీంపట్నం: రాష్ట్ర స్థాయి స్కూల్గేమ్స్ ఫెడరేషన్ తైక్వాండో పోటీల్లో ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఉత్తమ ప్రతిభ చాటి బంగారు, రజత పతకాలు సాధించారు. ఈ నెల 1, 2 తేదీల్లో ఏలూరులో జరిగిన అండర్–17 పోటీలో చెల్లెలు కలతోటి దామిని బంగారు పతకం సాధించింది. గత 26, 27 తేదీల్లో రైల్వే కోడూరులో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో అండర్–19 పోటీల్లో అక్క కలతోటి హాసిని రజత పతకం కై వసం చేసుకుంది. బంగారు పతకం సాధించిన దామిని జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై ంది. దామిని గుణదల డాన్బాస్కో పాఠశాలలో తొమ్మిదో తరతగతి చదువుతుండగా, అక్క హాసిని గుంటూరులో ఇంటర్మీడియెట్ చదువుతున్నట్లు తల్లిదండ్రులు రమేష్బాబు, స్నేహలత తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి ఎం.అంకమ్మరావు, పసుపులేటి గౌరీశంకర్ కోచింగ్లో తైక్వాండో పోటీల్లో తమ పిల్లలు రాణిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. దామిని అరుణాచలప్రదేశ్లో జరుగనున్న జాతీయస్థాయిలో పాల్గొని రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో బంగారు, రజత పతకాలు సొంతం -
స్కాన్ చేయండి.. పన్నులు చెల్లించండి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామ పంచాయతీకి సంబంధించి పన్నులు ఆన్లైన్ ద్వారా చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సులభతరం చేసిందని, ఈ వెసులుబాటును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. సోమవారం మీ కోసం సమావేశ మందిరంలో జేసీ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్లతో కలిసి స్వర్ణ పంచాయతీ – నిమిషాల్లో పన్నులు చెల్లించండి పేరుతో రూపొందించిన వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణ..కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సోమవారం నుంచి ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించే నూతన విధానం ప్రారంభించిందన్నా రు. ఈ పద్ధతిలో సులభంగా పంచాయతీ పన్ను ల న్నీ చెల్లించవచ్చని చెప్పారు. ప్రతి పంచాయతీ కార్యాలయం, సచివాలయం ప్రభుత్వ కార్యాలయాల్లో వాల్పోస్టర్లను ప్రదర్శిస్తామన్నారు. కార్యక్రమంలో డీపీవో జె.అరుణ, బందరు ఆర్డీవో స్వాతి, కేఆర్ఆర్సీఎస్ డీసీ శ్రీదేవి, సీఐ శ్రీను, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 7న హాకీ శతాబ్ది వేడుకలు మచిలీపట్నంఅర్బన్: భారత దేశంలో హాకీ క్రీడకు నవంబర్ 7తో 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన మీటింగ్ హాల్లో హాకీ శతాబ్ది వేడుకల వాల్ పోస్టర్ను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాకీ భారతదేశపు గర్వకారణమైన జాతీయ క్రీడగా నిలిచిందన్నారు. జిల్లాలో హాకీ అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. హాకీ కృష్ణా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన గూడూరులోని జెడ్పీ హైస్కూల్లో శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, హాకీ కృష్ణా అసోసియేషన్ అధ్యక్షుడు సన్నిధి నాగసాయి శ్రీనివాస్, కార్యదర్శి శ్రవణం హరికృష్ణ, కోశాధికారి పీఎస్ విఠల్, సభ్యులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి సోమవారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. విజయవాడ విద్యాధరపురానికి చెందిన ఎం.అప్పాజీరావు దంపతులు నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని ఆలయ ఈవో శీనానాయక్కు అందించారు. విజయవాడ అయోధ్యనగర్కు చెందిన కె.వెంకటరత్న సుబ్రహ్మణ్య శర్మ, అరుణకుమారి దంపతులు నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని, భవానీపురానికి చెందిన రామలింగేశ్వరరావు, సీతాలక్ష్మి దంపతులు బి.పవన్హర్షిత్ శ్రీరామ్ కుటుంబం ఆలయ అధికారులను కలిసి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
వైఎస్ జగన్ పర్యటనపై బాబు సర్కార్ ఆంక్షలు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై చంద్రబాబు సర్కార్ అడుగడుగునా ఆంక్షలు పెడుతోంది. వైఎస్ జగన్ను కలవకుండా రైతులపై ఆంక్షలు విధిస్తోంది. జనాన్ని రాకుండా అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు మోహరించారు. వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలను పోలీసులు బ్లాక్ చేశారు.నేడు కృష్ణా జిల్లాలో మోంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో ఆయన మాట్లాడనున్నారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు.కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు పెట్టారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలు విధించిన పోలీసులు.. వైఎస్ జగన్ పర్యటనకు రావొద్దంటూ వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు నోటీసులతో పోలీసులు బెదిరింపు చర్యలకు దిగారు. -
బాబు పాలనలో ఆత్మహత్యలే శరణ్యమా
బాపట్ల/తిరుపతి అర్బన్/ మచిలీపట్నం అర్బన్: సమస్యలు పరిష్కారం కాకపోవడం, కూటమి నేతల వేధింపులు తాళలేక సోమవారం రాష్ట్రంలోని కలెక్టర్ కార్యాలయాల వద్ద పలువురు ఆత్మహత్యాయత్నం చేశారు. భూ వివాదానికి సంబంధించిన సమస్యపై ఎన్ని అర్జీలు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తి, ఇంటి స్థలానికి సంబంధించి కూటమి నేతల వేధింపులు భరించలేక తిరుపతి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు, అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా వితంతు పింఛను రావడంలేదని కృష్ణా జిల్లాకు చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు.టీడీపీ నేతల వేధింపులతో..కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతల వేధింపులు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ఇంటి స్థలాల విషయంలో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ టీడీపీ నాయకులు తరచూ తమ ఇంటికి పోలీసులను పంపి వేధిస్తున్నారని తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం ఇద్దరు మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు వెంకటసుబ్బమ్మ, లక్ష్మీదేవి మీడియాకు తమ సమస్యను తెలిపారు. తిరుపతి నగరం సంజయగాంధీ కాలనీలో తమ ఇద్దరికి ఇంటి స్థలాలు ఉన్నాయని చెప్పారు. రేకులను ఏర్పాటు చేసుకుని 20ఏళ్లకు పైగా జీవనం సాగిస్తున్నామన్నారు.తహసీల్దార్ తమకు ల్యాండ్ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. 20ఏళ్లకు పైగా మున్సిపాలిటీకి ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తిరుపతి నగరంలో 18 రోడ్లను విస్తరించారని, అందులో తమ ఇళ్ల సమీపంలోనూ కొత్త రోడ్లు ఏర్పాటు చేశారన్నారు. దీంతో అక్కడ ఇంటి స్థలాల ధరలు అత్యధికంగా పెరిగినట్లు వెల్లడించారు. అనంతరం తాము రేకుల ఇళ్లను తొలగించి చిన్నపాటి భవనాన్ని నిర్మించుకుంటున్నామని, ఈ క్రమంలో టీడీపీకి చెందిన రజనీకాంత్ అనే నాయకుడు తమ అనుచరులను పంపించి ఇంటి నిర్మాణాలను అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారు.కోర్టును ఆశ్రయిస్తే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, అయినప్పటికీ టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేపదే తమ ఇంటికి పోలీసులను పంపుతున్నారని వాపోయారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా టీడీపీ నేతకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక సోమవారం కలెక్టరేట్ వద్ద కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకుని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారని, విచారణ చేసి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు.వితంతు పింఛను రావట్లేదంటూ..కృష్ణాజిల్లా కలెక్టరేట్లో సోమవారం ‘మీకోసం’లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యనమలకుదురు డొంక రోడ్డు ప్రాంతానికి చెందిన తోట కృష్ణవేణి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి పోలీసులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కృష్ణవేణి తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి సమావేశానికి హాజరై సీఐ శీను వద్ద తమ సమస్యను వివరిసూ్తనే ఒక్కసారిగా పెట్రోల్ సీసా తీసి ఒంటిపై పోసుకుంది. వెంటనే అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆమెను తన వద్దకు పిలిపించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణవేణి కుమార్తె లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. తన తల్లికి వితంతు పింఛను రాకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, విద్యుత్ బిల్లు పేరు మార్పు సాధ్యం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చింది.పురుగు మందు తాగి..భూ వివాదానికి సంబంధించి ఎన్ని అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి పురుగుమందు తాగి సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు అప్రమత్తమై అతడిని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చిన్నగంజాం మండలం మున్నంవారిపాలేనికి చెందిన బాధితుడు మార్పు బెన్ను కథనం మేరకు..‘1981లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 22 కుటుంబాలు, సర్వే నంబర్ 1158 లో ప్రభుత్వం మంజూరు చేసిన 56 ఎకరాలను సాగు చేసుకుంటున్నాయి.ఏడేళ్ల క్రితం మా భూమిని మన్నె సునీల్ చౌదరికి లీజుకు ఇచ్చాం. అతడు లీజు సక్రమంగా చెల్లించకపోగా ఆ భూమిలో చేపల చెరువులు వేసి అతడి భార్య రాధిక పేరుతో సర్వే నంబర్ 1159తో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి చేపల చెరువులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించుకొని సర్వే నంబర్ 1158 భూమికి సంబంధించిన చెరువులను సాగు చేసుకుంటున్నాడు. మా భూమిని మాకు అప్పగించాలని గతనెల 13న గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాం. ఆ ఫిర్యాదు విద్యుత్ శాఖ ఏడీ వద్దకు చేరింది. అక్కడి నుంచి చిన్న గంజాం విద్యుత్ ఏఈకి వచ్చింది.ఈ సమస్య నా పరిధిలోనిది కాదని ఏఈ సమాధానమిచ్చారు. ఒకసారి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగించాక దాన్ని రద్దు చేయలేమని ఏఈ చెబుతున్నారు. మొదట్లో టీడీపీ నేత శ్రీను మా పొలాలను లీజుకు తీసుకున్నాడు. అతని నుంచి సునీల్ తీసుకొని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మా పొలాలకు లీజులు చెల్లించడం లేదు. మా పొలాలను స్వాధీనం చేయకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తాను’ అని స్పష్టం చేశాడు. -
నేడు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు.మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను వైఎస్ జగన్ పరిశీలించి.. రైతులతో మాట్లాడతారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది. -
స్మృతివనం నిర్వహణపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): స్మృతివనం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మహనీయునికి విశిష్ట గౌరవం కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంలతో కలిసి సమన్వయ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించిన అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్మృతివనం నిర్వహణలో ఎలాంటి అలసత్వానికి చోటులేదని చెప్పారు. ఇప్పటివరకు నిర్వహణ బాధ్యతలు చూసిన కాంట్రాక్టు సంస్థను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ సంస్థను ఆదేశించామని తెలిపారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే బ్లాక్లిస్ట్లో పెడతామని హెచ్చరించారు. స్మృతివనం నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలకు అప్పగించిందని వెల్లడించారు. ఈ శాఖల ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా నిరంతర కృషి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో విజయవాడ నగర పాలక సంస్థ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, ఏపీఐఐసీ, సాంఘిక సంక్షేమం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
అవినీతిపై పోరాటానికి ముందుకు రావాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజాభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని, దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్–2025లో భాగంగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీజీ అతుల్ సింగ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన విజిలెన్స్ అవేర్ నెస్ వీక్ నవంబర్ రెండో తేదీతో ముగుస్తుందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని చేపట్టామన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిల్లో కూడా సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదు చేయండి.. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేయాలనుకుంటే 1064కు కాల్ చేయవచ్చని ఏసీబీ డీజీ చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ బెంజ్ సర్కిల్ మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకూ వెళ్లి తిరిగి ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంది. ఏసీబీ డైరెక్టర్ ఆర్. జయ లక్ష్మి, హెడ్ క్వార్టర్స్ అడిషనల్ ఎస్పీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ -
చరిత్రలో ఇదే మొదటిసారి..
వసూళ్ల ‘వాణిజ్యం’లో వీరిదే హవాఅటెండ్ల దందా ఇలా.. అధికారులూ ఏం తక్కువ కాదు.. బదిలీలు లేకపోవటమే కారణమా? వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్ల దందా కుటుంబ సభ్యులను అధికారులుగా చూపి ముడుపులు దండుకుంటున్న వైనం అధికారులు సైతం ముడుపుల వసూళ్లకు వీరినే వినియోగిస్తున్న పరిస్థితి దీనిని అలుసుగా తీసుకొని రెచ్చిపోతున్న అటెండర్లు ఒక అటెండర్ను ఏసీబీ పట్టుకోవటం మొదటిసారి అంటున్న అధికారులు సస్పెండ్ అవుతున్నా వెనుకకు తగ్గని వైనం -
వెలకట్టలేని త్యాగం.. వెలుగులు నింపిన ప్రాణం
గుడివాడరూరల్: అవయవ దానం ద్వారా నలుగురు జీవితాల్లో చిరు వ్యాపారి వెలుగులు నింపి సజీవంగా నిలిచారు. పట్టణంలోని బంటుమిల్లిరోడ్డు పెద్ద మసీదు వద్ద నివసించే చిరు వ్యాపారి హరి విజయకుమార్ (46) బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానమిచ్చి ఆదర్శంగా నిలిచారు. మూత్రపిండం, కాలేయం మణిపాల్ ఆసుపత్రికి అందచేయగా విజయవాడలో అవసరమైన వారికి అవయవ మార్పిడి నిర్వహించారు. మరో కిడ్నీ విజయవాడ కామినేని హాస్పటల్కు, నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. గత నెల 30వ తేదీన హరి విజయ్కుమార్ గుడివాడ నుంచి బ్యాంక్ పని నిమిత్తం మంగళగిరి వెళ్లారు. ఈక్రమంలో ఆయనకు ఆకస్మికంగా ఫిట్స్ రావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్లో తీవ్ర రక్తస్త్రావం అయిందని గుర్తించి మెరుగైన వైద్యం కోసం మణిపాల్ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు అవసరమైన పరీక్షలు చేసి బ్రెయిన్డెడ్ అని నిర్థారించారు. ఈ నేపధ్యంలో భార్య యోగవిష్ణు ప్రియ, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏపీ జీవన్ దాన్ చైర్మన్ డాక్టర్ రాంబాబు, మణిపాల్ వైద్యశాల డైరెక్టర్ రామాంజనేయరెడ్డి పర్యవేక్షణలో అవయవదానం చేశారు. దాత కుటుంబానికి మణిపాల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. మరణించిన తర్వాత కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపిన విజయ్కుమార్ కుటుంబ సభ్యులను గుడివాడకు చెందిన సేవాతత్పరులు పలువురు ఆదివారం అభినందించారు. నేత్రదానం, రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజయ్కుమార్ కుటుంబ సన్నిహితుడు దాసరి మహేష్ తెలిపారు. కష్టకాలంలో 10 మందికి మంచి చేయాలని మిత్రుడు విజయ్ కుటుంబ సభ్యులు చేసిన గొప్ప పనిని ఆయన అభినందించారు. జనసేన కార్యకర్త అయిన విజయ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఆయన కుటుంబ పరిస్థితి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని మహేష్ చెప్పారు. బ్రెయిన్డెడ్ వ్యక్తి అవయవాల దానం చేసిన కుటుంబ సభ్యులు -
చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్):దేవాలయంలో హుండి పగులకొట్టి నగదు చోరీతో పాటుగా ఆటో, ద్విచక్ర వాహనం దొంగిలించిన నిందితుడిని ఎస్ఎన్పురం పోలీసులు అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎస్వీవీ లక్ష్మీనారాయణతో కలసి నార్త్జోన్ ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్ వివరాలు వెల్లడించారు. దాసాంజనేస్వామి ఆలయంలో గత నెల 27న హుండీ పగులకొట్టి నగదు చోరీకి గురైనట్లు వచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరానికి పాల్పడింది ప్రకాశం జిల్లాకు చెందిన రామనబోయిన శ్రీనుగా గుర్తించి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు ఆదివారం రైల్వేస్టేషన్ సమీపంలోని బొగ్గులైన్ క్వార్టర్స్ వద్ద ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. విచారణలో నిందితుడు హుండీలో చోరీ చేసిన నగదులో కొంతభాగం బొగ్గు లైన్ క్వార్ట్ర్స్ వద్ద పొదల్లో దాచినట్లు చెప్పారు. మరికొంత సొమ్ముతో కర్నూలు బస్సు ఎక్కి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. తన వద్ద ఉన్న సొమ్ము అయిపోవడంతో దాచిపెట్టుకున్న సొమ్మును తీసుకువెళ్లేందుకు బొగ్గు లైన్ క్వార్టర్స్కు రాగా పోలీసులు పట్టుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి రూ. 18వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆటో, ద్విచక్ర వాహనం చోరీ కేసులో ఎనికేపాడుకు చెందిన పెనుగోతు మురళిగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. చోరీకి గురైన ఒక ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆది దంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, శాంతి కల్యాణంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. మరోవైపున అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెటు క్యూలైన్లలో భక్తుల తాకిడి కనిపించింది. భక్తుల రద్దీతో అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. దుర్గాఘాట్లో రద్దీ... కార్తిక మాసం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన యాత్రికులు, భక్తులు దుర్గాఘాట్లో పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కొంత మంది భక్తులు దేవస్థాన కేశకండనశాలలో తలనీలాలు సమర్పించిన అనంతరం నదీతీరంలో స్నానాలు ఆచరించి అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థాన ఘాట్రోడ్డుతో పాటు మహామండపం మెట్లు, లిప్టు మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా మహా మండపం 5వ అంతస్తు వరకే లిప్టులను అనుమతించారు. అక్కడి నుంచి భక్తులు క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకున్నారు. లోక కళ్యాణార్ధం సూర్యోపాసన సేవ దుర్గగుడిలో లోక కళ్యాణార్ధం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యభగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువురు ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. -
తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే
రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ఆలయాల్లో భక్తులకూ భద్రత కరువైంది● కాశీబుగ్గ ఘటనలో మృతులకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి ● ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ ● విజయవాడలో కాశీబుగ్గ మృతులకు సంతాపంగా వైఎస్సార్ సీపీ క్యాండిల్ ర్యాలీ లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ఆలయాలకు వచ్చే భక్తులకూ భద్రత కరువైందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. చంద్రబాబు పాలన అంటే అన్ని వర్గాలు భయాందోళనతో బతకాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతులకు సంతాపకంగా.. వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు అంటూ నినాదాలు చేశారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన చేతకాని తనం, నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎంత మంది మృతి చెందారో చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఒకవైపు పాలన గాలికొదిలేసి, లా అండ్ ఆర్డర్ను పట్టించుకోకపోవడం వల్ల ప్రజల భద్రత, ముఖ్యంగా దేవాలయాలకు వెళ్లే భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ చేసి విష ప్రచారం మొదలుకొని, దేవుళ్ల పేరుతో చంద్రబాబు తన రాక్షస రాజకీయంతో అనేక విషాదాలు, ఘోరా లు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార పిచ్చితో గోదా వరి పుష్కరాల్లో 20 మంది మృతి చెందారన్నారు. సనాతన ధర్మం అని చెప్పిన పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. పార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ హోం మంత్రి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. రాజకీయాలకు తిరుపతి లడ్డూని వాడుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జగ్గయ్యపేట వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరావు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నత్తా యోనారాజు, ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు విజిత, నేతలు రవిచంద్ర, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆలయాల్లో జరిగిన అపచారాలు, ఘోరాలు అన్నీ ఇన్నీ కావన్నారు. శ్రీకూర్మంలో తాబేళ్లపార్కు నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంతో తాబేళ్లు మృత్యువాత, టీటీడీ బోర్డులో క్రిమినల్ కేసులున్న వారికి సభ్యత్వం, తిరుమలలోని గోశాలలో వందకు పైగా గోవులు మృతి వంటి అనేక అపచారాలు జరిగాయన్నారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తారని తెలిసినా కాశీబుగ్గలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పుడు ప్రైవేటు ఆలయం, ఎలాంటి సమాచారం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రొద్దుటూరు శ్రీ వాసవీ పరమేశ్వరి ఆలయం, అనకాపల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, సీతానగరంలో విజయకీలాద్రి, ద్వారంపూడిలో అయ్యప్పస్వామి ఆలయం వంటి అనేక ప్రైవేటు ఆలయాలు ఉన్నాయని, పర్వదినాలు, వేడుకల సమయంలో భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. తిరుమల తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలంలో జరిగిన ఘటనలో ఏడుగురు భక్తులు బలయ్యారన్నారు. ఇప్పుడు కాశీబుగ్గలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ..
కంకిపాడు: కూటమి సర్కారు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలు ఈ ఆరోపణలు, విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఆపదలో ఆదుకోవాల్సిన సర్కారు నిర్లక్ష్యం కనబర్చటంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. తుపానుతో పంట నష్టపోయి పెట్టుబడులు కోల్పోయి ఆందోళన చెందుతున్న తరుణంలో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. పంట నష్టపరిహారం నమోదు చేస్తే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదంటూ అధికారులు చెబుతున్న మాటలే ఇందుకు కారణం. పంటపై పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే అరకొర సాయంతో చేతులు దులుపుకుంటూ ఆఖరికి ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా..... కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.54 లక్షల హెక్టార్లలో వరి, 24 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగయ్యాయి. అరటి, కంద, పసుపు, తమలపాకు, కూరగాయలు, బొప్పాయి, ఇతర పంటలు సైతం ఉన్నాయి. ప్రధానంగా వరి పంట ప్రస్తుతం చేతికొచ్చే తరుణం. మరో పది రోజుల్లో వరి కోతలు ప్రారంభమై ధాన్యం మార్కెట్కు చేరుతుంది. ఇప్పటికే ఒక్కో రైతు ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకూ పెట్టుబడులు పెట్టి దిగుబడి కోసం ఆశగా ఉన్న తరుణం. అకాల వర్షాలు, తుపానుతో నష్టం.... ఈ ఏడాది అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచాయి. దీనికి తోడు పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాను విరుచుకుపడింది. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 427 గ్రామాల్లో 56,040 మంది రైతులు 46,357 హెక్టార్లలో పంటలు దెబ్బతిని తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ప్రత్యేకించి 54,180 మంది రైతులకు చెందిన 45,040 హెక్టార్లలో వరి పంట నేలవాలింది. వరిపైరు చిరుపొట్ట, కంకులు గట్టిపడే దశలో ఉన్నాయి. ఈ సమయంలో తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పైర్లు నేలవాలి కంకులు రాలి, సుంకు దెబ్బతినటంతో పాటుగా మడమ తాలు, తాలు, తప్ప ఏర్పడ్డాయి. మానుగాయ, పాకుడుతో పంటకు నష్టం వాటిల్లుతోంది. పంటపై పెట్టిన పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 45 బస్తాల వరకూ దిగుబడులు వస్తాయని ఆశించిన రైతులు నేడు కనీసం 20 బస్తాలైనా చేతికొస్తాయో? లేదో? అన్న ఆందోళనలో మునిగిపోతున్నారు. ఆ దిగుబడులతో కౌలు డబ్బులే కట్టాలో?, పెట్టుబడులే చూసుకోవాలో అర్థం కావటం లేదంటూ వాపోతున్నారు. అప్పుడే నిబంధనల కొర్రీ.... తుపాను గాయం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే ప్రభుత్వం విధించే నిబంధనల కొర్రీతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పంట నష్టపరిహారం నమోదు చేయించుకునే రైతుల నుంచి రానున్న ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉండదంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. అంతకు ఇష్టమైతేనే పేర్లు నమోదుచేయించుకోమంటూ చెప్పటం గమనార్హం. దీంతో పంటలో సగం దిగుబడి వచ్చినా ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలనే ప్రశ్న తలెత్తటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాలు తప్ప వచ్చి పంట పోయినా మిగిలిన పంటకై నా మద్దతు ధర దక్కితే పెట్టుబడులు చేతికి రాకపోయినా కౌలు చెల్లింపు సజావుగా సాగుతుందన్న ఆశాభావంతో అన్నదాతలు ఉన్నారు. నష్టపరిహారం నమోదు సమయంలోనే నిబంధనల పేరుతో తిరకాసు పెట్టడం, వ్యవసాయ సహాయకులు గ్రామస్థాయిలో ఈ విషయాన్ని ఘంటాపథంగా చెప్పటంతో రైతులకు దిక్కుతోచటం లేదు. ప్రభుత్వం అందించే అరకొర సాయంతో సరిపెట్టుకునేందుకు కొందరు రైతులు వెనుకాడుతున్నారు. వచ్చిన కాస్త దిగుబడిని మద్దతుకు అమ్ముకుంటామని చెబుతున్నారు. పంట నష్టపరిహారం అందించిన తరువాత పంట దిగుబడులు కొనుగోలు సాధ్యం కాదు. గతంలోనూ ఇదే జరిగింది. ఈ సీజన్లో ఆ సమస్య తలెత్తకుండా ముందుగానే క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంట దెబ్బతిన్నాక దిగుబడులు ఊసే ఉండదు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధిస్తుందో తెలీదు. నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. –ఎన్.పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారి, కృష్ణాజిల్లా ప్రభుత్వం ఇచ్చే సాయం అరకొరే. అది కనీసం కూలీ ఖర్చులకు కూడా సరిపోదు. తుపాను నుంచి బయటపడ్డ మిగిలిన పంటను అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలి. రైతులకు మద్దతు ధర దక్కేలా చేయాలి. లేకపోతే కౌలుచెల్లింపులు ఎలా సాధ్యం. ఇప్పటికే పెట్టుబడులు పూర్తిగా కోల్పోతున్నాం. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. – యలమంచిలి సత్యమోహన్, కౌలురైతు, గొడవర్రు, కంకిపాడు మండలం -
సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదాయం రూ. 9.25 లక్షలు
మోపిదేవి:శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ. 9,25,419 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. సేవా టిక్కెట్ల ద్వారా రూ. 4,89,208, లడ్డూ ప్రసాదం రూ.2,30,820, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ. 95,521, స్వామివారి దర్శనం టెక్కట్ల ద్వారా రూ. 41,200, శాశ్వత అన్నదానం నిమిత్తం రూ. 31,450, వంటి తదితర సేవా టిక్కెట్ల ద్వారా మొత్తం రూ. 9,25,419 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లన్నీ భక్తజనంతో కళకళలాడాయి. ఆలయం వెలుపల భారీ ట్రాఫిక్ ఏర్పటింది. మోపిదేవి గుడి వద్ద ప్రధాన రహదారికి ఇరువైపుల భక్తుల వాహనాలు నిలిచాయి. పెనమలూరు:గోసాల వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందటంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... గోసాల పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి (65)ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి తెల్ల చొక్కా, గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. మృతుడి సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలపాలని కోరారు. బస్సు ఢీకొని వ్యక్తి...కృష్ణలంక:ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యకి దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన కట్టా గురవయ్య(55) ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం ఉదయం గురువయ్య తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇబ్రహీపట్నంలో ఉంటున్న పెద్ద కుమార్తె వద్దకు వెళ్లారు. తిరిగి ప్రకాశం బ్యారేజీ మీదుగా నరసరావుపేటకు వెళ్లే క్రమంలో రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. దీంతో గురవయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. -
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్కు మరో ముగ్గురు డీసీపీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్కు మరో ముగ్గురు డీసీపీలు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా కృష్ణకాంత్ పటేల్ను విజయవాడ సిటీ డెప్యూటీ కమిషనర్గా, షేక్ షిరీన్ బేగంను ట్రాఫిక్ డీసీపీగా నియమించారు. అలాగే జిల్లా రూరల్ డీసీపీగా లక్ష్మీనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో డిసెంబర్ 13న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తాల గోపీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ లోక్అదాలత్ను నిర్వహిస్తున్నామని సివిల్, క్రిమినల్, కాంపౌండబుల్ కేసులతో పాటు అన్ని రకాల కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు తమతమ న్యాయవాదులను సంప్రదించి లోక్అదాలత్కు సిఫార్సు చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. మచిలీపట్నంటౌన్: పాండురంగ స్వామి వారి కార్తిక శుద్ధ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారి రథోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం ఆలయం వద్ద ప్రారంభమైన ఈ రథోత్సవం పురవీధుల గుండా ముందుకు సాగి తెల్లవారు జామున ఆలయానికి చేరింది. స్వామివారి దర్శనం కోసం ప్రజలు గుంపులు గుంపులుగా ఎదురొ చ్చి హారతులు ఇచ్చి టెంకాయలు కొట్టి మొక్కు లు తీర్చుకున్నారు. రథోత్సవం ముందు భాగా న డోలు సన్నాయి వాయిద్యాలతో పాటు మహిళల కోలాటం, డప్పు కళాకారుల విన్యాసాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆలయంలో ఉదయం స్వామివారికి ద్వాదశి పారాయణ, శ్రీ లక్ష్మీ సుదర్శన హోమం వంటి పూజా కార్యక్రమాలను ఆలయ నిర్వాహకుడు టేకి నరసింహం పర్యవేక్షణలో నిర్వహించారు. రథోత్సవంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు, గోల్డ్ ప్రిన్స్ అధినేత తిరుమలశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు: కార్తిక మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పెనుగంచిప్రోలులో వేంచేసి ఉన్న తిరుపతమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించారు. షేక్ షిరీన్ బేగం కృష్ణకాంత్ పటేల్ -
సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం
గన్నవరం: సమస్యల పరిష్కారం కోసం పోరాటామే ఏకై క మార్గమని ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక చింతపల్లి పాపారావు భవన్ ప్రాంగణంలో ఆదివారం యూనియన్ 9వ మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ధ్వజమెత్తారు. కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కాగితాలకే పరిమితమవుతున్నాయని చెప్పారు. కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో కార్మికులు నిరంతరం సమస్యలతో సహజీవనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాలు పెంచుతామనే హామీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. తొలుత యూనియన్ పతకాన్ని సంఘ నాయకులు నాగమణి అవిష్కరించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం. పోలినాయుడు, బుద్దవరం సర్పంచి బడుగు బాలమ్మ, సీఐటీయూ నేతలు బెజవాడ తాతబ్బాయి, కె. రామరాజు, సీపీఎం నేతలు ఎం. ఆంజనేయులు, సూరగాని సాంబశివరావు, కై లే ఏసుదాసు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక.... అనంతరం జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కె. శ్రీనివాసరావు, ఎం. పోలినాయుడు, ఆఫీస్ బేరర్స్గా ఎం. గణేష్, పి. కృష్ణకుమారి, ఎం. ప్రభుశేఖర్, టి. అబ్రహం, కె.రాజేష్, వి.శ్రీనివాసరావు, ఎం.జగన్, ఎం.రామకృష్ణ, మరో 18 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
కిడ్నీవ్యాధితో వృద్ధుడి మృతి
తిరువూరు: ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు దీప్లానగర్ తండాలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం జరపల మంగ్యా (60) మృతి చెందాడు. గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మంగ్యా వైద్య ఖర్చుల నిమిత్తం లక్షలాది రూపాయలు వెచ్చించినా ప్రయోజనం లేకపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం. మంగ్యా మృతదేహాన్ని సీపీఎం మండల కార్యదర్శి పానెం ఆనందరావు, స్థానిక నాయకులు ఆళ్ల అమ్మిరెడ్డి తదితరులు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కృష్ణా నదీ జలాల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో కిడ్నీరోగుల సంఖ్య పెరుగుతోందని, మండలంలో కిడ్నీ రోగులకు వైద్యసేవలందించడంలో కూడా ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని వారు విమర్శించారు. -
షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్లు ఎంపిక
గన్నవరం: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ అండర్–17 బాల, బాలికల ఉమ్మడి కృష్ణా జిల్లా జట్ల ఎంపిక ప్రకియ ఆదివారం ముగిసింది. స్థానిక కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ సెలక్షన్స్కు ఉమ్మడి జిల్లాలోని ఆరు డివిజన్లకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాల, బాలికలు ఐదుగురు చొప్పున జిల్లా జట్లకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రాంబాబు తెలిపారు. అలాగే అండర్–14 గుడివాడ డివిజన్ ఎంపికలు కూడా నిర్వహించినట్లు చెప్పారు. ముగింపు వేడుకల్లో స్రవంతి హైస్కూల్ ప్రిన్సిపాల్ కొమ్మినేని రామకృష్ణ పాల్గొని ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి పతకాలతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి.ఆర్. కిషోర్, నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త డి. నాగరాజు, హీల్ సంస్థ ప్రతినిధి బి.సత్యనారాయణరావు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాలుర జట్టు... టి. శేషసాయిశ్రీనివాస్(ఎన్ఆర్ఎస్వీఆర్ కళాశాల, మైలవరం), ఇ. చరణ్(శ్రీచైతన్య స్కూల్, విజయవాడ), షోయాబ్ఖాన్(డీఏవీ స్కూల్, ఇబ్రహీంపట్నం), పి.తేజస్విన్(లయోలా కళాశాల, విజయవాడ), పి. షాషిష్(ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నిడమానూరు) స్టాండ్బై: వి.ఓంకార్(శ్రీచైతన్య స్కూల్, విజయవాడ). బాలికల జట్టు... ఐ.తన్వి(ఎట్కిన్సన్ స్కూల్, విజయవాడ), కె. తనూజ(కృష్ణవేణి కళాశాల, విజయవాడ), ఆర్. యస్వితసాయి(శ్రీచైతన్య స్కూల్, విజయవాడ), డి. తేజస్విని(నారాయణ స్కూల్, భవానిపురం), బి. వర్షిణి(ఎన్ఎస్ఎం స్కూల్, విజయవాడ) స్టాండ్ బైః వి. ఆస్థ(స్టాన్రాక్ స్కూల్) -
ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్
పాయకాపురం(విజయవాడ రూరల్): క్యోఇకు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ –2025 శాంతినగర్ లోని కరాటే డోజోలో ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో వివిధ జిల్లాల నుంచి 200 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యఅతిఽథులుగా ఆదిత్య డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ ఎస్.జగదీశ్వరి, శ్రీవిద్య కాలేజి ప్రిన్సిపాల్ ఆర్.దామోదర్ రావు, మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ జయ ప్రకాష్ పాల్గొని కరాటే ప్రాధాన్యతను వివరించారు. గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్, బ్రాంచ్ మెడల్స్ని అందచేశారు. కరాటే మాస్టర్లు సెన్సాయ్ ఎస్.దుర్గారావు, పి.మురళి, ఎం.కరుణాకర్, వీటి బద్రినాఽథ్, డి.ప్రభాకర్, శేఖర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. నిర్వాహకులు బల్లం కిషోర్ టోర్నమెంట్ను విజయవంతం కావడానికి సహకరించినవారికి ధన్యవాదాలు తెలియచేశారు. -
ఈనెల 4న కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు మోంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. మోంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించిన పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, పేర్ని నానిలు వెల్లడించారు. ఉచిత పంటల బీమాతో రైతులకు శ్రీరామ రక్ష: వైఎస్ జగన్ -
భర్త ఎంపీడీవో.. భార్య మాత్రం ఇలా.. బస్టాండ్లో ఏం జరిగిందంటే?
సాక్షి, విజయవాడ: తన భర్త ప్రభుత్వ ఉద్యోగి.. భార్య మాత్రం తన స్థాయిని మర్చిపోయింది. చిల్లర పనులకు దిగజారింది. బస్టాండ్లో తోటి ప్రయాణికురాలి వద్ద ఎంపీడీవో భార్య.. పర్సును దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్లో ఈ ఘటన జరిగింది. బస్సు ఎక్కే క్రమంలో ఒక నర్సు నుంచి పర్సు దొంగతనం చేసింది. ఈ విషయం తెలిసినా కూడా దొంగతనాన్ని దాచిపెట్టి భార్యను ఎంపీడీవో ప్రోత్సహించారు.బాధిత నర్సు ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్లను కృష్ణలంక పోలీసులు పరిశీలించారు. నర్సు చేతిలో ఉన్న బ్యాగ్ను ఎంపీడీవో భార్య అదే పనిగా చూస్తుండటం.. బస్సు ఎక్కే సమయంలో నర్సు వెనుకే ఆమె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూనిఫాం ఆధారంగా కుమార్తె చదివే కళాశాలకు వెళ్లి విచారణ చేసిన పోలీసులు.. గుంటూరులో ఎంపీడీవోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని ప్రశ్నిస్తున్నారు. -
లోకేష్ కుట్రే.. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు: జోగి శకుంతల
సాక్షి, విజయవాడ: ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఏమీ లేదన్నారు ఆయన సతీమణి శకుంతల. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే జోగి రమేష్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసినా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతల సాక్షితో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన, నారా లోకేష్ కక్ష పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధిస్తున్నారు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఏమీ లేదు. కావాలనే ఈ కేసులో పోలీసులు ఇరికించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశాం. ఇవాళ ఉదయాన్నే మా ఇంటిని వచ్చిన పోలీసులు.. తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యవహరించారు. పైన దేవుడు ఉన్నాడు.. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. దేవుడు అన్నీ చూసుకుంటాడు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మాట్లాడుతూ..‘పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి. మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సహా ఆయన సోదరుడు జోగి రాము, ఆయన సహచరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘చంద్రబాబు సర్కార్ మరో డైవర్షన్ డ్రామా’
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్ట్ను వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు‘‘మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు. దానిపై జోగి రమేష్ చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిప ప్రమాణంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వెఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్లు’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లేని లిక్కర్ స్కామ్లు సృష్టించారు. కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైఎస్సార్సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు జోగి రమేష్ కోరారు. దానిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణకు రాకముందే జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారు. కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట.. పలువురి దుర్మరణం. మోంథా తుపాన్ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం. రెండింటి నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ అరెస్ట్. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్ లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్ను ఇరికించి అరెస్టు చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
జోగి రమేష్ అరెస్ట్ అప్డేట్స్.. 6వ అడిషనల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జోగి రమేష్ను హాజరు పరిచిన ఎక్సైజ్ పోలీసులుజీజీహెచ్ ఆసుపత్రిలో జోగి రమేష్, రాముకు వైద్య పరీక్షలు పూర్తి, ఆసుపత్రి నుంచి కోర్టుకు తరలింపుఆసుపత్రి వద్ద కన్నీటి పర్యంతమైన జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవివైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్న పోలీసులుజీజీహెచ్ ఆసుపత్రికి భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులుపోలీసులు, ప్రభుత్వ తీరుపై వైసీపీ కార్యకర్తలు ఫైర్జోగి రమేష్కు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలువైఎస్ఆర్సిపి కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులుకాసేపట్లో జోగి రమేష్కు వైద్య పరీక్షలుజీజీహెచ్లో జోగి రమేష్, జోగి రాములకు వైద్య పరీక్షలుజోగి రమేష్ ఇంట్లో ముగిసిన సోదాలు..ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ముగిసిన APFSL EVIDENCE RESPONSE TEAM సోదాలుసీసీ కెమెరాలు , ల్యాప్ టాప్లు పరిశీలించిన ఫోరెన్సిక్ టీమ్రెండు గంటలకు పైగా కొనసాగిన తనిఖీలుజోగి రమేష్ మొబైల్స్, ఆయన సతీమణి ఫోన్, ఇద్దరు కుమారులకు చెందిన ల్యాప్ ట్యాప్లు, సీసీకెమెరా ఫుటేజ్ హార్డ్ డిస్క్ స్వాధీనంజోగి రమేష్ ఇంట్లో తనిఖీల అనంతరం జోగి రమేష్ సోదరుడు రాము ఇంటికి వెళ్లిన తనిఖీల బృందంజోగి రమేష్ సహా మరో ఇద్దరు అరెస్ట్..విజయవాడ..మాజీ మంత్రి జోగి రమేష్ సహా మరో ఇద్దరిని అక్రమ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు.జోగి రమేష్తో పాటు అతని సోదరుడు జోగి రాము అక్రమ అరెస్ట్జోగి రమేష్ ప్రధాన అనుచరుడు అరేపల్లి రాము అరెస్ట్భవానిపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న అధికారులుమాజీ మంత్రి జోగి రమేష్ కామెంట్స్..చంద్రబాబు రాక్షసానందం పొందడానికే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.తప్పు చేయలేదని నా భార్య, పిల్లల మీద ప్రమాణం చేశాను.అయినా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేసేందుకు కుట్ర ఇది.అందుకే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ తరలింపు..మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్ అధికారులుజోగి రమేష్కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన సిట్విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలింపుజోగి రమేష్ సోదరుడు రామును సైతం అరెస్ట్ చేసిన పోలీసులు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆగ్రహం.జోగి రమేష్ అరెస్ట్పై వైఎస్సార్సీపీ నేతల ఆందోళనప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరసనజోగి రమేష్ అరెస్ట్..మాజీ మంత్రి జోగి రమేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జోగి రమేష్కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్న పోలీసులుఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. జోగి రమేష్ అరెస్ట్ను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళన. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కామెంట్స్..పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు.మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు.చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య.నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి.మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. 👉మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు తెల్లవారుజామునే భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి వద్దకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. 👉మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం ఓవరాక్షన్కు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఇరికించే కుట్రకు తెరలేపింది. ఏ1 జనార్థనరావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయనను ఇరికించేందుకు ప్లాన్ చేశారు. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతలను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్పై అక్రమ కేసు పెట్టింది.👉అయితే, ఇప్పటికే నకిలీ మద్యం విషయంలో సీబీఐ విచారణ జరపాలని జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన వెంటనే జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడం విశేషం. కాగా, ఏ1 జనార్థనరావు రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ ప్రస్తావన లేకపోవడం ఈ కేసులో కీలక పరిణామం. జనార్థనరావు జైలుకి వెళ్లాక కుట్ర పూరితంగా ఓ వీడియో విడుదల చేశారు. పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వీడియో రికార్డింగ్ చేసి ఎల్లో మీడియా, టీడీపీ ఆఫీస్ ద్వారా వీడియోను బయటకు వదిలారు.👉కాగా, నకిలీ లిక్కర్ డాన్ జనార్థనరావు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జనార్థనరావుతో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమరిదికి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో టీడీపీ ఎమ్మెల్యే వసంతను జనార్థనరావు కలిశారు. జనార్థనరావు సమక్షంలోనే తంబళ్లపల్లె జయచంద్రారెడ్డికి చంద్రబాబు బీఫామ్ కూడా ఇచ్చారు. చంద్రబాబుతో ఏ1 జనార్థనరావు దిగిన ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. కాగా, నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలను తప్పించి కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ నేతలపైకి కేసు డైవర్షన్ చేసింది. సీఎం చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టిన తర్వాత జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చారు. సిట్ వేసిన వెంటనే జనార్థనరావు వీడియోను విడుదల చేశారు. ఎల్లో స్క్రిప్ట్ ప్రకారం నకిలీ లిక్కర్ విచారణ కట్టుకథను అమలు చేస్తున్నారు. ఇక, మద్యం ఫ్యాక్టరీ పెట్టిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని, ఆయన బావ మరది గిరిధర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. -
కురుమద్దాలిలో రేపు మెగా జాబ్మేళా
పామర్రు: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నవంబర్ 1న కురుమద్దాలి గ్రామంలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్కుమార్ గురువారం తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో జపనీస్ ఎంఎస్సీ–ఎన్ఎస్ ఇన్స్రూమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెరికన్ ఎంఎన్సీ–కొల్గేట్ పల్మోలివ్ లిమిటెడ్, ఫాక్స్కా ఎంఎన్సీ, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీవీఎస్ లేబోరేటరీస్ లిమిటెడ్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, క్రైడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్, వరుణ్ గ్రూప్, శ్రీనివాస ట్రాక్టర్స్(ఎస్కార్ట్స్ లిమిటెడ్) వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బి–ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత అర్హులన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా హెచ్టీటీపీఎస్://ఎన్ఏఐపీయూఎన్వైఏఎం.ఏపీ.జీవోవీ.ఐఎన్//యూఎస్ఈఆర్–ఆర్ఈజీఐఎస్టీఆర్ఏటీఐఓఎన్ లింక్ నందు రిజిష్టర్ కావాలన్నారు. జాబ్ మేళాకు రెజ్యూమ్ లేదా బయోడేటా ఫామ్లతో పాటు ఆధార్, ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 80743 70846, 96767 08041 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ఇబ్రహీంపట్నం: కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగినప్పటికీ ఇసుక తవ్వకాలు ఆగలేదు. కాసుల కక్కుర్తితో నదిలో నుంచి ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్న పడవ నీటి ప్రవాహానికి నదిలో మునిగిపోయింది. ఈప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అదే సమయంలో వరద ప్రవాహం పరిశీలించడానికి వచ్చిన ఆర్డీవో కావూరి చైతన్య పడవ నదిలో కొట్టుకుపోయిన విషయం రెవెన్యూ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. పడవ ప్రమాదంపై ఆరా తీశారు. నదిలో మునిగిన ఇసుక పడవ బయటకు తీయాలని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో పడవ వెతికేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మునిగిన ప్రాంతానికి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని తుమ్మలపాలెం వద్ద నదిలో ఉన్న పడవను గుర్తించారు. బలమైన తాళ్లు కట్టి పొక్లెయిన్, జేసీబీల సహాయంతో ఇసుక పడవను ఒడ్డుకు తీశారు. నదిలో నుంచి ఇసుక తరలించేందుకు ఇసుక రేవుకు గానీ, పడవలకు గానీ ఎటువంటి అనుమతులు లేవు. పడవ యజమానిపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. -
నష్టపోయిన రైతులందరికీ పరిహారం
కంచికచర్ల: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. కంచికచర్ల మండలం కీసరలో మునేరు వంతెన వద్ద గురువారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబుతో కలసి వరద ఉధృతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. కృష్ణానది, మున్నేరు, కట్టలేరు, వైరా, పాలేరు వాగుల్లో వరద ప్రవాహంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు. మున్నేరుకు అటు, ఇటు ఉన్న 40 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి కూడా ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. పంట నష్టాల తుది అంచనాల నివేదికలకు అనుగుణంగా బాధిత రైతులు అందరికీ పరిహారం అందిస్తామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కృష్ణా నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహారావు, ఎంపీ డీఓ డి.వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ చవాన్, ఆర్ఐ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
సహాయక చర్యల్లో వీక్
ప్రచారంలో పీక్.. ●వరి సాగు చేసినరైతులకు మిగిలేది అప్పులే ● వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని సాక్షి, అమరావతి: మోంథా తుపాను సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ప్రచార ఆర్భాటంలో మాత్రం హంగామా చేసిందని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వసమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యా లయం నుంచి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్తో పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ.. తమ జిల్లాలో వర్షాల కంటే గాలి వల్ల ఎక్కువ పంట నష్టం జరిగిందన్నారు. పడిపోయిన పంటలను ఎత్తడం కూడా రైతులకు భారంగా మారుతోందన్నారు. ఒక మనిషి రోజుకు రూ.800 కూలి అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ పంట నష్టం అంచనాలు ఇప్పుడే మొదలు పెట్టారని తెలిపారు. ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దామని చెప్పారు. ఇరిగేషన్ కమిటీలన్నింటినీ అధికార పార్టీ వాళ్లే సొంతంగా రాసుకున్నారని, ఎలక్టెడ్ కాకుండా పంచుకు న్నారని జగన్మోహన్రెడ్డి దృష్టికి తెచ్చారు. ప్రాథమికంగా జిల్లాలో 1.18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా పెనమ లూరు, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. మచిలీపట్నంలో వేరుశనగ దెబ్బతిం దని, వరి పంట వేసిన ఏ రైతూ కోలుకునే పరిస్థితి లేదని, అప్పుల్లో కూరుకుపోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. -
బాధిత రైతులను ఆదుకుంటాం
కంకిపాడు: మోంథా తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని పునాదిపాడు గ్రామంలో గురువారం మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. వరి పొలాలను పరిశీలించి నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.50 లక్షల హెక్టార్లలో వరి పంట నేలవాలిందన్నారు. ఉద్యాన పంటలు 12,500 హెక్టార్లలో నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలను నివేదించారన్నారు. పంట నష్టం సర్వేను పూర్తి స్థాయిలో సమర్థంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి పంట నష్టం సర్వే, రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: మోంథా తుఫాన్ ప్రభావంతో అధికంగా కురిసిన వర్షాలకు మున్నేరుతో పాటు కృష్ణానదికి వరద పోటెత్తుతుందని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ తెలిపారు. కృష్ణానది ప్రవాహాన్ని, వరద పరిస్థితిని ఆర్డీవో కావూరి చైతన్యతో పాటు ఆమె ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం, జూపూడి వద్ద లంక గ్రా మాలకు వెళ్లే దారిలో గురువారం పరిశీలించారు. వరదల దృష్ట్యా రెవెన్యూ శాఖతో పాటు పోలీస్, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వరద ప్రవా హం పెరిగితే ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా నదీ పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వరద ప్రవాహంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీస్ పహారా ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): జాతీయ రహదారి పక్కన బందరు కాలువలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కృష్ణలంక పోలీసులు తెలిపిన వివరాల మేరకు గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బందరు కాలువలో ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొస్తున్నట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు బందరు కాలువ ఒడ్డున ఉన్న కర్మల భవన్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, బ్లూ కలర్ షర్టు, బ్లూ కలర్ నైట్ ఫ్యాంట్, బెల్టు చెప్పులు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఊపిరిపోయని వెంటిలేటర్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితితో ఉన్న రోగికి ప్రాణ వాయువును అందించే వెంటిలేటర్ల తీవ్ర కొరత ఏర్పడింది. ఐసీయూలో ఉన్న రోగిని వెంటిలేటర్పై పెట్టాలంటేనే వైద్యులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటిలేటర్లు సరిగా పనిచేయక ప్రాణాలుపోతే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఎంతో కాలంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రాణ వాయువును అందించే వెంటిలేటర్లను కొనుగోలు చేయాలనే ఆలోచనే చేయడం లేదు. దీంతో నిరుపేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కోసారి వెంటిలేటర్ అవసరమైన రోగులు బయట ఆస్పత్రులకు తరలి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో కొన్న వాటితోనే... కోవిడ్ సమయంలో గత ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రులకు పెద్ద ఎత్తున వెంటిలేటర్లను సరఫరా చేసింది. అందులో భాగంగా విజయవాడ ఆస్పత్రికి అప్పట్లో 200 వరకూ వెంటిలేటర్లు సమకూరాయి. రెండు విడతల కోవిడ్లో ఆ వెంటిలేటర్లు చాలా మందికి ఊపిరిపోశాయి. వాటినే ఇప్పటి వరకూ వినియోగిస్తూ వస్తున్నారు. పనిచేయని కొన్నింటిని పక్కన పెడుతూ ఉన్న వాటితోనే నెట్టుకొస్తున్నారు. క్రమేణా పనిచేసే వెంటిలేటర్లు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల అవసరాలకు అనుగుణంగా వెంటిలేటర్లు చాలడం లేదు. కొంతకాలంగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వం మొండిచేయి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వాస్పత్రికి ఆధునిక పరికరాలు అందించిన సందర్భాలు లేదు. గత ప్రభుత్వంలో అన్ని విభాగాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. వాటితోనే వైద్యులు నెట్టు కొస్తున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో కొలనోస్కోపీ పరికరం పనిచేయడం లేదు. న్యూరాలజీ విభాగంలో ఈఈఎజీ పరికరం మూలన పడింది. న్యూరోసర్జరీలో ఆధునిక మైక్రోస్కోప్ ఊసే లేదు. హెర్నియాకు ల్యాపరోస్కోపీ సర్జరీలు చేయాలంటే అవసరమైన మెష్లు కొనుగోలు చేయడం లేదు. ఇలా అనేక లోపాలున్నా సరిచేయడంతో ప్రభుత్వం నుంచి స్పందన లోపించడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెల కొంది. వెంటిలేటర్లు కొనుగోలు విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన కొరవడంతో ఆస్పత్రికి వచ్చిన పీజీ గ్రాంట్స్ నుంచి కొనుగోలు చేసే ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రాణాపాయంలో ఉన్న రోగికి ప్రాణవాయువు అందించేందుకు వెంటిలేటర్పై పెట్టాలంటే వైద్యులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ వెంటిలేటర్ పనిచేయక మధ్యలో రోగి ప్రాణాలు పోతే పరిస్థితి ఏమిటని వైద్యులు సైతం ఆందోళన చెందిన ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రిలో చేసే మేజర్ జనరల్ సర్జరీలు, బ్రెయిన్ సర్జరీలు, క్లిష్టతరమైన వాస్క్యులర్ సర్జరీలు, రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రంగా గాయపడిన వారిని, నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి శ్యాస తీసుకోలేని సందర్భాల్లో వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే వెంటిలేటర్లు చాలా వరకూ పనిచేయక పోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచన పరిస్థితి నెలకొంది. ఒకవేళ వాటిపై ఉంచిన తర్వాత పనిచేయక రోగి ప్రాణాలు పోతే ఏమిటని ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. విజయవాడ జీజీహెచ్లో వెంటిలేటర్ల కొరత కోవిడ్ సమయంలో ఇచ్చిన పరికరాలతోనే వైద్య సేవలు చాలా వరకూ పనిచేయక మూలకు చేరిన వైనం ఐసీయూల్లో రోగులకు వెంటిలేటర్లు లేక ఇక్కట్లు కొత్తవి కొనాలన్న ఆలోచన చేయని ప్రభుత్వం కొత్త వెంటిలేటర్లు రెండు వారాల్లో రానున్నాయి. వైద్య కళాశాలకు సంబంధించి డీఎంఈ వద్ద ఉన్న పీజీ గ్రాంట్ నుంచి వెంటిలేటర్లు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ వెంటిలేటర్ల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. కోవిడ్లో వచ్చిన వెంటిలేటర్లలో చాలా వరకూ పక్కన పడేశాం. ఉన్న వాటినే వాడుతున్నాం. – డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్, ప్రభుత్వాస్పత్రి -
డెప్యూటీ సీఎం పవన్ పర్యటనలో సర్పంచ్కు అవమానం
అవనిగడ్డ: అవనిగడ్డలో డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటన సందర్భంగా ప్రథమ పౌరురాలైన సర్పంచ్ లక్ష్మీ తిరుపతమ్మకు అవమానం జరిగింది. అవనిగడ్డ మండల పరిధిలోని రామకోటిపురం పంచాయతీ పరిధిలోకి వచ్చే విద్యుత్ సబ్స్టేషన్ వద్ద గురువారం తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా రామకోటిపురం సర్పంచ్ లక్ష్మీ తిరుపతమ్మ ఫొటో ఎగ్జిబిషన్ వద్దకు వెళ్లగా పోలీసులు ఆమెను అనుమతించలేదు. సర్పంచ్ అని చెప్పినా వినకుండా ప్రొటోకాల్లో మీరు లేరని ఆమెను మహిళా పోలీస్ సిబ్బంది బయటకు పంపించటం తీవ్ర చర్చనీయాంశమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ కావడం వల్లనే బయటకు పంపించేశారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఏ పదవీ లేని కొంతమంది నాయకులు మాత్రం దర్జాగా లోపల తిరగటం కొసమెరుపు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ప్రేమించానని మాయమాటలు చెప్పి యువతిని మోసం చేసిన యువకుడిపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాత రాజరాజేశ్వరిపేట మణికంఠ మెడికల్ షాపు సెంటర్కు చెందిన యువతి బీసెంట్రోడ్డులోని ఓ షాపులో పని చేస్తుంది. షాపు ఎదురుగా ఉండే చెప్పుల షాపులో సాయికుమార్ పని చేసేవాడు. కొంత కాలంగా సాయికుమార్, ఆమెను ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. ఆ తర్వాత వారు రెండు సార్లు లైంగికంగా కలిశారు. యువతి కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. అయితే ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. సాయికుమార్ తన ఇంట్లో వారితో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాడు. ప్రస్తుతం సాయికుమార్కు ఫోన్ చేస్తే పెళ్లి తన కుటుంబ సభ్యులకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో తాను మోసపోయానని ఆమె గ్రహించింది. సాయికుమార్ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. మంగళగిరి టౌన్: రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి బాగుందంటూ..ఒకసారి ఫొటో దిగుతానని, ట్రయల్ రన్ వేస్తానని చెప్పి, బండితో పరారైన సంఘటన మంగళగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు.. విజయవాడకు చెందిన నరిశెట్టి మురారి అనే యువకుడు మంగళగిరి నగర పరిధిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతూ.. కళాశాల సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. ఈనెల 28 సాయంత్రం తన స్నేహితుడితో మంగళగిరి నగర పరిధిలోని ఓ సూపర్ మార్కెట్ వద్దకు వచ్చాడు. సరుకులు కొనుగోలు చేసి తన వాహనం వద్దకు వచ్చాడు. అదే సమయంలో ఓ యువకుడు బుల్లెట్ బాగుందంటూ మాట కలిపాడు. ఈ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నానని, బుల్లెట్పై ఫొటో దిగుతానని నమ్మబలికాడు. బైక్ మీద కూర్చుని, ఒక రౌండ్ వేసి వస్తానని చెప్పడంతో మురారి సరేనంటూ తాళం ఇచ్చాడు. ఆ యువకుడు బుల్లెట్ స్టార్ట్ చేసి కొంతదూరం వెళ్లి అటు నుంచి అటు ఉడాయించాడు. ఎంతకూ రాకపోయే సరికి మురారి సూపర్మార్కెట్లోకి వెళ్లి మీ దగ్గర పనిచేసే వ్యక్తి బుల్లెట్ తీసుకువెళ్లాడని, తిరిగి రాలేదని చెప్పడంతో ఆ యువకుడు తమకు తెలియదంటూ చల్లగా చెప్పడంతో.. తాను మోసపోయానని గ్రహించాడు. మంగళగిరి, విజయవాడ ప్రాంతాల్లో ఎంత వెతికినా నిందితుడి సమాచారం తెలియకపోవడంతో మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పోలీసుల ఆంక్షలు.. ప్రజలకు అవస్థలు
కోడూరు: డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన పేరుతో పోలీసులు విధించిన ఆంక్షలు ప్రజలను అవస్థలకు గురి చేశాయి. పవన్కల్యాణ్ గురువారం ఉదయం 10.30 గంటలకు కోడూరు చేరుకుంటా రని ప్రకటించారు. అయితే ఆయన 11.40 గంటలకు వచ్చారు. డెప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఉదయం ఏడు గంటల నుంచే ఆంక్షలు విధించారు. కోడూరు వంతెన సెంటర్, ఇస్మాయిల్బేగ్పేట రహదారి, రామచంద్రాపురం వద్ద ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు. కోడూరు నుంచి అవనిగడ్డ వరకు 13 కిలోమీటర్లు ఉండగా, ఈ రహదారి మొత్తం ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు అవనిగడ్డ నుంచి కోడూరు అన్ని ఆర్టీసీ సర్వీసులను అధికారులు రద్దు చేశారు. -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2025గుడ్లవల్లేరు: స్థానిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో గురువారం శిఖర ప్రతిష్టా మహోత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. 7నాగాయలంక: స్థానిక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్ వద్ద శ్రీరామలింగేశ్వర స్వామికి గురువారం మహాభిషేకం నిర్వహించారు. కోటి వత్తులతో దీపాలు వెలిగించారు. కంకిపాడు: సీఎం చంద్రబాబు శుక్రవారం కంకిపాడు రానున్నారు. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్నాయుడు గురువారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. -
రేపటి నుంచి భవానీ మండల దీక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని డెప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్ గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసిన పవన్కల్యాణ్ పుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను డెప్యూటీ సీఎంకు అందించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా తుపాను ప్రత్యేక అధికారి కాటా ఆమ్రపాలి, కలెక్టర్ బాలాజీ, జేసీ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా దేవదాయశాఖ పరిధిలోని వివిధ దేవస్థానాల్లో బేసిక్ వేతనంపై పని చేస్తున్న సిబ్బందికి హెచ్ఆర్ఏ, డీఏ, వార్షిక ఇంక్రిమెంట్లు, ఐఆర్ వంటి అలవెన్సులు మంజూరు చేయాలని పవన్ కల్యాణ్కు ఆలయ సిబ్బంది వినతిపత్రం అందజేశారు. పెనమలూరు: మండలంలోని యనమలకుదు రులో వేంచేసి ఉన్న శ్రీపార్వతి సమేత శ్రీ రామ లింగేశ్వరస్వామి ఆలయాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం సందర్శించారు. మంత్రి ఆలయంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ప్రధాన అర్చకుడు జి.ఆర్.వి.సాగర్ పూజలు నిర్వహించారు. అనంతరం హోం మంత్రి అనితకు ఆలయ నిర్మాణ దాత సంగా నరసింహారావు ఆలయ ఫొటోను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.భవాని, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎన్యు(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. యూజీ కోర్సులకు పేపర్కు రూ.770 చొప్పున, పీజీ కోర్సులకు పేపరుకు రూ.960 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్ శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల విభాగం కోఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్, డెప్యూటీ రిజి స్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు పి. కృష్ణవేణి, డి.కోదండపాణి, సూపరింటెండెంట్ టి.వెంకటేశ్వర్లు, జవ్వాజి శ్రీనివాసరావు, మాధురి, దూర విద్య ఐసీటీ డివిజన్ డైరెక్టర్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
దివిసీమ నష్టాన్ని వ్యక్తిగతంగా సమీక్షిస్తా
●ఏపీ డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ●అవనిగడ్డలో అరటి తోటలు, పంట నష్టం ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గ నష్టాన్ని వ్యక్తిగతంగా సమీక్షించి సీఎం చంద్రబాబుకు నివేదిక పంపుతానని ఏపీ డెప్యూటీ సీఎం కొణిదెల పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా కోడూరు శివారు కృష్ణాపురంలో తుఫాన్తో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ఎదురుమొండి – గొల్లమంద రోడ్డుకు రూ.13.8 కోట్లతో నిర్మాణ పనులకు టెండర్లు ఖరారయ్యాయన్నారు. డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ దివిసీమలో గురువారం పర్యటన సందర్భంగా అవనిగడ్డలో దెబ్బతిన్న అరటి తోటలు పరిశీలించారు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నియోజకవర్గంలో జరిగిన మోంథా తుఫాన్ నష్టం వివరాల ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అద్భుతమైన సహాయక చర్యలు అందించారని ప్రశంసించారు. మేకలు తోలుకుని లంకకు వెళ్లి తుఫాన్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను గుర్తించి రెస్క్యూ బృందాలు కాపాడినట్లు తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో 1,523 గ్రామాలు నష్టపోయాయని, 274 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయన్నారు. కేంద్ర సహాయం కోరుతాం రాష్ట్రంలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సూపర్ శానిటేషన్ కోసం 20 వేల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నట్లు పవన్కళ్యాణ్ తెలిపారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులను ఆదుకుంటున్నామన్నారు. పంట నష్టం అంచనాలు సాధ్యమైనంత వేగంగా రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి కేంద్ర సహాయం కోరుతామని చెప్పారు. నియోజకవర్గంలోని తీర గ్రామాల్లో కీలకంగా ఉన్న ఔట్ ఫాల్ స్లూయీజ్ల పునర్నిర్మాణానికి నాబార్డ్ లేక ప్రత్యామ్నాయ నిధులు సమకూర్చుతామని ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధికి, మోంథా తుఫాన్ నష్టం తీర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి ఆమ్రపాలి, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జేసీ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, వివిధ విభాగాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
జాతి సమైఖ్యతకు స్ఫూర్తి వల్లభాయ్ పటేల్
చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ సమైఖ్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రచారయాత్ర డిజిటల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, జిల్లా యువజన అధికారి సుంకర రాము తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. భారత చరిత్రలో ఇంతకు ముందున్నెడూ లేని విధంగా వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31 నుంచి నవంబరు 25వ తేదీ వరకు యువతలో ఐక్యత దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా అన్ని జిల్లాల్లో యూనిటీ మార్చ్ను నిర్వహిస్తున్నామన్నారు. మచిలీపట్నం నగరంలో కోనేరుసెంటర్ నుంచి మూడు స్తంభాల సెంటర్ వరకు మార్చ్ చేపడతామని తెలిపారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామాంజనేయులు మాట్లాడుతూ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా యోగా, ఆరోగ్య శిబిరాలు, మత్తు రహిత భారత ప్రతిజ్ఞలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ఆర్సీ ఆనందకుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మోంథాతో వేల ఎకరాల్లో పంట నష్టం
●17 మండలాలు, 235 గ్రామాలపై మోంథా తుఫాన్ ప్రభావం ● వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్కు వివరించిన దేవినేని అవినాష్ ● కూటమి ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటమే లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో మోంథా తుఫాను ప్రభావం 17 మండలాల్లోని 235 గ్రామాలపై చూపిందని, 42 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ వివరించారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో గురువారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో దేవినేని అవినాష్ జిల్లాలో తుఫాన్ బాధిత ప్రాంతాలకు సంబంధించి నష్టాన్ని వివరించారు. పంటలకు సంబంధించి వరి, పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలు బాగా దెబ్బతిన్నాయని, వాటి వివరాలను తెలియజేశారు. మంచి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు.. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. వరదలు, తుఫాన్ల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలువ ప్రజలకు తెలుస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పబ్లిసిటీ కాకుండా ప్రజలకు నేరుగా న్యాయం జరిగేదని, ఈ విషయాన్ని స్వయంగా ప్రజలే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. వైఎస్ జగన్ తలపెట్టిన సచివాలయం వ్యవస్థ తుఫాన్ సమయంలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిందన్నారు. నాడు– నేడు ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలలు పునరావాస కేంద్రాలుగా ప్రజలకు ఉపయోగపడ్డాయని చెప్పారు. కూటమి ప్రభుత్వ మీడియా చానళ్లలో ఏదో చేస్తున్నారని పబ్లిసిటీ చేశారని, తుఫాన్ బాధితులకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది వరదలు కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వచ్చాయని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. ఏడాది దాటినా వరద బాధితులందరికీ నష్ట పరిహారం అందించలేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ తరుఫున బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నాలు చేసిన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గతంలో రైతులు పండించిన మిర్చిని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం రైతుల గోడు పట్టించుకునే నాయకుడు లేరని వాపోతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు పార్టీలు, కుల మతాలు చూడకుండా న్యాయం చేశామన్నారు. వరదలు, తుఫాన్లు టీడీపీ నాయకులకు ఆదాయంగా మారాయని చెప్పారు. గతేడాది వరదల సమయంలో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అబద్ధపు లెక్కలు చూపారని అవినాష్ ఆరోపించారు. నష్టపోయిన ప్రజలకు మంచి చేసే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో తుఫాన్ బాధిత, కొండ ప్రాంతాల్లో నియోజకవర్గ సమన్వయకర్తలు, స్థానిక జెడ్పీటీసీలు, నాయకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. -
తుఫాన్కు దెబ్బతిన్న వరి పంటను రక్షించుకోండిలా
గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లాలో 1.54 లక్షల హెక్టారుల్లో వరి సాగు చేపట్టారు. అందులో 45,040 హెక్టారుల్లో వరి మోంథా తుఫాన్కు దెబ్బ తింది. తుఫాన్కు దెబ్బతిన్న వరి పంటను రక్షించుకునే విధానాన్ని జిల్లాలోని రైతులకు జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి గురువారం సూచించారు. వరి పంట పెరుగుదల దశలో వరిపైరు వర్షపునీటి ముంపునకు గురైతే పొలంలో ముుంపు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. తుఫాన్కు పొలంలోకి వర్షపునీరు చేరినప్పుడు చీడపీడలు కూడా పంటను పీడిస్తాయి. ఎకరానికి 30 కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి. ఈ తరుణంలో వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు వరిలో దుబ్బు చేసే దశ నుంచి ఆకులపై మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవిగా పాముపొడ మచ్చలుగా మారతాయి. ఉధృతి ఎక్కువైతే మొక్కలు ఎండిపోతాయి. నివారణకు ప్రొపికోనజోల్ ఒక మిల్లీలీటర్లు లేక వాలిడామైసిన్ రెండు మిల్లీలీటర్లు లేక హెక్సాకొనజోల్ రెండు మిల్లీలీటర్లు నీటిలో కలిపి దుబ్బుకు తగిలేలా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. గ్రామాల్లో పోస్టర్ల ద్వారా అవగాహన.. అలాగే వరిలో అగ్గి తెగులు ఉధృతికి ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అగ్గి తెగులు సోకినప్పుడు ముదురు ఆకులపై నూలుకుండి ఆకారంలో గోధుమ రంగు మచ్చలు వచ్చి ఆకులు ఎర్రబడతాయి. క్రమేపీ మచ్చలు కలిసిపోయి పంట ఎండిపోయినట్లు కనిపిస్తుంది. నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా కాసుగామైసిన్ రెండు మిల్లీలీటర్లు లేదా ప్యాజివన్ రెండు మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పొలంలో అధిక నీటి ప్రవాహం తర్వాత దోమ ఆశించే అవకాశం ఉంది. దోమ ఉధృతి ఎక్కువైనప్పుడు నివారణకు ఇతోపెన్హాక్స్ రెండు మిల్లీలీటర్లు లేదా 1.5గ్రాములు ఎసిపేట్ లేదా 0.25 మిల్లీలీటర్లు అమిడాక్లోప్రిడ్ లేదా 0.20 గ్రాములు దయోమిదో కామ్ లేదా డైనెటో ఫ్యురాన్ 0.25 గ్రాములు లేదా బిప్రొఫ్యూజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ౖపైమెట్రోజన్ 0.6 మిల్లీలీటర్లు లేదా రెండు మిల్లీలీటర్లు బీపీఎంసీ లేదా మోనోక్రోటోఫాస్ 2.2మిల్లీలీటర్లు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలాన్ని అడపా తడపా ఆరబెట్టాలని జిల్లాలోని రైతులకు జేడీఏ పద్మావతి సూచించారు. అలాగే తుఫాన్కు దెబ్బతిన్న పంటల్ని ఎలా కాపాడాకోవాలనేది జిల్లాలోని ప్రతి మండలంలోని గ్రామాల్లో పోస్టర్ల ద్వారా రైతులకు ఏడీఏలు, ఏవోలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కలిగిస్తున్నారని పద్మావతి పేర్కొన్నారు. జేడీఏ పద్మావతి -
ఇంద్ర ఏసీ బస్సుకు తప్పిన ప్రమాదం
హనుమాన్జంక్షన్రూరల్: హనుమాన్జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్లో ఇంద్ర ఏసీ బస్సుకు గురువారం సాయంత్రం పెనుప్రమాదం తప్పింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రహదారి నుంచి బస్టాండ్ ఇన్గేట్ ద్వారా లోనికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇన్గేట్ మార్గం పక్కనే ఉన్న పాత బస్టాండ్ రేకుల షెడ్ పైకప్పును ఇంద్ర బస్సు ఢీకొంది. ఐరన్ రేకులను గీసుకుంటూ బస్సు ముందుకు రావటంతో బస్సు, పాత బస్టాండ్ పైకప్పు దెబ్బతిన్నాయి. పాత బస్టాండ్ రేకుల పైకప్పును ఢీ కొడుతూ బస్సు ముందుకు వెళ్లటంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ బస్సు కావటంతో మంటలు చెలరేగితే మరింత ముప్పు వాట్లిలేదంటూ మండిపడ్డారు. అంతేకాక బస్సు అదుపు తప్పి ఇన్గేట్ మార్గం నుంచి పక్కనే ఉన్న పాత బస్టాండ్ లోతట్టు ప్రాంతంలోకి బస్సు బోల్తా కొడితే పెనుప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులకు భరోసా కరువు
పమిడిముక్కల: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాతో రైతులకు భరోసా ఉండేదని, నేడు కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు భరోసా కరువైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ తెలిపారు. మండలంలోని మేడూరు, కృష్ణాపురం, నారాయణపురం పరిధిలో నేలవాలిన వరి పంటను పార్టీ నాయకులు, రైతులతో కలిసి గురువారం పరిశీలించారు. తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటంతా ఆంక్షలు లేకుండా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 20 శాతం, 50 శాతం అని ఆంక్షలు పెట్టి పంట నమోదు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలి.. రైతులు భీమనబోయిన సుబ్బారావు, వీర్ల నాగేశ్వరరావు, ముచ్చు పిచేశ్వరరావు, ముచ్చు రాంబాబులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చయిందని, గింజ గట్టి పడే దశలో పంటంతా నేలవాలిందని, తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గింజ గట్టిపడదని రైతులు చెప్పారు. గతంలో కోత దశలో తుఫాన్లు, వర్షాల వల్ల పంట దెబ్బతిన్న కొద్దిగానే నష్టపోయేవారమని, నేడు పూర్తిగా నష్టపోయామని తెలిపారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు యలమంచిలి గణేష్, వైస్ ఎంపీపీలు కొడమంచిలి మహేష్, గంజాల సీతారామయ్య, ఎంపీటీసీ గుర్విందపల్లి వంశీ, నాయకులు పోలిమెట్ల వంశీకృష్ణ, గొర్కెపూడి బుజ్జి, మర్రి బాబూరావు, ముళ్లపూడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనిల్కుమార్ -
పంట పొలంలో పవన్ ‘షో’
కోడూరు/అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటన ఒక ‘షో’లా సాగింది. కేవలం 15 నిమిషాల్లోపే రైతుల పరామర్శను ముగించారు. అది కూడా ముగ్గురు అన్నదమ్ములకు చెందిన ఒక్క పొలాన్ని మాత్రమే పరిశీలించారు. ఫొటోలు, వీడియో పోజులకే అధిక ప్రాధాన్యమిస్తూ.. ఇతర రైతులను దగ్గరికి రానివ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళా రైతులను పోలీసులు పక్కకు లాగేశారు. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓట్లు కావాలి గానీ.. సమస్యలు పట్టవా? డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ గురువారం కృష్ణా జిల్లా కోడూరు మండలం కృష్ణాపురంలో పర్యటించారు. ఈదురుగాలులకు నేలవాలిన ఐదెకరాల వరి పొలాన్ని పరిశీలించారు. ఆ పొలాన్ని సాగు చేస్తున్న ఇస్మాయిల్బేగ్పేటకు చెందిన అన్నదమ్ములు రమేశ్, వెంకటేశ్వరరావు, శివరామకృష్ణను పవన్ పరామర్శించారు. అప్పులు చేసి వరి సాగు చేస్తున్నామని.. తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయామని వారు వివరించారు.అనంతరం తీర ప్రాంతంలో ముంపు బారిన పడిన వరి పొలాల డ్రోన్ విజువల్స్ను పవన్ వీక్షించారు. అదే సమయంలో ఇస్మాయిల్బేగ్పేటకు చెందిన కొందరు మహిళా రైతులు తమ సమస్యలను పవన్కు చెప్పుకునేందుకు రాగా.. పోలీసులు వారిని నెట్టివేశారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక రైతు కుటుంబంతో మాట్లాడితే అందరి సమస్యలు ఎలా తెలుస్తాయని మండిపడ్డారు.మా ఓట్లు కావాలి గానీ.. మా సమస్యలు చెప్పుకుందామంటే తోసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హంసలదీవి, రామకృష్ణాపురం జనసేన నాయకులను కూడా దగ్గరికి రానివ్వకపోవడంతో.. వారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవుట్ ఫాల్ స్లూయిస్ గేట్లు దెబ్బతినడం వల్ల పొలాలు ముంపునకు గురవుతున్నాయని వారు చెప్పారు. స్లూయిస్ గేట్లు, రత్నకోడు డ్రెయిన్లను పరిశీలించకుండా ఒక్క పొలాన్ని చూసి వెళ్లిపోతే సరిపోతుందా? అంటూ మండిపడ్డారు.ఫొటో పోజులకే ప్రాధాన్యంపవన్కళ్యాణ్ పర్యటన యావత్తు ఫొటో పోజులకే ప్రాధాన్యమిచ్చారని స్థానికులు మండిపడ్డారు. మీడియా ప్రతినిధులు కాకుండా ప్రత్యేకంగా వచ్చి న కొందరు వీడియో, ఫొటో కెమెరాలతో చిత్రీకరిస్తుండగా.. మరికొందరు మూడు డ్రోన్ కెమెరాలతో హడావుడి చేశారు. తమను పట్టించుకోకుండా.. అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద రోడ్డు పక్కన పళ్ల వ్యాపారులతో ఫొటోలకు పోజులివ్వడంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఓట్లు కావాలి.. సమస్యలు పట్టవా..? పవన్పై మహిళా రైతుల ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మహిళా రైతులు మండిపడ్డారు. కోడూరు మండలంలో మోంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పవన్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఆదర్శ రైతులను పట్టించుకోని పవన్ కళ్యాణ్.. దెబ్బతిన్న పంటలను తూతూ మంత్రంగా పరిశీలించారు.తమ కష్టాలను వినకుండా.. తమకు కలిసే అవకాశం ఇవ్వకపోవడంపై మహిళలు మండిపడ్డారు. కేవలం ఒకే రైతు కుటుంబంతో మాట్లాడితే అందరి సమస్యలు ఎలా తెలుస్తాయంటూ మండిపడ్డారు. మా ఓట్లు కావాలి.. కానీ మా సమస్యలు మీకు పట్టవా అంటూ నిలదీశారు.మరోవైపు, పవన్ కల్యాణ్ జిల్లా పర్యటన వేళ.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోడూరు-అవనిగడ్డ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. ట్రాఫిక్ మళ్లింపుపై జనాలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, పైగా చుట్టు తిరిగి రావాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కోడూరు మండలంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు. అయితే.. ఆయన పర్యటన కోసం పోలీసులు విధించిన డైవర్షన్ జనాలు 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
పవన్ పర్యటన.. జనం పాట్లు
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లా పర్యటన వేళ.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోడూరు - అవనిగడ్డ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. ట్రాఫిక్ మళ్లింపుపై జనాలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, పైగా చుట్టు తిరిగి రావాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కోడూరు మండలంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు. అయితే.. ఆయన పర్యటన కోసం పోలీసులు విధించిన డైవర్షన్ జనాలు 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తన పర్యటనలో భాగంగా.. కృష్ణాపురం వద్ద నేలకొరిగిన పంటలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఆపై అవనిగడ్డ సబ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించి.. స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారులతో సమీక్షించారు. ‘కుదర్లేదు కాని... కుదిరితే ఆ మోంథా తుపానును పట్టుకుని తిప్పికొట్టేవారు..!’’ ‘‘ఎన్నో తుపాన్లను సమర్థంగా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన సలహా కోసం ఇతర రాష్ట్రాల సీఎంలే సంప్రదించేవారు..’’ ఇదీ సీఎం చంద్రబాబు గురించి ఎల్లో మీడియాలో సాగుతున్న భజన. విపత్తులను కూడా రాజకీయ మైలేజీకి వాడుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబు ఇప్పుడు తుపానును అవకాశంగా తీసుకున్నారు.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉చంద్రబాబు ప్రచార ‘విపత్తు’ -
సమష్టి కృషితో తుపానును ఎదుర్కొన్నాం
●కృష్ణా కలెక్టర్ బాలాజీ ●కోడూరు మండలంలో 5వేల మందికి పునరావాసం ●ఎలాంటి ప్రాణ, జంతునష్టాలు లేవు కోడూరు: ‘మోంథీ’ తుపాను ను జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషితో ఎదుర్కొన్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. కోడూరు జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్ పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మండలాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తుపాను నష్టంపై సమీక్ష నిర్వహించారు. సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్న కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం మండలాలపై తుపాను ప్రభావం అధికంగా కనిపించిందని కలెక్టర్ తెలిపారు. కోడూరు, వి.కొత్తపాలెం జెడ్పీ పాఠశాలలు, తీరప్రాంత గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐదు పునరావాస కేంద్రాల ద్వారా రెండు రోజుల పాటు ఐదు వేల మందికి పునరావాసం కల్పించినట్లు చెప్పారు. కేంద్రాల్లో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని వసతులు సమకూర్చారని, ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజన సదు పాయాన్ని సమకూర్చినట్లు కలెక్టర్ తెలిపారు. తుఫాన్ వల్ల తీరప్రాంతాల్లో ఏ విధమైన ప్రాణ, జంతు నష్టాలు జరగలేదని ప్రకటించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుపాను సమయంలో సమన్వయంతో పని చేసిన పంచాయతీరాజ్, రెవెన్యూ, సచివాలయ, విద్యుత్, వైద్య శాఖల అధికారులను కలెక్టర్ ప్రశంసించారు. ప్రత్యేకాధికారి ఫణి, తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి, ఎంపీడీఓ సుధాప్రవీణ్, ఎంఈఓ టి.వి.ఎం.రామదాసు, ఈఓపీఆర్డీ నాగరేవతి పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం స్వాధీనం
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి రమేష్నగర్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి మృతి చెంది ఉంటాడా, లేక ఏదైనా వాహనం ఢీకొట్టి మరణించి ఉంటాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ విజయలక్ష్మి తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లుతో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటాయని, ఎత్తు 5.1 అడుగులు, ఎడమ వైపు మోచేతికి ఎస్ఎస్ఎస్ శ్రీను అనే పచ్చబొట్టు, కుడి చేతిపై ఎస్.పి అనే పచ్చ బొట్టు ఉన్నాయి. ఆచూకీ తెలిసిన వారు 90591 21109 నంబర్కు ఫోన్ చేయాలని తెలియజేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశాం
మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలపూడి(మచిలీపట్నం): తుపాను కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండాలనే లక్ష్యంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బుధవారం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ తుపాను ప్రభావం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకపోయినా విద్యుత్ సరఫరాకు చాలా ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడిందన్నారు. ఇంకా 25 వేల గృహాలకు జిల్లాలో విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉందని, త్వరలో వాటిని పూర్తి చేసి సరఫరాను అందిస్తామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా తుపాను ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. నష్టపోయిన వారందరినీ తగిన విధంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, విద్యుత్శాఖ డైరెక్టర్ మురళీకృష్ణయాదవ్, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ ఎం.సత్యానందం, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు: విదేశాలలో పనికి వెళ్లిన భార్య పట్టించుకోకపోవటంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం కానూరుకు చెందిన బొట్టు రాజేష్ (38) ఆటోనగర్లో టింకరింగ్ పనులు చేస్తాడు. అతనికి మొదటి భార్యతో విభేదాలు రావటంతో విడిపోయారు. ధనలక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు పుట్టిన ఒక కుమార్తె, రెండవ భార్యకు పుట్టిన ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య ధలనక్ష్మి రెండు నెలల క్రితం మస్కట్ దేశంలో పని చేయటానికి వెళ్లింది. కొద్ది రోజులుగా ఆమె భర్తతో మాట్లాడటం లేదు. భార్య మాట్లాడక పోవటంతో మనస్తాపానికి గురైన రాజేష్ బుధవారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఆత్మహత్య చేసుకోవటంతో కుమార్తెలు బంధువులకు సమాచారం తెలిపారు. మృతుడి సోదరి జోషిరాణి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
సమర్థంగా తుపాను భద్రత ఏర్పాట్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): మోంథా తుపాను ప్రభావ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రయాణికుల భద్రత, సౌకర్యాల ఏర్పాట్లలో విజయవాడ డివిజన్ సమర్ధంగా పనిచేసిందని డీఆర్ఎం మోహిత్ సోనాకియా తెలిపారు. కచ్చితమైన ప్రణాళికలతో తుపాను ప్రభావ సమయంలో రైళ్ల కార్యకలాపాలు, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిబ్బంది, యంత్రాలతో 24 గంటలూ పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో న్యూ ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ (20806) రైలును విజయవాడలో నిలిపివేశామన్నారు. అందులోని 329 మంది ప్రయాణికులను ప్లాట్ఫాం నంబర్ 1లోని వెయిటింగ్ హాల్కు సురక్షితంగా తరలించి వారికి రిఫ్రెష్మెంట్, సిట్టింగ్ సదుపాయం, ఆహారం తదితర ఏర్పాట్లు చేశామని చెప్పారు. అనంతరం ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా రైలు నంబర్ 17209లో 35మందిని, రైలు నంబర్ 18520లో 95 మందిని, రైలు నంబర్ 12840లో 10మందిని, రైలు నంబర్ 12718లో 189 మంది ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు వివరించారు. యంత్రాలు, మానవశక్తితో సత్ఫలితాలు తుపాను ప్రభావాన్ని సమర్ధంగా ఎదుర్కొనేందుకు అవసరమైన యంత్రాలు, మానవ శక్తిని సమీకరించుకున్నామన్నారు. ఇందులో 25 ఎస్కవేటర్లు, అత్యవసర పరిస్థితిలో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఇసుక బ్యాగులతో కూడిన 24 వ్యాగన్లు, బండరాళ్లతో నిండిన 24 వ్యాగన్లను సమస్యాత్మక ప్రాంతాలలో అందుబాటులో ఉంచామన్నారు. వీటితో పాటు 650 స్టీల్ క్రిబ్లు, 450 మంది కాంట్రాక్ట్ కార్మికులు, ట్రాక్ల పటిష్టతను పరిశీలించేందుకు 475 మంది ట్రాక్మెన్లను నియమించామన్నారు. అత్యవసర పరిస్థితి కోసం 2800 క్యూబిక్ మీటర్ల ఇసుక, 2500 క్యూబిక్ మీటర్ల బండరాళ్లు, 12 స్టీల్ ఎమర్జెన్సీ గిడ్డర్లు, 150 హ్యూమ్ పైపులను అవసరమైన ప్రదేశాలకు తరలించేందుకు సిద్ధం చేశామని చెప్పారు. అవసరమైన ప్రదేశాలకు తరలించేందుకు యంత్రాలతో కూడిన మానవశక్తి, 72 ట్రాక్ మిషన్లను సిద్ధంగా ఉంచామన్నారు. నిరంతరం ఆర్పీఎఫ్ పర్యవేక్షణ విజయవాడ డివిజన్ ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది డివిజన్ వ్యాప్తంగా 24 గంటలూ సీసీ టీవీ పర్యవేక్షిస్తూ ప్రయాణికుల భద్రతలో కీలకపాత్ర పోషించారని డీఆర్ఎం సోనాకియా చెప్పారు. రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు ప్రధాన స్టేషన్లలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా -
నిబద్ధత లేని అధికారులు – తెరుచుకోని కంట్రోల్ రూమ్లు
తుఫాన్ నుంచి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటుచేసిన కంట్రోల్ రూములు కొన్ని చోట్ల కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయి. చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటుచేశామని, 24 గంటలూ ప్రజలకు ఈ కంట్రోల్ రూము అందుబాటులో ఉంటుందని చెప్పారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు వెళ్లి పరిశీలించగా అక్కడ కనీసం పలకరించే నాథుడే లేడు. కార్యాలయానికి ఉన్న తలుపులకు తాళాలు కూడా తీయలేదు. పక్కనున్న వీఆర్ఓల కార్యాలయం వైపు చూస్తే అది కూడా మూసి ఉంది. స్థానిక బందరు రోడ్డులోని పెట్రోల్ బంక్ పక్కన కొత్తగా నిర్మించిన సచివాలయం–1 కు కూడా తాళాలు వేసి ఉండటంతో కంట్రోల్ రూము ఎక్కడుందబ్బా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా అధికారులే రాత్రింబవళ్లూ కంట్రోల్ రూములో కూర్చుని పర్యవేక్షిస్తుంటే దానికి భిన్నంగా ఇక్కడ కార్యాలయానికి తాళాలు వేసుకుని వెళ్లిపోవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. –చల్లపల్లి -
తుపాను దెబ్బతో కూరగాయల కొరత
● రైతుబజార్లలో అరకొరగా లభ్యం ● ఉన్నవేమో ధరల మంట ●ఉసూరుమంటూ వెనుతిరుగుతున్న వినియోగదారులు పాయకాపురం(విజయవాడరూరల్): మోంథా తుపాను కారణంగా విజయవాడ నగరంలోని రైతుబజార్లలో కూరగాయల కొరత ఏర్పడింది. రైతుబజార్లకు రావాల్సిన కూరగాయలు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు పండించే ప్రాంతాల నుంచి వర్షం దెబ్బకు కూరగాయలు రాకపోవడంతో రైతుబజార్లలో అరకొరగా ఒకటి, రెండు రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. దీంతో కూరగాయల కొనుగోలు కోసం వచ్చిన వినియోగదారులు నిరాశతో వెనుతిరిగి వెడుతున్నారు. పాయకాపురం, అజిత్ సింగ్నగర్ రైతు బజార్లలో మోంథా తుపాను వలన కూరగాయలకు కొరత ఏర్పడింది. టమోటాలు, కూర అరటి కాయలు, మునగ తప్ప చెప్పుకోదగిన కూరగాయలు లభించక కొనుగోలుదారులు ఉసూరుమంటూ వెనక్కి తిరిగి వెడుతున్నారు.గుంటూరు జిల్లా కుంచనపల్లి పరిసర ప్రాంతాల నుంచి ఆకు కూరలు కూడా అరకొరగా రావడం, ధరలు అమాంతం పెంచి అమ్మడంతో ధరల మంట మండిస్తున్నారంటూ వినియోగ దారులు గగ్గోలు పెడుతున్నారు. టమోట కిలో రూ.38, దొండ కిలో రూ.50, దోసకాయలు కిలో రూ.25, కాకరకాయ పావుకిలో రూ.30, క్యారెట్ కిలో రూ.75 చొప్పున అమ్ముతున్నారు. ఆకు కూరల విషయానికి వస్తే తోటకూర కట్ట 30 రూపాయలు, పాలకూర 25 రూపాయలు అమ్ముతున్నారు. ధరలు ఆకాశాన్నంటుతుంటే ఏం కొంటాం, ఏం తింటామని వినియోగదారులు వాపోతున్నారు. పాయకాపురం రైతు బజార్లో కూరగాయలు స్టాకు సరిపడా లేకపోవడంతో కొన్ని దుకాణాలు మూతవేసి ఉండటం కనిపించింది. మోంథా తుపాను వల్ల కూరగాయలు తక్కువగా వస్తున్నాయని ఎస్టేట్ అధికారి కిరణ్ తెలియజేశారు. నూజివీడు, ఆగిరిపల్లి, నున్న, మోరంపూడి, కుంచనపల్లి, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల నుంచి కూరగాయలు రావడం లేదన్నారు. రైతుబజార్లకు దుకాణదారులు వచ్చి పెద్ద మొత్తంలో కూరగాయలను కొనుగోలు చేసి తీసుకెళ్లడంతో గృహ వినియోగదార్లకు అరకొరగా ఉన్న కూరగాయలు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరం లోని అన్ని రైతుబజార్లకు ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా కూరగాయలను సరసమైన ధరలకు సరఫరా చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలని గృహ వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నారాయణ యాదవ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడ కానూరుకు చెందిన నారాయణ యాదవ్ నియమితులయ్యారు. ఆ మేరకు ఆ సంఘ (ఆల్ ఇండియా యాదవ మహాసభ) జాతీయ అధ్యక్షుడు రవీంద్ర సింగ్ యాదవ్ ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. నవంబరులో పూర్తిస్థాయి రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఆ వివరాలను జాతీయ మహాసభ సమన్వయకర్త సి.శేఖర్ యాదవ్కు అందజేయాలని రవీంద్రసింగ్ ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. తనకు ఈ బాధ్యతలను అప్పగించినందుకు నారాయణ యాదవ్ జాతీయ అధ్యక్షుడు రవీంద్ర సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. -
నిత్యన్నదాన పథకానికి రూ.50 వేల విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో నిర్వహించే నిత్యన్నదాన పథకానికి హైదరాబాద్, బాచుపల్లి వాస్తవ్యులు వి.వంశీకృష్ణ, మమత దంపతులు తమ చిన్నారి దేవాన్షి పేరున రూ.50 వేలు విరాళం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు ఈ విరాళాన్ని అందజేశారు. ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. కృష్ణలంక(విజయవాడ తూర్పు): మోంథా తుఫాన్ కారణంగా పనులు కోల్పోయిన వ్యవసాయ కార్మికులందరినీ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, రెండు రోజులుగా మోంథా తుఫాన్ కారణంగా పనులు లేక వ్యవసాయ కార్మికులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపట్టాలని, ఇప్పటికే చేసిన పనులకు బకాయిలు చెల్లించాలని, ప్రతి కుటుంబానికి రూ.20 వేల నగదు, 25 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు, ఉచిత గ్యాస్ అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా చెల్లించాల్సిన డ్వాక్రా రుణాలు ఆరు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. భారీ వర్షాలు, తుఫాన్ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో తీవ్రమైన విష జ్వరాలు సంభవించే అవకాశం ఉందని, ప్రతి గ్రామంలోనూ సురక్షిత మంచి నీరు, ప్రతి కుటుంబానికి దోమతెరలు, గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కోడూరు: కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ‘మోంథా’ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గురువారం రాష్ట్ర డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటించనున్నారు. పవన్కల్యాణ్ మంగళగిరి నుంచి రోడ్డు మార్గంలో కోడూరు చేరుకొని తుఫాన్ కారణంగా ముంపు బారిన పడిన ప్రాంతాలను పరిశీలిస్తారని డెప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. -
నీట మునిగిన ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా నీట మునిగిన ఇళ్లకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నీట మునిగిన ప్రాంతాలలో బుధవారం ఆయన పర్యటించారు. తొలుత భవానీపురం 43వ డివిజన్లో వీఎంసీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఊర్మిళానగర్, ఇందిరా ప్రియదర్శిని కాలనీ, హెచ్బీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగర పాలక సంస్థ కమిషనర్, ఆర్డీవో ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడి స్థానిక సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట మునిగిన ఇళ్లకు తక్షణమే సర్వే చేయించాలన్నారు. వేసవి కాలంలో కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టి ఉంటే ఇప్పుడు ఇళ్లు నీట మునిగేవి కాదన్నారు. ఇది పూర్తిగా పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. నీట మునిగిన ఇళ్లలో నగర పాలక సంస్థ అధికారులు త్వరితగతిన నీటిని తొలగించాలని కోరారు. ఆయన వెంట కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే నీట మునిగిన ఇళ్లు వేసవిలో కాలువల్లో సిల్ట్ తీసి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు -
రహదారులపై నీళ్లు నిలవకుండా పకడ్బందీ చర్యలు
వాన నీటి పంపుహౌస్ను పరిశీలించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలవకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ లోబ్రిడ్జ్ ప్రాంతంలోని వాననీటి పంపు హౌస్ను బుధవారం ఆయన పరిశీలించారు. పంపు హౌస్ పనితీరును మునిసిపల్ ఇంజినీర్లు మంత్రికి వివరించారు. పంపుహౌస్లో ఎనిమిది మోటార్ల పనితీరును ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో తోడినట్లు తెలిపారు. ప్రయాణికులు, ప్రజలకు ఇబ్బందిలేకుండా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మార్గదర్శకత్వంలో ప్రత్యేక బృందాలు ఈ విషయంలో కీలకపాత్ర పోషించాయన్నారు. నీరు నిలిచిపోతే అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలే అవకాశముందని, అందువల్ల ఎక్కడా వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి తుపాను సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసి, అన్ని విధాలుగా సంసిద్ధుల్ని చేశారని, ఆ సన్నద్ధత కారణంగానే తుపానును సమర్థంగా ఎదుర్కొని, ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించగలిగామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, లోతట్టు ప్రాంతాలు, తుపాను ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుచేసి ఏ సమస్య వచ్చినా సత్వరం పరిష్కరించగలిగేలా చూశామన్నారు. బుడవేురు, ప్రకాశం బ్యారేజీలలో ఇన్ఫ్లో తక్కువగానే ఉందన్నారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. పాము కాటు మందు సహా, అన్ని రకాల ఔషధాలను అందుబాటులో ఉంచామన్నారు. ఆయన వెంట వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తదితరులు ఉన్నారు. మంగళగిరి టౌన్: చేనేతల రక్షణకు 11 రకాల రిజర్వేషన్లు అమలుచేయాలని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని ఆయన కార్యాలయం నుంచి బుధవారం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు జరుపుతానని చెప్పి 14 నెలలు గడిచినా నేటికీ అమలుచేయలేదన్నారు. చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 25 వేలు తక్షణమే అమలు చేయాలని కోరారు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు రూ.203 కోట్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. చేనేతపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోంథా తుపాను కారణంగా జీవనం కోల్పోయిన చేనేత కార్మికులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నవంబర్ 7న రాష్ట్రంలో ఏడీ కార్యాలయాల వద్ద ధర్నాలు జరుగుతాయని, వాటిలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పెడన:మోంథా తుపాను గాలుల ప్రభావంతో వరిచేలు నేలరాలిన పంటల విషయంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పెడన ఏవో ఎస్ జెన్నీ సూచించారు. మండలంలో బుధవారం ఆమె పర్యటించారు. నేల రాలిన పంటల రైతులను కలిసి వారికి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి పొలంలో నీరుంటే చిన్న చిన్న పాటి దారులు ఏర్పాటు చేసి ఆ నీరంతా బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. పడిపోయిన వరికంకులను నిలబెట్టి కట్టాలన్నారు. -
కృష్ణానదిలోకరిగిపోయిన జింకపాలెం రోడ్డు
నాగాయలంక: మండలంలోని ఎదురుమొండి దీవి నుంచి గొల్లమంద మీదుగా సముద్రతీర గ్రామం జింకపాలెం వెళ్లే ప్రధాన రోడ్డులో ప్రయాణం సందిగ్ధంలో పడింది. మోంథా తుపాను తాకిడికి ఈ రోడ్డు గొల్లమంద సమీపంలో పూర్తిగా కృష్ణానదిలో కనుమరుగైంది. దీంతో గొల్లమంద, జింకపాలెం ప్రజలు ప్రయాణమార్గం లేక ఆందోళన చెందుతున్నారు. తరచూ ఈ రోడ్డు కృష్ణానది ఉధృతికి కోతకు గురవుతోంది. రోడ్డు పునర్నిర్మాణం కోసం ఈ ప్రాంత బడుగు బలహీనవర్గాల ప్రజలు, మత్స్యకారులు నాయకులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని కూటమి నాయకులు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక కలెక్టర్ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పర్యటించి డెప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రూ.13 కోట్లు మంజూరయినట్లు నాయకులు ప్రకటించారు. ఇది జరిగి నెలలు గడిచాయి. తాత్కా లిక మరమ్మతులకే రోడ్డు పరిమితమైంది. ఈ నేపథ్యంలో మోంథా తుపాను ప్రభావంతో రోడ్డు పూర్తిగా నదిలో కలసిపోయింది. -
డ్రోన్తో తుపాను నష్టం అంచనాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలతో పాటు రోడ్లు, వంతెనలు, ఇళ్లు తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించి జరిగిన నష్టాన్ని వేగవంతంగా, కచ్చితంగా, అత్యంత పారదర్శకంగా అంచనా వేసేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ)లో కలెక్టర్ లక్ష్మీశ తుపాను నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసేందుకు డ్రోన్ కార్పొరేషన్ ద్వారా తొలిగా అందుబాటులోకి వచ్చిన డ్రోన్ల పనితీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రజలకు వీలైనంత త్వరగా సహాయసహకారాలు అందించేందుకు నష్టాలను సత్వరం అంచనా వేసేలా ఆధునిక సాంకేతికత దోహదం చేస్తోందన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో నష్టాల అంచనాలకుగాను ఒక్కో మండలానికి ఒక డ్రోన్ సర్వే టీమ్ పనిచేస్తోందని వివ రించారు. సంప్రదాయ పద్ధతులతో పోల్చితే చాలా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో డ్రోన్ సాంకేతికత ద్వారా కచ్చితమైన ఆధారాలతో నష్టాలను అంచనా వేయొచ్చన్నారు. హై రిజల్యూషన్ ఇమేజరీ, పుటేజీ ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. మనుషులు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లోకి సైతం డ్రోన్లను పంపి.. అక్కడి పరిస్థితిని తెలుసుకొని నష్టాన్ని విశ్లేషించేందుకు డ్రోన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. డిజిటల్ మ్యాపులు, ఫొటోలు, 3డీ నమూనాల రూపంలోనూ పంట నష్టం నివేదికలను రూపొందించి పారదర్శకతను పెంపొందించవచ్చన్నారు. పునరుద్ధరణ పనులకూ దోహదం.. డ్రోన్ సాంకేతికత ద్వారా సేకరించిన డేటా ఆధారంగా పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులను సైతం సత్వరం చేపట్టేందుకు వీలుంటుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని త్వరగా, సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. -
అప్పులు తీరేదెలా?
ఈ ఏడాది చేపట్టిన వాణిజ్య పంట ఏ ఒక్కటీ చేతి కందలేదు. గత జూన్లో మిర్చి సాగు చేస్తే మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కలేదు. నష్టాలు చవిచూశాను. మోంథా తుపానుతో చక్రకేళి అరటి తోట పూర్తిగా నేలవాలింది. అరటి సాగుకు రూ.1.75 లక్షల అప్పుచేసి పెట్టుబడి పెట్టాను. ఫల సాయం చేతికి అందే సమయంలో తుపాను కన్నీరు మిగిల్చింది. ఈ అప్పులు తీరేదెలానో అర్థం కావడంలేదు. – మోర్ల శ్రీనివాసరావు, మోపిదేవిలంక, కృష్ణాజిల్లా ఆరెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగుచేశా. గాలులకు పంట నేలవాలింది. భారీ నష్టం తప్పదు. అధికారులు సమగ్ర సర్వేచేసి పరిహారం అందేలా చూడాలి. ఎందుకంటే ఒక్క గింజ కూడా చేతికి రాదు. పెట్టుబడి మొత్తం పోయినట్టే. కౌలు ఎలా చెల్లించాలో? తలుచుకుంటేనే భయమేస్తోంది. – మాదు రాజబాబు, కౌలురైతు, గొడవర్రు, కంకిపాడు మండలం -
వరిగిన ఆశలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తుపాను భారీ వర్షాలు, ఈదురు గాలలతో కృష్ణా జిల్లాను వణికించింది. ముఖ్యంగా లక్ష ఎకరాలకు పైగా వరి పంటను దెబ్బతీసి రైతులకు కన్నీరు మిగిల్చింది. బొప్పాయి, అరటి, కూరగాయ పంటలను తుడిచిపెట్టి ఉద్యాన రైతుల కష్టం కలిగించింది. తీరం వెంబడి వీచిన భారీ ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 119 సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పలు పట్టణాలు, గ్రామాల్లో అంధకారం నెలకొంది. అధికారులు జిల్లా వ్యాప్తంగా 214 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసి 21,525 మందికి రక్షణ కల్పించారు. అన్నదాతకు గుండెకోత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తొలుత వాయుగుండంగా ఆ తరువాత మోంథా పెను తుపానుగా మారి జిల్లాపై విరుచుకుపడింది. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షం, ఈదురు గాలులకు చిరుపొట్ట నుంచి, గింజ గట్టి పడే దశలో, కోతకు సిద్ధంగా ఉన్న వరిచేలు నేలవాలాయి. పైరు మీదుగా వర్షపునీరు ప్రవహిస్తుండటంతో చిరు పొట్ట, గింజ గట్టిపడే దశలో ఉన్న పొలాల్లో తాలు, తప్ప గింజలు ఏర్పడతాయని, మానుగాయ వచ్చి దిగుబడులు, నాణ్యత దిగజారుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టబడులు పెట్టామని, మరో 20 రోజుల్లో కోతలు చేపట్టాల్సిన తరుణంలో తుపాను తమ కష్టాన్ని కన్నీటిపాలు చేసిందని వాపోయారు. నియోజకవర్గాల వారీగా నష్టం ఇలా.. మోంథా తుపానుతో కంద పంట మొత్తం నీటమునిగింది. పుట్టు విత్తనం రూ.7 వేల చొప్పున కొని ఎకరాకు సుమారు రూ. 1.50 లక్షలు వెచ్చించి సాగుచేపట్టా. ప్రస్తుతం కంద తోటలో నీరు నిలిచింది. దీని వల్ల దుంప పెరుగుదల నిలిచిపోతుంది. ఎక్కువ రోజులు నీరు నిలిస్తే దుంప పూర్తిగా కుల్లిపోతుంది. పెట్టుబడి మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. – కోసూరు వెంకటేశ్వరావు, కోసూరువారిపాలెం, కృష్ణాజిల్లా జిల్లాలో 24 మండలాల పరిధిలోని 427 గ్రామాల్లో 5,6050 మంది రైతులకు సంబంధించి 1,15,892.5 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 54,180 మంది రైతులు సాగుచేసిన వరి 1,12,601.3 ఎకరాల్లో నేలవాలి దెబ్బతింది. 720.5 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతిని 566 మంది రైతులు నష్టపోయారు. 2462.5 ఎకరాల్లో మినుము దెబ్బతిని 1,249 మంది రైతులకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు సంబంధించి 2,229 మంది రైతులు 1397.2 ఎకరాల్లో సాగుచేస్తున్న అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిని రూ.73.45 కోట్ల నష్టం వాటిల్లింది. 119 సబ్స్టేషన్లు, 52 33 కేవీ ఫీడర్లు, 11 కేవీ ఫీడర్లు 471, 33 కేవీ స్తంభాలు 93, 11 కేవీ స్తంభాలు 353 దెబ్బతిని రూ.2 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 506 చెట్లు నేలకూలాయి. ఒక గెదే, మరో దూడ చనిపోయాయి. బుధవారం సాయంత్రానికి సైతం కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు నోచుకోలేదు. అవనిగడ్డ నియోజకవర్గంలో సెల్ టవర్లు పనిచేయలేదు. దీంతో మంగళవారం ఫోన్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పులిచింతల ప్రాజెక్టు సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 78,360 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 51,182 క్యూసెక్కులు వదులుతున్నారు. తుపాను సమయంలో రైల్వే ప్రయాణికుల భద్రత, సౌకర్యాల ఏర్పాట్లలో సమర్థంగా పనిచేసినట్టు డీఆర్ఎం మోహిత్ సోనాకియా తెలిపారు. తుపాను కారణంగా జిల్లాలో కూరగాయల కొరత ఏర్పడింది. రవాణా నిలిచిపోవడంతో రైతుబజార్లలో ఒకటి, రెండు రకాలే అందుబాటులో ఉంటున్నాయి. 7 -
పునరావాస కేంద్రంలో మహిళకు పాము కాటు
చల్లపల్లి: తుపాను పునరావాస కేంద్రాల్లో బాధితులకు రక్షణ కరువైంది. ఇద్దరు పిల్లలతో కేంద్రానికి వెళ్లిన తల్లి పాముకాటు బారినపడి ఆస్పత్రి పాలైంది. ఈ సంఘటన చల్లపల్లి మండలం వక్కలగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రంలో జరిగింది. తుపాను నేపథ్యంలో మంగళవారం రాత్రి వక్కలగడ్డ గ్రామానికి చెందిన కట్టా లక్ష్మీతిరుప తమ్మ తన భర్త నాగరాజు, కుమార్తె సత్యఅక్షర, కుమారుడు జోఅఖిలానంద్తో కలిసి పునరా వాస కేంద్రానికి వచ్చింది. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కుమార్తె సత్యఅక్షరను మరుగుదొడ్డికి తీసుకెళ్తున్న క్రమంతో లక్ష్మీతిరుపతమ్మ కాలిపై కట్లపాము కాటువేసింది. అనంతరం దానిని పునరావాస కేంద్రంలో ఉన్నవారు చంపేశారు. పునరావాస కేంద్రంలోని సచివాలయ సిబ్బంది 108కు కాల్చేసి బాధితురాలిని చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుపతమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అదే పునరావాస కేంద్రంలోని వంట గదిలో బుధవారం ఉదయం మరో కట్లపాము కంటపడటంతో అక్కడ ఆశ్రయం పొందిన వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 35 మి.మీ. వర్షపాతం నమోదు చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో బుధవారం 35.0 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాగాయలంక మండలంలో 80.4, అత్యల్పంగా గూడూరు మండ లంలో 9.0 మిల్లీమీటర్ల వర్షం పడింది. మండలాల వారీగా కోడూరులో 65.8 మిల్లీమీటర్లు, అవనిగడ్డ 61.6, పెనమలూరు 58.6, కంకి పాడు 55.4, తోట్లవల్లూరు 44.6, మోపిదేవి 40.8, గన్నవరం 39.4, చల్లపల్లి 38.2, ఉంగుటూరు 34.8, ఘంటసాల మండలంలో 33.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. పామర్రు మండలంలో 31.0 మిల్లీమీటర్లు, మచిలీపట్నం నార్త్, సౌత్, ఉయ్యూరు 30.6, మొవ్వ 29.4, గుడివాడ 27.0, పెడన 25.4, పమిడిముక్కల 24.4, బాపులపాడు, పెదపారుపూడి 22.8, కృత్తివెన్ను 20.2, బంటుమిల్లి 20.0, గుడ్లవల్లేరు 17.2, నందివాడ 17.6 మిల్లీమీటర్ల వర్షం పడింది. తుపాను పునరావాస కేంద్రాల మూసివేత పెనమలూరు: మోంథా తుపాను నేపథ్యంలో మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను అధికారులు మూసివేశారు. పెనమలూరు, పోరంకి, యనమలకుదురు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో సుమారు 500 మంది పేదలు తలదాచుకున్నారు. వారికి రోజున్నర పాటు అధికారులు ఆహారం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను పర్యవేక్షించిన ప్రభుత్వ సిబ్బంది బుధవారం ఉదయం పేదలకు అల్పాహారం అందించి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. రెండు రోజులుగా పనులు లేవని, ఇప్పుడు ఇళ్లకు వెళ్లి ఏమిచేయాలని పేదలు వాపోయారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవటంతో ఇళ్లకు వెళ్లిపోయారు. తుపాను ముందు హడావుడి చేసిన అధికారులు, నేతలు పత్తాలేకుండా పోయారని బాధితులు ఆరోపించారు. నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు మచిలీపట్నంఅర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుపాను ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థలు గురువారం నుంచి యథావిధిగా కొనసాగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.వి.జె.రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తుపాను ముప్పు కార ణంగా ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభానికి యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని డీఈఓ సూచించారు. విద్యా ర్థులు యథావిధిగా విద్యాసంస్థలకు హాజరు కావాలని పేర్కొన్నారు. -
నారా లోకేష్ పేరుతో సైబర్ నేరం.. 54 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
విజయవాడ: ప్రభుత్వం నుంచి మెడికల్ హెల్ప్ కోసం ఎదురుచూస్తున్న బాధితులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. మంత్రి నారా లోకేష్ పేరును ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లోకేష్ ఫోటో ఉపయోగించి సైబర్ కేటుగాళ్లు ఈ నేరాలకు పాల్పడ్డారు. అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు దోచేసిన ముగ్గురు నిందితులు. సోషల్ మీడియా వేదికగా సురేంద్ర టిడిపి ఎన్.అర్.ఐ కన్వీనర్ అంటూ మోసాలు చేశారు.వాట్సాప్ డీపి నారా లోకేష్ ది ఉండటంతో నిజమని నమ్మిన బాధితులు. నిందితులు రాజేష్, సాయి శ్రీనాథ్, సుమంత్లను సీ.ఐ.డీ పోలీసులు అరెస్ట్ చేశారు. పది లక్షల రూపాయలు వీత్ డ్రాకి అనుమతి వచ్చింది అంటూ.. ట్యాక్స్ లు పేరిట బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటనలో 9 మంది బాధితుల నుంచి 54 లక్షల రూపాయల కాజేసిన కేటుగాళ్లు. -
మల్లేశ్వరునికి సహస్ర లింగార్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారికి మంగళవారం విశేష అభిషేకాలు, అర్చనలు, దీపార్చనలు నిర్వహించారు. స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని శాంతి కల్యాణ వేదిక వద్ద సహస్ర లింగార్చన జరిగింది. ఆలయ అర్చకులు పుట్టమన్నుతో శివాకృతులను సిద్ధం చేసి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గులాబీలు, చామంతులు, కలువ పూలు, శంఖు పుష్పాలు, సన్నజాజులు, గన్నేరు పుష్పాలతో అర్చన నిర్వహించారు. సహస్ర లింగార్చనలో పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామి వారికి మహా నివేదన, పంచహారతుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ నిర్వహించారు. శ్రీ గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు దీపాలంకరణ సేవ అనంతరం ఊంజల్ సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయా సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తుపాను నేపథ్యంలో ఘాట్రోడ్డు మూసివేత మంగళవారం సాయంత్రం నుంచి వర్షం తీవ్రత అధికం కావడంతో దుర్గగుడి ఘాట్రోడ్డును మూసివేశారు. తుపాను ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఘాట్రోడ్డులో రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు కనకదుర్గనగర్, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలని సూచించారు. -
యానాదులకు దొరకని పునరావాసం
మచిలీపట్నంటౌన్: నగరంలోని 36వ డివిజన్ రాజుపేట మగ్గాల కాలనీకి చెందిన 20 యానాది కుటుంబాల వారు తుఫాన్ నేపథ్యంలో పునరావాసం లేక ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ పెనుగాలులకు మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వారు నివసిస్తున్న గుడిసెలు దెబ్బతిని నివాసానికి ఇబ్బందిగా మారాయి. అదే ప్రాంతంలో ఓ భారీ వృక్షం నేలకూలింది. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ యానాదుల కాలనీవాసులు 36వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ మాచవరపు రాంప్రసాద్ ను సంప్రదించారు. దీంతో ఆయన వారిని డివిజన్ లోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉంచేందుకు తీసుకెళ్లారు. అయితే వారు తల దాచుకునేందుకు గది ఇచ్చేందుకు కళాశాల నిర్వాహకులు విముఖత చూపారు. తమ కళాశాలలో పునరావాస కేంద్రం లేదని మరుగుదొడ్ల సమస్య ఉందని చెప్పారు. దీంతో కార్పొరేటర్ రాంప్రసాద్ తహసీల్దార్ కు ఫోన్ చేసి పరిస్థితిని చెప్పడంతో 50వ డివిజన్ తుఫాన్ సెంటర్లో పునరావాసం ఏర్పాటు చేశామని, వారిని అక్కడకు తీసుకువెళ్లాలని చెప్పారు. తాము ఉదయం నుంచి ప్రచారం చేస్తున్న వారు ఎందుకు పునరావాస కేంద్రానికి వెళ్లలేదని ఆయన ఎదురు ప్రశ్నించారు. హోరు గాలిలో పిల్లాపాపలతో ఉన్న యానాదులను దాదాపు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పునరావాస కేంద్రానికి ఎలా తీసుకువెళ్లాలని రాంప్రసాద్ తహసీల్దార్ను ప్రశ్నించారు. గతంలో ఏ విపత్తు వచ్చినా ఈ కళాశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసే వారమని ఇంత భారీ తుఫాన్ వస్తున్న సమయంలో ఇక్కడ పునరావాస కేంద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని రాంప్రసాద్ తహసీల్దార్ను నిలదీశారు. చేసేది లేక చివరకు వారంతా కళాశాల వరండాలోనే తలదాచుకుంటుండగా కార్పొరేటర్ రాంప్రసాద్ వారికి తాగునీరు, అల్పాహారం వంటివి అందజేశారు. -
సమన్వయంతో ఎదుర్కొందాం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చిలకలపూడి(మచిలీపట్నం): అందరి సమన్వయంతో జిల్లాలో మోంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గనులు భూ గర్భవనరులు ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం మంత్రి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మోంథా తుపాను జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి, కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి తుపాను పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై శాఖల వారీగా అధికారులతో చర్చించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి జిల్లా ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తోందన్నారు. ఈ తుపాను వల్ల సుమారు 16 వేల మందికి పైగా ప్రభావం చూపే అవకాశం ఉందని, మిగిలిన వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. ప్రత్యేక బృందాలు.. జిల్లా ప్రత్యేక అధికారి కాట ఆమ్రపాలి మాట్లాడుతూ తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, మురుగు కాలువలు పొంగిపొర్లకుండా అడ్డంకులు తొలగించడం, విద్యుత్ స్తంభాలు కూలిపోతే పునరుద్ధరించడం, రహదారులు కొట్టుకుపోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 165 పునరావాస కేంద్రాలు.. కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో లోతట్టు ప్రాంతంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వారికోసం 165 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతానికి 6,618 మంది ప్రజలను తరలించి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని, ఆలోపుగానే అవసరమైన నిత్యావసర సరుకులతోపాటు పిల్లలకి అవసరమైన పాలు, పండ్లు, ఔషధాలు, సరిపడా తాగునీరు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పాడవకుండా ఉండేందుకు స్విచ్లు ఆఫ్ చేసుకోవాలని సూచించారు. డీఆర్ఓ కె. చంద్రశేఖర రావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఏఎస్పీ సత్యనారాయణ, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) చైర్మన్ బండి రామ కృష్ణ, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని) తదితరులు పాల్గొన్నారు. -
మంగినపూడి బీచ్ పరిశీలన
కోనేరుసెంటర్: మోంథా తుపాను నేపథ్యంలో కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మండలంలోని మంగినపూడి బీచ్ వద్ద పరిస్థితులను గమనించారు. మోంథా తుపాను నేపథ్యంలో తీరప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అనంతరం గిరిపురంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. జిల్లాలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. చెట్లు, గోడలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు వివరించారు. మంత్రి వెంట ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మచిలీపట్నం డివిజన్ తుపాను ప్రత్యేకాధికారి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. -
రెస్క్యూ బృందాలు సంసిద్ధం
నాగాయలంక: మోంథా తుపాను తీవ్రత దృష్ట్యా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అన్నిచోట్లా రిస్క్యూ బృందాలు అవసరమైన మెటీరియల్తో సంసిద్ధంగా ఉన్నాయని, యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన నాగాయలంక మండలంలో పర్యటించి భద్రతా చర్యలు పర్యవేక్షించారు. ఆయన తొలుత మండలంలోని ఏటిమొగ వద్ద దీవుల ప్రజలకు సంబంధించిన పంటు మార్గాన్ని పరిశీలించారు. తుపాను పరిస్థితుల్లో దీవుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షం నిలకడగా ఉందని, దివిసీమ ప్రాంతంలో పునరావాస కేంద్రాలు, భవనాల పటిష్టత విషయంలో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తహసీల్దార్ సీహెచ్వీ ఆంజనేయ ప్రసాద్, అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ ప్రత్యేక డీఎస్పీ సీఎం గంగయ్య, మండల తుపాను స్పెషాలాఫీసర్, ఫిషరీస్ ఏడీ ఆర్.ప్రతిభ తదితరులు ఉన్నారు. ప్రజలు బయటకు రావొద్దు.. అవనిగడ్డ: మోంథా తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని మంగళవారం ఎస్పీ పరిశీలించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 165 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేయడంతో పాటు, ప్రజల ఇళ్ల వద్ద దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని తగిన స్థాయిలో మోహరించి ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంచామని ఎస్పీ వివరించారు. ఆయనతో పాటుగా అవనిగడ్డ తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, అవనిగడ్డ సిఐ యువకుమార్, ఎస్ఐ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. -
కృత్తివెన్నులో వణుకు
కృత్తివెన్ను: బంగాళాఖాతంలో ఏర్పడ్డ మోంథా తుపాను ప్రభావం మండలంపై తీవ్రంగా ఉంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా తీవ్రమైన గాలులతో పాటు వర్షం కురుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన అధికార యంత్రాంగం తీర గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు గ్రామాల ప్రజలను కేంద్రాలకు తరలించారు. తుపాను తీవ్రతతో కృత్తివెన్ను మండలం పెద్ద గొల్లపాలెం బీచ్లో సముద్రం నీరు 100 మీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చింది. సముద్రం బాగా పొంగడంతో ఉప్పుటేరులు, ఏటిపాయలు నీటి మట్టం పెరిగి ప్రధాన రహదారులు నీట మునిగిపోయాయి. లక్ష్మీపురం నుంచి పోడు వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా నీట మునిగిపోవడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఇంతేరు గ్రామపంచాయతీ పార్వతీపురం రహదారికి వరద పోటు కారణంగా గండి పడే ప్రమాదం పొంచి ఉండడంతో అధికారుల పర్యవేక్షణలో సిమెంట్ బస్తాలతో రక్షణ ఏర్పాటు చేశారు. పునరావాస శిబిరాలతో పాటు లోతట్టు ప్రాంతాలను మచిలీపట్నం డీఎస్పీ రాజా, రూరల్ సీఐ నాగేంద్రకుమార్, కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబులు సిబ్బందితో పరిశీలించారు. -
భారీ గాలులతో నేలకూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
మచిలీపట్నంటౌన్: మోంథా తుపాను ప్రభావం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంపై పడింది. ఉదయం నుంచి కొద్దిపాటి గాలులతో ప్రారంభమై తుపాను కేంద్రం మచిలీపట్నంకు 50 కిలోమీటర్ల దగ్గరకు వచ్చే సరికి బలమైన గాలులు వీచాయి. చీకటి పడే సమయానికి బలమైన గాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లోని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో మచిలీపట్నం నగరంతో పాటు గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ సరఫరా లేకపోవటంతో నియోజకవర్గం మొత్తం అంధకారం అలముకుంది. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి. మంగినపూడిబీచ్ రోడ్లో మూడు చోట్ల, నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరా లేకపోవటంతో ప్రజలు సెల్ఫోన్ లైట్లు, కొవ్వొత్తుల వెలుగులోనే గడిపారు. నగరంలోని 33వ డివిజన్లో ఇంటిపై చెట్టు కూలింది. విద్యుత్ వైర్లు కూడా తెగిపడ్డాయి. ఆ డివిజన్ కార్పొరేటర్ మీర్ అస్గర్ అలీ సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. -
బోసిపోయిన బెజవాడ మార్కెట్లు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): మోంథా తుఫాన్ నేపథ్యంలో మంగళవారం నగరంలోని మార్కెట్లు బోసిపోయాయి. తుఫాన్ హెచ్చరికలతో జిల్లాలో ప్రజల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. నిత్యం రద్దీగా దర్శనమిచ్చే నగరంలోని ప్రధాన వ్యాపార సముదాయాలు, ఇతర వాణిజ్య ప్రాంగణాలన్నీ బోసిపోయి కనిపించాయి. నగరంలోని వివిధ మార్కెట్లకు నిత్యం లక్షలాది మంది వినియోగదారులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. వారి రాకపోకలతో దుకాణాలన్నీ నిత్యం కళకళలాడుతూ దర్శనమిస్తుంటాయి. అయితే తుఫాన్ హెచ్చరికలతో నగరానికి వచ్చే రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దాంతో దుకాణాలు తెరిచి ఉన్నప్పటికీ ఏమాత్రం వ్యాపారాలు జరగలేదంటూ యజమానులు వాపోయారు. బీసెంట్రోడ్డు, బందరురోడ్డులోని ప్రధాన వ్యాపార కూడళ్లన్నీ బోసిపోయి దర్శనమిచ్చాయి. ఖాళీగా దర్శనమిచ్చిన పాతబస్తీ మార్కెట్లు తుఫాన్ నేపథ్యంలో పాతబస్తీలో వందలాది దుకాణాలు ఉన్న వివిధ ప్రధాన మార్కెట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా దాని పరిసర ప్రాంతాల్లో సుమారు వందకు పైగా హోల్సేల్ వ్యాపార సంఘాలు కొనసాగుతుంటాయి. వాటి పరిధుల్లో వేలాది దుకాణాలు పని చేస్తుంటాయి. తుఫాన్ హెచ్చరికలతో పాటుగా అధికారులు ప్రకటనలతో ప్రజానీకం ఎవరూ బయటకు రాకపోవటంతో ఆయా వ్యాపార కూడళ్లు అన్నీ బోసిపోయాయి. ముఖ్యంగా శ్రీ లాల్బహుదూర్ హోల్సేల్ క్లాత్ మార్కెట్ (వస్త్రలత), కృష్ణవేణి హోల్సేల్ మార్కెట్, మెయిన్బజార్, శివాలయంవీధి, పులిపాటి వారి వీధి తదితర ప్రాంతాల్లోని దుకాణాలన్నీ ఖాళీగా కనిపించాయి. రైళ్లు, బస్సుల రద్దుతో... తుఫాన్ కారణంగా నగరానికి వచ్చే రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించింది. విజయవాడతో పాటుగా విశాఖపట్నం నుంచి బయలుదేరే పలు రైలు సర్వీసులను రైల్వేశాఖ ముందస్తు జాగ్రత్తగా రద్దు చేసింది. నిత్యం లక్షలాదిగా ప్రయాణికులతో దర్శనమిచ్చే రైల్వేస్టేషన్ సైతం బోసిపోయింది. దాంతో నగరానికి వచ్చే ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో పాటుగా నగరానికి వచ్చే బస్సు సర్వీసులను సైతం ఆర్టీసీ కుదించింది. కొన్ని రూట్లలో అనధికారికంగా బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతంతమాత్రంగానే బ్యాంకింగ్ లావాదేవీలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లోనూ అంతంత మాత్రంగానే సేవలు కొనసాగాయి. ప్రధానంగా నగరంలోని వందలాది బ్యాంకుల్లో లావాదేవీలు నామమాత్రంగానే కొనసాగినట్లు ఆయా బ్యాంకు ఉద్యోగులు వ్యాఖ్యానించారు. దాంతో పాటుగా నగరంలోని వన్టౌన్లో ఉన్న ప్రధాన పోస్టాఫీస్ సైతం వినియోగదారులు లేక ఖాళీగా దర్శనమిచ్చింది. -
పత్తిలో మొలకలు...రైతులు దిగాలు
జి.కొండూరు: పత్తి రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. వరుస వానలతో భూమిలో తేమ శాతం తగ్గకపోవడంతో పత్తి ఎర్రబారి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు మళ్లీ మోంథా తుఫాన్ పత్తి రైతు నెత్తిన పిడుగులా మారింది. తీతకు వచ్చిన పత్తి చెట్టు పైనే మొలకెత్తుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాల ప్రభావంతో పత్తి గుబ్బలుగా మారి నల్లబడి నాణ్యత తగ్గడం, మొలకలు రావడం దీనికితోడు ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకు అందిన కాడికి తెగనమ్ముకుని నష్టపోతున్నారు. తుఫాన్ ప్రభావం కూడా పడడంతో పత్తిని నాణ్యతతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఎకరానికి యాభైవేలకు పైగా నష్టం ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది 32,744.5 హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. పత్తి సాగు చేసేందుకు సొంత భూమి ఉన్న రైతులు పెట్టుబడి రూపంలో ఎకరానికి రూ.30వేలు వరకు ఖర్చు చేశారు. ఇక కౌలు రైతులు అయితే కౌలు రూ.20వేలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. వరుసగా వానలు పడుతుండడంతో పాటు మోంథా తుఫాన్ ప్రభావం కూడా పడడంతో పత్తి ఎర్రబారి తీతకు వచ్చిన పత్తి చెట్ల పైనే మొలకలు వస్తున్నాయి. మొదటి విడతగా తీయాల్సిన పత్తి చెట్ల పైనే మొలకలు వచ్చి నష్టపోతున్న రైతులు కొందరైతే మొదటి విడత పత్తి తీసి నాణ్యత లేక తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్న రైతులు మరికొందరు. పత్తి పైరు కూడా ఇప్పటికే ఎర్రబారి ఎండిపోతున్న క్రమంలో తదుపరి విడతల్లో దిగుబడి వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్వింటా పత్తి ధర రూ.4వేలు లోపే... ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటా పత్తి రూ.8,110 ధర పలకాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అందినకాడికి ప్రయివేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పత్తి నాణ్యత లేకపోవడంతో దళారులు ఇష్టమొచ్చినట్లు ధర తగ్గించి క్వింటా పత్తి రూ.3వేల నుంచి రూ.4వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటా పత్తి తీయడానికి కూలీలకు కేజీకి రూ.15 నుంచి రూ.20 చెల్లించాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వాలిటీతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ప్రకృతి వైపరీత్యాల వలన రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గత ప్రభుత్వంలో ఈ క్రాప్ చేయించిన ప్రతి రైతుకు ఉచితంగా క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించేలా నిబంధనలను అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉచితంగా అందిస్తున్న క్రాప్ ఇన్సూరెన్స్ను నిలిపివేసింది. రైతులే నేరుగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పడంతో రైతులు ఆసక్తి చూపలేదు. పత్తి పైరులో ఈ ఏడాది వచ్చే నష్టాన్ని క్రాప్ ఇన్సూరెన్స్ ఉండి ఉంటే కొంత మేర నష్టం తగ్గేదని, అది లేకపోవడం వలన తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. -
తుపాను రక్షణ సేవలో సచివాలయ ఉద్యోగులు
అవనిగడ్డ: సచివాలయ ఉద్యోగులు మోంథా తుపాను రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు డ్యూటీలు వేయడంతో పునరావాస కేంద్రాల్లో సేవలతో పాటు పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, దెబ్బతిన్న గృహాల్లో నివసిస్తున్న వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రాత్రి వారికి భోజనం పెట్టటం దగ్గర నుంచి విశ్రాంతి తీసుకునే వరకు ప్రతి ఒక్క బాధితుడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు విపత్తుల సమయంలోనూ ఈ విధంగా ఉపయోగపడటం చాలా సంతోషంగా ఉందని పలువురు తుఫాన్ బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ రైలు నిర్వహణలో లోపాలను సకాలంలో గుర్తించి అవాంఛనీయ ఘటనలను నివారించడంలో కృషిచేసిన ముగ్గురు ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డులు అందజేశారు. సికింద్రాబాద్ లోని రైల్ నిలయం నుంచి జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ మంగళవారం విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్గా భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మోంథా తుఫాన్ దృష్ట్యా అన్ని డివిజన్లలో భద్రత సంసిద్ధతపై డీఆర్ఎంలతో సమీక్షించారు. ఈ సందర్భంగా విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ముందస్తు ప్రమాద నివారణ చర్యలు చేపట్టిన పలువురు ఉద్యోగులకు ఆయన అవార్డులను అందజేశారు. విజయవాడ డివిజన్లో రాజమండ్రికి చెందిన గూడ్స్ లోకోపైలట్ కె.నరసింహారావు, తేలప్రోలు స్టేషన్ మాస్టర్ పెదగడి శ్రీనివాసరావు, కావలిలోని ట్రాక్ మెయింటెయినర్ పి.మాధవరావులకు జీఎం అవార్డులను ప్రదానం చేసి వారిని అభినందించారు. రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు విజయవాడ–సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్ప్రెస్కు ఈనెల 30 నుంచి తెలంగాణలోని జనగాం రైల్వేస్టేషన్లో ప్రయోగాత్మకంగా ఒక నిమిషం స్టాపేజీ సదుపాయం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్ (12713) ఉదయం 10.14 గంటలకు జనగాం చేరుకుని, 10.15 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (12714) సాయంత్రం 5.19 గంటలకు జనగాం చేరుకుని 5.20 గంటలకు బయలుదేరుతుంది. -
తుఫాన్ బాధితులకు పునరావాసం కష్టాలు.. అండగా నిలిచిన వైసిపి
Cyclone Montha: మచిలీపట్నంలో "మోంథా" తుఫాన్ బాధితులకు పునరావాసం కష్టాలు. గాలుల ధాటికి 36వ డివిజన్ రాజుపేట మగ్గాల కాలనీలో దెబ్బతిన్న పూరిగుడిసెలు. దాంతో తల దాచుకునేందుకు ఆంధ్రజాతీయ కళాశాలకు వెళ్లిన బాధితులు. అయితే బాధితులకు పునరావాసం కల్పించేందుకు కళాశాల నిర్వాహకులు విముఖత వ్యక్తం చేశారు.ఇక గత్యంతరం లేక కళాశాల వరండాలోనే తలదాచుకున్న తుఫాన్ బాధితులు. విషయం తెలుసుకుని తుఫాన్ బాధితులకు వైసిపి కార్పొరేటర్ రాం ప్రసాద్ అండగా నిలిచారు. వారికి తాగునీరు , అల్పాహారం అందజేశారు. -
భార్యభర్తలిద్దరూ తుఫాన్ డ్యూటీలో
కోడూరు: ఒకరేమో కోడూరు పోలీస్స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చాణిక్య.. మరొకరేమో పాలకాయతిప్ప మైరెన్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పూర్ణమాధురి. వీరిరువురు భార్యభర్తలు. ప్రస్తుతం ‘మోంథా’ తుఫాన్ నేపథ్యంలో భార్యభర్తలిద్దరికీ కోడూరు జెడ్పీ పాఠశాలలో ప్రభుత్వం తీర ప్రాంత ప్రజల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో డ్యూటీ పడింది. అటు పోలీసు, ఇటు మైరెన్ శాఖలను భార్యభర్తలిద్దరు సమన్వయం చేసుకుంటూ తమ విధులు నిర్వర్తించారు. -
ప్రత్యేకాధికారి ఆమ్రపాలికి స్వాగతం
చిలకలపూడి(మచిలీపట్నం): మోంథా తుఫాన్ కారణంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేకాధికారి, రాష్ట్ర పర్యాటకశాఖ ఎండీ ఆమ్రపాలికి సోమవారం కలెక్టరేట్లో ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావులతో పాటు జిల్లా పర్యాటకశాఖాధికారి రామ్లక్ష్మణ్రావు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె జిల్లాలోని తుఫాన్ పరిస్థితులను జేసీ నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
బంగారు ఆభరణాలపై కన్నేసింది.. కొట్టేసింది
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ మారుతీనగర్కు చెందిన చీపురుపల్లి సుమలత అలియాస్ లత సూర్యారావుపేట చిలుకు దుర్గయ్య వీధిలోని ఓ ఇంట్లో వంట, ఇంటి పనిచేసేందుకు చేరింది. ఇంట్లో పనులు చేస్తూ చాలా బంగారు ఆభరణాలు ఉన్నాయని గ్రహించి, వాటినీ చోరీ చేయాలని భావించింది. ఒకేసారి అయితే అనుమానం వస్తుందని, పని ముగించుకుని వెళ్లేటప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఒక్కో ఆభరణం ఎత్తుకెళ్లింది. అలా 837 గ్రాముల ఆభరణాలను తస్కరించింది. ఆరు నెలల కిందట తండ్రి మరణంతో ఆరోగ్యం బాగుండటం లేదని చెప్పి పనిమానేసింది. ఆలస్యంగా గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లత నుంచి చోరీకి గురైన రూ.కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిబ్బందికి అభినందనలు.. సూర్యారావుపేట చిలుకు దుర్గయ్య వీధిలో నివశించే ఫిర్యాది తమ ఇంట్లోని 837 గ్రాముల బంగారు వస్తువులు ఎవరో దొంగిలించారని సోమవారం సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటికి వెళ్లి అనుమానితుల వివరాలు సేకరించారు. సీపీ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కేజీవీ సరిత సూచనలతో సౌత్జోన్ ఏసీపీ డి.పావన్కుమార్ పర్యవేక్షణలో సూర్యారావుపేట సీపీ షేక్ అహ్మద్ అలీ తమ సిబ్బందిలో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో ఆ ఇంట్లో పనిచేసి మానేసిన మహిళ సుమలతను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమె నుంచి రూ.కోటి విలువైన 837 గ్రాముల ఆభరణాలను రికవరీ చేశారు. గంటల వ్యవధిలోనే కేసును చేధించడంతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సౌత్ ఏసీపీ డి.పావన్కుమార్, ఎస్ఆర్పేట సీఐ షేక్ అహ్మద్ అలీ, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు అభినందించారు. సమావేశంలో డీసీపీలు సరిత, తిరుమలేశ్వరరెడ్డి, క్రైమ్ ఏడీసీపీ ఎం.రాజారావు, సౌత్ ఏసీపీ పావన్కుమార్, ఎస్ఆర్పేట సీఐ అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
యాజమాన్యం నిర్లక్ష్యానికి క్వారీ కార్మికుడి మృతి
దొనబండ(ఇబ్రహీంపట్నం): బ్లాస్టింగ్ కోసం కొండపై డ్రిల్లింగ్ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడిపోయిన వ్యక్తి మృతి చెందిన ఘటన దొనబండలోని ఓ క్వారీలో సోమవారం జరిగింది. ప్రమాదంలో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు ఉప్పుతల కృష్ణ(27)గా గుర్తించారు. గ్రామానికి చెందిన ఉప్పతల శ్రీరాములు, నాగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. మృతిచెందిన కృష్ణ రెండో కుమారుడు. ఈ ఏడాది జనవరిలో కృష్ణ తండ్రి శ్రీరాములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు కుమారుడు కూడా క్వారీ ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యాజమాన్య నిర్లక్ష్యం, క్వారీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, భద్రతా పరికరాలు వాడనందునే ప్రమాదాలు జరుగుతున్నాయని బిల్డింగ్ కన్సక్షన్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. మృతిని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం ప్రమాదాలు జరిగినప్పుడు నామమాత్రపు తనిఖీలు నిర్వహించి తరువాత పట్టించుకోక పోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ బి.రాజు తెలిపారు. జి.కొండూరు: మోంథా తుఫాన్ నేపథ్యంలో పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో హెడ్రెగ్యులేటర్ల మధ్యలో రైతుల అవసరాల కోసం నిల్వ ఉంచిన నీటిని అధికారులు సోమవారం కృష్ణానదిలోకి విడుదల చేశారు. బుడమేరుతో పాటు పోలవరం రైట్మెయిన్ కెనాల్ కూడా వెలగలేరు హెడ్రెగ్యులేటర్ వద్ద డైవర్షన్ కెనాల్లో కలిసి ప్రవహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిస్తే ఒక వైపు బుడమేరుకు వరద పోటెత్తే అవకాశం ఉంది. మరో వైపు పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా వర్షం నీరు పోటెత్తి ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్టాగ్నేటెడ్ వాటర్ని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో బుడమేరులో ఎగువ నుంచి వచ్చే కొద్దిపాటి ప్రవాహంతో పోలవరం రైట్మెయిన్ కెనాల్లో స్టాగ్నేటెడ్ వాటర్ కలిసి వెలగలేరు హెడ్రెగ్యులేటర్ వద్ద 3.3 అడుగుల మేర నీటి నిల్వ ఉండగా కృష్ణానదిలోకి 3,500 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. -
తుఫాన్తో బుడమేరుకు వరద ముంపు !
జి.కొండూరు: బుడమేరు పేరు చెప్తేనే ఉలిక్కిపడేలా జల ప్రళయాన్ని సృష్టించిన ఘటన మరవక ముందే మోంథా తుఫాన్ రూపంలో వస్తున్న మరో ఉప్పెన లోతట్టు ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. బుడమేరు ఎగువ ప్రాంతాల్లో చెరువులు ఇప్పటికే నిండిపోయి నిండుకుండల్లా దర్శనమిస్తున్న క్రమంలో ఏ మాత్రం భారీ వర్షం కురిసినా బుడమేరుకు వరద పోటెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. వరద పెరిగితే వెంటనే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరద వచ్చే అవకాశం ఉండడంతో ఉరుకులు పరుగులు పెడుతున్న ప్రభుత్వ యంత్రాంగం వరదలొచ్చిపోయి ఏడాది గడిచినా బుడమేరు ప్రక్షాళన చేయడంలో మాత్రం విఫలమైంది. ఒక వేళ మోంథా తుఫాన్తో బుడమేరుకు వరద పోటెత్తితే ఎన్టీఆర్ జిల్లాలో రైతులు, పేద ప్రజలకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. గతేడాది అసలేం జరిగింది గతేడాది ఆగస్టు 30వ తేదీన శుక్రవారం మెల్లగా మొదలైన వర్షం ఆ రాత్రి భారీ వర్షంగా మారింది. దీంతో ఆగస్టు 31వ తేదీన ఉదయానికల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండవాగు, కోతులవాగు, కళింగవాగు, కోవ వాగు, పులివాగు, వెంకటాపురం వాగు, దొర్లింతాల వాగు, కప్పలవాగు, తొమ్మండ్రం వాగులతో పాటు పలు వాగులు పొంగిపొర్లాయి. ఒక్కసారిగా ఊహించని వరద ఉప్పొంగడంతో నియోజకవర్గంలో 34 చెరువులకు గండ్లు పడ్డాయి. ఏ.కొండూరు మండలంలో బుడమేరు పుట్టిన ప్రదేశం నుంచి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వరకు 42 కిలోమీటర్ల పరిధిలో చిన్న, పెద్దవి కలిపి 80కి పైగా గండ్లు పడ్డాయి. అదేవిధంగా ఈ వరద ప్రవాహానికి వెలగలేరు హెడ్రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్లు మేర ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్కు కుడి వైపు ఏడు గండ్లు, ఎడమ వైపున మూడు గండ్లు పడ్డాయి. ఈ వరద ప్రవాహానికి మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలాలు ముంపునకు గురయ్యాయి. అయితే అదేరోజు సాయంత్రానికి వెలగలేరు హెడ్రెగ్యులేటర్ వద్దకు 30 వేల క్యూసెక్కులకుపైగా వరద నీరు చేరి అధికారులు 11 గేట్లను ఎత్తడంతో తర్వాతి రోజు సెప్టెంబర్ ఒకటో తేదీన ఉదయానికి విజయవాడ రూరల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. కృష్ణానదికి కూడా వరద ప్రవాహం పెరగడంతో ఇబ్రహీంపట్నం పూర్తిగా ముంపునకు గురైంది. ఈ వరద ప్రభావంతో అటు విజయవాడ, ఇటు మైలవరం నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. యాభై మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి. ఇప్పుడు మళ్లీ మోంథా తుఫాన్ ప్రభావంతో బుడమేరుకు వరద పోటెత్తడంతో పాటు ఎగువన చెరువులు కూడా నిండి ఉండడంతో బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఆ మూడు గ్రామాలకు ప్రమాదం బుడమేరుకు వరద ప్రవాహం ఎక్కువైతే జి.కొండూరు మండల పరిధి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్దకు భారీగా వరద చేరుతుంది. హెడ్రెగ్యులేటర్ లాకులు ఎత్తితే విజయవాడ మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు సాధ్యమైనంత వరకు డైవర్షన్ కెనాల్గుండా కృష్ణా నదికే వరద మళ్లిస్తారు. ఈ క్రమంలో హెడ్రెగ్యులేటర్ వద్ద భారీగా వరద నిల్వ ఉంటుంది. ఈ సమయంలో బుడమేరు కాల్వకు ఎడమ వైపు గండ్లు పడితే దిగువన ఉన్న వెలగలేరు, కవులూరు గ్రామాలు, కుడి వైపు గండ్లు పడితే ముత్యాలంపాడు గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. 11,823 మంది జనాభా ఉండే ఈ మూడు గ్రామాల్లో ఇటీవల వచ్చిన వరద ప్రవాహానికి తీరని నష్టం వాటిల్లింది. మోంథా తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద బుడమేరును పరిశీలించారు. ఎగువ నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు 24/7 ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులను అప్రమత్తం చేయాలని బుడమేరు పరిశీలనా అధికారులకు సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 189 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. -
ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): మోంథా తుపాను కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తుపాను పర్యవేక్షణ జోనల్ ప్రత్యేకాధికారి, చేనేత, జౌళిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్నాయుడు, జేసీ నవీన్లతో కలిసి తుపాను ప్రభావంపై తీసుకున్న చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్ధంగా పనిచేయాలన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందుగానే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, డయాలసిస్ పేషంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మూడు రోజులు ప్రజలందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండేలా అప్రమత్తం చేయాలన్నారు. ముందుగానే నిత్యవసర సరుకులు నిల్వ చేసుకోవాలని, ఇతర సామగ్రిని కూడా సిద్ధంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పట్టణ ప్రాంతాల్లో రహదారులు, డివైడర్లపై ఉన్న హోర్డింగ్లు వెంటనే తొలగించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ల సిగ్నల్స్ సమస్య వస్తుందని దీనిని అధిగమించేందుకు శాటిలైట్ ఫోన్లను వినియోగించాలన్నారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, ఆర్డీవో కె.స్వాతి, ఇరిగేషన్ ఎస్ఈ మోహనరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.4.33 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 20 రోజులకు గాను 44 హుండీల ద్వారా 167 సంచులను తెరిచి కానుకల లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మొత్తం రూ.4,33,85,655 నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 6.614 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో శీనానాయక్ తెలిపారు. ఇక విదేశాలకు చెందిన కరెన్సీ సైతం భారీగానే లభ్యమైంది. యుఎస్ఏకి చెందిన 582 డాలర్లు, సింగపూర్ డాలర్లు 22, కెనడా డాలర్లు 215, యుఏఈకి చెందిన 485 దిర్షమ్స్, అస్ట్రేలియా డాలర్లు 250, మలేషియా రింగిట్స్ 23, ఖతార్ రియాల్స్ 18, కువైట్ దినార్ 2.25, ఇంగ్లాండ్ పౌండ్లు 15 లభ్యమయ్యాయి. కానుకల లెక్కింపును ఛైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
ఆ సమయం...అమూల్యం
●వత్తిళ్లను అధిగమించేందుకు యోగా, మెడిటేషన్ చేయాలి ●రెగ్యులర్గా వ్యాయామం చేయాలి ●రక్తపోటు, మధుమేహంను అదుపులో ఉంచుకోవాలి ●అధిక కొలస్ట్రాల్ను తగ్గించుకోవాలి ●ధూమపానం, ఆల్కాహాల్ను మానుకోవాలి ●ఒకసారి స్ట్రోక్ వచ్చిన వారు రెండోసారి రాకుండా మందులు సక్రమంగా వాడాలి ●అవసరమైతే వైద్యుల సూచన మేరకు రక్తం పలుచబడే మందులు వాడాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు యాబై ఏళ్లు దాటిన వారు బ్రెయిన్స్ట్రోక్కు గురయ్యేవారు. ఇప్పుడు 20 ఏళ్లకే స్ట్రోక్(పక్షవాతం)కు గురవడం ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు చెపుతున్నారు. అందుకు తీవ్రమైన వత్తిళ్లే(స్ట్రెస్) కారణం అంటున్నారు. విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇలా అన్ని రంగాల్లో యువత తీవ్రమైన స్ట్రెస్కు గురవుతున్నారు. ఒకవైపు మారిన జీవనశైలి, మరోవైపు విధుల్లో వత్తిళ్లు స్ట్రోక్కు కారణమవుతున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఏటా 6 వేల మందికి పైగా స్ట్రోక్ బారిన పడుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్ట్రోక్ లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా లక్షణాలు కనిపించిన తర్వాత ‘ప్రతి నిమిషం లెక్కించదగినదే’ అనే నినాదంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోల్డెన్ అవర్ కీలకం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన తర్వాత ప్రతి నిమిషం కీలకమైనదే. గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి చేరితే సీటీ స్కాన్ ద్వారా వైద్యులు ఏ రకమైన బ్రెయిన్ స్ట్రోక్ అనేది నిర్ధారిస్తారు. ఇస్కిమిక్ స్ట్రోక్(రక్తనాళాల్లో గడ్డలు)గా నిర్ధారించిన వారికి థ్రోంబలైజ్ ఇంజక్షన్ ఇస్తారు. అవసరమైతే 12 గంటల్లోపు క్యాథ్ల్యాబ్కు తీసుకెళ్లి రక్తనాళాల్లోని గడ్డలను తొలగిస్తారు. ఈ రకమైన చికిత్సతో స్ట్రోక్ వచ్చినా రోగికి వైకల్యం లేకుండా చూడగలుగుతున్నారు. ఆస్పత్రికి రావడంలో ఆలస్యం అయిన వారికి ఈ రకమైన చికిత్సలు చేసినా ప్రయోజనం ఉండదు. బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే వారిలో 85 శాతం ఇస్కిమిక్ స్ట్రోక్ కాగా, 15 శాతం హెమరైజ్డ్ స్ట్రోక్కు గురవుతున్నారు. రిహాబిలేషన్... ●పక్షవాతం రోగుల్లో రిహాబిలేషన్ అనేది చాలా ముఖ్యం. కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉంటూ ఫిజియోథెరపీ లాంటివి చేయాలి. ●మాట రాని వారి కోసం స్పీచ్ థెరపీ చేయించాలి. ●ఒక్కసారి ఫిజియోథెరపీ సమయంలో నడవగలిగితే రోగిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. యువతలో పెరిగిన స్ట్రోక్ ముప్పు ప్రస్తుతం యువత బ్రెయిన్ స్ట్రోక్కు గురవడమే కాకుండా, మరణాలకు దారి తీయడం ఆందోళన కలిగించే అంశంగా చెపుతున్నారు. ●గాంధీనగర్కు చెందిన సంతోష్(25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. విధుల్లో తీవ్రమైన వత్తిళ్లకు గురై, వారం రోజుల కిందట సడన్గా స్ట్రోక్ వచ్చి, కొన్ని గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డాడు. ●లబ్బీపేటకు చెందిన 26 ఏళ్ల ఇర్ఫాన్ ప్రయివేటు ఉద్యోగి. ఒకరోజు ఉదయం సడన్గా చేయి పైకి ఎత్తలేక పోవడం, మూతి వంకరగా మారడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే సమీపంలోని స్ట్రోక్ యూనిట్కు తరలించగా, అక్కడ సత్వరమే చికిత్స అందించడంతో ఎలాంటి వైకల్యం రాకుండా కోలుకున్నాడు. తీసుకోవలసిన జాగ్రత్తలు... -
మార్చిలో ఏపీ టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు):వచ్చే ఏడాది మార్చిలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్డీ ప్రసాద్ చెప్పారు. నగరంలోని హోటల్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. అనంతరం ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ... టెన్సిస్ బాల్తో క్రికెట్ ఆడే క్రీడాకారుల్లోని ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఈ లీగ్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చిలో 12 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ లీగ్ పోటీల్లో విజేతలకు సుమారు రూ.30 లక్షల విలువైన నగదు బహుమతులతో పాటుగా బెస్ట్ ప్లేయర్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్మెన్స్లకు బహుమతులు అందిస్తామని తెలిపారు. రానున్న కాలంలో టెన్నిస్ బాల్ క్రికెట్కు ఆదరణ వచ్చేలా తమ అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఐకాన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రెడ్డి మాట్లాడుతూ మార్చిలో జరిగే లీగ్ పోటీల్లో టెన్నిల్ బాల్ క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని వారిలోని ఉన్న ప్రతిభను మెరుగుపర్చుకోవచ్చని వెల్లడించారు. ఈ లీగ్ పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలను నవంబర్ 14వ తేదీన విడుదల చేస్తామన్నారు. రాధా రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్ అతిథిగా హాజరై టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు సంబంధించిన పాటను ఆవిష్కరించారు. కొండలరావు, కరుణాకర్తో పాటుగా సంఘం సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ వైద్యంపై సమ్మెట
మందుల కొరత లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రామీణ వైద్యం దారితప్పింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు 24 రోజుల పాటు సమ్మెలో ఉండటంతో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఆందోళన విరమించి వైద్యులు విధుల్లో చేరినా, పెండింగ్ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. సంచార వైద్యం గాడిన పడేందుకు వారం, పది రోజుల సమయం పడుతుందని వైద్యులు భావిస్తున్నారు. 25 రోజుల పాటు పర్యవేక్షించేవారు లేక హైరిస్క్ గర్భిణులు ఇబ్బందులకు గురయ్యారు. వైద్యాధికారుల లాగిన్లో ఉండే పలు ఆరోగ్య కార్యక్ర మాలు దాదాపు నెల రోజులుగా పెండింగ్లో ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా గాడితప్పిన గ్రామీణ వైద్యం మళ్లీ సజావుగా సాగేదెన్నడో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు సమ్మె కాలంలో ఇండెంట్ పెట్టే వారు కూడా లేక మందులు కొరత నెలకొంది. మొత్తం 72 పీహెచ్సీలు ఎన్టీఆర్ జిల్లాలో 22, కృష్ణా జిల్లాలో 50 చొప్పున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 130 మంది వరకూ వైద్యులు పనిచేస్తున్నారు. వారంతా 24 రోజుల సమ్మె చేయగా, అంతకు ముందు సైతం నిరసనలో ఉన్నారు. ఆ సమయంలో కార్యక్రమాలు ఏమీ పట్టించుకోలేదు. సమ్మె కాలంలో ఇన్చార్జి వైద్యులను నియమించినా వారు మొక్కుబడిగా విధులు నిర్వహించి వెళ్లిపోయారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పీహెచ్ సీల్లో చేయాల్సిన పనులన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. ఆరోగ్య కార్యక్రమాలతో పాటు, మందుల ఇండెంట్లు, ఇలా అన్ని రకాల సేవలు నిలిచిపోగా, అవన్నీ మళ్లీ గాడిన పడేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని సీనియర్ వైద్యులే అంటున్నారు. సంచార వైద్యం లేక.. గత ప్రభుత్వంలో అమలు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని ప్రస్తుతం సంచార వైద్యం పేరుతో నిర్వహించారు. అదికూడా మొక్కుబడిగా నిర్వహించగా, సమ్మెకాలంలో నిలిచిపోయింది. మళ్లీ రూట్ మ్యాపింగ్ ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పెండింగ్ పనులు ఎక్కువగా ఉన్నందున దానిని తిరిగి అమలు చేసేందుకు వారం పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకూ రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే మందుల కోసం సుదూర ప్రాంతంలోని ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యుల సమ్మెతో కొన్ని కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. ప్రస్తుతం వైద్యులందరూ విధుల్లో చేరడంతో సోమవారం నుంచి కార్యక్రమాలపై పర్యవేక్షణ చేస్తాం. మందుల కొరత, ఇతరాత్ర అన్ని విషయాలపై దృష్టి పెడతాం. వైద్య సేవల్లో ఇబ్బందులు లేకుండా చూస్తాం, ఆరోగ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ యుగంధర్, డీఎంహెచ్ఓ, కృష్ణా జిల్లా నెల రోజుల పాటు పీహెచ్సీ వైద్యులు నిరస నలు, సమ్మె చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో మందుల కొరత నెలకొంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్స్లో బీపీ మందులు లేవంటున్నారు. రామవరప్పాడులో ఉన్న హెల్త్ క్లినిక్లో ఓ రోగి వెళ్లి బీపీ మందులు అడగ్గా లేవని అక్కడి సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఇలా అన్ని ప్రాంతాల్లో నెల రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులకు వాడే పలు రకాల మందులు అందుబాటులో లేవంటున్నారు. ఇప్పుడు జిల్లా అంతా ఒకేసారి మందులకు ఇండెంట్ పెట్టినా అవి ఎప్పటికీ అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులకు మరిన్ని రోజులు కష్టాలు తప్పేలా లేవు. -
దుర్గమ్మ సన్నిధిలో క్యూలైన్లు కిటకిట
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు భక్తుల రద్దీ ఓ మోస్తరుగా కనిపించింది. వర్షాలు కురుస్తాయని ముందుగా హెచ్చరించడంతో ఆ ప్రభావం కొంత భక్తులపై పడింది. అయితే ఉదయం నుంచి వాతావరణం పొడిగా, ఎండగా ఉండటంతో క్రమేపీ రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అరగంట పాటు అన్ని క్యూలైన్లు నిలిపివేశారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించిన అనంతరం మధ్యాహ్నం తిరిగి దర్శనాలు ప్రారంభమయ్యాయి. అయితే అప్పటికే అన్ని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఘాట్రోడ్డులో ఓం టర్నింగ్లోని స్టీల్గేట్ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉండగా, ఇటు మహా మండపం మెట్ల మార్గంలోని క్యూలైన్ నాల్గో అంతస్తు వరకు చేరింది. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమై భక్తులకు త్వరతిగతిన అయ్యేలా చర్యలు తీసుకున్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా త్వరగా ముందుకు జరిగేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టిగా, రూ. 300, రూ. 100 టికెటు క్యూలైన్లో గంట సమయం పట్టింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ పలువురు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సర్వ దర్శనానికి రెండు గంటలు -
సంఖ్యలు.. ప్రమాద సంకేతాలు!
సాక్షి నెట్వర్క్: తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులకు తుఫాన్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రతి ఏటా తీర ప్రాంత జనం తుఫాన్ ప్రభావాలకు లోనవుతున్నారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో హెచ్చరిక సంఖ్యలు, వాటి తీవ్రతలు గురించి తెలుసుకుందాం. తుఫాన్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో వాతావరణ శాఖ మత్స్యకారులకు సూచించే విధంగా తీరం ఒడ్డున ఉండే ఎత్తయిన భవనాలపై హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తుఫాన్ ప్రభావాన్ని మత్య్సకారులకు తెలిపేందుకు చీరాల వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఇప్పటివరకు మూడుసార్లు జారీ చేశారు. 10వ నంబర్ హెచ్చరిక అంటే ‘తీవ్రమైన వాతావరణం తుఫాన్గా రేవు మీదుగా గానీ, దగ్గరగా కానీ తీరాన్ని తాకును’ అనే అర్థం. అంటే ప్రమాదం భారీఎత్తున ఉన్నప్పుడే 10 నంబర్ హెచ్చరిక జారీ చేస్తారు. 11వ నంబర్ హెచ్చరికను జారీ చేస్తే ఎలాంటి వర్తమానాలు లేకుండా అంతా అతలాకుతలంగా మారుతుంది. ఇప్పటివరకు చీరాల రేవులో 11వ నంబర్ హెచ్చరికను జారీ చేయలేదు. చీరాల వాడరేవులో ఇప్పటివరకు 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను కేవలం మూడు సార్లు మాత్రమే జారీ చేశారు. 2021లో వార్దా తుఫాన్కు ఒకసారి, 2012లో జల్ తుఫాను సమయంలో, 2010 లైలా తుఫాన్ సమయాల్లోనే హెచ్చరిక జారీ చేశారు. గతంలో వచ్చిన లైలా, జల్ తుఫాన్లు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ తుఫాన్ల కారణంగా భయంకరమైన గాలులు, భారీ వర్షాలు ముంచెత్తడంతో పాటుగా రాకాసి అలలు తీరానికి సంభవించాయి. మత్స్యకారులు బోట్లు ధ్వంసం కాగా, వలలు రాకాసి అలల తాకిడికి సముద్ర గర్భంలో కలిసిపోయాయి. మత్స్యకారులకు రూ.లక్షల్లో, అన్నదాతలకు రూ.కోట్లలో నష్టాన్ని మిగిల్చాయి. తీరం కోతకు గురవ్వడంతో పాటుగా అనేక ప్రాంతాల్లో రహదారులు సైతం కొట్టుకుపోయాయి. ఎన్నో బ్రిడ్జిలు ముంపునకు గురయ్యాయి. హెచ్చరిక సంఖ్య తీవ్రత 1 నంబర్ అక్కడ ఈదురు గాలి ఉన్న ప్రాంతం ఉన్నది. దానికి తోటు తుఫాను ఏర్పడవచ్చు. 2 నంబర్ తుఫాన్ ఏర్పడి ఉన్నది. 3 నంబర్ ఈదురుగాలులు రేవును తాకవచ్చు. 4 నంబర్ తుఫాన్ తాకినప్పటికి ప్రమాదం లేదు. 5 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును ఎడమ పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది. 6 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును కుడి పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది. 7 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవు మీదుగా గాని తీరాన్ని గాని తాకుతుంది. 8 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును ఎడమ పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది. 9 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును కుడి పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది. 10 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవు మీదుగా గానీ దగ్గరగా గానీ తీరాన్ని తాకుతుంది. 11 నంబర్ తుఫాను ప్రమాదమైనది. వర్తమానాలు లేవు -
● యువత లక్ష్యంగా సాగుతున్న గంజాయి దందా ● ఈజీ మనీకి అలవాటుపడి గంజాయి రవాణా చేస్తున్న యువకులు ● రూరల్ ప్రాంతాల్లో వరసగా పట్టుబడుతున్న గంజాయి నిందితులు ● గంజాయి మత్తులో హత్యలు, దాడులకు పాల్పడుతున్న వైనం
జి.కొండూరు: యువతే లక్ష్యంగా గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. తేలికగా డబ్బు సంపాదించేందుకు అలవాటుపడిన యువకులతో గంజాయి రవాణా సాగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం గంజాయి దందా సాగిస్తోంది. పల్లె ప్రాంతాల్లో తరుచూ గంజాయి పట్టుబడటం ఇందుకు నిదర్శనంగా మారింది. యువతే లక్ష్యంగా గంజాయి మాఫియా ప్రత్యేక నెటవర్క్ను నడుపుతూ ఆన్లైన్ పేమెంట్లతో ముందుగానే ఆర్డర్లు తీసుకొని సరఫరా చేయడం నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి రవాణా పల్లెల్లో విస్తరిస్తోంది. రేషన్, ఇసుక, మట్టి మాఫియా నిర్వాహకులు తమ దందాకు సెక్యూరిటీగా గంజాయి బ్యాచ్ను నియమించుకుంటున్నారని సమాచారం. ఇటీవల తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఓ మీడియా చానల్ డిబేట్లో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు ప్రజాప్రతినిధి అనుచరులే భద్రాచలం నుంచి గంజాయి తెప్పించి తిరువూరులో విక్రయిస్తున్నారని ఆరోపించడం గమనార్హం. తనిఖీల్లో చిక్కుతున్న గంజాయి ఈ నెల 15వ తేదీన జి.కొండూరు మండలం చెవుటూరు శివారులోని పత్తి చేలల్లో పోలీసులు తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద 1.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందతుల్లో ఏలూరుకు చెందిన ఉత్తరవల్లి జగదీష్, విజయవాడకు చెందిన నలుగురు యువకులు, మైలవరంకు చెందిన ఒకరు, జి.కొండూరు మండలం వెంకటాపురానికి చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు. తిరువూరు మండలం చిట్టేల క్రాస్రోడ్డు వద్ద ఈ నెల 21న బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను పోలీసులు తనిఖీ చేయగా 1.5 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు విశాఖపట్నం జిల్లాలోని సీలేరు నుంచి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు నిందితుల్లో ఒకరు తిరువూరుకు చెందిన యువకుడు, మిగిలిన ఇద్దరు విజయవాడకు చెందిన వారని, తరచూ గంజాయి రవాణా చేస్తున్నారని వెల్లడైంది. జగ్గయ్యపేట మండల పరిధి చిల్లకల్లు పోలీసుస్టేషన్ పరిధిలో గౌరవరం వద్ద ఒడిశా నుంచి హైదరబాద్కు రెండు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 10 కిలోల గంజాయి జూలై 24న పట్టుబడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు, కంచకచర్ల మండలం కీసరకు చెందిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచకచర్ల మండలం పరిటాల శివారులో ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్న కారులో ఆరు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదే నెల 24వ తేదీన జుజ్జూరురోడ్డులో రెండు బైకులపై తరలిస్తున్న నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదే నెలలో నందిగామ, చిల్లకల్లు పోలీసుస్టేషన్ల పరిధిలో సుమారు 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ ఏసీపీ బాలగంగాధర్ తిలక్ అప్పట్లో ప్రకటించారు. దాడి ఘటనలో గంజాయి కలకలం గంజాయి మత్తుకు బానిసలవుతున్న యువకులు విచక్షణ కోల్పోయి రక్తసంబంధాలను మరిచి హత్యలకు తెగబడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2024, డిసెంబరు 22వ తేదీన రాత్రి సమయంలో జి.కొండూరు మండలం కుంటముక్కల శివారులో ఇటుక బట్టీల వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ట్రాక్టర్లు పక్కకు తప్పుకునే విషయమై వివాదం తలెత్తింది. ఈ వివాదంలో ఒక ట్రాక్టరుపై ఉన్న యువకుడు సన్నీ తన స్నేహితులకు ఫోన్ చేశాడు. బైకుపై వచ్చిన ముగ్గురు యువకులు మరో ట్రాక్టరుపై ఉన్న యడవల్లి వెంకటేశ్వరరావు, సానం సాయిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే బాధితులకు మద్దతుగా ఇటుకబట్టీలలో కార్మికులు రావడంతో దాడి చేసిన యువకులు బైకులను వదిలేసి పారిపోయారు. ఈ బైకుల్లో గంజాయి దొరికింది. గంజాయి మత్తులోనే యువకులు దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఐదుగురు కుమార్తెలు, రెండో భార్యకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాజీ గంజాయి వ్యాపారం చేసేవాడు. గంజాయి విక్రయ కేసులో బాజీతో పాటు అతని రెండో భార్య నాగేంద్రమ్మ ఈ ఏడాది మే 30వ తేదీన పోలీసులకు పట్టుబడ్డారు. మొదటి భార్య సాయంతో జైలు నుంచి విడుదలైన బాజీ జైలులో ఉన్న రెండో భార్య కుమార్తె చిందే గాయత్రిని ఆగస్టు 31వ తేదీన హత్య చేశాడు. గంజాయి కేసులో తన వివరాలను పోలీసులకు చెప్పిందనే కోపంతోనే ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తగా, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో ఈ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు. నిందితుడిపై మొత్తం పది గంజాయి, చోరీ కేసులు ఉన్నాయి. అతని వద్ద 27.170 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని పీడీయాక్టును ప్రయోగించారు. ఈ కేసులో బాజీ, అతని రెండో భార్య జైలుపాలవగా కుమార్తె చనిపోయి ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. -
పోట్రైట్ చిత్ర కళాకారుడు సన్నాలకు ఘన నివాళి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రముఖ పో ట్రైట్ చిత్రకారుడు సన్నాల సత్యనారాయణ వరప్రసాద్కు ఆదివారం చిత్రకారులు పోట్రైట్ చిత్రాలతో ఘనంగా నివాళులర్పించారు. ముత్యాలంపాడు ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఎంఎస్ మూర్తి ఆర్ట్ గ్యాలరీలో ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య, జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి, ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఎంఎస్ మూర్తి ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో సన్నాల సత్యనారాయణ వరప్రసాద్కు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 25 మంది ప్రోట్రైట్ చిత్రకారులు సన్నాల పోట్రైట్ చిత్రాలను గీసి నివాళులర్పించారు. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి కార్యదర్శి గోళ్ల నారాయణరావు అధ్యక్షతన సన్నాల సంస్మరణ సభ జరిగింది. అనంతరం పోట్రైట్ చిత్రాలు గీసిన చిత్రకారులకు సర్టిపికెట్లు అందజేశారు. ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ కార్యదర్శి ఎంవీ సాయిబాబు చిత్రకారులు టీవీ, జీవన్ గోషిక, విజయకుమార్, బాలయోగి, మురళీకృష్ణ, రాము అలహరి, కళాసాగర్ రాజు, చిత్రాలయ రాంబాబు, కాంతారావు, సునీల్కుమార్, సర్వేశ్వరరావు పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లా ప్రత్యేకాధికారిగా ఆమ్రపాలి
చిలకలపూడి(మచిలీపట్నం): మోంథా తుపాను పరిశీలన కృష్ణా జిల్లా ప్రత్యేకాధికారిగా కె.అమ్రాపాలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, గాలులు వీయనున్న నేపథ్యంలో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగ కుండా, అధికారులను అప్రమత్తం చేసేందుకు జిల్లాకు ప్రత్యేకాధికారిగా ఆమెను నియమించారు. అమ్రాపాలి సోమవారం కలెక్టరేట్కు వస్తారని అధికారులు తెలిపారు. -
మద్యం షాపు తొలగించాలంటూ ఆందోళన
కృత్తివెన్ను: తమ గ్రామంలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని మండలంలోని సీతనపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం వారంతా షాపు వద్దకు చేరుకుని షాపు ముందు టెంట్ వేసి నిరసన తెలిపారు. ఇటీవల సీతనపల్లి గ్రామంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై ఎకై ్సజ్ శాఖాధికారులకు, స్థానిక అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినా కూడా వారు స్పందించలేదని గ్రామస్తులు ఆరోపించారు. తమ గ్రామంలో వెంటనే షాపు తొలగించాలని ఆందోళన చేయడంతో ఎకై ్సజ్ సీఐ రమణ విషయం తెలిసి అక్కడకు వచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి షాపును తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ షాపు నిర్వహణ కుదరదని వారు పట్టుపట్టడంతో షాపును తొలగిస్తున్నట్లు, వేరే ప్రాంతానికి తరలించనున్నట్లు సీఐ తెలిపారు. దీంతో గ్రామస్తులు నిరసన విరమించారు. -
రైతులకు అందుబాటులో ఉండాలి
కంకిపాడు: మండల స్థాయిలో అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ సస్యరక్షణ చర్యలు వివరించాలని కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి స్పష్టం చేశారు. ఈనెల 25వ తేదీన ‘వదలని వాన..రైతన్న హైరానా’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి శనివారం ఆమె స్పందించారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 1.54 లక్షల హెక్టార్లలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు జరిగిందన్నారు. పైర్లు చిరుపొట్ట, గింజ గట్టిపడే దశలో ఉన్నాయన్నారు. గత ఐదురోజులుగా 107.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం 33 గ్రామాల్లో 379 మంది రైతులకు చెందిన 228.4 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనాలు రూపొందించిందన్నారు. శాస్త్రవేత్తల బృందంతో కలిసి, వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి పంటల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తున్నామన్నారు. ముఖ్యంగా పొలాల్లో ముంపు నీటిని త్వరగా బయటకు తరలించాలన్నారు. ఎకరాకు 30 కిలోలు యూరియా, 15 కిలోలు పొటాష్ ఎరువులు పైపాటుగా వాడుకోవాలన్నారు. వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువగా రావటానికి ఆస్కారం ఉంటుందని, ఉధృతి ఎక్కువైతే మొక్కలు ఎండిపోయి చనిపోతాయన్నారు. నివారణకు ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్లు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి దుబ్బుకి తగిలేలా 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు పిచికారీ చేసుకోవాలన్నారు. అగ్గితెగులు ఉధృతికి వాతావరణం అనుకూలంగా ఉందని, తెగులు ఆశించినప్పుడు నూలుకండె ఆకారంలో గోధుమరంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ మచ్చలు పెద్దవి అయి మొక్కలు చనిపోతాయన్నారు. నివారణకు ట్రైసైక్లోజల్ 0.6 గ్రాములు లైదా కాసుగామైసిన్ 2 మిల్లీలీటర్లు, లేదా ప్యూజివన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. సుడిదోమ ఆశిస్తే ఇతోపెన్హాక్స 2 మిల్లీలీటర్లు లేదా 1.5 గ్రాములు ఎసిపేట్, లేదా 0.25 మిల్లీలీటర్లు ఇమిడాక్లోపిడ్ లేదా 0.20 గ్రాములు డయోమిథోకార్బ్ ఇతర వ్యవసాయ శాఖ సూచనల మేరకు మందులు వినియోగించి పైరుపై పిచికారీ చేసుకోవాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ వరి కోతలు వాయిదా వేసుకోవాలని, అధిక వర్షాల దృష్ట్యా రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు ఇవ్వాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి -
అందని వందనం – తల్లుల దైన్యం
●38 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు ●కొణకంచి జెడ్పీ హైస్కూల్లో డీవైఈఓ విచారణ కొణకంచి(పెనుగంచిప్రోలు): మండలంలోని కొణకంచి గ్రామంలో నలబోతు రామనాథం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు పడలేదు. హైస్కూల్లో 6 నుంచి 10 వ తరగతి వరకు మొత్తం 220 మంది విద్యార్థులు ఉండగా సుమారుగా 100 మందికి పైగా విద్యార్థుల వరకు డబ్బులు పడలేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే తమకు 38 మంది నుంచి మాత్రమే ఫిర్యాదులు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు ఎందుకు పడలేదో విద్యాశాఖ, గ్రామ సచివాలయంలో సంప్రదించినా సరైన సమాధానం రాలేదని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగటం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక్కొక్కరికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరికి మాత్రమే డబ్బులు పడ్డాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. కేవలం హైస్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే డబ్బులు పడలేదని అంటున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు... తల్లికి వందనం డబ్బులు పడలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ప్రజా పరిష్కారాల వేదికలో కూడా అర్జీ అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీవైఈఓ శ్యాం సుందరరావు శుక్రవారం పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన పూర్తి స్థాయిలో పరిశీలన చేశారు. దీనిపై వివరణ కోరగా డీవైఈఓ మాట్లాడుతూ 38 మంది తల్లిదండ్రులు తల్లికి వందనం డబ్బులు పడలేదని జిల్లా కలెక్టర్, డీవైఈఓ, ఆర్జేడీలకు ఫిర్యాదులు చేశారని, దీనిపై పూర్తిగా విచారణ చేయగా ఆధార్ నంబర్లు తప్పుగా ఉన్నాయని గుర్తించామని, తప్పుల్ని సరిచేసి అందరు విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. కొందరికి ఇద్దరు పైన పిల్లలు ఉంటే ఒకరికి డబ్బులు పడ్డాయన్నారు. హెచ్ఎం నాగరాజు మాట్లాడుతూ తాను జూన్ నెలలో పాఠశాలకు వచ్చానని, హెచ్ఎం లాగిన్లో తల్లి, పిల్లల ఆధార్కార్డు నంబర్లు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. కొన్ని బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డుకు అనుసంధానం కాకుండా ఉన్నాయన్నారు. తప్పులు అన్నీ ఐటీ సెల్ ద్వారా సరి చేయిస్తామన్నారు. -
ఆర్టీసీ బస్సులో పొగలు
నందిగామ టౌన్: విజయవాడ గవర్నరుపేట–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పొగలు వ్యాపించిన ఘటన పట్టణం సమీపంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు విజయవాడ నుంచి కోదాడకు ఆర్టీసీ బస్సు 15 మంది ప్రయాణికులతో వెళ్తోంది. నందిగామ పట్టణం సమీపంలోకి వచ్చే సరికి ఒక్కసారిగా బస్సులో పొగలు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపి ఆర్టీసీకి చెందిన మరొక బస్సులో పంపించారు. బస్సు ఇంజిన్లో ఆయిల్ లీకవటంతో పొగలు వ్యాపించినట్లు డ్రైవర్ తెలిపారు. కర్నూలు ఘటన మరువక ముందే ఈ విధంగా జరగడంతో ప్రయాణికులు ఆందోళనచెందారు. పొగలు వ్యాపించడంతో రోడ్డుపై నిలిచిపోయిన బస్సు -
ముగ్గురు పిల్లలకీ డబ్బులు పడలేదు
మాకు నలుగురు పిల్లలు. బాబు నందిగామలో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. అతనికి డబ్బులు పడ్డాయి. గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న నాగకీర్తన, 9వ తరగతి చదువుతున్న అక్షయ, 6వ తరగతి చదువుతున్న అఖిల ముగ్గురికీ తల్లికి వందనం డబ్బులు పడలేదు. హెచ్ఎం, సచివాలయం లాగిన్లో ఆధార్ నంబర్లు కచ్చితంగా ఉన్నాయి. ఈకేవైసీ కూడా అయింది. –బచ్చు కవిత తల్లికి వందనం డబ్బుల కోసం మూడు నెలలుగా తిరుగుతున్నాం. మా(లక్ష్మి) బాబు వేణుగోపాల్ పదో తరగతి చదువుతున్నాడు. గతంలో అమ్మ ఒడి డబ్బులు పడ్డాయి. ఇప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నా డబ్బులు పడలేదు. మా(నవ్య) పెద్దబాబు వాసు పదో తరగతి పూర్తి చేశాడు. రెండో బాబు రామ్ప్రసాద్ 8వ తరగతి అయింది. వారిద్దరికీ డబ్బులు పడలేదు. –కోనూరు లక్ష్మి , బొల్లెద్దు నవ్య మాకు 9వ తరగతి చదువుతున్న పాప నాగదీపిక, రెండో తరగతి చదువుతున్న నాగఅశ్విన్ ఉన్నారు. హైస్కూల్లో చదువుతున్న నాగదీపికకు తల్లికి వందనం డబ్బులు పడలేదు. పాఠశాలలో అధికారులు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. మా గోడు వారికి విన్నవించుకున్నాం. –కోడి త్రివేణి -
ఏబీపీలో కీలక సూచికల్లో పురోగతి
●పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టి పెట్టాలి ● కేంద్ర ప్రభారి అధికారి నేలపట్ల అశోక్బాబు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం (ఏబీపీ) అమలవుతున్న పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల్లో కీలక సూచికల్లో పురోగతి సాధించినట్లు కేంద్ర ప్రభారి అధికారి నేలపట్ల అశోక్బాబు అన్నారు. ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం మంచి చర్యలు చేపట్టిందని ప్రశంసించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన ఆకాంక్షిత బ్లాకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల పెనుగంచిప్రోలు మండలంలో 25 సూచికల్లో, ఇబ్రహీంపట్నం మండలంలో 18 సూచికల్లో నూరుశాతం లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. మిగిలిన సూచికల్లో కూడా సంతృప్త స్థాయిని సాధించాలని సూచించారు. ఈ మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుంచి సంపద కేంద్రాలు మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. కొండపల్లి బొమ్మలను వివిధ రకాల ఆకృతుల్లో రూపొందించాలని సూచించారు. పాఠశాలల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టి సారించాలని, కొండపల్లి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఆకాంక్షిత బ్లాకులలో మెరుగైన ఫలితాల సాధనకు స్మార్ట్ వ్యవసాయాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఏబీపీలో భాగంగా ఆరు కీలక సూచికల్లో నూరు శాతం సంతృప్త స్థాయి చేరుకోవడానికి 2024 జూలైలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రధానమంత్రి ‘సంపూర్ణత అభియాన్‘ కార్యక్రమం ప్రారంభించారని చెప్పారు. జిల్లాలోని రెండు ఏబీపీ మండలాల్లోనూ ఆరు సూచికల్లో నూరు శాతం లక్ష్యాలు సాధించి నీతి అయోగ్ నుంచి జిల్లా, మండల అధికారులు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు పొంది నట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన సూచికల్లోనూ సంతృప్త స్థాయి సాధిస్తామని తెలిపారు. ఏబీపీలో ఎ.కొండూరు మండలాన్ని కూడా చేర్చాలని కోరారు. అంతకుముందు కలెక్టరేట్ లోని ఇగ్నైట్ సెల్ లో డీఆర్డీఏ విభాగం ఏర్పాటుచేసిన స్టాల్ను కేంద్ర ప్రభారీ అధికారి అశోక్ బాబు కలెక్టర్ లక్ష్మీశతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కె. చైతన్య, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ నరసింహం, ముఖ్య ప్రణాళిక అధికారి వై.శ్రీలత, జెడ్పీ సీఈవో కేకే నాయుడు, కె.ఆర్.ఆర్.సి.స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పోసిబాబు, డీఎంహెచ్ఓ సుహాసిని, డీఆర్డీఏ పి.డి నాంచారయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
● రహదారి ఇలా.. రాకపోకలు ఎలా?
విస్సన్నపేట నుంచి ఎ.కొండూరు వెళ్లే రోడ్డుపై భారీ గుంతలు పడ్డాయి. చిన్నపాటి వర్షానికి సైతం ఈ గుంతల్లోకి నీరు చేరుతోంది. పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ట్రైబల్ బాలుర గురుకుల పాఠశాలతో పాటు ఆస్పత్రులు, కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. గుంతల కారణంగా వాహన చోదకులు, పాదచారులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. పలువురు వాహనచోదకులు ప్రమాదాల బారిన పడ్డారు. అధికారులు స్పందించి రహదారికి మర్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. –విస్సన్నపేట -
సీఎం చేతికి చిన్ని చిట్టా
ఘనంగా నాగులచవితి వేడుక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం నాగులచవితి వేడుక ఘనంగా జరిగింది. వేకువ జాము నుంచే పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. పుట్టలో పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి మొక్కుబడులు చెల్లించారు. మోపిదేవిలోని ప్రసిద్ధ శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, పెనమలూరు మండలం చోడవరంలో వేంచేసిన శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీనాగేంద్ర స్వామివారి దేవస్థానం భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం ప్రజలు బాణసంచా కాల్చి సందడిచేశారు. – సాక్షి నెట్వర్క్ సాక్షి, ప్రత్యేక ప్రతినిఽధి: ‘విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుల మధ్య ఆ రచ్చ ఏంటి? పార్టీ పరువు బజారున పడటం లేదా? వారు ఎందుకింత రోడ్డుపైకి ఈడుస్తున్నారు? ఇంత దారుణమైన పరిస్థితులు మరెక్కడైనా ఉన్నాయా? అలా నేరుగా మీడియాకు ఎక్కడం ఏంటి? పార్టీ అధిష్ఠానం, కేంద్ర కార్యాలయం ఉన్న అమరావతిలోనే ఈ దుస్థితి నెలకొని ఉంటే రాష్ట్రమంతా ఎలాంటి సంకేతాలు వెళతాయి? ప్రజాప్రతినిధులపైన, నాయకులపైన పార్టీకి ఏమాత్రం పట్టులేదని రూఢీ కావడం లేదా? ద్వితీయశ్రేణి నాయకత్వం, కార్యకర్తలు ఏమనుకుంటున్నారో అంచనాకు అందడం లేదా? మీరంతా కేంద్ర కార్యాలయంలో ఉండి ఏం చేస్తున్నారు? ఇంతలా అవుతున్నా ఎందుకు నా దృష్టికి తీసుకురాలేదు?’ అని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యులపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్బ్యూరో సభ్యులతో పాటు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతోనూ దుబాయ్ నుంచి మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీల గురించి తాజా సమాచారం రావడంతో వాటన్నింటిపై విచారించి వాస్తవాలు తెలియజేయాలని సంబంధితులను ఆదేశించినట్లు తెలిసింది. తిరువూరులో ఎమ్మెల్యే వ్యవహారాలపై ఫిర్యాదులు అందగా ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణల చిట్టా చాంతాడంత చంద్రబాబు చేతికి వెళ్లిందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇసుక, గ్రావెల్, నాటుసారా, గంజాయి అమ్మకాలు తదితరాల గురించి నేతలిరువురు పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం, వారి ముఖ్య అనుచరులు వాటిని సవివరంగా ఏకరువు పెట్టడం బహిరంగ రహస్యమే. విజయవాడలో శనివారం జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనగా అందులోనూ చిన్ని, కొలికిపూడి వ్యవహారంపై చర్చ వచ్చింది. ఈ సమావేశంలోనూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్లు టీడీపీ నేతల ద్వారా తెలిసింది. వీరి వ్యవహారంపై ఒక కమిటీని వేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర మీడియాకు తెలిపారు. ‘నువ్వేదో సర్వీస్ ఓరియంటెడ్ అనుకున్నా. ఇంత కమర్షియల్ అని అనుకోలేదు. సర్వీస్ అంటే ఏంటో గండిపేటకు వెళ్లి ఎన్టీఆర్ ట్రస్టు చేస్తున్న సేవల గురించి తెలుసుకో. సేవ ఎలా చేయాలో, ఏం చేయాలో తెలిసొస్తుంది..’ అని ఎంపీ కేశినేని చిన్నికి చంద్ర బాబు విజయవాడలో ఓ సందర్భంలో హితవు చెప్పారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ‘సాక్షి’కి వివరించారు. -
తుపానును ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మోంథా తుపాను వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జేసీ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టర్ తుపాను సన్నద్ధత సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తుపాను కారణంగా వేగంగా వీచే గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేప ట్టాలన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ప్రజలు నిత్యావసర సరుకులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున కొవ్వొత్తులు, బ్యాటరీ లైట్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఫోన్లకు చార్జింగ్ పెట్టుకుని సిద్ధం చేసుకునేలా అప్రమత్తం చేయాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్యశిబిరాలు, పాముకాటు మందులు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే కంట్రోల్రూమ్ 08672– 252572 నంబరుతో ఏర్పాటు చేశామని, ఆర్డీఓ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా డివిజన్, మండలస్థాయిలో తుపాను, వరదలకు సంభవించిన ఎటువంటి సమాచారం వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. చిన్నపిల్లలు అంగన్వాడీ కేంద్రానికి రాకుండా వారికి ఇవ్వాల్సిన పోషకాహారాలను ఇంటి వద్దకే చేరవేయాలన్నారు. పశువుల పెంపకందారులు వాటిని ఇంటి వద్దనే ఉంచుకునేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తుపాను ప్రభావిత రోజుల్లో ప్రసవించనున్న గర్భవతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన యంత్ర పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జేసీ నవీన్ మాట్లాడుతూ.. ఆదివారం నాటికి అన్ని చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర వస్తువులన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం, హేలాషారోన్, ఏఎస్పీలు వి.వి.నాయుడు, సత్యనారాయణ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు రమణారావు, సోమశేఖర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామప్రసాద్ పాల్గొన్నారు. -
సైకిల్పై విధులకు హాజరైన కృష్ణా కలెక్టర్
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్పై వచ్చి విధులకు హాజరయ్యారు. శబ్ద, వాయు కాలుష్యం నివారణలో భాగంగా సైకిల్పై లేదా నడక మార్గంలో ప్రతి ఒక్కరూ ఒక రోజైనా విధులకు హాజరు కావాలని ఆయన ఇటీవల ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సైకిల్పై విధులకు హాజరయ్యారు. 27, 28, 29 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవు చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఈ నెల 27, 28, 29 తేదీలను సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మోంథా తుపాను కారణంగా అధిక వర్షాలు, గాలులు ఉండే అవ కాశం ఉన్నందున ప్రాణనష్టం జరగకుండా నివారించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, గురుకుల పాఠశాలలకు సెలవులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లోని విద్యార్థులందరూ ఆదివారం సాయంత్రంలోగా తమ ఇళ్లకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ఆదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విలేజ్ క్లినిక్లలో ఆయుర్వేద గ్రాడ్యుయేట్లను నియమించండి లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని విలేజ్ హెల్త్ క్లినిక్లలో ఆయుర్వేద గ్రాడ్యుయేట్లను నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, నేషనల్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ , కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు ఉద్దేశించి 58 సర్జరీలను అనుమతిస్తూ ప్రత్యేక జీఓ ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్కి పాలక మండలి ఏర్పాటు చేయాలని, ఆయుష్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని విన్నవించారు. డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలకు స్థలం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులకు డీడీఓ పవర్స్ మంజూరు చేయాలనే అంశాలను మంత్రికి వివరించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆయా అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఏపీ ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి.బుల్లయ్య తెలిపారు. మంత్రిని కలిసి వారిలో నేషనల్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేముల భాను ప్రకాశ్, డాక్టర్ వి.శ్రీధర్, డాక్టర్ రాజ్కమలాకర్, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ జి.చినరాజు తదితరులు పాల్గొన్నారు. డెంగీతో సీఆర్పీ మృతి పాయకాపురం(విజయవాడరూరల్): డెంగీతో వారం రోజులుగా బాధ పడుతున్న కమ్యూనిటీ రిసోర్సు పర్సన్ (సీఆర్పీ) వి.శివదుర్గ(36) శనివారం ఉదయం మరణించారు. నగరంలోని 61వ డివిజన్ ప్రశాంతి నగర్లో నివసిస్తున్న శివదుర్గ సీఆర్పీగా విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు సెక్టార్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారం రోజుల క్రితం జ్వరం రాగా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డెంగీ అని నిర్ధారించారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి భర్త రాజారావు నార్త్ మండలంలో సీఆర్పీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వ హిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. సీఆర్పీ మృతి చెందినట్లు సమాచారం అందుకున్న విజయవాడ రూరల్ మండలం విద్యాశాఖాధికారులు ఎ.వెంకటరత్నం, ఎ.సూరిబాబు మండల సీఆర్పీలతో కలసి వెళ్లి ఆమె భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. -
ప్రైవేటు బస్సు.. భద్రత తుస్సు
బస్టాండ్(విజయవాడపశ్చిమ): కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అవి మృత్యు శకటాలుగా మారి నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ట్రావెల్స్ యజమానులు పలువురు నిబంధనలు పాటించకుండా కాలం చెల్లిన బస్సులు నడుపుతున్నారు. ఫిట్నెస్ లేకపోయినా బస్సులు రోడ్లు ఎక్కుతున్నాయి. వాటిపై నిరంతరం నిఘా ఉంచాల్సిన రవాణా శాఖ అధికారులు నామ మాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు నాలుగు రోజులు హడావిడి చేసి వదిలేస్తున్నారు. ఏడేళ్ల క్రితం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద జేసీ కుటుంబానికి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. తాజాగా కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో 20 మందిపైగా మృత్యువాత పడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో డొల్లతనం బయటపడింది. ఉమ్మడి జిల్లాలో 500లకు పైగా బస్సులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు విజయవాడ రాజధానిగా మారింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 500లకు పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి మరో 200 వరకు బస్సులు నగరం మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖ, చైన్నె, బెంగళూరు వంటి ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు వాటిలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రత్యేకించి సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలతో పాటు వీకెండ్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మూడొంతులు పర్మిట్లు, ఫిట్నెస్ లేకపోవడం, సేఫ్టీ నింబంధనలు పాటించకుండానే రోడ్లపైన తిరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా తిరిగే బస్సులో అత్యధికం ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో ఉన్నవే. అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్మిట్లు పొంది మన రాష్ట్రంలో విచ్చలవిడిగి తిరుగుతున్నాయి. ఈ బస్సులకు ఫిట్నెస్, పర్మిట్లు ఉన్నాయా? లేవా? ప్రయాణికులతో పాటు సరుకు రవాణా చేస్తున్నాయా అన్న అంశాలను నిరంతరం తనిఖీ చేయాల్సిన అధికారులు వాటివైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. అంతా అడ్డగోలు కొందరు ట్రావెల్స్ యజమానులు ఫిట్నెస్ ఉన్న బస్సుల నంబర్లతో మరో రెండు మూడు పాత బస్సులను నడుపుతున్నారు. ఒక బస్సు విశాఖ రూట్లో వెళ్తే అదే నంబరుతో మరో బస్సు హైదరాబాద్, ఇంకొకటి బెంగళూరు రూట్లో ప్రయాణిస్తాయి. ఈ విషయాలన్నీ రవాణా శాఖ అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. డ్రైవర్లు ఏ స్థితిలో ఉన్నారో కూడా పట్టించుకోవడం లేదు. 2017లో హైదరాబాద్ జాతీయ రహదారిపై పెనుగంచిప్రోలు మండలంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పది మంది మృత్యువాత పడ్డారు. తాజాగా కర్నూలులో జరిగిన ఘటనలో 20 మంది చనిపోయారు. రెండేళ్ల క్రితం విజయవాడలో రోడ్డుపక్కన నిలిపి ఉంచిన బస్సు అగ్నికి ఆహుతైంది. కారణాలు తెలియలేదు. ఈ ప్రమాదాల నుంచి అటు ట్రావెల్స్ నిర్వాహకులు, ఇటు అధికారులు గుణపాఠం నేర్చుకోవడం లేదు. ప్రయాణికులతోపాటు సరుకు రవాణా విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికులనే కాకుండా సరుకు రవాణా చేస్తున్నారు. విజయవాడ ఆటో నగర్, హనుమాన్పేట తదితర ప్రాంతాల్లో నిత్యం ప్రైవేటు బస్సులు సరుకు లోడింగ్ చేసుకుని వెళ్తుంటాయి. పోలీసులు, రవాణా శాఖ అధికారులు వారిపై చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. బస్సుల్లో ఏయే సరుకులు రవాణా చేస్తున్నారో కూడా నిఘా ఉండడం లేదు. కొన్ని బస్సుల్లో కింది భాగంలో బైక్లు ఎక్కిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బైక్ల్లోని పెట్రోల్ ట్యాంక్లు పగిలి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బస్టేషన్కు రెండు మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే విజయవాడ బస్టాండ్ ఎదురుగానే ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. కేబిన్లోనూ ప్రయాణికులను ఎక్కించి దందా సాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా తీసు కుని అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఆయా శాఖల అధికారులు స్పందించి ప్రైవేటు బస్సుల్లో ఫిట్ నెస్, పర్మిట్లు, భధ్రత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విశాఖపట్నం, చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తగినన్ని బస్సులను ఆర్టీసీ నడపాలి. ఆర్టీసీ బస్సులు లేక పోవడం వల్లే ప్రైవేటు టావెల్స్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. సురక్షితం కాదని తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించక తప్పడంలేదు. – తిమోతి, ప్రయాణికుడు, విజయవాడ ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణ లోపించింది. ట్రావెల్స్ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. టన్నుల కొద్దీ సరుకును ప్రయాణికుల బస్సుల్లో లోడు చేస్తున్నారు. ఆ బస్సులు పరిమితికి మంచి లోడుతో ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. – శరత్, ప్రయాణికుడు, విజయవాడ -
క్రీడలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి
విజయవాడరూరల్:క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని రాష్ట్ర ఎంఈఓల సంఘం అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, సమగ్ర శిక్ష, ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నున్న జిల్లా పరిషత్ హైస్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన రెజ్లింగ్ అండర్–19 పోటీలు గురువారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మండల విద్యాశాఖాధికారుల సంఘం అధ్యక్షుడు, విజయవాడ రూరల్ ఎంఈఓ ఎ.వెంకటరత్నం రెజ్లింగ్ పోటీల్లో గెలుపొందిన నెల్లూరు జిల్లా జట్టుకు ఓవరాల్ చాంపియన్షిప్ ట్రోఫీలను, వ్యక్తిగత విజేతలకు పతకాలు అందచేశారు. ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నెల్లూరు జట్టు.... నెల్లూరు జిల్లా క్రీడాకారులు ఈ టోర్నమెంట్ అంతటా అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఫ్రీస్టైల్ విభాగంలో ఆ జట్టు నాలుగు బంగారు పతకాలను రెండు రజత పతకాలను గెలుచుకోవడం ద్వారా 26 పాయింట్లు సాధించింది. గ్రీకో రోమన్ విభాగంలో మూడు బంగారు పతకాలు, మూడు కాంస్య పతకాలతో 18 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో నున్న జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎస్.రవిప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్ జి.కుమార్, ఏపీ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.భూషణం, సీహెచ్ రమేష్, పి.ఆనంద్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి టి.శ్రీలత, ఫిజికల్ డైరెక్టర్లు టి.విజయవర్మ, ఎంవీ సత్యప్రసాద్, ఎస్.రమేష్ పాల్గొన్నారు. రాష్ట్ర ఎంఈఓల సంఘం అధ్యక్షుడు ఆదూరి -
బీఈడీ, స్పెషల్ బీఈడీ ఫలితాలు విడుదల
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలకు సంబంధించి బీఈడీ, స్పెషల్ బీఈడీ రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. ఉపకులపతి ఆచార్య కె.రాంజీ ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామని చెప్పారు. 1351 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 71.13 శాతంతో 961 మంది, స్పెషల్ బీఈడీ –2 సెమిస్టర్లో 66 మంది పరీక్షకు హాజరుకాగా 84.85 శాతంతో 56 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పునఃమూల్యాంఖనం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు నవంబరు 4వ తేదీలోగా వెబ్సైట్లో సూచించిన రుసుము చెల్లించి ధరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. పెడన:మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాథమిక పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న స్కూలు భవనం కూలిపోయింది. వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు జిల్లా వ్యాప్తంగా సెలవు మంజూరు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే వాదన గ్రామస్తులు నుంచి వ్యక్తమవుతుంది. ఇటువంటి వాటిని తక్షణం తొలగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు ఎవరైనా ఆడుకోవడానికి వెళ్లి ఉంటే పరిస్థితి ఏమిటనే ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నారు. -
40 సూచికల్లో వృద్ధి సాధించాలి
పెనుగంచిప్రోలు:రాష్ట్రంలో 15 మండలాలను నీతి అయోగ్ ఆకాంక్షిత బ్లాక్(ఏబీపీ)లుగా గుర్తించిందని, ఉమ్మడి జిల్లాలో పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలను గుర్తించామని కేంద్ర ప్రభారీ అధికారి, కేంద్ర జలసంఘం డైరక్టర్ నేలపట్ల అశోక్కుమార్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పెనుగంచిప్రోలు, ముండ్లపాడు గ్రామా ల్లో గురువారం ఆయన పర్యటించారు. పెనుగంచిప్రోలులో తిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘ మహిళలను కలుసుకుని వారితో మాట్లాడారు. వ్యాపారా న్ని మరింత వృద్ధి చేసుకునేందుకు సూచనలు చేశా రు. అలాగే ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, కేవీఆర్ జెడ్పీ హైస్కూల్, అంగన్వాడీ కేంద్రం, ఎస్డబ్ల్యూయపీసీ యార్డు, పంచాయతీ కార్యాలయం, రైతు సేవా కేంద్రాలను పరిశీలించారు. హైస్కూల్లో వంట షెడ్ నిర్మాణం కోసం పాఠశాల పూర్వ విద్యార్థులను సంప్రదించాలని హెచ్ఎంకు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు లేరని ఇన్చార్జీ వైద్యులు వస్తున్నారని, ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ మార్కపూడి గాంధీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి అధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై డీఎంహెచ్ఓ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ వైద్యుల పోస్టులు కొద్ది రోజుల్లో భర్తీ అవుతాయన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి అయోగ్ నిర్దేశించిన 40 సూచికల్లో జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలాల్లో వెనుకబడిన సూచికల్లో మరింత వృద్ధి సాధించటానికి అధికారులను సమాయత్తం చేయటం, మరింత వేగం పెంచటానికి పలు సూచనలు, సలహాలు ఇవ్వటానికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామన్నారు. ఆస్పిరేషనల్ బ్లాక్ అధికారి (ఏబీపీ)మోహన్ సందీప్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు శాశ్వత భవనాలు లేవని గుర్తించామని వెల్లడించారు. పెనుగంచిప్రోలు, ముండ్లపాడు సర్పంచులు వేల్పుల పద్మకుమారి, గూడపాటి లావణ్య, డీపీఓ లావణ్యకుమారి, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, తహసీల్దార్ ఎ శాంతిలక్ష్మీ, ఎంపీడీఓ జి శ్రీను, ఐసీడీఎస్ పీడీ రిక్సానా బేగం, పశుసంవర్ధక శాఖ జేడీ హనుమంతరావు, డీడీ మోజెస్, ఎంఈఓ డి రవీంద్ర, పీఆర్ ఏఈ సుందరరామయ్య, ఏపీఎం రమఱ, ఏపీఓ జనార్ధనరావు, వైస్ ఎంపీపీ గుంటుపల్లి వాసు, మండల సమాఖ్య అధ్యక్షురాలు కర్ల కోటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభారీ అధికారి అశోక్కుమార్ -
కాజ్వేపై నుంచి మునేరులో పడిన ఇసుక ట్రాక్టర్
పెనుగంచిప్రోలు: కాజ్వేపై నుంచి ఇసుక ట్రాక్టర్ మునేరులో పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మునేరు కాజ్వే అవతల నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి ట్రక్కుతో సహా మునేరులో పడింది. ప్రమాద సమయంలో డ్రైవర్ గోగుల నాగు పక్కకు దూకటంతో తలకు గాయమైంది. ట్రాక్టర్ జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందినది కాగా, డ్రైవర్ తెలంగాణ రాష్ట్రం రాయగూడెంకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి అరెస్టు
ఉయ్యూరు: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పోలీసుస్టేషన్ నుంచి నిందితుడిని ముసుగు తొలగించి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లి హాజరు పరిచారు. న్యాయమూర్తి శ్రీహరి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. న్యాయస్థానం ఆదేశాలతో నిందితుడు చాన్బాషాను నెల్లూరు జైలుకు తరలించారు. గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు స్థానిక పోలీసుస్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. ఉయ్యూరులోని కాపుల రామాలయం ప్రాంతంలో షేక్ చాన్బాషా నివాసం ఉంటున్నాడు. గ్యాస్స్టవ్లు రిపేర్లు చేస్తూ తాపీ కార్మికుడుగా పని చేస్తున్నాడు. తన ఇంటి వద్దకు రోజూ ఆడుకునేందుకు వచ్చే ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఆశ చూపి పైశాచికానందం పొందుతున్నాడు. విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 21న ఆయన ఇంటికి వచ్చిన బాలిక పెద్దగా కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో దారుణం వెలుగు చూసింది. నిందితుడు బాలికకు వరుసకు మామయ్యే. ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా స్పందించటంతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామారావు వేగంగా దర్యాప్తు చేపట్టి ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోడూరు: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ చాణిక్య గురువారం తెలిపిన వివరాల మేరకు.. కోడూరు పంచాయతీ పరిధిలోని నాల్గో వార్డులో సానంగుల నాంచారయ్య (60) తనకున్న పూరి పాకలో ఒంటరిగా జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం నాంచారయ్య ఇంట్లో ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైయ్యాడు. విద్యుత్ ఘాతం దాటికి నాంచారయ్య శరీరమంతా కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతురాలి కుమార్తె తన్నీరు రంగమ్మ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. పామర్రు: చల్లపల్లిరోడ్డులోని నాగులేరు కాలువ వంతెన కింద చెట్టు కొమ్మకు చిక్కుకున్న మృతదేహం లభ్యమైందని ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. మృతుడి ఒంటిపై ఎటువంటి దుస్తులు లేవని కుడి భజంపై మాత్రం శంఖు ఆకారం గల పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని పేర్కొన్నారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ నంబరు 08674 253 333కు సమాచారం అందించాలని కోరారు. మైలవరం:మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న నిర్వహించాల్సిన జాబ్మేళా కార్యక్రమం ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా రద్దు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ళ రవి తెలిపారు. తిరిగి ఈ నెల 31 శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. -
గురుకులాల్లో ప్రకృతి సాగుకు ప్రోత్సాహం
జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తిరువూరు:జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నామని, విద్యార్థులకు అవసరమైన ఆకుకూరలు, కాయగూరలు పండించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. తిరువూరు మండలం కాకర్ల, రామన్నపాలెం, ఏకొండూరు మండలం కృష్ణారావుపాలెం, ఏకొండూరు గ్రామాల్లో గురువారం కలెక్టర్ పర్యటించారు. కృష్ణారావుపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రకృతి సేద్యం ద్వారా సాగుచేస్తున్న దుంపజాతులు, తీగజాతులు, ఆకుకూరలు, కాయగూరలను పరిశీలించారు. తెగుళ్ళ నివారణకు ద్రవ జీవామృతం, ఘన జీవామృతాలను వాడాలని, రసాయన మందులను వినియోగించవద్దని సూచించారు. గురుకుల విద్యార్థులకు పోషక విలువలున్న కూరగాయలు అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి సేద్యంలో విద్యార్థుల్ని భాగస్వాముల్ని చేయాలన్నారు. రామన్నపాలెంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్న పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, దుంపలను కలెక్టర్ పరిశీలించి రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. ఏకొండూరులో ధాన్యం సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రైతులతో మాట్లాడారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజరు శంకర్ నాయక్, ఏకొండూరు తహసీల్దారు లక్ష్మి, డీఎంఎం నాగేశ్వరమ్మ, తిరువూరు ఏడీఏ రంగారావు, వ్యవసాయాధికారి పి.పద్మ పాల్గొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మచిలీపట్నం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న మచిలీపట్నం–చర్లపల్లి (07642) రైలు, 26న చర్లపల్లి–మచిలీపట్నం (07641) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. రెండు మార్గాల్లో ఈ రైలు గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుందన్నారు. -
ముగ్దమనోహరంగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం గాజులతో విశేషంగా అలంకరించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ప్రధాన మూలవిరాట్తో పాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి, ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారికి సప్త వర్ణాలతో మెరిసిపోతున్న గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ప్రధాన ఆలయానికి గాజులతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. యమ ద్వితీయ, భగిని హస్త భోజనాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తిక మాసంలో అమ్మవారిని గాజులతో విశేషంగా అలంకరిస్తారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ దంపతులు, ఆలయ అధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఉత్సవానికి సుమారు 4.31 లక్షల గాజులను సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూజా సామగ్రితో పాటు గాజులను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ముత్తయిదువులు గాజులు, పసుపు, కుంకుమను ఇచ్చిపుచ్చుకున్నారు. ఉత్సవం నేపథ్యంలో 300 మంది సేవా సిబ్బంది 24 గంటల పాటు నిర్విరామంగా సేవలందించి ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. అమ్మవారికి అలంకరించిన గాజులను ఉత్సవం అనంతరం భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సర్వాంగ సుందరంగా అలంకరణ గాజుల ఉత్సవం నేపథ్యంలో అమ్మవారి మూలవిరాట్ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పెద్ద, మీడియం, చిన్న సైజు గాజులతో అమ్మవారికి అవసరమైన ఆభరణాలను తీర్చిదిద్ది అలంకరించారు. గాజుల అలంకారంలో అమ్మవారి రూపం ముగ్దమనోహరంగా ఉందని భక్తులు అంటున్నారు. సాయంత్రం పెరిగిన రద్దీ ఉదయం 9 గంటల వరకు వాతావరణం సాధారణంగా ఉండటంతో భక్తుల రద్దీ కనిపించింది. 9 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఆ ప్రభావం రద్దీపై కనిపించింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో రద్దీ క్రమంగా పెరిగింది. పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. -
కనుల పండువగా ఆదిదంపతులకు దీపోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో సాయంత్రం ఆదిదంపతులకు దీపోత్సవ సేవ నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదిక వద్ద సహస్ర లింగార్చనను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. లింగార్చనలో భాగంగా స్వామి వారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, హారతి, ప్రసాదాల పంపిణీ జరిగింది. సాయంత్రం ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. దీపోత్సవంలో భాగంగా ఆదిదంపతులకు ఊంజల్ సేవ నిర్వహించారు. పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గురువారం 30.4 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. అత్యధికంగా గూడూరులో 69.0 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పామర్రులో 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లాలోని మిగిలిన మండలాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పమిడిముక్కల 63.8, చల్లపల్లి 60.4, మొవ్వ 53.2, ఉయ్యూరు 41.6, మోపిదేవి 39.2, గుడ్లవల్లేరు 38.4, గుడివాడ 36.2, కంకిపాడు 33.4, ఘంటసాల 31.4, పెదపారుపూడి 30.8, కృత్తివెన్ను 26.2 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. నందివాడ 25.0 మిల్లీమీటర్లు, ఉంగుటూరు 24.4, తోట్లవల్లూరు 22.4, కోడూరు 22.4, పెనమలూరు 21.8, మచిలీపట్నం సౌత్, నార్త్ 21.6, అవనిగడ్డ 18.6, నాగాయలంక 17.6, బంటుమిల్లి 16.4, బాపులపాడు 14.6, పెడన 14.6, గన్నవరం 12.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. -
జీజీహెచ్లో దివీస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): దివీస్ లేబొరేటరీస్ తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రోగులు, అటెండెంట్ల కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. న్యూ జీజీహెచ్లో రూ.66.67 లక్షలు వెచ్చించి గంటకు 1000 లీటర్ల సామర్ధ్యం ఉన్న 3 ఆర్ఓ ప్లాంట్లు, గంటకు 100 లీటర్ల సామర్ధ్యం కల 11 ఆర్ఓ ప్లాంట్లను వితరణగా అందజేసింది. వాటిని గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావుతో కలిసి తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, సిబ్బందికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు ముందుకు వచ్చిన దివీస్ లేబొరేటరీస్కు ఎమ్మెల్యే, సూపరింటెండెంట్లు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్(డెప్యూటీ కలెక్టర్) జీవీవీ సత్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్(పరిపాలనా విభాగం) లక్ష్మీకుమారి, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పెనమలూరుః విద్యార్థులు కళారూపాలలో ప్రావీణ్యం సాధించాలని పాఠశాల విద్యా కమిషనర్ వి.విజయరామరాజు అన్నారు. పోరంకిలో గురువారం రాష్ట్ర స్థాయి కళోత్సవం, సమృద్ధి ఫెస్టివల్ వైభవాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని వివరించారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2020 విద్యా విధానంలో భాగంగా సాధారణ విద్యతో పాటు కళా విద్యను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వినూత్న బోధనా పద్ధతుల ద్వారా తరగతి గదుల్లో సమృద్ధి కళారూపం ఎంతగానో మేలు చేస్తుందని అన్నారు. 12 రకాల కళారూపాల్లో 348 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి మండల దీక్ష మాలధారణ కార్యక్రమం డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతుందని ఆలయ ఈఓ కిషోర్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 21తో ముగుస్తుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 10 వరకు అర్ధమండల దీక్ష, జనవరి 16 నుంచి 20 వరకు 11 రోజుల దీక్ష మాలధారణ కార్యక్రమం ఆలయంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఉద్యోగి జి. రాంబాబు జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్–2025 టైటిల్ కై వసం చేసుకున్నాడు. కర్నాటక రాష్ట్రం పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 12 వరకు బెంగళూరులో జరిగిన జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాజమండ్రిలో ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న జి.రాంబాబు అద్భుతమైన ప్రదర్శనతో మొదటిస్థానం కైవసం చేసుకున్నాడు. అతను స్క్వాట్–165 కిలోలు, బెంచ్ ప్రెస్–100 కిలోలు, డెడ్లిఫ్ట్–202.5 కిలోల్లో తన ప్రతిభ చాటుకుని టైటిల్ విన్నర్తో పాటుగా మాస్టర్ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా–2025 బిరుదును అందుకున్నాడు. ఈ సందర్భంగా రాంబాబు గురువారం విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా, ఏడీఆర్ఎం, ఇతర సిబ్బందిని మర్యాదపూర్వకంగా కలిశారు. -
ప్రజా ఉద్యమంతో పీపీపీని అడ్డుకుంటాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానాన్ని అడ్డుకునేందుకు అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఈ నెల 28న ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. అందులో భాగంగా ర్యాలీలు నిర్వహించి, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయన్నుట్లు చెప్పారు. ప్రజా ఉద్యమంకు సంబంధించిన పోస్టర్ను గురువారం విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అంశంపై ఇప్పటికే నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేస్తున్నారన్నారు. ఈ నెల 28న నిర్వహించే ప్రజా ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వైద్యాన్ని అమ్ముకునేలా చంద్రబాబు పాలన రాష్ట్రంలో వైద్యాన్ని అమ్ముకునేలా చంద్రబాబు పాలన ఉందని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్రస్ లేని కంపెనీలకు విలువైన భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు. వైద్యం ఊపిరి తీస్తున్నారు కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో వైద్య రంగం ఊపిరి తీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మల్లాది విష్ణు అన్నారు. పీహెచ్సీ వైద్యుల సమ్మెతో గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు బంద్ అయ్యాయని, ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ మాజీ ఎమ్మెల్యే, నందిగామ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. అనేక ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు కనీసం రక్షిత మంచినీరు కూడా అందివ్వడం లేదన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి ఇతర పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆసిఫ్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ మెహబూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు ముట్టజెప్పా..
తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పరస్పర ఆరోపణలతో ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. నాయకుల అవినీతిపై మాటల మంటలు మండుతున్నాయి. ఎమ్మెల్యే కొలికపూడిపై ఎంపీ చిన్ని చేసిన ఆరోపణల నేపథ్యంలో దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. తిరువూరు నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియా ఎంపీ కనుసన్నల్లోనే నడుస్తోం దని, నామినేటెడ్ పోస్టులను సైతం ఎంపీ కార్యాలయ సిబ్బంది అమ్ముకున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గ రాజకీయాల్లో తలదూరు స్తున్న ఎంపీ వ్యవహారంపై అధిష్టానం ఎదుట తేల్చుకుంటానని, ఈ నెల 24న టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం తిరువూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ చిన్ని వావిలాల గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొలికపూడిపై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను నిఖార్సైన టీడీపీ కార్యకర్తనని, ప్రతిపక్ష పార్టీలతో అంటకాగే రకాన్ని కాదని ఎంపీ అన్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేశ్ను విమర్శించే నాయకుల అంతు చూస్తానంటూ ఎంపీ హెచ్చరించారు. నాలుగేళ్లుగా తాను నియోజకవర్గంలో సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తుండగా.. తాను డబ్బులు తీసుకుని పనులు చేస్తున్నట్టు ఆరోపిస్తున్న వ్యక్తుల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ ఎమ్మెల్యేపై పరోక్షంగా విమర్శలు చేశారు. టీడీపీలో కోవర్టులున్నారు టీడీపీలో కోవర్టులు ఉన్నారని.. ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చిపోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ, నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు. ‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు. కాగా.. ఎంపీ చిన్ని తిరువూరు పర్యటనలో తనపై చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే కొలికపూడి దీటైన సమాధానం ఇచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో సంచలనం రేపింది. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యేను విభేదించే నాయకులు ఎంపీ పర్యటనలో పాల్గొన్నారు. -
కూటమిలో ముసలం మొదలు!
●అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంతో ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించిన జనసేన నేత వంపుగడవల చౌదరి ● తాను ఎస్సీననే టీడీపీ నాయకులు వివక్ష మచిలీపట్నంటౌన్: కూటమిలో ముసలం మొదలైంది. అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సర కార్యక్రమం దీనికి వేదికై ంది. ఇటీవల అర్బన్ బ్యాంక్కు చైర్మన్తో సహా 9 మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గురువారం బ్యాంక్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందు కూటమి శ్రేణులు బ్యాంకు వద్ద వర్షంలో సైతం పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ప్రమాణ స్వీకారోత్సవ సభ వద్ద టీడీపీ, సనసేన నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న వంపుగడవల చౌదరికి పాలకవర్గంలో చోటు లభించింది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత చౌదరికి ఉపాధ్యక్ష పదవి వచ్చిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఆయనకు చెప్పారు. ఆ పార్టీ శ్రేణులు ప్రమాణ స్వీకారం సందర్భంగా నగరంలో చౌదరి వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటూ శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున బ్యానర్లు సైతం ఏర్పాటు చేశారు. చైర్మన్గా టీడీపీకి చెందిన దిలీప్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వైస్ చైర్మన్గా తనతో ప్రమాణ స్వీకారం చేస్తారని భావించిన చౌదరికి భంగపాటు ఎదురయింది. దీంతో చౌదరితో పాటు జనసేన నాయకులు ఈ విషయమై అక్కడున్న టీడీపీ నాయకులను ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ రామకృష్ణ కార్యక్రమానికి హాజరు కాలేదని, వారిద్దరితో చర్చించిన తర్వాతనే వైస్ చైర్మన్ పదవి ఎవరికి అనేది నిర్ధారించి ప్రమాణస్వీకారం చేయిస్తామని టీడీపీ నాయకులు చెప్పారు. దీనికి విభేదించిన చౌదరి ప్రమాణస్వీకారం బహిష్కరించి అక్కడి నుంచి వచ్చేశారు. అనంతరం చౌదరి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పొత్తు ధర్మం పాటించకుండా తాను కేవలం ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిననే టీడీపీ నాయకులు సాకులు చెబుతూ వైస్ చైర్మన్ పదవి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఈ విధంగా నమ్మించి అవమానపరిచిన టీడీపీ వారిని ఏమనాలో అర్థం కావట్లేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మిగిలిన డైరెక్టర్లు వేము కోటేశ్వరరావు, నూకల రమాదేవి, జి.అరుణ్ కుమారి, పోతాబత్తుల పాండురంగారావు, సూరిశెట్టి హరికృష్ణ, బొర్రా శ్రీనివాస్, గున్నం నాగరాజన్లు ప్రమాణ స్వీకారం చేశారు. -
‘కార్తిక మాసం జ్యోతిర్లింగ దర్శనం’ పేరుతో ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో విజయవాడ డివిజన్లోని రేణిగుంట స్టేషన్ నుంచి ‘కార్తీకమాసం జ్యోతిర్లింగ దర్శనం’ పేరుతో భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 4వరకు జరిగే ఈ యాత్రలో ద్వారకలోని ద్వారకాదీష్ ఆలయం, నాగేశ్వర్ దేవాలయం, ద్వారకా, సోమనాథ్లోని సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్లోని సబర్మతి అశ్రమం, మోథేరా సూర్యదేవాలయం, రాణిక వాప్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ (ఏక్తా నగర్) సందర్శన ఉంటుందన్నారు. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ స్టేషన్లలో బోర్డింగ్/డీబోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో ఆన్బోర్డు/ఆఫ్బోర్డులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టిఫిన్, భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణ సదుపాయం, రాత్రుళ్లు హోటల్స్లో బస తదితర ఏర్పాట్లతో పాటు కోచ్లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్ ఎస్కార్ట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్యాకేజీ ధరలు... ఈ యాత్రలో ఎకానమి (స్లీపర్ క్లాస్) పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 18,400, పిల్లలకు రూ. 17,300, స్టాండర్డ్ (3 ఏసీ)లో పెద్దలకు రూ. 30,200, పిల్లలకు రూ. 28,900, కంఫర్ట్ (2 ఏసీ) పెద్దలకు రూ 39,000, పిల్లలకు రూ. 38,300 టికెట్ ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు ఆర్ఆర్సీటీసీ వెబ్సైట్ లేదా 9281495848, 9281030714 ఫోన్ నంబర్ల ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 4 వరకు యాత్ర -
ఆక్వాసాగులో ప్రపంచానికి రోల్ మోడల్ కావాలి
రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ గుడివాడ టౌన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వచ్చే 8 నెలల్లో నందివాడ క్లస్టర్లో ఆక్వాసాగు ప్రపంచానికి రోల్మోడల్ కావాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. స్థానిక వీకేఆర్, వీఎన్బీ అండ్ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాల ఫంక్షన్ హాలులో ఆక్వా ఎక్స్ఛేంజ్ ఆధ్వర్యంలో గురువారం ఆక్వా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా ఆక్వా రైతుకు గ్లోబల్ గుర్తింపు లక్ష్యంగా డిజిటల్ ట్రేసబిలిటీతో నందివాడ ముందడుగు పేరుతో ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం పన్ను కారణంగా రాష్ట్రంలో ఆక్వారంగంపై ఎక్కువగా ప్రభావం చూపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగులో సుస్థిరత సాధించేలా చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే ఆక్వా ఎక్స్ఛేంజ్ నందివాడ మండలంలోని అరిపిరాలలో చేపట్టిన వినూత్నసాగు సందర్శించానన్నారు. ఆక్వా ఎక్స్ఛేంజ్ సంస్థ 60 వేల ఎకరాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వాసాగు చేయాలనుకోవడం శుభ పరిణామం అని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజి, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఆక్వా ఎక్స్ఛేంజ్ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్కుమార్, మత్యశాఖ జేడీ నాగరాజు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, ఏపీఎస్ఏడీఏ కార్పొరేషన్ డైరెక్టర్ రాజబాబు, మత్యశాఖ అధికారులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. -
వ్యాన్పై పడిన విద్యుత్ తీగలు
షాక్కు గురై యువకుడి మృతి కోటవురట్ల: విద్యుత్ తీగలు వ్యాన్పై పడిన ఘటనలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. కృష్ణా జిల్లా ముచ్చర్ల గ్రామానికి చెందిన మొటేపల్లి గీతాకృష్ణ (22) అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని పందూరు శివారున ఉన్న 73 హిల్స్ లేఅవుట్లో పనిచేస్తున్నాడు. లేఅవుట్లోనే నివాసం ఉంటూ నిర్వహణ పనులు చేస్తుంటాడు. గురువారం మధ్యాహ్నం లేఅవుట్ నుంచి మినీ వ్యానును నడుపుకొంటూ పందూరు వస్తుండగా మార్గం మధ్యలో సిమెంట్ విద్యుత్ స్తంభానికి వ్యాను వెనక ఉన్న గార్డ్ రాడ్ తగులుకుని స్తంభం విరిగిపోయింది. దాంతో విద్యుత్ తీగలు వ్యాన్పై పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా వ్యాన్ అంతటికీ పాకింది. ఈ విషయాన్ని గమనించని గీతాకృష్ణ డోరు తీసి కిందికి దిగుతుండగా విద్యుత్ షాక్కు గురై కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మండల కేంద్రంలోని సీహెచ్సీకి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు నమోదు విషయమై ఎస్ఐ రమేష్ వివరణ కోరగా.. మృతుని కుటుంబ సభ్యులు దూర ప్రాంతం నుంచి రావాల్సి ఉండడంతో తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పటమటలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఆటోనగర్లో ఉన్న నవ్య బార్ వద్ద వ్యక్తి చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన సిబ్బంది ఊరు, పేరు తెలియని సుమారు 30– 35 మధ్య వయసు గల ఒక మగ వ్యక్తి చనిపోయాడని గుర్తించామన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు. మృతుడి వివరాలు తెలియలేదని ఎవరైనా గుర్తిస్తే స్టేషన్ నంబరు, 0866–2542333, ఎస్ఐ నంబరు 9866216282 సంప్రదించాలన్నారు. -
వేయి మునులకుదురులో కార్తికమాస పూజలు
నెలరోజుల పాటు కొండ పై దీపారాధన పెనమలూరు:యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో కార్తికమాస పూజలు నెల రోజుల పాటు చేయనున్నారు. కార్తికమాస ఉత్సవాల సందర్భంగా స్వామివారికి భక్తులు అభిషేకాలు నిర్వహించనున్నారు. దీని కోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలో యనమలకుదురు గ్రామంలో మునిగిరి అనే పేరు గల కొండ పై శ్రీరామలింగేశ్వరస్వాయివార్ల దేవాలయం కొలువై ఉంది. శివుడు ఇక్కడ శ్రీరామలింగేశ్వరుడిగా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో శివుడు స్వయంభువుగా వెలిశాడు. దేవాలయంలో శివుడిని వాయులింగంగా కొలుస్తారు. విష్ణుమూర్తి ఆరవ అవతామమైన పరుశురాముడు ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. ఆ సమయంలో వేయి మంది మునులు కొలువు తీరి యజ్ఞం నిర్వహించనట్లుగా తెలుస్తోంది. పరుశురాముడు శివలింగాన్ని ప్రతిష్టించి ప్రాణప్రతిష్ట చేశాడని స్థల పురాణం చెబుతుంది. వేయి మంది మునులు తపస్సు చే శారని అప్పటి నుంచి వేయి మునులకుదురు కాలక్రమేనా యనమలకుదురుగా పిలుస్తున్నారు. గ్రామంలో 612 అడుగుల ఎత్తు కొండ పై రామలింగేశ్వర ఆలయం కొలువై ఉంది. కొండ పై వేంచేసి ఉన్న రామలింగేశ్వరస్వామి సన్నిధిలో కార్తిక దీపారాధన భక్తులు చేస్తారు. నాలుగు కార్తిక సోమవారాలతో పాటు, కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కొండపై దీపాలు వెలిగిస్తారు. భక్తుల సౌకర్యార్థం కొండ పై దీపారాధనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తికమాస పూజలకు ప్రత్యేకం.... రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగేంద్రస్వామివారి ఆలయంలో శనివారం నాగులచవితి పండుగ చేస్తారు. ఈ నెల 27వ తేదీ మొదటి సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారికి శాంతికల్యాణం, నవంబర్ 1వ తేదీవ తేదీన భస్మాభిషేకం, 3వ తేదీ రెండవ కార్తిక సోమవారం శాంతి కల్యాణం, నందీశ్వర అభిషేకం పూజలు నిర్వహిస్తారు. 5వ తేదీ పెద్ద ఎత్తున కార్తిక పౌర్ణమి పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు. నవంబర్ 9వ తేదీ పార్వతీదేవి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా ప్రత్యేకంగా అలంకరిస్తారు. స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం 8 గంటలకు అన్నాభిషేకం, 11 గంటలకు భక్తులకు అన్నసంతర్పన చేస్తారు. 10వ తేదీ మూడవ కార్తిక సోమవారం సందర్భంగా శాంతి కల్యాణం చేస్తారు. 15వ తేదీన స్వామివారికి మారేడు దళాలతో బిల్వార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవంబర్ 17వ తేదీన 4వ కార్తీక సోమవారం సందర్భంగా శాంతి కల్యాణం, సాయంత్రం నందీశ్వర అభిషేకం చేస్తారు. 18వ తేదీ మాసశివరాత్రి ప్రత్యేక పూజలు చేస్తారు. నవంబర్ 21వ తేదీన ఉద్వాసన సందర్భంగా స్వామివారికి అభిషేకం, విశేష అలంకరణ చేస్తారు. రామలింగేశ్వర సన్నిధిలో దీపారాధన చాలా పవిత్రమైనది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశాం. కార్తిక మాసంలో భక్తులు ప్రతి రోజూ దీపారాధన చేయటానికి వసతులు కల్పించాం. నవంబర్ 9వ తేదీ అన్నసంతర్పణ ఉంటుంది. భక్తులు గోత్రనామాలతో అభిషేకం చేసుకోవచ్చు. – సంగా నరసింహారావు, ఆలయ నిర్మాణ దాత, యనమలకుదురు -
● జలదిగ్బంధంలో కృష్ణా కలెక్టరేట్
మచిలీపట్నం నగరంలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో కలెక్టరేట్ పరిసరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి మోకాలి లోతు నీళ్లతో రహ దారులన్నీ జలమయమయ్యాయి. కార్యాలయానికి వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఏ కార్యాలయానికి వెళ్లాలన్నా మోకాలి లోతు నీళ్లలో నడిచి వెళ్లాల్సి వచ్చింది. కలెక్టరేట్కు వెళ్లే రహదారులన్నీ జలమయం కావటంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారుల్లో వర్షపునీరు నిలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. – చిలకలపూడి(మచిలీపట్నం) -
ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియామకం
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ సుబేందు సమంత నియామకం జరిగింది. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్.. గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై రాగా, జస్టిస్ సుబేందు సమంత.. కోల్కతా హైకోర్టు నుంచి బదిలీపై వచ్చారు. -
‘ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారు’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన విషయాలు బయటపెట్టారు. కేశినేని చిన్నికి సంబంధించిన ఆధారాలను కొలికపూడి బయటపెట్టారు. రూ.5 కోట్లు తీసుకుని తనకు తిరువూరు టికెట్ ఇచ్చారన్న కొలికపూడి.. సంచలన ఆధారాలను బయటపెట్టారు.2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని నన్ను ఐదు కోట్లు అడిగాన్న కొలికపూడి.. తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్ఫర్ చేశారో ఆయన బయటపెట్టారు. ‘‘2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫ్రిబవరి 8న మరో రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫిబ్రవరి 14న రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. కేశినేని చిన్ని పీఏ మోహన్కు రూ. 50 లక్షలు.. గొల్లపూడిలో నా మిత్రుల ద్వారా రూ.3.5 కోట్లు ఇచ్చా.. ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం’’ అంటూ కొలికపూడి సంచలన పోస్టు పెట్టారు. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.మరోవైపు.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ‘‘తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు. నాపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువూరు వరకూ రావాల్సిన అవసరం లేదు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లాయి’’ అని చిన్ని వ్యాఖ్యానించారు. -
ప్రైవేటు వసూళ్లు!
పదో తరగతి పరీక్ష ఫీజులంటూ దోపిడీవన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలు పరీక్ష ఫీజు పేరుతో అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. వాటిని కట్టలేక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 2026 మార్చి మాసంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనుంది. ఆ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష రుసుంను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ రుసుం వసూళ్లలో ప్రైవేట్ విద్యాసంస్థలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. అందినకాడికి దండుకునేలా విద్యార్థుల నుంచి తమకిష్టమైన రీతిలో వేలాది రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ విద్యార్థుల తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ విడుదల కాని నోటిఫికేషన్.. పదో తరగతి పరీక్ష రుసుంకు సంబంధించి ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ను జారీ చేయలేదు. ఇప్పటి వరకూ పరీక్షల షెడ్యూల్ను కూడా ప్రకటించలేదు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ను ప్రకటించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఇప్పటికే తమ దందాను ప్రారంభించాయి. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని దాదాపుగా సగానికి పైగా ప్రైవేట్ యాజమాన్యాలు ఈ దందా కొనసాగిస్తున్నాయని సాక్షాత్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. మూడు వేల వరకూ వసూళ్లు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 55వేల నుంచి 60 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. పరీక్ష ఫీజు చెల్లించి, గడువు ముగిసిన తరువాత ఆ సంఖ్యపై స్పష్టత వస్తుంది. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు నుంచి మూడు వేల వరకూ పరీక్ష ఫీజు అంటూ వసూళ్లకు పాల్పడుతున్నాయి. దసరా సెలవులకు ముందు వరకూ పాఠశాలలు పుస్తకాల విక్రయాలు, వాటి వసూళ్లలో బిజిబిజీగా ఉన్నాయి. దసరా సెలవులు ముగిసిన తరువాత పరీక్ష ఫీజు వసూళ్ల దందాను ప్రారంభించాయని పలువురు మండిపడుతున్నారు. స్కూల్ ఫీజు చెల్లిస్తేనే.. పరీక్షల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కాకముందే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పరీక్ష ఫీజు కట్టాలని కట్టాలని వెంటపడటానికి కారణం స్కూల్ ఫీజులు వసూళ్ల కోసమని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. తాజాగా పరీక్ష ఫీజు చెల్లించాలంటే తప్పనిసరిగా మొత్తం స్కూల్ ఫీజు చెల్లించాల్సిందేనని, లేకుంటా పరీక్ష ఫీజు తీసుకోమంటూ పాఠశాలల యాజమాన్యాలు వెంటపడుతున్నాయి. ఒక్కసారిగా మొత్తం ఫీజు చెల్లించాలంటే ఎలా? అంటూ పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 మాత్రమేపదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయలేదు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. అప్పుడే పరీక్ష ఫీజు నిర్ణయం తదితర వివరాలు తెలుస్తాయి. దానికి తోడు స్కూల్ ఫీజుతో పరీక్ష రుసుం ముడిపెట్టి విద్యార్థులను ఇబ్బందులు పెట్టడం సరికాదు. అదేవిధంగా పరీక్ష ఫీజు అధికంగా వసూళ్లకు పాల్పడినట్లుగా తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. –యూవీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ జిల్లా సాధారణంగా ఏటా పదో తరగతి పరీక్ష ఫీజు కేవలం రూ.125 మాత్రమే ఉంటుంది. అలాగే వొకేషనల్ విద్యార్థులు రూ.185 చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ విద్యార్థులు హాజరు మినహాయింపు కోసం రూ.650 సంబంధిత విద్యార్థులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును నేరుగా చెల్లించకుండా పాఠశాల యాజమాన్యం ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రకటించిన తేదీ దాటిన తరువాత చెల్లించే విద్యార్థులు ప్రభుత్వం ప్రకటించిన అపరాధ రుసుంతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రభుత్వం మొండివైఖరి వీడాలి
18వ రోజు కొనసాగిన పీహెచ్సీ వైద్యుల రిలే దీక్షలు లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 18వ రోజు కొనసాగాయి. తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తుండటంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైద్యులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లపై స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెపుతున్నారు. ఇన్సర్వీసు పీజీ సీట్లు 20 శాతం 2030 వరకూ ఇవ్వాలని, ఆ మేరకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా టైమ్బాండ్ పదోన్నతులు, టైం బాండ్ స్కేల్స్ వర్తింపజేయాలంటున్నారు. నిరసనలో అసోసియేషన్ నేతలతో పాటు, వందలాది మంది వైద్యులు పాల్గొన్నారు. కాగా నగరంలో బుధవారం కురిసిన జోరు వర్షంలోనూ దీక్ష కొనసాగించారు. -
రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో నెలకొన్న పలు రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవిలతో కలిసి రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు వారి మండలాల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇళ్లస్థలాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం ఇళ్లస్థలాలు మంజూరు చేయాలన్నారు. తహసీల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లతో కలిసి ప్రస్తుతం జిల్లాలో ఉన్న లేఅవుట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖాళీలను గుర్తించాలన్నారు. నిర్లక్ష్యం వద్దు.. పొలాలు, ఇళ్లస్థలాలు సర్వే చేయాలని అర్జీ పెట్టుకున్న దరఖాస్తుదారుల విషయంలో నిర్లక్ష్యం సరికాదని కలెక్టర్ అన్నారు. సర్వేయర్లు ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పనిచేయాలన్నారు. ‘మీ కోసం’ అర్జీలు రీ–ఓపెన్ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ధాన్యం సేకరణ సమయం ఆసన్నమైనందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆర్డీవోలు కె. స్వాతి, జి. బాలసుబ్రహ్మణ్యం, బీఎస్ హేలా షారోన్, సర్వే ఏడీ జోషీలా తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు వాయు‘గండం’
కంకిపాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావంతో కురుస్తున్న మోస్తరు వర్షాలతో పెట్టుబడులు కోల్పోవాల్సి వస్తుందని అన్నదాతలు వాపోతున్నారు. పొట్ట దశ నుంచి కంకులు గట్టిపడే దశలో ఉన్న చేలు నేలవాలితే నష్టం తీవ్రంగా ఉంటుందని భయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు.. అల్పపీడన ప్రభావంతో కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై కారుమబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం నుంచి చిరుజల్లులతో ఆరంభమై భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు, రోడ్డు మార్జిన్లలో నీరు చేరి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరి రైతుల్లో గుబులు.. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.54లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. పెనమలూరు, పామర్రు, గన్నవరం, గుడివాడ, పెడన నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల్లో తొలకరి వర్షాలతో రైతులు వరి నాట్లు వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వరి పైర్లు చిరుపొట్ట, కంకులు గట్టిపడే దశలో ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు చాలా చోట్ల వరి పైర్లు నేలవాలాయి. కంకులు సుంకు రాలిపోతుందని, చిరుపొట్ట ధ్వంసమై తాలు ఏర్పడుతుందని వాపోతున్నారు. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలకు కంటి మీద కునుకు కరువైంది. దిగుబడులుపై ప్రభావం.. ఒక్కో రైతు ఎకరాకు ఇప్పటికే రూ.20వేల నుంచి రూ.25వేలు వరకూ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం చిరుపొట్ట, కంకులు దశకు వరి పైర్లు చేరుకున్నాయి. ఈ తరుణంలో కురుస్తున్న మోస్తరు వర్షాలు, వీస్తున్న గాలులకు పైర్లు నేలవాలుతున్నాయి. దీంతో కంకులు నీటిలో నానటం, తాలు తప్ప ఏర్పడటంతో దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటపై పెట్టిన పెట్టుబడులు ఎక్కడ చేతికి అందకుండా పోతాయోనన్న భయంతో రోజులు వెళ్లదీస్తున్నారు. -
విద్యార్థి ఉసురు తీసిన బెట్టింగ్ వ్యసనం
మైలవరం: బెట్టింగ్లతో అప్పులపాలై మనస్తాపంతో హాస్టల్లో రూమ్లో ఉరి వేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మైలవరంలో బుధవారం జరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవరపల్లికి చెందిన గొర్రె అరవింద్(23) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అతను స్నేహితులతో కలిసి హాస్టల్లో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆన్లైన్లో బెట్టింగులకు అలవాటు పడ్డాడు. బెట్టింగుల కోసం స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. అప్పులు చెల్లించలేక బుధవారం కాలేజీకి వెళ్లకుండా రూమ్లోనే ఉండి ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. కళాశాల నుంచి తిరిగి హాస్టల్కు వచ్చిన అతని స్నేహితులకు అరవింద్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని వారు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైలవరం: పురుగు మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని పుల్లూరు పంచాయతీ శివారు సీతారామపురం తండాలో జరిగింది. సీతారామపురం తండాకు చెందిన బాణావతు భిక్షాలు, బుజ్జి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. నలుగురు కుమార్తెలకు వివాహాలయ్యాయి. పెద్ద కుమారుడు జమలయ్య (22) ఈ ఏడాది మార్చిలో ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట తండాకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకు న్నాడు. దీపావళి పండుగకు అత్తగారింటికి వెళ్లొచ్చిన అనంతరం మంగళవారం సాయంత్రం తండాకు సమీపంలో ఉన్న అటవీ భూముల్లో పురుగు మందు తాగి బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న జమలయ్యను మైలవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం జమలయ్య మృతి చెందా డని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జి.కొండూరు: మండలంలోని కవులూరు పోస్టాఫీసులో మహిళా పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారుల సొమ్మును స్వాహాచేసిన ఘటనపై ఉన్నతాధికారుల విచారణ బుధవారం కొనసాగింది. ఖాతాదారులను పోస్టాఫీసుకు పిలిపించిన అధికారులు వారి నగదు లావాదేవీలను నమోదు చేశారు. నిధుల గోల్మాల్ అంశంపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పోస్టాఫీసు వద్దకు చేరుకున్నారు. ఖాతాదారుల్లో ఎక్కువ శాతం కూలిపనులు చేసుకునే పేదలే. ఆడబిడ్డల భవిష్యత్తు అవసరాల కోసం సుకన్య సమృద్ధి పథకంలో డిపాజిట్లు చేస్తున్న వారు ఉన్నారు. ఎనిమిది నెలలుగా పక్కా వ్యూహంతో పోస్టుమాస్టర్ ఖాతాదారుల నిధులు గోల్మాల్ చేసినట్లు సమాచారం. రెండో రోజు విచారణ పూర్తయ్యే సమయానికి రూ.6 లక్షల వరకు గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. ఉన్నతాధికారుల విచారణ మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. నిధుల స్వాహా నేపథ్యంలో తమ పథకాలు కొనసాగుతాయా లేదా అని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. నిధుల గోల్మాల్ అంశం బయటకు పొక్కడంతో పోస్టు మాస్టర్ రూ.2 లక్షల మేర ఇప్పటికే కొంత మంది ఖాతాదారులకు చెల్లించి, మరో రూ.2 లక్షలను కొండపల్లి సబ్ పోస్టాఫీసులో డిపాజిట్ చేసినట్లు సమాచారం. పోస్టుమాస్టర్పై కేసు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారని తెలిసింది. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమ స్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. పీజీఆర్ఎస్, అందరికీ ఇళ్లు అంశాలపై భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జేసీ కలెక్టర్ ఇలక్కియతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ అర్జీల్లో అపరిష్కృతంగా ఉన్నవాటి వివరాలు శాఖల వారీగా, మండలాల వారీగా తెలపాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని ఆదేశించారు. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కీలక ప్రగతి సూచికల్లో (కేపీఐ) ఐసీడీఎస్, పోలీస్ శాఖల అంశాలలో పురోగతి ఉండాలన్నారు. ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ లక్ష్మీనరసింహం, కేఆర్ఆర్సీ ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్ ఎ.పోసిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఎస్ఎల్ఓ వై.మోహన్రావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
జనానికి జ్వరమొస్తే నాదా బాధ్యత?
సాలూరు: జనాలకు జ్వరమొస్తే మంత్రిదా బాధ్యత? అంటూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాలవలస బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి బుధ వారం హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతీ ఊరిలో, ప్రతీ పాఠశాలలోని పిల్లలు జ్వరాలు, పచ్చకామెర్లతో బాధ పడుతున్నారన్నారు. ఇది వాస్తవమన్నారు. తాను కూడా గత వారంలో రోజు లుగా జ్వరంతోనే బాధపడుతున్నానని.. ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఎదురు ప్రశ్నించారు. ఎవరికైనా జ్వరం వస్తే తానెలా బాధ్యత వహిస్తానని ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు పచ్చకామెర్లతో మృతిచెందగా.. జ్వరాలు, వివిధ ఆరోగ్య సమస్యలతో మరో 13 మంది విద్యార్థులు మరణించారు. దీనిపై గిరిజన, విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. మంత్రిని కూడా నిలదీశాయి. దీనికి ఆమె సమాధానం చెప్పకుండా, పిల్లలకు మెరుగైన వైద్యసేవలు అందజేసేందుకు కృషిచేస్తానని కూడా పేర్కొనకుండా, జ్వరాలు సోకితే తనదెలా బాధ్యతంటూ మంత్రి సంధ్యారాణి మీడియా సాక్షిగా పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి వ్యాఖ్యలపై గిరిజన, ప్రజా సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో కొనసాగుతున్న విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలుకుతున్నారు. -
చంద్రబాబు అంటేనే కాపీ కొట్టడం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ జగన్ చేసిన పనులను చూసి కాపీ కొట్టడమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. అలాగే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది అంటూ వ్యాఖ్యలు చేశారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేవీనగర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, కార్పొరేటర్ జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశాడు . వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీకి గ్రీన్ చానల్ అని పెట్టి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించారు. ఆరోగ్య శ్రీ ఉద్యోగులు రోడ్డుపై నిరసనలకు దిగుతున్నారుప్రతి సందర్భంలో వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కూటమి నేతలు విర్రవీగుతున్నారు. వైఎస్ జగన్ దీపావళి పండగ చేస్తే.. దానిపై బురద జల్లుతున్నారు. వైఎస్ జగన్ చేసిన పనులన్నీ చంద్రబాబు కాపీ కొట్టడమే పని. వైఎస్ జగన్ దీపావళి చేస్తే.. చంద్రబాబు విజయవాడలో దీపావళి చేస్తాడు. వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తే.. చంద్రబాబు విజయవాడలో వినాయక చవితి వేడుకలు ఏర్పాటు చేశాడు. వైఎస్ జగన్ చేసే ప్రతీ పనిని చంద్రబాబు కాపీ కొడుతున్నాడు. ప్రజల విషయంలో అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేపడుతుంది. 28వ తేదీన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ర్యాలీ చేపడతాం’ అని చెప్పుకొచ్చారు. -
టీడీపీ నుంచి వలసలుగా వైఎస్సార్ సీపీలోకి..
పామర్రు: టీడీపీ నేతల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తట్టుకోలేక ఆ పార్టీ నుంచి వలసలుగా ప్రజలు వైఎస్సార్ సీపీలోకి వస్తున్నారని పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ అన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గృహంలో మొవ్వ మండలం నిడుమోలు గ్రామానికి చెందిన టీడీపీ మైనార్టీ నాయకులు వైఎస్సార్ సీపీలోకి చేరారు. తొలుత అనిల్ కుమార్తో వారు కొద్ది సేపు మాట్లాడి అనంతరం పార్టీ కండువాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రజలలో లభిస్తోన్న ఆదరణకు ఈ చేరికలే సంకేతాలన్నారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆ పార్టీలు 17 నెలలకే ప్రజాగ్రహానికి గురయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం ప్రజల్లో వైఎస్సార్ సీపీ పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం అవుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్


