ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి
స్థాయీ సంఘ సమావేశంలో వీఎంసీ మేయర్ భాగ్యలక్ష్మి
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఆమె స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశపు అజెండాలో మొత్తం 32 అంశాలు ప్రతిపాదనకు రాగా వాటిలో 23 అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఒక అంశాన్ని వాయిదా వేయగా, నాలుగు అంశాలు ర్యాటీఫై చేస్తూ తీర్మానించారు. ఒక అంశాన్ని రికార్డు చేయగా మరో అంశాన్ని ధ్రువీకరించారు.
ప్రధానాంశాలివే..
● విజయవాడలోని సర్కిల్–2 పరిధిలో ఉన్న లెనిన్ సెంటర్ వద్ద శిల్కోషోరూం ఎదురుగా వీఎంసీ పార్కింగ్ స్థలాన్ని లీజు పొడగింపునకు వచ్చిన ప్రతిపాదనను సభ్యులు తిరస్కరిస్తూ తీర్మానించారు.
● నగరపాలక సంస్థ పరిధిలోని సర్కిల్–1లో కబేళాను ఏడాదిపాటు లీజుకు ఇచ్చేందుకు వచ్చిన ప్రతిపాదనను వాయిదా వేస్తూ తీర్మానం చేశారు.
● నగరపాలక సంస్థలో హార్టీకల్చర్ ఆఫీసర్(హెచ్వో)లుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు రూ. 60వేలు వేతనాన్ని పెంచుతూ వచ్చిన తీర్మానంపై సభ్యులు ఆమోదం తెలిపారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ప్రణాళిక ప్రకారం రైతులకు కావాల్సిన ఎరువులను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సోమవారం సాయంత్రం ఆయన చాంబర్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న యూరియా నిల్వలను ఐఎఫ్ఎంఎస్ డేటాతో సరిపోల్చుకొని స్పష్టత ఇవ్వాలని సూచించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ప్రవేశపెడుతున్న కొత్త యాప్పై అవగాహన కోసం వ్యవసాయశాఖ అధికారులు, మార్క్ఫెడ్ అధికారులు గుంటూరు, ఏలూరు జిల్లాలకు వెళ్లి అక్కడ నిర్వహిస్తున్న పైలెట్ ప్రాజెక్టుపై అధ్యయనం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు కనీసం 1500 టన్నుల బఫర్ యూరియా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అదనపు నిల్వలను డిమాండ్ చేసి తెప్పించుకోవాలన్నారు. మే నెల నుంచే జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్. పద్మావతి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ బి. మురళీ కిషోర్, బందరు ఇన్చార్జ్ ఆర్డీవో పోతురాజు పాల్గొన్నారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థి రైలు కింద పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం జిల్లా బురుజుపల్లె తండాకు చెందిన మూడావత్ గణేష్ నాయక్(18) పెనమలూరులోని ప్రైవేటు కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. గణేష్ నాయక్ తల్లిదండ్రులు ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్కు రూ. 2.6లక్షలు, ద్వితీయ సంవత్సరానికి రూ. 2.85 లక్షలు చెల్లించి చదివిస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదు. ఇదే విషయాన్ని గణేష్నాయక్ తలిదండ్రులకు ఫోన్ చేసి తాను ఎంత కష్టపడి చదివినప్పటికీ మార్కులు రావటం లేదని.. గుర్తుండటం లేదని చెప్పాడు. దీనికి తలిదండ్రులు గుర్తున్నదే రాయి అని ధైర్యం చెప్పారు.
అంతర్మథనంతో అఘాయిత్యం..
అయినప్పటికీ రూ. లక్షలాది రూపాయల వ్యయంతో తనను చదివిస్తున్నారని.. తాను ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోతున్నానని మథన పడుతున్నాడు. మంగళవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి స్టడీ అవర్ నుంచి బయటకు వచ్చిన గణేష్ నాయక్ విజయవాడ రైల్వేస్టేషన్కు చేరుకున్నాడు. 7వ నంబర్ ప్లాట్ఫాంలో ఆదివారం రాత్రి రైలు కదులుతున్న సమయంలో ఒక్కసారిగా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు.
తల్లిదండ్రుల అనుమానం..
గణేష్నాయక్ తల్లిదండ్రులు ఈ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో ఏదో గొడవ కారణంగానే ఇది జరిగిందని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారించి, న్యాయం చేయాలని కోరుతున్నారు.
ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి
ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి


